Cricket
-
భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత జట్టు శుభారంభం అందుకుంది. బర్మింగ్హామ్ వేదికగా ఆదివారం నాటి తొలి మ్యాచ్లో.. దాయాది పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించి చిరకాల ప్రత్యర్థిని ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేసి జయభేరి మోగించింది.ఇండియా గెలుస్తుందని ముందే తెలుసుఈ నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్ సేనపై ప్రశంసలు కురుస్తుండగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈ మ్యాచ్లో భారత్ గెలుస్తుందని తనకు ముందుగానే తెలుసునని.. పాక్ కంటే భారత జట్టుకు ‘అన్ఫేర్’ అడ్వాంటేజ్ ఉందంటూ అక్కసు వెళ్లగక్కాడు.ఇది అన్యాయంభారత్- పాక్ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన నాసిర్ హుసేన్ తాజా స్కై స్పోర్ట్స్ పాడ్కాస్ట్లో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ‘‘మ్యాచ్ ఆరంభానికి ముందే ఇండియా గెలుస్తుందని నాకు తెలుసు. ఇండియా- పాక్ మధ్య పోటీ అన్యాయం. పాక్తో పోలిస్తే ఇండియాకు అదనపు ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.రెండూ సమతూకమైన జట్లు కావు. ఇండియా ప్లేయర్లు ఎక్కువగా ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడుతున్నారు. తద్వారా రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నారు. ఆ అనుభవంతో జాతీయ జట్టు తరఫునా రాణిస్తున్నారు. కానీ పాకిస్తాన్లో ఆ పరిస్థితి లేదు.బంగ్లా, పాక్ ప్లేయర్లు అద్భుతం.. కానీ పాపంబంగ్లాదేశ్కు చెందిన మరుఫా అక్తర్, పాక్ ప్లేయర్ ఫాతిమా సనా అత్యద్భుతమైన క్రికెటర్లు. కానీ వాళ్లకు ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడే అవకాశం లేదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోంది. ది హండ్రెడ్ వంటి లీగ్లలో వీరిని ఆడించాలి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆడిన అనుభవం ఐసీసీ ఈవెంట్లలోనూ పనికివస్తుంది’’ అని నాసిర్ హుసేన్ చెప్పుకొచ్చాడు.అదే లాజిక్ ఇక్కడ వర్తించదా? ఈ నేపథ్యంలో పురుషుల క్రికెట్లో మీ వైఖరి ఏమిటి అంటూ టీమిండియా అభిమానులు నాసిర్ హుసేన్ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ‘భారత క్రికెటర్లు కేవలం ఐపీఎల్లోనే ఆడతారు.పాక్ ఆటగాళ్లు మాత్రం PSLతో పాటు, బిగ్బాష్ లీగ్, ది హండ్రెడ్ తదితర విదేశీ లీగ్లలోనూ ఆడతారు. మరి వాళ్లెందుకు టీమిండియా చేతిలో ఓడిపోతున్నారు? మీ లాజిక్ ప్రకారం ఫ్రాంఛైజీ క్రికెట్ ఎక్కువగా ఆడే పాక్ ప్లేయర్లే పైచేయి సాధించాలి కదా!’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు! -
పోలీసులకు గంగూలీ ఫిర్యాదు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు. తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇందుకు సంబంధించి కోల్కతా పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.విమర్శలు ఓకే.. కానీ..ఈ మేరకు.. ‘‘పబ్లిక్ ఫిగర్గా ఉన్నందువల్ల నా గురించి వచ్చే అభిప్రాయాలు, విమర్శలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే, అసత్య ప్రచారాలు చేయడం, పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగానే నా ప్రతిష్టను దిగజార్చేలా రాతలు రాయడం చేస్తే అస్సలు ఆమోదించను.ఆమోదయోగ్యనీయం కాదుఇలాంటి పనులు ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాను. నా ఫిర్యాదు స్వీకరించి సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను’’ అని గంగూలీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.కాగా ‘సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్’ పేరిట ఉన్న ఫేస్బుక్ పేజీపై గంగూలీ ఫిర్యాదు చేశాడు. అదే విధంగా.. స్పోర్ట్జ్వికీ అనే ప్లాట్ఫామ్ గురించి కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించాడు. ఈ రెండు ప్లాట్ఫామ్లలో తరచుగా తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు.దిగ్గజ బ్యాటర్కోల్కతాలో జన్మించిన గంగూలీ టీమిండియా తరఫున 1992లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ టెస్టుల్లో 7212, వన్డేల్లో 11363 పరుగులు సాధించాడు. భారత జట్టు కెప్టెన్గానూ పనిచేసిన గంగూలీని అభిమానులు ముద్దుగా ‘దాదా’ అని పిలుచుకుంటారు. కాగా గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగానూ పనిచేశాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు! -
వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టు చిక్కుల్లో పడింది. ఇప్పటికి మూడు మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ సేన.. రెండింట ఓడిపోయింది. తొలుత అఫ్గనిస్తాన్ -‘ఎ’ చేతిలో ఓడిన భారత జట్టు.. సోమవారం నాటి పోరులో లంక చేతిలో పరాజయం పాలైంది.దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్లో ఇరుజట్లు 265 పరుగులు చేయగా.. మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. భారత్ అనూహ్య రీతిలో ఓడిపోయింది. అయితే, వెలుతురులేమి కారణంగా తొలుత సూపర్ ఓవర్ నిర్వహించడం సాధ్యం కాదని అంతా భావించారు.వెలుతురులేమి సమస్యభారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ సైతం ఇదే విషయంపై అంపైర్లతో వాదించినట్లు సమాచారం. కానీ వెలుతురు మరీ తగ్గిపోతే సూపర్ ఓవర్ మొదలైనప్పటికీ మ్యాచ్ నిలిపివేస్తామని అంపైర్లు భారత శిబిరానికి చెప్పినట్లు క్రిక్బజ్ తన కథనంలో పేర్కొంది. అయితే, తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేయగా.. భారత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో మరింతగా చీకటి అలుముకుంది.కొట్టుకోవడం ఒక్కటే తక్కువఅయినప్పటికీ సూపర్ ఓవర్ నిర్వహించగా.. భారత జట్టు ఓటమిపాలైంది. ఆద్యంతం ఆసక్తిరేపిన ఈ మ్యాచ్లో సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో శ్రీలంక ఆటగాళ్లు వ్యవహరించిన తీరు.. అందుకు వైభవ్ బదులిచ్చిన విధానం విమర్శలకు దారితీసింది.వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!వైభవ్- శ్రీలంక ఆటగాళ్లు పరస్పరం మీదమీదకు వెళ్తూ కొట్టుకున్నంత పనిచేశారు. అయితే, వారి మధ్య గొడవకు కారణం ఏమిటన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. శ్రీలంక ప్లేయర్ విశేన్ హలంబగే వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు’’ అన్నట్లు సమాచారం.దీంతో కోపోద్రిక్తుడైన వైభవ్.. ‘‘ఏమంటున్నావు’’ అంటూ మీదకు వెళ్లగా ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. ఆ తర్వాత లంక సీనియర్ ప్లేయర్ ఒకరు వచ్చి ఇద్దరినీ విడదీశారు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. అయితే, ఈ విషయం గురించి శ్రీలంక డ్రెసింగ్రూమ్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.క్షమాపణ అడుగుదాం!చీకటి పడిన తర్వాత కూడా సూపర్ ఓవర్లో ఆడేందుకు సహకరించిన భారత జట్టుకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు.. వైభవ్ విషయంలో జరిగినదానికి క్షమాపణలు కోరాలనే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజా ఓటమితో భారత్ ఫైనల్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి.చదవండి: 29 బంతుల్లోనే సెంచరీ చేసిన చహల్🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
గుజరాత్ టైటాన్స్ ప్లేయర్కు జాక్పాట్.. టీమిండియాకు ఎంపిక!
ట్రై సిరీస్లో భాగంగా శ్రీలంక-ఏతో మ్యాచ్లో ఓటమితో ఫైనల్ అవకాశాలను ఇండియా-ఏ క్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓటమి బాధలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు గుడ్న్యూస్ అందింది. గాయపడిన యద్వీర్ సింగ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు అశోక్ శర్మను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో అశోక్ శర్మ తక్షణమే శ్రీలంకకు బయల్దేరనున్నాడు. బుధవారం అప్గానిస్తాన్తో జరగనున్న మ్యాచ్లో అశోక్ శర్మ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అశోక్ శర్మ గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం విశేషం. ఆరు వికెట్లే తీసినప్పటికీ అతడి స్పీడ్ బౌలింగ్ ఇవాళ ఇండియా-ఏ జట్టులోకి పిలుపు వచ్చేలా చేసింది. ఇక యద్వీర్ సింగ్ భుజం గాయంతో ఇండియా-ఏ ఆడిన మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ వేయడంలో ఇబ్బంది పడిన యద్వీర్ బెంచ్కే పరిమితమయ్యాడు. దీంతో అతడి స్థానంలో అశోక్ శర్మను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. గాయంతో బాధపడుతున్న యద్వీర్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు రావాలని బీసీసీఐ అతడిని ఆదేశించింది.బుధవారం అఫ్గానిస్తాన్ జట్టుతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాచ్లో గెలవడమే కాదు భారీ రన్రేట్ సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా-ఏ జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. అదే సమయంలో అఫ్గానిస్తాన్ జట్టు లంకతో జరిగే తమ చివరి మ్యాచ్లో గెలిస్తే మాత్రం సమీకరణాలు మారిపోనున్నాయి. ఎందుకంటే ఆఫ్గన్పై ఇండియా గెలిచి, శ్రీలంకపై ఆఫ్గన్ గెలిస్తే.. ఇరుజట్లు నాలుగు మ్యాచ్ల్లో రెండేసి విజయాలతో ఉంటాయి. అప్పుడు నెట్రన్రేట్ కీలకం కానుంది. చదవండి: కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్! -
కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్!
ట్రై సిరీస్లో శ్రీలంక-ఏతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఆ జట్టు ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ గొడవ హైలైట్గా నిలిచింది. తప్పు ఎవరిదైనా వైభవ్ సూర్యవంశీ ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. 15 ఏళ్ల వయసులో ఇంత అగ్రెసివ్ పనికి రాదని, ఓర్పు వహిస్తేనే జట్టులో ఎక్కువకాలం చోటు ఉంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు వారాల క్రితం ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీకి కోహ్లి అడ్వైజ్ ఇస్తున్న ఫొటో తాజాగా సోషల్ మీడియాలో మరోసారి వైరలయ్యింది. ఆ ఫొటోలో కోహ్లి వైభవ్ భుజంపై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారనేది కూడా వైభవ్ వెల్లడించాడు. ‘మ్యాచ్ జరుగుతున్నంత సేపు ప్రత్యర్థి ఏం మాట్లాడుతున్నా పట్టించుకోవద్దు. ఆటపైనే మన దృష్టి ఉండాలి. కెరీర్ ఎదుగుదలలో ఓపిక చాలా అవసరం. అది ఉన్నప్పుడే మనకు క్రికెట్లో లాంగ్ కెరీర్కు ఆస్కారం ఉంటుంది’ అని కోహ్లి తనతో చెప్పినట్లు వైభవ్ పేర్కొన్నాడు. అయితే తాజాగా లంకతో మ్యాచ్లో వైభవ్ అగ్రెసివ్ ప్రవర్తన చూస్తుంటే కోహ్లీ చెప్పిన మాటలు ఏవీ అతడు చెవికె క్కించుకోలేదనిపిస్తోంది. కోహ్లి ఇచ్చిన సూచనలు, సలహాలు తూ.చా. తప్పకుండా పాటించి ఉంటే ఇవాళ వైభవ్ ప్రవర్తన ఇలా ఉండేది కాదని పలువురు సీనియర్లు పేర్కొంటున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీ అగ్రెసివ్గా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. 2025లో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ సందర్భంలోనూ వైభవ్ ఇదే దూకుడు ప్రదర్శించాడు. ఆనాడు పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ పేసర్ అలీ రెజా వైభవ్ను ఔట్ చేశాడు. ఈ సమయంలో పాక్ బౌలర్ వైభవ్ను కించపరిచే విధంగా మాట్లాడాడు. అయితే ఉడుకురక్తంతో ఉన్న వైభవ్ కూడా అంతే ఘాటుగా స్పందించాడు. అలీ రెజావైపు చూస్తూ చేతి వేలితో సైగ చేస్తూ, దూషిస్తూ పెవిలియన్ బాట పట్టాడు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరలయ్యింది.టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అంటేనే దూకుడుకు పెట్టింది పేరు. తన అగ్రెసివ్ ప్రవర్తనతో విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. అయితే కోహ్లి మైదానంలో ఉన్నంతసేపు మాత్రం హుందాగానే ప్రవర్తిస్తాడు. ప్రత్యర్థిపై ఎంత కోపం ఉన్నా మైదానంలో ఎక్కువశాతం ఫన్నీమోడ్లోనే ఉండడానికే ప్రయత్నం చేస్తుంటాడు. మంచి విషయం ఆలస్యంగా.. కానీ ఒక చెడ్డ విషయం వేగంగా వ్యాప్తి చెందుతున్న మాట వైభవ్ విషయంలో నిజమైంది. ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో అందరి చేత శెభాష్ అనిపించుకున్న వైభవ్ ఇప్పుడు తన ప్రవర్తనతో అందరి దృష్టిలో బ్యాడ్గా మారిపోతున్నాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికైనా తన అగ్రెసివ్ ప్రవర్తనను తగ్గించుకొని ఆడితే క్రికెట్లో ఎక్కువకాలం కొనసాగేందుకు ఆస్కారం ఉంటుంది.Another heated moment between Vaibhav Sooryvanshi and Sri Lankan players. 🥶 https://t.co/iwmOQfMZwv pic.twitter.com/cUINMCFuJ5— Qamar. (@Qamar5618) June 15, 2026King meets Bihari Monster 💀 pic.twitter.com/927R0z8kF3— सीतामढ़ी जिला 🇮🇳 (@SitamarhiJila) June 1, 2026చదవండి: ఓటమితో లెక్కలు తారుమారు.. ఇండియా-ఏ ఫైనల్ చేరడం కష్టమే! -
ఓటమితో లెక్కలు తారుమారు.. ఇండియా-ఏ ఫైనల్ చేరడం కష్టమే!
ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక వెళ్లిన ఇండియా-ఏ జట్టుకు శ్రీలంక-ఏ చేతిలో సూపర్ ఓవర్ ఓటమి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఓటమి కారణంగా ఇండియా-ఏ జట్టు ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించి శుభారంభం చేసిన ఇండియా-ఏ ఆ తర్వాత అఫ్గానిస్తాన్-ఏతో జరిగిన మ్యాచ్లో అనూహ్య ఓటమి చవిచూసింది. ఇక సోమవారం లంకతో జరిగిన మ్యాచ్లో హైడ్రామా నడుమ సూపర్ ఓవర్లో ఓటమిపాలై రెండో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో మూడు మ్యాచ్ల్లో రెండింట ఓడి ఒక మ్యాచ్లో గెలిచి పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.ఆఫ్గన్పై గెలిచినా..బుధవారం అఫ్గానిస్తాన్ జట్టుతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాచ్లో గెలవడమే కాదు భారీ రన్రేట్ సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా-ఏ జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. అదే సమయంలో అఫ్గానిస్తాన్ జట్టు లంకతో జరిగే తమ చివరి మ్యాచ్లో గెలిస్తే మాత్రం సమీకరణాలు మారిపోనున్నాయి. ఎందుకంటే ఆఫ్గన్పై ఇండియా గెలిచి, శ్రీలంకపై ఆఫ్గన్ గెలిస్తే.. ఇరుజట్లు నాలుగు మ్యాచ్ల్లో రెండేసి విజయాలతో ఉంటాయి.కీలకం కానున్న నెట్ రన్రేట్ అప్పుడు నెట్ రన్రేట్ కీలకం కానుంది. ఈ రెండు జట్లలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుంది. అయితే ప్రస్తుతం రన్రేట్ విషయంలో అఫ్గానిస్తాన్ (-1.392)తో పోలిస్తే ఇండియా-ఏ (+0.330)ది పైచేయిగా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ లంకతో చివరి మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే మాత్రం మెరుగైన రన్రేట్తో ఫైనల్కు వెళ్లే అవకాశముంది. కాబట్టి ఆఫ్గన్కు అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే వారిపై భారీ తేడాతో గెలవడం ఇప్పుడు ఇండియా-ఏ జట్టు ముందున్న తక్షణ కర్తవ్యం. అయితే శ్రీలంకతో మ్యాచ్లో టాపార్డర్, మిడిలార్డర్ పూర్తిగా విఫలమవ్వడం జట్టు కొంపముంచింది. లోయర్ ఆర్డర్లో సూర్యాన్ష్ హెగ్డె, విప్రజ్ నిగమ్లు ఆడకపోయుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. శ్రీలంకతో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు సూర్యాన్ష్ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్కు తోడు విప్రాజ్ నిగమ్ (51) సంచలన అర్థసెంచరీ చేయడంతో 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో లంక జట్టు కూడా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో శ్రీలంక 16 పరుగులు చేయగా, భారత్ 9 పరుగులకే పరిమితమయ్యి ఓటమి చవిచూసింది.Read: లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్పై నిషేధం తప్పదా! -
లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్పై నిషేధం తప్పదా!
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సోమవారం శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో భారత్ ఓటమి చవిచూసింది. అయితే ఈ ఓటమి కంటే వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ హైలైట్గా నిలిచింది. లంక ఆటగాళ్ల తప్పు అటుంచితే, వైభవ్ చేసిన తప్పులకు అతడికి శిక్ష తప్పేలా లేదు. మరి ఈ గొడవతో వైభవ్ సూర్యవంశీపై నిషేధం పడనుందా అనేది ఒకసారి తెలుసుకుందాం. నిజానికి ఒక అంతర్జాతీయ మ్యాచ్లో ఒక ఆటగాడు ఇలా గొడవ పడితే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అది భారీ జరిమానా నుంచి నిషేధం వరకు ఉంటుంది. అయితే వైభవ్, లంక ఆటగాదళ్ల మధ్య జరిగిన గొడవ అనధికారిక మ్యాచ్ కిందకు రావడంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం తక్కువగానే ఉంటుంది. కేవలం మ్యాచ్ రిఫరీ నుంచి జరిమానా ఎదుర్కొనేందుకు ఆస్కారముంది. అంతేకాదు బీసీసీఐ కూడా వైభవ్ సూర్యవంశీని మందలించడం లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.అసలేం జరిగింది?మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు స్వల్ప గొడవ జరిగింది. వైభవ్, సూర్యాంశ్లను ఉద్దేశించి లంక ఆటగాళ్లు ఏదో అనడంతో క్రికెటర్లు ఒకరిపై మరొకరు దూసుకొచ్చారు. సూర్యాంశ్ వైపు వెళుతున్న విశేన్ హలంబాగేను వైభవ్ అడ్డుకోగా... అతడిని కూడా లంక ఆటగాడు తోసేశాడు. సీనియర్ ఆటగాడు డిక్వెలా జోక్యం చేసుకొని ఇద్దరినీ విడిపించాల్సి వచ్చింది. తిరిగి వెళుతూ కూడా 15 ఏళ్ల వైభవ్ మీ సంగతి చూస్తా అన్నట్లుగా హెచ్చరిస్తూ సైగలు చేయడం కనిపించింది. జాతీయ జట్టులో చోటుఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్ను ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ప్రకటించిన టీమిండియా జట్టుకు ఎంపిక చేసింది. తాజా ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రంకు ముందే వైభవ్ సూర్యవంశీ నిషేధం ఎదుర్కోనున్నాడా అనేది చూడాలి. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్లోనూ వైభవ్ సూర్యవంశీ రాణించడంలో విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్లు కలిపి 69 పరుగులు మాత్రమే చేసిన వైభవ్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. టీ20, వన్డే ఫార్మాట్లలో ఒకేలా ఆడుతానంటే కుదరదు.. కొంచెం ఓపిక వహించాల్సిన అవసరముందంటూ అభిమానులు పేర్కొంటున్నారు.Another heated moment between Vaibhav Sooryvanshi and Sri Lankan players. 🥶 https://t.co/iwmOQfMZwv pic.twitter.com/cUINMCFuJ5— Qamar. (@Qamar5618) June 15, 2026A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026 -
120 కోట్ల మంది చూశారు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎక్కువ మంది ప్రేక్షకుల అభిమానం పొందిన సీజన్గా 2026 నిలిచింది. ఈసారి టీవీ, డిజిటల్ వేదికలపై కలిపి ఏకంగా 120 కోట్ల మంది ఐపీఎల్ను వీక్షించినట్లు టోర్నీ అధికారిక ప్రసారకర్త ‘జియో హాట్స్టార్’ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 7 శాతం ఎక్కువ కావడం విశేషం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ వ్యూయర్షిప్ వచ్చిన మ్యాచ్గా గుర్తింపు పొందింది. ఆర్సీబీ వరుసగా టైటిల్ గెలిచిన ఈ పోరును వేర్వేరు స్క్రీన్లపై కలిపి 40 కోట్ల మంది చూడటం కొత్త రికార్డుగా నమోదైంది. ప్రేక్షకుల సంఖ్య గత ఏడాదికంటే ఈ సారి టీవీల్లో 22 శాతం, డిజిటల్లో 8 శాతం పెరగగా...జియో హాట్ స్టార్ ప్రాంతీయ డిజిటల్ చానల్స్లో ఐపీఎల్ వ్యూయర్షిప్ ఏకంగా 33 శాతం పెరిగింది. తాజా రేటింగ్ అంతర్జాతీయ క్రీడల్లో ఐపీఎల్ స్థాయి ఏమిటో చూపించాయని, మున్ముందు మరిన్ని కొత్త హంగులు, టెక్నాలజీతో ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ప్రయతి్నస్తామని జియో స్టార్ సీఈఓ ఇషాన్ ఛటర్జీ పేర్కొన్నారు. -
ODI WC: అతడిని పక్కనపెడితే మూర్ఖత్వమే అవుతుంది!
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జడ్డూ అద్భుత ఆటగాడని.. అతడిని వన్డే వరల్డ్కప్-2027లో ఆడిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు. అయితే, అందుకోసం ముందుగా జడేజా సెలక్టర్లను ఒప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.ఈ ఏడాది మూడు వన్డేలు ఆడిన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఓవర్కు ఆరు చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అఫ్గనిస్తాన్తో స్వదేశంలో వన్డే సిరీస్కు జడ్డూ ఎంపిక కాలేదు. యువ ఆల్రౌండర్ హర్ష్ దూబే తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు.మరోవైపు.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడగా.. నితీశ్ కుమార్ రెడ్డి అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ 37 ఏళ్ల జడ్డూ భవిష్యత్తు గురించి మాట్లాడాడు. హార్దిక్ పాండ్యా తిరిగి వస్తే.. ‘‘జడేజాను ఇప్పుడే లెక్కలోంచి తీసేయొద్దు. అతడు ఇప్పటికీ అద్భుతమైన క్రికెటరే. నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆల్రౌండర్. హార్దిక్ పాండ్యా తిరిగి వస్తే.. నితీశ్కు బదులు అతడే జట్టులో ఉంటాడు.ఇక హార్దిక్తో పాటు జట్టులో ఉన్న మరో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజానే. అతడు ప్రపంచకప్ వరకు కొనసాగితే బాగుంటుంది. అయితే, అందుకు జడ్డూ తన ప్రదర్శనతో సెలక్టర్లను మెప్పించాల్సి ఉంది. ప్రస్తుతం అతడు ఫామ్లో లేకపోవచ్చు. కానీ జట్టు నుంచి పూర్తిగా తప్పిస్తామంటే మాత్రం అది మూర్ఖత్వమే అవుతుంది’’ అని చిక్కా పేర్కొన్నాడు.ఫామ్లోకి వస్తేనేకాగా 2027లో జరిగే వన్డే వరల్డ్కప్లో దిగ్గజ బ్యాటింగ్ ద్వయం విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ ఆడతారా లేదా? అన్న అంశంపై జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక అరుదుగా జట్టుకు దూరమయ్యే కోహ్లి.. తొడకండరాల గాయంతో అఫ్గన్తో వన్డే సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. మరోవైపు.. ఫిట్నెస్ సాధించి తిరిగి వచ్చిన రోహిత్ అఫ్గనిస్తాన్తో తొలి మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 16 పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో చిక్కా మాట్లాడుతూ.. రోహిత్ ఫామ్లోకి వస్తేనే ప్రపంచకప్ జట్టులో ఉంటాడని అభిప్రాయపడ్డాడు. లేదంటే అతడికి చోటు దక్కడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.చదవండి: శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్ సూర్యవంశీ -
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం
న్యూజిలాండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం అందుకుంది. లార్డ్స్ వేదికగా తొలి టెస్టులో పర్యాటక కివీస్ను 115 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం (జూన్ 17) నుంచి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగారెండో టెస్టు మొదలుకానుంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) తాజాగా తమ తుదిజట్టును ప్రకటించింది. నైట్క్లబ్ వివాదం నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ బెన్స్టోక్స్పై వేటు వేసిన బోర్డు.. అతడి స్థానంలో రెండో టెస్టుకు వెటరన్ ప్లేయర్ జో రూట్ సారథిగా వ్యవహరిస్తాడని తెలిపింది.ఇద్దరి అరంగేట్రంఇక కివీస్తో రెండో టెస్టు సందర్భంగా తమ జట్టు తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నట్లు ఈసీబీ వెల్లడించింది. వికెట్ కీపర్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్, హాంప్షైర్ ఫాస్ట్ బౌలర్ సోనీ బేకర్ టెస్టుల్లో అడుగుపెట్టనున్నట్లు తెలిపింది.కాగా జోర్డాన్ ఇప్పటికే ఇంగ్లండ్ తరఫున మూడు వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్లు ఆడాడు. మరోవైపు.. బేకర్ ఇప్పటికి రెండు వైట్బాల్ మ్యాచ్లలో ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, చివరగా అతడు 2025లో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇక జోర్డాన్ ఎనిమిది నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు.ఇదిలా ఉంటే.. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా రెండో టస్టు సందర్భంగా జట్టుతో చేరుతున్నాడు. కాగా నైట్క్లబ్ వివాదంలో స్టోక్స్తో పాటు ఆల్రౌండర్ గస్ అట్కిన్సన్ మీద కూడా వేటు పడింది. ఇక ఓలీ రాబిన్సన్ను విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో జోర్డాన్, బేకర్, ఆర్చర్ తుదిజట్టులోకి వచ్చారు.న్యూజిలాండ్తో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజో రూట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, మ్యాట్ ఫిషర్, ఎమీలియో గే, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్.చదవండి: శ్రీలంకప్లేయర్ను నెట్టేసిన వైభవ్ సూర్యవంశీ.. -
అంపైర్లతో తిలక్ వర్మ, వైభవ్ వాగ్వాదం.. తిలక్ను తోసేసి..
భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంపైర్లతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.దంబుల్లా వేదికగా గురువారం అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టు చేతిలో ఓడిన భారత్.. సోమవారం శ్రీలంక చేతిలోనూ ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 265 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది.అయితే, శ్రీలంక ఇన్నింగ్స్లో ఆఖరి బంతిని ఎదుర్కొన్న గుణశేఖర బాల్ను ఫ్లిక్ చేయకుండానే.. సింగిల్ తీసి రనౌట్ అయ్యాడు. దీంతో స్కోరు సమం కాగా.. భారత శిబిరం మాత్రం ఆ పరుగును ఎలా పరిగణిస్తారని అంపైర్లను ప్రశ్నించింది. మరోవైపు.. సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా అప్పటికే చీకటి పడిపోయింది.ఈ నేపథ్యంలో కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. గుణశేఖర బంతిని బాదనపుడు తొలి పరుగును ఎలా లెక్కలోకి తీసుకుంటారని వాదించినట్లు కనిపించింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ కూడా తిలక్కు మద్దతుగా వచ్చి నిలబడ్డాడు.Vaibhav Sooryavanshi sending off Captain Tilak Varma from arguing with Umpire.pic.twitter.com/067cYfhmo2— Maina Singh (@Maina_Singhx77) June 15, 2026అయితే, కాసేటికే తిలక్ను సముదాయించినట్లు వెనక్కి నెడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక సూపర్ ఓవర్లో తిలక్ బంతిని అర్షద్ ఖాన్కు ఇవ్వగా.. లంక కెప్టెన్ సహన్ అరాచిగే తొలి బంతికే రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతి వైడ్కాగా.. తదుపరి మరో సింగిల్ వచ్చింది.మూడో బంతికి అవిష్క ఫెర్నాండో సింగిల్ తీయగా.. నాలుగో బంతికి అరాచిగే మూడు పరుగులు రాబట్టాడు. ఐదో బంతిని ఫెర్నాండో సిక్సర్గా మలచగా.. ఆరో బంతి నోబాల్ అయింది. దీంతో ఫ్రీ హిట్ రాగా.. మొత్తంగా లంక 16 పరుగులు చేసింది. అయితే, నోబాల్ విషయంలో కూడా తిలక్ వర్మ వాదనకు దిగాడు. అనంతరం భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే బ్యాటింగ్కు దిగగా.. భారత్కు ఓటమే ఎదురైంది. A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026చదవండి: శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్.. వీడియో వైరల్ -
శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్.. కోపంతో ఊగిపోతూ..
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఆతిథ్య శ్రీలంక- ‘ఎ’- భారత్ -‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. దంబుల్లాలో సోమవారం టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్కు దిగింది. లంక బౌలర్ల ధాటికి 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.మ్యాచ్ ‘టై’ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాల వల్ల భారత్కు ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. అయితే, విప్రాజ్ నిగమ్ పిచ్ మధ్యభాగంలో రెండుసార్లు పరిగెత్తడం వల్ల భారత్కు పది పరుగుల పెనాల్టీ పడింది. దీంతో 10/0తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులే చేసింది.ఫలితంగా మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 పరుగులు చేసింది. అనంతరం భారత్ తరఫున బ్యాటింగ్కు దిగిన వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. తొలి బంతికి సూర్యాంశ్ రెండు పరుగులు తీయగా.. తర్వాత పరుగేమీ రాలేదు.భారత్ ఓటమిఆ తర్వాత వైభవ్ రెండు పరుగులు తీయగా.. మరుసటి బంతికి ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి ఎనిమిది పరుగులు అవసరం కాగా.. వైభవ్ పరుగులేమీ తీయలేకపోయాడు. దీంతో భారత్ ఓటమి ఖరారైంది. ఈ క్రమంలో వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్న శ్రీలంక ప్లేయర్లలో ఎవరో వైభవ్ను ఏదో అన్నట్లుగా కనిపించింది.శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్దీంతో కోపంతో శ్రీలంక ఆటగాళ్లపై దూసుకువెళ్లిన పదిహేనేళ్ల వైభవ్ వారిని నెట్టేశాడు. ఇంతలో అంపైర్, సూర్యాంశ్ వచ్చి అతడిని వారి నుంచి విడదీశారు. ఆ తర్వాత కూడా వైభవ్ చేయి చూపిస్తూ కోపంతో ఊగిపోతూ మైదానం వీడాడు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. వైభవ్ దూకుడుగా వ్యవహరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులు.. హైడ్రామా🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
IND vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులే ట్విస్టులు.. ఆఖరికి
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-‘ఎ’ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. తొలుత అఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన భారత జట్టు తాజాగా.. సోమవారం నాటి మ్యాచ్లో శ్రీలంక చేతిలోనూ పరాజయం పాలైంది.ముక్కోణపు వన్డే సిరీస్కాగా శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య జూన్ 9న ముక్కోణపు వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్లో శ్రీలంకపై భారత్ 8 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్లో అఫ్గనిస్తాన్ భారత్పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది.ఇక మూడో మ్యాచ్లో శ్రీలంక అఫ్గనిస్తాన్పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించగా.. నాలుగో మ్యాచ్లో భాగంగా సోమవారం భారత్- శ్రీలంక రెండోసారి తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు.. తిలక్ వర్మ సేన తొలుత బ్యాటింగ్కు దిగింది.265 పరుగులు చేసి ఆలౌట్గత మ్యాచ్లో ఆకట్టుకున్న భారత ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) ఈసారి నిరాశపరిచారు. ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఈసారి 37 పరుగులకే పరిమితం కాగా.. కెప్టెన్ తిలక్ వర్మ కేవలం 23 పరుగులే చేశాడు. ఆయుశ్ బదోని 15, నిశాంత్ సింధు 6, అనుకుల్ రాయ్ 8, అర్షద్ ఖాన్ 2 పరుగులు చేసి నిష్క్రమించారు.అయితే, ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే 66 బంతుల్లో 72, విప్రాజ్ నిగమ్ 49 బంతుల్లో 51 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి అర్ద శతకాల కారణంగా భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.పది పరుగుల పెనాల్టీశ్రీలంక బౌలర్లలో విజయకాంత్ వియస్కాంత్, మొహ్మద్ షిరాజ్ చెరో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. కెప్టెన్ సహన్ అరాచిగే, వనుజా సహన్, కుగాతస్ మతూలన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అయితే, విప్రాజ్ నిగమ్ పరుగులు తీసే క్రమంలో రెండుసార్లు పిచ్ మధ్యభాగంలోకి వచ్చాడు. దీంతో భారత జట్టుకు పది పరుగుల పెనాల్టీ పడింది.Not every day you see 5 runs off a helmet hit😅 Watch #SLvIND in the #TalentTVCup, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV 📺 #SonySportsNetwork #SonyLIV #TeamIndia pic.twitter.com/2db4eMFJpL— Sony Sports Network (@SonySportsNetwk) June 15, 2026ఫలితంగా శ్రీలంక 10/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, బౌలింగ్ సమయంలో బంతి వికెట్ కీపర్ హెల్మెట్కు తాకడంతో శ్రీలంకకు కూడా పెనాల్టీ పడింది.ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు నిరోషన్ డిక్విల్లా (37), అవిష్క ఫెర్నాండో (22) మెరుగైన ఆరంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ విశేన్ హలంబగే (17) విఫలమయ్యాడు. కెప్టెన్ సహన్ అరాచిగే 8 పరుగులకే నిష్క్రమించగా.. అహాన్ విక్రమసింఘే 6 పరుగులు చేసి అవుటయ్యాడు.ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా వనుజా సహన్ (25) రాణించగా.. విజయకాంత్ వియస్కాంత్ 39 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు.నరాలు తెగే ఉత్కంఠఇక 47 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేయగా.. విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికి సదీర సమరవిక్రమ 104 బంతుల్లో 88 పరుగుల వద్ద ఉన్నాడు.ఈ క్రమంలో 48వ ఓవర్లో ఆరు పరుగులు రాగా.. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సదీర ఆచితూచి ఆడాడు. ఇలాంటి తరుణంలో యశ్ ఠాకూర్ నోబాల్తో 48వ ఓవర్ ఆఖరి బంతికి లంకకు ఫ్రీహిట్ రాగా.. గుణశేఖర ఫోర్ బాదాడు. దీంతో చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. అర్షద్ ఖాన్ బంతితో రంగంలోకి దిగాడు.తొలి బంతికి పరుగులేమీ ఇవ్వని.. అర్షద్ రెండో బంతికి సదీర సమరవిక్రమను బౌల్డ్ చేశాడు. దీంతో 93 పరుగుల వద్ద సదీర నిష్క్రమించగా.. నాలుగు బంతుల్లో ఐదు పరుగులుగా లంక విజయ సమీకరణం మారింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షిరాజ్ మూడో బంతికి సింగిల్ తీయగా.. ఆ తర్వాత గుణశేఖర సైతం సింగిల్ పూర్తి చేశాడు.దీంతో రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం కాగా.. అర్షద్పై ఒత్తిడి పెరిగింది. ఐదో బంతికి షిరాజ్ సింగ్ తీయడంతో సమీకరణం ఆఖరి బంతికి రెండు పరుగులుగా మారింది. అయితే, ఆఖరి బంతికి పరుగు తీసిన గుణశేఖర రెండో పరుగు కోసం రాగా.. రనౌట్ అయ్యాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి.సూపర్ ఓవర్ ముగిసిందిలా..అయితే, గుణశేఖర షాట్ ఆడినట్లు కనిపించలేదని.. బంతి ఫ్లిక్ అయి కీపర్ వైపు వెళ్లింది కాబట్టి దీనిని రన్గా పరిగణించవద్దని భారత శిబిరం కోరగా.. ప్రతికూల నిర్ణయమే వచ్చింది. ఇక ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా.. వెలుతురులేమి సమస్యగా మారింది. అయినప్పటికీ సూపర్ కోసం పట్టుపట్టగా.. ఫ్లడ్లైట్లు లేకుండానే శ్రీలంక తొలుత బ్యాటింగ్కు దిగింది.భారత కెప్టెన్ తిలక్ వర్మ అర్షద్ ఖాన్ చేతికి బంతినివ్వగా.. వైడ్, నోబాల్ రూపంలో భారత్ మూల్యం చెల్లించింది. శ్రీలంక 16 పరుగులు చేసింది. అయితే, నోబ్ విషయంలో తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ మ్యాచ్ కొనసాగింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 పరుగులే చేయడంతో ఓటమి ఖరారైంది. -
IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’
టీమిండియా సెలక్టర్లపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. విమర్శలకు బెదరకుండా సరైన ఆటగాడినే జట్టుకు ఎంపిక చేశారని కొనియాడాడు. టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఆకిబ్ నబీకి మొండిచేయి అంతకుముందు అఫ్గన్తో ఏకైక టెస్టు ఆడింది శుబ్మన్ గిల్ సేన. ఈ మ్యాచ్కు ఎంపిక చేసిన జట్టులో గుర్నూర్ బ్రార్కు చోటు ఇచ్చారు సెలక్టర్లు. రంజీ ట్రోఫీ 2025-26లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీకి మాత్రం మొండిచేయి చూపారు.ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీ పట్ల వివక్షపూరితంగా వ్యవహరించి.. అతడికి బదులు గుర్నూర్ను ఎంపిక చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. రంజీల్లో ఒకే సీజన్లో అరవైకి పైగా వికెట్లు సాధించినా ఆకిబ్ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు తలెత్తాయి.వన్డేతో అరంగేట్రంఇక అఫ్గన్తో టెస్టు మ్యాచ్లో గుర్నూర్ బ్రార్కు తుదిజట్టులో చోటు దక్కలేదు. అయితే, ధర్మశాల వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. ఈ పేస్ బౌలర్తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష్ దూబే కూడా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇద్దరూ రాణించారుఇక తన తొలి ఓవర్లోనే వికెట్ తీసిన గుర్నూర్ బ్రార్.. మొత్తంగా 4.5 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మరోవైపు.. హర్ష్ దూబే ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 47 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.సెలక్టర్ల నిర్ణయం సరైందేఈ నేపథ్యంలో అశ్విన్ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఆకిబ్ నబీని కాదని గుర్నూర్ను ఎంపిక చేసి మంచి పనిచేశారన్నాడు. ఈ మేరకు.. ‘‘గుర్నూర్ బ్రార్ తొలి మ్యాచ్లోనే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు పొడుగ్గా ఉంటాడు. బలంగా కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.ప్రతీ బంతిని గంటకు 145కు కిలోమీటర్ల వేగంతో సంధించాడు. అతడి బౌలింగ్ నైపుణ్యం, శైలి.. బంతిని స్వింగ్ చేసే విధానం అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా కొత్త బంతితో అద్భుతంగా ఆడాడు. అతడు ఇంకా వేగంగా కూడా బౌలింగ్ చేయగలడు.సెలక్టర్లు ఆకిబ్ నబీని కాదని గుర్నూర్ ఎంపిక చేసినపుడు చాలా మంది విమర్శించారు. అయితే, వారి నిర్ణయం సరైందే. వాళ్లిద్దరి మధ్య పోలిక ఇక్కడ అనవసరం. గుర్నూర్ ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు, కోచ్లను తప్పక అభినందించాల్సిందే.భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్గాఒకవేళ అతడు ఫిట్గా ఉండి.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. భారత పేస్ దళంలో కీలక సభ్యుడిగా మారగలడు. భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్గా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని అశ్విన్.. 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్తో పాటు సెలక్టర్లను ప్రశంసించాడు. అదే విధంగా.. హర్ష్ దూబే సైతం మున్ముందు జట్టుకు బాగా ఉపయోగపడతాడని అశూ అభిప్రాయపడ్డాడు. కాగా వర్షం వల్ల తొలి వన్డేను 25 ఓవర్లకు కుదించగా.. భారత్ అఫ్గన్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.చదవండి: 29 బంతుల్లోనే చహల్ సెంచరీ -
చహల్ విధ్వంసం.. 29 బంతుల్లోనే శతక్కొట్టాడు!
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ బ్యాట్తో ఇరగదీశాడు. కేవలం 29 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపిస్తూ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ‘రికార్డు’ను బద్దలుకొట్టాడు.ఇంతటి పవర్ హిట్టరా? చహల్ ఇంతటి పవర్ హిట్టరా? ఎప్పుడూ అతడి బ్యాటింగ్ చూడలేదే! అంటూ ఆశ్చర్యపోతున్నారా?!.. ఆగండాగండి.. చహల్ శతక్కొట్టింది.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ నిర్వహించే ఓ యూట్యూబ్ చాలెంజ్ షోలో!..శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లోనే..అవును.. పీటర్సన్ నిర్వహించే ఈ యూట్యూబ్ షోలో ఇప్పటికే పలువురు భారత క్రికెటర్లు, విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. డివిలియర్స్ 30 బంతుల్లో శతకం చేయగా.. టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇక భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇటీవల 25 బంతుల్లో శతక చాలెంజ్ను పూర్తి చేశాడు.తాజాగా చహల్ కూడా ఈ చాలెంజ్ను స్వీకరించాడు. యాభై బంతుల్లో సెంచరీ కొట్టాలని పీటర్సన్ సవాలు చేశాడు. ఇక తొలి బంతి గంటకు 51 మీటర్ల వేగంతో వస్తుందని.. అయితే, ఆ తర్వాత ప్రతీ బంతికి 1 మీటర్ వేగం మేర పెరుగుతుందని పీటర్సన్ షరతు విధించాడు. అంతేకాదు.. చహల్ కోసం బౌండరీని 40 మీటర్లకు కుదించాడు.14 బంతుల్లోనే 50 పరుగులుఈ క్రమంలో మొదటి బంతికే సిక్సర్ బాదిన చహల్.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మధ్యలో చాలాసార్లు ఫీల్డర్లు అతడి క్యాచ్ జారవిడవడంతో లైఫ్ పొందిన చహల్.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో 14 బంతుల్లోనే 50 పరుగులు మార్కు అందుకున్నాడు చహల్.29వ బంతికి సిక్సర్ బాది శతకంఆ తర్వాత కవర్స్ మీదుగా సిక్సర్ బాదే క్రమంలో చహల్ ఫీల్డర్కు దొరికిపోయాడు. అయితే, ఇందుకు ప్రతిగా అతడి స్కోరులో ఐదు పరుగుల కోత విధించిన పీటర్సన్.. తర్వాత ఆటను కొనసాగించాల్సిందిగా సూచించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో 90 పరుగులు పూర్తి చేసుకున్న చహల్.. 29వ బంతికి సిక్సర్ శతక మార్కు అందుకున్నాడు.చహల్ విధ్వంసకర ఇన్నింగ్స్లో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక పీటర్సన్ 50 బంతుల్లో సెంచరీ చేయాలనే షరతు విధించగా.. ఈ స్పిన్ బౌలర్ మరో 21 బంతులు మిగిలి ఉండగానే.. అంటే 29 బంతుల్లో శతక్కొట్టడం మరో విశేషం. చదవండి: IND vs SL: కొంప ముంచేశాడు! -
విరాట్ కోహ్లికి అహంకారం ఎక్కువే!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎలా ఉంటాడో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి గ్రౌండ్లో దిగిన తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోతాడు. ప్రత్యర్థి కవ్వింపు చర్యలకు దిగితే వారి శైలిలోనే వారికి సమాధానం చెబుతాడు. స్లెడ్జింగ్కు దిగిన వారికి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తాడు.ఇక అదే సమయంలో అంతే సరదాగానూ ఉండటం కోహ్లికే చెల్లింది. అయితే, కొంతమంది మాత్రం విరాట్ కోహ్లి (Virat Kohli)ని అహంకారి అని.. దూకుడు ఎక్కువని.. అతి చేయడం సరికాదంటూ విమర్శిస్తూ ఉంటారు. తాజాగా ఇదే తరహాలో కోహ్లిని విమర్శిస్తూ ఓ పోస్టు ప్రత్యక్షమైంది.అది నిజమే.. విరాట్ కోహ్లి అహంకారిఇందుకు టీమిండియా మాజీ హెడ్కోచ్, కోహ్లితో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్న రవిశాస్త్రి స్పందించాడు. వన్8 చానెల్ పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘‘అహంకారి.. అతి గారాబం వల్ల చెడిపోయిన అల్లరిపిల్లాడు. దూకుడు.. కోహ్లి గురించి వాళ్లు అన్న ప్రతీ మాట నిజమే. అయితే, ఇదంతా క్రికెట్ మైదానంలో ఉన్నంత వరకే. మైదానం వెలుపల కోహ్లి ఇందుకు పూర్తి విభిన్నం. ఎక్కడ ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం’’ అని రవిశాస్త్రి కోహ్లి పట్ల అభిమానం చాటుకున్నాడు.ప్రత్యేక అనుబంధంకాగా రవిశాస్త్రి హెడ్కోచ్గా.. కోహ్లి కెప్టెన్గా ఉన్న సమయంలో టీమిండియా మంచి విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో నంబర్ వన్గా నిలిచి సత్తా చాటింది. ఈ ఇద్దరు తర్వాతి కాలంలో తమ తమ పదవుల నుంచి వైదొలిగినప్పటికీ.. వారి మధ్య అనుబంధం మాత్రం అలాగే కొనసాగుతోంది. తాజాగా రవిశాస్త్రి వ్యాఖ్యలతో మరోసారి ఈ విషయం నిరూపితమైంది.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించిన కోహ్లి.. ఫైనల్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అఫ్గనిస్తాన్తో స్వదేశంలో వన్డే సిరీస్కు కోహ్లి దూరమయ్యాడు. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. ఇక రవిశాస్త్రి ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతూ.. తనదైన శైలి వ్యాఖ్యానంతో అభిమానులను అలరిస్తున్నాడు.చదవండి: IND vs SL: కొంపముంచేశాడు! -
IND vs SL: కొంపముంచేశాడు.. భారత్కు భారీ షాక్!
