Cricket
-
‘అఫ్గనిస్తాన్తో సిరీస్ బాయ్కాట్ చేయొచ్చు’
క్రికెట్ ఐర్లాండ్ ఇటీవలే అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ ఆడనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. సొంతగడ్డపై ఆగష్టు 5- 14 వరకు ఐర్లాండ్- అఫ్గనిస్తాన్ మధ్య ఐదు వన్డేలు జరుగనున్నట్లు వెల్లడించింది.కాగా గతంలో ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లు అఫ్గనిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లు బహిష్కరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అఫ్గన్లో 2021లో తిరిగి వచ్చిన తాలిబన్ ప్రభుత్వం మహిళలు, బాలికల పట్ల అనుసరిస్తున్న విధానాలే కారణం.అయితే, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ సమయంలో ఇంగ్లండ్ అఫ్గన్తో మ్యాచ్ బాయ్కాట్ చేస్తామని ముందుగా చెప్పినా.. ఆ తర్వాత మాత్రం మ్యాచ్ ఆడింది. ఇక ఐర్లాండ్ తాజాగా అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ ఆడనుండటం పట్ల విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో క్రికెట్ ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రేమ్ వెస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము అఫ్గన్తో సిరీస్ నిర్వహిస్తున్నా.. ఇష్టం లేని ఆటగాళ్లు తప్పుకొనే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా ఆటగాళ్లకు మేము ఆ వెసలుబాటు కల్పిస్తాం.ఇప్పటికే పురుష, మహిళల జట్లతో మేము ఈ విషయంలో అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాము. బోర్డుతో కూడా మాట్లాడాము. ఇరు వర్గాలకు ఇందుకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్వేచ్ఛ ఉంటుంది’’ అని వెస్ట్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. క్రికెట్ ఐర్లాండ్ సీఈవో ఇటీవలే ఎంపికైన సారా కీన్ అఫ్గనిస్తాన్తో సిరీస్ నిర్వహణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళగా తనకు ఈ విషయంలో నైతికంగా కాస్త ఇబ్బందిగానే ఉందని.. అయితే, సిరీస్ బహిష్కరించడం ద్వారా సాధించేది ఏమీ ఉండకపోవచ్చని అన్నారు.తమ బోర్డులో నలభై శాతం మహిళలే ఉన్నారని.. అఫ్గనిస్తాన్తో సిరీస్ను బహిష్కరించే బదులు.. ఆ మహిళా జట్టును కూడా ఐర్లాండ్కు పంపాల్సిందిగా కోరినట్లు సారా తెలిపారు. కాగా ఇటీవల ఐర్లాండ్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలమైంది. కనీసం సూపర్-8 దశ చేరకుండానే లీగ్ స్టేజీలోనే నిష్క్రమించింది. ఫలితంగా టీ20 కెప్టెన్ పదవికి పాల్ స్టిర్లిండ్ రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టులో అఫ్గనిస్తాన్తో జరిగే వన్డే సిరీస్కు బ్రీడీ, బెల్ఫాస్ట్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
అత్యంత క్లిష్ట సమయం: బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు
ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గడిచిన మూడు నెలల కాలం తన కెప్టెన్సీ కెరీర్లో అత్యంత కష్టతరమైనదని పేర్కొన్నాడు. ఏదేమైనా తాము సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటామని అన్నాడు.ఘోర పరాభవంఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టు చేతిలో 4-1తో ఓడిపోయిన స్టోక్స్ బృందం.. ఈ కీలక టెస్టు సిరీస్ను ఆసీస్కు సమర్పించుకుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్కు ఊరటనిచ్చిన ఒకే ఒక్క అంశం మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు గెలవడం మాత్రమే. రాజీనామా డిమాండ్లూఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు ఆట తీరుపై.. ముఖ్యంగా బజ్బాల్ పేరిట టెస్టు క్రికెట్లోనూ దూకుడుగా ఆడటం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ రాజీనామా చేయాలనే డిమాండ్లూ వచ్చాయి. అయితే, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) మాత్రం వీరిపై నమ్మకం ఉంచింది.అన్నిసార్లూ అదే సరైన మార్గం కాదుECB చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గుడ్ ఈ విషయం గురించి తాజాగా మాట్లాడుతూ.. ‘‘అంతర్గతంగా యాషెస్ వైఫల్యంపై సమీక్ష జరిపాము. కొన్నిసార్లు నాయకత్వ బృందాన్ని మార్చడం తేలికైన పని అనిపిస్తుంది. కానీ అన్నిసార్లూ అదే సరైన మార్గం కాదు.అదృష్టవశాత్తూ మా నాయకత్వ బృందానికి అంకితభావం, లక్ష్య సాధనకై శ్రమించే తత్వం ఎక్కువ. యాషెస్ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు’’ అని పేర్కొన్నాడు. అత్యంత క్లిష్టమైనదిఈ మేరకు రిచర్డ్ వ్యాఖ్యలు చేసిన కాసేపటికి స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘‘ఇంగ్లండ్ జట్టు కెప్టెన్గా ఉండటం అత్యంత గొప్ప గౌరవం. దీనిని నేను తేలికగా తీసుకోవడం లేదు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి.కొన్నిసార్లు నవ్వితే.. మరికొన్నిసార్లు వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు. గత మూడు నెలల కాలం నా కెప్టెన్సీ ప్రయాణంలో అత్యంత క్లిష్టమైనది. బజ్ (మెకల్లమ్), రాబ్ కీ (సెలక్టర్), నేను ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నాము.జట్టును విజయపథంలో నడిపించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. మేము కొన్ని తప్పులు చేశామని మాకు తెలుసు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటాము. అపజయాలను విజయాలుగా మారుస్తాము. సమ్మర్ టెస్టు షెడ్యూల్తో జూన్లో మిమ్మల్ని కలసుకుంటాను’’ అని స్టోక్స్ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా బజ్, రాబ్తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.చదవండి: PSL: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం -
RR సంచలనం.. రూ. 15 వేల కోట్లకు సొంతం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సరికొత్త సంచలనం.. ఆరంభ సీజన్-2008 విజేత రాజస్తాన్ రాయల్స్ (RR) రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. రాజస్తాన్ ఫ్రాంఛైజీని అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.రూ. 15 వేల కోట్లకు సొంతం!జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దాదాపు 1.63 బిలియన్ అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ. 15 వేల కోట్లు) మొత్తానికి ఈ కన్సార్టియం రాయల్స్ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా వ్యాపారవేత్తలు.. వాల్మార్ట్ కుటుంబానికి చెందిన రాబ్ వాల్టన్, హ్యాంప్ కుటుంబం సోమానితో కలిసి ఈ డీల్లో భాగమైనట్లు తెలుస్తోంది.ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో రాజస్తాన్ రాయల్స్ యాజమాన్య మార్పు జరుగనున్నట్లు సమాచారం. కాగా మనోజ్ బదాలే సారథ్యంలోని ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ రాజస్తాన్ రాయల్స్కు యజమానిగా ఉంది. రెడ్బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్, లాచ్లాన్ ముర్దోచ్ తదితర సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.అయితే, ఫ్రాంఛైజీని అమ్మేయాలని గతేడాది యాజమాన్యం నిర్ణయానికి రాగా.. ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికాకు చెందిన స్పోర్ట్స్ ఇన్వెస్టర్ డేవిడ్ బిల్ట్జర్ రాయల్స్ను కొనేందుకు పోటీపడ్డారు. అయితే, ఆఖరికి ఇది సోమాని నేతృత్వంలోని కన్సార్టియానికి సొంతమైనట్లు తెలుస్తోంది.ఎవరీ కల్ సోమానీ?ఎడ్ టెక్, కృత్రిమ మేధ, క్రీడా సాంకేతికత, సమాచార గోప్యత తదితర రంగాల్లో పదిహేనేళ్లకు పైగా అనుభవం ఉన్న అమెరికాకు చెందిన వ్యాపారవేత్త. అరిజోనాలోని సర్వీస్ సంస్థలు ఇంట్రాఎడ్జ్, ట్రూయో వంటి సంస్థలను సోమానీ స్థాపించినట్లు సమాచారం. 2021లోనే అతడు రాజస్తాన్ రాయల్స్లో పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు కన్సార్టియంతో కలిసి ఏకంగా ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్నట్లు సమాచారం.కాగా తాజాగా యాజమాన్యం మార్పు నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్ అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచింది. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆర్సీబీని కూడా అమ్మకానికి పెట్టగా.. దాదాపు రెండు బిలియన్ల యూఎస్ డాలర్లకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది.చదవండి: అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్ దిగ్గజం -
PSL: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వేళ పాకిస్తాన్లోనూ గందరగోళం నెలకొంది. అఫ్గనిస్తాన్పై పాక్ వైమానిక దాడుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)-2026 నిర్వహణ విషయంలో బోర్డు ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేసింది.ప్రేక్షకులు లేకుండానే..ఆరంభ మ్యాచ్లకు స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించమని.. కరాచీ, లాహోర్లలో మాత్రమే మ్యాచ్లు జరుగుతాయని పాక్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రీడా శాఖా మంత్రి అమినుల్ హక్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్ భద్రతా ముప్పు ఉందని భావిస్తే PSLలో ఆడేందుకు తమ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చే విషయంలో పునరాలోచన చేస్తామని అమినుల్ వెల్లడించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు PSLలో పాల్గొనేందుకు NOCలు జారీ చేసినట్లు సమాచారం.బంగ్లాదేశ్ కీలక నిర్ణయంఈ విషయం గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి క్రిక్బజ్తో మాట్లాడారు. ‘‘విదేశాంగ శాఖతో మేము చర్చలు జరిపాము. ఇస్లామాబాద్లో ఉన్న మా హై కమిషన్ను కూడా సంప్రదించాము. వారి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే PSLలో ఆడేందుకు మా ఆటగాళ్లకు అనుమతి ఇచ్చాము’’ అని పేర్కొన్నారు.కాగా మరోసారి ఐపీఎల్కు పోటీగా పాక్ బోర్డు PSLను నిర్వహించేందుకు సిద్ధమైంది. మార్చి 26న తాజా ఎడిషన్ మొదలుకానుంది. ఇక బంగ్లాదేశ్కు చెందిన ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హొసేన్ ఇమాన్, షోరిఫుల్ ఇస్లాం, నహీద్ రాణా, తాంజిద్ హసన్ తమీమ్, రిషాద్ హొసేన్ తదితరులు ఈ సీజన్లో భాగం కానున్నారు.చదవండి: అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్ దిగ్గజం -
ఆర్సీబీకి భారీ షాక్.. ఆరంభ మ్యాచ్లకు స్టార్ ప్లేయర్ దూరం
ఐపీఎల్-2026 సీజన్కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గాయాల బెడద వెంటాడుతోంది. ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ జోష్ హాజిల్వుడ్, శ్రీలంక పేసర్ నువాన్ తుషారలు ఇంకా జట్టుతో చేరలేదు. తొడకండరాల గాయంతో బాధపడుతున్న నువాన్ తుషారకు ఒకట్రెండు రోజుల్లో శ్రీలంక క్రికెట్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహరించనుంది.ఒకవేళ అందులో అతడు పాసైతే లంక క్రికెట్ బోర్డు ఎన్వోసీ జారీ చేయనుంది. అతడు దాదాపుగా పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే మోకాలి గాయంతో బాధపడుతున్న హాజిల్వుడ్ మాత్రం కోలుకోవడానిని మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది సీజన్ ఆరంభ మ్యాచ్లకు హేజిల్వుడ్ అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ ధ్రువీకరించారు."జోష్ హేజిల్వుడ్ గాయాల కారణంగా ఇటీవల పోటీ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. అతడు ప్రస్తుతం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు.క్రికెట్ ఆస్ట్రేలియా (CA) వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. అతడి ఫిట్నెస్పై సీఏ వైద్య బృందం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే భారత్కు వచ్చేందుకు అనుమతి లభిస్తుంది. క్రికెట్ ఆస్ట్రేలియాతో మేము నిరంతరం టచ్లో ఉన్నాము.అయితే మా జట్టులో అభినందన్, రషిక్ ధార్ వంటి అద్భుతమైన డొమాస్టిక్ బౌలర్లు ఉన్నారు. అదేవిధంగా భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ వంటి అనుభవం ఉన్న బౌలర్లు కూడా ఉన్నారు" అని బోబాట్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ముంబై తుది జట్టు ఇదే.. విధ్వంసకర ఆటగాడికి నో ఛాన్స్? -
’అతడు టీమిండియాలో అరంగేట్రానికి అర్హుడు’
ఆరంభ సీజన్ 2008 నుంచి ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. అత్యుత్తమంగా 2014లో తొలిసారి ఫైనల్ చేరిన ఈ జట్టు.. సుదీర్ఘ విరామం తర్వాత గతేడాది మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఆర్సీబీ చేతిలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడి చాంపియన్గా నిలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది.మరోవైపు.. ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడి తమ ఖాతాలో తొలి టైటిల్ జమచేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో పంజాబ్ మార్చి 31న తమ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది.పటిష్టంగా మిడిలార్డర్ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ మిడిలార్డర్ గురించి టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, నేహాల్ వధేరాలతో పంజాబ్ మిడిలార్డర్ పటిష్టంగా ఉందన్నాడు. వీరిలో శశాంక్ సింగ్ టీమిండియాలో చోటుకు అర్హుడని పేర్కొన్నాడు.టీమిండియాలో అరంగేట్రానికి అతడు అర్హుడు‘‘పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ విభాగంలో శశాంక్ సింగ్ కూడా ముఖ్య ఆటగాడు. కానీ అతడి గురించి అంతగా చర్చ జరగడం లేదు. నిజానికి టీమిండియాలో అరంగేట్రానికి అతడు అర్హుడు. ఎన్నోసార్లు అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచాడు.PC: PBKSపంజాబ్ కింగ్స్ అతడిని ఎంచుకుని మంచి పనిచేసింది. రిటెన్షన్ జాబితాలో కూడా అతడు ఉన్నాడు. అతడు మంచి ఫినిషర్. శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరాలతో కలిసి మిడిలార్డర్ను పటిష్టంగా మార్చాడు. పంజాబ్ కింగ్స్ ఈ ముగ్గురు ప్రధాన బలం’’ అని అశూ అభిప్రాయపడ్డాడు.ముగ్గురూ ముగ్గురేకాగా శశాంక్ సింగ్ గతేడాది 17 మ్యాచ్లలో కలిపి 350 పరుగులు చేయగా.. నేహాల్ వధేరా 16 మ్యాచ్లలో భాగమై 369 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 17 మ్యాచ్లలో కలిపి ఏకంగా 604 పరుగులతో దుమ్ములేపాడు. తొలి ప్రయత్నంలోనే పంజాబ్ కెప్టెన్గా జట్టును ఫైనల్కు చేర్చి సత్తా చాటాడు.ఫామ్లేమి.. మరేం పర్లేదుఇదిలా ఉంటే.. శశాంక్ సింగ్ ఇటీవల ముగిసిన దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తీవ్రంగా నిరాశపరిచాడు. 34 ఏళ్ల ఈ ఛత్తీస్గఢ్ ఆటగాడు ఏడు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 101 పరుగులే చేశాడు. అయితే, హెడ్కోచ్ రిక్కీ పాంటింగ్ మార్గదర్శనంలో శశాంక్ ఐపీఎల్-2026లో ఫామ్ అందుకుని.. అదరగొట్టగలడని అశూ ధీమా వ్యక్తం చేశాడు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్ జట్టులోకి 300 వికెట్ల వీరుడు -
ముంబై తుది జట్టు ఇదే.. విధ్వంసకర ఆటగాడికి నో ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ కోసం సిద్దమవుతోంది. గత సీజన్లో ఫైనల్కు చేరుకుండానే ఇంటిముఖం పట్టిన ముంబై ఇండియన్స్.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్గా నిలవాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు వాంఖడే స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తోంది.అయితే ముంబై శిక్షణ శిబిరంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా చేరకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే తొలి మ్యాచ్ సమయానికి మాత్రం బుమ్రా అందుబాటులో ఉంటాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 29న వాంఖడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తుది జట్టును భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఎంచుకున్నాడు.ఓపెనర్లగా రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్లకు అతడు అవకాశమిచ్చాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్, తర్వాతి ఆర్డర్లో తిలక్ వర్మకు చోటు దక్కింది. ఇక ఆల్రౌండర్ల కోటాలో విల్ జాక్స్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్లను బద్రీనాథ్ ఎంపిక చేశాడు. ఫినిషర్గా నమన్ ధీర్కు ఛాన్స్ లభించింది.ఇక ఫాస్ట్ బౌలర్లగా దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా,ట్రెంట్ బౌల్ట్ త్రయంతో బద్రీనాథ్ వెళ్లాడు. అయితే ఈ జట్టులో వెస్టిండీస్ హిట్టర్ షెర్ఫేన్ రూథర్ఫోర్డ్కు మాత్రం అతడు అవకాశం ఇవ్వలేదు. రూథర్ఫోర్డ్ ట్రేడ్ రూపంలో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్కు వచ్చాడు. అతడు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. జాతీయ జట్టుతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో కూడా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు.బద్రీనాథ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ తుది జట్టు ఇదేరోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
యశ్ దయాళ్ విషయంలో ఆర్సీబీ కీలక ప్రకటన
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కీలక ప్రకటన చేసింది. తమ పేసర్ యశ్ దయాళ్ ఐపీఎల్-2026లో పాల్గొనడం లేదని తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడిని పక్కనపెట్టామని.. అయితే, కాంట్రాక్టు మాత్రం కొనసాగిస్తామని వెల్లడించింది.సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ తొలిసారి గతేడాది ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. ఇందులో యశ్ దయాళ్ (Yash Dayal) కూడా తన వంతు పాత్ర పోషించాడు. సీజన్ మొత్తం కలిపి 13 వికెట్లతో రాణించి జట్టును చాంపియన్గా నిలపడంలో తోడ్పడ్డాడు.సంచలన ఆరోపణలుఅయితే, అనూహ్య రీతిలో యశ్ దయాళ్పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఘజియాబాద్లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో గతేడాది జూలైలో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐదేళ్లు తనతో రిలేషన్షిప్లో ఉండి.. పెళ్లి పేరిట మోసం చేశాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేసింది. శారీరకంగా, మానసికంగా తనను హింసించాడని.. లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.పోక్సో కేసు కూడాఆ తర్వాత ఓ టీనేజర్ తెరమీదకు వచ్చింది. 2023 నుంచి తనపై యశ్ దయాళ్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద జైపూర్లో మరో కేసు నమోదైంది. ఐపీఎల్-2025 సందర్భంగానూ హోటల్ గదిలో దయాళ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని సదరు టీనేజర్ ఆరోపించింది. క్రికెట్లో తనకు కెరీర్ ఆశ చూపి ఇలా చేశాడని వాపోయింది.అయితే, మొదటి కేసులో అలహాబాద్ హైకోర్టు యశ్ దయాళ్ అరెస్టు కాకుండా స్టే విధించగా.. రెండోకేసులో జైపూర్లోని పోక్సో కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ను 2025 డిసెంబరులో తిరస్కరించింది. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇటీవలే యశ్ దయాళ్ ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అతడిని ఈ సీజన్లో ఆడించము.. కానీకాగా యశ్ దయాళ్ను కొనసాగించడంపై ఆర్సీబీపై విమర్శలు రాగా.. ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మొ బొబాట్ తాజాగా స్పందించాడు. ‘‘యశ్ దయాళ్ ఈసారి జట్టుతో చేరడం లేదు. వ్యక్తిగతంగా అతడు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు మేము అతడికి మద్దతుగానే నిలబడ్డాము.అతడిపై నమ్మకం ఉంది కాబట్టే రిటైన్ చేసుకున్నాము. అతడి కాంట్రాక్టు కొనసాగుతుంది. అతడితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము. ఈరోజు కూడా అతడిని సంప్రదించిన తర్వాతే జట్టుతో చేర్చకూడదనే నిర్ణయానికి వచ్చాము. అతడితో పాటు జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాము. అతడికి మా మద్దతు ఉంటుంది’’ అని మొ బొబాట్ పేర్కొన్నాడు. కాగా మార్చి 28న ఐపీఎల్-2026 టోర్నీకి తెరలేవనుండగా.. తొలి మ్యాచ్లో ఆర్సీబీ- సన్రైజర్స్ తలపడతాయి. ఇందుకు చిన్నస్వామి స్టేడియం వేదిక.చదవండి: రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే? -
IPL 2026: ‘గెలవడానికే బరిలోకి దిగుతున్నాం’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ ప్రస్థానం 2022లో మొదలైంది. ఆ సీజన్లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగిన తొలిసారే చాంపియన్గా నిలవడం విశేషం. ఆ మరుసటి ఏడాది అంచనాలను అందుకుంటూ మరోసారి ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్కే పరిమితమయింది. అయితే 2024 సీజన్లో పేలవ ఆటతీరుతో లీగ్ దశకే పరిమితమైన గుజరాత్ గత సీజన్లో మాత్రం మరోసారి మంచి ప్రదర్శన నమోదు చేసింది. గిల్ కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఐదో సీజన్ ఆడనున్న గుజరాత్ టైటాన్స్ ఈసారి కప్పు గెలవడానికే బరిలోకి దిగుతోందని ఆ జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా ధీమా వ్యక్తం చేశాడు. సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ పూర్తిస్థాయి జట్టుతో శుభారంభ్-2026 కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆటగాళ్లతో పాటు అభిమానులు, ఫ్రాంచైజీ ఓనర్లు, సహాయక సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నెహ్రా మాట్లాడాడు. ‘ఈ సీజన్లో భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఆలోచించడానికేం లేదు. ఎందుకంటే బరిలోకి దిగనున్న జట్టు మ్యాచ్ ఎలా ఆడాలన్నది ఆలోచిస్తోంది, జట్టు ఆటగాళ్లు దీని గురించి ఆలోచిస్తారు. ఒక కోచ్గా నేను సలహాలు మాత్రమే అందివ్వగలను. ఈ శుభారంబ్ వేడుక సాక్షిగా ఒక విషయం చెప్పదలచుకున్నా. ఈ సీజన్కు పూర్తి ఆత్మవిశ్వాసంతో వస్తున్నాం. ఈసారి కేవలం పాల్గొనడానికి రాలేదు, ఐపీఎల్లో కప్పు గెలవడానికే వస్తున్నాం. కొత్త జట్టుకు సమయం పడుతుందని అంతా అంటున్నారు. కానీ మా విధానాలు, ప్రణాళికలు ఎప్పుడు రెండు అడుగులు ముందే ఉంటాయి. ఐదేళ్లుగా గుజరాత్ జట్టుతోనే ఉన్నాను. ఈ ఐదేళ్లలో జట్టుతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ శుభారంభ్ మా గుజరాత్ టైటాన్స్కు కొత్త శోభను తీసుకొచ్చింది. ఇది ఇచ్చిన స్ఫూర్తి, ఐక్యతతో ముందుకు సాగుతాం’ అని చెప్పుకొచ్చాడు. ఇక గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో తొలి మ్యాచ్ను మార్చి 31 ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. -
ఎస్ఆర్హెచ్ జట్టులోకి 300 వికెట్ల వీరుడు
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్కు దూరమైన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ స్దానాన్ని ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ పేయిన్తో ఎస్ఆర్హెచ్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.ఈ ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ను రూ.1.5 కోట్లకే సన్రైజర్స్ దక్కించుకుంది. కాగా 26 ఏళ్ల డేవిడ్ పేయిన్ ఇంగ్లండ్ తరపున కేవలం ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. కానీ అతడికి టీ20ల్లో మాత్రం అపారమైన అనుభవం ఉంది. ఇప్పటివరకు 233 టీ20లు ఆడి 304 వికెట్లు పడగొట్టాడు.బిగ్ బాష్ లీగ్, ది హాండ్రడ్, ఇంటర్ననేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడిన అనుభవం అతడికి ఉంది. ఈ క్రమంలోనే అతడిని ఆరెంజ్ ఆర్మీ జట్టులోకి తీసుకుంది. అతడి రాకతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం పటిష్టం కానుంది. ఎషాన్ మలింగ, జయదేవ్ ఉనద్కట్తో పేయిన్ బంతిని పంచుకోనున్నాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఫిట్నెస్ సాధిస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్కు ఇక తిరుగులేనిట్లే. సన్రైజర్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.ఎస్ఆర్హెచ్ జట్టుబ్యాటర్లు: ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, స్మరన్ రవిచంద్రన్, సలీల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ఆల్ రౌండర్లు: హర్షల్ పటేల్, కమిందు మెండిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్సే, శివంగ్ కుమార్, క్రెయిన్ ఫులేట్రా, లియామ్ లివింగ్స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిబౌలర్లు: పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివమ్ మావి -
రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?
టీ20 వరల్డ్కప్ విన్నర్, టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్కు అరుదైన గౌరవం దక్కింది. రింకూ సింగ్ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ (RSO)గా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం లక్నోలోని లోక్ భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నియామక పత్రాన్ని రింకూకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందజేశారు.కాగా వరల్డ్కప్ సమయంలో రింకూ తండ్రి మరణించినప్పటికి.. అంత్యక్రియలు ముగిసిన వెంటనే తిరిగి జట్టుతో చేరి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. రింకూ ఈ టోర్నీలో మొత్తం 5 ఇన్నింగ్స్లో 24 పరుగులు మాత్రమే చేశాడు. అయితే చాలా మ్యాచ్లలో అతడు ఆఖరిలో బ్యాటింగ్కు వచ్చాడు. పాక్పై కేవలం 4 బంతుల్లోనే 11 పరుగులు చేశాడు.ఓ వైపు గుండె నిండా బాధ ఉన్నప్పటికి.. భారత్ సాధించిన చారిత్రత్మక విజయంలో రింకూ భాగమయ్యాడు. దీంతో అతడి అంకితభావానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగంతో సత్కరించింది. ఉత్తరప్రదేశ్లో రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ పోస్ట్ గ్రూప్-ఏ కిందికి వస్తుంది. జీతం, అలవెన్సులతో కలిపి రూ. 70,000 వరకు చేతికి అందుతుంది. ఇక రింకూ సింగ్తో పాటు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మరో ఐదుగురు అథ్లెట్లకు కూడా ప్రభుత్వం ఉద్యోగాలను ప్రకటించింది.నియమాక పత్రాలు అందుకున్న వారు వీరేరింకూ సింగ్: రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్రాజ్కుమార్ పాల్ (హాకీ): పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన హాకీ జట్టు సభ్యుడు రాజ్కుమార్ పాల్ను డీఎస్పీ గా నియమించారు.ప్రవీణ్ కుమార్ (పారా హైజంప్): పారాలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్కు కూడా డీఎస్పీ హోదా కల్పించారు.అజిత్ సింగ్, సిమ్రాన్: పారాలింపిక్స్ పతక విజేతలు అజిత్ సింగ్, సిమ్రాన్లను జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్లుగా నియమించారు.లక్ష్మణ్, రాణి లక్ష్మీబాయి పురస్కారాలు:ఉద్యోగాలతో పాటు 2024-25 సంవత్సరానికి గాను తొమ్మిది మంది క్రీడాకారులకు రాష్ట్ర అత్యున్నత పురస్కారాలైన లక్ష్మణ్ అవార్డు, రాణి లక్ష్మీబాయి అవార్డులను అందజేశారు. వీరికి రూ. 3.11 లక్షల నగదు బహుమతితో పాటు కాంస్య విగ్రహాన్ని బహూకరించారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించే కొత్త పథకంలో భాగంగా ఈ నియామకాలు జరిగాయి.చదవండి: IND vs SA: సౌతాఫ్రికా టూర్కు భారత జట్టు ప్రకటన -
చిన్నస్వామి సాక్షిగా.. ఆ 11 మందికి ఆర్సీబీ ఘన నివాళి!
ఐపీఎల్-2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA), ఆర్సీబీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నాయి.గతేడాది జరిగిన 'చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట' బాధితుల జ్ఞాపకార్థం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను కేఎస్సీఎ, ఆర్సీబీ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. కాగా గతేడాది చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు విషాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనలో మొత్తం మంది అభిమానులు ప్రాణాలు విడిచారు.దీంతో ఆ 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం.. స్టేడియంలోని ఒక స్టాండ్లో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచాలని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ సీట్లను ఇకపై ఏ ఐపీఎల్ మ్యాచ్కు గానీ, అంతర్జాతీయ మ్యాచ్కు గానీ విక్రయించరు. అదేవిధంగా స్టేడియంలో ప్రధాన ఎంట్రెన్స్ ద్వారం వద్ద స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు.మార్చి 28న మ్యాచ్ ప్రారంభానికి ముందే కేఎస్సీఏ ప్రెసిడెంట్ వెంకటేష్ ప్రసాద్ దీన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మ్యాచ్ ఆరంభానికి ముందు స్టేడియం మొత్తం ఒక నిమిషం పాట మౌనం పాటిస్తారు. సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్లు నల్లటి బ్యాండ్లు భుజానికి ధరించి బరిలోకి దిగనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇప్పటికే రూ. 25 లక్షల చొప్పున ఆర్ధిక సహాయాన్ని బాధితుల కుటుంబాలకు అందజేసింది. అయితే ఈ విషాద సంఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్ ఇదే కావడం గమానార్హం.చదవండి: IND vs SA: సౌతాఫ్రికా టూర్కు భారత జట్టు ప్రకటన -
రాజస్థాన్లోకి షనక.. కీలక సూత్రధారి అతడే!
న్యూఢిల్లీ: శ్రీలంక ఆల్రౌండర్ దసున్ షనక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లండ్ ఆల్రౌండర్ స్యామ్ కరన్ గాయంతో జట్టుకు దూరమవడంతో... అతడి స్థానంలో ఫ్రాంచైజీ షనకను ఎంపిక చేసుకుంది. షనకను రూ. 2 కోట్లకు రాజస్తాన్ తీసుకుంది. దీంతో అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి తప్పుకొని ఐపీఎల్ ఆడనున్నాడు. ఇప్పటికే జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబాని పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరగా... ఇప్పుడా జాబితాలో షనక చేరనున్నాడు. ఐపీఎల్ మినీ వేలంలో షనకను ఏ ఫ్రాంచైజీ తీసుకోక పోగా... పీఎస్ఎల్లో లాహోర్ ఖలందర్స్ జట్టు అతడిని ఎంపిక చేసుకుంది. ఇప్పుడు రాజస్తాన్ కోచ్ సంగక్కర ప్రోత్సాహంతో అతడు ఐపీఎల్లోకి రానున్నాడు. ఐపీఎల్లో బరిలోకి దిగడం షనకకిది రెండోసారి. 2023లో అతను గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున మూడు మ్యాచ్లు ఆడాడు. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్లో 34 ఏళ్ల షనక శ్రీలంక జట్టుకు కెపె్టన్గా వ్యవహరించాడు. శ్రీలంక తరఫున షనక ఇప్పటి వరకు 6 టెస్టులు, 71 వన్డేలు, 131 టి20 మ్యాచ్లు ఆడాడు. చదవండి: శతక్కొట్టిన జార్జియా వోల్.. సిరీస్ క్లీన్స్వీప్ -
శతక్కొట్టిన జార్జియా వోల్.. సిరీస్ క్లీన్స్వీప్
వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా మహిళల జట్టు శుభారంభం చేసింది. వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం కింగ్స్టౌన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా డక్వర్త్ లూయిస్ పద్దతిలో 40 పరుగుల తేడాతో వెస్టిండీస్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. జార్జియా వోల్ (53 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో మెరిసింది. చివర్లో నికోలా కేరీ (24 నాటౌట్), సోఫీ మొలినెక్స్ (25) రాణించారు. అయితే ఆసీస్ చేసిన స్కోరులో సగం పరుగులు జార్జియావే ఉండడం విశేషం. కాగా జార్జియా వోల్కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం విశేషం.వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు తీయగా, జాజ్రా క్లాక్స్టన్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ వర్షం అంతరాయం కలిగించే సమయానికి 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (30 నాటౌట్), డియాండ్రా దొతిన్ (11 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ఎలీస్పెర్రీ, మేగన్ స్కాట్,లూసీ హామిల్టన్ తలా ఒక వికెట్ తీశారు. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో పిచ్ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ను నిలిపివేసి డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. సెంచరీతో విధ్వంసం సృష్టించిన జార్జియా వోల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోగా, అలానా కింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచింది. ఇరుజట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం జరగనుంది.చదవండి: IPL 2026: ‘పరాగ్కు అంత సీన్ లేదు’ -
మరో 4 రోజుల్లో ఐపీఎల్.. ఇంకా భారత్కు రాని స్టార్ ప్లేయర్
ఐపీఎల్-2026 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన పేస్ అస్త్రం మిచెల్ స్టార్క్ మాత్రం జట్టుతో చేరలేదు. క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) నుంచి లీగ్లో ఆడేందుకు స్టార్ సీమర్కు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయలేదని తెలిసింది.ఈ శనివారం లీగ్ ప్రారంభమవుతున్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఏప్రిల్ 1న జరుగనుంది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే మొదటి మ్యాచ్కల్లా అతను అందుబాటులో ఉంటాడని ప్రాంచైజీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.సోమవారం మీడియా సమావేశంలో క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. "ఆసీస్ బోర్డు నుంచి ఎన్వోసీ కోసం మేం ఎదురుచూస్తున్నాం. అది వస్తే స్టార్క్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉండేది చెప్పగలం. ఈ మేరకు సీఏతో సంప్రదింపులు జరుపుతున్నాం" అని అన్నాడు. ఫిట్నెస్ సమస్యలేమైనా ఉన్నాయా అన్న ప్రశ్నకు బదులిస్తూ అలాంటిదేమీ లేదని, నెట్స్లో అతను బౌలింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారముందని చెప్పాడు. క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల రావు మాట్లాడుతూ అతను వస్తున్నాడని, ఎన్ఓసీ ఆలస్యమే అసలు సమస్యని పేర్కొన్నాడు.ఎన్ఓసీ జారీ చేస్తే తొలి మ్యాచ్ నుంచే స్టార్క్ అందుబాటులో ఉంటాడని చెప్పాడు. పేసర్ నటరాజన్ వందశాతం ఫిట్నెస్తో ఉన్నాడని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. గత సీజన్లో భుజం గాయం వల్ల నట్టు కేవలం రెండే మ్యాచ్లు ఆడాడు.చదవండి: IPL 2026: సన్రైజర్స్కు భారీ శుభవార్త.. ఇక దబిడి దిబిడే -
సన్రైజర్స్కు భారీ శుభవార్త.. ఇక దబిడి దిబిడే
ఐపీఎల్-2026 సీజన్ ముందు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న స్టార్ పేసర్, రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఊహించిన దానికంటే ముందే జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీతో తొలి మ్యాచ్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మంగళవారం బెంగళూరులో అడుగుపెట్టనుంది.అయితే కమ్మిన్స్ కూడా నేడే బెంగళూరుకు చేరుకోనున్నట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. కాగా కమ్మిన్స్ గత కొంత కాలంగా తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతడు టీ20 ప్రపంచకప్-2026 నుంచి కూడా తప్పుకొన్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2026 సీజన్లో కూడా ఫస్ట్ హాఫ్కు వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా కమిన్స్ క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తమ జట్టు పగ్గాలను ఇషాన్ కిషన్కు అప్పగించింది. కానీ ఇప్పుడు కమ్మిన్స్ ముందుగానే భారత్కు చేరుకుంటుండటం ఆరెంజ్ ఆర్మీకి భారీ ఊరట కలిగించే ఆంశంగా చెప్పాలి.కమ్మిన్స్ తుది జట్టులో ఉంటాడా?అయితే కమిన్స్ ముందుగానే వచ్చినా.. మార్చి 28న ఆర్సీబీతో జరిగే తొలి మ్యాచ్లో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మార్చి 25న ముంబైలో జరిగే ఐపీఎల్ కెప్టెన్ల అధికారిక సమావేశానికి ఎస్ఆర్హెచ్ తరపున ఇషాన్ కిషన్ హాజరుకానున్నట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.దీని బట్టి కమ్మిన్స్ పూర్తి ఫిట్నెస్ సాధించే వరకు కిషన్ జట్టు నడిపించనున్నాడని స్పష్టమవుతోంది. ఏదేమైనప్పటికి కమ్మిన్స్ జట్టుతో కలవడం ఎస్ఆర్హెచ్ కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ప్రాక్టీస్లో కానీ, మ్యాచ్ సమయంలో కానీ కమ్మిన్స్ తన అనుభవాన్ని పంచుకోనున్నాడు.మరోవైపు శ్రీలంక స్పీడ్స్టార్ ఎషాన్ మలింగ కూడా ఎస్ఆర్హెచ్ జట్టులో చేరనున్నాడు. ఐపీఎల్ ఆడేందుకు శ్రీలంక క్రికెట్ ఎన్వోసీ మంజూరు చేసింది. ఇప్పుడు కమ్మిన్స్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధిస్తే సన్రైజర్స్ బౌలింగ్ యూనిట్ పటిష్టంగా మారనుంది.ఎస్ఆర్హెచ్ జట్టుబ్యాటర్లు: ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, స్మరన్ రవిచంద్రన్, సలీల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ఆల్ రౌండర్లు: హర్షల్ పటేల్, కమిందు మెండిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్సే, శివంగ్ కుమార్, క్రెయిన్ ఫులేట్రా, లియామ్ లివింగ్స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిబౌలర్లు: పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివమ్ మావి -
IPL 2026: ‘పరాగ్కు అంత సీన్ లేదు’
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా రియాన్ పరాగ్ ఎంపికవడం వెనుక ఫ్రాంచైజీ పెద్దల నుంచి ప్రత్యేక మద్దతు గట్టిగా ఉందంటూ భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నప్పటికీ కెప్టెన్గా పరాగ్ ఎంపిక తనను ఆశ్చర్చపరిచిందన్నాడు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘అతడు కెప్టెన్ ఎలా అయ్యాడో అందరికీ తెలుసు. ఎందుకంటే అది రాజస్థాన్ ప్రాంచైజీ పెద్దల నిర్ణయం. అక్కడ రియాన్ పరాగ్ను వాళ్లు రాజులా చూసుకుంటారు. రాజస్థాన్ పరాగ్ను ఆకాశానికెత్తుతోంది కానీ అతడికి అంత సీన్ లేదు. గతేడాది పరాగ్కు అంతగా కలిసిరాలేదు. సంజూ శాంసన్ గైర్హాజరీలో కెప్టెన్గా సేవలందించిన పరాగ్లో నాయకత్వ ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. కానీ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కాదని ఈ సీజన్లోనూ అతడికే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. సంజూ శాంసన్ను రూ. 18 కోట్లకు చెన్నై ట్రేడింగ్ చేసుకున్నప్పటికీ అతడి స్థానంలో రవీంద్ర జడేజా, సామ్ కరన్లు రాజస్థాన్కు బదిలీ అయ్యారు. జడేజా, జైస్వాల్, ధ్రువ్ జురేల్ లాంటి నాయకత్వ సామర్థ్యం కలిగిన ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదో చెప్పాలి’ అని పేర్కొన్నారు. ఇక ఈ సీజన్లో రాజస్థాన్ విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయనే ప్రశ్నకు శ్రీకాంత్ సమాధానమిచ్చాడు.‘గత సీజన్తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ మెరుగ్గానే కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్లను ఓడించే సత్తా వీరికి ఉన్నప్పటికీ అంత ప్రమాదకరం కాదు. టాప్ ఐదుగురిలో ఇద్దరు రాణించినా రాజస్థాన్కు తిరుగుండదు. జైస్వాల్-వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీ జట్టుకు పెద్ద బలం కానుంది. హెట్మైర్, జడేజా, షనక, ధ్రువ్ జురేల్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. రాజస్థాన్కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు 50-50 శాతమే’ అని తెలిపాడు. ఇక రియాన్ పరాగ్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్ల్లో 393 పరుగులు సాధించాడు. కేకేఆర్తో జరిగిన మ్యచ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. 2017 నుంచి రాజస్థాన్ రాయల్స్కే ఆడుతున్న రియాన్ పరాగ్ ఇప్పటివరకు 84 మ్యాచ్ల్లో ఏడు అర్థశతకాలతో 1566 పరుగులు సాధించాడు. అయితే పరాగ్లో నిలకడలేమి అతనికి పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లు తమ ప్రాక్టీస్ను ముమ్మరం చేశాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్ను చెన్నై సూపర్కింగ్స్తో ఆడనుంది.చదవండి: IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలివే! -
సౌతాఫ్రికా టూర్కు భారత జట్టు ప్రకటన
దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. అయితే డబ్ల్యూపీఎల్- 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ ఆల్రౌండర్ అనుష్క శర్మకు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది.అదేవిధంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారతీ ఫుల్మాలిని ప్రోటీస్తో సిరీస్కూ కొనసాగించారు. అద్భుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఉన్న భారతీకి ఆసీస్ టూర్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. మరోవైపు 22 ఏళ్ల పేసర్ కాశ్వి గౌతమ్కు తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కింది.అయితే యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ, స్నేహ రాణాలను ఈ సిరీస్కు సెలెక్టర్లు పక్కన పెట్టారు. కాగా ఈ సిరీస్ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా జరగనుంది. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ ఏప్రిల్ 17 నుంచి ప్రోటీస్ గడ్డపై ప్రారంభం కానుంది.దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు:హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కాశ్వి గౌతమ్, భారతీ ఫుల్మాలి, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), అనుష్క శర్మ.సిరీస్ షెడ్యూల్:1.ఏప్రిల్ 17: మొదటి టీ20 (డర్బన్)2.ఏప్రిల్ 19: రెండో టీ20 (డర్బన్)3.ఏప్రిల్ 22: మూడో టీ20 (జోహన్నెస్బర్గ్)4.ఏప్రిల్ 25: నాలుగో టీ20 (జోహన్నెస్బర్గ్)5.ఏప్రిల్ 27: ఐదో టీ20 (బెనోని)చదవండి: IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలివే! -
IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలివే!
ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైన వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టోర్నీ ఆరంభానికి ముందే జట్లు పాటించాల్సిన ప్రాక్టీస్ సెషన్లు, పిచ్ నిర్వహణకు సంబంధించి కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా మ్యాచ్ రోజుల్లో ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లకు ఇకపై అనుమతి ఉండదని పేర్కొంది.కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు..ఏ జట్టు కూడా సాధన సమయంలో తమ ప్రత్యర్థి ఉపయోగించిన పిచ్లను లేదా నెట్లను వాడకూడదు. ప్రతి సెషన్కు తాజాగా సిద్ధం చేసిన పిచ్లను తప్పనిసరిగా అందించాలి. ఉదాహరణకు, ఉదయం ‘టీమ్ బి’ ఉపయోగించిన పిచ్పై సాయంత్రం ‘టీమ్ ఎ’ సాధన చేయకూడదు.జట్లు ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, మొదటి జట్టు ఉపయోగించిన నెట్లను రెండవ జట్టుకు ఇవ్వరాదు.మ్యాచ్ జరిగే రోజులలో ప్రాక్టీస్కు అనుమతి ఉండదు. మ్యాచ్ జరిగే రోజున ప్రధాన ప్రాంగణంలో ఎలాంటి ఫిట్నెస్ పరీక్ష జరగదు.ప్రాక్టీస్ రోజుల్లో (ప్రీ టోర్నమెంట్, టోర్నీ జరుగుతున్న సమయంలో), గుర్తింపు పొందిన సిబ్బందిని మాత్రమే డ్రెస్సింగ్ రూమ్లోకి, మైదానంలోకి అనుమతిస్తారు.ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు వేరే వాహనంలో ప్రయాణిస్తారు. హాస్పిటాలిటీ ఏరియా నుంచి జట్టు ప్రాక్టీస్ను వీక్షించే అవకాశం వీరికి కల్పిస్తారు.అదనపు సహాయక సిబ్బంది (త్రో డౌన్ స్పెషలిస్ట్/నెట్ బౌలర్లు) జాబితా వివరాలను బీసీసీఐకి సమర్పించాలి. బీసీసీఐ ఆమోదం పొందిన తర్వాతే వీరికి గుర్తింపు పత్రాలు జారీ చేయబడతాయి.ఆటగాళ్లు ప్రాక్టీస్కు వచ్చేటప్పుడు టీమ్ బస్సును మాత్రమే ఉపయోగించాలి. జట్లు రెండు బృందాలుగా ప్రయాణించవచ్చు.మ్యాచ్ రోజుల్లో ప్రాక్టీస్, ఫిట్నెస్ టెస్ట్కు సంబంధించి ఎలాంటి అభ్యర్థన వచ్చినా స్థానిక మేనేజర్ను సంప్రదించాల్సి ఉంటుంది.మ్యాచ్ రోజు మార్గదర్శకాలు..పీఎంవోఏ నుంచి గుర్తింపు పొందిన సిబ్బంది మ్యాచ్ రోజున తమ గుర్తింపు పత్రాన్ని తీసుకురావడం తప్పనిసరి. మొదటిసారి గుర్తింపు పత్రాన్ని తీసుకురాని పక్షంలో, హెచ్చరికతో సరిపెడతారు. కానీ రెండోసారి అదే తప్పు చేస్తే ఆయా జట్టుకు జరిమానా విధించబడుతుంది.ఆటగాళ్లు నారింజ లేదా ఊదా రంగు టోపీలు ధరించాలి. ఒకవేళ ఆటగాళ్లు టోపీలు ధరించకపోతే, ప్రసారంలో కనిపించేంత వరకు మొదటి రెండు ఓవర్ల పాటు ఆ క్యాప్లను ధరించాలి.మ్యాచ్ అనంతర బహుమతి ప్రదానోత్సవంలో ఫ్లాపీలు, స్లీవ్లెస్ జెర్సీలు ధరించేందుకు ఆటగాళ్లకు అనుమతి లేదు. ఆటగాళ్లు రూల్ను పాటించకపోతే తొలిసారి హెచ్చరించడం జరుగుతుంది. రెండోసారి మాత్రం జరిమానా విధించడం జరుగుతుంది.ఐపీఎల్ 2025 సీజన్ మాదిరిగానే, మ్యాచ్ రోజుల్లో టీమ్ డాక్టర్తో సహా 12 మంది గుర్తింపు పొందిన సహాయక సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు.ఆటగాళ్ల జెర్సీ నంబర్లలో మార్పు ఉన్నట్లయితే, ఆయా ఫ్రాంచైజీలు నిబంధనల ప్రకారం 24 గంటల ముందే వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. చదవండి: సౌతాఫ్రికా టూర్కు భారత జట్టు ప్రకటన -
‘గంభీర్.. మొరటుతనం తగ్గించుకో’
టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ దూకుడు స్వభావం అందరికి తెలిసిందే. గతంలో ఆటగాడిగానైనా, ఇప్పుడు కోచ్గానైనా అదే దూకుడు మంత్రం గంభీర్ను ప్రత్యేకంగా నిలిపింది. కొన్నిసార్లు అదే దూకుడుతనం గొడవలకు కూడా దారి తీసింది. ఐపీఎల్లో విరాట్ కోహ్లీతో వైరం కూడా అలాంటి కోవకు చెందినదే. అయితే కోచ్గా గంభీర్ అంత కఠినంగా, మొరటుగా ఉండాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. అదే సమయంలో భారత జట్టు ప్రధాన కోచ్గా గంభీర్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడంలోనూ విజయవంతమయ్యాడని ప్రశంసించాడు. గంగూలీ మాట్లాడుతూ.. ‘నిజానికి గంభీర్ కాస్త మొరటు వ్యక్తే కావొచ్చు. కానీ అతనో పోరాటయోధుడు. నేను అతడితో కలిసి ఆడాను. అతడు పోటీతత్వం కలవాడు. ప్రతీ మ్యాచ్ను భారత్ గెలవాలని బలంగా కోరుకునేవాడు. జట్టు కోసమే ఎప్పుడు మాట్లాడుతాడు. ఎల్లప్పుడూ సమిష్టితత్వాన్ని కోరుకుంటాడు. కోచ్గా గంభీర్కు అసలైన సవాల్ ముందుంది.సౌతాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ (వైట్బాల్క్రికెట్) గంభీర్ ముందున్న అతిపెద్ద లక్ష్యం. అక్కడి పరిస్థితులు అతనికి పరీక్షే అయినప్పటికీ కచ్చితంగా తన లక్ష్యాలను చేరుకోవడానికే ప్రయత్నిస్తాడు. ఇక రెడ్బాల్ (టెస్టు క్రికెట్)లో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ఇంగ్లండ్ సిరీస్ గంభీర్కు ఒక ఉదాహరణ. కోచ్గా అతను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’అని చెప్పుకొచ్చాడు. భారత ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించాడు. అందులో ఒకటి 2025 చాంపియన్స్ ట్రోఫీ కాగా, మరొకటి 2026 టీ20 ప్రపంచకప్. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా వరుస సిరీస్లతో బిజీ కానుంది. ఇం2్లండ్లో సుదీర్ఘమైన వైట్ బాల్ సిరీస్కు ముందు భారత్ అఫ్గానిస్థాన్, ఐర్లాండ్లతో సిరీస్లు ఆడనుంది.చదవండి: ‘ఆ రూల్కు నేనెప్పుడూ వ్యతిరేకమే’! -
‘ఆ రూల్కు నేనెప్పుడూ వ్యతిరేకమే’!
