breaking news
Cricket
-
శ్రీలంక హెడ్ కోచ్గా టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తి
తాము సంయుక్తంగా (భారత్తో పాటు) ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్-2026లో ఘోరంగా విఫలమైన (సూపర్-8 దశలో నిష్క్రమణ) తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు ప్రక్షాళన చేపట్టింది. టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తిని హెడ్ కోచ్గా ఎంపిక చేసుకుంది. అతని పేరు గ్యారీ కిర్స్టన్. ఈ సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ 2011లో టీమిండియాను జగజ్జేతగా (హెడ్ కోచ్గా) నిలిపాడు.పొట్టి ప్రపంచకప్ వైఫల్యాల నేపథ్యంలో అప్పటివరకు హెడ్ కోచ్గా ఉండిన సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేయడంతో లంక క్రికెట్ బోర్డు కిర్స్టన్ను ఎంపిక చేసింది. కిర్స్టన్ రెండేళ్ల ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 15న బాధ్యతలు చేపడతారు. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా లంక క్రికెట్ కిర్స్టన్ నియామకం చేపట్టింది.కిర్స్టన్ను హెడ్ కోచ్గా మంచి ట్రాక్ ఉంది. అంతర్జాతీయంగా, ఐపీఎల్లో అతను విజయవంతమైన జట్లకు కోచ్గా వ్యవహరించాడు. భారత్ను వన్డే ప్రపంచ ఛాంపియన్గా నిలపడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి కూడా చేర్చాడు. అలాగే తన సొంత జట్టు దక్షిణాఫ్రికాకు కూడా విజయవంతంగా సేవలందించాడు. అతని కెరీర్లో ఏదైనా ఫెయిల్యూర్ ఉందా అంటే అది పాకిస్తాన్ వైట్ బాల్ జట్టుకు కోచ్గా సేవలందించడమే. పాక్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే అతను రాజీనామా చేశాడు (బోర్డు మరియు ఆటగాళ్లతో విభేదాల కారణంగా).ఐపీఎల్లో కిర్స్టన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలతో పని చేశారు. టైటాన్స్ 2022లో తొలి సీజన్లోనే టైటిల్ గెలిచినప్పుడు అతను బ్యాటింగ్ కోచ్గా ఉన్నారు. 2027 వన్డే ప్రపంచకప్కు శ్రీలంకను నేరుగా అర్హత సాధించేలా చేయడమే కిర్స్టన్ ప్రధాన లక్ష్యం. లంక క్రికెట్ కొద్ది రోజుల క్రితమే తమ మహిళల జట్టు కోచ్ను ( జేమీ సిడ్డన్స్) కూడా మార్చింది. -
ఈ విజయం వారిద్దరికీ అంకితం: గంభీర్
టీమిండియా సొంతగడ్డపై టి20 ప్రపంచకప్ విజేతగా నిలవడంతో హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ పేరు మారుమోగుతోంది. మొన్నటి వరకు అతడిని తిట్టిపోసిన వారు కూడా ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా క్రెడిట్ అంతా గౌతీదేనని పొగుడుతున్నారు. గంభీర్ మాత్రం ఇద్దరు దిగ్గజాల పేర్లు చెప్పాడు. మెన్ ఇన్ బ్లూ విజయాల వెనుక వీరిద్దరూ ఉన్నారని మీడియా ముఖంగా ప్రకటించాడు.మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడాడు గంభీర్. టీమిండియా టి20 ప్రపంచకప్ విజయాన్ని ఎవరికి అంకితం చేస్తారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు గంభీర్ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చాడు. ఎవరూ ఊహించని పేర్లు చెప్పాడు. వారే రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్. టీమిండియా విజయాల్లో వీరిద్దరి పాత్ర ఎంతో ఉందని గంభీర్ గుర్తు చేసుకున్నాడు."టి20 ప్రపంచకప్ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితం చేస్తున్నాను. భారత జట్టును ద్రవిడ్ ఒక స్థానంలో ఉంచారు. అలాగే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను లక్ష్మణ్ క్రమపద్ధతిలో నడిపిస్తూ జట్టుకు విలువైన సేవలు అందిస్తున్నార"ని గంభీర్ పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్.. గంభీర్ కంటే టీమిండియా హెచ్కోచ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.వారిద్దరికీ కృతజ్ఞతలుఐసీసీ ప్రస్తుత చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జైషా తనకు కష్టకాలంలో అండగా నిలిచారని వెల్లడించారు. గతేడాది స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్నప్పుడు జైషా దన్నుగా నిలిచారని తెలిపాడు. ఎన్ని విమర్శలు వచ్చినా నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ను పొగిడారు. వీరిద్దరికీ గంభీర్ కృతజ్ఞతలు చెప్పాడు.భయాన్ని వదులుకోవాలితాను తన జట్టుకు జవాబుదారిగా ఉంటానని, సోషల్ మీడియాలోని వ్యక్తులకు కాదని గంభీర్ స్పష్టం చేశాడు. టీమ్ వల్లే తాను కోచ్ కాగలిగానని అన్నాడు. ఓడిపోతామనే భయాన్ని ముందుగా వదులుకోవాలని అభిప్రాయపడ్డాడు. సెమీస్, ఫైనల్లో 250 పరుగులు చేయాలంటే ధైర్యం చూపించాల్సిందేనన్నారు. ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డుల కంటే ట్రోఫీలు గెలవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. తానేప్పుడు నమ్మకం ఆధారంగానే జట్టు సభ్యులను ఎంపిక చేస్తానని చెప్పాడు. చదవండి: సంజు, బుమ్రానే కాదు.. వారిద్దరూ కూడా హీరోలే! -
T20 WC 2026 Final: అరువు తెచ్చుకున్న బ్యాట్తో అరిపించాడు..!
నిన్న (మార్చి 8) జరిగిన టీ20 వరల్డ్కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్ను (2024, 2026), ఓవరాల్గా మూడో పొట్టి ప్రపంచకప్ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.ఫైనల్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగి ఏకపక్ష విజయాన్ని సాధించారు. ముఖ్యంగా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించారు. పవర్ ప్లేలో భారత బ్యాటర్లు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశారు.వరుస వైఫల్యాల తరువాత ఈ మ్యాచ్లో అభిషేక్ విలయతాండవం చేశాడు. కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ తన ఈ అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ను అతను సహచరుడు శివమ్ దూబే నుంచి అరువు తెచ్చుకున్న బ్యాట్తో ఆడినట్లు పేర్కొన్నాడు.అభిషేక్ మాటల్లో.. ఇవాళ నేను శివమ్ దూబే బ్యాట్తో ఆడాను. ఉదయం ఏదో కొత్తగా ప్రయత్నించాలని అనిపించింది. శుభ్మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో దూబే దగ్గరికి వెళ్లి అతని బ్యాట్ తీసుకున్నానని చెప్పాడు. ప్రస్తుత ప్రపంచకప్లో అభిషేక్ భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి ఆరంభ మ్యాచ్లలో ఘోరంగా విఫలమయ్యాడు. హ్యాట్రిక్ డకౌట్లు సహా పేలవ ప్రదర్శనలు చేశాడు. అయితే కీలకమైన ఫైనల్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చి భారత్ భారీ స్కోర్ చేయడానికి పటిష్ట పునాది వేశాడు. సంజూ శాంసన్తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ దశనే మార్చేసింది. ఇలాంటి కీలక ఇన్నింగ్స్ను అతను అరువు తెచ్చుకున్న బ్యాట్తో ఆడటం విశేషం. అభిషేక్కు ముందు నుంచి సెంటిమెంట్లు ఎక్కువ. ఇదే ప్రపంచకప్లో వరుసగా విఫలమవుతున్నాడని ఓ మ్యాచ్లో సిరాజ్ జెర్సీ ధరించి బరిలోకి దిగాడు. అంతకుముందు కూడా టీమిండియా వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాట్తో పలు సందర్భాల్లో ఆడాడు. ఫైనల్గా ఫైనల్లో అరువు తెచ్చుకున్న బ్యాట్తో అరిపించి, భారత్ జగజ్జేతగా అవతరించడంలో తనవంతు పాత్ర పోషించాడు. -
వరల్డ్కప్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
టీ20 వరల్డ్కప్ 2026 ముగిసిన నేపథ్యంలో టీమిండియా తదుపరి షెడ్యూల్ ఎంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. 20 రోజుల గ్యాప్ తర్వాత (మార్చి 28) ఐపీఎల్ 2026 ప్రారంభమవుతుంది. ఈ లీగ్ మే 31 వరకు కొనసాగుతుంది. ఆతర్వాతే టీమిండియా షెడ్యూల్ మొదలవుతుంది.జూన్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఇందులో ఓ టెస్ట్, వన్డే సిరీస్ జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ న్యూ చంఢీఘడ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జూన్ 6–10 వరకు జరుగుతుంది. అనంతరం జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి.ఆతర్వాత భారత్ జులైలో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో.. వన్డేలు ఎడ్జ్బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జులై 14, 16, 19 తేదీల్లో జరుగుతాయి.అనంతరం భారత జట్టు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో 2 టెస్ట్లు, 2 టీ20ల సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. దీని తర్వాత సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఏషియన్ గేమ్స్ జరుగుతాయి. దాని తర్వాత భారత జట్టు స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20లు, 3 వన్డేల సిరీస్లు ఆడుతుంది. అనంతరం స్వదేశంలోనే వెస్టిండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్ట్లు, 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి. ఈ ఏడాది చివర్లో శ్రీలంక జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు జరుగుతాయి. -
బాబర్ ఆజమ్పై వేటు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోచ్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవల బంగ్లాదేశ్ పర్యటన కోసం 15 మంది సభ్యుల వన్డే జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టులో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ లేకపోవడం అభిమానులకు ఆశ్చర్యానికి కలిగించింది. బాబర్ ఇటీవలికాలంలో మిగతా ఫార్మాట్లతో పాటు వన్డేల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అందుకే అతనిపై వేటు పడిందని అంతా అనుకున్నారు. అయితే దీనిపై పాక్ కోచ్ మరోలా వివరణ ఇచ్చాడు.బంగ్లా సిరీస్ నుంచి బాబర్ను తప్పించలేదు. ఈ సిరీస్ను యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే వేదికగా చూస్తున్నాము. బాబర్తో పాటు సైమ్ అయూబ్, నసీమ్ షా కూడా జట్టులో లేరని గుర్తు చేశాడు. మొత్తంగా బాబర్పై పడింది వేటు కాదని, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసమే అతనికి విశ్రాంతినిచ్చారని స్పష్టతనిచ్చాడు.కాగా, బంగ్లా సిరీస్కు దేశీయంగా సత్తా చాటుతున్న అబ్దుల్ సమద్, సాద్ మసూద్, షమైల్ హుస్సేన్, మాజ్ సదాకత్ వంటి యువ ఆటగాళ్లతో పాటు టీ20 వరల్డ్కప్ 2026లో చెలరేగిపోయిన (2 సెంచరీల సాయంతో 383 పరుగులు) సాహిబ్జాదా ఫర్హాన్కు కూడా అవకాశం లభించింది. ఈ జట్టుకు కెప్టెన్గా షాహీన్ అఫ్రిది కొనసాగాడు. కొత్తగా ఆరుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు.బంగ్లా పర్యటనలో పాక్ మూడు వన్డేలు ఆడనుంది. ఢాకాలోని షేక్ ఏ బంగ్లా స్టేడియం వేదికగా మార్చి 11, 13, 15 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి.జట్లు.. పాకిస్తాన్: షాహీన్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్ఱం, హారిస్ రౌఫ్, హుస్సేన్ తలత్, మాజ్ సదాకత్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీమ్, మొహమ్మద్ ఘాజీ ఘోరి, సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా, షమైల్ హుస్సేన్. బంగ్లాదేశ్: మెహిదీ హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తంజిద్ హసన్, నజ్ముల్ హొసైన్ షాంటో, తౌహిద్ హ్రిదోయ్, లిట్టన్ దాస్, ఆఫిఫ్ హొసైన్, మహిదుల్ ఇస్లాం భుయాన్, రిషాద్ హొసైన్, తాన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, నాహిద్ రానా. -
సంజూ శాంసన్ సక్సెస్ వెనుక భారత క్రికెట్ దిగ్గజం
భారత క్రికెట్ చరిత్రలో సంజూ శాంసన్ తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో భారత జట్టుకు మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్ను అందించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టీ20 వరల్డ్కప్-2026లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. తిరిగి టైటిల్ను రిటైన్ చేసుకుంది.అయితే ఈ మెగా టోర్నీలో ఎవరూ ఊహించని విధంగా శాంసన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్' గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు దక్కకపోయిన అతడు ఎక్కడ నిరాశ చెందలేదు. తిరిగి జట్టులోకి వచ్చి సింహంలా గర్జించాడు. వెస్టిండీస్తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ నుంచి తుది పోరు వరకు సంజూ దుమ్ములేపాడు. వరుసగా మూడు మ్యాచ్లలో 80కి పైగా పరుగులు చేసి సత్తాచాటాడు. వెస్టిండీస్పై 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన సంజూ.. ఆ తర్వాత వరుసగా సెమీస్, ఫైనల్లో 89 పరుగులు చేశాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89 పరుగులు చేశాడు. సంజూ మొత్తంగా ఐదు మ్యాచ్ల్లో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచాడు. అయితే సంజూ శాంసన్ సక్సెస్ వెనక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని సంజూ వెల్లడించాడు."అంతా కలలా ఉంది. ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. కివీస్తో సిరీస్లో వైఫల్యం తర్వాత నా కలలు చెదిరిపోయాయి. నేనేం చేయలేనా అని చాలా బాధపడ్డాను. కానీ దేవుడు అండగా నిలిచాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా సహకరించారు.గత రెండు నెలలుగా సచిన్ సర్తో టచ్లో ఉన్నాను. ఆస్ట్రేలియాలో జట్టులో చోటు దక్కక బయట కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడాను. సచిన్ చాలా సలహాలు ఇచ్చారు. ఆయనతో మాట్లాడటంతో మార్గనిర్దేశనం లభించింది. ఇది చాలా పెద్ద ఘనత. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు" సంజూ పేర్కొన్నాడు. -
T20 WC 2026: ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ.. భారత ఆటగాళ్ల డామినేషన్
నిన్న (మార్చి 8) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో ఎడిషన్లో (2024, 2026), ఓవరాల్గా మూడో పొట్టి ప్రపంచకప్ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో శివమ్ దూబే (8 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 3, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆదిలోనే చేతులెత్తేసింది. బుమ్రా (4-0-15-4), అక్షర్ పటేల్ (3-0-27-3), హార్దికా పాండ్యా (4-0-26-1), వరుణ్ చక్రవర్తి (3-0-29-1), అభిషేక్ శర్మ (1-0-5-1) ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటై, 96 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. కివీస్ ఇన్నింగ్స్లో టిమ్ సీఫర్ట్ (52), మిచెల్ సాంట్నర్ (43) మాత్రమే నామమాత్రపు ప్రదర్శనలు చేశారు. 4 వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరిచిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. సూపర్-8 నుంచి భారత విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించాయి.ఇదిలా ఉంటే, టోర్నీ పూర్తయ్యాక ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ను ప్రకటించింది. ఇందులో భారత ఆటగాళ్ల హవా కొనసాగింది. కెప్టెన్గా ఎవరూ ఊహించని ఆటగాడు సికందర్ రజా ఎంపికయ్యాడు. భారత్ నుంచి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా) ఎంపికయ్యారు. 12వ ఆటగాడు కూడా భారత ఆటగాడే (హార్దిక్ పాండ్యా) కావడం విశేషం.ఐసీసీ టీమ్ ఆఫ్ టీ20 వరల్డ్కప్ 2026: సంజూ శాంసన్ (wk), టిమ్ సీఫెర్ట్, ఇషాన్ కిషన్, షిమ్రాన్ హెట్మైర్, సికందర్ రజా (c), శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజారబాని, జస్ప్రీత్ బుమ్రా12వ ఆటగాడు: హార్దిక్ పాండ్యా -
సంజూను యువీతో పోల్చొద్దు.. అతడొక స్పెషల్ ప్లేయర్: గంభీర్
టీమిండియా దాదాపు 15 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. వన్డే ప్రపంచకప్-2023లో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. టీ20 వరల్డ్కప్-2026లో మాత్రం ఎలాంటి పొరపాటు చేయలేదు. రెండున్నరేళ్ల కిందట ఎక్కడైతే ఊహించని పరాభవం చవిచూసిందో.. ఇప్పుడు అదే వేదికలో ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది.ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో న్యూజిలాండ్ను ఓడించి ట్రోఫీని.. మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్ను భారత్ కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్లో మూడు సార్లు ఛాంపియన్గా నిలిచిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే చారిత్రత్మక విజయంలో స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ది కీలక పాత్ర.టోర్నీ ఆరంభంలో తుది జట్టులోనే లేని సంజూ.. ఆ తర్వాత అనుహ్యంగా తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. వరుసగా మూడు కీలక మ్యాచ్లలోనూ హాఫ్ సెంచరీలు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89 పరుగులు చేశాడు.అంతకుముందు వెస్టిండీస్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లోనూ 97 పరుగులతో సత్తాచాటాడు. దీంతో సంజూపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ను 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్తో పోలుస్తున్నారు. యువరాజ్ కూడా అప్పుడు తన అద్బుత ప్రదర్శనలతో ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా నిలిచాడు. ఈ క్రమంలోనే యువీతో సంజూ పోలుస్తున్నారు.అయితే ఇదే విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "యువరాజ్ సింగ్తో సంజూను పోల్చడం సరికాదు. కానీ సంజూ ఏమి చేశాడో మనందరికి తెలుసు. నిజంగా అతడు అద్భుతాలు చేశాడు. వరుసగా మూడు మ్యాచ్లలో 80కు పైగా పరుగులు చేయడం అంత సులువైన విషయం కాదు.ప్రపంచకప్కు ముందు న్యూజిలాండ్ సిరీస్లో విఫలమై, టోర్నీ ప్రారంభంలో బెంచ్కే పరిమితమై, ఆ తర్వాత ఈ తరహా ఇన్నింగ్స్లు ఆడడం నిజంగా గ్రేట్. ఇది అతడిలోని ధైర్యానికి నిదర్శనం. మా నమ్మకాన్ని అతడు నిలబెట్టాడు. సంజూ ఒక స్పెషల్ ప్లేయర్" అని గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.చదవండి: T20 WC 2026: ఫైనల్కు ముందు సిస్టర్ మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన కిషన్ -
వారు లేకుండా భారత్ ప్రపంచకప్ ఎప్పుడూ గెలవలేదు..!
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన నిరాశను భారత జట్టు 2026 పొట్టి ప్రపంచకప్లో తుడిచిపెట్టేసింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు మెన్స్ టీ20 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఇది భారత్కు మూడో టీ20 టైటిల్. మొత్తంగా ఐదో ప్రపంచకప్ (రెండు వన్డే, మూడు టీ20). అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న (మార్చి 8) జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి వరుసగా రెండో ఎడిషన్లో జగజ్జేతగా అవతరించింది.కాగా, టీమిండియా వరల్డ్ కప్ విజయాల వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. 1983 వన్డే వరల్డ్కప్ విజయం నుంచి తాజాగా సాధించిన 2026 టీ20 ప్రపంచకప్ వరకు భారత్ గెలిచిన ప్రతి వరల్డ్ కప్లో ఒక సర్దార్ (పంజాబీ), ఒక కేరళ ఆటగాడు జట్టులో భాగమయ్యారు. 1983లో బల్విందర్ సంధూ (సర్దార్), సునీల్ వాల్సన్ (కేరళ)తో ఈ సంప్రదాయం మొదలైంది. 2007 (టీ20), 2011 (వన్డే) ప్రపంచకప్లలో శ్రీశాంత్ (కేరళ), హర్భజన్ సింగ్ (సర్దార్) కీలక పాత్ర పోషించారు. 2024, 2026 టీ20 వరల్డ్ కప్లలో సంజూ శాంసన్ (కేరళ), అర్ష్దీప్ సింగ్ (సర్దార్) ఈ ప్యాటర్న్ను కొనసాగించారు. రాకింగ్ సంజూ 2026 టీ20 వరల్డ్ కప్లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై అజేయమైన 97 పరుగులు (50 బంతుల్లో) చేసిన సంజూ.. సెమీస్లో ఇంగ్లండ్పై, ఫైనల్లో న్యూజిలాండ్పై తలో 89 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 5 ఇన్నింగ్స్ల్లో 321 పరుగులు సాధించాడు. 2024 ఎడిషన్లో సంజూ పూర్తిగా బెంచ్పైనే గడిపాడు. ఇది 1983లో వాల్సన్ పరిస్థితిని గుర్తు చేసింది. షేకింగ్ సర్దార్2024 ప్రపంచకప్లో టాప్ వికెట్ టేకర్గా (17 వికెట్లు) నిలిచి భారత్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన అర్షదీప్ సింగ్.. తాజా ఎడిషన్లోనూ (2026) ఇంచుమించు అదే తరహా ప్రదర్శనలతో (9 వికెట్లు) షేకింగ్ సర్దార్ అనిపించుకున్నాడు. అర్షదీప్ తన నిలకడ ప్రదర్శనలతో భారత్కు వరుసగా రెండు టీ20 టైటిళ్లు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. -
ఫైనల్కు ముందు సిస్టర్ మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన కిషన్
టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ది కీలక పాత్ర. అభిషేక్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఇషాన్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్లతో 54 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ వెనుక ఒక గుండెల్ని పిండేసే విషాదం దాగి ఉంది. ఓ వైపు కన్నీళ్లను దిగమింగుతూనే తన జట్టును వరల్డ్ ఛాంపియన్గా నిలిపాడు.ఏమి జరిగిందంటే?ఫైనల్కు ఒక్క రోజు ముందు (శనివారం) ఇషాన్ కిషన్ కుటంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కిషన్ కజిన్ సోదరి (వైష్ణవి సింగ్), ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోల్కతాలో ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఊహించని సంఘటన జరిగింది. వారిద్దరి మరణం కిషన్ కుటుంబాన్ని కుదిపేసింది.ఆరు నెలల పసికందు, మూడేళ్ల చిన్నారి అనాథలయ్యారు. ఈ విషయంపై కిషన్ తండ్రి ప్రణవ్ పాండే స్పందిస్తూ.. చాలా ఘోరం జరిగిపోయింది. మేము చాలా బాధలో ఉన్నాము అని అన్నారు. వాస్తవానికి ఆయన అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్కు హాజరావ్వాల్సి ఉండేది. కానీ తమ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం కారణంగా ప్రణవ్ కోల్కతాలో ఉండిపోయారు. మ్యాచ్ అనంతరం కిషన్ కూడా మాట్లాడుతూ.. నిన్న నేను నా కజిన్ సోదరిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయాను. ఆమె ఎప్పుడూ నేను బాగా ఆడాలని కోరుకునేది. ఇప్పుడు నన్ను ఛాంపియన్గా చూసేందుకు ఆమె మాతో లేదు. చాలా బాధగా ఉందని కిషన్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన ఇషాన్ దుమ్ములేపుతున్నాడు.చదవండి: T20 WC 2026: సంజూ, బుమ్రానే కాదు.. వారిద్దరూ కూడా హీరోలే -
‘తుదిజట్టులో అతడు లేకుంటే టీమిండియాకు ఓటమే’
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో రాణించి న్యూజిలాండ్ను మట్టికరిపించింది. అహ్మదాబాద్లో కివీస్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ముచ్చటగా మూడోసారి పొట్టి క్రికెట్ వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్పాన్ పఠాన్ (Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత తుదిజట్టులో సంజూ శాంసన్ లేకపోయి ఉంటే.. సూర్య సేన ప్రయాణం ఇక్కడిదాకా సాగేది కాదన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..తుదిజట్టులో లేకపోయి ఉంటే..‘‘ఈ ప్రపంచకప్ టోర్నీలో.. ఒకవేళ సంజూ శాంసన్ గనుక భారత తుదిజట్టులో లేకపోయి ఉంటే.. టీమిండియా ట్రోఫీ గెలిచేది కాదు. వెస్టిండీస్తో సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఇక ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లోనూ అత్యద్భుత రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఫైనల్లోనూ ఇదే పునరావృతం చేసి ముచ్చటగా, వరుసగా మూడో భారీ హాఫ్ సెంచరీ సాధించాడు. నిజానికి తన కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి.అయినా సరే అతడు కఠినంగా శ్రమిస్తూ ధైర్యంగా ముందుకు సాగాడు. అందుకే ఆ దేవుడు అతడి కష్టానికి తగిన గుర్తింపు వచ్చేలా చేశాడు. సంజూ హార్డ్వర్క్కు లభించిన స్వీటెస్ట్ రివార్డు ఇది’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్పై ప్రశంసలు కురిపించాడు.నాకౌట్ మ్యాచ్లలో సంజూ విశ్వరూపంకాగా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే తుదిజట్టులో సంజూ చోటు కోల్పోయాడు. అయితే, నమీబియాతో మ్యాచ్కు అభిషేక్ శర్మ కడుపు నొప్పి వల్ల దూరం కాగా మళ్లీ తుదిజట్టులోకి వచ్చాడు. అనంతరం జింబాబ్వేతో మ్యాచ్లోనూ ఆడాడు.అయితే, నాకౌట్ మ్యాచ్లలో సంజూ విశ్వరూపం చూపించాడు. వెస్టిండీస్తో మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్తో సెమీస్లో 89, న్యూజిలాండ్తో ఫైనల్లో 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: సంజూ, ఇషాన్ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ మాజీ క్రికెటర్All yours, Sanju! You’ve earned every bit of it! ❤️#T20WorldCup #INDvNZ pic.twitter.com/Ya4aJeeyyL— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
ఆసీస్ క్రికెటర్ రిటైర్మెంట్.. భుజాలపై మోసిన ప్లేయర్లు
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్లో ఓ శకం ముగిసింది. దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. టీమిండియాతో జరిగిన ఏకైక టెస్టు తర్వాత హీలీ ఆట నుంచి తప్పుకొంది. మ్యాచ్ ముగిశాక సహచరులు అలీసాను తమ భుజాలపై ఎత్తుకొని మైదానం చుట్టూ తిరిగారు. కాగా 35 ఏళ్ల అలీసా 11 టెస్టుల్లో 502 పరుగులు... 126 వన్డేల్లో 3777 పరుగులు... 162 టి20ల్లో 3054 పరుగులు సాధించింది. మూడు ఫార్మాట్లలో కలిపి అలీసా 173 క్యాచ్లు తీసుకొని, 103 స్టంపింగ్లు చేసింది.మిచెల్ స్టార్క్ సతీమణితనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీలీ.. ఆస్ట్రేలియా పురుషుల జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సతీమణి కూడా!.. భర్త మైదానంలో బ్యాటర్లను హడలెత్తిస్తుంటే.. భార్యేమో బౌలర్ల పాలిట విలన్ అయిన సందర్భాలు కోకొల్లలు. ఇక హీలీ చివరి మ్యాచ్ చూసేందుకు స్టార్క్ మైదానానికి వచ్చి ఆమెను చీర్ చేశాడు.ఇదిలా ఉంటే.. ఆరుసార్లు ఐసీసీ మహిళల టీ20 ప్రంపచకప్ ముద్దాడిన ఏకైక ప్లేయర్గా హీలీ రికార్డు సాధించింది. అంతేకాదు... రెండు వన్డే వరల్డ్కప్లు గెలిచిన ఘనత ఆమె సొంతం. అదే విధంగా మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డు కూడా హీలీ పేరిటే ఉండగా.... అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్గానూ గుర్తింపు దక్కించుకుంది. View this post on Instagram A post shared by Aussie Women's Cricket Team (@auswomencricket)రికార్డుల మోతఅంతేకాదు.. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్ కీపర్గానూ.. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్కీపర్గానూ హీలీ అరుదైన ఘనత సాధించింది. ఇక ఒకే సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత... ఇలా చెప్పుకుంటూ పోతే హీలీ రికార్డుల జాబితా పెద్దగానే ఉంది. మూడో రోజేఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఘనంగా ప్రారంభించిన భారత మహిళల జట్టు ఓవరాల్ చాంపియన్ఫిప్ను ఘోరంగా ముగించిన సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్ను 2–1తో వశం చేసుకున్న హర్మన్ప్రీత్ బృందం... మూడు వన్డేల సిరీస్లో వైట్వాష్ అయ్యింది. ఏకైక డే అండ్ నైట్ టెస్టులో పూర్తిగా చేతులెత్తేసింది. 4 రోజుల పింక్బాల్ టెస్టును కనీసం రెండున్నర రోజులైనా ఆడలేక మూడో రోజే ప్రత్యర్థి ముందు మోకరిల్లింది.ఓవర్నైట్ స్కోరు 105/6తో ఆదివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ 48.2 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. క్రితం రోజు బ్యాటర్ ప్రతీక రావల్ (137 బంతుల్లో 63; 8 ఫోర్లు) చేసిన అర్ధసెంచరీ భారత్ను ఇన్నింగ్స్ పరాజయం నుంచి తప్పించింది కానీ పరాభవం నుంచి మాత్రం గట్టెక్కించలేకపోయింది. ప్రతీక, స్నేహ్ రాణా (54 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఏడో వికెట్కు 50 పరుగులు జోడించారు.ఏకైక టెస్టు విజయంతోఈ కాస్త పోరాటం చేస్తున్న వీరిద్దరిని యాష్లే గార్డ్నర్ (2/8) అవుట్ చేయగా, అలానా కింగ్ (2/23) టెయిలెండర్ల పనిపట్టింది. కేవలం 25 పరుగుల నామమాత్రమైన లక్ష్యాన్ని ఆతిథ్య జట్టుకు నిర్దేశించగా, ఓపెనర్లు జార్జియా వోల్ (16 నాటౌట్; 4 ఫోర్లు), ఫోబీ లిచ్ఫీల్డ్ (11 నాటౌట్; 1 ఫోర్) 4.3 ఓవర్లలోనే అజేయంగా ముగించారు. శతకం సహా రెండు ఇన్నింగ్స్ల్లో (4/46, 2/15) ఆరు వికెట్లు తీసిన అనాబెల్ సదర్లాండ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.టీ20లు, వన్డేలు, ఒక టెస్టు కలిపి సాగిన ఓవరాల్ చాంపియన్షిప్ను 12–4 పాయింట్ల తేడాతో ఆసీస్ జట్టు చేజిక్కించుకుంది. పరిమిత ఓవర్ల మ్యాచ్ విజయానికి 2 పాయింట్లు, టెస్టు గెలుపునకు 4 పాయింట్లు కేటాయించారు. రెండు టీ20లు నెగ్గిన భారత్ ఖాతాలో 4 పాయింట్లే ఉండగా, ఒక టి20, మూడు వన్డేలు, ఏకైక టెస్టు విజయంతో ఆసీస్ డజను పాయింట్లను సాధించింది. View this post on Instagram A post shared by Aussie Women's Cricket Team (@auswomencricket) -
సంజూ, బుమ్రానే కాదు.. వారిద్దరూ కూడా హీరోలే
సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ త్రయం గురించే మాట్లాడుకుంటున్నారు. టీ20 వరల్డ్కప్-2026 వీరివల్లే భారత్ గెలిచిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అవును నిజమే. కానీ వీరితో పాటు మరో ఇద్దరు సైలెంట్ హీరోలు కూడా ఉన్నారు. భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలవడంలో వారిద్దరూ పోషించిన పాత్ర వెలకట్టలేనిది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బంతితో వికెట్లు తీయడం, బ్యాట్తో మెరుపులు మెరిపించడం వారి స్పెషాలిటీ. ఒకరెమో తన మెరుపు బ్యాటింగ్తో జట్టుకు మంచి ఫినిషింగ్ అందించగా.. మరొకరు తన స్పిన్ మయాజాలంతో కివీస్ అగ్రశ్రేణి బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. వారే ఆల్రౌండర్లు శివమ్ దూబే, అక్షర్ పటేల్.సిక్సర్ల దూబేఈ టోర్నీ అసాంతం దూబే అద్భతమైన ప్రదర్శన కనబరిచాడు. బ్యాట్తో పాటు బంతితోనూ రాణించాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి వారు ఆరంభంలో దూకుడుగా ఆడితే, దూబే చివరిలో బ్యాటింగ్కు వచ్చి తనపని తాను చేసుకోపోయేవాడు. దాదాపుగా ప్రతీ మ్యాచ్లోనూ అతడి బ్యాట్ నుంచి పరుగులు వచ్చాయి. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత బ్యాటర్లు మొత్తం విఫలమైనా.. దూబే మాత్రం రాణించాడు. కీలకమైన సెమీఫైనల్, ఫైనల్లోనూ తన మార్క్ను చూపించాడు. ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లో సెకెండ్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఈ ముంబై ఆటగాడు తన అద్భుత బ్యాటింగ్తో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా ఫైనల్లో కూడా దూబే బ్యాట్ ఝూలిపించాడు. భారత్ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి తడబడుతున్న సమయంలో దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ముఖ్యంగా నీషమ్ వేసిన చివరి ఓవర్లో అతడు ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఆ మెరుపు ఇన్నింగ్స్ వల్లే భారత్ 255 పరుగుల భారీ స్కోరును అందుకోగలిగింది. దూబే మొత్తంగా 9 మ్యాచ్లలో 235 పరుగులు చేశాడు. దూబే ఆడిన చిన్న చిన్న ఇన్నింగ్స్లు ఈ రోజు భారత్ను విశ్వవిజేతగా నిలిపింది.అక్షర్ అదుర్స్భారత్ ఫైనల్కు చేరి కప్ కొట్టడంలో అక్షర్ది కీలక పాత్ర. వాంఖడే వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లో పటేల్ బంతితో రాణించకపోయినప్పటికి ఫీల్డింగ్లో మాత్రం అద్భుతాలు చేశాడు. అక్షర్ సంచలన క్యాచ్లతో హ్యారీ బ్రూక్, విల్ జాక్స్ వంటి విధ్వంసకర ప్లేయర్లను పెవిలియన్కు పంపాడు.ఒకవేళ అక్షర్ ఆ క్యాచ్లను అందుకోపోయింటే కథ మరోలా ఉండేది. అప్పటికే ఇంగ్లండ్ భారత్ను ఓడించే అంత పనిచేసింది. ఫైనల్ మ్యాచ్లోనూ అక్షర్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ వంటి డేంజరస్ ప్లేయర్లను ఔట్ చేసి భారత్కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ ప్రపంచ కప్లో అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు.చదవండి: T20 WC Final: రవిశాస్త్రికి ఏమైంది?Crowd started chanting "Dube !! Show us your muscles" when they saw Shivam Dube😅❤ Then Shivam Dube finally started flexing his muscles😂🔥pic.twitter.com/hOLNZDv7uy— Gillfied⁷ (@Gill_Iss) March 9, 2026 -
T20 WC Final: రవిశాస్త్రికి ఏమైంది?
క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ కామెంటేటర్గా టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రికి పేరుంది. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఛలోక్తులు, చణుకులు విసరడంలో అతడు దిట్ట. ఎన్నో చిరస్మరణీయ విజయాలు, అద్భుతమైన క్షణాలను తన వ్యాఖ్యానంతో మరింత గుర్తుండిపోయేలా చేసిన ఘనత అతడిది.ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్కప్లో సొంతగడ్డపై శ్రీలంకతో ఫైనల్లో.. నాటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్.. ధోని సిక్స్ బాది విజయాన్ని ఖరారు చేయగానే.. ‘‘ఎంఎస్ ధోని తనదైన శైలిలో ముగింపు ఇచ్చాడు( "MS Dhoni finishes off in style" )’’ అన్న రవిశాస్త్రి మాటలు ఇప్పటికీ.. క్రికెట్ అభిమానుల చెవుల్లో మారుమ్రోగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.అంతటి రవిశాస్త్రి కామెంట్రీలోనూఅయితే, అంతటి రవిశాస్త్రి కామెంట్రీలో కూడా కొన్నిసార్లు తప్పులు దొర్లడం సహజం. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్ సందర్భంగా అతడు చేసిన పొరపాటు నెట్టింట ట్రోలింగ్కు కారణమైంది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.టాపార్డర్ దుమ్ములేపడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు సాధించింది. తద్వారా పొట్టి ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ను.. భారత్ 159 పరుగులకే ఆలౌట్ చేసింది.తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతోకివీస్ ఇన్నింగ్స్లో మూడో ఓవర్లోనే.. అక్షర్ పటేల్ తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. అభిషేక్ శర్మ బౌలింగ్లో జేకబ్ డఫీ ఇచ్చిన క్యాచ్ను తిలక్ వర్మ పట్టడంతో న్యూజిలాండ్ కథ ముగిసింది. అయితే, తిలక్ క్యాచ్ అందుకున్న సమయంలో రవిశాస్త్రి.. న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది అని కామెంట్రీలో చెప్పాడు.అద్భుతమైన ప్రదర్శనఆ వెంటనే తప్పును గ్రహించి.. ‘‘నిజానికి అంతా అయిపోయింది.. టీమిండియా మూడోసారి ప్రపంచకప్ గెలిచింది. వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. అంతేకాదు.. సొంతగడ్డపై టీ20 వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శన’’ అని రవిశాస్త్రి టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు.వన్డే వరల్డ్కప్-2023లో ఆస్ట్రేలియాకు టైటిల్ కోల్పోయిన వేదికపైనే.. ఇప్పుడు టీ20 వరల్డ్కప్ గెలిచి సత్తా చాటిందని కొనియాడాడు. రవిశాస్త్రి కామెంట్రీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.చదవండి: సంజూ, ఇషాన్ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ మాజీ క్రికెటర్Let the celebrations begin 🤩India are #T20WorldCup 2026 champions 🏆 pic.twitter.com/zGgQtwODwH— ICC (@ICC) March 8, 2026 -
అర్ష్దీప్.. ఇదేనా నీ సంస్కారం? ఫ్యాన్స్ ఫైర్
టీ20 వరల్డ్కప్-2026 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించిన భారత్ మూడోసారి టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే ఈ తుది పోరులో టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ క్రీడా స్పూర్తిగా విరుద్దంగా ప్రవర్తించాడు. మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్తో అర్ష్దీప్ గొడవపడ్డాడు.అసలేమి జరిగిందంటే?న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో తొలి రెండు బంతులను మిచెల్ భారీ సిక్సర్లగా మలిచాడు. అదే ఓవర్లో ఐదో బంతికి నాన్స్ట్రైకర్ ఎండ్ వైపు మిచెల్ ఆడాడు. అయితే ఫాలో త్రులో బంతిని అందుకున్న అర్ష్దీప్ కోపంతో వికెట్ల వైపు త్రో చేశాడు.అయితే బంతి నేరుగా వెళ్లి మిచెల్కు బలంగా తాకింది. క్రీజులో ఉన్నప్పటికి తనపైకి బంతి విసిరడంతో మిచెల్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. అర్ష్దీప్ వైపు కోపంగా చూస్తూ, గట్టిగా అరుస్తూ అతని వైపు వెళ్లాడు. ఆ సమయంలో అర్ష్దీప్ మొదట క్షమాపణ చెప్పకుండా వెనక్కి నడవడంతో మిచెల్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని మిచెల్కు సర్దిచెప్పాడు. అంపైర్ కూడా అర్ష్దీప్ను పిలిచి హెచ్చరించాడు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత అర్ష్దీప్ స్వయంగా మిచెల్ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది.కానీ అర్ష్దీప్ ప్రవర్తనను భారత అభిమానులు సైతం తప్పుబడుతున్నారు. సారి చెప్పినా, అర్ష్దీప్ అలా చేయడం సరికాదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్లో అర్ష్దీప్ తన 4 ఓవర్లలో కోటాలో32 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.చదవండి: T20 WC 2026: టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?Rohit Sharma to Arshdeep Singh regarding Daryl Mitchell incident🎙;Paaji !! Since when do you start doing so much sledging😭❤🔥pic.twitter.com/5l49estQO4— Gillfied⁷ (@Gill_Iss) March 8, 2026 -
టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?