శ్రీలంక, అఫ్గనిస్తాన్లతో ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ ఇప్పటికి రెండు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. తొలుత ఆతిథ్య లంక జట్టుతో తలపడ్డ తిలక్ వర్మ సేన.. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.అఫ్గన్ చేతిలో ఓటమిఅనంతరం అఫ్గన్-‘ఎ’ జట్టుతో మ్యాచ్లో 349 పరుగుల మేర భారీ స్కోరు సాధించినప్పటికీ.. భారత జట్టుకు పరాభవం తప్పలేదు. వర్షం పదేపదే అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో అఫ్గన్ జట్టు డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.ఫలితంగా పాయింట్ల పట్టికలో అఫ్గనిస్తాన్ అగ్రస్థానానికి దూసుకుపోగా.. భారత్, శ్రీలంక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే, తర్వాతి మ్యాచ్లో అఫ్గనిస్తాన్పై గెలిచి లంక టాప్కు దూసుకెళ్లగా.. భారత్ రెండు, అఫ్గన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.మరోసారి శ్రీలంకతోఈ ట్రై సిరీస్లో భాగంగా భారత్ సోమవారం నాటి మ్యాచ్లో మరోసారి శ్రీలంకతో తలపడుతోంది. దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 37, కెప్టెన్ తిలక్ వర్మ 23 పరుగులు చేశారు. మిగతా వారిలో ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.రెండుసార్లు అదే తప్పుఅయితే, విప్రాజ్ చేసిన పొరపాటు వల్ల భారత్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. భారత్-‘ఎ’ ఇన్నింగ్స్లో 35వ, 37వ ఓవర్లలో విప్రాజ్.. సింగిల్ తీసే క్రమంలో పిచ్ మధ్యలో పరిగెత్తాడు. ఎంసీసీ నిబంధన 41.14 ప్రకారం.. ఉద్వేశపూర్వకంగా గానీ, అనుకోకుండా గానీ పిచ్ మధ్యలో (ప్రొటెక్టెడ్ ఏరియా)కి వచ్చి డ్యామేజ్కు కారణమయ్యే పరిస్థితి తలెత్తితే తొలుత అంపైర్ సదరు స్ట్రైకర్ను హెచ్చరిస్తాడు.ఇదే తప్పు పునరావృతం చేస్తే బ్యాటింగ్ చేసే జట్టు స్కోరులో ఐదు పరుగుల మేర కోత విధిస్తారు. అయితే, ఇక్కడ తొలుత అనుకుల్ రాయ్ కూడా ఇలాంటి తప్పిదానికే పాల్పడగా.. అంపైర్ వార్నింగ్తో వదిలేశాడు. అయితే, విప్రాజ్ ఒకటి కాకుండా.. ఏకంగా రెండుసార్లు పిచ్ మధ్యలోకి రావడంతో మొత్తంగా భారత్కు పది పరుగుల మేర నష్టం కలిగింది.పది పరుగుల నష్టంఫలితంగా శ్రీలంక తమ ఇన్నింగ్స్ను 10/0తో మొదలుపెట్టింది. అంటే విప్రాజ్ తప్పిదం వల్ల ప్రత్యర్థికి అదనంగా పది పరుగుల మేర లాభం చేకూరింది. ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఈ ఆల్రౌండర్ చేసిన తప్పిదం దేనికి దారితీస్తుందో చూడాలి మరి!!చదవండి: హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ విండీస్ కైవసం -
సూర్యాన్ష్ మెరుపులు.. ఇండియా-ఏ భారీ స్కోరు
ముక్కోనఫు వన్డే సిరీస్లో భాగంగా సోమవారం దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సూర్యాన్ష్ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్కు తోడు విప్రాజ్ నిగమ్ (51) సంచలన అర్థసెంచరీ చేయడంతో ఇండియా-ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ (21) మరోసారి నిరాశపరచగా, రుతురాజ్ గైక్వాడ్ (37), కెప్టెన్ తిలక్ వర్మ (23) పర్వాలేదనిపించారు. ఒక దశలో 143 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇండియా-ఏ జట్టును సూర్యాన్ష్, విప్రజ్ ఆదుకున్నారు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట లోయర్ ఆర్డర్లో సూర్యాన్ష్, విప్రజ్ నిగమ్లు బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించారు. ఈ ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్కు 104 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో విజయ్కాంత్ వియస్కాంత్ 3 వికెట్లు తీయగా, మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు.చదవండి: పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలు.. గొంతుపట్టుకున్న హర్మన్! -
పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలు.. గొంతుపట్టుకున్న హర్మన్!
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వచ్చాకా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు ఏఐను తప్పుడు సంకేతాలకు వాడడం అలవాటుగా మార్చుకున్నారు. తాజాగా మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్కు సంబంధించిన ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ వద్దకు వచ్చిన పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన హర్మన్ప్రీత్ ఆమె గొంతు పట్టుకొని నెట్టేసింది. దీంతో అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని ఇద్దరిని విడదీయడం వీడియోలో కన్పించింది. ఇది చూసిన కొంతమంది అభిమానులు మ్యాచ్లో ఇంత పెద్ద గొడవ ఎప్పుడు జరిగిందా అని రిప్లేల మీద రిప్లేలు చూశారు. నిజానికి మ్యాచ్లో ఎక్కడా గొడవ జరిగిన దాఖలాలు లేవు. అయితే కొందరు ఆకతాయిలు ఏఐ మాయతో పాత వీడియో క్లిప్పింగ్లను జత చేర్చి ఈ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఇదీ అసలు సంగతి. అయితే ఐసీసీ ఈ ఫేక్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ వీడియోల వల్ల ఆటకు ఉండే క్రీడాస్ఫూర్తి దెబ్బతింటుందని, ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని కఠినంగా హెచ్చరించింది. అయితే భారత ఇన్నింగ్స్ సమయంలో జెమీమా రోడ్రిగ్స్ ఔటైన సమయంలో మాత్రం పాక్ ప్లేయర్లు కాస్త ఓవరాక్షన్ చేశారు. తస్మియా రుబాబ్ బౌలింగ్లో రోడ్రిగ్స్ మిడాన్ దిశగా షాట్ ఆడింది. అయితే అక్కడే ఉన్న నటాలియా పెర్వాయిజ్ క్యాచ్ అందుకుంది. ఈ క్రమంలో పాక్ ఫీల్డర్ శ్రుతి మించి రోడ్రిగ్స్ నడుచుకుంటూ వెళుతున్న తరుణంలో ఆమెను చూస్తే బంతిని బలంగా నేలకేసి కొట్టడం వివాదంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదని నిర్ణయించిన బీసీసీఐ నిన్నటి మహిళల మ్యాచ్లోనూ దానిని కంటిన్యూ చేసింది. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మంధాన (68), రిచా (34), హర్మన్ ప్రీత్ (36) రాణించారు. అనంతరం పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఆల్రౌండర్ దీప్తి శర్మ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది.చదవండి: ట్యునీషియాపై విజయం.. సంబరాలు చేసుకోని స్వీడన్! -
హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను వెస్టిండీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన మూడో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయాన్ని అందుకుంది. విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ ఐదు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా, బ్యాటింగ్లో రూథర్ఫోర్డ్, హోల్డర్ మెరుపులు మెరిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. దునిత్ వెల్లలాగె (43 పరుగులు) టాప్ స్కోరర్గా నిలవగా, కమిల్ మిశారా (28), నిస్సాంక (26) పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్ 5 వికెట్లు తీయగా, అకిల్ హొసెన్, మాథ్యూ ఫోర్డె, జాసన్ హోల్డర్, రోస్టన్ చేజ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి విజయం సాధించింది. 53 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ను రోవ్మెన్ పావెల్ (33), రూథర్ఫోర్డ్ (54 నాటౌట్) చక్కదిద్దడమే గాక జట్టును విజయంవైపు నడిపించారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 81 పరుగులు జోడించారు. విజయానికి చేరువవుతున్న క్రమంలో పావెల్ ఔటైనప్పటికీ, క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్ (5 బంతుల్లో 21 నాటౌట్) మూడు భారీ సిక్సర్లు బాది వెస్టిండీస్ను గెలిపించాడు. లంక బౌలర్లలో హసరంగ రెండు వికెట్లు తీయగా, వెల్లలాగె, దుష్మంత చమీర, తీక్షణ తలా ఒక వికెట్ తీశారు. షమర్ జోసెఫ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా గెలుచుకున్నాడు. 2024 తర్వాత వెస్టిండీస్ తమ సొంతగడ్డపై టీ20 సిరీస్ నెగ్గడం విశేషం. ఇరుజట్ల మధ్య జూన్ 25 నుంచి అంటిగ్వా వేదికగా తొలి టెస్టు జరగనుంది.మ్యాచ్లో నమోదైన పలు రికార్డులు..👉ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడం ద్వారా షమర్ జోసెఫ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సబీనా పార్క్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా షమర్ జోసెఫ్ నిలిచాడు. గతంలో ఈ మైదానంలో ఐర్లాండ్కు బౌలర్ అలెక్స్ కుసాక్ (4/11) అత్యుత్తమంగా ఉండేది. తాజాగా ఆ రికార్డును జోసెఫ్ బద్దలు కొట్టాడు.👉టీ20 క్రికెట్లో వెస్టిండీస్ తరఫున ఐదు వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్గా షమర్ జోసెఫ్ నిలిచాడు. ఇక శ్రీలంకతో మ్యాచ్లో ఐదు వికెట్ల హాల్ అందుకున్న రెండో బౌలర్గా జోసెఫ్ నిలిచాడు. గతంలో ఓషెన్ థామన్ ఈ ఫీట్ సాధించాడు.👉శ్రీలంకతో మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడం ద్వారా షమర్ జోసెఫ్ టీ20 క్రికెట్లో 50 వికెట్ల మార్క్ పూర్తి చేసుకున్నాడు.చదవండి: శ్రీలంక-ఏతో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో -
శ్రీలంక-ఏతో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో
శ్రీలంక పర్యటనలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో విజయవంతంగా కొనసాగుతుంది. ట్రై సిరీస్లో భాగంగా సోమవారం దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్లో వైభవ్ మరోసారి నిరాశపరిచాడు. మంచి ఈజ్తోనే బ్యాటింగ్ ప్రారంభించినప్పటికీ వైభవ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 14 బంతుల్లో 21 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ సాహన్ అరాచిగే బౌలింగ్లో వనుజా సాహన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లంకతో జరిగిన తొలి మ్యాచ్లో 14 పరుగులు చేసిన వైభవ్ ఆఫ్గన్తో మ్యాచ్లో 22 బంతుల్లో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. తాజాగా లంకతో జరుగుతున్న మ్యాచ్లో క్రీజులో ఎక్కువసేపు నిలుస్తాడనుకున్నప్పటికీ విఫలమయ్యాడు. దీంతో వైభవ్ సూర్యవంశీపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్తో రెచ్చిపోయారు. ‘వన్డే క్రికెట్లో వైభవ్ సూర్యవం ప్లాఫ్ షో కొనసాగుతోంది’.. ‘టీ20 ఆట వన్డేల్లో పనికిరాదు’.. ‘ఓవర్ హైప్ వల్ల ఆడలేకపోతున్నాడు’ అంటూ కామెంట్లు చేశారు.ఇక మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం భారత-ఏ జట్టు 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.మ్యాచ్కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తిలక్ వర్మ తెలిపాడు. యశ్ ఠాకూర్, అనుకుల్ రాయ్ తుదిజట్టులోకి వచ్చారు. మరోవైపు శ్రీలంక జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.తుది జట్లు:ఇండియా-ఏ: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, నిశాంత్ సింధు, అనుకూల్ రాయ్, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్శ్రీలంక-ఏ: నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, విషెన్ హలంబాగే, సదీర సమరవిక్రమ, అహన్ విక్రమసింఘే, సహన్ అరాచ్చిగే(కెప్టెన్), వనుజా సహన్, విజయకాంత్ వియస్కాంత్, కుగతస్ మతులన్, చమిక కరుణరత్నే, మహ్మద్ షిరాజ్. -
చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. 'హనుమంతుడి దయ వల్లే ఇదంతా'
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే విజయంలో దీప్తి శర్మ కీలకపాత్ర పోషించింది. బ్యాటింగ్లో విలువైన పరుగులు, బౌలింగ్లో ఐదు వికెట్లు సహా ఫీల్డింగ్లో ఒక రనౌట్ చేసి ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేసింది. తద్వారా చిరకాల ప్రత్యర్థిపై విజయంలో దీప్తి శర్మ కర్త, కర్మ, క్రియగా నిలిచింది. ఈ నేపథ్యంలో దీప్తి శర్మ ఒక అరుదైన రికార్డు సాధించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ అగ్రస్థానంలో నిలిచింది. పాక్తో మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడం ద్వారా 166 వికెట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. థాయ్లాండ్కు చెందిన తిపాట్చా పుత్తావాంగ్ (165 వికెట్లు) రెండో స్థానంలో ఉండగా, వాండాకు చెందిన హెన్రిట్టే ఇష్విమే (160 వికెట్లతో) మూడో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ షట్ (152 వికెట్లు), థాయ్లాండ్కు చెందిన ఒన్నిచా కమ్చోఫూ (148 వికెట్లు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి దీప్తి శర్మ ఇప్పటివరకు 354 వికెట్లు పడగొట్టింది. తద్వారా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. తొలి స్థానంలో భారత్కు చెందిన మాజీ బౌలర్ జులన్ గోస్వామి (355 వికెట్లు) ఉండగా, ఇంగ్లండ్కు చెందిన కేథరిన్ బ్రంట్ (335 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎలీస్ పెర్రీ (332 వికెట్లు), ఇంగ్లండ్కు చెందిన సోఫీ ఎసల్స్టోన్ (327 వికెట్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లోనూ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది.5/10 – దీప్తి శర్మ vs పాకిస్తాన్, బర్మింగ్హామ్, 2026, 5/11 – జులన్ గోస్వామి vs ఆస్ట్రేలియా, విశాఖపట్నం, 20125/15 – రేణుకా సింగ్ vs ఇంగ్లాండ్, గ్కెబెర్హా, 20235/16 – ప్రియాంక రాయ్ vs పాకిస్థాన్, టౌంటన్, 20095/19 – దీప్తి శర్మ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్బర్గ్, 202628 ఏళ్ల ఆమె మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో భారతదేశం తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేయగా, టోర్నమెంట్ చరిత్రలో ఏ బౌలర్ అయినా సాధించిన గణాంకాలలో ఇది మూడవ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.మహిళల టీ20 ప్రపంచ కప్లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:5/5 – డియాండ్రా డాటిన్ (వెస్ట్ ఇండీస్) వర్సెస్ బంగ్లాదేశ్, ప్రొవిడెన్స్, 20185/8 – సునే లూస్ (దక్షిణాఫ్రికా) వర్సెస్ ఐర్లాండ్, చెన్నై, 20165/10 – దీప్తి శర్మ (భారతదేశం) వర్సెస్ పాకిస్తాన్, బర్మింగ్హామ్, 2026, ఈరోజు*5/12 – ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా) వర్సెస్ న్యూజిలాండ్, పార్ల్, 20235/15 – రేణుకా సింగ్ (భారత్) వర్సెస్ ఇంగ్లండ్, గ్వేబెర్హా, 2023ఇక మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత దీప్తి మాట్లాడుతూ ఈ ఘనత మొత్తం జట్టుకే చెందుతుందని చెప్పింది. తన విజయానికి హనుమాన్ జీ ఆశీస్సులు కూడా కారణమని పేర్కొంది. ఐసీసీ టోర్నమెంట్లు తనకు ప్రత్యేకమైనవని, అలాంటి వేదికలపై ఆడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపింది. స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్లపై బౌలింగ్ చేయడం తనకు ఎంతో ఇష్టమని, ప్రతి బంతికి వేగం మారుస్తూ సరైన ప్రాంతాల్లో బంతులు వేయడమే తన విజయ రహస్యమని వివరించింది.BIG NEWS 🚨 India Women Team defeats Pakistan by 64 runs in #T20WC2026 opener!Deepti Sharma wins Player of the Match.She picked up a career-best 5/10 with the ball to restrict Pakistan to 106."Special Thanks to Hanuman ji" - DEEPTI 🔥 pic.twitter.com/h4VZqnXtgJ— News Algebra (@NewsAlgebraIND) June 14, 2026 -
‘మ్యాచ్ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 64 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీప్తిశర్మ ఆల్రౌండ్ ప్రదర్శనకు తోడు మంధాన, హర్మన్ మెరుపులతో పాక్పై భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. కాగా మ్యాచ్ విజయం అనంతరం హర్మన్ప్రీత్ మాట్లాడింది. 'మ్యాచ్ విజయంతో చాలా సంతోషంగా ఉన్నా. ముందుగా మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మ్యాచ్ విజయంలో (స్మృతి మంధాన, దీప్తి శర్మ) ఆ ఇద్దరిదే కీలకపాత్ర. జట్టుకు అవసరమైనప్పుడల్లా వారు ముందుంటారు. ఇవాళ వాళ్లిద్దరూ ఆడిన తీరు చూసి సంతోషంగా అనిపించింది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. అయితే ఆరంభంలో వికెట్లు పడడంతో కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నాం. అయితే పిచ్పై అవగాహన వచ్చిన తర్వాత మంధాన, నేను స్వేచ్ఛగా ఆడాం. రిచా ఘోష్కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వొచ్చు. కానీ ఆమె ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమని చెప్పింది. ఇవాళ ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. ధనాధన్ ఇన్నింగ్స్తో అభిమానులను అలరించింది. ఇక ఫీల్డింగ్లో కొన్ని తప్పులున్నాయి. రాబోయే మ్యాచ్ల్లో వాటిని సరిచేసుకుంటాం. నెట్ రన్రేట్ అనేది కీలకం కాబట్టి మరింత వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తాం.' అని చెప్పుకొచ్చింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (44 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకంతో విజృంభించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించింది. చివర్లో రిచా ఘోష్ (17 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టింది. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా, ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మునీబా అలీ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. -
పాక్ను తిప్పేశారు
ధనాధన్ ఫార్మాట్లోనూ విశ్వవిజేతగా అవతరించాలనే లక్ష్యంతో ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన భారత మహిళల జట్టు టైటిల్ వేటను బ్రహ్మాండంగా ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను తొలి మ్యాచ్లో చిత్తు చేసి టీమిండియా గెలుపు గర్జన చేసింది. బ్యాటింగ్లో స్మృతి మంధాన, రిచా ఘోష్, హర్మన్ప్రీత్ విజృంభించగా... బౌలింగ్లో ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి, స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ తమ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చారు. బర్మింగ్హామ్: ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్లో శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై ఘనవిజయంతో కప్పు వేటను ఘనంగా ప్రారంభించింది. గ్రూప్–1లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 64 పరుగుల తేడాతో పాకిస్తాన్పై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (44 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకంతో విజృంభించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించింది. చివర్లో రిచా ఘోష్ (17 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టింది. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా, ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మునీబా అలీ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. పవర్ప్లే ముగిసేసరికి 52/1తో పటిష్ట స్థితిలో కనిపించిన పాకిస్తాన్... స్పిన్నర్ల రంగప్రవేశం తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ 10 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా... ఆంధ్ర అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 21 పరుగులిచ్చి 3 వికెట్లు ఖాతాలో వేసుకుంది. భారత పురుష క్రికెటర్ల మాదిరిగానే... మహిళా క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్లకు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదు. ప్రపంచకప్లో సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్ల్లో న్యూజిలాండ్తో శ్రీలంక; ఇంగ్లండ్తో ఐర్లాండ్ తలపడతాయి. తొలి బంతికే సిక్సర్... ఓపెనర్ షఫాలీ వర్మ (6) తొలి బంతికే సిక్స్ బాదడంతో... టీమిండియాకు మంచి ఆరంభం దక్కుతుందనుకుంటే అది సాధ్యపడలేదు. ఐదో బంతికి షఫాలీ అవుట్ కాగా... జెమీమా (1) విఫలమైంది. దీంతో భారత్ 18/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో నాయకద్వయం జట్టును ఆదుకుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్తో కలిసి వైస్ కెప్టెన్ స్మృతి ఇన్నింగ్స్ను నిర్మించింది. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన ఈ జంట... కుదురుకున్నాక చక్కటి షాట్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. మూడో వికెట్కు 91 పరుగులు జోడించిన అనంతరం స్మృతి అవుట్ కాగా... హార్డ్ హిట్టర్ భారతి ఫుల్మాలి (1) నిరాశ పరిచింది. ఈ దశలో దీప్తి శర్మ (12 నాటౌట్) అండతో రిచా రెచ్చిపోయింది. పాకిస్తాన్ పేలవ ఫీల్డింగ్ కూడా మనవాళ్లకు కలిసి వచ్చింది. ఒక్క ఓవర్లో 23 పరుగులు... తస్మియా రుబాబ్ వేసిన ఇన్నింగ్స్19వ ఓవర్లో భారత బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. తొలి బంతికి ఫోర్ కొట్టిన దీప్తి రెండో బంతికి సింగిల్ తీయగా... ఆ తర్వాత రిచా రఫ్ఫాడించింది. వరుసగా 4, 6, 4, 4 బాదింది. దీంతో ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో మరో 15 పరుగులు రాబట్టారు. మొత్తంగా తొలి 10 ఓవర్లలో 65 పరుగులకే పరిమితమైన టీమిండియా ఆ తర్వాత 10 ఓవర్లలో 105 పరుగులు చేసింది. 87 అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా స్మతి మంధాన అవతరించింది. 86 సిక్స్లతో హర్మన్ప్రీత్ పేరిట ఉన్న రికార్డును స్మృతి అధిగమించింది.14 టి20 ఫార్మాట్లో పాకిస్తాన్పై భారత్ గెలిచిన మ్యాచ్లు. ఇరు జట్ల మధ్య 17 మ్యాచ్లు జరిగాయి. మూడింటిలో పాక్ గెలిచింది.166 మహిళల టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ గుర్తింపు పొందింది. 165 వికెట్లతో థిపాచా పథావోంగ్ (థాయ్లాండ్) పేరిట ఉన్న రికార్డును దీప్తి సవరించింది.స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) మునీబా (బి) సాదియా 6; స్మృతి (సి) సనా (బి) షమీమ్ 68; జెమీమా (సి) నటాలియా (బి) తస్మియా 1; హర్మన్ప్రీత్ (సి) నటాలియా (బి) సనా 36; భారతి (స్టంప్డ్) మునీబా (బి) సాదియా 1; రిచా (బి) సనా 34; దీప్తి శర్మ (నాటౌట్) 12; శ్రేయాంక పాటిల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–109, 4–110, 5–123, 6–168. బౌలింగ్: సాదియా 4–0–41–2; ఫాతిమా సనా 4–0–33–2; తస్మియా 4–0–41–1; రమీన్ షమీమ్ 4–0–30–1; నష్ర 4–0–25–0. పాకిస్తాన్ మహిళల ఇన్నింగ్స్: మునీబా (రనౌట్) 41; ఫెరోజా (సి) భారతి (బి) దీప్తి 12; ఆయేషా (సి) స్మృతి (బి) దీప్తి 12; సైరా జబీన్ (సి) హర్మన్ (బి) శ్రీ చరణి 2; నటాలియా (సి) హర్మన్ (బి) శ్రీ చరణి 7; సనా (సి) స్మృతి (బి) షఫాలీ 0; ఆలియా (సి) జెమీమా (బి) దీప్తి 18; షమీమ్ (సి) శ్రేయాంక (బి) శ్రీ చరణి 4; నష్ర (సి) హర్మన్ (బి) దీప్తి 4; తస్మియా (సి) జెమీమా (బి) దీప్తి 0; సాదియా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 106. వికెట్ల పతనం: 1–38, 2–53, 3–58, 4–75, 5–77, 6–79, 7–91, 8–105, 9–105, 10–106. బౌలింగ్: అరుంధతి రెడ్డి 2–0–21–0; శ్రేయాంక 3–0–17–0; క్రాంతి గౌడ్ 1–0–14–0; దీప్తి శర్మ 4–0–10–5; శ్రీ చరణి 4–0–21–3; షఫాలీ 3–0–22–1. -
షనక మెరుపులు
కింగ్స్టన్: వెస్టిండీస్తో తొలి టి20లో ఓటమి పాలైన శ్రీలంక జట్టు... రెండో మ్యాచ్లో సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. మొదట లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కమిల్ మిషారా (40 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దసున్ షనక (24 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో విజృంభించారు. విండీస్ బౌలర్లలో షామార్ జోసెఫ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ 18.1 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. రావ్మన్ పావెల్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్లు), హెట్మైర్ (26 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కాస్త పోరాడగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. లంక బౌలర్లలో హసరంగ, చమీర చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
దీప్తి మాయాజాలం.. పాక్ను చిత్తుగా ఓడించిన భారత్
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ (36) మంధనకు సహకరించింది. ఆఖర్లో రిచా ఘోష్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించింది. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్ 1 (నాటౌట్) పరుగు చేశారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా, సదియా ఇక్బల్ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్, రమీన్ షమీమ్ చెరో వికెట్ పడగొట్టారు.దీప్తి మాయాజాలంఅనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. దీప్తి శర్మ మాయాజాలానికి (4-0-10-5) కుదేలైంది. ఆమె శ్రీ చరణి (4-0-21-3), షఫాలీ వర్మ (3-0-22-1) కూడా తోడవ్వడంతో పాక్ 17 ఓవర్లలో 106 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టు తరఫున ఓపెనర్ మునీబా అలీ (41) మాత్రమే ఓ మోస్తరు స్కోర్ సాధించింది. మిగతా ప్లేయర్లలో గుల్ ఫెరోజా (12), ఆయేషా జాఫర్ (2), ఆలియా రియాజ్ (18) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు సాధించగా.. సైరా జబీన్ (2), నతాలియా పర్వేజ్ (7), రమీన్ షమీమ్ (4), నష్రా సంధు (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఫాతిమా సనా, తస్మియా రుబాబ్ డకౌట్లయ్యారు. ఈ గెలుపుతో భారత్ తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించినట్లైంది. -
పాక్తో సమరం.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 14) బిగ్ ఫైట్ జరుగుతుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్-పాక్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది.ఓపెనర్ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించగ.. ఆమెకు కెప్టెన్ హర్మన్ప్రీత్ (36) సహకరించింది. ఆఖర్లో రిచా ఘోష్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించింది. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్ 1 (నాటౌట్) పరుగు చేశారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా, సదియా ఇక్బల్ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్, రమీన్ షమీమ్ చెరో వికెట్ పడగొట్టారు. చరిత్ర సృష్టించిన హర్మన్ ఈ మ్యాచ్లో హర్మన్ ఓ ప్రత్యేక రికార్డును బద్దలు కొట్టింది. భారత్ తరఫున టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు (762) చేసిన బ్యాటర్గా అవతరించింది. ఇప్పటివరకు ఈ రికార్డు మిథాలీరాజ్ ( 726) పేరిట ఉండింది. ఈ రికార్డుకు సంబంధించిన జాబితాలో హర్మన్, మిథాలీ తర్వాతి స్థానాల్లో స్మృతి మంధాన (592), జెమీమా రోడ్రిగ్స్ (408), పూనమ్ రౌత్ (375) ఉన్నారు. -
బోణీ కొట్టిన బంగ్లాదేశ్
2026 మహిళల టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ తమ ప్రయాణాన్ని విజయంతో మొదలుపెట్టింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇవాళ (జూన్ 14) జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో నెదర్లాండ్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి, టోర్నీ చరిత్రలో తమ అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది. అరంగేట్రం బ్యాటర్ ఫిర్దౌస్ (50) మెరుపు అర్ద శతకంతో బంగ్లా గెలుపుతో ప్రధానపాత్ర పోషించింది.టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. మరుఫా అక్తర్ (4-0-31-2), ఫరిహా త్రిస్న (4-0-32-1) చక్కటి బౌలింగ్తో కీలక వికెట్లు పడగొట్టారు. అయితే కెప్టెన్ బార్బెట్ డి లీడ్ 45 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టును ఆదుకుంది. లీడ్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ కారణంగా నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగలిగింది. ఆఖర్లో ఐరిస్ జ్విల్లింగ్ (13 నాటౌట్), సిల్వర్ సీగర్స్ (10 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు ఫిర్దౌస్, దిల్హర అక్తర్ (26) శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు 67 పరుగులు జోడించి జట్టును పటిష్టమైన స్థితిలో నిలిపారు. ఫిర్దౌస్ కేవలం 32 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసింది. ఆమె ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.అంతా సజావుగా సాగుతున్న వేల, నెదర్లాండ్స్ బౌలర్లు అనూహ్య పోరాట పటిమ కనబరిచారు. కరోలిన్ డి లాంజ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చింది. ఫిర్దౌస్ అర్ధశతకం అనంతరం ఔట్ కాగా, కెప్టెన్ నిగార్ సుల్తానా ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. అనంతరం సిల్వర్ సీగర్స్ దిల్హరాను ఔట్ చేయగా, ఫ్రెడెరిక్ ఓవర్డైక్ అద్భుత డైరెక్ట్ హిట్తో శోభన మోస్తరీను రనౌట్ చేసింది. దీంతో బంగ్లా స్కోర్ 67/0 నుంచి 85/4కు పడిపోయి ఒత్తిడిలో పడింది.ఈ దశలో అనుభవజ్ఞురాలు షర్మిన్ అక్తర్ (37 నాటౌట్), యువ బ్యాటర్ షోరఆన అక్తర్ (18 నాటౌట్) జాగ్రత్తగా ఆడి, మరో 5 బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్ను (4 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేర్చారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లాంజ్ 2, సిల్వర్ ఓ వికెట్ తీశారు. -
పాక్తో మ్యాచ్.. చరిత్ర సృష్టించిన హర్మన్ప్రీత్
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ ఒక అరుదైన రికార్డు సాధించింది. భారత్ తరఫున టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా హర్మన్ నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున ఇప్పటివరకు ఈ రికార్డు మిథాలీరాజ్ పేరిట ఉంది. మిథాలీరాజ్ 40.33 సగటుతో 726 పరుగులు సాధించింది. తాజాగా హర్మన్ప్రీత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బౌండరీ కొట్టడం ద్వారా మిథాలీరాజ్ రికార్డును బద్దలుకొట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఇక హర్మన్, మిథాలీ రాజ్ తర్వాత స్మృతి మంధాన 524 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, జెమీమా రోడ్రిగ్స్ 407 పరుగులతో నాలుగో స్థానంలో, పూనమ్ రౌత్ 375 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ (36), రిచా ఘోష్ (7) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఓపెనర్ స్మృతి మంధాన 68 పరుగులు చేసింది.చదవండి: బాస్కెట్బాల్ చరిత్రలో సంచలనం.. 53 ఏళ్ల నిరీక్షణకు తెర! -
మరో పరాభవాన్ని తృటిలో తప్పించుకున్న ఆసీస్
డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్, ఆరుసార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ అస్ట్రేలియా బంగ్లాదేశ్ పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (జూన్ 14) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో అతికష్టం మీద వికెట్ తేడాతో గెలుపొందింది. ఫలితంగా బంగ్లాదేశ్ ఆధిపత్యాన్ని 1-2కు తగ్గించి, క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇదివరకే సిరీస్ను చేజార్చుకున్న ఆసీస్.. నేటి మ్యాచ్లోనూ మరో ఘోర పరాభవాన్ని తృటిలో తప్పించుకుంది.275 పరుగుల లక్ష్య ఛేదనలో కూపర్ కన్నోల్లీ (149) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే గెలుపుకు అతి చేరువలో 5 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి, మరో ఘోర ఓటమికి చేరువైంది. నానా కష్టాలు పడ్డ అనంతరం చివరి ఓవర్ మూడో బంతికి ఆడమ్ జంపా (4 నాటౌట్) బౌండరీ సాధించి, ఆసీస్ను మరో ఘోర పరాభం నుంచి తప్పించడంతో సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యే అవమానం నుంచి కూడా గట్టెక్కించాడు. చివర్లో జంపాకు మెరిడిత్ (2 నాటౌట్) సహకరించాడు. ఫలితంగా ఆసీస్ 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీ అనంతరం కన్నోల్లీ గెలుపు వాకిట ఔటై ఆసీస్ శిబిరంలో ఉత్కంఠ రేపాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ .. తౌహిద్ హృదోయ్ (83), లిటన్ దాస్ (58 నాటౌట్), మొసద్దెక్ హొసేన్ (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో బార్ట్లెట్, రెన్షా తలో 2 వికెట్లతో రాణించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో కన్నోల్లీ ఒంటరిపోరాటం చేశాడు. అతడికి లబూషేన్ (29), గ్రీన్ (27), పీక్ (27) కాసేపు అండగా నిలబడ్డారు. గెలుపు ఖరారయ్యాక బంగ్లా బౌలర్లు ఒక్కసారిగా చెలరేగడంతో ఆసీస్ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. కాస్త అటుఇటు అయ్యుంటే ఈ మ్యాచ్ కూడా ఆసీస్ చేజారేది. షోరిఫుల్ ఇస్లాం (10-1-48-6) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్ శిబిరంలో రైళ్లు పరిగెట్టించాడు. ఈ పర్యటనలో ఆసీస్ తదుపరి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ చట్టోగ్రామ్ వేదికగా జూన్ 17న జరుగనుంది. -
టీమిండియా ఘన విజయం
పాక్ను చిత్తుగా ఓడించిన భారత్మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. దీప్తి శర్మ (4-0-10-5) మాయాజాలానికి పాక్ 106 పరుగులకే చాపచుట్టేసింది. భారత్ తరఫున బ్యాటింగ్లో మంధాన (68) రాణించగా.. ఆఖర్లో రిచా ఘోష్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించింది. ఓటమి దిశగా పాక్75 పరుగుల వద్ద నాలుగు పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన పాక్.. ఓటమి దిశగా సాగుతోంది. 75 పరుగుల వద్ద మునీబా అలీని (41) దీప్తి శర్మ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయగా.. 77 పరుగుల వద్ద ఫాతిమా సనాను (0) షఫాలీ, 79 పరుగుల వద్ద నతాలియాను (7) శ్రీ చరణి ఔట్ చేశారు. 13 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 83-6గా ఉంది. ఆలియా రియాజ్ (4), రమీన్ షమీమ్ (1) క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన పాక్7.4వ ఓవర్- 58 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్ కోల్పోయింది. శ్రీచరణి బౌలింగ్లో హర్మన్ప్రీత్కు క్యాచ్ ఇచ్చి సైరా జబీన్ (2) ఔటైంది. రెండో వికెట్ కోల్పోయిన పాక్6.3వ ఓవర్- 53 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ కోల్పోయింది. దీప్తి శర్మ బౌలింగ్లో స్మృతి మంధనకు క్యాచ్ ఇచ్చి అయేషా జాఫర్ (12) ఔటైంది.ఇండియాకు తొలి బ్రేక్171 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్కు మెరుపు ఆరంభం లభించింది. 4.4 ఓవర్లలో ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (24), గుల్ ఫెరోజా (12) 38 పరుగులు చేశారు. అయితే 4.5వ ఓవర్లో భారత్కు తొలి బ్రేక్ లభించింది. ఫెరోజాను దీప్తి శర్మ ఇంటిదారి పట్టించింది. భారతి ఫుల్మలి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఇది జరిగింది. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన టీమిండియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించింది. ఆమెకు కెప్టెన్ హర్మన్ప్రీత్ (36) సహకరించింది. ఆఖర్లో రిచా ఘోష్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించింది. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్ 1 (నాటౌట్) పరుగు చేశారు. ఆపఖ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా, సదియా ఇక్బల్ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్, రమీన్ షమీమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్16.2వ ఓవర్- 123 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఫాతిమా సనా బౌలింగ్లో నతాలియాకు క్యాచ్ ఇచ్చి హర్మన్ప్రీత్ (36) ఔటైంది. 👉 సాదియా ఇక్బాల్ బౌలింగ్లో భారతీ ఫుల్మలీ (1) స్టంప్ ఔట్ కావడంతో 110 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.మంధాన (68) ఔట్.. మూడో వికెట్ డౌన్ధాటిగా ఆడుతున్న మంధాన (68) రూపంలో టీమిండియా 109 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. రమీన్ సమీమ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన మంధాన ఫాతిమా సనాషేక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. హాఫ్ సెంచరీ బాదిన మంధానపాక్తో మ్యాచ్లో ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో చెలరేగింది. 34 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన మంధాన ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మంధాన (55), హర్మన్ప్రీత్ (21) పరుగులతో ఆడుతున్నారు.9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ ఎంతంటే..?18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. స్మృతి మంధన (28), కెప్టెన్ హర్మన్ప్రీత్ (17) ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్నారు. 9 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 54-2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా3.2వ ఓవర్- 18 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. తస్మియా రుబాబ్ బౌలింగ్లో నతాలియా పర్వేజ్ క్యాచ్ పట్టడంతో జెమీమా రోడ్రిగ్స్ (1) పెవిలియన్కు చేరింది. తొలి బంతికే సిక్సర్.. ఐదో బంతికి వికెట్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు మెరుపు ఆరంభం లభించింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సదియా ఇక్బాల్ బౌలింగ్లో షఫాలీ వర్మ సిక్సర్ కొట్టింది. అయితే అదే ఓవర్ ఐదో బంతికి మునీబా అలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (జూన్ 14) బిగ్ ఫైట్ జరుగనుంది. దాయాదులు భారత్, పాకిస్తాన్ ఎడ్జ్బాస్టన్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లోనూ భారత, పాక్ కెప్టెన్లు నో హ్యాండ్ షేక్ ఆనవాయితీని కొనసాగించారు. తుది జట్లు:భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (సి), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్పాకిస్తాన్: గుల్ ఫిరోజా, మునీబా అలీ(w), అయేషా జాఫర్, సైరా జబీన్, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, ఫాతిమా సనా(c), రమీన్ షమీమ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్, సదియా ఇక్బాల్ -
మళ్లీ కెప్టెన్గా స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ఫ్రాంచైజీ అయిన వాషింగ్టన్ ఫ్రీడం 2026 సీజన్ కోసం స్టీవ్ను కెప్టెన్గా నియమించింది. స్టీవ్ గతంలోనూ ఈ ఫ్రాంచైజీ కెప్టెన్గా వ్యవహరించాడు. 2024 సీజన్లో వ్యక్తిగతంగానూ సత్తా చాటి టైటిల్ గెలిపించాడు.గత సీజన్లో ఆస్ట్రేలియాకే చెందిన గ్లెన్ మ్యాక్స్వెల్ వాషింగ్టన్కు కెప్టెన్గా వ్యవహరించగా, ఈసారి ఆ బాధ్యతలు స్మిత్కు అప్పగించారు. వాషింగ్టన్ బృందం ఆస్ట్రేలియా ప్రస్తుత, మాజీ ఆటగాళ్లతో నిండిపోయి ఉంది. ఈ జట్టుకు రికీ పాంటింగ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.టోర్నీ విషయానికొస్తే.. 2026 సీజన్ జూన్ 18న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో టెక్సాస్ కింగ్స్, సీయాటిల్ ఓర్కాస్ తలపడనున్నాయి. వాషింగ్టన్ తమ తొలి మ్యాచ్ను జూన్ 20న సియాటిల్తో ఆడనుంది. కాగా, ఈ టోర్నీ 2023లో ప్రారంభం కాగా.. ఎంఐ న్యూయార్క్ రెండు సార్లు, వాషింగ్టన్ ఓసారి టైటిల్ సాధించాయి. గత ఎడిషన్లో ఎంఐ న్యూయార్క్ విజేతగా నిలువగా.. వాషింగ్టన్ ఫ్రీడం రన్నరప్గా నిలిచింది. -
పాక్తో మ్యాచ్.. అగ్గి రాజేసిన కెప్టెన్ హర్మన్ప్రీత్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలే మిగిలి ఉన్న సమయంలో ఇరుజట్ల కెప్టెన్లు ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తన మాటలతో అగ్గి రాజేసింది. పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హర్మన్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది. తాము ఇక్కడికి క్రికెట్ ఆడడానికి మాత్రమే వచ్చామని, ఎవరితో చేతులు కలపడానికి కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. హర్మన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి మేము ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు వచ్చాము. కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. క్రికెట్ మినహా అనవసర విషయాల గురించి మాట్లాడదలచుకోలేము. అయినా నేను క్రికెట్ తప్ప దేని గురించి ఆలోచించడం లేదు. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా క్రికెట్ అనేది మా కల. దాని గురించే మాట్లాడుకుంటాం. మీరు హైవోల్టేజ్ మ్యాచ్ అని చెబుతున్న ప్పటికీ నా దృష్టిలో మాత్రం పాకిస్తాన్తో మ్యాచ్ను ఒక సాధారణ గేమ్గానే చూస్తున్నాను. అయితే పాక్తో ఆడేటప్పుడు ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని నేను అంగీకరిస్తాను. పాక్ ఒక్కటే కాదు తాము ఆడబోయే ప్రతీ మ్యాచ్లోనూ ఒత్తిడి సహజం. కానీ దానిని జయిస్తేనే విజయం మనల్ని వరిస్తుంది. ఎవరితో మ్యాచ్ అయినా మేము అత్యుత్తమ క్రికెట్ ఆడాలని అనుకుంటాము.’ అని చెప్పుకొచ్చింది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో ఇరుజట్లు తలపడితే ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవారు. కానీ పహల్గాం ఘటన తర్వాత పాక్తో ఆడే ఎలాంటి మ్యాచ్ అయినా సరే ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. బీసీసీఐ కూడా భారత ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆసియా కప్ నుంచి పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి ముందుకు రాలేదు. మహిళల వన్డే ప్రపంచకప్ సమయంలోనూ హర్మన్ సేన పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. కాబట్టి నేటి మ్యాచ్లోనూ భారత మహిళా ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసే అవకాశం లేదు. సొంతగడ్డపై జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ను తొలిసారి సొంతం చేసుకున్న హర్మన్ప్రీత్ సేన తాజాగా టీ20 ప్రపంచకప్లోనూ అదే జోరును కనబరచాలని ఉవ్విళ్లూరుతోంది. 2009లో మొదలైన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరింది. 2020 ఎడిషన్లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్తోనే సరిపెట్టుకుంది. 𝘛𝘩𝘦 𝘸𝘰𝘳𝘭𝘥 𝘳𝘦𝘮𝘦𝘮𝘣𝘦𝘳𝘴 𝘾𝙝𝙖𝙢𝙥𝙞𝙤𝙣𝙨 𝘧𝘰𝘳 𝘸𝘩𝘢𝘵 𝘵𝘩𝘦𝘺 𝘥𝘪𝘥 𝘰𝘯𝘤𝘦…𝙂𝙧𝙚𝙖𝙩 𝙏𝙚𝙖𝙢𝙨 𝘢𝘳𝘦 𝘳𝘦𝘮𝘦𝘮𝘣𝘦𝘳𝘦𝘥 𝘧𝘰𝘳 𝘸𝘩𝘢𝘵 𝘵𝘩𝘦𝘺 𝘥𝘰 𝘯𝘦𝘹𝘵 🏆⏳The #WomenInBlue are #T20WorldCup ready 💪 #TeamIndia pic.twitter.com/7fWJN6ootJ— BCCI Women (@BCCIWomen) June 14, 2026చదవండి: ఇండియా-ఏకు భారీ షాక్.. వైభవ్ సూర్యవంశీకి గాయం! -
బాబర్ ఆజం రికార్డును బద్దలు కొట్టిన గిల్
ఆఫ్ఘనిస్తాన్తో నిన్న (జూన్ 13) జరిగిన తొలి వన్డేలో అజేయమైన 84 పరుగులు చేసి టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో పలు అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఇన్నింగ్స్తో వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకున్న అతడు.. ఈ ఘనత (కనీసం 3000 పరుగులు) సాధించిన బ్యాటర్లలో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (53.43), ఏబీ డివిలియర్స్ (53.50), మైఖేల్ బెవాన్ (53.58) లాంటి హేమాహేమీలను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరాడు. ప్రస్తుతం టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (58.71) మాత్రమే గిల్ (57.30) కంటే ముందున్నాడు.ఈ ఇన్నింగ్స్తో గిల్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా (62 ఇన్నింగ్స్లు) 3000 పరుగులు చేసిన భారత బ్యాటర్గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధవన్ (72 ఇన్నింగ్స్లు) పేరిట ఉండేది. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (75 ఇన్నింగ్స్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్గా చూస్తే, ఈ రికార్డు సౌతాఫ్రికా బ్యాటర్ హషిమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా కేవలం 57 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ (102) మెరుపు శతకంతో చెలరేగాడు. అతడు మినహా ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27), అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలో 3 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, నితీశ్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టాడు.అనంతరం 195 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. గిల్ (84 నాటౌట్) సత్తా చాటడంతో 22.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. గిల్కు ఇషాన్ కిషన్ (34), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) సహకరించగా.. రోహిత్ శర్మ (16), శ్రేయస్ అయ్యర్ (12) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే జూన్ 17న లక్నోలో జరగనుంది. -
ఇండియా-ఏకు భారీ షాక్.. వైభవ్ సూర్యవంశీకి గాయం!
ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టుకు భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం శ్రీలంకతో జరగనున్న వన్డే మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడేది అనుమానంగానే ఉంది. ఆదివారం ప్రాక్టీస్ సెషన్కు వచ్చిన వచ్చిన వైభవ్ సూర్యవంశీ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో వైభవ్ ప్రాక్టీస్ మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే నివేదికలో వైభవ్ సూర్యవంశీ గాయం తీవ్రత ఎంత అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఇక రేపు శ్రీలంక-ఏతో జరగనున్న మ్యాచ్కు వైభవ్ దూరమైతే అతడి స్థానంలో నిశాంత్ సింధును జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఎలాగూ టాపార్డర్లో ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ ఉండడంతో వీరిలో ఇద్దరు ఓపెనర్లుగా వస్తే, ఒకరు వన్డౌన్లో రావడం ఖాయం. కెప్టెన్ తిలక్ వర్మ నాలుగో స్థానంలో ఆడుతాడు. ఇక వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్లో విఫలమైనప్పటికీ, రెండో మ్యాచ్లో మాత్రం 22 బంతుల్లో 44 పరుగులతో తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.అయితే వైభవ్ సూర్యవంశీ గాయం అప్డేట్పై ఎలాంటి సమాచారం లేనప్పటికీ రాబోయే ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్ ఆడే టీమిండియా జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్కు గాయం తీవ్రత ఎక్కువగా లేకపోతే రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఆడే సువర్ణావకాశం లభిస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్లో సంచలన బ్యాటింగ్తో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ అనూహ్యంగా టీమిండియాలోకి ఎంపిక చేసింది. ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు కూడా వైభవ్ సూర్యవంశీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఒకవేళ ఐర్లాండ్తో పర్యటనకు ముందే సూర్యవంశీ ఫిట్నెస్ నిరూపించుకుంటే, సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశం తరఫున అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచే అవకాశముంది. -
ఫైనల్ మ్యాచ్లో హైడ్రామా.. లైవ్లోనే తన్నుకున్న ఆటగాళ్లు!