ఐపీఎల్లో అమలు చేసే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు నచ్చదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. ఒక ఆల్రౌండర్గా తాను ఎప్పటికీ ఇంపాక్ట్ రూల్ను వ్యతిరేకిస్తూనే ఉంటానని తెలిపాడు. ఈ నిబంధన ద్వారా ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుందన్న వాదనల్లో నిజముందని అక్షర్ వ్యాఖ్యానించాడు. అక్షర్ మాట్లాడుతూ.. ‘ఆ నిబంధన నాకు నచ్చదు. స్వతహాగా నేను ఆల్రౌండర్ను. గతంలో మేం ఈ రోల్ (బ్యాటింగ్, బౌలింగ్ చేసేవారు) కోసం ఆల్రౌండర్ను ఎంపిక చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అవసరాన్ని బట్టి బ్యాటర్, బౌలర్ను వాడుకుంటున్నది. అదే సమయంలో మనకు ఆల్రౌండర్ అవసరమా? అన్న చర్చ తలెత్తుతున్నది. నేను దీనికి మొదటి నుంచి వ్యతిరేకినే. కానీ రూల్స్ అంటే రూల్సే కదా. మనం వాటిని పాటించాలి తప్పదు’ అని అన్నాడు. గతంలోనూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై ముంబై ఇండియన్స్ క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2018 నుంచి చూసుకుంటే అక్షర్ పటేల్ గత సీజన్లో కేవలం 34 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేశాడు. ఇదే విషయమై అక్షర్ స్పందిస్తూ.. ‘18వ సీజన్లో నేను ఎక్కువగా బౌలింగ్ చేయకపోవడానికి చేతి వేలి గాయమే. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో బంతిని తిప్పేందుకు ఉపయోగపడే నా వేలికి గాయమైంది. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ గాయం మరింత పెద్దదైంది. దాంతో ఐపీఎల్లో జట్టుకు అవసరమైనప్పుడే బౌలింగ్ చేసి నా వేలిని కాపాడుకున్నా. ఏడు మ్యాచ్ల తర్వాత నా వేలి గాయం పూర్తిగా తగ్గిపోయింది.’ అని చెప్పుకొచ్చాడు. అక్షర్పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్లో లీగ్ దశకే పరిమితమైంది. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ను ఏప్రిల్ 1న లక్నో సూపర్జెయింట్స్తో ఆడనుంది. -
విమర్శలొచ్చినా వెనక్కి తగ్గని రహానే!
గత సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) నిరాశజనక ప్రదర్శన చేసింది. జట్టుగా కేకేఆర్ విఫలమైనా, బ్యాటర్గా మాత్రం టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. 14 మ్యాచ్ల్లో 390 పరుగులు సాధించి కేకేఆర్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో రహానే సారథ్యంలో 14 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించిన కేకేఆర్ 8వ స్థానంలో నిలిచి లీగ్ దశలోనే వైదొలగింది. రహానే తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా జట్టు ఓటములపై ప్రభావం చూపించింది. అయితే ఈసారి మాత్రం ఆ తప్పు చేయకుండా కేకేఆర్ టైటిల్ కొట్టాలని రహానే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ తన ప్రాక్టీస్ను ముమ్మరం చేసింది. ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి మరో నాలుగు రోజులు మిగిలిఉన్న నేపథ్యంలో అన్ని జట్లు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్లతో బిజీగా గడుపుతున్నాయి. సోమవారం రాత్రి కేకేఆర్ జట్టు కూడా ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో రహానే బ్యాటింగ్లో దుమ్మురేపాడు. 25 బంతుల్లోనే 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్ల నుంచి బ్యాటింగ్లో గేర్ మార్చిన రహానే దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్లోనూ రహానే అదే జోరు కనబరిచాడు. ఉన్నంతసేపు ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. మరో బ్యాటర్ కామెరున్ గ్రీన్ కూడా 30 బంతుల్లో 52 పరుగులు చేసి వెనుదిరిగాడు. న్యూజిలాండ్ సంచలనం ఫిన్ అలెన్ కూడా ఉన్నంతసేపు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. గాయపడిన ఆకాశ్దీప్ స్థానంలో జట్టులోకి వచ్చిన సౌరబ్ దూబే ఫిన్ అలెన్ను వెనక్కి పంపించాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత రహానే నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈడెన్ గార్డెన్లో స్పిన్ వనరులను వినియోగించుకోవడంలో విఫలమైన రహానే కెప్టెన్గా తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా జట్టుపై ప్రభావం చూపించాయి. అయితే తాజా సీజన్ ప్రారంభానికి ముందే బ్యాటర్గా తానేంటో నిరూపించుకున్న రహానే కెప్టెన్సీలోనూ అదే జోరు చూపించాలని భావిస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ తన తొలి మ్యాచ్ను మార్చి 29న ముంబై ఇండియన్స్తో ఆడనుంది.చదవండి: విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు! -
అరుంధతికి ఐసీసీ పురస్కారం
దుబాయ్: భారత పేస్ బౌలర్, హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి తన కెరీర్లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అవార్డు సాధించింది. 2021లో ఐసీసీ ప్రవేశపెట్టిన ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ పురస్కారాన్ని అరుంధతి తొలిసారి సొంతం చేసుకుంది. ఫిబ్రవరి నెలకుగాను అరుంధతికి ఈ గౌరవం దక్కింది. గత నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత మహిళల జట్టు టి20 సిరీస్ను 2–1తో గెలుచుకుంది. తన బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టి ఎనిమిది వికెట్లు పడగొట్టిన అరుంధతి టీమిండియా టి20 సిరీస్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించింది. తొలి మ్యాచ్లో అరుంధతి 22 పరుగులిచ్చి 4 వికెట్లు, రెండో మ్యాచ్లో 30 పరుగులిచ్చి 2 వికెట్లు, మూడో మ్యాచ్లో 35 పరుగులిచ్చి 2 వికెట్లు నేలకూలి్చంది. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఆ్రస్టేలియాలో భారత జట్టు విజయానికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్ విజయం ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్లో జరిగే టి20 ప్రపంచకప్కు ముందు మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని అరుంధతి వ్యాఖ్యానించింది. హర్మన్ప్రీత్ కౌర్ (2022–సెపె్టంబర్), దీప్తి శర్మ (2023–డిసెంబర్), స్మృతి మంధాన (2024–జూన్, 2025–సెప్టెంబర్), షఫాలీ వర్మ (2025–నవంబర్) తర్వాత ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు గెల్చుకున్న భారత ఐదో మహిళా క్రికెటర్గా అరుంధతి గుర్తింపు పొందింది. -
చెన్నై చెలరేగేనా!
ఏ సీజన్లోనైనా ఐపీఎల్ టైటిల్ ఫేవరెట్స్ ప్రస్తావన వస్తే కచ్చితంగా అందులో ఉండే జట్టు చెన్నై సూపర్కింగ్స్. నిషేధం కారణంగా మధ్యలో రెండేళ్లు మినహాయిస్తే 16 సీజన్లలో 12 సార్లు టాప్–4లో నిలిచిన ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్. 12 పర్యాయాల్లో ఐదుసార్లు విజేతగా... ఐదుసార్లు రన్నరప్గా నిలిచి చెన్నై తమ సత్తా చాటుకుంది. అయితే గత రెండేళ్లలో చెన్నై జట్టు పరిస్థితి మారింది. ‘కెప్టెన్ కూల్’ ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం... రుతురాజ్ గైక్వాడ్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం జరిగింది. 2023లో ధోని సారథ్యంలోనే ఐదోసారి ఐపీఎల్ చాంపియన్గా నిలిచిన చెన్నై ఆ తర్వాత తడబడింది. రుతురాజ్ సారథ్యంలో 2024లో ఐదో స్థానంలో నిలిచిన ఆ జట్టు 2025లో అనూహ్యంగా చివరిదైన పదో స్థానంతో సరిపెట్టుకొని తమ లీగ్ చరిత్రలోనే పేలవమైన ప్రదర్శన నమోదు చేసింది.సూపర్ కింగ్స్లో నాణ్యమైన ఆటగాళ్లే కాదు... పొట్టి ఫార్మాట్కు అవసరమైన స్పెషలిస్ట్ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఒకప్పటిలానే ఇప్పుడు కూడా ఈ జట్టు విదేశీ మెరుపుల కంటే భారత ఆటగాళ్లు, వారి బలాబలాలనే నమ్ముకుంది. అయితే దీనికి విదేశీ ఆటగాళ్లు మెరుపులు జోడిస్తే అది అదనపు బలమే అవుతుంది. ఫ్రాంచైజీల మధ్య జరిగిన అంతర్గత ట్రేడింగ్లో రవీంద్ర జడేజాను వదిలేసి అతని స్థానంలో సంజూ సామ్సన్ను కొనుగోలు చేసింది. పలువురు దేశవాళీ కుర్రాళ్లను తీసుకోవడం ద్వారా జట్టులోకి యువ రక్తాన్ని ఎక్కించినట్లయ్యింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే చెన్నై కీలక ఆటగాళ్లు కాగా... క్రికెట్ దిగ్గజం ధోని తుది జట్టుకు ఆడుతున్నప్పటికీ అతని పాత్ర మాత్రం ఆటకంటే కూడా మార్గదర్శనంతోనే పరిమితమనే మాట జగమెరిగిన సత్యం. వయసు పైబడిన అతను ఇప్పటికీ ఫ్రాంచైజీ ఆశాకిరణంగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఫినిషర్గా బ్యాటింగ్కు దిగే అవకాశమైతే ఉంది! కానీ అన్ని మ్యాచ్ల్లో మాత్రం కాదు. మరోసారి ధోనికిది ఫేర్వెల్ ఐపీఎల్ కాగలదని క్రికెట్ విశ్లేషకులంతా భావిస్తున్నారు. దీంతో చెన్నై సహచరులంతా తమ అభిమాన భారత దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. బ్రెవిస్, హెన్రీలు సత్తా చాటితే చెన్నైకి భారత ఆటగాళ్లే కొండంత బలమైనప్పటికీ విదేశీ ఆటగాళ్లలో బ్రెవిస్, నూర్ అహ్మద్, హెన్రీలను కూడా నమ్ముకుంది. గత సీజన్లో సత్తా చాటుకున్న బ్రెవిస్, నూర్ అహ్మద్ రాణిస్తే చెన్నై మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. అలాగే పవర్ప్లేలో ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్ను విరిచే సత్తా ఉన్న మ్యాట్ హెన్రీ కూడా చెలరేగితే చెన్నై జోరుకు ఎదురుండదు. వేలంలో ఎవరి ఊహకి అందని విధంగా భారీ మొత్తం వెచ్చించి మరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్లను చెన్నై తీసుకుంది. ఈ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లపై ఎవరికి ఎలాంటి అంచనాలున్నా... లేకున్నా... ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం పెద్ద నమ్మకాన్నే పెట్టుకుంది. లేకుంటే కేవలం ఇద్దరిపైనే రూ. 28.40 కోట్లనయితే ఖర్చు చేయదుగా! సర్ఫరాజ్ ఖాన్ కూడా సూపర్కింగ్స్ జట్టు ద్వారా అందరికంటా పడాలని తెగ ఆరాటపడుతున్నాడు. అందివచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. సామ్సన్ ‘కింగ్స్’ రాత మార్చేనా... సంజూ సామ్సన్ అంటే ఒకప్పుడు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టే గుర్తొస్తుంది. ఇప్పుడు అలా కాదు. 2026 టి20 ప్రపంచకప్ కూడా గుర్తుంటుంది. నిజానికి ఈ మెగా ఈవెంట్ మొత్తం మ్యాచ్లు కూడా ఆడని ప్లేయర్... మొత్తం ప్రపంచకప్ కథనే మార్చిన ఆటగాడయ్యాడు. వెస్టిండీస్తో క్వార్టర్ ఫైనల్స్ను తలపించిన సూపర్–8 చివరి మ్యాచ్లో సామ్సన్ (97 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత సెమీఫైనల్లో 89, ఫైనల్లో 89 స్కోర్లు భారత్ను ప్రపంచకప్ను నిలబెట్టుకునేలా చేశాయి. అలా ఇప్పుడు ఐపీఎల్ ప్లేయర్ కాస్తా టీమిండియా స్టార్ అయ్యాడు. గెలిచిన కప్, ఆడబోయే లీగ్ రెండూ టి20 ఫార్మాటే కావడంతో ఈ ఫార్మాట్లో సూపర్ ఫామ్లో ఉన్న సామ్సన్ ఇప్పుడు ధోని జట్టుకు బంగారు కొండలా కనిపిస్తున్నాడు. రుతురాజ్, శివమ్ దూబేలాంటి హిట్టర్లున్న కింగ్స్కు పూర్వవైభవం తేవాలన్నా... జట్టు రాత మారాలన్నా అది సామ్సన్ ఒక్కడి మెరుపులపైనే ఆధారపడి ఉంది. ధోని తుది జట్టుకు ఆడుతున్నాడనే ధైర్యం కూడా చెన్నైకి అదనపు బలం కాగాలదు. ఈ నేపథ్యంలో అన్ని అనుకున్నట్లు జరిగితే చెన్నై ఖాతాలో ఆరో టైటిల్ చేరడం సాధ్యమే. ఇదే జరిగితే ఫ్యాన్స్ ‘విజిల్ పొడు’తో సందడి చేసుకుంటారు. చెన్నై సూపర్కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెపె్టన్), ధోని, సంజూ సామ్సన్, ఆయుశ్ మాత్రే, బ్రెవిస్, రామకృష్ణ ఘోష్, శివమ్ దూబే, ఉరి్వల్ పటేల్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ చౌధరీ, నూర్ అహ్మద్, శ్రేయస్ గోపాల్, గుర్జప్నీత్ సింగ్, ఓవర్టన్, అకీల్ హోసీన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్, హెన్రీ, రాహుల్ చహర్, జాక్ ఫౌక్స్. -
బంగ్లాదేశ్ క్రికెట్ చీఫ్ సెలెక్టర్గా మాజీ కెప్టెన్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు సభ్యులతో కూడిన నూతన సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా మాజీ కెప్టెన్ హబీబుల్ బషర్ను బీసీబీ నియమించింది. గతంలో బంగ్లా సెలక్షన్ కమిటీలో కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు మరొకరిని ప్యానల్లోకి బీసీబీ చేర్చింది. ఈ కొత్త కమిటీ వన్డే ప్రపంచకప్-2027 వరకు తమ బాధ్యతల్లో కొనసాగనుంది.కాగా 53 ఏళ్ల బాషర్ బంగ్లాదేశ్ క్రికెట్లో తనంకటూ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్నాడు. టెస్టు క్రికెట్లో 3000 పరుగులు దాటిని మొదటి బంగ్లాదేశ్ ఆటగాడు కూడా ఆయనే కావడం విశేషం. అదేవిధంగా గతంలో పురుషుల, మహిళల జట్లకు సెలక్టర్గా పనిచేసిన అనుభవం కూడా అతడికి ఉంది.ఇక ఈ ప్యానల్లో అతడితో పాటు మాజీ పేసర్ హసిబుల్ హొస్సేన్, నయీమ్ ఇస్లాం, నదీఫ్ చౌదరి ఉన్నారు. 39 ఏళ్ల నయీమ్ పేరిట ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బంగ్లాదేశ్ తరపున అత్యధిక సెంచరీలు(34) సెంచరీలు చేసిన రికార్డు ఉంది. ఈ సీనియర్ సెలక్షన్ ప్యానల్ బంగ్లాదేశ్ క్రికెట్ విజయపథంలో నడిపిస్తుందని బీసీబీ భావిస్తోంది. బంగ్లా జట్టు ఇటీవలే పాకిస్తాన్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. -
'అతడు మరొక అభిషేక్ శర్మ.. వారికి టెన్షన్ మొదలైంది'
పంజాబ్ యువ సంచలనం సలీల్ అరోరా తొలిసారి ఐపీఎల్లో ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్కు అరోరా ప్రాతినిథ్యం వహించనున్నాడు. దేశవాళీ క్రికెట్లో భారీ హిట్టర్గా పేరొందిన ఆరోరా.. ఇప్పుడు ఐపీఎల్ వంటి పెద్ద టోర్నీలో ఎలా రాణిస్తాడో అందరూ అతృతగా ఎదరుచూస్తున్నారు.గతేడాది జరిగిన వేలంలో పోటీపడి మరి రూ. 1.50 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. ఇటీవల జరిగిన ఎస్ఆర్హెచ్ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్లో కూడా అరోరా విధ్వంసం సృష్టించాడు. కేవలం 13 బంతుల్లో 40 పరుగులు చేసి సత్తాచాటాడు. అతడు వరుసగా ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు.ప్రధాన టోర్నీలోనూ ఇదే జోరును కొనసాగించాలని సన్రైజర్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సలీల్ ఆరోరాపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 వరల్డ్ నెం1 బ్యాటర్ అభిషేక్ శర్మతో అరోరాను పఠాన్ పోల్చాడు. కాగా అభిషేక్, అరోరా ఇద్దరూ పంజాబ్కు చెందినవారే కావడం గమనార్హం."సలీల్ అరోరా కూడా పంజాబ్ క్రికెట్ నుంచే వచ్చాడు. ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో తన సత్తాను నిరూపించుకున్నాడు. అభిషేక్ శర్మ, నమన్ ధీర్, రమన్దీప్ సింగ్ వంటి ఆటగాళ్లు పంజాబ్ నుండి వచ్చి తమకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు సలీల్ కూడా అదే జాబితాలో చేరేలా కన్పిస్తున్నాడు. వేలంలో అతడిని ఎస్ఆర్హెచ్ ఒక బ్యాకప్ ఆటగాడిగా తీసుకుంది. కాబట్టి ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి ఫామ్లో లేకపోయినా, లేదా అనికేత్ వర్మ సరిగ్గా ఆడకపోయినా సలీల్కు అవకాశం దక్కుతుంది. బెంచ్పై సలీల్ వంటి ప్రతిభావంతుడు ఉన్నందున.. నితీశ్, అనికేత్పై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది" అని పఠాన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది? -
జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది?
ఐపీఎల్-2026 సీజన్కు ముందు భారత పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే ఉన్నప్పటికి బుమ్రా ఇంకా ముంబై ఇండియన్స్ శిబిరంలో చేరలేదు.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆటగాళ్లు గాయపడినప్పుడు లేదా ఫిట్నెస్ పరీక్షల కోసం మాత్రమే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్తారు. కానీ బుమ్రా ఇప్పుడు సీఓఈకు ఏదైనా గాయం వల్ల లేదా సాధారణ చెకప్ కోసమా వెళ్లాడా అన్నది ఇంకా స్పష్టత లేదు.ముంబై ఇండియన్స్ నుంచి కూడా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్దనే ఇటీవల మాట్లాడుతూ.. ప్రపంచ కప్ ఆడిన ఆటగాళ్లందరికీ తగినంత విరామం ఇచ్చామని, వారందరూ మార్చి 22 నాటికి జట్టుతో చేరుతారని చెప్పాడు.కానీ బుమ్రా మాత్రం ఇంకా ప్రాక్టీస్ సెషన్లకు హాజరుకాలేదు. ప్రస్తుతం ఇదే విషయం క్రికెట్ వర్గాల్లో చర్చానీయాంశమైంది. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 29న వాంఖడే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్కు గుడ్ న్యూస్.. యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు -
ఎస్ఆర్హెచ్కు గుడ్ న్యూస్.. యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు
ఐపీఎల్-2026 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఎషాన్ మలింగ తన ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేశాడు. దీంతో ఐపీఎల్లో ఆడేందుకు అతడికి శ్రీలంక క్రికెట్ 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) మంజూరు చేసింది.మలింగ ఒకట్రెండు రోజుల్లో ఎస్ఆర్హెచ్ జట్టుతో కలవనున్నాడు. మలింగకు ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో గాయపడ్డాడు. దీంతో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 19వ సీజన్ కూడా దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. గత వారం శ్రీలంక క్రికెట్ నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలలో దుష్మంత చమీర, పాతుమ్ నిస్సంక, కమిందు మెండిస్ ఉత్తీర్ణత సాధించినప్పటికి.. మలింగ మాత్రం క్లియర్ చేయలేకపోయాడు.దీంతో అతడు టోర్నీ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడని అంతా భావించారు. కానీ తాజాగా నిర్వహించిన పరీక్షలలో మాత్రం అతడు పాసయ్యాడు. మలింగ రాకతో సన్రైజర్స్ బౌలింగ్ పటిష్టంగా మారనుంది. మలింగ గత సీజన్లో కేవలం 7 మ్యాచ్ల్లోనే 13 వికెట్లు తీసి సత్తాచాటాడు. తన యార్కర్లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ లేని లోటును మలింగ భర్తీ చేయనున్నాడు. మలింగ వెన్ను గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీలంక ఆటగాళ్లు వనిందు హసరంగ (లక్నో సూపర్ జెయింట్స్), మతీష పతిరణ (కోల్కతా నైట్ రైడర్స్), నువాన్ తుషార (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఇంకా ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: PSL 2026: చంపేస్తమంటూ వార్నింగ్.. అయినా పాక్కు వచ్చిన స్మిత్ -
భారత పర్యటనకు ఆసీస్ జట్టు.. షెడ్యూల్ ఖరారు
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వచ్చే ఏడాది భారత్లో పర్యటించనుంది. ఇందుకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా 2026-27 కాలానికి గానూ ఆస్ట్రేలియా షెడ్యూల్కు సంబంధించిన అంతర్జాతీయ క్యాలెండర్ను సీఏ ప్రకటించింది.ఇందులో భాగంగా ఆగష్టు నుంచి బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్ ద్వారా ఆసీస్ హోం సీజన్ మొదలుకానుంది. ఇంగ్లండ్తో 150వ వార్షికోత్సవ టెస్టుతో 2027 మార్చితో ఈ సీజన్ ముగియనుంది. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్తో నాలుగు వారాల పాటు సిరీస్లు ఆడనున్న ఆసీస్.. అక్టోబరు చివరలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.ఆ తర్వాత నవంబరులో ఇంగ్లండ్తో ఎనిమిది మ్యాచ్ల వైట్బాల్ సిరీస్ ఆడనుంది. ఇక వచ్చే ఏడాది జనవరి మధ్య లేదంటే చివరి వారంలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టు.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది.వారికి ఇదే ఆఖరి సిరీస్ఈ నేపథ్యంలో.. ‘‘భారత్లో ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవని కమిన్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్, నాథన్ లియోన్ వంటి ఆటగాళ్లకు ఇదే ఆఖరి సిరీస్ కావొచ్చు’’ అని సీఏ తన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఒకవేళ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2027 ఫైనల్కు అర్హత సాధిస్తే జూన్లో ఇంగ్లండ్ వేదికగా ఆసీస్ ప్రత్యర్థితో తలపడుతుంది. అనంతరం జూన్- ఆగష్టు మధ్య కాలంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టులు ఆడుతుంది.ఆస్ట్రేలియా టెస్టు షెడ్యూల్ 2026-2027👉ఆగష్టు: బంగ్లాదేశ్తో సొంతగడ్డపై రెండు టెస్టులు👉అక్టోబరు- సౌతాఫ్రికాతో మూడు టెస్టులు👉డిసెంబరు- జనవరి: న్యూజిలాండ్తో సొంతగడ్డపై నాలుగు టెస్టులు👉జనవరి- మార్చి: టీమిండియాతో ఐదు టెస్టులు👉మార్చి 11-15: ఇంగ్లండ్తో సొంతగడ్డపై 150వ వార్షికోత్సవ టెస్టు👉జూన్: డబ్ల్యూటీసీ ఫైనల్ (అర్హత సాధిస్తే)👉జూన్- ఆగష్టు: ఇంగ్లండ్తో ఐదు టెస్టులు.చదవండి: భారత్తో స్నేహం కావాలి: పాక్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్! -
చంపేస్తమంటూ వార్నింగ్.. అయినా పాక్కు వచ్చిన స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో ఆడేందుకు లహోర్కు చేరుకున్నాడు. ఓ వైపు పాకిస్థాన్ వ్యతిరేక సాయుధ దళం జమాత్ ఉల్ అహ్రార్ నుంచి బెదిరింపులు వచ్చినప్పటికి.. స్మిత్ మాత్రం పాక్ గడ్డపై అడుగుపెట్టాడు. లహోర్ ఎయిర్పోర్ట్లో స్మిత్కు ఘన స్వాగతం లభించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య అతడు ముల్తాన్ సుల్తాన్ టీమ్ బస చేసే హోటల్కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చంపేస్తమంటూ వార్నింగ్!కాగా నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్’ (TTP)కి చెందిన జమాత్-ఉల్-అహ్రార్ విభాగం విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేసింది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్ వంటి ఆటగాళ్లు వెంటనే టోర్నీ నుండి తప్పుకోవాలని, లేదంటే వారి భద్రతకు తాము బాధ్యులం కాదని ఓ ప్రకటనలో జమాత్-ఉల్-అహ్రార్ పేర్కొంది. అయినప్పటికి విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పాక్కు చేరుకుంటున్నారు.పీసీబీ కీలక నిర్ణయం..ఈ హెచ్చరికల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భద్రత, ఇంధన సంక్షోభం దృష్ట్యా ఈసారి మ్యాచ్లను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అంతేకాకుండా కేవలం రెండు వేదికలలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఇక పీఎస్ఎల్ 11వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ICC: పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు -
కేకేఆర్ జట్టులోకి స్వింగ్ కింగ్.. ఎవరంటే?
ఐపీఎల్-2026 సీజన్కు కోల్కతా నైట్రైడర్స్ స్పీడ్ స్టార్ ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఆకాష్ దీప్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి సుమారు 8 నుంచి 12 వారాల సమయం పట్టనుంది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని విదర్భ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ దూబేతో కేకేఆర్ భర్తీ చేసింది.ఐపీఎల్-2022లో దూబేను సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసినప్పటికి, గాయం కారణంగా అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది సీజన్ మినీ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నప్పటికి ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఆకాష్ దీప్ గాయం బారిన పడడంతో లక్కీగా ఐపీఎల్లో ఆడే అవకాశం దూబేకు దక్కింది.ఈ విదర్భ పేసర్కు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా అతడి ఉంది. అంతేకాకుండా బౌన్సీ పిచ్లపై బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. 2019 ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో భారత అండర్-23 జట్టు తరపున దూబే అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఒకే మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.ఆ సమయంలో భారత అండర్-23 జట్టు కోచ్గా రాహుల్ ద్రవిడ్ ఉండడం విశేషం. ద్రవిడ్ వంటి దిగ్గజం నుంచి కూడా అతడు పాఠాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి మహా వేదికపై సత్తాచాటేందుకు సౌరభ్ సిద్దమయ్యాడు.కాగా కేకేఆర్ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ దూరం కాగా.. శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరానా ఫిట్నెస్పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఐపీఎల్-19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: న్యూజిలాండ్ క్రికెట్కు భారీ షాక్..! -
పిల్లలకు ఆస్తులు పంచి ఇచ్చిన భారత మాజీ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు అత్యంత ప్రత్యేకమైన రెండు ఇళ్లను పిల్లలకు పంచి ఇచ్చేశానని తెలిపాడు. పంజాబ్కు చెందిన నవజ్యోత్ సింగ్ సిద్ధు 1983- 1999 వరకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.తన కెరీర్లో మొత్తంగా 51 టెస్టులు, 136 వన్డేలు ఆడిన సిద్ధు.. టెస్టుల్లో 3202, వన్డేల్లో 4413 పరుగులు సాధించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్గా కొనసాగుతున్న సిద్ధు.. టీవీ షోల ద్వారా కూడా ఆదాయం పొందుతున్నాడు. ఇక రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టిన నవజ్యోత్ సింగ్ సిద్ధు రెండుసార్లు ఎంపీగా పనిచేశాడు.ఓ కుమారుడు, కుమార్తెవ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. డాక్టర్, రాజకీయ నాయకురాలు నవజ్యోత్ కౌర్ సిద్ధును పెళ్లాడిన సిద్ధుకు.. కుమారుడు కరణ్ సిద్ధు, కుమార్తె రబియా సిద్ధు సంతానం. ఇదిలా ఉంటే.. తాజాగా నవజ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టాడు. తాను బతికి ఉండగానే తన పిల్లలకు ‘విలువైన’ ఆస్తులను పంచి ఇచ్చినట్లు తెలిపాడు.ఇద్దరికి చెరో ఇల్లు‘‘పార్వతీ దేవి అమ్మవారి అనుగ్రహంతో అమృత్సర్లో నేను కట్టుకున్న ఇల్లు.. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నేను ఎక్కువగా ఇక్కడ నివసించలేకపోయాను. బిగ్బాస్ నుంచి స్టార్ టీవీలో హిందీ కామెంట్రీ, కపిల్ శర్మ షో.. ఇలా ఒక్కో ఆదాయ మార్గంఅయితే, రాజకీయాల ద్వారా ఒక్క పైసా కూడా నేను సంపాదించలేదు. నా కష్టార్జితంతోనే కొన్ని ఆస్తులు కూడబెట్టగలిగాను. పటియాలాలో మా నాన్నగారు కట్టించిన పూర్వీకుల ఇల్లు కరణ్కు వారసత్వంగా లభిస్తుంది. అమృత్సర్లో నేను కట్టిన ఇల్లు రబియాకు ఇస్తున్నాము’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు పోస్ట్ షేర్ చేశాడు. ఈ సందర్భంగా కూతురుతో కలిసి దిగిన ఫొటోలు, శివలింగానికి పూజ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను పంచుకున్నాడు.రూ. 25 కోట్లు!కాగా అమృత్సర్లో ప్రీమియర్ లొకాలిటీలో సిద్ధు కట్టిన ఇల్లు 49,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం, 2014-15 మధ్య కాలంలో నిర్మించిన ఈ ఇంటి విలువ దాదాపు రూ. 25 కోట్లు అని తెలుస్తోంది. స్విమ్మింగ్పూల్, జిమ్, స్పా వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయట.అంతేకాదు.. ఈ విలాసవంతమైన ఇంటిలో ప్రత్యేకంగా శివుడి కోసం చిన్న ఆలయం కూడా నిర్మించినట్లు కథనాలు ఉన్నాయి. ఇందులో ప్రతిష్టించిన శివలింగం దాదాపు రూ. 2.5 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. శివుడితో పాటు ఇతర దేవతా విగ్రహాలు, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ కూడా ఇందులో ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. అమృత్సర్ ఇల్లు, పటియాలా నివాసం వద్ద కూతురితో సిద్ధుచదవండి: భారత్తో స్నేహం కావాలి: పాక్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్! -
న్యూజిలాండ్ క్రికెట్కు భారీ షాక్..!
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో ఓటమి తర్వాత న్యూజిలాండ్ క్రికెట్లో లుకలుకలు బయటపడ్డాయి. కివీస్ క్రికెట్ బోర్డు సభ్యుడు, మాజీ క్రికెటర్ డైన్ వాష్ తన పదవికి రాజీనామా చేశారు. బోర్డు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల నేపథ్యంలో అతడు తన పదవి నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కొత్త ఫ్రాంచైజీ ఆధారిత టీ20 లీగ్ను ప్రారంభించాలని సోమవారం నిర్ణయించింది. అంతేకాకుండా బిగ్ బాష్ లీగ్లో న్యూజిలాండ్ ఆధారిత ఓ జట్టును చేర్చాలని బోర్డు ప్రతిపాదించింది. అయితే బోర్డు తీసుకున్న నిర్ణయం సభ్యుల మధ్య విభేదాలకు దారితీసింది.ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే నాష్ తన పదవి నుంచి వైదొలగి అందరికి షాకిచ్చాడు. "బోర్డు తీసుకున్న నిర్ణయాలకు నేను మద్దతు ఇవ్వలేను. అందుకే నా పోస్ట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావించాను" అని నాష్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.మొన్న స్కాట్.. నేడు నాష్కాగా ఇదే టీ20 లీగ్ వివాదం కారణంగా గత ఏడాది న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ కూడా పదవి నుంచి తప్పుకొన్నాడు. ఇప్పుడు నాష్ ఈ జాబితాలోకి చేరాడు. అయితే బోర్డు తీసుకున్న నిర్ణయానికి సోఫీ డివైన్, అమీలియా కేర్ వంటి స్టార్ ఉమెన్స్ క్రికెటర్లు మాత్రం మద్దతు తెలుపుతున్నారు.కాగా భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోలిస్తే ఐసీసీ నుంచి న్యూజిలాండ్కు వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఈ లోటును పూడ్చుకోవడానికే కొత్త లీగ్ ప్రారంభించాలని న్యూజిలాండ్ క్రికెట్ యోచిస్తోంది.చదవండి: ICC: పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు -
పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
టీ20 ప్రపంచకప్-2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్కు అరుదైన గౌరవం దక్కింది. ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఫర్హాన్ ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ విల్ జాక్స్, అమెరికా పేసర్ షాడ్లీ వాన్ షాల్క్విక్లను వెనక్కి నెట్టి ఫర్హాన్ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ సెమీస్కు చేరడంలో విఫలమైనప్పటికి.. సాహిబ్జాదా ఫర్హాన్ మాత్రం దుమ్ములేపాడు. ఒక్క భారత్పై తప్ప ప్రతీ మ్యాచ్లోనూ అతడు బ్యాట్ ఝులిపించాడు. నమీబియా, శ్రీలంకపై సెంచరీలతో అతడు చెలరేగాడు.తద్వారా ఒకే టీ20 ప్రపంచకప్లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 383 పరుగులు సాధించి, ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లిని అతడు అధిగమించాడు. ఈ క్రమంలోనే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.ఫర్హాన్ కంటే ముందు బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, నోమన్ అలీ, హసన్ అలీ వంటి పాక్ ఆటగాళ్లు ఈ ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నారు. బాబర్కు అయితే అత్యధికంగా మూడు సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇక మహిళల విభాగంగాలో భారత స్టార్ ఆల్రౌండర్ అరుంధతి రెడ్డి ఈ అవార్డు వరించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో అరుంధతి మొత్తం 8 వికెట్లు పడగొట్టింది. ఆసీస్తో టీ20 సిరీస్ను సొంతం చేసుకోవడంలో అరుంధతిది కీలక పాత్ర.చదవండి: వైభవ్పై డివిలియర్స్ ప్రశంసలు!.. ఆర్సీబీ స్టార్ షాకింగ్ కామెంట్స్ -
‘వైభవ్ సూర్యవంశీ.. చెప్పిన మాట అసలే వినడు’
పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో అద్భుతాలు చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఇటు ఐపీఎల్లో.. అటు భారత అండర్-19 క్రికెట్ జట్టు తరఫునా సత్తా చాటాడు. క్యాష్ రిచ్ లీగ్లో విధ్వంసకర శతకంతో అతి పిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఈ బిహారీ పిల్లాడు.. అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు.తద్వారా భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన వైభవ్.. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున మరోసారి సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యాడు.అతడొక గొప్ప ఆటగాడుఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించి సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు.. అందుకు ప్రతిగా టీమిండియా స్టార్, ఆర్సీబీ ఆటగాడు జితేశ్ శర్మ (Jitesh Sharma) బదులిచ్చిన తీరు వైరల్గా మారింది. ‘‘అతడొక గొప్ప ఆటగాడు. అండర్-19 క్రికెట్లో అతడి ఆట తీరును నేను గమనించాను.ఐపీఎల్లాంటి పెద్ద టోర్నీలో ఆడిన తర్వాత అదే స్థాయిలో.. అవే ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగడం అందరికీ సాధ్యం కాదు. అయితే, వైభవ్ సూర్యవంశీ మాత్రం వరల్డ్కప్ టోర్నీలో అంతే ప్రొఫెషనల్గా, భయం లేకుండా ఆడటం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రొఫెషనల్గా ఎదుగుతాడుఆ వయసుకే అతడు అంతగా పరిణతి చెందిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. ఎక్కడ ఆడుతున్నా తన గేమ్ప్లాన్కు కట్టుబడి ఉంటాడు. తను తనలాగే ఆడతాడు. వేరే వాళ్లను అనుకరించే ప్రయత్నం చేయడు. బౌలర్లను గౌరవిస్తాడు. చెత్త బంతుల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టడు. అతడొక గొప్ప ప్రొఫెషనల్గా ఎదుగుతాడు’’ అని డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు.అయితే, ఇందుకు జితేశ్ శర్మ బదులిస్తూ.. ‘‘అతడు అస్సలు ప్రొఫెషనల్ కాదు. నేను ఈ మాట కచ్చితంగా చెప్పగలను’’ అంటూ సరాదాగా కామెంట్ చేశాడు. ‘‘అందరూ అతడిని ప్రొఫెషనల్ అనుకుంటారు. మైదానంలో అతడు ఎలా ఉంటాడన్నది పక్కనపెడితే.. మైదానం వెలుపల మాత్రం అస్సలు చెప్పిన మాట వినడు. రాత్రివేళ ఐస్క్రీమ్ తినొద్దని నేను ఎంతగానో మొత్తుకున్నా.చెప్పిన మాట అసలే వినడుఅయినా అతడు నా మాట వినలేదు. ఈ విషయంలో అతడు ఎప్పుడూ ఎవరి మాటా వినడు’’ అని జితేశ్ శర్మ వైభవ్కు ఉన్న అలవాటు గురించి డివిలియర్స్కు చెప్పాడు. కాగా చిన్న వయసు కాబట్టి ఐస్క్రీమ్ పట్ల వైభవ్కు ఆ మాత్రం ఇష్టం ఉండటం సహజమే. అయితే, ప్రొఫెషనల్ క్రికెటర్గా ఎదిగే క్రమంలో డైట్ పాటిస్తూ జీవనశైలిని మెరుగుపరచుకుంటేనే ఫిట్గా ఉండి.. అనుకున్న శిఖరాలకు చేరుకోగలడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో భారత జట్టుకు జితేశ్ శర్మ కెప్టెన్గా వ్యవహరించగా.. వైభవ్ సూర్యవంశీ అందులో సభ్యుడిగా ఉన్నాడు.చదవండి: భారత్తో స్నేహం కావాలి: పాక్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్! -
విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పటికే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహించేందుకు సిద్ధమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్వాహకులకు మరో తలనొప్పి వచ్చి పడింది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లకు పాకిస్థాన్ వ్యతిరేక సాయుధదళం జమాత్ ఉల్ అహ్రార్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. విదేశీ ఆటగాళ్లను హెచ్చరిస్తూ తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్కు చెందిన జమాత్ ఉల్ అహ్రార్ పంచుకున్న లేఖను ఇస్లామాబాద్ పోస్ట్ తన ‘ఎక్స్’లో పంచుకుంది. ‘కొన్ని రోజులుగా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కైబర్ పంక్తున్వా, బెలూచిస్థాన్ ఫ్రావిన్స్కు చెందిన అమాయక ప్రజలపై పాకిస్థాన్ అమానుష దాడులకు పాల్పడుతుంది. మా ప్రజలపై వారు చేస్తున్న దాష్టీకాలన్నింటిని గమనిస్తూనే ఉన్నాం. త్వరలోనే పాకిస్థాన్కు గట్టి బదులు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్లీగ్ (పీఎస్ఎల్) ఆడేందుకు వచ్చే విదేశీ ఆటగాళ్లకు ఇదే మా హెచ్చరిక. పీఎస్ఎల్ ఆడేందుకు పాకిస్థాన్కు రావొద్దు. ఇక్కడి పరిస్థితులు అంతగా బాలేవు. కాబట్టి ఆటగాళ్ల భద్రతకు ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేము. నిజానికి మేము క్రికెట్కు వ్యతిరేకులం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పీఎస్ఎల్ నిర్వహించడం మంచిది కాదు. పీఎస్ఎల్ ఆడేందుకు వచ్చే విదేశీ ఆటగాళ్లు అవనసరంగా ఇబ్బంది పడడం ఇష్టం లేదు. కాబట్టి పాకిస్థాన్కు రాకపోవడమే మంచిది. ఒకవేళ వస్తే పాక్ విడిచి వెళ్లిపోతే మంచిదని మా అభిప్రాయం.’ అని లేఖలో పేర్కొంది. పశ్చియాసియా యుద్ధం, అఫ్గానిస్థాన్తో వైరం కారణంగా పీఎస్ఎల్లో ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని ఆదివారం పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతలో పాకిస్థాన్ వ్యతిరేక శక్తుల నుంచి లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే భద్రతా, ఇతర కారణాల రీత్యా చాలా మంది విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్కు గుడ్బై చెబుతున్నారు. షనక, ముజరబానీ, స్పెన్సర్ జాన్సన్ తదితరులు జాబితాలో ఉన్నారు. ఇక మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న పీఎస్ఎల్లో ఈసారి ఆస్ట్రేలియా క్రికెటర్లు సహా మొయిన్ అలీ (ఇంగ్లండ్), డెవన్ కాన్వే (న్యూజిలాండ్) ఇలా చాలా మందే ఉన్నారు. కానీ తాజా బెదిరింపులతో అసలు పీఎస్ఎల్ సక్రమంగా జరుగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.చదవండి: 60 ఏండ్లు వచ్చేదాకా ఆడుతా!🔴 JUST IN 🇵🇰 Armed opposition groups in Pakistan have issued a statement urging all foreign players participating in the Pakistan Super League (PSL) cricket matches to avoid traveling to Pakistan, stating that their security is not guaranteed and there is a risk of harm.The… pic.twitter.com/caf7Tim1ep— Islamabad Post (@ISBPost) March 23, 2026 -
60 ఏండ్లు వచ్చేదాకా ఆడుతా!
తనకు 60 ఏండ్లు వచ్చే వరకు ఐపీఎల్ ఆడతానని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేర్కొనడం చెన్నై సూపర్కింగ్స్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్రస్తుతం 44 ఏండ్లు ఉన్న ధోనికి ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరిదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్గా నిలిచిన సీఎస్కే ఈసారి ఎలాగైనా టైటిల్ గెలిచి ధోనికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ధోని వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. విషయంలోకి వెళితే.. ఆదివారం సీఎస్కే ఫ్యాన్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళ హీరో శివకార్తికేయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ధోని రిటైర్మెంట్ విషయమై శివకార్తికేయన్ మాట్లాడాడు. ‘ధోని సార్ మీరు రిటైర్ అవ్వొద్దు. అలా చేస్తే చెన్నై సూపర్కింగ్స్ అభిమానులు బాధపడతారు. 44 ఏళ్ల వయసులోనూ మీరు యంగ్గానే కనిపిస్తున్నారు.కనీసం 60 సంవత్సరాల వరకైనా క్రికెట్ ఆడి మమ్నల్ని అలరించాలి’ అని పేర్కొన్నాడు. దీనిపై మహేంద్ర సింగ్ ధోని వెంటనే స్పందించాడు. ‘రోజురోజుకు ఆరోగ్యంతో పాటు ఫిట్నెస్ కూడా తగ్గుతూ వస్తోంది. అయినా సరే 60 ఏళ్లు వచ్చే వరకు ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని ధోని చమత్కరించాడు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే యాజమాన్యం తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసుకోవడంతో అది వైరల్గా మారింది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతూ వస్తోన్న ధోనికిది 19వ సీజన్. ఇప్పటివరకు ధోని ఐపీఎల్లో 278 మ్యాచ్లాడి 5,349 పరుగులు సాధించాడు. 2024లో సీఎస్కే కెప్టెన్గా వైదొలగడానికి ముందు ఆ జట్టు సాధించిన ఐదు టైటిల్స్ అందించి జట్టు ప్రయాణంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో ధోని పూర్థిస్థాయిలో అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మున్ముందు తేలనుంది. అయితే సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాత్రం ఈ సీజన్కు ధోని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడని పేర్కొన్నారు. అయితే ఫ్రాంచైజీ ట్రేడింగ్లో సంజూ శాంసన్ సీఎస్కేకు రావడంతో కీపింగ్ బాధ్యతలు అతడే తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధోనికిది చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే సీఎస్కే ట్రేడింగ్లో ఏరికోరి శాంసన్ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది.A CSK fan at heart, Our star SK in the house 🥳#Roar26 #WhistlePodu pic.twitter.com/Sl8aG0xmGH— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2026చదవండి: Delhi Capitals: ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’ -
సెలక్టర్లు వింటారు: నితీశ్ రెడ్డికి ఇషాన్ కిషన్ వార్నింగ్!