పొట్టి ఫార్మాట్లో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి చాటి చెప్పింది. టీ20 ప్రపంచకప్-2026 విజేతగా సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు నిలిచింది. గతంలో చేదు జ్ఞాపకాలు మిగిల్చిన చోట మన జట్టు అద్భుతాలు సృష్టించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుదిపోరులో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.ఈ తుది పోరులో భారత జట్టు ఆల్రౌండ్షోతో అదరగొట్టింది. ఈ చారిత్రత్మక విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరు కీలక పాత్ర పోషించారు. ఈ విజయాన్ని దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన భారత్కు ఎంత ప్రైజ్ మనీ దక్కిందో ఓసారి పరిశీలిద్దాం.ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?విజేత టీమిండియాకు రూ.27.48 కోట్ల నగదు బహుమతి లభించింది. టీ20 వరల్డ్కప్ చరిత్రలో ఇదే అత్యధికం . అదేవిధంగా రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్కు రూ.14.65 కోట్ల ప్రైజ్మనీ దక్కనుంది. సెమీఫైనలిస్ట్స్ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సుమారు రూ. 7.24 కోట్లు అందుకోనున్నాయి. గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయిన ప్రతి జట్టుకు దాదాపు రూ. 2.29 కోట్లు లభించనుంది. 2024 టీ20 వరల్డ్ కప్తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీని 20 శాతం వరకు భారీగా పెంచారు. ఐసీసీ ఏకంగా ఈ ఏడాది వరల్డ్కప్ ప్రైజ్మనీని రూ.123 కోట్లగా నిర్ణయించింది. బీసీసీఐ సైతం భారత జట్టుకు భారీ క్యాష్ రివార్డును ప్రకటించనుంది.చదవండి: అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్ -
అబ్బా.. అదొక కిల్లర్ కాంబో: ధోని పోస్ట్ వైరల్
టీమిండియా చరిత్ర పునరావృతం చేసింది. బార్బడోస్ వేదికగా 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్.. తాజాగా ఆదివారం నాటి ఫైనల్లోనూ జయభేరి మోగించింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్ను ఏకంగా 96 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి.. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు సాధించింది.ఈ నేపథ్యంలో యావత్ భారతావని సూర్య సేన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ.. ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్, టీమిండియాకు తొలి టీ20 వరల్డ్కప్ అందించిన సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తనదైన శైలిలో స్పందించాడు. జట్టుతో పాటు.. ఒకప్పటి సహచర ఆటగాడు, ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ గురించి ఆసక్తికర పోస్టు చేశాడు.కన్నులపండుగ‘‘అహ్మదాబాద్లో చరిత్ర సృష్టించబడింది. టీమిండియాకు శుభాకాంక్షలు. సహాయక సిబ్బంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులకు అభినందనలు. ఈరోజు టీమిండియా ఆట కన్నులపండుగగా సాగింది.అబ్బా అదొక కిల్లర్ కాంబోకోచ్ సాహెబ్.. మీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ నవ్వు.. అబ్బా అదొక కిల్లర్ కాంబో. మీరు అద్భుతం చేశారు. ఈ విజయాన్ని ఆస్వాదించండి బాయ్స్. ఇక బుమ్రా గురించి కూడా ఒక మాట చెప్పాలిగా.. అతడొక చాంపియన్ బౌలర్’’ అని ధోని ఇన్స్టా వేదికగా రాసుకొచ్చాడు. ఇందుకు టీమిండియా ట్రోఫీతో ఉన్న ఫొటో జతచేశాడు. ధోని షేర్ చేసిన ఈ పోస్టు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆరు మిలియన్లకు పైగా లైకులతో దూసుకుపోతోంది. ఏకైక కెప్టెన్గాకాగా ఐసీసీ 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్కప్ను ధోని సారథ్యంలో భారత్ గెలుచుకుంది. ఈ జట్టులో గంభీర్ సభ్యుడు. ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్కప్ (ఇందులోనూ గంభీర్ సభ్యుడే), 2013లో చాంపియన్స్ ట్రోఫీని ధోని అందించాడు. తద్వారా భారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఏకైక కెప్టెన్గా కొనసాగుతున్నాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 255/5(20)👉న్యూజిలాండ్ స్కోరు: 159(19)👉ఫలితం: 96 పరుగుల తేడాతో భారత్ జయభేరిచదవండి: అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్The ICC Men's #T20WorldCup 2026 Champions, everyone! ⭐️ ⭐️ ⭐️#INDvNZ #TeamIndia #Champions pic.twitter.com/5FFrQvYcww— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. భారత్లో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవలేదని.. అక్కడి గొప్ప వ్యవస్థ కూడా ఈ అరుదైన ఘనతకు కారణం అన్నాడు. మరోవైపు.. పాకిస్తాన్లో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని.. అయితే, పాక్ బోర్డు తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా సొంతగడ్డపై పొట్టి క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన జట్టుగా.. ఓవరాల్గా మూడుసార్లు టీ20 ప్రపంచకప్ అందుకున్న టీమ్గా చరిత్ర సృష్టించింది.ప్రశంసల వర్షం ఈ నేపథ్యంలో పాక్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరును కొనియాడుతూ.. పాక్ క్రికెట్ బోర్డు (PCB)కు గట్టిగానే చురకలు అంటించాడు.‘‘పాకిస్తాన్లో క్రికెట్ టాలెంట్కు కొదవలేదు. ఇక్కడ చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. అయితే, లోపమంతా ఇక్కడి వ్యవస్థలోనే ఉంది. మరి ఇండియాలో.. అక్కడ ప్రతిభ, సరైన వ్యవస్థ.. రెండూ ఉన్నాయి. వారు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం.అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు?అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు? అతడికి అసలు గతంలో అవకాశాలు వచ్చేవా?.. మరి ఇప్పుడో.. అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ ఇషాన్ కిషన్.. అతడు ఎప్పుడో ఒకసారి మాత్రమే జట్టుకు ఆడతాడు.క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడ్డాడని బోర్డు అతడిని శిక్షించింది. ఆ కసితో దేశవాళీ క్రికెట్లో అతడు రాణిస్తే.. తిరిగి నేరుగా ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా అభిషేక్ శర్మ.. టోర్నీ ఆరంభం నుంచి ఒత్తిడిలో కూరుకుపోయి విఫలమయ్యాడు.అయినా యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది. అందుకు ప్రతిగా ఫైనల్లో 21 బంతుల్లోనే 52 పరుగులతో సత్తా చాటాడు. టీమిండియా పెద్ద పెద్ద మ్యాచ్లలో పెద్ద జట్లను ఓడిస్తుంది. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాంకానీ మన పాకిస్తాన్ జింబాబ్వే, ఉగాండా, కెన్యా వంటి పసికూన జట్లపై విజయాలను పండుగ చేసుకుంటుంది. వాళ్లను ఇక్కడికి పిలిపించి వారిపై గెలుపును ఆస్వాదిస్తుంది. ఇదే తేడా’’ అని అహ్మద్ షెహజాద్ పాక్ క్రికెట్ను ఘాటుగా విమర్శిస్తూ.. టీమిండియాను ప్రశంసించాడు. చదవండి: T20 WC 2026: సలాం సంజూ శాంసన్Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్
మరోసారి దురదృష్టం.. స్వయంకృతాపరాధానికి మూల్యం.. 2015. 2019, 2021, 2026.. నాలుగు సందర్భాల్లోనూ ఐసీసీ టోర్నీ ఫైనల్స్కు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు రన్నరప్తోనే సరిపెట్టుకుంది. కీలక సమయంలో ఒత్తిడికి గురై.. మరోసారి ‘చోకర్స్’గా మిగిలిపోయింది.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా టీమిండియా చేతిలో 96 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన కివీస్.. ‘రెండోస్థానం’ అనే చేదు ముద్రను పదిలం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ విచారం వ్యక్తం చేశాడు. అయితే, తమ జట్టు ఆట పట్ల మాత్రం తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు.గొప్పగా ఆడిన జట్టు చేతిలోనే ఓడిపోయాము‘‘అవును.. ఇది జరిగిపోయింది. అయినా మా జట్టు ప్రయాణం ఇక్కడిదాకా సాగినందుకు గర్వంగా ఉంది. మా వాళ్లు గొప్పగా ఆడారు. టోర్నీ ఆసాంతం మేము సవాళ్లు ఎదుర్కొన్నాం. ప్రతీ దశలోనూ ఆటంకాన్ని అధిగమించి ఇక్కడిదాకా వచ్చాము.ఈరోజు కూడా గొప్పగా ఆడిన జట్టు చేతిలోనే ఓడిపోయాము. స్టేడియం మొత్తం నీలి వర్ణమే. వారి సాక్షిగానే ఓటమిని ఆహ్వానించాము. మేము ఇక్కడ ఫేవరెట్ జట్టు కాదు.ఏదేమైనా సొంతగడ్డపై సూర్యకుమార్ సేన అద్భుతం చేసింది. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ టోర్నీలో మా జట్టులోని ఒక్కో సభ్యుడు ఒక్కో సందర్భంలో ముందుకు వచ్చి జట్టును గెలిపించాడు. సూపర్-8, సెమీ ఫైనల్లో మేము గొప్పగా ఆడాము.ముందుగా చెప్పినట్లు గొప్ప జట్టు చేతిలోనే ఫైనల్ ఓడిపోయాము. మా వాళ్లు నాకు గర్వకారణం’’ అని సాంట్నర్ కివీస్ జట్టును ప్రశంసించాడు. ఇక తమ ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ..అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి‘‘పవర్ ప్లేలో వాళ్లు ఒక్క వికెట్ కోల్పోకుండా ఏకంగా 90 పరుగుల మేర అసాధారణ స్కోరు నమోదు చేశారు. మేము మాత్రం పవర్ప్లేలో సుమారుగా 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. అక్కడే చాలా వెనుకబడి పోయాము. 256 పరుగుల మేర భారీ స్కోరు ఛేదనలో ఇలాంటి పరిస్థితి రావడం అతి పెద్ద సవాలు’’ అని సాంట్నర్ పేర్కొన్నాడు.భారత ఓపెనర్ల విధ్వంసంకాగా న్యూజిలాండ్తో ఫైనల్లో టీమిండియా పవర్ ప్లే (తొలి ఆరు ఓవర్లు)లో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు సాధిస్తే.. న్యూజిలాండ్ 52 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ విధ్వంసం కారణంగా భారత్కు పవర్ ప్లేలో ఈ మేర స్కోరు సాధ్యమైంది. పవర్ ప్లే ముగిసేసరికి సంజూ 17 బంతుల్లో 33, అభిషేక్ 19 బంతుల్లో 51 పరుగులు చేశారు. ఓవరాల్గా సంజూ 89 పరుగులు సాధించగా.. అభిషేక్ 52 పరుగులు చేశాడు. చదవండి: Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డులక్కీ కెప్టెన్!CHAK DE, INDIAAAAA! 🇮🇳Ladies & gentlemen, presenting the three-time ICC Men's T20 World Cup champions 🏆🏆🏆#T20WorldCup #INDvNZ pic.twitter.com/0hb7APCcD2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
వాళ్లు అద్భుతం.. తదుపరి లక్ష్యం గోల్డ్ మెడల్: సూర్యకుమార్
టీమిండియా అద్భుతం చేసింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ సాధించింది. తమ ఖాతాలో మూడో పొట్టి వరల్డ్కప్ ట్రోఫీని జమచేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత్ ఏకంగా 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. ఈ ఘనత సాధించింది.చరిత్ర పుటల్లోకి ఈ అద్వితీయ గెలుపుతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) దిగ్గజాల సరసన నిలిచాడు. భారత్కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni), రోహిత్ శర్మ (Rohit Sharma)లతో పాటు సూర్య పేరు కూడా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత సూర్య రిటైర్ అవుతాడనే ఊహాగానాలు వచ్చాయి.ఈ నేపథ్యంలో విజయానంతరం సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలవడమేనని పేర్కొన్నాడు. తద్వారా ఇప్పుడే తాను రిటైర్ కాబోనని 35 ఏళ్ల సూర్య సంకేతాలు ఇచ్చాడు.గోల్డ్ మెడల్ లక్ష్యంకాగా 2028లో లాస్ ఏంజెలెస్ వేదికగా విశ్వ క్రీడలు జరుగనున్న సంగతి తెలిసిందే. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ తదుపరి ఎడిషన్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సూర్య మాట్లాడుతూ.. ‘‘తదుపరి ఒకే ఏడాదిలో టీ20 వరల్డ్కప్తో పాటు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యం’’ అని పేర్కొన్నాడు. ఇక ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో.. ‘‘ఈ సంతోషం నుంచి తేరుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుంది.వాళ్లు అద్భుతంసంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రత్యేక ఆటగాళ్లు. వారు ఏదైనా అద్భుతం చేయగలరని అనుకున్నాం. ఫైనల్లో ఆ పని చేసి చూపించారు. ఇక మా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. తరానికొక్క అరుదైన బౌలర్. అతడిని జాతీయ సొత్తు అని పిలవవచ్చు. జట్టును గెలిపించేందుకు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా.. జట్టులోని ఇలా ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను చక్కగా నెరవేర్చారు’’ అని సూర్య ప్రశంసలు కురిపించాడు.చదవండి: లక్కీ కెప్టెన్!From World Cup glory to the next challenge, #SuryakumarYadav opens up about what lies ahead for #TeamIndia.🇮🇳❤️#T20WorldCup #INDVNZ pic.twitter.com/5NPw2aNK5X— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
భారత్కు వరంగా దొరికిన అరుదైన రత్నం బుమ్రా
ఈ ఆనందం నుంచి తేరుకునేందుకు మరికొంత సమయం పడుతుంది. 2024 వరల్డ్ కప్ తర్వాత మా ప్రయాణం మొదలైంది. జై షా, రోహిత్ నాపై నమ్మకం ఉంచి కెప్టెన్గా నాకు అవకాశం కల్పించారు. అక్కడి నుంచి ఇప్పుడు వరల్డ్ కప్ గెలవడం వరకు చాలా గొప్పగా సాగింది. గత రెండేళ్లుగా మేం చాలా బాగా ఆడాం. వరల్డ్ కప్లోనూ అదే కొనసాగించాలని భావించాం. ఆటగాళ్లను అర్థం చేసుకుంటూ వారికి సరైన సమయంలో సరైన అవకాశాలు ఇచ్చాం. సామ్సన్, అభిషేక్ ప్రత్యేక ఆటగాళ్లు. వారు ఏదైనా అద్భుతం చేయగలరని అనుకున్నాం. దానిని వారు ఫైనల్లో చూపించారు. తరానికొక్కడు వంటి అరుదైన రత్నం బుమ్రా. గెలిపించేందుకు ఏం చేయాలనేది అతనికి బాగా తెలుసు. –సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ -
సక్సెస్ఫుల్ కోచ్
భారత గడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతుల్లో క్లీన్స్వీప్నకు గురి కావడం, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో చిత్తుగా ఓడటం హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్కు చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. కోచ్గా సమర్థుడు కాకపోయినా... బీసీసీఐ పెద్ద అండదండలంతో సాగుతున్నాడనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను ‘డ్రా’గా ముగించినా అతనికి తగిన క్రెడిట్ దక్కలేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్కు సంబంధించి మాత్రం గంభీర్ను విజయవంతమైన కోచ్గా అంగీకరించాలనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టోరీ్నల్లో జట్టు విజేతగా నిలవడంతో కోచ్గా అతని పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ టి20 వరల్డ్ కప్ టోరీ్నకి సంబంధించి అన్ని అంశాల్లో అతని భాగస్వామ్యం ఉంది. జట్టు ఎంపిక మొదలు తుది జట్టులో మార్పులు, కీలక సమయాల్లో వ్యూహాల విషయంలో గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. కెపె్టన్గా పెద్దగా అనుభవం లేని సూర్యకుమార్కు సరైన రీతిలో అతను మార్గనిర్దేశనం కూడా చేశాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీ, 2026 టి20 వరల్డ్ కప్లను గెలిపించిన కెపె్టన్ గంభీర్ తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో ఆటగాడిగా టి20 వరల్డ్కప్ గెలిచిన గంభీర్ ఇప్పుడు కోచ్గా తన ఖాతాలో మరో ప్రపంచకప్ జమ చేసుకున్నాడు. -
'త్రి'వర్ణ విజయం
సామ్సన్ కొట్టిన సిక్స్లను కరిగే క్షణాలు కూడా కాసేపాగి వీక్షించినట్లు.. అభిషేక్ బాదిన బౌండరీల్ని పదిలంగా దాచుకోవాలని మైదానం తలచినట్లు.. ఇషాన్ ధనాధన్ అర్ధశతకానికి బంతి పెద్ద ఫ్యాన్ అయినట్లు... అహ్మదాబాద్లో పరుచుకున్న ‘పరుగుల’ వెన్నెల యావత్ భారతాన్ని మురిపించింది. ఎందుకంటే ఈ ప్రపంచకప్ విజయం...దీని తాలూకు వచ్చే ఆనందం... ఓ పూటకే సరిపోదు.ఒక్క చోటికే పరిమితం కాదు. మొత్తం దేశాన్నే తమ క్రికెట్ అభిమాన ప్రవాహంలో ఉప్పొంగేలా చేసింది.ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ను ముద్దాడింది.2019 వన్డే ప్రపంచకప్లో మనల్ని ఫైనల్ చేరకుండా సెమీస్లోనే వెళ్లగొట్టిన న్యూజిలాండ్ జట్టుకు... 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మనగడ్డపై మనల్ని ముంచిన అహ్మదాబాద్ వేదికకు.. టీమిండియా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. 2026 టి20 ప్రపంచకప్లో భారత్ విజేతగానిలిచింది. డిఫెండింగ్ చాంపియన్గాకరీబియన్లో పట్టుకొచ్చిన టి20 ప్రపంచకప్ను సొంతగడ్డపైనా నిలబెట్టుకుంది. సెమీస్లోఇంగ్లండ్పై, ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్పై భారత బ్యాటింగ్ దళం గర్జించింది.వందేమాతరం... వందేమాతరం... లక్ష మంది అభిమానులతో అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తిపోయింది... ఇందులో రెండున్నరేళ్ల క్రితం ఇదే మైదానంలో గుండెకోతను అనుభవించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు అది గతం.. నాటి గాయానికి మందు రాసేలా సొంతగడ్డపై, ఫ్యాన్స్ సమక్షంలో భారత జట్టు టి20 ప్రపంచ కప్ను సగర్వంగా అందుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడో టైటిల్ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టుగా ఘనత సాధించింది. రెండేళ్ల క్రితం విశ్వ విజేతగా నిలిచిన నాటి నుంచి ఏ రోజూ స్థాయి తగ్గకుండా అదే దూకుడు, జోరుతో ఆడిన టీమిండియా అదే తీవ్రతను కొనసాగిస్తూ టైటిల్ నిలబెట్టుకోవడం విశేషం.ఫైనల్లో న్యూజిలాండ్తో సమరం అంటే ముందుగా మనదే కొంత పైచేయిగా కనిపించింది... దానికి తగినట్లుగా ఆరంభం నుంచే టాప్–3 బ్యాటర్లు విరుచుకుపడ్డారు. సామ్సన్ తన ధాటిని కొనసాగించగా అభిషేక్ అసలు పోరులో తన సత్తాను ప్రదర్శించాడు. తోడుగా ఇషాన్ కిషన్ కూడా చెలరేగడంతో బౌండరీల విధ్వంసం సాగింది. ప్రతీ బంతీ బౌండరీ దాటుతుండగా భారత్ ఆట చూస్తే 300 స్కోరు ఖాయమనిపించింది. అక్కడి వరకు చేరకపోయినా 255 పరుగులతో మ్యాచ్ను శాసించే స్థితిలో టీమిండియా నిలిచింది. వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు వేదికపై ఛేదన ఎంత కష్టమో కివీస్కు తెలిసే సరికి మ్యాచ్ ముగిసిపోయింది... బుమ్రా, అక్షర్ బౌలింగ్తో ఆ జట్టు కునారిల్లింది. సంపూర్ణ ఆధిపత్యంతో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది.అభిషేక్ బౌలింగ్లో డఫీ కొట్టిన షాట్ను బౌండరీ వద్ద హైదరాబాదీ తిలక్ వర్మ అందుకోవడంతో అన్ని వైపుల నుంచి వేడుకలు మొదలయ్యాయి. గత టోర్నీ గెలుపు అనుభవాన్ని కొందరు మళ్లీ రుచి చూస్తే... తొలిసారి వరల్డ్ కప్ నెగ్గిన కుర్రాళ్ల ఆనందానికి అవధుల్లేవు... వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్గా సూర్యకుమార్ చరిత్రకెక్కగా... గత వరల్డ్ కప్ విజేతలు కపిల్, ధోని, రోహిత్ శర్మ గ్యాలరీ నుంచి అభినందిస్తుండగా టీమిండియా ఆటగాళ్లంతా మైదానంలో మువ్వన్నెల జెండాతో సంబరాలు చేసుకున్నారు. అహ్మదాబాద్: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు టి20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచింది. గతంలో 2007, 2024లో టైటిల్ సాధించిన టీమిండియా ఇప్పుడు మూడోసారి ట్రోఫీని అందుకోవడం విశేషం. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్స్లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. టిమ్ సీఫెర్ట్ (26 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్లు), సాంట్నర్ (35 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్ పటేల్ (3/27) న్యూజిలాండ్ను దెబ్బ తీశారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 27 కోట్ల 48 లక్షల ప్రైజ్మనీ దక్కింది. ధనాధన్ దూకుడు... తొలి ఓవర్లో 7 పరుగులు, రెండో ఓవర్లో 5 పరుగులు... ఇంత వరకు భారత్ కాస్త జాగ్రత్త పడింది. డఫీ వేసిన మూడో ఓవర్తో మొదలైన బ్యాటింగ్ విధ్వంసం చివరి ఓవర్ వరకు సాగింది. టాప్–3 బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి కివీస్ పనిపట్టారు. ఫెర్గూసన్ ఓవర్లో అభిషేక్, సామ్సన్ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టడంతో 24 పరుగులు వచ్చాయి. హెన్రీ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్సర్ బాదగా, డఫీ ఓవర్లో అభిషేక్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 92 పరుగులకు చేరింది. 18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అభిషేక్ వెనుదిరిగినా, కిషన్ వచ్చి అదే జోరును కొనసాగించాడు. 33 బంతుల్లో సామ్సన్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత ఫెర్గూసన్ ఓవర్లో సామ్సన్ వరుసగా 2 సిక్స్లు బాదగా, కిషన్ మరో సిక్స్ కొట్టాడు. రచిన్ వేసిన 14వ ఓవర్లోనైతే సామ్సన్ వరుసగా 6, 6, 6తో చెలరేగిపోగా, కిషన్ కూడా 23 బంతుల్లోనే అర్ధ సెంచరీని చేరుకున్నాడు. అయితే ఎట్టకేలకు తర్వాతి 16–19 వరకు నాలుగు ఓవర్ల పాటు భారత్ను కట్టడి చేయడంలో కివీస్ సఫలమైంది. నీషమ్ వేసిన ఒకే ఓవర్లో సామ్సన్, కిషన్, సూర్యకుమార్ (0) అవుట్ కాగా... పాండ్యా (18)ను హెన్రీ అవుట్ చేశాడు. ఈ నాలుగు ఓవర్లలో కలిపి 28 పరుగులే వచ్చాయి. అయితే నీషమ్ వేసిన చివరి ఓవర్లో దూబే (8 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగిపోయాడు. దాంతో స్కోరు 250 దాటింది. సీఫెర్ట్ మినహా... తమ జట్టుకు శుభారంభం అందించడంలో కివీస్ ఓపెనర్లు విఫలమయ్యారు. పాండ్యా ఓవర్లో 2 సిక్స్లు, 2 ఫోర్లు బాది సీఫెర్ట్ జోరు ప్రదర్శించినా... మరోవైపు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 4 బంతుల వ్యవధిలో అలెన్ (9), రచిన్(1) అవుట్ కాగా, ఫిలిప్స్ను (5) అక్షర్ బౌల్డ్ చేశాడు. పవర్ప్లేలో జట్టు 52 పరుగులు చేయగలిగింది. వరుణ్ ఓవర్లో 2 సిక్స్లతో 23 బంతుల్లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే నాలుగు బంతుల వ్యవధిలో చాప్మన్ (3), సీఫెర్ట్లు వెనుదిరగడంతో సగం టీమ్ పెవిలియన్ చేరింది. మిచెల్ (17), సాంట్నర్ కొద్దిసేపు పోరాడగలిగారు.అయితే బుమ్రా అద్భుత బంతితో సాంట్నర్ను అవుట్ చేయడంతో కివీస్ ఓటమి లాంఛనమే అయింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) (సబ్) మెక్కోన్కీ (బి) నీషమ్ 89; అభిషేక్ (సి) సీఫెర్ట్ (బి) రచిన్ 52; ఇషాన్ కిషన్ (సి) చాప్మన్ (బి) నీషమ్ 54; పాండ్యా (సి) సాంట్నర్ (బి) హెన్రీ 18; సూర్యకుమార్ (సి) రచిన్ (బి) నీషమ్ 0; తిలక్ (నాటౌట్) 8; దూబే (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–98, 2–203, 3–204, 4–204, 5–226. బౌలింగ్: హెన్రీ 4–0–49–1, ఫిలిప్స్ 1–0–5–0, డఫీ 3–0–42–0, ఫెర్గూసన్ 2–0–48–0, సాంట్నర్ 4–0–33–0, రచిన్ రవీంద్ర 2–0–32–1, నీషమ్ 4–0–46–3. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (సి) ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 52; అలెన్ (సి) తిలక్ (బి) అక్షర్ 9; రచిన్ (సి) ఇషాన్ కిషన్ (బి) బుమ్రా 1; ఫిలిప్స్ (బి) అక్షర్ 5; చాప్మన్ (బి) పాండ్యా 3; మిచెల్ (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 17; సాంట్నర్ (బి)బుమ్రా 43; నీషమ్ (బి) బుమ్రా 8; హెన్రీ (బి) బుమ్రా 0; ఫెర్గూసన్ (నాటౌట్) 6; డఫీ (సి) తిలక్ (బి) అభిషేక్ 3; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–31, 2–32, 3–47, 4–70, 5–72, 6–124, 7–141, 8–141, 9–152, 10–159. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–32–0, పాండ్యా 4–0–36–1, అక్షర్ 3–0–27–3, బుమ్రా 4–0–15–4, వరుణ్ 3–0–39–1, అభిషేక్ 1–0–5–1. -
లక్కీ కెప్టెన్!
‘సంజు సామ్సన్కు మరో అవకాశం ఇస్తారా’... దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు ముందు మీడియా ప్రతినిధి ఒకరు సూర్యకుమార్ యాదవ్కు ప్రశ్న వేశాడు. సాధారణంగా మరో కెప్టెన్ అయితే జట్టులోని 15 మందీ సమర్థులే. పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి. మ్యాచ్ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటాం అని సమాధానం ఇస్తారు. కానీ సూర్యకుమార్ వ్యంగ్యంగా ఒకింత అహంకారంగా నవ్వుతూ... ‘అభిషేక్ను తీసి ఆడించమంటారా...తిలక్ను తీసి ఆడించమంటారా’ అంటూ ఎదురు ప్రశ్న వేశాడు.చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో తర్వాతి మ్యాచ్ జింబాబ్వేపై సామ్సన్ను ఆడించాల్సి వచ్చింది. ఆపై వరుసగా సామ్సన్ అద్భుత ప్రదర్శనలే జట్టును చాంపియన్గా నిలిపాయి. ఫైనల్కు ముందు కూడా ఆఫ్ స్పిన్ బౌలింగ్లో బ్యాటర్ల వైఫల్యం గురించి మాట్లాడుతూ... ‘120 స్ట్రయిక్రేట్తో ఆడుతూ కూడా ఫైనల్కు వచ్చామంటే అలాగే ఆడతాం’ అంటూ అర్థం లేని సమాధానం ఒకటి ఇచ్చాడు. ఒక నాయకుడిగా అతని అపరిపక్వతకు ఇవి ఒక సూచన. కానీ ఇవన్నీ ఇప్పుడు పక్కకు వెళ్లిపోతాయి.వరల్డ్ కప్ అందించిన నాయకుడిగానే అతను గుర్తుండిపోతాడు. కెప్టెన్గా 52 మ్యాచ్లలో 40 విజయాలు చూస్తే రికార్డుపరంగా ఇది చాలా మంచి సారథ్య ప్రదర్శనే. వరల్డ్ కప్కు కొద్ది రోజుల ముందు పరిస్థితి చూస్తే వరుసగా 23 టి20 మ్యాచ్లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు... సిరీస్పై సిరీస్ గెలుస్తూ వస్తున్నా కెప్టెన్గా తనకంటూ ప్రత్యేక ముద్ర లేదు. కోచ్ గంభీర్ పర్యవేక్షణలో కేవలం అతని సూచనలను మైదానంలో అమలు చేసేవాడిగానే కనిపిస్తున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా అతనికి లేదు... సూర్యకుమార్ యాదవ్ సారథ్యంపై గత రెండేళ్లుగా వినిపించిన విమర్శలు.తాజాగా వరల్డ్ కప్లోనూ ‘ఇదీ కెప్టెన్ క్షణం’ అనిపించే వ్యూహాలు ఏమీ అతడి నుంచి రాలేదు. అంతా సానుకూలంగా సాగిపోయింది, జట్టులో అందరూ తమ బాధ్యతలు నెరవేరుస్తూ వెళుతున్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తూనే వచ్చాయి. అయితేనేమి భారత్కు ప్రపంచ కప్ అందించిన దిగ్గజాలు కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ సరసన ఇప్పుడు సూర్యకుమార్ కూడా నిలిచాడు. నిజానికి రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టి20ల్లో సూర్య ఆటోమెటిక్ ప్రత్యామ్నాయం ఏమీ కాదు.బ్యాటర్గా మంచి గుర్తింపు ఉన్నా నాయకుడిగా అతనికి ఎలాంటి రికార్డు లేదు. 2024 వరల్డ్ కప్ విజయం తర్వాత అప్పటి ఫామ్, సారథిగా అనుభవాన్ని బట్టి చూస్తే హార్దిక్ పాండ్యాకే జట్టు పగ్గాలు దక్కుతాయని అనిపించింది. అయితే క్రికెటేతర కారణాలు కావచ్చు పాండ్యాను కెప్టెన్సీ నుంచి దూరంగా పెట్టారు. అయితే బాధ్యతలు చేపట్టాక వరుస విజయాలు సూర్య కెప్టెన్సీ స్థానాన్ని పటిష్టం చేశాయి.శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్... ఇలా ప్రతీ జట్టుపై సిరీస్ సాధించడంతో పాటు ఆసియా కప్ కూడా మన ఖాతాలో చేరింది. పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్సీ నుంచి తప్పించాలని చర్చ వచ్చినా వరల్డ్ కప్కు మరీ తక్కువ సమయం ఉండటంతో బీసీసీఐ అలాంటి సాహసం చేయలేదు. వరల్డ్ కప్లోనూ టీమిండియా ప్రదర్శన ముందు అన్ని జట్లూ తేలిపోవడంతో ట్రోఫీని అందుకోవడంలో సూర్య సఫలమయ్యాడు. –సాక్షి క్రీడా విభాగం -
ఒకరితో పోటీ పడి మరొకరు చెలరేగి
భయం లేదు, బెదురు లేదు... మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన మాత్రమే ఉంది. ఒక వికెట్ పడితే నెమ్మదించిపోయే తత్వం ఎప్పుడో అంతరించిపోయింది. ఒకడు పోతే మరొకడు అన్నట్లుగా అవుటైన బ్యాటర్ తర్వాత వచ్చే ఆటగాడు అంతకంటే ఎక్కువ కసితో చెలరేగిపోయేందుకు సిద్ధం... గత రెండేళ్ళలో భారత టి20 జట్టు బ్యాటింగ్ ప్రతాపం ఇదే తరహాలో సాగింది. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడేజా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. కానీ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. ఐపీఎల్లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్న వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎక్కడా తగ్గకుండా అదే స్థాయిని ప్రదర్శించారు. ఓపెనర్గా ప్రతీ మ్యాచ్కు కొత్త రికార్డు నెలకొల్పుతూ వచ్చిన అభిషేక్ ఇచ్చిన ఆరంభాలు టీమిండియా విజయాలు సులువు చేస్తే, మిడిలార్డర్లో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కీలకంగా మారాడు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై అతను ఆడిన ఇన్నింగ్స్ జట్టులో తిలక్ విలువను చూపించింది. ఇక అనూహ్యంగా టీమ్కు దూరమై తిరిగి వచ్చిన తర్వాత ఇషాన్ కిషన్ మరింత చెలరేగిపోయాడు. అసాధారణ ఫామ్తో అతను వరల్డ్ కప్లోకి అడుగు పెట్టాడు. టోర్నీలో కూడా పాకిస్తాన్పై మ్యాచ్తోపాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్లలో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కీలక సమయంలో భారత జట్టు వ్యూహం మార్చిన తీరు టోర్నీలో మన రాతను మార్చింది. టాప్–3లో అభిషేక్, కిషన్, తిలక్లవంటి ముగ్గురు ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉండటంతో ప్రత్యర్థులు ఆఫ్స్పిన్నర్ను ప్రయోగించి జట్టును దెబ్బ తీస్తూ వచ్చారు. దీనిని గుర్తించిన యాజమాన్యం సామ్సన్ను మళ్లీ ఆడించి కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. అంతే... ఆ తర్వాత టీమ్ ప్రదర్శన ఒక్కసారిగా మారిపోయింది. జింబాబ్వేపై 256 పరుగులు, విండీస్పై 196 పరుగుల అలవోక ఛేదన, ఇంగ్లండ్పై 253, న్యూజిలాండ్పై 255... ఇలా పరుగుల వరద పారింది. ఒక్క అమెరికాపై మ్యాచ్ మినహా బ్యాటర్గా సూర్యకుమార్ ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. కానీ సహచరుల ప్రదర్శనలతో భారత్ వరుస విజయాలు సాధించడం సారథిగా అతనిపై ఒత్తిడిని తగ్గించింది. ఇక అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లోనూ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా విలువ వెలకట్టలేనిది. బ్యాటింగ్లో భారీ హిట్టింగ్తో పరుగులు రాబట్టిన అతను బౌలర్గా అటు కొత్త బంతితో, ఇటు చివరి ఓవర్లలో కూడా సత్తా చూపించాడు. ఇంగ్లండ్పై సెమీస్లో అతను వేసిన 19వ ఓవర్ ఎంత కీలకంగా మారిందో చెప్పనవసరం లేదు. ఈసారి జట్టు విజయంలో శివమ్ దూబే కూడా తోడయ్యాడు. స్లాగ్ ఓవర్లలో మొత్తం 17 సిక్సర్లతో దూబే చూపించిన దూకుడు జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. బౌలింగ్లో బుమ్రా ఒంటి చేత్తో జట్టుతో నడిపించిన తీరు అతను ‘ఆల్టైమ్ గ్రేట్’ ఎందుకో చెబుతుంది. 2024 టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన బుమ్రా ఈసారి కూడా వన్నె తగ్గకుండా తన పదునును చూపించాడు. ఏడుకంటే తక్కువ ఎకానమీతో అతను పరుగులు ఇచ్చిన తీరు ప్రత్యర్థి బ్యాటర్లను ఏమాత్రం కోలుకోకుండా చేసింది. ఫైనల్లో తీసిన 4 వికెట్లు బుమ్రా స్పెషల్. తనదైన శైలిలో బ్యాటర్లను నిలువరించడంలో అర్‡్షదీప్ కూడా పూర్తిగా సఫలమయ్యాడు. వరుణ్ చక్రవర్తి టోర్నీ ద్వితీయార్ధంతో కొంత తడబడినా... ఓవరాల్గా అతని స్పిన్ ప్రభావం బాగానే కనిపించింది. టీమ్ కూర్పు కారణంగా సిరాజ్, కుల్దీప్ ఒకే ఒక్క మ్యాచ్కే పరిమితం కాగా, రింకూ సింగ్కు కూడా ఎక్కువ అవకాశం రాలేదు. 2024 ఆరంభం నుంచి భారత జట్టు ఆరుసార్లు 250కు పైగా స్కోర్లు నమోదు చేసింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా భారీ షాట్లతో విరుచుకుపడింది. 2024 వరల్డ్ కప్ విజయం తర్వాత 50 మ్యాచ్లలో 41 విజయాలు మన స్థాయిని, అసాధారణ ప్రదర్శనను చూపించాయి. ఈ టోర్నీలో కూడా ఒక్క దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో మినహా మిగతా ఎనిమిది మ్యాచ్లలో టీమిండియా అసలు స్థాయిని ప్రదర్శించాయి. గత రెండేళ్లుగా సాగించిన సన్నాహాలు, వరుస సిరీస్లలో విజయాలు, ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు వరుసగా రెండో వరల్డ్ కప్ను అందించాయి. –సాక్షి క్రీడా విభాగం సక్సెస్ఫుల్ కోచ్ భారత గడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతుల్లో క్లీన్స్వీప్నకు గురి కావడం, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో చిత్తుగా ఓడటం హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్కు చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. కోచ్గా సమర్థుడు కాకపోయినా... బీసీసీఐ పెద్ద అండదండలంతో సాగుతున్నాడనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను ‘డ్రా’గా ముగించినా అతనికి తగిన క్రెడిట్ దక్కలేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్కు సంబంధించి మాత్రం గంభీర్ను విజయవంతమైన కోచ్గా అంగీకరించాలనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టోర్నీల్లో జట్టు విజేతగా నిలవడంతో కోచ్గా అతని పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ టి20 వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి అన్ని అంశాల్లో అతని భాగస్వామ్యం ఉంది. జట్టు ఎంపిక మొదలు తుది జట్టులో మార్పులు, కీలక సమయాల్లో వ్యూహాల విషయంలో గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. కెప్టెన్గా పెద్దగా అనుభవం లేని సూర్యకుమార్కు సరైన రీతిలో అతను మార్గనిర్దేశనం కూడా చేశాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీ, 2026 టి20 వరల్డ్ కప్లను గెలిపించిన కెప్టెన్ గంభీర్ తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో ఆటగాడిగా టి20 వరల్డ్కప్ గెలిచిన గంభీర్ ఇప్పుడు కోచ్గా తన ఖాతాలో మరో ప్రపంచకప్ జమ చేసుకున్నాడు. -
‘రెండో స్థానం’ ముద్ర మారలేదు!
2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, 2021 టి20 వరల్డ్ కప్ ఫైనల్, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2026 టి20 వరల్డ్ కప్ ఫైనల్... గత ఆరేళ్లలో నాలుగు ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీలలో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టు నాలుగు సార్లూ రన్నరప్కే పరిమితమైంది. టోర్నీ ఆసాంతం నిలకడగా ఆడటం, అసలు సమయంలో చేతులెత్తేయడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. వారిని చూస్తే ఇకపై కూడా ఇంతే అనిపించడం మాత్రమే కాదు... ఆ జట్టుపై జాలి పడటం కూడా అనవసరం అనిపిస్తుంది. 2019 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో దురదృష్టం వెంటాడి ఓడినప్పుడు అంతా అయ్యో కివీస్ అనుకున్నారు. కానీ మిగతా మూడు ఫైనల్ మ్యాచ్లలో మాత్రం వారిదే స్వయంకృతం. కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక జట్టు పూర్తిగా చేతులెత్తేస్తూ వచ్చింది. సుమారు 50 లక్షల జనాభాతో చిన్న దేశంగా, తక్కువ సౌకర్యాలతో ఉన్న తాము భారత్లాంటి జట్టుతో ఫైనల్లో ఆడటమే మహద్భాగ్యం అన్నట్లుగా జట్టు ఆల్రౌండర్ ఫిలిప్స్ చేసిన వ్యాఖ్యలు ఆటకు ముందే ఓటమికి సిద్ధమైనట్లుగా అనిపించాయి. మంచివాళ్లుగా మాకు పేరున్నా సరే... భారత అభిమానులు గుండె పగిలేలా చేయడానికి వెనుకాడం అంటూ ఫైనల్కు ముందు ప్రకటించిన కెప్టెన్ సాంట్నర్తో పాటు పూర్తిగా టీమ్ తలవంచింది. ఇక్కడ ఓటమి మాత్రం పూర్తిగా స్వయంకృతంలా కనిపించింది. నిజానికి టోర్నీలో సెమీస్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మినహా కివీస్ అద్భుతంగా ఏమీ ఆడలేదు. లీగ్ దశలో కివీస్ చేతిలో చిత్తు కావడం, సూపర్ ఎయిట్స్తో ఇంగ్లండ్ చేతిలో ఓడటం ఆ జట్టును బలహీనతలను బాగా చూపించాయి. కోల్కతాలో జరిగిన సెమీస్లో మాత్రం చిన్న గ్రౌండ్, మంచు మధ్య సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. అది వారిలో అతి విశ్వాసానికి దారి తీసినట్లుంది. భారత్తో వారి సొంతగడ్డపై ఫైనల్ మ్యాచ్ అంటే గెలుపు ఎంత కష్టమో ప్రతీ జట్టుకు తెలుసు. కానీ ఈ మ్యాచ్కు సంబంధించి కివీస్ ఎలాంటి హోం వర్క్ చేసినట్లుగా లేదు. భారత్తో సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేసిన తప్పులు తాము చేయకుండా ఎలాంటి వ్యూహంతో ఆడాలో కివీస్ గుర్తించినట్లు లేదు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకొని భంగపడింది. వారి ఆట చూస్తే ముందుగా బ్యాటింగ్ చేస్తే ఇంగ్లండ్ గెలిచేదేమో అనిపించింది. మంచు ప్రభావం ఎలా ఉన్నా, మైదానంలో ఛేదన సులువు అని రికార్డులు చెబుతున్నా...ఫైనల్లాంటి మ్యాచ్లో ఉండే తీవ్ర ఒత్తిడి వేరు. బలమైన భారత బౌలింగ్ను ఎదుర్కొని తాము లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో లక్ష్యాన్ని ఛేదించగలమని కివీస్ అసలు ఎలా భావించింది! టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ఆ జట్టు చేసిన మొదటి తప్పు. టోర్నీ ఆసాంతం టీమిండియా ఆఫ్స్పిన్నర్ల బౌలింగ్లో బాగా తడబడింది. సెమీస్లో సత్తా చాటిన రెగ్యులర్ ఆఫ్స్పిన్నర్ మెక్కోన్కీని తుది జట్టునుంచి తప్పించడం పెద్ద తప్పు కాగా, అదనపు పేసర్ డఫీనుంచి జట్టు మంచి ప్రదర్శన ఆశించడం కూడా అంతే తప్పు. సీనియర్ కావడం తప్ప నీషమ్ బౌలింగ్ ఏమాత్రం ప్రభావవంతం కాకపోయినా అతడిని తప్పించే ఆలోచన చేయలేదు. పైగా ఫెర్గూసన్లాంటి రెగ్యులర్ పేసర్కు ఓవర్లు మిగిలి ఉండగా నీషమ్తో ఆఖరి ఓవర్ వేయించింది. తొలి ఓవర్లో హెన్రీ కాస్త స్వింగ్ రాబట్టగా అతడిని ఒక ఓవర్కే పరిమితం చేసి డఫీకి బంతినివ్వడంతో అంతా కథ మారిపోయింది. ఏదో భారత్కు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం బంతులు విసిరినట్లుగానే వారి ఆట సాగింది. టీమిండియా స్కోరు చూడగానే సహజంగానే కివీస్ బెంబేలెత్తిపోయింది. అలెన్ తొందరగా అవుట్ కావడంతో ఇక చేసేదేమీ లేదనే పరిస్థితి కనిపించింది. ఇంగ్లండ్ తరహాలో పోరాడటంలో టీమ్ విఫలమైంది. న్యూజిలాండ్ ఇదే తరహాలో మున్ముందూ ఆడితే ఎప్పటికీ రన్నరప్ స్థానమే తప్ప వరల్డ్ కప్ ఆ జట్టు ఖాతాలో చేరడం సందేహమే. చివరగా... 2024 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికాకు ఆ సమయంలో హెడ్ కోచ్గా ఉన్న రాబ్ వాల్టర్ ఇప్పుడు ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్కు కూడా హెడ్ కోచ్ కావడం విశేషం! – సాక్షి క్రీడా విభాగం -
సలాం సామ్సన్...
‘ఏమాత్రం బాధపడవద్దు మిత్రమా. సుదీర్ఘ టోర్నీ ఇది. ఏదో ఒక సమయంలో అవకాశం కచ్చితంగా లభిస్తుంది’... వరల్డ్ కప్ తొలి రోజు అమెరికాతో మ్యాచ్కు ముందు సంజు సామ్సన్కు తుది జట్టులో స్థానం లభించని సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి సాంత్వన కలిగిస్తూ చెప్పిన మాట ఇది. తర్వాతి మ్యాచ్లో నమీబియాతో అభిషేక్ అనారోగ్య కారణంగా సామ్సన్కు అవకాశం దక్కింది. కానీ చేసింది 22 పరుగులే. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లలో టీమ్లో మళ్లీ చోటు లేదు. జింబాబ్వేపై చాన్స్ లభించినా 24 పరుగులకే పరిమితం! దాంతో సామ్సన్ టీమ్కు భారం, అతని భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. కానీ సామ్సన్ ఓడిపోలేదు. ఇక తనకు చివరి అవకాశంగా వెస్టిండీస్తో మ్యాచ్ లభించింది. అంతే... అక్కడి నుంచి అసాధారణంగా చెలరేగిపోయాడు. వెస్టిండీస్తో కీలకపోరులో 50 బంతుల్లో 97 నాటౌట్... సెమీఫైనల్లో ఇంగ్లండ్పై 42 బంతుల్లో 89... ఫైనల్లో న్యూజిలాండ్పై 46 బంతుల్లో 89... వరుసగా మూడు ముఖ్యమైన మ్యాచ్లలో మూడు అర్ధసెంచరీలతో తిరుగులేని ప్రదర్శన. మూడుసార్లూ త్రుటిలో సెంచరీ చేజారింది.చివర్లో కాస్త ప్రయత్ని స్తే శతకాలు అతని ఖాతాలో చేరేవేమో. కానీ అతను వాటిని పట్టించుకోలేదు. ప్రతీ బంతిని జట్టు స్కోరు పెంచడానికే తప్ప ఒక్క బంతి కూడా తన వ్యక్తిగత ఘనతల కోసం ఆడేందుకు ప్రయత్ని ంచలేదు. కానీ ఈ మూడు మ్యాచ్లలో సామ్సన్ చూపించిన విధ్వంస ప్రదర్శన భారత జట్టులో అతని స్థాయిని అమాంతం పెంచేసింది. సామ్సన్కు అనవసరంగా మద్దతు ఇస్తున్నారని, అతనికి చోటు దండగ అంటూ వ్యాఖ్యానించిన వారే ఇప్పుడు అతని వల్లే వరల్డ్ కప్ గెలిచిందని ప్రశంసిస్తున్నారు. తన ఆటతోనే అందరికీ అతను ఇచ్చిన సమాధానం ఇది. సామ్సన్ 2024లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. కానీ నాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే చాన్స్ రాకుండా ‘నామ్కే వాస్తే’గానే జట్టులో భాగంగా ఉన్నాడు. కానీ ఈసారి అతను విజయాన్ని శాసించాడు. కేవలం 5 ఇన్నింగ్స్లలో 321 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా గెల్చుకొని జట్టులో ఎవరికీ అందనంత ఎత్తులో అతను నిలిచాడు. –సాక్షి క్రీడా విభాగం వెల్డన్... టీమిండియా న్యూఢిల్లీ: మూడోసారి టి20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అసాధారణ నైపుణ్యం, పట్టుదల, సమష్టి కృషికి భారత జట్టు విజయం నిదర్శనమని ‘ఎక్స్’ వేదికగా మోదీ ప్రశంసించారు. ‘టోర్నీ ఆద్యంతం అత్యద్భుత ఆటతీరుతో అలరించారు. దేశం మొత్తం గర్వపడేలా చేశారు. వెల్డన్... టీమిండియా’ అంటూ మోదీ కొనియాడారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ సూర్యకుమార్ బృందం సాధించిన టి20 ప్రపంచకప్ విజయం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి టీమిండియాను అభినందించారు. భవిష్యత్లో భారత్ మరిన్ని విజయాలు సాధించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. -
భారతీయులు గర్వపడే విజయమిది : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టి20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ బృందానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అద్భుతంగా ఆడి మళ్లీ చాంపియన్లుగా నిలిచిన కెప్టెన్ సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. తుదిపోరులో ప్రారంభం నుంచే భారత్ ఆధిపత్యం ప్రదర్శించిందని కొనియాడారు. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్ బాగా ఆడారని, చివరి విజయ క్షణాలు భారతీయులందరినీ గర్వపడేలా చేశాయని అభివర్ణించారు. వరల్డ్ కప్ కిరీటం తిరిగి మన ఇంటిలోనే ఉందంటూ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఫైనల్లో టీమిండియా ప్రదర్శించిన అద్భుత ఆటతీరు దేశ ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. ఈ విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని రేవంత్ అన్నారు. -
తొమ్మిది మంది ‘డబుల్’
2024 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుల్లో 9 మంది ఈసారీ విన్నింగ్ టీమ్లో భాగంగా ఉండి కెరీర్లో రెండు టి20 వరల్డ్ కప్లు గెలుచుకున్న అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరారు. సూర్యకుమార్ యాదవ్, సంజు సామ్సన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్లకు ఇది రెండో టి20 వరల్డ్ కప్ విక్టరీ. ఇషాన్ కిషన్, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలకు ఇది తొలి తీపి వరల్డ్ కప్. 2024లో కెప్టెన్ అయిన రోహిత్ శర్మ 2007లో గెలిచిన జట్టులో సభ్యుడిగా ‘డబుల్’ ఆనందాన్ని పొందాడు. పురుషుల దినోత్సవాన చేజారింది... మహిళల దినోత్సవాన దక్కింది... 2023 నవంబర్ 19న భారత జట్టు ఇదే అహ్మదాబాద్ మైదానంలో ఆ్రస్టేలియాతో చేతిలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడి తీవ్ర నిరాశకు గురైంది. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘మెన్స్ డే’గా జరుపుకుంటారు. కానీ ఇప్పుడు ‘ఉమెన్స్ డే’ (మార్చి 8న) రోజు టీమిండియా అదే మైదానంలో మరో వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్లో సత్తా చాటి విశ్వవిజేతగా నిలవడం విశేషం. ఎట్టకేలకు ఆదివారం ‘గెలిచాం’ గతంలో ఆదివారం రోజు జరిగిన మూడు వరల్డ్కప్ ఫైనల్స్లో భారత జట్టు ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. నాలుగోసారి మాత్రం ‘సండే ఫైనల్ సెంటిమెంట్’ను బద్దలు కొట్టింది. ఆదివారం రోజు జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో తొలిసారి భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం రోజు జరిగిన 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో... 2014 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో... 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియా... ఈసారి మాత్రం ప్రత్యర్థి జట్టును చిత్తుగా ఓడించి ఆదివారం అద్భుతం సాధించింది. గతంలో భారత్ గెలిచిన 1983, 2011 వన్డే వరల్డ్కప్ టైటిల్స్ శనివారం రోజున, 2007 టి20 వరల్డ్కప్ టైటిల్ సోమవారం రోజున... 2024 టి20 వరల్డ్కప్ టైటిల్ శనివారం రోజున వచ్చాయి. -
టీ20 వరల్డ్ కప్ విజయం.. భారత్ జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. టోర్నమెంట్ మొత్తం దూకుడుగా ఆడిన టీమిండియా చివరి మ్యాచ్లో కూడా తమ ప్రతిభ చాటుతూ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.Champions! Congratulations to the Indian team on winning the ICC Men’s T20 World Cup! This remarkable triumph reflects exceptional skills, determination and teamwork. They have shown outstanding grit through the tournament. This victory has filled every Indian heart with…— Narendra Modi (@narendramodi) March 8, 2026ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత్ జట్టును అభినందించారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన.. “ఈ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది. దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఈ ఘనతకు టీమ్ ఇండియాకు హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.భారత్ జట్టు సాధించిన ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. క్రీడల పట్ల దేశంలో ఆసక్తిని మరింత పెంచే ఘనత ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఫైనల్లో న్యూజిలాండ్ చిత్తు.. విశ్వవిజేతగా భారత్
అహ్మదాబాద్లో భారత పురుషల క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. రెండున్నరేళ్ల కిందట ఎక్కడైతే అభిమానులకు గుండె కోత మిగిల్చిందో.. ఇప్పుడు అదే వేదికలో చరిత్రను తిరగరాసింది. టీ20 వరల్డ్కప్-2026 విజేతగా టీమిండియా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. ముచ్చటగా మూడోసారి టైటిల్ను ముద్దాడింది.తద్వారా అత్యధిక సార్లు టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన జట్టుగా మెన్ బ్లూ నిలిచింది. అంతేకాకుండా వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్ గెలిచిన జట్టు కూడా టీమిండియానే కావడం విశేషం. భారత్ 2007,2024లో విశ్వవిజేతలగా నిలవగా.. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మరోసారి కప్ కొట్టి సత్తాచాటింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.దంచి కొట్టిన భారత బ్యాటర్లుఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత భారత్ను బ్యాటింగ్కు అహ్హనించాడు. అయితే శాంట్నర్ తీసుకున్న నిర్ణయం మిస్ ఫైర్ అయింది. భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89), అభిషేక్ శర్మ(52), ఇషాన్ కిషన్(54) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో శివమ్ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 26) మెరుపులు మెరిపించాడు.సంజూ, అభిషేక్ తొలి వికెట్కు 98 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారు. ఓ దశలో భారత్ 300 పరుగుల మార్క్ అందుకునేలా కన్పించింది. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.బుమ్ బుమ్ బుమ్రా..అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కివీస్ చతికల పడింది. 19 ఓవర్లలో 159 పరుగులకు న్యూజిలాండ్ కుప్పకూలింది. భారత బౌలర్లలో పేస్ గుర్రం జస్ప్రీత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు అక్షర్ పటేల్ మూడు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలా వికెట్ సాధించారు. కివీస్ బ్యాటర్లలో సీఫర్ట్ (52) టాప్ స్కోరర్ నిలిచాడు. బుమ్రా ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలవగా.. సంజూ శాంసన్కు ప్లేయర్ ఆఫ్ది టోర్నీ అవార్డు లభించింది. Make it THREEEEEEE! 🏆🏆🏆#TeamIndia have repeated & defeated history by becoming the first team to 👇▪️ Win back-to-back titles▪️Three titles▪️Win the title at home#T20WorldCup #INDvNZ pic.twitter.com/bQlm5t0D3k— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్... ఐపీఎల్-2026 ప్రారంభం ఎప్పుడంటే?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఐపీఎల్-2026 సీజన్ ప్రారంభ తేదీ మారింది. గతంలో ఈ మెగా టోర్నీని మార్చి 26న ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ఈ టీ20 క్రికెట్ టోర్నీ మార్చి 28 నుంచి షురూ కానుంది. ఈ విషయాన్ని భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది.ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నట్లు సమాచారం. కాగా గత ఏడాది జూన్లో ఆర్సీబీ టైటిల్ సెలబ్రేషన్స్ సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లను నిలిపివేశారు. ఇప్పుడు కర్ణాటక సర్కార్ నుంచి అనుమతి లభించడంతో చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ సందడి మళ్లీ మొదలు కానుంది. ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్లలో 5 మ్యాచ్లను బెంగళూరులో, మిగిలిన 2 మ్యాచ్లను రాయ్పూర్లో ఆడనుంది. కాగా ఫైనల్ లేదా ఓ ప్లే ఆఫ్ మ్యాచ్కు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన భారత్.. వరల్డ్ రికార్డు
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా రికార్డు స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలింగ్ను చితక్కొడుతూ భారత టాపార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడిన టీమిండియా.. కివీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది.అభిషేక్. సంజూ ధనాధన్గత మ్యాచ్లలో విఫలమై విమర్శలు మూటగట్టుకున్న ఓపెనర్ అభిషేక్ శర్మ.. టైటిల్ పోరులో బ్యాట్ ఝులిపించాడు. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 52 పరుగులు సాధించాడు.Cometh the hour, cometh the man! 😍Abhishek Sharma brings up his fifty in just 18 balls, fastest of the tournament! 💪ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/mcmGhlxJxe— Star Sports (@StarSportsIndia) March 8, 2026ఇక మరో ఓపెనర్ సంజూ శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరోసారి విజృంభించాడు. కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 89 పరుగులు సాధించాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెమీస్ మాదిరే సెంచరీకి మరోసారి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026ఇషాన్ సైతంవన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 54 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 18) నిరాశపరిచాడు. తిలక్ వర్మ 6 బంతుల్లో 8 పరుగులతో అజేయంగా నిలవగా.. శివం దూబే 8 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్లు బాది 26 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టీమిండియా 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలా ఒక వికెట్ పడగొట్టారు.చరిత్ర సృష్టించిన టీమిండియాటీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్తో టైటిల్ పోరులో 255/5 స్కోరు నమోదు చేసిన టీమిండియా.. గత ఎడిషన్లో తాను సృష్టించిన రికార్డును.. తాజాగా బద్దలు కొట్టింది. కాగా టీ20 ప్రపంచకప్-2024లో సౌతాఫ్రికాతో ఫైనల్లో టీమిండియా 176/7 నమోదు చేసింది.టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్లు నమోదు చేసిన జట్లు👉టీమిండియా- 2026లో న్యూజిలాండ్పై 255/5👉టీమిండియా- 2024లో సౌతాఫ్రికాపై 176/7👉ఆస్ట్రేలియా- 2021లో న్యూజిలాండ్పై 173/2👉న్యూజిలాండ్- 2021లో ఆస్ట్రేలియాపై 172/4👉వెస్టిండీస్- 2016లో ఇంగ్లండ్పై 161/6👉టీమిండియా- 2007లో పాకిస్తాన్ 157/5.చదవండి: టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు -
ఫైనల్లో ఊచకోత.. సంజూ శాంసన్ వరల్డ్ రికార్డు
టీ20 వరల్డ్కప్-2026ను టీమిండియా స్టార్ ఓపెనర్గా సంజూ శాంసన్ ఘనంగా ముగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో శాంసన్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను ఉతికారేశాడు.మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం సంజూ విడిచిపెట్టలేదు. అతడి మెరుపు బ్యాటింగ్కు బౌండరీలు చిన్నబోయాయి. శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో 5 మ్యాచ్లు ఆడిన శాంసన్.. 80.25 సగటుతో 321 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన సంజూ శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.సంజూ సాధించిన రికార్డులు ఇవే👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా సంజూ రికార్డులెక్కాడు. సంజూ తొలి ఓవర్లో ఇప్పటివరకు 4 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు మహ్మద్ రిజ్వాన్, క్వింటన్ డికాక్, గుర్బాన్, సాల్ట్ పేరిట ఉండేది. వీరిందరూ తొలి ఓవర్లో మూడు సిక్స్లు బాదారు.👉ఒక టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ప్రపంచకప్లో సంజూ 21 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఫిన్ అలెన్(21)ను సంజూ అధిగమించాడు.👉ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ హాఫ్ సెంచరీలు సాధించిన మూడో ప్లేయర్గా శాంసన్ నిలిచాడు. శాంసన్ కంటే ముందు షాహిద్ అఫ్రిది, విరాట్ కోహ్లి ఈ ఫీట్ సాధించారు.Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు
భారత టీ20 ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్- అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో యాభైకి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జంటగా ప్రపంచ రికార్డు సాధించారు. వీరిద్దరి విధ్వంసం కారణంగా.. టీ20 ప్రపంచకప్ సెమీస్ లేదంటే ఫైనల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో న్యూజిలాండ్తో ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత ఓపెనర్లు సంజూ- అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. నాలుగో ఓవర్ ముగిసేసరికి సంజూ 14 బంతుల్లోనే 24, అభిషేక్ శర్మ 10 బంతుల్లోనే 23 పరుగులు సాధించారు.CHETTA POWER! 💪Outrageous six from Sanju Samson as 21 runs came off Matt Henry's over! 🥶ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/LGg4snOIuP— Star Sports (@StarSportsIndia) March 8, 2026దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో 50కి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా భారత స్టార్లు నిలిచారు. ఇక ఆ తర్వాత కూడా సంజూ- అభిషేక్ జోరు కొనసాగించారు. అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.Cometh the hour, cometh the man! 😍Abhishek Sharma brings up his fifty in just 18 balls, fastest of the tournament! 💪ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/mcmGhlxJxe— Star Sports (@StarSportsIndia) March 8, 2026మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపిన అభిషేక్.. రచిన్ రవీంద్ర బౌలింగ్లో టిమ్ సీఫర్ట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సంజూతో కలిసి అభిషేక్ తొలి వికెట్కు 43 బంతుల్లో 98 పరుగులు జోడించాడు.కాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా పాకిస్తాన్ స్టార్లు కమ్రాన్ అక్మల్- షాజైబ్ హసన్ రికార్డు సాధించాడు. వీరు 2009లో లార్డ్స్ వేదికగా శ్రీలంక మీద 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజాగా వీరి రికార్డును బద్దలు కొడుతూ సంజూ- అభిషేక్ శర్మ కలిసి కేవలం నాలుగు ఓవర్లలోనే 51 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ 33 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. -
ఫైనల్లో అభిషేక్ శర్మ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక మ్యాచ్లో తన ఫామ్ను తిరిగి అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తన పేలవ ఫామ్కు చెక్ పెడుతూ కివీస్ బౌలర్లను ఉతికారేశాడు.నరేంద్ర మోడీ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా టీ20 వరల్డ్కప్ నాకౌట్స్ మ్యాచ్లలో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన ప్లేయర్గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెతల్ పేరిట ఉండేది. వీరిద్దరూ ఇదే వరల్డ్కప్ సెమీఫైనల్స్లో 19 బంతుల్లో ఆర్ధ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తాజా ఇన్నింగ్స్తో వీరిద్దరిని అభిషేక్ అధిగమించాడు.ఓవరాల్గా 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 6 ఫోర్లు, 3 సిక్స్లతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా భారత్ స్కోర్ కేవలం 7 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్ దాటింది.🚨 ABHISHEK SHARMA SELECTION UNDER QUESTION 🚨Fans said – “Why is GG wasting a spot for this blind slogger?”Management said – Abhishek has only 89 runs in 7 matches with 3 ducks, but we won’t change the winning combination for the Final! 🤯pic.twitter.com/05OFSZf4PT— Sam (@Cricsam01) March 7, 2026 -
T20 WC Final: అదృష్టం!.. భయపెడుతున్న మరో సెంటిమెంట్
న్యూజిలాండ్తో టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. ఊహాగానాలకు తెరదించుతూ సెమీ ఫైనల్లో ఆడిన తుదిజట్టునే టైటిల్ పోరులోనూ కొనసాగించింది. వరుస వైఫల్యాల తర్వాత కూడా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. నంబర్ వన్ బౌలర్ వరుణు చక్రవర్తికి తుదిజట్టులో చోటు ఇచ్చింది.అదే వేదిక.. అదే అంపైర్ఇదిలా ఉంటే.. భారత్- కివీస్ జట్లకు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఇదే వేదికపై టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్.. తాజా ఫైనల్కు కూడా అంపైర్ కావడం గమనార్హం.అదృష్టం ఏమిటంటేఇక ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోవడం కూడా అభిమానులను కలవరపెడుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు 14 టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లలో పదకొండు లక్ష్య ఛేదనకు దిగిన జట్లే గెలవడం ఇందుకు కారణం. అయితే, అదృష్టం ఏమిటంటే.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన సందర్భాలలో.. మూడు విజయాలూ టీమిండియా ఖాతాలోనే ఉండటం. కాగా టీమిండియా కివీస్తో ఫైనల్లో ఏ మార్పు లేకుండానే బరిలోకి దిగగా.. న్యూజిలాండ్ కోల్ మెకాంచీ స్థానంలో జేకబ్ డఫీని తీసుకువచ్చింది. Classic Ravi Shastri energy at the toss! 😍🚨 The coin toss goes Mitchell Santner's way & New Zealand will bowl first in the final! ✌️ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/g8UkcXpNKo— Star Sports (@StarSportsIndia) March 8, 2026తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ . -
గతం గురించి ఆలోచించడం లేదు.. ఇది మాకు చాలా స్పెషల్: సూర్య
టీ20 ప్రపంచకప్-2026లో తుది పోరుకు తేర లేచింది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్-భారత్ తలపడతున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత టీమిండియాను బ్యాటింగ్కు అహ్హనించాడు. న్యూజిలాండ్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. మెక్కాంచీ స్ధానంలో పేసర్ జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చాడు. టీమిండియా మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. సెమీస్లో ఆడిన టీమ్నే కొనసాగించింది. ఇక టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు."ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. గత కొన్ని మ్యాచ్లుగా మేము మొదట బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నాము. సెమీస్ లేదా ఫైనల్ వంటి మెగా మ్యాచ్లలో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరును ప్రత్యర్ధి ముందు ఉంచిగల్గితే ఉత్తమంగా ఉంటుంది.2023 వరల్డ్కప్ ఓటమి గురుంచి మేము ఆలోచించడం లేదు. అది గతం మాత్రమే. ఇది డిఫెరెంట్ ఫార్మాట్. మా కుర్రాళ్లు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారు. 1,20,000 మంది ప్రేక్షకుల ముందు ఇటువంటి మ్యాచ్ ఆడడం నిజంగా చాలా స్పెషల్. టాస్ వేసే సమయానికే స్టేడియం నిండిపోయింది. మా ఆట తీరుతో వారిని అలరిస్తామని" సూర్య పేర్కొన్నాడు.తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ -
న్యూజిలాండ్-భారత్ ఫైనల్.. టిక్కెట్ ధర ఎన్ని లక్షలంటే?