టీ20 ముంబై లీగ్ 2026 విజేతగా ఎమ్ఎస్సి మరాఠా రాయల్స్ నిలిచింది. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఆర్క్స్ అంధేరిపై 8 పరుగుల తేడాతో విజయం సాధించిన మరాఠా రాయల్స్ డిఫెండింగ్ చాంపియన్ హోదాను నిలుపుకుంది. అయితే మ్యాచ్ ముగిశాకా ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలోనే గొడవకు దిగారు. ఒకానొక దశలో ఇద్దరు క్రికెటర్లు దాడి చేసుకునే వరకు వెళ్లారు. దీంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విషయంలోకి వెళితే మరాఠా రాయల్స్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో ఆర్క్స్ అంధేరి ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ వివాదం మొదలైంది. ఆ ఓవర్ రెండో బంతికి అంధేరి బ్యాటర్ గౌరవ్ జతార్ సిక్స్ కొట్టాడు. అయితే ఆ తర్వాతి బంతికే ఇర్ఫాన్ ఉమైర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో రాయల్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, గౌరవ్ అసహనం వ్యక్తం చేశాడు. గౌరవ్ పెవిలియన్ వైపు వెళ్తుండగా.. డగౌట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మరాఠా రాయల్స్ ఆటగాడు రోహన్ రాజేతో అతనికి మాటల యుద్ధం నడిచింది. మొదట ఫోర్త్ అంపైర్ ఇద్దరినీ విడదీసినప్పటికీ.. వారు మళ్లీ ఒకరినొకరు నెట్టుకుంటూ తీవ్రమైన వాగ్వాదానికి దిగారు. దీంతో అంధేరి జట్టు సభ్యులతో పాటు మరాఠా రాయల్స్ ఆటగాళ్లు కూడా స్టేడియంలోకి పెరిగెత్తుకుంటూ వచ్చి రోహన్, గౌరవ్లకు సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది.ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 154 పరుగులకే పరిమితమైంది. ఎమ్ఎస్సి బ్యాటర్లలో చిన్మయ్ రాజేష్ సుతార్(61) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ సిద్దేశ్ లాడ్(33) కాస్త దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంధేరి బౌలర్లలో అర్జున్ టెండూల్కర్ రెండు, శివమ్ దూబే, ముషీర్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అనంతరం ఏఆర్సీఎస్ అంధేరి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమైంది. దివ్యాన్ష్ సక్సేనా (51) టాప్ స్కోరర్గా నిలిచాడు. మరాఠా బౌలర్లలో ఆదిత్య ధుమాల్, తుషార్ దేశ్పాండే, ఇర్ఫాన్ ఉమెర్ తలా రెండు వికెట్లు తీశారు. తుషార్ దేశ్పాండేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించగా, సువేద్ పార్కర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.The last over drama in T20 Mumbai league 😭🔥💥 pic.twitter.com/XGTvl0II19— Abhinav MSDian™ (@Abhinav_hariom) June 14, 2026చదవండి: 24 ఏళ్ల తర్వాత బరిలోకి.. టర్కీకి షాక్ ఇచ్చిన ఆసీస్! -
న్యూజిలాండ్కు షాకిచ్చిన వెస్టిండీస్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో న్యూజిలాండ్కు వెస్టిండీస్కు ఊహించని షాకిచ్చింది. శనివారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో న్యూజిలాండ్పై 7 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టు ఘన విజయం సాధించింది. గత ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమికి విండీస్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ ప్లిమ్మర్(8), కెప్టెన్ అమేలియా(5) ఆరంభంలోనే ఔటైనప్పటికి, బ్రూక్ హాలిడే(40), ఇసాబెల్లా గేజ్(39), మ్యాడీ గ్రీన్(35) అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు. విండీస్ బౌలర్లలో ఆలియా అల్లెన్ 4 వికెట్లతో సత్తాచాటింది.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 19.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ షెమైన్ కాంప్బెల్ది కీలక పాత్ర. కాంప్బెల్ కేవలం 62 బంతుల్లో 90 పరుగులు చేసి తన జట్టును గెలిపించింది.ఆమె టీ20 కెరీర్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. కాగా ఇది మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది రెండవ అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్ కావడం విశేషం. -
కొంపముంచిన అర్జున్ టెండూల్కర్
ముంబై లీగ్ టీ20 లీగ్-2026 విజేతగా ఎమ్ఎస్సి మరాఠా రాయల్స్ నిలిచింది. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఆర్క్స్ అంధేరిపై 8 పరుగుల తేడాతో విజయం సాధించిన మరాఠా రాయల్స్.. వరుసగా రెండో ఎంటీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది.ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 154 పరుగులకే పరిమితమైంది. ఎమ్ఎస్సి బ్యాటర్లలో చిన్మయ్ రాజేష్ సుతార్(61) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ సిద్దేశ్ లాడ్(33) కాస్త దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంధేరి బౌలర్లలో అర్జున్ టెండూల్కర్ రెండు, శివమ్ దూబే, ముషీర్ ఖాన్ తలా వికెట్ సాధించారు.కొంపముంచిన అర్జున్అయితే 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్క్స్ అంధేరి సునాయసంగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. కానా మరాఠా రాయల్స్ కంటే అంధేరి బ్యాటర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ ముషీర్ ఖాన్(0) వికెట్ను ఆర్క్స్ జట్టు కోల్పోయింది. ఈ క్రమంలో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన అర్జున్ టెండూల్కర్ అంధేరి కొంపముంచాడు. జిడ్డు బ్యాటింగ్ చేస్తూ తర్వాత వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు.కనీసం స్ట్రైక్ కూడా రోటేట్ చేయలేకపోయాడు. అతడు 12 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అంధేరి విజయానికి కావాల్సిన రన్రేట్ పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ప్రసాద్ పవార్ అవుటైనప్పటికి, ఓపెనర్ దివ్యాన్ష్ సక్సేనా( 38 బంతుల్లో 50 పరుగులు) నిలకడగా ఆడుతూ గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. అయితే దివ్యాన్ష్ ఔటయ్యక అంధేరి వికెట్ల పతనం మొదలైంది. ప్రగ్నేష్ కన్పిల్లెవార్(21 బంతుల్లో 28), కెప్టెన్ శివమ్ దూబే(15) వెంటవెంటనే ఔటయ్యారు. చివరిలో వేగంగా ఆడిన గౌరవ్ జాతర్ కూడా (17 బంతుల్లో 23 పరుగులు) కూడా 19 ఓవర్లో పెవిలియన్కు చెరాడు.ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో అంధేరి విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. మరాఠా బౌలర్ రాజే కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో మరాఠా రాయల్స్ ఛాంపియన్స్గా నిలవగా.. అంధేరి రన్నరప్తో సరిపెట్టుకుంది.చదవండి: IND vs AFG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్ -
అమ్మ నుంచి ఫోన్ కాల్..! లైవ్ ప్రెస్ మీట్లో నితీష్ ఏం చేశాడంటే?
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన మొదటి వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో టీమిండియా తరపున యువ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.ఏమి జరిగిందంటే?నితీష్ మీడియాతో మాట్లాడుతుండగా.. మైక్ల ముందున్న అతడి మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయ్యింది. నితీశ్ ఒక్క నిమిషం ఆగి, ఫోన్ స్క్రీన్ వైపు చూసి చిరు నవ్వు చిందించాడు. ఫోన్ చేస్తోంది తన అమ్మ అని తెలియడంతో ఏమాత్రం సంకోచించకుండా.. “సారీ, నేను ఈ కాల్ మాట్లాడాలి” అని అక్కడున్న జర్నలిస్టులకు చెప్పి ఫోన్ ఎత్తాడు. అమ్మా.. నేను ఐదు నిమిషాలు ఆగి చేస్తా’’ అని సమాధానం ఇచ్చాడు. మళ్లీ ప్రెస్మీట్ను కొనసాగించిన నితీశ్ మరోసారి విలేకర్లకు క్షమాపణలు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్లో షేర్ చేసింది. పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ కాసేపు ఆగవచ్చు ఏమో కానీ అమ్మ నుంచి వచ్చే ఫోన్ కాల్ మాత్రం అస్సలు ఆగదు అంటూ ఆ వీడియో క్యాప్షన్గా బీసీసీఐ రాసుకొచ్చింది.అదరగొట్టిన కుర్రాళ్లుకాగా వర్షం కారణంగా మ్యాచ్ను 25 ఓవర్లకు కదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అఫ్గాన్ ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్(102) కేవలం 48 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.భారత బౌలర్లలో అరంగేట్ర బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లతో సత్తాచాటారు. వీరితో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ కూడా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 22.5 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు.The post-match presser can wait but a call from Mom simply cannot 😊#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/23OUBNZvYH— BCCI (@BCCI) June 13, 2026చదవండి: IND vs AFG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను దురదృష్టం వెంటాడింది. 16 పరుగులు చేసి మంచి టచ్లో కనిపించిన రోహిత్.. అనుహ్యంగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కాగా హిట్మ్యాన్ క్రీజులో ఉన్నది కాసేపే అయినా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే👉అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఓపెనర్గా 16,000 పరుగుల మైలురాయిని రోహిత్ శర్మ అందుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అతడు ఈ రికార్డును కేవలం 384 ఇన్నింగ్స్ల్లోనే సాధించాడు. దీంతో అత్యంతవేగంగా ఈ ఫీట్ను అందుకున్న ఓపెనర్గా ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్(390) రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.👉ఓవరాల్గా ప్రపంచ క్రికెట్ చరిత్రలో 16,000 పరుగుల మైలు రాయిని అందుకున్న 7వ ఓపెనర్గా రోహిత్ నిలిచాడు.👉అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్గా వీరేంద్ర సెహ్వాగ్ను అధిగమించడానికి రోహిత్ శర్మ ఇప్పుడు కేవలం 110 పరుగుల దూరంలో ఉన్నాడు. సెహ్వాగ్ తన కెరీర్లో ఓపెనర్గా మొత్తం 16,119 పరుగులు చేశాడు.👉ఈ మ్యాచ్ బరిలోకి దిగడం ద్వారా రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు మోహిందర్ అమర్నాథ్ పేరిట ఉండేది. ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడారు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయస్సు కలిగిన హిట్మ్యాన్.. అమర్నాథ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర -
టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్కు భారీ షాక్!
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో హైవోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. ఆదివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా గ్రూపు-ఎ మ్యాచ్లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు పాక్ టీమ్కు భారీ షాక్ తగిలింది. శనివారం ప్రాక్టీస్ సెషన్లో ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా గాయపడింది. నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, యువ బ్యాటర్ ఆయేషా జాఫర్ కొట్టిన షాట్ నేరుగా ఫాతిమా సనా కుడి మోకాలికి తగిలింది. దీంతో ఆమె తీవ్రమైన నొప్పితో విలవిల్లాడింది. వెంటనే ఫిజియో వచ్చి సనాకు చికిత్స అందించాడు. ఆ తర్వాత ఆమె నెట్స్ నుంచి వెళ్లిపోయింది. ఫాతిమా తిరిగి ప్రాక్టీస్కు రాలేదు. కానీ దాదాపు గంట తర్వాత ఫాతిమా అటు ఇటు నడుస్తూ మైదానంలో కనిపించింది. అయితే ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఫాతిమా సనాకు తన గాయం గురుంచి విలేకరులు ప్రశ్నించారు."ఇది అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే. ఆయేషా ఆడిన షాట్ నా మోకాలికి తగిలింది. ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది. రేపటికల్లా పూర్తిగా కోలుకుంటానని ఆశిస్తున్నాను" అని ఫాతిమా పేర్కొంది. ఒకవేళ భారత్తో మ్యాచ్కు ఫాతిమా దూరమైతే వికెట్ కీపర్ మునీబా అలీ జట్టును నడిపించే అవకాశముంది. కాగా టీ20ల్లో భారత్పై పాక్ అంతమంచి రికార్డు లేదు. భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 16 సార్లు తలపడ్డాయి. భారత్ 16 మ్యాచ్లు విజయం సాధించగా.. పాక్ కేవలం మూడింట మాత్రమే గెలుపొందింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ 'మహిళల ఆసియా కప్ 2024'లో జరిగింది. ఇప్పుడు ఫాతిమా కూడా జట్టులో లేకపోతే పాక్కు పూర్తిగా గెలిచే అవకాశమే ఉండదు. టీ20 ప్రపంచకప్-2026 నుంచి పాక్ జట్టులో ఫాతిమా కీలక ప్లేయర్గా కొనసాగుతోంది.చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర -
107 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆసీస్ ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో ఆసీస్ 65 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఫోబ్ లిచ్ఫీల్డ్ (24 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), ఎలైస్ పెరీ (36), వేర్హామ్ (32) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా, మలాబా, నడైన్ డిక్లార్క్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కెప్టెన్ లారా వోల్వడర్ట్(44) మినహా మిగతా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ స్పిన్నర్ జార్జియా వేర్హామ్ 3 వికెట్లు పడగొట్టి ప్రోటీస్ పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు కెప్టెన్ మోలనిక్స్, కింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన వేర్హామ్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.మరో మ్యాచ్లో స్కాట్లాండ్ 40 పరుగులతో ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేయగా, ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది.చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర -
ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
ఫిఫా ప్రపంచకప్-2026లో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా ఖతార్-స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఖతార్కు ఇదే తొలి పాయింట్ కావడం విశేషం. కాగా ఈ మ్యాచ్ ఆరంభం నుంచే స్విట్జర్లాండ్ జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. 17వ నిమిషంలో ఖతార్ గోల్కీపర్ మహమూద్ అబునాడ ప్రత్యర్థి ఆటగాడిని ఫౌల్ చేయడంతో స్విట్జర్లాండ్కు పెనాల్టీ లభించింది. దీనిని బ్రీల్ ఎంబోలో విజయవంతంగా గోల్గా మలిచి స్విట్జర్లాండ్ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత స్విస్ డిఫెండర్లు అప్రమత్తంగా ఉండడంతో ఖతార్ కనీసం గోల్ పోస్ట్ వైపు కూడా సంధించలేకపోయింది. దీంతో ఖతార్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ మ్యాచ్ ముగుస్తుందన్న ఆఖరి క్షణాల్లో ఖతార్ కెప్టెన్ బౌలెం ఖౌఖీ అద్భుతం చేశాడు. బౌలెం ఖౌఖీ అత్యంత చాకచక్యంగా హెడర్ ద్వారా బంతిని గోల్ పోస్ట్లోకి పంపాడు. దీంతో స్టేడియంలో ఖతార్ ఆటగాళ్లు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.చదవండి: శుబ్మన్ గిల్ గెలిపించగా... -
మన మహిళలు రెడీ
బర్మింగ్హామ్: మహిళల వన్డే వరల్డ్ కప్ చాంపియన్ భారత్ తొలి సారి టి20 ప్రపంచకప్ను కూడా అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. టోర్నీలో నేడు జరిగే తమ తొలి మ్యాచ్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. ప్రస్తుత ఫామ్, ఓవరాల్గా ఆటగాళ్ల రికార్డులను బట్టి చూస్తే అన్ని రంగాల్లో పాక్కంటే పటిష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్కు ముందు ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లను వారి సొంతగడ్డపై ఓడించిన హర్మన్ప్రీత్ సేన... స్వదేశంలో శ్రీలంకను 5–0తో చిత్తు చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ల చేతుల్లో సిరీస్లు కోల్పోయినా... జట్టు కూర్పులో భాగంగా చేసిన పలు ప్రయోగాల్లో ఈ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇప్పటి వరకు టి20 ప్రపంచకప్లలో పాక్పై భారత్ 6–2తో ఆధిక్యంలో ఉండగా... ఓవరాల్గా టి20ల్లో కూడా భారత్ 13–3తో పైచేయి సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ దూకుడుగా ఆరంభిస్తే భారత్ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. మూడో స్థానంలో యస్తిక భాటియా, భారతి ఫుల్మలిలలో ఎవరికి అవకాశం లభిస్తుందనేది చూడాలి. మిడిలార్డర్లో జెమీమా, హర్మన్ తమ స్థాయికి తగ్గి ప్రదర్శన చేయాల్సి ఉంది. ఎప్పటిలాగే ఫినిషింగ్లో రిచా ఘోష్ మెరుపు బ్యాటింగ్ కనబర్చగల సమర్థురాలు. ప్రధాన పేసర్గా క్రాంతి గౌడ్ ఖాయం కాగా...అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్లలో ఒకరికే రెండో పేసర్గా చాన్స్ లభిస్తుంది. ముగ్గురు స్పిన్నర్లు శ్రీచరణి, నందిని శర్మ, దీప్తి శర్మలతో భారత్ ఆడటం ఖాయమైంది. మరో వైపు 2024 వరల్డ్ కప్లో భారత్ చేతిలో చిత్తయిన పాక్ జట్టు ఈ సారైనా పోటీనివ్వాలని భావిస్తోంది. జట్టు కెపె్టన్ ఫాతిమా సనా ఆల్రౌండ్ ప్రదర్శనపై జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా బంతి తగలడంతో సనా మోకాలికి గాయమైంది. అయితే ఇది ప్రమాదకరమైందని కాదని, ఆమె బరిలోకి దిగుతుందని పాక్ మేనేజ్మెట్ ప్రకటించింది. సీనియర్ ఓపెన్ మునీబా, గుల్ ఫెరోజా ఎలాంటి ఆటతీరు కనబరుస్తారనేది చూడాలి. పాక్ జట్టులో ఈ సారి కొత్త ప్లేయర్ ఇమాన్ ఫాతిమాపై అందరి దృష్టీ నిలిచింది. అండర్–19 స్థాయినుంచి వచ్చిన ఆమె టి20ల్లో 150కు పైగా స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేయగల సమర్థురాలు. ఫినిషర్గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఇమాన్పై పాక్ ఆశలు పెట్టుకుంది.డానీ వ్యాట్ సెంచరీమహిళల టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ శుభారంభం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్–2 మ్యాచ్లో ఇంగ్లండ్ 87 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 219 పరుగులు చేసింది. మహిళల టి20 ప్రపంచకప్ చరిత్రలో ఒక జట్టు అత్యధిక స్కోరు ఇదే. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ఓపెనర్ డానీ వ్యాట్ (62 బంతుల్లో 105 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగింది. అమీ జోన్స్ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సీవర్ బ్రంట్ (22 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరవడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షిక (39; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్ 4 వికెట్లు పడగొట్టింది.ఆ్రస్టేలియా అదరహో...మాంచెస్టర్: మహిళల టి20 ప్రపంచకప్లో అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్లో ఆసీస్ 65 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా ఫోబ్ లిచ్ఫీల్డ్ (24 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), ఎలైస్ పెరీ (36), వేర్హామ్ (32) మెరుపులతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 172 పరుగులు సాధించగా... దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్లో స్కాట్లాండ్ 40 పరుగులతో ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేయగా, ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. -
శుబ్మన్ గిల్ గెలిపించగా...
అఫ్గాన్తో ఏకైక టెస్టులో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ రికార్డు విజయం సాధించిన భారత జట్టు... వన్డే సిరీస్లోనూ అదే ఆటతీరుతో బోణీ కొట్టింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో గుర్బాజ్ సెంచరీతో అఫ్గాన్ ఓ మాదిరి స్కోరుకు పరిమితం కాగా... అరంగేట్ర బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో మూడు వికెట్లతో సత్తా చాటారు. అనంతరం ఛేదనలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్కు రాహుల్, ఇషాన్ మెరుపులు తోడవడంతో టీమిండియా ముందంజ వేసింది.ధర్మశాల: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు... అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరులో శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయంకంటే నాలుగున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభం కాగా... ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ (51 బంతుల్లో 102; 8 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27; 3 ఫోర్లు), అజ్మతుల్లా (26; 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. ఆడిన తొలి వన్డేలోనే గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లు పడగొట్టగా... అర్ష్ దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో అలరించగా... కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. రోహిత్ శర్మ (16; 2 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (12; 1 ఫోర్) భారీ స్కోరు చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, జియాఉర్ రహమాన్ చెరో వికెట్ పడగొట్టారు. గుర్బాజ్ సెంచరీ... భారీ వర్షం కారణంగా మ్యాచ్ను కుదించడంతో... మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్ టి20 తరహా దూకుడు కనబర్చింది. గుర్నూర్ బ్రార్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ (1) అవుట్ కాగా... అర్ష్ దీప్ సింగ్ వరుస ఓవర్లలో సాధిఖుల్లా (0), రహమత్ షా (3)ను పెవిలియన్కు పంపాడు. దీంతో అఫ్గాన్ జట్టు 26/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ హష్మతుల్లా అండతో గుర్బాజ్ రెచ్చిపోయాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహించిన గుర్బాజ్... ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బౌలర్తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న అతడు... 48 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో అతడికిది తొమ్మిదో శతకం. ‘టెస్టు మ్యాచ్ అనంతరం నా బ్యాటింగ్కు సంబంధించి గౌతమ్ గంభీర్ సర్తో చర్చించా. షాట్ సెలక్షన్ విషయంలో గంభీర్ సలహాలు పాటించడంతోనే సెంచరీ చేయగలిగా’ అని మ్యాచ్ అనంతరం గుర్బాజ్ అన్నాడు. నాలుగో వికెట్కు 66 బంతుల్లోనే 116 పరుగులు జోడించిన అనంతరం గుర్బాజ్ అవుట్ కాగా... ఆ తర్వాత మిగిలినవారు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో అఫ్గాన్ ఆశించిన స్కోరు చేయలేకపోయింది. హర్ష్ దూబే, గుర్నూర్ అరంగేట్రం...గత కొంతకాలంగా టీమిండియా నెట్ బౌలర్గా కొనసాగుతున్న గుర్నూర్ బ్రార్... ఈ మ్యాచ్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.మ్యాచ్ ఆరంభానికి ముందు అతడికి జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ భారత క్యాప్ అందించాడు. దేశవాళీల్లో సత్తాచాటిన స్పిన్నర్ హర్ష్ దూబేకు సైతం ఇదే తొలి వన్డే కాగా... అతడికి కేఎల్ రాహుల్ క్యాప్ అందజేశాడు.1 టీమిండియా తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అతి పెద్ద (39 సంవత్సరాల 44 రోజులు) వయసు్కడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు.మొహిందర్ అమర్నాథ్ (39 సంవత్సరాల36 రోజులు) రెండో స్థానానికి చేరాడు.స్కోరు వివరాలుఅఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి) నితీశ్ రెడ్డి 102; ఇబ్రహీం (సి) గిల్ (బి) గుర్నూర్ 1; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; రహమత్ షా (సి) హర్ష్ దూబే (బి) అర్ష్ దీప్ 3; హష్మతుల్లా (సి) రాహుల్ (బి) హర్ష్ దూబే 27; అజ్మతుల్లా (స్టంప్డ్) ఇషాన్ (బి) హర్ష్ దూబే 26; నబీ (సి) అర్ష్ దీప్ (బి) నితీశ్ రెడ్డి 9; రషీద్ (బి) గుర్నూర్ 9; ఘజన్ఫర్ (సి) గిల్ (బి) హర్ష్ దూబే 0; జియాఉర్ (సి) అర్ష్ దీప్ (బి) గుర్నూర్ 4; సలీమ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (24.5 ఓవర్లలో ఆలౌట్) 194. వికెట్ల పతనం: 1–13, 2–16, 3–26, 4–142, 5–144, 6–172, 7–182, 8–182, 9–193, 10–194. బౌలింగ్: అర్ష్ దీప్ 5–0–27–2; గుర్నూర్ బ్రార్ 4.5–0–27–3; ప్రసిధ్ 5–0–35–0; హర్ష్ దూబే 5–0–47–3; సుందర్ 1–0–19–0; నితీశ్ రెడ్డి 4–0–31–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రనౌట్) 16; గిల్ (నాటౌట్) 84; ఇషాన్ (బి) రషీద్ 34; శ్రేయస్ (సి) సలీమ్ (బి) జియాఉర్ 12; రాహుల్ (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 10; మొత్తం (22.5 ఓవర్లలో 3 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–46, 2–116, 3–142. బౌలింగ్: అజ్మతుల్లా 3–0–28–0; జియా ఉర్ 4–0–39–1; ఘజన్ఫర్ 5–0–28–0; సలీమ్ 3.5–0–36–0; రషీద్ ఖాన్ 5–0–37–1; నబీ 2–0–26–0. -
భారత అండర్–19 జట్టులో ప్రతీక్ష
సాక్షి, హైదరాబాద్: శ్రీలంకతో జరిగే మహిళల అండర్–19 వన్డే సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో హైదరాబాద్కు చెందిన వి.ప్రతీక్ష ఎంపికైంది. భవికా అహిరే నేతృత్వంలో బరిలోకి దిగే 15 మంది సభ్యుల టీమ్లో ప్రతీక్షకు అవకాశం దక్కింది. నగరంలోని మీర్ అకాడమీలో కోచ్లు ముస్తఫా అలీ, వసీం అలీ వద్ద ప్రతీక్ష శిక్షణ పొందుతోంది. ఇటీవల దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడంతో ఆమె ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు జట్టులో స్థానం కల్పించారు. జూన్ 30, జులై 3, 6 తేదీల్లో భారత్, శ్రీలంక టీమ్ల మధ్య పుదుచ్చేరిలో మూడు వన్డేలు జరుగుతాయి. భారత అండర్–19 మహిళల జట్టు: భవికా అహిరే (కెప్టెన్), ఇరా జాదవ్, దియా యాదవ్, ఈశ్వరి, వి.ప్రతీక్ష, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పలక్, మహక్, కాశ్వీ, విధి పర్మార్, గౌరి గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె.దీక్ష. -
ఆఫ్గన్తో తొలి వన్డే.. భారత ఓపెనర్ల అరుదైన రికార్డు!
ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్తో తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్మన్ గిల్ వేర్వేరుగా అరుదైన రికార్డులు సాధించారు. రోహిత్ శర్మ విషయానికొస్తే మ్యాచ్లో రోహిత్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఓపెనర్గా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి 16 వేల పరుగుల మార్క్ను దాటడం విశేషం. అయితే మంచి ఈజ్తో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్తో సమన్వయం లోపం వల్ల రనౌట్గా వెనుదిరిగాడు. మరోవైపు ఇదే మ్యాచ్లో ఓపెనర్ గిల్ కూడా వన్డేల్లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్గా గిల్ నిలిచాడు. గిల్ 67 ఇన్నింగ్స్లో 3వేల పరుగుల మార్క్ను అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక షై హోప్, ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్లు 67 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించారు.Scaling Mt. 16,000 🗻A monumental milestone unlocked by Rohit Sharma as an opener in international cricket 👏🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/vyC4C0oPvg— BCCI (@BCCI) June 13, 2026 Major Milestone for our Captain 🫡Shubman Gill becomes the fastest Indian and 2⃣nd fastest player overall to amass 3⃣0⃣0⃣0⃣ ODI runs 🙌🔝He also brings up his fifty!Updates ▶️ https://t.co/lCuohEZYAl#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/tdxL7cvo7X— BCCI (@BCCI) June 13, 2026 -
గిల్, రాహుల్ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాటింగ్లో కెప్టెన్ శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ఖాన్, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.ఆఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26), భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది.Picture-Perfect 🙌#TeamIndia wrap a comprehensive victory by 7️⃣ wickets in Dharamshala ✅They lead the #INDvAFG ODI series by 1️⃣-0️⃣ 👌Scorecard ▶️ https://t.co/lCuohEZYAl @IDFCFIRSTBank pic.twitter.com/RNy13a0PHX— BCCI (@BCCI) June 13, 2026 -
గిల్ స్టన్నింగ్ క్యాచ్కు నోరెళ్లబెట్టాల్సిందే!
అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో శుబ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. హర్ష్దూబే వేసిన బంతిని అల్లా గజన్ఫర్ ఆఫ్ స్టంప్ ఔట్సైడ్ దిశగా ఆడాడు. అయితే స్లిప్లో ఉన్న గిల్ ఒక్క ఉదుటున డైవ్ చేసి సెకన్ల వ్యవధిలో ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడం విశేషం. ఇక గిల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్కు గజన్ఫర్ నోరెళ్లబెట్టాడు.అయితే గిల్ పట్టిన క్యాచ్ను చాలా మంది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోలుస్తున్నారు. ధోని తన ప్రైమ్టైమ్లో సెకన్ల వ్యవధిలోనే స్టంపింగ్లు చేసిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. 🔹 1st ODI | IND 🇮🇳 vs AFG 🇦🇫 🔹IND 🇮🇳 : 4️⃣0️⃣-0️⃣ (5 Overs)Rohit* : 1️⃣5️⃣¹⁴Gill* : 1️⃣7️⃣¹⁷INDIA 🇮🇳 NEED 1️⃣5️⃣5️⃣ RUNS MORE TO WIN#INDvAFG #TeamIndia #INDvsAFG #ODI #Cricketpic.twitter.com/z9dUJRGKlK https://t.co/oL8hQj02gs— Cricket Lover 🏏 (@Crick97924Lover) June 13, 2026 What. A. Catch 🤯Captain Shubman Gill with an absolute stunner of a grab 🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/jX2rAfSbtq— BCCI (@BCCI) June 13, 2026 -
ఉతికారేసిన గుర్బాజ్.. సెంచరీతో పలు రికార్డులు బద్దలు!
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శతకంతో అదరగొట్టాడు. వర్షం అంతరాయంతో 25 ఓవర్లకు కుదించిన ఆటలో ఆఫ్గన్ ఓపెనర్ ఆరంభం నుంచే టీ20 ఆటను ప్రదర్శించాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ ఒక ఎండ్లో బ్యాటింగ్ కొనసాగించిన గుర్బాజ్ బౌలింగ్కు వచ్చిన ప్రతీ భారత బౌలర్ను ఉతికారేశాడు. ఈ క్రమంలోనే గుర్బాజ్ 48 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా గుర్బాజ్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.👉అఫ్గానిస్తాన్ తరఫున వన్డేల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ తొలి స్థానంలో నిలిచాడు. 48 బంతుల్లోనే గుర్బాజ్ ఈ ఫీట్ అందుకున్నాడు. అంతకముందు మహ్మద్ షెహజాద్ (2010లో స్కాట్లాండ్పై 72 బంతుల్లో), కరీమ్ సాదిక్ (2012లో నెదర్లాండ్స్పై, 72 బంతుల్లో), నౌరోజ్ మంగల్ (2013లో స్కాట్లాండ్పై, 85 బంతుల్లో), మహ్మద్ షెహజాద్ (2019లో ఐర్లాండ్పై, 85 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.👉ఇక వన్డేల్లో భారత్పై ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ రెండో స్థానంలో నిలిచాడు. 2005లో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ ఫాల్కనర్ (57 బంతుల్లో), ఏబీ డివిలియర్స్ (57 బంతుల్లో), మైఖెల్ బ్రాస్వెల్ (57 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.👉వన్డేల్లో గుర్బాజ్కు ఇది తొమ్మిదో సెంచరీ. ఆఫ్గన్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు గుర్బాజ్ పేరిటే ఉంది. ఇబ్రహీం జర్దన్, మొహమ్మద్ షెహజాద్లు చెరో ఆరు సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.👉వన్డేల్లో ఆఫ్గన్ తరఫున ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదడం రహ్మనుల్లా గుర్బాజ్కు ఇది నాలుగోసారి. టీమిండియాతో మ్యాచ్లో 8 సిక్సర్లు బాదిన గుర్బాజ్.. గతంలో 2021లో ఐర్లాండ్తో మ్యాచ్లో 9 సిక్సర్లు, 2023లో బంగ్లాదేశ్పై 8 సిక్సర్లు, 2024లో బంగ్లాదేశ్పై 7 సిక్సర్లు కొట్టాడు. -
అఫ్గానిస్తాన్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 195 పరుగులు
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. -
కౌంటీలోనూ అదే జోరు.. బౌలింగ్తో హడలెత్తించిన మానవ్ సుతార్!
టీమిండియా తరఫున అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టిన మానవ్ సుతార్ కౌంటీ చాంపియన్షిప్లోనూ తన బౌలింగ్తో బెంబెలె త్తిస్తున్నాడు. ఆఫ్గన్తో జరిగిన టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ ఆడిన తొలి మ్యాచ్లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఆఫ్గన్పై ప్రదర్శనతో కౌంటీ క్రికెట్లో ఆడే అవకాశం దక్కించుకున్న మానవ్ సుతార్ అక్కడ కూడా అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు. వార్విక్షైర్ తరఫున బరిలోకి దిగిన మానవ్ సుతార్ యార్క్షైర్తో జరుగుతున్న కౌంటీ మ్యాచ్లో 85 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మానవ్ సుతార్ తీసిన మూడు వికెట్లు కీలకమైనవే కావడం విశేషం. మొదట హాఫ్ సెంచరీ చేసిన సామ్ వైట్మన్ (55)ను పెవిలియన్ చేర్చిన మానవ్ సుతార్.. తన సెంచరీతో యార్క్షైర్ ఇన్నింగ్స్కు వెన్నుముకలా నిలిచిన విలియమ్ లక్స్టన్ (167 పరుగులు) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత చివర్లో యార్క్షైర్ భారీ స్కోరు చేయడంలో సహాయపడిన జార్జ్ హిల్ (30)ను ఔట్ చేసి ముచ్చటగా మూడో వికెట్ తీసుకున్నాడు.ఇలా అరంగేట్రం మ్యాచ్లోనే మూడు కీలక వికెట్లు తీసి కౌంటీ క్రికెట్లోనూ మానవ్ సుతార్ అదుర్స్ అనిపించాడు. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్షైర్ 110.4 ఓవర్లలో 469 పరుగులకు ఆలౌటైంది. విలియం లక్స్టన్ సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ జానీ బెయిర్ స్టో (68)తో పాటు సామ్ వైట్మన్ అర్థసెంచరీ సాధించారు. మానవ్ సుతార్, ఈతన్ బాంబర్, ఎడ్ బెర్నాడ్లు తలా మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ ఆరంభించిన వార్విక్షైర్ 23 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. రాబర్ట్ యేట్స్ (22), సామ్ హెయిన్ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.Manav Suthar has his first championship wicket! pic.twitter.com/BmD8DZ2lX7— No Context County Cricket (@NoContextCounty) June 12, 2026Talk about a dream start on debut 🤩🎥 Manav Suthar getting his maiden Test wicket in his very first over 🙌Scorecard ▶️ https://t.co/Au50EfVM30#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/MEx9QHwkD0— BCCI (@BCCI) June 7, 2026 -
భారత్ తరఫున అరంగేట్రం.. అతడి ఎంపిక వెనుక గిల్ హస్తం!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న తొలి వన్డేతో టీమిండియా తరఫున గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. హర్ష్దూబేకు కేఎల్ రాహుల్ డెబ్యూ క్యాప్ అందించగా, గుర్నూర్ బ్రార్కు కెప్టెన్ శుబ్మన్ గిల్ క్యాప్ అందించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ ఇద్దరు క్రికెటర్లపై ఒక లుక్కేద్దాం. వీరిద్దరు అరంగేట్రం చేసినప్పటికీ గుర్నూర్ ఎంపిక వెనుక మాత్రం కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలకపాత్ర పోషించాడు.గిల్ మెచ్చిన క్రికెటర్..పంజాబ్కు చెందిన గుర్నూర్ బ్రార్కు సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ ఆరాధ్య క్రికెటర్. అతడి బౌలింగ్ యాక్షన్ను అచ్చుగుద్దినట్లు అనుకరించడంలో గుర్నూర్ బ్రార్ సుప్రసిద్ధుడు. అయితే గుర్నూర్ చిన్న వయసులో క్రికెట్ కంటే ఫుట్బాల్, టెన్నిస్ ఆటను ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే హైట్ అడ్వాంటేజ్ కారణంగా క్రికెట్లోకి వెళితే బాగా రాణిస్తావు అని స్నేహితులు ఇచ్చిన సలహాతో గుర్నూర్ బ్రార్ తననుత తాను పరీక్షించుకోవడానికి క్రికెట్ ట్రయల్స్కు వెళ్లాడు. ఆ తర్వాత రెండేళ్లలోనే ఇండియా అండర్-19 టీమ్కు బౌలింగ్ చేసే స్థాయికి వెళ్లాడు. అక్కడే గుర్నూర్ బ్రార్కు ప్రస్తుత టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ పరిచయమయ్యాడు. అతడి టాలెంట్ను గమనించిన గిల్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అలా పంజాబ్ అండర్-23 జట్టులో చోటు దక్కించుకున్న గుర్నూర్ బ్రార్ 2021లో లిస్ట్-ఏతో పాటు ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2023లో పంజాబ్ కింగ్స్కు నెట్బౌలర్గా వచ్చిన గుర్నూర్ బ్రార్కు అనుకోకుండా జట్టుకు ఆడే అవకాశం వచ్చింది. అప్పటి పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో అతడి స్థానంలో ఎంపికయిన గుర్నూర్ బ్రార్ లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గిల్ మరోసారి గుర్నూర్కు అండగా నిలబడి నెట్బౌలర్గా తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్కు సూచించాడు. ఈ సమయంలోనే హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, స్టార్ బౌలర్ రబాడ ఇచ్చిన సలహాలు గుర్నూర్కు చాలా ఉపయోగపడ్డాయి. అలా ఐపీఎల్ 2025 సీజన్కు ముందు జరిగిన వేలంలో గుర్నూర్ బ్రార్ను గుజరాత్ టైటాన్స్ రూ.30 లక్షలకు రిటైన్ చేసుకుంది. అయితే ఐపీఎల్ అంత మంచి ప్రదర్శన చేయనప్పటికీ విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్లో అతడి ప్రదర్శన గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల దృష్టిలో పడిన గుర్నూర్ బ్రార్ను గతేడాది ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయడంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది.నిఖార్సైన ఆల్రౌండర్విదర్భకు చెందిన హర్ష్ దూబే నిఖార్సైన ఆల్రౌండర్, 2024-25 రంజీ సీజన్లో విదర్భ టైటిల్ గెలవడంలో హర్ష్ దూబేది కీలకపాత్ర. ఆ సీజన్లో హర్ష్దూబే మొత్తం 69 వికెట్లు పడగొట్టాడు. అతడి ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ తర్వాతి ఏడాది ఇండియా-ఏ జట్టులోకి ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీలో ప్రదర్శనకు గానూ హర్ష్దూబే బెస్ట్ ఆల్రౌండర్ (లాలా అమర్నాథ్) అవార్డు గెలుచుకున్నాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో కెప్టెన్గా విదర్భను నడిపించిన హర్ష్దూబే ఆ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. దేశవాలీ క్రికెట్లో ప్రదర్శనతో హర్ష్ దూబేను ఐపీఎల్ 2025 సీజన్కు ముందు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హర్ష్దూబే ఆ సీజన్లో మూడు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీశాడు. 2026 సీజన్కు ఎస్ఆర్హెచ్ అతడిని రిటైన్ చేసుకుంది.ఈ సీజన్లో 8 మ్యాచ్లాడిన హర్ష్దూబే 8 వికెట్లు తీశాడు.నిజానికి ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టు ద్వారానే హర్ష్దూబే అరంగేట్రం చేయాల్సింది. రవీంద్ర జడేజాకు విశ్రాంతి కల్పించడంతో మానవ్ సుతార్, హర్ష్దూబే పేర్లు వినిపించినప్పటికీ మానవ్ సుతార్ను తుదిజట్టులోకి ఎంపిక చేసింది. ఆడిన తొలి మ్యాచ్లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన మానవ్ సుతార్ అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. 𝗗𝗿𝗲𝗮𝗺 𝗰𝗼𝗺𝗲 𝘁𝗿𝘂𝗲 🧢🇮🇳Congratulations to Harsh Dubey and Gurnoor Brar on receiving their ODI debut caps from KL Rahul and Shubman Gill respectively 👏Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/GoZSxHSHVf— BCCI (@BCCI) June 13, 2026చదవండి: ‘అతడు వంద టెస్టుల గురించి ఆలోచించలేదు’ -
అఫ్గన్తో వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం.. జైసూకు నో ఛాన్స్
ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటలపాటు ఇటు ఆటగాళ్లు.. ఇటు ప్రేక్షకులు వేచి చూడాల్సిన పరిస్థితి.అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాన తగ్గడంతో మైదానంలో కప్పిన కవర్లు తీసేసిన సిబ్బంది.. మ్యాచ్కు గ్రౌండ్ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో 5.15 నిమిషాలకు టాస్ పడింది. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ఆ ఇద్దరి అరంగేట్రంఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికెట్ పాత బడే కొద్ది బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు. అదే విధంగా హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్తో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా విరాట్ కోహ్లి స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీగా గిల్- రోహిత్ శర్మ కొనసాతుండగా.. వన్డౌన్లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ కిషన్ సేవలు అందించనున్నాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడి సిరీస్కు దూరం కాగా.. ఆంధ్ర సీమ్బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. ఇక సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టిన యాజమాన్యం.. హర్ష్ దూబేకు తొలి అవకాశం ఇచ్చింది. పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణతో కలిసి గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగుతున్నాడు.భారత తుదిజట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ తుదిజట్టుఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ. -
చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ సిస్టర్స్
మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. స్కాట్లాండ్ స్టిస్టర్స్ కెప్టెన్ కేథరిన్ బ్రైస్, సారా బ్రైస్లు తమ బ్యాటింగ్తో అభిమానులను అలరించారు. ఈ ఇద్దరు స్వయానా అక్కాచెల్లి కావడం విశేషం. టోర్నీలో భాగంగా గ్రూప్-బిలో శనివారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ మహిళలు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు విఫలమైన వేళ అక్క కేథరిన్ బ్రైస్, ఆమె చెల్లి సారా బ్రైస్ ఐర్లాండ్ బౌలర్లను చితక్కొట్టారు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు శతక భాగస్వామ్యం (106 పరుగులు) నమోదు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ సిస్టర్స్ తమ బ్యాటింగ్తో అభిమానులను అలరించడమే గాక ఆ జట్టు తరఫున టీ20 ప్రపంచకప్లో శతకం భాగస్వామ్యం నమోదు చేసిన తొలి జంటగా చరిత్ర సృష్టించారు.39 బంతుల్లో 60 పరుగులు చేసిన కేథరిన్ బ్రైస్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక 35 బంతుల్లో 49 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో అర్థసెంచరీ చేజార్చుకున్న సారా బ్రైస్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.కాగా పురుషుల క్రికెట్లో బ్రదర్స్ కలిసి ఆడిన జట్టు ఏదైనా ఉందంటే ఐర్లాండ్ జట్టు మాత్రమే. ఈ జట్టులోనే ఎక్కువగా అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహించిన సందర్భాలు ఉన్నాయి. ఓబ్రియన్ బ్రదర్స్ (కెవిన్, నీల్), టెక్టర్ బ్రదర్స్ (హ్యారీ, టిమ్, జాక్), అడెయిర్ బ్రదర్స్ (మార్క్, రాస్)లు ఐర్లాండ్ జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. A stunning 1️⃣0️⃣6️⃣ run partnership from Kathryn and Sarah Bryce 💪 pic.twitter.com/Hiviy2S6ZV— Cricket Scotland (@CricketScotland) June 13, 2026చదవండి: పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న బంగ్లా క్రికెటర్! -
‘జిడ్డులా వేలాడలేదు.. తేలిగ్గానే వదిలేశాడు’
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సారథిగా, వికెట్ కీపర్ బ్యాటర్గా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు ఈ జార్ఖండ్ డైనమైట్. మైదానంలో ప్రశాంతంగా ఉంటూనే ప్రత్యర్థుల ఎత్తులు చిత్తు చేసిన ఘనత ఈ ‘మిస్టర్ కూల్’ సొంతం.అయితే, ధోని ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించినా.. రికార్డుల కోసం మాత్రం ఎప్పుడూ ఆడలేదు. ముఖ్యంగా వంద టెస్టులకు చేరవవుతున్న వేళ అకస్మాత్తుగా ఈ దిగ్గజ ఆటగాడు సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు.అవకాశం ఉన్నా..ఆస్ట్రేలియాతో 2014-15లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో మూడో టెస్టు తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటికి మొత్తంగా కెరీర్లో 90 టెస్టులు ఆడిన ధోని.. 4876 పరుగులు సాధించాడు. ఇంకొంత కాలం వేచి ఉంటే.. 100 టెస్టుల మైలురాయిని చేరడంతో పాటు.. ఐదు వేల పరుగుల మార్కు అందుకునే అవకాశం నాడు ధోనికి ఉంది.కానీ అతడు జిడ్డులా పట్టుకుని వేలాడలేదు. తన రిటైర్మెంట్కు అదే సరైన సందర్భమని భావించి హుందాగా తప్పుకొన్నాడు. అయితే, కెరీర్ను పొడిగించుకునే అవకాశం ఉన్నా వదులుకునే వాళ్లు కొంతమందే ఉంటారని.. అందులో ధోని ముందు వరుసలో ఉంటాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు.ధోని నుంచి నేర్చుకోవాల్సిన జీవితం పాఠంఈ మేరకు.. ‘‘జీవితంలో నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉంటాయి. అయితే, ధోని గురించి తెలుసుకోవడం అన్నింటికంటే ఉత్తమమైన విషయం అని నేను చెప్పగలను. మనకు ఏదైనా లభిస్తే.. దానిని పట్టుకుని ఉండటం సులువే.ఒకవేళ మన వల్ల ఇక కుదరని తెలిసినా దానినే పట్టుకుని జిడ్డులా వేలాడుతూనే ఉన్నామనుకోండి.. అది జరగదని తెలిసినా వదిలివేయబుద్ధికాదు. కానీ కొంతమంది తమకు ఆ విషయాన్ని కొనసాగించే అవకాశం ఉన్నా సులువుగా దానిని వదులుకుంటారు.సూపర్స్టార్ అయినా..ముఖ్యంగా సూపర్స్టార్లుగా ఉన్న వ్యక్తులు అంత తేలికగా దేనినీ వదులుకోలేరు. కానీ ధోని అలా కాదు. అతడు దేనినైనా సులువుగా త్యజించగలడు. నాడు అతడు టెస్టు జట్టు కెప్టెన్గా ఉన్నాడు. అతడిని ఎవరూ ఏమీ అనలేదు. అప్పుడతడు అంతటి పటిష్ట స్థితిలో ఉన్నాడు.అయినా సరే సిరీస్ మధ్యలోనే.. ‘ఇక నా వల్ల కాదు.. నేనిది వదిలేస్తున్నా’ అని ప్రకటించాడు. అతడు 90 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఇంచుమించుగా ఐదు వేల టెస్టు పరుగులకు దగ్గరగా ఉన్నాడు. అలాంటి సమయంలో అతడు మైలురాళ్ల గురించి ఆలోచించలేదు. తనకు నచ్చిన నిర్ణయం తీసుకున్నాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ప్రయోజనం లేదనుకుంటే ఏ విషయాన్నైనా పొడిగించడం సరికాదనే సందేశాన్ని ఇచ్చాడని తన ఫాలోవర్లతో పేర్కొన్నాడు.దిగ్గజ సారథికాగా 2004లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ధోని.. 2019లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్లో మొత్తంగా 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో 10773, టెస్టుల్లో 4876, టీ20లలో 1617 పరుగులు సాధించాడు.సారథిగా టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 టైటిళ్లు గెలిచిన ధోని.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ తమ్ముడి సూపర్ సెంచరీ! -
పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న బంగ్లా క్రికెటర్!
బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెటర్, ఆఫ్-స్పిన్నర్ మొహమ్మద్ నయీమ్ హసన్ పోలీసుల చేతిలో చావుదెబ్బలు తినడం సంచలనం కలిగించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తాను క్రికెటర్ అని చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని బంగ్లా క్రికెటర్ వాపోయాడు. ఈ విషయం తెలుసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నయీమ్ హసన్పై దాడిని ఖండిస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పోలీసు కమిషనర్ క్షమాపణ..కాగా క్రికెటర్ నయీమ్ హసన్పై పోలీసుల దాడి విషయాన్ని తెలుసుకున్న చట్టోగ్రామ్ మెట్రోపాలిటన్ పోలీస్ (సీఎంపీ) కమిషనర్ హసన్ మహమ్మద్ షౌకత్ అతడి నివాసానికి వెళ్లాడు. నయీమ్ హసన్ను వేధించారనే ఆరోపణలపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఘటనపై నయీమ్ హసన్కు క్షమాపణ చెప్పారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..బంగ్లాదేశ్లో జరిగే ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ముగించుకుని నయీమ్ హసన్ విమానంలో ఢాకా నుంచి చిట్టగాంగ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగా, శుక్రవారం రాత్రి సుమారు 11:25 గంటల సమయంలో లంకన్ బజార్ ఫ్లైఓవర్ కింద పోలీసులు ఆయన ప్రయాణిస్తున్న ఆటోను ఆపారు. ఆ తర్వాత నయీమ్ హసన్ను ఆటో నుంచి బలవంతంగా దించి పోలీసు వాహనం ఎక్కించారు. తాను క్రికెటర్ను అని చెప్పినప్పటికీ మాట వినిపించుకోకుండా తనపై దౌర్జన్యంగా దాడి చేశారని నయీమ్ హసన్ తెలిపాడు. అతడు మాట్లాడుతూ..‘వారు డ్రైవర్ నుంచి పత్రాలు తీసుకున్నారు. అవసరమైతే నా బ్యాగ్ కూడా తనిఖీ చేసుకోమని నేను వారితో చెప్పాను. కానీ వారు నా గొంతు పట్టుకుని.. 'కారు ఎక్కు' అంటూ వారి వాహనంలోకి తీసుకెళ్లారు. ఎందుకు నా గొంతు పట్టుకున్నారు? అని నేను ప్రశ్నించగా, వారు నన్ను బయటకు తోసేసి, కొట్టి, అసభ్యకరంగా తిట్టారు. నేను దేశం తరఫున టెస్ట్ మ్యాచ్లు ఆడే జాతీయ క్రికెటర్ను అని చెప్పినా మొదట వినిపించుకోలేదు. ఆ తర్వాత నేను బోర్డుకు సమాచారం అందించడం, వాళ్లకు పై అధికారుల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో వదిలేశారు’ అని నయీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఇక త్వరలో జింబాబ్వేతో జరగనున్న టెస్ట్ సిరీస్కు బంగ్లాదేశ్ జట్టులో నయీమ్ హసన్కు చోటు దక్కింది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2018లో బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మొహమ్మద్ నయీమ్ హసన్ 14 టెస్టుల్లో 235 పరుగులు చేయడంతో పాటు తన ఆఫ్ స్పిన్ బౌలింగ్తో 48 వికెట్లు పడగొట్టాడు.చదవండి: సెమీస్లో ముగిసిన పీవీ సింధు పోరాటం -
మూడో స్థానం.. ఆ ముగ్గురికి అవకాశం: టీమిండియా కోచ్
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఫిట్నెస్కు మారుపేరైన ఈ రన్మెషీన్.. ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అఫ్గన్తో సిరీస్కు అతడు పూర్తిగా దూరమయ్యాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే ప్రకటించింది.వన్డే జట్టులోకి జైస్వాల్ కోహ్లి స్థానంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్ను ఎంపిక చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్కు కూడా అఫ్గన్తో వన్డే సిరీస్లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో కోహ్లి గైర్హాజరీలో వన్డౌన్లో ఎవరు ఆడతారన్న చర్చ నడుస్తోంది.ఓపెనర్లుగా జైసూ, ఇషాన్కు అనుభవం ఉంది. ఇక ఇషాన్ వన్డౌన్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఈ జార్ఖండ్ డైనమైట్ వైపే మొగ్గుచూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆ ముగ్గురికీ అవకాశంఈ విషయంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. అఫ్గనిస్తాన్తో శనివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం. కోహ్లికి బదులు ఇషాన్ లేదా కేఎల్ రాహుల్.. లేదంటే యశస్వి జైస్వాల్ ఎవరైనా ఆడవచ్చు.వాళ్లకు ఇదొక మంచి అవకాశం. మాకు మూడు వన్డేలు ఉన్నాయి. కాబట్టి వివిధ ఆప్షన్లు ప్రయత్నించడానికి అవకాశం దొరికింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు కూర్పు దెబ్బతినకుండా ఉండేలా విభిన్నమైన ప్లేయర్లను ప్రయత్నించేందుకు ఇదో చక్కటి అవకాశం’’ అని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యా లేదని.. అతడు మ్యాచ్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.చదవండి: వైభవ్ తమ్ముడి సూపర్ సెంచరీ -
రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్
క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత హైవోల్టేజ్ మ్యాచ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఆదివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. రాజకీయ కారణాల వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగకపోవడంతో ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీలతో పాటు ఏసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి.దీంతో చిరకాల ప్రత్యర్థులు ఎప్పుడు తలపడతారా? ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ను గెలుచుకుని అద్భుతమైన ఫామ్లో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ సేన.. అదే జోరుతో ఈ టీ20 ప్రపంచ కప్లోనూ బోణీ కొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇరు జట్లు బలాబాలాలపై ఓ లుక్కేద్దాం.డేంజరస్ బ్యాటింగ్ లైనప్దాయాది పాకిస్తాన్తో పోలిస్తే భారత జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్లతో టాప్, మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. భారతి ఫుల్మాలి వంటి ఫినిషర్ కూడా ఉండడం జట్టుకు కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ఈ టోర్నీకి ముందు జరిగిన వార్మాప్ మ్యాచ్లలో ఫుల్మాలి దుమ్ములేపింది. అంతేకాకుండా అనుభవజ్ఞురాలైన దీప్తి శర్మ జట్టుకు అదనపు బలాన్ని చేకూరుస్తోంది.బ్యాటింగ్ పరంగా భారత్ బలంగా ఉన్నప్పటికి బౌలింగ్లో మాత్రం కాస్త బలహీనంగా ఉందనే చెప్పాలి. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత బౌలర్లు తేలిపోయారు. వార్మాప్ మ్యాచ్లలో కూడా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కానీ ప్రధాన టోర్నీలో మాత్రం తమ బౌలర్లు మెరుగ్గా రాణిస్తారని భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది.మరోవైపు జట్టులోని నలుగురు ఆటగాళ్లు (భారతి ఫుల్మాలి, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్) మొదటిసారిగా టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ఆడుతున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో అద్భుతంగా రాణించినప్పటికి, ప్రపంచకప్ వంటి ఈవెంట్లో ఒత్తిడిని తట్టుకుని ఎలా రాణిస్తారో వేచి చూడాలి. శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, శ్రీ చరణిల త్రయంతో పాటు దీప్తి శర్మ వంటి అద్బుతమైన స్పిన్నర్లు కూడా జట్టులో ఉన్నారు. వీరు మాత్రం బంతిని తిప్పితే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. పేస్ బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్తో పాటు నందని శర్మ, అరుంధతి రెడ్డి యువ పేసర్లు ఉన్నారు.ఫామ్లో లేని పాక్పాకిస్తాన్ మహిళల జట్టు ప్రస్తుతం వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ టోర్నీకి ముందు ఐర్లాండ్ వేదికగా జరిగిన ట్రైసిరీస్లో పాక్ ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత వార్మాప్ మ్యాచ్లు రెండింటిలోనూ ఉమెన్ ఇన్ గ్రీన్ ఓటమి పాలైంది. ఇప్పుడు తొలి మ్యాచ్లోనే పటిష్టమైన భారత్తో తలపడనుంది. ప్రస్తుతం పరిస్థితుల బట్టి చూస్తే భారత్ చేతిలో పాక్కు మరో ఓటమి ఖాయమన్పిస్తోంది.పాక్ జట్టులో ఓపెనర్లు మునీబా ఆలీ, గుల్ ఫెరోజా, కెప్టెన్ ఫాతిమా సనా మినహా మిగితా ప్లేయర్లు ఎవరు ఫామ్లో లేరు. బౌలింగ్ విభాగంలో డయానా బేగ్, నష్రా సంధు, రమీన్ షమీ, సాదియా ఇక్బాల్ వంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నప్పటికి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు.భారత్దే పై చేయిమహిళల టీ20 క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 16 సార్లు తలపడ్డాయి. భారత్ 16 మ్యాచ్లు విజయం సాధించగా.. పాక్ కేవలం మూడింట మాత్రమే గెలుపొందింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ 'మహిళల ఆసియా కప్ 2024'లో జరిగింది. -
IND vs AFG: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. గిల్ (67), శ్రేయస్ (6) పరుగులతో ఆడుతున్నారు.👉ఇషాన్ కిషన్ (34) రూపంలో టీమిండియా 116 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ బాదిన గిల్అఫ్గాన్తో మ్యాచ్లో కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 37 బంతుల్లో గిల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది.👉10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30), గిల్ (29) పరుగులతో ఆడుతున్నారు.రోహిత్ శర్మ రనౌట్.. తొలి వికెట్ డౌన్రోహిత్ శర్మ రనౌట్ కావడంతో టీమిండియా 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న టీమిండియా195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (15), శుబ్మన్ గిల్ (17) పరుగులతో ఆడుతున్నారు.ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్16.3: హర్ష్ దూబే బౌలింగ్లో హష్మతుల్లా (27) రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా వెనుదిరిగాడు. హర్ష్కు వన్డేల్లో ఇదే తొలి వికెట్. నబీ క్రీజులోకి రాగా.. అజ్మతుల్లా రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 144-5(16.5).నాలుగో వికెట్ డౌన్15.3: నితీశ్ రెడ్డి బౌలింగ్లో బౌల్డ్ అయిన రహ్మానుల్లా గుర్బాజ్. 51 బంతుల్లో 102 పరుగులు చేసి నిష్క్రమణ. స్కోరు: 143-4(16). హష్మతుల్లా 27, అజ్మతుల్లా ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.శతక్కొట్టిన రహ్మానుల్లా గుర్బాజ్48 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న అఫ్గనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 👉14 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 130-3 సెంచరీకి చేరువైన రహ్మానుల్లా గుర్బాజ్సెంచరీ కొట్టిన అఫ్గనిస్తాన్.. స్కోరు: 110-3(12)హష్మతుల్లా 17, రహ్మానుల్లా గుర్బాజ్ 86 పరుగులతో ఉన్నారు.రహ్మానుల్లాగుర్బాజ్ హాఫ్ సెంచరీ👉10 ఓవర్లు ముగిసేసరికి అఫ్గానిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. రహమనుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 25 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకుని.. అఫ్గన్ తరఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు.ఆరు ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 35-3 (6)రహ్మానుల్లా 25 పరుగులతో ఉండగా.. హష్మతుల్లా 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్4.3: అర్ష్దీప్ బౌలింగ్లో హర్ష్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటైన రహ్మత్ షా (3). క్రీజులోకి హష్మతుల్లా షాహిది. రహ్మానుల్లా 20 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 26-3(4.4).రెండో వికెట్ డౌన్2.3: అర్ష్దీప్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన సెదీకుల్లా (0). అంపైర్ అవుట్ ఇవ్వగా.. అఫ్గన్ రివ్యూకు వెళ్లింది. అయితే, ఎల్బీడబ్ల్యూగా తేలడంతో సెదీకుల్లా మైదానం వీడాడు. రహ్మత్ షా క్రీజులోకి రాగా.. రహ్మానుల్లా 14 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 17-2(2.4)తొలి వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన ఇబ్రహీం జద్రాన్ (1). స్కోరు: 13-1(1.5). క్రీజులోకి సెదీకుల్లా రాగా.. రహ్మానుల్లా 11 పరుగులతో ఉన్నాడు.👉టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత బౌలింగ్👉టీమిండియా తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రంతుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.శుభవార్తవర్షం తగ్గుముఖం పట్టింది. సూర్యుడు మేఘాల మాటు నుంచి బయటకు వచ్చాడు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీసేసి మాప్ చేస్తున్నారు. 5.45 నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది. ఈ వన్డే మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్ప్లే ఐదు ఓవర్లు ఉంటుంది. ఐదుగురు బౌలర్లు తలా ఐదు ఓవర్లు బౌల్ చేస్తారు. 👉4.45PM: తగ్గుముఖం పట్టిన వాన.. మైదానంలోకి వచ్చిన గ్రౌండ్ సిబ్బంది.👉కొనసాగుతున్న చిరుజల్లులు👉మరోసారి భారీగా కురుస్తున్న వర్షం. 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహణకు కటాఫ్ టైమ్ సాయంత్రం 6.32 గంటలు.మ్యాచ్ జరిగేనా?👉తగ్గుముఖం పట్టిన వానవరుణుడు కరుణిస్తాడా?👉కొనసాగుతున్న జల్లులు👉మైదానంలోకి వచ్చి పరిశీలించిన హెడ్ క్యూరేటర్.. వాన తెరిపినిస్తేనే కవర్లు ఎత్తివేసే అవకాశంవాన మొదలు👉🌧️ధర్మశాలలో మొదలైన వాన👉రన్-అప్ ఏరియాపై కవర్లు కప్పిన సిబ్బందిటాస్ ఆలస్యంక్రికెట్ అభిమానులకు చేదు వార్త. టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ధర్మశాలలో వాతావరణం మేఘావృతం కావడంతో టాస్ ఆలస్యం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ధర్మశాలలో వాన పడేందుకు 60- 70 శాతం అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తుదిజట్ల అంచనాభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్/ప్రిన్స్ యాదవ్.అఫ్గనిస్తాన్రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదీకుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇక్రమ్ అలికిల్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, బిలామ్ సమీ/మహ్మద్ సలీం. -
కాసేపట్లో మ్యాచ్.. టీమిండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్
ధర్మశాల వేదికగా తొలి వన్డేలో భారత్-అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్తో భారత్ తమ వన్డే ప్రపంచకప్-2027 ప్రిపరేషన్స్ను ప్రారంభించనుంది. విరాట్ కోహ్లి అందుబాటులో లేకపోయినప్పటికి రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ప్లేయర్ల ఆట చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచింది. శనివారం మ్యాచ్ జరిగే సమయం (మధ్యాహ్నం 1:30)లో భారీ వర్షం పడేందుకు అస్కారముందని అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. అక్యూవెదర్.కామ్ ప్రకారం.. ధర్మశాలలో ఈరోజు రోజంతా భారీ వర్షం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య 90 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని అక్యూవెదర్ తమ రిపోర్ట్లో పేర్కొంది. ఆ తర్వాత సాయత్రం వర్షం తగ్గుతుందని తెలిపింది. అయితే మళ్లీ రాత్రి వేళ వర్షం పడే అవకాశం 65 శాతం ఉండడంతో మ్యాచ్ పూర్తిగా జరిగే సూచనలు కనిపించడం లేదు.కాగా ఈ సిరీస్కు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా దూరమయ్యారు. కోహ్లి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్తో భర్తీ చేశారు. కానీ హార్దిక్ పాండ్యా రిప్లేస్మెంట్ను బీసీసీఐ ప్రకటించలేదు. అతడి స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్షిత్ తిరిగి జట్టులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్చదవండి: IND vs AFG: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు? -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు?
టీమిండియాకు గుడ్ న్యూస్. టీ20 ప్రపంచకప్-2026కు ముందు గాయపడిన స్టార్ పేసర్ హర్షిత్ రాణా, ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు నెలలగా పోటీ క్రికెట్కు దూరంగా ఉంటున్న హర్షిత్.. అఫ్గాన్తో మూడో వన్డేకు ముందు భారత జట్టుతో చేరనున్నట్లు సమాచారం.వాస్తవానికి అఫ్గాన్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో హర్షిత్ లేడు. కానీ ఇప్పుడు అతడు కోలుకోవడంతో గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా స్ధానంలో జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఐర్లాండ్,ఇంగ్లండ్ పర్యటనలకు మాత్రం ముందే అతడిని ఎంపిక చేశారు.ఈ ఢిల్లీ క్రికెటర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఉన్నాడు. అతడు ప్రతి రోజూ 9-10 ఓవర్లు బౌలింగ్ చేస్తూ, తన బ్యాటింగ్పై కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాడని టైమ్స్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. జూన్ 17 నాటికి అతడికి సీఓఈ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.సీఓఈ వైద్య బృందం నుంచి అనుమతి వచ్చిన వెంటనే అతడు నేరుగా మూడో వన్డేకు ముందు చెన్నైలో జట్టుతో కలవనున్నాడు. హర్షిత్ చివరగా భారత్ తరపున వన్డేల్లో ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్పై ఆడాడు. ఇప్పటివరకు 14 వన్డేలు ఆడిన రాణా.. 6.22 ఏకానమితో 26 వికెట్లు పడగొట్టాడు. అతడికి బ్యాట్తో రాణించే సత్తా కూడా ఉంది. దీంతో టీమ్ మెనెజ్మెంట్ అతడిని ఆల్రౌండర్గా ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్చదవండి: వరల్డ్కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.. ఇంగ్లండ్ దెబ్బకు లంక కుదేల్ -
వరల్డ్కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.. ఇంగ్లండ్ దెబ్బకు లంక కుదేల్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో ఆతిథ్య ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంక ఉమెన్స్ టీమ్పై 87 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు డ్యానీ వ్యాట్-హాడ్జ్, అమీ జోన్స్ కాస్త నెమ్మదిగా ఆడారు. క్రీజులో కుదురుకున్నాక వారిద్దరూ లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ఇద్దరూ మొదటి వికెట్కు 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోన్స్(53) హాఫ్ సెంచరీ చేసి ఔటైనప్పటికి వ్యాట్ మాత్రం తన దూకుడు కొనసాగించింది.ఈ క్రమంలో వ్యాట్ తన మూడో టీ20 సెంచరీ మార్క్ను అందుకుంది. మొత్తంగా ఆమె 62 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్తో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. వీరితో పాటు నాట్ స్కివర్ బ్రంట్(22 బంతుల్లో 46) కూడా మెరుపులు మెరిపించింది. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే అత్యధిక టీమ్ స్కోరు కావడం గమనార్హం.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ యువ బౌలర్ ఫ్రేయా కెంప్ తన సంచలన బౌలింగ్తో లంక మిడిల్ ఆర్డర్ను దెబ్బతీసింది. ఆమె కేవలం 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు స్పిన్నర్లు డీన్, సోఫీ ఎక్లెస్టోన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సూపర్ సెంచరీతో సత్తాచాటిన వ్యాట్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
వైభవ్ సూర్యవంశీ తమ్ముడి వీరవిహారం.. 10 ఏళ్లకే సూపర్ సెంచరీ
నయా బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెటర్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. తన అద్భుత బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే సెంచరీ బాది యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. తనకంటే సీనియర్ బౌలర్లను సైతం విడిచిపెట్టలేదు. మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఆ చిచ్చర పిడుగు ఎవరో కాదు వైభవ్ చిన్న తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. ఇప్పుడు అన్న బాటలోనే ఆశీర్వాద్ కూడా అడుగులు వేస్తున్నాడు.ఆశీర్వాద్ తాజాగా బిహార్లోని సమస్తిపూర్లో జరిగిన ఒక స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 'క్రికెట్ అకాడమీ తాజ్పూర్' తరపున ఆడిన జూనియర్ వైభవ్ 87 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 20 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 118.39గా నమోదైంది.తమ్ముడి క్లాస్ ఇన్నింగ్స్ చూసి మురిసిపోయిన వైభవ్ సూర్యవంశీ.. సోషల్ మీడియా ద్వారా ఆశీర్వాద్కు అభినందనలు తెలిపాడు. ఆశీర్వాద్ స్కోర్ కార్డ్కు సంబంధించి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అన్నకు తగ్గ తమ్ముడు అని కామెంట్లు చేస్తున్నారు.కాగా వైభవ్ ఇప్పటికే భారత సీనియర్ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్ల కోసం అతడిని జట్టులోకి తీసుకున్నారు. తద్వారా భారత జట్టుకు సెలక్ట్ అయిన అతి పిన్న వయష్కుడిగా సచిన్ రికార్డును సూర్యవంశీ(15) బ్రేక్ చేశాడు.ఇటీవల ముగిసిన ఐపీఎల్లోనూ వైభవ్ అసాధరణ ప్రదర్శన చేశాడు. మొత్తం 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి టోర్నమెంట్లో టాప్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: IND vs AFG: మరికొన్ని గంటల్లో మ్యాచ్.. అంతలోనే స్టార్ క్రికెటర్ తండ్రి మరణం -
మరికొన్ని గంటల్లో మ్యాచ్.. అంతలోనే స్టార్ క్రికెటర్ తండ్రి మరణం
భారత్-అఫ్గానిస్తాన్ మధ్య తొలి వన్డే ధర్మశాల వేదికగా శనివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు అఫ్గాన్ క్యాంప్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ క్రికెటర్ దర్విష్ రసూలీ తండ్రి గురువారం(జూన్ 11) కన్నుమూశారు.దీంతో వెంటనే రసూలీ తన కుటుంబానికి అండగా ఉండేందుకు ఉన్నపళంగా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. ఈ విషయాన్ని శుక్రవారం జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అధికారికంగా ధృవీకరించాడు."దర్విష్ రసూలీ తండ్రి మరణించినట్లు మాకు గత రాత్రి తెలిసింది. ఇది చాలా బాధకరం. ఈ కష్టసమయంలో అతడు తన కుటుంబ సభ్యుల వద్ద ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతడు అఫ్గాన్కు తిరిగి వెళ్లిపోయాడు" అని షాహిదీ పేర్కొన్నాడు.ఇప్పుడు రసూలీ లేకపోవడంతో తుది జట్టు ఎంపికకు అఫ్గాన్ వద్ద 14 ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. యాదృఛ్చికంగా భారత్ వద్ద కూడా అంతే మంది ఉన్నారు. గాయం కారణంగా సిరీస్కు దూరమైన హార్దిక్ పాండ్యా స్ధానాన్ని బీసీసీఐ ఇంకా భర్తీ చేయలేదు.కాగా దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న రసూలీ ఇప్పటివరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ధర్మశాల వేదికగా అతడు భారత్పై వన్డే డెబ్యూ చేస్తాడని అంతా భావించారు. అంతలోనే అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.ఇప్పటికే అఫ్గానిస్తాన్ తరఫున 28 టీ20లు ఆడిన రసూలీకి లిస్ట్-ఎ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. అతడు 54.94 సగటుతో, 93.79 స్ట్రైక్ రేట్తో 3,022 పరుగులు చేశాడు. అతడు తిరిగి జూన్ 17న లక్నోలో జరిగే రెండో వన్డే సమయానికి జట్టుతో చేరే అవకాశముంది.అఫ్ఘనిస్తాన్ జట్టురహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), రహమత్ షా, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఘజన్ఫర్, బిలాల్ రాసోలీ, ఫాలీద్ సమీ, ఫాలీద్ సమీ, రెహమాన్ షరీఫీచదవండి: IND Vs AFG: రోహిత్ శర్మకు గాయం.. ఆఫ్గన్తో తొలి వన్డేకు డౌట్! -
రోహిత్పైనే దృష్టి
ధర్మశాల: వన్డే వరల్డ్ కప్ వచ్చే ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరగనుండగా... దానికి ముందు భారత జట్టు కనీసం 25 వన్డేలు ఆడనుంది. మెగా టోర్నీ కోసం జట్టును సిద్ధం చేసేందుకు, అందుబాటులో ఉన్న అన్ని రకాల ప్రత్యామ్నాయాలను పరీక్షించేందుకు మేనేజ్మెంట్కు ఇదే సరైన సమయం. ఈ నేపథ్యంలో ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపైనే అందరి దృష్టీ నిలిచింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు ధర్మశాలలో తొలి వన్డే జరగనుంది. ఇటీవల ఐపీఎల్లో ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొని కోలుకున్న రోహిత్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. గాయంతో ఇప్పటికే విరాట్ కోహ్లి సిరీస్ నుంచి తప్పుకోవడంతో రోహిత్ ఆట కీలకం కానుంది. 39 ఏళ్ల రోహిత్ అటు బ్యాటింగ్లో రాణించడంతో పాటు తన ఫిట్నెస్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ తమ ఆఖరి వన్డే సిరీస్లో న్యూజిలాండ్ చేతిలో ఓడగా, రోహిత్ అన్ని మ్యాచ్లలో విఫలమయ్యాడు. సత్తా చాటేందుకు నితీశ్ సిద్ధం... కెపె్టన్ శుబ్మన్ గిల్తో పాటు రోహిత్ ఓపెనింగ్ చేయనుండగా... కోహ్లికి బదులుగా ఇషాన్ కిషన్ మూడో స్థానంలో దిగవచ్చు. ఆ తర్వాత శ్రేయస్, రాహుల్ స్థానాలు పదిలం కాగా, ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్, సుందర్ ఉంటారు. ఇక్కడి పిచ్ను బట్టి చూస్తే భారత్ ముగ్గురు పేసర్లతో ఆడనుంది. ప్రసిధ్, అర్ష్ దీప్లతో పాటు మూడో స్థానం కోసం కొత్త ఆటగాడు గుర్నూర్ సింగ్, ప్రిన్స్ యాదవ్ మధ్య పోటీ ఉంది. ఇద్దరిలో ఒకరు అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయం. ఆరో స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తన చోటును సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఐపీఎల్లో నిలకడగా రాణించిన నితీశ్ తన గత వన్డేలో అర్ధ సెంచరీ కూడా సాధించాడు. బౌలింగ్లో కూడా పేస్ పదును పెంచుకున్న అతను టి20లను దాటి ఈ ఫార్మాట్లో 10 ఓవర్లు ఎలా వేస్తాడనేది ఆసక్తికరం. హార్దిక్ పాండ్యా పదే పదే గాయాలతో జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో నితీశ్కు ఇది చాలా చక్కటి అవకాశం. 3–0తో ఆధిక్యం... మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు అనుభజ్ఞులైన ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇబ్రహీమ్, గుర్బాజ్, రహ్మత్ షా, హష్మతుల్లా ప్రధాన బ్యాటర్లు కాగా... ఆల్రౌండర్గా అజ్మతుల్లా ఒమర్జాయ్ గత రెండేళ్లలో చాలా బాగా ఆడుతున్నాడు. టెస్టు ఆడని రషీద్ ఖాన్ రాకతో స్పిన్ బలంగా మారగా, ఘజన్ఫర్ కూడా కీలకం కానున్నాడు. ఇరు జట్ల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్. గతంలో ప్రపంచకప్, ఆసియా కప్లలో కలిపి రెండు టీమ్లు 4 మ్యాచ్లలో తలపడగా... భారత్ 3 గెలిచింది. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. -
అందరివాడు కేన్ మామా...
జెంటిల్మన్ క్రికెటర్ అంటే ఎలా ఉండాలి... పరాజయంలో, మైదానంలో కఠిన సమయంలో, తుది ఫలితంతో గుండె బద్దలైన క్షణంలో కూడా ప్రశాంతంగా కనిపించడమే కాదు... నిగ్రహం కోల్పోకుండా తన ‘క్లాస్’ను కోల్పోకుండా వ్యవహరించాలి. వన్డే వరల్డ్ కప్ ఫైనల్, టి20 వరల్డ్ కప్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్... ఇలా తన సారథ్యంలో మూడుసార్లూ చివరి మెట్టుపై ఓటమి ఎదురైనప్పుడు కూడా అతను ఎక్కడా గీత దాటలేదు... 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో దాదాపు తమ చేతుల్లోంచి లాక్కున్నట్లుగా ట్రోఫీని కోల్పోయిన సమయంలోనూ అతను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అదే చిరునవ్వు, అదే సంయమనం. అందుకే అతను అందరివాడు అయ్యాడు.ప్రత్యర్థి జట్ల అభిమానులు కూడా పలుమార్లు అతను విజయంలో భాగం అయి ఉంటే బాగుండేదని కోరుకున్నారు. అలాంటి మంచి పేరును సంపాదించుకున్న ఆటగాడే కేన్ విలియమ్సన్. హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా ‘కేన్ మామా’ అంటూ అభిమానంతో పిలుచుకునే ఈ న్యూజిలాండ్ దిగ్గజం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. 2010 తర్వాత గత దశాబ్దన్నర కాలంలో తమదైన ముద్ర వేసిన ‘ఫ్యాబ్ 4’లలో ఒకడైన కేన్ ఇప్పుడు పూర్తిగా తప్పుకున్నాడు. -సాక్షి క్రీడా విభాగం న్యూజిలాండ్ క్రికెట్ స్థాయిని పెంచి, తమదైన ఆటతో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో మార్టిన్ క్రో, రిచర్ట్ హ్యాడ్లీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, బ్రెండన్ మెకల్లమ్ల తర్వాత కేన్ విలియమ్సన్ పేరు కచ్చితంగా ఉంటుంది. 20 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసి తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన కేన్ ఆ తర్వాత దూసుకుపోయి పదిహేనేళ్ల పాటు నిలకడైన ప్రదర్శనతో తానేంటో నిరూపించుకున్నాడు. అటు పేస్, ఇటు స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఆడగల నైపుణ్యం కేన్ను సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఈతరం అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నిలిపింది. ‘ఫ్యాబ్యులస్ 4’లలో ఒకడిగా స్టీవ్ స్మిత్, జో రూట్, విరాట్ కోహ్లిలతో పోటీ పడుతూ పరుగులు సాధించిన విలియమ్సన్ పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. తనదైన ‘క్లాసిక్’ శైలితో వన్డే క్రికెట్లో చక్కటి గణాంకాలు నమోదు చేసిన ఈ కివీ స్టార్... టి20లకు అనుగుణంగా తన ఆటను మార్చుకొని మంచి ఫలితాలను సాధించడం చెప్పుకోదగ్గ విశేషం.హైదరాబాదీల అభిమానం...విలియమ్సన్ బ్యాటింగ్ శైలి చూస్తే అతను టి20లకు పనికి రాడని అంతా అనుకుంటారు. కానీ 2014 చాంపియన్స్ లీగ్లోనే అతను 48 బంతుల్లో సెంచరీతో తన వాడిని చూపించాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ జట్టు ద్వారా హైదరాబాద్ అభిమానులకు అతను చేరువయ్యాడు. 2015 నుంచి 2022 వరకు వరుసగా ఎనిమిది సీజన్ల పాటు ఇదే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతను ‘కేన్ మామా’గానే సుపరిచితుడు. 2016 టైటిల్ విజయంలో భాగంగా ఉన్నా... అతను పెద్ద పాత్ర పోషించలేదు. కానీ 2018లో డేవిడ్ వార్నర్ గైర్హాజరులో కేన్ జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. 8 అర్ధ సెంచరీలు సహా 735 పరుగులతో ‘ఆరెంజ్ క్యాప్’ గెలుచుకొని ముందుండి నడిపించాడు. తాజా సీజన్లో లక్నో జట్టు సలహాదారుడిగా ఇప్పటికే ఐపీఎల్లో కేన్ రెండో ఇన్నింగ్స్ మొదలైంది.‘వరల్డ్’ విజేతగా...టెస్టుల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విలియమ్సన్ సొంతం. అయితే అరుదైన 10 వేల మైలురాయికి కేవలం 485 పరుగుల దూరంలో ఉన్న అతను సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం అనూహ్యం. అయితే తాను ఎప్పుడైనా వ్యక్తిగత ప్రదర్శనకంటే జట్టు గురించి ఆలోచించానని, ఇప్పుడు ‘టీమ్ షీట్లో ఒక పేరు’గా మాత్రమే ఉండి మరో రెండు మ్యాచ్లు పెంచదల్చుకోలేదని తన ఉద్దేశాన్ని కేన్ స్పష్టంగా చెప్పాడు. చాలా కాలంగా అతను ఫామ్లేమితో పాటు ఫిట్నెస్ సమస్యలతో కూడా బాధపడుతున్నాడు. తనకు నచ్చిన టోర్నీలు లేదా సిరీస్లలో ఆడేందుకు 2024 జూన్లోనే అతను న్యూజిలాండ్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగానే భారత గడ్డపై న్యూజిలాండ్ 3–0తో గెలిచిన సిరీస్లో అతను ఆడలేదు. గత 9 ఇన్నింగ్స్లలో ఒకటే అర్ధసెంచరీ చేసిన కేన్... తాజాగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో 0, 18 పరుగులే నమోదు చేశాడు. దాంతో తప్పుకునేందుకు ఇదే సరైన సమయంగా భావించాడు. కెప్టెన్గా 2021 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ను గెలిపించడం విలియమ్సన్ కెరీర్లోనే అత్యుత్తమ ఘట్టం. భారత్పై లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్లో అతను అజేయ అర్ధసెంచరీ సాధించాడు. గుండె పగిలిన క్షణం...వన్డే క్రికెట్లో కూడా బ్యాటర్గా కేన్ తనదైన ముద్ర వేశాడు. మూడో స్థానంలో అతను ఏకంగా 51.16 సగటుతో పరుగులు సాధించడం అతని బ్యాటింగ్ గొప్పతనాన్ని చూపిస్తుంది. అతని 15 వన్డే సెంచరీల్లో 11 సార్లు జట్టు విజయం సాధించింది. అయితే కేన్ను మరచిపోకుండా చేసిన క్షణం 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో వచ్చింది. ఈ టోర్నీలో అద్భుత ఆటతో 9 ఇన్నింగ్స్లలో అతను 578 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లపై శతకాలతో పాటు సెమీస్లో భారత్పై విజయంలో 67 పరుగులతో కీలకపాత్ర పోషించాడు. అయితే ఫైనల్లో కేన్ బృందాన్ని దురదృష్టం వెంటాడింది. మ్యాచ్, సూపర్ ఓవర్లలో సమంగా నిలిచినా కూడా ట్రోఫీ దక్కలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘బౌండరీ కౌంట్’ రూల్తో కివీస్ రన్నరప్గానే నిలవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంగ్లండ్ మినహా ఇతర క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా ఎంతో బాధపడిందంటే అతిశయోక్తి కాదు. టీమ్ను ఫైనల్ వరకు చేర్చిన విలియమ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలిచాడు. కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ రికార్డుటెస్టులు 110 పరుగులు 9515 పరుగులు సగటు 54.06 సెంచరీలు 33 అర్ధ సెంచరీలు 38 అత్యధిక స్కోరు 251వన్డేలు 175 పరుగులు 7256 సగటు 48.69 సెంచరీలు 15 అర్ధ సెంచరీలు 47 అత్యధిక స్కోరు 148టి20లు 93 పరుగులు 2575 సగటు 33.44 అర్ధ సెంచరీలు 18 అత్యధిక స్కోరు 95 -
రోహిత్ శర్మకు గాయం.. ఆఫ్గన్తో తొలి వన్డేకు డౌట్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లుగా అనిపిస్తోంది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రసిధ్ క్రిష్ణ వేసిన బంతిని ఆడే క్రమంలో రోహిత్ మిస్ చేయడంతో అతడి కుడిచేతి బొటనవేలిని బలంగా తాకింది. అయితే రోహిత్ శర్మ మాత్రం తన ప్రాక్టీస్ను కొనసాగించాడు. కానీ అర్ష్దీప్ సింగ్ వేసిన బంతులను ఆడడంలో రోహిత్ ఇబ్బంది పడడం చూస్తుంటే చేతివేలి గాయం పెద్దదిగానే కనిపిస్తోంది. దీంతో ఆఫ్గన్తో తొలి వన్డేలో రోహిత్ ఆడడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ రోహిత్ గాయంతో దూరమైతే గిల్తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. అప్పుడు వన్డౌన్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు రానున్నాడు. ఇక మరో సీనియర్ విరాట్ కోహ్లీ కండరాల గాయంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే కోహ్లీ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్, కోహ్లీకి చివరి టోర్నీ కానుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఇద్దరు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఇక రోహిత్ గాయంతో దూరమయ్యే అవకాశాలు ఉంటే మాత్రం అతడి స్థానంలో జైస్వాల్ బరిలోకి దిగనున్నాడు.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్.Rohit Sharma very rusty in the nets so far. Prasidh Krishna delivery hits him on the right thumb, plenty hitting the maker’s mark on the bat and then thick outside edge to a Arshdeep Singh delivery. pic.twitter.com/65M2pKVVeF— Sahil Malhotra (@Sahil_Malhotra1) June 12, 2026చదవండి: ఫ్యాబ్-4: ఇద్దరు పోయారు.. మరో ఇద్దరు మిగిలారు! -
ఫ్యాబ్-4: ఇద్దరు పోయారు.. మరో ఇద్దరు మిగిలారు!
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. అయితే కివీస్ క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్గా పేరు పొందిన కేన్ విలియమ్సన్ దాదాపు రెండు దశాబ్దాల పాటు బ్లాక్క్యాప్స్ బ్యాటింగ్ లైనప్కు వెన్నుముకలా నిలిచాడు. వివాదరహితుడిగా పేరున్న విలియమ్సన్ నిష్రమణ సగటు అభిమానిని బాధించే అంశం. అయితే టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లీ (టీమిండియా), జో రూట్ (ఇంగ్లండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)లను 2014లో దివంగత క్రికెటర్ మార్టిన్ క్రో ముద్దుగా ఫ్యాబ్-4 అని అభివర్ణించారు. ఈ తరంలో ఈ నలుగురు అత్యంత గొప్ప టెస్టు క్రికెటర్లని ఆయన కొనియాడారు. అందుకు తగ్గట్లే ఈ ఫ్యాబ్-4 తమ ఆటతో అభిమానుల మనసులు దోచుకున్నారు. అయితే ఫ్యాబ్-4 క్రమంగా కూలిపోతోంది. తాజాగా విలియమ్సన్ రిటైర్మెంట్తో ఈ ఫ్యాబ్-4 కాస్తా ఇప్పుడు ఫ్యాబ్-2గా మారిపోయింది. ఇప్పటికే కోహ్లీ టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పగా, తాజాగా కేన్ మామ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. మిగిలిన ఇద్దరు క్రికెటర్లు జో రూట్, స్టీవ్ స్మిత్ కూడా మహా అయితే మరో రెండేళ్లు ఆడే అవకాశముంది. వీళ్లిద్దరూ కూడా రిటైరైతే ఫ్యాబ్-4 కథ కంచికి చేరనుంది.ఇక 16 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అందుకున్న కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ తరఫున 110 టెస్టులు, 175 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి 378 మ్యాచ్లాడిన కేన్ విలియమ్సన్ 19,346 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్గా కేన్ మామ కివీస్ తరఫున 40 టెస్టులు, 91 వన్డేలు, 75 టీ20లకు సారథ్యం వహించాడు. కేన్ విలియమ్సన్ సారథ్యంలో న్యూజిలాండ్ 2021 ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ గెలుచుకుంది. అతడి సారథ్యంలోనే 2015 వన్డే ప్రపంచకప్తో పాటు 2021 టీ20 ప్రపంచకప్లో ఫైనల్ చేరినప్పటికీ, రన్నరప్తోనే సరిపెట్టుకుంది.చదవండి: జస్పాల్ రాణా మృతి వెనుక అసలు కారణమిదే! -
అతడిని విస్మరించొద్దు.. సెలెక్టర్లకు మాజీ క్రికెటర్ హెచ్చరిక!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టు క్రికెట్లో వేగంగా ఆడుతాడనే పేరుంది. కానీ వన్డే, టీ20 క్రికెట్లో మాత్రం పంత్ ఆట పూర్తి విరుద్ధంగా ఉంటుంది. వేగంగా ఆడాల్సిన వన్డే, టీ20 క్రికెట్లో సరిగ్గా ఆడకపోవడం.. ఆచితూచి ఆడాల్సిన టెస్టు క్రికెట్లో వేగాన్ని చూపించడం పంత్ నైజం. అయితే ఇటీవలే పేలవ ఫామ్ కారణంగా వన్డే, టీ20 క్రికెట్లో చోటు కోల్పోయిన పంత్ టెస్టు జట్టులో మాత్రం స్థానం నిలుపుకున్నాడు. అయితే పరిమిత ఓవర్ల ఆటలో పంత్ ఆట ఇక ముగిసినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలకవ్యాఖ్యలు చేశాడు. జియో హాట్స్టార్ ఇంటర్వ్యూలో పఠాన్ మాట్లాడాడు. పంత్ను వైట్బాల్ జట్టు నుంచి తొలగించినప్పటికీ 2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో అతడిని పూర్తిగా విస్మరించివద్దని సెలెక్షన్ కమిటీని కోరాడు. 'వన్డే క్రికెట్ నుంచి తప్పించారనే నిరాశ వాదాన్ని వదిలేసి మళ్లీ ట్రాక్ ఎక్కితే పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాలో చోటు దక్కించుకోవడం పంత్కు పెద్ద కష్టమేమి కాదు. ఈ విషయంలో పంత్ తన సహచర క్రికెటర్లను ఆదర్శంగా తీసుకోవాలి. వన్డేల్లో వికెట్ కీపర్ ఇప్పుడు కేఎల్ రాహుల్ తొలి ఛాయిస్. ఓపెనర్గా, అవసరమైతే ఐదు లేదా ఆరో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడు. అతడికి బ్యాకప్గా ఇషాన్ కిషన్ ను తీసుకొచ్చారు. ఇషాన్ కూడా టాపార్డర్లో బ్యాటింగ్ చేస్తాడు. షార్ట్పిచ్ బంతులను కూడా చక్కగా ఆడగలడు. బీసీసీఐకి మూడో ఆప్షన్ సంజు శాంసన్. అతడికి ఎప్పుడు అవకాశం వచ్చినా వన్డేల్లో సత్తా చాటడంలో ముందుంటాడు. గత టీ20 ప్రపంచకప్లోనూ శాంసన్ పలు కీలక ఇన్నింగ్స్ లు ఆడటం చూశాం. పంత్ విషయంలో మాత్రం సెలక్టర్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 2027 వన్డే ప్రపంచ కప్ సెలక్షన్స్లో పూర్తిగా అతడిని పక్కన పెట్టొద్దు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి ఫామ్ గొప్పగా లేదని తెలుసు. గతంలో ఇషాన్ కిషన్ కూడా జట్టులో నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత రాణించి మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. సారథిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని జార్ఖండ్కు అందించాడు. అందుకే అతడిని పంత్ స్ఫూర్తిగా తీసుకోవాలి. వైట్బాల్ క్రికెట్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వాలి.' అని ఇర్ఫాన్ తెలిపాడు. పంత్ చివరిసారిగా 2024లో వన్డే మ్యాచ్ ఆడాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా జట్టులో ఉన్నప్పటికీ రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ పంత్ కెప్టెన్గా, ఆటగాడిగా విఫలమయ్యాడు. లక్నో సూపర్జెయింట్స్ తరఫున 14 మ్యాచ్లాడిన పంత్ 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్గా జట్టును నడిపించడంలో విఫలమైన పంత్ పాయింట్ల పట్టికలో లక్నోను ఆఖరి స్థానంలో నిలిపాడు. దీంతో లక్నో యాజమాన్యం పంత్ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఐపీఎల్లో చెత్త ప్రదర్శన చేసినప్పటికీ ఇటీవలే ఆఫ్గన్తో జరిగిన టెస్టులో మాత్రం పంత్ ఆకట్టుకున్నాడు. 121 బంతులాడిన పంత్ 81 పరుగులు సాధించాడు. ఇక సౌతాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్కు రోహిత్, కోహ్లీలను నేరుగా ఎంపిక చేస్తారనే ఊహాగానాలను పఠాన్ తోసిపుచ్చాడు.చదవండి: అంతర్జాతీయ క్రికెట్కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు -
‘సచిన్, కోహ్లిలను మించిపోతాడు.. అతడికి తిరుగులేదు’
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ పదిహేనేళ్ల పిల్లాడు టీమిండియా లెజెండ్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిలను మించిపోయినా ఆశ్చర్యం లేదంటూ ఆకాశానికెత్తాడు. భారత క్రికెట్కు దొరికిన అత్యంత విలువైన నిధిగా వైభవ్ను అభివర్ణించాడు.ఫార్మాట్లకు అతీతంగాగతేడాది కాలంగా వైభవ్ సూర్యవంశీ ఫార్మాట్లకు అతీతంగా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో అలరించాడు.ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డలపై యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో శతకాలు బాది చరిత్ర సృష్టించాడు. ఇక అండర్-19 వరల్డ్కప్ ఆద్యంతం అలరించిన వైభవ్.. ఫైనల్లో ఇంగ్లండ్ మీద 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.ఆరెంజ్ క్యాప్ విజేతవరల్డ్కప్లో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా వైభవ్ గెలుచుకున్నాడు. అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగి 16 మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల నుంచి వైభవ్ సూర్యవంశీ పిలుపు అందుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లో పర్యటించడంతో పాటు ఆసియా క్రీడలు- 2026లో పాల్గొనే భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో డేల్ స్టెయిన్ వైభవ్పై ప్రశంసలు కురిపించాడు.సచిన్, కోహ్లిలను మించిపోతాడు‘‘సచిన్, విరాట్లను ఈ పిల్లాడు మించిపోగలడు. ఇదే ఫామ్ కొనసాగిస్తూ ఉంటే.. తన కెరీర్ ముగిసేనాటికి వీరిద్దరి కంటే పెద్ద స్టార్గా ఎదుగుతాడు. వైభవ్ సూర్యవంశీ విభిన్న ఆటగాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఎంతో మంది క్రికెటర్ల కంటే వైభవ్ ఎంతో బెటర్.అతడొక అద్భుతమైన పిల్లాడు. భారత క్రికెట్కు దొరికిన అత్యంత విలువైన నిధి. అతడు ఇండియాలో ఆడినపుడు నేను దగ్గరగా చూశాను. అక్కడి బౌండరీలు చిన్నగానే ఉన్నాయి. అయినప్పటికీ సీనియర్లకు కూడా సాధ్యం కాని రీతిలో అతడు పవర్హిట్టింగ్ ఆడాడు’’ అని డేల్ స్టెయిన్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు.అయితే, వైభవ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బీసీసీఐకి ఈ సందర్భంగా స్టెయిన్ సూచించాడు. పదిహేనేళ్ల పిల్లాడు ఒత్తిడికి లోనుకాకుండా.. అతడిపై చెడు ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నాడు.చదవండి: తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి? -
IND vs PAK: భారత తుది జట్టు ఇదే!
పొట్టి క్రికెట్ మహా సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12- జూలై 5 మధ్య ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్- శ్రీలంక మధ్య శుక్రవారం ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది.ఇక భారత మహిళా జట్టు తమ తొలి మ్యాచ్లోనే దాయాది పాకిస్తాన్ను ఎదుర్కోనుంది. ఎడ్జ్బాస్టన్లో ఆదివారం (జూన్ 14) ఇరుజట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పాక్తో తలపడే భారత తుదిజట్టుపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఓపెనర్గా షఫాలీ వర్మనే సరైన ఆప్షన్. ఆమెకు తోడుగా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఉండనే ఉంది. యస్తికా భాటియా కూడా అద్భుతంగా ఆడుతోంది. మూడో స్థానంలో ఆమెను ఆడించాలి. నాలుగో స్థానంలో జెమీమా రోడ్రిగ్స్, ఐదో స్థానంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆడుతుంది.రిచా ఘోష్ ఆరో స్థానంలో పవర్ హిట్టర్గా సేవలు అందించగలదు. భారతి పుల్మాలిని ఎంపిక చేయాలనే ఉంది. కానీ రాధా యాదవ్తో పోలిస్తే ఆమె కాస్త వెనుబడి ఉన్నట్లు అనిపిస్తోంది. కాబట్టి ఫినిషర్గా రాణించగల లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధా యాదవ్నే నేను ఎంచుకుంటాను.ఆ తర్వాతి స్థానంలో దీప్తి శర్మ ఉంటుంది. క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రీచరణి బౌలింగ్ విభాగంలో సేవలు అందిస్తారు’’ అని అభిషేక్ నాయర్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.పాకిస్తాన్తో మ్యాచ్కు అభిషేక్ నాయర్ ఎంచుకున్న భారత తుదిజట్టుషఫాలీ వర్మ, స్మృతి మంధాన, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, రాధా యాదవ్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, క్రాంతి గౌడ్. -
అంతర్జాతీయ క్రికెట్కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. కివీస్ తరఫున అత్యుత్తమ క్రికెటర్గా పేరు పొందిన విలియమ్సన్ అన్ని పార్మాట్లకు గుడ్బై చెప్పినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఆడుతోంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్ విలియమ్సన్ ఆడాడు. అయితే వీడ్కోలు మ్యాచ్గా రెండో టెస్టు ఆడేందుకు విలియమ్సన్ మొగ్గు చూపలేదని, దీంతో లార్డ్స్ టెస్టుతో కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేశాడని కివీస్ బోర్డు స్పష్టం చేసింది. లార్డ్స్ టెస్టులో న్యూజిలాండ్ 115 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్లో విలియమ్సన్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్లు విలియమ్సన్ పేర్కొన్నాడు.‘రిటైర్మెంట్పై కొంతకాలంగా ఆలోచిస్తున్నా. నా వీడ్కోలుకు ఇదే సరైన సమయం అనిపించింది. 16 ఏళ్ల కెరీర్లో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. కివీస్కు ఐసీసీ మేజర్ టోర్నీ లేదనే భావన మాలో బలంగా ఉండిపోయింది. కానీ 2021లో భారత్ను ఓడించి ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ను కైవసం చేసుకోవడం ద్వారా మా ఖాతాలోనూ ఒక ఐసీసీ టైటిల్ వచ్చి చేరింది. న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడడం నా అదృష్టంగా భావిస్తున్నా. జట్టు కోసం ఆడాలనే నా తపన, కష్టం ఊరికే పోలేదు. కివీస్ తరఫున నేను ఆడిన ప్రతి మ్యాచ్లోనూ సర్వశక్తులు ఒడ్డి ఆడడం గర్వంగా భావిస్తున్నా. అన్నీ ఆలోచించే రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఎవరి బలవంతం లేదు.’ అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.2010లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన విలియమ్సన్ భారత్తో తాను ఆడిన తొలి టెస్టులోనే శతకం బాదిన క్రికెటర్గా నిలిచాడు. 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో విలియమ్సన్ అన్ని ఫార్మాట్లు కలిపి 378 మ్యాచ్లు ఆడాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 19, 346 పరుగులు సాధించిన విలియమ్సన్ ఖాతాలో 48 సెంచరీలున్నాయి. తద్వారా న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గానూ విలియమ్సన్ రికార్డులకెక్కాడు. ఇక కేన్ విలియమ్సన్ తన కెరీర్లో 110 టెస్టులాడి 9,515 పరుగులు (33 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు), 175 వన్డేల్లో 7,256 పరుగులు (15 సెంచరీలు, 47 హాఫ్సెంచరీలు), 93 టీ20ల్లో 2,575 పరుగులు (18 హాఫ్ సెంచరీలు) చేశాడు. ఇక న్యూజిలాండ్ సారథిగా కేన్ విలియమ్సన్కు అద్భుతమైన రికార్డు ఉంది. విలియమ్సన్ మొత్తం 40 టెస్టులు, 91 వన్డేలు, 75 టీ20ల్లో న్యూజిలాండ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలో న్యూజిలాండ్ 2019 ప్రపంచకప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడింది. ఈ రెండింటిలోనూ కివీస్ రన్నరప్కే పరిమితమైంది. అయితే 2021లో భారత్తో జరిగిన తొలి ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ను గెలిచిన న్యూజిలాండ్ తొలి మేజర్ ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకుంది. 2019లో ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్న కేన్ విలియమ్సన్ నాలుగుసార్లు రిచర్డ్ హార్డ్లీ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితుడైన కేన్ విలియమ్సన్ను అందరు ముద్దుగా ‘కేన్ మామ’ అని పిలుచుకుంటారు. 2018 ఐపీఎల్ సీజన్లో రన్నరప్గా నిలిచిన ఎస్ఆర్హెచ్కు కేన్ విలియమ్సన్ కెప్టెన్గా వ్యవహరించాడు. చదవండి: FIFA WC 2026: మెస్సీ వర్సెస్ రొనాల్డో పోరు ఎప్పుడంటే! -
తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?