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)- సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్తో మార్చి 28న ఐపీఎల్-2026 టోర్నీకి తెరలేవనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక.కెప్టెన్గా ఇషాన్ కిషన్ఇక ఆరంభ మ్యాచ్లకు ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. అతడి గైర్హాజరీలో సన్రైజర్స్ కెప్టెన్గా టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు. ఇప్పటికే సన్రైజర్స్ నెట్ ప్రాక్టీస్, ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్లతో బిజీబిజీగా గడుపుతోంది.ఈ క్రమంలో ఆటవిడుపుగా సన్రైజర్స్ ఆటగాళ్లు అభిమానులతో మమేకం అయ్యారు. ఫ్యాన్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలతో అలరించారు. ఇందులో భాగంగా ఆంధ్ర కుర్రాడు, టీమిండియా స్టార్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు.. అందుకు కెప్టెన్ ఇషాన్ కిషన్ ఇచ్చిన కౌంటర్లు.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సెలక్టర్లు వింటారు!టెస్టు లేదంటే టీ20 ఫార్మాట్.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటారని హోస్ట్ అడుగగా నితీశ్ రెడ్డి.. టీ20 అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత టెస్టు లేదంటే వన్డేలలో ఒకటి ఎంచుకోమనగా.. అతడు వన్డే అని బదులిచ్చాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ జోక్యం చేసుకుంటూ.. ‘‘నువ్వు టెస్టు జట్టులో కీలక సభ్యుడివి బ్రో. సెలక్టర్లు ఈ మాటలు వింటారు జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. దీంతో నితీశ్తో పాటు ఆక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వేశారు.𝙁𝙤𝙧 𝙩𝙝𝙚 𝙩𝙚𝙖𝙢, 𝙖𝙣𝙮𝙩𝙝𝙞𝙣𝙜 🤌 pic.twitter.com/ju8SpzTvxl— SunRisers Hyderabad (@SunRisers) March 22, 2026కాగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన నితీశ్ రెడ్డిని.. హార్దిక్ పాండ్యాకు సరైన వారసుడిగా సెలక్టర్లు భావిస్తున్నారు. వైట్బాల్ క్రికెట్లో హార్దిక్ గైర్హాజరీలో అడపాదడపా అవకాశాలు అందుకున్న నితీశ్.. గత రెండేళ్లుగా టెస్టుల్లో మాత్రం ఆల్రౌండర్గా స్థానం సుస్థిరం చేసుకున్నాడు.అది సాధ్యం కాదు!ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇషాన్ కిషన్ నితీశ్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ఇక ఐపీఎల్లో పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడం ఇష్టమా? లేదంటే డెత్ ఓవర్లలో బ్యాటింగ్ ఇష్టమా? అని హోస్ట్ అడుగగా.. నితీశ్ రెడ్డి పవర్ ప్లే అని సమాధానం ఇచ్చాడు.దీంతో మరోసారి ఇషాన్ కిషన్ కౌంటర్తో ముందుకు వచ్చాడు. నితీశ్ రెడ్డి రెగ్యులర్గా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి.. అతడికి ఎంత ఇష్టం ఉన్నా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయలేడంటూ నవ్వులు పూయించాడు. టెస్టు జట్టులో స్థానం సుస్థిరంకాగా సన్రైజర్స్ తరఫున 2024లో సత్తా చాటి భారత టీ20 జట్టులో అడుగుపెట్టిన నితీశ్ రెడ్డి.. అదే ఏడాది ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 10 టెస్టులు, 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడాడు.మరోవైపు ఇషాన్ కిషన్ దాదాపు మూడేళ్ల తర్వాత ఇటీవలే టీమిండియాలో పునరాగమనం చేశాడు. క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. అద్భుత ఫామ్లో ఉన్న అతడిని టీ20 ప్రపంచకప్-2026 జట్టుకు ఎంపిక చేయగా.. భారత్ చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: భారత్తో స్నేహం కావాలి: పాక్కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్! -
Delhi Capitals: ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 18 సీజన్లు ముగిసినప్పటికీ టైటిల్ గెలవాలన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆకలి మాత్రం తీరడం లేదు. జట్టు పేరు మార్చినా, ఆటగాళ్లను మార్చినా, దిగ్గజ ఆటగాళ్లు జట్టును నడిపించినా ఢిల్లీ తలరాత మాత్రం మారలేదు. ఐపీఎల్ ప్రారంభమైన 2008లో ఢిల్లీ డేర్డెవిల్స్గా ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలో సెమీఫైనల్ చేరింది. తర్వాతి సీజన్లో కూడా సెమీస్లో అడుగుపెట్టింది. ఇక మధ్యలో 2012లో మరోసారి ప్లేఆఫ్స్ చేరినప్పటికీ టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. ఆ తర్వాత వరుసగా ఆరు సీజన్ల పాటు లీగ్ దశకే పరిమితమైంది. అయితే 2018లో ఢిల్లీ డేర్డెవిల్స్ను జేఎస్డబ్ల్యూ సంస్థ కొనుగోలు చేసింది. ఆ తర్వాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ గా మార్చారు. పేరు మార్చిన తర్వాత వరుసగా మూడు సీజన్లు (2019, 2020, 2021) అదరగొట్టింది. పుష్కర కాలానికి..ఐపీఎల్ ప్రారంభమైన పుష్కరకాలం తర్వాత 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలై రన్నరప్కే పరిమితమైంది. 2021లో మరోసారి ప్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ కథ 2022 నుంచి మళ్లీ మొదటికే వచ్చింది. గత సీజన్లోనూ ఢిల్లీ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.బ్యాటింగే బలం..ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేపర్పైన బలంగానే కనిపిస్తుంది. పేపర్పై ఉన్న బలాన్ని మైదానంలోనూ ప్రదర్శిస్తుందా లేక గత సీజన్ల మాదిరే చతికిలపడుతుందా అన్నది చూడాలి. జట్టుకు కేఎల్ రాహుల్ పెద్ద బలం అని చెప్పొచ్చు. గత సీజన్లో కేఎల్ రాహుల్ 539 పరుగులతో జట్టు టాప్స్కోరర్గా నిలిచాడు. మరోసారి రాహులే జట్టుకు కీలకమవ్వనున్నాడు. కేఎల్ రాహుల్తో పాటు బెన్ డకెట్, పాతుమ్ నిసాంక, పృథ్వీ షా, అభిషేక్ పొరేల్, నితీశ్ రాణా, డేవిడ్ మిల్లర్, సమీర్ రజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ వంటి హిట్టర్లు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం.ఇక కెప్టెన్ అక్షర్ పటేల్ బంతితో పాటు బ్యాట్తోనూ రాణించగల సమర్థుడు.మిచెల్ స్టార్క్ఆడేనా?బ్యాటింగ్తో పోలిస్తే బౌలింగ్ కూడా పటిష్టంగా ఉన్నప్పటికీ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడతాడా లేదా అన్న సంశయం ఉండడంతో కాస్త ఆందోళన నెలకొంది. నటరాజన్, ముకేశ్ కుమార్కు తోడు దేశవాళీల్లో సంచలన ప్రదర్శనతో వేలంలో రూ. 8.4 కోట్ల ధరతో ఢిల్లీ దక్కించుకున్న కశ్మీర్ పేసర్ అకిబ్ నబీపై కూడా జట్టు భారీ అంచనాలే పెట్టుకుంది. స్పిన్ విభాగంలో అక్షర్, కుల్దీప్, విప్రజ్ నిగమ్లతో బలంగానే కనిపిస్తోంది. మొత్తం మీద ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’ అన్నట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి తయారైంది. ఐపీఎల్ 19వ సీజన్లోనైనా మెరిసి కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగుతోంది. ఢిల్లీ కల నెరవేరాలని ఆశిద్దాం.ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు అంచనా: అక్షర్పటేల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిసాంక, నితీశ్ రానా, డేవిడ్ మిల్లర్, సమీర్ రిజ్వీ/కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, కుల్దీప్యాదవ్, అకిబ్ నబీ, స్టార్క్, ముకేశ్ కుమార్/నటరాజన్.ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బెస్ట్: 2020 (రన్నరప్); 2019, 2021 (ప్లే ఆఫ్స్); 2008, 2009 (సెమీఫైనల్స్)చదవండి: భారత స్టార్కు మొండిచేయి.. అశ్విన్ తుది జట్టు ఇదే! -
భారత్తో స్నేహం కావాలి: పాకిస్తాన్కు దిమ్మతిరిగే షాక్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చిన భారత్ చాంపియన్గా నిలిచింది. స్వదేశంలో తొలిసారి, వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి క్రికెట్ వరల్డ్కప్ ట్రోఫీ ముద్దాడిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.టోర్నీ నుంచి అవుట్మరోవైపు.. భారత్తో దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెంచుకున్న బంగ్లాదేశ్.. భద్రతా కారణాలు చూపి భారత్లో ఆడేందుకు నిరాకరించింది. తమ వేదికను శ్రీలంకు మార్చాలని కోరగా.. ఐసీసీ అందుకు అంగీకరించలేదు. ఫలితంగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకొంది.ఐపీఎల్ ప్రసారాలపై నిషేధంఐపీఎల్-2026 నుంచి తమ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ను తప్పించిన తర్వాతే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ మేరకు కుంటిసాకులతో ఐసీసీ టోర్నీ నుంచి వైదొలిగింది. అంతేకాదు తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తున్నట్లు యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఒకానొక సందర్భంలో ప్రకటించింది కూడా!!అయితే, బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మాత్రం భారత్తో క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించుకోవడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఐపీఎల్ ప్రసారాల విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బంగ్లాదేశ్ క్రీడా శాఖా మంత్రి అమినుల్ హక్ క్రిక్బజ్తో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.భారత్తో స్నేహం కావాలి‘‘బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాల గురించి మేము ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. అయితే, రంజాన్ ముగిసిన వెంటనే క్రికెట్ బోర్డుతో ఇందుకు సంబంధించి చర్చలు జరుపుతాము. ఆ తర్వాతే ఒక నిర్ణయానికి వస్తాము.ఇండియాతో స్నేహ పూర్వక సంబంధాలనే మేము కోరుకుంటున్నాము. వారితో విభేదాలు, వివాదాలను పరిష్కరించుకుంటాము. క్రీడలలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నది మా ఆలోచన. బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసుకుంటాము. ఆ తర్వాతే ఐపీఎల్ ప్రసారాల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటాము’’ అని అమినుల్ హక్ పేర్కొన్నారు.పాకిస్తాన్కు దిమ్మతిరిగేలా షాక్కాగా టీ20 ప్రపంచకప్ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ప్రభుత్వం ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్కు అన్యాయం చేస్తున్నారని.. తాము కూడా బంగ్లాకు మద్దతుగా టోర్నీ నుంచి తప్పుకొంటామని నాటకాలు ఆడింది. తర్వాత యథావిధిగా మాట మార్చి టోర్నీ ఆడి.. సెమీస్ చేరుకుండానే నిష్క్రమించింది. పీసీబీ ఇలా ఓవరాక్షన్ చేయగా.. బంగ్లాదేశ్ తాజాగా భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు సంకేతాలు ఇవ్వడం గమనార్హం. మరోవైపు.. భారత్తో ద్వైపాక్షిక సిరీస్ల విషయంలోనూ బంగ్లా బోర్డు సానుకూల వైఖరితో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. చదవండి: హక్కుగా భావిస్తున్నారు.. వాళ్లపై వేటు వేయండి: గావస్కర్ ఫైర్ -
హక్కుగా భావిస్తున్నారు.. వాళ్లపై వేటు వేయండి: గావస్కర్ ఫైర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీలకు టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ కీలక సూచన చేశాడు. విదేశీ ఆటగాళ్ల విషయంలో ఫ్రాంఛైజీలు కాస్త కఠినంగా ఉండాలని సూచించాడు. చాలా మంది లీగ్ను తేలికగా తీసుకుంటున్నారని.. అలాంటి వారు దారిలోకి రావాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదు అన్నాడు.అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్గా కొనసాగుతున్న భారత జట్టు మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్.. ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్లో కీలక సభ్యుడు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే సన్నీ.. విదేశీ ఆటగాళ్లలో కొంతమంది వైఖరి తనకు నచ్చడం లేదని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్స్టార్కు రాసిన కాలమ్లో...గాయాల బెడద లేకున్నా..‘‘కొంతమంది విదేశీ ఆటగాళ్లు గాయాల బెడద లేకున్నా అందుబాటులో ఉండటం లేదు. కొంతమంది వ్యక్తిగత కారణాలు చూపుతున్నారు. మరి కొందరేమో ఆలస్యంగా శిక్షణా శిబిరంలో చేరుతున్నారు. ఫ్రాంఛైజీలు తమ కోసం ఏం చేయడానికైనా సిద్ధమనే ఆలోచనతోనే వారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.మరోవైపు.. ఫ్రాంఛైజీ యజమానులు కూడా అందుకు తగ్గట్లుగా ఆటగాళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా వారి కుటుంబాలకు అయ్యే ఖర్చులు సైతం భరిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా వారంతా చక్కగా అన్ని చోట్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.భారతీయ ఆతిథ్యం అలాగే ఉంటుందినిజానికి భారతీయ ఆతిథ్యం అలాగే ఉంటుంది. అతిథులకు అన్ని రకాలుగా మర్యాద చేస్తాము. కానీ కొంతమంది ఆటగాళ్లు ఇది తమ హక్కుగా భావిస్తున్నారు. తమకోసం ఏదైనా చేస్తారులే అన్న ధోరణి వారిలో కనిపిస్తోంది. మన మంచితనాన్ని వారు వేరొక రకంగా అర్థం చేసుకుంటున్నారు.ఫ్రాంఛైజీ తమను కొనే సమయంలో తాము కచ్చితంగా అందుబాటులో ఉంటామని చెప్పే ఆటగాళ్లలో చాలా మంది.. సమయానికి చేతులెత్తేస్తున్నారు. తమ సమస్యల గురించి ముందుగానే ఫ్రాంఛైజీలకు చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ఆఖర్లో ఏదో ఒక కారణం సాకుగా చూపి తప్పుకొంటున్నారు.వాళ్లపై వేటు వేయండిఇలాంటి ఆటగాళ్లపై వేటు వేయడంలో ఫ్రాంఛైజీలు మరో ఆలోచనకు తావు ఇవ్వకూడదు. టైటిల్ గెలిచేందుకే ప్రతి జట్టు బరిలోకి దిగుతుంది. కానీ ఇలాంటి కొంతమంది వల్ల కూర్పు దెబ్బతిని అవకాశాలు సన్నగిల్లుతాయి. ఫ్రాంఛైజీ యజమానులు కఠిన చర్యలు తీసుకుంటారనే భయం లేనంత వరకు ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి’’ అని గావస్కర్ ఘాటు విమర్శలు చేశాడు.హ్యారీ బ్రూక్ విషయంలోకాగా గతంలో కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఆఖరి నిమిషంలో లీగ్ నుంచి తప్పుకొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఐపీఎల్ పాలక మండలి కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. గాయాలు, అత్యవసర పరిస్థితుల్లో మినహా లీగ్ నుంచి అకస్మాత్తుగా తప్పుకొనే ఆటగాళ్లు మరోసారి వేలంలో పాల్గొనకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది.ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ విషయంలో ఈ నిబంధన అమలైంది కూడా! 2025 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేయగా ఆఖరి నిమిషంలో తప్పుకొన్నాడు. అతడు ఇలా చేయడం వరుసగా ఇది రెండోసారి. దీంతో రెండేళ్ల పాటు బ్రూక్ ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించారు. ఇదిలా ఉంటే.. మార్చి 28న ఐపీఎల్-2026కు తెరలేవనుంది. ఇక సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆర్సీబీ ఆటగాడు జోష్ హాజిల్వుడ్, ఢిల్లీ పేసర్ మిచెల్ స్టార్క్ ఫిట్నెస్ సమస్యల కారణంగా ఆలస్యంగా జట్లతో చేరనున్నారు. ఈ ముగ్గురు పేసర్లు ఆస్ట్రేలియాకు చెందినవారేనన్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2026: పంత్ను తీసేద్దామనుకున్నారా? -
భారత స్టార్కు మొండిచేయి.. అశ్విన్ తుది జట్టు ఇదే!
ఐపీఎల్ 2026 సీజన్కు మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో టోర్నీలోని అన్ని జట్లు తమ ప్రాక్టీస్ను ముమ్మరం చేశాయి. కొన్ని జట్లలోని ఆటగాళ్లు ఇంట్రాస్వ్కాడ్లుగా విడిపోయి మ్యాచ్లు కూడా ఆడుతున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆటగాళ్లు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ లీగ్కు ఊపు తెస్తున్నారు. ఆయా ఫ్రాంచైజీలకు సంబంధించి తుది జట్టులో ఎవరెవరికీ చోటు దక్కుతుందనే దానిపై మాజీ క్రికెటర్లు జోరుగా ఊహాగానాలు వ్యక్తం చేస్తూ తమ ప్రాబబుల్ ఎలెవెన్ను ప్రకటించే పనిలో పడ్డారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే తాను ప్రకటించిన జట్టులో భారత బౌలర్ తుషార్ దేశ్పాండేకు చోటు కల్పించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. రాజస్థాన్ రాయల్స్ తుషార్ దేశ్పాండేను రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అశ్విన్ ప్రకటించిన జట్టులో ఓపెనర్లుగా వైభవ్ సూర్యశంశీ, జైశ్వాల్లు, మూడో స్థానంలో కెప్టెన్ రియాన్ పరాగ్కు చోటు కల్పించాడు. మిడిలార్డర్లో హెట్మైర్, ధ్రువ్ జురేల్, ఫెరీరాలకు అవకాశమిచ్చాడు. జడేజాను ఆల్రౌండర్గా ఎంచుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఆర్చర్, బిష్ణోయి, సందీప్ శర్మలకు చోటు కల్పించాడు. ‘నా దృష్టిలో హెట్మైర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రావడం ఉత్తమం. టీ20 ప్రపంచకప్లో విండీస్ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి దుమ్మురేపాడు. అందుకే నాలుగోస్థానం అతడికి సరైనది. ఫినిషింగ్ బాధ్యతలు జడేజా, ఫెరీరాలు చూసుకుంటారు. నా వరకు ఇది బెస్ట్ టీం. నేను ప్రకటించిన జట్టులో ఒకటి, రెండు మార్పులుండే అవకాశముంది.’అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో రాజ స్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 30న గౌహతి వేదికగా చెన్నై సూపర్కింగ్స్తో ఆడనుంది. ఇక అశ్విన్ ఐపీఎల్లో 221 మ్యాచ్లాడి 833 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 187 వికెట్లు పడగొట్టాడు.అశ్విన్ రాజస్థాన్ ఎలెవెన్ జట్టు: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మైర్, ధ్రువ్ జురేల్, శుభమ్ దూబే, డొనొవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయి, సందీప్ శర్మచదవండి: కోర్డా సంచలనం.. ప్రపంచ నంబర్వన్కు షాక్! -
పాండ్యా కెప్టెన్సీ వదులుకోవాలి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ది ఘనమైన చరిత్ర. ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్ కొల్లగొట్టిన ముంబై ఇండియన్స్కు అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. 2020లో చివరిసారి చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ అప్పటినుంచి మరోసారి టైటిల్ గెలవలేకపోయింది. నాలుగేళ్లలో మూడుసార్లు లీగ్ దశకే (2021, 2022, 2024) పరిమితమైన ముంబై 2023, 2025 సీజన్లో మాత్రం ప్లేఆఫ్స్ చేరింది. కానీ ఆరోసారి టైటిల్ మాత్రం గెలుచుకోలేకపోయింది. ముంబై టైటిల్ గెలిచిన ఐదుసార్లు కెప్టెన్గా రోహిత్ శర్మనే ఉన్నాడు. టీమిండియా కెప్టెన్గా విజయవంతమైన హిట్మ్యాన్ ఐపీఎల్లోనూ నాయకుడిగా అదే తరహా విజయాన్ని అందుకున్నాడు. అయితే 2024లో గుజరాత్ టైటాన్స్కు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్లో చేరాడు. పాండ్యాకు బాధ్యతలు..ఆ సీజన్లో రోహిత్ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి పాండ్యాను కెప్టెన్ చేశారు. అప్పట్లో రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. మైదానంలోనే హార్దిక్ పాండ్యాను గేలి చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీనికి తోడు ముంబై ఇండియన్స్ 2024 సీజన్లో వరుస పరాజయాలతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. పెరిగిన విమర్శలు..దీంతో పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు పెరిగిపోయాయి. అయితే 2025 సీజన్లో ముంబై పరిస్థితి కాస్త కుదుటపడింది. పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరుకుంది. అయితే ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కూడా మరోసారి కెప్టెన్సీ విషయంలో ముంబై అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు. పాండ్యా స్థానంలో సూర్యకుమార్ లేదా రోహిత్ శర్మకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ బ్యాటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ముంబై ఇండియన్స్కెప్టెన్సీ విషయమై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా తన కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్కు అప్పగిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ‘కెప్టెన్సీ మార్పుతోనే ముంబై ఇండియన్స్ గాడిన పడుతుందేమో. కెప్టెన్సీ విషయంలో జట్టు యాజమాన్యం రోహిత్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలతో కలిసి ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది. నిజానికి పాండ్యా మంచి కెప్టెనే కావొచ్చు.. కానీ జట్టులో భారత్కు రెండు టీ20 ప్రపంచకప్లు అందించిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్లు ఉన్నారు. నాయకత్వ మార్పు జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాబట్టి ముంబై యాజమాన్యం ఈ విషయంపై మరోసారి ఆలోచించాలి. కెప్టెన్ మారితే జట్టు అదృష్టం మారే అవకాశం లేకపోలేదు. అందుకే సూర్యకుమార్కు పాండ్యా స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది.సూర్య అయితే బాగుంటుంది..అయితే కెప్టెన్ ఎవరనే అంతిమ నిర్ణయం ఫ్రాంచైజీదే. పాండ్యాను కాదనుకుంటే సూర్యకుమార్కు బాధ్యతలు అప్పగించొచ్చు. కానీ అది ముంబై ఇండియన్స్ అంతర్గత వ్యవహారం. కాబట్టి వాళ్లంతా కలిసి కూర్చోని మాట్లాడుకొని సమస్యకు ముగింపు పలకాలి. నా వరకు సూర్యకుమార్ కెప్టెన్గా జట్టును సమర్థంగా నడిపించగలడు’ అని చెప్పుకొచ్చాడు. ఇటీవలే టీమిండియాకు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ అందించాడు. దీంతో హార్దిక్పాండ్యా స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్కు అప్పగించాలని బీసీసీఐ మాజీ సెలెక్టర్లు కూడా పిలుపునిచ్చారు. ఇక ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ను మార్చి 29న కేకేఆర్తో ఆడనుంది.చదవండి: పీఎస్ఎల్ద్దు.. ఐపీఎల్ ముద్దు! -
పీఎస్ఎల్ వద్దు.. ఐపీఎల్ ముద్దు!
శ్రీలంక ఆల్రౌండర్ దాసున్ షనకను అదృష్టం వరించింది. తంతే బూరల బుట్టలో పడ్డట్టుగా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన షనక తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ ఆడేందుకు సమాయత్తమవుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ సామ్ కరన్ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో అతని స్థానాన్ని షనకతో భర్తీ చేయాలని రాజస్థాన్ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో షనక తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. అందుకే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి షనక వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ కూడా షనకను సంప్రదించిందని, జట్టులో జాయిన్ అయ్యేందుకు అన్ని లాంఛనాలు పూర్తయ్యాయని, సంతకాలు మాత్రమే మిగిలాయని రాజస్థాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్కు స్విచ్ అవుతున్న రెండో ఆటగాడు దాసున్ షనక. ముజరబానీ కూడా..గతంలో జింబాబ్వే ఆటగాడు బ్లెసింగ్ ముజరబానీ కూడా పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్కు షిఫ్ట్ అవ్వనున్నాడు. ముజరబానీ పీఎస్ఎల్లో షమర్ జోసెఫ్ స్థానంలో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ఆడేందుకు 1.10 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అనూహ్యంగా కేకేఆర్ నుంచి పిలుపు రావడంతో ఐపీఎల్ ఆడేందుకే మొగ్గుచూపాడు. వాస్తవానికి గతేడాది అబుదాబి వేదికగా జరిగిన మినీ వేలంలో షనకను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ మొగ్గు చూపలేదు. దీంతో షనక అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) వేలంలో పాల్గొన్నాడు. అయితే షనకను లాహోర్ ఖలండర్స్ 75 లక్షలకు దక్కించుకుంది.షనక దారిలోనే స్పెన్సర్..ఇక స్పెన్సర్ జాన్సర్ కూడా పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్కు రానున్నాడు. చెన్నై సూపర్కింగ్స్ బౌలర్ నాథన్ ఎల్లిస్ గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో స్పెన్సర్ జాన్సన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎస్కే అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అయితే షనక, స్పెన్సర్లు పీఎస్ఎల్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు రావడంతో ఆయా ఫ్రాంచైజీలు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యాయి. కానీ విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్కు షిఫ్ట్ అవ్వడం ఇదేమీ కొత్త కాదు. గతేడాది కార్బిన్ బోష్ కూడా ఇదే విధంగా పీఎస్ఎల్ నుంచి తప్పుకొని ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్ను ఏప్రిల్ 4న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది. పరాగ్ సారథ్యంలో..రాజస్థాన్ రాయల్స్ను నడిపించిన సంజూ శాంసన్ ట్రేడింగ్లో చెన్నైకి వెళ్లిపోవడంతో రియాన్ పరాగ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. బదులుగా సీఎస్కే వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్థాన్కు బదలాయించింది. కాగా జడేజా 2008 ఐపీఎల్ తొలి టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.చదవండి: పంత్ను తీసేద్దామనుకున్నారా? -
పంత్ను తీసేద్దామనుకున్నారా?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ను లక్నో సూపర్జెయింట్స్ రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఆటగాడికి అంత ధర చెల్లించడం అదే తొలిసారి. అంతేకాదు కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్కు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే పంత్ మాత్రం గత సీజన్లో కెప్టెన్గా, బ్యాటర్గా పూర్తిగా విఫలమయ్యాడు. పంత్ తాను ఆడిన 14 మ్యాచ్ల్లో 269 పరుగులు మాత్రమే చేయడమే గాక కెప్టెన్గా జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో పంత్ను జట్టు నుంచి రిలీజ్ చేయాలన్న ఆలోచన లక్నో సూపర్జెయింట్స్కు కలిగినట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. బ్యాటింగ్లో విఫలమైన పంత్ అటు కెప్టెన్గానూ విఫలం కావడంతో జట్టు నుంచి రిలీజ్ చేయాలని లక్నో యాజమాన్యం భావించిందట. ఖండించిన గోయెంకా..అయితే ఒక్క సీజన్కే పంత్ను తప్పించడం సరికాదని మళ్లీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. పంత్ను జట్టు నుంచి రిలీజ్ చేయాలనుకున్నట్లు వచ్చిన వార్తలను తాజాగా లక్నో సూపర్జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా ఖండించారు. పంత్ నిరాశజనక ప్రదర్శన చేసినప్పటికీ అతన్ని జట్టు నుంచి తొలగించాలని ఎన్నడూ అనుకోలేదని తెలిపారు. ‘నిజానికి గత సీజన్లో పంత్ కెప్టెన్ాా బాగానే చేశాడు. కానీ జట్టుకు కీలకమైన నలుగులు బౌలర్ల సేవలు కోల్పోతే అతడు మాత్రం ఏమి చేయగలడు. దీంతో పంత్ తన జట్టులో ఉన్న పరిమిత వనరులను ఉపయోగించుకొనే జట్టును సమర్థంగా నడిపించాడు. రిషబ్ పేలవ ప్రదర్శనతో జట్టు నుంచి తొలగిస్తారని ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలు చూసి నేను చాలాసేపు నవ్వుకున్నా. సోషల్ మీడియా కేవలం తమ వ్యూస్ను పెంచుకోవడం కోసమే ఇలాంటి కల్పిత వార్తలను సృష్టించే పనిలో పడ్డాయి. పంత్ చాలా అద్భుతమైన ఆటగాడు. ప్రతీ విషయంలో సూటిగా స్పష్టంగా ఉంటాడు. ఫ్రాంచైజీ కోసం నూటికి నూరుశాతం కష్టపడతాడు. బ్యాటర్గా విఫలమైనా కెప్టెన్సీకి వంద శాతం న్యాయం చేశాడు. ఒక ఆటగాడి నుంచి అంతకంటే ఎక్కువగా ఆశించలేము. ’ అని చెప్పుకొచ్చారు. ఇక పంత్ ఐపీఎల్లో 125 మ్యాచ్లాడి 3,553 పరుగులు సాధించాడు.రాహుల్తో విభేదాలు..2022లో ఐపీఎల్లో గుజరాత్ ఐటాన్స్తో కలిసి అరంగేట్రం చేసిన లక్నో సూపర్జెయింట్స్ తొలి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరుకుంది. కేఎల్ రాహుల్ కూడా జట్టును సమర్థంగా నడిపించాడు. అయితే 2024 సీజన్లో కేఎల్ రాహుల్, ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దీనికి తోడు ఆ సీజన్లో లక్నో లీగ్ దశకే పరిమితమైంది. దీంతో కేఎల్ రాహుల్ను జట్టు నుంచి రిలీజ్ చేయడంతో పాటు కొత్త ఆటగాళ్లను తీసుకున్నారు. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.చదవండి: అభిమానుల కన్నీటి పర్యంతం -
కోల్‘కథ’ హిట్ అవుతుందా?
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ల తర్వాత ‘ఐపీఎల్’ బుక్లో తమ కంటూ చరిత్ర లిఖించుకున్న ఫ్రాంచైజీ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్). మూడుసార్లు చాంపియన్గా నిలిచిన ఈ ‘త్రీ స్టార్’ చాంపియన్ గతేడాది మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. 2024లో విజేతగా నిలిచిన కేకేఆర్... గత సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి పేలవమైన ప్రదర్శనతో ఏకంగా ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇప్పుడు మాత్రం ఈ మరకను మరిచి... ఇంకో ఐదు రోజుల్లో ఆరంభమయ్యే లీగ్లో మెరుగైన ప్రదర్శనతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమైంది. –సాక్షి క్రీడా విభాగంఐపీఎల్ లీగ్లో ఫైనల్ చేరితే టైటిల్స్ను ఉడుం పట్టులా పట్టిన జట్టేదైనా ఉందంటే అది కోల్కతా నైట్రైడర్స్ ఒక్కటే! నాలుగుసార్లు 2012, 2014, 2021, 2024లలో తుదిపోరుకు అర్హత సంపాదించిన కేకేఆర్ ఒకే ఒక్కసారి (2021లో) మాత్రమే రన్నరప్తో సరిపెట్టుకుంది. మిగతా మూడుసార్లు లీగ్ అసాంతం అసాధారణంగా రాణించిన జట్లను ఫైనల్లో బోల్తా కొట్టించి మరీ టైటిళ్లను ఎగరేసుకుపోయిన ఘనత కోల్కతాకే దక్కుతుంది. ఇప్పుడు కూడా ఇలాంటి ఆశల పల్లకితోనే ఈ సీజన్ బరిలోకి దిగుతోంది. అనుభవజ్ఞుడైన అజింక్య రహానే సారథ్యం గత సీజన్కు అక్కరకు రాలేదు. అలాగని అన్నీసార్లు అదే జరగదు! పైగా ఇది పొట్టి ఫార్మాట్! ఒక్క ఓవర్ చాలు ఫలితం తారుమారయ్యేందుకు..! కాబట్టి ప్రపంచ శ్రేణి హిట్టర్లు అందుబాటులో ఉన్న నైట్రైడర్స్ జట్టును గత సీజన్ ప్రదర్శనను బట్టి తక్కువ అంచనా వేయలేం. గ్రీన్పై గంపెడాశలతో...కోల్కతా జట్టులో మేటి బ్యాటర్లున్నారు. స్టార్ ఆల్రౌండర్లు సైతం అందుబాటులో ఉన్నారు. అయినా సరే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆస్ట్రేలియన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ను (రూ.25.20 కోట్లు) పాతిక కోట్లు పోసి కొనుక్కొంది. ఇంత భారీ మొత్తం పెట్టిన గ్రీన్ స్పెషలిస్టు టాపార్డర్ బ్యాటర్. ఓపెనింగ్ లేదంటే వన్డౌన్లో బ్యాటింగ్ దిగేందుకే ఇష్టపడతాడు. కానీ టాప్–3లో అందరూ పాతుకుపోయిన బ్యాటర్లే బోలెడు మంది ఉన్నారు. కెప్టెన్ రహానే సహా సునీల్ నరైన్, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్లు టాపార్డర్ బ్యాటర్లే. అంతే కాదు... నలుగురు విదేశీ ఆటగాళ్లు (నరైన్, ఫిన్, టిమ్, గ్రీన్)లు తుది జట్టుకు ఆడే ఆటగాళ్లు. అందుకే జట్టు మేనేజ్మెంట్కు బ్యాటింగ్ ఆర్డర్ సర్దుబాటే అతిపెద్ద సవాలుగా మారింది. ఇంపాక్ట్ ఓకే... మరి కూర్పు?విదేశీ స్టార్లే కాదు... భారత మేటి ఆటగాళ్లు సైతం నైట్రైడర్స్కు వెన్నుదన్నుగా ఉన్నారు. న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ టి20ల్లోనే ప్రమాదకర బ్యాటర్. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్లో కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో కివీ డాషింగ్ ఓపెనర్ దక్షిణాఫ్రికాపై సెమీస్లో 33 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు. సీఫెర్ట్ కూడా నిలకడైన బ్యాటింగ్తో ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగని భారత ఆటగాళ్లు తక్కువ కాదు. అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమణ్దీప్ సింగ్, రాహుల్ త్రిపాఠిలతో కూడిన బ్యాటింగ్ బెంచ్ అసాధరణమని చెప్పొచ్చు. ముఖ్యంగా రఘువంశీ, త్రిపాఠి, త్యాగిలు ఇంపాక్ట్ ప్లేయర్లుగా బరిలోకి దింపినా... రెగ్యులర్ జట్టులో రింకూ, రమణ్దీప్లు కూడా హిట్టర్లు. వీరందరూ టి20 ఫార్మాట్కు అవసరమైన వారే. కానీ తుది 11 మంది కూర్పు కోసం జట్టు మేనేజ్మెంట్ పెద్ద కసరత్తే చేయాలి. స్పిన్నర్లపైనే భారమంతా...బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనపడుతోంది. కానీ బౌలింగే ఆందోళన పరుస్తోంది. కీలకమైన పేసర్లు గాయాల బారిన పడటంతో ఇప్పుడు బౌలింగ్ భారమంతా స్పిన్నర్లపైనే పడింది. తిప్పేసే సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలే కోల్కతా బలమైనా... దళమైనా! డెత్ ఓవర్లను నియంత్రించే హర్షిత్ రాణాలాంటి పేసర్ స్థానంలో ముజరబాని (జింబాబ్వే)ను తీసుకున్నారు. ఇది ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి. మొత్తానికి ఒక్క పేస్ బౌలింగ్ కళ తప్పినా... ఆల్రౌండ్ సత్తా చాటే ఆటగాళ్లు కోల్కతాకు అందుబాటులో ఉన్నారు.గాయాల బెడదతో దడదడ!జట్టును ప్రధానంగా వేధిస్తున్న సమస్య గాయాలు. భారత పేస్ బౌలర్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ సీజన్ మొత్తానికే దూరమయ్యారు. శ్రీలంక యార్కర్ స్పెషలిస్ట్ పతిరణ పరిస్థితి కూడా అదే! ఇప్పటికైతే ఆరంభ మ్యాచ్లకు దూరమైనప్పటికీ సింహళ సీమర్ అందుబాటులోకి వచ్చేది అనుమానమే. దీంతో బౌలింగ్ దళం... ప్రత్యేకించి పేస్ విభాగం బలహీనమైంది. దీనివల్ల అందుబాటులో ఉన్న బౌలర్లపై అదనపు భారమే కాదు... ఒత్తిడి కూడా పడినట్లయింది.కోల్కతా నైట్రైడర్స్ జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, కామెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, రోవ్మన్ పావెల్, రింకూ సింగ్, ఉమ్రాన్ మాలిక్, రమణ్దీప్ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ముజరబాని, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, అనుకూల్ రాయ్, దక్ష్ కమ్రా, సార్థక్ రంజన్, మనీశ్ పాండే, అంగ్క్రిష్ రఘువంశీ, రాహుల్ త్రిపాఠి, తేజస్వి సింగ్, ప్రశాంత్ సోలంకి, పతిరణ.ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ గణాంకాలుఆడిన మ్యాచ్లు 265 గెలిచినవి 136ఓడినవి 127రద్దు 2అత్యుత్తమ ప్రదర్శన: చాంపియన్ (2012, 2014, 2024), రన్నరప్ (2021). -
న్యూజిలాండ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు!
న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ అమేలియా కెర్ అరుదైన రికార్డు సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అమేలియా కెర్ వరుసగా పదోసారి 30కి పైగా పరుగులు సాధించడం విశేషం. సౌతాఫ్రికా మహిళలతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ సందర్భంగా అమేలియా ఈ ప్రపంచ రికార్డును అందుకుంది. ఈ నేపథ్యంలోనే పురుషుల,మహిళల క్రికెట్లోనూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు కూడా అమేలియా కెర్ తాజాగా తన పేరిట లిఖించుకుంది. గతంలో అమేలియా కెర్ సహా శ్రీలంకకు చెందిన చమేరి ఆటపట్టు, రోమానియాకు చెందిన రెబెక్కా బ్లేక్లు 9 సార్లు వరుసగా 30కి పైగా స్కోర్లు సాధించారు.తాజాగా వీరిని వెనక్కినెట్టిన అమేలియా కెర్ అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల క్రికెట్లో రోహిత్ శర్మ (భారత్), అభిషేక్ శర్మ (భారత్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), హ్రిస్టో లాకోవ్లు వరుసగా ఏడుసార్లు 30కి పైగా స్కోర్లు సాధించారు. ఇదే మ్యాచ్లో మరో కివీస్ బ్యాటర్ సోఫీ డివైన్ కూడా అరుదైన రికార్డు సాధించింది. మ్యాచ్లో 34 బంతుల్లో 64 పరుగులు చేసిన సోఫీ డివైన్.. దక్షిణాఫ్రికా జట్టుపై 10సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్గా నిలిచింది. గతంలో బాబర్ ఆజమ్ (వర్సెస్ న్యూజిలాండ్), స్మృతి మంధాన (వర్సెస్ ఇంగ్లండ్), బెత్ మూనీ (వర్సెస్ భారత్) తొమ్మిదేసి సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించారు. మ్యాచ్ విషయానికి వస్తే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కివీస్ 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మహిళల జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం కివీస్ మహిళలు 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జెస్ కెర్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. నామమాత్రమైన ఐదో టీ20 బుధవారం జరగనుంది.చదవండి: IPL 2026: అభిమానుల కన్నీటిపర్యంతం! -
IPL 2026: అభిమానుల కన్నీటిపర్యంతం!
ఎంఎస్ ధోని.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. టీమిండియాకు రెండుసార్లు ఐసీసీ వరల్డ్కప్లు అందించిన ధోనికి అభిమాన గణం కూడా ఎక్కువే. ధోని నడిచినా, నవ్వినా, బ్యాటింగ్ చేసినా అతడి మైకంలో మునిగితేలిన అభిమానులు ఎందరో ఉన్నారు. అతడు మైదానంలోకి దిగుతున్నాడంటేనే ఏదో తెలియని అనుభూతికి లోనయ్యే ఫ్యాన్స్ తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కష్టంగా మారిపోతుంది. అచ్చం అలాంటి సంఘటనే చెపాక్ స్టేడియంలో మరోసారి జరిగింది. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా సీఎస్కే తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్న ధోని ఆదివారం అలా చెపాక్ స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చాడో లేదో అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. విషయంలోకి వెళితే.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లంతా ప్రాక్టీస్లో మునిగితేలారు. మ్యాచ్ జరగనప్పటికీ చెపాక్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. దీనికి ప్రధాన కారణం ధోనినే అన్న సంగతి తర్వాతి క్షణంలోనే తెలిసొచ్చింది. సీఎస్కే ప్లేయర్లంతా ప్రాక్టీస్లో మునిగిన సమయంలో ధోని అలా మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పెవిలియన్ ఎండ్ నుంచి చిన్నగా నడుచుకుంటూ గ్రౌండ్ మధ్యలోకి చేరుకున్నాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. ప్రేక్షకులంతా లేచి నిలబడి ‘ధోని.. ధోని.. ధోని’.. ‘తలా.. తలా’ అంటూ అరుపులు, కేకలతో స్టేడియం దద్దరిల్లింది. ఇదే సమయంలో కొంతమంది అభిమానులు ధోనిని చూసి ఎమోషన్ను అదుపు చేసుకోలేక కన్నీటిపర్యంతమవ్వడం కనిపించింది. ధోని అంతర్జాతీయ క్రికెట్కు 2020లో వీడ్కోలు పలలికినప్పటికీ ఐపీఎల్లో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి ధోనిని చూడగానే అభిమానుల్లో దుఃఖం బయటికి రావడానికి ‘ధోనికి బహుశా ఇదే చివరి సీజన్’ అనే కారణం కూడా ఉండొచ్చు. కొంతకాలంగా ధోనికి ఇదే చివరి సీజన్ అనే ప్రచారం కూడా గట్టిగా సాగుతుంది. దీనికి సంబంధించిన వీడియోనూ సీఎస్కే యాజమాన్యం తన ‘ఎక్స్’లో షేర్ చేసుకోవడంతో వైరల్గా మారింది. ఇక 2023లో విజేతగా నిలిచిన సీఎస్కే ఈ సీజన్లో మరోసారి టైటిల్ సాధించి ధోనికి ఘనమైన వీడ్కోలు పలకాలని భావిస్తోంది. ఈసారి సీఎస్కేకు సంజూ శాంసన్ రాకతో జట్టుకు అదనపు బలం చేకూరినట్లయింది. ఇక ఐపీఎల్ 19వ సీజన్లో సీఎస్కే తన తొలి మ్యాచ్ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది.Thala Dharisanam 🦁#Roar26 #WhistlePodu pic.twitter.com/RST5EpXKct— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2026చదవండి: 21 సిక్సర్లతో ఆర్సీబీ మాజీ ఆటగాడి విధ్వంసం! -
21 సిక్సర్లతో ఆర్సీబీ మాజీ ఆటగాడి విధ్వంసం!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా అయోధ్య ప్రీమియర్ లీగ్లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 మినీ-వేలంలో అమ్ముడుపోని స్వస్తిక్ లీగ్లో 69 బంతుల్లోనే 195 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. అయోధ్య ప్రీమియర్ లీగ్ పోరులో హిండన్ టైటాన్స్పై గోమతి థండర్ తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగిన ప్రియాంశు పాండే, చికారా ఇన్నింగ్స్ ఆద్యంతం బ్యాటింగ్ చేసి 307 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాండే 54 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇదే సమయంలో మరో ఓపెనర్ చికారా హిండన్ టైటాన్స్ బౌలర్లపై మెరుపు దాడి చేశాడు. 69 బంతుల్లో 195 పరుగులు బాదిన స్వస్తిక్ చికారా ఇన్నింగ్స్లో 21 సిక్సర్లు, 11 బౌండరీలు ఉన్నాయి. కేవలం సిక్సర్లు, బౌండరీల రూపంలోనే 126 పరుగులు వచ్చాయంటే ఊచకోత ఏ రేంజ్లో ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. చికారా డబుల్ సెంచరీకి 27 పరుగుల దూరంలో 173 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఉన్నప్పుడూ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉన్నాయి. ఈ దశలో మూడు సిక్సర్లు, ఒక ఫోర్తో అలరించినప్పటికీ డబుల్ మార్క్కు ఐదు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అనంతరం 308 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ కు దిగిన హిండన్ టైటాన్స్ 218 పరుగులకే ఆలౌటైంది. టైటాన్స్ బ్యాటర్లలో శేఖర్ సిరోహి 33 బంతుల్లో 68 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.ఎవరీ స్వస్తిక్ చికారా?భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను ఆరాధ్య క్రికెటర్గా భావించిన స్వస్తిక్ చికారా 2024 ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్లో మీరట్ మావెరిక్స్ తరఫున ఆడుతున్నప్పుడు వెలుగులోకి వచ్చాడు. ఆ లీగ్లో 499 పరుగులు సాధించిన స్వస్తిక్ చికారా టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత కొద్దికాలానికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం యూపీ జట్టుకు ఎంపికయ్యాడు. దేశవాళీ టోర్నీలో అతను నాలుగు మ్యాచ్లలో కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని కొనుగోలు చేసింది. 2025లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్లో కూడా ఆడకపోయినప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ గెలిచిన జట్టులో చికారా సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్2026 వేలానికి ముందే అతడిని ఆర్సీబీ విడుదల చేసింది. కానీ వేలంలో స్వస్తిక్ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.చదవండి: క్షమాపణ చెప్పిన పీసీబీ చైర్మన్!Swastik Chikara hammered 195*(69) at the Ayodhya Premier League .5 short of a double ton in t20s 🤯😵.He is unsold in IPL 2026 auction pic.twitter.com/QwVPP59AmP— Mithun 🧢 (@Mithun71389478) March 22, 2026 -
క్షమాపణ చెప్పిన పీసీబీ చైర్మన్!
పశ్చిమాసియాలో భీకర యుద్ధం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)పై ప్రభావం చూపిస్తోంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. యుద్ధం కారణంగా తలెత్తిన చమురు సంక్షోభం, ఇంధన ధరలు పెరగడం ప్రేక్షకులు రావడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్లు నిర్వహించాలని పీఎస్ఎల్ నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ క్రికెట్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. 'పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కారణంగా దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తింది. దీంతో పాకిస్థాన్ ప్రజలందరూ తమ రాకపోకలను పరిమితం చేసుకోవాలని ప్రధాని కోరారు. పరిస్థితులన్నింటిని గమనించి, మా భద్రతా సంస్థలతో చర్చించిన తర్వాతే ప్రేక్షకులు లేకుండా పీఎస్ఎల్ను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చాం. 10 నుంచి 15 రోజుల పాటు పీఎస్ఎల్లో అన్ని మ్యాచ్లు ఖాళీ స్టేడియాల్లోనే జరుగుతాయి. ఫైనల్ వరకు ప్రేక్షకులను అనుమతించే విషయమై ఆలోచిస్తాం. ఇక టోర్నీ మొత్తం కూడా లాహోర్, కరాచీ వేదికల్లోనే జరుగుతుంది. అంతేకాదు చమురు సంక్షోభం కారణంగా పీఎస్ఎల్ ప్రారంభ వేడుకలను కూడా రద్దు చేశాము. అయితే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహిస్తుండడంతో గేట్ రెవెన్యూలో వచ్చిన నష్టానికి ఫ్రాంచైజీలకు నష్టపరిహారం చెల్లించనున్నాం. అఫ్గానిస్థాన్కు సరిహద్దుగా ఉండడంతో పెషావర్ స్టేడియంను మ్యాచ్ల నిర్వహణ నుంచి తొలగించినందుకు కూడా నఖ్వీ క్షమాపణలు చెబుతున్నా' అంటూ పేర్కొన్నాడు.చదవండి: లక్నో సూపర్జెయింట్స్ కథ మారేనా? -
లక్నో సూపర్జెయింట్స్ కథ మారేనా?
ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్జెయింట్స్ కొత్తగా ప్రవేశించాయి. తమ తొలి సీజన్లోనూ గుజరాత్ టైటాన్స్ చాంపియన్గా నిలిచి ఔరా అనిపిస్తే.. లక్నో ప్లేఆఫ్స్కు చేరి ఆకట్టుకుంది. 2023 సీజన్లోనూ లక్నో జట్టు మరోసారి ప్లేఆఫ్స్కు చేరినప్పటికీ తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైంది. 2024 సీజన్లో లీగ్ దశకే పరిమితమైన లక్నో 2025లో కెప్టెన్ను మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో గత సీజన్లోనూ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్జెయింట్స్ జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈ సీజన్లో మాత్రం గత అనుభవాలను తిరగరాస్తూ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటాలని పంత్ సేన పట్టుదలతో ఉంది. అదొక్కటే ఊరట!మిగతా జట్లతో పోలిస్తే ప్లేయర్ల గాయాల బాధ లేకపోవడం ఒకింత ఊరటనిచ్చే అంశమని చెప్పొచ్చు. షమీ, నోర్ట్జే, మోసిన్ ఖాన్, ఆవేశ్ఖాన్, మయాంక్ యాదవ్ లాంటి పేసర్లు ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించగలరు. మరో వారం రోజుల్లో ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో లక్నో బలాలు, బలహీనతలపై ఒక లుక్కేద్దాం.లక్నో జట్టులో హార్డ్హిట్టర్లకు కొదువలేదు. పొట్టి ఫార్మాట్లో తమ దూకుడైన బ్యాటింగ్తో మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చే శక్తి ఉన్న ప్లేయర్లు లక్నో సొంతం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్పై తమదైన ఆటతీరుతో ముద్రవేసిన మార్కరమ్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ లక్నోకు కొండంత బలం. వీరిలో ఏ ఒక్కరు నిలదొక్కుకున్న మ్యాచ్ ఫలితం మారినట్లే.విదేశీ ప్లేయర్లే బలం..ఇటీవలి టీ20 ప్రపంచకప్లో అదరగొట్టిన మార్కరమ్.. మిచెల్ మార్ష్తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశముంది. మరోవైపు గత రెండు సీజన్లలో 499, 524 పరుగులతో జట్టు బ్యాటింగ్కు వెన్నెముకగా నిలిచిన నికోలస్ పూరన్ లక్నోకు అదనపు ఆకర్షణ. అవసరమైతే కీపర్గా సేవలందించేందుకు సిద్ధంగా ఉండే పూరన్..మిడిలార్డర్తో పాటు ఆఖర్లో మెరుపులు మెరిపించడంలో దిట్ట. ఇక కెప్టెన్ పంత్ ఫామ్ కొంత ఆందోళన కల్గిస్తున్నది. గత సీజన్లో ఘోరంగా విఫలమైన పంత్ ఈసారైనా మెరుపులు మెరిపిస్తాడని ఫ్రాంచైజీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఇంగ్లిస్, నోర్ట్జే, హసరంగ వంటి ప్లేయర్లను వేలంలో తీసుకున్న లక్నో..వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ, అర్జున్ టెండూల్కర్లను ట్రేడ్ ద్వారా ఎంపిక చేసుకుంది. అయితే 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన షమీ దేశవాళీ సీజన్లో దుమ్మురేపాడు.షమీ కథేంటి?తన సూపర్ స్వింగ్తో అటు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో పాటు రంజీల్లోనూ అదరగొట్టాడు 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఇస్పటి నుంచే ప్లేయర్ల ఎంపికపై దృష్టి పెట్టిన బీసీసీఐ..షమీని పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది చూడాలి. జట్టులో కొంత మందికి గాయాల బెడద తోడు ఫిట్నెస్ సమస్యలు జట్టుకు ప్రతికూలంగా మారనున్నాయి. మిస్టరీ స్పిన్నర్ హసరంగకు శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ మంజూరు కాలేదు. మరోవైపు దక్షిణాఫ్రికా స్పీడ్స్టర్ నోకియా తరుచూ గాయాల పాలు అవుతుండటం జట్టుకు ఆందోళన కల్గిస్తున్నది. బౌలింగ్ పరంగా పేపర్ మీద బలంగా కనిపిస్తున్న లక్నోకు ఫిట్నెస్ పెద్ద సమస్యగా మారింది. షమీ, ఆవేశ్ఖాన్, మయాంక్ యాదవ్ పూర్తి సీజన్ జట్టుకు అందుబాటులో ఉంటారా అన్నది అనుమానమే. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ తమ తొలి మ్యాచ్ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.చదవండి: బెదిరింపులకు లొంగని 11 ఏళ్ల చిన్నది! -
సౌతాఫ్రికా విజయం.. రసపట్టులో టీ20 సిరీస్!
న్యూజిలాండ్, సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. ఆదివారం వెల్లింగ్టన్ వేదికగ2ఆ జరిగిన నాలుగో టీ20లో దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా 2-2తో రెండు జట్లు సమంగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కొన్నర్ ఎస్తర్హూజిన్ (36 బంతుల్లో 57, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవవగా, రుబిన్ హెర్మన్ (28 నాటౌట్), టోనీ డి జోర్జి (23) రాణించారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. టిమ్ రాబిన్సన్ (22 బంతుల్లో 32) టాప్ స్కోరర్గా నిలవగా, డేన్ క్లెవర్ (26) పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా, బార్త్మన్, సుబ్రెయన్, కేశవ్ మహరాజ్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అర్థసెంచరీతో మెరిసిన ఎస్తర్హుజిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. వియాన్ ముల్డర్ డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత టోనీ డిజార్జి, ఎస్తర్ హుజిన్లు రెండో వికెట్కు 81 పరుగులు జోడించి సఫారీ ఇన్నింగ్స్ను నిలబెట్టారు. టోనీ ఔటైన తర్వాత కఈజులోకి వచ్చిన రుబిన్ హెర్మన్ ధాటిగా ఆడాడు. ఎస్తర్హుజిన్ పెవిలియన్ చేరిన తర్వాత ఇన్నింగ్స్ చివర్లో జాసన్ స్మిత్, డియాన్ ఫెరస్టర్లు బ్యాట్ ఝలిపించడంతో సౌతాఫ్రికా గౌరప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో ఆది నుంచే తడబడిన న్యూజిలాండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక చివరి టీ20 బుధవారం జరగనుంది. -
పంజాబ్ కింగ్స్లో లుకలుకలు!
ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ది ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి కొనసాగుతున్న ఫ్రాంచైజీల్లో పంజాబ్ కూడా ఒకటి. అయితే 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ప్లేఆఫ్స్ చేరుకున్న సందర్భాలు మూడుసార్లు మాత్రమే. అయితే గత సీజన్లో జట్టును మొత్తం ప్రక్షాళన చేసిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్లో మాత్రం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే తుది పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలై రన్నరప్కే పరిమితమైంది. అయితే గతంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యంలో తలెత్తిన వివాదాల కారణంగానే ఇన్నేళ్లుగా వెనుకబడిపోయిందని టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. పంజాబ్ కింగ్స్లో తెరవెనుక పరిస్థితులు ఎప్పుడూ సాఫీగా సాగలేదని, ఏదో ఒక విషయంలో లుకలుకలు తలెత్తేవని తెలిపాడు. పఠాన్ మాట్లాడుతూ.. ‘2008 తొలి సీజన్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ (అప్పటిక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్)ప్లేఆఫ్స్కు చేరింది. తొలి సీజన్ తర్వాత పంజాబ్ క్రమంగా తమ పట్టును కోల్పోయింది. తొలి సీజన్ తర్వాత కెప్టెన్సీ కొనసాగాల్సింది. కానీ మూడో ఏడాదికే కెప్టెన్సీ మారిపోయింది. అదే వివాదాలకు దారి తీసింది. యాజమానులు, కోచ్లు ఇద్దరూ క్రికెట్పై కనీస అవగాహన లేనివారు కావడంతో నిర్ణయాల్లో తేడాలు వచ్చాయి. ఒక యజమాని ఒక టీమ్ కాంబినేషన్ కోరుకుంటే, మరొకరు ఇంకో ప్లాన్ చెప్పడంతో జట్టులో గందరగోళం ఏర్పడేది. నిజానికి పంజాబ్ కింగ్స్ యాజమాన్యంలో ప్రీతిజింటా ఎక్కువ వాటా ఉన్నప్పటికీ, మోహిత్ బర్మన్, నెస్ వాడియా, కరణ్ పాల్ కూడా జట్టులో భాగస్వాములుగా కొనసాగుతున్నారు. ఈ పార్టనర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో అది ప్రదర్శనపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. 18 ఏళ్లలో పంజాబ్ కింగ్స్కు 12 మంది కెప్టెన్లు మారడంతో జట్టుపై నమ్మకం తగ్గిపోయింది. ఇప్పుడు అది జట్టుపైనే ప్రభావం చూపిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపిస్తున్నట్లుగా ఉంది. శ్రేయస్ అయ్యర్ పంజాబ్ను సరైన దిశలో నడిపిస్తాడనే నమ్మకం కలుగుతున్నది. కాగా పఠాన్ ఐపీఎల్లో తొలి మూడు సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 42 మ్యాచ్ల్లో 47 వికెట్లు పడగొట్టడంతో పాటు 603 పరుగులు సాధించాడు. చదవండి: '250 స్కోర్ కొట్టినా.. సన్రైజర్స్ ఓడిపోతుంది' -
నాలుగో టీ20లో సౌతాఫ్రికా చిత్తు.. సిరీస్ న్యూజిలాండ్ సొంతం
వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మహిళలతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1తో న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.ప్రోటీస్ ఆల్రౌండర్ అనేరీ డెర్క్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 32 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 55 పరుగులు చేసింది. ఆమెతో పాటు లాస్ 30 పరుగులతో రాణించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 3 వికెట్లతో అదరగొట్టింది. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్ స్టార్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీలియా కేర్ 31 పరుగులతో రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లో ట్రయాన్ 2 వికెట్లు తీసింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20 క్రైస్ట్చర్చ్ వేదికగా మార్చి 25న జరగనుంది.చదవండి: IPL 2026: '250 స్కోర్ కొట్టినా.. సన్రైజర్స్ ఓడిపోతుంది' -
'250 స్కోర్ కొట్టినా.. సన్రైజర్స్ ఓడిపోతుంది'
ఐపీఎల్-2026 సీజన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. గత సీజన్లో కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టిన ఎస్ఆర్హెచ్.. ఈసారి మాత్రం ఛాంపియన్గా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆరెంజ్ ఆర్మీ తమ హోం గ్రౌండ్లో ప్రాక్టీస్ను మొదలు పెట్టింది.అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభ మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడం ఎస్ఆర్హెచ్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. వెన్ను గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్ సీజన్ మధ్యలో ఎస్ఆర్హెచ్ జట్టులో చేరే అవకాశముంది. దీంతో అప్పటివరకు సన్రైజర్స్ జట్టును స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నడిపించనున్నాడు. మరోవైపు గత సీజన్లో దుమ్ములేపిన శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగ అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది.అంతేకాకుండా వేలంలో కొన్న బౌలింగ్ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. దీంతో ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ను బౌలింగ్ కష్టాలు వెంటాడడం ఖాయం. ఎందుకంటే ప్రస్తుత ఎస్ఆర్హెచ్ జట్టులో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్ తప్ప చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్ అంటూ లేరు.ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్కు బౌలింగ్ అతి పెద్ద సవాలుగా మారనుందని అతడు అభిప్రాయపడ్డాడు."కమ్మిన్స్, మలింగ లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం చాలా వీక్గా కన్పిస్తోంది. కచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయి. బ్రైడన్ కార్స్ జట్టులో ఉన్నప్పటికి ఉపఖండ పిచ్లపై అతడికి అనుభవం లేదు. అలా అని కేవలం భారత బౌలర్లతో ఆడడం చాలా ప్రమాదకరం. జట్టులో అమిత్ కుమార్, ప్రఫుల్ హింజ్, సాకిబ్ హుస్సేన్, ఓంకర్ తర్మాలే, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్ హర్ష్ దూబే వంటి యువ బౌలర్లు ఉన్నారు.హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్కు మాత్రమే ఎక్కువ ఆడిన అనుభవం ఉంది. ఈ బలహీనమైన బౌలింగ్ లైనప్తో ఎస్ఆర్హెచ్ ఎలా మేనెజ్చేస్తోందో ఆర్ధం కావడం లేదు. ఒకవేళ బ్యాటర్లు 250 పరుగులు చేసినా, బౌలర్లు ఆ టోటల్ను డిఫెండ్ చేసుకునేలా లేరు" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: వేలంలో అన్సోల్డ్.. కట్ చేస్తే! ఇప్పుడు కేకేఆర్లోకి -
వేలంలో అన్సోల్డ్.. కట్ చేస్తే! ఇప్పుడు కేకేఆర్లోకి
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే కోల్కతా నైట్రైడర్స్ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కాగా.. ఇప్పుడు మరో ఫాస్ట్ బౌలర్ ఈ జాబితాలోకి చేరాడు. స్పీడ్ స్టార్ ఆకాష్ దీప్ సైతం గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకొన్నాడు.మరోవైపు శ్రీలంక మతీషా పతిరానకు ఇంకా ఎన్వోసీ లభించలేదు. అతడు ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా బంగ్లాస్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను కూడా కేకేఆర్ కోల్పోయింది. అతడి స్ధానంలో ఇప్పటికే జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజరాబానీని జట్టులోకి కేకేఆర్ తీసుకుంది. అయితే ఇప్పుడు హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ స్ధానాలను భర్తీ చేసే పనిలో పడింది.కేకేఆర్లోకి సిమర్జీత్ హర్షిత్ రాణా స్ధానంలో ఢిల్లీ పేసర్ సిమర్జీత్ సింగ్ను తీసుకోవాలని కేకేఆర్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అతడిని ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సిమర్జీత్ గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. అంతకుముందు సీఎస్కే తరపున మూడు సీజన్ల పాటు ఆడాడు. పవర్ప్లేలో బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా అద్భుతమైన యార్కర్లు కూడా సంధించగలడు. అయితే గతేడాది జరిగిన వేలంలో మాత్రం అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఇప్పుడు హర్షిత్ రాణా గాయం రూపంలో అతడికి మరోసారి ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కనుంది. ఇక ఆకాష్ దీప్ స్ధానాన్ని ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ ఆకాశ్ మధ్వాల్తో భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్వాల్కు ఐపీఎల్ అనుభవం ఉంది. ఐపీఎల్-2023 ఎలిమినేటర్లో 5 వికెట్లు తీసి సత్తాచాటాడు. అయితే మధ్వాల్ కూడా వేలంలో అమ్ముడుపోలేదు. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా!? ఎప్పుడంటే? -
బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా!? ఎప్పుడంటే?
భారత్-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపడుతున్నాయా? ఈ ఏడాది ఆగస్టులో బంగ్లా పర్యటనకు టీమిండియా వెళ్లనుందా? అంటే అవునానే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి గతేడాది జూలైలో బంగ్లాదేశ్ టూర్కు భారత్ వెళ్లాల్సి ఉండేది. కానీ అదే సమయంలో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో.. బంగ్లాలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీంతో ఈ వైట్బాల్ సిరీస్ను 2026 ఆగస్టుకు వాయిదా వేశారు. కానీ ఆ తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తలు చోటు చేసుకోవడంతో ఈ వైట్బాల్ సిరీస్లపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండిస్తూ ఐపీఎల్ నుంచి ఆ దేశ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను బీసీసీఐ తప్పించింది.అందుకు నిరసనగా భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకొంది. దీంతో పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లా-భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడడ ఇక కష్టమే అని అంతా భావించారు. కానీ బంగ్లాదేశ్లో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. దీంతో భారత్-బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్ ప్రకారం జరగనున్నట్లు బంగ్లా క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆగస్టులో కాకుండా ఈ సిరీస్లో సెప్టెంబర్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది."భారత్ పర్యటను సెప్టెంబర్కు ఐర్లాండ్ సిరీస్ను మరో విండోలో నిర్వహించాలని కోరాము. కానీ వారి బీజీ షెడ్యూల్ కారణంగా అది సాధ్యపడలేదు. అందుకే ఐరీష్ పర్యటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామని" ఓ బీసీబీ సీనియర్ అధికారి క్రిక్బజ్తో పేర్కొన్నారు. అయితే భారత క్రికెట్ బోర్డు నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.చదవండి: ఈ సారి 2000-3000 పరుగులు చేస్తా: వైభవ్ సూర్యవంశీ -
ఈ సారి 2000-3000 పరుగులు చేస్తా: వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026 సీజన్కు మరో ఐదు రోజుల్లో తెరలేవనుంది. ఈ ధనధాన్ క్రికెట్ పండగ మార్చి 28 నుంచి మొదలు కానుంది. అయితే ప్రస్తుతం అందరి కళ్లు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. గత సీజన్లో ఊహకందని విధంగా విధ్వంసం సృష్టించిన వైభవ్.. ఈ ఏడాది ఎలా రాణిస్తాడో అని అందరూ వెయ్యి కళ్లతో ఎదరుచూస్తున్నారు. ఐపీఎల్-2025 సీజన్తో పాటు అండర్-19 క్రికెట్ స్ధాయిలో వైభవ్ దుమ్ములేపాడు. అండర్-19 ప్రపంచ కప్ 2026ను భారత్ సొంతం చేసుకోవడంలో వైభవ్ది కీలక పాత్ర. ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ పోరులో వైభవ్ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.ఇప్పుడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ సత్తాచాటేందుకు వైభవ్ సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల వైభవ్ తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైభవ్కు రిపోర్టర్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది.ఐపీఎల్ 2026 కోసం మీ ప్లాన్స్ ఏంటి? ఆరెంజ్ క్యాప్ కోసం ఎన్ని పరుగులు చేయాలనుకుంటున్నారు? అని సదరు విలేఖరి ప్రశ్నించాడు.అందుకు వైభవ్ నవ్వుతూ.. మీరు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగితే, రెండు నుండి మూడు వేల పరుగులు చేస్తానని చెబుతా అని బదులిచ్చాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ ఎక్స్లో షేర్ చేసింది.అయితే ఇదే ప్రశ్నకు వైభవ్ తర్వాత సీరియస్గా సమాధనమిచ్చాడు. నేను ఇన్ని పరుగులు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకోలేదు. నేను సహజశైలిలోనే బ్యాటింగ్ చేస్తాను. నా వ్యక్తిగత మైలురాయిల కంటే జట్టుకు ట్రోఫీ అందించడమే నా ప్రధాన లక్ష్యం" అని అతడు చెప్పుకొచ్చాడు.చదవండి: IPL 2026: ఇషాన్ కిషన్పై యువ ప్లేయర్ సీరియస్.. -
ఇషాన్ కిషన్పై యువ ప్లేయర్ సీరియస్..
ఐపీఎల్-2026 సీజన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ సిద్దమవుతోంది. గత సీజన్లో లీగ్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టిన ఎస్ఆర్హెచ్.. ఈసారి మాత్రం టైటిల్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. దీంతో ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తోంది.ఈ క్రమంలో శనివారం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు రెండు జట్లగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. అయితే ఈ సందర్భంగా ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్కు వింత అనుభవం ఎదురైంది. సన్రైజర్స్ స్పిన్నర్ జీషన్ అన్సారీ.. కిషన్పై సీరియస్ అయ్యాడు.అసలేమి జరిగిందంటే?మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 8వ ఓవర్ వేసిన జీషన్ అన్సారీ బౌలింగ్లో కిషన్ తొలి నాలుగు బంతులను రెండు సిక్సర్లు, రెండు ఫోర్లుగా మలిచాడు. అయితే ఆ తర్వాత ఐదో బంతికి అన్సారీ అద్భుతమైన ఫుల్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. కిషన్ డీప్ స్క్వేర్ లెగ్లో ఉన్న ఫీల్డర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే జీషన్ అన్సారీ మాత్రం కిషన్కు ఫైరీ సెంఢాప్ ఇచ్చాడు. కిషన్ వైపు వేలు చూపిస్తూ ఇక ఆడింది చాలు, పెవిలియన్కు వెళ్లిపోమని సైగ చూశాడు. జీషన్ రియాక్షన్ చూసి ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. కిషన్ మాత్రం నవ్వుతూ డగౌట్కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో ఎస్ఆర్హెచ్ జట్టును కిషన్ నడిపించనున్నాడు.Send off to Ishan Kishan 🤯During the intra squad match today, Zeeshan Ansari, a bowler for Sunrisers Hyderabad, was seen giving a send off to his own captain Ishan Kishan after dismissing him.The team atmosphere doesn’t seem to be very good.pic.twitter.com/3b75QtTh3F— Stubbsy (@spideypant_) March 21, 2026చదవండి: IPL 2026: అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచకోత! -
అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచకోత!
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తమ విధ్వంసకర బ్యాటింగ్తో అన్ని జట్లను భయపెడుతున్నారు. శనివారం జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.సన్రైజర్స్ రెండు జట్లగా విడిపోయి ప్రాక్టీస్ చేసింది. తొలుత సన్రైజర్స్-ఎ జట్టు తరపున ఆడిన అభిషేక్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు సాధించి అన్ని జట్లకు హెచ్చరిక జారీ చేశాడు.అతడి ఇన్నింగ్స్లో 7 సిక్స్లు, 8 ఫోర్లు ఉన్నాయి. అతడితో హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 49), సలిల్ అరోరా (16 బంతుల్లో 47)రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్-ఎ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ మాత్రం కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. సన్రైజర్స్-బి బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. నితీష్ రెడ్డి మూడు వికెట్లు తీసాడు. అనంతరం సన్రైజర్స్ బి టీమ్ తరపున కూడా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఈసారి అభిషేక్ శర్మ(4) నిరాశపరిస్తే.. కిషాన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.ఇషాన్ 25 బంతుల్లో 72 పరుగులు చేసి తన బ్యాటింగ్ పవర్ను చూపించాడు. అయితే 253 పరుగుల భారీ లక్ష్యాన్ని మాత్రం బి టీమ్ చేరుకోలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చదవండి: పాక్ టీవీ షోలో పాల్గొనడంపై విమర్శలు.. స్పందించిన గవాస్కర్🚨 "ABHISHEK SHARMA" STORM IN PRACTICE MATCH SIMULATION 🚨 He Smashed 94Runs off 42 balls with 7 Sixes and 8 Fours 🔥 He nearly Missed well deserved hundred Will IPL 2026 gonna be going hot for Abhishek's career ?? pic.twitter.com/dDaFiYgKQi— Kiara (@crickiara) March 21, 2026 -
పాక్ టీవీ షోలో పాల్గొనడంపై విమర్శలు.. స్పందించిన గవాస్కర్
ఆసియాకప్-2025 సందర్భంగా ఓ పాకిస్తానీ టీవీ క్రికెట్ షో అతిథిగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఐసీసీ, ఏసీసీ కామెంటరీ ప్యానెల్లో గవాస్కర్ ఉండడంతో ఆ క్రికెట్ షోకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే అప్పటిలో ఈ విషయాన్ని ఎవరూ తప్పు బట్టలేదు.కానీ ఇటీవల ది హాండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్గ్రూప్ యాజమాన్యంకు చెందిన సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడాన్ని గవాస్కర్ విమర్శించాడు. పాక్ క్రికెటర్లకు ఫీజు చెల్లించడమంటే భారత సైనికులు, పౌరుల మరణానికి దోహదపడటమేనని వ్యాఖ్యానించాడు.ఈ క్రమంలో పాకిస్తాన్ టీవీ ఛానల్ డిబేట్లో మీరు పాల్గొన్నారని గవాస్కర్ను కొంత మంది ప్రశ్నించారు. తాజగా తనపై వచ్చిన విమర్శలపై గవాస్కర్ స్పందించారు. కామెంటరీ ప్యానల్లో ఉన్నందున మాత్రమే ఆ క్రికెట్ షోలో పాల్గొనాల్సి వచ్చింది అని లిటిల్ మాస్టర్ అన్నారు."నేను ఐసీసీ, ఏసీసీ వ్యాఖ్యతల ప్యానెల్లో ఉన్నాను. ఈ టోర్నీలో పాల్గోన్న అన్ని దేశాలకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి ఆదాయం వెళ్తుంది. అంతే తప్ప ఏ భారతీయ సంస్థ నుంచి కూడా పాక్కు ఆదాయం వెళ్లడం లేదు. అదేవిధంగా నేను కూడా ఆ దేశానికి ఎలాంటి డబ్బులు చెల్లించడం లేదు.కాబట్టి నేను పాకిస్తాన్కు సహకరిస్తున్నాను అనడంలో అర్ధం లేదు. కేవలం భారత్ నుంచి పాకిస్తాన్కు నగదు సాయం చేయడం ఆపాలని మాత్రమే కోరుకుంటున్నాను. గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ నుంచి ఒక్క రూపాయి కూడా భారత్కు రాలేదు" అని ముంబై మిర్రర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నారు. కాగా హాండ్రెడ్ లీగ్ వేలంలో అబ్రార్ను రూ. 2.35 కోట్లు భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసింది. చదవండి: ‘ఐసీసీ మా యాజమాని కాదు’ -
రాయల్స్ నిరీక్షణ ముగిసేనా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్ (2008)లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... సంచలన ప్రదర్శనతో ట్రోఫీ చేజిక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్... రెండో టైటిల్ కోసం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉంది. ప్లేయర్లు మారినా, సారథులు మారినా జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ఈ సీజన్కు ముందు 11 ఏళ్లు జట్టుతో ఉన్న కెప్టెన్ సంజూ సామ్సన్ను వదిలేసుకొని వార్తల్లో నిలిచిన రాజస్తాన్... రియాన్ పరాగ్ సారథ్యంలో కొత్త సీజన్కు ‘సై’ అంటోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడు... యశస్వి జైస్వాల్ నిలకడ... హెట్మైర్ మెరుపులు... రవీంద్ర జడేజా ప్రవేశం... రాయల్స్కు రెండో కప్ అందిస్తుందా లేదా వేచి చూడాలి! – సాక్షి క్రీడా విభాగంప్రధాన ఆటగాళ్లను తిరిగి తీసుకోకుండా గతేడాది పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్... ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందే తమ రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామ్సన్ను చెన్నై సూపర్ కింగ్స్కు బదిలీ చేసుకొని... అతడి స్థానంలో రవీంద్ర జడేజాను తెచ్చుకుంది. గత సీజన్లో కొన్ని కారణాల వల్ల సామ్సన్ కొన్ని మ్యాచ్ల్లో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే బరిలోకి దిగగా... అతడి స్థానంలో జట్టుకు నాయకత్వం వహించిన రియాన్ పరాగ్కు ఈసారి పూర్తిస్థాయి సారథ్య బాధ్యతలు అప్పగించింది. పెద్దగా అంతర్జాతీయ స్టార్లు లేని జట్టును అతడు ఎలా నడిపిస్తాడనేది కీలకంగా మారింది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కుమార సంగక్కర జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. ఒకవైపు జట్టును అమ్మేందుకు ఫ్రాంచైజీ ప్రయతి్నస్తుంటే... మైదానంలో మెరుగైన ప్రదర్శనతో ఇతరత్రా వార్తల నుంచి దృష్టి మరల్చాలని టీమ్ భావిస్తోంది. వైభవ్పైనే అందరి దృష్టి... పద్నాలుగేళ్ల వయసులోనే అంతర్జాతీయ బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ... గత సీజన్లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ప్లేయర్గా రికార్డు సృష్టించిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి నిలవనుంది. ఐపీఎల్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు 15వ పడిలో అడుగు పెట్టనున్న ఈ పాలబుగ్గల బుడ్డోడు... ఈ ఏడాది ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది ఆసక్తికరం. ఐపీఎల్లో రాణించిన అనంతరం దేశవాళీలో, ఏజ్ గ్రూప్ క్రికెట్లో సైతం అదే దూకుడు కొనసాగిస్తూ ఆకట్టుకున్న సూర్యవంశీపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలర్తో సంబంధం లేకుండా తొలి బంతి నుంచే దంచికొట్టే వైభవ్ అదే జోరు కొనసాగిస్తే ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అతడితో పాటు యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. భారత టి20 జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోవాలని చూస్తున్న జైస్వాల్కు ఈ సీజన్ మరింత కీలకం కానుంది. వీరిద్దరితో పాటు రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ కీలకం కానున్నారు. విదేశీ ఆటగాళ్ల కోటాలో... విండీస్ విధ్వంసక వీరుడు హెట్మైర్, ఇంగ్లండ్ ఆల్రౌండర్ స్యామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, ప్రిటోరియస్, ఫెరీరా, ఎంఫకా, ఆడమ్ మిల్నే, బర్గర్ అందుబాటులో ఉన్నారు. గతంలో పంజాబ్, చెన్నై జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్యామ్ కరన్ ప్రస్తుతం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతడు అందుబాటులో లేకుంటే ఫ్రాంచైజీ వద్ద తగిన ప్రత్యామ్నాయాలు కూడా లేవు. రవీంద్ర జడేజా తప్ప చెప్పుకోదగ్గ ఆల్రౌండర్ లేకపోవడం కాస్త ఇబ్బందే అయినా... సమష్టితత్వంతో ఫలితాలు సాధించాలని రాయల్స్ యోచిస్తోంది. గెలిపించేది ఎవరో? ప్రత్యర్థి జట్లన్నీ స్టార్ ఆటగాళ్లపై ఆధారపడుతుంటే... రాయల్స్ మాత్రం మ్యాచ్లు గెలిపించే ఆటగాడి కోసం చూస్తోంది. ముఖ్యంగా 12 మంది బౌలర్లు అందుబాటులో ఉన్నా... వారిలో మ్యాచ్ విన్నర్లు కనిపించడం లేదు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్కు సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే ఏమాత్రం సహకరిస్తారో చూడాలి. ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న సందీప్ శర్మ రాణించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. రవీంద్ర జడేజాతో పాటు రవి బిష్ణోయ్ స్పిన్ భారం మోయనున్నారు. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంతో పాటు... గువాహటిలోనూ రాయల్స్ తమ సొంతగడ్డ మ్యాచ్లు ఆడనుంది. తుది జట్టు ఎంపిక నుంచి ... జట్టులో సమష్టితత్వం వరకు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న రాజస్తాన్... మైదానంలో దుమ్మురేపి వాటన్నిటిని అధిగమించాలని ఆశిస్తోంది. ఇదే జరగాలంటే ఎవరో ఒకరు జట్టును గెలిపించే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. రాజస్తాన్ రాయల్స్ జట్టు: పరాగ్ (కెప్టెన్), శుభమ్ దూబే, వైభవ్, ఫెరీరా, ప్రిటోరియస్, రవి సింగ్, అమన్ రావు, హెట్మైర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, యుధ్వీర్, జడేజా, స్యామ్ కరన్, ఆర్చర్, తుషార్, ఎంఫకా, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, యశ్ రాజ్, విఘ్నేశ్ పుతుర్, బ్రిజేశ్ శర్మ, మిల్నే, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, బర్గర్.రాజస్తాన్ రాయల్స్ గణాంకాలుఆడిన మ్యాచ్లు 236 గెలిచినవి 116 ఓడినవి 117 రద్దు 3 అత్యుత్తమ ప్రదర్శన: చాంపియన్ (2008), రన్నరప్ (2022). -
ఐపీఎల్కు ఆకాశ్దీప్ దూరం
కోల్కతా: మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో ఇప్పటికే పేస్ బౌలర్ హర్షిత్ రాణా ఈ మెగా టోర్నీకి దూరంకాగా... అతని సరసన మరో ఫాస్ట్ బౌలర్ ఆకాశ్దీప్ కూడా చేరాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఆకాశ్దీప్ కోలుకోవడానికి కనీసం ఎనిమిది నుంచి 12 వారాలు పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈనెల 28 నుంచి మొదలయ్యే ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఆకాశ్దీప్ తప్పుకున్నాడు. అఫ్గానిస్తాన్తో జూన్ తొలి వారంలో జరిగే ఏకైక టెస్టుకు కూడా ఆకాశ్దీప్ దూరమయ్యే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బిహార్కు చెందిన 29 ఏళ్ల ఆకాశ్దీప్ దేశవాళీ క్రికెట్లో బెంగాల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున 10 టెస్టులు ఆడిన అతను 28 వికెట్లుపడగొట్టాడు. ఐపీఎల్లో 2022 నుంచి 2024 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ఆడిన ఆకాశ్దీప్ గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడు. ఓవరాల్గా ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడిన ఆకాశ్దీప్ 10 వికెట్లు తీశాడు. -
జూన్లో ఐర్లాండ్లో భారత్ పర్యటన
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్లో భారత పురుషుల క్రికెట్ జట్టు పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత జట్టు బెల్ఫాస్ట్ నగరంలో ఐర్లాండ్తో రెండు టి20 మ్యాచ్లు ఆడుతుంది. జూన్ 26న తొలి మ్యాచ్, జూన్ 28న రెండో మ్యాచ్ జరుగుతుంది. జూన్ 20న స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఒక టెస్టు, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ముగిశాక భారత జట్టు ఐర్లాండ్కు బయలుదేరుతుంది. ఐర్లాండ్తో సిరీస్ తర్వాత ఇంగ్లండ్లో ఇంగ్లండ్ జట్టుతో టీమిండియా ఐదు టి20 మ్యాచ్లు (జూలై 1, 4, 7, 9, 11), మూడు వన్డేలు (జూలై 14, 16, 19) ఆడుతుంది. -
అంచనాలు అందుకుంటాం!
ఐపీఎల్ 2026 సీజన్లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగుతోంది. పంజాబ్ కింగ్స్కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రధాన బలం. గతేడాది సీజన్లో కెప్టెన్ా అయ్యర్ పంజాబ్ను ఫైనల్ చేర్చాడు. కానీ తుది పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయి రన్నరప్కే పరిమితమయింది. కానీ ఈసారి మాత్రం అభిమానులు తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఐపీఎల్ కప్పు కొల్లగొడతామని శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 19వ సీజన్కు సిద్ధమవుతున్న తరుణంలో అయ్యర్ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు.‘గాయం వల్ల నేను దాదాపు ఏడు కేజీలు బరువు తగ్గాను. దాని నుంచి కోలుకొని రావడం పెద్ద సవాల్గా నిలిచింది. నాకైన గాయం చాలా ప్రమాదకరమైనది. అయితే రెండు నెలల తీవ్రంగా కష్టపడిన తర్వాత ఇప్పుడు శరీరాకృతి బాగుంది. కానీ ఫిట్గా ఉంటూనే ఏడు కేజీల బరువు పెరగాలంటే చాలా శ్రమించాలి. నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. తప్పకుండా పరిస్థితిని అధిగమిస్తా. ఇలాంటివి ఎన్నోసార్లు అనుభవించా. కమ్బ్యాక్ చేసి భారత జట్టుకు ఆడిన రోజులు ఉన్నాయి. గతేడాది మేం ఫైనల్కు వచ్చాం. రన్నరప్గా నిలిచాం.దీంతో ఈసారి మాపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడానికి కష్టపడతాం. విజయాలు సాధించి ట్రోఫీని అందుకుంటాం. ప్రతి మ్యాచ్కు మూడు రోజుల ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. మైదానం ఆవల ఉండే బాండింగ్తోనే మ్యాచ్లో మెరుగ్గా రాణించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది’ అని శ్రేయస్ తెలిపాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్ను మార్చి 31న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది.చదవండి: అయోధ్య రాముడి సేవలో లక్నో జట్టు -
అయోధ్య రాముడి సేవలో లక్నో జట్టు
ఐపీఎల్ 2026 సీజన్కు మరో వారం రోజులు మాత్రమే మిగిలిఉంది. దీంతో ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్లో చెమటోడుస్తున్నారు. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లో సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ సన్నద్ధతకు ముందు అయోధ్యలోని రామజన్మ భూమిని దర్శించుకుంది. శనివారం కెప్టెన్ రిషభ్ పంత్, ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా సహా క్రికెటర్లు అయోధ్య బాలరాముడి దీవెనలు అందుకున్నారు. ఐపీఎల్ 19వ సీజన్ ఘనంగా ఆరంభించాలని రాముడిని కోరుకుంటున్నట్లు లక్నో ఫ్రాంచైజీ తెలిపింది.ఈ సందర్భంగా శనివారం తమ టీమ్ అయోధ్య రాముడిని దర్శించుకున్న ఫోటోలను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పంచుకుంది.‘రాముడికి ప్రార్ధనలు చేయడం కొత్తమే కాదు. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న వేళ.. మా జట్టు ఆటగాళ్లందరు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ రాముడి ఆశీర్వాదం ఉంటే అన్నీ అనుకూలంగా జరుగుతాయి’ అని సంజీవ్ గొయెంకా ఏఎన్ఐతో తెలిపాడు.ఐపీఎల్లో మూడుసార్లు ఫ్లే ఆఫ్స్ వరకూ పరిమితమైన లక్నో సూపర్ జెయింట్స్ గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచింది. రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆరే విజయాలతో నాకౌట్కు ముందే నిష్క్రమించింది. అయితే.. ఈసారి కొత్త జెర్సీతో ఆడనున్న లక్నో మైదానంలో చెలరేగిపోవాలనుకుంటోంది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఏప్రిల్ 11న మ్యాచ్తో లక్నో టోర్నీలో అడుగు పెట్టనుంది. -
‘ఐసీసీ మా యజమాని కాదు’
బంగ్లాదేశ్లో ఇటీవలే ఎన్నికైన కొత్త క్రికెట్ బోర్డు తమ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్తో అనధికారిక చర్చలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి విచారణ కమిటీ ఏర్పాటుకు సంబంధించి జాతీయ క్రీడా మండలి (ఎన్ఎస్సీ) ఐసీసీని ఆశ్రయిస్తూ గెజిట్ను విడుదల చేయడం తమను ఆశ్చర్యపరిచిందని బీసీబీ పేర్కొంది. ఈ గెజిట్ ఎన్నికైన పరిపాలన స్థిరత్వం, స్వాతంత్ర్యం, కొనసాగింపు విషయంలో అనిశ్చితి సృష్టించే అవకాశముందని తెలిపింది. ఇదే విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాజీ కార్యదర్శి సయ్యద్ అష్రఫుల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బీసీబీ దేశ క్రీడామండలి పరిధిలో ఉందని, ఏమైనా అభ్యంతరాలుంటే బీసీబీకి చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుత బోర్డు మాత్రం ఐసీసీకి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా అనిపించింది. బంగ్లా క్రికెట్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఐసీసీ మా యాజమాని కాదు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో మాకు సభ్యత్వమున్నప్పటికీ తొలి ప్రాధాన్యత మాత్రం నేషనల్ స్పోర్ట్స్ పాలసీ (ఎన్ఎస్సీ)దే. బీసీబీ రాజ్యాంగం మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ఐసీసీ జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా ఉంది. అయితే ఐసీసీ మాకు సహాయకులు, మంచి మిత్రులు’ అని చెప్పుకొచ్చాడు. అంతకముందు బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల కారణంగా కేకేఆర్ ముస్తాఫిజుర్ను జట్టు నుంచి రిలీజ్ చేయడం కూడా బంగ్లా క్రికెట్ బోర్డుకు రుచించలేదు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ సమయంలో భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో, వేదికలు మార్చే ప్రసక్తే లేదని ఐసీసీ తేల్చిచెప్పింది. దీంతో బంగ్లా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చదవండి: కేకేఆర్కు మరో దెబ్బ.. కీలక ఆటగాడు దూరం! -
కేకేఆర్కు మరో దెబ్బ.. కీలక ఆటగాడు దూరం!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే మూడుసార్లు చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కుడి మోకాలి గాయం కారణంగా కేకేఆర్ స్టార్ బౌలర్ హర్షిత్ రానా ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. తాజాగా కేకేఆర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్ ఆకాశ్దీప్ నడుము కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆకాశ్ దీప్ దాదాపు ఎనిమిది వారాల పాటు ఐపీఎల్కు దూరమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కోల్కతా ఫ్రాంచైజీ ధృవీకరించాల్సి ఉంది.‘ఆకాశ్ దీప్ నడుము కింది భాగం స్ట్రెస్కు గురి కావడంతో నొప్పి తీవ్రత పెరిగింది. అతడు కోలుకునేందుకు కనీసం 8 నుంచి 12 వారాల సమయం పట్టే అవకాశముంది. దీంతో ఐపీఎల్లో పాల్గొనే అవకాశాలు లేవు’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా ఆకాశ్దీప్ను కోల్కతా నైట్రైడర్స్ రూ. కోటికి కొనుగోలు చేసింది. మరోవైపు శ్రీలంక పేసర్ మతీషా పతిరానా విషయంలోనూ ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ సీజన్లో రానా ఆడుతాడా? లేదా? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఎదురుదెబ్బలతో ప్రస్తుతం కేకేఆర్ బౌలింగ్ విభాగంలో వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, బ్లెసింగ్ ముజరబానీ, కార్తిక్ త్యాగి మాత్రమే ఉన్నారు. ఇప్పటికే వీరితో ట్రయల్ బౌలింగ్ను ప్రారంభించింది.చదవండి: అమ్ముడుపోని బౌలర్ విధ్వంసం! -
అమ్ముడుపోని బౌలర్ విధ్వంసం!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ తన ప్రాక్టీస్ను ఆరంభించింది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్లో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన నవదీప్ సైనీ విజృంభించాడు. న్యూజిలాండ్ విధ్వంసరకర బ్యాటర్ ఫిన్ అలెన్ను క్లీన్బౌల్డ్ చేసిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రాక్టీస్లో భాగంగా కేకేఆర్ ఆటగాళ్లంతా శుక్రవారం పర్పుల్ నైట్స్, గోల్డెన్ నైట్స్గా విడిపోయి ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడారు. గోల్డెన్ నైట్స్ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పర్పుల్ నైట్స్కు శుభారంభం లభించింది. ఫిన్ అలెన్ 10 బంతుల్లోనే 23 పరుగులు బాదాడు. అయితే వేలంలో అమ్ముడుపోని నవదీప్ సైనీ బౌలింగ్కు వచ్చిన తరుణంలో అతడు వేసిన తొలి బంతిని ఫిన్ అలెన్ సిక్సర్గా మలిచాడు. అయితే ఆ తర్వాత బంతిని సైనీ యార్కర్ వేయగా ఫిన్ అలెన్ వికెట్ నుంచి పక్కకు జరిగి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఫిన్ అలెన్ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. కాగా ఫిన్ అలెన్ను కోల్కతా రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పర్పుల్ నైట్స్ 6 వికెట్ల తేడాతో గోల్డెన్ నైట్స్పై విజయం సాధించింది. అంగ్క్రిష్ రఘువంశీ 55 బంతుల్లోనే 103 పరుగుల మెరుపు సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు గోల్డెన్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ (45), సార్థక్ రాజన్ (37), రింకూ సింగ్ (40) రాణించారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్లో ఫిన్ అలెన్ తన విధ్వంసకర బ్యాటింగ్తో అలరించాడు. 8 ఇన్నింగ్స్ల్లో 200 స్ట్రైక్రేట్తో 298 పరుగులు సాధించాడు. ఇందులో సౌతాఫ్రికాపై 33 బంతుల్లోనే సెంచరీ సాధించిన ఫిన్ అలెన్ అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ తన తొలి మ్యాచ్ను మార్చి 29న ముంబై ఇండియన్స్తో ఆడనుంది. తొలి విడతలో ముంబైతో పాటు ఎస్ఆర్హెచ్, పంజాబ్, లక్నోతో ఆడనుంది.Finn Allen got out early but the trailer has been shown, the picture will be seen in the IPL match. pic.twitter.com/eYBvOwCHdO— Ayush🎃 (@AyushBandhe) March 20, 2026చదవండి: ‘అతడితోనే వైరం.. జైషాకు సంబంధం లేదు’ -
‘అతడితోనే వైరం.. జైషాకు సంబంధం లేదు’
బీసీసీఐ తనను 23 ఏళ్లుగా విస్మరించిందని, అందుకే కామెంటేటర్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్ రాజీనామా వెనుక జై షా హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్ మరోసారి స్పందించారు. తన రాజీనామాతో జైషాకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్ధలు కొట్టారు. శివరామకృష్ణన్ మాట్లాడుతూ.. ‘నా రాజీనామాకు బీసీసీఐతో సంబంధం లేదు. బీసీసీఐ పరిపాలనపై నాకు ఆగ్రహం లేదు. నా నిర్ణయం వెనుక బీసీసీఐ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ చైర్మన్ జై షా హస్తం ఉందన్న వార్తలో నిజం లేదు. ఈ విషయంలోకి బీసీసీఐ యాజమాన్యాన్ని లాగవద్దు. ఇది కేవలం బీసీసీఐలో ఒక ఉద్యోగి చేసిన నిర్వాకం మాత్రమే. నా జీవిత పగ్గాలను నా చేతిలోకి తీసుకుంటున్నా. అలా చేసే హక్కు ఉందని భావిస్తున్నా’ అని వెల్లడించారు. శివరామకృష్ణన్ ఆకస్మిక నిర్ణయంపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, "ఓహ్ నో! ఈ ఐపీఎల్కు ఎందుకు ఉండరు?" అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 1984లో ఇంగ్లండ్పై ఒకే మ్యాచ్లో 12 వికెట్లు పడగొట్టి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన శివరామకృష్ణన్, 1985లో సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్షిప్లో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచి సత్తా చాటాడు. 2000వ సంవత్సరంలో కామెంటరీ కెరీర్ ప్రారంభించిన శివరామకృష్ణన్, అంతకుముందు ఐసీసీ క్రికెట్ కమిటీలో ఆటగాళ్ల ప్రతినిధిగా కూడా పనిచేశాడు. మొత్తంగా భారత్ తరఫున శివరామకృష్ణన్ 9 టెస్టుల్లో 26 వికెట్లు, 16 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు.Don’t bring the BCCI Administration into the picture. It’s a one on one with an employee of the BCCI. Jay Shah and Co. have nothing to do with this issue. I am taking control of my life and I think I am entitled to do it.— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) March 21, 2026 -
‘వస్తారు కోట్లు పట్టుకెళ్తారు.. ప్రయోజనమెవరికీ’!
ఐపీఎల్ 2026 సీజన్ మరో వారం రోజుల్లో మొదలుకానుంది. కానీ ఐపీఎల్లో ఈసారి ఆటగాళ్ల గాయాల సమస్యలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వేలంలో కోట్ల ధర పలికిన విదేశీ ఆటగాళ్లు గాయాలు, వ్యక్తిగత కారణాలతో లీగ్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానుండడం ఆయా ఫ్రాంచైజీలపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను గాయం నుంచి కోలుకోకపోవడంతో సీజన్ ఆరంభ మ్యాచ్లకు కమిన్స్ అందుబాటులో ఉండడం లేదు. దీంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్ఆర్హెచ్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రాయల్చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ కూడా గాయంతో దూరమయ్యాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్కు గాయాల బెడద తగిలింది. ఆ జట్టు స్టార్ మిచెల్ స్టార్క్ గాయంతో సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా క్రికెట్ ఆస్ట్రేలియాపై విమర్శలు చేశాడు. ‘మిచెల్ స్టార్క్ సీజన్ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇప్పటికే జోష్ హాజిల్వుడ్, పాట్ కమిన్స్లు దూరమయ్యారు. తాజాగా స్టార్క్ గాయంతో బాధపడుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పేర్కొంది. కానీ నిజానికి అతను ఫిట్గా ఉన్నప్పటికీ సీఏ మాత్రం ఏవో సాకులు చెప్పి అతన్ని ఐపీఎల్ మ్యాచ్లు ఆడకుండా చూస్తుంది. స్టార్క్ టీ20 క్రికెట్కు ఎప్పుడో వీడ్కోలు పలికాడు. మరి రెండు నెలలుగా స్టార్క్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చేసినట్లు? అంతేకాదు స్టార్క్ యాషెస్ సిరీస్ తర్వాత మళ్లీ మ్యాచ్లు ఆడలేదు. అయితే భారత్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ నేపథ్యంలో మొదట విశ్రాంతి తీసుకోమని పేర్కొన్న సీఏ ఆ తర్వాత మాట మార్చి ఐపీఎల్కు అందుబాటులో ఉంటాడని తెలిపింది. కానీ ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. ఇక న్యూజిలాండ్ బౌలర్ లోకీ ఫెర్గూసన్ విషయం నన్ను మరింత ఆశ్చర్యపరుస్తోంది. గాయం లేనప్పటికీ కుటుంబంతో కొంత సమయం గడిపేందుకు ఫెర్గూసన్ ఐపీఎల్లో తొలి ఏడు మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇది దారుణమైన అంశం. ప్రస్తుతం ఫెర్గూసన్ సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్నాడు. అది ముగియగానే తన కుటుంబంతో గడిపేందుకు న్యూజిలాండ్ వెళ్లనున్నాడు. అది అతని వ్యక్తిగత విషయం కావొచ్చు, కానీ ఐపీఎల్లో ఒక జట్టుకు ఆడుతూ ఏడు మ్యాచ్ల తర్వాత జట్టులో చేరి రూ.కోటి తీసుకొని వెళ్లిపోతాడు. కానీ దీనివల్ల ఎవరికీ ప్రయోజనం? ప్రతీ ఐపీఎల్లో ఇది సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంది.’ అని వెల్లడించాడు. -
పాక్ క్రికెట్లో విష సంస్కృతి ఎక్కువ!
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు గుప్పించాడు. వ్యవస్థాగత జోక్యం, వృత్తిపరమైన గౌరవం కొరవడడంతో పాకిస్థాన్ క్రికెట్ ప్రధాన కోచ్గా పనిచేయడం తనకు నరకంలా అనిపించిందని కిర్స్టన్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే శ్రీలంక ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన కిర్స్టన్ పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ నేతృత్వంలో పని చేసే వర్క్ కల్చర్ దారుణంగా ఉండేదని పేర్కొన్నాడు. కిర్స్టన్ మాట్లాడుతూ.. ‘నేను చూసిన జట్లలో ఇంత స్థాయి జోక్యం ఎక్కడా చూడలేదు. కోచ్గా వచ్చి ప్లేయర్లతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే బయట నుంచి వచ్చే ఈ నాయిస్ చాలా కష్టంగా మారుతుంది. జట్టు ఫలితాలు సరిగా రాకపోతే కోచ్పైనే ఒత్తిడి పెంచడం, ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రతికూలంగా మారుతాయి. టీమ్ బాగా ఆడకపోతే కోచ్ను తీసేయడం లేదా అతనిపై పరిమితులు పెట్టడం చాలా ఈజీ. కానీ అదే తప్పు. అలా అయితే కోచ్ని ఎందుకు నియమిస్తారు?’అంటూ కిర్స్టెన్ ప్రశ్నించాడు. ఇక తన భవిష్యత్పై కూడా క్లారిటీ ఇచ్చిన కిర్స్టెన్, తాజాగా శ్రీలంక క్రికెట్తో రెండు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2027 ఐసీసీ వన్డే వరల్డ్కప్ కోసం శ్రీలంక జట్టును సిద్ధం చేయడం ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఈ టోర్నమెంట్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది. 2024లో టీ20 ప్రపంచకప్లో లీగ్ స్టేజీలోనే పాకిస్థాన్ నిష్క్రమించడంతో పీసీబీ వైఖరితో పొసగక కిర్స్టన్ తన పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతకముందు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిలెస్పీ నిష్క్రమణ కూడా దాదాపు ఇలాంటి పద్దతిలోనే జరగడం గమనార్హం. ఇంగ్లండ్పై స్వదేశంలో చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని పాక్ జట్టుకు అందించినప్పటికీ, మోసిన్ నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ కనీస సమాచారం ఇవ్వకుండానే గిలెస్పీని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనంగా నిలిచింది.చదవండి: IPL 2026: పంజాబ్ ‘కింగ్స్’ అయ్యేనా? -
IPL 2026: పంజాబ్ ‘కింగ్స్’ అయ్యేనా?
ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోవడం పంజాబ్ కింగ్స్ నిలకడలేని ఫామ్ను ఎత్తి చూపుతోంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ ప్లేఆఫ్స్కు చేరిన పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) మళ్లీ 2014 ఐపీఎల్ సీజన్లో ఫైనల్ ఆడింది. ఆ సీజన్లో కేకేఆర్ చేతిలో ఓడిన పంజాబ్ రన్నరప్కే పరిమితమైంది. ఆ తర్వాత మళ్లీ 11 ఏళ్లకు కానీ ఆ జట్టు ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. అప్పుడు కేకేఆర్ అడ్డు తగిలితే ఈసారి ఆర్సీబీ పంజాబ్ను అడ్డుకుంది. అయితే, గత సంవత్సరం జట్టును సమూలంగా ప్రక్షాళించడం పంజాబ్కు కలిసి వచ్చింది. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ను భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు అతడికి జట్టు పగ్గాలు అప్పగించింది. తనపై వెచ్చించిన మొత్తానికి, ఫ్రాంచైజీ యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రేయాస్ అయ్యర్ జట్టును నిరుడు తుదిపోరుకు తీసుకొచ్చాడు. ఈనేపథ్యంలో ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న పంజాబ్ రన్నరప్గా నిలిచిన ఆత్మవిశ్వాసంతో ఈ సీజన్కు సై అంటోంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ ఈసారైనా ‘కింగ్స్’ అవుతుందా? అనేది చూడాలి.అయితే పంజాబ్కు విదేశీ ఆల్రౌండర్లు ప్రధాన బలం. మార్కస్ స్టొయినిస్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మిచెల్ ఒవెన్, కూపర్ కానొలీ బంతిని ఎంత బలంగా బాది భారీ షాట్లు సాధించగలరో..అదే బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలరు. పైగా ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ ఫ్రాంచైజీ లీగ్లలో ఆడుతున్న అపార అనుభవం ఆ ఐదుగురు ఆల్రౌండర్ల సొంతం. ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్సిమ్రన్ సింగ్ దూకుడైన బ్యాటింగ్తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించగలరు. నిరుడు 400కుపైగా రన్స్ చేసిన ఆర్యా రెండో బెస్ట్ స్ట్రయిక్ రేట్ బ్యాటర్గా నిలిచాడు. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాలను కొనసాగించేందుకు శ్రేయాస్ ఎలాగూ ఉంటాడు. అర్ష్దీప్, ఫెర్గూసన్, యాన్సెన్, చాహల్తో పేస్, స్పిన్ బౌలింగ్లో వైవిధ్యం పంజాబ్కు కలిసి వచ్చే అంశం. పటిష్టమైన రిజర్వ్ బెంచ్ అదనపు బలం.పెద్దగా అనుభవంలేని భారత ఆటగాళ్లు జట్టులో ఉండడం పంజాబ్ కింగ్స్ బలహీనత. కెప్టెన్ అయ్యర్ మినహా ప్రియాన్ష్, శశాంక్ సింగ్, వధేరా, హర్ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్, వైశాఖ్లకు అత్యున్నత స్థాయి ఐపీఎల్ మ్యాచ్లు ఆడింది తక్కువ. వీరందరిలో ప్రతిభకు కొదవ లేకపోయినా నిలకడగా రాణించలేకపోవడం, ఒత్తిడి సమయాల్లో ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడం కీలక సమయాల్లో జట్టును దెబ్బతీస్తోంది. అలాగే చాహల్ మినహా పేరు కలిగిన మరో స్పిన్నర్ లేకపోవడం లోటు.పంజాబ్ కింగ్స్ జట్టు:స్వదేశీ ఆటగాళ్లు: శ్రేయాస్ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్ సింగ్ (కీపర్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చాహల్, హర్ప్రీత్ బ్రార్, సూర్యాన్ష్ షెగ్డే, విష్ణు వినోద్ (కీపర్), యశ్ ఠాకూర్, ముషీర్ ఖాన్, హర్నూర్ సింగ్, పైలా అవినాశ్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్.విదేశీ ఆటగాళ్లు: స్టొయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, జేవియర్ బార్ట్లెట్, మిచెల్ ఒవెన్, ఫెర్గూసన్, కూపర్ కానొలీ, బెన్ డ్వార్షూయిస్.చదవండి: జట్లకు వార్నింగ్.. కేకేఆర్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ -
జట్లకు వార్నింగ్.. కేకేఆర్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ
ఐపీఎల్ 2026 సీజన్ కోసం మూడు సార్లు ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ తీవ్రంగా శ్రమిస్తోంది. గత సీజన్లో దారుణంగా విఫలమైన కేకేఆర్.. ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో తమ ట్రైనింగ్ క్యాంపును కేకేఆర్ ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో శుక్రవారం కేకేఆర్ సభ్యులు రెండు జట్లగా విడిపోయి ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడాడు. గోల్డెన్ నైట్స్ జట్టుకు రింకూ సింగ్ కెప్టెన్ కాగా.. 'పర్పుల్ నైట్స్' జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించాడు. అయితే ఈ మ్యాచ్లో రహానే జట్టుకు ప్రాతినిథ్యం వహించిన యువ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 55 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడితో పాటు కివీ స్టార్ ఫిన్ అలెన్ కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా లక్ష్యాన్ని పర్పుల్ నైట్స్ జట్టు 19.2 ఛేదించింది.అయితే ఈ ఏడాది సీజన్లో రఘువంశీ బ్యాటింగ్ ఆర్డర్పై ఇంకా స్పష్టత లేదు. గత సీజన్లో కొన్ని సార్లు మూడో స్ధానంలో, మరికొన్ని మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చేవాడు. అయితే ఇప్పుడు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్య రహానే, కామెరాన్ గ్రీన్ వంటి టాపార్డర్ బ్యాటర్లు ఉండడంతో రఘువంశీని మరి ఎలా ఉపయోగిస్తారో చూడాలి. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్లో మార్చి 29న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో తలపడనుంది.చదవండి: IPl 2026: 'ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు'.. సహచరులకు కోహ్లి వార్నింగ్ -
'ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు'.. సహచరులకు కోహ్లి వార్నింగ్
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి కౌంట్డౌన్ మొదలైంది. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ షురూ కానుంది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ.. టైటిల్ను ఎలాగైనా రిటైన్ చేసుకోవాలని పట్టుదలతో ఉంది. రజిత్ పాటిదార్ నేతృత్వంలో ఆర్సీబీ జట్టు తాజాగా చిన్నస్వామి స్టేడియంలో తమ మొదటి ట్రైనింగ్ సెషన్లో పాల్గోంది. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆటగాళ్లలలో స్ఫూర్తి నింపుతూ ప్రసంగించాడు. "గత రెండు, మూడు సీజన్లలో మనం పడ్డ కష్టానికి ఫలితం గతేడాది దక్కింది. కానీ ఈసారి మరిన్ని కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎందుకంటే అన్ని జట్లు మనల్ని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాయి. గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ సమయాన్ని వృథా చేయొద్దు. ప్రతీ సెషన్లోనూ ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా 120 శాతం కష్టపడాలి. ఈ టోర్నీలో సత్తాచాటేందుకు మనమంతా ఉత్సాహంగా ఉన్నామని అందరి ముఖాల్లో కనిపిస్తోంది" అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ తొలి టైటిల్ సాధించడంలో కోహ్లిది కీలక పాత్ర. మొత్తం 15 మ్యాచ్లలో 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లోనూ ఆర్సీబీ విరాట్ కీలకం కానున్నాడు.చదవండి: IPL 2026: దుమ్ములేపిన పప్పు యాదవ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే -
ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ
భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు మ్యాచ్లు జూన్ 26,28వ తేదిల్లో బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్నాయి. ఈ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్స్గా నిలిచిన తర్వాత భారత్కు ఇదే తొలి టీ20 సిరీస్ కావడం గమనార్హం. వాస్తవానికి ఈ సిరీస్ టీమిండియా ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో లేదు.ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో అఫ్గానిస్తాన్ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. జూన్ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్ ఖరారైంది.జూలై 1- 19 వరకు ఇరు జట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఐర్లాండ్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బీసీసీఐ ఈ పర్యటనను ఖరారు చేసింది. ఆ తర్వాత భారత జట్టు అక్కడ నుంచి నేరుగా ఇంగ్లండ్కు వెళ్లనుంది. భారత్, ఐర్లాండ్ జట్లు చివరిసారిగా టీ20 ప్రపంచకప్లో తలపడ్డాయి.చదవండి: IPl 2026: 'వైభవ్ అతిగా ఆలోచించకు.. జైస్వాల్ చూసుకుంటాడు' -
'వైభవ్ అతిగా ఆలోచించకు.. జైస్వాల్ చూసుకుంటాడు'
ఐపీఎల్-2026 సీజన్లో సత్తా చాటేందుకు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సిద్దమవుతున్నాడు. గత సీజన్లో తన అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని అకర్షించిన ఈ బిహార్ ఆటగాడు.. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.ఇప్పటికే రాయల్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరిన 14 ఏళ్ల సూర్యవంశీ .. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాయల్స్ కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది వైభవ్పై భారీ అంచనాలతో పాటు ఒత్తడి కూడా ఉంటుందని పరాగ్ తెలిపాడు.వైభవ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో అతడిపై ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ కెప్టెన్గా ఒక్క విషయం అతడికి చెప్పాలనుకుంటున్నాను. ఆ ఒత్తిడిని యశస్వి జైస్వాల్కు వదిలేయమని చెబుతా. ఎందుకంటే జైశ్వాల్కు అనుభవం ఎక్కువగా ఉంది. ఒత్తిడిని తట్టుకుని ఆడే సత్తా జైశూ వద్ద ఉంది. కాబట్టి వైభవ్ క్రీజులోకి వెళ్లి తన సహజ సిద్ధమైన ఆటను ఆడితే చాలు. బయట విషయాలను అతడు పట్టించుకోకూడదు. అతడి దృష్టింతా కేవలం ఆటపైనే ఉండాలి. అందుకే అతడిని మీడియా దృష్టికి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. ప్రెస్ కాన్ఫరెన్స్లకు హాజరుకావద్దని, ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడవద్దని చెబుతాను అని పరాగ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025 సీజన్లో వైభవ్ దుమ్ములేపాడు. కేవలం 7 మ్యాచ్లలో 206.56 స్ట్రైక్ రేట్తో 252 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు.చదవండి: IPL 2026: లైంగిక ఆరోపణలు.. స్టార్ ప్లేయర్పై వేటు వేసిన ఆర్సీబీ!? -
లైంగిక ఆరోపణలు.. స్టార్ ప్లేయర్పై వేటు వేసిన ఆర్సీబీ!?