టీ20 వరల్డ్కప్-2026 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ తుది పోరును వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. అహ్మదాబాద్ ప్రస్తుతం 'క్రికెట్ ఫీవర్'తో ఊగిపోతోంది. ఇప్పటికే ఈ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్లు మొత్తం అమ్ముడుపోయాయి.బుక్మై షో యాప్ ద్వారా టికెట్లను విక్రయించారు. ప్రారంభ టిక్కెట్ ధర రూ. 2 వేలు కాగా.. గరిష్ట ధర రూ. 75000గా నిర్ణయించారు. అయితే టిక్కెట్లు దొరకని అభిమానులను ధళారులు టార్గెట్ చేస్తున్నారు.బ్లాక్ మార్కెట్లో ఒక్కో టిక్కెట్ను రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) కార్యదర్శి అనిల్ పటేల్ స్పందించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి ఫిజికల్ టిక్కెట్లను విక్రయించడం లేదని, కేవలం బుక్మైషో యాప్ ద్వారానే అధికారిక బుకింగ్స్ జరుగుతాయని స్పష్టం చేశారు. అడ్డదారుల్లో టిక్కెట్లు కొనవద్దని ఆయన హెచ్చరించారు.కేవలం టిక్కెట్లే కాదు, అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాల్లో హోటల్ గదుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. సాధారణంగా అహ్మదాబాద్ హోటల్లో ఒక రోజుకు ధర రూ. 4,000గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ క్రేజ్ కారణంగా ఈ ధరలు ఏకంగా 10 రెట్లు పెరిగాయి. అంటే ఒక్క రోజుకు రూ.40,000 పైగా వసూలు చేస్తున్నారు. -
టీ20 వరల్డ్కప్-2026 ఛాంపియన్స్గా భారత్
వరల్డ్ ఛాంపియన్గా భారత్టీ20 వరల్డ్కప్-2026 ఛాంపియన్గా భారత్ నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. మూడోసారి పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 256 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కివీస్ చతికలపడింది. 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది.UPDATESన్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన శాంట్నర్.. బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.బుమ్ బుమ్ బుమ్రా..16వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో కివీస్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. మూడో బంతికి నీషమ్, నాలుగో బంతికి హెన్రీ క్లీన్ బౌల్డయ్యాడు. 16 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 143/8ఆరో వికెట్ డౌన్.. మిచెల్ ఔట్124 పరుగుల వద్ద కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన డారిల్ మిచెల్.. అక్షర్పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు.న్యూజిలాండ్ ఐదో వికెట్ డౌన్52 పరుగులు చేసిన టిమ్ సీఫర్ట్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు కివీస్ స్కోర్: 80-5కివీస్ నాలుగో వికెట్ డౌన్న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన చాప్మన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు.సీఫర్ట్ హాఫ్ సెంచరీఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి టిమ్ సీఫర్ట్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 7 ఓవర్లకు న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.న్యూజిలాండ్ మూడో వికెట్ డౌన్న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.కివీస్ రెండో వికెట్ డౌన్రచిన్ రవీంద్ర రూపంలో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రవీంద్ర.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు.కివీస్ తొలి వికెట్ డౌన్256 పరుగుల భారీ లక్ష్యంంతో బరిలోకి దిగిన కివీస్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్లో ఉన్న ఫిన్ అలెన్.. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 3 ఓవర్లకు కివీస్ స్కోర్: 32/1న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?టీ20 వరల్డ్కప్-2026లో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడిన తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89), అభిషేక్ శర్మ(52), ఇషాన్ కిషన్(54) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో శివమ్ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 26) మెరుపులు మెరిపించాడు.18 ఓవర్లలో టీమిండియా స్కోరు: 220-4హార్దిక్ 12, తిలక్ 5 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్15.6: సూర్యకుమార్ డకౌట్. నీషమ్ బౌలింగ్లో రచిన్కు క్యాచ్ ఇచ్చి అవుట్. స్కోరు: 204-4(16). క్రీజులోకి తిలక్ వర్మ. హార్దిక్ ఒక పరుగుతో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన భారత్15.5: నీషమ్ బౌలింగ్లో మార్క్ చాప్మన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇషాన్ (25 బంతుల్లో 54).రెండో వికెట్ కోల్పోయిన భారత్15.1: జేమ్స్ నీషమ్ బౌలింగ్లో సంజూ మెకాంచీ (సబ్స్టిట్యూట్ ఫీల్డర్)కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 46 బంతుల్లో ఐదు ఫోర్లు, 8 సిక్స్లు కొట్టి 89 పరుగులు సాధించాడు.ఇషాన్ హాఫ్ సెంచరీ23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ హాఫ్ సెంచరీ14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 191-1సంజూ 44 బంతుల్లో 88, ఇషాన్ కిషన్ 19 బంతుల్లో 43 పరుగులతో ఉన్నారు.శాంసన్ హాఫ్ సెంచరీసంజూ శాంసన్ ఫైనల్లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. 33 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 161 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన భారత్అభిషేక్ శర్మ రచిన్ రవీంద్ర బౌలింగ్లో టిమ్ సీఫర్ట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గత మ్యాచ్లలో విఫలమైన అభిషేక్ ఈసారి 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపాడు.పవర్ ప్లేలో టీమిండియా రికార్డు స్కోరు: 92-0(6)అభిషేక్ 19 బంతుల్లో 51, సంజూ శాంసన్ 17 బంతుల్లో 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు.అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీకేవలం 18 బంతుల్లోనే అభిషేక్ శర్మ అర్ధ శతకం బాదాడు. రికార్డు అలర్ట్టీ20 ప్రపంచకప్ ఫైనల్లో 50కి పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లుగా చరిత్ర సృష్టించిన భారత జోడీ సంజూ- అభిషేక్దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్లుఫైనల్ మ్యాచ్లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(23), సంజూ శాంసన్(24) దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది.తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీటీ20 ప్రపంచకప్-2026 తుది అంకానికి చేరుకుంది. అహ్మబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ హైవోల్టేజ్ మ్యాచ్ షురూ కానుంది. ఇందుకోసం ఇరుజట్లు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నాయి. ఊర్రూతలూగేలా..పాప్ స్టార్ రికీ మార్టిన్ క్లోజింగ్ సెర్మనీలో మారియా సాంగ్తో ప్రేక్షకులను అలరించాడు. డాన్సులతో ఉర్రూతలూగించాడు. అంతకుముందు సుఖ్బీర్ తన పాటలతో స్టేడియాన్ని హోరెత్తించాడు.#WATCH | Gujarat: Team India leaves from their hotel in Ahmedabad for Narendra Modi Stadium where they will face New Zealand in #ICCT20WorldCupfinal this evening. pic.twitter.com/X2sjnwXyTb— ANI (@ANI) March 8, 2026ధోని సైతం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సైతం అహ్మదాబాద్కు చేరుకున్నారు.#WATCH | Gujarat | Former Captain of the Indian Cricket Team Mahendra Singh Dhoni arrives at Ahmedabad ICC Men's T20 World Cup 2026 final between India and New Zealand, to be played today at the Narendra Modi Stadium. pic.twitter.com/5Q6gNuIcsQ— ANI (@ANI) March 8, 2026 సతీ సమేతంగా రోహిత్సతీ సమేతంగా భారత మాజీ కెప్టెన్, టీ20 ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ అహ్మదాబాద్కు విచ్చేశాడు.#WATCH | Gujarat: Former Captain of the Indian Cricket Team, Rohit Sharma and his wife Ritika Sajdeh arrive in Ahmedabad to watch the India vs New Zealand #ICCT20WorldCup final at Narendra Modi Stadium this evening. pic.twitter.com/iXVibFowWH— ANI (@ANI) March 8, 2026 -
మరి కొన్ని గంటల్లో ఫైనల్.. టీమిండియా సంచలన నిర్ణయం!?
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు మరి కొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా తెరలేవనుంది.ఈ తుది పోరులో ఎలాగైనా గెలిచి మూడో సారి టైటిల్ను ముద్దాడాలని భారత్ భావిస్తుంటే.. కివీస్ సైతం తొలి టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.వరుణ్పై వేటు..?‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు వెల్లడించాయి. ఫైనల్ మ్యాచ్కు ముందు కుల్దీప్ నెట్స్లో తీవ్రంగా శ్రమించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. వరుణ్ చక్రవర్తి మాత్రం నామమాత్రపు ప్రాక్టీస్కే పరిమితం కావడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ బౌలర్గా ఉన్నప్పటికీ, ఈ టోర్నమెంట్లో ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ తమిళనాడు స్పిన్నర్ లీగ్ స్టేజ్లో రాణించినప్పటికి.. కీలకమైన సూపర్-8 దశలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు.సెమీఫైనల్లో కూడా ఓ వికెట్ పడగొట్టినప్పటికి పరుగులు మాత్రం ధారాళంగా సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానంలో కుల్దీప్ను జట్టులోకి తీసుకోవాలని టీమ్ మెనెజ్మెంట్ భావిస్తుందంట. వరుణ్ కంటే కుల్దీప్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంచి రికార్డు ఉంది. ఫ్లాట్ పిచ్పై కూడా బంతిని తిప్పగలిగే సత్తా కుల్దీప్ యాదవ్కు ఉంది. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం కుల్దీప్ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించారు. మరి టీమ్ మెనెజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కాగా ఈ టోర్నీలో కుల్దీప్ కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆడాడు.భారత తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.చదవండి: మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్ -
‘పర్ఫెక్ట్ ఇన్నింగ్స్.. నిశ్చితార్థం చేసుకున్నా’
భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా శుభవార్త చెప్పాడు. మనసిచ్చిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఆదివారం వెల్లడించాడు. ఆకృతి అగర్వాల్తో తన ఎంగేజ్మెంట్ జరిగిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాడు.ఈ సందర్భంగా.. ‘‘మైదానంలో సిక్సర్లు బాదడం నుంచి.. జీవితకాలం మైదానం వెలుపలా అదే జోరు కొనసాగించేలా.. ఆమే నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్.. జస్ట్ ఇప్పుడే నిశ్చితార్థం చేసుకున్నా’’ అని 26 ఏళ్ల పృథ్వీ షా ఇన్స్టా వేదికగా తన ఎంగేజ్మెంట్ ఫొటోలు షేర్ చేశాడు. దీంతో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఆకృతి ఎవరంటే?సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, నటిగా 22 ఏళ్ల ఆకృతి అగర్వాల్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఈమెకు మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఆకృతి.. ఉన్నత విద్య కోసం ముంబైకి వచ్చింది.ఈ క్రమంలో నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. త్రిముఖ అనే చిత్రంలో మొదటిసారి నటించింది. ఇక పృథ్వీ షాతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. గతేడాది రొమాంటిక్ రీల్ చేయడం ద్వారా తమ బంధం గురించి వీరు అభిమానులకు సంకేతాలు ఇచ్చారు.ఇటీవల.. సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ల వివాహానికి కూడా పృథ్వీ- ఆకృతి జంటగా హాజరయ్యారు. ఇంతలోనే.. వారం తిరగకముందే ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. పడిలేచిన ప్రయాణంచిన్న వయసులోనే క్రికెటర్గా సత్తా చాటిన పృథ్వీ షా.. కెప్టెన్గా భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించాడు. ఈ క్రమంలో టీమిండియాలో అరంగేట్రం చేసిన ఈ ముంబైకర్.. ఓపెనర్గా ఆరంభంలో సత్తా చాటాడు.అయితే, ఆ తర్వాత ఫామ్ కొనసాగించలేక జట్టులో స్థానం కోల్పోయాడు. పృథ్వీ షా కెప్టెన్సీలో అండర్ 19 వరల్డ్కప్ ఆడిన శుబ్మన్ గిల్ ఇపుడు టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదగగా.. క్రమశిక్షణా రాహిత్యంతో పృథ్వీ షా అధఃపాతాళానికి పడిపోయాడు. ఇటీవలే మళ్లి ఫామ్ అందుకున్న అతడు.. ముంబై తరఫున దేశీ క్రికెట్లో రాణించాడు. ఐపీఎల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది మినీ వేలంలో రూ. 75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది.చదవండి: ఘనంగా అర్జున్ టెండుల్కర్- సానియా వివాహం.. వీడియో వైరల్ -
T20 WC Final: మారవా?.. నీ అంచనా తప్పుతుంది!
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై నోరు పారేసుకున్నాడు. సూర్యకుమార్ సేనపై మిచెల్ సాంట్నర్ బృందానిదే పైచేయి అవుతుందని పేర్కొన్నాడు. కివీస్ జట్టు సమిష్టిగా రాణిస్తుంటే.. టీమిండియా ఇంకా ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడటమే ఇందుకు కారణమని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్కు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం భారత్- కివీస్ (IND vs NZ) జట్లు టైటిల్ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలా ఉంటే.. పాక్ మాజీ పేసర్ ఆమిర్ టోర్నీ ఆరంభం నుంచి టీమిండియాపై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు.పదే పదే అదే మాటలీగ్ దశలో సూర్య సేన అజేయంగా నిలిచినప్పటికీ.. అది అదృష్టం వల్లేనని ఆమిర్ (Mohammad Amir) అన్నాడు. ఇక సూపర్-8 దశలోనూ టీమిండియా రాణించలేదని సెమీస్కు చేరలేదని వాదించాడు. అయితే, భారత జట్టు సెమీ ఫైనల్లో అడుగుపెట్టడమే కాకుండా.. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్ చేరింది.న్యూజిలాండ్ గెలుస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా మొహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై అక్కసు వెళ్లగక్కాడు. ‘‘న్యూజిలాండ్ జట్టు సమిష్టి ప్రదర్శతో సెమీస్లో సౌతాఫ్రికాను ఓడించింది. కానీ టీమిండియా.. జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ వంటి ఇద్దరు ఆటగాళ్ల కారణంగా ఈరోజు ఫైనల్లో ఉంది. వాళ్లిద్దరు లేకుంటే పరిస్థితి వేరుగా ఉండేది.నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ పరిస్థితులు న్యూజిలాండ్కు సరిగ్గా సరిపోతాయి. ముఖ్యంగా వాళ్ల బౌలింగ్ విభాగం టీమిండియా కంటే మెరుగ్గా ఉంది. భారత జట్టులో బుమ్రా తప్ప ఎవరూ ఫామ్లో లేరు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా వికెట్లు తీసేందుకు కష్టపడుతున్నారు.నీ అంచనా తప్పుతుందిఅయితే, బ్యాటింగ్ పరంగా ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. రెండు జట్లలోనూ మంచి బ్యాటర్లు ఉన్నారు. ముందుగా చెప్పినట్లు న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. టీమిండియా ఎక్కువగా బుమ్రా మీదే ఆధారపడుతోంది. కాబట్టి న్యూజిలాండ్దే గెలుపు అని విశ్వసిస్తున్నాను’’ అని మొహమ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ఆమిర్కు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. సూర్య సేన ఈసారి సమిష్టిగా రాణించి గెలిచి తీరుతుందని.. మరోసారి నీ అంచనా తప్పని నిరూపిస్తుందని పేర్కొంటున్నారు.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీరును తప్పుబట్టాడు. ఐసీసీ ఒక్కొక్క జట్టును ఒక్కోలా చూస్తుందని.. తాజాగా ఇంగ్లండ్కు పెద్ద పీట వేసిన తీరే ఇందుకు నిదర్శనమని విమర్శించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే.టైటిల్ పోరుతో తెరఫిబ్రవరి 7న మొదలైన ఈ ఐసీసీ టోర్నీ నేటి (మార్చి 8) ఫైనల్తో ముగియనుంది. భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జరిగే టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక. ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ టోర్నీ మధ్యలోనే మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. అందుకు ఇరాన్ స్పందిస్తున్న తీరుతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఇక్కడే!ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల గగనతలం మూసివేయడంతో వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు భారత్లోనే చిక్కుకుపోయాయి. నిజానికి విండీస్ మార్చి 1 టీమిండియా చేతిలో ఓటమి తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమించింది. పరిస్థితులు సాధారణంగా ఉండి ఉంటే.. ఆ మరుసటి రోజే స్వదేశానికి చేరుకోవాల్సింది.కానీ పశ్చియాసియాలో యుద్ధం కారణంగా విండీస్ జట్టు వారం రోజులుగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మార్చి 4 నాటి మ్యాచ్లో ఓడి ఎలిమినేట్ అయింది. యుద్ధ పరిస్థితుల వల్ల జట్టు కూడా ఇక్కడే ఉంది. మరోవైపు.. సెమీ ఫైనల్లో మార్చి 5న టీమిండియా చేతిలో ఓడిన ఇంగ్లండ్ కూడా ఇక్కడే ఉండాల్సి రాగా.. ఐసీసీ జోక్యంతో శనివారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో బయల్దేరింది. ఇక వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లకు కూడా ఐసీసీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదని సమాచారం.దీంతో ఆ రెండు జట్లు ఇంకా భారత్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విండీస్ హెడ్కోచ్ డారెన్ సామీ.. ‘‘మమ్మల్ని త్వరగా పంపిచేయండి’’ మహాప్రభో అంటూ మొరపెట్టుకున్న తీరు చర్చనీయాంశమైంది.ఇంగ్లండ్కి మాత్రం చార్టర్ ఫ్లైట్ దొరికిందిఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఐసీసీ తీరును విమర్శించాడు. ‘‘ఇంగ్లండ్ గురువారమే నాకౌట్ అయింది. వాళ్లకి మాత్రం చార్టర్ ఫ్లైట్ దొరికింది. వెస్టిండీస్ గత ఆదివారం నుంచి కోల్కతాలోనే చిక్కుకుపోయింది.సౌతాఫ్రికా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడే అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. జట్లన్నీ ఒకే పరిస్థితిలో ఉన్నపుడు.. వాటన్నింటీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి కదా!.. ఓ దేశ బోర్డు శక్తిమంతమైనది అయినంత మాత్రాన ఐసీసీ వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వకూడదు’’ అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.ఓవరాక్షన్ వద్దుఅయితే, వాన్ పోస్టుకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇండియా- యూరోప్ మధ్య గగనతలంలో ఎలాంటి అడ్డంకులు లేవని.. అదే వెస్టిండీస్ వంటి జట్టు స్వదేశం చేరాలంటే గల్ఫ్ దేశాలు దాటాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.ఒకవేళ యూరోప్ గుండా విండీస్ జట్టును పంపించాలన్నా ఇప్పటికిప్పుడు వీసా, ఒకే చోట 40- 50 మందికి సీట్లు అరేంజ్ చేయడం కుదరదని అంటున్నారు. భౌగోళిక పరిస్థితులను బట్టే ఓ జట్టు ముందు.. ఓ జట్టు వెనక వెళ్లడం జరుగుతుందని.. అంతే తప్ప ఇందులో అధికార దుర్వినియోగం ఏమీ లేదని వాన్కు చురకలు అంటిస్తున్నారు. కాగా ఆదివారం నాటికి వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు స్వదేశానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: T20 WC Final: సాంట్నర్కు ఇచ్చిపడేసిన సూర్యకుమార్ -
254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ పేసర్
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. 254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును న్యూజిలాండ్ పేసర్ బ్రెట్ రాండెల్ సాధించాడు. న్యూజిలాండ్లోని ప్లంకెట్ షీల్డ్ టోర్నీలో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఆడే బ్రెట్ రాండెల్.. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ ఈ ఫీట్ను సాధించలేదు.ఈ మ్యాచ్లో రాండెల్ వరుసగా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించలేకపోయినా, ఎనిమిది బంతుల్లో ఆరు వికెట్లు తీసి మరో రికార్డు సృష్టించాడు. మొత్తంగా 11 ఓవర్లలో 25 పరుగులకు 7 వికెట్లు తీసి తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. రాండెల్ ధాటికి నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ తొలి ఇన్నింగ్స్లో 82 పరుగులకే ఆలౌటైంది. రాండెల్ ధాటికి 4-0గా ఉన్న నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ స్కోర్ స్వల్ప వ్యవధిలో 11-7కి చేరింది.గతంలోనూ ఉన్నా..!ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన ఉదంతాలు గతంలో ఉన్నా.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో నమోదు కావడం మాత్రం ఇదే మొదటిసారి. 2021లో జరిగిన ఓ టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ క్యాంఫర్ ఈ రేర్ ఫీట్ను సాధించాడు. 2024లో జింబాబ్వే మహిళా క్రికెటర్ కెలిస్ న్ద్లోవు ఓ అండర్-19 మ్యాచ్లో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీశారు. కాగా, తాజా ఉదంతంలో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన రాండెల్కు ఈ మ్యాచ్లో ఆడే అవకాశం అనుకోకుండా వచ్చింది. సీనియర్ బౌలర్లు గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో రాండెల్ తుది జట్టులోకి వచ్చాడు. ఆ అవకాశాన్ని ఆయన చరిత్రాత్మక ప్రదర్శనగా మార్చి, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. -
టీమిండియాకు ఘోర పరాభవం
మల్టీ ఫార్మాట్ సిరీస్ (3 టీ20, 3 వన్డేలు, ఏకైక టెస్ట్) కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత మహిళల జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పెర్త్లోని వాకా స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. ఆతర్వాత జరిగిన వన్డే సిరీస్లో క్వీన్ స్వీప్ అయ్యింది. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో కూడా ఓడి, సిరీస్ మొత్తాన్ని కోల్పోయింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. అన్నాబెల్ సదర్ల్యాండ్ (17-5-46-4), లూసీ హ్యామిల్టన్ (11-3-31-3), డార్సీ బ్రౌన్ (12.4-0-41-2) ధాటికి 62.4 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్లో జమీమా రోడ్రిగ్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించారు. షఫాలీ వర్మ (35), ఆఖర్లో కశ్వీ గౌతమ్ (34 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 323 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంతితో సత్తా చాటిన సదర్ల్యాండ్ బ్యాట్తోనూ చెలరేగి సూపర్ సెంచరీ (129) చేసింది. ఎల్లిస్ పెర్రీ (76) అర్ద సెంచరీతో రాణించగా.. మిగతా ప్లేయర్లు ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. భారత బౌలర్లలో సయాలీ సత్ఘరే 4, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 2, స్నేహ్ రాణా, షఫాలీ వర్మ చెరో వికెట్ తీశారు.125 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఆసీస్ బౌలర్ల ధాటికి మరోసారి దారుణంగా పతనమైంది. హ్యామిల్టన్ (8-1-32-3), అలానా కింగ్ (10-2-23-2), ఆష్లే గార్డ్నర్ (4.2-1-8-2), సదర్ల్యాండ్ (6-2-15-2), డార్సీ బ్రౌన్ (14-2-45-1) దెబ్బకు 149 పరుగులకే ఆలౌటైంది. ప్రతీక రావల్ (63) ఒంటరిపోరాటం చేయగా.. స్టార్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. కెప్టెన్ హర్మన్(11), జెమీమా (14) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. ఆఖర్లో స్నేహ్ రాణా (30) ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించింది.అనంతరం 25 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కేవలం 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. జార్జియా వాల్ 16, లిచ్ఫీల్డ్ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్లోనే ముగిసింది. -
T20 WC 2026: ఫైనల్కు ముందు టీమిండియాకు భారీ బూస్టప్
టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. ఇవాళ (మార్చి 8) అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య అంతిమ సమరం జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్ వరుసగా తమ రెండో టైటిల్ను, ఓవరాల్గా మూడో టైటిల్ సాధిస్తుందా లేక న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరిస్తుందా అన్న విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.చర్చలు, అంచనాలు ఎలా ఉన్నా.. టీమిండియాకు మాత్రం ఓ విషయం చాలా బూస్టప్ను ఇస్తుంది. అదేంటంటే.. భారత్కు టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ చేతిలో ఇప్పటివరకు ఓటమనేదే లేదు. ఇరు జట్లు ఈ మెగా టోర్నీలో 3 సార్లు ఎదురెదురుపడగా.. మూడు సార్లు టీమిండియానే పైచేయి సాధించింది.ఓవరాల్గా (మొత్తం టీ20ల్లో) చూసినా న్యూజిలాండ్పై టీమిండియాదే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్లు జరగ్గా.. 16 మ్యాచ్ల్లో భారత్, 11 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మూడు మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి.ఇరు జట్లు గత రెండు సందర్భాల్లో ఎదురెదురుపడినప్పుడు కూడా టీమిండియానే ఆధిక్యత ప్రదర్శించింది. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియానే గెలిచింది.పై అంశాలతో పాటు మరో అంశం కూడా టీమిండియాకు సానుకూలంగా ఉంది. అదే హోం అడ్వాంటేజ్. భారత్ సహజంగానే స్వదేశంలో చెలరేగిపోతూ ఉంటుంది. అభిమానుల నుంచి లభించే విపరీతమైన ప్రోత్సాహం టీమిండియాను ఎంతటి ఒత్తిడినైనా అధిగమించేలా చేస్తుంది. ఈ విషయం పలు సార్లు మిస్ ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో ఆసీస్ చేతిలో చిత్తైంది. అయితే ఈసారి అలా జరగదని భారత అభిమానులు బలంగా నమ్ముతున్నారు. -
న్యూజిలాండ్ ఘన విజయం
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జింబాబ్వే మహిళల జట్టుతో ఇవాళ (మార్చి 8) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. డునెడిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే ఇదే డునెడిన్ వేదికగా మార్చి 11న జరుగనుంది.వన్డే సిరీస్కు ముందు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను కూడా న్యూజిలాండే 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం జింబాబ్వే మహిళల జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. కెప్టెన్ అమేలియా కెర్ (9.1-1-34-7) విజృంభించడంతో 29.1 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. కెర్కు పెన్ఫోల్డ్ (4-1-17-3) సహకరించింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో ముపచిక్వ (32) మినహా ఒక్కరు కూడా కనీసం 15 పరుగుల మార్కును తాకలేకపోయారు. నలుగురు డకౌట్లు కాగా.. ముగ్గురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ బ్యాటర్లు ఆడుతూపాడుతూ ఛేదించారు. బంతితో విజృంభించిన కెర్ (45) బ్యాట్తోనూ సత్తా చాటి ఒంటిచేత్తో తన జట్టుకు విజయాన్నందించింది. కెర్కు మరో ఓపెనర్ ఇసబెల్లా గేజ్ (20), మ్యాడీ గ్రీన్ (27 నాటౌట్), బ్రూక్ హల్లీడే (7 నాటౌట్) సహకరించడంతో న్యూజిలాండ్ 16.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జింబాబ్వే బౌలర్లలో మజ్విషయా, చటోంజ్వాకు తలో వికెట్ దక్కింది. -
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్..?
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 8) తుది సమరం జరుగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ టైటిల్ కోసం పోటీ పడతాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్ వరుసగా తమ రెండో టైటిల్ను సాధిస్తుందా లేక న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరిస్తుందా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.మండుటెండల్లో ఈ హీట్కు తోడు మరో సంచలన విషయం వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది. అదేంటంటే.. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేటి ఫైనల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని సోషల్మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. టైటిల్ గెలిచినా, గెలవకపోయినా సూర్య నిర్ణయం మారదని పలు కథనాలు వెలువడుతున్నాయి.వయసు పైబడటం (35), మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) అవకాశాలు లేకపోవడం చేత స్కై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తరహాలోనే స్కై కూడా కెరీర్కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్, కోహ్లి టీ20 ప్రపంచకప్ 2024 గెలుపు తర్వాత పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.గత కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడిన సూర్య.. ఈ ప్రపంచకప్కు ముందే తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఫామ్లో ఉన్నప్పుడే కెరీర్కు పుల్స్టాప్ పెడితే గౌరవంగా ఉంటుందన్న మరో భావన కూడా సూర్య రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. నేటి ఫైనల్లో ఓ మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపుకు దోహదపడితే స్కై భారత కెప్టెన్గా తన కెరీర్కు న్యాయం చేసినట్లవుతుంది.రోహిత్ శర్మ తర్వాత భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్య.. కెప్టెన్గా అసమానమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. అతని సారథ్యంలో భారత జట్టు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. పైగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి మేటి జట్ట భారీ సిరీస్ విజయాలు సాధించాడు. అతని కెప్టెన్సీ సక్సెస్ రేట్ 80 శాతానికి పైగా ఉందంటే, అతను ఏ రేంజ్లో విజయాలు సాధించాడో అర్దమవుతుంది. వ్యక్తిగతంగా విఫలమైనా, స్కై కెప్టెన్గా జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు.స్కై రిటైర్మెంట్పై ఊహాగానాలు తప్పిస్తే.. ఇప్పటివరకు అతని నుంచి కానీ, బీసీసీఐ నుంచి కాని ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. ఈ విషయంపై సందిగ్దత వీడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
ఘనంగా వరల్డ్కప్ క్లోజింగ్ సెర్మనీ.. ప్రత్యేక ఆకర్షణగా రికీ మార్టిన్
టీ20 ప్రపంచకప్ 2026 క్లోజింగ్ సెర్మనీ ఘనంగా జరుగనుంది. ఇవాళ (మార్చి 8) అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగబోయే భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్కు ముందు ఈ గ్రాండ్ ఈవెంట్ షెడ్యూలైంది. ఈ ఈవెంట్లో అంతర్జాతీయ పాప్ స్టార్ రికీ మార్టిన్ నృత్య, గాన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. Livin’ La Vida Loca, She Bangs వంటి హిట్ పాటలతో అతను అభిమానులను ఉర్రూతళూగించనున్నాడు.ఈ ఈవెంట్లో ప్రముఖ పంజాబీ సింగర్ సుఖ్బీర్, ఫేమస్ గాయని ఫాల్గుని పాఠక్ కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ వేడుకలో గ్లోబల్ హిట్స్తో పాటు దేశీ అంథమ్స్ కూడా వినిపించనున్నాయి. రికీ మార్టిన్ అంతర్జాతీయ ధమాకా ప్రదర్శన ఇస్తే, సుఖ్బీర్, ఫాల్గుని భారతీయ రుచిని జోడించనున్నారు. ఈ కార్యక్రమం నరేంద్ర మోడి స్టేడియంలోనే మ్యాచ్ ప్రారంభానికి (7 గంటలకు) గంటన్నర ముందు (సాయంత్రం 5:30) మొదలవుతుంది. ఈ ఈవెంట్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే JioHotstar యాప్ మరియు వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ టోర్నీకి సబంధించి ప్రారంభ వేడుక కూడా ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్లో నోరా ఫతేహి తన వైవిధ్యభరితమైన డాన్స్తో అలరించగా, రిషభ్ రిఖిరామ్ శర్మ సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. -
మరో కొత్త అవతారంలో గంగూలీ
టీమిండియా ఆటగాడిగా, కెప్టెన్గా, బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కోచ్గా, మెంటార్గా వివిధ హోదాల్లో క్రికెట్కు సేవలందించిన భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. త్వరలో క్రికెటేతర రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రముఖ టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్' బెంగాలీ వెర్షన్కు హోస్ట్గా ఎంపికయ్యాడు. ఈ షోను ఇటీవలే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఘనంగా ప్రకటించారు. బిగ్ బాస్ లాంచ్ వేడుక ఈడెన్ గార్డెన్స్లో భారీ లైట్ షో, కళాకారుల ప్రదర్శనలు, సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్తో ఘనంగా జరిగింది. ఈ షో స్టార్ జల్షా ఛానల్లో ప్రసారం కానుంది. బిగ్ బాస్ హోస్ట్గా ఎంపికైన సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ఏ పని చిన్నది కాదు. దేశం కోసం ఆడినా, షో హోస్ట్ చేసినా, నేను పూర్తి అంకితభావంతో చేస్తాను అని అన్నాడు. కాగా, గంగూలీ ప్రస్తుతం ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్ పర్సన్గా, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, సౌతాఫ్రికా టీ20 లీగ్లో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్గా, బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ అడ్మినిస్ట్రేటర్గా వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇవి కాకుండా ఇప్పుడు అదనంగా బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలు చేపట్టాడు.మరోవైపు గంగూలీ బయోపిక్ తెరపైకి రానున్న విషయం తెలిసిందే. అందులో రాజ్కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించనున్నారు. అపరాజిత ఆధ్యా గంగూలీ తల్లి పాత్రలో, బోమన్ ఇరానీ తండ్రి చండీ గంగూలీగా నటించనున్నట్లు సమాచారం. పాత్రకు సన్నద్ధం కావడానికి రాజ్కుమార్ రావు గంగూలీ ఇంట్లో కొంతకాలం గడపనున్నారు. -
ప్రపంచకప్ ఫైనల్కు ముందు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
టీమిండియాతో జరుగబోయే పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్కు ముందు న్యూజిలాండ్ స్టార్ మహిళా క్రికెటర్ లియా తాహూహు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించింది. న్యూజిలాండ్ మహిళల క్రికెట్లో అత్యంత అనుభవజ్ఞులైన అయిన లియా.. తన 15 ఏళ్ల వన్డే క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికింది. 35 ఏళ్ల తాహూహు, 2011లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసి, 103 వన్డేల్లో 125 వికెట్లు సాధించింది. ఇది న్యూజిలాండ్ మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్ల రికార్డు. లియా కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్.తాహూహు నాలుగు వన్డే ప్రపంచకప్లలో (2013, 2017, 2022, 2025) ఆడి 36 వికెట్లు తీసింది. ఇది న్యూజిలాండ్ తరఫున అత్యధికం. అలాగే మొత్తం జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది. 2025లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ ఆమె చివరి వన్డేగా నిలిచింది. రిటైర్మెంట్ సందర్భంగా తాహూహు భావోద్వేగంగా స్పందించారు. “వైట్ ఫెర్న్స్ జెర్సీ ధరించడం ఎప్పుడూ గౌరవం. ఒక్క మ్యాచ్ ఆడటం కూడా గొప్ప అనుభూతే. కానీ వందకు పైగా మ్యాచ్ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని కలలో కూడా ఊహించలేదని అన్నారు. వన్డేలకు వీడ్కోలు పలికినా, అంతర్జాతీయ టీ20ల్లో కొనసాగుతానని తాహూహు స్పష్టం చేసింది. ఆమె తన చివరి టీ20ని 2025 మార్చిలో ఆడింది. ఈ నెలలో దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్లో తాహూహు జట్టులో ఉంటుందని న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగమైన తాహూహు, ఈ ఏడాది ఇంగ్లండ్లో జరగబోయే టోర్నీలో టైటిల్ నిలబెట్టుకోవడం కోసం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. తాహూహు కెరీర్ న్యూజిలాండ్ మహిళల క్రికెట్కు ఓ మైలురాయిగా నిలిచింది. ఆమె వేగం, దూకుడు జట్టుకు ప్రత్యేకమైన అంచు ఇచ్చాయి. వన్డేలకు వీడ్కోలు పలికినా, టీ20ల్లో ఆమె అనుభవం జట్టుకు మరింత బలం చేకూర్చనుంది. తాహూహు ఇప్పటివరకు ఆడిన 98 టీ20ల్లో 95 వికెట్లు తీసింది. -
ట్రిపుల్ టైటిల్ వేటలో...