అఫ్గనిస్తాన్తో శనివారం నాటి తొలి వన్డే కోసం టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇందుకోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకుంది. కాగా అఫ్గన్తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ప్రధాన మార్పు జరిగిన సంగతి తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల టీమిండియాకు దూరమయ్యాడు. ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా ఈ ఆర్సీబీ ఆటగాడు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అఫ్గన్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు.ఈ నేపథ్యంలో వన్డౌన్ బ్యాటర్ కోహ్లి స్థానంలో.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ను వన్డే జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. అయితే, రుతురాజ్ గైక్వాడ్ను కాదని జైసూను ఎందుకు తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.రుతుకు బదులు జైసూను ఎంపిక చేసి సెలక్టర్లు మంచి పనే చేశారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘విరాట్ కోహ్లి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి రుతు శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్తో బిజీగా ఉన్నాడు.అక్కడ భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఓ మ్యాచ్లో నాలుగో స్థానంలో వచ్చి సెంచరీ చేశాడు. మరో మ్యాచ్లోనూ రాణించాడు. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు రుతును ఎంపిక చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. భారత్- ‘ఎ’ జట్టులో అతడు కీలక సభ్యుడు.ఒకవేళ టీమిండియాకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కదు. అలాంటపుడు కోహ్లి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?.. యశస్వి జైస్వాల్కు కూడా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇవ్వరు. కాబట్టి రుతురాజ్ శ్రీలంకలో ఉండటమే కరెక్ట్.నిజానికి జైసూ అఫ్గనిస్తాన్తో చండీగఢ్లో టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి వన్డే కోసం అక్కడి నుంచి ధర్మశాలకు సులువుగానే చేరుకుంటాడు. తుదిజట్టులో యశస్వి జైస్వాల్కు బదులు ఇషాన్ కిషన్నే ఆడిస్తారు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున ఆడిన తమ చివరి వన్డేల్లో రుతు, జైసూ శతకాలు బాదడం విశేషం.ఇదిలా ఉంటే.. శనివారం ధర్మశాల వేదికగా టీమిండియా అఫ్గనిస్తాన్తో తొలి వన్డే ఆడనుంది. ఓపెనర్లుగా కెప్టెన్ శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగనుండగా.. వన్డౌన్లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. కాబట్టి జైసూ బెంచ్కే పరిమితమయ్యే పరిస్థితి. -
చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. బద్దలు కానున్న 37 ఏళ్ల రికార్డు
టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్లో మరో అరుదైన మైలు రాయిని అందుకునేందుకు సిద్దమయ్యాడు. అఫ్గానిస్తాన్తో ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేలో బరిలోకి దిగనున్న రోహిత్.. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్, 1983 వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడు మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉంది.ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడారు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయస్సు కలిగిన హిట్మ్యాన్.. అమర్నాథ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. 2007లో భారత్ తరపున వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ, 19 ఏళ్ల తన సేవలను అందిస్తూనే ఉన్నాడు.కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న రోహిత్.. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో తిరుగులేని ఆటగాడిగా నిలిచాడు. ధోనీ 2013లో రోహిత్ను ఓపెనర్గా పంపడం ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. ఓపెనర్గా మారిన తర్వాతే రోహిత్ ప్రపంచ స్థాయి బ్యాటర్గా ఎదిగాడు. ఆ తర్వాత భారత జట్టు పగ్గాలను కూడా చేపట్టాడు. అతడి కెప్టెన్సీలోనే భారత్ 2023 ప్రపంచకప్ను తృటిలో కోల్పోయింది.ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన మెన్ ఇన్ బ్లూ, తుది మొట్టుపై బోల్తా పడింది. టీ20 ప్రపంచకప్-2026ను మాత్రం అతడి కెప్టెన్సీలోనే టీమిండియా గెలుచుకుంది. తన 19 ఏళ్ల కెరీర్లో రోహిత్ ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా చారిత్రత్మక రికార్డును ఈ ముంబైకర్ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (7 సెంచరీలు) చేసిన రికార్డు రోహిత్ పేరిటే ఉంది. రోహిత్ శర్మ ఇప్పటివరకు 282 వన్డే మ్యాచ్ల్లో 11,577 పరుగులు సాధించాడు. -
ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. కోహ్లీ విషయంలో కీలక ప్రకటన!
అప్గానిస్తాన్తో వన్డే సిరీస్కు గాయంతో దూరమైన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విషయంలో ఒక కీలక అప్డేట్ వచ్చింది. కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లీ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూలైలో ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ లెక్కన అభిమానులకు కోహ్లీ విషయంలో ఇది గుడ్న్యూస్.జూలై 14 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఐపీఎల్ 2026 సీజన్ సమయంలోనే కోహ్లీ కండరాల గాయంతో సతమతమయ్యాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో చివరిదాకా బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ కండరాల గాయం తీవ్రత పెరిగిపోయింది. దీంతో ఫైనల్ పూర్తయిన మరుసటి రోజే కోహ్లీ తన కాలిని స్కాన్ చేయించుకున్నాడు. రిపోర్ట్లో కోహ్లి కాలిలో ఉండే డిస్టల్ సెమిమెంబ్రానోనస్ టెండన్ టియర్లో చీలిక వచ్చినట్లు తేలింది. డిస్టల్ సెమిమెంబ్రానోనస్ అనేది మోకాలి వెనుక భాగంలో ఉంటుంది. దీనిలో చీలిక వస్తే అది కాలి కండరాలను తీవ్రంగా బాధిస్తోంది. ఇది అత్యంత అరుదుగా జరుగుతుందని, కోలుకోవడానికి ఒక్కోసారి ఆరు నెలలు సమయం పడుతుందని వైద్యబృందం తెలిపింది. కానీ కోహ్లీ విషయంలో అద్భుతం జరిగిందని, అతడి అసామాన్యమైన ఫిట్నెస్ కారణంగా నాలుగు వారాల్లోనే పూర్తిగా కోలుకుంటాడని పేర్కొన్నారు. దీంతో ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడనే వార్తలు వస్తున్న వేళ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్లో ఇప్పటికే చాలా రికార్డులు తన పేరిట లిఖించుకున్న కోహ్లీ సచిన్ వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకుంటాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. 37 ఏళ్ల కోహ్లీ కెరీర్లో ఇప్పటివరకు 85 అంతర్జాతీయ సెంచరీలున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ కోహ్లీకి ఆఖరి టోర్నీ అని ప్రచారం జరుగుతున్న వేళ టీమిండియా ఆ టోర్నీ వచ్చేలోగా స్వదేశం, విదేశం కలిపి సుమారు 28 నుంచి 30 వన్డేల వరకు ఆడే అవకాశముంది. ఇందులోనే ఆసియా కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఉన్నాయి. ఈ లెక్కన సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీకి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు.చదవండి: భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్! యార్కర్ల కింగ్ అరంగేట్రం? -
భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్! యార్కర్ల కింగ్ అరంగేట్రం?
వన్డే ప్రపంచకప్-2027 సన్నాహాలను ప్రారంభించేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ ప్రిపరేషన్స్లో భాగంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్తో మూడు వన్డేల సిరీస్లో తలడపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల శనివారం ధర్మశాల వేదికగా తొలి వన్డే జరగనుంది.ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్-అఫ్గాన్ జట్లు ధర్మశాలకు చేరుకుని తీవ్రంగా శ్రమించాయి. ఈ మూడు వన్డేల సిరీస్కు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరయ్యారు. విరాట్ స్ధానంలో యశస్వి జైశ్వాల్ను జట్టులోకి తీసుకోగా, ఇంకా హార్దిక్ రిప్లేస్మెంట్ను ప్రకటించలేదు. అయితే తొలి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో అంచనా వేద్దాం.భారత ఇన్నింగ్స్ను ఎప్పటిలాగే రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్మన్ గిల్ ప్రారంభించనున్నారు. అయితే కోహ్లి లేనుందన మూడో స్ధానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది. కిషన్ చివరగా అక్టోబర్ 2023లో ఇదే అఫ్గాన్పై భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు.కోహ్లి ప్రత్యామ్నయంగా వచ్చిన జైశ్వాల్ మాత్రం బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జైస్వాల్ చివరిగా డిసెంబర్ 2025లో సౌతాఫ్రికాతో వన్డే ఆడాడు. జైశ్వాల్ కేవలం ఓపెనర్గా మాత్రమే ఆడగలడు. కాబట్టి రోహిత్కు విశ్రాంతి ఇస్తే తప్ప జైశూకు తుది జట్టులో చోటు దక్కదు. నాలుగో స్ధానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్ధానంలో కేఎల్ రాహుల్(వికెట్ కీపర్) బ్యాటింగ్కు రానున్నారు.ఆల్రౌండర్లుగా నితీష్ కుమార్ రెడ్డి, సుందర్హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయం కారణంగా సిరీస్కు దూరం కావడంతో, తెలుగు కుర్రాడు ఆల్రౌండర్ల కోటాలో చోటు దక్కనుంది. అతడు తన 10 ఓవర్ల కోటాను పూర్తిగా వేయాల్సి ఉంటుంది. మరో ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ జట్టులో కొనసాగనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండనున్నాడు.ప్రిన్స్ యాదవ్ వన్డే అరంగేట్రం?ఇక ఈ మ్యాచ్తో ఢిల్లీ పేసర్ ప్రిన్స్ యాదవ్ భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ప్రిన్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 12 మ్యాచుల్లో 16 వికెట్లు తీసి సెలెక్టర్లను ఆకర్షించాడు. ఈ సిరీస్కు బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లు లేకపోవడంతో ప్రిన్స్కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమనే చెప్పాలి. అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ వంటి యువ బౌలర్లతో ప్రిన్స్ బంతిని పంచుకోనున్నాడు. అతడు యార్కర్లు వేయడంలో దిట్ట.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్ -
శ్రీలంకపై వెస్టిండీస్ ఘన విజయం
శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. శుక్రవారం కింగ్స్టన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసింది. లంక ఇన్నింగ్స్లో కమిందు మెండిస్(51), కెప్టెన్ కుశాల్ మెండిస్(36) మినహా మిగితా ప్లేయరంతా దారుణంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో స్పీడ్ స్టార్లు జాసన్ హోల్డర్, షమీర్ జోషఫ్ తలా మూడు వికెట్లు పడగొట్టి లంకను దెబ్బ తీశారు.అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని కరేబియన్ జట్టు 19.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కెప్టెన్ షాయ్ హోప్(65 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా, బ్రాండన్ కింగ్(37) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగా రెండు వికెట్లు పడగొట్టగా.. మలింగ ఓ వికెట్ తీశాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 కింగ్స్టన్ వేదికగానే శనివారం జరగనుంది. కాగా ఇప్పటికే శ్రీలంకపై వన్డే సిరీస్ను వెస్టిండీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20 సిరీస్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని కరేబియన్స్ పట్టుదలతో ఉన్నారు.చదవండి: షాకింగ్.. శ్రేయస్ అయ్యర్ ఇంటి అద్దె రూ.7.14కోట్లు -
షాకింగ్.. శ్రేయస్ అయ్యర్ ఇంటి అద్దె రూ.7.14కోట్లు
టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబైలో అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నాడు. రియల్ ఎస్టేట్ ప్లాట్ఫారమ్ 'స్క్వేర్ యార్డ్స్' ప్రకారం.. వర్లీ ప్రాంతంలో ఉన్న ఈ ఖరీదైన అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ కోసం మూడేళ్ల కాలానికి గాను ఏకంగా రూ.7.14 కోట్లతో అయ్యర్ లీజు ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ ఫ్లాట్ సుమారు 3,875 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్లాట్తో పాటు అయ్యర్కు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించబడ్డాయి. ఈ లీజ్ ఒప్పందం మొత్తం 36 నెలల కాలపరిమితికి కుదిరింది. ప్రతి సంవత్సరం అద్దె సుమారు 7 శాతం చొప్పున పెరుగుతుంది. దీనికి సంబంధించి జూన్ 10న రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. ఈ ఒప్పందం కోసం రూ. 1.84 లక్షల స్టాంప్ డ్యూటీ అయ్యర్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ముంబై రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది.నెలవారీ అద్దె మొదటి సంవత్సరం- రూ.18.50 లక్షలురెండూ సంవత్సరం- రూ.19.79 లక్షలుమూడో సంవత్సరం-రూ.21.18 లక్షలునూతన సాథిగా అయ్యర్కాగా ఇటీవల శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ స్ధానంలో అయ్యర్కు జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. అయ్యర్ ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్ నుంచి భారత కెప్టెన్గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నారు.చదవండి: IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం వాయిదా? -
IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం వాయిదా?
ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో హింసాత్మక అల్లర్లు కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించారు. బుధవారం సాయంత్రం నగరంలోని పలు వీధుల్లో ముసుగులు ధరించిన కొంతమంది ఇళ్లు, వ్యాపార సముదాయాలు, కార్లు సిటీ బస్సులకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి వాటర్ క్యానన్లను ప్రయోగించారు.జూన్ 8వ తేదీ రాత్రి బెల్ఫాస్ట్లో ఒక వ్యక్తిపై జరిగిన దారుణమైన కత్తిపోట్ల దాడి ఈ హింసకు దారితీసింది. ఈ దాడికి పాల్పడిన నిందితుడు వేరే దేశానికి చెందిన వలసదారుడు అనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో స్థానికంగా వలసదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు మొదలై, అవి కాస్తా హింసాత్మక అల్లర్లుగా మారాయి.భారత్-ఐర్లాండ్ సిరీస్ డౌటే!కాగా నెలఖారులో భారత క్రికెట్ జట్టుకు రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సింది. ఈ రెండు మ్యాచ్లు (జూన్ 26, 28) కూడా బెల్ఫాస్ట్ వేదికగానే జరగాల్సి ఉంది. ఇప్పుడు అక్కడ నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఈ టీ20 సిరీస్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.తాజాగా ఇదే విషయంపై ఐర్లాండ్ క్రికెట్ స్పందించింది. భారత్తో జరగాల్సిన రెండు టీ20 మ్యాచ్ల సిరీస్ నిర్వహణపై రాబోయే 48 గంటల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ఐరీష్ క్రికెట్ బోర్డు తెలిపింది.బెల్ఫాస్ట్ నెలకొన్న పరిస్థితులను 'క్రికెట్ ఐర్లాండ్' నిశితంగా గమనిస్తోంది. భారత్తో టీ20 సిరీస్తో పాటు, ఈ ఆదివారం జరగాల్సిన 'ఐరిష్ సీనియర్ కప్', 'నేషనల్ కప్' మ్యాచ్ల నిర్వహణపై కూడా రాబోయే రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్లు, కోచ్లు, మ్యాచ్ అధికారులు, అభిమానుల భద్రతే మాకు అత్యంత ముఖ్యమని" ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన పేర్కొంది. వైభవ్ డెబ్యూ వాయిదా?కాగా ఈ టూర్ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ నుంచి తప్పించి అయ్యర్కు జట్టు బాధ్యతలను అప్పగించారు. కాగా ఈ సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. భారత జట్టుకు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ రికార్డును వైభవ్(15) బ్రేక్ చేశాడు. ఒకవేళ ఈ సిరీస్ వాయిదా పడితే సూర్యవంశీ అరంగేట్రం కోసం ఇంగ్లండ్ టూర్ వరకు వేచిచూడాల్సిందే. ఇంగ్లండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు కూడా అతడు ఎంపికయ్యాడు.చదవండి: FIFA World Cup 2026: ఆరంభంలోనే ఆల్టైమ్ రికార్డు.. ఫిఫా హిస్టరీలోనే మొదటిసారి -
ఆడేద్దాం... ధనాధన్
ఒకవైపు క్రీడా లోకమంతా సాకర్ ఫీవర్లో మునిగి తేలుతుంటే... మరోవైపు ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్నకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఇంగ్లండ్ వేదికగా 24 రోజుల పాటు జరగనున్న మహిళల మహా సంగ్రామంలో 12 జట్లు ట్రోఫీ కోసం కొట్లాడనున్నాయి. గతేడాది వన్డే ప్రపంచకప్ చేజిక్కించుకొని జోరుమీదున్న టీమిండియా... టి20 ఫార్మాట్లోనూ విశ్వ విజేత అనిపించుకోవాలని తహతహలాడుతుంటే... గత రెండు పర్యాయాలు తుది మెట్టుపై బోల్తాపడ్డ దక్షిణాఫ్రికా ఈసారైనా కప్పును ఒడిసిపట్టాలని కృతనిశ్చయంతో ఉంది!మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఆరుసార్లు టైటిల్ నెగ్గిన ఆ్రస్టేలియా ఏడో కప్పు ఖాతాలో వేసుకోవాలనుకుంటుంటే... డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ తమ పట్టు కొనసాగించాలని చూస్తోంది! సంచలన ప్రదర్శనతో రెండోసారి చాంపియన్గా నిలవాలని వెస్టిండీస్ భావిస్తుంటే... అప్పుడెప్పుడో ఈ ఫార్మాట్లో జరిగిన తొలి వరల్డ్కప్లో ట్రోఫీ నెగ్గిన ఇంగ్లండ్... ఇప్పుడు ఆతిథ్య హోదాలో రెండోసారి టైటిల్ హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది! మరెందుకు ఆలస్యం... అటు ‘ఫిఫా’ ప్రపంచకప్తో పాటు ఇటు... టి20 మెరుపులు చూసేందుకు సిద్ధమైపోదాం. –సాక్షి, క్రీడావిభాగంరెండేళ్లకోసారి జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్ మరోసారి సందడి చేసేందుకు మన ముందుకు వచ్చేసింది. తొలి ప్రపంచకప్ తర్వాత ఇప్పుడు పదో టోర్నీకి మరోసారి ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తుండగా... 7 వేదికల్లో మొత్తం 33 మ్యాచ్లు నిర్వహించనున్నారు. 12 జట్లు ట్రోఫీ కోసం అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటుండగా... వచ్చే నెల 5న విఖ్యాత లార్డ్స్ మైదానంలో విశ్వవిజేత ఎవరో తేలనుంది. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది వరల్డ్కప్లలో ఆరుసార్లు చాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా... తమ ఆధిపత్యం కనబర్చాలని చూస్తుంటే... ఇప్పటి వరకు ఒక్కోసారి ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్... రెండో టైటిల్ కోసం నిరీక్షిస్తున్నాయి. ఇక ఈ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా వరల్డ్కప్ గెలవని భారత్, దక్షిణాఫ్రికా తమ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవాలని భావిస్తున్నాయి. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో విజేతగా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)తో రాటుదేలిన భారత అమ్మాయిలు... విశ్వ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్తో టి20 సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ... ప్రధాన టోర్నీలో దూకుడే మంత్రంగా ఆడుతామని హర్మన్ వెల్లడించింది. ఇక గత రెండు (2023, 2024) వరల్డ్కప్లలో ఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా బలమైన బృందంతో బరిలోకి దిగనుంది. సొంతగడ్డ ఇంగ్లండ్కు అనుకూలం కానుండగా... డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్కు ఆల్రౌండర్ల బలగం దండిగా ఉంది. శుక్రవారం శ్రీలంక, ఇంగ్లండ్ మ్యాచ్తో ఈ టోర్నీకి తెరలేవనుండగా... టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. ఎంపిక ఇలా... బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చి న 2024 టి20 ప్రపంచకప్లో 10 జట్లు పాల్గొనగా... ఇప్పుడా సంఖ్యను 12కు పెంచారు. ఆతిథ్య హోదాలో ఇంగ్లండ్ నేరుగా వరల్డ్కప్నకు అర్హత సాధించగా... 2024 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఐదు జట్లతో పాటు... ఐసీసీ మహిళల టి20 ర్యాంకింగ్స్లో అత్యుత్తమ రెండు జట్లను కూడా నేరుగా మెగా టోర్నీకి ఎంపిక చేశారు. ఇక మిగిలిన నాలుగు జట్లను క్వాలిఫయర్ టోర్నీల ద్వారా నిర్ణయించారు. మొత్తం 12 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. ప్రతి జట్టు గ్రూప్లోని మిగిలిన ఐదు జట్లతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడనుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూప్ల్లో టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ప్రైజ్మనీ ఎంతంటే... ఈ టోర్నీ మొత్తం ప్రైజ్మనీ 8 లక్షల 76 వేల డాలర్లు (సుమారు రూ. 83 కోట్లు). విజేతకు 23 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు) లభించనుండగా... రన్నరప్ జట్టుకు 11 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) దక్కనున్నాయి. సెమీస్లో ఓడిన జట్లకు 6 లక్షల డాలర్ల (రూ. 6 కోట్లు) చొప్పున లభించనున్నాయి. 10 ఇది పదో మహిళల టి20 ప్రపంచకప్. 2009లో తొలిసారి ఇంగ్లండ్, వేల్స్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగగా... మళ్లీ ఇప్పుడు పదో ఎడిషన్ వరల్డ్కప్నకు ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తోంది. తొలి టోర్నీలో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ ఆ తర్వాత ఎప్పుడూ ట్రోఫీని అందుకోలేదు. 6 ఆ్రస్టేలియా గెలిచిన టి20 వరల్డ్కప్ ట్రోఫీలు. 2010, 2012, 2014, 2018, 2020, 2023లో ఆ్రస్టేలియా చాంపియన్గా నిలవగా... ఇంగ్లండ్ (2009), వెస్టిండీస్ (2016), న్యూజిలాండ్ (2024) ఒక్కోసారి ట్రోఫీ దక్కించుకున్నాయి. భారత్ అత్యుత్తమంగా 2020లో రన్నరప్గా నిలిచింది. -
భారత అండర్–19 జట్టులో యశ్వీర్ గౌడ్
న్యూఢిల్లీ: శ్రీలంకలో వచ్చే నెలలో పర్యటించే భారత అండర్–19 పురుషుల క్రికెట్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో హైదరాబాద్కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్ ఊట్కూరు యశ్వీర్ గౌడ్ ఎంపికయ్యాడు. యశ్వీర్ గౌడ్ తల్లిదండ్రులు ఊట్కూరు రాజ్కుమార్ గౌడ్, వాణి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్. హైదరాబాద్లో పుట్టి పెరిగిన యశ్వీర్ ఎనిమిదేళ్ల ప్రాయంలో బంతి పట్టాడు.విద్యానగర్లోని డేనియల్ క్రికెట్ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్న యశ్వీర్ ప్రస్తుతం కోచ్ కృష్ణమోహన్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. గత ఏడాది హైదరాబాద్ జట్టు తొలిసారి వినూ మన్కడ్ బీసీసీఐ అండర్–19 ట్రోఫీ టైటిల్ నెగ్గడంలో యశ్వీర్ కీలకపాత్ర పోషించాడు. యశ్వీర్ ఈ టోర్నీలో 15 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల తెలంగాణ టి20 లీగ్లో హైదరాబాద్ ఫ్రాంచైజీ యశ్వీర్ను రూ. 3 లక్షలకు సొంతం చేసుకుంది. మరోవైపు భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ కూడా శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టులోకి ఎంపికయ్యాడు. మరోవైపు స్వదేశంలో శ్రీలంక అండర్–19 మహిళల జట్టుతో జరిగే వన్డే, టి20 సిరీస్లో పాల్గొనే భారత అండర్–19 జట్టులో ఆంధ్ర వికెట్ కీపర్ కె.దీక్ష చోటు దక్కించుకుంది. 15 మంది సభ్యులతో కూడిన భారత వన్డే, టి20 జట్లకు భవిక అహిరె కెప్టెన్గా వ్యవహరించనుంది. -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ వన్డే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్, ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్లో విజయం సాధించింది. స్వదేశంలో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (జూన్ 11) జరిగిన రెండో మ్యాచ్లో విజయం సాధించడంతో ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్లోనూ ఆసీస్ను చిత్తు చేసిన బంగ్లా జట్టు, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్ను హస్తగతం చేసుకుంది. 2005లో తొలిసారి ఆస్ట్రేలియాపై ఓ వన్డేలో విజయం సాధించిన బంగ్లాదేశ్.. తాజాగా రెండు వరుస విజయాలు సాధించి సంచలనం సృష్టించింది.మ్యాచ్ విషయానికొస్తే.. వరుణుడు అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 41 ఓవర్లలో 192 పరుగులకు మార్చారు. లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు రెండో బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా డక్వర్త్ లూయిస్ పద్దతిలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తౌహిద్ హృదోయ్ (40), కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ (22) అజేయమైన ఇన్నింగ్స్లతో బంగ్లాను గెలుపుతీరాలకు చేర్చారు. అంతకుముందు సౌమ్య సర్కార్ (42), నజ్ముల్ షాంటో (41) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. మిగతా ఆటగాళ్లలో తంజిద్ హసన్ డకౌట్ కాగా.. లిటన్ దాస్ 21, తొలి వన్డే హీరో మొసద్దెక్ హొసేన్ 15 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బార్ట్లెట్, మెరిడిత్, జంపా, రెన్షా, గ్రీన్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఆసీస్ ఖాతా తెరవకుండానే 3 వికెట్లు కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేని అపవాదును మూటగట్టుకుంది. లబూషేన్ (55 నాటౌట్), బార్ట్లెట్ (52) అర్ద సెంచరీలతో రాణించి, ఈ మాత్రం స్కోరైనా అందించారు. మిగతా ఆటగాళ్లలో కెప్టెన్ ఇంగ్లిస్ (34), గ్రీన్ (25), అలెక్స్ క్యారీ (13) రెండంకెల స్కోర్లు చేయగా.. షార్ట్, కన్నోల్లీ, రెన్షాతో పాటు జంపా డకౌటయ్యారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (7-2-27-3), తస్కిన్ అహ్మద్ (8-1-33-3), తన్వీర్ ఇస్తాం (10-0-45-2) చెలరేగి బౌలింగ్ చేశారు. ఈ సిరీస్లోని నామమాత్రపు మూడో వన్డే జూన్ 14న జరుగనుంది. కాగా, ఆసీస్కు ఇది వరుసగా రెండో ద్వైపాక్షిక సిరీస్ ఓటమి. ఈ సిరీస్కు ముందు ఆ జట్టు పాకిస్తాన్ చేతిలో 1-2 తేడాతో సిరీస్ను కోల్పోయింది. -
శివాలెత్తిన శివమ్ దూబే.. సిక్సర్ల వర్షం
టీ20 ముంబై లీగ్లో భారత టీ20 ప్లేయర్ శివమ్ దూబే శివాలెత్తిపోయాడు. ఈ టోర్నీలో అంధేరి ఆర్క్స్కు సారథ్యం వహిస్తున్న అతడు.. ఆకాశ్ టైగర్స్తో ఇవాళ (జూన్ 11) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఫలితంగా అతడి జట్టు ఫైనల్కు దూసుకుపోయింది.ఈ మ్యాచ్లో తొలుత బంతితో (3-0-16-1) రాణించిన దూబే.. ఆతర్వాత బ్యాటింగ్లో చెలరేగిపోయాడు. ప్రత్యర్ది నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. 26 బంతుల్లో ఓ బౌండరీ, 5 సిక్సర్లతో విరుచుకుపడి అజేయమైన 45 పరుగులు చేశాడు.తద్వారా అతడి జట్టు మరో 9 బంతులు మిడిలుండగానే విజయతీరాలకు చేరింది. లక్ష్య ఛేదనలో దూబేకు దివ్యాంశ్ సక్సేనా (34), ప్రసాద్ పవార్ (26), గౌరవ్ జాథర్ (11 నాటౌట్) సహకరించారు. ఈ జట్టు స్టార్ ఆటగాళ్లు ముషీర్ ఖాన్ (0), అర్జున్ టెండూల్కర్ (13) ఈ మ్యాచ్లో నిరాశపరిచారు.అంతకుముందు ఆకాశ్ టైగర్స్ తరఫున ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ (34), జయ్ గోకుల్ బిస్తా (35) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును తాకలేదు. అంధేరి బౌలర్లలో అశుతోష్ 2 వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్, ముషీర్ ఖాన్, శివమ్ దూబే, ప్రసూన్ సింగ్, అజయ్ మిశ్రా తలో వికెట్ తీశారు. -
సిరీస్ మధ్యలో స్వదేశానికి వెళ్లిపోయిన డెవాన్ కాన్వే
ఇంగ్లండ్తో రెండో టెస్ట్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో, ఆమెతో ఉండేందుకు తాత్కాలికంగా జట్టును వీడాడు.రెండో టెస్ట్ జూన్ 17న మొదలు కావాల్సి ఉండగా.. ఆ సమయానికంతా అతడు జట్టుతో కలుస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కాన్వే తన తొలి సంతానం జనన సమయంలోనూ ఇంగ్లండ్తో టెస్ట్ మ్యాచ్ను మిస్ అయ్యాడు. ఒకవేళ కాన్వే రెండో టెస్ట్ సమయానికి అందుబాటులోకి రాకపోతే కెప్టెన్ టామ్ లాథమ్తో కలిసి రచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేస్తాడు.కాగా, న్యూజిలాండ్ జట్టు మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇప్పటికే తొలి టెస్ట్ పూర్తి కాగా, ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడింది. ఆ మ్యాచ్లో కాన్వే తొలి ఇన్నింగ్స్లో (1) విఫలమైనా, రెండో ఇన్నింగ్స్లో (41) పర్వాలేదనిపించాడు. కాన్వే ఇటీవలికాలంలో బ్యాటింగ్లో స్థిరత్వంలేక ఇబ్బందిపడుతున్నాడు. ఓ సిరీస్లో రాణిస్తే, మరో సిరీస్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. తాజాగా విండీస్తో జరిగిన సిరీస్లో అతడు 452 పరుగులతో సత్తా చాటాడు.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్పై తొలి టెస్ట్ విజయం తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆ మ్యాచ్ గెలిచిన ఆనందంలో వారిద్దరు నిబంధనలు ఉల్లంఘించి నైట్క్లబ్లో పార్టీ చేసుకోవడంతో పాటు అక్కడు ఓ రగ్బీ ఆటగాడితో గొడవకు దిగారు. అక్కడ స్టోక్స్ తాగిన మత్తులో సదరు రగ్బీ ఆటగాడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఈసీబీ.. స్టోక్స్, అట్కిన్సన్ నిబంధనలు ఉల్లంఘించారని నిర్దారించి వారిని రెండో టెస్ట్ నుంచి తప్పించింది. స్టోక్స్ గైర్హాజరీలో రూట్ను తాత్కాలిక సారధిగా ప్రకటించింది. -
IND vs AFG: భారత్కు భారీ షాక్.. అఫ్గన్ అనూహ్య విజయం
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టుతో గురువారం నాటి మ్యాచ్లో తిలక్ వర్మ సేన ఓటమి పాలైంది.తొలుత ఆతిథ్య శ్రీలంక- భారత్ మధ్య మ్యాచ్ జరుగగా.. భారత్ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. ఈ క్రమంలో గురువారం అఫ్గన్తో తలపడ్డ భారత జట్టు.. దంబుల్లాలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. అదరగొట్టిన భారత బ్యాటర్లుగత మ్యాచ్లో విఫలమైన ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈసారి అదరగొట్టారు. ప్రభ్సిమ్రన్ 69 బంతుల్లో 84 పరుగులు సాధించగా.. వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు.మూడో స్థానంలో వచ్చిన ప్రియాన్ష్ ఆర్య (8) విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 80 బంతుల్లో 66, కెప్టెన్ తిలక్ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించారు. మిగతా వారిలో ఆయుశ్ బదోని డకౌట్ కాగా.. సూయాన్ష్ షెడ్గే (40) మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ (1), విప్రాజ్ నిగమ్ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.349 పరుగుల భారీ స్కోరుఇక వర్షం వల్ల ఈ మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గనిస్తాన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ ఒక వికెట్ పడగొట్టారు.పదే పదే ఆటంకంఅనంతరం అఫ్గన్ లక్ష్య ఛేదనకు దిగగా వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. అఫ్గన్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇమ్రాన్ మిర్, హసన్ ఐసాఖిల్ అఫ్గన్కు శుభారంభం అందించారు.ఇమ్రాన్ 70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 75 పరుగులతో అజేయంగా నిలవగా.. హసన్ 29 బంతుల్లో 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. వన్డౌన్ బ్యాటర్ ఖలీద్ తనీవాల్ (2) మాత్రం విఫలమయ్యాడు. అయితే, ఓపెనర్ ఇమ్రాన్కు తోడుగా బహీరీ షా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు.సారథితో పాటు పట్టుదలగా నిలబడ్డ బహీర్బహీర్ 52 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 51 పరుగులతో ఇమ్రాన్తో కలిసి అజేయంగా నిలిచాడు. అయితే, అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్లో 25.5 ఓవర్లు పూర్తైన తర్వాత మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి అఫ్గన్ రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.భారత్ ఓటమిఅయితే, ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువైంది. దీంతో డక్వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం నిర్ణీత ఓవర్లలో భారత్ కంటే అఫ్గన్ జట్టు ఆధిక్యంలో నిలిచినట్లయింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ను విజేతగా ప్రకటించారు. భారత్పై అనూహ్య రీతిలో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో అఫ్గనిస్తాన్ విజయం సాధించింది.ఇక ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ట్రై సిరీస్లో రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న భారత్ ఒక గెలుపు, ఒక ఓటమి నమోదు చేసింది. మరోవైపు.. అఫ్గన్ ఆడిన ఒక్కటీ గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో ప్రథమ స్థానంలో నిలవగా.. భారత్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్రన్రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది. ఆడిన ఒక్క మ్యాచ్లో ఓడిన లంక చివరి స్థానంలో నిలిచింది.చదవండి: భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు -
ICC ODI WC 2027: క్రేజీ అప్డేట్
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2027కు సంబంధించి క్రేజీ అప్డేట్ అందింది. ఈ మెగా ఈవెంట్కు అక్టోబరు- నవంబరు మధ్య షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. వచ్చే ఏడాది అక్టోబరు 4న మొదలై నవంబరు 21న ఫైనల్తో వన్డే వరల్డ్కప్ ముగియనున్నట్లు తెలుస్తోంది. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మేలో అహ్మదాబాద్లో సమావేశమైన సమయంలో వరల్డ్కప్ షెడ్యూల్ గురించి ప్రధానంగా చర్చ జరిగింది. ఈ మెగా ఈవెంట్కు సౌతాఫ్రికాతో పాటు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.అక్కడ ఎనిమిది వేదికలుఅయితే, ప్రధాన మ్యాచ్లనీ సౌతాఫ్రికాలోనే జరుగనున్నాయి. ఇందుకోసం ఎనిమిది వేదికలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈవెంట్లోని 54 మ్యాచ్లలో 41 మ్యాచ్లు సౌతాఫ్రికాలోనే నిర్వహిస్తారు. ఇక జింబాబ్వేకు 8- 10 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కగా.. నమీబియాలో కేవలం మూడు మ్యాచ్లే నిర్వహించనున్నట్లు సమాచారం.కాగా సౌతాఫ్రికాలోని సెంచూరియన్, జొహన్నస్బర్గ్, బ్లోయేమ్ఫొంటేన్, డర్బన్, ఈస్ట్ లండన్, గెబెర్హ, పర్ల్, కేప్టౌన్లను వరల్డ్కప్ వేదికలుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక జింబాబ్వేలో హరారే, క్వీన్స్, విక్టోరియా ఫాల్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్ షెడ్యూల్పై జూలైలో జరిగే సమావేశంలో పూర్తి స్పష్టత రానుంది.24 ఏళ్ల తర్వాతకాగా దాదాపు 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆఫ్రికా ఖండంలో వన్డే వరల్డ్కప్ జరుగనుంది. చివరగా 2003లో సౌతాఫ్రికాలో ఈ టోర్నీ జరుగగా.. నాడు ఫైనల్లో టీమిండియాపై గెలిచి ఆస్ట్రేలియా విజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ టోర్నీకి సౌతాఫ్రికానే ఆతిథ్యం ఇవ్వడం విశేషం.చదవండి: భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు -
ఆసీస్ సిరీస్ కోసం ప్రత్యేక అస్త్రాలు సిద్దం చేసిన బంగ్లా
త్వరలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, ఆతర్వాత జింబాబ్వేతో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం రెండు వేర్వేరు బంగ్లాదేశ్ జట్లను ఇవాళ (జూన్ 11) ప్రకటించారు. ముందుగా ఆసీస్తో టీ20 సిరీస్ విషయానికొస్తే.. ఈ జట్టుకు కెప్టెన్గా లిట్టన్ దాస్ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా యువ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ పేరును ప్రకటించారు.ఈ సిరీస్తో పేస్ త్రయం ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా రీఎంట్రీ ఇచ్చింది. ఈ ముగ్గురు పేసర్లతో బంగ్లాదేశ్ ఆసీస్ బ్యాటింగ్ యూనిట్పై దాడికి దిగనుంది. ఈ జట్టులో గత సిరీస్లో ఆడిన తంజిమ్ హసన్ షకీబ్, రిపన్ మొండల్, మొహమ్మద్ సైఫుద్దీన్లకు చోటు దక్కలేదు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా వీరిని తప్పించినట్లు సెలెక్టర్లు చెప్పారు.జింబాబ్వేతో ఏకైక టెస్ట్ విషయానికొస్తే.. నజ్ముల్ హసన్ షాంటో కెప్టెన్గా కొనసాగనున్నాడు. దేశవాలీ టోర్నీల్లో విశేషంగా రాణిస్తున్న తౌహిద్ హృదోయ్ టెస్ట్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. సీనియర్లు ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, మొమినుల్ హక్ జట్టులో చోటు నిలుపుకున్నారు. కొత్త పేసర్ రోబివుల్ హాక్కు అవకాశం లభించింది.ఆసీస్తో మూడు మ్యాచ్ టీ20 సిరీస్ జూన్ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగనుండగా.. జింబాబ్వేతో ఏకైక టెస్ట్ జూన్ 28 నుంచి హరారేలో జరుగనుంది.ఆస్ట్రేలియా సిరీస్కు బంగ్లా టీ20 జట్టు: లిటన్ కుమార్ దాస్ (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తంజిద్ హసన్, మహ్మద్ సైఫ్ హసన్, షమీమ్ హొస్సేన్, తౌహిద్ హృదోయ్ (వైస్ కెప్టెన్), నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, రిషద్ హొసేన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, అబ్దుల్ గఫార్ సక్లైన్.జింబాబ్వేతో ఏకైక టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, తాంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ కుమార్ దాస్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్, ఇబాడోత్ హొసేన్, హసన్ మహమూద్, తౌహిద్ హృదోయ్, అమిటే హసన్, రోబివుల్ హాక్. -
BCCI: అవును.. అతడు జట్టుకు దూరమయ్యాడు!
అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. వన్డే సిరీస్కు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత జట్టు ముల్లన్పూర్ నుంచి ధర్మశాలకు పయనమైంది. కెప్టెన్ శుబ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ.. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ విమానంలో బయల్దేరారు. జైస్వాల్కు చోటుఇక లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల అఫ్గన్తో వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్కు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ తెచ్చుకున్నాడు.రోహిత్ పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఫిట్నెస్ సాధించి జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఆ తర్వాత దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేశాయి. దీంతో దాదాపు రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కానీ పాండ్యా గాయం గురించి అధికారిక ప్రకటన రాలేదు.అతడు జట్టుకు దూరమయ్యాడు!ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయం గురించి తాజాగా స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘‘అవును.. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. గాయం వల్ల అతడు అందుబాటులో ఉండటం లేదు.అతడి స్థానంలో వేరే ఆటగాడిని తీసుకోవాలా? లేదంటే పద్నాలుగు మందితోనే జట్టును కొనసాగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు.నితీశ్ రెడ్డి ఉన్నాడుగాకాగా ఇప్పటికే హార్దిక్కు బ్యాకప్గా మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని అఫ్గన్తో వన్డేలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందుకే రీప్లేస్మెంట్ గురించి సెలక్టర్లు ఆలోచించడంలేదని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. అఫ్గన్తో ముల్లన్పూర్ వేదికగా టెస్టు మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి జూన్ 13, 17, 20 తేదీల్లో మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ధర్మశాల, లక్నో, చెన్నై ఇందుకు వేదికలు. చదవండి: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు -
బంగ్లా ప్లేయర్పై కన్నెర్ర చేసిన ఐసీసీ
బంగ్లాదేశ్ యువ పేసర్ నహిద్ రాణాపై ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) కఠిన చర్యలు తీసుకుంది. జూన్ 9న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో జోష్ ఇంగ్లిస్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించింది. రాణా తన తప్పును అంగీకరించడంతో జరిమానా పడలేదు. ఫార్మల్ హియరింగ్ కూడా అవసరం లేకుండా అతి తక్కువ శిక్షతో బయటపడ్డాడు. ఐసీసీ నియమావళి ప్రకారం, రాణా ఆర్టికల్ 2.5 ఉల్లంఘనకు పాల్పడ్డాడు.రాణా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదు. గతేడాది ఐర్లాండ్ పర్యటనలోనూ ఓ ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించి ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. అప్పట్లో రాణా మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత విధించారు.ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు 24 నెలల్లో 4 డీ మెరిట్ పాయింట్లు మూటగట్టుకుంటే సస్పెన్షన్కు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో నిషేధం పడే అవకాశం కూడా ఉంటుంది. రాణా ఇకనై జాగ్రత్తగా ఉండకపోతే నిషేధాన్ని ఎదుర్కోక తప్పదు.ఇంతకీ ఏం జరగిందంటే.. ఆ మ్యాచ్లో రాణా అద్భుతమైన బంతి వేసి ఇంగ్లిస్ను ఔట్ చేశాడు. ఆ వెంటనే శృతిమంచి సంబురాలు చేసుకున్నాడు. ఈ చర్యలు ఇంగ్లిస్ను ప్రేరేపించేలా ఉన్నాయని అంపైర్లు భావించారు. దీంతో రాణాపై డిసిప్లినరి చర్యలు తీసుకున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. రాణా ఆ వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఫలితంగా తన జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించలేకపోయింది. డక్త్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లోని రెండో వన్డే ఇవాళ జరుగుతుంది. -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ పేర్ల ప్రకటన
2026 మే నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీస్ పేర్లను ఐసీసీ ఇవాళ (జూన్ 11) ప్రకటించింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్ ఆటగాళ్ల హవా కనిపించింది. గత నెలలో ఆ జట్టు పాకిస్తాన్పై టెస్ట్ సిరీస్ విజయం (2-0తో క్లీన్ స్వీప్) సాధించిన విషయం తెలిసిందే.ఈ సిరీస్లో విశేషంగా రాణించిన వికెట్కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం, స్పిన్ బౌలర్ తైజుల్ ఇస్లాం ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్గా ఎంపికయ్యారు. మరో నామినీగా నేపాల్ ఆల్రౌండర్ దీపేంద్ర సింగ్ ఎయిరీ ఎంపికయ్యాడు. దీపేంద్ర గత నెలలో ఆడిన వన్డేల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెలరేగాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.ముష్ఫికర్ రహీంఈ వెటరన్ బ్యాటర్ మే నెలలో అసాధారణంగా రాణించాడు. పాక్పై రెండు టెస్టుల్లో 253 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 137 పరుగుల భారీ ఇన్నింగ్స్తో మ్యాచ్ను పూర్తిగా బంగ్లాదేశ్ వైపు తిప్పేశాడు.తైజుల్ ఇస్లాంబంగ్లాదేశ్ ప్రధాన స్పిన్నర్ అయిన తైజుల్ పాక్తో జరిగిన సిరీస్లో 13 వికెట్లతో సిరీస్ టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ స్పెల్ (6/120) ఇందులో హైలైట్గా నిలిచింది.దీపేంద్ర సింగ్ ఎయిరీఎయిరీ గత నెలలో జరిగిన వన్డేల్లో ఓ సెంచరీ (యూఏఈపై), రెండు హాఫ్ సెంచరీలు (యూఎస్ఏపై) సహా 8 వికెట్లు తీశాడు. అతడి ఆల్రౌండ్ ప్రదర్శనల వల్ల నేపాల్ కీలక విజయాలు సాధించింది.మహిళల విషయానికొస్తే.. ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్, పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ గుల్ ఫెరోజా, న్యూజిలాండ్ బ్యాటర్ మ్యాడీ గ్రీన్ మే నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. -
భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు
శ్రీలంక పర్యటనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అండర్-19 జట్టును ప్రకటించింది. యశ్వర్దన్ సింగ్ చౌహాన్ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది. కాగా ఈ పర్యటనలో భాగంగా భారత అండర్-19 జట్టు ఆతిథ్య లంకతో వన్డే, ఫోర్-డే మ్యాచ్లు ఆడనుంది.ఇక ఈ జట్టులో టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid)కు కూడా చోటు దక్కింది. వన్డే జట్టులోని ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా పదహారేళ్ల అన్వయ్కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.కొత్త జట్టుబీసీసీఐ జూనియర్ క్రికెట్ కమిటీ పంథా మార్చింది. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఒక్క ఆటగాడిని కూడా తాజా టూర్కు ఎంపిక చేయలేదు. ఈ పర్యటనతో యశ్వర్దన్ సారథ్యంలో కొత్త జట్టును తీర్చిదిద్దే దిశగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ జట్టులో ఆల్రౌండర్లకే సెలక్టర్లు పెద్దపీట వేశారు.మరోసారి అన్వయ్కు చోటుగతేడాది నవంబరులో చివరగా అన్వయ్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో ఆడిన భారత్- ‘బి’ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.బెంగళూరు వేదికగా ఈ సిరీస్లో ఏకైక మ్యాచ్ ఆడిన అన్వయ్.. అఫ్గన్ బౌలర్ నజీఫుల్లా అమిరి బౌలింగ్లో తొలి బంతికే అవుటై వెనుదిరిగాడు. అయితే, దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు సెలక్టర్లు తాజాగా మరోసారి అవకాశం ఇచ్చారు.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్ అండర్-19 వన్డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్ కెప్టెన్), యశ్వర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), వినీత్ వీకే, అర్జున్ రాజ్పుత్, కుషాగ్రా ఓజా, రజత్ బఘెల్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), అన్మోల్జీత్ సింగ్, వూట్కూరి యశ్వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, శవిన్ వి, కావ్యా పరేశ్ పటేల్, మోహిత్ ఉల్వా. ఇషాన్ సూద్.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్ అండర్-19 మల్టీ-డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్ కెప్టెన్), యశ్వర్దన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), పటేల్ కుష్, మనల్ చౌహాన్, కుషాగ్రా ఓజా, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), ఆర్యన్ సందేశ్ సక్పాల్ (వికెట్ కీపర్), హేమ్చుదేశన్ జె, బికె కిషోర్, రోహిత్ అనిల్ యాదవ్, కావ్య పరేష్ సింగ్ పటేల్, ప్రియాన్షు సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట.భారత్ అండర్-19 వర్సెస్ శ్రీలంక అండర్-19 షెడ్యూల్ (మూడు వన్డేలు, రెండు యూత్ టెస్టులు)👉హంబన్టోటా వేదికగా మూడు వన్డేలు👉జూలై 4, జూలై 6, జూలై 9 తేదీల్లో వన్డేల నిర్వహణ👉గాలే వేదికగా జూలై 13-16 మధ్య మొదటి యూత్ టెస్టు👉కొలంబో వేదికగా జూలై 20-23 మధ్య రెండో యూత్ టెస్టు.చదవండి: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు -
ఐదేళ్ల తర్వాత హఠాత్తుగా తుది జట్టులో ప్రత్యక్షం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో ఇవాళ (జూన్ 11) జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టులో ఓ ఆశ్చర్యం చోటు చేసుకుంది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్ ముందుగా ప్రకటించిన జట్టులో లేకపోయినా, అనూహ్యంగా తుది జట్టులో ప్రత్యక్షమయ్యాడు. మరో ఆశ్చర్యం ఏంటంటే, మెరిడిత్ దాదాపుగా ఐదేళ్లుగా వన్డే జట్టులో లేడు. అలాంటి ఆటగాడు హఠాత్తుగా తుది జట్టులో ప్రత్యక్షం కావడం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.ముందుగా జట్టులో లేని మెరిడిత్ను తుది జట్టులో తీసుకోవడం ఆసీస్ వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. తొలి వన్డేలో భారీ ఓటమి తర్వాత సిరీస్ను కాపాడుకోవాలన్న ఒత్తిడిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెరిడిత్ చివరిగా 2021 జులైలో వెస్టిండీస్పై ఓ వన్డే ఆడాడు. ఇదే అతని కెరీర్లో చివరిది, మొదటది. ఆ మ్యాచ్లో 5 ఓవర్లు వేసిన మెరిడిత్ 36 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత అతను వన్డేల్లో అవకాశాలు రాక, టీ20 ఫార్మాట్కు మాత్రమే పరిమితం అయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్ బ్యాటింగ్ కష్టాలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో ఆ జట్టు మరింత దారుణంగా ఖాతా తెరవకుండానే ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది. ఆ దేశ వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. గత మూడు వన్డేల్లోనూ ఆ జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. తాజా ఉదంతంలో ఓపెనర్లు షార్ట్, కన్నోల్లీ, నాలుగో నంబర్ ఆటగాడు రెన్షా డకౌట్లయ్యారు.లబూషేన్ (55 నాటౌట్), బార్ట్లెట్ (52) బాధ్యతాయుతంగా ఆడటంతో ఆసీస్ అతికష్టం మీద 42 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ దశలో వరుణుడు అంతరాయం కలిగించాడు. ప్రస్తుతానికి మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఆసీస్ ఇన్నింగ్స్లో లబూషేన్, బార్ట్లెట్తో పాటు కెప్టెన్ ఇంగ్లిస్ (34), గ్రీన్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మరో బ్యాటర్ (జంపా) కూడా డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (7-2-27-3), తస్కిన్ అహ్మద్ (8-1-33-3) చెలరేగి బౌలింగ్ చేశారు. ఆసీస్ ఈ మ్యాచ్ కూడా కోల్పోతే, వరుసగా రెండో సిరీస్ను చేజార్చుకున్నట్లవుతుంది. ఈ సిరీస్కు ముందు పాక్ చేతిలోనూ ఆసీస్ 1-2 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆసీస్ నుంచి ఇలాంటి చెత్త ప్రదర్శనలు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. -
IND vs AFG ODI: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో భారత్-‘ఎ’ జట్టు సత్తా చాటింది. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఈసారి సత్తా చాటగా.. రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ తిలక్ వర్మ మరోసారి రాణించారు. ఫలితంగా నిర్ణీత 49 ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 349 పరుగులు సాధించింది.తొలి మ్యాచ్ శ్రీలంకతోశ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ మంగళవారం మొదలైంది. తొలి మ్యాచ్లో భారత్- శ్రీలంక తలపడగా.. తిలక్ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.లంకతో మ్యాచ్లో ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్సిమ్రన్ సింగ్ (2) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ (101) శతకంతో రాణించాడు. తిలక్ వర్మ 60 పరుగులతో రాణించాడు. ఇక తొలి మ్యాచ్లో గట్టెక్కిన భారత్.. రెండో మ్యాచ్లో భాగంగా గురువారం అఫ్గన్పై భారీ స్కోరు సాధించింది.అఫ్గన్పై చెలరేగిన ఓపెనర్లు దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (69 బంతుల్లో 84), వైభవ్ సూర్యవంశీ (22 బంతుల్లోనే 44) శుభారంభం అందించారు. ప్రభ్సిమ్రన్ ఆచితూచి ఆడగా.. వైభవ్ ధనాధన్ దంచికొట్టాడు.రుతు, తిలక్ మరోసారి..వన్డౌన్లో వచ్చిన ప్రియాన్ష్ ఆర్య (8) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 80 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 రన్స్ రాబట్టాడు. మిగిలిన వారిలో ఆయుశ్ బదోని డకౌట్ కాగా.. సూయాన్ష్ షెడ్గే (40) రాణించాడు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షద్ ఖాన్ (1), విప్రాజ్ నిగమ్ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. 49 ఓవర్లు ఎందుకంటే?వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. అఫ్గన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అఫ్గన్ లక్ష్యం 294వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం అఫ్గనిస్తాన్ టార్గెట్ను 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు.చదవండి: ఆసీస్ జట్టులో నిఖిల్ చౌదరి -
అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా.. కానీ!