ఐపీఎల్-2026 సీజన్కు రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యశ్ దయాల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఓ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న దయాల్ను ఆర్సీబీ మేనెజ్మెంట్ పక్కన పెట్టినట్లు సమాచారం. బెంగళూరు జట్టు ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియంలో ట్రైనింగ్ క్యాంప్ను ఏర్పాటు చేసింది.అయితే ఈ శిక్షణా శిబిరానికి దయాల్ గైర్హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఆర్సీబీ టీమ్ బస్పై కూడా దయాల్ ఫోటో లేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఆర్సీబీ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆర్సీబీ తొలి టైటిల్ సాధించడంలో దయాల్ది కీలక పాత్ర. మొత్తం 13 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అయితే గతేడాది జూలైలో దయాల్పై రెండు వేర్వేరు రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అతడిని అరెస్టు చేయొద్దంటూ అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే రాజస్తాన్లో నమోదైన కేసులో మాత్రం అతడు బెయిల్పై ఉన్నాడు. రాజస్థాన్ హైకోర్టు యశ్ దయాల్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. గత నెలలో యశ్ దయాల్ సీక్రెట్గా పెళ్లిచేసుకున్నాడు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్తో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టాడు.చదవండి: IPL 2026: దుమ్ములేపిన పప్పు యాదవ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే -
దుమ్ములేపిన పప్పు యాదవ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే
ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్కతా నైట్రైడర్స్ తమ ప్రాక్టీస్ జోరు పెంచింది. శుక్రవారం కేకేఆర్ ఆటగాళ్లు రెండు జట్లగా విడిపోయి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడారు. గోల్డెన్ నైట్స్ జట్టుకు రింకూ సింగ్ కెప్టెన్ కాగా.. 'పర్పుల్ నైట్స్' జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించాడు.అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఢిల్లీ ఆటగాడు, ఎంపీ పప్పు యాదవ్ తనయుడు సార్థక్ రంజన్ విధ్వంసం సృష్టించాడు. తన పవర్ ఫుల్ బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 'గోల్డెన్ నైట్స్' జట్టు తరపున ఆడిన సార్థక్.. కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేశారు. వైభవ్ ఆరోరా వేసిన మూడో ఓవర్లో అతడు ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు.ఆఖరికి బ్లెస్సింగ్ ముజారబానీ బౌలింగ్లో థర్డ్ మ్యాన్ దిశగా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైస్కు సార్థక్ రంజన్ను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్తో పాటు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడికి ఈ అవకాశం దక్కింది. డొమాస్టిక్ క్రికెట్లో దుమ్ములేపిన సార్థక్.. ఇప్పుడు ఐపీఎల్ వంటి మహా వేదికపై సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు.ఐపీఎల్-2026 కోసం కోల్కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు: అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, ఎఫ్ గ్రీన్ అరోరా, వరుణ్ చకరన్, ఎఫ్. పతిరణ, తేజస్వి సింగ్, కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్.చదవండి: ఆర్సీబీ టికెట్ కొంటే మెట్రోలో ఫ్రీ జర్నీ -
ఆర్సీబీ టికెట్ కొంటే మెట్రోలో ఫ్రీ జర్నీ
బెంగళూరు (శివాజీనగర): ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ఒక వారం మాత్రమే గడువు ఉంది. పోటీలను స్వస్థలం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిపేందుకు అనుమతి పొందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు తన అభిమానులకు బంపర్ ఆఫర్ను ఇచ్చింది. టికెట్ కొనుగోలు చేసిన వారికి ‘నమ్మ మెట్రో’లో ఆయా రోజుల్లో ఉచితంగా ప్రయాణానికి అవకాశం లభించనుంది. మెట్రో ప్రయాణపు క్యూర్ కోడ్ సైతం లభించనుంది. టికెట్ కొనుగోలు ఎలా? ఈసారి ఆర్సీబీ జట్టు స్వస్థలంలో పోటీలకు ఆన్లైన్ టికెట్లకు మాత్రమే ప్రాధాన్యత కల్పించింది. జట్టు అధికారిక వెబ్సైట్ లేదా, యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు. త్వరలో టికెట్ అమ్మకాల తేదీని ప్రకటిస్తారు. ఇతర వెబ్సైట్లకు గాని వ్యక్తులకు కాని టికెట్ అమ్మకాల హక్కులు లేవు. ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడు? 2026వ సంవత్సర ఐపీఎల్ టోర్నీ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయమై తొలి దశ టైం టేబల్ను సైతం విడుదల చేశారు. పశి్చమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న కారణంగా తొలి 20 పోటీల టైం టేబల్ను మాత్రం ప్రకటించారు. టోర్నీ ప్రారం¿ోత్సవ పోటీల్లో ప్రస్తుతం చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైసర్స్ హైదరాబాద్ జట్లు ముఖాముఖి తలపడతాయి. ఈ పోటీలకు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానం అతిథ్యం ఇస్తోంది. తొలి దశలో ఆర్సీబీ తలపడే మ్యాచ్లు: -
చరిత్ర సృష్టించిన అనామక ప్లేయర్
రువాండాకు చెందిన టీనేజ్ క్రికెటర్ ఫ్యానీ ఉతగుషుమనిందే అరంగేట్రంలోనే సెంచరీతో చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మహిళల టి20ల్లో ‘శత’క్కొట్టిన అతిపిన్న వయష్కరాలిగా ఫ్యానీ (15 ఏళ్ల 223 రోజులు) రికార్డు నెలకొల్పింది. ఉగాండా ప్లేయర్ ప్రొస్కోవియా అలకో (16 ఏళ్ల 233 రోజులు; 2019లో మాలి జట్టుపై) పేరిట ఉన్న రికార్డును ఫ్యానీ బద్దలు కొట్టింది.నైజీరియాలో జరుగుతున్న ఇంటర్ననేషనల్ టి20 టోర్నీలో భాగంగా ఘనాతో జరిగిన మ్యాచ్లో ఫ్యానీ 65 బంతుల్లో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే శతకం, అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మహిళా బ్యాటర్గా ఘనతకెక్కింది. ఆమె మెరుపు శతకం 21 ఏళ్ల రికార్డును తిరగరాసింది. 2005లో అప్పుడే మొదలైన మహిళల అంతర్జాతీయ టి20లో ఆస్ట్రేలియన్ బ్యాటర్ తన అరంగేట్రం మ్యాచ్లో కరెన్ రోల్టన్ (96 నాటౌట్) ఇంగ్లండ్పై రికార్డు సృష్టించింది. ఫ్యానీ ధనాధన్ షోతో రువాండా 20 ఓవర్లలో 3 వికెట్లకు 210 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం ఘనా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 88 పరుగులే చేసింది. -
ముంబై మురిపించేనా!
ఎనిమిదేళ్ల వ్యవధిలో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచి సంచలనం సృష్టించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమవుతోంది. గత ఐదు సీజన్లలో కనీసం ఒక్కసారీ ఫైనల్ చేరలేకపోయిన హార్దిక్ పాండ్యా బృందం... ఆరో టైటిల్ వేటకు సిద్ధమైంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, డికాక్, సాంట్నర్, బౌల్ట్, బుమ్రా ఇలా జట్టు మొత్తం స్టార్లతో నిండి ఉండగా... వీరంతా కలిసికట్టుగా కదంతొక్కాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇటీవల టీమిండియా టి20 ప్రపంచకప్ నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్, తిలక్ ఫుల్ఫామ్లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బలాబలాలను పరిశీలిస్తే... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక టైటిల్స్ సాధించిన రెండు జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ గత ఐదేళ్లుగా ట్రోఫీ కోసం పరితపిస్తోంది. క్షణాల్లో మ్యాచ్ను మలుపు తిప్పగల స్టార్లు... బంతిని అదే పనిగా బౌండరీకి తరలించగల హిట్టర్లు... రెప్పపాటులో వికెట్లను పడగొట్టగల బౌలర్లు... ఇలా జట్టులో అన్నీ ఉన్నా ఆరో టైటిల్ మాత్రం దరిచేరడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ జట్లకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సాంట్నర్ ఇలా నాయకులతో నిండి ఉన్న జట్టును ఈ సీజన్లో హార్దిక్ ఎలా నడిపిస్తాడనేది కీలకం. లీగ్ ఆరంభం నుంచే సచిన్, పాంటింగ్ వంటి స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్న ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ 2013లో తొలిసారి ట్రోఫీ అందించాడు... ఆ తర్వాత అతడి సారథ్యంలోనే 2015, 2017, 2019, 2020లో ముంబై జట్టు విజేతగా నిలిచింది. కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయిన ముంబై... ఈ సీజన్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాలని భావిస్తోంది. ప్లేయర్లను తీర్చిదిద్దడంలో మంచి అనుభవమున్న ముంబై ఫ్రాంచైజీ... 2026 వేలంలో దక్షిణాఫ్రికా విధ్వంసక ఓపెనర్ డికాక్, విండీస్ హిట్టర్ రూథర్ఫర్డ్ను అతి తక్కువ ధరకే దక్కించుకుంది. హెడ్ కోచ్ జయవర్ధనే ఈ ఇద్దరి సేవలను ఎలా వినియోగించుకుంటాడనేది ఆసక్తికరం. రోహిత్ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గానే... ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి కూడా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘హిట్మ్యాన్’ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు. రోహిత్తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... తిలక్వర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, నమన్లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ను ప్రత్యర్థి నుంచి లాగేసుకోవడంలో వీరికి అపార అనుభవం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఒక్క డికాక్ మినహా మిగిలిన వాళ్లంతా భారత ఆటగాళ్లే కావడంతో... విదేశీ ఆటగాళ్ల సేవలను వినియోగించుకునే విషయంలో ఫ్రాంచైజీకి మంచి వెసులుబాటు ఉంది. ఈ కోటాలో డికాక్, రికెల్టన్, రూథర్ఫర్డ్, సాంట్నర్, విల్ జాక్స్, బాష్, ట్రెంట్ బౌల్ట్, ఘజన్ఫర్ అందుబాటులో ఉండగా... డికాక్, జాక్స్, సాంట్నర్, బౌల్ట్ తుదిజట్టులో ఉండటం ఖాయమే. పరిస్థితులను బట్టి రూథర్ఫర్డ్, ఘజన్ఫర్ను పరిశీలించవచ్చు. బుమ్రాపైనే భారం... టీమిండియా వరుసగా రెండోసారి టి20 ప్రపంచకప్ కైవసం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన బుమ్రాపైనే ముంబై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్గా మన్ననలు అందుకుంటున్న అతడు స్థాయికి తగ్గట్లు రాణిస్తే జట్టుకు తిరుగుండదు. బౌల్ట్, దీపక్ చాహర్ నుంచి అతడికి సహకారం అందితే ముంబైను ఆపడం ప్రత్యర్థులకు కష్టతరమే. తాజా టి20 ప్రపంచకప్లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్తో పాటు న్యూజిలాండ్ కెపె్టన్ సాంట్నర్ స్పిన్ భారం మోయనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలింగ్లో అవసరమైతే మయాంక్ మార్కండే, అశ్వని కుమార్, శార్దుల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నారు. గత 13 సీజన్లను ముంబై జట్టు పరాజయంతో ప్రారంభించింది. ఈసారి ఓటమితో కాకుండా గెలుపుతో బోణీ కొడుతుందో లేదో చూడాలి. ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెపె్టన్), రోహిత్, సూర్యకుమార్, రాబిన్ మిన్జ్, రూథర్ఫర్డ్, రికెల్టన్, డికాక్, దానిశ్, తిలక్, నమన్ ధీర్, సాంట్నర్, రాజ్ బావా, అథర్వ, మయాంక్ రావత్, కార్బిన్ బాష్, విల్ జాక్స్, శార్దుల్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, దీపక్ చాహర్, అశ్వని కుమార్, రఘుశర్మ, ఇజహార్, ఘజన్ఫర్, బుమ్రా.ముంబై ఇండియన్స్ గణాంకాలుఆడిన మ్యాచ్లు 277 గెలిచినవి 153 ఓడినవి 124 అత్యుత్తమ ప్రదర్శన: చాంపియన్ (2013, 2015, 2017, 2019, 2020), రన్నరప్ (2010). -
ఐపీఎల్ నుంచి హర్షిత్ రాణా అవుట్
కోల్కతా: భారత్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా ఇదివరకే గాయంతో టి20 ప్రపంచకప్ ఆడలేకపోయాడు. ఇప్పుడు మెరుపుల లీగ్ ఐపీఎల్కు సైతం దూరమయ్యాడు. అతను ఆడటంపై మొదటి నుంచి సందేహం ఉన్నప్పటికీ శుక్రవారం కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. రాణా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని తెలిపింది. ‘మాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. కొన్నేళ్లుగా హర్షిత్ మా జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ముఖ్యంగా గతేడాది కాలంగా మరింత రాటుదేలాడు. అలాంటి ఆటగాడు సీజన్ అసాంతం దూరమవడం మాకు చాలా ఇబ్బందికరం. ఉన్నపళంగా అతని స్థానాన్ని భర్తీ చేయడం కూడా కష్టమే’ అని కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ అన్నారు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ పతిరణ గాయంతో లంక పేసర్ సేవల్ని సైతం కోల్పోయింది. ఇంతకీ అతనికేమైంది? టీమిండియా జట్టులో సీనియర్ల గైర్హాజరీతో జట్టులోకి వచ్చిన హర్షిత్ సీమ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో భారీ షాట్లతో అలరించాడు. దీంతో టి20 ప్రపంచకప్లో పాల్గొనే జట్టుకూ అతన్ని కొనసాగించారు. కానీ దురదృష్టవశాత్తూ దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా అతని కుడి మోకాలికి గాయమైంది. దీంతో జట్టుకు దూరమైన రాణా టీమిండియా జగజ్జేత బృందంలో భాగం కాలేకపోయాడు. అనంతరం హర్షిత్ మోకాలికి సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం పునరావాస శిబిరంలో ఉన్నప్పటికీ అతను పూర్తిగా కోలుకునేందుకు రీహాబిలిటేషన్ ప్రక్రియ ఇంకొంత కాలం కొనసాగించాల్సి ఉండటంతో ఇప్పుడప్పుడే అతను బరిలోకి దిగే అవకాశమైతే లేదు. -
సన్రైజర్స్కు మరో దెబ్బ... ఐపీఎల్కు జాక్ ఎడ్వర్డ్స్ దూరం
హైదరాబాద్: ఆరంభానికి ముందే ఐపీఎల్ను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెపె్టన్ కమిన్స్ తొలి దశ మ్యాచ్లకు దూరం కాగా, తాజాగా మరో సహచరుడు జాక్ ఎడ్వర్డ్స్ ఏకంగా సీజన్ మొత్తానికే అందుబాటులో లేకుండా పోయాడు. ఆ్రస్టేలియాకే చెందిన 25 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఎడ్వర్డ్స్ను వేలంలో రూ. 3 కోట్లకు హైదరాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఈ సీజన్తో ఐపీఎల్లో అరంగేట్రం చేయాల్సిన ఈ ఆసీస్ ఆల్రౌండర్ ఇప్పుడు మరో సీజన్ దాకా వేచి ఉండక తప్పదు. అతడు కాలిపాదం గాయంతో సతమతమవుతున్నాడు. బిగ్బాష్ లీగ్లో విశేషంగా రాణించిన జాక్ (19 వికెట్లు; 133 పరుగులు) పెర్త్ వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. మొత్తమ్మీద ఆ్రస్టేలియన్ బౌలింగ్ దళాన్నే గాయాలు పట్టిపీడిస్తున్నాయి. ఎందుకంటే కమిన్స్, హాజల్వుడ్, స్టార్క్, ఎలిస్లు ఇదివరకే గాయాలతో ఆటకు దూరంగా ఉంటున్నారు. -
ఐపీఎల్పై సెలెక్టర్ల నజర్
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఈ సీజన్ ఐపీఎల్ టి20 టోర్నీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కానీ సెలక్టర్ల బృందం తాము ఎంపిక చేసిన ప్రపంచకప్ ప్రాబబుల్స్ సైన్యం ఆటతీరు కోసం ఎలా ఉంటుందోనని పర్యవేక్షించనుంది. పది ఫ్రాంచైజీలు 2026–ఐపీఎల్ ట్రోఫీపై కన్నేస్తే... ఐదుగురు జాతీయ సెలక్టర్లు మాత్రం 2027 వన్డే ప్రపంచకప్కు దీటైన జట్టును ఎంపిక చేసే పనిలో పడింది. ఐపీఎల్ టోర్నీ ఫార్మాట్... వరల్డ్కప్ ఫార్మాట్ వేరైనా... ఇప్పటికే సిద్ధం చేసుకున్న 20 మంది భారత ప్రపంచకప్ ప్రాబబుల్స్పై సెలక్షన్ కమిటీ కన్నేసింది. ఇందుకోసం వారం రోజుల్లో మొదలయ్యే మెరుపుల లీగ్పై ప్రతీ సెలక్టర్ ఉమ్మడి బాధ్యత తీసుకున్నట్లు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఈ బృందంలో శివసుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ప్రజ్ఞాన్ ఓజా సెలక్టర్లుగా ఉన్నారు. ఇప్పుడు వీరంతా తమ ప్రాబబుల్స్ జాబితాలోని ఆటగాడు ఆడే ఐపీఎల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించేందుకు స్టేడియానికి వెళ్లనున్నారు. ఇలా ఐదుగురు సెలక్టర్లు వారంలో ఐదు రోజులు ఇదేపనిపై ఉంటారు. వంతుల వారీగా ఒకరైతే తప్పనిసరిగా స్టేడియానికి వెళితే... మిగతా నలుగురు టీవీల్లో ప్రాబబుల్స్ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించనున్నారు. ఈ నెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)ల మధ్య జరిగే మ్యాచ్తో లీగ్ మొదలవుతుంది. పూర్తిస్థాయి జట్టుతో... ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు సొంతగడ్డపై అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇది ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా లేదు. డబ్ల్యూటీసీలో లేకపోయినా... ప్రత్యర్థి బలహీనమైన జట్టే అయినా సెలక్టర్లు పూర్తిస్థాయి టీమిండియానే బరిలోకి దించాలని భావిస్తున్నారు. సీనియర్లు, కీలకమైన ఆటగాళ్లెవరికీ విశ్రాంతి ఇవ్వకుండా అందరిని మైదానంలో ఆడించేందుకు సెలక్టర్లు సిద్ధమయ్యారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఎందుకంటే ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్కు ఇంకా 9 టెస్టులు మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో మేటి జట్లను ఎదుర్కొనేందుకు దీటుగా ప్రతీ మ్యాచ్ను సీరియస్గా తీసుకోవాలని సెలక్షన్ కమిటీ చూస్తోంది. దీంతో ప్రీమియం సీమర్ బుమ్రాతో పాటు టెస్టుల్లో రెగ్యులర్ బౌలరైనా హైదరాబాదీ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలను అఫ్గాన్తో టెస్టుకు ఎంపిక చేయనుంది. అగార్కర్ పొడిగింపు కోరలేదు సీనియర్ సెలక్షన్ కమిటీకి మాజీ సీమర్ అజిత్ అగార్కర్ చైర్మన్గా ఉన్నాడు. 2023, జూలైలో చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టిన అతని పదవీ కాలం ఈ సెపె్టంబర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు టి20 ప్రపంచకప్లకు విజయవంతమైన జట్లను ఎంపిక చేసిన అగార్కర్ పదవీ కాలం పొడిగింపు కోరినట్లు వార్తలు ఊపందుకున్నాయి. కానీ బోర్డు సీనియర్ అధికారి ఒకరు ఈ ఊహాగానాలను తొసిపుచ్చారు. అతని పదవీ కాలం ముగియలేదని, అప్పటి వరకు అతనే చీఫ్ సెలక్టర్ అని ఆ తర్వాతే అగార్కర్, బోర్డు కార్యదర్శి కలిసి ఓ నిర్ణయానికి వస్తారని ఆయన చెప్పారు. -
IPL 2026: వేలకోట్లు వదులుకున్న రాజస్థాన్
ఐపీఎల్ ప్రారంభ సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్కు గురి చేస్తోంది. ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను అమ్మకాలకు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్ రాయల్స్ కొలంబియా పసిఫిక్ క్యాపిటల్స్ పార్టనర్స్ (సీపీసీసీ) కన్సార్టియం నుంచి వచ్చిన 16 వేల కోట్లు (1.7 బిలియన్ డాలర్ల) బిడ్డింగ్ను వదులుకోవడం ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి రాజస్థాన్కు ఇప్పుడొచ్చిన బిడ్ మంచి ధరే అని చెప్పొచ్చు. కానీ ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తూ పెద్ద మొత్తంలో వచ్చిన బిడ్ను కాదనుకొని రాజస్థాన్ చేతులు కాల్చుకుంటుందని పలువురు క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా, కెనడాలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన సీపీసీసీ రాజస్థాన్ రాయల్స్ కోసం పెద్ద మొత్తంలో బిడ్ను దాఖలు చేయడం కొంత ఆశ్చర్యపరిచింది.రాజస్థాన్ ఫ్రాంచైజీలో ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ అధినేత మనోజ్ బదాలె వాటా 65 శాతం కాగా మిగతా వాటా రెడ్బర్డ్ క్యాపిటల్కు ఉంది. మరోవైపు ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో ముందు వరుసలో ఉండే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విలువ మాత్రం 20వేల కోట్లు దాటే అవకాశముంది. ఇప్పటికే ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రంజన్ పై సారథ్యంలోని కన్సార్టియం దాదాపు 2 బిలియన్ డాలర్లకు పైగానే బిడ్ను దాఖలు చేసింది. ఇక 2008లో ప్రారంభమైన ఐపీఎల్ తొలి సీజన్లో అండర్డాగ్స్గా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ గెలుచుకుంది. షేన్ వార్న్ సారధ్యంలోని జట్టులో రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, యూసఫ్ పఠాన్ సహా కీలక క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఇక ఆ తర్వాత రాజస్థాన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతూనే వచ్చింది. అయితే 2013 తర్వాత నుంచి రాజస్థాన్ కాస్త గాడిన పడింది. 2013లో ప్లేఆఫ్స్ చేరిన రాజస్థాన్ ఆ తర్వాత 2015, 2018 సీజన్లోనూ ప్లేఆఫ్స్ చేరింది. 2022లో శాంసన్ సారథ్యంలో రన్నరప్గా నిలిచింది. 2025 సీజన్లో రాజస్థాన్ 9వ స్థానంలో నిలిచి లీగ్ దశకే పరిమితమైంది.చదవండి: ‘మానసిక వేదన అనుభవిస్తున్నా’ -
‘సంజూకు మామయ్యలాంటి వాడిని’
భారత జట్టు స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను తర్వాతి ధోనీగా పోల్చాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. ఇటీవల తమ మధ్య జరిగిన ఒక సంభాషణలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు శశిథరూర్ వెల్లడించారు. అయితే సంజూ శాంసన్తో బంధం ఈనాటిది కాదని, అతడికి తాను మామయ్యలాంటి వాడినని తెలిపారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీలో 321 పరుగులు చేసిన శాంసన్ ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శశిథరూర్ సంజూ శాంసన్తో తనకున్న అనుబంధాన్ని, సంజూ విషయంలో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నాడు. ‘సంజూని మొదటిసారి 14 ఏళ్ల వయసులో చూశాను. ఆ సమయంలో అతడికి నేను ఎందుకో అంకుల్గా ఫీలయ్యాను. ఆ సమయంలోనే శాంసన్ టాలెంట్ స్పష్టంగా కనిపించింది. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ అసాధారణ ప్రతిభ ఉంది. అప్పుడు నేను నువ్వు తర్వాతి ధోనీ అవుతావని శాంసన్కు చెప్పాను. కానీ తర్వాత గంభీర్తో ఈ విషయమై చర్చకు వచ్చినప్పుడు, ఆయన ‘లేదండీ శాంసన్ తర్వాతి ధోనీ కాదు..వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసన్’ అని చెప్పినట్లు గుర్తుంది. ఇవాళ గంభీర్ మాటలు నిజమయ్యాయి.సంజూ మరెవరికీ ప్రతిరూపం కావాల్సిన అవసరం లేదు. అతడిని అతడిలానే ఉండనిద్దాం. సంజూ శాంసన్ ఎంతో వినయంగా ఉంటాడు.మంచి నాయకుడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ను సమర్థంగా నడిపించాడు. ఇప్పుడు చెన్నై జట్టులోనూ తనకంటే ప్రత్యేకతను సాధించుకుంటాడు. జట్టుకు అవసరమైనప్పుడు స్వార్థం లేకుండా ఆడతాడు. శతకం కోసం ఆడకుండా టీమ్ కోసం పెద్ద షాట్లు ఆడాడు. అదే అతని గొప్పతనం. శాంసన్ను అన్యాయంగా జట్టు నుంచి తప్పించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించడం అతని స్థిరత్వానికి నిదర్శనం. సంజూ శాంసన్కు మున్ముందు మరిన్ని అవకాశాలివ్వాలి. వన్డేల్లోనూ రెగ్యులర్గా ఆడించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది’ అని శశిథరూర్ వెల్లడించారు. ఇంతకాలం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్ ఈ సీజన్ నుంచి చెన్నై సూపర్కింగ్స్కు ఆడనున్నాడు. తన ఫెవరెట్ క్రికెటర్ అయిన ఎంఎస్ ధోనితో కలిసి ఆడనుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని శాంసన్ ఇటీవలే సీఎస్కే ప్రాక్టీస్లో జాయిన్ అయిన సందర్భంగా వెల్లడించాడు.చదవండి: 24 ఏళ్ల తర్వాత మ్యాచ్.. సంచలనం రిపీటయ్యేనా? -
మాజీ క్రికెటర్ ’రిటైర్మెంట్’.. బీసీసీఐపై సంచలన ఆరోపణలు
భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ కీలక ప్రకటన చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కామెంట్రీ ప్యానెల్ నుంచి వైదొలిగినట్లు తెలిపాడు. ఇకపై బీసీసీఐ కామెంట్రీలో తాను కనిపించబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు.శరీర రంగు నల్లగా ఉన్న కారణంగాఈ సందర్భంగా లక్ష్మణ్ శివరామకృష్ణన్ బీసీసీఐపై సంచలన ఆరోపణలు చేశాడు. తన శరీర రంగు నల్లగా ఉన్న కారణంగా వివక్ష చూపారని.. అందుకే తనకు తగినన్ని అవకాశాలు రాలేదని ఆరోపించాడు. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ శివరామకృష్ణన్ 1980వ దశకంలో టీమిండియాకు ఆడాడు.సంచలన ప్రదర్శనలుఅంతర్జాతీయ క్రికెట్లో తొమ్మిది టెస్టుల్లో 130 పరుగులు, 26 వికెట్లు తీసిన లక్ష్మణ్ శివరామకృష్ణన్.. 16 వన్డేలు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. టెస్టు అరంగేట్రంలో ఒక్క వికెట్ కూడా తీయని ఈ స్పిన్ బౌలర్.. 1984లో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఏకంగా 12 వికెట్లు తీసి జట్టును గెలిపించి వార్తల్లో నిలిచాడు.అంతేకాదు 1985లో ఆస్ట్రేలియా వేదికగా సునిల్ గావస్కర్ కెప్టెన్సీలో బెన్సన్ హెడ్జెస్ వరల్డ్ చాంపియన్షిప్ గెలవడంలోనూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్తో నాటి ఫైనల్లో ప్రత్యర్థిని 176 పరుగులకే కట్టడి చేయడంలో సహకరించి.. భారత్ విజయానికి కృషి చేశాడు.ఇక ఆటకు స్వస్తి పలికిన తర్వాత లక్ష్మణ్ శివరామకృష్ణన్ 2000 సంవత్సరంలో కామెంటేటర్గా కెరీర్ ఆరంభించాడు. ఐసీసీ క్రికెట్ కమిటీలో ప్లేయర్ రిప్రజెంటేటివ్గానూ పనిచేశాడు. ఈ క్రమంలో శుక్రవారం కామెంట్రీకి రిటైర్మెంట్ ప్రకటిస్తూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా చర్చకు తెరలేపాడు.శాస్త్రి కోచ్గా ఉన్న సమయంలోనూ‘‘బీసీసీఐ కామెంట్రీకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. 23 ఏళ్ల కాలంలో టాస్లు వేయడానికి, ప్రెజెంటేషన్ ఇవ్వడానికి నేను పనికిరాలేదు. కానీ కొత్త వాళ్లు వచ్చి పిచ్ రిపోర్టులు ఇస్తూ. టాస్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. శాస్త్రి కోచ్గా ఉన్న సమయంలోనూ నాకు అవకాశం రాలేదు. దీనికి కారణం ఏమనుకుంటున్నారు?’’ అంటూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ వరుసగా ట్వీట్లు చేశాడు.వర్ణ వివక్షఇందుకు ఓ నెటిజన్.. ‘‘మీరు రంగు తక్కువ కాబట్టి’’ అని కామెంట్ చేయగా.. ‘‘సరిగ్గా చెప్పారు’’ అని శివరామకృష్ణన్ సమాధానం ఇచ్చాడు. మరో నెటిజన్ కూడా ఇలాగే కామెంట్ చేయగా.. ‘‘అవును.. మీరు చెప్పింది నిజం. వర్ణ వివక్ష’’ అని పేర్కొన్నాడు. అయితే, మరికొంత మంది మాత్రం ఉన్నన్ని రోజులు బోర్డును వాడుకుని.. ఇలా నిందించడం కొందరికి అలవాటేనంటూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ను విమర్శించారు.అవునా?ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా లక్ష్మణ్ శివరామకృష్ణన్ పోస్ట్పై స్పందించాడు. ‘‘ఓహ్.. ఇలా ఎందుకు? ఈసారి ఐపీఎల్కు ముందే ఎందుకిలా?’’ అని కామెంట్ చేశాడు. అయితే, అశూ వ్యంగ్యంగానే ఇలా స్పందించాడని అభిమానులు అంటున్నారు. గతంలో అశూను లక్ష్మణ్ శివరామకృష్ణన్ విమర్శిస్తూ పోస్ట్ పెట్టాడు. అశ్విన్ భారత్లో మాత్రమే రాణించగలడని.. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి బౌలింగ్ రికార్డు ఘోరంగా ఉందంటూ విమర్శించాడు.చదవండి: అతడికి ఆ అవసరం లేదు: బీసీసీఐ -
జట్టులో చోటుకే దిక్కులేదు.. కెప్టెన్ను చేయాలా?
పాకిస్తాన్ పేస్ దళ నాయకుడిగా పేరొందిన షాహిన్ ఆఫ్రిదిపై విమర్శల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026లో పేలవ ప్రదర్శన, వన్డే కెప్టెన్గా బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమి ఇందుకు తాజా కారణాలు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 103 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్ 136 వికెట్లు కూల్చాడు.తద్వారా పాక్ తరఫున పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా షాహిన్ ఆఫ్రిది కొనసాగుతున్నాడు. అయితే, గత కొంతకాలంగా అతడి ఆట మరీ దిగజారింది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్ టోర్నీలో మొత్తంగా ఎనిమిది వికెట్లు మాత్రమే తీయగలిగాడు.పదకొండేళ్ల తర్వాతఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో పాక్ వన్డే జట్టుగా బాధ్యతలు నిర్వర్తించిన షాహిన్ ఆఫ్రిది.. 2-1 తేడాతో పాక్ సిరీస్ కోల్పోవడంతో విమర్శల పాలయ్యాడు. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత పాక్ బంగ్లాకు వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి కావడంతో విమర్శలు పదునెక్కాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సైతం షాహిన్ ఆఫ్రిది ఆట తీరుపై మండిపడ్డాడు.జట్టులో చోటుకే దిక్కులేదు‘‘పాకిస్తాన్ టీ20, వన్డే జట్ల కెప్టెన్గా షాహిన్ ఆఫ్రిది ఉండాలని గతంలో క్యాంపెయిన్ నడిచింది. ఆ తర్వాత వన్డేలకు బదులు టీ20 జట్టుకు కెప్టెన్ అయితే చాలు అన్నారు. కానీ ఇప్పుడు వన్డే కెప్టెన్గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు.నిజానికి పాక్ టీ20 జట్టులో అతడికి చోటు కూడా ఇవ్వొద్దు. ముఖ్యంగా తుదిజట్టులో ఉండే అర్హత అతడు కోల్పోయాడు. అతడి ఖేల్ ఖతమైపోయింది’’ అని రషీద్ లతీఫ్ షాహిన్ ఆఫ్రిదిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.మామ అలామరోవైపు.. బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత షాహిన్ ఆఫ్రిది మామ, మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ.. సెలక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్, బంగ్లా సిరీస్లో ఓటముల నేపథ్యంలో విమర్శలకు సెలక్టర్లు అర్హులేనని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. ఏ ఫార్మాట్కు ఎవరిని కెప్టెన్ చేయాలో తెలియదంటూ మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ పైవిధంగా స్పందించడం గమనార్హం.చదవండి: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు! -
24 ఏళ్ల తర్వాత మ్యాచ్.. సంచలనం రిపీటయ్యేనా?
భారత మహిళల జట్టు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడనుండడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే 24 ఏళ్ల కిందట మహిళల జట్టు సౌతాఫ్రికాలో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. మరి 2002లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియా మహిళలు మరోసారి ఆ సీన్ను రిపీట్ చేస్తారా లేదా అన్నది చూడాలంటే డిసెంబర్ 20 వరకు ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా శుక్రవారం భారత మహిళల జట్టు పర్యటనకు సంబం ధించిన వన్డేలు, ఏకైక టెస్టు మ్యాచ్కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. సఫారీల పర్యటనలో తొలుత సౌతాఫ్రికా ఎమర్జింగ్ టీమ్తో హర్మన్ బృందం వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత డిసెంబర్ 9 నుంచి 15 మధ్య మూడు వన్డేలు, ఆ తర్వాత డిసెంబర్ 20 నుంచి 23 మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్కు ముందే టీ20 ప్రపంచకప్ సన్నాహకంగా వచ్చే నెలలో సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. మహిళల టీ20 ప్రపంచకప్ ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరగనుంది.2002లో మార్చి 19 నుంచి 22 వరకు పార్ల్ వేదికగా జరిగిన ఆనాటి మ్యాచ్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ను భారత్ 9 వికెట్ల నష్టానికి 404 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో అంజూ జైన్ (52), కెప్టెన్ అంజుమ్ చోప్రా (80), మిథాలీరాజ్ (55), హేమలతా కలా (64), మమతా మబెన్ (50) అర్థసెంచరీలతో రాణించారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపా మరాతే 3 వికెట్లు తీయగా, నీతూ డేవిడ్ 2 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత ఫాలోఆన్ ఆడిన సౌతాఫ్రికా జట్టు 266 పరుగుల వద్ద ఆలౌటైంది. జులన్ గోస్వామి, హేమలతా కలా చెరో 3 వికెట్లతో రాణించారు. ఆ తర్వాత 13 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 1.3 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా ఛేదించి విజయాన్ని అందుకుంది.సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు పర్యటన వివరాలు..డిసెంబర్ 6: సౌతాఫ్రికా ఎమర్జింగ్ జట్టుతో వార్మప్మ్యాచ్డిసెంబర్ 9: తొలి వన్డే, పోచెఫ్స్ట్రూమ్డిసెంబర్ 12: రెండో వన్డే, బ్లోమ్ఫోంటైన్డిసెంబర్ 15: మూడో వన్డే, కేప్టౌన్డిసెంబర్ 20-23: ఏకైక టెస్టు మ్యాచ్, గెబెర్హాచదవండి: ‘అతడి వెంటపడొద్దు.. స్వేచ్ఛనివ్వండి’ -
టీమిండియా అభిమానులకు పండుగే పండుగ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని విజయవంతంగా ముగించుకున్న భారత ఆటగాళ్లు తదుపరి ఐపీఎల్ పందొమ్మిదో ఎడిషన్తో బిజీ కానున్నారు. మార్చి 28న ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. ఇక ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత జూన్ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య సిరీస్ జరుగుతుంది.ముందుగా ఐర్లాండ్ టూర్కు!ఇందులో భాగంగా భారత్- అఫ్గన్ జట్లు ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడతాయి. అనంతరం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు భారత జట్టు ఐర్లాండ్ టూర్కు వెళ్లనున్నట్లు సమాచారం.ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రాహమ్ వెస్ట్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుందని సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఐర్లాండ్ కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకుండానే నిష్క్రమించింది.మంచి బూస్ట్ఇందుకు బాధ్యత వహిస్తూ పాల్ స్టెర్లింగ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో.. ‘‘టీ20 ప్రపంచకప్-2028 సన్నాహకాల్లో భాగంగా పాల్ స్టెర్లింగ్ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో వచ్చే కొత్త కెప్టెన్కు జూన్లో టీమిండియాతో జరిగే సిరీస్తో మంచి బూస్ట్ లభిస్తుంది’’ అని గ్రాహమ్ వెస్ట్ ప్రకటన విడుదల చేశాడు. తద్వారా భారత్- ఐర్లాండ్ సిరీస్ విషయాన్ని ఖరారు చేశాడు.కాగా గత ఏడేళ్లలో ఇప్పటి వరకు టీమిండియా ఐర్లాండ్లో మూడుసార్లు (2018, 2022, 2023)లో పర్యటించింది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్ ముగించుకున్న తర్వాత టీమిండియా జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్ ఖరారైంది. జూలై 1- 19 వరకు ఇరుజట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు నిర్వహించాలని నిర్ణయించారు.మరింత బిజీగాఅయితే, తాజాగా ఐర్లాండ్ టూర్తో భారత జట్టు షెడ్యూల్ మరింత బిజీగా మారింది. దీంతో తమకు ఈ ఏడాదంతా పండుగేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా స్వదేశంలో మొట్టమొదటిసారి, వరుసగా రెండోసారి, ఓవరాల్గా మూడోసారి టీ20 వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్లిస్ట్ చేసిన బీసీసీఐ? -
‘అతడి వెంటపడొద్దు.. స్వేచ్ఛనివ్వండి’
వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. పసిప్రాయంలోనే దూకుడైన ఇన్నింగ్స్లతో ప్రత్యర్థులను వణికించిన 15 ఏళ్ల సూర్యవంశీ ఏడాది కాలంగా అండర్-19 క్రికెట్లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవలే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 175 పరుగుల సంచలన ఇన్నింగ్స్ అతడి అసాధారణ ప్రతిభకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంతకాలం అండర్-19 క్రికెట్లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ ఇక ఐపీఎల్లో తన మెరుపులు చూపించేందుకు సమాయ త్తమవుతున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సూర్యవంశీపై ఈసారి భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కెప్టెన్గా ప్రమోషన్ పొందిన రియాన్ పరాగ్ వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘ఏడాది కాలంగా తిరుగులేని ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిలో పడ్డాడు. ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడ భారీ స్కోర్లు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఐపీఎల్ ద్వారా వైభవ్ కొత్తగా నిరూపించుకోవాల్సిన పని లేదు. అలాంటి యంగ్ ఓపెనర్ మా జట్టులో ఉండడం మాకు కొండంత బలం. ఇటీవలే అండర్-19 ప్రపంచకప్లో సూర్యవంశీ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్లే అందుకు నిదర్శనం. ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉండడం సహజమే. కానీ కెప్టెన్గా వైభవ్కు నేను ఇచ్చే సలహా ఒక్కటే. అందరి దృష్టి తన మీదే ఉండడంతో మీడియా అటెన్షన్ ఉంటుంది. అందుకే మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ అతడు తన ఆటను ఎంజాయ్ చేస్తూ ఆడితే బాగుంటుంది. అతడికింకా 15-16 ఏళ్లు మాత్రమే. అందుకే సూర్యవంశీని తన ఆటను స్వేచ్ఛగా ఆడనిద్దాం. జట్టుగా అతడిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం మా బాధ్యత. సంచలన ఇన్నింగ్స్లతో దేశానికి గర్వకారణంగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లోనూ అదరగొట్టాలని ఆశిస్తున్నా’ అని పరాగ్ చెప్పుకొచ్చాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర మాట్లాడుతూ.. ‘బ్యాటర్లు, బౌలర్లు, ఆల్రౌండర్ల సమతూకంతో మా జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తోంది. ఈసారి కచ్చితంగా టైటిల్ కొట్టేందుకే అహర్నిశలు శ్రమించనున్నాం’ అని తెలిపాడు. కాగా గతేడాది వరకు రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన సంజూ శాంసన్ ట్రేడింగ్లో చెన్నై సూపర్కింగ్స్కు వెళ్లిపోవడంతో రియాన్ పరాగ్ రాజస్థాన్ నూతన కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు. శాంసన్ స్థానంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్లు చెన్నై నుంచి రాజస్థాన్కు వచ్చారు.చదవండి: ఇరాన్కు షాకిచ్చిన ఫిఫా! -
అతడికి ఆ అవసరం లేదు: బీసీసీఐ
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరికొంత కాలం తనను కొనసాగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి అతడు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. వన్డే వరల్డ్కప్-2027 వరకు తానే చీఫ్ సెలక్టర్గా ఉంటానని అగార్కర్ కోరినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.అతడికి ఆ అవసరం లేదుఈ అంశంపై బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. అగార్కర్ తమ వద్ద ఇలాంటి ప్రతిపాదన తేలేదని కొట్టిపారేశారు. PTIతో మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్ ప్యానెల్లోని సబ్ కమిటీతో సహా సెలక్టర్లందరి కాంట్రాక్టు ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉంది.అజిత్ కాంట్రాక్టు కూడా సెప్టెంబరులోనే ముగుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి, అజిత్ కలిసి చర్చించిన తర్వాతే.. అజిత్ వన్డే వరల్డ్కప్-2027 వరకు కొనసాగుతాడా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుంది.బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ సెలక్టర్ నాలుగు ఏళ్ల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి అతడు తన పదవీకాలాన్ని పొడిగించాలని అభ్యర్థించాల్సిన అవసరం పెద్దగా ఉండదు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా 2023, జూన్లో మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టాడు.సాహసోపేత నిర్ణయాలు సెలక్షన్ కమిటీ చైర్మన్గా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అజిత్ అగార్కర్ తనదైన ముద్ర వేయగలుగుతున్నాడు. అతడి హయాంలో టీమిండియా 2023 వన్డే వరల్డ్కప్ టోర్నీలో రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఆసియా టీ20 కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ.. తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లను భారత్ గెలుచుకుంది.ఇక అజిత్ అగార్కర్కు తోడుగా హెడ్కోచ్గా మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వచ్చాక.. నాయకత్వ బృందంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీ20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను కాదని.. సూర్యకుమార్ యాదవ్ను నియమించగా.. అతడు 2026లో వరల్డ్కప్ గెలిచాడు. సీనియర్ల రిటైర్మెంట్ఇక వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించగా ఇంత వరకు మూడింట ఒక్క సిరీస్ కూడా అతడు గెలవలేకపోయాడు. మరోవైపు.. ఈ జోడీ హయాంలోనే దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్కు వీడ్కోలు పలకగా.. బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక 2024లో వరల్డ్కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన రో-కో.. ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నారు. వీరిద్దరు వన్డే వరల్డ్కప్-2027 వరకు ఆడతామని సంకేతాలు ఇవ్వగా.. అగార్కర్ మాత్రం ఈ విషయంలో తమకు స్పష్టత లేదని చెప్పడం గమనార్హం.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్లిస్ట్ చేసిన బీసీసీఐ? -
అదరగొట్టిన ఓపెనర్.. కివీస్ ఘన విజయం
సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను అందుకుంది. ఓపెనర్ టామ్ లాథమ్ (55 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) యాంకర్ రోల్ పోషించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ప్రొటీస్ బ్యాటర్లలో టెయిలెండర్ కొబాని మొకినా (26 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా, జార్జ్ లిండే (23) పర్వాలేదనిపించాడు. అయితే సౌతాఫ్రికా టాపార్డర్, మిడిలార్డర్ పూర్తిగా విఫలం కావడంతో సఫారీలు సాధారణ స్కోరుకే పరిమితమయ్యారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అయితే తొలి రెండు టీ20 మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఛేదనలో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. కాన్వే, టామ్ లాథమ్లు తొలి వికెట్కు 96 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత కాన్వే ఔటైనా లాథమ్ చివరి వరకు నిలిచి జట్టుకు స్పష్టమైన విజయాన్ని అందించాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన లోకీ ఫెర్గూసన్ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.ఈ మ్యాచ్ విజయంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.చదవండి: IPL 2026: బోల్తా కొట్టిన విరాట్ కోహ్లీ! -
IPL 2026: బోల్తా కొట్టిన విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లోని ఆయా జట్లు ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నాయి. మార్చి 28న జరగనున్న సీజన్ ఆరంభ మ్యాచ్లోనే డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో తలపడనుంది. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇప్పటికే లండన్ నుంచి భారత్ చేరుకొని తన ప్రాక్టీస్ను మొదలుపెట్టాడు. తాజాగా ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన యార్కర్ బంతికి కోహ్లీ వద్ద సమాధానం లేకుండా పోయింది. 36 ఏళ్ల వయసులోనూ బంతిని స్వింగ్ చేయడంలో తన పదును చూపెడుతున్నాడు. భువీ వేసిన అద్భుత యార్కర్ కోహ్లీ లెగ్స్టంప్ను తాకుతూ వెళ్లింది. దీంతో అదుపు తప్పిన కోహ్లీ పక్కకు పడిపోగా బంతి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో షాక్ తిన్న కోహ్లీ ‘వాట్ ఏ బాల్ భువీ’ అంటూ పేర్కొన్నాడు. దీనికి భువనేశ్వర్ నవ్వుతోనే రియాక్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒక అభిమాని తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసుకోవడంతో వైరల్గా మారింది. గతేడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కోహ్లీతో పాటు భువనేశ్వర్ కూడా కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్లో కోహ్లీ 15 ఇన్నింగ్స్ల్లో 657 పరుగులు సాధించగా.. భువనేశ్వర్ 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లోనూ ఈ ఇద్దరు సీనియర్లు ఆర్సీబీకి కీలకం కానున్నారు. బ్యాటింగ్లో కోహ్లీ పెద్దన్న పాత్ర పోషించనుండగా.. బౌలింగ్ దళాన్ని భువనేశ్వర్ నడిపించనున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉండడనున్నాడు. మరోవైపు భారత బౌలర్ యశ్ దయాల్ విషయంలో కూడా స్పష్టత లేదు. దీంతో రషీక్ సలామ్, మంగేశ్ యాదవ్లకు భువనేశ్వర్ మెంటార్గా కూడా వ్యవహరించే అవకాశముంది. ఐపీఎల్ 2025 మెగావేలంలో భువనేశ్వర్ కుమార్ను ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.This yorker from Bhuvneshwar Kumar completely beat Virat Kohli.🫡In the last two years, Bhuvneshwar Kumar’s name has gone a bit down, but maybe in this IPL he will definitely do something special.🙌 pic.twitter.com/L0bF9BsR0Z— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 19, 2026చదవండి: ODI WC: బీసీసీఐ బిగ్ ప్లాన్.. షార్ట్లిస్టులో ఇరవై పేర్లు! -
ODI WC: బీసీసీఐ బిగ్ ప్లాన్.. షార్ట్లిస్టులో ఇరవై పేర్లు!
ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా 2024 నుంచి ఏకంగా మూడు టైటిళ్లు గెలిచింది. టీ20 ప్రపంచకప్-2024, చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026లలో చాంపియన్గా నిలిచింది. తదుపరి వన్డే వరల్డ్కప్-2027 టోర్నీ రూపంలో మరో ఐసీసీ ఈవెంట్ వేచి ఉంది.షార్ట్లిస్టులో ఇరవై పేర్లు!ఈ మెగా టోర్నీకి దాదాపు పద్దెనిమిది నెలలకు పైగానే సమయం ఉంది. అయినప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటి నుంచే జట్టు ఎంపికపై దృష్టి సారించింది. ఇప్పటికే దాదాపు ఇరవై మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 ప్రదర్శన కూడా ఇందులో కీలకం కానున్నట్లు సమాచారం.ప్రణాళికలు సిద్ధంచీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా ఎస్ఎస్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ప్రజ్ఞాన్ ఓజా ఇందుకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క సెలక్టర్ ఐపీఎల్లో వారానికి ఒక్క మ్యాచ్ అయినా ప్రత్యక్షంగా చూసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉంది.తద్వారా వారానికి ఐదు మ్యాచ్లు కవర్ అవుతాయి. ఇక టీవీలోనూ మ్యాచ్లు వీక్షించడం ద్వారా ఆటగాళ్ల ఫామ్పై సెలక్టర్లు ఓ అంచనాకు వస్తారు’’ అని పేర్కొన్నాయి. కాగా టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలపై సెలక్టర్లు ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది.వారికి చోటు ఉందా?ఐపీఎల్లో కోహ్లి బెంగళూరు జట్టు తరఫున, రోహిత్ ముంబై తరఫున కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20లకు స్వస్తి పలికిన రో-కోలకు ఈసారి ఐపీఎల్ అత్యంత కీలకం కానుంది. గతేడాది దేశీ వన్డే క్రికెట్ బరిలో దిగిన ఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటారు. ఆ తర్వాత టీమిండియా తరఫునా అదరగొట్టారు. తద్వారా తాము వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. అయితే, సెలక్టర్లు వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.చదవండి: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు! -
పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు!