భారత జట్టు 2024 టి20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన తర్వాత ఇప్పటి వరకు 49 మ్యాచ్లు ఆడితే 40 గెలిచింది. 2023 ఆగస్టు నుంచి మన టీమ్ ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. జట్టులో పలు మార్పులు చేసుకున్నా, ఆఖరి క్షణాల్లో ఆటగాళ్లను చేర్చినా ఫలితాల్లో మాత్రం తేడా రాలేదు. ఎలాంటి నిర్ణయం, వ్యూహమైనా అద్భుతంగా పని చేశాయి. ఇలాంటి విజయాల తర్వాత, ఇంత బలమైన జట్టుకు ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉంది. కానీ అనిశ్చితికి మారుపేరైన టి20 క్రికెట్లో కొన్ని అనూహ్య క్షణాలు కూడా రాత మారుస్తాయి. అలాంటివి అధిగమించి టీమిండియా మూడోసారి, వరుసగా రెండోసారి వరల్డ్ కప్ను సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించగలదా?అవతలి వైపు ఉన్న జట్టు మనతో పోలిస్తే చిన్నదే కావచ్చు... బలాబలాల్లో, అనుభవంతో భారత్కు పోటీ కాకపోవచ్చు. కానీ పోరాడితే పోయేదేమీ లేదనే తత్వమే న్యూజిలాండ్ను ఒక్కసారిగా బలంగా మార్చేస్తుంది. రెండున్నరేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన రోజు భారత అభిమానులకు ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకం... కానీ నేటి ఫైనల్లో కివీస్ ఓడితే తర్వాతి వారంలో ఆ దేశంలో అంతా మరచిపోతారు. వారి రోజూవారీ సంవాదనల్లో అది ఒక విషయమే కాదు. ఆ టీమ్లో స్టార్ పేసర్ లేకపోయినా, మిస్టరీ స్పిన్నర్ లేకపోయినా గెలిచేందుకు కావాల్సినంత కసి ఉంది. ఇప్పుడు అలాంటిదే వారికి మొదటి టి20 వరల్డ్ కప్ అందించాలి. ప్రపంచకప్లలో పడిన ‘రన్నరప్’ ముద్రను ఆ జట్టు మార్చగలదా?వ్యూహ ప్రతివ్యూహాలు, భావోద్వేగాలు, ప్రతిభ మాత్రమే సరిపోదు, కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి...చివరకు రోజు ముగిసేసరికి ఒక్క జట్టుకు మాత్రం సంపూర్ణ ఆనందం దక్కితే మరో జట్టుకు తీవ్ర నిరాశ ఖాయం. ఒక్క దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో ఓటమి మినహా టోర్నీ ఆసాంతం టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబర్చగా... పడుతూ, లేస్తూ ప్రయాణం సాగించిన కివీస్ సెమీస్లో దక్షిణాఫ్రికాపైనే భారీ విజయంతో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ నేపథ్యంలో పదో టి20 వరల్డ్ కప్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. దాదాపు లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగే ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్: టి20 ప్రపంచ కప్లో రెండుసార్లు (2007, 2024) విజేతగా నిలిచి ఇప్పుడు మూడో టైటిల్పై గురి పెట్టిన జట్టు ఒకవైపు...తొమ్మిది ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయిన జట్టు మరోవైపు... ఒక టీమ్ టోర్నీ గెలిస్తే తొలిసారి ‘ట్రిపుల్’ సాధించిన జట్టు కావడంతో పాటు సొంతగడ్డపై నెగ్గిన తొలి టీమ్గా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. మరో టీమ్ గెలిస్తే సుదీర్ఘ కాలంగా అందకుండా ఊరిస్తున్న వరల్డ్ కప్ కల నెరవేరుతుంది. ఇలాంటి అంచనాల మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు డిఫెండింగ్ చాంపియన్ భారత్, న్యూజిలాండ్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. స్వదేశంలో టీమిండియా విజయంపై అభిమానులు భారీ ఆశలతో ఉండగా... కివీస్ తమ స్థాయికి మించిన ప్రదర్శనను కనబర్చాలని పట్టుదలగా ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇదే మైదానంలో టి20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచి ట్రోఫీని అందుకోవాలని సూర్యకుమార్ బృందం భావిస్తోంది. వరుణ్ స్థానంలో కుల్దీప్! ప్రపంచకప్లో భారత్ ప్రదర్శన చూస్తే ఇప్పడు ఫైనల్ కోసం తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. కానీ ‘సూపర్ ఎయిట్స్’ దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేలవ ఆట జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఎంత ఘనంగా బౌలింగ్ చేసినా టి20ల్లో తాజా ఫామ్ కీలకం. దాదాపు 12 పరుగుల ఎకానమీతో అతను 4 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. వరుణ్ మిస్టరీని ప్రత్యర్థులు ఛేదించినట్లుగా కనిపిస్తోంది. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే భావిస్తే అతని స్థానంలో ఎడంచేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కవచ్చు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్పై కూడా కాస్త సందేహం ఉన్నా... ఒంటిచేత్తో ఆట స్వరూపాన్ని మార్చే అతడిని పక్కన పెట్టే ఆలోచన చేయకపోవచ్చు. సంజు సామ్సన్ గత రెండు మ్యాచ్లలో చెలరేగిన విధంగా మరో నాకౌట్ మ్యాచ్లోనూ ఆడితే జట్టుకు తిరుగుండదు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా సత్తా చాటితే భారీ స్కోరు ఖాయం. చివర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ వేగంగా అందించే అదనపు పరుగులతో ప్రత్యర్థికి టీమిండియా సవాల్ విసరడం ఖాయం.ముందుగా బ్యాటింగ్ చేస్తే మరోసారి 200కు పైగా స్కోరు చేస్తే జట్టు నిశ్చింతగా ఉండవచ్చు. డఫీకి చోటు! న్యూజిలాండ్ విజయావకాశాలన్నీ ఇప్పుడు ఓపెనింగ్ జోడీ ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్లపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దక్షిణాఫ్రికాపై మెరుపు వేగంతో చెలరేగిన వీరిద్దరు మరోసారి శుభారంభం అందించగలరు. ఇన్నింగ్స్ మొదట్లోనే బుమ్రా, అర్ష్ దీప్ వీరిని కట్టడి చేయడం కీలకం. రచిన్ రవీంద్ర ఆల్రౌండర్గా రాణిస్తుండగా, ఫిలిప్స్ బ్యాటింగ్ కూడా కీలకం. వరల్డ్ కప్కు ముందు భారత్పై చెలరేగిన మిచెల్ ఈ టోర్నీలో పూర్తిగా విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. అసలు సమరంలోనైనా అతను తన స్థాయికి తగినట్లుగా ఆడాలని టీమ్ కోరుకుంటోంది. చాప్మన్ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. కెపె్టన్ సాంట్నర్పై అటు ఆల్రౌండర్గా, ఇటు కెపె్టన్గా కూడా అదనపు భారం ఉంది. గతంలో ఏ కివీస్ సారథికి సాధ్యం కాని ఘనతను అందుకోవాలంటే అతను కూడా స్వయంగా అసాధారణ ఆటతీరు కనబర్చాల్సి ఉంది. పిచ్ కాస్త అనుకూలిస్తే పేసర్లు హెన్రీ, ఫెర్గూసన్ ప్రమాదకారులు కాగలరు. టీమిండియా లెఫ్ట్ హ్యాండర్లను నిలువరించేందుకు ఆఫ్స్పిన్నర్ మెక్కోన్కీ జట్టు సమర్థంగా వాడుకునే ప్రయత్నం చేయడం ఖాయం. ఆల్రౌండర్ నీషమ్ స్థానంలో పేసర్ డఫీకి చోటు దక్కే అవకాశం ఉంది. 7 అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు 10 టి20 మ్యాచ్లు ఆడింది. 7 మ్యాచ్ల్లో గెలిచి, 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ వేదికపై న్యూజిలాండ్తో ఆడిన ఒక టి20 మ్యాచ్లో భారత జట్టే గెలిచింది. పిచ్, వాతావరణం ఎర్రమట్టి, నల్లరేగడి మట్టి మిశ్రమం కలిపిన పిచ్ను ఫైనల్ కోసం సిద్ధం చేశారు. దీనిపై మంచి పేస్, బౌన్స్ ఉండి బ్యాటింగ్కు చక్కగా అనుకూలిస్తుంది. భారీ స్కోరు సాధించేందుకు అవకాశం ఉంది. స్పిన్కు తగిన టర్న్ లభించకపోవచ్చు. ఈ మైదానంలోనే దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా... ఆ మ్యాచ్ను భారత్ మరో పిచ్పై ఆడింది. గత ఎనిమిది మ్యాచ్లలో తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టే ఐదుసార్లు గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన టీమ్ ఛేదనకే మొగ్గు చూపవచ్చు. అయితే భారత్పై సెమీస్లో ఇంగ్లండ్ ఒత్తిడిలో చిత్తయిన తీరు చూస్తే ముందుగా బ్యాటింగ్ చేయడమే మేలు. వర్షం సమస్య లేదు. ఒకవేళ వాన వచ్చినా రిజర్వ్ డే ఉంది. 2-2 భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన గత నాలుగు ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్లలో ఇరు జట్లూ చెరో రెండు గెలిచి 2–2తో సమంగా ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలవగా... 2019 వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ గెలుపొందింది.16 భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 30 టి20 మ్యాచ్లు జరిగాయి. 16 మ్యాచ్ల్లో భారత్, 11 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మూడు మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), సామ్సన్, అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్వర్మ, పాండ్యా, దూబే, అక్షర్, బుమ్రా, అర్ష్ దీప్, వరుణ్/కుల్దీప్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్ ), అలెన్, సీఫెర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, మెక్కోన్కీ, హెన్రీ, ఫెర్గూసన్, నీషమ్/డఫీ. -
పరాజయం పలకరిస్తోంది!
పెర్త్: భారత మహిళల జట్టు ఏకైక డే అండ్ నైట్ టెస్టులో పరాజయం దిశగా పయనిస్తోంది. రెండో రోజే ఆ్రస్టేలియా మహిళల జట్టు మ్యాచ్నే శాసించే స్థితిలో నిలిచింది. మొదట బ్యాట్తో, తర్వాత బంతితో హర్మన్ప్రీత్ బృందాన్ని ఆటాడుకుంది. దీంతో నాలుగు రోజుల ‘పింక్ బాల్’ టెస్టును మూడు రోజుల్లోనే ముగించేందుకు సిద్ధమైంది. ఓవర్నైట్ స్కోరు 96/3తో శనివారం ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్లో 90.4 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. క్రితంరోజు బ్యాటర్లు అనాబెల్ సదర్లాండ్ (129; 17 ఫోర్లు) ‘శత’క్కొట్టగా, ఎలీస్ పెరీ (76; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించింది. ఇద్దరు నాలుగో వికెట్కు 128 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో సయాలీ సత్గరే 4 వికెట్లు, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో 125 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. స్మృతి మంధాన (2), షఫాలీ వర్మ (5), జెమీమా రోడ్రిగ్స్ (14), కెపె్టన్ హర్మన్ప్రీత్ (11)లతో కూడిన ప్రధాన బ్యాటింగ్ బలగమంతా ని్రష్కమించింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే భారత జట్టు మరో 20 పరుగులు సాధించాలి. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 198; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: జార్జియా వోల్ (బి) సయాలీ 2; ఫోబీ లిచ్ఫీల్డ్ (సి) జెమీమా (బి) క్రాంతి 9; పెరీ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 76; అలీసా హీలీ (సి) జెమీమా (బి) సయాలీ 13; అనాబెల్ సదర్లాండ్ (సి) హర్మన్ప్రీత్ (బి) దీప్తి 129; బెత్ మూనీ (సి) జెమీమా (బి) స్నేహ్ రాణా 19; యాష్లీ గార్డ్నర్ (బి) క్రాంతి 1; తాలియా (సి) స్మృతి మంధాన (బి) షఫాలీ 13; అలానా కింగ్ (సి) స్నేహ్ రాణా (బి) సయాలీ 21; లూసీ హామిల్టన్ (సి) స్నేహ్ రాణా (బి) సయాలీ 23; డార్సీ బ్రౌన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 17; మొత్తం (90.4 ఓవర్లలో ఆలౌట్) 323. వికెట్ల పతనం: 1–2, 2–31, 3–58, 4–186, 5–240, 6–241, 7–273, 8–277, 9–311, 10–323. బౌలింగ్: సయాలీ 18.4–2–50–4, క్రాంతి గౌడ్ 22–5–72–2, కాశ్వీ గౌతమ్ 11–1–46–0, స్నేహ్ రాణా 17–1–64–1, దీప్తి శర్మ 17–1–67–2, షఫాలీ 5–2–12–1. భారత్ రెండో ఇన్నింగ్స్: స్మృతి (బి) డార్సీ బ్రౌన్ 2; షఫాలీ (సి) బెత్ మూనీ (బి) లూసీ 5; ప్రతీక (బ్యాటింగ్) 43; జెమీమా (సి) బెత్ మూనీ (బి) సదర్లాండ్ 14; హర్మన్ప్రీత్ (సి) లూసీ (బి) సదర్లాండ్ 11; దీప్తి శర్మ (బి) లూసీ 9; రిచా ఘోష్ (సి) బెత్ మూనీ (బి) లూసీ 0; స్నేహ్ రాణా (బ్యాటింగ్) 14; ఎక్స్ట్రాలు 7; మొత్తం (29 ఓవర్లలో 6 వికెట్లకు) 105. బౌలింగ్: 1–2, 2–10, 3–38, 4–64, 5–82, 6–82. బౌలింగ్: డార్సీ బ్రౌన్ 9–1–37–1, లూసీ హామిల్టన్ 8–1–32–3, అనాబెల్ సదర్లాండ్ 6–2–15–2, తాలియా 6–1–15–0. 1 వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్గా అనాబెల్ రికార్డు నెలకొల్పింది. భారత్తో టెస్టుకంటే ముందు దక్షిణాఫ్రికాపై (210; 2024లో), ఇంగ్లండ్పై (163; 2025లో) అనాబెల్ సెంచరీలు సాధించింది. అనాబెల్ తన తొలి సెంచరీని 2023లో ఇంగ్లండ్పై (137 నాటౌట్) నమోదు చేసింది. -
సంజూ మాట!.. కోహ్లి మాదిరే విశ్వరూపం చూపిస్తాడా!
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేక కిందామీదా పడింది టీమ్ ఇండియా. ముంబై వేదికగా గురువారం జరిగిన రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ విజయం సాధించింది. దీంతో టీమిండియా ఓవరాల్గా నాలుగోసారి, వరుసగా రెండోసారి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. అయితే, జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది.వాస్తవానికి అభిషేక్ శర్మకు ఈ టీ20 వరల్డ్ కప్ ఓ పీడకలలా మారింది. ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్ల్లో అతడు కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ స్టేజ్లో ఆడిన మూడు మ్యాచ్లలోనూ అభిషేక్.. కనీసం ఖాతా తెరవకుండానే డకౌటయ్యి వెనుదిరగడం గమనార్హం. జింబాబ్వేపై 55 పరుగులు చేసి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ తర్వాత వెస్టిండీస్, సెమీస్లో ఇంగ్లండ్పై మళ్ళీ విఫలమయ్యాడు. దీంతో ఫైనల్లో అభిషేక్ ప్లేస్లో ఫినిషర్ రింకూ సింగ్నైనా టీమ్లోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతమవుతుందన్న వాదన వినిపిస్తోంది.అయితే.. అభిషేక్ ఫామ్ లేమిపై సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ఫైనల్లో అభిషేక్ దుమ్మురేపుతాడేమోనని అన్నాడు. కాగా.. గత టీ20 వరల్డ్కప్లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గత వరల్డ్కప్లో ఇలానే వరుస ఫెయిల్యూర్లతో ఆందోళన రేకెత్తించాడు. చివరికి సెమీస్లోనూ రాణించలేకపోయాడు.ఆ సమయంలో అప్పటి కెప్టెన్గా ఉన్న రోహిత్ సరిగ్గా ఇలాంటి కామెంట్లే చేశాడు. కోహ్లీ ఫైనల్లో ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ అన్నట్టే కోహ్లీ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజృంభించాడు. ఆసక్తికరంగా ఫైనల్లో అంతా విఫలమవగా కోహ్లీ ఒక్కడే ఆదుకున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో ఓపెనింగ్ బ్యాటర్ కోహ్లి 59 బంతుల్లో 76 పరుగులు సాధించాడు.దీంతో ఇప్పుడు సంజూ అన్నట్టు.. ఈసారి అభిషేక్ కూడా ఫైనల్లో విశ్వరూపం చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే జరిగితే అంతకంటే సంతోషం ఉండదు. చూడాలి మరి అభిషేక్ శర్మ అభిమానులతో పాటు యాజమాన్యం నమ్మకం నిలబెట్టుకుంటాడో లేదో!! -
T20 WC Final: సాంట్నర్కు ఇచ్చిపడేసిన సూర్యకుమార్
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్కు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. సాంట్నర్ అబద్ధం చెబుతున్నాడని.. తమను కట్టడి చేయడం అంత తేలికేమీ కాదని చురకలు అంటించాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్కు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం.. భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉండబోతున్న అంశం చర్చనీయాంశంగా మారింది.ఎర్రమట్టి పిచ్!అహ్మదాబాద్లో ఈసారి ఎర్రమట్టి పిచ్ తయారు చేస్తున్నారని.. బ్యాటర్లకు అనుకూలించే వికెట్ ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టీమిండియా 253 పరుగుల భారీ స్కోరు చేసినా.. లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆఖరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది.220 పరుగులకే కట్టడి చేస్తేఈ పరిణామాల నేపథ్యంలో సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘అహ్మదాబాద్లో ఫ్లాట్ పిచ్ ఉంటుంది. టీమిండియాను 250కి బదులు 220 పరుగులకే కట్టడి చేస్తే.. మాకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి’’ అని పేర్కొన్నాడు.అబద్ధం చెబుతున్నాడుఈ క్రమంలో శనివారం మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. సాంట్నర్కు గట్టిగానే ఇచ్చిపడేశాడు. ‘‘అతడు అబద్ధం చెబుతున్నాడు. మేము గొప్పగా బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాం. 225 లేదంటే 250 పరుగులు చేస్తే బాగుంటుంది.అయితే, కొన్నిసార్లు అనుకున్న దాని కంటే వికెట్ భిన్నంగా ఉంటుంది. అందుకు అనుగుణంగానే మేము ఆడాల్సి ఉంటుందిఇ. డ్రెస్సింగ్రూమ్లో కూర్చుని ఎంత స్కోరు చేయగలమని అంచనా వేయడం కష్టం. పిచ్ డిమాండ్కు తగ్గట్లే ఆడాల్సి ఉంటుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
IND vs NZ: అభిషేక్ శర్మ వద్దు.. అతడిని ఆడించండి!
న్యూజిలాండ్తో ఫైనల్లో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ నడుస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత కూడా అభిషేక్ శర్మను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కీలక మ్యాచ్కు ముందు తుదిజట్టులో మార్పులు చేసి రిస్క్ తీసుకోవద్దని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. వైఫల్యాలు అభిషేక్ శర్మ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని.. కాబట్టి అతడికి విశ్రాంతినివ్వడమే ఉత్తమమని పేర్కొన్నాడు. ఇందుకు వెస్టిండీస్ ఆటగాళ్లను ఉదాహరిస్తూ పోలిక తెచ్చాడు.విశ్రాంతినివ్వాలి‘‘అభిషేక్ శర్మకు మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వాలి. ఇప్పటికే అతడు చాలా మ్యాచ్లు ఆడేశాడు. అన్నింటిలోనూ విఫలం అయ్యాడు. ఫైనల్లో తుదిజట్టులో మార్పులు చేయడం ఏమంత హానికరం కాదు. పొట్టి ఫార్మాట్లో ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు సహజమే.టీమిండియాతో సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్.. ఫామ్లో లేని బ్రాండన్ కింగ్కు బదులు.. రోస్టన్ ఛేజ్ను ఓపెనర్గా ఆడించింది. బ్రాండన్రు ఐదు- ఆరు మ్యాచ్లు ఆడించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కీలక మ్యాచ్ అయినా సరే అతడికి బ్రేక్ ఇచ్చారు.టీమిండియా కూడా ఆదిలో సంజూను పక్కన పెట్టింది. కీలక మ్యాచ్లలో ఆడించి అనుకున్న ఫలితం రాబట్టింది. అతడు గొప్ప ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. జట్టుకు ప్రయోజనం చేకూర్చాడు. భారత జట్టులో ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.రింకూను ఆడించండిటెస్టులు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్.. ఇలా టోర్నీ ఏదైనా రింకూ సింగ్ పరుగులు రాబట్టగలడు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ కీలక సమయాల్లో వికెట్లు కూల్చి జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్లేయర్లు డగౌట్లో కూర్చుని ఉండటం చూస్తే.. అభిషేక్ శర్మకు బదులు వీరిలో ఒకరిని ఆడించవచ్చు కదా అనిపిస్తుంది.అవును.. ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మకు బదులు డగౌట్లో కూర్చోబెడుతున్న రింకూ సింగ్ను తుదిజట్టులోకి తీసుకోండి. బాగా ఆడని ఆటగాడికి చోటు ఇస్తూ.. అద్భుతంగా ఆడే ప్లేయర్ను బెంచ్కే పరిమితం చేయడం సరికాదు. అభిషేక్ శర్మ గొప్ప నైపుణ్యాలు ఉన్న ఆటగాడే. కానీ ఐసీసీ టోర్నీలు అతడికి కొత్త. ఏదేమైనా సంజూతో అతడిని పోల్చవద్దు. సంజూతో పోలిక వద్దుఇప్పటికే సంజూ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్లో తానేంటో నిరూపించుకున్నాడు. టాప్-10 బ్యాటర్లలో అతడూ ఉంటాడు’’ అని మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఫైనల్లో అభిషేక్ శర్మను తప్పించి రింకూను ఫైనల్లో ఆడించాలని కైఫ్ సూచించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్- న్యూజిలాండ్ ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
T20 WC Final: హృదయాలు ముక్కలు చేస్తాం: సాంట్నర్
అహ్మదాబాద్ పిచ్పై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఇప్పటి వరకు వికెట్ను పరిశీలించలేదని.. అయితే, ఫ్లాట్ పిచ్నే రూపొందించి ఉంటారని భావిస్తున్నామన్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల వరద ఖాయమని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం భారత్- న్యూజిలాండ్ ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మిచెల్ సాంట్నర్ పలు విషయాలపై స్పందించాడు.హై స్కోరింగ్కు అవకాశంపిచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు మేము వికెట్ ఎలా ఉందో చూడలేదు. ఇప్పటికీ కవర్లు కప్పే ఉన్నాయి. అయితే, ఈ పిచ్ ఫ్లాట్గా ఉంటుందని అనుకుంటున్నా. ఇక్కడ హై స్కోరింగ్కు అవకాశం ఉంటుంది’’ అని సాంట్నర్ (Mitchell Santner) పేర్కొన్నాడు.మా లక్ష్యం అదే..అదే విధంగా.. ‘‘టీమిండియాకు మద్దతుగా వచ్చే ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండేలా చేయడమే మా లక్ష్యం (Goal to silence the crowd). అందుకు అనుగుణంగానే మా ఆట ఉంటుంది. అయితే, క్రికెట్లో ఎన్నో సవాళ్లు ఉంటాయి. టీ20 క్రికెట్ వైవిధ్యంతో కూడుకున్నది.హృదయాలు ముక్కలు చేస్తాంఏదేమైనా సొంతగడ్డపై ఫైనల్ గెలవాలన్న ఒత్తిడి టీమిండియాపై కచ్చితంగా ఉంటుంది’’ అని సాంట్నర్ అన్నాడు. టోర్నీ ఆసాంతం తాము నిలకడగా ఆడామని.. ట్రోఫీ గెలవడం సాధ్యమేనని పేర్కొన్నాడు. కొంతమంది హృదయాలు ముక్కలు చేసేందుకు తామేమీ వెనుకాడమని టీమిండియా అభిమానులను ఉద్దేశించి సాంట్నర్ కామెంట్ చేశాడు.కాగా సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్ చేరగా.. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్పై గెలిచి టీమిండియా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ టోర్నీకి ముందు భారత్.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో 4-1తో ఏకపక్ష విజయం సాధించింది. చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
వైభవ్ సూర్యవంశీ మామకు సివిల్స్లో బెస్ట్ ర్యాంక్
భారత క్రికెట్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. మైదానంలో పరుగుల వరద పారించడం ఈ పిల్లాడికి పరిపాటి అయిపోయింది. పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నెన్నో ప్రపంచ రికార్డులు సాధించాడు ఈ బిహారీ అబ్బాయి.యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో అతి పిన్న వయసులోనే విధ్వంసకర శతకాలు బాదిన బ్యాటర్గా వైభవ్ చరిత్రకెక్కాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున మొదలైన అతడి పరుగుల ప్రవాహం.. భారత్ అండర్-19 జట్టు తరఫునా కొనసాగుతోంది.ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్కప్ టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్పై 175 పరుగులు చేసి.. భారత్ను గెలిపించాడు వైభవ్ (Vaibhav Suryavanshi). తద్వారా టీమిండియా వైపు తొలి అడుగు వేశాడు. ఇక ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 కోసం రాజస్తాన్ రాయల్స్తో కలిసి నెట్స్లో చెమటోడుస్తున్నాడు.పదో తరగతి పరీక్షలు డుమ్మాఇదిలా ఉంటే.. ఆటతో కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఇటీవల వైభవ్ సూర్యవంశీ పేరు వైరల్ అవుతోంది. క్రికెట్తో బిజీగా ఉన్నందున అతడు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయలేకపోయాడు. ఈ విషయాన్ని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ధ్రువీకరించారు.102వ ర్యాంకుమరోవైపు.. తాజాగా సంజీవ్ సూర్యవంశీ చేసిన పోస్టు వైరల్గా మారింది. వైభవ్ సూర్యవంశీకి వరుసకు మేనమామ అయిన అభిషేక్ చౌహాన్ (Abhishek Chauhan) యూపీఎస్సీ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 102వ ర్యాంకు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి ప్రయత్నంలోనే అభిషేక్ ఈ మేర ర్యాంకు సాధించడం మరో విశేషం. ఆయన ఐపీఎస్ సర్వీస్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.ఉన్నత విద్యావంతుల కుటుంబంబిహార్లోని సమస్తిపూర్లో గల మొహియుద్దీన్నగర్ బ్లాక్లో గల రాజాజన్ గ్రామంలో 1999లో అభిషేక్ చౌహాన్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డాక్టర్ అభయ్ కుమార్ సింగ్, తల్లి అనురాధా రాజ్పుత్. అభయ్ కుమార్ సింగ్ నలంద ఓపెన్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. ఇక ఎంటెక్లో గోల్డ్ మెడల్ సాధించిన అభిషేక్ 2022 నుంచి సివిల్స్ పరీక్షకు సన్నద్ధం అయ్యారు. 2025లో తొలిసారి పరీక్ష రాయగా.. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 102వ ర్యాంకు సాధించారు. దీంతో సమస్తిపూర్లో సంతోషకర వాతావరణం నెలకొంది. బంధువులు, స్నేహితుల రాకతో హడావుడిగా మారింది. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ.. అభిషేక్ చౌహాన్కు శుభాకాంక్షలు తెలిపారు.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
T20 WC Final: ఆ ఇద్దరిపై వేటు!.. అతడికి చోటు?
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో బ్యాటర్ల, బౌలర్ల జాబితాలో అగ్రస్థానం టీమిండియా ఆటగాళ్లదే. ఓపెనింగ్ స్టార్ అభిషేక్ శర్మ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతుండగా.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు.అయితే, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్, వరుణ్ స్థాయికి తగ్గట్లు ఆడటంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ దారుణమైన ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 89.ఏకంగా 64 పరుగులుమరోవైపు.. వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఆరంభ మ్యాచ్లలో రాణించినా.. కీలక నాకౌట్ దశలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళనకరంగా పరిణమించింది. ముఖ్యంగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో ఈ స్పిన్ బౌలర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 64 పరుగులు ఇచ్చుకుని కేవలం ఒకే ఒక్క వికెట్ కూల్చాడు.ఆ ఇద్దరిపై వేటు వేయాలి!ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్లో కలిపి వరుణ్ 8.85 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో ఫైనల్ నేపథ్యంలో అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలపై వేటు వేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.ముఖ్యంగా వరుణ్ను తప్పించి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలను కొనసాగించాలా? వద్దా? అన్న అంశం గురించి స్పందించాడు.నలుగురు విఫలమైనా.. ‘‘ఇప్పుడిదే అతిపెద్ద ప్రశ్న. అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఎందుకు కొనసాగించవచ్చో చెబుతాను. మనకు ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. మరీ గ్రహచారం బాగాలేకపోతే నలుగురు విఫలమైనా.. మరో నలుగురు పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది.బౌలర్లలో ఒక్కరు విఫలమైనా..అభిషేక్ శర్మ పరుగులు చేయకుండానే టీమిండియా ఫైనల్ వరకూ వచ్చింది. అయితే, బౌలర్ ఒక్క ఓవర్లో విఫలమైనా భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఐదుగురు బౌలర్లలో ఒక్కరు చెడ్డగా ఆడినా అంతే సంగతులు.ఇన్నింగ్స్లో ఓ బౌలర్కు 20 శాతం బౌలింగ్ కోటా ఉంటుంది. నిజానికి గత మ్యాచ్లో వరుణ్ పేలవంగా ఆడాడు. అందుకే కుల్దీప్ను తీసుకురావాలనే ఆలోచన రావొచ్చు. అనుభవజ్ఞుడైన లెఫ్టార్మ్ స్పిన్నర్ అందుబాటులో ఉంటే బాగుంటుంది.నేను మాత్రం ఆ ఇద్దరినీ కొనసాగిస్తాఅయితే, నేను మాత్రం తుదిజట్టును ఎంపిక చేసే స్థానంలో ఉంటే.. వరుణ్ చక్రవర్తినే కొనసాగిస్తా. అతడితో పాటు అభిషేక్ శర్మనూ కొనసాగిస్తా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కీలక మ్యాచ్లో తుదిజట్టులో మార్పులు అంతగా మంచిది కాదని.. తమదైన రోజున చెలరేగే సత్తా ఉన్న అభిషేక్, వరుణ్ వంటి స్టార్లపై వేటు వేయడం తగదని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఫైనల్కు షెడ్యూల్ ఖరారైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్ -
T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. టీమిండియా- న్యూజిలాండ్ ఆదివారం టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్ ఫైనల్ విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. డివిలియర్స్ యూట్యూబ్ చానెల్ వేదికగా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే.. ప్రతి ఒక్కరు సౌతాఫ్రికాను ‘చోకర్స్’ అని పిలవడానికి ఇష్టపడతారు. కీలక మ్యాచ్లలో మనం ఓడిపోవడం ఇందుకు కారణం.ఇది అసాధ్యంఅయితే, న్యూజిలాండ్ విషయంలోనూ నేను ఇదే మాట అంటాను. న్యూజిలాండ్ ఇప్పటి వరకు వరల్డ్కప్లు గెలవనేలేదు. సౌతాఫ్రికా మాదిరే ఎన్నోసార్లు ఫైనల్కు చేరినా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈసారైనా గెలిచేందుకు ప్రయత్నించండి.నిజానికి నాకు న్యూజిలాండ్ జట్టు అంటే చాలా ఇష్టం. కానీ వాళ్లు టీమిండియాను ఓడించలేరు. ఇది జరగాలంటే మాత్రం ఏదో ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని భారత జట్టు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది అసాధ్యం. కివీస్ గెలవాలనే కోరుకుంటున్నా. కానీ వాళ్లు భారత్ను ఓడించగలరా?.. అంటే లేదనే చెప్తాను’’ అని పేర్కొన్నాడు.జట్టు గెలవాలని నాకూ ఉందిఇందుకు డివిలియర్స్ బదులిస్తూ... ‘‘అవును.. న్యూజిలాండ్కు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఆ జట్టు గెలవాలని నాకూ ఉంది. కానీ వారికి ఆ అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలి’’ అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో న్యూజిలాండ్ ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే నెగ్గింది.రెండుసార్లు టీమిండియాను ఓడించిఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని 2000 సంవత్సరంలో కైవసం చేసుకున్న కివీస్.. మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ విజేతగానూ 2021లో అవతరించింది. ఈ రెండుసార్లూ న్యూజిలాండ్ ప్రత్యర్థి టీమిండియానే కావడం విశేషం. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్తో తలపడిన కివీస్కు ఈ సారి పరాజయమే ఎదురైంది. భారత్ విజేతగా అవతరించింది. అయితే, కివీస్ ఇంత వరకు ఒక్క వరల్డ్కప్ ట్రోఫీ గెలవకపోగా.. భారత్ మూడు ప్రపంచకప్ టోర్నీలు గెలిచింది. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, 2024 టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను సొంతం చేసుకుంది.చదవండి: T20 WC Final: పిచ్ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా? -
T20 WC 2026: ఐసీసీ రంగంలోకి దిగినా.. తప్పని చిక్కులు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో వెస్టిండీస్ ఫర్వాలేదనిపించగా.. సౌతాఫ్రికా సెమీస్ వరకు ప్రయాణం కొనసాగించింది. లీగ్ దశలో అదరగొట్టిన విండీస్ జట్టు.. సూపర్-8లో కీలక మ్యాచ్లో టీమిండియా చేతిలో ఓడి నిష్క్రమించింది.మరోవైపు.. సౌతాఫ్రికా లీగ్ దశలో అజేయంగా నిలవడంతో పాటు.. సూపర్-8లోనూ హ్యాట్రిక్ విజయాలతో సెమీస్లో అడుగుపెట్టింది. అయితే, కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి మరోసారి ‘చోకర్స్’ అన్న బిరుదును సార్థకం చేసుకుంది. ఇక ఈ రెండు జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినా.. ఇంకా ఇంటికి చేరుకోలేదు.భారత్లోనే చిక్కుకుపోయారుఇందుకు మధ్య ప్రాచ్యంలోని యుద్ధ వాతావరణం కారణం. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుండగా.. అందుకు ఇరాన్ కూడా గట్టిగానే బదులిస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో గగనతలం మూసివేశారు. దీంతో వెస్టిండీస్, జింబాబ్వే, సౌతాఫ్రికా జట్ల ఆటగాళ్లు భారత్లోనే చిక్కుకుపోయారు. అయితే, జింబాబ్వే జట్టును ప్రత్యేక విమానంలో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)తరలించినట్లు సమాచారం.ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా..ఇక వెస్టిండీస్ జట్టు కోసం కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా.. ఎయిర్ ట్రాఫిక్ అధికారుల నుంచి ఇంత వరకు ఆమోదం లభించనట్లు తెలుస్తోంది. దీంతో ఆటగాళ్లలో మరోసారి ఆందోళన నెలకొంది. కాగా ఇప్పటికే వెస్టిండీస్ హెడ్కోచ్ డారెన్ సామీ (Daren Sammy).. తమను స్వదేశానికి చేర్చమంటూ దీనంగా అర్థించిన విషయం తెలిసిందే.ఇక బౌలర్ అకీల్ హొసేన్ సైతం క్రిస్టియాన్ రొనాల్డోనే ఈ పరిస్థితులలో తమను ఆదుకోగలడంటూ ట్వీట్ చేశాడు. అయితే, ఐపీఎల్లో భాగమైన షెర్ఫానే రూథర్ఫర్డ్, రోవ్మన్ పావెల్, షిమ్రన్ హెట్మైర్ తదితరులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.సౌతాఫ్రికానూ వీడని చిక్కులుఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా మరికొన్నాళ్లు భారత్లోనే ఉండాల్సి రావొచ్చు. అయితే, న్యూజిలాండ్తో టీ20 సిరీస్ నేపథ్యంలో దాదాపు నలుగురు ఆటగాళ్లు నేరుగా కివీస్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. సెమీస్ మ్యాచ్లలో సౌతాఫ్రికాను న్యూజిలాండ్.. ఇంగ్లండ్ను టీమిండియా ఓడించి ఫైనల్కు అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్ -
T20 WC Final: పిచ్ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా?
టీమిండియా చరిత్రకు అడుగుదూరంలో ఉంది. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టింది సూర్యకుమార్ సేన.సొంతగడ్డపై టీ20 వరల్డ్కప్-2026 ఆడుతున్న భారత జట్టు లీగ్ దశలో అజేయంగా నిలిచింది. సూపర్-8లో తొలుత తడబడినా.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించి సెమీస్ చేరింది. ఇక సెమీ ఫైనల్లో ఇంగ్లండ్తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లోనూ ఏడు పరుగుల తేడాతో గెలిచి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది.వరుసగా రెండుసార్లుతద్వారా వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టోర్నీ ఫైనల్కు చేరిన జట్టుగా నిలిచింది. ఇక ట్రోఫీ కోసం న్యూజిలాండ్తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, ఫైనల్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కావడం సెంటిమెంట్ పరంగా టీమిండియాకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఇదే వేదికపై 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో తాజా ఫైనల్కు సంబంధించిన పిచ్ విషయంలో కూడా టీమిండియా తీవ్రంగా ఆలోచిస్తోంది. నిజానికి పిచ్ ఎంపిక, తయారీ ఐసీసీ పరిధిలోని అంశం. కానీ ఎర్ర మట్టితో చేసిన పిచ్పై ఆడాలనే తమ ఉద్దేశాన్ని భారత జట్టు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎర్రమట్టితో చేసిన పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తోంది. ముంబైలో ఇదే జరిగింది.టీమిండియా కోరుకుంది ఇదేఇక అహ్మదాబాద్లో నల్లరేగడి మట్టితో చేసిన పిచ్పై సౌతాఫ్రికా జట్టుతో ‘సూపర్–8’ మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ సేన దారుణంగా ఓడిపోయింది. అది పునరావృతం కాకుండా టీమిండియా బ్యాటింగ్ పిచ్నే కోరుకుంటోంది. ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ..ఎర్ర మట్టితోనే‘‘నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు మిశ్రమ మట్టితో తయారైన పిచ్ లభించనుంది. స్పోర్టింగ్ పిచ్నే రూపొందిస్తున్నారు. అయితే, ఎక్కువ మటుకు ఇది ఎర్ర మట్టితోనే తయారు చేస్తారు. కాస్త బౌన్సీగా ఉండటంతో పాటు.. బ్యాటర్లకు కూడా అనుకూలిస్తుంది’’ అని పేర్కొన్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా అహ్మదాబాద్లో జరిగిన తొలి ఐదు మ్యాచ్లలో పేస్ బౌలింగ్లో 762 బంతుల్లో బ్యాటర్లు 1062 పరుగులు సాధించారు. ఫాస్ట్ బౌలర్లకు 45 వికెట్లు దక్కాయి. ఇక స్పిన్ బౌలింగ్లో 421 బంతుల్లో బ్యాటర్లు 617 పరుగులు రాబట్టగా.. బౌలర్ల ఖాతాలో 20 వికెట్లు చేరాయి. చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్ -
హోటల్ మారితే అదృష్టం మారేనా!
అహ్మదాబాద్: నమ్మకం లేదా సెంటిమెంట్ అనుకోండి లేదా మూఢ విశ్వాసం అనుకోండి కానీ భారత క్రికెట్ జట్టుకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని అనూహ్య, ఆసక్తికర విషయాలు బయటకు వస్తుంటాయి. జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వాటిని బాగా ప్రోత్సహిస్తుంటాడని సమాచారం. ఏ నగరంలో మ్యాచ్కు వెళ్లినా అక్కడి ప్రఖ్యాత దేవాలయానికి ఆటగాళ్లను తీసుకెళ్లి దర్శనం చేయించడం ఆయనకు రివాజుగా మారిపోయింది. సెమీఫైనల్కు ముందు రోజు ప్రాక్టీస్ కోసం వాంఖెడే స్టేడియానికి జట్టు వచ్చినా... ఆ రోజు చంద్ర గ్రహణం కారణంగా ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్ దాటి బయటకు రాలేదు. గ్రహణం ముగిసిన తర్వాతే గంటసేపు ఆలస్యంగా టీమిండియా సాధన మొదలైంది. ఇప్పుడు కూడా ఫైనల్ కోసం మరో సెంటిమెంట్ అంశం వినిపిస్తోంది. అహ్మదాబాద్లో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడినప్పుడు భారత జట్టు ఐటీసీ నర్మద హోటల్లో బస చేసింది. నాటి మ్యాచ్లో పరాజయం జట్టును తీవ్రంగా బాధించింది. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం అక్కడ మాత్రం ఉండరాదని జట్టు అనుకుంది. అందుకే ఈసారి తాజ్ స్కైలైన్లో భారత బృందం దిగింది. దీంతో తమ అదృష్టం మారవచ్చని టీమ్ భావిస్తున్నట్లుంది. మరోవైపు మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంలో కూడా ‘హోం’ కాకుండా విజిటర్స్ డ్రెస్సింగ్ రూమ్ను వాడుకోవాలని కూడా టీమ్ నిర్ణయించింది. అంపైర్లను ప్రకటించిన ఐసీసీ భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్లో పాల్గొనే అధికారుల బృందాన్ని ఐసీసీ ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లుగా ఇంగ్లండ్కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్ వ్యవహరిస్తారు. థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా దక్షిణాఫ్రికాకు చెందిన అలావుద్దీన్ పలేకర్, ఆడ్రియాన్ హోల్డ్స్టాక్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వరల్డ్ కప్ తుది పోరు జరుగుతుంది. సామ్సన్ నామినేట్... టి20 వరల్డ్ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కోసం షార్ట్ లిస్ట్ చేసిన ఎనిమిది ఆటగాళ్ల జాబితాలో భారత్కు చెందిన సంజు సామ్సన్ పేరు కూడా ఉంది. సామ్సన్తో పాటు విల్ జాక్స్ (ఇంగ్లండ్), సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్తాన్), రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్ (న్యూజిలాండ్), షాడ్లీ వాన్ షాల్విక్ (అమెరికా), మార్క్రమ్, ఎన్గిడి (దక్షిణాఫ్రికా) ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు. బుమ్రా కూడా విఫలం కావచ్చు! భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఒంటిచేత్తో అతను మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. ఈ విషయం న్యూజిలాండ్కు కూడా బాగా తెలుసు. అయితే ఫైనల్లో తమపై మాత్రం బుమ్రా విఫలం కావాలని కోరుకుంటున్నట్లు కివీస్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అన్నాడు. ‘బుమ్రా అద్భుతమైన బౌలర్ అనడంలో సందేహం లేదు. అతని బౌలింగ్లో ఎంతో వైవిధ్యం ఉంది. యార్కర్లను గొప్పగా సంధించగలడు. అయితే అతను కూడా మానవమాత్రుడే. ఏదో ఒకరోజు విఫలం కావచ్చు కూడా. అది ఆదివారమే కావాలని ఆశిస్తున్నాం’ అని ఫిలిప్స్ చెప్పాడు. భారత్తో పోలిస్తే జనాభాలో ఎంతో చిన్నదైన తమ దేశం క్రికెట్లో ఇప్పటి వరకు సాధిస్తూ వచ్చిన ఘనత చిన్నదేమీ కాదని అతను అభిప్రాయపడ్డాడు. సుమారు 50 లక్షల జనాభా ఉన్న కివీస్ వరల్డ్ కప్లాంటి వేదికపై భారత్తో ఫైనల్లో తలపడే అవకాశం రావడం కూడా గొప్ప విషయమని అతను అన్నాడు. -
‘రికార్డులు’ బద్దలు కొట్టిన భారత్–ఇంగ్లండ్ సెమీఫైనల్
ముంబై: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగి రెండో సెమీఫైనల్ మ్యాచ్లో భారీ పరుగులు, బౌండరీలతో రికార్డుల మోత మోగింది. అయితే దీంతో పాటు డిజిటల్ వీక్షకుల సంఖ్య విషయంలో కూడా ఈ మ్యాచ్ కొత్త రికార్డులు నెలకొల్పింది. జియో హాట్స్టార్లో ఈ మ్యాచ్ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల (సుమారు 6 కోట్ల 25 లక్షలు) మంది చూడటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడా ఈవెంట్లోనైనా ప్రత్యక్ష ప్రసార సమయంలో ఇది అత్యధికం. తాజా గణాంకాలు క్రికెట్ స్థాయిని చూపిస్తున్నాయని, ఇది తమకు గర్వకారణమని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నారు. తాజా రికార్డు ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్తో చెరిగిపోతుందా అనేది ఆసక్తికరం. -
నలుగురి అరంగేట్రం
పెర్త్: భారత్, ఆ్రస్టేలియా మహిళల మధ్య శుక్రవారం మొదలైన ఏకైక టెస్టు మ్యాచ్ (డే అండ్ నైట్)లో తొలి రోజు బౌలర్ల హవా సాగింది. పింక్ బంతితో జరుగుతున్న ఈ టెస్టులో ఇరు జట్లు కలిపి మొదటి రోజు 13 వికెట్లు చేజార్చుకున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్లో 62.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. దాదాపు 20 నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కోలేక తడబడింది. జెమీమా రోడ్రిగ్స్ (84 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... షఫాలీ వర్మ (48 బంతుల్లో 35; 6 ఫోర్లు), కాశ్వీ గౌతమ్ (54 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ ఫీల్డర్లు నాలుగు క్యాచ్లు వదిలేసి భారత్కు కొంత మేలు చేశారు. అనాబెల్ సదర్లాండ్ 4 వికెట్లు పడగొట్టగా, తొలి టెస్టు ఆడుతున్న లూసీ హామిల్టన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా మహిళల జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 27 ఓవర్లలో 3 వికెట్లకు 96 పరుగులు చేసింది. ఎలైస్ పెరీ (62 బంతుల్లో 43 బ్యాటింగ్; 7 ఫోర్లు), అనాబెల్ సదర్లాండ్ (20 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న అలీసా హీలీ (13) విఫలమైంది. సయాలీ సత్గరేకు 2 వికెట్లు లభించాయి. ప్రస్తుతం ఆ్రస్టేలియా మరో 102 పరుగులు వెనుకబడి ఉంది. నలుగురి అరంగేట్రం... భారత జట్టు తరఫున ఒకేసారి నలుగురు ప్లేయర్లు టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టడం విశేషం. ఈ మ్యాచ్ ద్వారా వరుసగా కాశ్వీ గౌతమ్, క్రాంతి గౌడ్, ప్రతీక రావల్, సయాలీ సత్గరే టెస్టుల్లో అరంగేట్రం చేశారు. భారత్ తరఫున టెస్టు ఆడిన 95, 96, 97, 98వ ప్లేయర్లుగా వీరు నిలిచారు. స్కోరు వివరాలు భారత మహిళల తొలి ఇన్నింగ్స్: స్మృతి (బి) హామిల్టన్ 4; షఫాలీ (సి) మూనీ (బి) సదర్లాండ్ 35; ప్రతీక (సి) హామిల్టన్ (బి) సదర్లాండ్ 18; జెమీమా (సి) గార్డ్నర్ (బి) హామిల్టన్ 52; హర్మన్ప్రీత్ (బి) బ్రౌన్ 19; దీప్తి (సి) మూనీ (బి) సదర్లాండ్ 7; రిచా (సి) అలానా కింగ్ (బి) గార్డ్నర్ 11; స్నేహ్ రాణా (సి) తాలియా (బి) హామిల్టన్ 5; కాశ్వీ (నాటౌట్) 34; సయాలీ (సి) మూనీ (బి) సదర్లాండ్ 7; క్రాంతి (సి) సదర్లాండ్ (బి) బ్రౌన్ 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (62.4 ఓవర్లలో ఆలౌట్) 198. వికెట్ల పతనం: 1–18, 2–54, 3–61, 4–84, 5–107, 6–150, 7–150, 8–157, 9–195, 10–198. బౌలింగ్: డార్సీ బ్రౌన్ 12.4–0–41–2, హామిల్టన్ 11–3–31–3, అనాబెల్ సదర్లాండ్ 17–5–46–4, తాలియా 4–2–15–0, యాష్లీ గార్డ్నర్ 15–3–39–1, అలానా కింగ్ 3–0–23–0. ఆ్రస్టేలియా మహిళల తొలి ఇన్నింగ్స్: జార్జియా వోల్ (బి) సయాలీ 2; ఫోబీ లిచ్ఫీల్డ్ (సి) జెమీమా (బి) క్రాంతి 9; పెరీ (బ్యాటింగ్) 43; అలీసా హీలీ (సి) జెమీమా (బి) సయాలీ 13; అనాబెల్ సదర్లాండ్ (బ్యాటింగ్) 20; ఎక్స్ట్రాలు 9; మొత్తం (27 ఓవర్లలో 3 వికెట్లకు) 96. వికెట్ల పతనం: 1–2, 2–31, 3–58. బౌలింగ్: సయాలీ 8–1–24–2, క్రాంతి 11–2–28–1, కాశ్వీ 7–1–29–0, స్నేహ్ రాణా 1–0–9–0. -
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్ స్టార్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ టైటిల్ పోరుకు న్యూజిలాండ్, టీమిండియా అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం (మార్చి 8) ఫైనల్కు ముహూర్తం ఖరారైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో భారత్తో ఫైనల్కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాను చూసి.. తాము అంతగా భయపడటం లేదన్నాడు. బుమ్రా క్లాసిక్ బౌలర్ అయినప్పటికీ.. అతడూ ఒక మనిషే కదా అని పేర్కొన్నాడు.ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లోకాగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టీమిండియా గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. పరుగుల వరద పారిన వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో బుమ్రా 18వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. కీలక సమయంలో రాణించి జట్టు గెలుపునకు పునాది వేశాడు.దీంతో బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లోనూ అతడు తన మ్యాజిక్ చూపిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ మాత్రం మిగతా బౌలర్లలాగే.. బుమ్రా తమకు ఓ బౌలర్ అని అన్నాడు.అతడు కూడా మనిషే కదా!‘‘ఇటీవల టీమిండియా సిరీస్లో భాగంగా బుమ్రా బౌలింగ్లో మేము మెరుగ్గా ఆడాము. అతడొక క్లాస్ బౌలర్. వైవిధ్యభరితంగా బౌలింగ్ చేస్తాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. అతడి బౌలింగ్లో ఆడటం తేలిక కాదు. కానీ అసాధ్యం కూడా కాదు.బుమ్రాను వదిలేసి వేరే వాళ్ల బౌలింగ్లో ఆడాలని అనుకోవడం లేదు. అతడు కూడా మనిషే కదా!.. అందరిలాగే తనకూ ఒక చెడు రోజు ఉంటుంది. ఆరోజు అతడు విఫలం అవుతాడు. అదే, అతడి మీద మాకు మంచి రోజు అవుతుంది. ఫైనలే ఆరోజు కావాలని ఆశిస్తున్నాం?’’ అని గ్లెన్ ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు. బుమ్రా బౌలింగ్లో తాము మెరుగ్గా ఆడగలమని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు స్వదేశంలో భారత్ కివీస్తో ఐదు టీ20లు ఆడింది. ఇందులో 4-1తో గెలిచింది. అయితే, ఈ సిరీస్లో బుమ్రా ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి 9.46 ఎకానమీతో కేవలం నాలుగు వికెట్లే తీశాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
IND v AUS: భారత్ ఆలౌట్.. ఆసీస్ స్కోరెంతంటే?
ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు మొదటి రోజు తడబడింది. తొలి ఇన్నింగ్స్లో నామమాత్రపు స్కోరుకే ఆలౌట్ అయింది. ఆసీస్ వుమెన్ టీమ్తో మూడు టీ20, మూడు వన్డేలు.. ఒక టెస్టు ఆడేందుకు హర్మన్ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాటీ20 సిరీస్ను భారత్ 2-1తో దక్కించుకోగా.. వన్డే సిరీస్ను ఆసీస్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం డే- నైట్ టెస్టు మ్యాచ్ మొదలైంది. పెర్త్లోని WACA స్టేడియం వేదికగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఫలితంగా బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) నాలుగు పరుగులకే వెనుదిరిగింది. లూసీ హోమిల్టన్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరింది. వన్డౌన్లో వచ్చిన ప్రతికా రావల్ (18) సైతం నిరాశపరిచింది.హాఫ్ సెంచరీతో రాణించిన జెమీమాఇక మరో ఓపెనర్ షఫాలీ వర్మ 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) అర్ధ శతకం (84 బంతుల్లో 52, 7 ఫోర్లు)తో రాణించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (19) విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో కశ్వీ గౌతం (34 నాటౌట్) మెరుగైన బ్యాటింగ్తో ఆకట్టుకుంది.మిగిలిన వారంతా పెవిలియన్కు క్యూ కట్టారు. దీప్తి శర్మ (7), రిచా ఘోష్ (11), స్నేహ్ రాణా (5), సయాలీ సత్గరే (7), క్రాంతి గాడ్ (1) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా భారత్ 62.4 ఓవర్లలో 198 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అనాబెల్కు నాలుగు వికెట్లుఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేయగా.. లూసీ హోమిల్టన్ మూడు వికెట్లు పడగొట్టింది. డార్సీ బ్రౌన్ రెండు, ఆష్లే గార్డ్నర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.ఇక తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్కు భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఓపెనర్లలో జార్జియా వోల్ (2)ను సయాలీ బౌల్డ్ చేయగా.. ఫోబే లిచిఫీల్డ్ (9)ను క్రాంతి గాడ్ పెవిలియన్కు పంపింది. కెప్టెన్ అలెసా హీలీ (13) వికెట్ను సయాలీ తన ఖాతాలో వేసుకోగా.. ఎలిస్ పెర్రీ, అనాబెల్ పట్టుదలగా నిలబడ్డారు.నిలకడగా పెర్రీ, అనాబెల్శుక్రవారం నాటి మొదటిరోజు ఆట పూర్తయ్యేసరికి ఎలిస్ పెర్రీ 62 బంతుల్లో 43, అనాబెల్ 29 బంతుల్లో 20 పరుగులతో క్రీజులో నిలిచారు. మొత్తంగా ఆసీస్ 27 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే ఆసీస్ 102 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్గా తొలి రోజు ఆసీస్దే పైచేయి అని చెప్పవచ్చు. చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
నీకంత దూకుడు ఎందుకు?: అభిషేక్ శర్మపై అశ్విన్ ఆగ్రహం
అభిషేక్ శర్మ.. తొలిసారి ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 0 (1), 0 (4), 0 (3), 15 (12), 55 (30), 10 (11), 9 (7).విఫలమైనా..లీగ్ దశలో మూడు మ్యాచ్లు ఆడి డకౌట్ అయినా యాజమాన్యం అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఓపెనర్గా కొనసాగించిది. అయితే, అతడి ఆట తీరు మాత్రం మారలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్తో కీలక సెమీ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తేలిపోయాడు. తొందరపడి వికెట్ పారేసుకుని తొమ్మిది పరుగులకే నిష్క్రమించాడు.సంజూ మెరుపు ఇన్నింగ్స్మరో ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) మెరుపు ఇన్నింగ్స్ (42 బంతుల్లో 89) తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ ఓపెనింగ్ బ్యాటర్ వైఖరిని తప్పుబట్టాడు.తలతిక్క బ్యాటింగ్‘‘ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో అతడు తలతిక్కగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి అభిషేక్ గేమ్ప్లాన్కు నేను వీరాభిమానిని. విల్ జాక్స్ బౌలింగ్లో అతడు ఎనిమిది పరుగులు రాబట్టాడు. కానీ ఈ తర్వాత అతడి ఓవర్లోనే 30 పరుగులు తీయాలి అన్నట్లు తొందరపడ్డాడు.నీకంత దూకుడు ఎందుకు?కొన్నిసార్లు బాల్ను వదిలేయాల్సి ఉంటుంది. ఓవైపు సంజూ శాంసన్ కుదురుగా ఆడుతున్నాడు కదా!.. నీకు కష్టంగా అనిపిస్తే ఒక సింగిల్ తీసి మరో ఎండ్కు వెళ్లిపోవాల్సింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది కదా!.. ఏదేమైనా అంత దూకుడు పనికిరాదు’’ అని అశ్విన్ అభిషేక్పై మండిపడ్డాడు.అదే విధంగా.. న్యూజిలాండ్తో ఫైనల్ నేపథ్యంలో.. ‘‘అభిషేక్ మంచి బ్యాటర్. న్యూజిలాండ్తో ఇటీవలి సిరీస్లో సూపర్ ఫామ్ కనబరిచాడు. మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ బౌలింగ్లో గతంలో అదరగొట్టాడు.ఒత్తిడిలో ఉన్నాడుఅయితే, ఇప్పుడు అతడు ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్, హెడ్కోచ్ అతడితో మాట్లాడాలి. తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి జట్టు వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలి. అతడిలో గొప్ప ప్రతిభ ఉంది. కానీ ఎందుకో తడబడుతున్నాడు.ఇలాంటి తరుణంలో అతడిపై మరింత ఒత్తిడి చేసే విధంగా మేనేజ్మెంట్ ఉండకూడదు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలి’’ అని టీమిండియా యాజమాన్యానికి అశూ సూచనలు ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్.. అభిషేక్ కోసం లెగ్సైడ్లో ఒకే ఒక్క ఫీల్డర్ను ఉంచాడు. అతడికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. మార్చి 8న భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రంచకప్-2026 ఫైనల్కు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్.. రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్ను భారత్ ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో భారత్- న్యూజిలాండ్ మధ్య మార్చి 8 (ఆదివారం) ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇక ఈ మెగా ఫైనల్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది.అంపైర్లు వీరే..టీమిండియా- కివీస్ (IND vs NZ Final) మధ్య టైటిల్ పోరుకు అంపైర్లను శుక్రవారం ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్లకు చోటు ఇచ్చినట్లు తెలిపింది. వీరిద్దరు ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్కు కూడా అంపైర్లుగా వ్యవహరించారు.ఆ రెండుసార్లూ గెలిచినా..ఇదిలా ఉంటే.. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటికే ప్రతిష్టాత్మక ఫైనల్లలో అంపైర్గా పని చేసిన అనుభవం ఇల్లింగ్వర్త్కు ఉంది. వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్లో ఆయనే అంపైర్.అయితే, 2023లో తప్ప 2024, 2025 టైటిల్ పోరులో టీమిండియానే విజయం వరించింది. అన్నట్లు 2023లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్కు అడుగు దూరంలో నిలిచిపోయింది.ఆందోళనలో అభిమానులు.. కారణం ఇదేఅయితే, 2024లో వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాను.. 2025లో దుబాయ్లో న్యూజిలాండ్ను ఓడించి ట్రోఫీ విజేతగా నిలిచింది. అయితే, 2023 మాదిరే ఈసారి కూడా అదే అంపైర్ (ఇల్లింగ్వర్త్), అదే వేదిక (అహ్మదాబాద్)పై ఫైనల్ కావడంతో అభిమానులు కాస్త సెంటిమెంట్ ఫీలవుతున్నారు. దురదృష్టం వెంటాడకూడదని ప్రార్థిస్తున్నారు.టీ20 ప్రపంచకప్-2026లో భారత్- న్యూజిలాండ్ ఫైనల్కు అంపైర్లు వీరే👉ఆన్ ఫీల్డ్ అంపైర్లు- రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్👉థర్డ్ అంపైర్- అల్లాఉద్దీన్ పలేకర్👉ఫోర్త్ అంపైర్- అడ్రియాన్ హోల్డ్స్టక్👉మ్యాచ్ రిఫరీ- ఆండీ పైక్రాఫ్ట్.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడు: మాజీ క్రికెటర్
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా లాంటి బౌలర్ దొరకడం భారత జట్టు చేసుకున్న అదృష్టం అని కొనియాడాడు. టీమిండియాలో ఇంత వరకు ఇలాంటి బౌలర్ను ఎన్నడూ చూడలేదంటూ ఆకాశానికెత్తాడు.టైటిల్ పోరుకు అర్హతటీ20 ప్రపంచకప్-2026లో భారత్ ఫైనల్కు దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ముంబై వేదికగా వాంఖడేలో జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్పై ఏడు పరుగుల తేడాతో గెలిచిన సూర్య సేన.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఈ మ్యాచ్లో ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 89) బ్యాట్తో రాణిస్తే.. బుమ్రా తన అద్భుత స్పెల్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ చిచ్చర పిడుగు జేకబ్ బెతెల్ (48 బంతుల్లో 105) విధ్వంసకర ఇన్నింగ్స్తో మ్యాచ్ను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న వేళ.. బుమ్రా తన మ్యాజిక్ చూపించాడు.కీలక సమయంలో రాణించిపద్దెనిమిదవ ఓవర్లో 0,1,1,2,1,1 మాత్రమే ఇచ్చిన బుమ్రా.. టీమిండియా వైపు మ్యాచ్ తిప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ బుమ్రాను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘‘బుమ్రా గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతడు తరానికొక్క బౌలర్. టీమిండియాలో ఇలాంటి బౌలర్ను చూడటం అరుదు.సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడుయార్కర్లు, స్లో బాల్స్ వేస్తాడు.. అవుట్ స్వింగ్, ఇన్స్వింగ్ రాబడతాడు. బౌన్సర్లు సంధిస్తాడు. ముఖ్యంగా ఒత్తిడిలోనూ ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు. నా దృష్టిలో ఈ మ్యాచ్కు సంబంధించి బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సింది.ఈ పిచ్పై బౌలర్లందరి ఎకానమీ దాదాపుగా 10 దాటి పోయింది. రెండు జట్లు కలిపి 500కు పైగా పరుగులు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలా బౌలింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఇంతటి కఠినమైన ఓవర్ను బుమ్రా మాత్రమే వేయగలడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.అక్షర్ పటేల్ సైతంకాగా ఈ మ్యాచ్లో సంజూకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సంజూ సైతం బుమ్రానే ఈ అవార్డుకు అర్హుడు అని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుమ్రా ఓవరాల్గా నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మరోవైపు.. అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్లతో టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Next stop: FINAL! 😍A high-scoring thriller, but #TeamIndia hold their nerve and book a spot in the final! 🔥ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/PQfdlxUEv7— Star Sports (@StarSportsIndia) March 5, 2026చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
ఇది వరల్డ్కప్.. గుర్తుందా?: గావస్కర్ ఫైర్
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ ఫైనల్కు చేరుకుంది. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో.. ఏడు పరుగుల తేడాతో గట్టెక్కింది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ మ్యాచ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే.సంజూ భారీ అర్ధ శతకంటాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ భారీ అర్ధ శతకం (42 బంతుల్లో 89) తో ఆకట్టుకున్నాడు.ఇక లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో టీమిండియాకు శుభారంభం లభించింది. హార్దిక్ పాండ్యా ఫిల్ సాల్ట్ (5) రూపంలో తొలి వికెట్ దక్కించుకోగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా హ్యారీ బ్రూక్ (7)ను అవుట్ చేసి కీలక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.బెతెల్ విధ్వంసకర శతకంఅయితే, జేకబ్ బెతెల్ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 105)తో విరుచుకుపడి.. భారత శిబిరంలో గుబులు రేపాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. దీంతో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టీమిండియా ఊపిరి పీల్చుకుంది.ఇక ఈ మ్యాచ్లో బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూల్చాడు. ఇదిలా ఉంటే.. బుమ్రా బౌలింగ్ వేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వాంఖడే డీజే బృందం.. ‘‘బూమ్ బూమ్ బుమ్రా’’ అంటూ బుమ్రా నామస్మరణ చేయాలని ప్రేక్షకులకు పిలుపు ఇచ్చారు. దీంతో అందరూ బుమ్రా పేరును గట్టిగా పలుకుతూ స్టేడియం దద్దరిల్లేలా చేశారు.Every Team India fan after watching Jasprit Bumrah’s masterclass! 🇮🇳🔥ICC Men’s #T20WorldCup 👉🏻 FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/My9xx2WPyt— Star Sports (@StarSportsIndia) March 6, 2026బుమ్రా ఏంటి బుమ్రా?ఈ విషయంపై స్పందిస్తూ భారత మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బుమ్రా బౌలింగ్ చేసేందుకు సిద్ధపడినపుడు.. ‘బూమ్ బూమ్ బుమ్రా’ అని అరవాలని చెప్పడం సరికాదు.బుమ్రా నామస్మరణ చేయాలనుకుంటే అతడు ఫ్రీగా ఉన్నపుడు చేయాలి. ఇది వరల్డ్కప్ అన్న విషయం గుర్తుంచుకోవాలి’’ అని గావస్కర్ ఫైర్ అయ్యాడు. కాగా కీలక సెమీ ఫైనల్లో బుమ్రా బౌలింగ్ చేస్తున్నపుడు.. అతడి ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించడం సరికాదన్నది గావస్కర్ అభిప్రాయం.ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో సూపర్-8లో టీమిండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చేసిన ఏర్పాట్లపై కూడా గావస్కర్ ఇదే విధంగా స్పందించాడు. మ్యాచ్ మధ్యలో లేజర్ షో ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రవిశాస్త్రి కూడా అతడికి మద్దతు పలికాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
చూసుకోవా?.. హార్దిక్ కుమారుడి రియాక్షన్.. మహీక షాక్!
ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. 12 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 27 పరుగులు సాధించాడు. తద్వారా తన మెరుపు ఇన్నింగ్స్తో టీమిండియా 250 పరుగులు మార్కు దాటడంలో సహాయపడ్డాడు.రెండు వికెట్లుఇక బంతితోనూ హార్దిక్ పాండ్యా రాణించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5)తో పాటు ప్రమాదకర ఆటగాడు సామ్ కర్రాన్ (18) వికెట్ను కూడా హార్దిక్ పాండ్యా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 38 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ముంబై వేదికగా వాంఖడే మైదానంలో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు సెలబ్రిటీలు తరలివచ్చిన విషయం తెలిసిందే. అంబానీ కుటుంబంతో పాటు దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దంపతులు సహా బాలీవుడ్ ప్రముఖులు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించారు.నీతా అంబానీతో కలిసిఇక హార్దిక్ పాండ్యా ప్రేయసి మహీక శర్మ కూడా మరోసారి స్టాండ్స్లో సందడి చేసింది. నీతా అంబానీతో కలిసి మహీక ఒకే వరుసలో కూర్చుంది. అయితే, ఆమెతో పాటు హార్దిక్ కుమారుడు అగస్త్య ఉండటం విశేషం. తండ్రి బ్యాటింగ్ను ఆస్వాదించిన అగస్త్య.. అతడు అవుటైన తీరును మాత్రం తట్టుకోలేకపోయాడు.ఆ మాత్రం చూసుకోవా?భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి.. విల్జాక్స్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా పరుగు పూర్తి చేసి రనౌట్ అయ్యాడు. మరో పరుగుకు యత్నిస్తున్న క్రమంలో జేకబ్ బెతెల్ బంతిని అందుకుని వికెట్ల వైపు త్రో చేయగా.. వికెట్ కీపర్ బట్లర్ పని పూర్తిచేశాడు. దీంతో హార్దిక్ అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐదేళ్ల అగస్త్య కోపంతో ఊగిపోయాడు. ‘‘ఛ.. అంత బాగా ఆడి.. ఇంత చెత్తగా అవుటయ్యావేంటి నాన్నా.. ఆ మాత్రం చూసుకోవా?’’ అన్నట్లుగా గట్టిగా అరిచినట్లు కనిపించింది.ఆమె చేయి పట్టుకుని ఆ సమయంలో మహీక అగస్త్య భుజాలు పట్టుకుని కూల్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం మహీక తనతో పాటు అగస్త్యను తీసుకువెళ్లింది. అగస్త్య ఆమె చేయి పట్టుకుని కారు ఎక్కుతున్న వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.Hardik’s Girl Friend Mahieka with His Son Agasthya pic.twitter.com/oJwx1mxUU6— Ajit Samachar (@SamacharAj10350) March 6, 2026 Hardik Pandya's son Agastya pandya with his dad's girlfriend Mahieka Sharma 😭♥️#INDvsENG pic.twitter.com/5U5DejxvKj— Chota Don (@choga_don) March 5, 2026కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యాకు.. ఆమె ద్వారా కుమారుడు అగస్త్య కలిగాడు. అయితే, నటషాకు విడాకులు ఇచ్చిన పాండ్యా ప్రస్తుతం మహీకతో ప్రేమలో ఉన్నాడు. ఇక సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో గెలిచి భారత్ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.చదవండి: T20 WC 2026: ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆకాశానికెత్తిన సూర్యకుమార్ -
T20 WC: మా ఓటమికి కారణం అతడే: మెకల్లమ్
ఇంగ్లండ్ కల చెదిరింది. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో అడుగుపెట్టాలనుకున్న బ్రూక్ బృందాన్ని టీమిండియా గట్టి షాకిచ్చింది. ముంబై వేదికగా గురువారం నాటి సెమీ ఫైనల్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి భారత్ ఫైనల్కు దూసుకువెళ్లింది.ఆఖరి వరకు పోరాడినా ఇంగ్లండ్కు చేదు అనుభవమే మిగిలింది. ఇక టీమిండియా గెలుపులో అక్షర్ పటేల్ (Axar Patel)దీ కీలక పాత్రే. సంజూ శాంసన్ బ్యాట్తో రాణించగా.. జస్ప్రీత్ బుమ్రా బంతితో అదరగొట్టాడు. వీరిద్దరికి తోడు అక్షర్ అందుకున్న క్యాచ్లే గెలుపును టీమిండియా వైపు తిప్పాయి.ఇంగ్లండ్ హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ (Brendon McCullum) కూడా ఇదే మాట అంటున్నాడు. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ.. అక్షర్ అందుకున్న అద్భుత క్యాచ్లే మ్యాచ్ను తమ నుంచి లాగేసుకున్నాయని పేర్కొన్నాడు. స్కై స్పోర్ట్స్ క్రికెట్తో మాట్లాడుతూ..అద్భుత రీతిలో క్యాచ్లు అందుకుని‘‘నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్లో అక్షర్ అందుకున్న ఆ రెండు క్యాచ్ల గురించి మాట్లాడాలి. వాంఖడే మైదానంలో ఇలాంటి క్యాచ్లు అంత సులువేమీ కాదు. ఈ మ్యాచ్లో టీమిండియా తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేసింది.ముఖ్యంగా అక్షర్ అద్భుత రీతిలో క్యాచ్లు అందుకుని మ్యాచ్ను టీమిండియా వైపు తిప్పేశాడు. కీలక సమయంలో అతడు రాణించాడు. నిజానికి చాన్నాళ్లుగా వాళ్ల ఫీల్డింగ్ అంత గొప్పగా ఏమీ లేదు.. ఈ రోజు మా వాళ్లే ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండే బాగుండేది. ఏదేమైనా వాళ్లకి (టీమిండియా) క్రెడిట్ ఇవ్వాల్సిందే’’ అని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు.𝗕𝗮𝗽𝘂 𝗯𝗮𝘁𝘁𝗲𝗿𝘀 𝗸𝗲 𝗹𝗶𝘆𝗲 𝗵𝗮𝗻𝗶𝗸𝗮𝗿𝗮𝗸 𝗵𝗮𝗶. 🥵ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/4e06e0SYAv— Star Sports (@StarSportsIndia) March 5, 2026అక్షర్ ఫీల్డింగ్.. భారత్ విజయానికి బాటలుకాగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో అక్షర్ పటేల్ రెండు క్యాచ్లు అందుకున్నాడు. తొలుత హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఫిల్ సాల్ట్ (5) ఇచ్చిన సులువైన క్యాచ్ను అందుకున్నాడు. అయితే, కెప్టెన్, డేంజరస్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ బుమ్రా బౌలింగ్లో బంతిని గాల్లోకి తరలించగా.. పాయింట్ నుంచి చాలా దూరం పరిగెత్తి అక్షర్ బంతిని అందుకున్నాడు.అయితే, అన్నింటికంటే విల్ జాక్స్ (35) ఇచ్చిన క్యాచ్ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్నా పట్టు కోల్పోయినట్లు అనిపించగా.. అక్కడే ఉన్న దూబే వైపు విసరగా అతడు బంతిని క్యాచ్ పట్టాడు. ఇలా మ్యాచ్ను మలుపుతిప్పిన కీలక క్యాచ్లోనూ అక్షర్ భాగమయ్యాడు.చదవండి: టీమిండియా గెలుపునకు ప్రధాన కారణాలు ఇవే -
T20 WC 2026 Final: అభిషేక్పై వేటు పడుతుందా..?
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడతుంది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఎన్ని అవకాశాలు ఇచ్చినా గాడిలో పడలేకపోవడంతో యావత్ భారతం ఆందోళన చెందుతుంది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌట్లైన అతను.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్తో జరిగిన కీలక సమరాల్లోనూ చేతులెత్తేశాడు. టోర్నీ మొత్తంలో జింబాబ్వే మ్యాచ్ మినహాయించి ఒక్క మ్యాచ్లో కూడా కనీస ప్రదర్శనలు చేయలేకపోయాడు. మొత్తంగా 7 ఇన్నింగ్స్ల్లో 12.71 సగటున 89 పరుగులు మాత్రమే చేశాడు.వరుస వైఫల్యాల నేపథ్యంలో మార్చి 8న న్యూజిలాండ్తో జరుగబోయే ఫైనల్ మ్యాచ్లో అభిషేక్కు ఆడించాలా వద్దా అన్న చర్చ భారత క్రికెట్ సర్కిల్స్లో జోరుగా సాగుతుంది. మేనేజ్మెంట్ అభిషేక్ను వెనకేసుకొస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత దేశ పరువు సమస్య కాబట్టి, ఛాన్స్లు తీసుకోవద్దని సూచిస్తున్నారు.క్లిష్ట సమయంలో మేనేజ్మెంట్తో పాటు సహచరులు, కోచ్ గౌతమ్ గంభీర్ అభిషేక్కు అండగా నిలుస్తున్నారు. తాజాగా మరో ఓపెనర్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. భారత జట్టు అభిషేక్పై నమ్మకం కోల్పోలేదని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా పాజిటివ్గా ఉంది. ప్రతి ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమే అని వెనకేసుకొచ్చాడు. ఒకట్రెండు మంచి షాట్లు ఆడితే ఫామ్ తిరిగి వస్తుంది. ఫైనల్ అతని రోజు కావచ్చని సహచరుడికి పూర్తి స్థాయి మద్దతు తెలిపాడు.వాస్తవానికి అభిషేక్ వరుస వైఫల్యాలకు అతనిపై ఉన్న అధిక అంచనాలే కారణమని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి అధికం కావడం వల్ల అభిషేక్ తడబడుతున్నాడని అభిప్రాయపడుతున్నారు. అతనికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే సత్ఫలితాలు రావచ్చని అంటున్నారు. పరుగులు రాబట్టేందుకు కష్టపడుతున్న మాట కూడా వాస్తమే అయినప్పటికీ.. ఒక్కసారి లైన్లోకి వచ్చాడంటే, అతన్ని ఆడపం కష్టమని అంటున్నారు. ఆఫ్ స్పిన్ను ఎదుర్కోవడంలో లోపాలు సరిదిద్దుకుంటే రాణించగలడని అంచనా వేస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, కీలకమైన ఫైనల్లో రాణిస్తే మాత్రం అభిషేక్ భారత క్రికెట్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాడు.ప్రస్తుత ప్రపంచకప్లో అభిషేక్ ప్రదర్శనలు..యూఎస్ఏపై 0 (1)నమీబియాపై ఆడలేదుపాకిస్తాన్పై 0 (4)నెదర్లాండ్స్పై 0 (3)సౌతాఫ్రికాపై 15 (12 బంతులు; 2 ఫోర్లు, సిక్స్)జింబాబ్వేపై 55 (30 బంతులు; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)వెస్టిండీస్పై 10 (11 బంతులు; 2 ఫోర్లు)ఇంగ్లండ్పై 9 (7 బంతులు; 2 ఫోర్లు)కాగా, టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్కు చేరాయి. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను.. భారత్ ఇంగ్లండ్ను మట్టికరిపించి తుది పోరులో అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ సమరం మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. -
T20 WC 2026: ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ నామినీల పేర్లు ప్రకటన
2026 టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ నామినీల పేర్లను ఐసీసీ ఇవాళ (మార్చి 6) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో ఒక టీమిండియా ప్లేయర్, ఓ పాకిస్తానీ ప్లేయర్ ఉన్నారు.భారత్ తరఫున ఈ అవార్డుకు నామినేట్ అయిన ఆ ఒకే ఒక్కడు సంజూ శాంసన్. సంజూ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 232 పరుగులు చేశాడు. అతని సగటు 77.33, స్ట్రైక్ రేట్ 201.73గా ఉంది. ఈ టోర్నీలో భారత్ ఫైనల్కు చేరడంలో సంజూది కీలకపాత్ర. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్పై ఉగ్రరూపం (50 బంతుల్లో 97 నాటౌట్) దాల్చాడు. ఆపై సెమీస్లో ఇంగ్లండ్పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ 89 (42 బంతులు) ఆడి భారత్ను ఫైనల్కు చేర్చాడు.పాకిస్తాన్ తరఫున ఈ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్ సాహిబ్జాదా ఫర్హాన్. ఫర్హాన్ తన జట్టు సూపర్-8 దశ దాటలేకపోయినా, అద్బుత ప్రదర్శనలతో అలరించాడు. శ్రీలంక, నమీబియాపై శతకాలు సాధించి, ఒకే వరల్డ్ కప్లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన ఫర్హాన్.. 76.63 సగటున, 160.25 స్ట్రైక్ రేట్తో 383 పరుగులు చేశాడు.ఇతర నామినీలువిల్ జాక్స్ (ఇంగ్లండ్) – 226 పరుగులు, 9 వికెట్లు.రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) – 128 పరుగులు, 11 వికెట్లు.ఏయిడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా కెప్టెన్) – 286 పరుగులు, కీలక వికెట్లు.టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్) – 274 పరుగులు, సెమీఫైనల్లో 58.లుంగి ఎంగిడి (దక్షిణాఫ్రికా) – 12 వికెట్లు, ఎకానమీ 7.19.షాడ్లీ వాన్ స్కాల్క్విక్ (అమెరికా) – 13 వికెట్లు, టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్కు చేరాయి. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను.. భారత్ ఇంగ్లండ్ను మట్టికరిపించి తుది పోరులో అమీతుమీకి సిద్దమయ్యాయి. అంతిమ సమరం మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. -
T20 WC 2026: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న (మార్చి 5) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఎడిషన్లో (2024, 2026), ఓవరాల్గా నాలుగోసారి (2007, 2014, 2024, 2026) ఫైనల్కు చేరింది.ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్కు చేరిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తాజా ఫైనల్స్తో భారత్ ఐసీసీ టోర్నీల ఫైనల్స్ సంఖ్య 15కు చేరింది. గతంలో ఈ వరల్డ్ రికార్డు భారత్, ఆస్ట్రేలియా పేరిట సంయుక్తంగా ఉండేది. తాజాగా భారత్ ఆసీస్ ఆధిపత్యానికి తెరదించి, హోల్ అండ్ సోల్గా ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది.టీమిండియా ఫైనల్స్కు చేరిన ఐసీసీ టోర్నీలు.. భారత్ ఇప్పటివరకు 14 ఫైనల్స్లో 6 గెలిచింది, 7 ఓడింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వర్షం కారణంగా రద్దవగా, భారత్..శ్రీలంకతో పాటు సంయుక్తంగా ట్రోఫీని పంచుకుంది. - వన్డే వరల్డ్ కప్: 1983, 2011 విజయాలు, 2003, 2023 (రన్నరప్) - టీ20 వరల్డ్ కప్: 2007, 2024 విజయాలు, 2026 (లోడింగ్) - ఛాంపియన్స్ ట్రోఫీ: 2002 (సంయుక్త విజేత), 2013, 2025 విజయాలు, 2002, 2017 (రన్నరప్) - వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్: 2021, 2023 (రన్నరప్) ఐసీసీ టోర్నీల్లోఅత్యధిక సార్లు ఫైనల్స్కు చేరిన జట్లు 1. భారత్ – 15 2. ఆస్ట్రేలియా – 14 3. ఇంగ్లాండ్ – 9 4. న్యూజిలాండ్ – 8 5. వెస్టిండీస్ – 8 6. శ్రీలంక – 8 7. పాకిస్తాన్ – 7 8. దక్షిణాఫ్రికా – 3ఫైనల్లో న్యూజిలాండ్తో ఢీ2026 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8న జరుగనుంది. న్యూజిలాండ్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి ఫైనల్కు చేరింది. ఫిన్ అలెన్ 33 బంతుల్లో విధ్వంసకర సెంచరీ చేసి కివీస్ను ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు.చరిత్రాత్మక అవకాశం టీ20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఏ జట్టు టైటిల్ను రక్షించుకోలేదు. భారత్కు ఈసారి ఆ అవకాశం వచ్చింది. గత ఎడిషన్లో ఛాంపియన్గా నిలిచిన భారత్.. చరిత్ర తిరగరాయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, న్యూజిలాండ్ తమ తొలి టైటిల్ కోసం ఉవ్విళ్లూరుతుంది. -
వరల్డ్కప్ సెమీఫైనల్లో ఆసక్తికర సంఘటన
టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్ ఇంగ్లండ్పై 7 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్లో ఫైనల్కు దూసుకెళ్లింది. ముంబైలోని వాంఖడే స్టేడియం జరిగిన ఈ కీలక సమరాన్ని వీక్షించేందుకు అతిరథ మహారథులంతా తరలివచ్చారు. వీరిలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జంట హైలైటైంది. వీరికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇందులో సాక్షి (ధోని సతీమణి) ఆనందంతో ఎగిరి గంతులేస్తుండగా.. ధోని వారిస్తాడు. Sakshi Thought It Was Out And Jumped Outta Seat, MS Dhoni Had To Calm Her Down 🤌😭Moment hai ! 🥹💛pic.twitter.com/E3ZLz9xuLv https://t.co/2LJZGzyYzV— Abhinav MSDian™ (@Abhinav_hariom) March 5, 2026అసలేం జరిగిందంటే.. భారత్ నిర్దేశించిన 254 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించే దిశగా సాగుతోంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా సామ్ కర్రన్కు బౌలింగ్ చేస్తుండగా, బంతి బ్యాట్ దిగువ భాగాన్ని తాకి నేలపై పడి పైకి ఎగిరింది. బుమ్రా చురుకుగా వ్యవహరించి ఆ బంతిని క్యాచ్ పట్టాడు. ఇది ఔట్ కాదని అందరికీ తెలుసు. అయితే ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్న సాక్షి ధోని, కర్రన్ ఔటయ్యాడన్న ఆనందంతో లేచి చప్పట్లు కొడుతూ, ఎగురుతూ గంతులేసింది.ఆ సమయంలో ఆమె వెనుకే ఉన్న ధోని అది ఔట్ కాదంటూ సాక్షిని శాంతపరిచాడు. ఈ సన్నివేశం చుట్టూ ఉన్న వారిలో నవ్వులు పూయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఈ వీడియోను చూసిన వారంతా మిస్టర్ కూల్ ఇంకా కూల్గానే ఉన్నాడంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. భారత్ ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్కు చేరడం ఒక ఎత్తైతే ఈ సన్నివేశం మరో ఎత్తుగా నిలిచింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్,.. సంజూ శాంసన్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్లతో అలరించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ యువ బ్యాటర్ జేకబ్ బేతెల్ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి, కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు.అయితే బేతెల్ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్ ముందు భారత్కు బ్రేక్ దొరికింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు.19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే బేతెల్ను (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినా (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది.కాగా, భారత్ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. -
T20 WC 2026: ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆకాశానికెత్తిన సూర్యకుమార్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న (మార్చి 5) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో ఎడిషన్లో, ఓవరాల్గా నాలుగోసారి ఫైనల్కు చేరింది.నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడినా, భారత శిబిరంలో గుబులు రేపింది. ముఖ్యంగా యువ బ్యాటర్ జేకబ్ బేతెల్ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్ల విరుచుకుపడిన బేతెల్.. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు.బేతెల్ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్ ముందు భారత్కు బ్రేక్ దొరికింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు.19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే బేతెల్ను (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినా (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది.అంతకుముందు సంజూ శాంసన్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు) ఇరగదీయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్లతో అలరించారు.మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహచరులతో పాటు ఇంగ్లండ్ ఆటగాళ్లపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. స్కై మాటల్లో..స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండగా, ఇంతటి అద్భుతమైన జట్టును నడిపించడం, ఈ జట్టుతో ఫైనల్కు చేరడం ప్రత్యేక అనుభూతి. సంజూ శాంసన్ ఇన్నింగ్స్పై అతను క్రీజులోకి వచ్చిన వెంటనే ఏం చేయాలో తెలుసుకున్నాడు. వికెట్ బాగుందని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. గతేడాది నుంచి పడిన కష్టానికి ఫలితం ఇది. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ లక్ష్య ఛేదనపైవారి లక్ష్య ఛేదన ప్రయత్నం అద్భుతం. హ్యారీ బ్రూక్ను చూసి, ఇంకెంత స్కోర్ చేయాలయ్యా అని అడిగాను. వారు చివరి వరకు ఆటలో ఉన్నారు. కానీ బుమ్రా, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మ్యాచ్ను మలుపు తిప్పారు. బుమ్రా మరోసారి తన ప్రతిభను చూపాడు.ఫీల్డింగ్పై ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కృషిని గుర్తించాలి. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఫీల్డ్లో పదారసంలా కదిలారు. అద్బుతమైన క్యాచ్లు పట్టడంతో పాటు పరుగులను నియంత్రించగలిగారు. ప్రాక్టీస్ సెషన్లలో దిలీప్ చేసిన కృషి ఫలించింది.బ్యాటింగ్ కాంబినేషన్పై మూడో స్థానం వరకు అన్ని స్థిరంగా ఉన్నాయి. రషీద్ బౌలింగ్ చేస్తున్నప్పుడు శివమ్ దూబేను పంపడం సరైన నిర్ణయం. జట్టు అవసరమైతే నా స్థానాన్ని మార్చడం కూడా సరైనదే. ఫైనల్పై ఆలోచనలు ఫైనల్ ఒత్తిడి సహజంగానే ఉంటుంది. కానీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. టైటిల్ కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ముగించాడు. కాగా, భారత్ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. -
T20 WC 2026: ఇంగ్లండ్పై కీలక ప్రదర్శన.. చరిత్ర సృష్టించిన బుమ్రా
భారత ప్రీమియం ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా ఓ చరిత్రాత్మక మైలురాయిని తాకాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో నిన్న (మార్చి 5) జరిగిన రెండో సెమీఫైనల్లో హ్యారీ బ్రూక్ వికెట్ తీయడంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదైన 500 వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ మ్యాచ్లో తన స్పెల్ తొలి బంతికే ఈ ఘనత సాధించాడు. 32 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు 52 టెస్ట్ల్లో 234 వికెట్లు.. వన్డేల్లో 89 మ్యాచ్ల్లో 149.. టీ20ల్లో 94 మ్యాచ్ల్లో 117 వికెట్లు తీశాడు.2016 జనవరి 23న అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బుమ్రా.. అతి తక్కువ వ్యవధిలోనే 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదవ భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. బుమ్రాకు ముందు అనిల్ కుంబ్లే, అశ్విన్, హర్భజన్, కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్ ఈ ఘనత సాధించారు.ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో సామర్థ్యం మేరకు సత్తా చాటుతున్న బుమ్రా.. నిన్న ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ గెలుపు దిశగా పయనిస్తున్న వేల ఓ పొదుపైన ఓవర్తో మ్యాచ్ను భారత్వైపు మల్లించాడు.18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే విధ్వంసకర సెంచరీతో (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరంగం సృష్టించిన బేతెల్ను ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది. ఈ మ్యాచ్లో బుమ్రా అత్యంత పొదుపైన బౌలర్గా నిలవడంతో పాటు మ్యాచ్ మలుపు తిప్పే ఓవర్ వేసి అత్యంత కీలకమైన హ్యారీ బ్రూక్ వికెట్ తీశాడు.ప్రస్తుత ప్రపంచకప్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన బుమ్రా.. గ్రూప్ దశలో పాకిస్తాన్, సూపర్-8లో విండీస్.. సెమీస్లో ఇంగ్లండ్పై కీలక ప్రదర్శనలు చేసి మొత్తం 10 వికెట్లు తీశాడు.వరుసగా రెండో మ్యాచ్లో సంజూ హిట్ఇంగ్లండ్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్లో ఇరగదీయడంతో (89) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్లతో అలరించారు. కాగా, భారత్ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. -
T20 WC 2026: అదే మా కొంపముంచింది.. బ్రూక్ ఆవేదన
క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్న నమ్మకాన్ని నిన్నటి భారత్-ఇంగ్లండ్ టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్ మరోసారి రుజువు చేసింది. ఈ మ్యాచ్ కీలక దశలో శివమ్ దూబే (అక్షర్ పటేల్ సాయంతో), తిలక్ వర్మ పట్టిన రెండు అద్భుతమైన క్యాచ్లు మ్యాచ్ గతినే మార్చేశాయి. అప్పటివరకు ఇంగ్లండ్కు అనుకూలంగా ఉన్న సమీకరణలు.. ఆ రెండు క్యాచ్ల తర్వాత భారత్పైపు మళ్లాయి.254 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ లక్ష్యం వైపు దూసుకెళ్తున్న వేల, అక్షర్ పటేల్-శివమ్, తిలక్ వర్మ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదకరంగా ఉన్న విల్ జాక్స్, సామ్ కర్రన్ను అద్భుతమైన క్యాచ్లతో పెవిలియన్కు పంపారు. ఈ మ్యాచ్లో భారత్ గెలుపుకు ఈ రెండు క్యాచ్లు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.లక్ష్య ఛేదనలో జేకబ్ బేతెల్ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరోచిత శతకంతో పోరాడినప్పటికీ ఇంగ్లండ్ గెలుపు వాకిటి వరకు వచ్చి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమికి మరో క్యాచ్ కూడా కారణమైంది. అదేంటంటే.. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ (జోఫ్రా ఆర్చర్) రెండో బంతికి సంజూ శాంసన్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ను ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నేలపాలు చేశాడు. ఇక్కడే ఇంగ్లండ్ ఓటమికి మొదటి బీజం పడింది. లైఫ్ లభించడంతో చెలరేగిపోయిన సంజూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. సంజూకు లైఫ్ లభించే సమయానికి అతని స్కోర్ కేవలం 15 పరుగులే. లైఫ్ లభించాక పేట్రేగిపోయిన సంజూ మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒకవేళ సంజూ క్యాచ్ను బ్రూక్ ఆదిలోనే పట్టి ఉంటే, టీమిండియా ఈ స్థాయి స్కోర్ చేసుండకపోయేదేమో. ఏదిఏమైనా సంజూ క్యాచ్ వదలి బ్రూక్ సహా యావత్ ఇంగ్లండ్ టీమ్ మూల్యం చెల్లించుకుంది.ఈ మ్యాచ్లో మరో టర్నింగ్ పాయింట్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 18, 19వ ఓవర్లు. అప్పటివరకు గెలుపుపై ఆశలు పెట్టుకున్న ఇంగ్లండ్ను భారత పేసర్లు బుమ్రా, హార్దిక్ పాండ్యా దారుణంగా దెబ్బకొట్టారు. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్కు గెలుపుపై ధీమా వచ్చింది.చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే బేతెల్ను ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది.మొత్తంగా సంజూ శాంసన్ డ్రాప్ క్యాచ్, శివమ్ దూబే (అక్షర్ పటేల్ సాయంతో), తిలక్ వర్మ క్యాచ్లు, బుమ్రా, హార్దిక్ పొదుపైన ఓవర్లు, చివరి ఓవర్ తొలి బంతికి రనౌట్ కావడం వంటి అంశాలు భారత్ గెలుపుకు కీలక కారణాలుగా నిలిచాయి.అయితే వీటిలో సంజూ డ్రాప్ క్యాచే ఇంగ్లండ్ కొంపముంచిందని హ్యారీ బ్రూక్ అభిప్రాయపడ్డాడు. సంజూ క్యాచ్ వదలి చాలా పెద్ద తప్పు చేశానని మ్యాచ్ అనంతరం ఆవేదన వ్యక్తం చేశాడు. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ చిచ్చరపిడుగు
నిన్న (మార్చి 5) జరిగిన టీ20 వరల్డ్కప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్లో, ఓవరాల్గా నాలుగోసారి ఫైనల్కు చేరింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడినా, భారత శిబిరంలో గుబులు రేపింది. ముఖ్యంగా యువ బ్యాటర్ జేకబ్ బేతెల్ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలి బంతి నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన బేతెల్.. కేవలం 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. బేతెల్ సెంచరీ పూర్తి చేయడానికి ఒక్క ఓవర్ ముందే భారత్కు బ్రేక్ దొరకింది. 18 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్ బంతిని అందుకున్న హార్దిక్ ప్రమాదకరంగా కనినిస్తున్న సామ్ కర్రన్ను ఔట్ చేయడంతో పాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్కు గెలుపుపై ధీమా వచ్చింది. చివరి ఓవర్ వేసిన దూబే తొలి బంతికే బేతెల్ను ఔట్ చేయడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఆతర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన దూబే... చివరి మూడు బంతులకు సిక్సర్లు ఇచ్చినప్పటికీ (ఆర్చర్) అప్పటికే ఇంగ్లండ్ ఓటమి ఖరారైపోయింది.ఇంత భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్లు, ముఖ్యంగా జేకబ్ బేతెల్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అతను.. విల్ జాక్స్, సామ్ కర్రన్ సహకారాలతో గెలుపు తీరాల వరకు తీసుకెళ్లాడు. 18,19 ఓవర్లు బుమ్రా, హార్దిక్ కంట్రోల్ చేయకపోయుంటే పరిస్థితి వేరే ఉండేది. ఈ వీరోచిత శతకంతో బేతెల్ పలు భారీ రికార్డులను సొంతం చేసుకున్నాడు.టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక స్కోర్ (105) చేసిన ఆటగాడిగా, నిన్ననే ఫిన్ అలెన్ (100) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. బేతెల్కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇదే తొలి సెంచరీ. ప్రపంచంలో ఏ క్రికెటర్ తన తొలి ఫస్ట్క్లాస్, లిస్ట్-ఏ, టీ20 ఫార్మాట్ సెంచరీని అంతర్జాతీయ స్థాయిలో సాధించలేదు. చరిత్రలో జేకబ్ మొదటివాడు. ఇంగ్లండ్ తరఫున ప్రపంచకప్ టోర్నీల్లో సెంచరీలు చేసిన వారిలో జేకబ్ నాలుగో వాడు. వీరిలో రెండో అత్యధిక స్కోర్ జేకబ్దే. ఇంగ్లండ్ తరఫున టీ20 ప్రపంచకప్ల్లో అత్యధిక స్కోర్ రికార్డు అలెక్స్ హేల్స్ (116 నాటౌట్) పేరిట ఉంది.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్లో ఇరగదీయడంతో (89) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) సైతం మెరుపు ఇన్నింగ్స్లతో అలరించారు. కాగా, భారత్ మార్చి 8న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకుంటుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. -
IND Vs ENG: పరుగుల వరదతో ఫైనల్లోకి
భారత జట్టు స్కోరు 253 పరుగులు... ఇందులో 18 ఫోర్లు, 19 సిక్స్లు.. వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టూ కూడా ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు. ఇక గెలుపు లాంఛనమే, ఫైనల్ చేరడం ఖాయమనే అనిపించింది. కానీ ఇంగ్లండ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. భారీ స్కోరును చూసి బెదిరిపోకుండా ఆ జట్టు కూడా 21 ఫోర్లు, 15 సిక్స్లతో ఆఖరి వరకూ పోరాడింది... కానీ అదృష్టవశాత్తూ టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో చివరకు 7 పరుగులతో సూర్యకుమార్ బృందం గట్టెక్కింది. గత మ్యాచ్ తరహాలోనే సంజు సామ్సన్ మరో అద్భుత ఇన్నింగ్స్తో జట్టును నడిపించగా... ఇంగ్లండ్ తరఫున జాకబ్ బెతెల్ శతకం జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. చివర్లో కట్టుదిట్టమైన మన బౌలింగ్ భారత్ను ఫైనల్కు చేర్చింది. టి20 వరల్డ్ కప్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచేందుకు ఇక ఒకే ఒక్క విజయం భారత్కు కావాలి. ఆదివారం ఆఖరి సమరంలో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోవడమే టీమిండియాకు మిగిలింది. ముంబై: టి20 వరల్డ్ కప్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత జట్టు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి మన టీమ్ తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం వాంఖెడే మైదానంలో హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్ సమరంలో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (42 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా... శివమ్ దూబే (25 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడిపోయింది. జాకబ్ బెతెల్ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీతో పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. భారత్, కివీస్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. పోటీ పడి సిక్సర్లు బాది... ఓపెనర్ అభిషేక్ శర్మ (9) మరోసారి విఫలమైనా... సామ్సన్, ఇషాన్ భాగస్వామ్యంతో భారత్ దూసుకుపోయింది. ఆర్చర్ తొలి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సామ్సన్ అతని రెండో ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. మరోవైపు ఇషాన్ కూడా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 67 పరుగులకు చేరింది. డాసన్ ఓవర్లో భారీ సిక్స్తో 26 బంతుల్లో సామ్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, స్యామ్ కరన్ ఓవర్లో ఇద్దరూ కలిసి 20 పరుగులు రాబట్టారు. రెండో వికెట్కు 45 బంతుల్లో 97 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు ఇషాన్ను రషీద్ అవుట్ చేశాడు. అయితే స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతో బ్యాటింగ్లో ముందుగా దూబేను పంపిన భారత్ ఫలితం రాబట్టింది. రషీద్ ఓవర్లో 2 భారీ సిక్స్లతో అతను చెలరేగాడు. ఆ తర్వాత ఆర్చర్ ఓవర్లో మరో రెండు సిక్స్లు బాదిన సామ్సన్ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. సూర్యకుమార్ (11) ఎక్కువసేపు నిలవలేకపోగా, ఒవర్టన్ ఓవర్లో హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మూడు ఫోర్లు కొట్టాడు. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ వర్మ (7 బంతుల్లో 21; 3 సిక్స్లు) ఏకంగా మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 20వ ఓవర్లో పాండ్యా మరో 2 సిక్స్లు కొట్టడంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 76 పరుగులు సాధించడం విశేషం. టాపార్డర్ విఫలం... భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే ఫిల్ సాల్ట్ (5) వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ (17 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (7), టామ్ బాంటన్ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే బెతెల్ మాత్రం పోరాటపటిమ కనబర్చాడు. బుమ్రా బౌలింగ్లో సిక్స్ కొట్టిన అతను వరుణ్ చక్రవర్తి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. పాండ్యా ఓవర్లోనూ అతను వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. మరోవైపు విల్ జాక్స్ (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా బెతెల్కు సహకరించాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 39 బంతుల్లో 77 పరుగులు జోడించారు. జాక్స్ అవుటైన తర్వాత స్యామ్ కరన్ (18)తో కలిసి గెలిపించేందుకు బెతెల్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆఖరి 5 ఓవర్లలో 69 పరుగులు చేయాల్సిన దశలో రెండు ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బెతెల్... శివమ్ దూబే వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలు కోల్పోయింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆర్చర్ (19 నాటౌట్) మూడు సిక్స్లు బాదినా లాభం లేకపోయింది. 17 ఓవర్ల వరకు ఇంగ్లండ్దే పైచేయి... దాదాపు అసాధ్యమైన లక్ష్యమే అయినా ఇంగ్లండ్ పూర్తిగా తడబడలేదు. వికెట్లు పడుతున్నా పరుగుల వేగం మాత్రం తగ్గించలేదు. ఇరు జట్ల ఇన్నింగ్స్లను పోలిస్తే 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్దే పైచేయిగా ఉంది. 10 ఓవర్లలో స్కోర్లు 119, 119తో సమంగా ఉండగా 15 ఓవర్లలో 177, 185తో ఇంగ్లండ్ ముందంజలో ఉంది. 17 ఓవర్లలో 205/4, 209/5తో వారిదే పైచేయి. అయితే చివరి 3 ఓవర్లు తేడా చూపించాయి. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో తిలక్ కొట్టిన 3 సిక్స్లు కీలకంగా మారాయి. దూబే వేసిన ఆఖరి ఓవర్లో 30 పరుగులు కాపాడుకోవాల్సి వచ్చింది కాబట్టి భారత్ బతికిపోయింది. మరికొన్ని పరుగులు తక్కువగా ఉన్నా కష్టమయ్యేది. సామ్సన్ క్యాచ్ వదిలేసి... గత మ్యాచ్ తరహాలో ఈసారి కూడా సామ్సన్ దూకుడైన బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. అయితే అతనికి ఈసారి అదృష్టం కూడా కలిసి వచ్చింది. సామ్సన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆర్చర్ బౌలింగ్లో మిడాన్ వద్ద కెప్టెన్ బ్రూక్ అతి సునాయాస క్యాచ్ వదిలేశాడు. దానికి ఇంగ్లండ్ ఫలితం అనుభవించింది. క్యాచ్ చేజారడమే కాదు, ఈ క్షణం బౌలింగ్, ఫీల్డింగ్లో ఇంగ్లండ్ లయను బాగా దెబ్బ తీసింది. అప్పటి వరకు పరిస్థితి నియంత్రణలోనే ఉన్నా ఆ తర్వాత భారత్ పరుగుల వరద మొదలైంది. ఈ క్యాచ్ను బ్రూక్ పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. లైఫ్ లభించిన తర్వాత సామ్సన్ 36 బంతుల్లో 74 పరుగులు బాదాడు. ఆ ఒక్క ఓవర్లోనే... భారత్ ఇన్నింగ్స్లో ఆటగాళ్లంతా ఏ బౌలర్ను వదలకుండా ప్రతీ ఓవర్లో బౌండరీలతో చెలరేగారు. అయితే జాక్స్ వేసిన ఒక్క 14వ ఓవర్ మాత్రమే దీనికి మినహాయింపు. ఈ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా 7 పరుగులే ఇచ్చిన జాక్స్ తొలి బంతికే సామ్సన్ వికెట్ తీశాడు. అక్షర్ అదరహో... మైదానంలో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా సులువైన క్యాచ్ అందుకొని సాల్ట్ వెనుదిరిగేందుకు కారణమైన అక్షర్ ఆ తర్వాత అసాధారణ క్యాచ్తో బ్రూక్ను వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన తొలి బంతికే బ్రూక్ షాట్ ఆడగా బంతి ఫీల్డర్లపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. కానీ పాయింట్ నుంచి అక్షర్ వెనుదిరిగి చాలా దూరం పరుగెత్తాడు. బంతి కిందకు పడిపోతున్న దశలో చేతులూ పూర్తిగా చాపి అందుకున్న అతను నేలపై పడినా పట్టు కోల్పోలేదు. అనంతరం కీలక దశలో బౌండరీ వద్ద పరుగెడుతూ వచ్చి జాక్స్ క్యాచ్ను అందుకున్న అతను పట్టు కోల్పోయి బౌండరీ దాటుతున్నట్లు అనిపించిన సమయంలో దూబే వైపు విసిరాడు. ఈ క్యాచ్తో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గింది.5 టి20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్న ఐదో భారత క్రికెటర్ సంజు సామ్సన్. గతంలో యువరాజ్ సింగ్ (2007లో ఆ్రస్టేలియాపై సెమీఫైనల్లో), ఇర్ఫాన్ పఠాన్ (2007లో పాకిస్తాన్పై ఫైనల్లో), విరాట్ కోహ్లి (2014లో దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో; 2024లో దక్షిణాఫ్రికాపై ఫైనల్లో), అక్షర్ పటేల్ (2024లో ఇంగ్లండ్పై సెమీఫైనల్లో) ఈ ఘనత సాధించారు.4 ఐసీసీ టోర్నీల్లో అత్యధికంగా నాలుగోసారి భారత్–న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.4 టి20 ప్రపంచకప్లో భారత్ నాలుగోసారి ఫైనల్కు చేరింది. 2007లో, 2024లో విజేతగా నిలిచిన భారత్ 2014లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది.105 టి20 వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా బెతెల్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఫిన్ అలెన్ (100 నాటౌట్) స్కోరును బెతెల్ రెండో సెమీఫైనల్లో అధిగమించాడు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 89; అభిషేక్ (సి) సాల్ట్ (బి) జాక్స్ 9; ఇషాన్ కిషన్ (సి) జాక్స్ (బి) రషీద్ 39; దూబే (రనౌట్) 43; సూర్యకుమార్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 11; పాండ్యా (రనౌట్) 27; తిలక్ (బి) ఆర్చర్ 21; అక్షర్ (నాటౌట్) 2; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–20, 2–117, 3–160, 4–190, 5–212, 6–236, 7–251. బౌలింగ్: ఆర్చర్ 4–0–61–1, జాక్స్ 4–0–40–2, ఒవర్టన్ 3–0–36–0, స్యామ్ కరన్ 4–0–53–0, ఆదిల్ రషీద్ 4–0–41–2, లియామ్ డాసన్ 1–0–19–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) పాండ్యా 5; బట్లర్ (బి) వరుణ్ 25; హ్యారీ బ్రూక్ (సి) అక్షర్ పటేల్ (బి) బుమ్రా 7; బెతెల్ (రనౌట్) 105; బాంటన్ (బి) అక్షర్ 17; జాక్స్ (సి) శివమ్ దూబే (బి) అర్ష్ దీప్ 35; స్యామ్ కరన్ (సి) తిలక్ వర్మ (బి) హార్దిక్ పాండ్యా 18; ఒవర్టన్ (నాటౌట్) 2; ఆర్చర్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–64, 4–95, 5–172, 6–222, 7–225. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–51–1, హార్దిక్ పాండ్యా 4–0–38–2, జస్ప్రీత్ బుమ్రా 4–0–33–1, వరుణ్ 4–0–64–1, అక్షర్ పటేల్ 3–0–35–1, శివమ్ దూబే 1–0–22–0. -