టీమిండియా వన్డేల్లో తమ ఆధిపత్యం కొనసాగించింది. ఐసీసీ పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే, రేటింగ్ పాయింట్లలో మాత్రం తరుగుదల నమోదు చేసింది. ఇక న్యూజిలాండ్ రెండో స్థానాన్ని పదిలం చేసుకోవడంతో పాటురేటింగ్ పాయింట్లు కూడా మెరుగుపరచుకుంది.పాకిస్తాన్ను వెనక్కినెట్టి మరోవైపు.. వన్డే వరల్డ్కప్ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ రేటింగ్ పాయింట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఇక.. సౌతాఫ్రికా పాకిస్తాన్ను వెనక్కినెట్టి నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. కాగా స్వదేశంలో చివరగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడింది టీమిండియా. మూడు మ్యాచ్లలో రెండింట ఓడి కివీస్కు సిరీస్ను సమర్పించుకుంది. ఈ క్రమంలోనే భారత జట్టు ఒక రేటింగ్ పాయింట్ (119 నుంచి 118కి) కోల్పోయింది.అదే సమయంలో భారత గడ్డపై సత్తా చాటిన న్యూజిలాండ్ రెండు రేటింగ్ పాయింట్లు పొందింది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2027 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్ ప్రస్తుతం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు సిద్ధమైంది.అయితే, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటం ప్రతికూలాంశంగా మారింది. కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. అయితే, హార్దిక్ పాండ్యా రీప్లేస్మెంట్ను మాత్రం ఇంకా ప్రకటించలేదు.ఐసీసీ పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్లో టాప్-10లో ఉన్న జట్లు1.ఇండియా- 118 రేటింగ్ పాయింట్లు2. న్యూజిలాండ్- 113 రేటింగ్ పాయింట్లు3. ఆస్ట్రేలియా- 103 రేటింగ్ పాయింట్లు4. సౌతాఫ్రికా- 102 రేటింగ్ పాయింట్లు5. పాకిస్తాన్- 100 రేటింగ్ పాయింట్లు6. శ్రీలంక- 96 రేటింగ్ పాయింట్లు7. అఫ్గనిస్తాన్- 93 రేటింగ్ పాయింట్లు8. ఇంగ్లండ్- 89 రేటింగ్ పాయింట్లు9. బంగ్లాదేశ్- 86 రేటింగ్ పాయింట్లు10. వెస్టిండీస్- 73 రేటింగ్ పాయింట్లు. -
ఎందుకు అలా చేశావు.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్!
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత తొలిసారి బ్యాట్ ఝుళిపించాడు. ముక్కోణపు వన్డే సిరీస్లో దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరుగుతున్న మ్యాచ్లో భారత్-ఎ తరపున వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకపై విఫలమైనప్పటికి అఫ్గాన్పై మాత్రం అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు.15 ఏళ్ల సూర్యవంశీ తనదైన శైలిలో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు ఒక్క సిక్స్ కూడా కొట్టకుండానే 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. అతడు దూకుడు చూసి సెంచరీ బాదడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్గా వైభవ్ మలుచుకోలేకపోయాడు.చెత్త షాట్ ఆడి..కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికి. తనకు ఉన్న ఏకైక వీక్నెస్ ఈ మ్యాచ్లోనూ బయటపడింది. 'షార్ట్ ఆఫ్ ఎ లెంగ్త్' బంతికి మరోసారి తన వికెట్ను కోల్పోయాడు. ఆఫ్ఘన్ బౌలర్ అబ్దుల్లా అహ్మద్జాయ్ టీమిండియా ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన అబ్దుల్లా అహ్మద్జాయ్.. తొలి బంతిని ఆఫ్ స్టంప్కు వెలుపలగా షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని అతడు రాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.కానీ ఎక్స్ట్రా బౌన్స్ కారణంగా బంతి అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. అసలు ఆ బంతికి ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. కానీ అనవసరంగా లేని షాట్ను ఆడి తన హాఫ్ సెంచరీని కోల్పోయాడు. ఐపీఎల్-2026లోనూ చాలా మ్యాచ్లలో షార్ట్ లెంగ్త్ బంతికే వైభవ్ ఔటయ్యాడు. అతడి బలహీనతను పసిగట్టిన అఫ్గాన్ పేసర్.. ఒకే లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేసి బోల్తా కొట్టించాడు. -
ఆస్ట్రేలియాకు ఘోర అవమానం.. 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే
బంగ్లాదేశ్తో తొలి వన్డేలో ఘోర ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియాలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఢాకా వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు తేలిపోయారు. బంగ్లా పేస్ బౌలర్ల ధాటికి కంగారులు కంగారెత్తిపోతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.టాస్కిన్ అహ్మద్ వేసిన మొదటి ఓవర్లో నాలుగో బంతికి మాథ్యూ షార్ట్ ఖాతా తెరవకుండానే క్లీన్ బౌల్డయ్యాడు. అంతకుముందు తొలి వన్డేలో కూడా ఇదే తరహాలో షార్ట్ అవుటయ్యాడు. ఆ తర్వాత రెండో ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ పర్యాటక జట్టను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి బంతికి కూపర్ కొన్నోలీ(0).. ఆఖరి బంతికి రెన్షా(0) వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. దీంతో ఆస్ట్రేలియా తమ స్కోర్ బోర్డు ఖాతా తెరవకుండానే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తద్వారా ఆసీస్ ఓ చెత్త రికార్డును మూట కట్టుకుంది. ఆస్ట్రేలియా తమ 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒక్క పరుగు కూడా బోర్డుపై లేకుండా 3 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.అంతేకాకుండా ఈ ఘోరమైన రికార్డు నమోదు చేసిన తొలి ఆసియా యేతర జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇంతకుముందు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్, సౌతాఫ్రికాపై ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. తాజాగా కంగారులు కూడా ఈ జాబితాలో చేరారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 23 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. కెప్టెన్ జోష్ ఇంగ్లిష్(34), గ్రీన్(25) కాసేపు బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. కానీ ఇంగ్లిష్ ఔటయ్యాకు ఆసీస్ వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. కాగా బంగ్లా పర్యటనకు ముందు పాకిస్తాన్తో వన్డే సిరీస్ను కూడా 2-1 తేడాతో ఆస్ట్రేలియా కోల్పోయింది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, కమ్మిన్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.చదవండి: Vaibhav suryavanshi: మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం -
AUS vs BAN: ఆసీస్ గడ్డపై ‘మనోడి’ చరిత్ర
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథ్యంలో సిరీస్లో పాల్గొనే పదిహేడు మంది సభ్యుల పేర్లను తాజాగా వెల్లడించింది. ఈ జట్టులో భారత్కు చెందిన నిఖిల్ చౌదరికి సెలక్టర్లు చోటివ్వడం విశేషం.మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు ఆసీస్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా.. జూన్ 17, 19, 21 తేదీల్లో మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికఈ నేపథ్యంలో సీఏ తాజాగా బంగ్లాతో సిరీస్కు టీ20 జట్టును ప్రకటించింది. బిగ్బాష్ లీగ్లో రాణించిన ఆటగాళ్లకు సెలక్టర్లు ఈ జట్టులో చోటిచ్చారు. హోబర్ట్ హారికేన్స్ తరఫున సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న నిఖిల్ చౌదరి (Nikhil Chaudhary)కి తొలిసారి జాతీయ జట్టులో అవకాశం దక్కింది.ఆల్రౌండ్ నైపుణ్యాలున్న 30 ఏళ్ల నిఖిల్ చౌదరి బంగ్లాదేశ్తో సిరీస్తో గనుక అరంగేట్రం చేస్తే.. 62 ఏళ్ల తర్వాత ఆసీస్కు ఆడిన జన్మతః భారతీయుడైన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. కలకత్తా వేదికగా 1964లో రెక్స్ సెల్లార్స్ అనే భారతీయుడు ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగాడు. గుజరాత్లో జన్మించిన రెక్స్ లెగ్ స్పిన్నర్. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు నిఖిల్కు అవకాశం వచ్చింది.ఎవరీ నిఖిల్ చౌదరి?ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి దేశవాళీ క్రికెట్లో పంజాబ్కు ప్రాతినిథ్యం వహించాడు. భారత టెస్టు, వన్డే జట్ల ప్రస్తుత కెప్టెన్ శుబ్మన్ గిల్ సహా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్తో కలిసి పంజాబ్ జట్టుకు ఆడాడు.అదే విధంగా టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్లతో కలిసి పంజాబ్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అతడికి ఆశించినంతగా అవకాశాలు రాలేదు. ఇక 2020లో క్వీన్స్లాండ్లో ఉన్న తన అంకుల్ను చూసేందుకు నిఖిల్ చౌదరి ఆస్ట్రేలియాకు వెళ్లాడు.అయితే, కోవిడ్ కారణంగా ప్రయాణాలపై నిషేధం విధించడంతో నిఖిల్ అక్కడే చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోనే ఉండాలని నిర్ణయించుకున్న అతడు.. శాశ్వత నివాస హోదా పొందాడు. గత మూడేళ్లుగా బిగ్బాష్ లీగ్లో సత్తా చాటుతున్న నిఖిల్.. 2024-25లో హోబర్ట్ హారికేన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.అలా దేశీ క్రికెట్లో అవకాశంలెగ్స్పిన్నింగ్ ఆల్రౌండర్ నిఖిల్కు ఊహించని రీతిలో ఆసీస్ దేశీ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం లభించింది. స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ జాతీయ జట్టు విధుల్లోకి వెళ్లగా అతడి స్థానంలో టాస్మేనియా నిఖిల్ను పిలిపించింది.ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్లో టాస్మేనియాకు ఆడుతూ.. న్యూ సౌత్ వేల్స్తో మ్యాచ్లో శతకం (184 బంతుల్లో 163) సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఆసీస్ దేశవాళీ రెడ్బాల్ టోర్నీలో శతక్కొట్టిన భారత మూలాలున్న తొలి క్రికెటర్గా నిలిచాడు.ఏదేమైనా భారత్లో అవకాశాలు లేక ఆసీస్కు వెళ్లిన నిఖిల్ చౌదరి.. ఇప్పుడిలా అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ ఏకంగా ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికకావడం నిజంగా విశేషమే.బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్(కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, నిఖిల్ చౌదరి, కూపర్ కానొలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రైలీ మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, ఆడమ్ జంపా.చదవండి: వైభవ్ మారలేదు.. శ్రీలంకలో మెరుపులు -
భారత జట్టు ప్రకటన.. 16 ఏళ్ల యువ సంచలనానికి ఛాన్స్
స్వదేశంలో శ్రీలంక అండర్-19తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత అండర్-19 మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. గతేడాది కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ను గెలిచిన జట్టులో సభ్యురాలి ఉన్న భవిక అహిరేను కెప్టెన్గా సెలక్టర్లు ఎంపిక చేశారు. వన్డే, టీ20 సిరీస్ రెండింటిలోనూ భారత జట్టును ఆమె ముందుండి నడిపించనుంది. అదేవిధంగా భవికకు డిప్యూటీగా మహక్ నర్వాసే వ్యహరించనుంది. ఇక శ్రీలంకతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో యువ సంచలనం దీయా యాదవ్కు చోటు దక్కింది. కానీ ఆమెను టీ20లకు మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో 16 ఏళ్ల దీయాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమెకు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు భారత జెర్సీలో సత్తాచాటేందుకు దియా సిద్దమైంది. కాగా ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక అండర్-19 టీమ్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. చెన్నై, పుదుచ్చేరి వేదికలుగా మ్యాచ్లు జరగనున్నాయి.టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్టీ20 సిరీస్ (చెన్నై): జూన్ 22, జూన్ 24, జూన్ 27 (మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభం)వన్డే సిరీస్ (పుదుచ్చేరి): జూన్ 30, జూలై 3 (ఉదయం 9:00 గంటలకు), జూలై 6 (మధ్యాహ్నం 2:00 గంటలకు)భారత అండర్-19 టీ20 జట్టు:భవిక అహిరే (కెప్టెన్/వికెట్ కీపర్), ఇరా జాదవ్, తనిష్క శర్మ, ఈశ్వరి అవసరే, అవ్ని చౌదరి, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పాలక్, మహక్ నర్వాసే (వైస్ కెప్టెన్), కాశ్వి కందికుప్ప, మణియార్ మైత్రి, గౌరీ గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె. దీక్ష (వికెట్ కీపర్).భారత అండర్-19 వన్డే జట్టు:భవిక అహిరే (కెప్టెన్/వికెట్ కీపర్), ఇరా జాదవ్, దీయా యాదవ్, ఈశ్వరి అవసరే, వి.ప్రతీక్ష, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పాలక్, మహక్ నర్వాసే (వైస్ కెప్టెన్), కాశ్వి కందికుప్ప, విధి పర్మార్, గౌరీ గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె. దీక్ష (వికెట్ కీపర్). -
మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరుగుతున్న మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. శ్రీలంక-ఎతో జరిగిన తొలి మ్యాచ్లో విఫలమై వైభవ్.. రెండో మ్యాచ్లో తనదైన శైలిలో వీరవిహారం చేశాడు. భారత్-ఎ తరపున బరిలోకి సూర్యవంశీ.. అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ చిచ్చర పిడుగు ఇన్నింగ్స్ రెండో బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ మహమ్మద్ ఇబ్రహీంను వైభవ్ టార్గెట్ చేశాడు. పవర్ప్లేలో అతడు వేసిన మూడు ఓవర్లలోనూ పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్ కేవలం 22 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు.15 ఏళ్ల వైభవ్ ర్యాంప్ షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. కాగా ఈ యువ సంచలనం ఇటీవల ఇర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఅఫ్గానిస్తాన్A: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్),హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనివాల్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, బహిర్ షా, ఇషాక్ రహీమి(వికెట్ కీపర్), ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, ఫర్మానుల్లా సఫీఇండియా A: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్కీపర్), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్చదవండి: MPL 2026: సన్రైజర్స్ ఆల్రౌండర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనేIt's Vaibhav Suryavanshi show against Afghanistan 👏Vaibhav Sooryavanshi smashed 44 runs in just 22 balls vs Afghanistan A which included 9 fours at an strike rate of 200 💥This 15 year old kid is just phenomenal and nightmare for the bowlers 🫡pic.twitter.com/wrRLpUezgS— Ajay Jadeja (@AjayJadeja171) June 11, 2026 -
అఫ్గానిస్తాన్తో మ్యాచ్.. బ్యాటింగ్ భారత్దే
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంకపై సంచలన విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్లో కూడా అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది.మెన్ ఇన్ బ్లూ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.కాగా అందరి కళ్లు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. తొలి మ్యాచ్లో విఫలమైన వైభవ్.. ఇప్పుడు అఫ్గాన్పై ఎలా రాణిస్తాడా? అని ఎదురుచూస్తున్నారు.తుది జట్లుఅఫ్గానిస్తాన్A: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్),హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనివాల్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, బహిర్ షా, ఇషాక్ రహీమి(వికెట్ కీపర్), ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, ఫర్మానుల్లా సఫీఇండియా A: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్కీపర్), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్ -
సన్రైజర్స్ ఆల్రౌండర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే
మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ శివాంగ్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో బుందేల్ఖండ్ బుల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న శివాంగ్.. బుధవారం మాల్వా స్టాలియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన మాల్వా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అన్ష్ యాదవ్ (44 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు సక్షమ్ పురోహిత్(40), అఖిల్(33) రాణించారు. బుందేల్ఖండ్ బౌలర్లలో అనంత్ దూబే, శివాంగ్ కుమార్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.శివాలెత్తిన శివాంగ్అనంతరం 216 పరుగుల భారీ లక్ష్య చేధనలో శివాంగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన శివాంగ్.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 17 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్లతో 65 పరుగులు చేశాడు. అతడితో పాటు విక్రాంత్(43), అమన్ జైన్(17) రాణించారు.ఫలితంగా బుందేల్ఖండ్ లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. మాల్వా బౌలర్లలో పార్థ్ సహాని, ప్రశాంత్, పవన్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున శివాంగ్ 9 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. -
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్?
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చేరాడు. పాండ్యా ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో తన ఫిట్నెస్ టెస్ట్ను క్లియర్ చేశాడు. దీంతో అఫ్గాన్తో వన్డే సిరీస్లో పాల్గోనేందుకు బీసీసీఐ వైద్య బృందం అనుమతి ఇచ్చింది.అయితే క్లియరన్స్ లభించిన కొన్ని గంటల్లోనే హార్దిక్ మళ్లీ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో పాండ్యాకు పక్కటెముకల గాయమైంది. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడు కోలుకోవడానికి కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. జూలైలో ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు కూడా ఈ బరోడా ఆల్రౌండర్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది.టీమిండియాలోకి అర్షద్?ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేయగల పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు వేటను మొదలు పెట్టారు. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ అర్షద్ ఖాన్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అర్షద్ ప్రస్తుతం ఇండియా-ఎ జట్టుతో పాటు శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. ముక్కోణపు సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్లో అర్షద్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. 48వ ఓవర్ వేసిన అర్షద్ ఊహకందని అద్భుతం చేశాడు. ఆ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి భారత్కు సంచలన విజయాన్ని అందించాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ పవర్ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా బాగా రాణించగలడు. కేవలం బౌలర్గానే కాకుండా లోయర్ ఆర్డర్లో భారీ సిక్సర్లు బాదగల సత్తా అతడిది. గత ఐపీఎల్ సీజన్లలోనూ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో అర్షద్ బ్యాట్తో మెరుపు మెరిపించాడు. అర్షద్ ఇప్పటివరకు 9 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. అయితే పాండ్యా స్ధానంలో సెలక్టర్లు అర్షద్కు అవకాశమిస్తారో లేదో చూడాలి మరి. జూన్ 13 నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: IND vs AFG: టీమిండియాతో వన్డే సిరీస్.. అప్గాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం -
భారత్తో వన్డే సిరీస్.. అప్గాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
భారత్తో మూడు వన్డేల సిరీస్కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్లో 6 వికెట్లు పడగొట్టిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సలీమ్ సఫీకి ఇప్పుడు వన్డే జట్టులో కూడా చోటు కల్పించారు. ఈ ఏకైక టెస్ట్లో అఫ్గాన్ ఓడిపోయినప్పటికి, సఫీ మాత్రం తన అద్భుత బౌలింగ్తో అందరిని ఆకట్టుకున్నాడు. ముల్లాన్పూర్లో తీవ్రమైన వేడిని తట్టుకుని మరి సఫీ ఏకంగా 27 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ స్పీడ్స్టర్ భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లయిన యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిని వన్డే జట్టులో చేర్చారు.2023లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 23 ఏళ్ల మహ్మద్ సలీమ్ సఫీ.. ఇప్పటివరకు అఫ్గానిస్తాన్ తరపున కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ అతడికి అఫ్గాన్ వన్డే జట్టులో చోటు దక్కింది.నబీ, రషీద్ దూరం!కాగా మొహాలీలో బుధవారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్కు సీనియర్ ఆల్రౌండర్, మాజీ కెప్టెన్ రషీద్ ఖాన్ దూరమయ్యాడు. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు ముందు రషీద్ నేరుగా జట్టుతో కలవనున్నాడు. 41 ఏళ్ల మహ్మద్ నబీ మాత్రం 'అనారోగ్యం' కారణంగా ఈ ప్రాక్టీస్ సెషన్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కాగా ఈ వన్డే సిరీస్కు ముందు భారత్కు గట్టి ఎదురు దెబ్బతగిలింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. అదేవిధంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఈ సిరీస్కు అందుబాటులో లేడు.వన్డే సిరీస్ షెడ్యూల్మొదటి వన్డే- జూన్ 13- ధర్మశాలరెండో వన్డే-జూన్ 17-లక్నోమూడో వన్డే-జూన్ 20-చెన్నైవన్డే సిరీస్కు జట్లు భారత్శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ,యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, , ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబె, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, గుర్నూర్ బ్రార్అఫ్గానిస్తాన్హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, రహ్మత్ షా, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతై, రహ్మత్ ఝాన్ఫార్, ఘాజాయ్ మాలిక్, బిలాల్ సామి, సలీమ్ సఫీచదవండి: IND vs ENG: 'అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ' -
ఆస్ట్రేలియాకు ఘోర అవమానం
ఆరు సార్లు విశ్వవిజేత, ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ కూడా అయిన ఆస్ట్రేలియా వన్డే జట్టుకు ఘోర అవమానం జరిగింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న (జూన్ 9) జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయంపాలైన ఆ జట్టు.. మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో వరుసగా మూడో ఇన్నింగ్స్లోనూ ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ ఖాతా తెరవకుండానే కుప్పకూలింది.ఇటీవల పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లోనూ ఆస్ట్రేలియా ఓపెనర్లు రెండుసార్లు (చివరి రెండు వన్డేలు) ఒక్క పరుగు కూడా జోడించలేకపోయారు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ అదే పరిస్థితి పునరావృతం కావడంతో, వన్డే చరిత్రలో వరుసగా మూడు ఇన్నింగ్స్ల్లో ఓపెనింగ్ వికెట్కు ఖాతా తెరవని జట్ల జాబితాలో ఆస్ట్రేలియా చేరింది.ఈ అవాంఛనీయ జాబితాలో ఇప్పటికే న్యూజిలాండ్ (2015) ఉండగా, తాజాగా ఆస్ట్రేలియా వారి సరసన నిలిచింది. అయితే అత్యంత చెత్త రికార్డు మాత్రం పసికూన పపువా న్యూ గినియా పేరిట ఉంది. 2022లో పపువా న్యూ గినియా వరుసగా నాలుగు వన్డే ఇన్నింగ్స్ల్లో ఓపెనింగ్ వికెట్కు ఒక్క పరుగు కూడా నమోదు చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్వర్త్ లూయిస్) సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కుదేలైపోయారు.బ్యాటింగ్లో సత్తా చాటిన మొసద్దెక్ (10-1-37-2) బౌలింగ్లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు.36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్లో జరిగిన మ్యాచ్లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్కు షాకిచ్చింది. -
నైట్క్లబ్ వివాదం.. స్టోక్స్పై వేటు
నైట్క్లబ్ వివాదంలో చిక్కుకున్న ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్పై అందరూ ఊహించిన విధంగానే వేటు పడింది. న్యూజిలాండ్తో రెండో టెస్ట్కు అతడితో పాటు నైట్క్లబ్ వివాదంలో మరో నిందితుడు గస్ అట్కిన్సన్ను కూడా జట్టు నుంచి తప్పించారు. జట్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది.లార్డ్స్ టెస్ట్లో విజయానంతరం స్టోక్స్, అట్కిన్సన్లు లండన్లోని ఓ నైట్క్లబ్కు వెళ్లారు. వీరిద్దరు జట్టుకు విధించిన అర్ధరాత్రి కర్ఫ్యూను ఉల్లంఘించి అక్కడ ఉండగా, ఓ రగ్బీ ఆటగాడితో ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ECB విచారణ చేపట్టిన తర్వాత ఇద్దరినీ రెండో టెస్ట్కు ఎంపిక చేయలేదు.దీంతో 2022లో స్టోక్స్కు కెప్టెన్సీ అప్పగించిన మాజీ సారథి జో రూట్ మళ్లీ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన రూట్వైపే ECB మొగ్గుచూపింది.స్టోక్స్ స్థానంలో జోర్డన్ కాక్స్, అట్కిన్సన్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ జట్టులోకి వచ్చారు. ఐపీఎల్ తర్వాత ఆర్చర్ తిరిగి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.కాగా, నైట్ఫైట్ తర్వాత స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అతడు ఇప్పటికే వన్డే, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి టెస్ట్ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తాజా ఉదంతం తర్వాత స్టోక్స్ క్రికెట్ కెరీర్ మొత్తానికే గుడ్బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో గెలుపొంది, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లో రెండో టెస్ట్ జూన్ 17 నుంచి కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా మొదలుకానుంది.న్యూజిలాండ్తో రెండో టెస్ట్కు ఇంగ్లండ్ జట్టు..రూట్ (C), డకెట్, గే, బేతెల్, బ్రూక్, స్మిత్ (WK), రూ, కాక్స్, రెహాన్, రాబిన్సన్, జోఫ్రా, టంగ్, ఫిషర్, బేకర్, బషీర్ -
ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ (జూన్ 10) జరిగిన తొలి మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది.భారత్ను గెలిపించేందుకు రిచా ఘోష్ (36 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. శ్రీచరణి తొలి బంతికి సింగిల్ తీసి రిచాకు స్ట్రయిక్ ఇచ్చింది. అప్పటికే జోష్లో ఉన్న రిచా.. రెండో బంతిని బౌండరీకి, మూడో బంతిని సిక్సర్కు తరలించి భారత్ను గెలుపు వాకిటి వరకు చేర్చింది.అయితే తొందరగా మ్యాచ్ను ముగిద్దామనే క్రమంలో నాలుగో బంతికి లిండ్సే స్మిత్ బౌలింగ్లో స్టంపౌటయ్యింది. అప్పటికీ భారత్కు గెలిచే అవకాశం ఉండింది. మిగిలిన రెండు బంతుల్లో ఆరు పరుగులు సాధిస్తే టీమిండియాదే గెలుపు. చేతిలో ఓ వికెట్ ఉండింది. అయితే ఐదో బంతికి రేణుకా సింగ్ కూడా ఔట్ కావడంతో భారత్ ఆలౌటై, మ్యాచ్ను చేజార్చుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ (64), కెప్టెన నాట్ సీవర్ బ్రంట్ (57) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో డేనియెలా గిబ్సన్ (30 నాటౌట్) బ్యాట్ను ఝులిపించింది. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, షఫాలీ, రేణుకా, శ్రీ చరణి, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.భారత ఇన్నింగ్స్ విషయానికొస్తే.. రిచా మినహా జట్టులో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేదు. షఫాలీ (13), యస్తికా (15), హర్మన్ (17), భారతి (18), రాధా యాదవ్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ 3, డీన్, కోల్మన్, గిబ్సన్ తలో 2, వాంగ్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, ఈ ప్రపంచకప్ రెగ్యులర్ మ్యాచ్లు జూర్ 12 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్-శ్రీలంక తలపడనున్నాయి. భారత్ జూన్ 14న జరిగే తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. -
అర్హతే లేదు.. అఫ్గనిస్తాన్పై సంచలన వ్యాఖ్యలు!
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు మదన్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు అసలు టెస్టు హోదా పొందే అర్హతే లేదన్నాడు. కనీస స్థాయి లేని జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఎందుకు అవకాశం ఇస్తుందో తనకు అర్థం కావడం లేదన్నాడు.ఐర్లాండ్తో పాటు టెస్టు హోదాకాగా 2001లో ఐసీసీ అఫిలియేట్ మెంబర్గా ఉన్న అఫ్గనిస్తాన్.. 2013లో అసోసియేట్ మెంబర్ స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుని 2017లో ఐర్లాండ్తో పాటు టెస్టు హోదా పొందింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో 2018లో తమ తొలి టెస్టు ఆడి ఘోర పరాజయం చవిచూసింది.తాజాగా ముల్లన్పూర్లో మరోసారి టీమిండియాతో టెస్టులో తలపడ్డ అఫ్గనిస్తాన్ జట్టు.. ఇన్నింగ్స్ మీద 300 పరుగుల అతి భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్రౌండర్ మదన్ లాల్ అఫ్గన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఎందుకు అనుమతిస్తున్నారు?‘‘అసలు అఫ్గనిస్తాన్ను టెస్టు క్రికెట్ ఆడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారు? వాళ్లకు టెస్టు జట్టు హోదా ఎలా ఇచ్చారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. అఫిలియేట్ దేశాలకు కూడా వన్డే, టీ20 ప్రదర్శనలు, రికార్డుల ఆధారంగా టెస్టు హోదా ఇస్తున్నారు.నిజానికి అఫ్గనిస్తాన్ టీ20లలో మాత్రమే మెరుగ్గా ఆడుతోంది. వన్డేల్లో కూడా వాళ్లు మరింత దృష్టి సారించాలి. ముఖ్యంగా 50 ఓవర్ల పాటు అవుట్ కాకుండా నిలబడే సత్తా ఉండాలి. అలాంటి వాళ్లు ఏకంగా టెస్టు బరిలో దిగుతున్నారు.అఫ్గనిస్తాన్లో అవి శూన్యంభారత్తో మ్యాచ్లో 152, 112 పరుగులు మాత్రమే స్కోరు చేయగలిగారు. గతంలో 109, 102 పరుగులకే కుప్పకూలారు. టెస్టు క్రికెట్ను ప్రమోట్ చేసేందుకు ఇలాంటి జట్లను అనుమతించడం తగునా? నిజానికి ఐదు రోజుల క్రికెట్ ఆడేందుకు పూర్తిస్థాయి వ్యవస్థ, సదుపాయాలు అవసరం. కానీ అఫ్గనిస్తాన్లో అవి శూన్యం. అఫ్గన్ ఆటగాళ్లు చెత్తగా ఆడుతున్నారని నేను అనను.అయితే, వాళ్లకు టెస్టులు ఆడేందుకు వీలైన పరిస్థితులు లేవు. వాళ్లు ఇంతవరకు ఐదు రోజుల క్రికెట్కు అలవాటు పడనే లేదు. వ్యవస్థ సరిగ్గా లేనపుడు వాళ్లు మాత్రం ఏం చేయగలరు?’’ అని మదన్ లాల్ న్యూస్18తో పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటికి పదమూడు టెస్టులు ఆడి.. నాలుగు మాత్రమే గెలిచింది. ఎనిమిదింట ఓడి.. రెండు డ్రా చేసుకుంది.చదవండి: గంభీర్ను పట్టించుకోని సీనియర్లు! -
T20 WC: జట్లు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
గతేడాది సొంతగడ్డపై భారత మహిళ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తొలిసారిగా ఐసీసీ వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో చాంపియన్గా అవతరించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.ఆ తర్వాత టీమిండియా అదే జోరు కొనసాగిస్తూ స్వదేశంలో పొట్టి క్రికెట్ ప్రపంచకప్ గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విజేతగా నిలిచింది. ఇప్పుడు మహిళల వంతు వచ్చేసింది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 టీ20 మహిళా ప్రపంచకప్-2026 మొదలుకానుంది.ఈ మెగా టోర్నీలో సత్తా చాటాలని హర్మన్ బృందం పట్టుదలగా ఉంది. పురుషుల మాదిరే ఈసారి తామూ ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక న్యూజిలాండ్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలో దిగనుండగా.. గతేడాది రన్నరప్ సౌతాఫ్రికా కూడా ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. ఇక భారత జట్టు 2024లో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. ఈసారి లోపాలు సరిచేసుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.ఇంతకీ ఈ టోర్నీలో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? సారథులు ఎవరు?.. వేదికలు, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ? తదితర వివరాలు తెలుసుకుందామా?!షెడ్యూల్👉రౌండ్- రాబిన్ ఫార్మాట్👉జూన్ 12న వరల్డ్కప్ టోర్నీ మొదలు (ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక)👉భారత్ వర్సెస్ పాకిస్తాన్- జూన్ 14👉సెమీ ఫైనల్-1: జూన్ 30👉సెమీ ఫైనల్-2: జూలై 2👉జూలై 5న ఫైనల్తో ముగింపు.వేదికలు👉గ్రూప్, సూపర్-8 దశ: ఓల్డ్ ట్రఫోర్డ్, మాంచెస్టర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్, హెడింగ్లీ, లీడ్స్, హాంప్షైర్ బౌల్, సౌతాంప్టన్, ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్.👉సెమీ ఫైనల్- ది ఓవల్, ఫైనల్- లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.జట్లుఆస్ట్రేలియాసోఫీ మోలినెక్స్ (కెప్టెన్), నికోలా క్యారీ, ఆష్లే గార్డనర్, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, ఫోబ్ లిచ్ఫీల్డ్, తాహ్లియా మెక్గ్రాత్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగన్ షట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.బంగ్లాదేశ్నిగర్ సుల్తానా జోటీ (కెప్టెన్), నహిదా అక్తర్ (వైస్ కెప్టెన్), షర్మిన్ అక్తర్ సుప్తా, శోభనా మోస్తరీ, షోర్నా అక్తర్, రీతు మోని, రబెయా ఖాన్, ఫాహిమా ఖాతున్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, మరుఫా అక్తర్, శంజిదా అక్తేర్ మఘ్లా, సుల్తానా ఖాతున్, దిలారా అక్తర్, జుయేరియా ఫిర్దోస్, తాజ్ నెహర్.ఇండియాహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందనీ శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్నెదర్లాండ్స్బాబెట్ డి లీడే (కెప్టెన్), కరోలిన్ డి లాంగే, ఫ్రెడెరిక్ ఓవర్డిజ్క్, హన్నా లాంధీర్, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్, ఇసాబెల్ వాన్ డెర్ వోనింగ్, లారా లీమ్హూయిస్, మైర్తే వాన్ డెన్ రాడ్, ఫెబ్ మోల్కెన్బోయర్, రోసాలీ లావెరెన్స్, రోసాయా లావెరెన్స్, రోసాయా లావెరెన్స్, స్టెరె కాలిస్పాకిస్తాన్ఫాతిమా సనా (కెప్టెన్), గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, ఇరామ్ జావేద్, ఇమాన్ ఫాతిమా, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, సైరా జబీన్, మునీబా అలీ, తుబా హసన్, రమీన్ షమీమ్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, డయానా బేగ్, తస్మియా రుబాబ్.సౌతాఫ్రికాలారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నెరీ డెర్క్సెన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయాబొంగా ఖాకా, సునే లూయస్, కరాబో మెసో, నోంకులులేకో మ్లాబా, కైలా రేనేకే, టుమీ సెఖుఖునేర్, చ్లోవాన్ నికెర్కెర్ఇంగ్లండ్నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), లారెన్ బెల్, ఆలిస్ క్యాప్సీ, టిల్లీ కోర్టీన్-కోల్మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, డాని గిబ్సన్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, హీథర్ నైట్, లిన్సీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వ్యాట్-హాడ్జ్.ఐర్లాండ్గాబీ లూయిస్ (కెప్టెన్), అవా కానింగ్, క్రిస్టినా కౌల్టర్ రైలీ, అలనా డాల్జెల్, జార్జినా డెంప్సీ, అమీ హంటర్, ఆర్లీన్ కెల్లీ, లూయిస్ లిటిల్, ఐమీ మాగ్వైర్, లారా మెక్బ్రైడ్, కారా ముర్రే, లియా పాల్, ఓర్లా ప్రెండర్గాస్ట్, రెబెక్కా స్టోకెల్, ఆలిస్ టెక్టర్న్యూజిలాండ్మెలీ కెర్ (కెప్టెన్), సూజీ బేట్స్, సోఫీ డివైన్, ఫ్లోరా డెవాన్షైర్, ఇజ్జీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, నెన్సీ పటేల్, జార్జియా ప్లిమ్మర్, ఇజ్జీ షార్ప్, లీ తహుహు.స్కాట్లాండ్కాథరిన్ బ్రైస్ (కెప్టెన్), క్లో అబెల్, ఒలివియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియనాజ్ ఛటర్జీ, గాబ్రియెల్లా ఫొంటెన్లా, కాథరిన్ ఫ్రేజర్, కిర్స్టీ గోర్డాన్, ఐల్సా లిస్టర్, మైసీ మాసీరా, అబ్తాహా మక్సూద్, మేగన్ మెక్కోల్, రేచల్ స్లేటర్, పిప్పా స్ప్రౌల్శ్రీలంకచమరి ఆటపట్టు (కెప్టెన్), హాసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, ఇమేషా దులాని, నీలక్షిక సిల్వా, కవీషా దిల్హరి, హన్సిమా కరుణరత్నే, కౌషిణి నుత్యాంగన, సుగందిక దాసనాయక, నిమాషా మదుషాని, కావ్య మదుషాని, కావ్య మదుషాని, మల్కి మదర, మిథాలి అయోధ్య, చేతన విముక్తి.వెస్టిండీస్హేలీ మాథ్యూస్ (కెప్టెన్), చినెల్లే హెన్రీ, డియాండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్, అఫీ ఫ్లెచర్, ఆలియా అలీన్, షెమైన్ క్యాంప్బెల్లే, అష్మిని మునిసార్, కరిష్మా రామ్హారక్, జన్నీలియా గ్లాస్గో, జహజారా క్లాక్స్టన్, కియానా జోసెఫ్, మాన్షా హేగ్రుక్, జైదా జేమ్స్, మాండీ మంగ్రూ, షానిష హెక్టార్.ప్రత్యక్ష ప్రసారం👉స్టార్ స్పోర్ట్స్ (టీవీ), జియోహాట్స్టార్ (డిజిటల్).మ్యాచ్ ఆరంభ సమయాలుభారత కాలమానం ప్రకారం: మధ్యాహ్నం మూడు గంటలు, రాత్రి ఏడు గంటలు, పదకొండు గంటలకు ఆరంభం.చదవండి: గంభీర్ను పట్టించుకోని సీనియర్లు! -
టీమిండియా షెడ్యూల్లో మరో విదేశీ పర్యటన
భారత టెస్ట్ జట్టు షెడ్యూల్లో మరో విదేశీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. 2017 తర్వాత టీమిండియా తొలిసారి శ్రీలంక గడ్డపై (టెస్ట్ సిరీస్ కోసం) అడుగుపెట్టనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్లో జరగనుంది.బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు శ్రీలంకలోని ప్రముఖ వేదిక అయిన గాలే అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించే అవకాశం ఉంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండగా, అది కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరగనున్నట్లు తెలుస్తోంది.భారత్ చివరిగా లంక గడ్డపై ఆడిన టెస్ట్ సిరీస్ను విరాట్ కోహ్లి నేతృత్వంలో 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత మళ్లీ భారత్ అక్కడ టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ టూర్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.టెస్ట్ సిరీస్తో పాటు లంక టూర్లో మూడు టీ20 మ్యాచ్లు కూడా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సిరీస్ నిర్వహణపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. టెస్ట్ సిరీస్ షెడ్యూల్పై కూడా అధికారిక ప్రకటన లేనప్పటికీ.. పైన అనుకున్న షెడ్యూల్ ఖరారైనట్లు బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి ప్రకటించారు. -
పాక్ కెప్టెన్పై వేటు.. హెడ్కోచ్పై వేళాడుతున్న కత్తి!