టీ20 ప్రపంచకప్-2026 సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి మద్దతుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్ను తొలగించడంతో.. భారత్లో జరిగే తమ ప్రపంచకప్ మ్యాచ్లు ఆడమని బీసీబీ మొండికేసింది.భద్రతా కారణాలు సాకుగా..ఇందుకు భద్రతా కారణాలు సాకుగా చూపుతూ వేదికను మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేయగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిరాకరించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే, ఈ విషయంలో తాము బంగ్లాకు మద్దతుగా టోర్నీని బాయ్కాట్ చేస్తామని నాటకాలాడిన పాక్.. తర్వాత భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది.బంగ్లాదేశ్ సహా ఇతర బోర్డుల నుంచి ఒత్తిడి, ఐసీసీ హెచ్చరికలతో పాక్ యూటర్న్ తీసుకుంది. భారత్తో కూడా మ్యాచ్ ఆడి.. అందులో ఓడి సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) షెడ్యూల్ను పాక్ బోర్డు ప్రకటించింది.ఎన్ఓసీ ఇచ్చినా..ఇక బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హొసేన్ ఇమాన్ (లాహోర్ ఖలందర్స్), షోరిఫుల్ ఇస్లాం, నహీద్ రాణా, తాంజిద్ హసన్ తమీమ్, రిషాద్ హొసేన్ (పెషావర్ జల్మీ) పీఎస్ఎల్ వేలంలో అమ్ముడుపోయారు. అయితే, వీరికి బంగ్లా బోర్డు పీఎస్ఎల్లో ఆడేందుకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చినప్పటికీ ఓ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.పాకిస్తాన్ ఇటీవల అఫ్గనిస్తాన్పై వైమానిక దాడులు చేయగా.. సుమారుగా 400 మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీసీబీ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే తమ ప్లేయర్లను పాకిస్తాన్కు పంపాలా లేదా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది.ప్రభుత్వం చెప్పినట్లే వింటాముఈ విషయం గురించి బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ నజ్ముల్ అబెదిన్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్కు ఆటగాళ్లను పంపే విషయంలో మేము ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు పూర్తిగా తెలియదు. అందుకే ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాము’’ అని పేర్కొన్నాడు. తమ ఆటగాళ్ల భద్రతే అన్నిటికంటే ముఖ్యమని పేర్కొన్నాడు.కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం పీఎస్ఎల్లో ఆడేందుకు వెళ్లే తమ ఆటగాళ్లను భద్రత విషయమై హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ విదేశీ ఆటగాళ్లు దూరమైతే పీఎస్ఎల్కు ఉన్న ఆ మాత్రం ఆదరణ కూడా కరువయ్యే అవకాశం ఉంది.చదవండి: IPL 2026: 'గొప్ప క్రికెటరేమి కాదు.. అతడికెందుకు రూ.25 కోట్లు' -
తండ్రైన ఆర్సీబీ కెప్టెన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజిత్ పాటిదార్ తొలిసారి తండ్రయ్యాడు. అతడి భార్య గుంజన్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను పాటిదార్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.దీంతో పాటిదార్ దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా యాదృచ్చికంగా ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ కూడా గురువారమే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాకుండా డికే, పాటిదార్ బర్త్డేలు కూడా ఒకే రోజు కావడం విశేషం.ఇక మధ్యప్రదేశ్కు చెందిన పాటిదార్ను ఆర్సీబీ గతేడాది తమ జట్టు కెప్టెన్గా నియమించింది. అయితే కెప్టెన్గా తొలి సీజన్లోనే ట్రోఫీని అందించి.. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనున్న ఆర్సీబీని మరోసారి విజేతగా నిలపాలని పాటిదార్ ఉవ్విళ్లూరుతున్నాడు.బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ శిబరాన్ని నిర్వహిస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి జట్టుతో చేరాడు. ఆర్సీబీ తమ తొలి మ్యాచ్లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. అయితే ఈ ఏడాది సీజన్కు ముందు ఆర్సీబీని గాయల బెడద వెంటాడుతోంది. స్టార్ పేసర్లు జోష్ హాజిల్వుడ్, నువాన్ తుషారా అందుబాటుపై ఇంకా క్లారిటీ లేదు.చదవండి: IPL 2026: 'గొప్ప క్రికెటరేమి కాదు.. అతడికెందుకు రూ.25 కోట్లు' -
'గొప్ప క్రికెటరేమి కాదు.. అతడికెందుకు రూ.25 కోట్లు'
ఐపీఎల్-2026 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామోరాన్ గ్రీన్పై కాసుల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. గ్రీన్ను కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.25.5 కోట్ల భారీ ధర వెచ్చించి మరి సొంతం చేసుకుంది. దీంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది.ఈ ఏడాది సీజన్లో గ్రీన్ ఎలా రాణిస్తాడో అని ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గ్రీన్ను అంత భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయడాన్ని బద్రీనాథ్ తప్పుబట్టాడు.కేవలం హైప్ వల్లే గ్రీన్ అంత భారీ ధరకు అమ్ముడయ్యాడని, అంతే తప్ప అతడేమి పెద్ద క్రికెటర్ కాదని ఈ సీఎస్కే మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. కాగా గ్రీన్ ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. యాషెస్ సిరీస్తో పాటు ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లోనూ గ్రీన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ఈ నేపథ్యంలో బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "గ్రీన్ను వేలంలో రూ.25 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అతడేమో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా తరపున అతడు ఎలా ఆడాడో చూశాం.కేవలం అతడిపై ఉన్న హైప్ కారణంగానే అంత భారీ ధరకు అమ్ముడయ్యాడు. వాస్తవానికి అతడు అంత విలువైన క్రికెటర్ కాదు. ఐపీఎల్లో అతడు ఒంటిచేత్తో గెలిపించిన మ్యాచ్ ఒక్కటైనా ఉందా? ఆస్ట్రేలియా ఆటగాళ్లపై ప్రతీసారి అనవసరమైన హైప్ సృష్టిస్తారు. ఇప్పుడు గ్రీన్ విషయంలో కూడా అదే జరిగింది. కేకేఆర్ మాత్రం అతడిపై అంత భారీ మొత్తాన్ని వెచ్చించి తప్పు చేసింది అని పేర్కొన్నాడు. కాగా గ్రీన్ గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. అయితే గాయం కారణంగా గత సీజన్కు గ్రీన్ దూరమయ్యాడు. తర్వాత తన పునరాగమనంలో గ్రీన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక ఐపీఎల్-19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IPL 2026: 'సెహ్వాగ్ను చూసి నేర్చుకో'.. అభిషేక్కు కుంబ్లే వార్నింగ్ -
ఢిల్లీ క్యాపిటల్స్కు ఊహించని షాక్
ఐపీఎల్-2026 సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది సీజన్ ఫస్ట్ హాఫ్కు ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతడు సెకెండ్ హాఫ్లో ఢిల్లీ జట్టుతో చేరనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియా రాబోయే 12 నెలల్లో దాదాపు 21 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అదేవిధంగా వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ జరగనుంది.దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రధాన పేసర్లను లీగ్ క్రికెట్లో ఎక్కువగా ఆడించి రిస్క్ తీసుకూడదని భావిస్తుందంట. ఈ కారణంతో అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది సీజన్కు ముందు స్టార్క్ను రూ.11.75 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది.కానీ అతడు ఇప్పుడు అందుబాటులో లేకపోవడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయితే ఢిల్లీ జట్టులో లుంగి ఎంగిడీ, కైల్ జేమీసన్, దుష్మంత చమీర వంటి స్టార్ పేసర్లు ఉండడం కాస్త ఉపశమనం కలిగించే ఆంశంగా చెప్పుకోవాలి. కాగా స్టార్క్ ఏప్రిల్ మూడో వారం నాటికి జట్టుతో చేరే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు.మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్, సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ జట్టును నడిపించనున్నాడు. ఆర్సీబీ స్పీడ్ స్టార్ జోష్ హాజిల్వుడ్ అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుబ్యాటర్లు: కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతుమ్ నిస్సాంక, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, ఔకిబ్ దార్, నితీష్ రాణాబౌలర్లు: మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, లుంగి ఎన్గిడి, కైల్ జేమీసన్, కుల్దీప్ యాదవ్చదవండి: IPL 2026: 'సెహ్వాగ్ను చూసి నేర్చుకో'.. అభిషేక్కు కుంబ్లే వార్నింగ్ -
యుద్ధం ఎఫెక్ట్.. ఇంగ్లండ్లో బంతుల కొరత!
మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ఈ యుద్ద ప్రభావం ఊహించని విధంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుపై పడింది. మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్కు 'డ్యూక్స్' (Dukes) బంతుల కొరత ఏర్పడింది.ఇంగ్లండ్లో జరిగే కౌంటీ ఛాంపియన్షిప్, అంతర్జాతీయ టెస్టు సిరీస్లలో డ్యూక్స్ బంతులను మాత్రమే ఉపయోగిస్తారు. అయితే ఏప్రిల్ 3 నుంచి కౌంటీ సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆయా క్లబ్ల వద్ద ఉండాల్సిన స్టాక్లో కేవలం 50 శాతం బంతులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఈ డ్యూక్స్ బంతులు దక్షిణాసియా దేశాలనైన భారత్, పాకిస్తాన్లో తాయారు అవుతాయి. అయితే మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం కారణంగా దక్షిణాసియాలో తయారైన బంతులు ఇంగ్లండ్కు చేరడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో కౌంటీ జట్ల పరిమిత సంఖ్యలో మాత్రమే బంతులు ఉన్నాయి. అయితే ఈ సంక్షోభంపై తయారీదారు బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ సంస్థ యజమాని దిలీప్ జజోడియా స్పందించారు."ఈ గల్ఫ్ యుద్దం కారణంగా మేము పెద్ద సంక్షోభంలో చిక్కుకున్నాము. సీజన్ ప్రారంభంలో క్లబ్లకు 50 శాతం బంతులను మాత్రమే ఇచ్చి, మిగిలినవి తర్వాత అందజేయాల్సి వస్తోంది. ఉపఖండంలోని ఫ్యాక్టరీలలో బంతులు సిద్దంగా ఉన్నా.. రవాణా చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. విమానయాన సంస్థలు సరుకు రవాణా చేయడానికి ముందుకు రావడం లేదు. రవాణా ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి. సాధారణంగా 120 బంతుల బాక్స్కు కిలోకు 5 డాలర్లు ఛార్జ్ చేసేవారు. కానీ ఇప్పుడు కిలోకు 15 డాలర్లు అడుగుతున్నారు. మధ్యప్రాచ్యం గుండా సరుకులు రవాణా చేయడం పెద్ద సమస్యగా మారింది" అని జజోడియా పేర్కొన్నాయి. ఒకవేళ సంక్షోభం మరింత ముదిరితే ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాకు చెందిన 'కూకబుర్రా' బంతులను వాడాల్సి రావచ్చు.చదవండి: T20 WC: వరల్డ్ కప్లో జట్టు ఫెయిల్.. కెప్టెన్ సంచలన నిర్ణయం! -
'సెహ్వాగ్ను చూసి నేర్చుకో'.. అభిషేక్కు కుంబ్లే వార్నింగ్
ఐపీఎల్-2026 సీజన్ మరో వారం రోజుల్లో షురూ కానుంది. మార్చి 28న ఆరంభ మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ తీరుపై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అభిషేక్ తన దూకుడుకు కాస్త 'నిలకడ'ను తోడు చేస్తే మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో తిరుగులేని ఆటగాడిగా ఎదుగుతాడని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. కాగా 25 ఏళ్ల అభిషేక్ శర్మ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నెం1 బ్యాటర్ కొనసాగుతున్నాడు.అయితే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్లలో అతడు కేవలం 141 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తనకు కలిసొచ్చిన ఐపీఎల్లో సత్తాచాటాలని అభిషేక్ ఉవ్విళ్లూరుతున్నాడు."అభిషేక్ను వీరేంద్ర సెహ్వాగ్ వంటి లెజెండరీ ఆటగాడితో పోల్చాలనుకుంటున్నాను. ఎందుకంటే సెహ్వాగ్ కూడా ప్రతీ బంతినీ బాదడానికే చూసేవాడు. ఇప్పుడు అభిషేక్ కూడా అదే చేస్తున్నాడు. అయితే సెహ్వాగ్ క్రమంగా తన ఆట తీరులో మార్పు చేసుకున్నాడు.టెస్టు నుంచి వన్డేలకు, ఆపై టీ20ల్లో ఆడేటప్పుడు.. ఇన్నింగ్స్ను ఎలా నిర్మించాలో అతడు గ్రహించాడు. అయినప్పటికీ సెహ్వాగ్ 140–150 స్ట్రైక్ రేటుతోనే బ్యాటింగ్ చేసేవాడు. కాబట్టి అభిషేక్ ఇప్పుడు అదే బాటలో నడవాలి. అభిషేక్ 200, ఆపై 300 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు.కేవలం దూకుండా ఆడి అవుట్ అవ్వడం కంటే, ఎక్కువ బంతులు ఆడి క్రీజులో గడపడం ముఖ్యం. అభిషేక్ శర్మ క్రీజులో కనీసం 20 బంతులు ఆడితే, అతడు ఖచ్చితంగా 50 పరుగుల మార్కుకు చేరుకుంటాడని మనకు తెలుసు. సంజూ శాంసన్ విషయంలో కూడా మనం అదే చూశాం. అతడు 40, 50 పరుగుల వద్ద అవుట్ కాకుండా, ఎక్కువ సేపు క్రీజులో నిలబడి 85-90 రన్స్ చేసి జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అభిషేక్ కూడా అదే చేయాలి. టీ20 ఫార్మాట్లో జట్టుకు కావాల్సింది అదే. ఈ సీజన్లో అభిషేక్లో తన ఆట తీరును మార్చుకుంటాడని ఆశిస్తున్నా" అని జియో స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్ -
వరల్డ్ కప్లో జట్టు ఫెయిల్.. కెప్టెన్ సంచలన నిర్ణయం!
ఐర్లాండ్ కెప్టెన్, వెటరన్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐరీష్ జట్టు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు స్టిర్లింగ్ ప్రకటించాడు. జట్టు దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగనప్పటికి వన్డేల్లో మాత్రం సారథిగా స్టిర్లింగ్ కొనసాగనున్నాడు.అతడు చివరగా టీ20 ప్రపంచకప్-2026లో ఐరీష్ జట్టును నడిపించాడు. 35 ఏళ్ల స్టిర్లింగ్ ఈ మెగా టోర్నీలో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మోకాలి గాయానికి గురైన స్టిర్లింగ్.. టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించాడు. ఇప్పుడు టక్కర్ లేదా హ్యారీ టెక్టర్ ఐర్లాండ్ టీ20 జట్టు బాధ్యతలను చేపట్టే అవకాశముంది. కాగా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో ఐర్లాండ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. కేవలం ఒకే ఒక్క విజయం సాధించి టోర్నీని ముగించింది. స్టిర్లింగ్ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నప్పటికి ఐర్లాండ్ టీ20 జట్టులో సభ్యునిగా మాత్రం కొనసాగనున్నాడు."టీ20 ఫార్మాట్లో ఐర్లాండ్ జట్టుకు నాయకత్వం వహించడం నాకెంతో గర్వకారణం. నాపై నమ్మకం ఉంచిన క్రికెట్ ఐర్లాండ్ మేనేజ్మెంట్, కోచింగ్ స్టాఫ్, సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు. కెప్టెన్సీ వదిలినా, ఒక ఆటగాడిగా జట్టుకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది" అని స్టిర్లింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్ -
ఐపీఎల్ నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్
ఐపీఎల్-2026 సీజన్కు దాదాపు అన్ని జట్లకు గాయాల బెడద వెంటాడుతోంది. తాజాగా రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ గాయం కారణంగా ఐపీఎల్ 19వ సీజన్ నుంచి తప్పుకొన్నాడు. కర్రన్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.టీ20 ప్రపంచకప్-2026 సమయంలోనే అతడికి ఈ సమస్యతలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఇంగ్లీష్ ఆల్రౌండర్ తన గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఐపీఎల్ నుంచి వైదొలిగాడు.నిజంగా ఇది రాజస్తాన్కు గట్టి ఎదురు దెబ్బగానే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో కర్రాన్ బంతితో పాటు కూడా రాణించాడు. గతేడాది ఐపీఎల్లో సీజన్లో కూడా సీఎస్కే తరపున కర్రాన్ ఆకట్టకున్నాడు. అయితే గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలానికి ముందు ట్రేడింగ్ విండోలో భాగంగా సంజూ శాంసన్ సీఎస్కేకు వెళ్లగా.. అందుకు బదులుగా రవీండ్ర జడేజాతో కలిసి కర్రన్ రాజస్తాన్ జట్టులోకి వచ్చాడు. అయితే ఇప్పుడు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అతడు దూరమయ్యాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని భర్తీ చేసే పనిలో రాజస్తాన్ రాయల్స్ మేనేజ్మెంట్ పడింది.రాజస్తాన్ జట్టుధృవ్ జురెల్ (వికెట్ కీపర్), డోనోవన్ ఫెరీరా, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, తుషార్ దేశ్పాండే, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, యష్ రాజ్ పుంజా, విఘ్నేష్ పుత్తూర్, రవి సింగ్, అమన్ రావ్, బ్రిజేష్ శర్మ, ఆడమ్ మిల్నేచదవండి: IPL 2026: తొలి టైటిల్ వేటలో... -
తొలి టైటిల్ వేటలో...
పేర్లు మారినా... ప్లేయర్లు మారినా.. ఆ రెండు జట్ల రాత మాత్రం మారడం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి పోటీ పడుతున్నా... ఇప్పటి వరకు ఆ రెండు జట్లకు ట్రోఫీ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. అందులో ఒకటి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్... మరొకటి అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్. గత సీజన్లో జట్లను ప్రక్షాళన చేసుకొని కొత్తగా దర్శనమిచ్చిన ఈ రెండు టీమ్లు మెరుగైన ప్రదర్శనే చేశాయి. బెంగళూరుతో జరిగిన ఫైనల్లో తడబడిన పంజాబ్ కింగ్స్ రన్నరప్తో సరిపెట్టుకోగా... ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానానికి పరిమితమైంది. చరిత్రను పక్కనపెట్టి ఇరు జట్లు ఈసారి ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాయో చూడాలి!సాక్షి, క్రీడావిభాగం : ఏళ్లకు ఏళ్లుగా తొలి టైటిల్ సాధించాలనే తపనతో సాగుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు గత ఏడాది మెరుగైన ఆటతీరు కనబర్చింది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యానికి సహచరుల సహకారం తోడవడంతో... పంజాబ్ తొలి టైటిల్ గెలిచేలా కనిపించింది. అయితే బెంగళూరుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సారథి విఫలమవడం ఫలితంపై ప్రభావం చూపింది. గత సీజన్లో ఆడిన జట్టులో పెద్దగా మార్పులు చేయని పంజాబ్... ఈసారి ఎలాగైనా తమ చిరకాల కోరిక తీర్చుకోవాలని భావిస్తోంది. గత సీజన్లాగే బలంగా కనిపిస్తున్న కింగ్స్... మైదానంలో మళ్లీ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పంజాబ్కు ప్రధాన బలం కాగా... జట్టు ఆల్రౌండర్లతో కిక్కిరిసి ఉంది. ప్రియాన్‡్ష ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఇన్నింగ్స్కు స్థిరత్వం తేనున్నాడు. విదేశీ ప్లేయర్ల కోటాలో... స్టొయినిస్, యాన్సెన్, అజ్మతుల్లా, ఫెర్గూసన్ కీలకం కానున్నారు. సీజన్ మొత్తం ఈ నలుగురినే కొనసాగించే అవకాశాలున్నాయి. నేహల్ వధేరా, శశాంక్ సింగ్, ముషీర్ ఖాన్ రూపంలో మిడిలార్డర్లో ధాటిగా ఆడగల భారత ఆటగాళ్లు అందుబాటులో ఉండటం పంజాబ్కు కలిసి రానుంది. బౌలింగ్లో అర్‡్షదీప్ సింగ్ జట్టు ప్రధాన బలం కాగా... యుజ్వేంద్ర చహల్, స్టొయినిస్, యాన్సెన్, అజ్మతుల్లా మిగతా భారం మోయనున్నారు. ఆంధ్ర ఆటగాడు పైలా అవినాశ్కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా చూడాలి. పంజాబ్ కింగ్స్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ), నేహల్ వధేరా, విష్ణు వినోద్, హర్నూర్ పన్ను, పైల అవినాశ్, ప్రభ్సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్, స్టొయినిస్, హర్ప్రీత్ బ్రార్, యాన్సెన్, అజ్మతుల్లా, ప్రియాన్ష్ ఆర్య, ముషీర్ ఖాన్, సూర్యాన్ష్, ఓవెన్, కొనొల్లీ, డ్వార్షుయ్, అర్ష్ దీప్, చహల్, వైశాక్, యశ్ ఠాకూర్, జేవియర్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్, ఫెర్గూసన్.అత్యుత్తమ ప్రదర్శన: రన్నరప్ (2014, 2025)‘మద్యం మానేశా’ప్రస్తుతం నా వయసు 35 ఏళ్లు. సీనియర్ ఆటగాడిగా చహల్ను చూసి ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలని అనుకోవాలి. మైదానంలో మరింత చురుగ్గా ఉంటూ జట్టు కోసం 150 శాతం శ్రమించాలని పట్టుదలగా ఉన్నా. అందుకే నా శరీరంపై మరింత దృష్టి పెట్టా. గత ఆరు నెలలుగా మద్యం మానేశాననే శుభవార్త మీతో పంచుకుంటున్నా. – చహల్, పంజాబ్ఢిల్లీ రాత మారేనా! ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కసారి (2020 సీజన్లో) ఫైనల్కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... గతేడాది టీమ్లో సమూల మార్పులు చేసింది. టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ సారథ్యానికి మొగ్గు చూపకపోవడంతో... అక్షర్ పటేల్కు ఆ బాధ్యతలు అప్పగించింది. అందుకు తగ్గట్లే అక్షర్ అటు బ్యాట్తో, ఇటు బంతితో మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. అయితే లీగ్ దశలో ఏడు మ్యాచ్ల్లో గెలిచిన క్యాపిటల్స్.. ప్లే ఆఫ్స్కు చేరడంలో విఫలమైంది. తొలి నాలుగు మ్యాచ్ల్లో నెగ్గి ప్రత్యర్థులను భయపెట్టిన ఢిల్లీ... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, పృథ్వీ షా వంటి ప్లేయర్లతో టాపార్డర్ బలంగా ఉండగా... మిడిలార్డర్లో అశుతోష్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్ కీలకం కానున్నారు. పేరున్న స్టార్లకన్నా... సమయానుకూలంగా రెచ్చిపోగల ప్లేయర్లు ఉండటం క్యాపిటల్స్కు అదనపు బలం కానుంది. ఆంధ్ర ప్లేయర్ త్రిపురాన విజయ్ను ఆడిస్తారా అనేది ఆసక్తికరం. విదేశీ ప్లేయర్ల కోటాలో మిచెల్ స్టార్క్, మిల్లర్, స్టబ్స్, డకెట్, ఎంగిడి, జెమీసన్ అందుబాటులో ఉన్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన పేస్ ఆల్రౌండర్ లేకపోవడం కాస్త లోటే. బౌలింగ్లో ముకేశ్ కుమార్, నటరాజన్, కుల్దీప్ యాదవ్ కీలకం కానున్నారు. దేశవాళీ సెన్సేషన్ పేసర్ ఆఖిబ్ నబీ ఈ సారి అదనపు బలం కానున్నాడు. గత సీజన్ మాదిరిగానే సమష్టి ప్రదర్శనను నమ్ముకుంటే ఈ సారి క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్కు చేరొచ్చు. హేమాంగ్ బదానీ కోచింగ్, అక్షర్ పటేల్ కెప్టెన్సీ జట్టును ఎలా నడిపిస్తాయనేది కీలకం. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మిల్లర్, డకెట్, నిశాంక, సాహిల్, పృథ్వీ షా, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ రాణా, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారి, ఆఖిబ్ నబీ, నితీశ్ రాణా, స్టార్క్, నటరాజన్, ముకేశ్ కుమార్, చమీర, ఎంగిడి. జెమీసన్, కుల్దీప్ యాదవ్. అత్యుత్తమ ప్రదర్శన: రన్నరప్ (2020) -
మందు మానేశా...ఇక సత్తా చూపిస్తా!
గొప్పగొప్ప లక్ష్యాలు కూడా సమాధి కావడానికి చిన్న చిన్న వ్యసనాలు చాలు. కొండంత బలం వృధా కావడానికి గోరంత బలహీనత చాలు. మరీ ముఖ్యంగా అత్యంత క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరమైన క్రీడా రంగంలో బలహీనతలు, దురలవాట్లు ఉండడం అంటే అది చేజేతులా భవిష్యత్తును పాడె ఎక్కించడమే అనాలి. మాజీ టాప్ క్రికెటర్ వినోద్ కాంబ్లి లాంటి వాళ్ల జీవితాలు దీనికో నిదర్శనంగా నిలుస్తున్నాయి కూడా!!ఈ నేపథ్యంలో తాను మద్యం అలవాటును మానుకున్నానని, ఇకపై తన పూర్తి సమయం క్రికెట్కే కేటాయిస్తానని ప్రముఖ భారత క్రికెటర్, స్పిన్నర్ ఐపీఎల్ లో పంజాబ్ టీమ్ ప్లేయర్ అయిన యజ్వేంద్ర చహల్ చెబుతున్నాడు.ఇటీవల తన మాజీ ఐపీఎల్ సహచరుడు ఏబీ డివిలియర్స్ ఆధ్వర్యంలోని యూట్యూబ్ షోలో చహల్ ఈ విషయం గురించి మాట్లాడాడు. ఒకనాటి తన బలహీనతని, అది తనకు కలిగించిన నష్టాన్ని నిస్సంకోచంగా వెల్లడించాడు.తరచూ ఆరోగ్య సమస్యలుగతంలో తాను తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నానని చహల్ చెప్పాడు. మరీ ముఖ్యంగా గాయాల కారణంగా తన క్రీడా నైపుణ్యాలను తగిన విధంగా ప్రదర్శించలేకపోయానని పేర్కొన్నాడు. ‘‘కొన్ని సార్లు నా మీద నాకే నిరాశ కలిగిన మాట వాస్తవం. కేకేఆర్ మ్యాచ్ తర్వాత నా పక్కటెముక విరిగింది, ఆ తర్వాత నా కాలి వేలి కీలు కూడా విరిగింది. అందుకే సెమీఫైనల్, ఫైనల్లో నేను నా సరైన లెగ్–స్పిన్ బౌలింగ్ చేయలేకపోయాను’’ అని చహల్ గుర్తు చేసుకున్నాడు.‘‘ఈ ఏడాది నేను ముందుగా నా శరీరం గురించి జాగ్రత్త పడాలనుకుంటున్నాను. రాబోయే సీజన్ లో నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపైనే దృష్టి పెట్టా’’ అని చహల్ వెల్లడించాడు. మద్యం మానేశానుదీనికి అనుగుణంగా తీసుకున్న తన నిర్ణయాలను గురించి చెబుతూ... తాను మద్యం మానేసినట్లు తెలిపాడు. దానికి కారణం తన వయస్సు తో పాటు పంజాబ్ కింగ్స్ కోసం మరింత బాగా రాణించాలనే తన ఆలోచనే అని చహల్ ఈ సందర్భంగా చెప్పాడు.‘ఇప్పుడు కాదు.. నిజానికి నేను మద్యం తాగడం మానేసి ఆరు నెలలకు పైగా అయింది. నాకు ఇప్పుడు 35 ఏళ్లు, కాబట్టి నా చురుకుతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నా జట్టు కోసం నూటికి నూట యాభై శాతం ఇవ్వాలనుకుంటున్నాను. ఒక సీనియర్ ఆటగాడిగా, ఐపీఎల్లోని యువ ఆటగాళ్లు నా నుంచి ఏదైనా మంచి విషయం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను’ అని చహల్ తన ఆలోచనల్ని ఏకరవు పెట్టాడు.ఈ సందర్భంగా గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన ఫైనల్పై కూడా చహల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. యాన్సెన్ లేకపోవడం వల్లేఆ ఓటమికి గల కారణాలలో తమ బౌలింగ్ ఆల్–రౌండర్ మార్కో యాన్సెన్ లేకపోవడం కూడా ఒకటని అతను విశ్లేషించాడు. జాన్సెన్ 14 మ్యాచ్లలో 16 వికెట్లు పడగొట్టినప్పటికీ, జాతీయ జట్టు బాధ్యతల కారణంగా ప్లేఆఫ్స్కు దూరమయ్యాడు.సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుని ఐపీఎల్ జూన్ నెలకు వాయిదా పడటంతో, యాన్సెన్ క్యాంప్ విడిచిపెట్టి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం సన్నద్ధమయ్యేందుకు దక్షిణాఫ్రికాతో చేరవలసి వచ్చింది.‘ఫైనల్లో మార్కో యాన్సెన్ గనక ఉండి ఉంటే, ఖచ్చితంగా టైటిల్ గెలిచి ఉండేవాళ్ళం. టోర్నమెంట్ అంతటా అతను బౌలింగ్ చేసిన తీరు అద్భుతం, బ్యాటింగ్లో కూడా చివరిలో రెండు మూడు సిక్సర్లు కొట్టగల సత్తా అతనికి ఉంది. అతను బౌలింగ్ చేస్తున్న తీరు వల్ల ఇప్పుడు మాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని చహల్ చెప్పాడు.చదవండి: IPL 2026: సీఎస్కేకు భారీ షాక్!.. మాకు నిజంగా ఎదురుదెబ్బే! -
‘క్యాష్ రిచ్’ లీగ్ ఐపీఎల్కు ఘోర అవమానం?
టీ20 క్రికెట్కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త లీగ్లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే యూరోప్లో సైతం EUT20 Belgium పేరిట టోర్నీని ప్రవేశపెట్టారు. ఇక క్రికెట్ను మతంలా భావించే భారత్లో పొట్టి క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగాదేశంలో 2008లో ప్రవేశపెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఇప్పటికీ పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతూ ఉండటం ఇందుకు నిదర్శనం. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లీగ్గా పేరొందిన ఐపీఎల్లో ఒక్కసారైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ ఆశపడతాడనటంలో సందేహం లేదు.ప్రతిభ ఉన్న యువ, అన్క్యాప్డ్ క్రికెటర్లపై కూడా కోట్ల వర్షం కురవడం ఇందుకు కారణం. ఐపీఎల్లో ఆడిన తర్వాత జాతీయ జట్లకు ఎంపికైన ఆటగాళ్లు కూడా కోకొల్లలు. అయితే, ప్రపంచ క్రికెటర్ల సమాఖ్య (WCA) మాత్రం ఐపీఎల్కు టాప్-10 ర్యాంకులలో మూడో స్థానం ఇవ్వడం గమనార్హం.ఫ్రాంఛైజీ క్రికెట్ లీగ్లకు సంబంధించి WCA గురువారం ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్కు ప్రథమ స్థానం కట్టబెట్టిన సమాఖ్య.. సౌతాఫ్రికా టీ20 లీగ్కు రెండో ర్యాంకు ఇచ్చింది. క్యాష్ రిచ్.. కానీ బెస్ట్ కాదు!క్యాష్ రిచ్ లీగ్గా పేరొందిన ఐపీఎల్ను మూడో స్థానానికి పరిమితం చేసిన WCA.. బిగ్బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), పాకిస్తాన్ సూపర్ లీగ్లకు టాప్-5లో చోటు ఇచ్చింది.ఆటగాళ్లకు చెల్లించే కనీస మొత్తం, సగటు, భద్రతా ప్రమాణాలు, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, వాణిజ్యపరమైన హక్కులు, ఆదాయంలో వాటా, ప్లేయర్/ఏజెంట్ అప్రూవల్ తదితర పదమూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుని WCA ఈ ర్యాంకులు ఇచ్చింది.ఈ అంశాలలో మెరుగుపడాలి!ఇందులో భాగంగా ది హండ్రెడ్కు వందకు 75.2 మార్కులు రాగా.. సౌతాఫ్రికా లీగ్కు 68.0 మార్కులు వేశారు. ఇక ఐపీఎల్కు వందకు 62.6 మార్కులే పడ్డాయి. ఆటగాళ్లకు చెల్లింపు విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్గా ఐపీఎల్ను పేర్కొన్న WCA.. సెక్యూరిటీ రివ్యూ, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, ఆదాయంలో వాటా తదితర అంశాల్లో మాత్రం మెరుగుపడాలని సూచించింది. పాక్ పరిస్థితి ఇదీఇక బిగ్బాష్ లీగ్కు 62.5 మార్కులు రాగా.. పాకిస్తాన్ సూపర్ లీగ్కు 48 మార్కులు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 సీజన్ మార్చి 28న మొదలుకానుంది. పశ్చిమాసియాలో యుద్ధం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ తొలుత 20 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే విడుదల చేయడం గమనార్హం.అంతటా మనోళ్లదే పైచేయికాగా WCA ప్రకటించిన టాప్-2 ర్యాంకులలో ఉన్న.. ‘ది హండ్రెడ్’, సౌతాఫ్రికా టీ20 లీగ్లలో అత్యధిక జట్లు ఐపీఎల్కు చెందిన ఫ్రాంఛైజీల యాజమాన్యంలోనే ఉండటం గమనార్హం. ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఉన్న ఆరు జట్లు ఐపీఎల్లోని ఫ్రాంఛైజీల ఓనర్లవే కావడం విశేషం. అంతేకాదు కరేబియన్ ప్రీమియర్ లీగ్, ILT20లోనూ వీరి పెట్టుబడులే ఎక్కువ.చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్ -
సీఎస్కేకు భారీ షాక్!.. మాకు నిజంగా ఎదురుదెబ్బే!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ తీవ్రంగా గాయపడ్డాడు. తొడకండరాల గాయం కారణంగా అతడు ఐపీఎల్-2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.పతిరణను వదిలేసి..కాగా 2026 మినీ వేలానికి ముందు శ్రీలంక స్టార్, తమ విజయాల్లో కీలకమైన యువ పేసర్ మతీశ పతిరణను సీఎస్కే విడిచిపెట్టింది. దీంతో పేస్ దళం బలహీనపడగా.. రూ. 2 కోట్లకు ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ (Nathan Ellis)ను మాత్రం సీఎస్కే అట్టిపెట్టుకుంది.అయితే, సీజన్ ఆరంభానికి సమయం సమీపిస్తున్న వేళ ఎల్లిస్ గాయపడ్డాడు. గాయం తీవ్రత కారణంగా సీజన్ మొత్తానికి అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే సీఈఓ కేఎస్ విశ్వనాథన్ ధ్రువీకరించారు.మాకు ఇది భారీ ఎదురుదెబ్బ‘‘మాకు ఇది భారీ ఎదురుదెబ్బ. ఎల్లిస్ జట్టులో కీలక బౌలర్. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడు ప్రభావం చూపగలడు. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడి కోసం వెదుకుతున్నాము’’ అని విశ్వనాథన్ స్పోర్ట్స్స్టార్కు తెలిపారు. దీనిని బట్టి త్వరలోనే ఎల్లిస్ రీప్లేస్మెంట్ను సీఎస్కే ప్రకటించనున్నట్లు స్పష్టమైంది.ఇదిలా ఉంటే.. సీఎస్కే పేస్ విభాగంలో ప్రస్తుతం ఇద్దరు న్యూజిలాండ్ బౌలర్లు ఉన్నారు. మ్యాట్ హెన్రీని రూ. 2 కోట్లు, ఫౌల్క్స్ను రూ. 75 లక్షలకు సీఎస్కే మినీ వేలంలో కొనుగోలు చేసింది. ఇక ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ కూడా ఈ జట్టులో ఉన్నాడు.ఐపీఎల్-2026 టోర్నీకి సీఎస్కే జట్టుMS ధోని (వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, సంజూ శాంసన్ (ట్రేడింగ్ ద్వారా, వికెట్ కీపర్), గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ చౌదరి, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, నాథన్ ఎల్లిస్, శ్రేయాస్ గోపాల్, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), ఖలీల్ అహ్మద్, అకీల్ హొసేన్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, జాక్ ఫౌల్క్స్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చహర్, మ్యాట్ హెన్రీ.చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్ -
రూ. 18 కోట్లు.. ఫిట్గా ఉన్నా అనుమతి లేదు?
ఐపీఎల్-2026 ఆరంభానికి ముందే కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ను కేకేఆర్ జట్టు నుంచి తొలగించింది.పతిరణకూ గాయం!ఇక కేకేఆర్ మరో ఆటగాడు, టీమిండియా స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. పేస్ దళాన్ని పటిష్టం చేసే క్రమంలో రాణాతో పాటు రాణిస్తాడని భావించిన శ్రీలంక బౌలర్ మతీశ పతిరణ కూడా గాయపడ్డాడు.ఫిట్గా ఉన్నా అనుమతి లేదు?టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా పతిరణ కాలికి గాయం కాగా.. అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే అతడు ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) మాత్రం ఐపీఎల్లో ఆడేందుకు పతిరణకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చే విషయంలో జాప్యం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పతిరణ ఫిట్నెస్ విషయంలో తమకు సంతృప్తికరమైన సమాచారం వచ్చినపుడే NOC ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి కేకేఆర్ సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘వాళ్లు (SLC) అతడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్న అంశంపై ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.విమాన టికెట్లు బుకింగ్, రద్దుమేము వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. దాదాపుగా ప్రతిరోజు పతిరణ కోసం విమాన టికెట్లు బుక్ చేయడం, రద్దు చేయడం జరుగుతోంది’’ అని పేర్కొన్నాయి. కాగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన పతిరణ.. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రియ శిష్యుడిగా పేరొందాడు.చెన్నై వదిలేయగా.. రూ. 18 కోట్లకు కొనుగోలుఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన 23 ఏళ్ల మతీశ పతిరణ.. 47 వికెట్లు తీశాడు. అయితే, 2026 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలివేయగా.. కేకేఆర్ రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఓవైపు హర్షిత్ రాణా జట్టుకు దూరం కాగా.. పతిరణ విషయంలోనూ సస్పెన్స్ కొనసాగడం కేకేఆర్కు తలనొప్పిగా మారింది.మరోవైపు.. పతిరణ మేనేజర్ మాత్రం అతడు త్వరలోనే అందుబాటులోకి వస్తాడనేలా సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ముస్తాఫిజుర్ రహమాన్ స్థానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీని కేకేఆర్ జట్టులో చేర్చుకున్న సంగతి తెలిసిందే.చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్ -
మా నాన్నలా కాదు కానీ..!: అర్జున్ టెండుల్కర్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్. అంతర్జాతీయ క్రికెట్లో ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా ఏకంగా వంద సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఇలాంటి ఇంకెన్నో చిరస్మరణీయ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ లెజెండరీ బ్యాటర్.ఇప్పటికీ గుర్తింపు అంతంతమాత్రమేఇక సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ కూడా తండ్రి బాటలో క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. కానీ ఇప్పటికీ తగినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడీ 26 ఏళ్ల ఆల్రౌండర్. దేశీ క్రికెట్లో తొలుత ముంబైకి ఆడిన అర్జున్.. తర్వాత గోవాకు మారిపోయి అక్కడ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.ఇక ఐపీఎల్లో తండ్రి సచిన్ మెంటార్గా ఉన్న ముంబై ఇండియన్స్ (MI) తరఫున 2023లో అరంగేట్రం చేశాడు అర్జున్. ఇప్పటికి మొత్తంగా ఐదు మ్యాచ్లు ఆడి మూడు వికెట్లు తీయడంతో పాటు 13 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు అర్జున్ను వదిలేసిన ముంబై.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు అతడిని ట్రేడ్ చేసింది.ఈసారి లక్నో తరఫున అయినా అవకాశాలు అందిపుచ్చుకోవాలని అర్జున్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్తో అర్జున్ సంభాషించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందులో పంత్.. అర్జున్ టెండుల్కర్ బ్యాట్ బరువు గురించి అడుగగా..మా నాన్నలా కాదులే!.. ‘‘1220 గ్రాముల బరువు ఉండవచ్చు. ఇంతకంటే తక్కువ బరువున్న బ్యాట్తో నేను ఆడలేను. మా నాన్న అయితే 1301-1315 గ్రాముల బరువున్న బ్యాట్ వాడేవారు. నేను అలా కాకుండా 1220 గ్రాముల బరువు ఉన్నది వాడతాను. బ్యాట్ ఎలా ఉన్నా బంతిని బాదడమే అంతిమ లక్ష్యం’’ అని అర్జున్ సమాధానం ఇచ్చాడు.పెళ్లైన మరుసటి రోజే వచ్చేశావా?ఇక ఆట పట్ల అర్జున్ టెండుల్కర్ అంకిత భావం గురించి రిషభ్ పంత్ ప్రస్తావిస్తూ.. ‘‘యువరాజ్ సింగ్ పాజీతో కలిసి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు కదా! పెళ్లైన మరుసటి రోజే నెట్స్కి వచ్చేశావు. క్రికెట్ పట్ల నువ్వు అత్యంత ఆసక్తిగా, ఉత్సుకతతో ఉన్నావు సోదరా!’’ అని పేర్కొన్నాడు.కాగా మార్చి 5న సానియా చందోక్తో.. అర్జున్ టెండుల్కర్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మార్చి 28 నుంచి ఐపీఎల్-2026 ఆరంభం కానుంది. లక్నో తమ తొలి మ్యాచ్లో ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది.చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్!Already loving this new Rishabh-Arjun bond 🥹❤️💙 pic.twitter.com/pa79YqebbU— Lucknow Super Giants (@LucknowIPL) March 18, 2026 -
తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కృత్రిమ మేధతో డీప్ఫేక్స్ తయారు చేసి కొంతమంది తన పరువుకు భంగం కలిగించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే వీటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. అదే విధంగా నష్ట పరిహారంగా రూ. 2.5 కోట్లు ఇప్పించాలని అభ్యర్థించాడు.హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లుగాసామాజిక మాధ్యమాలైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర వేదికలపై 2025 నుంచి తనపై డీప్ఫేక్స్ పెరిగిపోయాయని గంభీర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందులో తాను హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు గంభీర్ చెప్పినట్లుగా ఉన్న ఓ నకిలీ వీడియోకు ఏకంగా 29 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.ఆయుధంలా వాడుకుంటూ అప్రతిష్టఇక మరో వీడియోలో గంభీర్ (Gautam Gambhir).. టీమిండియా సీనియర్ క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయి.. దీనిని 17 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో తన పేరు, గుర్తింపు, రూపం, గొంతుక ఇలా అన్నింటిని వాడుకుంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని గంభీర్ కోర్టును ఆశ్రయించాడు. తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.చట్టబద్ధంగా రక్షణ కల్పించాలితన గుర్తింపును ఆయుధంగా వాడుకుని పరువుకు భంగం కలిగించడమే కాకుండా.. ఆదాయం కూడా ఆర్జిస్తున్నారని పేర్కొన్నాడు. కృత్రిమ మేధ యుగంలో తనపై డీప్ఫేక్ వీడియోలు పెరిగిపోతున్న తరుణంలో.. చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని గౌతీ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. ఇందులో 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. తక్షణమే ఆ వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని గంభీర్ కోరాడు.కాగా 2024లో టీమిండియా హెడ్కోచ్గా నియమితుడయ్యాడు గంభీర్. అతడి మార్గదర్శనంలో భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025.. ఆసియా టీ20 కప్-2025.. తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోచ్గా గంభీర్ విజయవంతమైనా.. టెస్టుల్లో మాత్రం అతడికి పేలవమైన రికార్డు ఉండటం గమనార్హం.చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్! -
వాళ్ల ముందు మోకరిల్లారు: పీసీబీపై మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రస్తుత యాజమాన్యం తీరుపై ఆ దేశ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ముందు పీసీబీ మోకరిల్లిందని.. అందుకే పాక్ క్రికెట్ నాశనమైపోయిందని మండిపడ్డాడు.వరుస వైఫల్యాలుకాగా గత కొంతకాలంగా పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనలతో విమర్శలు మూటగట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో 2023 నుంచి వైఫల్యాలు కొనసాగుతున్నాయి. వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ కూడా చేరకుండా ఇంటిబాట పట్టిన పాక్.. టీ20 ప్రపంచకప్-2024లో కనీసం సూపర్-8 చేరకుండానే నిష్క్రమించింది.తాజాగా 2026 టీ20 ప్రపంచకప్లో సూపర్-8 దశ దాటినా.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. ఇక ఈ టోర్నీ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన పాక్ జట్టు.. వన్డే సిరీస్లో 2-1తో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలైంది. తద్వారా పదకొండేళ్ల తర్వాత తొలిసారి ఈ మేరకు బంగ్లా చేతిలో పరాభవాన్ని మూటగట్టుకుంది.ఐదారు మందిపైనే ఫోకస్ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ వెటరన్ బ్యాటర్ అహ్మద్ షెబాజ్ పీసీబీ తీరును ఘాటుగా విమర్శించాడు. ‘‘మీ ఆటగాళ్ల స్థాయి మీరు ఊహించిన స్థాయిలో లేదు. పాకిస్తాన్ జట్టు, పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) వేదికగా మీరు గత 5-7 ఏళ్ల నుంచి 6-8 మందినే ప్రధానంగా చూపిస్తూ హైలైట్ చేస్తున్నారు.పీఎస్ఎల్, పాక్ జట్టు ముఖచిత్రంగా వారిని ప్రమోట్ చేస్తున్నారు. కానీ వాళ్లు మాత్రం మీ రాత మార్చలేకపోతున్నారు. వాళ్లకు స్పాన్సర్షిప్లు, ఎండార్స్మెంట్ల రూపంలో డబ్బులే డబ్బులు. వాళ్లకు పీఎస్ఎల్లో కెప్టెన్సీలు కూడా మీరే ఇప్పిస్తారు. పాక్ క్రికెట్ అంటే వాళ్లే అనేంతలా ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు.కనక వర్షంకానీ వాళ్లు పాక్ క్రికెట్ వ్యవస్థలోని లోపాలు అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ల జేబులు నిండుతున్నాయి. కానీ పాక్ జట్టు ఘోరమైన ఓటములు చవిచూస్తోంది. అయినా సరే అందులో ఒక్క ఆటగాడు కూడా బాధ్యత వహించేందుకు ముందుకు రాడు.జట్టు ఓటమికి ఏవేవో కుంటిసాకులు చెబుతూ తప్పు తమది కాదని పక్క వాళ్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పీసీబీ చరిత్రలో ఇంతటి బలహీనమైన యాజమాన్యాన్ని ఎప్పుడూ చూడలేదు. ఆటగాళ్ల ముందు పీసీబీ మోకర్లింది. మీరే దిక్కు అంటూ వారిని నెత్తినపెట్టుకుంది.కొత్త వాళ్లను ప్రోత్సహించే బదులు పాత వాళ్లను అందలం ఎక్కించింది. వాళ్లేమో ప్రతీ టోర్నీలో ఓడటం.. దానికి ఏదో ఒక సాకు చెప్పడం పరిపాటిగా మారింది. ప్రజలకు కూడా ఇది అలవాటైపోయింది’’ అని పీసీబీ చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీని ఉద్దేశించి అహ్మద్ షెబాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.చదవండి: T20 WC 2026: జోస్ బట్లర్ రిటైర్మెంట్..? -
T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్!
టీమిండియా గత మూడేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగు ఐసీసీ టోర్నమెంట్లు ఆడింది. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 ఎడిషన్లో రన్నరప్గా నిలిచిన రోహిత్ సేన.. 2024లో అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో చాంపియన్గా నిలిచింది.ఇక దుబాయ్లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను కూడా రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ సొంతం చేసుకుంది. తాజాగా స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్-2026లో సూర్య (Suryakumar Yadav) కెప్టెన్సీలో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. అంతేకాదు సొంతగడ్డపై తొలిసారి, వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.సాహసోపేత నిర్ణయాలుఈ నాలుగు సందర్భాల్లోనూ టీమిండియా చీఫ్ సెలక్టర్గా అజిత్ అగార్కర్ ఉన్నాడు. 2020-21లోనే ఈ పదవి కోసం అతడు పోటీ పడగా చేతన్ శర్మకు అవకాశం దక్కింది. అయితే, చేతన్ శర్మ టీమిండియా ఆటగాళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడి పదవి పోగొట్టుకున్నాడు.ఫలితంగా జూన్, 2023లో అజిత్ అగార్కర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. జట్టు ఎంపిక విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఒక్కోసారి విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు ఈ మాజీ క్రికెటర్. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు గుడ్బై చెప్పిన నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు అగార్కర్పై కూడా విమర్శలు వచ్చాయి.రో-కో ఆడటం కష్టమంటూఅంతేకాదు వన్డే వరల్డ్కప్-2027లో రో-కో ఆడటం కష్టమంటూ అతడు చేసిన వ్యాఖ్యలు, అర్ధంతరంగా రోహిత్ శర్మను వన్డే సారథిగా తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు ఇవ్వడం అగార్కర్పై అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి.అదే సమయంలో టీ20 ప్రపంచకప్-2026 జట్టు నుంచి టెస్టు, వన్డే కెప్టెన్ గిల్ను తప్పించడం.. అతడి స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ చెలరేగడం అగార్కర్పై సానుకూలత వచ్చేలా చేశాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికి మంచి రికార్డే ఉన్నా.. టెస్టుల్లో మాత్రం చేదు అనుభవాలు ఉన్నాయి. 2023-25 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో టీమిండియా కనీసం ఫైనల్కు కూడా చేరకపోవడం ఇందుకు నిదర్శనం.మరోసారి..ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025కి ముందే అగార్కర్ పదవీకాలాన్ని పొడగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అగార్కర్ మరోసారి తన పదవీకాలాన్ని పొడిగించాల్సిందిగా బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం.వన్డే వరల్డ్కప్-2027 ముగిసే వరకు తనను చీఫ్ సెలక్టర్గా కొనసాగించాలని అగార్కర్ బోర్డుకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెస్ట్జోన్ నుంచి ఓ మాజీ క్రికెటర్ కూడా ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియాపై ప్రభావం చూపిన అగార్కర్ విషయంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.చదవండి: Dinesh Karthik: 40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్ -
విరాట్ కోహ్లి విశ్వరూపం.. తొలి రోజే సిక్సర్ల వర్షం!