ఏకైక ‘టెస్టు’కు భారత్ రె‘ఢీ’
పెర్త్: ఆ్రస్టేలియా పర్యటనను టి20 సిరీస్ విజయంతో మొదలుపెట్టిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్ మొదలవడంతోనే కంగారు పడింది. అన్నీ ఓడి వైట్వాష్ అయ్యింది. ఇప్పుడు హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్కు మిగిలిందల్లా ఈ ‘టెస్టే’. నాలుగు రోజులపాటు జరిగే ఏకైక డే అండ్ నైట్ పింక్బాల్ టెస్టును గెలుచుకొని అత్యంత సంతృప్తికరంగా స్వదేశం చేరవచ్చు. ఓవరాల్ చాంపియన్షిప్లో ఇరు జట్లు చెరో సిరీస్ గెలుచుకున్నాయి. అయితే పాయింట్ల పరంగా చూస్తే భారత అమ్మాయిలు బాగా వెనుకబడి ఉన్నారు. పరిమిత ఓవర్ల మ్యాచ్ విజేతకు 2 పాయింట్లు లభించడంతో ఒక టి20, అన్నీ వన్డేలు గెలుపొందిన ఆ్రస్టేలియా 8 పాయింట్లతో పైచేయిగా ఉంది. రెండు టి20 విజయాలతో భారత్ ఖాతాలో 4 పాయింట్లే ఉన్నాయి. ఇప్పుడు టెస్టు గెలిస్తేనే 4 పాయింట్లు వస్తాయి. అప్పుడే భారత్ 8–8 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్షిప్ను పంచుకుంటుంది. ఒకవేళ ‘డ్రా’ చేసుకున్నా... ఆతిథ్య జట్టుకే ట్రోఫీ దక్కుతుంది. అజేయమే కానీ... ఇక్కడి వన్డే సిరీస్ను పక్కనబెడితే సంప్రదాయ ఫార్మాట్లో హర్మన్ బృందం అజేయంగా ఉంది. 2023 నుంచి ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టుల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలపై వరుసగా గెలిచింది. అయితే ఈ మూడు సొంతగడ్డపై జరిగాయి. బ్యాటింగ్లో స్మృతి మంధాన ఫామ్లో ఉంది. ప్రతీకతో కలిసి చక్కని ఆరంభం ఇవ్వగలిగితే జెమీమా, హర్మన్, షఫాలీ వర్మ మిగతా బ్యాటింగ్ భారాన్ని పంచుకుంటారు. దీప్తి, రిచా ఘోష్లు కూడా ఆతిథ్య బౌలింగ్ను దీటుగా ఎదుర్కొంటే బ్యాటింగ్లో ఏ బెంగా ఉండదు. బౌలింగే మెరుగు పడాల్సి ఉంది. క్రాంతి, స్నేహ్ రాణా, సయాలీ, కాశీ్వలు సమష్టిగా రాణించాలి. ఆత్మవిశ్వాసంతో ఆసీస్ ఓడినా, గెలిచినా... సొంతగడ్డపై ఆ్రస్టేలియా దుర్బేధ్యమైన ప్రత్యర్థి. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఇప్పటివరకు జరిగిన మూడు ‘పింక్ బాల్’ టెస్టులు ఇక్కడే జరిగాయి. డేనైట్ టెస్టులో ఈ జట్టుకున్నంత అనుభవం ఇంకే జట్టుకు లేదు. ఫోబీ లిచ్ఫీల్డ్, జార్జియా వోల్, ఎలీస్ పెరీ, కెప్టెన్ అలీసా హీలీ సొంతగడ్డపై తప్పకుండా రాణిస్తారు. తాలియా, ల్యూసీ హామిల్టన్, అలనా కింగ్, డార్సీ బ్రౌన్లతో కూడిన బౌలింగ్ దళమైతే మనకంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్ తర్వాత అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్న అలీసా హీలీకి గెలుపు బహుమతి అందించాలని ఆసీస్ బృందం భావిస్తోంది. పిచ్, వాతావరణం ఇది పోటాపోటీ పిచ్. నాణ్యమైన బౌలింగ్కు... పాతుకుపోతే బ్యాటింగ్కు సమాన అవకాశముంది. దేశవాళీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో సీజన్ అంతా అదే జరిగింది. పచ్చికతో తొలిరోజు బౌలింగ్కు బాగా అనుకూలించడంతో బ్యాటర్లకు కష్టాలు తప్పవు. పిచ్ పాతబడే కొద్దీ స్పిన్నర్లు మాయ చేస్తారు. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, ప్రతీక, షఫాలీ, జెమీమా, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్జోత్/సయాలీ, కాశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్. ఆ్రస్టేలియా: అలీసా హీలీ (కెప్టెన్ ), ఫోబీ లిచ్ఫీల్డ్, జార్జియా వోల్, ఎలీస్ పెరీ, అనాబెల్ సదర్లాండ్, బెత్ మూనీ, యాష్లీ గార్డ్నర్, తాలియా, అలానా కింగ్, ల్యూసీ హామిల్టన్, డార్సీ బ్రౌన్. -
ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఒక ఇంటి వాడయ్యాడు. 26 ఏళ్ల అర్జున్ వివాహం గురువారం సానియా చందోక్తో ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన దేశంలోని ప్రముఖులంతా ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుటుంబం, భారత మాజీ క్రికెటర్లు ధోని, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, కైఫ్, జహీర్ ఖాన్, ఐసీసీ చైర్మన్ జై షా, సినీ తారలు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ తదితరులంతా అతిథులుగా పెళ్లిలో పాల్గొన్నారు. ఆల్రౌండర్ అర్జున్ దేశవాళీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 77 మ్యాచ్లు ఆడాడు. -
IND Vs ENG: నరాలు తెగే ఉత్కంఠ: టీమిండియా ధనాధన్ షో.. .. దర్జాగా ఫైనల్కు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి కూడా ఫైనల్కు చేరి సత్తా చాటింది.253 పరుగులుముంబైలోని వాంఖడేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి ధనాధన్ దంచికొట్టాడు. 42 బంతుల్లో 89 పరుగులతో ఈ వికెట్ కీపర్బ్యాటర్ అదరగొట్టాడు.వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39) కూడా వేగంగా ఆడగా.. ఆల్రౌండర్లు శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపులు మెరిపించారు. తిలక్ వర్మ (7 బంతుల్లో 21) సైతం రాణించాడు.ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్కు ఒక వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5), వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (7) వికెట్లు కోల్పోయింది.పట్టువదలని విక్రమార్కుడిలాఇక టామ్ బాంటన్ (17) కాసేపు నిలబడగా.. జోస్ బట్లర్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా జేకబ్ బెతెల్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం బాది.. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) రికార్డు సమం చేశాడు.నరాలు తెగే ఉత్కంఠఅదే జోరు కొనసాగిస్తూ బెతెల్ భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లలో ఇంగ్లండ్ విజయ సమీకరణం 39 పరుగులుగా మారింది.అయితే, హార్దిక్ పాండ్యా బౌలింగ్లో పందొమ్మిదో ఓవర్లో సిక్స్ బాది బెతెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లోనే 102 పరుగులు సాధించాడు. దీంతో ఉత్కంఠ పెరిగింది. అయితే, పాండ్యా మూడో బంతికి సామ్ కర్రాన్ (18)ను అవుట్ చేశాడు. పాండ్యా బౌలింగ్లో కర్రాన్ బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ అద్భుతంగా క్యాచ్పట్టాడు.ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోతన ఓవర్లో పాండ్యా 9 పరుగులే ఇవ్వగా.. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ గెలుపునకు 30 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతిని శివం దూబేకు ఇచ్చాడు. అతడి ఓవర్లో తొలి బంతికే బెతెల్ (105) రనౌట్ అయ్యాడు. దీంతో ఐదు బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా.. ఆర్చర్ ఆఖరి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టినా లాభం లేకుండా పోయింది. ఇంగ్లండ్ 22 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్తో ట్రోఫీ కోసం సూర్యకుమార్ సేన తలపడుతుంది. Next stop: FINAL! 😍A high-scoring thriller, but #TeamIndia hold their nerve and book a spot in the final! 🔥ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/PQfdlxUEv7— Star Sports (@StarSportsIndia) March 5, 2026 స్కోర్లు: భారత్ - 253/7(20)ఇంగ్లండ్ - 246/7(20)ఫలితం: ఏడు పరుగుల తేడాతో భారత్ గెలుపు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత సాధించింది. పురుషుల పొట్టి ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.జింబాబ్వేపై 256 పరుగులుభారత జట్టు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సూపర్-8 దశలో జింబాబ్వేపై 256 పరుగులు సాధించిన భారత జట్టు.. తాజాగా గురువారం నాటి మ్యాచ్లోనూ 250కి పైగా స్కోరు నమోదు చేసింది.పొట్టి క్రికెట్లో తొలి జట్టుగాముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 82) అదరగొట్టగా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27), తిలక్ వర్మ (7 బంతుల్లో 21) మెరుపులు మెరిపించారు.Another must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఫలితంగా టీమిండియాకు ఈ మేర 253 పరుగుల స్కోరు సాధ్యమైంది. ఈ క్రమంలోనే పొట్టి క్రికెట్లో అత్యధిక సార్లు 250 ప్లస్ స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. తద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250కి పైగా పరుగులు సాధించిన జట్లు👉టీమిండియా- ఆరు సార్లు👉సన్రైజర్స్ హైదరాబాద్- ఐదు సార్లు👉వెస్టిండీస్- మూడు సార్లు👉జింబాబ్వే- మూడు సార్లు👉సర్రే- మూడు సార్లు.చదవండి: IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి! -
పాకిస్తాన్ క్రికెట్లో కీలక పరిణామం.. ఈసారి..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. సెలక్టర్ పదవికి అలీం దర్ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో ఇద్దరిని సెలక్షన్ కమిటీలో చేర్చింది. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్ జట్టు విఫలమైన విషయం తెలిసిందే.సెమీ ఫైనల్ చేరకుండానేగ్రూప్ దశలో ఫర్వాలేదనిపించిన సల్మాన్ ఆఘా బృందం.. సూపర్-8లో మాత్రం చేతులెత్తేసింది. ఫలితంగా సెమీ ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై.. ముఖ్యంగా సీనియర్లు బాబర్ ఆజం (Babar Azam), షాబాద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిదిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.అలీం దర్ రాజీనామాఈ క్రమంలో సెలక్టర్, మాజీ అంపైర్ అలీం దర్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. శ్రీలంకలో తమ మ్యాచ్ల దృష్ట్యా హెడ్కోచ్ మైక్ హసన్ (Mike Hesson), మరో సెలక్టర్ ఆకిబ్ జావేద్ బాబర్, షాదాబ్లను ఆడించాలని పట్టుపట్టగా.. అలీం మాత్రం వ్యతిరేకించినట్లు సమాచారం.అంతేకాదు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ను ఎంపిక చేయాలని అలీం వాదించగా.. మిగతా వారు అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలతో నొచ్చుకున్న అలీం దర్ తన పదవికి రాజీనామా చేశాడు.సెలక్టర్లు మాజీ కెప్టెన్లు ఈ నేపథ్యంలో పీసీబీ ఇద్దరిని జాతీయ సెలక్షన్ కమిటీలో చేర్చింది. మాజీ కెప్టెన్లు మిస్బా ఉల్ హక్, సర్ఫరాజ్ అహ్మద్లకు మెన్స్ సెలక్షన్ కమిటీలో చోటు ఇచ్చింది. కాగా ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్లతో కలిసి వీరిద్దరు సెలక్టర్లుగా పనిచేయనున్నారు. కాగా అలీం దర్ గతేడాది అక్టోబరులో పాక్ పురుషుల జట్టు కెప్టెన్గా వచ్చాడు. అయితే, హెడ్కోచ్ మైక్ హసన్ అతి జోక్యం, ఆకిబ్ జావేద్ అతడికే వంతపాడిన నేపథ్యంలో విసుగు చెంది రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా జియో సూపర్ వెల్లడించింది.గతంలో ఇలా..ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ అహ్మద్ గతంలో పాకిస్తాన్ అండర్-19 జట్టు పాక్ షాహీన్స్కు మెంటార్గా వ్యవహరించాడు. మరోవైపు.. మిస్బా ఉల్ హక్ గతంలో పాక్ జట్టు హెడ్కోచ్గా, చీఫ్ సెలక్టర్గా బాధ్యతలే నిర్వర్తించాడు. అంతేకాదు.. పీసీబీ క్రికెట్ టెక్నికల్ కమిటీలో సభ్యుడిగానూ సేవలు అందించాడు. ఇప్పుడు మరోసారి సెలక్టర్గా తిరిగి వచ్చాడు. ఇక బాబర్, షాదాబ్ విఫలమైన సంగతి తెలిసిందే. చదవండి: T20 WC 2026: రషీద్ ఖాన్పై వేటు.. అఫ్గనిస్తాన్కు కొత్త కెప్టెన్ -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ అదరగొట్టాడు. ఇంగ్లండ్ బౌలింగ్ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మూడో ఓవర్లో తనకు లభించిన లైఫ్ను సద్వినియోగం చేసుకున్న ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు.Ohhhhh, Harry Brook! 😳Sanju Samson makes the most of the lifeline and sends it into the stands! 🚀ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/zOWfIEAdUv— Star Sports (@StarSportsIndia) March 5, 2026మరోసారి సెంచరీ మిస్అయితే, దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు ఫామ్లేమితో సతమతమైన సంజూ ఓపెనర్గా జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 ఓపెనర్, వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ అతడి స్థానాన్ని భర్తీ చేసి అదరగొట్టాడు.అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరం కాగా.. తొలిసారి సంజూకు వరల్డ్కప్ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఈ మ్యాచ్లో వేగంగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటయ్యాడు.అనంతరం సూపర్-8 జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా తిరిగి తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. 15 బంతుల్లో 24 రన్స్ చేయగలిగాడు. అయినప్పటికీ మేనేజ్మెంట్ ఈసారి సంజూపై నమ్మకం ఉంచింది. ఈ క్రమంలో వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సంజూ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ను గెలిపించి సెమీ ఫైనల్కు చేర్చాడు. అయితే, మూడు పరుగులతో అక్కడ సెంచరీ మిస్సయ్యాడు.8 ఫోర్లు, 7 సిక్స్లు కొట్టితాజాగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లోనూ సంజూ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్లో పద్నాలుగో ఓవర్లో విల్ జాక్స్ బౌలింగ్కు దిగాడు. అతడి బౌలింగ్లో తొందరపడి షాట్కు యత్నించిన సంజూ.. ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లు కొట్టి 89 పరుగులు సాధించి.. సెంచరీకి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.Just Hardik Pandya things at the Wankhede Stadium! 🔥🚨 RECORD ALERT: 19 sixes by #TeamIndia - the most in an innings in ICC Men's T20 World Cup history!ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/JdGVdpz1B4— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ (9)తో కలిసి తొలి వికెట్కు 20 పరుగులు జోడించిన సంజూ.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (39)తో కలిసి రెండో వికెట్కు 45 బంతుల్లో 97 పరుగులు, శివం దూబేతో కలిసి మూడో వికెట్కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది.చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్గా సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు👉సంజూ శాంసన్- 16 సిక్స్లు- 2026లో👉రోహిత్ శర్మ- 15 సిక్స్లు- 2024లో👉శివం దూబే- 15 సిక్స్లు- 2026లో👉ఇషాన్ కిషన్- 14 సిక్స్లు- 2026లో👉హార్దిక్ పాండ్యా- 14 సిక్స్లు- 2026లో👉యువరాజ్ సింగ్- 12 సిక్స్లు- 2007లో.చదవండి: IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి! -
IND vs ENG: సెమీస్లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్తో కీలక సెమీ ఫైనల్లోనూ పేలవ ఆట తీరుతో తేలిపోయాడు. వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా అభిమానులు సైతం అభిషేక్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టీ20 ప్రపంచకప్-2026 ఆరంభం నుంచి అభిషేక్ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ డకౌట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. సూపర్-8 దశలో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్లో పదిహేను పరుగులకే పెవిలియన్ చేరిన అభిషేక్.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్లో మాత్రం అర్ధ శతకంతో రాణించాడు.పాత కథే పునరావృతంఅయితే, సూపర్-8లో కీలకమైన వెస్టిండీస్తో మ్యాచ్లో మరోసారి తేలిపోయాడు అభిషేక్ శర్మ. పట్టుమని పది పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్లో అతడిని ఆడించే విషయంలో పునరాలోచన చేయాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, యాజమాన్యం మాత్రం అభిషేక్పై నమ్మకం ఉంచగా.. అతడు పాత కథనే పునరావృతం చేశాడు.తొమ్మిది పరుగులే చేసిముంబై వేదికగా గురువారం ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఏడు బంతుల్లో రెండు ఫోర్లు బాది కేవలం తొమ్మిది పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఓవర్లో విల్ జాక్స్ బంతితో రంగంలోకి దిగి ఆఖర్లో స్లోబాల్ వేశాడు. ఈ క్రమంలో భారీ షాట్కు యత్నించిన అభిషేక్.. బంతిని గాల్లోకి లేపగా డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన ఫిల్ సాల్ట్ బంతిని ఒడిసిపట్టాడు. దీంతో అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. మరోసారి ఆఫ్ స్పిన్నర్ చేతికి చిక్కి నిరాశగా వెనుదిరిగాడు. ఇప్పటి వరకు అభిషేక్ శర్మ ఈ టోర్నీలో చేసిన పరుగులు 89. వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా అభిమానులు అభిషేక్పై భగ్గుమంటున్నారు. ‘‘ నువ్విక మారవా?.. అతడిని జట్టు నుంచి తీసేయండి’’ అని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు.చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట -
'మమ్మల్ని పంపించండి మహాప్రభో'
టి20 ప్రపంచకప్లో వెస్టిండీస్ జట్టు తమ చివరి మ్యాచ్ మార్చి 1న ఆడింది. క్వార్టర్ ఫైనల్కు చేరుకున్న విండీస్ టీమ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో టీమిండియాతో తలపడి ఓటమి పాలయింది. వరల్డ్కప్లో తమ పోరాటం ముగియడంతో స్వదేశానికి పయనం కావాల్సిన విండీస్ జట్టు అనూహ్యంగా ఇండియాలో చిక్కుబడి పోయింది. ఐదు రోజుల నుంచి కోల్కతాలోనే పడిగాపులు కాస్తోంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ ప్రధాన కోచ్ డారెన్ సామీ తన బాధను ఎక్స్ వేదికగా వ్యక్తీకరించాడు.తమను ఎప్పుడు స్వదేశానికి పంపిస్తారో చెప్పాలని డారెన్ సామీ (Daren Sammy) వేడుకున్నాడు. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఈరోజా, వచ్చే వారమా అనేదానైనా చెప్పాలని విజ్ఞప్తి చేశాడు. ఇప్పటికే 5 రోజులు గడిచిపోయిందని వాపోయాడు. కాగా, తమ జట్టు సభ్యులు భారత దేశంలో సురక్షితంగా ఉన్నారని క్రికెట్ వెస్టిండీస్ (CWI) అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అంతర్జాతీయ గగనతల నియంత్రణల కారణంగా తమ జట్టు స్వదేశానికి రాలేకపోయిందని తెలిపింది. ఇండియాలో తమ టీమ్కు తగిన వసతి కల్పించారని పేర్కొంది.పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావరణం కారణంగా గగనతలంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో గల్ప్ దేశాలతో సహా పలు మార్గాల్లో అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా విమాన ప్రయాణాలపై అనిశ్చితి కొనసాగుతోంది. జింబాబ్వే క్రికెట్ జట్టు కూడా ఇదే రకమైన సమస్యను ఎదుర్కొంది.జట్టు కొంచెం ఆలస్యంగా స్వదేశానికి వచ్చినా ఫర్వాలేదని, క్రికెటర్ల భద్రతకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని క్రికెట్ వెస్టిండీస్ స్పష్టం చేసింది. ఆటగాళ్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో సమన్వయం చేసుకుంటున్నామని వివరించింది. తొందరలోనే వారికి స్వదేశానికి తీసుకొస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.చదవండి: 'థ్యాంక్స్ సంజు సామ్సన్.. ఇదీ రియల్ కేరళ స్టోరీ' -
T20 WC 2nd Semis: ఇంగ్లండ్పై భారత్ గెలుపు
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో కీలక పోరు... రెండో సెమీ ఫైనల్లో భారత్- ఇంగ్లండ్ అమీతుమీ... ముంబైలోని వాంఖడే వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్... ఫలితంగా బ్యాటింగ్కు దిగిన భారత్.భారత్ భారీ స్కోరునిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ భారీ హాఫ్ సెంచరీ (42 బంతుల్లో 89) బాదగా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), తిలక్ వర్మ (7 బంతుల్లో 21),హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్తో అలరించారు.UPDATES: ఇంగ్లండ్పై భారత్ గెలుపులక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పై టీమిండియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి కూడా ఫైనల్కు చేరి సత్తా చాటింది.ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్దూబే బౌలింగ్లో బెతల్ రన్ ఔట్ (105) అయ్యాడు.పదిహేడు ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 209-515 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 185-5కర్రాన్ 5, బెతెల్ 81 పరుగులతో ఉన్నారు.13.6: ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్అర్ష్దీప్ బౌలింగ్లో జాక్స్ (35) ఇచ్చిన క్యాచ్ను అద్భుతంగా పట్టిన శివం దూబే.పదమూడు ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 160-4విజయానికి 42 బంతుల్లో 94 పరుగులు కావాలి. బెతెల్ 65, విల్ జాక్స్ 35 పరుగులతో ఉన్నారు.పది ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 119-4నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్7.3: అక్షర్ పటేల్ బౌలింగ్లో టామ్ బాంటన్ (5 బంతుల్లో 17) బౌల్డ్. క్రీజులోకి విల్ జాక్స్. స్కోరు: 95-4(7.3).బెతెల్ 39 పరుగులతో ఉన్నాడు. విజయానికి 75 బంతుల్లో 159 పరుగులు కావాలి.మూడో వికెట్ డౌన్5.5: వరుణ్ చక్రవర్తి అద్భుత రీతిలో బట్లర్ (25)ను బౌల్డ్ చేశాడు. స్కోరు: 64-3(5.5). బెతెల్ 26 పరుగులతో ఉన్నాడు.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్4.1: బుమ్రా బౌలింగ్లో హ్యారీ బ్రూక్ (7) ఇచ్చిన క్యాచ్ను అక్షర్పటేల్ అద్భుత రీతిలో అందుకున్నాడు. ఫలింగా ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. జేకబ్ బెతెల్ క్రీజులోకి రాగా.. బట్లర్ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 38-2(4.2).తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్1.1: హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఫిల్ సాల్ట్ (5) అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి అవుట్. క్రీజులోకి బ్రూక్. బట్లర్ ఎనిమిది పరుగులతో ఉన్నాడు. స్కోరు: 14-1(1.2)భారత్ స్కోరు: 253-7ఏడో వికెట్ డౌన్19.5: ఆఖరి ఓవర్ఐదో బంతికి పాండ్యా రనౌట్ (12 బంతుల్లో 27). వరుణ్ చక్రవర్తి క్రీజులోకి రాగా.. అక్షర్ పటేల్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్18.5: తిలక్ వర్మ రూపంలో ఆరో వికెట్ కోల్పోయిన భారత్. ఆర్చర్ బౌలింగ్లో తిలక్ బౌల్డ్ (7 బంతుల్లో 21). అక్షర్ క్రీజులోకి రాగా.. పాండ్యా 14 రన్స్తో ఉన్నాడు. స్కోరు: 237-6(19)ఐదో వికెట్ కోల్పోయిన భారత్17.3: సామ్ కర్రాన్ బౌలింగ్లో సింగిల్కు యత్నించి.. హార్దిక్ పాండ్యాతో సమన్వయ లోపం కారణంగా దూబే (25 బంతుల్లో 43) రనౌట్. తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ డౌన్15.4: ఆదిల్ రషీద్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ స్టంపౌట్. స్కోరు: 190-4 (16). హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. దూబే35 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 177-3సూర్య 5, దూబే 28 పరుగులతో ఉన్నారు.సంజూ శాంసన్ అవుట్13.1: సంజూ శాంసన్ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. వెస్టిండీస్తో మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్తో సెమీస్లో 89 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. విల్ జాక్స్బౌలింగ్లో తొందరపడి షాట్కు యత్నించి.. ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లు కొట్టి 89 పరుగులు రాబట్టాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. దూబే 18 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 160-3(13.1)రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా9.3: మెరుపు ఇన్నింగ్స్తో అలరించిన ఇషాన్ కిషన్.. ఆదిల్ రషీద్ బౌలింగ్లో విల్ జాక్స్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 18 బంతుల్లో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు. శివం దూబే క్రీజులో వచ్చాడు. సంజూ 66 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 117-2(9.3). 8.3: వంద పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియాAnother must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026సంజూ హాఫ్ సెంచరీవెస్టిండీస్తో మ్యాచ్లో భారీ హాఫ్ సెంచరీ బాదిన సంజూ.. తాజా మ్యాచ్లోనూ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. డాసన్ బౌలింగ్లో సిక్స్ బాది మరీ ఈ మైలురాయి చేరుకున్నాడు.పవర్ ప్లేలో భారత్ స్కోరు: 67-1(6)సంజూ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 41 పరుగులతో ఉండగా.. ఇషాన్ కిషన్ 9 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు.తొలి వికెట్ డౌన్1.6: విల్ జాక్స్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (7 బంతుల్లో 9) అవుట్. సంజూ 11 పరుగులతో ఉండగా.. ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 20-1(2)సైలెంట్ చేసేస్తాంటాస్ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ బాగుంది. వికెట్ పాతబడే కొద్దీ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని అనుకుంటున్నాం. అందుకే మేము ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాము.ఒక మార్పుతో బరిలోకిటీమిండియాకు ఈ పిచ్పై ఆడిన అనుభవం మాకంటే ఎక్కువే. అయితే, టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. టీమిండియా మద్దతుదారులు నిశ్శబ్దంగా ఉండేలా చేస్తాం. రెహాన్ అహ్మద్ స్థానంలో ఓవర్టన్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.అదే జట్టు..ఇక టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘సెమీ ఫైనల్. బిగ్ గేమ్. మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. ఇక్కడ అంతగా డ్యూ ఉంటుందని అనుకోవడం లేదు. పిచ్ బాగుంది. క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్కు ధన్యవాదాలు. గత మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.Harry Brook calls it right, and England will bowl first in the semi-final! ✌️What do you make of the decision? 👀ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/Zabmv2MsVT— Star Sports (@StarSportsIndia) March 5, 2026భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట -
T20 WC: రషీద్ ఖాన్పై వేటు.. అఫ్గనిస్తాన్కు కొత్త కెప్టెన్
అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్పై వేటు పడింది. టీ20 కెప్టెన్సీ నుంచి అఫ్గన్ క్రికెట్ బోర్డు (ACB) అతడిని తొలగించింది. రషీద్ ఖాన్ స్థానంలో ఓపెనింగ్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ను కొత్త కెప్టెన్గా నియమించింది. ఇందుకు సంబంధించి ఏసీబీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి ఇబ్రహీం జద్రాన్ అఫ్గన్ టీ20 జట్టు సారథిగా (T20I New Captain) వ్యవహరిస్తాడని తెలిపింది. ఈ సందర్భంగా రషీద్ ఖాన్ (Rashid Khan) కెప్టెన్సీలో జట్టు సాధించిన చిరస్మరణీయ విజయాన్ని ఏసీబీ ప్రస్తావించింది.గుర్తుండిపోయే విజయాలు‘‘అఫ్గనిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్గా రషీద్ ఖాన్ పదవీ కాలంలో జట్టు గుర్తుండిపోయే విజయాలు సాధించింది. ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఏకంగా సెమీ ఫైనల్కు చేరుకుంది. అయితే, ఏసీబీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యంలో మార్పులు తీసుకువచ్చింది.కొత్త హెడ్కోచ్ వచ్చారు. అదే విధంగా కెప్టెన్ను కూడా మార్చాలని నిర్ణయించుకున్నాం. రషీద్ ఖాన్ డిప్యూటీగా పనిచేసిన ఇబ్రహీం జద్రాన్కు పగ్గాలు అప్పగించాము. రషీద్ ఖాన్ సేవలను మేము ప్రశంసిస్తున్నాం. అలాగే ఇబ్రహీం జద్రాన్ తన కొత్త,అతి ముఖ్యమైన పాత్రలో రాణించాలని కోరుకుంటున్నాం’’ అంటూ అఫ్గనిస్తాన్ చీఫ్ సెలక్టర్ అహ్మద్ షా సలీమనిఖిల్ ప్రకటన విడుదల చేశాడు.కాగా మార్చి 13, 15, 17 తేదీల్లో అఫ్గనిస్తాన్- శ్రీలంక మధ్య షార్జాలో మూడు టీ20లు, దుబాయ్లో మార్చి 20, 22, 25 మూడు వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించి జట్లను ఏసీబీ తాజాగా ప్రకటించింది.టీ20 ప్రపంచకప్-2026లో అఫ్గనిస్తాన్ వైఫల్యంగత ఎడిషన్ ప్రభావంతో ఓ మోస్తరు అంచనాలతో బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్ ఈసారి నిరాశపరిచింది. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్, యూఏఈ, కెనడా జట్లతో పోటీపడిన అఫ్గన్ జట్టు.. నాలుగింట కేవలం రెండు విజయాలే సాధించింది. ఫలితంగా సూపర్-8కు చేరకుండానే నిష్క్రమించింది.ఈ క్రమంలో జొనాథన్ ట్రాట్ హెడ్కోచ్గా తప్పుకోగా.. స్థానంలో కొత్త హెడ్ కోచ్గా రిచర్డ్ పైబస్ను నియమించింది ఏసీబీ. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా కోచ్గా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడు.శ్రీలంకతో టీ20 సిరీస్కు అఫ్గన్ జట్టుఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నూర్ రెహమాన్ (వికెట్ కీపర్), సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, షరాఫుద్దీన్ అష్రఫ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రహ్మాన్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్శ్రీలంకతో వన్డే సిరీస్కు అఫ్గన్ జట్టుహష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రామ్ అలీఖిల్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదీఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోటీ, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్, బిలాల్ సమీ. -
T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట
జింబాబ్వే క్రికెట్ జట్టుకు భారీ ఊరట లభించింది. ఎట్టకేలకు స్వదేశానికి వెళ్లే మార్గం సుగమమైంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే చిరస్మరణీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే.ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించిభారత్- శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీలో గ్రూప్-బి నుంచి శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్లతో కలిసి జింబాబ్వే పోటీ పడింది. అనూహ్య రీతిలో మాజీ చాంపియన్లు ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించి గ్రూప్ టాపర్గా సూపర్-8 చేరింది. అయితే, కీలక దశలో వెస్టిండీస్, టీమిండియా, సౌతాఫ్రికా చేతిలో ఓడి నిష్క్రమించింది.యుద్ధం కారణంగాఈ నేపథ్యంలో మార్చి 2న భారత్ నుంచి జింబాబ్వే జట్టు స్వదేశానికి పయనం కావాల్సింది. కానీ ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో గల్ఫ్ వేదికగా ప్రయాణించాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఫలితంగా జింబాబ్వే జట్టు బుధవారం వరకు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.ఈ క్రమంలో బ్యాచ్ల వారీగా భారత్ను వీడేందుకు జింబాబ్వే సిద్ధమైనట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. బుధవారం తొలి బ్యాచ్ స్వదేశానికి పయనం కాగా.. శుక్రవారం ఆఖరి బ్యాచ్ ఇండియా నుంచి బయల్దేరుతుందని తెలిపింది.అందుకే విడతల వారీగాఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని పేర్కొంది. తగినన్ని విమానాలు అందుబాటులో లేనందున విడతల వారీగా ఆటగాళ్లు జింబాబ్వేకు చేరుకుంటాడని బోర్డు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం జింబాబ్వే జట్టు దుబాయ్ మీదుగా ఎమిరేట్స్ ఫ్లైట్లో వెళ్లాల్సింది. అయితే, యుద్ధ ప్రభావం కారణంగా అదిస్ అబాబా, ఇథియోపియా మీదుగా హరారేకు వారు చేరుకోనున్నట్లు సమాచారం. మరోవైపు.. వెస్టిండీస్ క్రికెట్ జట్టు సైతం భారత్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: మొయిన్ అలీపై నిషేధం..! -
తప్పుడు ఫీల్డర్.. సూర్య ఇలా చేస్తాడా?: భారత మాజీ కోచ్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్తో గురువారం అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం ఇందుకు వేదిక.అజేయంగా సూపర్-8కుఇక టోర్నీ ఆరంభం నుంచి టీమిండియా మెరుగ్గానే ఆడింది. ముఖ్యంగా గ్రూప్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్లూ గెలిచి అజేయంగా సూపర్-8కు చేరింది. అయితే, ఆ తర్వాత భారత జట్టు సౌతాఫ్రికా చేతిలో డెబ్బై ఆరు పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో తమ అతి పెద్ద పరాజయాన్ని నమోదు చేసింది.ఫీల్డింగ్పై విమర్శలు అనంతరం జింబాబ్వే, వెస్టిండీస్లపై గెలిచిన సూర్యకుమార్ సేన సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, విండీస్తో మ్యాచ్లో భారత్ ఫీల్డింగ్ చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెమీస్లోనూ ఇలాంటి తప్పులు పునరావృతం చేస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.కాగా విండీస్తో మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి రనౌట్ చాన్స్ మిస్ చేయగా.. అభిషేక్ శర్మ రెండు, తిలక్ వర్మ ఒక క్యాచ్ జారవిడిచారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ మాజీ కోచ్ ఆర్. శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.తప్పుడు ఫీల్డర్.. సూర్య ఇలాంటి తప్పు చేస్తాడా?‘‘బయటి నుంచి చూసి వరుణ్ ఫీల్డింగ్ పొజిషన్ గురించి నేను ఏదైనా మాట్లాడవచ్చు. అయితే, ఆ బంతిని వేసిన అర్ష్దీప్ సింగ్ కోణం నుంచి చూస్తే.. డీప్ స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్, షార్ట్ ఫైన్ లెగ్ కంటే వరుణ్ షార్ట్ కవర్ రీజియన్లో ఉండటమే మంచిదని అనుకున్నారేమో!అయినా సూర్యలాంటి తెలివైన కెప్టెన్లు ఇలాంటి ఎలిమెంటరీ స్కూల్ తరహా తప్పులు చేయకూడదు. తప్పుడు ఫీల్డర్ను తప్పుడు ఏరియాలో పెట్టినట్లు అనిపించింది. గతంతో పోలిస్తే వరుణ్ ఫీల్డింగ్ పరంగా మెరుగయ్యాడు. అయితే, ఈసారి మరోమారు తప్పు చేశాడు. అతడు సరైన స్థానంలో ఉన్నాడు. కానీ ఫీల్డింగ్ మాత్రం సరిగ్గా చేయలేకపోయాడు.ఇక అభిషేక్ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయి క్యాచ్లు జారవిడిచినట్లు అనిపించింది’’ అని ఆర్. శ్రీధర్ విమర్శించాడు. కాగా విండీస్ స్కోరు 13/0గా ఉన్న వేళ అర్ష్దీప్ బౌలింగ్లో రోస్టన్ ఛేజ్ కవర్ షాట్ ఆడి పరుగుకు ఉపక్రమించాడు. అయితే, షాయీ హోప్ మాత్రం బాల్ పొజిషన్ చూసి తిరిగి నాన్ స్ట్రైకర్ ఎండ్కు వచ్చేశాడు.వరుణ్ వల్లే మిస్మరోవైపు.. ఛేజ్ పిచ్ మధ్య వరకు రాగా.. వరుణ్ వికెట్ కీపర్ వైపు కాకుండా.. బౌలర్ పొజిషన్ వైపు బంతిని విసిరాడు. దీంతో ఛేజ్ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో వరుణ్ షాయీ హోప్ (32) రూపంలో ఒక వికెట్ దక్కించుకున్నాడు. కాగా సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ (50 బంతుల్లో 97 నాటౌట్)తో మెరిసి విండీస్పై భారత్ను గెలిపించాడు.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
ఘనంగా అర్జున్ టెండుల్కర్- సానియా వివాహం.. వీడియో వైరల్
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇంట శుభకార్యం జరిగింది. సచిన్- అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండుల్కర్ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. యువ వ్యాపారవేత్త సానియా చందోక్తో గురువారం అతడి పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. గతేడాది నిశ్చితార్థంకాగా గతేడాది ఆగష్టులో అర్జున్- సానియా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితుల నడుమ గోప్యంగా ఈ వేడుక జరుగగా.. కొన్నిరోజుల తర్వాత సచిన్ టెండుల్కర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇక ఇటీవల అర్జున్- సానియా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి.Saree, sunshine, and Sara’s signature glow."#SaraTendulkar #ArjunTendulkar #SachinTendulkar pic.twitter.com/cbNHRG0pR9— Nitika Sharma (@Nitika3012) March 5, 2026అంబానీ కుటుంబం ఆధ్వర్యంలోముకేశ్ అంబానీ కుటుంబం జామ్నగర్లో కాబోయే వధూవరుల కోసం పార్టీ ఏర్పాటు చేసింది. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం జరిగిన చోట అర్జున్- సానియాల పెళ్లి వేడుకలను ఆరంభించింది. గణేషుడి ఆశీర్వాదంతో పాటు అంబానీ కుటుంబం వీరికి శుభాకాంక్షలు అందజేసింది.ఈ సందర్భంగా నీతా అంబానీకి ధన్యవాదాలు తెలిపిన సచిన్ టెండుల్కర్.. కాబోయే కోడలిపై ప్రేమను కురిపించాడు. తన కుమారుడు అర్జున్.. అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకున్నాడని కొనియాడాడు. వారిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని.. కలకాలం ఇలాగే జీవించాలని ఆకాంక్షించాడు.ముంబైలో పెళ్లి వేడుకఅనంతరం ముంబైలో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరుగగా.. పెళ్లి వేడుక (Arjun Tendulkar- Saaniya Chandhok Wedding)గురువారం జరిగింది. కాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలే సానియా చందోక్. ఆమె కూడా ఓ ఎంటర్ప్రెన్యూర్. సచిన్ కుమార్తె సారా టెండుల్కర్కు సానియా ప్రాణ స్నేహితురాలు. అర్జున్ టెండుల్కర్ కంటే వయసులో ఓ ఏడాది పెద్ద.Sara Tendulkar dancing at the sangeet ceremony of her brother Arjun Tendulkar. 💃✨ pic.twitter.com/fltLHqIdYC— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 5, 2026ఇక అర్జున్ టెండుల్కర్ వివాహానికి దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దంపతులు, సురేశ్ రైనా దంపతులు సహా భారత మాజీ క్రికెటర్లలో చాలా మంది సతీసమేతంగా విచ్చేశారు. బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ వివాహ వేడుక కోసం తరలివచ్చారు. వ్యాపార దిగ్గజం ముకేశ్- నీతా అంబానీ దంపతులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా స్టార్ Arjun Tendulkar, the son of Sachin Tendulkar, got married to Saaniya Chandhok today in Mumbai.❤️Congratulations to Arjun and Saaniya. Best wishes for a happy life together. 💐 pic.twitter.com/HhkU9is64F— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 5, 2026 -
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా
అమెరికా, ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ ప్రభావం క్రికెట్పై కూడా పడింది. ఇప్పటికే పాకిస్తాన్ షాహీన్స్-ఇంగ్లండ్ లయన్స్ మధ్య అబుదాబీలో జరగాల్సిన అనధికారిక వన్డే సిరీస్ రద్దు కాగా.. తాజాగా ఐసీసీ టోర్నీ వాయిదా పడింది. నేపాల్లోని ఖాట్మండు వేదికగా మార్చి 10 నుంచి 20వ తేదీ వరకు జరగాల్సిన ICC Men’s Cricket World Cup League 2లో పలు మ్యాచ్లు వాయిదా పడ్డాయి. ఈ మ్యాచ్లలో ఒమన్, యూఏఈ, నేపాల్ జట్లు పాల్గొనాల్సి ఉంది. వాయిదా విషయాన్ని క్రికెట్ నేపాల్ అధికారికంగా ప్రకటించింది. కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.కాగా, ICC Men’s Cricket World Cup League 2 టోర్నీ ద్వారా 2027 వన్డే ప్రపంచకప్లో నాలుగు బెర్త్లు ఖరారవుతాయి. ఈ క్వాలిఫయర్ టోర్నీ వాయిదా ఆయా జట్ల అర్హత అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఒమన్, యూఏఈ, నేపాల్ జట్లతో పాటు యూఎస్ఏ, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, నమీబియా జట్లు పాల్గొంటున్నాయి.ఇదిలా ఉంటే, పశ్చిమాసియాలో యుద్దం పరోక్షంగానూ క్రికెట్ను ప్రభావితం చేస్తుంది. ఈ యుద్దం కారణంగా గల్ఫ్లో దుబాయ్ సహా ప్రధాన విమానాశ్రయాలన్నీ మూసివేయడంతో టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొన్న పలు జట్లు స్వదేశాలకు తిరిగి వెళ్లలేకపోయాయి. మరోపక్క సౌతాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్ ముగించుకున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు కూడా అక్కడే ఇరుక్కుపోయింది. ఈ విషయాలను ఐసీసీ దగ్గరుండి పరిశీలిస్తూ.. ఆయా జట్లకు తగిన సహాయ సహకారాలు అందిస్తుంది. -
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్లో బద్దలయ్యే అవకాశమున్న 3 రికార్డులు ఇవే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 5) అత్యంత కీలకమైన సమరం జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇరు జట్లు సమవుజ్జీలు కావడంతో హోరీహోరీ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియాకు హోం అడ్వాంటేజ్ ఉన్నా, ఇంగ్లండ్ను తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇరు జట్లు సెమీస్లో ఎదురెదురుపడటం ఇది వరుసగా మూడోసారి. 2022 ఎడిషన్లో ఇంగ్లండ్ భారత్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆతర్వాత టైటిల్ను కూడా ఎగరేసుకుపోగా.. 2024 ఎడిషన్లో భారత్ ఇంగ్లండ్ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి, ఆతర్వాత టైటిల్ను కూడా సొంతం చేసుకుంది. గత రెండు ఎడిషన్లలో ఇరు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్లో గెలిచిన జట్లు ఆతర్వాత టైటిల్ను కూడా ఎగరేసుకుపోవడంతో ఇవాల్టి మ్యాచ్కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్స్కు చేరడమే కాకుండా, ఆతర్వాత టైటిల్ కూడా ఎగరేసుకుపోతుందని సెంటిమెంట్లను ఫాలో అయ్యే వారు నమ్ముతున్నారు.గెలుపోటముల విషయం పక్కన పెడితే, నేటి మ్యాచ్లో మూడు భారీ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.అత్యధిక టీమ్ టోటల్నేటి మ్యాచ్లో భారత్ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్లో అత్యధిక టీమ్ టోటల్ను నమోదు చేసే అవకాశం ఉంది. 2016 ఎడిషన్లో వాంఖడే మైదానంలోనే విండీస్పై చేసిన 192 పరుగులే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్ విభాగం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండటంతో నేటి మ్యాచ్లో ఈ రికార్డు బద్దలవడం ఖాయంగా కనిపిస్తుంది. వాంఖడే వికెట్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేస్తే టీమిండియా 200 పైచిలుకు పరుగులు సాధిస్తుందనే అంచనా ఉంది.డేంజర్లో విరాట్ రికార్డునేటి మ్యాచ్లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 వరల్డ్కప్ నాకౌట్స్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. 2016 ఎడిషన్ సెమీఫైనల్లో విండీస్పై విరాట్ చేసిన 89 పరుగులకే (47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్, నాటౌట్) నేటి వరకు టీ20 ప్రపంచకప్ నాకౌట్స్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉంది. నేటి మ్యాచ్లో ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భారత బ్యాటింగ్ ఆర్డర్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ నుంచి ఈ రికార్డుకు ముప్పు పొంచి ఉంది.ఎవరు గెలిచినా రికార్డేనేటి మ్యాచ్లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్స్కు చేరిన రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉంది. ఈ నాలుగు జట్లు తలో మూడు సార్లు ఫైనల్స్కు చేరాయి. నేటి మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా చరిత్ర అవుతుంది. భారత్ 2007, 2014, 2024 ఎడిషన్లలో ఫైనల్స్కు చేరగా.. ఇంగ్లండ్ 2010, 2016, 2022 ఎడిషన్లలో తుది పోరుకు అర్హత సాధించింది. -
ప్రపంచకప్ సందర్భంగా పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన.. మహిళతో..!