పాకిస్తాన్ టెస్టు కెప్టెన్సీ పదవి నుంచి షాన్ మసూద్ను తొలగించే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. షాన్ మసూద్తో పాటు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉన్నతాధికారులు వారాంతంలో సమావేశం కానున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ పర్యటనలో బంగ్లా చేతిలో పాకిస్తాన్ 0-2తో టెస్టు సిరీస్లో వైట్వాష్ కావడంతో షాన్ మసూద్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించిన సల్మాన్ అలీ అఘాకు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్లు వినిపించాయి. దీంతో షాన్ మసూద్, కోచ్ సర్ఫరాజ్ అహ్మద్లు రాబోయే ఇంగ్లండ్, వెస్టిండీస్ టూర్ వరకు కొనసాగుతారా లేక తొలగిస్తారా అనేది మీటింగ్లో తేలిపోనుంది. ఇదే విషయంపై పీసీబీ సెలెక్టర్ ఒకరు స్పందించారు. ‘పాకిస్తాన్ టెస్టు కెప్టెన్గా సల్మాన్ అలీని నియమించడానికి బోర్డు అధికారులు ఇప్పటికే అనుమతి ఇచ్చారని, త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నాం. ఇక సర్ఫరాజ్ అహ్మద్ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ హెడ్కోచ్ను కూడా మార్చే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. సర్ఫరాజ్ స్థానంలో మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ హెడ్కోచ్గా వచ్చే చాన్స్ ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సల్మాన్ అలీ అఘా పరిమిత ఓవర్ల కెప్టెన్గా కొనసాగుతున్నాడు. టెస్టు జట్టుకు కూడా అతడే నాయకత్వం వహించనుండడం లాంఛనం కానుంది. అయితే హెడ్కోచ్ పదవికి యూనిస్ఖాన్తో పాటు మరో మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం జరిగే మీటింగ్లో ఈ విషయాలపై పూర్తి స్పష్టత రానుంది.చదవండి: ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్మనీ ఎంతో తెలుసా? -
అఫ్గనిస్తాన్తో వన్డే.. వైభవ్ సూర్యవంశీ ఉంటాడు!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ‘ఎ’ జట్టు తరఫున తొలి మ్యాచ్లోనే విఫలమయ్యాడు. ముక్కోణపు సిరీస్లో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో మంగళవారం నాటి వన్డేలో ఓపెనర్గా బరిలోకి దిగాడు ఈ లెప్టాండర్ బ్యాటర్.వైభవ్ విఫలంఆరంభంలో బౌండరీలతో అలరించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. కాసేపటికే అవుటై ఉసూరుమనిపించాడు. మొత్తంగా 12 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో కేవలం 14 పరుగులు చేసి మహ్మద్ షిరాజ్ బౌలింగ్లో నిష్క్రమించాడు. ఇక మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2) విఫలమయ్యాడు.Bossing From Ball 1 😎Vaibhav Sooryavanshi - making a 𝙍𝙐𝙏𝙃𝙇𝙀𝙎𝙎 entry on the world stage. 💥 #SonySportsNetwork #SonyLIV #TalentTVCup #TeamIndia #SLvIND pic.twitter.com/tLBkRO2ySF— Sony Sports Network (@SonySportsNetwk) June 9, 2026రుతురాజ్ గైక్వాడ్ సెంచరీసాధారణంగా ఓపెనర్గా బరిలోకి దిగే ప్రియాన్ష్ ఆర్య లంకతో మ్యాచ్లో మూడో స్థానంలో వచ్చి (32 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించాడు. టాపార్డర్ విఫలమైనా నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ(101)తో రాణించడంతో భారత్ గట్టెక్కింది. నిర్ణీత 50 ఓవర్లలో 277 పరుగులు చేయగలిగింది.అయితే, విజయం కోసం మాత్రం చివరి వరకు తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్ విధించిన 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 47 ఓవర్లు ముగిసే సరికి లంక 261/6తో పటిష్టంగా ఉంది. ఆఖరి మూడు ఓవర్లలో 17 పరుగులే రావాల్సి ఉండగా.. విజయం లాంఛనమే అనుకున్నారు.బౌలర్ల విజృంభణతో..కానీ భారత బౌలర్లు ఆఖర్లో పది బంతుల్లోనే నాలుగు వికెట్లు కూల్చి ఆతిథ్య లంక జట్టు ఓటమిని శాసించారు. అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్, ఆయుశ్ బదోని, విప్రాజ్ నిగమ్ రెండేసి వికెట్లు తీయగా... అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి.. సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది.ఇక తమ రెండో మ్యాచ్లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు గురువారం అఫ్గనిస్తాన్-‘ఎ’ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై చర్చ మొదలైంది. ఓపెనర్లుగా వైభవ్, ప్రభ్సిమ్రన్ విఫలమైనా వారిద్దరిని కొనసాగించాలని నాయకత్వ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా లంకపై గెలిచిన తుది జట్టుతోనే భారత్ అఫ్గన్తో వన్డే బరిలోనూ దిగనున్నట్లు తేలిపోయింది.అఫ్గనిస్తాన్-‘ఎ’తో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ (కెప్టెన్), ఆయుశ్ బదోని, అనుకుల్ రాయ్, సూయాన్ష్ షెడ్గే, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, విప్రాజ్ నిగమ్.చదవండి: వాళ్లకే దిక్కు లేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు? -
టెస్ట్ల్లో సరికొత్త 'నంబర్ వన్'
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సరికొత్త నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్గా అవతరించాడు. సహచరుడు జో రూట్ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్లో అర్ద సెంచరీ సాధించి నంబర్ వన్ స్థానానికి చేరాడు. ఇదే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఘోరంగా విఫలమైన రూట్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు.తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో సూపర్ సెంచరీతో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. 743 రేటింగ్ పాయింట్లు కలిగిన గిల్.. ప్రస్తుతం భారత్ తరఫున అత్యధిక రేటింగ్ కలిగిన బ్యాటర్గా నిలిచాడు.ఇదే మ్యాచ్లో సెంచరీ చేసిన మరో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ర్యాంక్లో (34) ఎలాంటి మార్పు లేదు. గిల్తో పాటు టాప్-10లో ఉన్న మరో టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానంలో కోల్పోయి తొమ్మిదో స్థానానికి చేరాడు. ఓవరాల్గా తాజా ర్యాంకింగ్స్లో అత్యధిక లబ్ది పొందిన బ్యాటర్గా గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. ఫిలిప్స్ తాజాగా ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్లో ఓ మోస్తరు ప్రదర్శన చేసినప్పటికీ.. 15 స్థానాలు మెరుగుపర్చుకొని 40వ స్థానానికి ఎగబాకాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ టెస్ట్లో కళ్లు చెదిరే ప్రదర్శన ఇచ్చిన ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ 7 స్థానాలు మెరుగుపర్చుకొని పదో స్థానానికి ఎగబాకాడు. ఆఫ్ఘన్ టెస్ట్లో సంచలన ప్రదర్శన ఇచ్చిన టీమిండియా అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ తొలిసారి టాప్-100లోకి ప్రవేశించాడు. ఆ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన సుతార్ 272 రేటింగ్ పాయింట్లు సాధించి 72వ స్థానంలో నిలిచాడు.మిగతా భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 14వ స్థానానికి చేరగా.. సిరాజ్ ఓ స్థానం కోల్పోయి 15వ స్థానానికి పడిపోయాడు. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా వెటరన్ ఆటగాడు రవీంద్ర జడేజా టాప్ ప్లేస్ను నిలుపుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. -
ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్మనీ ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా యమా క్రేజ్ ఉన్న ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఫిఫా వరల్డ్కప్కు ఈసారి అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 39 రోజుల పాటు జరగనున్న సాకర్ సమరంలో 48 దేశాలు పాల్గొన నున్నాయి. ఫైనల్ సహా మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. మ్యాచ్ల నిర్వహణ, ఆరంభ వేడుకలకే పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ఫిఫా నిర్వాహకులు.. టోర్నీలో విజేతగా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ సహా సెమీఫైనలిస్ట్లు, క్వారర్ ఫైనలిస్ట్లు, గ్రూప్ దశలో వెనుదిరిగే జట్లకు అందించే ప్రైజ్మనీ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2022 ఫిఫా ప్రపంచకప్ విజేత అర్జెంటీనాఅయితే 1998 వరకు ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్మనీ సాధారణంగానే ఉండేది. అయితే 1998 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రైజ్మనీ విలువ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుత ఫిఫా వరల్డ్కప్లో మొత్తం ప్రైజ్మనీ విలువ 655 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 6 వేల కోట్లకు పైమాటే). 2022 ఫిఫా ప్రపంచకప్తో పోలిస్తే ప్రైజ్మనీ విలువ దాదాపు 50శాతం పెరగడం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీగా పిలవబడే ఈవెంట్ అయిన ఫిఫా ప్రపంచకప్తో క్రికెట్లో నిర్వహించే టీ20 ప్రపంచకప్తో పోల్చలేమని క్రీడా పండితులు పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్మనీలో టీ20 ప్రపంచకప్ ప్రైజ్మనీ సగం కూడా తూగదు. ఎందుకంటే ఫిఫా ప్రపంచకప్లో లీగ్ దశలో 17 నుంచి 32 స్థానాల్లో నిలిచే జట్లకు అందించే 11 మిలియన్ డాలర్లే ఐసీసీ టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్మనీ విలువ కావడం గమనార్హం. 2026 టీ20 ప్రపంచకప్ విజేత భారత్అందుకే ఐసీసీ టీ20 ప్రపంచకప్ విలువను ఫిఫా ప్రపంచకప్ విలువతో పోలిస్తే దాని కాలిగోటికి కూడా సరిపోదు. ఇక ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్మనీ అయిన 655 మిలియన్ అమెరికా డాలర్లను టోర్నీలో చాంపియన్స్గా నిలిచే జట్టు నుంచి లీగ్లో ఆఖరి స్థానంలో నిలిచే జట్లకు ఎలా పంచుతారనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఫిఫా ప్రపంచకప్ మొత్తం ప్రైజ్మనీ: 655 మిలియన్ డాలర్లుచాంపియన్స్: 50 మిలియన్ డాలర్లురన్నరప్: 33 మిలియన్ డాలర్లుమూడు, నాలుగు స్థానాలు: 27 మిలియన్ డాలర్లు5 నుంచి 8వ స్థానం : 19 మిలియన్ డాలర్లు9 నుంచి 16వ స్థానం: 15 మిలియన్ డాలర్లు17 నుంచి 32వ స్థానం: 11 మిలియన్ డాలర్లు 33 నుంచి 48వ స్థానం: 9 మిలియన్ డాలర్లు. దీనికి అదనంగా అర్హత సాధించిన ప్రతీ జట్టుకు సన్నాహక ఖర్చుల కింద మరో 1.5 మిలియన్ డాలర్లు అదనంగా లభిస్తాయి. మరోవైపు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మొత్తం ప్రైజ్మనీ విలువ 11.25 మిలియన్ డాలర్లు.చాంపియన్స్ (భారత్): 2.6 మిలియన్ డాలర్లురన్నరప్ (న్యూజిలాండ్): 1.42 మిలియన్ డాలర్లుమూడో స్థానం (దక్షిణాఫ్రికా): 1 మిలియన్ డాలర్లునాలుగో స్థానం (ఇంగ్లండ్): 974,423 డాలర్లు5 నుంచి 8వ స్థానం వరకువెస్టిండీస్ - 538,269 డాలర్లుపాకిస్తాన్ - 522,692 డాలర్లుజింబాబ్వే - 491,538 డాలర్లుశ్రీలంక - 475,962 డాలర్లుచదవండి: చతికిలపడ్డ బాలీవుడ్ స్టార్లు.. ఇది సార్ కోహ్లీ బ్రాండ్! -
టీమిండియా యువ సంచలనానికి బంపరాఫర్
తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో అద్భుత ప్రదర్శనతో (7 వికెట్లు) ఆకట్టుకున్న టీమిండియా యువ సంచలనం మానవ్ సుతార్కు ఊహించని అవకాశం లభించింది. అరంగేట్రంలోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చిన అతడితో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోని ప్రముఖ జట్టైన వార్విక్షైర్ రెండు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్ల ఒప్పందం చేసుకుంది.సుతార్కు ఈ డీల్ చాలా లక్కీగా పరిగణించబడుతోంది. టీమిండియా భవిష్యత్ ఇంగ్లండ్ పర్యటనల్లో అతడికి ఈ అనుభవం చాలా పనికొస్తుంది. స్పిన్నర్లకు పెద్దగా సహకరించని ఇంగ్లండ్ పిచ్లపై సుతార్ తన బౌలింగ్ను మెరుగుపర్చుకోవచ్చు. ఇంగ్లండ్లో రాణిస్తే సుతార్ భవిష్యత్తుకు తిరుగుండదు.అశ్విన్ రిటైర్మెంట్, జడేజా తరచుగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రస్తుతం భారత టెస్ట్ జట్టుకు విదేశీ పరిస్థితుల్లో స్థిరమైన స్పిన్నర్ అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలో సుతార్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అనుభవం సాధించడం టీమిండియాకు చాలా ఉపయోగపడుతుంది.దేశీయ క్రికెట్లో అత్యుత్తమ ట్రాక్ రికార్డు (30 మ్యాచ్ల్లో 136 వికెట్లు) కలిగిన సుతార్.. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్తో టీమిండియా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ స్పెల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా భారత్ వైపుకు తిప్పింది. రెండో ఇన్నింగ్స్లోనూ సుతార్ తన ప్రభావాన్ని కొనసాగిస్తూ మరో వికెట్ సాధించాడు. మొత్తంగా అరంగేట్ర టెస్ట్లో 7 వికెట్లు తీసి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకుగానూ అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. -
బిగ్ అనౌన్స్మెంట్..!
భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చని భావిస్తున్న ఓ ప్రతిపాదన ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫ్రాంచైజీ టి20 లీగ్ అయిన బిగ్బాష్ లీగ్ మ్యాచ్లను తొలిసారిగా భారత్లో నిర్వహించే దిశగా ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన నిజమైతే, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది ఓ కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.ఈ ప్రణాళికలో భాగంగా చెన్నై నగరం ప్రధాన వేదికగా పరిశీలనలో ఉన్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఐకానిక్ క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన చిదంబరం స్టేడియంను ఓ ప్రత్యేక బీబీఎల్ రెగ్యులర్ మ్యాచ్కు ఆతిథ్యమివ్వడానికి అనుకూలమైన వేదికగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై గత కొన్ని నెలలుగా క్రికెట్ ఆస్ట్రేలియా , బీసీసీఐ మరియు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మధ్య అనధికారిక చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.తాజాగా ఈ అంశానికి అధిక ప్రాధాన్యత లభించడానికి కారణం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారని వస్తున్న వార్తలు. ఆ పర్యటనలో మోదీ బిగ్బాష్ లీగ్ భారత ఎంట్రీపై "గ్రౌండ్ బ్రేకింగ్" ప్రకటన చేస్తారని అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాలపై పలు సానుకూల ప్రకటనలు చేస్తారని సమాచారం.ఒకవేళ బిగ్బాష్ లీగ్ భారత ఎంట్రీ ప్రాజెక్ట్ సాకారమైతే, అంతర్జాతీయ టీ20 లీగ్లు పరస్పర దేశాల్లో మ్యాచ్లు నిర్వహించే కొత్త ట్రెండ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రతిపాదనకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లు విదేశీ లీగ్లలో పాల్గొనడంపై ఉన్న పరిమితులు, ఐపీఎల్ షెడ్యూల్తో సర్దుబాటు, ప్రసార హక్కుల పంపకం, లాజిస్టిక్స్ వంటి అంశాలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. -
గంభీర్తో మాకు సంబంధం లేదు!.. సీనియర్ల రూటే వేరు!
అఫ్గనిస్తాన్తో సిరీస్తో టీమిండియా వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాలు మొదలుకానున్నాయి. గిల్ సేన స్వదేశంలో అఫ్గన్తో మూడు వన్డేలు ఆడేందుకు సన్నద్ధమైంది. గాయం కారణంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ సిరీస్కు దూరం కాగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం కాలు నొప్పితో దూరమయ్యే పరిస్థితి నెలకొంది.మరోవైపు.. లెజెండరీ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన దిగ్గజ ద్వయం రోహిత్- కోహ్లి వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.గంభీర్, అగార్కర్ విముఖత?వన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా రో-కో ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. వరల్డ్కప్ ఆడే విషయంలో రో-కో తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాడు.తలవంచనుఅయితే, ఇందుకు కోహ్లి ఇటీవలే గట్టి కౌంటర్ ఇచ్చాడు. తనను తాను నిరూపించుకోవాలని పదే పదే ఒత్తిడి చేస్తే.. అందుకు తాను తలవంచనని చెప్పేశాడు. డ్రెసింగ్రూమ్లో తన అవసరం లేదనుకుంటే తన గురించి చర్చే అనవసరం అని పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో రో-కో భవితవ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించాయి. సీనియర్ ఆటగాళ్లు గంభీర్, అగార్కర్లను కాదని యాజమాన్యంతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి.గంభీర్తో మాకు సంబంధం లేదు‘‘జట్టులో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ గిల్ ప్రతీ విషయంలో డ్రెసింగ్రూమ్ గట్టిగా తన గొంతు వినిపించాల్సి ఉంది. టెస్టు, టీ20 ఫార్మాట్లలో మాదిరి గంభీర్ వన్డే జట్టు విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు.అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. వన్డే వరల్డ్కప్ సన్నాహకాలు మొదలైపోయాయి. గంభీర్- గిల్ ఇకపై మరి కాస్త కఠినంగా ఉండవచ్చు. డ్రెసింగ్రూమ్లో తన ఐడియాలను బలంగా వినిపించవచ్చు.చాలా ఏళ్లుగా అత్యంత గొప్పగా.. సేవలు అందిస్తున్న సీనియర్లు వచ్చే పదహారు నెలల్లో జట్టులో తమ పాత్ర ఏమిటన్న అంశం గురించి గంభీర్తో కాకుండా నేరుగా యాజమాన్యంతో చర్చిస్తున్నారు. తమ భవితవ్యంపై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: వాళ్లకే దిక్కులేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు? -
చతికిలపడ్డ బాలీవుడ్ స్టార్లు.. ఇది సార్ కోహ్లీ బ్రాండ్!
భారత క్రికెట్ ముఖచిత్రంలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న విరాట్ కోహ్లీ ఆసియా ఖండంలో అది పెద్ద స్టార్ క్రీడాకారుడిగా పేరు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ తర్వాత అంతటి పేరు సంపాదించిన కోహ్లీ ఫిట్నెస్, రికార్డులపై నిత్యం ప్రశంసల వెల్లువ కురుస్తూనే ఉంటుంది. 20 ఏళ్లుగా క్రికెట్ ఆడుతూ అసామాన్యమైన స్టార్డమ్ను పొందిన కోహ్లీ తాజాగా తన బ్రాండ్ పవర్ను మరోసారి చాటుకున్నాడు.భారతదేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా అగ్రస్థానంలో నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా, గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్బ్రాండ్ సంయుక్తంగా తొలిసారి విడుదల చేసిన 'మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీస్' ర్యాంకింగ్స్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. విరాట్ బ్రాండ్ విలువను ఏకంగా రూ.3,542 కోట్లుగా లెక్కగట్టడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో నిలవగా, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.క్రికెటర్ల ఆధిపత్యంఈ ర్యాంకింగ్స్లో క్రికెటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. టాప్ 10 జాబితాలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ధోనీ కూడా చోటు సంపాదించారు. కేవలం సంపాదన, ప్రఖ్యాతి ఆధారంగా కాకుండా.. ఒక సెలబ్రిటీకి ఉన్న విశిష్టత, అభిమానులతో అనుబంధం, సామాజిక బాధ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను నిర్ణయించారు. వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయడంలో, బ్రాండ్లపై నమ్మకాన్ని పెంచడంలో సెలబ్రిటీల పాత్రను ఈ అధ్యయనం విశ్లేషించింది.విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడానికి పలు కారణాలు దోహదం చేశాయి. ప్యూమా, ఆడీ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలు, ఫిట్నెస్ ఐకాన్గా ఆయనకున్న ఇమేజ్, ఇన్స్టాగ్రామ్లో 270 మిలియన్లకు పైగా ఉన్న భారీ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆయన బ్రాండ్ విలువను అమాంతం పెంచాయి. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించచడంలో కీలక పాత్ర పోషించడం, ఫైనల్లో 42 బంతుల్లో 75 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవడం కోహ్లీ మార్కెట్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. అయితే ఆఫ్గన్తో వన్డే సిరీస్కు కోహ్లీని ఎంపిక చేసినప్పటికీ, గాయం వల్ల అతడు జట్టుకు దూరమయ్యాడు.చదవండి: సెలెక్షన్ కమిటీపై భువనేశ్వర్ సంచలన వ్యాఖ్యలు! -
వాళ్లకే దిక్కులేదు!.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు?
టీమిండియా సెలక్టర్ల తీరుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు.. ఆసియా క్రీడలు-2026 టోర్నీకి ప్రకటించిన టీ20 జట్టులో అర్హులకు చోటు దక్కలేదని మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లు కేవలం హెడ్కోచ్ గౌతం గంభీర్ వల్లే జట్టులో ఉన్నారని పెదవి విరుస్తున్నారు.ఇంతకంటే ఇంకేం చేయాలి?గత రెండేళ్లుగా ఐపీఎల్లో సత్తా చాటుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి వరుసగా రెండుసార్లు టైటిల్ అందించిన రజత్ పాటిదార్ (Rajat Patidar)ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. భారత టీ20 జట్టులో పాటిదార్కు చోటిచ్చేందుకు ఆస్కారం లేదని పేర్కొన్నాడు. ఇప్పటికే టీ20 ప్రపంచకప్-2026 గెలిచిన జట్టు నుంచి చాలా మందిని తప్పించారని.. పాటిదార్ కోసం ఈ సంఖ్యను మరింత పెంచలేరని పేర్కొన్నాడు.ఆవేదన అర్థం చేసుకోగలను!.. కానీఈ మేరకు.. ‘‘భారత టీ20 జట్టులో రజత్ పాటిదార్ ఎందుకు లేడు? అతడు కచ్చితంగా జట్టులో ఉండాలి కదా!.. ఇంతకంటే గొప్పగా ఏ ఆటగాడైనా ఏం చేయగలడు?.. చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు.భజ్జీ (హర్భజన్ సింగ్) కూడా ఇలాగే ట్వీట్ చేశాడు. భజ్జీతో నేనూ ఏకీభవిస్తాను. అందరి మనసుల్లోనూ ఇదే భావన ఉంది. అర్హుడైనా అతడికి స్థానం దక్కలేదన్న ఆవేదనను నేనూ అర్థం చేసుకోగలను.అయితే, ఇక్కడ భావోద్వేగాల కంటే కూర్పుకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రజత్ పాటిదార్కు చోటివ్వాలంటే ఎవరో ఒకరిని తీసేయాల్సి ఉంటుంది. మరి అతడి కోసం ఎవరిని బలి చేయాలంటారు?వాళ్లకే దిక్కులేదు.. అతడికి చోటు ఎలా?ప్రపంచకప్ గెలిచిన జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పైనే వేటు వేశారు. అతడితో పాటు రింకూ సింగ్నూ తప్పించారు. వీరిద్దరి స్థానంలో కొత్త సారథిగా శ్రేయస్ అయ్యర్, ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వచ్చారు.ఇంతకంటే ఇంకెన్ని మార్పులు చేయాలి? ప్రపంచకప్ గెలిచిన జట్టు నుంచి ఇంకెంత మంది సభ్యులను నిర్దాక్షిణ్యంగా తప్పించాలి?’’ అని ఆకాశ్ చోప్రా విమర్శకులను ప్రశ్నించాడు.సారథిగా సరైనోడుఏదేమైనా శ్రేయస్ అయ్యర్ సారథిగా సరైనోడని.. అందుకే మూడేళ్ల తర్వాత ఏకంగా కెప్టెన్గా టీ20 జట్టులో పునరాగమనం చేశాడని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా వరల్డ్కప్ గెలిచిన 35 ఏళ్ల సూర్యతో పాటు రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్లపై సెలక్టర్లు వేటు వేశారు.మరోవైపు.. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. అయితే, బుమ్రాను ఆసియా క్రీడల జట్టుకు మాత్రం ఎంపిక చేశారు. కొత్తగా శ్రేయస్ అయ్యర్తో పాటు యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రాగా.. రవి బిష్ణోయి, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్లకు కూడా చోటు దక్కింది.చదవండి: ‘అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో చోటు దండగ’ -
సెలెక్షన్ కమిటీపై భువనేశ్వర్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా వెటరన్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ తనను జాతీయ జట్టకు ఎంపిక చేయకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను ఎంపిక చేయాలని ఎవరిని అడుక్కోనని, టాలెంట్ను గుర్తించి జట్టులోకి ఎంపిక చేస్తే ఆడుతానంటూ భువీ కుండబద్దలు కొట్టాడు. టీమిండియాకు చాలాకాలం క్రితమే దూరమైన 36 ఏళ్ల భువనేశ్వర్ ఇటీవలే ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆర్సీబీ తరఫున ఆడిన భువనేశ్వర్ 28 వికెట్లతో అదరగొట్టాడు. తద్వారా ఆర్సీబీ వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో భువనేశ్వర్ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఇటీవలే ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆసియా గేమ్స్కు సంబంధించి టీమిండియా జట్లను ప్రకటించిన బీసీసీఐ భువనేశ్వర్కు మరోసారి మొండిచేయి చూపించింది. అయితే రెస్ట్ పేరుతో సిరాజ్ను ఈ టోర్నీల నుంచి తప్పించడంతో భువీ పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. కానీ అనూహ్యంగా సిరాజ్ స్థానంలో ప్రసిధ్ క్రిష్ణను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో భువనేశ్వర్కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే బుధవారం భువనేశ్వర్ కుమార్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇంటర్య్వూ ఇచ్చాడు. 'నేను టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. కానీ నా మనసులో ఉన్న మాటలను బయటపెట్టకపోవడం నా నైజం. ప్రతీ ఒక్కరు తమ పని తాము చేస్తున్నట్లే నా పని నేను చేస్తున్నా. బీసీసీఐ సెలెక్టర్లు కూడా వారి పని చేస్తున్నారు. ఎంపిక చేయడం, చేయకపోవడం వారి బాధ్యత. నేను సరిపోతానని భావిస్తే, వాళ్లే ఎంపిక చేస్తారు. నన్ను ఎంపిక చేయమని ఎవరిని అడగను. టీమిండియా తరఫున ఆడాలనే కోరిక ఇప్పటికీ నాలో బలంగా ఉంది. నేను మెరుగైన ప్రదర్శన చేస్తున్నా. టీమిండియా తరఫున ఆడడాన్ని ఇప్పటికీ ఒక అదృష్టంగానే భావిస్తాను.' అని ముగించాడు.టీమిండియాకు ఎంతోకాలం ఫ్రంట్లైన్ బౌలర్గా సేవలందించిన భువనేశ్వర్ 2022లో టీమిండియా తరఫున చివరిసారి ఆడాడు. నేపియర్లో న్యూజిలాండ్తో జరిగిన టీ20 మ్యాచ్ భువీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్కు పరిమితమైన తర్వాత సీనియర్లను పక్కనబెట్టి, యువ బౌలర్లకు అవకాశం ఇచ్చేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపింది. దీంతో భువనేశ్వర్ కుమార్ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో 2018లోనే భువీ టెస్టు కెరీర్ ముగిసిపోయింది. మరి ఈ లెక్కన భువనేశ్వర్ మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడా అంటే చెప్పడం కష్టమే. 36 ఏళ్ల వయసులోనే తన బౌలింగ్లో పదును తగ్గని భువనేశ్వర్ను ఆడించాలనుకుంటే మాత్రం ఇదే మంచి అవకాశం. ఎందుకంటే 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టులో చాలా మార్పులు జరగనున్నాయి. రోహిత్, కోహ్లీ, జడేజా వంటి క్రికెటర్లు వీడ్కోలు పలికే అవకాశముంది. ఇప్పటికే ఐపీఎల్ పుణ్యమా అని ప్రిన్స్యాదవ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రానా వంటి బౌలర్లు రేపటి భారత బౌలింగ్ భవిష్యత్తుకు ఆశాకిరణంలా కనిపిస్తున్నారు.చదవండి: స్టోక్స్పై పిడిగుద్దుల వర్షం.. ఎవరీ రగ్బీ ప్లేయర్? -
పాక్ జట్టు ప్రకటన.. బీసీసీఐ అలా.. పీసీబీ ఇలా!
ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. సల్మాన్ ఆఘాను తప్పించి అతడి స్థానంలో సాహిబ్జాదా ఫర్హాన్కు సారథిగా పగ్గాలు అప్పగించింది.స్టార్లు లేకుండానే...ఆసియా క్రీడల్లో పాల్గొనే పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజం, షాహిన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్ తదితరుల పేర్లు కనిపించలేదు. సల్మాన్ సహా వీరందరికీ విశ్రాంతినివ్వాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.కొత్త ముఖాలకు చోటుఈ క్రమంలోనే పాక్ ఫర్హాన్ కెప్టెన్సీలో ద్వితీయ శ్రేణి జట్టును ఆసియా క్రీడలకు పంపనుంది. ఈ ఈవెంట్లో ఫర్హాన్కు డిప్యూటీగా అబ్దుల్ సమద్ వ్యవహరించనున్నాడు. ఇక ఇంతవరకు అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేయని ఆకిఫ్ జావేద్, అలీ రెజా, మాజ్ సదాకత్, సాద్ మసూద్లకు కూడా సెలక్టర్లు ఆసియా క్రీడల జట్టులో చోటిచ్చారు.పీసీబీ ఇలా.. బీసీసీఐ అలామరోవైపు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం ఆసియా క్రీడలకు పూర్తిస్థాయి జట్టును పంపేందుకు సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన జట్టును ఇటీవలే ప్రకటించింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ఈ జట్టుకు ఎంపిక చేసింది.ముఖాముఖి పోరు ఉంటుందా?కాగా లీగ్ దశలో భారత్- పాకిస్తాన్ తలపడే పరిస్థితి లేకపోవచ్చు. అయితే, సెమీస్ లేదంటే ఫైనల్లో దాయాదులు ముఖాముఖి ఎదురుపడే అవకాశం ఉంది. ఇటీవల ఆసియా కప్-2026, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీల్లో భారత్ చేతిలో పాక్ మరోసారి భంగపడ్డ సంగతి తెలిసిందే.ఆసియా కప్లో ఫైనల్ చేరినప్పటికీ.. వరల్డ్కప్ టోర్నీలో కనీసం సెమీస్ కూడా చేరకుండానే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడల్లో పూర్తిస్థాయి జట్టును కాకుండా ద్వితీయ శ్రేణి జట్టును పీసీబీ రంగంలోకి దించడం విశేషం.తొలిసారి సారథిగాఇదిలా ఉంటే.. 30 ఏళ్ల సాహిబ్జాదా ఫర్హాన్ ఇప్పటి వరకు పాకిస్తాన్ తరఫున 46 టీ20 మ్యాచ్లు ఆడాడు. రెండు శతకాలు, పది అర్ధ శతకాల సాయంతో 1305 పరుగులు సాధించాడు. ఆసియా క్రీడల సందర్భంగా తొలిసారిగా పాక్ జట్టు కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు.కాగా సెప్టెంబరు 19- అక్టోబరు 4 వరకు జపాన్ వేదికగా ఆసియా క్రీడలు- 2026 జరుగనున్నాయి. ఇక క్రికెట్ పోటీలను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. కాగా 2023లో బీసీసీఐ తొలిసారిగా పురుష, మహిళా జట్లను ఆసియా క్రీడలకు పంపగా.. రుతురాజ్ గైక్వాడ్, హర్మన్ప్రీత్ కౌర్ల సారథ్యంలో భారత్ రెండు విభాగాల్లోనూ పసిడి పతకాలు సాధించింది.ఆసియా క్రీడలకు పాక్ జట్టుసాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), అబ్దుల్ సమద్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, అకీఫ్ జావేద్, అలీ రజా, అరాఫత్ మిన్హాస్, హైదర్ అలీ, హసన్ నవాజ్, మాజ్ సదాకత్, సల్మాన్ మీర్జా, సాద్ మసూద్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), సుఫీయాన్ ముకీమ్.చదవండి: ‘అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో దండగ’ -
స్టోక్స్పై పిడిగుద్దుల వర్షం.. ఎవరీ రగ్బీ ప్లేయర్?
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సహచర బౌలర్ గస్ అట్కిన్సన్లు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బోర్డు అనుమతి లేకుండా నైట్క్లబ్కు వెళ్లిన స్టోక్స్, అట్కిన్సన్ ఫూటుగా తాగి బీర్బాటిళ్లు విసిరేసి అపరిచితులపై దాడి చేశారు. దీంతో జట్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు న్యూజిలాండ్తో రెండో టెస్టుకు వీరిద్దరిని సస్పెండ్ చేసే అవకాశముంది. స్టోక్స్, అట్కిన్సన్పై చర్యలు తీసుకోవడానికి ముందు మరింత సమాచారం సేకరిస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. సమాచార సేకరణలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఈసీబీ పేర్కొంది. ఈసీబీ తెలిపిన ప్రకారం.. స్టోక్స్ దాడి చేయడానికి ముందే రగ్బీ ఆటగాడు, 21 ఏళ్ల టోటోవా ఔవా స్టోక్స్, అట్కిన్సన్లపై పిడిగుద్దుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. టోటోవా ఔవాను కించపరిచే విధంగా స్టోక్స్ మాట్లాడాడని, ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. నైట్క్లబ్లోనే స్టోక్స్, అట్కిన్సన్లతో టోటోవా ఔవాతో పాటు అతడి సహచరులు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టోక్స్ను కిందపడేసి టోటోవా పిడి గుద్దులు కురిపించాడు. అడ్డువచ్చిన అట్కిన్సన్ను కూడా చితకబాదాడు. అయితే గొడవ పతాక స్థాయికి చేరడంతో బౌన్సర్లు వారందరిని బయటికి పంపించేశారు. అయితే బయటికి వచ్చాకా స్టోక్స్, అట్కిన్సన్లు తమ వద్ద ఉన్న బీర్ బాటిళ్లను విసిరి టోటోవా అనుచరులను కిందపడేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడడం వీడియోలో బయటపడింది. ఈ దాడికి ముందే టోటోవా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఈసీబీ తెలిపింది. ఈ సమాచారం మొత్తం తమకు నైట్క్లబ్ సీసీటీవీ ఫుటేజీలో దొరికిందని వెల్లడించిన ఈసీబీ.. స్టోక్స్, అట్కిన్సన్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ స్టోక్స్పై వేటు పడితే కివీస్తో రెండో టెస్టుకు హ్యారీ బ్రూక్ జట్టును నడిపించనున్నాడు.ఎవరీ టోటోవా?ఇంగ్లండ్ క్రికెటర్ స్టోక్స్పై పిడిగుద్దుల వర్షం కురిపించిన టోటోవా ఔవా ఎవరని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. రగ్బీ ప్లేయర్ అయిన టోటోవా సరసెన్స్ అకాడమీలో రగ్బీ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ఇప్పటివరకు రగ్బీ మ్యాచ్ ఆడలేదు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 125 కిలోల బరువుతో బాహుబలి రూపంతో ఆకర్షిస్తున్నాడు. స్టోక్స్తో గొడవపడిన టోటోవా ఔవా రాత్రికిత్రే స్టార్ అయి పోయాడు.Ben Stokes, the real street fighter 😭 waiting for the new fight video pic.twitter.com/iK0at0nSvg— Santoshvk18 (@269signofff) June 8, 2026చదవండి: మళ్లీ గాయపడిన పాండ్యా.. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరం! -
మళ్లీ గాయపడిన పాండ్యా.. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరం!
అప్గానిస్తాన్తో మూడు వన్డేల సిరీస్కు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో దూరమయ్యాడు. అయితే మంగళవారమే రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా తమ ఫిట్నెస్ను నిరూపించుకొని క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందినట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్లో ఈ ఇద్దరు ఆడుతారని బీసీసీఐ తెలిపింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. రీఎంట్రీ కోసం సీవోఈలో శిక్షణ తీసుకుంటున్న పాండ్యా బౌలింగ్ వేస్తున్న క్రమంలో అతడి కాలు బెణికినట్లు సమాచారం. దీంతో అతడు కోలుకోవడానికి మరో రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయం కావడంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని మెడికల్ టీమ్ వెల్లడించింది. దీంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్కు పాండ్యా దూరమైనట్లే. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక సీవోఈ నుంచి క్లియరెన్స్ పొందిన రోహిత్ శర్మ మాత్రం ఆఫ్గన్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2026 సీజన్లో పాండ్యా వెన్నునొప్పికి గురయ్యాడు. దీంతో సీజన్ ఆఖర్లో ముంబై జట్టుకు దూరమైన పాండ్యా నేరుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి చేరుకున్నాడు. పాండ్యా కోలుకొని ఫిట్నెస్ క్లియరెన్స్ కూడా సాధించడంతో అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఈ ఆల్రౌండర్ మళ్లీ గాయానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో చీలమండ గాయంతో పాండ్యా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా తన చివరి వన్డే మ్యాచ్ను 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటినుంచి పాండ్యా వరుస గాయాలతో సతమతమవుతూనే వస్తున్నాడు.చదవండి: మెస్సీ విజృంభణ.. అర్జెంటీనా ఘన విజయం -
గెలిచామన్న గర్వం.. రెచ్చిపోయిన బంగ్లా బౌలర్!
బంగ్లాదేశ్ తమ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత ఆసీస్ను మట్టికరిపించిన బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే గెలిచామన్న గర్వమో లేక పొగరో తెలియదు కానీ బంగ్లాదేశ్ బౌలర్ నహిద్ రానా ఆస్ట్రేలియా కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ను స్లెడ్జింగ్ చేయడం మ్యాచ్లో హాట్టాపిక్గా మారింది. విషయంలోకి వెళితే.. 285 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ గోల్డెన్ డక్గా వెనుదిరగ్గా, మార్నస్ లబుషేన్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో కూపర్కు జత కలిసిన ఇంగ్లిస్ ఆసీస్ ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. వీరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో నహీద్ రానా 11వ ఓవర్లో బౌలింగ్కు వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఇంగ్లిస్ను పెవిలియన్ చేర్చాడు. ఔట్సైడ్ అయిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో ఇంగ్లిస్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇంగ్లిస్ పెవిలియన్ వైపు వెళుతున్న తరుణంలో నహీద్ రానా అతడిని ఉద్దేశించి ఏదో అన్నాడు. ఇది విన్న ఇంగ్లిస్ నేరుగా నహీద్ రానావైపు దూసుకొచ్చి ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బంగ్లా కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ ఇంగ్లిస్ను అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశాడు. ఆ తర్వాత నహీద్ రానా వద్దకు వచ్చిన మెహదీ హసన్.. ఎమోషన్ కంట్రోల్ చేసుకో అని అనడం స్టంప్ మైక్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడాడు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. డక్వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు. Big Wicket for Bangladesh! Josh Inglis departs. Caught by Litton Das, bowled by Nahid Rana! pic.twitter.com/waRZRvW6mX— Bangladesh Cricket (@BCBtigers) June 9, 2026చదవండి: 'అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ' -
'అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ'
హైదరాబాదీ, తెలుగు తేజం తిలక్ వర్మ భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ స్ధానంలో ఆ బాధ్యతలను తిలక్కు బీసీసీఐ అప్పగించింది. ఇకపై టీ20ల్లో శ్రేయస్ అయ్యర్కు డిప్యూటీగా అతడు వ్యవహరించున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఏషియన్ గేమ్స్కు జట్టు ఎంపిక సందర్బంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించడాన్ని భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టాడు. అదేవిధంగా ఐపీఎల్-2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ను ఎందుకు జట్టులో తీసుకోలేదని అతడు సెలక్టర్లపై విమర్శలు గుప్పించాడు."తిలక్ వర్మకు కెప్టెన్గా అసలు అనుభవమే లేదు. అదేవిధంగా అతడు ఫామ్లో కూడా లేడు. అతడికి భారీ షాట్లు ఆడే సత్తా సైతం లేదు. పాటిదార్ లాగా బౌలర్లను టార్గెట్ చేయలేడు. గత రెండు మూడు ఐపీఎల్ సీజన్ల నుంచి తిలక్ వర్మ ఆశించినంత మేర రాణించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లోనూ నిరాశపరిచాడు.అయినప్పటికి వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. మరోవైపు భారత టీ20 జట్టులో వాషింగ్టన్ సుందర్కు చోటు దక్కే అర్హత లేదు. అతడు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున బౌలింగ్ కూడా చేయలేదు. కేవలం మిడిలార్డర్ బ్యాటర్గా ఆడాడు. టీమిండియాలో కూడా అతడు రెగ్యులర్గా బౌలింగ్ చేయడం లేదు. అలాంటప్పుడు అతడిని ఒక ఆల్రౌండర్గా ఎలా జట్టులోకి తీసుకున్నారో సెలక్టర్లకే తెలియాలి. అతడి స్ధానంలో పాటిదార్ను ఎంపిక చేయాల్సిందని" శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: అతడి కంటే భువీ ఎంతో బెటర్.. సెలక్టర్లు తప్పు చేశారు!? -
అతడి కంటే భువీ ఎంతో బెటర్.. సెలక్టర్లు తప్పు చేశారు!?
ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్ల కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో కీలక మార్పు చోటు చేసింది. ఈ టీ20 సిరీస్ల నుంచి స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 'వర్క్లోడ్ మేనేజ్మెంట్'లో భాగంగా సిరాజ్కు విశ్రాంతినిచ్చినట్లు బోర్డు తెలిపింది. అతడి స్ధానంలో కర్ణాటక పేసర్ ప్రసిద్ద్ కృష్ణను జట్టులో తీసుకున్నారు. అయితే సిరాజ్ స్ధానాన్ని ప్రసిద్ద్ కృష్ణతో భర్తీ చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.అతడికి బదులుగా వెటరన్ భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేయాల్సిందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రసిద్ద్తో పోలిస్తే భువీ ఎంతో బెటర్ అని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. భువనేశ్వర్ నవంబర్ 2022 నుంచి భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ, డొమెస్టిక్ క్రికెట్తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు.ఇటీవల ముగిసిన ఐపీఎల్ 19వ సీజన్లో అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 16 మ్యాచ్లలో 28 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ టీ20ల్లో కూడా ఈ యూపీ ఫాస్ట్ బౌలర్కు మంచి రికార్డు ఉంది. 87 మ్యాచ్లు ఆడి 6.96 ఎకానమీ రేట్తో 90 వికెట్లు పడగొట్టాడు. 36 ఏళ్ల భువీ ఇప్పటికి కొత్త బంతితో అద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడు. ఈ ఆర్సీబీ పేసర్ ప్రస్తుతం యువ క్రికెటర్ల కంటే ఫిట్గా కనిపిస్తున్నాడు. దీంతో అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయినప్పటికి సెలక్టర్లు మాత్రం అతడి పేరును పరిగణలోకి తీసుకోవడం లేదు.ప్రసిద్ద్ కృష్ణ విషయానికి వస్తే.. టెస్ట్, వన్డేల్లో టీమిండియా తరపున కాస్త ఫర్వాలేదనిపించినప్పటికి, టీ20ల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి కేవలం 8 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-2026 సీజన్లోనూ ఆశించినంత మేర రాణించలేకపోయాడు.ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ , శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ సింగ్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.చదవండి: ‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’ -
ఓటమి అంచుల నుంచి...
దంబుల్లా: 278 పరుగుల లక్ష్యఛేదనలో 47 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక ‘ఎ’ జట్టు 261/6తో నిలిచింది. ఆ జట్టు విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉండగా... చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ సహాన్ (72 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకంతో జోరు మీదున్నాడు. ఇంకేముంది ముక్కోణపు వన్డే టోర్నీలో శ్రీలంక ‘ఎ’ జట్టు విజయం సాధించడం తథ్యమే అనుకుంటే... అక్కడే భారత ‘ఎ’ బౌలర్లు అద్భుతం చేశారు. 48వ ఓవర్లో 7 పరుగులు ఇ చ్చిన అన్షుల్ కంబోజ్... ప్రత్యర్థి కెప్టెన్ను అవుట్ చేయగా... అర్షద్ ఖాన్ వేసిన 49వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక ‘ఎ’ జట్టు 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (114 బంతుల్లో 101; 6 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్ వర్మ ( 97 బంతుల్లో 60; 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14; 3 ఫోర్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (2) విఫలమయ్యారు. భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్లో వైభవ్... ఐపీఎల్ జోరు కనబర్చలేకపోయాడు. ప్రియాన్ష్ ఆర్య (32; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆయుశ్ బదోనీ (24; 2 ఫోర్లు), సూర్యాన్ష్ షెడ్గె (26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) తలా కొన్ని పరుగులు చేశారు. లంక బౌలర్లలో షిరాజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో లంక 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. సహాన్తో పాటు డికెవెల్లా (47), అవిష్క(45), సదీరా సమరవిక్రమ (46) రాణించారు. అయితే చివర్లో ఒత్తిడిని అధిగమించడంలో సఫలమైన భారత జట్టును విజయం వరించింది. భారత ‘ఎ’ బౌలర్లలో అర్షద్ ఖాన్, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోనీ, విప్రాజ్ నిగమ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. గురువారం జరగనున్న రెండో లీగ్ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడనుంది. -
నైట్క్లబ్ వివాదం.. స్టోక్స్ కెరీర్కు ఎండ్ కార్డ్..?