ఐపీఎల్-2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సన్నద్దమవుతున్నాడు. బుధవారం ఆర్సీబీ జట్టుతో చేరిన కోహ్లి.. తన తొలి నెట్ ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా శ్రమించాడు. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి తన ట్రేడ్మార్క్ షాట్లతో అలరించాడు.ముఖ్యంగా ఫుట్ వర్క్ ఉపయోగిస్తూ ముందుకు వచ్చి మరి భారీ షాట్లతో విరుచుపడ్డాడు. దాదాపు ఏడాది నుంచి కేవలం వన్డేలకు పరిమితమైన కోహ్లి.. ఇప్పుడు టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా తన బ్యాటింగ్ను మలుచుకోవడం విశేషం. అయితే కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.విరాట్ తను చివరగా ఆడిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా వన్డే సిరీస్లో దుమ్ములేపాడు. సౌతాఫ్రికా సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 151 సగటుతో 302 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్పై కూడా తన ఫామ్ను కొనసాగించాడు. 3 మ్యాచ్ల్లో 80 సగటుతో 240 పరుగులు చేశాడు. ఇప్పుడు అదే జోరును ఐపీఎల్లో కూడా కొనసాగించాలని కింగ్ ఉవ్విళ్లూరుతున్నాడు. కాగా గత సీజన్లోనూ కోహ్లి అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్లు ఆడిన కోహ్లి 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో కోహ్లిది కీలక పాత్ర. కోహ్లి మరోసారి తన అద్భుత ప్రదర్శనలతో ఆర్సీబీకి టైటిల్ను అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆర్సీబీ తమ తొలి మ్యాచ్లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.చదవండి: IPL 2026: 'అతడితో జాగ్రత్త.. స్టార్ బ్యాటర్లను సైతం భయపెట్టగలడు'Wtf is Virat Kohli cooking in nets. Man is Dealing only in sixes 😭😭Someone really said, 2026 is the new 2016. pic.twitter.com/rSBD0HUkmc— Selfless⁴⁵ (@SelflessCricket) March 18, 2026 -
'అతడితో జాగ్రత్త.. స్టార్ బ్యాటర్లను సైతం భయపెట్టగలడు'
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2026 సీజన్కు రంగం సిద్దమైంది. మార్చి 28 నుంచి ఈ వరల్డ్ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ పేసర్ మహమ్మద్ ఇజార్పై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇజార్ను తక్కువగా అంచనా వేయొద్దని బ్యాటర్లను పఠాన్ హెచ్చరించాడు.కాగా గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో బిహార్కు చెందిన 22 ఏళ్ల మహమ్మద్ ఇజార్ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. ఎడమచేతి వాటం పేసర్ అయిన ఇజార్.. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని ముంబై వంటి పెద్ద ఫ్రాంచైజీ తమ జట్టులోకి తీసుకుంది."ముంబై ఇండియన్స్లో ఇప్పటికే ట్రెంట్ బౌల్డ్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ వంటి ప్రధాన పేసర్లు ఉన్నారు. ఇప్పుడు మహ్మద్ ఇజార్ రూపంలో మరో పేస్ సంచలనం ముంబై జట్టులోకి వచ్చాడు. అతడు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇజార్ 'బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్' స్లోయర్ డెలివరీలు అద్భుతంగా బౌలింగ్ చేయగలడు.అతడి బౌలింగ్ యాక్షన్ కూడా చాలా బాగుంది. ఇజార్ 135 కిలోమీటర్ల వేగంతో షార్ట్ బాల్స్, ఫుల్లర్ లెంగ్త్ డెలివరీలు కూడా సంధించగలడు. ముఖ్యంగా స్లో బాల్స్ వేయడం అతడి స్పెషాలిటీ. ఆ బంతులతో ఎలాంటి బ్యాటర్నైనా అతడు ముప్పుతిప్పలు పెట్టగలడు.గతసీజన్లో యువ పేసర్ అశ్విన్ కుమార్ అద్భుతంగా రాణించాడు. కాబట్టి అందరి దృష్టి అతడిపై ఉంటుంది. కానీ ఇజార్ను కూడా తక్కువ అంచనా వేయకండి" అని పఠాన్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇప్పటివరకు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి మహా వేదికపై సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు.చదవండి: Dinesh Karthik: 40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్ -
40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మరోసారి తండ్రయ్యాడు. అతడి భార్య, స్టార్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ పండింటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ పాపకు డికే-దీపికా జోడీ 'రాహా' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.దీంతో అభిమానులు వారిద్దరికి శుభకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు కుమారులు(కవలలు) ఉన్నారు. 2021లో కబీర్, జియాన్ జన్మించారు. ఇప్పుడు 40 ఏళ్ల వయసులో డికే మూడోసారి తండ్రి అయ్యాడు.కాగా ఆల్ఫార్మాట్ క్రికెట్ విడ్కోలు పలికిన కార్తీక్.. ప్రస్తుతం కామెంటేటర్గా, కోచ్గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్గా డీకే వ్యవహరిస్తున్నాడు. ఇక దీపికా విషయానికి వస్తే.. ఆమె చివరగా ఆసియాగేమ్స్-2023లో మిక్సిడ్ డబుల్స్లో బంగారు పతకంతో మెరిసింది.అంతకుముందు వరల్డ్ డబుల్స్ ఛాంపియన్షిప్-2022లో రెండు స్వర్ణాలు ఆమె సాధించింది. దీంతో ఆమె సేవలకుగాను భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.చదవండి: T20 WC 2026: జోస్ బట్లర్ రిటైర్మెంట్..? -
జోస్ బట్లర్ రిటైర్మెంట్..?
జోస్ బట్లర్.. ప్రస్తుత తరం అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అయితే ఈ ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. బట్లర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.మొత్తం 8 మ్యాచ్లలో అతడు కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క మ్యాచ్లో కూడా కనీసం 30 పరుగులు సాధించలేకపోయాడు. ఈ క్రమంలో బట్లర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకునున్నట్లు ప్రాచారం జరిగింది. తాజాగా తన రిటైర్మెంట్ వార్తలపై బట్లర్ స్పందించాడు. ఇప్పటిలో తనకు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని బట్లర్ స్పష్టం చేశాడు. బట్లర్ ఇటీవల ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్కాస్ట్లో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ తదుపరి వైట్-బాల్ సిరీస్లో ఆడతారా? అన్న ప్రశ్న జోస్కు ఎదురైంది."ఇంగ్లండ్ తదుపరి సిరీస్లో ఆడాలనుకుంటున్నాను. నిజంగానే టీ20 వరల్డ్కప్లో పేలవ ప్రదర్శన కనబరిచాను. ఇలా ఆడుతానని అస్సలు ఊహించలేదు. అది తీవ్ర నిరాశ కలిగించింది. అయితే గత కొన్నేళ్లుగా నా కెరీర్లోనే అత్యుత్తమ క్రికెట్ ఆడాను. త్వరలోనే తిరిగి ఫామ్లోకి వస్తాననే నమ్మకం నాకు ఉంది. ఇంగ్లండ్ తరపున మరి కొంత కాలం ఆడాలనుకుంటున్నాను. కానీ నేను ఇప్పుడు కెప్టెన్ని కాను కేవలం ప్లేయర్ మాత్రమే. జట్టులో కొనసాగడం లేకపోవడం అనేది సెలెక్టర్ల చేతుల్లో ఉంటుంది. ఏమి జరుగుతుందో చూద్దాం. ప్రపంచకప్ తర్వాత ఫ్యామిలీతో గడిపిన సమయం నాకు ఉపశమనం కలిగించింది" అని బట్లర్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్కప్ వైఫల్యం తర్వాత బట్లర్ తన ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్ ట్రిప్నకు వెళ్లాడు. అతడు ఒకట్రెండు రోజుల్లో ఐపీఎల్-2026 సీజన్ కోసం భారత్కు రానున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున బట్లర్ బరిలోకి దిగనున్నాడు.చదవండి: సీఎస్కే వైస్ కెప్టెన్గా అతడే సరైనోడు: అనిల్ కుంబ్లే -
అతడు ఆర్సీబీ గుండెచప్పుడు: డివిలియర్స్
ఐపీఎల్-2026 సీజన్ కోసం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో చేరాడు. త్వరలోనే అతడు ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది.వరుసగా రెండో సీజన్లోనూ విజేతగా నిలవాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ఆర్సీబీ స్టార్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-19వ సీజన్లోనూ ఆర్సీబీకీ కోహ్లి కీలకం కానున్నాడని డివిలియర్స్ తెలిపాడు. కాగా బెంగళూరు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో విరాట్ది కీలక పాత్ర. ఐపీఎల్-2025 సీజన్లో కోహ్లి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్లు ఆడిన కోహ్లి 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు అదే జోరును విరాట్ కొనసాగించాలని ఏబీడీ కోరుకుంటున్నాడు."ఆర్సీబీకి విరాట్ కోహ్లి గుండెచప్పుడు లాంటి వాడు. కేవలం తన అద్భుతమైన బ్యాటింగ్తో మాత్రమే కాకుండా, అతడు చూపించే పట్టుదల, ఎనర్జీ జట్టులోని ఇతర ఆటగాళ్లకు గొప్ప స్ఫూర్తినిస్తున్నాయి. మైదానంలోనూ, మైదానం వెలుపలా కోహ్లి వ్యవహరించే తీరు అమోఘం.విరాట్ నుంచి యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చుకున్నారు. కోహ్లి సృష్టించిన ఈ సానుకూల వాతావరణమే, గత సీజన్లో ఆర్సీబీ తన తొలి టైటిల్ నెగ్గడానికి ప్రధాన కారణం. అంతకుముందు సీజన్ వరకు ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లపై మాత్రమే ఆర్సీబీ ఆధారపడేది. కానీ ఇప్పుడు మాత్రం తొలి టైటిల్ గెలవడంలో జట్టులో ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు" అని జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ పేర్కొన్నాడు.చదవండి: సీఎస్కే వైస్ కెప్టెన్గా అతడే సరైనోడు: అనిల్ కుంబ్లే -
సీఎస్కే వైస్ కెప్టెన్గా అతడే సరైనోడు: అనిల్ కుంబ్లే
టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఇప్పుడు ఐపీఎల్-2026లో సత్తాచాటేందుకు సన్నద్దమవుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు సంజూ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఐపీఎల్-19వ సీజన్ వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్కే శాంసన్ ట్రేడ్ అయ్యాడు.అందుకోసం చెన్నై ఫ్రాంచైజీ రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్ వంటి స్టార్ ఆల్రౌండర్లను వదులుకోవాల్సి వచ్చింది. 11 సీజన్ల పాటు రాజస్తాన్కు ప్రాతినిధ్యం వహించిన శాంసన్.. ఇప్పుడు ఎల్లో జెర్సీలో మెరవనున్నాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. శాంసన్ను ట్రేడ్ డీల్ను కుంబ్లే సమర్ధించాడు. ఎంఎస్ ధోనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సంజూకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని కుంబ్లే అభిప్రాయపడ్డాడు."భారత క్రికెట్లో సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్, ఆపై ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి వరకు వారసత్వం ఎలా కొనసాగిందో.. ఇప్పుడు ధోని నుంచి ఆ బాధ్యతను శాంసన్ అందుకోబోతున్నాడు. సంజూను జట్టులోకి తీసుకోవడం సీఎస్కే వ్యూహత్మక నిర్ణయంగా చెప్పుకోవాలి. సంజూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.బ్యాటింగ్తో పాటు వికెట్ల వెనక కూడా బాధ్యతలు నిర్వర్తించగలడు. టీ20 ప్రపంచకప్లో వరుసగా మూడు సంచలన ఇన్నింగ్స్లు ఆడి భారత్కు విజయాన్ని అందించాడు. ఇప్పుడు అదే జోరును సీఎస్కే తరపున కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. అతడి రాకతో సీఎస్కే ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరగనుంది. సీఎస్కే వైస్ కెప్టెన్సీ రోల్కు సంజూ సరిగ్గా సరిపోతాడు. అతడికి కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో జడేజా కెప్టెన్సీ తప్పుకున్నప్పుడు, రుతురాజ్ గైక్వాడ్ గాయపడినప్పుడు మళ్ళీ ధోనీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సంజూ రాకతో రుతురాజ్ అందుబాటులో లేని సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే లీడర్ జట్టుకు దొరికినట్లయింది" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.చదవండి: ఆ విషయంలో స్వార్థపరుడినే: సంజూ శాంసన్ -
ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి!
ఐపీఎల్-2026 సీజన్లోని ఆరంభ మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు. ఎస్ఆర్హెచ్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ప్రస్తుతం వెన్ను నొప్పి గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరో నాలుగు వారాల సమయం పట్టనుంది. దీంతో టోర్నీ ఫస్ట్ హాఫ్కు కమ్మిన్స్కు దూరంగా ఉన్నాడు. క్రమంలోనే కిషన్ను కెప్టెన్గా, వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మను సన్రైజర్స్ యాజమాన్యం నియమించింది.తొలిసారి అందరూ భారత కెప్టెన్లే.. సన్రైజర్స్ యాజమాన్యం ఇషాన్ కిషన్ను కెప్టెన్ ప్రకటించడంతో... ఐపీఎల్ చరిత్రలో తొలిసారి బరిలో ఉన్న 10 జట్లకు భారత ప్లేయర్లే సారథులుగా కనిపించనున్నారు. గత 18 సీజన్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు. 19వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రజత్ పాటీదార్... ఢిల్లీ క్యాపిటల్స్కు అక్షర్ పటేల్... గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుబ్మన్ గిల్... కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు అజింక్య రహానే... రాజస్తాన్ రాయల్స్కు రియాన్ పరాగ్... ముంబై ఇండియన్స్కు హర్దిక్ పాండ్యా... పంజాబ్ కింగ్స్కు శ్రేయస్ అయ్యర్... లక్నో సూపర్ జెయింట్స్కు రిషభ్ పంత్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.ఇక ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్లో లీగ్ ఆరంభం(మార్చి 28) రోజున చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో తలపడనుంది. ప్రస్తుతం బీసీసీఐ కేవలం 20 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే విడుదల చేసింది. -
ఆర్సీబీ రె‘ఢీ’
ఒకటి కాదు రెండు కాదు పదిహేడు సీజన్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ టైటిల్ వేటలో విఫలమైంది. ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో బరిలోకి దిగడం చివరకు ఖాళీ చేతులతో వెనుదిరగడం జట్టుకు అలవాటులా కనిపించింది. మూడుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. కానీ ఆర్సీబీ అభిమానుల కోరిక ఎట్టకేలకు గత సీజన్లో తీరింది. ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో బెంగళూరు ఐపీఎల్ విజేతగా నిలిచింది. విజయోత్సవ వేడుకలో అపశ్రుతితో ఈ గెలుపు సంబరాలు కాస్త తగ్గినా ఇప్పుడు అంతా సర్దుకుంది. తమ సొంత మైదానంలో మళ్లీ మ్యాచ్లకు ఆర్సీబీ సిద్ధమైంది. గత ఏడాదితో పోలిస్తే పెద్దగా మార్పులు లేకుండా దాదాపు అదే బృందాన్ని కొనసాగించిన టీమ్ మళ్లీ టైటిల్ కొడుతుందా లేదా వేచి చూడాలి! సాక్షి క్రీడా విభాగం తొలి టైటిల్ కోసం ఎంతగానో ఎదురు చూసిన తర్వాత ఆర్సీబీ టీమ్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఒకప్పుడు కోహ్లి లేదా గేల్ లేదా డివిలియర్స్ల వ్యక్తిగత ప్రదర్శనలపైనే ఆధారపడిన జట్టు 2025 సీజన్లో సమష్టి తత్వాన్ని నమ్ముకుంది. అదే మంచి ఫలితాలను ఇచ్చింది. కోహ్లి ఎప్పటిలాగే తనదైన శైలిలో 657 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే కోహ్లి ప్రదర్శనకు మించి ఇతర ఎన్నో అంశాలు జట్టును నడిపించాయి. జట్టు కష్టాల్లో నిలిచిన ప్రతీ మ్యాచ్లో ఒక్కో ఆటగాడు హీరోగా నిలిచాడు.కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, హాజల్వుడ్, భువనేశ్వర్... ఇలా అందరూ తమ పాత్ర పోషించారు. కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ ప్రశాంతంగా జట్టును నడిపించిన తీరు కూడా ప్రశంసనీయం. కెపె్టన్ హోదా లేకపోయినా కోహ్లి టీమ్లో నింపే స్ఫూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి సీజన్లో కూడా ఆర్సీబీ నుంచి అభిమానులు అదే ఆశిస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఇతర జట్లతో పోలిస్తే వేలం సమయంలో ఆర్సీబీకి పెద్ద సమస్య లేకపోయింది. వేలంలో 8 మంది ఆటగాళ్లను ఎంచుకోగా... వీరిలో ఐదుగురు భారత్కు ఆడని ‘అన్క్యాప్డ్’ ఆటగాళ్లే. మిగతా ముగ్గురు కచ్చితంగా తుది జట్టులో ఉండే ఆటగాళ్లు కాదు. ముందు జాగ్రత్తగా వేలంలో జాకబ్ డఫీ, జోర్డాన్ కాక్స్, వెంకటేశ్ అయ్యర్లను తీసుకుంది. అయితే ఎవరూ ఉన్నా, లేకున్నా ఎప్పటిలాగే టీమ్లో జోష్ నింపేందుకు కోహ్లి ఉండటమే అది పెద్ద బలం. పదునైన బ్యాటింగ్... 2025 ఫైనల్లో ఆడిన తుది జట్టును ఈసారి మొదటి మ్యాచ్లో ఆడటం కోసం చూసుకుంటే ఎనిమిది మంది కచ్చితంగా జట్టులో ఉంటారు. ఆర్సీబీ విడుదల చేసిన లివింగ్స్టోన్కు బదులుగా ఈసారి అంతకంటే విధ్వంసకర బ్యాటర్ జాకబ్ బెతెల్కు తుది జట్టులో చోటు ఖాయం. గత ఏడాది అతను 2 మ్యాచ్ల్లో ఆడగా, అందులో ఒక అర్ధసెంచరీ ఉంది. ఇటీవలి టి20 వరల్డ్ కప్లో భారత్పై చెలరేగి బెతెల్ సాధించిన సెంచరీని చూస్తే ఆర్సీబీ బలం మరింత పెరిగినట్లే. మూడో స్థానంలో ఆడిన మయాంక్ అగర్వాల్ జట్టుకు దూరమయ్యాడు. ఈ స్థానం కోసం ఇద్దరు భారత బ్యాటర్లు పడిక్కల్, వెంకటేశ్ అయ్యర్ మధ్య పోటీ ఉంది. అయితే గతంలో ఇదే జట్టుతో ఆడిన అనుభవం, ఇటీవలి ఫామ్, లోకల్ ముద్ర కారణంగా పడిక్కల్కే ఎక్కువ చాన్స్ ఉంది. కోహ్లి, సాల్ట్లతో తిరుగులేని ఓపెనింగ్ జట్టు సొంతం. వీరిద్దరు ఇచ్చే ఆరంభాలే జట్టు విజయాలకు పునాది అవుతాయి. మిడిలార్డర్లో పాటీదార్, డేవిడ్, జితేశ్ శర్మలు ఇన్నింగ్స్ను ధాటిగా నడిపించగల సమర్థులు. ఈ బృందం విఫలమైనా ఆల్రౌండర్లు కృనాల్ పాండ్యా, షెఫర్డ్ బ్యాటింగ్తో ఆదుకోగలరు. గత సీజన్లో ఇది బాగా కనిపించింది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి మైదానంలో భారీ స్కోర్లు సాధిస్తే జట్టుకు తిరుగుండదు. భువీ, దయాళ్లపై భారం... బౌలింగ్కు సంబంధించి ఆర్సీబీని ఒకే ఒక సమస్య వెంటాడుతోంది. అదే స్టార్ పేసర్ హాజల్వుడ్ లేకపోవడం. గత సీజన్లో 22 వికెట్లతో జట్టుకు విజయం అందించడంలో అతను కీలకపాత్ర పోషించాడు. హాజల్వుడ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలీని స్థితిలో ప్రత్యామ్నాయంపై జట్టు దృష్టి పెట్టింది. ఇద్దరు భారత పేసర్లు భువనేశ్వర్, యశ్ దయాళ్ కీలకం కానుండగా, ఈసారి పేస్ విషయంలో వీరిపై అదనపు భారం ఉంది. హాజల్వుడ్కు బదులుగా డఫీ, తుషారాలలో ఒకరిని ఆడిస్తారా లేక భారత పేసర్ రసిఖ్ దార్కు అవకాశం ఇస్తారా చూడాలి. స్పిన్లో మరోసారి సుయశ్ శర్మ ప్రధాన అస్త్రం కాగా, కృనాల్ పాండ్యా లెఫ్టార్మ్ స్పిన్తో ప్రత్యర్థిని కట్టడి చేయగలడు. షెఫర్డ్ కూడా బౌలింగ్లో జట్టు కోటా పూర్తి చేయగలడు. ఐపీఎల్లో ఆర్సీబీ గణాంకాలు ఆడిన మ్యాచ్లు 271 గెలిచినవి 134 ఓడినవి 133 రద్దు 4 అత్యుత్తమ ప్రదర్శన: విజేత (2025), రన్నరప్ (2009, 2011, 2016)2026 జట్టు వివరాలు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), పడిక్కల్, కోహ్లి, సాల్ట్, జితేశ్, కాక్స్, కృనాల్, స్వప్నిల్, డేవిడ్, షెఫర్డ్, బెతెల్, వెంకటేశ్ అయ్యర్, సాత్విక్, మంగేశ్, విక్కీ ఒస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, హాజల్వుడ్, రసిఖ్ దార్, సుయాశ్, భువనేశ్వర్, నువాన్ తుషారా, అభినందన్ సింగ్, డఫీ, యశ్ దయాళ్. -
ధోని జెర్సీ నంబర్ మారనుందా?
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 సీజన్లో తన జెర్సీ నంబర్ మార్చుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని జెర్సీ నంబర్ ఎంత అని చిన్న పిల్లాడిని అడిగినా టక్కున ఏడు అని చెప్పేస్తాడు. అంతలా పాతుకుపోయింది ధోని జెర్సీ నంబర్. రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్కు ఆడిన ధోని ఏడు నెంబర్ జెర్సీతోనే బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్లోనూ సీఎస్కే తరఫున అదే జెర్సీ నెంబర్తో బరిలోకి దిగుతున్నాడు. అయితే తాజాగా ధోనినే స్వయంగా తన ఫేస్బుక్ ఖాతా వేదికగా తాను ధరించబోయే ఎనిమిదో నెంబర్ జెర్సీని పంచుకున్నాడు. ‘కొన్ని నంబర్లు మనతో పాటే ఉండిపోతాయి. అందులో ఏడు అనేది ఒకటి. కానీ ఇవాళ నేను 8కి స్విచ్ అవుతున్నా. ఎందుకనేది మీకు త్వరలోనే తెలుస్తోంది’ అంటూ ధోని ఒక క్యాప్షన్ జత చేశాడు. ఇది చూసిన ధోని అభిమానులు మాత్రం ‘మా ధోని ఎప్పుడు ఏడో నంబర్ జెర్సీకే కట్టుబడి ఉండాలి. అది మాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది’ అంటూ పేర్కొన్నారు. మరికొందరు మాత్రం అది కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం ధోని చేసిన వీడియో అని తెలిపారు. నిజానికి ఎంఎస్ ధోనికి నంబర్ 7తో చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. ధోనికి ఆ నంబర్ ఒక ఎమోషన్ కూడా. ధోని పుట్టిన తేదీ జూలై 7 (07/07). అందుకే కెరీర్ ఆరంభం నుంచి ధోని అదే నంబర్ను వాడుతున్నాడు. భారత క్రికెట్కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్ కూడా ప్రకటించి అతని జెర్సీని బీసీసీఐ మ్యూజియంలో ఉంచింది. ఇలాంటి తరుణంలో ధోని తనకు అచ్చొచ్చిన నంబర్ను ఐపీఎల్లో మార్చుకోవడం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.చదవండి: ‘కెరీర్ ముగింపు మన చేతుల్లో ఉండదు’ -
బుమ్రాకు 2 కోట్ల నష్టపరిహారం!
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ గత ఫిబ్రవరిలో 2025-26 సీజన్ కోసం ఆటగాళ్లకు వార్షిక ఫీజులకు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో ‘ఏ ప్లస్’ గ్రేడ్ను బీసీసీఐ తొలగించింది. గతంలో ఏ ప్లస్ కేటగిరీలో రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా ఉండేవారు. వీరిలో కోహ్లీ, రోహిత్లు కేవలం వన్డే ఫార్మాట్లో కొనసాగుతుండగా, జడేజా రెండు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. దీంతో ఈ ముగ్గురి ఫీజు చెల్లింపు విషయంలో బీసీసీఐకి పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ ఇప్పటివరకు ఏ ప్లస్ గ్రేడ్లో ఉన్న బుమ్రాను ఏ గ్రేడ్కు మార్చింది. ఇదే ఏ గ్రేడ్లో బుమ్రాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్, జడేజా కూడా ఉన్నారు. బీసీసీఐ ఒప్పందం ప్రకారం గ్రేడ్-ఏ ఆటగాళ్లకు ఏటా రూ. 5 కోట్లు, గ్రేడ్-బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు లభిస్తాయి. గ్రేడ్ సి ఆటగాళ్లు రూ. 1 కోటి అందుకుంటారు. ఇంతకముందు ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక ఫీజు కింద రూ. 7 కోట్లు చెల్లించేవారు. దీంతో ఇప్పటివరకు ఏ ప్లస్లో కొనసాగిన బుమ్రా ప్రస్తుతం ఏ కేటగిరీ కింద రూ. 5 కోట్లు మాత్రమే అందుకోనున్నాడు. కానీ మూడు ఫార్మాట్లు (వన్డే, టెస్టు, టీ20లు) ఆడుతూ కూడా రూ.2 కోట్లను కోల్పోవాల్సి వస్తోంది. దీంతో బుమ్రా విషయంలో బీసీసీఐ పునరాలోచనలోన పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు మిగిలిన రూ. 2 కోట్లను నష్టపరిహారంగా అందివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొందరు ఆటగాళ్ల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని వారి కాంట్రాక్టు మొత్తాలను కూడా బీసీసీఐ పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో ఏ ప్లస్ కేటగిరీ దక్కించుకోవాలంటే క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూ కనీసం ఒక్క ఫార్మాట్లోనైనా టాప్-10 ర్యాంకులో కొనసాగాలనే నిబంధన ఉండేది. తాజాగా ఏ ప్లస్ను రద్దు చేయడంతో ఆ నిబంధన కూడా తొలిగిపోయింది.చదవండి: ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా ఇషాన్ కిషన్ -
ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆరంభ మ్యాచ్లకు ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అయితే ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమవ్వనున్నట్లు ఇప్పటికే జట్టు మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. కాగా ఎస్ఆర్హెచ్ 2026 సీజన్లో ఆరంభం రోజునే డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీతో తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలోనే కమిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తాడని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ వైస్ కెప్టెన్గా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బాధ్యతలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ను భారత్ గెలవడంలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.అభిషేక్ సంగతి పక్కనబెడితే రిషబ్ పంత్,జితేశ్ శర్మలు గాయాల బారీన పడడంతో ఇషాన్ కిషన్కు అనూహ్యంగా జట్టులోకి పిలుపొచ్చింది. టీ20 ప్రపంచకప్కు ముందు న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. అదే ఫామ్ను టీ20 ప్రపంచకప్లోనూ కొనసాగించాడు. తాజాగా కమిన్స్ స్థానంలో కెప్టెన్గా ఎంపికైన ఇషాన్ కిషన్ ఐపీఎల్లోనూ అదరగొట్టాలని ఆశిద్దాం.ఇక వెన్ను గాయంతో బాధపడుతున్న కమిన్స్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వెన్నునొప్పి కారణంగానే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్కు కూడా కమిన్స్ దూరమయ్యాడు. ఇక కమిన్స్ ఆస్ట్రేలియా వన్డే, టెస్టు జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్లో కమిన్స్ సారథ్యంలోనే ఎస్ఆర్హెచ్ రన్నరప్గా నిలిచింది. ఆ సీజన్లో సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన సన్రైజర్స్ ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఓటమిపాలైంది. 2024 ఎడిషన్ నుంచి గేర్ మార్చిన ఎస్ఆర్హెచ్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, లివింగ్స్టోన్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో బ్యాటింగ్ దుర్భేద్యంగా మారింది. అయితే 2025 సీజన్లో ఆశించినంతగా రాణించలేకపోయిన ఎస్ఆర్హెచ్ ఆరో స్థానానికి పరిమితమయ్యింది.సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ (వైస్ కెప్టెన్), అనికేత్ వర్మ, బ్రైడన్ కార్సే, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, హెన్రిచ్ క్లాసెన్,ఘ, జయదేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, స్మరణ్ రవిచంద్రన్, ట్రావిస్ హెడ్, జీషన్ అన్సారీ, సలీల్ అరోరా, శివంగ్ కుమార్, లివింగ్స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అమిత్ కుమార్, క్రెయిన్స్ ఫెల్టూరా, సకిబ్ హుసేన్, ఒంకార్ తర్మలే, ప్రఫుల్ హింగే, శివమ్ మావి.𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓 🚨 Pat Cummins will miss a few games while recovering from injury.Until he recovers, Ishan Kishan will be the Captain and Abhishek Sharma will be the Vice-Captain. pic.twitter.com/etXJUkQJeG— SunRisers Hyderabad (@SunRisers) March 18, 2026 -
రికార్డు స్థాయి బిడ్.. తుది దశకు ఆర్సీబీ అమ్మకం!
ఐపీఎల్లో 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్గా నిలిచింది. అయితే 17 సీజన్ల పాటు కింగ్ఫిషర్ కంపెనీ నిర్వహిస్తూ వచ్చిన ఆర్బీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. స్వీడన్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ భారీ బిడ్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ పై, అమెరికా సంస్థ కోల్బెర్గ్ క్రావిస్ రాబర్ట్స్ అండ్ కో (కేకేఆర్), సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ టెమాసెక్ కలసిన కన్సార్టియం కూడా పోటీలో ఉంది. కాగా మొత్తం డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ప్రారంభంలో మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమానులు గ్లేజర్స్, అదార్ పూనావాలా కూడా ఆసక్తి చూపినప్పటికీ చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. గ్లేజర్స్ సుమారు 1.8 బిలియన్ డాలర్ల నాన్ బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు, అయితే ఈక్యూటీ దాన్ని దాటేలా బిడ్ పెంచినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ డీల్ సూటిగా బిడ్డింగ్ పోరుగా మారింది. డయాజియో గ్రూప్ మార్చి 31ని గడువుగా పెట్టి ఈ అమ్మకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం వెనుక కూడా ఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మూడు సంస్థలు బైండింగ్ బిడ్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఫేవరెట్గా నిలుస్తోంది. మొదట మెజారిటీ వాటా అమ్మాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇప్పుడు పూర్తి విక్రయానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఫ్రాంచైజీ విలువ 1.1 బిలియన్ నుంచి 1.35 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. రైన్ గ్రూప్ ఈ అమ్మక ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అమెరికాకు చెందిన డేవిడ్ బ్లిట్జర్, ఆదిత్య బిర్లా గ్రూప్ కలిసి కన్సార్టియంగా బిడ్ సమర్పించినట్లు తెలుస్తోంది. మార్చి 31 ఈ డీల్ కూ కీలక గడువుగా ఉంది. అయితే ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అభిమానులు చాలా మంది ఉంటారు. ఖరీదైన జట్టుగా పేరున్న ఆర్సీబీని దక్కించుకోవడానికి రెండు ప్రధాన సంస్థలు పోటీలో ఉన్నాయి. అంతిమంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్సీబీ అమ్మకం ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్స్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.చదవండి: ఐపీఎల్ ఖరీదైన ఆటగాడి అసహనం! -
ఆ విషయంలో స్వార్థపరుడినే: సంజూ శాంసన్
టీ20 ప్రపంచకప్-2026 హీరో, టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతరుల మెప్పు కోసం తాను ఎప్పుడూ ఏ పనీ చేయలేదని తెలిపాడు. ఎల్లప్పుడూ తన మనసు చెప్పినట్లే నడుచుకున్నానని.. ఈ విషయంలో తాను స్వార్థపరుడినే అన్నాడు.దాగుడుమూతల మాదిరి..భారత టీ20 జట్టు ఓపెనర్గా 2024 నుంచి రాణిస్తున్న సంజూ శాంసన్.. శుబ్మన్ గిల్ (Shubman Gill) పునరాగమనంతో కొన్నాళ్లు తుదిజట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత గిల్ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చినా.. సరిగ్గా వరల్డ్కప్ టోర్నీ ఆరంభానికి ముందే ఫామ్ కోల్పోయాడు. దీంతో ఓపెనర్, వికెట్ కీపర్గా సంజూ స్థానాన్ని ఇషాన్ కిషన్ (Ishan Kishan) భర్తీ చేశాడు.నాకౌట్ దశలో వరుసగా హాఫ్ సెంచరీలుఅయితే, కీలక నాకౌట్ మ్యాచ్లలో యాజమాన్యం సంజూకు తిరిగి ఓపెనర్గా అవకాశం ఇవ్వగా దుమ్ములేపాడు. ముఖ్యంగా సెమీస్ చేరాలంటే వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.ఆ తర్వాత ఇంగ్లండ్తో సెమీస్లో 89, న్యూజిలాండ్తో ఫైనల్లో 89 పరుగులతో సంజూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు సందర్భాల్లోనూ అతడి సెంచరీ చేసే అవకాశం కోల్పోవడం గమనార్హం. ఏదేమైనా భారత్ టీ20 వరల్డ్కప్-2026 గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సంజూ తనకు జట్టు ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్కోచ్ గౌతం గంభీర్ డ్రెసింగ్ రూమ్లో ఎప్పుడూ దీని గురించే మాట్లాడేవారన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు జట్టు విజయం కోసమే శ్రమించాలని దిశా నిర్దేశం చేసేవారని పేర్కొన్నాడు.ఆ విషయంలో నేను స్వార్థపరుడినే‘‘మా కోచ్ , కెప్టెన్ డ్రెసింగ్రూమ్లో కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకు తగ్గట్లే ఆడాలని పదే పదే మాకు చెప్పేవారు. మా నాయకత్వ బృందం నిర్ణయానుసారమే మేమంతా నడుచుకున్నాము.నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఆటగాడు అలాగే ఆలోచించాలి. నేనైతే నా మనసు చెప్పినట్లే జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే ఆడేవాడిని. ఈ విషయంలో నేను స్వార్థపరుడినే. నా పట్ల నేను నిజాయితీగా ఉండటం ద్వారా నాలోని బలహీనతలు అధిగమించడం సులువైంది’’ అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.కాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఇటీవలే ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అనుభవం ఉందని.. అయితే, తమ జట్టులో యువకులు ఉన్నా జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అన్నాడు. తద్వారా టీమిండియా మరోసారి వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిందని పేర్కొన్నాడు.చదవండి: ’నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదు’ -
ఐపీఎల్ ఖరీదైన ఆటగాడి అసహనం!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో 10 రోజుల సమయముంది. ఈ నేపథ్యంలో గతేడాది తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోని కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 18వ సీజన్లో ఎలాగైనా టైటిల్ కొట్టాలనే ధ్యేయంతో సరికొత్తగా సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు కామెరున్ గ్రీన్ పై చాలా ఆశలే పెట్టుకుంది. గతేడాది జరిగిన వేలంలో ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ను కేకేఆర్ రూ.25.20 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి ఇంత ఖర్చు చేయడం ఇదే తొలిసారి. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కామెరున్ గ్రీన్ ఆకట్టుకున్న దాఖలాలు తక్కువే. ఇటీవలే టీ20 ప్రపంచకప్లోనూ గ్రీన్ అంతగా ఆకట్టుకోలేదు. మరో పది రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ఇది కేకేఆర్కు ఒక రకంగా బ్యాడ్న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్లో వెస్ట్ ఆస్ట్రేలియా తరఫున కామెరున్ గ్రీన్ మూడంకెల స్కోరును అందుకున్నాడు. న్యూసౌత్వేల్స్తో జరిగిన మ్యాచ్లో గ్రీన్ సెంచరీ మార్క్ సాధించాడు. ఈ సందర్భంగా ఆసీస్ మీడియాకు చెందిన ఒక రిపోర్టర్ సెంచరీ చేయడం ఎలా అనిపిస్తోందని గ్రీన్ను అడిగాడు. ‘ఇది నాకు గ్రేట్ ఫీలింగ్ కలిగిస్తోంది. మొదటి మూడురోజులు మంచి స్టార్ట్ లభించింది. కచ్చితంగా మ్యాచ్ గెలవబోతున్నాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే దీనికి ముందు ఫామ్లేమీతో ఇబ్బంది పడడం ఎలా అనిపించిందంటూ మరో ప్రశ్న వేశాడు. దీనికి ‘నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పదలచుకోలేను. వేరే ప్రశ్నకు వెళ్లండి’ అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. ప్రశ్నలు లేవు అనడంతో ఇంటర్వ్యూను అక్కడితో ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో గ్రీన్ ‘వేస్ట్ ఆఫ్ టైమ్’ అంటూ తనలో తాను గొణుక్కుంటూ వెళ్లిపోయాడని రిపోర్టర్ వాపోయాడు. ఆ తర్వాత వెస్ట్ ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ బ్యూకాసన్.. గ్రీన్ తరఫున మీడి యాకు క్షమాపణ చెప్పడం ఆసక్తి కలిగించింది.చదవండి: గొడవ పడిన బంగ్లా కెప్టెన్కు బెస్ట్ ర్యాంకు! -
’నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదు’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్కోచ్గా గౌతం గంభీర్ తన పనిని సరిగ్గానే చేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా సరైన సమయంలోనే తాను ఆటకు వీడ్కోలు పలికానని భావిస్తున్నట్లు తెలిపాడు.గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్లకే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా.. టూర్ మధ్యలోనే అనూహ్యంగా అశూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్తో తొలి టెస్టులో అశూను బెంచ్కే పరిమితం చేసిన యాజమాన్యం.. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను ఆడించింది.పిలిచి.. మళ్లీ తప్పించిఅయితే, రెండో టెస్టు కోసం అశూను పిలిపించింది. ఆ తర్వాత మూడో టెస్టులో అతడి స్థానాన్ని రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో భర్తీ చేశారు. దీంతో ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం చర్చకు దారితీసింది. ఇందుకు గంభీర్ కారణం అయి ఉంటాడనే ఊహాగానాలు వచ్చాయి.ఏదేమైనా టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే (619) తర్వాతి స్థానాన్ని ఆక్రమించిన అశూ (537).. ఇంకొన్నాళ్లు ఆడి ఉంటే అతడి రికార్డు సమం చేయగలిగే వాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అశూ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.అదే అతిపెద్ద బలం‘‘సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం నాకున్న అతిపెద్ద బలం. అది తప్పా, ఒప్పా అని ప్రజలు చర్చించుకున్నా నేనేం పట్టించుకోను. పెర్త్లో వాషీ, ఆ తర్వాత అడిలైడ్లో నేను, బ్రిస్బేన్లో జడేజా.. ఇలా ఒకరి తర్వాత ఒకరం స్పిన్ దళాన్ని నడిపించాము.నేను జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాను. దానర్థం వాషీ, జడ్డూకు నేను మార్గం సుగమం చేయాలనే కదా అనిపించింది. వద్దన్నా నేను పట్టుకుని వేలాడే రకం కాదు. కెరీర్లో నేను చాలా దూరం వచ్చేశాను. అనుకున్నవి సాధించగలిగాను. కొంతమంది ఈ విషయంలో గంభీర్ గురించి వారికి నచ్చినట్లు మాట్లాడారు.నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదుకోచ్గా తన జాబ్ తాను చేశాడు. ఒకవేళ నేను, విరాట్, రోహిత్.. రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయన కోరుకుని ఉండవచ్చు. హెడ్కోచ్గా ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఇందులో తప్పుబట్టడానికి ఏమీలేదు.స్వార్థం, ఈగో వదిలేయాలని నేను ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మనం మనుషులం. భావోద్వేగాలు ఉండటం సహజం’’ అని అశూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసీస్ టూర్ తర్వాత అకస్మాత్తుగా రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పగా.. అనూహ్య రీతిలో టెస్టు దిగ్గజ బ్యాటర్ కోహ్లి సైతం ఇదే బాటలో నడిచాడు. దీంతో గంభీర్పై మరోసారి విమర్శలు వచ్చాయి. చదవండి: T20 WC Final: ’అర్ష్దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’ -
గొడవ పడిన బంగ్లా కెప్టెన్కు బెస్ట్ ర్యాంకు!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం వన్డే, టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్ల ర్యాంకుల్లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఆటగాళ్ల ర్యాంకింగ్స్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవలే పాకిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్ను 2-1 తేడాతో బంగ్లాదేశ్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్తో రెండో వన్డే సందర్భంగా బంగ్లా కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ నాన్ స్ట్రైక్ ఎండ్లో పాక్ బ్యాటర్ సల్మాన్ అఘాను రనౌట్ చేయడం వివాదం సృష్టించింది. అఘా కోపానికి కారణమై గొడవకు మూలకేంద్రంగా నిలవడమే గాక, బంగ్లాకు సిరీస్ విజయం దక్కడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో ఆల్రౌండర్ల జాబితాలో బంగ్లా కెప్టెన్ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో పాకిస్థాన్ ఆటగాడు సల్మాన్ అఘా బ్యాటింగ్ విభాగంలో 9 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక ఆల్రౌండర్ల విభాగంలోనూ సల్మాన్ అఘా ఉమ్మడిగా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. పాక్ కెప్టెన్ షహీన్ అఫ్రిది ఆల్రౌండర్ల కోటాలో 25వ స్థానంలో నిలిచాడు. ఇక భారత బ్యాటర్ల విషయానికి వస్తే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ తర్వాత టీమిండియా మళ్లీ వన్డేలు ఆడలేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (791 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతుండగా, రోహిత్ శర్మ 4వ స్థానంలో (748 పాయింట్లు), శుబ్మన్ గిల్ 5వ స్థానంలో (716 పాయింట్లు), కేఎల్ రాహుల్ (664 పాయింట్లు) తొమ్మిదో స్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్యాదవ్ ఒక్కడే టాప్-10లో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల విభాగంలోనూ అక్షర్పటేల్ పదో స్థానంలో ఉన్నాడు. టీ20 ర్యాంకింగ్స్లో పురుషుల విభాగంలో భారత్ నుంచి అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్లు టాప్-10లో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి 2వ స్థానం నిలబెట్టుకోగా, బుమ్రా ఒక స్థానం మెరుగుపరుచుకొని 702 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో మెరిసిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 11 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా రెండో ర్యాంక్లో కొనసాగుతున్నాడు.చదవండి: ‘కాల్ మీ’.. లలిత్ మోదీ ఆసక్తికర పోస్టు! -
‘కాల్ మీ’.. లలిత్ మోదీ ఆసక్తికర పోస్టు!
హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై భారత్లో పెద్ద దుమారమే రేగుతోంది. కావ్యామారన్కు చెందిన సన్రైజర్స్ యాజమాన్యంపై పాకిస్థాన్ ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు భారత్లో సన్రైజర్స్ లీడ్స్కు చెందిన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ 190,000 పౌండ్లు (సుమారు రూ.2.34 కోట్లు) దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సన్రైజర్స్ లీడ్స్కు ఆసక్తికర సందేశాన్ని పంపించారు. ‘పాకిస్తాన్ ఆటగాడిపై రూ.2.34 కోట్లు పెట్టుబడి పెట్టడంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో పడిపోయిన ఇమేజ్ను ఎలా తిరిగి వెనక్కి తెచ్చుకోవా లనేది నాకు తెలుసు. అందుకే ఒకసారి నాకు కాల్ చేయండి’ అంటూ పోస్టు పెట్టాడు. అయితే లలిత్ మోదీ తన పోస్ట్లో ఎక్కడా కూడా కావ్య మారన్ పేరు ప్రస్తావించలేదు. అయినప్పటికీ లలిత్ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన సందేశం మాత్రం సన్రైజర్స్ యాజమాన్యాన్ని ఉద్దేశించే అని స్పష్టంగా అర్థమవుతోంది.అయితే తాజాగా భారత్లో ఐపీఎల్ ప్రారంభమవుతున్న వేళ అభిమానుల్లో సఖ్యత సాధించేందుకే లలిత్ మోదీ.. కావ్యామారన్కు ఇలాంటి సందేశాన్ని పంపించి ఉంటారని తెలుస్తోంది. 2010లో పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, ఐపీఎల్ ప్రసార హక్కుల కేటాయింపులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో లలిత్ మోదీ దేశం విడిచి వెళ్లాడు. ఈడీ ప్రకారం 2009లో ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ హక్కుల కేటాయింపులో మోదీ అవకతవకలు చేసి రూ.125 కోట్లకు పైగా లాభం పొందినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. లలిత్ మోదీ ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నాడు. భారత్లో పలు ఆర్థిక అవకతవకల కేసులు కూడా ఉన్నాయి. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం విధించారు. అప్పటి నుంచి విదేశీల లీగ్లలో కూడా భారతీయ ఫ్రాంఛైజీలు పాక్ ప్లేయ ర్లను దాదాపు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే, ఈ సంప్రదాయాన్ని సన్రైజర్స్ పక్కనబెట్టి మరీ అబ్రార్ అహ్మద్ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.చదవండి: మల్టీ టాలెంటెడ్.. పైలట్ అవతారమెత్తిన గ్లెన్ ఫిలిప్స్ -
రోహిత్ శర్మ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్దమవతున్నాడు. ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున హిట్మ్యాన్ బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది సీజన్ కోసం రోహిత్ పూర్తి స్థాయిలో టీమ్తో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. మంగళవారం నెట్స్లో రోహిత్ తీవ్రంగా శ్రమించాడు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ముందు రోహిత్ అభిమానులకు ముంబై ఇండియన్స్ హెడ్కోచ్ మహేలా జయవర్ధనే గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్-19వ సీజన్లో రోహిత్ శర్మను 'ఇంపాక్ట్ ప్లేయర్'గా ఉపయోగించే ఆలోచన లేదని, అతను పూర్తిస్థాయి ఆటగాడిగా మైదానంలో ఉంటాడని జయవర్ధనే స్పష్టం చేశాడు.కాగా గత సీజన్లో రోహిత్ చాలా మ్యాచ్లలో ఇంపార్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి, మిగితా సమయంలో డగౌట్లో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఫీల్డ్లో కూడా తన అనుభవాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పంచుకోనున్నాడు."గతేడాది రోహిత్ శర్మ చిన్న చిన్న గాయాలతో బాధపడ్డాడు. అందుకే అతడిని మేము ఇంపాక్ట్ సబ్గా ఉపయోగించాము. వర్క్లోడ్ మేనెజ్మెంట్లో భాగంగానే విశ్రాంతి ఇచ్చాము. మైదానంలో ఉన్నా లేకపోయినా అతడి ప్రభావం జట్టుపై కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది సీజన్లో మాత్రం రోహిత్ను కచ్చితంగా ఎక్కువ సమయం మైదానంలోనే ఉంచుతాము.అయితే జట్టులో ఎక్కువ మంది ఆల్రౌండర్ల ఉన్నందున.. మ్యాచ్ పరిస్థితుల బట్టి ఇంపాక్ట్ ప్లేయర్ను రోటేట్ చేస్తాము" అని ఓ ఇంటర్వ్యూలో జయవర్ధనే పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 29న కేకేఆర్తో తలపడనుంది.చదవండి: T20 WC: డీఎస్పీగా సంజూ శాంసన్!? -
మల్టీ టాలెంటెడ్.. పైలట్ అవతారమెత్తిన గ్లెన్ ఫిలిప్స్
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్కు సాధ్యపడనిది అంటూ ఏదైనా ఉందా? అంటే లేదు అనే అన్పిస్తోంది. మైదానంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపింగ్లతో సూపర్ మ్యాన్గా పేరొందిన ఫిలిప్స్.. ఇప్పుడు తనలోని పైలట్ స్కిల్స్ను బయటపెట్టాడు. ఫిలిప్స్ మంగళవారం ఆక్లాండ్లోని ఆర్డ్మోర్ ఏరోడ్రోమ్లో మినీ ఎయిర్క్రాఫ్ట్ను విజయవంతంగా ల్యాండ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫిలిప్స్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఫిలిప్స్ ప్రస్తుతం కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఓవైపు క్రికెట్ కెరీర్ను కొనసాగిస్తూనే.. ఆర్డ్మోర్ ఫ్లయింగ్ స్కూల్లో పైలట్గా శిక్షణ పొందుతున్నాడు.ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరంగా ఫిలిప్స్.. ఫ్లయింగ్ స్కూల్లో తన ఖాళీ సమయాన్ని గడపుతున్నాడు. ఫిలిఫ్స్కు విమానాలు నడపడం అంటే చిన్నతనం నుంచే మక్కువ ఎక్కవ. క్రికెటర్ కాకపోయింటే కచ్చితంగా పైలట్ అయ్యే వాడనని ఫిలిప్స్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశాడు. అంతేకాకుండా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఏవియేషన్ రంగంలోనే సెటిల్ అవుతానని గ్లెన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ కివీస్ క్రికెటర్ ఐపీఎల్-2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.చదవండి: షేన్ వార్న్ గొప్ప బౌలర్ కాదు! వరల్డ్కప్ ఫైనల్లో అలా శ్రీలంక గెలుపు! View this post on Instagram A post shared by Glenn Phillips (@glennphillips236) -
షేన్ వార్న్పై అర్జున రణతుంగ వ్యాఖ్యలు.. ఆరోజు అలా..
శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం అర్జున రణతుంగ, ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ మధ్య వైరం గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాము ఒకరికొకరం నచ్చమని ఇద్దరూ పలు సందర్భాల్లో వెల్లడించారు.షేన్ వార్న్ గురించి అతిగా చెప్తున్నారే తప్ప.. అతడికి అంత సీన్ లేదని అర్జున రణతుంగ 1996 ప్రపంచకప్ సందర్భంగా అన్నాడు. అంతేకాదు.. యువకులు రోల్ మోడల్గా తీసుకోదగ్గ వ్యక్తికాదని విమర్శించాడు.ఇందుకు ప్రతిగా షేన్ వార్న్.. ‘షేన్ వార్న్ సెంచరీ: నా టాప్ 100 టెస్టు క్రికెటర్లు’ పేరిట రాసిన పుస్తకంలో అర్జున్ రణతుంగకు 93వ ర్యాంకు ఇచ్చాడు. ఇలా వీరి మధ్య వైరమే తప్ప మచ్చుకైనా స్నేహంగా కనిపించిన దాఖలాలు లేవు. 1996 వన్డే వరల్డ్కప్ టోర్నీ ఫైనల్లోకాగా 1996 వన్డే వరల్డ్కప్ టోర్నీ ఫైనల్లో శ్రీలంక- ఆస్ట్రేలియా తలపడ్డాయి. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో లంక ఆసీస్పై ఏడు వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్ విజేతగా అవతరించింది.ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. శ్రీలంక 143 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన వేళ అర్జున రణతుంగ 37 బంతుల్లో 47 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా అరవింద డి సిల్వ అజేయ శతకం (124 బంతుల్లో 107)తో అదరగొట్టగా.. అసాంక గురుసిన్హ 99 బంతుల్లో 65 పరుగులతో రాణించాడు.58 పరుగులు ఇచ్చిఫలితంగా 46.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 245 పరుగులు చేసిన శ్రీలంక.. ఆసీస్ను చిత్తు చేసి తొలిసారి వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్లో షేన్ వార్న్ పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 58 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.అతడేమీ గొప్ప బౌలర్ కాదునాటి ఈ సంగతుల గురించి అప్పటి సెంచరీ హీరో అరవింద డిసిల్వ తాజాగా ఓ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నాడు. షేన్ వార్న్ను మైండ్గేమ్లో ఓడించి అర్జున రణతుంగ పైచేయి సాధించినట్లు తెలిపాడు. ‘‘ప్రత్యర్థిని గందరగోళానికి గురిచేయడం, ఒత్తిడిలోకి నెట్టే క్రమంలో.. ఫైనల్కు ముందు రణతుంగ షేన్ వార్న్ను టార్గెట్ చేశాడు.అతడేమీ గొప్ప బౌలర్ కాదని.. అయినా సరే చాలా మంది అతడి బౌలింగ్ గురించి ఎందుకంతగా మాట్లాడతారో తనకు అర్థం కాదని అన్నాడు. ఈ మాటలతో వార్న్ తీవ్ర నిరాశ, ఒత్తిడికి గురయ్యాడు. రణతుంగ, తాను రిటైర్ తర్వాత ఇదే విషయం గురించి ప్రస్తావన రాగా షేన్ వార్న్ ఏమన్నాడంటే..నాకు ఇప్పుడు అర్థమైంది‘ఆరోజు అతడు ఎందుకలా అన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. నన్ను గందగోళంలోకి నెట్టేయాలని అలా అన్నాడు. ఆ సమయంలో నేను నా బౌలింగ్పై నియంత్రణ కోల్పోయాను. ప్రతిసారి అతడిని అవుట్ చేయాలనే లక్ష్యంతోనే బౌలింగ్ చేశానే తప్ప ఆటపై దృష్టి పెట్టలేకపోయాను.ఏం జరుగుతుందో అర్ధం చేసుకోలేకపోయాను. అతడు మైండ్గేమ్లో గెలిచాడు’ అని చెప్పాడు. రణతుంగ వ్యూహాలు అలా ఉంటాయి మరి’’ అని డిసిల్వ చెప్పుకొచ్చాడు. కాగా వార్న్ ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు తీయగా.. 194 వన్డేల్లో 293 వికెట్లు కూల్చాడు. 1999లో వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. మరోవైపు.. రణతుంగ శ్రీలంక తరఫున 83 టెస్టుల్లో 5105, 269 వన్డేల్లో 7456 పరుగులు సాధించాడు. లంకకు వరల్డ్కప్ అందించిన తొలి కెప్టెన్గా చరిత్రకెక్కాడు.చదవండి: AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు!“Arjuna said Warne wasn’t a great bowler…”30 years later, Aravinda reveals what happened next.“Warne told me he lost control… he only wanted Arjuna’s wicket.”Mind games. Big stage. Big impact. 🇱🇰🔥 pic.twitter.com/34ycroOb5w— NewsWire 🇱🇰 (@NewsWireLK) March 17, 2026 -
ఢిల్లీ క్యాపిటల్స్తో రాహుల్కు విభేదాలు?
ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మరో జట్టుకు ట్రేడ్ కానున్నాడని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం రాహుల్ను తమతోనే అంటిపెట్టుకుని ట్రేడ్ ఊహాగానాలకు చెక్ పెట్టింది. అతడి అనుభవాన్ని మరోసారి ఉపయోగించుకోవాలని ఢిల్లీ నిర్ణయించింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బ్యాటింగ్ పొజిషన్ విషయంలో రాహుల్కు ఢిల్లీ మేనేజ్మెంట్కు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. తన బ్యాటింగ్ స్ధానాన్ని పదే పదే మార్చడంపై కేఎల్ రాహుల్ ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు అతడు తెలిపాడు.కాగా గత సీజన్లో రాహుల్ కొన్ని మ్యాచ్లలో మిడిలార్డర్లోనూ, మరి కొన్ని మ్యాచ్లలో టాపార్డర్లోనూ బ్యాటింగ్కు వచ్చాడు. మ్యాచ్ మ్యాచ్కూ అతడి స్ధానం మరిపోయేది. అయినప్పటికి ఈ కర్ణాటక బ్యాటర్ దుమ్ములేపాడు. రాహుల్ గత సీజన్లో 150 స్ట్రైక్ రేట్తో 539 పరుగులు చేసి ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు.'ప్రతీ సంవత్సరం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్కు తలనొప్పిగా మారింది. అతడిని ఏ స్ధానంలో ఆడించాలో ఆ జట్టు సరిగా తేల్చుకోలేకపోతోంది. రాహుల్ ఓపెనింగ్ చేయడం ఇష్టం. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతన్ని మిడిల్ ఆర్డర్లో ఆడించాలని చూస్తోంది. ఈ విషయంలో టీమ్ మెనెజ్మెంట్, రాహుల్ మధ్య విభేదాలు ఉన్నట్లు కన్పిస్తోంది. కచ్చితంగా ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించుకోవాలి. అసలు ఢిల్లీ జట్టులో కేఎల్ సంతోషంగా ఉన్నాడో, లేదో స్పష్టత లేదు' అని తన యూట్యూబ్ ఛానల్లో బద్రీనాథ్ పేర్కొన్నాడు. అయితే ఈ ఏడాది సీజన్లో రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు ఇంగ్లండ్ స్టార్ బెన్ డకెట్ ఢిల్లీ ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నట్లు సమాచారం.చదవండి: T20 WC: డీఎస్పీగా సంజూ శాంసన్!? -
డీఎస్పీగా సంజూ శాంసన్!?
టీ20 వరల్డ్కప్-2026ను గెలిచి టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మూడు టీ20 ప్రపంచకప్ టైటిల్స్ గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఈ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ది కీలక పాత్ర. కీలకమైన సూపర్-8 మ్యాచ్తో పాటు సెమీస్, ఫైనల్లోనూ సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.సంజూ కేవలం ఐదు మ్యాచ్లలోనే 80.25 సగటు 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచాడు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం సంజూను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగంతో సత్కరించిందని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై కేరళ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఇవన్ని అసత్య ప్రచారాలని, కేరళ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వైరల్ అవుతున్న ఫోటోలు కేవలం ఏఐ ద్వారా సృష్టించినవి మాత్రమే. కాగా వరల్డ్కప్ గెలిచిన అనంతరం తిరువనంతపురంలో శాంసన్ను కేరళ సర్కార్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గోన్నారు. అంతేతప్ప అతడికి నగదు బహుమతి కానీ, ఉద్యోగం కానీ ప్రకటించలేదు. చదవండి: T20 WC Final: ’అర్ష్దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’ -
’అర్ష్దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్ సందర్భంగా అర్ష్దీప్ సింగ్ వ్యవహరించిన తీరుపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించాడు. ఆ సమయంలో తాను న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్కు క్షమాపణలు చెప్పానని తెలిపాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా మార్చి 8న జరిగిన ఫైనల్లో భారత్- న్యూజిలాండ్ టైటిల్ కోసం తలపడ్డ సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్లో భారత్ కివీస్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని గెలుచుకుంది. ఇదిలా ఉంటే.. టైటిల్ పోరులో భారత పేసర్ అర్ష్దీప్ సింగ్.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అర్ష్ బౌలింగ్లో మిచెల్ అతడి వైపే బంతిని ఆడాడు.బాల్తో కొట్టిన అర్ష్దీప్ బాల్ అందుకున్న అర్ష్దీప్ దానిని మిచెల్ వైపు విసిరి కొట్టగా.. అతడికి బలంగా తాకింది. దీంతో మిచెల్ ఆగ్రహంతో అర్ష్ వైపు దూసుకురాగా.. అంపైర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వచ్చి సముదాయించడంతో పరిస్థితి చల్లబడింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం నిబంధనల ప్రకారం.. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు అర్ష్దీప్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెట్టింది.అర్ష్దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పానుఈ విషయంపై సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్తో టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా డారిల్ మిచెల్పైకి అర్ష్దీప్ సింగ్ బంతి విసిరిన సందర్భంలో నేను కివీస్ ప్లేయర్కు క్షమాపణలు చెప్పా. ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో కొన్నిసార్లు అలా జరిగిపోతూ ఉంటుంది. అర్ష్ దీప్ కూడా క్షణికావేశంలో జరిగిపోయిందని అన్నాడు. వెంటనే మిచెల్కు క్షమాపణ చెప్పాడు. మ్యాచ్ అనంతరం అర్ష్ దీప్ బహిరంగంగా సైతం ఇదే పనిచేశాడు. సారథిగా ప్రత్యర్థి ప్లేయర్లను సైతం గౌరవించడం నా బాధ్యత’’ అని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. హెడ్కోచ్ గౌతం గంభీర్ ఈ విషయంలో అర్ష్దీప్నుకు వత్తాసు పలికిన విషయం తెలిసిందే. దేశం కోసం ఆడే సమయంలో ఆ మాత్రం దూకుడు అవసరమని.. తన దృష్టిలో అర్ష్ క్షమాపణ చెపాల్సిన అవసరం లేదని సమర్థించాడు.చదవండి: సన్రైజర్స్పై విమర్శలు.. అబ్రార్ అహ్మద్ షాకింగ్ రియాక్షన్! -
‘టాప్’లోనే స్మృతి.. ఏడో ర్యాంక్కు హర్మన్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ర్యాంకింగ్స్లో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఒక స్థానం మెరుగు పరుచుకొని ఏడో ర్యాంక్కు చేరగా... వైస్ కెపె్టన్ స్మృతి మంధాన అగ్రస్థానంలో కొనసాగుతోంది. స్మృతి 790 పాయింట్లతో ‘టాప్’లో ఉండగా... ప్రస్తుతం హర్మన్ ఖాతాలో 652 ర్యాంకింగ్ పాయింట్లు ఉన్నాయి. జెమీమా రోడ్రిగ్స్ 635 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతోంది. టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో స్మృతి 770 పాయింట్లతో రెండో ర్యాంక్లో ఉండగా... ఆ్రస్టేలియా ప్లేయర్ బెత్ మూనీ 787 పాయింట్లతో నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకుంది. బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ 717 పాయింట్లతో భారత్ తరఫున అత్యుత్తమంగా నాలుగో ర్యాంక్లో ఉంది. -
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్గా స్టార్ ప్లేయర్?
ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడా? అంటే అవునానే సమాధానమిస్తోంది. రాహుల్ గత సీజన్లలో చాలా మ్యాచ్లలో మిడిలార్డర్లోనే బ్యాటింగ్కు వచ్చాడు. ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్లు అందుబాటులో ఉండటంతో రాహుల్కు ఓపెనర్గా పెద్దగా అవకాశం దక్కలేదు.అయితే జేక్ ఫ్రేజర్-మెక్గర్క్ ఓపెనర్గా విఫలం కావడంతో ఆఖరి మ్యాచ్లలో రాహుల్కు ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం దక్కింది. కేఎల్ ఓపెనర్గా మరోసారి తన సత్తాను నిరూపించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో అజేయ సెంచరీతో అదరగొట్టాడు.దీంతో ఈ ఏడాది సీజన్లో రాహుల్ను ఫుల్ టైమ్ ఓపెనర్గా ఢిల్లీ టీమ్ మెనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. రాహుల్ గత సీజన్లో 150 స్ట్రైక్ రేట్తో 539 పరుగులు చేసి ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు.రాహుల్ పార్టనర్ ఎవరు?అయితే రాహుల్తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్ను ఇన్నింగ్స్ ప్రారంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుత ఢిల్లీ జట్టులో ఓపెనింగ్ స్లాట్ కోపం నలుగురు పోటీలో ఉన్నారు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్, శ్రీలంక స్టార్ పాథుమ్ నిస్సాంక ఉన్నారు. వీరిద్దరూ తమ తమ జట్ల ఇన్నింగ్స్లను ప్రారంభిస్తుంటారు. మరోవైపు భారత ఆటగాళ్లు పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ కూడా ఉన్నారు. వీరిద్దరికి ఢిల్లీ తరపున ఓపెనర్గా ఆడిన అనుభవం ఉంది. కాగా అభిషేక్కు ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఉంది. కాబట్టి ప్రధానంగా డకెట్, నిస్సాంక, పృథ్వీషా మధ్యనే పోటీ నెలకొంది.ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2026 జట్టుబ్యాటర్లు: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతుమ్ నిస్సాంక, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్ (కెప్టెన్), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, ఔకిబ్ దార్, నితీష్ రాణాబౌలర్లు: మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీర, లుంగి ఎన్గిడి, కైల్ జేమీసన్, కుల్దీప్ యాదవ్చదవండి: 'అఫ్గాన్ చరిత్ర అందరికి తెలుసు.. రిపీటైతే పాక్కు చుక్కలే' -
'అఫ్గాన్ చరిత్ర అందరికి తెలుసు.. రిపీటైతే పాక్కు చుక్కలే'
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లోని ఓ రిహేబిటేషన్ సెంటర్పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ బాంబు దాడుల్లో 400 మంది మరణించగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానుష చర్యపై అఫ్గాన్ యువ సంచలనం, ముంబై ఇండియన్స్ అల్లా ఘజన్ఫర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఘజన్ఫర్ కోరాడు."అక్కడ చికిత్స పొందుతున్న వారంతా పేదవారే. వారికి ప్రైవేటు అస్పత్రిలో చికిత్స చేయించుకునే స్తోమత లేదు. ఇప్పుడు ఆ ఆసుపత్రిని కూడా లక్ష్యంగా చేసుకుని ప్రజల ప్రాణాలను బలికొన్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. వారు ఇటువంటి హేయమైన చర్యలతో ఏమి నిరూపించుకోవాలనుకుంటున్నారో నాకు తెలియదు.సామాన్య ప్రజలను పొట్టనబెట్టుకుని ఏమి సాధించారు. దీనిని మేము ఏమాత్రం అంగీకరించలేము. అఫ్గాన్ చరిత్ర అందరికీ తెలుసు. ఒకవేళ ఆ చరిత్ర మళ్ళీ రిపీట్ అయితే, అది పాక్కు చాలా ప్రమాదకరంగా మారుతుందిష అని న్యూస్ 18తో ఘజన్ఫర్ పేర్కొన్నాడు.అదేవిధంగా భారత్-అఫ్గాన్ సంబంధాలపై కూడా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. "భారత్ మాకు మంచి మిత్ర దేశం. ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు భారత్తో చర్చలు జరపాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం ప్రపంచం ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇలాంటి యుద్ధ వాతావరణం ఎవరికీ మంచిది కాదని" ఘజన్ఫర్ తెలిపాడు. కాగా ఈ ఘటనపై ఘజన్ఫర్తో పాటు రషీద్ ఖాన్, నబీ, నవీన్ ఉల్ హక్ వంటి పలువురు అఫ్గాన్ క్రికెటర్లు ఆవేదన వ్యక్తంచేశారు.చదవండి: సన్రైజర్స్పై విమర్శలు.. అబ్రార్ అహ్మద్ షాకింగ్ రియాక్షన్! -
సన్రైజర్స్పై విమర్శలు.. అబ్రార్ అహ్మద్ షాకింగ్ రియాక్షన్!
ఇంగ్లండ్ 'ది హండ్రెడ్' (The Hundred) వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం పెను వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. లండన్ వేదికగా జరిగిన ఈ వేలంలో అబ్రార్ను సన్రైజర్స్ లీడ్స్ జట్టు 1.90 లక్షల పౌండ్ల (సుమారు రూ.2.3 కోట్లు)కు కొనుగోలు చేసింది.ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్, సన్రైజర్స్ లీడ్స్ ఓనర్ ఒక్కరే. దీంతో సన్రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్లో తీవ్ర వ్యతిరేకత ఎదురువుతోంది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం తీవ్రంగా స్పందించారు. ఇది పరోక్షంగా పాకిస్తాన్ మిలిటరీకి నిధులు సమకూర్చినట్లే అని ఆయన వ్యాఖ్యనించారు. అది భారత సైనికుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని ఆయన మండిపడ్డారు. గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ అండర్-19 కెప్టెన్ అజీమ్ రఫీక్ తప్పుపట్టారు. మీరు ఎన్ని పరుగులు చేశారన్నది ముఖ్యం కాదు, ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఆమోదయోగ్యం కాదు" అని రఫీక్ పేర్కొన్నాడు.అయితే ఈ వివాదాన్ని అబ్రార్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం. "అబ్రార్ ఒప్పందంపై ఈ రకమైన విమర్శలు ముందే ఊహించాం. కానీ అబ్రార్ ఈ వివాదంపై ఏ మాత్రం ఆందోళన చెందడం లేదు. అబ్రార్ ప్రపంచవ్యాప్తంగా లీగ్స్లో ఆడేందుకు సిద్ధంగా ఉండటంతో ది హండ్రెడ్ కోసం తన పేరును నమోదు చేసుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్లో టాప్-3లో ఉండడంతో వేలంలో అతడు భారీ ధర దక్కింది. అతడు అందుకు కచ్చితంగా అర్హుడు. సన్రైజర్స్ లీడ్స్ కోచ్ డేనియల్ వెట్టోరి అబ్రార్ ఫోన్ చేసి తనను కొనుగోలు చేసిన విషయాన్ని తెలియజేశాడు. తమతో టచ్లో ఉండాలని సూచించారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వర్గాలు టెలికామ్సియానెట్కు వెల్లడించాయి.చదవండి: భార్య మాట... బంగారు బాట! -
భార్య మాట... బంగారు బాట!
టి20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా అడుగు పెట్టడం... సొంతగడ్డపై విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు లేకుండా వరల్డ్కప్ ఆడటం... మెగా టోర్నమెంట్కు ముందు అనూహ్యంగా ఇషాన్ కిషన్పై భరోసా పెట్టడం... కీలక మ్యాచ్ల్లో సంజూ సామ్సన్కు అండగా నిలవడం నుంచి మొదలుకొని... భార్య సలహాలతో ఆలోచన విధానాన్నే మార్చుకొని టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే వరకు... టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్లోని పలు కీలక దశలపై ‘పీటీఐ’ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఐపీఎల్తోనే సరిపెట్టుకోవాలనుకున్న తాను... భార్య సూచనలతో భారత జట్టు కెప్టెన్గా ఎదగడం... తరగతి గదిలో సాధించలేనిది మైదానంలో చేసి చూపడం ఇలా సూర్యకుమార్ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే... న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్కతా నైట్రైడర్స్కు ఆడుతున్న సమయంలో దివిశతో నా వివాహం జరిగింది. జీవితం సాఫీగా సాగిపోతున్నట్లే అనిపించింది. రెండేళ్ల తర్వాత 2018లో ముంబై ఇండియన్స్తో జతకట్టా. అదే సమయంలో నా భార్య ఒక ప్రశ్న వేసింది. ‘ఏజ్ గ్రూప్ క్రికెట్లో నీతో కలిసి ఆడిన వాళ్లు చాలా మంది ఇప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నీ మనసులో ఏం ఉంది’ అని సీరియస్గా అడిగింది. ఆ సమయంలో నాకు కూడా టీమిండియా తరఫున ఆడాలని ఉంది అని చెప్పా. అయితే అందుకు నీ ప్రయత్నాలు ఏవి అని నేరుగా ప్రశ్నించింది. ఇలా ఇద్దరి మధ్య ఒక చిన్న సంభాషణ నా ఆలోచన ధోరణి ని మార్చింది. అప్పటి నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించే విషయంపై మరింత దృష్టి సారించా. ఆలోచనల నుంచి ఆహారం వరకు మొత్తం మార్చేశా. సినిమాలు, షికార్లు అన్నీ పక్కన పెట్టి తీవ్రంగా శ్రమించా. ఆ ఫలితం త్వరలోనే కనిపించింది. 2018లో ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబర్చా... అలాగే దేశవాళీల్లోనూ భారీగా పరుగులు చేశా. అలా వరుసగా మూడేళ్ల పాటు ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో మంచి ఇన్నింగ్స్లు ఆడా. 2020లో ఫినిషర్గా బాగా రాణించా... దీంతో మరుసటి ఏడాది టీమిండియా తరఫున పిలుపు వచ్చింది. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మరవలేను. భార్య అడిగిన చిన్న ప్రశ్న నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. అలా అని తను నా కెరీర్లో జోక్యం చేసుకోదు. ఎలా ఆడాలి అనే విషయాల గురించి అసలు మాట్లాడదు. కానీ నా ఆలోచన విధానాల్లో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపుతుంది. అందుకే నా విజయాల్లో అగ్రభాగం ఆమెకే దక్కుతుంది. అలా అని ఇంట్లో ఎప్పుడూ క్రికెట్ చర్చే జరుగుతుంది అనుకుంటే పొరబాటే. ఆటను గేటు బయటే పట్టి ఇంట్లోకి రమ్మని అంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు సూర్యకుమార్ యాదవ్ కాదు... కేవలం సూర్య మాత్రమే అంటూ చమత్కరిస్తుంది. అప్పటికి ఇప్పటికి అదే తేడా... 2024లో టి20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో... తాజాగా ట్రోఫీ చేజిక్కించుకున్న జట్టులో చిన్న చిన్న తేడాలు మాత్రమే ఉన్నాయి. 2024 టీమ్లో అనుభవంతో కూడిన జోరు ఉండేది... ఇప్పుడు జట్టులో యువరక్తం ఉరకలు వేస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రూపంలో జట్టులో అనుభవజు్ఞలు ఉండేవారు. ఎవరి బాధ్యతలు వారికి పక్కాగా ఉండేవి. ప్రస్తుత జట్టులో అనుభవం ఎక్కువగా లేకున్నా... ఉత్సాహం మాత్రం కావల్సినంత ఉంది. స్వదేశంలో ఆడటంపై... ప్రపంచకప్ అంటే అంచనాలు భారీగా ఉండటం సహజం. ద్వైపాక్షిక సిరీస్ల్లో ఉత్తమ ప్రదర్శన చేస్తుండటంతో పాటు... డిఫెండింగ్ చాంపియన్గా మాపై విపరీతమైన అంచనాలు ఉంటాయని మాకూ తెలుసు. టీమిండియాపై అది ఎప్పుడైనా సహజమే. భావోద్వేగాల విషయంలో గత టోర్నీకి ఇప్పటకీ పెద్ద తేడా లేదు. కానీ... సొంతగడ్డపై మ్యాచ్లు ఆడుతుండటంతో అది మరి కాస్త ఎక్కువైనట్లు అనిపించింది. టి20ల్లో చేయితిరిగిపోయింది జీవితంలో ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. దేశవాళీల్లో 10–12 ఏళ్లు ఆడాను. ముంబైలో క్రికెట్ ప్రారంభించిన వాళ్లు ఎవరైనా... ఎర్ర బంతితోనే ప్రాక్టీస్ చేస్తారు. నేను అంతే! అయితే టీమిండియా తరఫున ఏకైక టెస్టు మ్యాచ్ ఆడా. వన్డేల్లో నిలదొక్కుకునేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ అదీ సాధ్యపడలేదు. టి20 ఫార్మాట్లో మాత్రం చేయితిరిగిపోయింది. టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు జితేశ్ శర్మను కాదని ఇషాన్ను ఎంపిక చేశాం. అప్పుడే అతడితో ట్రోఫీ గెలిపిస్తావా అని అడిగాను. ముందు నమ్ము అని అన్నాడు. అదే జరిగింది. సామ్సన్ను తుది జట్టులోకి తీసుకున్న తర్వాత టోర్నమెంట్లో మా జట్టు ఆటతీరే మారిపోయింది. -
కమిన్స్ లేకుండానే..
హైదరాబాద్: ఐపీఎల్ మాజీ చాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లలో తమ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సేవలు కోల్పోనుంది. చాలా కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆ్రస్టేలియా స్టార్ పేసర్ కమిన్స్... ఈ సీజన్ మొదలయ్యే సమయానికి కోలుకుంటాడని భావించినా అది సాధ్యం కాలేదు. అతను ఇంకా రీహాబిలిటేషన్లోనే కొనసాగుతున్నాడని సమాచారం. గత ఏడాది డిసెంబర్లో ఇంగ్లండ్పై ఒకే ఒక యాషెస్ టెస్టు ఆడిన తర్వాత కమిన్స్ మళ్లీ మైదానంలోకే రాలేదు.సీజన్లో ఏ మ్యాచ్ నుంచి అతను అందుబాటులో వస్తాడో ఇప్పుడే చెప్పలేని స్థితి. 2024లో కెప్టెన్గా సన్రైజర్స్ను కమిన్స్ రన్నరప్గా నిలిపాడు. గత ఏడాది టీమ్ ఆరో స్థానంలో నిలిచింది. రెండు సీజన్లలో కలిపి 30 మ్యాచ్లలో కమిన్స్ 34 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్ దూరం కావడంతో హైదరాబాద్ ఒకవైపు రెగ్యులర్ పేస్ బౌలర్తో పాటు కెప్టెన్ను కూడా కొత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తుది జట్టులో కచ్చితంగా ఉండే ఆటగాడికే కెప్టెన్సీ అవకాశం కాబట్టి ఆ్రస్టేలియాకే చెందిన విధ్వంసక ఓపెనర్ ట్రవిస్ హెడ్ను ఎంపిక చేసే ఆలోచన ఉంది. కమిన్స్ తిరిగి వచ్చే వరకు తాత్కాలికమే కాబట్టి హెడ్ ఆసక్తి చూపించకపోతే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ లేదా మరో ఓపెనర్ అభిషేక్ శర్మకు నాయకత్వ బాధ్యతలు దక్కుతాయి. బౌలింగ్లో హర్షల్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్లపై అదనపు భారం తప్పదు. ఆర్సీబీకి హాజల్వుడ్ గాయాల సమస్య! ఐపీఎల్లో మరో ఫ్రాంచైజీ కూడా ఆసీస్ పేసర్ గాయం సమస్యను ఎదుర్కొంటోంది. గత ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన పేసర్ జోష్ హాజల్వుడ్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. కండరాలు, మడమ గాయాలతో ఇబ్బంది పడుతున్న హాజల్వుడ్ టోర్నీలో కొన్ని మ్యాచ్లకు దూరం కావడం ఖాయమైంది. హాజల్వుడ్ కూడా గత నవంబర్ తర్వాత మళ్లీ క్రికెట్ ఆడలేదు. అతని రీహాబిలిటేషన్ పూర్తయిన తర్వాత ఐపీఎల్లో పాల్గొనడంపై స్పష్టత రావచ్చు. హాజల్వుడ్ గైర్హాజరు ఆర్సీబీని బలహీనంగా మార్చడం ఖాయం. భువనేశ్వర్, యశ్ దయాళ్, నువాన్ తుషార రూపంలో జట్టుకు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. జాకబ్ డఫీ కూడా జట్టుకు ఉపయోగపడగలడు. హర్షిత్ రాణా కష్టమే! ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)కు గట్టి దెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న ప్రధాన పేసర్ హర్షిత్ రాణా ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. టి20 వరల్డ్ కప్ జట్టులో ఉండి చివరి నిమిషంలో టోర్నీకి దూరమైన హర్షిత్... ఎప్పటి వరకు ఫిట్గా మారతాడనే విషయంపై టీమ్ మేనేజ్మెంట్కు కూడా స్పష్టత లేదు. గత రెండు సీజన్లుగా రాణా కేకేఆర్ టీమ్లో కీలక బౌలర్గా సత్తా చాటాడు. రాణాతో పాటు మహీశా పతిరణ కూడా గాయంతో బాధపడుతుండగా, ముజరబాని ఏమాత్రం ప్రభావం చూపగలడనేది ఆసక్తికరం. అయితే వైభవ్ అరోరా, ఆకాశ్దీప్, ఉమ్రాన్ మలిక్ రూపంలో పేస్ ప్రత్యామ్నాయాలు జట్టుకు ఉన్నాయి. -
రోహిత్ సాధన షురూ...
ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు టెటిల్స్తో అగ్ర స్థానంలో ఉన్నాయి. అయితే గత ఐదు సీజన్లలో ముంబై ప్రదర్శన ఆశించినంత మెరుగ్గా లేదు. 2020లో ట్రోఫీని అందుకున్న తర్వాత టీమ్ పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు సీజన్లలో ‘ప్లే ఆఫ్స్’కు చేరడంలో విఫలమైన జట్టు... మిగిలిన రెండు సందర్భాల్లో నాలుగో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుత జట్టుతో 2026లోనైనా జట్టు రాత మారుతుందా అనేది చూడాలి. ఈ నేపథ్యంలో ముంబై స్టార్ బ్యాటర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో టీమ్తో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ చివరి సారి మైదానంలోకి దిగాడు. ఆ సిరీస్లో అతను వరుసగా 26, 24, 11 పరుగులు చేశాడు. ఇప్పుడు మళ్లీ బ్యాట్ పట్టి ఐపీఎల్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. మంగళవారం సాధనలో అతను సుదీర్ఘ సమయం పాటు నెట్స్లో గడిపాడు. బౌలర్లందరినీ అలవోకగా ఎదుర్కొంటూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా రోహిత్ గతంలో కంటే పూర్తి ఫిట్గా, చురుగ్గా కనిపిస్తుండటం విశేషం. 2025 సీజన్లో రోహిత్ 15 ఇన్నింగ్స్లలో 149.28 స్ట్రయిక్ రేట్తో 418 పరుగులు సాధించాడు. టీమ్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే పర్యవేక్షణలో జట్టు ఆటగాళ్ల ప్రాక్టీస్ సాగింది. -
మరిన్ని టెస్టులు... మరింత మెరుగు...
న్యూఢిల్లీ: మహిళల క్రికెట్లోనూ క్రమం తప్పకుండా టెస్టు మ్యాచ్లు జరిగితేనే జట్టు మెరుగవుతుందని భారత బ్యాటర్ ప్రతీక రావల్ చెప్పింది. ఇటీవల ఆ్రస్టేలియా గడ్డపై జరిగిన ఏకైక డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్టులో ఆమె అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ సంప్రదాయ టెస్టు క్రికెట్నే అందమైన ఫార్మాట్గా అభివరి్ణంచింది. పరిపూర్ణ క్రికెటర్ అయ్యేందుకు పరీక్ష పెడుతుందని చెప్పుకొచ్చింది. పురుషుల విభాగంతో పోలిస్తే మహిళల క్రికెట్లో టెస్టు మ్యాచ్లు అరుదుగా జరుగుతున్నాయి. 1976లో తొలి టెస్టు ఆడిన భారత మహిళల జట్టు 2026 వరకు మొత్తం 42 టెస్టుల్లో మాత్రమే పోటీపడింది. ఇందులో 8 టెస్టుల్లో గెలిచి, 7 టెస్టుల్లో ఓడిపోయింది. 27 టెస్టులను ‘డ్రా’గా ముగించింది. న్యూఢిల్లీలో జాతీయ క్రీడా పాత్రికేయుల సమాఖ్య కాన్ఫరెన్స్లో పాల్గొన్న 25 ఏళ్ల ప్రతీక ఈ సందర్భంగా చెప్పిన కబుర్లు ఆమె మాటల్లోనే... జగజ్జేతలుగా నిలవడం వన్డే ప్రపంచకప్ విజేతగా నిలవడం అన్నింటికంటే మించిన అద్భుతమైన అనుభవం. నా కెరీర్లో అదెప్పటికీ చిరస్మరణీయంగానే ఉంటుంది. ఇన్ని రోజులైనా... ఆ విజయం, కప్ ఎత్తుకున్న మా బృందం చేసిన సందడి, సంబరం కళ్లముందు కదలాడుతూనే ఉంది. బహుశా ఎప్పటికీ ఇలానే ఉండిపోతుందేమో చెప్పలేను. ఎందుకంటే మేం గెలిచింది... ఎప్పుడూ తలచుకునే ప్రపంచకప్ను. అసలైన క్రికెట్ అదే క్రికెట్లో టెస్టే అసలైన ఫార్మాట్. చిన్నప్పుడు మా నాన్న, కోచ్ ఇదే విషయాన్ని చెప్పారు. ఈ సంప్రదాయ ఫార్మాటే ప్రధానమైందని, ఇందులో రాణిస్తేనే క్రికెట్లో రాటుదేలుతామని, తద్వారా ఆ ఫార్మాట్ మన అభిమాన ఆటగా మారుతుందన్నారు. ఇప్పుడు టెస్టు ఆడుతుంటే నాక్కూడా అదే అనుభవం కలిగింది. సచిన్, లారా వీడియోల్ని చూసి పరిమిత ఓవర్ల క్రికెట్ పూర్తి భిన్నమైంది టెస్టు ఫార్మాట్. అందుకే ఈ సంప్రదాయ ఆటను ఒంటబట్టించుకునేందుకు దిగ్గజాలు ఆడిన తీరును అదేపనిగా చూశాను. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), వివియన్ రిచర్డ్స్, బ్రియాన్ లారా (వెస్టిండీస్)లు ఎలా ఆడారో తదేకంగా చూసేదాన్ని. గంటల తరబడి క్రీజులో నిలబడిన వారి బ్యాటింగ్ నాకు ప్రేరణగా ఉపయోగపడింది. నా ఆటకు ఉ్రత్పేరకంగా పనిచేసింది. ఈ ఏడాది కీలకం అమ్మాయిల జట్టుకు ఈ సీజన్ అత్యంత కీలకం. ఈ ఏడాది మహిళల టి20 ప్రపంచకప్తో పాటు ఆసియా క్రీడలు కూడా జరుగనున్నాయి. ఏషియాడ్లో కూడా టి20 ఫార్మాట్లోనే క్రికెట్ పోరు జరుగుతుంది. అందుకే ప్రస్తుతం జట్టు కోసం శ్రమించేందుకు, జట్టు విజయాల్లో భాగం కావాడమే లక్ష్యంగా నేను కసరత్తు చేస్తున్నాను. అంతేతప్ప భవిష్యత్తుపై అదేపనిగా అతిగా ఆలోచించను. గుర్తింపే కదా ఎవరైనా ఆశించేది బీసీసీఐ వార్షిక నమన్ అవార్డుల్లో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇదే తొలి వేడుక (బోర్డుకు సంబంధించి). ఎక్కడైనా... ఎవరైనా కోరుకునేది గుర్తింపునే. మన శ్రమను గుర్తించి ఇచ్చే అవార్డులు మనల్ని మరింత కష్టపడేందుకు దోహదపడతాయి. మనదేశంలో కొన్నేళ్లుగా మహిళల క్రికెట్ కూడా పురుషుల క్రికెట్లా దూసుకెళుతోంది. -
దిగ్గజ క్రికెటరన్న గౌరవం లేదా?
హండ్రెడ్ లీగ్ 2026 వేలంలో సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ పాకిస్థాన్ క్రికెటర్లను కొనుగోలు చేయడంపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ సన్రైజర్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాక్ ఆటగాళ్లకు ఫీజుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు పరోక్షంగా భారత సైనికులు, పౌరుల ప్రాణాలు తీస్తుందని వ్యాఖ్యానించారు. అయితే సునీల్ గావస్కర్ వ్యాఖ్యలను పాక్ సంతతికి చెందిన ఇంగ్లీష్ క్రికెటర్ అజీమ్ రఫిక్ ఖండించడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఒక దిగ్గజ క్రికెటర్ అనే కనీసం గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడి కొత్త వివాదానికి తెరలేపాడు. ‘సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు ఖండించదగినవే. అసలు ఆయన మాట్లాడిన మాటలను ఎవరైనా అంగీకరించగలరా చెప్పండి? అయినా మీరు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్ని పరుగులు చేశారన్నది నాకు అనవసరం. కానీ సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు మాత్రం అర్థరహితం’ అని పేర్కొన్నాడు. అయితే అజీమ్ రఫిక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం లేదన్న విషయం నిరూపించగలవా? అక్కడ నాన్ ముస్లింలనే లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించడం ఎంతవరకు సమంజసం’..‘భారత్పై పడి ఏడ్వడం మానండి. సునీల్ గావస్కర్ ఒక దిగ్గజ క్రికెటర్ అన్న కనీస మర్యాద కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు. ఆయన అనుభవమంత వయసు కూడా నీకు లేదు. ముందు ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆ తర్వాత ఉపన్యాసాలు ఇవ్వొచ్చు’.. ‘పాక్ క్రికెటర్లు సుద్దపూసలైతే ఆసియా కప్లో ఆ జట్టు బోర్డు చైర్మన్ ప్రవర్తించిన తీరు సరైనదేనా అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది?’ అని కామెంట్లు పెట్టారు.This is absolutely ridiculous & should be condemned ..How are these comments acceptable? I don’t care how many runs you have scoredVile stuff from Gavaskar https://t.co/sLYtUKmGnZ— Azeem Rafiq (@AzeemRafiq30) March 16, 2026చదవండి: క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్! -
క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్!
క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్ వేసిన ఘనతను పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ అసద్ అక్తర్ మూటగట్టుకున్నాడు. విషయంలోకి వెళితే.. పాకిస్థాన్ దేశవాలీ టీ20 క్రికెట్ పోటీల సందర్భంగా పెషావర్ వేదికగా కరాచీ బ్లూస్, లాహోర్ బ్లూస్కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కరాచీ బ్లూస్ తరఫున ఆడిన అసద్ అక్తర్ అతిపెద్ద నోబాల్ వేశాడు. క్రీజు లైన్ దాటిన అసద్ తన కాలిని చాలా ముందుకు పెట్టి బంతిని విసిరాడు. కావాలని విసిరాడో లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ ఈ వింత నోబాల్ మాత్రం ఇప్పుడు వివాదంగా మారిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. అంతేకాదు ఇదే ఓవర్లో అసద్ రెండు నోబాల్స్, రెండు వైడ్స్ కలిపి మొత్తం 21 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. అయితే చాలా మంది అసద్ అక్తర్ వేసిన నోబాల్ను 2010లో ఇంగ్లండ్పై పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ వేసిన నోబాల్తో పోల్చుతున్నారు. అయితే అది స్పాట్ ఫిక్సింగ్లో భాగమని తర్వాత తేలడంతో ఆమిర్ సహా అప్పటి కెప్టెన్ సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్లపై ఐసీసీ నిషేధం విధించింది. ఈ ముగ్గురికీ తర్వాత జైలుశిక్ష కూడా పడింది. తాజాగా అసద్ అక్తర్ వేసిన నోబాల్తో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం మరోసారి తెరమీదకు వచ్చింది. A 25 year old Pakistani pacer, Asad Akhtar, bowled a shocking no ball in their ongoing premium domestic T20 tournament and it looked ridiculously suspicious. Spot fixing again. pic.twitter.com/zFRzScLFLx— Kakarot (@MidOffMind) March 15, 2026ఈ ఘటన నేపథ్యంలో 2010 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం గురించి అబ్దుల్ రజాక్ ఓ పాకిస్థానీ టీవీ షోలో మాట్లాడుతూ కీలక విషయాలు బయటపెట్టాడు. ఆ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర ఒక మొబైల్ ఫోన్ రిపేర్ వల్ల యాదృచ్ఛికంగా ఎలా తెలిసిందో ఆయన వివరించాడు."లండన్లో నాకు తెలిసిన ఒక స్నేహితుడు పార్ట్టైమ్గా మొబైల్ ఫోన్లు రిపేర్ చేసేవాడు. స్పాట్ ఫిక్సింగ్ సూత్రధారి మజార్ మజీద్ తన ఫోన్ను రిపేర్ కోసం నా స్నేహితుడికి ఇచ్చాడు. ఆ ఫోన్ను బాగు చేసిన తర్వాత అందులో మజార్కు, ముగ్గురు పాక్ ఆటగాళ్లకు మధ్య జరిగిన మెసేజ్లను నా స్నేహితుడు చూశాడు. మ్యాచ్లో స్పాట్ ఫిక్సింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఆ మెసేజ్లలో ఉన్నాయి" అని రజాక్ తెలిపాడు.చదవండి: ఫ్యాన్ ఆర్మీ భారత క్రికెట్ను నాశనం చేస్తోంది! -
ఫ్యాన్ ఆర్మీ భారత క్రికెట్ను నాశనం చేస్తోంది!
భారత క్రికెట్లో ఇటీవలి కాలంలో ఫ్యాన్ ఆర్మీ,సూపర్ హీరో సంస్కృతి బాగా పెరిగిపోయిందని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఇది భారత క్రికెట్ను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపాడు. ఆటగాళ్ల కంటే వారి పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని, దీనివల్ల ఫ్యాన్వార్ పెరిగిపోతుందన్నాడు. కోల్కతాలో జరిగిన రేవ్ స్పోర్ట్స్ కాన్క్లేవ్ కార్యక్రమానికి హాజరైన అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఈ ఆటగాడికి ఆ ఆటగాడితో సమస్య ఉంది. అందుకే ఆ ఆటగాడు జట్టులో లేడు.. ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో చదువుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాంటివే తరచుగ2ఆ కనబడితే సహజంగానే ఏదో జరుగుతుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఇది మానవసహజం. కోచ్ గౌతమ్ గంభీర్ చేయాల్సిన పని చాలా ఉంది. జట్టులో నుంచి నేను, కోహ్లీ, రోహిత్ వెళ్లిపోవాలని అతడు భావించినా పర్వాలేదు. అది అతడి పని. నేను ఎప్పుడూ అహాన్ని వదిలించుకోవాలనే చూశాను. ఇక 25 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాపై వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ మ్యాచ్లో భారత్ గెలిచింది కాబట్టి లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. అది కేవలం లక్ష్మణ్ వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాదు.. జట్టు విజయం కూడా. అభిమానులు క్రికెటర్లను ఆరాధించవచ్చు, కానీ డ్రెస్సింగ్రూమ్లో వ్యక్తులకన్నా జట్టుకే అధిక ప్రాధాన్యం ఉంటుంది’ అని అశ్విన్ వెల్లడించాడు. చదవండి: అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు! -
అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్రాండ్ను కేవలం జట్టుకు ఉపయోగిస్తే సరిపోదని, అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి ముందుకు పంపితేనే ప్రయోజనం ఉంటుందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు సంజూ శాంసన్ లాంటి క్రికెటర్ సీఎస్కేలో చేరడం ఆ జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చనుందని, ధోని స్థానంలో ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగల సత్తా శాంసన్కు ఉందని తెలిపాడు. ‘సీఎస్కేకు ధోని పేరు అదనపు బ్రాండ్ అని చెప్పొచ్చు. సీఎస్ేపేరు చెప్పగానే అందరి నోటి నుంచి వచ్చే మొదటి పేరు ధోనిదే. అయితే గత కొన్నేళ్లుగా ధోని తూతూమంత్రంగానే జట్టులో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో లోయర్ ఆర్డర్ లోరావడంతో ఎక్కువగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ ధోని బ్యాట్తో ఇప్పటికీ ప్రభావం చూపగలడు. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో 8,9వ స్థానంలో ధోని బ్యాటింగ్కు దిగితే జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో ధోని బ్యాటింగ్ ఆర్డర్లో కచ్చితంగా ముందుగానే క్రీజులోకి రావాలి. కనీసం ఆరో స్థానంలో అయినా బ్యాటింగ్కు వస్తే బాగుంటుంది.నేనైతే మాత్రం ధోని నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా. గత సీజన్ల మాదిరి ఈసారి అలా జరగకూడదని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ తన తొలి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 3న ఆర్సీబీతో, ఏప్రిల్ 5న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.చదవండి: పెషావర్కు వెళ్లొద్దు.. ఆసీస్ ఆటగాళ్లకు హెచ్చరిక! -
పెషావర్కు వెళ్లొద్దు.. ఆసీస్ ఆటగాళ్లకు హెచ్చరిక!
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో మార్చి 26 నుంచి మొదలుకావాల్సిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సందిగ్ధంలో పడింది. తాజాగా అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 400 మంది చనిపోగా, మరో 250 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధంతో పశ్చిమాసియా ఇప్పటికే రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా పాల్గొనాల్సి ఉంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్వెల్ సహా చాలా మంది ఆసీస క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలపై నిషేధముంది. తాజాగా ఆసీస్ ఆటగాళ్లు పీఎస్ఎల్లో పాల్గొనేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు కొన్ని షరతుల మీద అనుమతి ఇచ్చింది. అఫ్గానిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పెషావర్కు దూరంగా ఉండాలని తెలిపింది. అయితే పెషావర్ జాల్మీ పేరుతో పీఎస్ఎల్లో ఒక జట్టు ఉండడంతో కచ్చితంగా మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. అయితే పాక్-ఆఫ్గన్ యుద్ధం కారణంగా పెషావర్ ప్రస్తుతం ‘నో ట్రావెల్ జోన్’లో ఉంది. ఈ కారణంగానే ఒకవేళ మ్యాచ్లు ఆడేందుకు పెషావర్కు వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందని ఆసీస్ క్రికెట్ బోర్డు భయపడుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 28న పెషావర్ జాల్మీ, రావల్పిండి మధ్య జరగనున్న మ్యాచ్కు పెషావర్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. పెషావర్ జాల్మీ జట్టులోనే ఆరోన్ హర్డీ ఉండగా, రావల్పిండి జట్టులో జేక్ ప్రేజర్ మెక్గుర్క్ ఉన్నాడు. అంతేకాదు ఒకవేళ ఏదైనా భద్రతా సమస్యలు తలెత్తినా ఆటగాళ్లను ప్రత్యేక ఫ్లైట్ో తరలించేందుకు సిద్ధంగా ఉంటామని పీఎస్ఎల్ నిర్వాహకులు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి రెండు రోజుల మందు మార్చి 26న పీఎస్ఎల్ సీజన్కు తెరలేవనుంది.చదవండి: ఇరాన్ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా! -
’ఇంకా నేర్చుకుంటూనే ఉండు.. సెలక్టర్లకు బుద్ధి లేదు’
పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్పై ఆ దేశ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ విమర్శల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా నేర్చుకునే దశలోనూ ఉన్నాడంటూ చురకలు అంటించాడు. ఇప్పటికైనా ఆట తీరు మార్చుకోకపోతే జట్టులో కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డాడు.చేదు అనుభవం.. బంగ్లా చేతిలో చిత్తుటీ20 ప్రపంచకప్-2026లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలోనూ చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్లో 2-1తో ఓడిపోయి దాదాపు పదకొండేళ్ల తర్వాత.. తొలిసారి బంగ్లాదేశ్కు సిరీస్ కోల్పోయింది.షాహిన్ ఆఫ్రిది సారథ్యంలో బంగ్లాతో వన్డే సిరీస్ ఆడిన పాకిస్తాన్ జట్టులో రిజ్వాన్ ఒక్కటే సీనియర్ మోస్ట్ ప్లేయర్. అయితే, ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 58 పరుగులే చేశాడు.అసలు టెక్నికే సరిగ్గా లేదుఈ నేపథ్యంలో అహ్మద్ షెజాద్ రిజ్వాన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బంతులు నువ్వు ఆడగలిగేలానే పడుతున్నాయి రిజ్వాన్ సాబ్. నువ్వు చాలా సమయం తీసుకుంటున్నావు. అయినా సరే బంతిని బాదలేకపోతున్నావు.అసలు టెక్నికే సరిగ్గా లేదు. లెగ్ సైడ్ ఆడాల్సింది. ఇన్నేళ్లు గడిచినా నువ్వింకా నేర్చుకునే దశలోనే ఉన్నావు. అసలు నీ ఆటలో ఏమైనా పురోగతి ఉందా? టీ20 ప్రపంచకప్ జట్టులో నీకు స్థానమే లేదు.బుద్ధి రావడం లేదువన్డేల్లోనైనా అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్ వంటి జట్టుపై నువ్వు సెంచరీలు బాదాల్సింది. కానీ సెలక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించేలా చెత్తగా ఆడావు. నిన్ను జట్టుకు ఎంపిక చేసే వాళ్లకు కూడా బుద్ధి రావడం లేదు’’ అని అహ్మద్ షెజాద్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా 2015లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన రిజ్వాన్.. ఇప్పటి వరకు 41 టెస్టుల్లో 2399, 103 వన్డేల్లో 2979, 106 టీ20లలో 3414 పరుగులు సాధించాడు.చదవండి: కోహ్లి, గేల్ కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్