పాకిస్తాన్ క్రికెటర్కు సంబంధించి ఆలస్యంగా వెలుగు చూసిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా ఓ పాక్ క్రికెటర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. సూపర్-8 దశలో శ్రీలంకతో మ్యాచ్కు ముందు ఈ ఘటన జరిగిందని సమాచారం.పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్ జట్టు ఫిబ్రవరి 28న పల్లెకెలెలో శ్రీలంకతో తమ చివరి సూపర్-8 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్కు ముందు, కాండీ (శ్రీలంక)లోని గోల్డెన్ క్రౌన్ హోటల్లో ఓ పాక్ ఆటగాడు మహిళా హౌస్కీపింగ్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు మహిళ సాయం కోసం కేకలు వేయగా, ఇతర హోటల్ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని తెలుస్తుంది. ఈ విషయం పాక్ మేనేజర్ నవీద్ చీమాకు తెలియజేయగా.. ఆయన హోటల్ మేనేజ్మెంట్కు క్షమాపణ చెప్పి సమస్యను అంతర్గతంగా పరిష్కరించాడని సమాచారం. మహిళను వేధించిన ఆ పాక్ ఆటగాడి పేరు బహిరంగంగా వెల్లడించకపోయినా, జట్టు మేనేజ్మెంట్ అతనిపై కఠన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా భారీ జరిమానా విధించినట్లు సమాచారం. ఈ ఘటనపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సదరు ఆటగాడిపై నక్వీ అదనపు చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.కాగా, పాక్ ఆటగాళ్లపై, సపోర్ట్ స్టాఫ్పై గతంలో ఇలాంటి ఆరోపణలు చాలానే వచ్చాయి. పాక్ బృందం దురుసు ప్రవర్తనకు మారు పేరని ప్రపంచ క్రికెట్ దేశాల హోటల్ యాజమాన్యాలన్నీ ముక్తకంఠంతో చెబుతాయి. పాక్ ఆటగాళ్లకు ఇలాంటి అనుభవాలు షరామామూలే.ఇదిలా ఉంటే, ప్రపంచకప్లో పాక్ ఘోర ప్రదర్శనలు చేసి సూపర్-8 దశలోనే నిష్క్రమించింది. చివరి సూపర్-8 మ్యాచ్లో శ్రీలంకపై భారీ తేడాతో గెలుచుంటే, న్యూజిలాండ్ కంటే మెరుగైన రన్రేట్ సాధించి సెమీస్కు అర్హత సాధించి ఉండేది. అయితే లంక ఆటగాళ్లు అద్భుతంగా ప్రతిఘటించి పాక్కు సెమీస్ బెర్త్ దక్కనీయకుండా చేశారు. లంకపై భారీ స్కోర్ చేసినా గెలిచినా, పాక్ ఇంటిముఖం పట్టక తప్పలేదు. పాక్ కంటే మెరుగైన రన్రేట్ ఉన్న కారణంగా గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్తో పాటు న్యూజిలాండ్ సెమీస్కు చేరింది. ఇదే న్యూజిలాండ్ జట్టు సెమీస్లో గ్రూప్-1 టాపర్ సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చి ఫైనల్కు దూసుకెళ్లింది. భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న న్యూజిలాండ్ చిచ్చరపిడుగులు
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా, ఆ జట్టు ఎంపిక చేసుకున్న ఆటగాళ్లు ఇప్పటినుంచే ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ఈ సీజన్ మినీ వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ టిమ్ సీఫర్ట్ (రూ. 1.5 కోట్లు), ఫిన్ అల్లెన్ (రూ. 2 కోట్లు)ను రూ. 3.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ న్యూజిలాండ్ ఓపెనింగ్ ద్వయం నిన్న (మార్చి 4) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై పేట్రేగిపోయింది. ముఖ్యంగా అల్లెన్ ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం (100 నాటౌట్) బాది తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు. మరో ఎండ్లో సీఫర్ట్ తానేమీ తక్కువ కాదు అన్నట్లు 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసి గెలుపుకు గట్టి పునాది వేశాడు. అల్లెన్, సీఫర్ట్ ఇంతలా విరుచుకుపడింది తమ ఐపీఎల్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డన్స్లో కావడం విశేషం. అల్లెన్, సీఫర్ట్ విధ్వంసకాండ చూశాక కేకేఆర్ అభిమానుల్లో ఎక్కడలేని జోష్ వచ్చింది. గత సీజన్లో పేలవ ప్రదర్శనలతో చివరి స్థానాల్లో నిలిచిన కేకేఆర్కు అల్లెన్, సీఫర్ట్ కొత్త ఊపునిచ్చారు. వీరిద్దరిని కేకేఆర్ వచ్చే సీజన్లో ఓపెనర్లుగా ప్రవేశపెట్టవచ్చు. వీరు మెరుపు విన్యాసాలకు పెట్టింది పేరు. ఇదే జోరును వీరు రానున్న ఐపీఎల్ సీజన్లోనూ కొనసాగిస్తే.. కేకేఆర్ మరోసారి టైటిల్ ఎగరేసుకుపోవడం ఖాయం. దీనికంటే ముందు ఈ ఇద్దరిపై మరో పెద్ద బాధ్యత ఉంది. న్యూజిలాండ్ను రెండో సారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేర్చిన వీరు.. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని కసిగా ఉన్నారు. ఈ ప్రపంచకప్లో వీరిద్దరి ఫామ్ అమోఘంగా ఉంది. ఇప్పటికే 463 పరుగులు జోడించి, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ వికెట్కైనా అత్యధిక పరుగులు జోడిగా రికార్డు నెలకొల్పారు. తాజాగా సౌతాఫ్రికాపై తొలి వికెట్కు 117 పరుగులు జోడించిన అల్లెన్-సీఫర్ట్ జోడి.. ఈ ఎడిషన్లో 100 ప్లస్ భాగస్వామ్యం నమోదు చేయడం ఇది రెండోసారి. గ్రూప్ దశలో యూఏఈపై ఈ జోడీ అజేయమైన 175 పరుగులు జోడించి ప్రపంచకప్ రికార్డు నెలకొల్పింది. మొత్తంగా అల్లెన్-సీఫర్ట్ జోడీ అటు స్వదేశ అభిమానులతో పాటు కేకేఆర్ అభిమానుల్లోనూ సరికొత్త ఆశలు చిగురింపజేస్తుంది. ఈ జోడీ ప్రపంచకప్ ఫైనల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇవాళ (మార్చి 5) భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఈ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. -
T20 WC 2026: సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్లో షాకింగ్ సన్నివేశం
సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య నిన్న (మార్చి 4) జరిగిన టీ20 వరల్డ్కప్ 2026 తొలి సెమీఫైనల్ మ్యాచ్లో షాకింగ్ సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ తొలి బంతిలో కగిసో రబాడా వేసిన అద్భుత బంతికి టిమ్ సీఫర్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆశ్చర్యకరంగా, ఓ బెయిల్ ఎగిరి ఏకంగా బౌండరీ రోప్పై పడింది. దీంతో ఆటగాళ్లు, అభిమానులు, వ్యాఖ్యాతలు అందరూ షాక్కు గురయ్యారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా జరిగాయి.pic.twitter.com/ZjIVl2UxEz— crictalk (@crictalk7) March 4, 2026మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి, ఫైనల్కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిన్ అల్లెన్ బీభత్సమైన సెంచరీతో (33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్) కివీస్ను ఒంటిచేత్తో గెలిపించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్ల్లోనూ ఇదే తొలి సెంచరీ. ఈ సెంచరీతో అల్లెన్ మరిన్ని రికార్డులు కొల్లగొట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 77 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మార్కో యాన్సెన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి ట్రిస్టన్ స్టబ్స్ (29) కాసేపు సహకరించాడు. అంతకుముందు డెవాల్డ్ బ్రెవిస్ (34) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించాడు. వీరు మినహా సౌతాఫ్రికా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. మార్క్రమ్ 18, డికాక్ 10, మిల్ర్ 6, బాష్ 2, రికెల్టన్, రబాడ డకౌటయ్యారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ను రచిన్ (4-0-29-2), మ్యాట్ హెన్రీ (4-0-34-2), కోల్ మెక్కోంచి (1-0-9-2), ఫెర్గూసన్ (4-0-29-1), మిచెల్ సాంట్నర్ (4-0-25-0) దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో టిమ్ సీఫర్డ్ (58), ఫిన్ అల్లెన్ (100 నాటౌట్) 9 ఓవర్లలో తొలి వికెట్కు 117 పరుగులు జోడించి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. సీఫర్ట్ ఔటయ్యాక మరింత రెచ్చిపోయిన అల్లెన్ కేవలం బౌండరీలు, సిక్సర్లతో మ్యాచ్ను ముగించాడు. అతనికి రచిన్ (13 నాటౌట్) సహకరించాడు.2021 ఎడిషన్ తర్వాత న్యూజిలాండ్ ఫైనల్కు చేరడం ఇదే మొదటిసారి. ఆ ఎడిషన్లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదుర్కొని తృటిలో ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కివీస్కు మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్ సాధించే అవకాశం వచ్చింది. భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ తమ తొలి ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతుంది. -
మొయిన్ అలీపై నిషేధం..!
ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ 2026 హండ్రెడ్ లీగ్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకారం, ఏ ఫ్రాంచైజీ మొయిన్ను నామినేట్ చేయలేదు. దీంతో అతని పేరు వేలం జాబితాలో చేరలేదు. నాలుగు సీజన్ల పాటు బర్మింగ్హామ్ ఫీనిక్స్కు నాయకత్వం వహించిన మొయిన్కు ఈ అవమానం జరగడానికి చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మొదటిది.. అతను పాక్ ఆటగాళ్లకు మద్దతు తెలపడం. ఈసారి హండ్రెడ్ లీగ్లో పాకిస్తాన్ ఆటగాళ్లపై షాడో బ్యాన్ ఉంది. ఈ లీగ్లో మెజార్టీ ఫ్రాంచైజీలను భారతీయులు, ముఖ్యంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు చేజిక్కించుకోవడంతో పాక్ ఆటగాళ్లను తీసుకోకూడదని అనధికారిక నిర్ణయం జరిగింది. ఇలా జరగడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్తో పాటు మొయిన్ అలీ కూడా వ్యతిరేకించాడు. ECB వివక్షకు వ్యతిరేకంగా కట్టుబడి ఉందని నమ్ముతున్నంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే దక్షిణాఫ్రికాలో జరిగిన జాతి వివక్షను ఉదాహరించి, ఇప్పుడు అదే విధమైన వివక్ష పాకిస్తాన్ ఆటగాళ్లపై జరుగుతోందని వ్యాఖ్యానించాడు. పాక్ ఆటగాళ్లకు మద్దతుగా మొయిన్ చేసిన ఈ వ్యాఖ్యలే అతన్ని ఏ హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీ నామినేట్ చేయకపోవడానికి కారణంగా తెలుస్తుంది.మరిన్ని కారణాలు..గత నిర్ణయాలు: గత సీజన్లో మొయిన్ CPL కోసం హండ్రెడ్ లీగ్ను మధ్యలోనే వదిలేశాడు. ఈ చర్య లీగ్ పట్ల అతని కమిట్మెంట్ను ప్రశ్నార్థకంగా మార్చింది. అందుకే ఏ ఫ్రాంచైజీ అతన్ని నామినేట్ చేయలేదు. వేలం ధర: మొయిన్ బేస్ ప్రైస్ £75,000 ఉండటం ఫ్రాంచైజీలను వెనక్కి తగ్గేలా చేసింది. వయసు: సీజన్ ప్రారంభ సమయానికి అతని వయసు 39 ఏళ్లు అవుతుంది. నిలకడలేమి: మొయిన్ను ఈ సీజన్లో హండ్రెడ్ ఫ్రాంచైజీలు చిన్నచూపు చూడటానికి మరో కారణం అతని నిలకడలేమి. మొయిన్ కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్ దేశీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి, ఇతర లీగ్లలో ఆడేందుకు NOCలు పొందాడు. అయితే, ఇటీవల అతను రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని యార్క్షైర్ తరఫున T20 బ్లాస్ట్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ నిలకడలేమే అతనికి మరో మైనస్గా మారింది.తలుపులు మూసుకుపోలేదు మొయిన్కు హండ్రెడ్ లీగ్ 2026 తలుపులు పూర్తిగా మూసుకుపోలేదు. జూన్లో జరిగే వైల్డ్ కార్డ్ సైనింగ్స్ ద్వారా అవకాశం లభించవచ్చు. ప్రతి ఫ్రాంచైజీ T20 బ్లాస్ట్ ప్రదర్శన ఆధారంగా £31,000 కాంట్రాక్ట్తో ఇద్దరు ఆటగాళ్లను వైల్డ్ కార్డ్ ద్వారా ఎంపిక చేసుకుంటుంది. యార్క్షైర్ తరఫున మంచి ప్రదర్శన చేస్తే మొయిన్ మళ్లీ హండ్రెడ్ లీగ్లో కనిపించే అవకాశం ఉంది. -
33 బంతుల్లో శతకం.. రికార్డుల మోత మోగించిన కివీస్ యోధుడు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (మార్చి 4) జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి, ఫైనల్కు చేరింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిన్ అల్లెన్ బీభత్సమైన సెంచరీతో కివీస్ను ఒంటిచేత్తో గెలిపించాడు. అల్లెన్ 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన సెంచరీ చేసి కివీస్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ సెంచరీతో అల్లెన్ రికార్డుల మోత మోగించాడు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్ టీ20 క్రికెట్ చరిత్రలో ఓ ఫుల్ మెంబర్ జట్టుపై ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్గా (ఫుల్ మెంబర్లు, సభ్య దేశాలు) టీ20ల్లో ఇది మూడో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ.ఓవరాల్గా ఓ ఫుల్ మెంబర్ జట్టు తరఫున సికందర్ రజాతో (గాంబియాపై 33 బంతుల్లో శతకం) పాటు జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల చరిత్రలో తొలి శతకం.టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ.టీ20 వరల్డ్కప్ చరిత్రలో బ్రెండన్ మెక్కల్లమ్తో (11 ఫోర్లు, 7 సిక్సర్లు) కలిసి ఓ ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీ కౌంట్ (10 ఫోర్లు, 8 సిక్సర్లు). ఓ టీ20 వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు-20.టీ20 వరల్డ్కప్ సెమీస్ లేదా ఫైనల్స్లో కనీసం 30 బంతులు ఆడిన కోటాలో విరాట్ కోహ్లితో పాటు అతి తక్కువ డాట్ బాల్స్ (3). టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ తరఫున మూడో శతకం (మెక్కల్లమ్, ఫిలిప్).ఈ ఇన్నింగ్స్తో అల్లెన్ మరిన్ని చిన్నా చితకా రికార్డులను కూడా బ్రేక్ చేసి న్యూజిలాండ్ను ప్రపంచకప్ కల సాకారం చేసే దిశగా తీసుకెళ్లాడు. 2021 ఎడిషన్ తర్వాత న్యూజిలాండ్ ఫైనల్కు చేరడం ఇదే మొదటిసారి. ఆ ఎడిషన్లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదుర్కొని తృటిలో ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కివీస్కు మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్ సాధించే అవకాశం వచ్చింది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ తమ తొలి ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతుంది. -
భారత్ ఫైనల్ గురి
3-2 టి20 వరల్డ్ కప్లో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్లు జరిగాయి. వీటిలో భారత్ 3 గెలిచి, 2 ఓడింది. గత టి20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచిన సందర్భంలో సెమీఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించే ముందంజ వేసింది. అంతకుముందు 2022 సెమీఫైనల్లో భారత్పై విజయం సాధించిన ఇంగ్లండ్ ఆపై టైటిల్నూ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి టైటిల్ పోరుకు ముందు ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీస్ సమరంలోనే ముఖాముఖికి సిద్ధమయ్యాయి. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే రెండు జట్లూ కూడా ‘లోపాలు లేని అత్యుత్తమ ఆటతీరు’ను కనబర్చలేకపోయాయి. ఇంగ్లండ్ ప్రస్థానం తడబడుతూనే సాగగా... భారత్ కూడా తమపై ఉన్న భారీ అంచనాలకు అనుగుణంగా ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. అయితే ఇక్కడి వరకు ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు మిగిలిన రెండు మ్యాచ్లు ఎలా గెలవడం అనేదే ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత్ సొంతగడ్డపై సత్తా చాటుతుందా లేక ఇంగ్లండ్ అనూహ్య ఫలితాన్ని సాధిస్తుందా అనేది ఆసక్తికరం. ముంబై: టి20 వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించే క్రమంలో అసలైన నాకౌట్ సమరానికి సిద్ధమైంది. నేడు వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ప్రత్యర్థులతో పోలిస్తే ఇంగ్లండ్ మరీ బలంగా ఏమీ లేదు. అయితే నాకౌట్ మ్యాచ్ ఒత్తిడిని అధిగమించి టీమిండియా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్ఫూర్తిదాయక సారథ్యంలో ఇంగ్లండ్ ఒక్కో అడుగు వేస్తూ సెమీస్కు చేరింది. టి20 వరల్డ్ కప్ను రెండేసిసార్లు గెలుచుకున్న ఈ రెండు జట్లు మూడో టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేసేందుకు నేటి పోరులో ఎలా చెలరేగుతాయో చూడాలి. మార్పుల్లేకుండా... పిచ్, వేదికతో సంబంధం లేకుండా భారత జట్టు అన్ని రకాలుగా ఈ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంది. కొత్తగా వ్యూహాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా బెస్ట్–11తో తుది జట్టు ఎంపిక కూడా ఖాయమైనట్లే. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో ఇంగ్లండ్పైనే అభిషేక్ శర్మ విధ్వంసకర ఆటతో తన రాకను ఘనంగా ప్రదర్శించాడు. నాటి మ్యాచ్లో 54 బంతుల్లోనే 7 ఫోర్లు, 13 సిక్స్లతో అతను ఏకంగా 135 పరుగులు సాధించాడు. ఇప్పుడు అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిషేక్ భావిస్తున్నాడు. విండీస్పై గత మ్యాచ్లో తడబడినా ఈసారి చెలరేగితే తిరుగుండదు. మరో ఓపెనర్ సంజు సామ్సన్ ఒక్క ఇన్నింగ్స్తో తన విలువేంటో చూపించాడు. అదే జోరు కొనసాగించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఆపై ఇషాన్, సూర్య, తిలక్లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా జట్టు భారీ స్కోరు చేయడం ఖాయం. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు చివర్లో వేగంగా అందించే పరుగులు దీనికి అదనం. ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్లాంటి ఆటగాడు ఉండటం టీమిండియా బలం. పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్ ఎప్పటిలాగే ఆరంభంలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగితే మన జట్టు పని మరింత సులువవుతుంది. అక్షర్తో పాటు వైవిధ్యమైన బౌలింగ్ ఉన్న వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం ఇంగ్లండ్కు కత్తి మీద సామే. ఇంగ్లండ్పై ఘనమైన రికార్డు ఉన్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలనే భావిస్తున్నా... ఎవరినీ పక్కన పెట్టలేని పరిస్థితి. బుధవారం సిద్ధి వినాయక ఆలయంలో అభిషేక్, అక్షర్, ఇషాన్ కీలకం విల్ జాక్స్... ఈ వరల్డ్ కప్లో ఇంగ్లండ్ చాలా సాధారణ ఆటతీరు కనబర్చింది. అతి కష్టమ్మీద నేపాల్పై 4 పరుగులతో నెగ్గి ఆపై విండీస్ చేతిలో ఓడింది. ‘సూపర్ ఎయిట్స్’లో కూడా స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్రమంలో పాకిస్తాన్, న్యూజిలాండ్లపై చచ్చీ చెడి గెలిచింది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా విధ్వంసకర ఆటకు చిరునామాగా నిలిచిన టీమ్ ఇప్పుడు అతి కష్టమ్మీద గెలుపు గీత దాటుతోంది. టోర్నీ మొత్తంలో బెస్ట్ ఓపెనింగ్ జోడీ అంటూ బరిలోకి దిగిన బట్లర్, ఫిల్ సాల్ట్ 7 మ్యాచ్లలో కలిపి 84 పరుగులే జోడించగలిగారు. ఏ మ్యాచ్లోనూ గరిష్టంగా నాలుగు ఓవర్లకు మించి వీరి భాగస్వామ్యం సాగలేదు. అయినా సరే మరో ప్రత్యామ్నాయం లేక మరోసారి జట్టు వీరినే నమ్ముకుంటోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బట్లర్ 7 మ్యాచ్లలో కలిపి చేసింది 62 పరుగులే! అయినా సరే, అతని స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ ఒక్క మ్యాచ్లోనైనా రావాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. బెతెల్, బాంటన్లను నమ్మే స్థితి లేకపోవడంతో కెప్టెన్ బ్రూక్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడటం అవసరం. ఆల్రౌండర్గా స్యామ్ కరన్ పెద్దగా ఆకట్టుకోకపోయినా....ఈ టోర్నీలో నాలుగు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు నెగ్గిన విల్ జాక్స్ కీలకం కానున్నాడు. ఆర్చర్తో పాటు రెండో పేసర్గా ఒవర్టన్పై భారం ఉంది. పిచ్ కొంత అనుకూలిస్తే మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ఆదిల్ రషీద్, డాసన్ కూడా ప్రభావం చూపగలరని జట్టు నమ్ముతోంది. పిచ్, వాతావరణం వాంఖెడే పిచ్ మొదటి నుంచీ బ్యాటింగ్కు బాగా అనుకూలం. మంచి బౌన్స్, చిన్న బౌండరీల కారణంగా భారీ స్కోర్లకు అవకాశం ఉంది. టోర్నీలో తొలి మ్యాచ్ను భారత్ ఇక్కడ ఆడగా... ఇంగ్లండ్ రెండు మ్యాచ్లు ఆడింది. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం సమస్య కలిగించినా...రిజర్వ్ డే ఉంది. 17-12 భారత్, ఇంగ్లండ్ మధ్య 29 టి20 మ్యాచ్లు జరిగాయి. భారత్ 17 మ్యాచ్ల్లో, ఇంగ్లండ్ 12 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, సామ్సన్, ఇషాన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్. ఇంగ్లండ్: బ్రూక్ (కెప్టెన్ ), సాల్ట్, బట్లర్, బెతెల్, బాంటన్, కరన్, ఒవర్టన్, జాక్స్, డాసన్, ఆర్చర్, రషీద్. -
కివీస్ కిర్రాక్ షో
చోకర్స్... క్రికెట్లో దక్షిణాఫ్రికా జట్టును ఉద్దేశించి తరచూ అనే మాట ఇది. అంటే... అన్నీ నెగ్గినా, ఎన్ని గెలిచినా, అసలైనా పోరులో తుస్సుమంటుందనే అర్థంలో వాడతారు. ఇదేలా ఉన్నా... గతం సంగతి పక్కన బెట్టినా... ఈ టి20 ప్రపంచకప్ వరకే చూసినా కూడా సఫారీ జట్టును ముమ్మూటికీ చోకర్స్ అనక తప్పదేమో! ఎందుకంటే ఈ టోర్నీలో లీగ్ మొదలు, సూపర్–8 ముగిసేదాకా అపజయమన్నదే ఎరుగని జట్టు కీలకమైన సెమీఫైనల్ కొచ్చేసరికి చేతులెత్తేసింది. కోల్కతా: ఇప్పటిదాకా ఈ టి20 ప్రపంచకప్లో ఎదురేలేని ఏకైక జట్టు దక్షిణాఫ్రికాను... రన్రేట్తో సెమీఫైనల్ చేరిన న్యూజిలాండ్ చిత్తు చేసింది. టోర్నీలోనే కఠినమైన ప్రత్యర్థిపై సులువుగా విజయం సాధించింది. బుధవారం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి సెమీఫైనల్లో కివీస్ 7.1 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై ఘనవిజయం నమోదు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిన్ అలెన్ (33 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్స్లు) వీరవిహారంతో దక్షిణాఫ్రికా లక్ష్యం చిన్నబోయింది. సఫారీ జట్టు మూగబోయింది. టాస్ నెగ్గిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్లు) మెరిపించాడు. కివీస్ బౌలర్లు మెక్కోన్కీ (2/9), రచిన్ రవీంద్ర (2/29), హెన్రీ (2/34) తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ అలెన్ శతక సునామీతో 12.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. టిమ్ సీఫెర్ట్ (33 బంతుల్లో 58; 7 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా దంచేశాడు. ఈ మెగా టోర్నీలో రెండోసారి ఫైనల్ చేరిన న్యూజిలాండ్ (2021లో తొలిసారి రన్నరప్)... నేడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం అహ్మదాబాద్లో టైటిల్ కోసం తలపడుతుంది. టాపార్డర్ తడబాటు కెప్టెన్ మార్క్రమ్ (18), డికాక్ (10), రికెల్టన్ (0) ఇలా టాప్–3 బ్యాటర్లు చేతులెత్తేశారు. 55 స్కోరు వద్ద టాపార్డర్ వికెట్లు కూలాయి. దీన్నుంచి తేరుకోకముందే మిల్లర్ (6), అప్పటిదాకా టాప్స్కోరర్ అయిన బ్రెవిస్ (34; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఇద్దరు 77 పరుగుల స్కోరు వద్దే వెనుదిరిగారు. నిజానికి ఇక్కడే సఫారీ పనైపోయింది. అయితే స్టబ్స్ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), యాన్సెన్ ఆరో వికెట్కు 73 పరుగులు జోడించిన భాగస్వామ్యం, 27 బంతుల్లో యాన్సెన్ చేసిన ఫిఫ్టీ దక్షిణాఫ్రికాను ఆదుకున్నాయి. అలెన్ ధన్ ధనాధన్ తొలి ఓవర్లో సీఫెర్ట్ రెండు బౌండరీలు, రెండో ఓవర్లో అలెన్ ఫోర్ కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి మొత్తం 19 పరుగులు వచ్చాయి. మరుసటి మూడో ఓవర్లో ఇద్దరు కలిపి కొట్టడంతో 18 పరుగులతో కివీస్ పరుగుల జోరందుకుంది. 4.1 ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. ఇక బాష్ వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతి ఒక్కటే బతికి పోయింది. అంతకుముందు పడిన ఐదు బంతుల్ని అలెన్ 6, 4, 4, 4, 4, 0లుగా బాదేయడంతో వరుసబెట్టి మరీ బౌండరీలైన్ను దాటేశాయి. 6 ఓవర్లలో 84/0. అచ్చు హైలైట్స్లాగే లక్ష్యంలో సగం స్కోరు కరిగింది. పవర్ప్లే ముగిసింది కానీ ఓపెనర్ల పవర్ స్ట్రోక్స్ మాత్రం అడ్డు అదుపు లేకుండా కొనసాగాయి. దీంతో 7.5 ఓవర్లోనే న్యూజిలాండ్ స్కోరు 100కు చేరింది. 28 బంతుల్లో సీఫెర్ట్, 19 బంతుల్లో అలెన్ ఫిఫ్టీలు సాధించారు. ఎట్టకేలకు రబడ పదో ఓవర్లో సీఫెర్ట్ను అవుట్ చేశాడు. కానీ కివీస్ స్కోరు 117/1. అప్పటికే సఫారీ వికెట్ సాఫల్యానికి ఆలస్యమైంది. అలెన్ దూకుడుతో న్యూజిలాండ్ లక్ష్యానికి చేరువైంది. యాన్సెన్ వేసిన 13వ ఓవర్లో అలెన్ వరుసగా 4, 4, 6, 6, 4 బాదేయడంతో 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న అలెన్ ఒక్క ఉదుటున 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో బంతి బౌండరీతోనే కివీస్ లక్ష్యాన్ని కూడా చేరుకుంది. 33 టి20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా అలెన్ రికార్డు నెలకొల్పాడు. క్రిస్ గేల్ (2016లో ఇంగ్లండ్పై 47 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును అలెన్ సవరించాడు.6 ప్రస్తుత టి20 ప్రపంచకప్లో నమోదైన సెంచరీలు. 2010, 2014, 2016, 2022 టోర్నీల్లో అత్యధికంగా రెండేసి సెంచరీలు వచ్చాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) మిచెల్ (బి) రచిన్ 18; డికాక్ (సి) ఫెర్గూసన్ (బి) మెక్కోన్కీ 10; రికెల్టన్ (సి) అలెన్ (బి) మెక్కోన్కీ 0; బ్రెవిస్ (సి) సాంట్నర్ (బి) నీషమ్ 34; మిల్లర్ (సి) మిచెల్ (బి) రచిన్ 6; స్టబ్స్ (బి) ఫెర్గూసన్ 29; యాన్సెన్ (నాటౌట్) 55; బాష్ (బి) హెన్రీ 2; రబడ (సి) నీషమ్ (బి) హెన్రీ 0; కేశవ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–55, 4–77, 5–77, 6–150, 7–166, 8–166. బౌలింగ్: హెన్రీ 4–0–34–2, మెక్కోన్కీ 1–0–9–2, ఫెర్గూసన్ 4–0–29–1, నీషమ్ 3–0–42–1, సాంట్నర్ 4–0–25–0, రచిన్ రవీంద్ర 4–0–29–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (బి) రబడ 58; అలెన్ (నాటౌట్) 100; రచిన్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 2; మొత్తం (12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 173. వికెట్ పతనం: 1–117. బౌలింగ్: యాన్సెన్ 2.5–0–53–0, రబడ 3–0–28–1, ఎన్గిడి 2–0–22–0, బాష్ 2–0–35–0, కేశవ్ 3–0–33–0. -
టి20 ప్రపంచకప్ వీక్షణలో కొత్త రికార్డులు
న్యూఢిల్లీ: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ కొత్త ప్రసార రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పటి వరకు జరిగిన అన్నీ టోర్నీల కంటే ఈ వరల్డ్కప్నకు అత్యధి వీక్షణలు వచ్చాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు జై షా బుధవారం తెలిపారు. పాత రికార్డులన్నింటిని తిరగరాస్తూ తాజా టోర్నమెంట్ వీక్షకుల సంఖ్య 500 మిలియన్ (50 కోట్లు)లను అధిగమించిందని వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండే టోర్నమెంట్గా ఇది నిలిచిందని... డిజిటల్ వినియోగం ద్వారానే వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని జై షా అన్నారు. ‘ఈ వరల్డ్కప్ను విశ్వవ్యాప్తం చేయాలని టోర్నీ ఆరంభానికి ముందే లక్ష్యంగా పెట్టుకున్నాం. భారత్లో జరుగుతున్న ఈ ఈవెంట్ వీక్షకుల సంఖ్య 500 మిలియన్లు దాటింది. టి20 ప్రపంచకప్ల చరిత్రలో ఇదే అత్యధికం. జియో హాట్స్టార్లో ఏకకాలంలో 60.5 మిలియన్ల గరిష్ట వీక్షకులను చూడటం చాలా సంతోషంగా ఉంది’ అని జై షా సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. తాజా టోర్నీలో సెమీఫైనల్స్, ఫైనల్ జరగకముందే... 2024లో అమెరికాలో జరిగిన వరల్డ్కప్ కంటే ఎక్కువమంది ఈవెంట్ను వీక్షించడం గమనార్హం. చివరి మూడు మ్యాచ్లు ముగిసేసరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
T20 WC: అలెన్ విధ్వంసకర శతకం.. వరల్డ్కప్ ఫైనల్లో న్యూజిలాండ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో న్యూజిలాండ్ ఫైనల్కు దూసుకువెళ్లింది. కోల్కతాలో జరిగిన తొలి సెమీస్ మ్యాచ్లో సౌతాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈడెన్ గార్డెన్స్లో బుధవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్.. సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ న్యూజిలాండ్ బౌలర్లు ఆది నుంచే నిప్పులు చెరిగారు. క్వింటన్ డికాక్ (10)ను అవుట్ చేసి కివీస్ వికెట్ల వేట మొదలుపెట్టిన కోల్ మెకాంచీ.. వన్డౌన్లో వచ్చిన ర్యాన్ రికెల్టన్ (0)ను డకౌట్గా వెనక్కి పంపాడు. ఇక మరో ఓపెనర్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (18)ను రచిన్ రవీంద్ర పెవిలియన్కు చేర్చాడు.యాన్సెన్ హాఫ్ సెంచరీఅదే విధంగా డారిల్ మిచెల్ (6)ను కూడా అవుట్ చేసిన రచిన్ కివీస్ శిబిరంలో జోష్ నింపాడు. ఇక డెవాల్డ్ బ్రెవిస్ (34)ను జేమ్స్ నీషమ్ అవుట్ చేయగా.. ట్రిస్టన్ స్టబ్స్ (29)ను లాకీ ఫెర్గూసన్ పెవిలియన్కు పంపించాడు. అయితే, మార్కో యాన్సెన్ హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 55) నాటౌట్గా నిలవడంతో సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ నష్టపోయి 173 పరుగులు సాధించింది. ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ 33 బంతుల్లో 58 పరుగులు సాధించగా.. ఫిన్ అలెన్ విధ్వంసకర శతకం బాదాడు. Everything is flying to the boundary tonight! 🫣ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/1kQbb9uF6n— Star Sports (@StarSportsIndia) March 4, 2026ఫాస్టెస్ట్ సెంచరీకేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫోర్ బాది కివీస్ గెలుపును ఖరారు చేశాడు. రచిన్ రవీంద్ర 11 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్గా అలెన్ చరిత్ర సృష్టించాడు. -
పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు: టీమిండియాకు హ్యారీ బ్రూక్ వార్నింగ్
టీమిండియాతో సెమీ ఫైనల్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో తాము ఇంత వరకు పరిపూర్ణమైన మ్యాచ్ ఆడలేదని.. అయినప్పటికీ సమిష్టిగా రాణించి విజయం సాధించామని పేర్కొన్నాడు. కాబట్టి టీమిండియాతో మ్యాచ్ గురించి తాము ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 లీగ్ దశలో నేపాల్ వంటి పసికూన చేతిలో తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లండ్.. ఆ తర్వాత సూపర్-8లో మాత్రం అదరగొట్టింది. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ మీద విజయాలు సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మూడు మ్యాచ్లలో కూడా ఆఖరి వరకు పోరాడి ఇంగ్లండ్ గెలిచింది.కల నిజమైన తరుణం ఇదిఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ (Harry Brook) మాట్లాడుతూ.. ‘‘ఆతిథ్య జట్టు (టీమిండియా)తో సెమీ ఫైనల్ ఆడటం విశేషం. మా జట్టులోని చాలా మంది కల నిజమైన తరుణం ఇది. ఈ మ్యాచ్ కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు.. అయినాపూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాం. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో పరిపూర్ణంగా ఆడలేదు. ఒక్కో మ్యాచ్లో ఒక్కొక్కరు కీలకంగా వ్యవహరించారు. టీమిండియాతో మ్యాచ్లో సైతం పూర్తి స్వేచ్ఛగా.. ధైర్యంగా ఆడతాం.ఈ టోర్నీలో కొన్ని ఉత్కంఠ మ్యాచ్లలో మేము గెలిచాము. మా బ్యాటర్లు స్పిన్ను ఎదర్కోవడంలో ఇబ్బంది పడతారని అంతా అనుకుంటున్నారు. కానీ మేము చక్కగా స్పిన్ ఆడగలము.వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) బౌలింగ్లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అతడి బౌలింగ్లో అత్యుత్తమంగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తా’’ అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా టీమిండియాకు కఠిన సవాలు తప్పదని సంకేతాలు ఇచ్చాడు. తాము ఇప్పటివరకు పర్ఫెక్ట్గా ఆడకపోయినా ఎవరో ఒకరు జట్టును ఆదుకుంటారని.. గతంలో మాదిరే ఈసారి అదే పునరావృతం కావొచ్చని బ్రూక్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ముంబై వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం సెమీ ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లు
న్యూజిలాండ్తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ అద్బుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కివీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలైన వేళ తాను ఉన్నానంటూ ముందుకు వచ్చాడు.చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లుకేవలం 77 పరుగులే చేసి సగం వికెట్లు కోల్పోయిన తరుణంలో యాన్సెన్ (Marco Jansen) .. ట్రిస్టన్ స్టబ్స్ (Trisran Stubss)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్కు 47 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా ఈ జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది.సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగా నిలిచింది. అంతేకాదు.. టీ20 ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు యాభైకి పైగా పరుగులు జోడించిన రెండో జంటగా యాన్సెన్- స్టబ్స్ నిలిచారు.Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth— Star Sports (@StarSportsIndia) March 4, 2026టీ20 ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు 50 ప్లస్ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీలు👉మార్కస్ స్టొయినిస్- మాథ్యూవేడ్ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్ మీద 2021 సెమీ ఫైనల్లో 81*👉మార్కో యాన్సెన్- ట్రిస్టన్ స్టబ్స్ (సౌతాఫ్రికా) న్యూజిలాండ్ మీద 2026 సెమీ ఫైనల్లో 73👉ఏంజెలో మాథ్యూస్- కుమార్ సంగక్కర (శ్రీలంక) పాకిస్తాన్ మీద 2009 ఫైనల్లో 68*👉జార్జ్ బెయిలీ- ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) వెస్టిండీస్ మీద 2012 సెమీ ఫైనల్లో 68👉కార్లోస్ బ్రాత్వైట్- మార్లన్ సామ్యూల్స్ (వెసిండీస్) ఇంగ్లండ్ మీద 2016 ఫైనల్లో 54*👉మైకేల్ హస్సీ- మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్ మీద 2010 సెమీ ఫైనల్లో 53*169 పరుగులుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా న్యూజిలాండ్తో సెమీ ఫైనల్లో టాస్ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. మార్కో యాన్సెన్ 55 పరుగులతో అజేయంగా నిలవగా.. స్టబ్స్ 29 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 34 పరుగులతో రాణించాడు. చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC: వార్ వన్సైడ్ అనుకుంటే.. ఆఖర్లో దంచికొట్టేశాడే!