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై సంచలన ప్రచారం జరుగుతోంది. తాజాగా న్యూజిలాండ్పై లార్డ్స్ టెస్టులో ఘన విజయం సాధించిన తర్వాత స్టోక్స్, సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్ జట్టు నిబంధనలను ఉల్లంఘించి అర్ధరాత్రి కర్ఫ్యూ సమయంలో ఓ నైట్క్లబ్లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వారు ఫుల్లుగా తాగి ఓ రగ్బీ ఆటగాడిపై దాడి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ వివాదం తర్వాత స్టోక్స్ తన కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 'ది క్రికెటర్' సీనియర్ జర్నలిస్ట్ జార్జ్ దోబెల్ ప్రకారం.. అతడు స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పాటు రిటైర్మెంట్ కూడా ప్రకటించవచ్చు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.ఇదిలా ఉంటే, నైట్క్లబ్ ఘటనలో స్టోక్స్, అట్కిన్సన్ ఎవరిపై దాడికి పాల్పడలేదని ECB వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తప్పకపోవచ్చు. స్టోక్స్కు ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గతంలోనూ పీకల దాకా తాగి రచ్చ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. గతేడాది నవంబర్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే నైట్క్లబ్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్కు ముందు వెల్లింగ్టన్లోని ఓ నైట్క్లబ్కు వెళ్లిన బ్రూక్, అక్కడ బౌన్సర్తో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇంగ్లండ్ భవిష్యత్తు ఆశాకిరణం జేకబ్ బెథెల్తో కలిసి సదరు బౌన్సర్పై దాడి చేశాడు. అయితే దాడి పెద్దది కాకపోవడంతో ఈసీబీ వారిద్దరిని మందలింపుతో సరిపెట్టింది. -
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం
ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (జూన్ 9) జరిగిన తొలి మ్యాచ్లో 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్వర్త్ లూయిస్) సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్లో జరిగిన మ్యాచ్లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్కు షాకిచ్చింది.ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన తాజా మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. తౌహిద్ హృదోయ్ (31), తస్కిన్ అహ్మద్ (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ (10-1-38-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. లియామ్ స్కాట్, మ్యాట్ రెన్షా తలో 2 వికెట్లతో పర్వాలేదనిపించారు. బార్ట్లెట్కు ఓ వికెట్ దక్కింది.లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడగా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. బ్యాటింగ్లో సత్తా చాటిన మొసద్దెక్ (10-1-37-2) బౌలింగ్లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (5.2-0-24-2), తస్కిన్ (5-0-28-1) కూడా రాణించారు. -
గైక్వాడ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపు
శ్రీలంకలో జరుగుతున్న ఏ-జట్ల ముక్కోణపు టోర్నీలో టీమిండియా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో ఇవాళ (జూన్ 9) జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్ (101) సూపర్ సెంచరీతో, కెప్టెన్ తిలక్ వర్మ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో ఆయుశ్ బదోని (24), సూర్యాంశ్ షేడ్గే (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో అలరించారు. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్మ 32, ప్రభ్సిమ్రన్ సింగ్ 2, అనుకూల్ రాయ్ 1 (నాటౌట్) పరుగు చేయగా.. ఐపీఎల్ 2026 తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు తీయగా.. కరుణరత్నే, సంకేత్, వనుజ సహాన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, సాహన్ అరచ్చిగే (74), నిరోషన్ డిక్వెల్లా (47), సమరవిక్రమ (46) రాణించడంతో ఓ దశలో (262/6) గెలుపు దిశగా దూసుకెళ్లింది. అయితే చివరి రెండు ఓవర్లలో (7 పరుగుల వ్యవధిలో) కేవలం 10 పరుగులు అవసరమైన సమయంలో శ్రీలంక వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.అర్షద్ ఖాన్, ఆయుష్ బదోని, అనుకూల్ రాయ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టింది. జూన్ 11న జరిగే తదుపరి మ్యాచ్లో భారత్-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ తలపడనున్నాయి. -
వైభవ్ నిర్దయగా సిక్సర్లు బాదాడు!.. ఇదే కొనసాగితే కష్టం!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయిందని.. ఇదే కొనసాగితే పొట్టి ఫార్మాట్ ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడ్డాడు.గతేడాది కాలంగా రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. పద్నాలుగేళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ (35)తో కదంతొక్కిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఏడాది ఏకంగా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.ఆరెంజ్ క్యాప్ విజేతఐపీఎల్-2026లో మొత్తంగా పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్తో పాటు మరెన్నో బహుమతులు గెలుచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబడ వంటి స్టార్ బౌలర్ల బౌలింగ్లో సైతం వైభవ్ చితక్కొట్టడం విశేషం.ఇక ఈ సీజన్లో ఏకంగా 72 సిక్సర్లు బాదిన వైభవ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల ఆల్టైమ్ రికార్డును బద్దలుకొట్టాడు కూడా!.. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ, వివాదాస్పద కోచ్ గ్రెగ్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్లో.. ‘‘పదిహేనేళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ టోర్నీనే శాసించే స్థితికి వెళ్లాడు. 237కు పైగా స్ట్రైక్రేటుతో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ భూమి మీద ఉన్న అత్యుత్తమ బౌలర్లను కూడా తన బ్యాటింగ్తో ఉతికి ఆరేశాడు.సీజన్లో 72 సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డునే బద్దలుకొట్టాడు. సంప్రదాయ క్రికెట్కు పూర్తి విరుద్ధంగా సరికొత్త బెంచ్మార్కు సృష్టించాడు. తనింకా పిల్లాడే. పూర్తి స్థాయిలో సీనియర్ ఆటగాడిగా మారిన తర్వాత అతడిని ఎవరూ ఆపలేరు.ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతంఅంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ బౌలర్లుగా గుర్తింపు పొందిన వారిని సైతం వేటాడేయగలడు. మారుతున్న క్రీడా విధానానికి ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతం. ఆధునిక టీ20 ఫార్మాట్ పారామీటర్లు కూడా మారిపోతున్నాయి.ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నిబంధనల వల్ల సమతూకం దెబ్బతింటోంది. బ్యాటింగ్ చేసే జట్టుకు అదనపు పవర్హిట్టర్ను ఆడించే వీలు దొరుకుతోంది. వైభవ్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా తన ప్రభావం చూపాడు’’ అని గ్రెగ్ చాపెల్ పేర్కొన్నాడు.ఇలా అయితేనే టీ20 క్రికెట్ను కాపాడుకుందాంఅదే విధంగా.. టీ20 క్రికెట్ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ గ్రెగ్ చాపెల్ ఈ సందర్భంగా మూడు ప్రధాన సూచనలు చేశాడు. ‘‘బ్యాటింగ్ చేసే జట్టుకు చేతిలో పది వికెట్లు కూడా ఆరు వికెట్లే ఉండాలి. అప్పుడు బ్యాటర్లు బాదడమే పనిగా పెట్టుకోకుండా మంచి టెక్నిక్తో ఆడే ప్రయత్నం చేశారు.పిచ్ల మీద కనీసం 3 మి.మీ. మేర పచ్చిక ఉండేలా చూసుకోవాలి. తద్వారా కాస్త సీమ్ జనరేట్ అవుతుంది. ఒక్కోసారి పచ్చికతో కూడినవి.. మరోసారి పూర్తిగా పొడి పిచ్లను తయారు చేయాలి. తద్వారా వైవిధ్యం చేకూరుతుంది. లెగ్ బిఫోర్ వికెట్ విషయంలో కూడా మార్పులు చేయాలి’’ అని గ్రెగ్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. చదవండి: అఫ్గన్తో తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే! -
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
అఫ్గనిస్తాన్తో సిరీస్ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో ఈ మ్యాచ్ భాగం కాదు.కాబట్టి అఫ్గన్తో టెస్టు, విజయంతో టీమిండియాకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే, కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం దొరికింది. మానవ్ సుతార్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వంటి కొత్త ఆటగాడు తనను తాను నిరూపించుకునే ఓ వేదిక దొరికింది.మూడు వన్డేలుఇదిలా ఉంటే.. జూన్ 13, 17, 20 తేదీల్లో టీమిండియా అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, గాయం వల్ల విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో ఈ సిరీస్కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.మరోవైపు.. ఇషాన్ కిషన్ సైతం చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించారు. దీంతో అఫ్గన్తో తొలి వన్డేకు భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది.ఇషాన్ వద్దు.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్కు బదులు యశస్వి జైస్వాల్కు పెద్ద పీట వేయాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఓపెనర్గా కాకుండా మూడో స్థానంలోనూ జైసూ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్తో వన్డేలో కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. యశస్వి జైస్వాల్ను వన్డౌన్లో ఆడించాలి. శ్రేయస్ అయ్యర్ నాలుగు, కేఎల్ రాహుల్ ఐదు, హార్దిక్ పాండ్యా ఆరు, వాషింగ్టన్ సుందర్ ఏడు, హర్ష్ దూబే ఎనిమిదో స్థానంలో ఆడాలి.పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్తో పాటు గుర్నూర్ బ్రార్ను ఆడించాలి. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నాడు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో ఇషాన్ కిషన్కు చోటు ఇవ్వలేదు.జైసూను ఆడిస్తారా?ఐపీఎల్-2026 సందర్భంగా బరిలో దిగిన యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా.. 16 మ్యాచ్లు ఆడి 427 పరుగులు సాధించాడు. మరోవైపు.. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్ కిషన్ 602 పరుగులతో దుమ్ములేపాడు.అంతేకాదు సీజన్ ఆరంభంలో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో సన్రైజర్స్ కెప్టెన్గా వ్యవహరించి జట్టును గెలిపించాడు ఇషాన్. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ సత్తా చాటాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అభిషేక్ నాయర్ మాత్రం జైసూకు ఓటేయడం విశేషం.అఫ్గనిస్తాన్తో తొలి వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్.చదవండి: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ -
ఇద్దరు ప్రపంచకప్ సభ్యులపై వేటు
జూన్ 11 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (జూన్ 9) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా షాయ్ హోప్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో ముగ్గురు టీ20 ప్రపంచకప్ 2026 సభ్యులకు చోటు దక్కలేదు. ఇందులో ఇద్దరిపై (జాన్సన్ ఛార్లెన్, క్వింటన్ సాంప్సన్) వేటు పడగా.. అల్జరీ జోసఫ్కు వర్క్లోడ్ కారణంగా విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాళ్లు ఆకీమ్ ఆగస్టే, జువెల్ ఆండ్రూ, షమర్ స్ప్రింగర్లకు ఈ జట్టులో అవకాశం ఇచ్చారు. విధ్వంసకర వీరులు హెట్మైర్, రూథర్ఫోర్డ్, షెపర్డ్, పావెల్, హోల్డర్ తమ స్థానాలను నిలుపుకున్నారు. శ్రీలంకతో ఈ సిరీస్ జూన్ 12, 14, 15 తేదీల్లో జమైకాలోని సబీనా పార్క్ వేదికగా జరుగనుంది.శ్రీలంకతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం విండీస్ జట్టుషాయ్ హోప్ (సి), జువెల్ ఆండ్రూ, అకీమ్ అగస్టే, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమార్ జోసఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్కాగా, శ్రీలంక క్రికెట్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంతకుముందు రెండో వన్డే కూడా వర్షార్పణం అయ్యింది. ఈ సిరీస్లో జరిగిన ఏకైక వన్డేలో గెలవడంతో శ్రీలంక సిరీస్ను కైవసం చేసుకుంది.స్వదేశంలో సిరీస్ కోల్పోవడంతో విండీస్ జట్టు 2027 వన్డే వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. 2023-27 సైకిల్లో విండీస్ ప్రస్తుతం పదో స్థానంలో ఉంది. టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్గా టోర్నీలోకి అడుగుపెడతాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు-నవంబరు మధ్య జరుగనున్న సంగతి తెలిసిందే. -
BCCI: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లే భారత టీ20 జట్టు నుంచి స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను తప్పించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోకాగా టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఫామ్లేమితో బాధపడుతున్న సూర్యను తప్పించి.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. దాదాపు మూడేళ్ల తర్వాత అతడిని జట్టును ఎంపిక చేయడమే కాకుండా.. కెప్టెన్గా నియమించింది.ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా జూన్ 26 నుంచి ఐర్లాండ్లో పర్యటించనుంది. తొలుత ఐర్లాండ్తో రెండు టీ20లు ఆడి.. ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. వైభవ్ సూర్యవంశీకి చోటుఇందుకోసం ప్రకటించిన జట్టులో తొలిసారిగా పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తాడని యాజమాన్యం తొలుత ప్రకటించింది.అందుకే సిరాజ్ను తప్పిస్తు న్నాంతాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ‘‘మా వైద్య బృందంతో చర్చల అనంతరం.. సిరాజ్కు విశ్రాంతి కావాలని భావించాము. పనిభారాన్ని తగ్గించే క్రమంలో అతడిని ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన నుంచి తప్పిస్తున్నాము. సుదీర్ఘమైన అంతర్జాతీయ క్రికెట్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.సిరాజ్ స్థానంలో ప్రసిద్ కృష్ణను సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సిరాజ్కు బదులు ఐర్లాండ్, ఇంగ్లండ్లలో అతడు టీ20 సిరీస్లలో పాల్గొంటాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్కు టీమిండియా (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ కృష్ణ.చదవండి: టీమిండియాలో చోటివ్వరా? సెంచరీతో కదంతొక్కాడు! -
టీమిండియాలో చోటివ్వరా? శతకంతో కదం తొక్కాడు!
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ శతక్కొట్టాడు. శ్రీలంక-‘ఎ’ జట్టుతో తొలి వన్డేలో సెంచరీతో మెరిసి జట్టును ఆదుకున్నాడు. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో పాటు అఫ్గనిస్తాన్తో భారత్ వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత శ్రీలంకతో పోరుకు భారత్ సిద్ధమైంది. దంబుల్లా వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.వైభవ్ విఫలం..అయితే, ఆదిలోనే శ్రీలంక భారత్కు షాకిచ్చింది. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2), వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14)లను పెవిలియన్కు పంపి దెబ్బకొట్టింది. వన్డౌన్లో వచ్చిన ప్రియాంశ్ ఆర్య 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.శతకంతో కదంతొక్కాడుఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ శతకంతో కదంతొక్కాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ (97 బంతుల్లో 60)తో కలిసి 185 బంతుల్లో 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.మిగిలిన వారిలో ఆయుశ్ బదోని 24, సూర్యాంశ్ షెడ్గే 26 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన భారత్ 277 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో మహ్మద్ షిరాజ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. చమిక కరుణరత్నె, గరుక సంకేత్, వనుజా సాహన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గనిస్తాన్తో వన్డేలకు ఎంపిక చేయని సెలక్టర్లుచివరగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అఫ్గనిస్తాన్తో స్వదేశంలో జూన్ సిరీస్కు రుతురాజ్ను ఎంపిక చేయలేదు.స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు ఆఖరి నిమిషంలో చోటిచ్చారు. ఇలాంటి తరుణంలో రుతురాజ్ భారత్-ఎ తరఫున శతక్కొట్టడం విశేషం. దీంతో తనను విస్మరించిన టీమిండియా సెలక్టర్లకు రుతు బ్యాట్తోనే గట్టి సమాధానం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కొడితే సెంచరీ.. లేదంటే డకౌట్! -
ODI WC: కొంప ముంచిన వర్షం.. విండీస్కు తప్పని గండం!
సొంతగడ్డపై వెస్టిండీస్ చతికిలపడింది. పర్యాటక శ్రీలంక జట్టుకు వన్డే సిరీస్ను కోల్పోయింది. ఫలితంగా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య ఈ మెగా ఈవెంట్ జరుగనున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా విండీస్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేలు ఆడేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్లో పర్యాటక జట్టు చేతిలో 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత రెండు వన్డేలు వర్షం వల్ల రద్దైపోయాయి. దీంతో సిరీస్ 1-0తో శ్రీలంక వశమైంది.పదో స్థానంలో...ఫలితంగా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి వెస్టిండీస్ నేరుగా అర్హత సాధించే అవకాశాలు సన్నగిల్లాయి. కాగా శ్రీలంకతో సిరీస్ ద్వారా ఈ సైకిల్ (2023-2027)లో విండీస్ ఇప్పటికి 32 మ్యాచ్లు పూర్తి చేసుకుంది.ఇందులో 11 గెలిచి, 18 ఓడిపోయింది. మిగిలిన మ్యాచ్లు వర్షం వల్ల రద్దైపోయాయి. దీంతో మొత్తంగా 73 రేటింగ్ పాయింట్లతో వెస్టిండీస్ పట్టికలో పదో స్థానంలో ఉంది.టాప్-8లో ఉన్న జట్లు మాత్రమేకాగా పట్టికలో టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్గా టోర్నీలో అడుగుపెడతాయి.ఇక విండీస్కు ఈ సైకిల్లో దాదాపుగా తొమ్మిది మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో జూలైలో న్యూజిలాండ్తో మూడు వన్డేలు ఆడనున్న కరేబియన్ జట్టు.. తదుపరి భారత పర్యటనలో మూడు వన్డేలు ఆడుతుంది. అనంతరం అఫ్గనిస్తాన్కు మూడు వన్డేల కోసం ఆతిథ్యం ఇస్తుంది. వరుసగా రెండోసారి..ఈ సిరీస్లలో వెస్టిండీస్ మెరుగైన ప్రదర్శనతో గెలవాల్సి ఉంటుంది. వర్షం వల్ల ఈ మ్యాచ్లకు ఆటంకం కలిగితే విండీస్ అవకాశాలు మరింత సన్నగిల్లడం ఖాయం. అదే జరిగితే వెస్టిండీస్ వరుసగా రెండోసారి గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది.ఇందులో నాలుగు స్థానాల కోసం పది జట్లు పోటీలో ఉంటాయి. ఉదాహరణకు.. స్కాట్లాండ్, నమీబియా, ఐర్లాండ్ వంటి చిన్నజట్లు రీజినల్ క్వాలిఫయర్స్లో సత్తా చాటడం ద్వారా గ్లోబల్ క్వాలిఫయర్లో అడుగుపెడతాయి. కాగా గత ఎడిషన్లో వెస్టిండీస్కు ఈ టోర్నీలో ఘోర పరాభవం ఎదురైంది.గత ఎడిషన్కు అర్హత సాధించకుండానే..స్కాట్లాండ్, నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి.. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి అర్హత సాధించకుండానే వెస్టిండీస్ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. రెండుసార్లు చాంపియన్గా నిలిచిన జట్టు ఈ మేరకు అర్హత కూడా సాధించకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఇక ప్రస్తుతం పటిష్టమైన ప్రత్యర్థులు న్యూజిలాండ్, టీమిండియాపై వెస్టిండీస్ సత్తా చాటాల్సి ఉంది. అఫ్గనిస్తాన్ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుత సైకిల్లో కూడా విండీస్కు క్వాలిఫయర్స్ ఆడే గండం తప్పకపోవచ్చని అనిపిస్తోంది. చదవండి: పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను -
కొంపముంచిన రుతురాజ్.. క్రికెట్ చరిత్రలో వింత రనౌట్!
ఇండియా-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే వింత రనౌట్కు మ్యాచ్ సాక్ష్యంగా నిలిచింది. విషయంలోకి వెళితే.. ఓపెనర్దిద్దరు తొందరగానే పెవిలియన్ చేరడంతో రుతురాజ్, ప్రియాన్ష్ ఆర్యలు ఆచితూచి ఆడారు. ఇద్దరు కలిసి చాలా బంతులెదుర్కొని 53 పరుగులు జోడించారు. ఇద్దరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో రుతురాజ్ చేసిన తప్పిదం కొంపముంచింది. రవిందు ఫెర్నాండో వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ తొలి బంతినే గైక్వాడ్ సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత బంతికే హైడ్రామా చోటుచేసుకుంది. పాయింట్ దిశగా ఆడిన రుతురాజ్ రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే స్ట్రైక్ ఎండ్వైపు ఉన్న ప్రియాన్ష్ ఆర్య రుతురాజ్ రెండో పరుగు కోసం వచ్చిన విషయం గమనించలేదు. అప్పటికే క్రీజులో బ్యాట్ పెట్టాడు. కానీ అప్పటికే రుతురాజ్ స్ట్రైక్ ఎండ్వైపు వచ్చేశాడు. ఈలోగా బంతిని కీపర్ బౌలర్ వైపు విసిరే క్రమంలో ప్రియాన్ష్ బ్యాట్ను తొక్కడం కనిపించింది. ఇంతలో కీపర్ నుంచి బంతిని అందుకున్న బౌలర్ వికెట్లను గిరాటేశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్లో ఉండడంతో నిబంధనల ప్రకారం ఎవరు బ్యాట్ను మొదటగా క్రీజులో పెట్టారనేది అంపైర్లు పరిశీలించారు. రిప్లేలో ప్రియాన్ష్ ఆర్య బ్యాట్ క్రీజుపై ఉంచినప్పటికీ, ప్రియాన్ష్ కంటే ముందే రుతురాజ్ బ్యాట్ను క్రీజులో ఉంచడం కనిపించింది. దీంతో అంపైర్లు ప్రియాన్ష్ ఆర్యను రనౌట్ అయినట్లు ప్రకటించారు. ఇద్దరి మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ వింత రనౌట్ జరిగింది. ఇలాంటి వింత రనౌట్లకు పాకిస్తాన్ పెట్టింది పేరు. ఇప్పుడు రుతురాజ్, ప్రియాన్ష్లు వింత రనౌట్తో వార్తల్లోకెక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే 69 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రుతురాజ్ గైక్వాడ్ (101), కెప్టెన్ తిలక్ వర్మ (60 బ్యాటింగ్) ఆదుకున్నారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 150 పరుగులు జోడించారు. లిస్ట్-ఏ క్రికెట్లో మంచి రికార్డు కలిగిన రుతురాజ్ మరోసారి ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ సెంచరీతో మెరిశాడు. అయితే సెంచరీ చేసిన మరుక్షణమే రుతురాజ్ వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇండియా-ఏ 45 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అంతకముందు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (14) ఫామ్ను కొనసాగించడంలో విఫలమయ్యాడు.pic.twitter.com/Ga3qBawcIN— crictalk (@crictalk7) June 9, 2026చదవండి: మూడో వన్డే రద్దు.. లంక కెప్టెన్ అరుదైన ఫీట్! -
‘కొడితే సెంచరీ.. లేదంటే వస్తాడు.. అవుటై వెళ్లిపోతాడు’
స్వదేశంలో టీమిండియా అదరగొట్టింది. అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (126), ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టిన సంగతి తెలిసిందే. మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (81), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (81) అర్ద శతకాలతో మెరిశారు. కాగా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) గతేడాది కాలంగా టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 800కు పైగా పరుగులు సాధించాడు. ఇక అఫ్గన్తో మ్యాచ్ సందర్భంగా 165 బంతుల్లో 100 రన్స్ చేసిన రాహుల్.. టెస్టు కెరీర్లో 12వ సెంచరీ నమోదు చేశాడు.అశ్విన్ సంచలన వ్యాఖ్యలుమొత్తంగా ఇప్పటికి టీమిండియా తరఫున 68 టెస్టులు ఆడిన రాహుల్ 4153 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సగటు 36.43. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కేఎల్ రాహుల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫామ్లో లేకుంటే ఈ కర్ణాటక బ్యాటర్ నుంచి ఒక్క పరుగు కూడా ఆశించలేమన్నాడు.పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా లేకుంటే..తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘విదేశాల్లో కఠినమైన పిచ్ల మీద ఆడటం వల్ల అతడి బ్యాటింగ్ సగటు తక్కువగా ఉందని చాలా మంది కేఎల్ రాహుల్ను వెనకేసుకువస్తారు. కానీ అతడిలో నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను.పిచ్ గనుక బ్యాటింగ్కు అనుకూలంగా లేకుంటే.. అతడు ఒక్క పరుగు కూడా చేయడు. ఇలా బ్యాటింగ్కు వెళ్తాడు. అలా అవుటై పెవిలియన్కు చేరతాడు. ఒకవేళ అదే స్థానంలో విరాట్ కోహ్లి ఉంటే.. అప్పుడతడు ఫామ్లో లేకపోయినా కనీసం 30, 33, 43.. లేదంటే 28 పరుగులైనా చేస్తాడు.కొడితే సెంచరీ.. లేదంటేకానీ కేఎల్ రాహుల్ మాత్రం 0- 10 మధ్య కూడా పరుగులు రాబట్టలేడు. ఫామ్లో ఉన్నాడంటే సెంచరీ అయినా చేస్తాడు. అది వేరే సంగతి. ఒకవేళ ఫామ్లో లేడంటే మాత్రం మనం అతడి నుంచి పరుగులు ఆశించకూడదు.కొడితే సెంచరీ.. లేదంటే ఇలా వెళ్లి అలా వచ్చేయడం.. కేఎల్ రాహుల్లో నేను ఈ రెండు మాత్రమే చూశాను. అతడు మధ్యస్థంగా ఆడటం ఎప్పుడూ చూడలేదు. అయితే, గత రెండేళ్లుగా అతడి ఆట తీరులో పరిణతి కనిపిస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగ్గా ఆడుతున్నాడు’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటికి 119 టెస్టు ఇన్నింగ్స్ ఆడిన 34 ఏళ్ల కేఎల్ రాహుల్ ఖాతాలో తొమ్మిది డకౌట్లు, 31 సింగిల్ డిజిట్ స్కోర్లు ఉండటం గమనార్హం.చదవండి: పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను -
పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను: బంగ్లా కెప్టెన్
ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆడాలనేది ప్రతి ఒక్క క్రికెటర్ కల. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే ఈ మెగా ఈవెంట్లో మెరవాలని కోరుకోని ప్లేయర్ ఉండరు. అయితే, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రభుత్వ నిర్ణయం కారణంగా బంగారం లాంటి ఈ అవకాశాన్ని ఈ ఏడాది కోల్పోయారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి అర్హత సాధించినప్పటికీ.. ప్రభుత్వం పంతానికి పోవడంతో ఈవెంట్ నుంచే జట్టు నిష్క్రమించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్కప్ టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే.దౌత్యపరమైన ఉద్రిక్తతలుఅయితే, టోర్నీ ఆరంభానికి ముందు భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను బీసీసీఐ తొలగించింది. ఈ నేపథ్యంలో భారత్లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని.. ప్రపంచకప్ ఆడేందుకు అక్కడకు వెళ్లమంటూ బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) కొత్త రాగం ఎత్తుకుంది.ప్రభుత్వ నిర్ణయం.. కాదు కాదు ఆటగాళ్లేనంటూ..తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా ఐసీసీని కోరింది. అయితే, బీసీబీ వాదనలో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము టోర్నీ నుంచే తప్పుకొంటున్నట్లు బీసీబీ ప్రకటించింది. ఇందుకు సరేనన్న ఐసీసీ.. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను వరల్డ్కప్లో ఆడించింది.అయితే, నాటి బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్.. టోర్నీ నుంచి తప్పుకోవాలన్నది తొలుత ప్రభుత్వ నిర్ణయమని చెప్పి.. ఆ తర్వాత తమ ఆటగాళ్లే దేశం కోసం భారత్లో ఆడలేదంటూ బాంబు పేల్చాడు. సర్వత్రా విమర్శలు రావడంతో మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు.భారత్లో ఎలాంటి సమస్యా లేకపోయినా..ఈ చేదు అనుభవాల గురించి ప్రపంచకప్-2026 బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన లిటన్ దాస్ తాజాగా స్పందించాడు. తాము పాకిస్తాన్లో తుపాకుల మధ్య క్రికెట్ ఆడిన సందర్భాలు ఉన్నాయని.. అలాంటిది భారత్లో ఎలాంటి సమస్యా లేకపోయినా టోర్నీ నుంచి వైదొలగడం తీవ్రంగా కలచివేసిందన్నాడు.ప్రథోమ్ అలోతో మాట్లాడుతూ.. ‘‘ఆరోజు మాతో బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. మీరేం కోరుకుంటాన్నరో చెప్పండని అడిగారు. ప్రతి ఆటగాడు వరల్డ్కప్ ఆడాలనే అనుకున్నాడు. కానీ బోర్డుతో యుద్ధానికి దిగడం ఎవరికీ ఇష్టం లేదు.పాకిస్తాన్లో ఆడాము.. అంతకంటే ప్రమాదకరమా?కేవలం ప్రపంచకప్ టోర్నీ ఆడాలన్నదే మా కల. కానీ వాళ్లు భారత్లో భద్రత లేదని అన్నారు. అప్పుడు నేను నా వాదన వినిపించాను. ‘పాకిస్తాన్లో మేము క్రికెట్ ఆడాము. అప్పుడు గదుల వెలుపల తుపాకీలతో నిలబడి మాకు రక్షణ ఇచ్చారు.ఇంతకంటే ప్రమాదకరమైన పరిస్థితులు అక్కడ (భారత్) ఉంటాయా?’ అని అడిగాను. కానీ వాళ్లు మాత్రం వినలేదు. తమకు నచ్చిన నిర్ణయమే తీసుకున్నారు. ఆటగాళ్లుగా వాళ్లు ఏం చెబితే మేము అదే వినాలి కదా!’’ అని లిటన్ దాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.బీసీసీఐతో సంబంధాల పునరుద్ధరణపై దృష్టికాగా బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీసీఐతో సంబంధాలు పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం బీసీబీ తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ను నియమించింది. పదవి చేపట్టిన వెంటనే రంగంలోకి దిగిన తమీమ్ ఇక్బాల్.. బోర్డు తరఫున బీసీసీఐకి లేఖ రాయించాడు. ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశాడు.ఏదేమైనా పాత ప్రభుత్వం వల్ల తాము ఎంతో నష్టపోయామని.. వారి అనుచిత నిర్ణయం వల్ల వరల్డ్కప్ ఆడే అవకాశం కోల్పోయామని ఆటగాళ్లు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా ఐసీసీ గట్టిగానే మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మెగా టోర్నీలో ఆతిథ్య టీమిండియా విజేతగా నిలిచి... ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది.చదవండి: అర్జున్ టెండుల్కర్ అదరగొట్టాడు -
మూడో వన్డే రద్దు.. లంక కెప్టెన్ అరుదైన ఫీట్!
వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరగాల్సిన మూడో వన్డే వర్షార్పణమైంది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను లంక 1-0తో కైవసం చేసుకుంది. దీంతో విండీస్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన మూడో కెప్టెన్గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతంలో అర్జున రణతుంగ, ఆటపట్టు ఈ ఫీట్ను సాధించారు. జమైకా వేదికగా జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది.కనీసం టాస్ వేసేందుకు కూడా వరుణుడు అవకాశం కల్పించలేదు. గ్రౌండ్ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని, మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండో వన్డే కూడా వర్షార్పణమైన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో మాత్రం శ్రీలంక జట్టు 41 పరుగుల తేడాతో గెలిచింది. కరీబియన్ గడ్డపై 13 ఏళ్ల తర్వాత లంక విజయం సాధించడం విశేషం. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ గురువారం నుంచి మొదలుకానుంది. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్లు కూడా జరగనున్నాయి.చదవండి: రోహిత్, పాండ్యా ఫిట్నెస్పై కీలక అప్డేట్! -
రోహిత్, పాండ్యా ఫిట్నెస్పై కీలక అప్డేట్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పాండ్యాకు బీసీసీఐ సీఓఈ స్పోర్ట్స్ బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన పలు మ్యాచ్ సిమ్యులేషన్లలో పాండ్యా పాల్గొన్నాడని, ఎక్కడా అసౌకర్యంగా కనిపించలేదని మెడికల్ బృందం తెలిపింది. అతడు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న భారత్, ఆఫ్గన్ తొలి వన్డేలో పాండ్యా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ఫిట్నెస్ నిరూపించు కున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ శుభవార్త చెప్పాడు. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు రోహిత్, పాండ్యా అందుబాటులో ఉంటారని తెలిపాడు. అయితే ఫిట్నెస్ క్లియరెన్స్కు సంబంధించి సర్టిఫికెట్ను మెడికల్ సీవోఈ బృందం ఇంకా అందించలేదు. అయితే తనకు అందిన సమాచారం మేరకు రోహిత్, పాండ్యా ఫిట్నెస్ నిరూపించుకున్నారని, అయితే మెడికల్ టీమ్ ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వలేదని తెలిపాడు. అయితే వారి నుంచి ఒక్కసారి క్లియరెన్స్ వస్తే మాత్రం రోహిత్, పాండ్యాలు ఆఫ్గన్తో వన్డే సిరీస్లో ఆడతారని స్పష్టం చేశాడు. కానీ వన్డే సిరీస్లో ఈ ఇద్దరూ పాల్గొనాలంటే పాండ్యా, రోహిత్లు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ చాలా మ్యాచ్లకు అందుబాటులో లేడు. కండరాల గాయంతో గ్రూప్ దశలో ఐదు మ్యాచ్కు దూరమవ్వగా, పాండ్యా లీగ్ ఆఖరి దశలో వెన్నునొప్పి కారణంగా చివరి మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత పాండ్యా, రోహిత్ శర్మలు ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి వచ్చారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు! -
వైభవ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు!
టీమిండియాకు ఎంపికైన బీహార్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ శ్రీలంక-ఏతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో విఫలమయ్యాడు. ఓపెనర్గా వచ్చిన వైభవ్ 12 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడు ఫోర్లతో ఊపు మీద కనిపించినప్పటికీ మొహమ్మద్ షిరాజ్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన వైభవ్ మిడాఫ్లో దొరికిపోయాడు. వైభవ్ కొట్టిన బంతిని సాహన్ అరాచిగే ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో వైభవ్ చెలరేగుతాడని ఆశించిన అభిమానులు నిరాశే ఎదురైంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన నెట్ సెషన్లో వైభవ్ కొంత సమయం రక్షణాత్మక బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాడు. సాధారణంగా దూకుడైన ఆటకు పెట్టింది పేరైన వైభవ్ వన్డే మ్యాచ్ కావడంతో పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇవాళ్టి మ్యాచ్లో మాత్రం వైభవ్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇండియా-ఏ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 7 ఓవర్లు ముగిసేసరికి ఇండియా జట్టు 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (12), రుతురాజ్ గైక్వాడ్ (2) పరుగులతో ఆడుతున్నారు.ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 16 మ్యాచ్లో 776 పరుగులు చేసి టోర్నమెంట్లో తనడైన ముద్ర వేశాడు. దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను వణికించిన వైభవ్.. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.టీ20 ఫార్మాట్ లో ఇప్పటికే తన ముద్ర వేసిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న యువ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతడి దూకుడైన శైలి, భారీ షాట్లు ఆడగల సామర్థ్యం భారత క్రికెట్ వర్గాల్లో అంచనాలు పెంచాయి. ఇప్పుడు శ్రీలంక-ఏ, ఆ తర్వాత అఫ్గానిస్థాన్-ఏ జట్లపై కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాడు.గతేడాది ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్లో యూఏఈపై ఇండియా-ఏ తరఫున వైభవ్ కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు బాదిన విషయం ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయింది. ఆ ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన బుడ్డాడు.. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా అదే స్థాయి ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.Vaibhav Suryavanshi started brightly with a few beautiful strokes, but his innings was cut short on 14 off 12 balls, including three boundaries. pic.twitter.com/a2RiJi4SNn— CofCricket (@CofCricket) June 9, 2026చదవండి: ఫూటుగా తాగి ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం! -
అతడికి షరతులు వర్తించవా?.. అగార్కర్కు చురకలు!
ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్కు సంబంధించి టీమిండియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో ఆటగాళ్ల ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్కు ముందు గాయానికి గురైన పేసర్ హర్షిత్ రాణా అప్పటినుంచి ఒక్క మ్యాచ్ ఆడకపోయినప్పటికీ మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. హర్షిత్ రాణా ఎంపికపై భారత మాజీ క్రికెటర్ శఠగోపన్ రమేశ్ అసహనం వ్యక్తం చేశాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఏ ప్రాతిపాదికన హర్షిత్ రాణాను ఎంపిక చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి ఎంపికల వల్ల మహ్మద్ షమీ, భువనేశ్వర్ వంటి సీనియర్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మాట్లాడుతూ..‘హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు? మోకాలి శస్త్రచికిత్స అనంతరం దేశవాలీలో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా ఇప్పుడు మూడు జట్లకు ఎంపిక చేయడం పట్ల సమాధానం మాత్రం ఉండదు. కొన్నాళ్లుగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న షమీ లాంటి క్రికెటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు. దేశవాలీ క్రికెట్లో ఆటగాళ్లు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాలనే నిబంధనను హర్షిత్ రాణా విషయంలో సెలెక్షన్ కమిటీ గాలికొదిలేసింది. కోహ్లీ, రోహిత్ ఇలా ఎవరైనా ఫిట్నెస్ నిరూపించుకుంటూనే జట్టులో చోటు ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. పాండ్యా గాయపడినప్పుడు కూడా జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందేనని అల్టీమేటం జారీ చేశారు. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ను కూడా న్యూజిలాండ్తో వన్డేలకు ముందు విజయ్ హజారే ట్రోఫీ ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలని కోరారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ హర్షిత్ రాణా విషయంలో మాత్రం అలా జరగలేదు. అతడికి ఈ షరతులు ఎందుకు వర్తించవనేది అగార్కర్ సమాధానం చెప్పాలి.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇక హర్షిత్ రాణా 2026 టీ20 ప్రపంచకప్కు టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ వార్మప్ మ్యాచ్లో బౌలింగ్ చేస్తుండగా మోకాలికి గాయమైంది. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న హర్షిత్ రాణా ఐపీఎల్ 2026 సీజన్కు కూడా దూరంగా ఉన్నాడు.చదవండి: ఫూటుగా తాగి ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం! -
ఫూటుగా తాగి ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం!
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వివాదంలో చిక్కుకున్నాడు. జట్టు బౌలర్ గస్ అట్కిన్సన్తో కలిసి ఫూటుగా మద్యం తాగి అపరిచితులపై దాడి చేసి వీరంగం సృష్టించాడు. తాజా ఉదంతంతో స్టోక్స్ మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్టోక్స్తో పాటు అట్కిన్సన్పై నిషేధం విధించే అవకాశం లేకపోలేదు. ఈ ఘటనతో స్టోక్స్ టెస్టు కెప్టెన్సీకి కూడా ముప్పు పొంచి ఉంది. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టు బుధవారం నుంచి జరగనుంది. మొదటి టెస్టు గెలిచిన ఆనందంలో కెప్టెన్ బెన్స్టోక్స్, బౌలర్ అట్కిన్సన్లు బోర్డు అనుమతి లేకుండా దొంగచాటుగా ఒక నైట్క్లబ్కు వెళ్లారు. ఇద్దరు పీకలదాకా మద్యం తాగారు. అనంతరం హోటల్ రూమ్ కు వస్తుండగా కొంతమంది అపరిచితులతో గొడవపడ్డారు . మాటా మాట పెరగడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బీర్ బాటిల్స్ విసురుకున్నారు. అట్కిన్సన్ వద్దని వారించినా స్టోక్స్ వినకుండా అవతలి వర్గంలో ఉన్న వ్యక్తుల్లో ఒకరిని కిందపడేసి విచక్షణారహితంగా కొట్టాడు. అయితే ఈ సంఘటనలో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సమాచారం అందుకున్న పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. విషయం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు తెలియడంతో ఆగ్రహించింది. ఆటగాళ్లు బోర్డు అనుమతి లేకుండా బయటికి వెళ్లడమే తప్పని, అలాంటిది నైట్క్లబ్కు వెళ్లి పీకలదాకా మద్యం తాగి అపరిచితులపై దాడి చేయడం కరెక్టు కాదని అభిప్రాయపడింది. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ కమిటీ వేసినట్లు బోర్డు తెలిపింది. ఈ వ్యవహారంలో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సల తప్పు ఉందని తేలితే మాత్రం ఇద్దరిపై నిషేధం పడే అవకాశముంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఇద్దరిని వేర్వేరుగా విచారించినట్లు తెలుస్తోంది. దీంతో కివీస్తో రెండో టెస్టులో వీరిద్దరూ ఆడేది అనుమానమే. అంతేకాదు బెన్ స్టోక్స్ను కెప్టెన్సీ నుంచి తొలగించే అంశంపై కూడా ఒక నిర్ణయానికి రానున్నట్లు బోర్డు తెలిపింది. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్కు ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాగే పీకల దాకా తాగి రచ్చ చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే గతేడాది నవంబర్లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే నైట్క్లబ్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్కు ముందు వెల్లింగ్టన్లో ఒక నైట్క్లబ్కు వెళ్లిన బ్రూక్ బౌన్సర్తో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జాకబ్ బెథెల్ కూడా బ్రూక్తో కలిసి బౌన్సర్పై గొడవకు దిగాడు. అయితే దాడి పెద్దది కాకపోవడంతో ఈసీబీ వీరిద్దరిని మందలింపు చర్యతో సరిపెట్టింది. కానీ స్టోక్స్, అట్కిన్సన్ విషయంలో మాత్రం బోర్డు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ స్టోక్స్పై నిషేధం పడితే అతడి స్థానంలో హ్యారీబ్రూక్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నాడు.Ben Stokes, the real street fighter 😭 waiting for the new fight video pic.twitter.com/iK0at0nSvg— Santoshvk18 (@269signofff) June 8, 2026చదవండి: టీ20 ముంబై లీగ్లో అర్జున్ టెండూల్కర్ విధ్వంసం! -
టీ20 ముంబై లీగ్లో అర్జున్ టెండూల్కర్ విధ్వంసం!
టీ20 ముంబై లీగ్ 2026 సీజన్లో అర్జున్ టెండూల్కర్ విజృంభించాడు. టోర్నీలో ఏఆర్సీఎస్ అంధేరీ తరఫున ఆడుతున్న అర్జున్ సోమవారం బాంద్రా బ్లాస్టర్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. మొదట బౌలింగ్లో మూడు వికెట్లు (3-1-11-3) కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో వన్డౌన్లో వచ్చిన అర్జున్ టెండూల్కర్ 34 బంతుల్లోనే 66 పరుగులు అజేయ ఇన్నింగ్స్తో మ్యాచ్లో వన్మ్యాన్ షో ప్రదర్శన చేశాడు. అతడి ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. 25 బంతుల్లోనే ఫిప్టీ మార్క్ను అందుకున్న అర్జున్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అర్జున్ విధ్వంసంతో అంధేరీ 145 పరుగుల లక్ష్యాన్ని 13.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ముషీర్ఖాన్ (38 బంతుల్లో 58 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్టర్స్ అర్జున్ టెండూల్కర్ ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. ఓమ్ కేశ్కామత్ (36 బంతుల్లో 49) టాప్ స్కోరర్ కాగా, సాగర్ ఛాబ్రియా (23 బంతుల్లో 44) రాణించాడు. అర్జున్ మూడు వికెట్లు తీయగా, ప్రసూన్ సింగ్ 2, అజమ్ మిశ్రా, శివమ్ దూబే, ముషీర్ ఖాన్, ప్రగ్నేశ్లు తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్జెయింట్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆడింది ఒక్క మ్యాచ్ అయినప్పటికీ, తన ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. బౌలింగ్లో 4 ఓవర్లు వేసిన అర్జున్ 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.Arjun Tendulkar picked up a wicket in his very first over, but the funniest part was Musheer Khan going in for the high-five 😭 Arjun hit his hand so hard Musheer was genuinely shocked and started telling everyone on the field to look at how hard he got hit 😂💀 pic.twitter.com/ldx9GCD2po— OldMonkOfCricket (@OldMonkofCric) June 9, 2026Match 16 | AA v BB: A performance to remember! Arjun Tendulkar bags the Player of the Match honours.📌 June 1-13 | Wankhede Stadium.🎟️ Tickets live at the link in bio. 🎥 Watch live on Jio Hotstar and Star Sports.🌐 Track live on https://t.co/2GVUXSuuuk and the T20 Mumbai… pic.twitter.com/2C4JBSxKVw— T20 Mumbai (@T20Mumbai) June 8, 2026Arjun Tendulkar hit such a massive six in today’s T20 Mumbai League match that the ball landed in the stands and struck a young child. The child appeared to be in a lot of pain and started crying loudly.😢 pic.twitter.com/yJIyGc3Oit— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 8, 2026 -
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్లో కీలక మార్పు
త్వరలో స్వదేశంలో భారత్తో జరుగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు సంబంధించి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ వీక్షకుల సంఖ్య పెంచేందుకు మూడు మ్యాచ్ల ప్రారంభ సమయాలను మార్చింది.వాస్తవానికి ఈ మ్యాచ్లు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే బ్రాడ్కాస్టర్లతో చర్చల అనంతరం వాటిని సాయంత్రం 5.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) ప్రారంభించాలని నిర్ణయించారు.ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం భారత ప్రేక్షకులే. భారత్లో క్రికెట్కు ఉన్న విపరీతమైన ఆదరణ దృష్ట్యా, మ్యాచ్లు మరింత ఎక్కువ మంది వీక్షించేలా టైమింగ్ను మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బ్రిటన్కు చెందిన స్కై స్పోర్ట్స్, భారత్కు చెందిన సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లతో ECB సంప్రదింపులు జరిపింది.కాగా, జూలై 1 నుంచి 19 వరకు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటనుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోసం భారత జట్టును తాజాగా ప్రకటించారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు ఈ సిరీస్కు సిద్ధమవుతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలిసారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడంతో ఈ పర్యటనపై మరింత ఆసక్తి నెలకొంది. -
టీమిండియాకు గుడ్ న్యూస్
త్వరలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త అందుతుంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పరీక్షల కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సందర్భంగా రోహిత్ హామ్స్ట్రింగ్ గాయానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.తాజాగా ఆ పునరావాసాన్ని పూర్తి చేసుకొని CoEకు చేరాడు. అక్కడ రోహిత్కు మూడు రోజుల పాటు ఫిట్నెస్ పరీక్షలు, నెట్ సెషన్లు, బ్యాటింగ్ ప్రాక్టీస్ నిర్వహించనున్నారు. ఇందులో ఫ్లడ్లైట్ల కింద ప్రత్యేక బ్యాటింగ్ సెషన్ కూడా ఉండనుంది. ఈ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధిస్తేనే రోహిత్కు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఆడేందుకు వైద్యుల అనుమతి లభించనుంది.తొలుత జూన్ 9న జట్టుతో కలిసి వెళ్లాల్సి ఉన్న రోహిత్, ఇప్పుడు ఫిట్నెస్ క్లియరెన్స్ తర్వాత మాత్రమే జట్టులో చేరనున్నాడు. జూన్ 11న ధర్మశాలకు చేరుకుని, జూన్ 13న జరిగే తొలి వన్డేకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.39 ఏళ్ల రోహిత్ ఇటీవల ఐపీఎల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, వన్డే ఫార్మాట్లో మాత్రం భారత జట్టుకు కీలక ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతోంది. 2027 ప్రపంచకప్ ఆడాలన్న లక్ష్యంతో రోహిత్ వన్డేల్లో కొనసాగుతున్నాడు. మిగతా ఫార్మాట్లకు ఇతను రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
రెచ్చిపోయిన స్పిన్నర్లు.. విండీస్ను చిత్తు చేసిన టీమిండియా
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్ల్లో టీమిండియా బోణీ కొట్టింది. కార్డిఫ్ వేదికగా విండీస్తో ఇవాళ (జూన్ 8) జరిగిన మ్యాచ్లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులకే పరిమితమైంది.భారత ఇన్నింగ్స్లో భారతి ఫుల్మాలి (56 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించగా.. షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (39), యస్తికా భాటియా (36) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్ 7, రిచా ఘోష్ డకౌట్, రాధా యాదవ్ 1, శ్రేయాంక పాటిల్ 2, క్రాంతి గౌడ్ 4, శ్రీ చరణి 2 (నాటౌట్) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ 4 వికెట్లతో సత్తా చాటగా.. కరిష్క రామ్హరాక్, ఆలియా అలెన్, డియాండ్రా డొట్టిన్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఓపెనర్లు డొట్టిన్ (49), షెర్మైన్ క్యాంప్బెల్ (25) శుభారంభం అందించినా, శ్రేయాంక పాటిల్ (4-0-36-4), రాధా యాదవ్ (4-0-25-3) చెలరేగడంతో విండీస్కు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు మినహా విండీస్ ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. భారత్ జూన్ 10న జరగే తమ మరో మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడనుంది. -
వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై
కెప్టెన్సీతో పాటు టీమిండియాలో స్థానం కోల్పోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్లో కసి రగులుతోన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ముంబై లీగ్లో అతడు వరుస విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో 24 బంతుల్లో 48 పరుగులు చేసిన స్కై.. తాజాగా తానాడిన రెండో మ్యాచ్లో (మరాఠా రాయల్స్) మరింతగా చెలరేగిపోయి 36 బంతుల్లోనే అజేయమైన 72 పరుగులు చేసి తన జట్టును గెలుపు తీరాలు దాటించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ అవార్డును స్కై.. ఇదే మ్యాచ్లో 5 వికెట్లు తీసిన సహచరుడు సిల్వెస్టర్ డిసౌజాతో షేర్ చేసుకొని తన గొప్ప మనసును చాటుకున్నాడు.మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. సిల్వెస్టర్ డిసౌజా (3.5-0-21-5) ధాటికి 152 పరుగులకే ఆలౌటైంది. రాయల్స్ జట్టులో 36 పరుగులు చేసిన మ్యాక్స్వెల్ స్వామినాథన్ టాప్ స్కోరర్గా నిలువగా.. చిన్మయ్ రాజేశ్ సుతార్ (32 రిటైర్డ్ ఔట్), సాహిల్ జాదవ్ (15), కెప్టెన్ సిద్దేశ్ లాడ్ (24), అయాజ్ ఖాన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ట్రంప్స్ నైట్స్ జట్టు.. సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ద సెంచరీతో పాటు నూతన్ కుమార్ గోయెల్ (56) అర్ద సెంచరీతో రాణించడంతో 16 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.కాగా, త్వరలో జరుగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను తాజాగా ప్రకటించారు. ఫామ్ కోల్పోయిన కారణంగా భారత సెలెక్టర్లు సూర్యను జట్టును తప్పించి, కెప్టెన్సీ నుంచి తొలగించారు. సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టు నూతన కెప్టెన్గా ఎంపికయ్యాడు. -
'ఆర్సీబీలోకి రావడమే ఇష్టం లేదు'
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును(ఆర్సీబీ) వరుసగా రెండుసార్లు చాంపియన్గా నిలిపిన అరుదైన కెప్టెన్గా రజత్ పాటీదార్ నిలిచాడు. వరుసగా ఒక జట్టుకు రెండు టైటిల్స్ అందించిన కెప్టెన్ల జాబితాలోనూ (ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ) పాటీదార్ చోటు దక్కించుకున్నాడు. తాజాగా పాటీదార్ మొదట్లో తనకు ఆర్సీబీకి ఆడడం ఇష్టం ఉండేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. యూట్యూబ్ చానెల్లో రోటోరిస్ సిరీస్లో జరిగిన ఇంటర్వ్యూలో పాటీదార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2021లో ఆర్సీబీ జట్టులో చేరిన తనను మొదట ఒక ప్రత్యామ్నాయ ఆటగాడిగా మాత్రమే చూశారని, అదే సమయంలో తన పెళ్లి ఉండడంతో మొదట ఆర్సీబీలో చేరేందుకు ఇష్టపడలేదని వెల్లడించాడు. పాటీదార్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పింది నిజమే. ఆర్సీబీ జట్టులోకి రావడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను తొలిసారి ఆ జట్టులోకి వచ్చిన సమ యంలో ప్రత్యామ్నాయంగానే చూశారు. తుది జట్టులో చోటు ఇవ్వరన్న విషయం క్లారిటీ ఉండడంతో ఆర్సీబీకి ఆడేందుకు సంకోచించాను. ఆర్సీబీలో జాయిన అయిన మొదట్లో కూడా అలాంటి సంకేతాలే వచ్చాయి. మేము నిన్ను ప్రత్యామ్నాయంగా మాత్రమే తీసుకున్నాం. కాబట్టి ప్రశాంతంగా ఉండు. ఎవరైనా గాయపడితే నీకు అవకాశం వస్తుంది అని ఆర్సీబీ యాజమాన్యం క్లియర్గా చెప్పింది. దీంతో ఆర్సీబీలోకి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అదే సమయంలో నా పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఒకవేళ ఆర్సీబీలోకి వచ్చినా బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చేది’ అని చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ 2021 సీజన్కు ముందు జరిగిన మినీ వేలంలో పాటిదార్ను ఆర్సీబీ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో పెద్దగా ఆడే అవకాశం రాని పాటీదార్ నాలుగు మ్యాచ్ల్లో 71 పరుగులు మాత్రమే చేశాడు. 2022 ఐపీఎల్ మెగావేలంలో పాటీదార్ను ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే సీజన్ మధ్యలో లవ్నిత్ సిసోడియా గాయపడడంతో అతడి స్థానంలో పాటీదార్ను తీసుకుంది. ఈసారి పాటీదార్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ సీజన్ ఎలిమినేటర్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో పాటీదార్ అజేయ సెంచరీ ( 112 పరుగులు నాటౌట్) సంచలన ఇన్నింగ్స్తో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత పాటీదార్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఐపీఎల్ 2025 మెగావేలం తర్వాత ఆర్సీబీ పాటీదార్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్గా తొలి సీజన్లోనే పాటీదార్ ఆర్సీబీని చాంపియన్గా నిలిపాడు. తాజాగా ఈ సీజన్లోనూ మరోసారి ఆర్సీబీని చాంపియన్గా నిలిపి లక్కీ కెప్టెన్ అయిపోయాడు. పాటీదార్ కెప్టెన్గానే గాక బ్యాటర్గాను అదరగొట్టాడు. ఈ సీజన్లో పాటీదార్ 15 మ్యాచ్ల్లో 501 పరుగులు సాధించాడు.చదవండి: రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ విన్నాం.. ఆబ్సెంట్ హర్ట్ అంటే?