న్యూజిలాండ్తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా మెరుగైన స్కోరు సాధించింది. ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ మెరుపు అర్ధ శతకంతో ఆదుకున్నాడు. ఫలితంగా ప్రొటిస్ జట్టు గౌరవప్రదంగా ఇన్నింగ్స్ ముగించగలిగింది.టీ20 ప్రపంచకప్-2026 తొలి సెమీస్ మ్యాచ్లో భాగంగా కోల్కతాలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఆది నుంచే కివీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో వరుస విరామాల్లో ప్రొటిస్ జట్టు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ కుదేలుఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (18), క్వింటన్ డికాక్ (10), ర్యాన్ రికెల్టన్ (0) పూర్తిగా విఫలమయ్యారు. డెవాల్డ్ బ్రెవిస్ (34) కాసేపు నిలబడగా... డేవిడ్ మిల్లర్ (6) పూర్తిగా నిరాశపరిచాడు. ఫలితంగా డెబ్బై ఏడు పరుగులకే సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి తరుణంలో ట్రిస్టన్ స్టబ్స్ (29)తో కలిసి మార్కో యాన్సెన్ భాగస్వామ్యం నిర్మించాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్కు 47 బంతుల్లో 73 పరుగులు జోడించారు. 27 బంతుల్లో అర్ధ శతకంఇక ఈ మ్యాచ్లో యాన్సెన్ 27 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఈ టోర్నీలో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో సిక్స్ బాది యాభై పరుగుల మార్కు అందుకున్నాడు యాన్సెన్. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు.Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth— Star Sports (@StarSportsIndia) March 4, 2026మిగిలిన వారిలో కార్బిన్ బాష్ రెండు పరుగులు చేయగా.. కగిసో రబడ డకౌట్ అయ్యాడు. కేశవ్ మహరాజ్ ఒక పరుగుతో నాటౌట్గా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. హెన్రీ పొదుపుగా బౌలింగ్ చేయడంతోకివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, కోల్ మెకాంచీ, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్లో హెన్రీ కేవలం ఆరు పరుగులే ఇచ్చి ప్రొటిస్ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
PCB: బాబర్పై వేటు.. కెప్టెన్గా ఆఫ్రిది.. ఆరుగురికి చోటు
ఊహాగానాలే నిజమయ్యాయి. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలమైన ‘స్టార్’ బ్యాటర్ బాబర్ ఆజంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వేటు వేసింది. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ నుంచి అతడిని తప్పించింది.బంగ్లాతో వన్డే సిరీస్కాగా ఢాకా వేదికగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య మార్చి 11- 15 మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో పర్యటించే జట్టును పీసీబీ బుధవారం ప్రకటించింది. పేస్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదిని కెప్టెన్గా కొనసాగించిన యాజమాన్యం.. బాబర్ను మాత్రం ఎంపిక చేయలేదు.ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుఅంతేకాదు.. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు ఇచ్చారు సెలక్టర్లు. తద్వారా సీనియర్లపై కఠిన చర్యలు తప్పవని.. జట్టు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే అబ్దుల్ సమద్, మాజ్ సదాకత్, ముహమద్ ఘాజి ఘోరి, సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, షామిల్ హుసేన్లకు తొలిసారి వన్డే జట్టులో చోటు ఇచ్చారు.అందుకే బాబర్పై వేటు.. వారికి చోటుకాగా బాబర్ ఆజం ఆట తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ప్రపంచకప్ టోర్నీలోనూ అతడు విఫలమయ్యాడు. మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.ఇక గతేడాది వన్డేల్లోనూ బాబర్ ఆజం 17 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 544 పరుగులే చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అతడిని పక్కనపెట్టారు. మరోవైపు.. టీ20 జట్టులో నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ ఫర్హాన్కు మాత్రం సెలక్టర్లు వన్డేక్యాప్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా ఫర్హాన్ వరల్డ్కప్ టోర్నీలో 383 పరుగులతో రాణించాడు.ఇదిలా ఉంటే.. అన్క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్, మాజ్, మసూద్, హుసేన్ ఇప్పటికే పాకిస్తాన్ షాహిన్స్ తరఫున సత్తా చాటారు. ఇక సీనియర్ ప్లేయర్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, పేసర్ హ్యారిస్ రవూఫ్, మొహమ్మద్ వసీం జూనియర్, ఆల్రౌండర్ ఫాహిమ్ ఆష్రఫ్, సల్మాన్ ఆఘా, మణికట్టు స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఈ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.బంగ్లాదేశ్తో వన్డేలకు పాకిస్తాన్ జట్టుషాహిన్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫాహిమ్ ఆష్రఫ్, ఫైజల్ అక్రం, హ్యారిస్ రవూఫ్, హుసేన్ తలత్, మాజ్ సదాకత్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, ముహమద్ ఘాజి ఘోరి (వికెట్ కీపర్), సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా, షామిల్ హుసేన్షెడ్యూల్మార్చి 11- తొలి వన్డేమార్చి 13- రెండోవన్డేమార్చి 15- మూడో వన్డేవేదిక: షేరే బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, ఢాకా.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC 1st Semi Final: టాస్ గెలిచిన కివీస్.. తుదిజట్లు ఇవే
పొట్టి క్రికెట్ మహా సంగ్రామంలో తొలి సెమీ ఫైనల్ పోరుకు తెరలేచింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మెగా మ్యాచ్కు కోల్కతా వేదిక. ఈడెన్ గార్డెన్స్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ప్రొటిస్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది.టాస్ సందర్భంగా కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ బాగుంది. వికెట్ పాతబడే కొద్ది బ్యాటింగ్కు ఇంకాస్త సహకరిస్తుందని అనిపిస్తోంది. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం. ఆది నుంచే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాల్సి ఉంటుంది. మ్యాట్ హెన్రీ తిరిగిఇ వచ్చాడు. సోధి స్థానంలో నీషమ్ కూడా తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.It’s semi-final time! Mitchell Santner has won the toss and opted to bowl first! 🪙Who will be the first team to make it to the final? 🤔ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/N8m1kkxoX8— Star Sports (@StarSportsIndia) March 4, 2026మా తుదిజట్టులో మూడు మార్పులుఇక సౌతాఫ్రికా సారథి ఐడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో ఇప్పటి వరకు మా జట్టులోని ప్రతి సభ్యుడు తమ వంతు సహకారం అందించడం సంతోషకరం. ఈ మ్యాచ్లోనూ గొప్పగా రాణించి మంచి స్కోరు నమోదు చేస్తామని ఆశిస్తున్నా. గత రాత్రి కూడా మేము ప్రాక్టీస్ చేశాము.మా తుదిజట్టులో మూడు మార్పులు చేశాము. రబడ, యాన్సెన్, కేశవ్ మహరాజ్ తిరిగి జట్టులోకి వచ్చారు’’ అని పేర్కొన్నాడు. కాగా సూపర్-8 దశలో అజేయంగా నిలిచిన సౌతాఫ్రికా తొలి టైటిల్ వేట దిశగా సెమీస్ రూపంలో మరో ముందడుగు వేసింది. గత ఎడిషన్లో రన్నరప్తో సరిపెట్టుకున్న సఫారీలు ఈసారి పట్టు వదలకుండా పోరాడేందుకు సిద్ధమయ్యారునిలకడైన ఆట.. ప్రొటిస్దే పైచేయిమరోవైపు.. సౌతాఫ్రికా మాదిరే ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని న్యూజిలాండ్ సైతం ఈసారి ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఈ ఎడిషన్లో ప్రదర్శనల పరంగా కివీస్ కంటే సఫారీలే ఓ అడుగు ముందున్నారు. ఇక సూపర్-8 దశలో పాకిస్తాన్తో ఆడాల్సిన మ్యాచ్ రద్దు కాగా.. శ్రీలంకపై గెలిచిన న్యూజిలాండ్ సెమీస్ రేసులో ముందుకు దూసుకువచ్చింది. ఆఖరి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా.. పాక్ శ్రీలంకపై నామమాత్రపు విజయంతో సరిపెట్టుకోవడంతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టగలిగింది.తుదిజట్లు ఇవేన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెక్కాంచీ, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్సౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC 2026: తిరగబడ్డ పాక్ క్రికెటర్లు!.. ఇక..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో చెత్త ప్రదర్శనతో వార్తల్లో నిలుస్తోంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. గ్రూప్ దశలో అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా వంటి చిన్న జట్లపై గెలుపొందిన సల్మాన్ ఆఘా బృందం.. దాయాది టీమిండియా చేతిలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది.పాకిస్తాన్కు భంగపాటుఇక సూపర్-8 దశలోనూ పేలవ ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోగా.. తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంకపై భారీ విజయం సాధించాల్సి ఉండగా.. లంక గట్టి పోరాటం చేయడంతో పాకిస్తాన్కు భంగపాటు తప్పలేదు.లంకపై గెలిచినా న్యూజిలాండ్తో పోటీలో నెట్ రన్రేటు పరంగా వెనుకబడి సెమీస్ చేరకుండానే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్లో విఫలమైన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.భారీ జరిమానాఏకంగా 50 లక్షల రూపాయలు (పాక్ కరెన్సీలో) జరిమానా విధించాలని పీసీబీ నిర్ణయించినట్లు స్థానిక మీడియాలో ప్రచారం జరిగింది. మరోవైపు కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు పడనుందనే వార్తలూ ఊపందుకున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో.. హెడ్కోచ్ మైక్ హసన్కు వ్యతిరేకంగా పాక్ ఆటగాళ్లు తిరుగుబాటు చేసినట్లు సమాచారం. కోచ్ ఏకపక్ష నిర్ణయాల కారణంగా డ్రెసింగ్ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని ఇప్పటికే పీసీబీ అధికారులకు వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.తిరగబడ్డ పాక్ క్రికెటర్లు!.. ఇక వేటే!జియో సూపర్ కథనం ప్రకారం.. ‘‘టోర్నమెంట్ జరుగుతున్న సమయంలోనే చాలా మంది పాకిస్తాన్ ప్లేయర్లు వ్యక్తిగతంగా పీసీబీ అధికారులను కలసి కోచ్ గురించి ఫిర్యాదు చేశారు. కీలక విషయాలను సైతం కెప్టెన్తో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్న తీరును వారి దృష్టికి తీసుకువచ్చారు.సొంత నిర్ణయాలతో యాజమాన్యం విషయాల్లోనూ హసన్ అతిగా జోక్యం చేసుకుంటున్న తీరును వివరించారు. ఇందుకు సీనియర్ అధికారులు సానుకూలంగా స్పందించి.. సమీక్ష జరుపుతున్నారు. కోచ్తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, హసన్కు రెండేళ్ల కాంట్రాక్టు ఉంది. కాబట్టి ఇప్పట్లో అతడిని తొలగించే ప్రయత్నం జరగకపోవచ్చు’’ అని పీసీబీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్
టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉంది. గ్రూప్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-8కు చేరుకుంది.ఇంగ్లండ్తో సెమీ ఫైనల్అయితే, సూపర్-8లో తొలి మ్యాచ్లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన సూర్యకుమార్ సేన.. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్లను ఓడించి సెమీస్కు అర్హత సాధించింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్ (IND vs ENG)తో గురువారం తలపడనుంది టీమిండియా. ఇందుకు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక.ఇందుకోసం ఇప్పటికే ముంబై చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది. అయితే, మంగళవారం నాటి చంద్ర గ్రహణం ప్రభావం టీమిండియాపై కూడా పడింది. గ్రహణం కారణంగా సూర్యకుమార్ సేన తమ ప్రాక్టీస్ సెషన్ను గంటపాటు వాయిదా వేసుకుంది.టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్కాగా గ్రహణం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 నిమిషాల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయంత్రం 6- 9 గంటల వరకు టీమిండియా ప్రాక్టీస్ చేయాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా అంటే ఏడు గంటలకు నెట్ సెషన్ను ఆరంభించింది. గ్రహణం సమయంలో ఏ పని చేయకూడదని.. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుందేమోనన్న భయంతో భారత జట్టు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.అవును.. మా వాళ్లు చెప్పారుఈ విషయం గురించి టీమిండియా కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. ‘‘అవును.. చంద్ర గ్రహణం గురించి నాకు మా వాళ్లు చెప్పారు. అందుకే సెషన్ను వాయిదా వేసుకున్నాం. అయితే, గ్రహణం ఒక్కటే మా రాతను మారుస్తుందనే భయం లేదు. గెలుపు కోసం అత్యుత్తమంగా ప్రయత్నించడమే ముఖ్యమైనది’’ అని మోర్కెల్ పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్కు ఆఖరిగా బుధవారం కూడా టీమిండియా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే ఇది ఆప్షనల్ కావడంతో వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ మాత్రమే నెట్స్లో శ్రమించారు. మిగతా వారు విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం. చదవండి: IND vs ENG: అభిషేక్ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి -
T20 WC 2026: బాబర్ ఆజం ఎందుకు?.. తొలి రాజీనామా
పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ను పేలవంగా ముగించింది. సూపర్-8లో తప్పక భారీ విజయం సాధించాల్సిన మ్యాచ్లో నామమాత్రపు గెలుపుతో సరిపెట్టుకుంది. ఫలితంగా సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.గుర్రుగా ఉన్న పీసీబీఐసీసీ ఈవెంట్లో పాక్ సెమీ ఫైనల్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టడం వరుసగా ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో ఇంటా బయటా పాక్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సైతం సల్మాన్ ఆఘా (Salman Agha) బృందంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆటగాళ్లకు జరిమానా రూపంలో శిక్ష విధించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.సెలక్టర్ పదవికి రాజీనామాఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్లో వైఫల్యం తర్వాత పాక్ బోర్డులో తొలి వికెట్ పడింది. అలీం దర్ సెలక్టర్ పదవికి రాజీనామా చేశాడు. సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులు, హెడ్కోచ్ మైక్ హసన్ తీరుకు నిరసనగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంపైర్గా పేరుప్రఖ్యాతులు పొందిన అలీం దర్ అక్టోబరు 11, 2024లో పాక్ జట్టు సెలక్టర్గా నియమితుడయ్యాడు.ఆకిబ్ జావేద్, అజర్ అలీ, అనలిస్టు హసన్ చీమాతో కలిసి సెలక్టర్ పదవి చేపట్టాడు. అయితే, టీ20 ప్రపంచకప్ టోర్నీకి జట్టును ఎంపిక చేసే సమయంలో మైక్ హసన్ అతి జోక్యం వల్ల అలీం దర్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం.బాబర్ ఆజం వద్దు అన్నందుకేనా?బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ వంటి సీనియర్లను ఎంపిక చేయవద్దని దర్ భావించగా.. ఆకిబ్ జావేద్ మద్దతుతో హసన్ ఈ ముగ్గురిని జట్టులో చేర్చినట్లు సమాచారం. అదే విధంగా మహ్మద్ రిజ్వాన్ను ఆరో స్థానానికి ఎంపిక చేస్తే బాగుంటుందనే అలీం దర్ అభిప్రాయాన్ని కూడా వీరు కొట్టివేసినట్లు తెలుస్తోంది.అంతేకాదు ఆకిబ్ జావేద్ కోచ్ హసన్కే మద్దతు పలుకుతూ.. ఇతర సభ్యుల నిర్ణయాలను ప్రభావితం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో విసిగిపోయిన అలీం దర్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా మంగళవారమే అతడు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు పాక్ స్థానిక మీడియా పేర్కొంది. కాగా అలీం దర్ వద్దన్నా.. హసన్, జావేద్ పట్టుబట్టి జట్టులో చేర్చిన బాబర్ ఆజం, షాదాబ్, ఉస్మాన్ ఈ టోర్నీలో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
IND vs ENG: అభిషేక్ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొంతకాలంగా విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అతడి వైఫల్యాలే ఇందుకు కారణం. ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కెరీర్లో తొలిసారి వరల్డ్కప్ ఆడుతున్నాడు.మూడు డకౌట్లువిధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. సొంతగడ్డపై భారీ అంచనాల నడుమ బరిలోకి దిగాడు. అయితే, ఆడిన తొలి మూడు మ్యాచ్లలో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఆరు మ్యాచ్లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 80.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో కీలక సెమీ ఫైనల్కు ముందు భారత జట్టు మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వరుస వైఫల్యాల కారణంగా అతడు మానసికంగా కాస్త కుంగిపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. అలాంటపుడు తుదిజట్టు నుంచి అభిషేక్ శర్మను తప్పించడమే సరైన నిర్ణయమని పేర్కొన్నాడు.అదొక్క మార్పు సరిపోతుందిఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘నెట్స్లో బ్యాటింగ్ తీరును చూసి అంచనాకు రాకూడదు. అతడితో ప్రత్యేకంగా మాట్లాడాలి. మానసికంగా అతడు ఎంత దృఢంగా ఉన్నాడో తెలుసుకోవాలి.ఒకవేళ అభిషేక్ శర్మను కొనసాగించకూడదని అనుకుంటే.. ఇషాన్ కిషన్ను ఓపెనర్గా ఆడించాలి. లోయర్ ఆర్డర్లో రింకూ సింగ్ను తీసుకువస్తే సరి. సెమీ ఫైనల్లో తుదజట్టులో అదొక్క మార్పు సరిపోతుంది.అయితే, అభిషేక్ శర్మ గత సిరీస్లో ఇంగ్లండ్ మీద అదరగొట్టిన తీరును మర్చిపోకూడదు. వాంఖడేలో గతంలో అతడి ప్రదర్శన అద్భుతం. అక్కడ అతడు భారీ, వేగవంతమైన శతకాలు బాదాడు. కాబట్టి అభిషేక్ శర్మను కొనసాగిస్తే బాగుంటుందనీ అనుకుంటున్నాను ఒకవేళ రింకూను తీసుకురావాలని అనుకుంటే మాత్రం ఓపెనింగ్ జోడీ మారక తప్పదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. గతేడాది ఇంగ్లండ్పై ఇరగదీసిన అభిషేక్కాగా గతేడాది వాంఖడే వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ 54 బంతుల్లోనే 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్గా అతడు చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం వేదికగా భారత్- ఇంగ్లండ్ సెమీ ఫైనల్లో తలపడేందుకు రంగం సిద్ధమైంది.చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
ధోని, కోహ్లీ, రోహిత్ గ్రూప్లో సంజూ
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ ఇన్నింగ్స్కు భారత అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ముగ్దులయ్యారు. ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో ఏ నోట విన్నా సంజూ పేరే వినిపిస్తుంది. అప్పటిదాకా తిట్టిపోసిన వారు కూడా విండీస్పై చారిత్రక ఇన్నింగ్స్ తర్వాత సంజూను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.అప్పటికే స్టార్ డమ్ ఉన్న సంజూ, ఆ ఒక్క ఇన్నింగ్స్తో దాన్ని మరింత పెంచుకున్నాడు. ఎంతలా అంటే.. భారత మాజీ వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ సంజూను దిగ్గజలు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పోల్చేంతలా. డీకే సంజూను ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో సమానంగా అభిమానుల ఆదరణ పొందుతున్న ఆటగాడిగా అభివర్ణించాడు. అతని మాటల్లో.. సంజూ దేశంలో అత్యంత అభిమానించబడే క్రికెటర్. ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎత్తుపల్లాలు ఎదురైనా, అభిమానులు ఎప్పుడూ ఆయనపై నమ్మకం ఉంచారని అన్నాడు.డీకే అభిప్రాయం ప్రకారం, సంజూ ప్రపంచకప్ ప్రారంభం నుంచే జట్టులో ఉండాల్సింది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లపై కష్టపడుతున్న ఎడమచేతి వాటం బ్యాటర్లకు ప్రత్యామ్నాయంగా సంజూ సమతుల్యతను తీసుకొచ్చాడు.వాస్తవానికి సంజూ టాలెంట్ ఎప్పుడూ గుర్తింపు పొందినా.. గాయాలు, అస్థిరత, ఎంపికల మార్పులు అతని కెరీర్ను దెబ్బతీశాయి. అయినప్పటికీ, అతను సహజమైన స్ట్రోక్ ప్లే, ఆత్మవిశ్వాసంతో తిరిగి తనను చాటుకున్నాడు.కాగా, విండీస్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాపార్డర్ తడబడింది. ఈ దశలో సంజూ (50 బంతుల్లో 97 పరుగులు; 12 ఫోర్లు, 4 సిక్సులు) తానున్నానంటూ ముందుకొచ్చి టీమిండియాను గెలిపించాడు. తద్వారా భారత్ సెమీస్ బెర్త్ ఖరారైంది. రేపు జరుగబోయే సెమీస్లో భారత్ ఇంగ్లండ్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లోనూ సంజూ కీలకమయ్యే అవకాశం ఉంది. -
కుమార సంగక్కర ఇంట తీవ్ర విషాదం
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార్ సంగక్కర ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి, ప్రముఖ న్యాయవాది ఎస్కే సంగక్కర వయోభారంతో నిన్న (మార్చి 3) సాయంత్రం తదిశ్వాస విడిచారు. ఎస్కే సంగక్కర మరణవార్త లంక క్రికెట్ సర్కిల్స్తో పాటు న్యాయ, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సోషల్మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్కే సంగక్కర అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 6 గంటలకు క్యాండీలోని మహాయావా స్మశానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఎస్కే సంగక్కరకు భార్య కుమారి, కుమార సంగక్కర సహా మరో ముగ్గురు తోబుట్టువులు (తుషారి, సురంగ, వెమింద్రా) ఉన్నారు.Saddened to hear the demise of Mr. Kshema Sangakkara, a well known Civil Lawyer, father and first coach of Kumar Sangakkara. RIP sir, your contribution to the law and cricket will not be forgotten🙏 pic.twitter.com/qJfIqNv6Zr— Akhila Seneviratne (@AkhilaSene97) March 3, 2026కాగా, కుమార సంగక్కరకు తొలి గురువు తండ్రే. సంగక్కర దిగ్గజ క్రికెటర్గా ఎదగడంలో ఎస్కే సంగక్కర పాత్ర చాలా కీలకం. ఎస్కే సంగక్కర వృత్తిరిత్యా బిజీ న్యాయవాది అయినప్పటికీ.. కొడుకు క్రికెట్ కెరీర్ కోసం సమయం వెచ్చించే వారు. ఈ విషయాన్ని సంగక్కర తన రిటైర్మెంట్ సందర్భంగా ప్రస్తావించాడు. కుమార సంగక్కర ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. -
నిబంధనలు ఉల్లంఘించిన ధోని.. జరిమానా
నియమ నిబంధనల విషయంలో ఎప్పుడూ నిక్కచ్చిగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. కొద్ది రోజుల కిందట ధోని పేరిట రిజిస్టర్ అయిన ఓ వాహనం రాంచీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు రికార్డైంది. సదరు వాహనం వేగ పరిమితిని మించి ప్రయాణించినట్లు ఆటోమేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తించడంతో మోటార్ వెహికిల్స్ యాక్ట్ సెక్షన్ 183 కింద రూ.1000 జరిమానా విధిస్తూ ఈ-చలాన్ జారీ చేశారు. ఈ ఘటన ధోని నివాసం సమీపంలో జరిగింది. ఇలాంటి ఘటనలు సర్వసాధారణమే అయినా, ధోని పేరు రావడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఇంతకుముందే మరో వివాదందీనికి ముందే ధోని మరో వివాదంలో చిక్కుకున్నాడు. రాంచీలోని హార్ము రోడ్లో ఉన్న ఆయన పాత నివాస స్థలాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపిస్తూ, ఝార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డు నోటీసులు జారీ చేసింది. ఆ స్థలం కేవలం నివాస ప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించబడిందని అధికారులు పేర్కొన్నారు. బిజీగా ధోనిట్రాఫిక్ చలాన్లు, ఇతర వివాదాలపై అవగాహన లేని ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2026 సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. 44 ఏళ్ల ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈ సీజన్కు కూడా రీటైన్ చేసుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్ కోటాలో (రూ. 4 కోట్లు) అతను ఎంపికయ్యాడు. గత సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్ల్లో 10 ఓటములు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. అయితే ధోని వ్యక్తిగంతా రాణించాడు (135.17 స్ట్రైక్ రేట్తో 196 పరుగులు). ధోనికి వయసు మీదపడినప్పటికీ.. ఆయన వ్యూహాత్మక అవగాహన, జట్టుపై నియంత్రణ CSKకి కీలకంగా మారాయి. ఈసారి జట్టు పునర్నిర్మాణ దశలో ఉన్నందున ధోని చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. సంజూ శాంసన్ లాంటి చాలామంది కీలక ఆటగాళ్లను జట్టులో చేర్చుకోవడంలోనూ ధోనిదే కీలకపాత్ర. -
నేడే సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య మెగా సమరం
టీ20 ప్రపంచకప్ 2026 తది దశకు చేరింది. ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్.. రేపు (మార్చి 5) రెండో సెమీఫైనల్ జరుగనున్నాయి. సౌతాఫ్రికా-న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్లో తలపడనుండగా.. భారత్-ఇంగ్లండ్ రెండో సెమీస్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డన్స్ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా.. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రేపు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది.సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్ మరి కొద్గి గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతుంది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, బలాబలాల ప్రకారం ఇరు జట్లు సమానంగా ఉన్నాయన్నది కాదనలేని సత్యం.ప్రస్తుత ఎడిషన్లో సౌతాఫ్రికాతో పోలిస్తే న్యూజిలాండ్ కాస్త తడబడినా, ఆ జట్టు శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎంతటి ప్రతికూల పరిస్థితులను అయినా ఆ జట్టు తమకు అనుకూలంగా మార్చుకున్న సందర్భాలను చాలా చూశాం. ఈ జట్టును ఎప్పుడూ ఫామ్ను బట్టి అంచనా వేయలేని పరిస్థితి. ఒక్కసారి లైన్లోకి వచ్చారంటే వారిని ఆపడం చాలా కష్టం. క్షణాల్లో ఫలితం తారుమారవుతుంది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత ఎడిషన్లో ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా దూసుకుపోతుంది. పైగా గ్రూప్ దశలో న్యూజిలాండ్ను ఓడించిన జోష్లో ఉంది. ఫామ్ను పరిగణిలోకి తీసుకుంటే ఈ జట్టే టైటిల్ ఫేవరెట్లలో ముందుంది.అయితే ఈ జట్టుకు కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. నాకౌట్ మ్యాచ్ల్లో తడబడటం సౌతాఫ్రికాకు పరిపాటి. గతంలో వారు ఇలాంటి అనుభవాలు కోకొల్లలుగా ఎదుర్కొన్నారు. అయితే ఈసారి వారి కసి చూస్తే టైటిల్ గెలవకుండా తమను ఎవరూ ఆపలేరన్నట్లుగా ఉంది. జట్టులోకి ప్రతి ఒక్కరు మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. ఒక్క నాకౌట్ ఫోబియా తప్పించి సౌతాఫ్రికాను ఏదీ కలవరపెట్టట్లేదు.హెడ్ టు హెడ్ రికార్డులు కూడా ఈ జట్టుకే అనుకూలంగా ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు 19 టీ20ల్లో తలపడగా.. సౌతాఫ్రికా 12, న్యూజిలాండ్ ఏడింట మాత్రమే గెలుపొందాయి. ప్రపంచకప్ సమరాల విషయానికొస్తే.. సౌతాఫ్రికా సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. మెగా టోర్నీల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 5 సార్లు ఎదురెదురుపడగా.. ఐదింట సౌతాఫ్రికానే జయకేతనం ఎగురవేసింది.ఇన్ని సానుకూల పరిణామాల మధ్య సౌతాఫ్రికా నేటి మ్యాచ్లో మరోసారి హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.న్యూజిలాండ్ సెమీస్ను అధిగమించిన సందర్భాలు.. 2021 (ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి)సౌతాఫ్రికా సెమీస్ను అధిగమించిన సందర్భాలు.. 2024 (ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి) -
ఐసీసీ ర్యాంకింగ్స్లో సంచలనం
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో సంచలనం చోటు చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఒకేసారి టాప్ ర్యాంక్లు మారాయి. ఇలాంటి పరిణామం చాలా అరుదుగా జరుగుతుంది. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ను కిందకి దించి స్మృతి మంధన (భారత్).. ఇంగ్లండ్కు చెందిన సోఫి ఎక్లెస్టోన్ను కిందకి దించి అలానా కింగ్ (ఆస్ట్రేలియా) అగ్రపీఠాలను అధిరోహించారు.తాజాగా జరిగిన భారత్-ఆసీస్ వన్డే సిరీస్లో ఈ ఇద్దరు అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు. తద్వారా తమతమ విభాగాల్లో టాప్ ర్యాంక్కు చేరారు. బౌలింగ్ విభాగంలో నాలుగేళ్లు అగ్రపీఠంపై కూర్చున్న సోఫిని అలానా కింగ్ తాజా ప్రదర్శనలతో (3 మ్యాచ్ల్లో 7 వికెట్లు) కిందికి దించింది. కింగ్తో పాటు టాప్-8లో మరో నలుగురు ఆసీస్ బౌలర్లు ఉన్నారు. ఆష్లే గార్డనర్ (3), అన్నాబెల్ సదర్ల్యాండ్ (5), మెగాన్ షట్ (7), కిమ్ గార్త్ (8) స్థానాల్లో నిలిచారు.మంధన విషయానికొస్తే.. గత వారం ఆసీస్తో జరిగిన రెండు వన్డేల్లో ఆమె 58, 31 స్కోర్లతో రాణించింది. తద్వారా స్వల్ప తేడాతో వోల్వార్డ్ట్ను అధిగమించి టాప్ ర్యాంక్కు చేరింది. కెరీర్లో చివరి వన్డే (భారత్తో మూడో వన్డే) ఆడిన ఆలైస్సా హీలీ అద్భుతమైన సెంచరీ చేసి 2 స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి, అదే మ్యాచ్లో సెంచరీ చేసిన బెత్ మూనీ కూడా 2 స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకుంది.భారత్ నుంచి మంధనతో సహా హర్మన్ప్రీత్ కౌర్ మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకుంది. ఆసీస్ సిరీస్లో రాణించిన ఆమె నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానాకి ఎగబాకింది.బౌలర్ల ర్యాంకింగ్స్లో టాప్-10లో భారత్ నుంచి ఒక్క దీప్తి శర్మకు మాత్రమే అవకాశం దక్కింది. ఆమె కూడా ఐదు స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయింది. ఇటీవలి ఆసీస్ సిరీస్లో దీప్తి నామమాత్రపు ప్రదర్శనలు కూడా చేయలేక చతికిలపడింది. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లోనూ దీప్తి ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోయింది. ఈ విభాగంలో ఆష్లే గార్డ్నర్ టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. -
రోహిత్, కోహ్లి అభిమానులకు పండగే..!
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు శుభవార్త. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ స్టార్ ద్వయానికి అదనపు అవకాశాలు రానున్నాయి. ఈ ఏడాది చివర్లో టీమిండియా మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ సిరీస్లో 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్లు షెడ్యూలయ్యాయి.2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా వన్డే మ్యాచ్ల సంఖ్యను 3 నుంచి 5కు పెంచాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ కూడా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. వన్డే మ్యాచ్ల సంఖ్య 4కు పెంచితే, టీ20 మ్యాచ్ల సంఖ్యను 3కు కుదించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. వన్డేల పెంపు ఖరారైందని సమాచారం.ఈ అంశం ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు వాణిజ్యపరమైన లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. రోహిత్-విరాట్ ఎక్కువ మ్యాచ్ల్లో కనబడితే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అలాగే వన్డే ప్రపంచకప్కు ముందు రో-కోకు వీలైనంత రియల్ ప్రాక్టీస్ కూడా లభించినట్లవుతుంది. కాబట్టి న్యూజిలాండ్ పర్యటనలో వన్డే లెగ్ పొడిగించడం దాదాపుగా ఖరారైనట్టే. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.ఐపీఎల్ తర్వాత వన్డేలపై దృష్టిఐపీఎల్ 2026 సీజన్ మే చివర్లో ముగిసిన వెంటనే, భారత జట్టు దృష్టి వన్డే ప్రపంచకప్ సన్నాహాలపై కేంద్రీకృతమవుతుంది. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో బిజీగా ఉన్న భారత జట్టు.. జూన్ మొదటి వారం నుంచి వన్డేలపై దృష్టి సారించనుంది.ఐపీఎల్ 2026 తర్వాత భారత వన్డే క్యాలెండర్ - జూన్లో ఆఫ్ఘానిస్తాన్తో మూడు మ్యాచ్లు - జూలైలో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్లు - ఆగస్టులో వెస్టిండీస్తో మూడు మ్యాచ్లు - అక్టోబర్లో న్యూజిలాండ్ పర్యటన- సంవత్సరం చివర్లో శ్రీలంకతో మూడు మ్యాచ్లు -
విండీస్ గడ్డపై తిరుగులేని విజయం సాధించిన శ్రీలంక
వెస్టిండీస్ గడ్డపై శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు తిరుగులేని విజయాలు సాధించింది. 3 వన్డేలు, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం వెస్టిండీస్లో పర్యటించిన శ్రీలంక.. తొలుత వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా టీ20 సిరీస్ను 2-0తో చేజిక్కించుకుంది.నిన్న (మార్చి 4) గ్రెనడా వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఆతిథ్య జట్టుపై శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేసింది.టాపార్డర్ బ్యాటర్లు హేలీ మాథ్యూస్ (8), ఎబోని బ్రాత్వైట్ (8), షవ్నిషా హెక్టార్ (5) దారుణంగా విఫలం కాగా.. మిడిలార్డర్ బ్యాటర్లు స్టెఫాలీ టేలర్ (24), డియాండ్రా డొట్టిన్ (28), చిన్నెల్ హెన్రీ (32 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో రణవీర (4-0-16-2), కవిష దిల్హరి (4-0-13-1), సుగంధిక కుమారి (4-0-32-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.హాసిని పెరీరా (52 నాటౌట్), చమారీ ఆటపట్టు (32), ఇమేషా దులాని (34 నాటౌట్) రాణించడంతో 17.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అర్ద సెంచరీతో రాణించిన హాసినికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. సిరీస్ ఆధ్యాంతం రాణంచిన చమారికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. -
ఆసీస్తో ఏకైక టెస్ట్.. టీమిండియాలో కీలక మార్పు
ఆసీస్తో ఏకైక టెస్ట్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ స్థానంలో యువ పేసర్ కశ్వీ గౌతమ్ను ఎంపిక చేశారు. వర్క్లోడ్ కారణంగా రేణుకా సింగ్కు విశ్రాంతినిచ్చినట్లు సెలెక్టర్లు చెప్పారు. రేణుకా ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడింది, కానీ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసింది. ప్రస్తుత ఆసీస్ పర్యటనలోనూ 3 టీ20లు (4 వికెట్లు), 2 వన్డేలు (ఒక్క వికెట్) ఆడినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. రేణుకా ఫామ్లో లేకపోయినా ఆమె అందుబాటులో లేకపోవడం వల్ల భారత పేస్ విభాగం అనుభవం కోల్పోనుంది. కశ్వీ విషయానికొస్తే.. ఆమెకు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. ఇప్పటివరకు 6 వన్డేలు మాత్రమే ఆడింది. ప్రస్తుత ఆసీస్ సిరీస్లో 3 వికెట్లు తీసి, 68 పరుగులు చేసింది. కశ్వీకి రేణుకా అంత అనుభవం లేకపోవడంతో ఆసీస్ మ్యాచ్లో టీమిండియా పరీక్ష ఎదుర్కోవచ్చు.భారత పేస్ విభాగంలో కశ్వీతో పాటు క్రాంతి గౌడ్, సయాలి సత్ఘరే, అమంజోత్ కౌర్ కూడా టెస్ట్ స్థాయిలో కొత్తవారే. అనుభవలేమితో భారత పేస్ విభాగం ఆసీస్ బ్యాటర్లను ఏమేరకు నిలువరించగలరో చూడాలి. మార్చి 6న పెర్త్లోని WACA మైదానంలో ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. పింక్బాల్తో జరిగే ఈ మ్యాచ్ డే అండ్ నైట్ ఫార్మాట్లో ఉంటుంది.కాగా, భారత మహిళల జట్టు మల్లీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరగగా భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆతిథ్య జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ పర్యటనలో చివరిదైన ఏకైక టెస్ట్ మార్చి 6న ప్రారంభం కానుంది. సిరీస్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 8-4 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్కి నాలుగు పాయింట్లు ఉన్నాయి. భారత్ గెలిస్తే సిరీస్ను సమం చేయగలదు. ఆసీస్తో ఏకైక టెస్ట్కు భారత జట్టు..స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్, ప్రతీక రావల్, షఫాలీ వర్మ, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమన్జోత్ కౌర్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, వైష్ణవి శర్మ, సయాలీ సత్ఘరే, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, క్రాంతి గౌడ్, కశ్వీ గౌతమ్భారత్తో ఏకైక టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టు.. - అలీస్సా హీలీ (కెప్టెన్) - డార్సీ బ్రౌన్ - మైట్లాన్ బ్రౌన్ - అశ్లే గార్డ్నర్ - లూసీ హామిల్టన్ - అలానా కింగ్ - ఫీబీ లిచ్ఫీల్డ్ - బెత్ మూనీ - తాలియా మెక్గ్రాత్ - ఎలీస్ పెర్రీ - అన్నాబెల్ సతర్లాండ్ - జార్జియా వోల్ - జార్జియా వారెహామ్ -
‘లారెస్’ టీమ్ అవార్డు రేసులో భారత మహిళల క్రికెట్ జట్టు
మాడ్రిడ్: గతేడాది తొలిసారి వన్డే ప్రపంచకప్ కొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో పురస్కారం ముంగిట నిలుచుంది. ప్రతిష్టాత్మక ‘లారెస్’ టీమ్ అవార్డు రేసులో హర్మన్ప్రీత్ కౌర్ సేన ఉంది. అంతర్జాతీయ క్రీడల్లో సాధించిన ఘన విజయాలు, ఘనతలకు ప్రతి యేట ‘లారెస్’ స్పోర్ట్స్ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ సారి భారత అమ్మాయిల జట్టు ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యింది. ఒక భారత జట్టు అంతర్జాతీయ పురస్కారాల రేసులో నిలవడం ఇదే మొదటిసారి! భారత క్రికెట్ జట్టుతో పాటు ఈ టీమ్ కేటగిరీలో ఇంగ్లండ్ మహిళల ఫుట్బాల్ జట్టు, యూరోపియన్ రైడర్ కప్ స్క్వాడ్, ఫ్రెంచ్ ఫుట్బాల్ లీగ్ చాంప్ పారిస్ సెయింట్–జెర్మయిన్, మెక్లారెన్ ఫార్ములావన్ టీమ్లు పోటీలో ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో ‘లారెస్’ అవార్డుకు నామినేట్ అయిన తొలి క్రికెట్ జట్టు భారత్ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సెమీస్లో జగజ్జేత ఆ్రస్టేలియా మహిళల జట్టుపై 339 పరుగుల భారీస్కోరును ఛేదించి ఫైనల్ చేరడం, అక్కడ దక్షిణాఫ్రికాను కంగుతినిపించి ప్రపంచకప్ సాధించిన ప్రదర్శనతో ‘లారెస్’ నిర్వాహకులు హర్మన్ సేనను నామినేట్ చేశారు. ఏప్రిల్ 20న స్పెయిన్ రాజధాని నగరం మాడ్రిడ్లో అవార్డుల వేడుక జరుగుతుంది. గతంలో భారత్ తరఫున వ్యక్తిగత విభాగంలో మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (2019), జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (2022), క్రికెటర్ రిషభ్ పంత్ (2025) నామినేట్ అయ్యారు. -
భారత జట్టు ముమ్మర సాధన
టి20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్కు సిద్ధమవుతున్న భారత క్రికెట్ జట్టు పూర్తి స్థాయి సాధనలో పాల్గొంది. ముంబైలోనే వాంఖెడే మైదానంలో మంగళవారం సుదీర్ఘ సమయం పాటు సాగిన ప్రాక్టీస్లో జట్టులో 15 మంది సభ్యులందరూ పాల్గొన్నారు. చంద్రగ్రహణం కారణంగా జట్టు ప్రాక్టీస్ దాదాపు గంట ఆలస్యంగా మొదలైంది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ పర్యవేక్షణలో అభిషేక్ శర్మ ప్రత్యేకంగా ఆఫ్ స్పిన్ను ఎదుర్కొంటూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్ ఆఫ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడు. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ అటు స్పిన్, ఇటు పేస్ బౌలింగ్లో సాధన చేశారు. కుల్దీప్ బౌలింగ్లో స్లాగ్స్వీప్లపై తిలక్ దృష్టి పెట్టాడు. అర్ష్ దీప్ సింగ్ యార్కర్లను సంధించడంపై ఎక్కువగా ప్రాక్టీస్ చేయగా, బుమ్రా మాత్రం ఎదురుగా బ్యాటర్ లేకుండా తనదైన శైలిలో స్పాట్ బౌలింగ్కే ప్రాధాన్యతనిచ్చాడు. హార్దిక్ పాండ్యా మాత్రం భారీ షాట్లపైనే దృష్టి పెడుతూ ప్రతీ బంతినీ బౌండరీకి తరలించే తరహాలో సాధన చేశాడు. సెమీస్కు రెండు రోజుల మాత్రం పిచ్పై చాలా పచి్చక కనిపిస్తున్నా...మ్యాచ్ ముందు దానిని తొలగించే అవకాశం ఉంది. -
సెమీస్ సమరానికి సిద్ధం
టి20 ప్రపంచ కప్ చరిత్రలో రెండు టీమ్లదీ దాదాపు ఒకే రకమైన పరిస్థితి...ఇరు జట్లు ఒక్కో సారి ఫైనల్ వరకు చేరగలిగినా టైటిల్ గెలుచుకోలేక రన్నరప్గానే సంతృప్తి చెందాయి. లీగ్ దశలో అద్భుతంగా ఆడుతున్నా, ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతున్నా అసలు సమయంలో మాత్రం ఈ టీమ్లు చేతులెత్తేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఫైనల్ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిద్ధమయ్యాయి. రెండు టీమ్లలో ఒకరికి మాత్రమే టైటిల్ వేటలో పోటీ పడేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో తుది పోరుకు అర్హత సాధించేందుకు రెండు జట్లూ సై అంటున్నాయి. ఈడెన్ గార్డెన్స్లో హోరాహోరీ పోరులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరం. కోల్కతా: టి20 వరల్డ్ కప్ తొలి నాకౌట్ సమరానికి రంగం సిద్ధమైంది. నేడు (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో గత టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్లలో కూడా విజయాలు సాధించే దక్షిణాఫ్రికా అజేయంగా సెమీస్ చేరగా...కివీస్ ప్రస్థానం మాత్రం తడబడుతూ సాగింది. లీగ్ దశలో మూడు బలహీన జట్లను ఓడించిన న్యూజిలాండ్, సూపర్ ఎయిట్స్లో ఒకటే విజయంతో ముందంజ వేసింది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో దక్షిణాఫ్రికా అలవోక విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ఫైనల్ చేరుతుందా లేక గత మ్యాచ్కు కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా చూడాలి. అద్భుత ఫామ్లో... 2024 వరల్డ్ కప్ ఫైనల్లో దాదాపు చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించి అనూహ్యంగా ఓడిన దక్షిణాఫ్రికా ఈ సారి మెగా టోర్నీకి బాగా సన్నద్ధమై వచ్చినట్లు కనిపించింది. ప్రత్యర్థులకు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ జట్టు చెలరేగిపోతోంది. అఫ్గనిస్తాన్పై పోరు సూపర్ ఓవర్ వరకు వెళ్లినా...భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్లను ఓడించిన తీరు జట్టు బలాన్ని చూపించింది. కెప్టెన్ మార్క్రమ్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో కనిపిస్తున్నాడు. టాపార్డర్లో డికాక్, రికెల్టన్లనుంచి అతనికి సరైన మద్దతు లభిస్తోంది. బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్లతో మిడిలార్డర్ చాలా పటిష్టంగా ఉంది. మిల్లర్ చాలా కాలంగా నిలకడగా రాణిస్తుండగా, బ్రెవిస్ మెరుపు బ్యాటింగ్తో ఏ టీమ్పైనైనా చెలరేగిపోగలడు. యాన్సెన్, బాష్ రూపంలో ఇద్దరు చక్కటి ఆల్రౌండర్లు ఉండటం జట్టు బలాన్ని పెంచింది. బౌలింగ్లో ఇద్దరు బెస్ట్ ఫాస్ట్ బౌలర్లు జట్టును నడిపిస్తున్నారు. రబాడ, ఎన్గిడి ప్రతీ మ్యాచ్లో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలం కావడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి కోలుకోకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తన ఆటను అమాంతం మెరుగుపర్చుకున్న ఎన్గిడి ‘స్లో బంతులు’ బ్యాటర్లకు పెద్ద సమస్యగా మారాయి. జట్టులో ఏకైక స్పిన్నర్గా కేశవ్ మహరాజ్ తన సత్తాను ప్రదర్శిస్తున్నాడు. ఓవరాల్గా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న సఫారీలకే గెలుపు సానుకూలత ఎక్కువగా ఉంది. తడబడుతూనే... ప్రత్యర్థితో పోలిస్తే న్యూజిలాండ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. టోర్నీ ఆరంభానికి ముందు బలాబలాల్లో ఏ జట్టుకూ కూడా తీసిపోనట్లు కనిపించిన కివీస్ అసలు సమయంలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శనను చూపించలేకపోయింది. ఏ ఆటగాడు కూడా ఒంటిచేత్తో టీమ్ను గెలిపించేలా కనిపించడం లేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో కూడా జట్టులో తడబాటు కనిపిస్తూనే ఉంది. టాప్–3 బ్యాటర్లు సీఫెర్ట్, అలెన్, రచిన్లలో ఎవరూ గొప్పగా ఆడలేదు. ఫిలిప్స్లో కూడా నిలకడ లోపించగా...చాప్మన్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇటీవల భారత్తో సిరీస్లో చెలరేగిన మిచెల్ పెద్దగా ప్రభావం చూపలేకపోగా...కెపె్టన్ సాంట్నర్ వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. బౌలింగ్లో విఫలమైన సాంట్నర్ బ్యాటింగ్లో కూడా ఒక్క ఇన్నింగ్స్ మినహా ఎక్కడా బాగా ఆడలేదు. ఇంగ్లండ్ చేతిలో పరాజయం జట్టు బలహీనతలను స్పష్టంగా చూపించింది. బౌలింగ్లో ఫెర్గూసన్పైనే ప్రధానంగా పేస్ భారం ఉంది. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన హెన్రీ సెమీస్ వరకు తిరిగి వస్తాడని మేనేజ్మెంట్ చెప్పినా, దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక వేళ హెన్రీ రాకపోతే అతని స్థానంలో డఫీ బరిలోకి దిగుతాడు. కివీస్ ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో ఆడుతున్నా ఒక్కరు కూడా ప్రమాదకరంగా కనిపించడం లేదు. అందరూ ధారాళంగా పరుగులిస్తున్నారు. తుది జట్లు (అంచనా) దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బాష్, రబాడ, మహరాజ్, ఎన్గిడి న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), సీఫెర్ట్, అలెన్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, మెక్కోన్కీ, సోధి, ఫెర్గూసన్, హెన్రీ / డఫీ5-0 టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్లు జరగ్గా...ఐదు కూడా దక్షిణాఫ్రికానే గెలిచింది. పిచ్, వాతావరణంబ్యాటింగ్కు బాగా అనుకూలమైన పిచ్. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావంతక్కువగా ఉన్నా సరే ఇక్కడ ఛేదన చాలా సులువు. భారత్, విండీస్ మధ్య పోరులో కూడా ఇది కనిపించింది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. -
హ్యాట్సాఫ్ హీలీ
ఆరుసార్లు ఐసీసీ మహిళల టి20 ప్రంపచకప్ ముద్దాడిన ఏకైక ప్లేయర్గా రికార్డు... రెండు వన్డే వరల్డ్కప్లు గెలిచిన ఘనత... మహిళల అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డు... అత్యధిక స్టంపింగ్స్ చేసిన గుర్తింపు.. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్ కీపర్గా చరిత్ర. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్కీపర్! ఒకే సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత అవుతుంది. సుదీర్ఘ కెరీర్లో ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఆ్రస్టేలియా మహిళల క్రికెట్ జట్టు దిగ్గజ ప్లేయర్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. ఆదివారం టీమిండియాతో ఆడిన తన కెరీర్ చివరి వన్డేలో భారీ సెంచరీతో కదం తొక్కిన హీలీ... శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా జరగనున్న ఏకైక టెస్టులో చివరిసారి ఆసీస్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. మహిళల క్రికెట్లో దిగ్గజ స్థాయికి చేరిన హీలీ కెరీర్ను ఓసారి విశ్లేషిస్తే... – సాక్షి, క్రీడావిభాగం ఇప్పుండంటే అలీసా హీలీ పెద్ద స్టార్ అయిఉండవచ్చు కానీ... కెరీర్ తొలినాళ్లలో ఆమె మెరుగైన జీవనం కోసం రెస్టారెంట్లో పనిచేసింది. 2009–10 మధ్య హీలీ ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు కేఎఫ్సీలో పనిచేస్తూ క్రికెట్ ప్రాక్టీస్ కొనసాగించింది. అలా ఆమె పడ్డ శ్రమ వృథా పోలేదు. నిలకడగా రాణిస్తున్న హీలీకి 2010లో తొలిసారి జాతీయ జట్టులో అవకాశం వచ్చింది. న్యూజిలాండ్తో ఆడిన అరంగేట్ర మ్యాచ్లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన అలీసా... 11 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేసింది. అప్పటికీ అదీ మహిళల వన్డేల్లో ఈ దూకుడు ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. లోయర్ ఆర్డర్లో జట్టుకు మంచి ‘పించ్ హిట్టర్’ దొరికిందని మేనేజ్మెంట్ భావించింది. అయితే ఆ జోరు ఎక్కువ కాలం కొనసాగలేదు. వికెట్ల వెనక అద్భుతమైన ప్రతిభ కనబర్చిన హీలీ... బ్యాటింగ్లో ఆ స్థాయిలో రాణించలేకపోయింది. అయినా... కీపింగ్లో ఆమె అసాధారణ గణాంకాలు జట్టులో చోటుకు భరోసానిచ్చాయి. మలుపుతిప్పిన 2017 అప్పటి వరకు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం... అవసరమైనప్పుడు ధాటిగా ఆడటం అలవాటు చేసుకున్న హీలీకి 2017లో అతిపెద్ద ప్రమోషన్ దక్కింది. ఆ ఏడాది అక్టోబర్లో హీలీకి ఇన్నింగ్స్ను ఆరంభించే అవకాశం దక్కింది. అప్పటి వరకు అడపాదడపా మెరుపులు మెరిపించిన అలీసా... ఇక దంచికొట్టడం ప్రారంభించింది. ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ... ఇన్నింగ్స్ను వాయువేగంతో ప్రారంభించడం అలవాటుగా మార్చుకుంది. 2017కు ముందు... ఆ తర్వాత ఆమె కెరీర్ను చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. 2017 ముందు వరకు 52 మ్యాచ్లాడి 15.96 సగటుతో 495 పరుగులే చేసిన ఈ వికెట్కీపర్... ఆ తర్వాత 74 మ్యాచ్ల్లో 46.22 సగటుతో 3282 పరుగులు చేసింది. వన్డేల్లో అలీసా స్ట్రయిక్రేట్ వందకు పైగా ఉంది అంటే ఆమె ఆటతీరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘నిజం చెప్పాలంటే కెరీర్ తొలి ఏడెనిమిది సంవత్సరాలు నేనేం అంత బాగా ఆడలేదు. అంతగా అవకాశాలు కూడా రాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశా’ అని ఇటీవల హీలీ వెల్లడించింది. 8 వరల్డ్కప్ల విజేత... అంతర్జాతీయ క్రికెట్లో ఆ్రస్టేలియా హవా సాగుతున్న సమయంలోనే హీలీ కెరీర్ కొనసాగింది. దీంతో సహజంగానే ఆమె ఖాతాలో అత్యధిక వరల్డ్కప్లు చేరాయి. 2010, 2012, 2014, 2018, 2020, 2023 ఐసీసీ టి20 వరల్డ్కప్లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో హీలీ సభ్యురాలు... మహిళల క్రికెట్లో మరే ప్లేయర్ ఆరుసార్లు పొట్టి ప్రపంచకప్ను ముద్దాడలేదు. ఇక 2013, 2022 వన్డే ప్రపంచకప్లు గెలిచిన జట్టులోనూ హీలీ ప్రధానపాత్ర పోషించింది. 2022 వరల్డ్కప్ పైనల్లో ఆమె కొట్టిన సెంచరీని అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. ఇంగ్లండ్తో జరిగిన తుది పోరులో 138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు చేసి ఆసీస్ భారీ విజయానికి అలీసా బాటలు వేసింది. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో వరుసగా రెండు సెంచరీలు బాది రికార్డు సృష్టించిన హీలీ... టీమిండియాతో జరిగిన సెమీఫైనల్లో విఫలమైంది. ఆ తర్వాత కెరీర్కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించిన ఆసీస్ సారథి... ఆసీస్లో టీమిండియా పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగనుంది. ఆదివారం భారత్తో జరిగిన ఆఖరి వన్డేలో హీలీ బ్యాటింగ్ చూసిన వారెవరైనా ఆమెకు 35 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే. కెరీర్ ఆఖరి వన్డేలోనూ అలవోకగా పరుగులు రాబట్టిన హీలీ అనవసరంగా రిటైర్మెంట్ ప్రకటించిందనే అనుమానం రాకమానదు. తన కెరీర్లో చివరి వన్డేలో కెప్టెన్ గా బరిలోకి దిగిన ఈ ఓపెనర్ 98 బంతుల్లోనే 158 పరుగులు చేసింది. ఆమె కెరీర్లో ఎన్నో శతకాలు ఉన్నా... దీని ప్రత్యేకతే వేరు. ఈ ఇన్నింగ్స్లో కేవలం బౌండరీల ద్వారానే అలీసా 120 పరుగులు రాబట్టడం విశేషం. ఇన్ని ఘనతలు సాధించిన హీలీ... శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనుంది. గతేడాది జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో ఆమెను ఏ జట్టు తీసుకోకపోయినా... భవిష్యత్తుల్లో అలీసా మహిళల బిగ్బాష్ లీగ్లో ఆడటం ఖాయమే. మిచెల్ స్టార్క్తో వివాహబంధం...క్రీడా కుటుంబానికే చెందిన హీలీ మొదటి నుంచే మంచి అథ్లెట్. దీంతో కష్టతరమైన క్యాచ్లను సైతం ఎంతో ఒడుపుగా అందుకునేది. ఆ్రస్టేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ హీలీ అన్న కుమార్తెగా తనమీద ఉన్న ముద్రను చెరిపేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2015లో ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు పేసర్ మిచెల్ స్టార్క్తో హీలీకి పరిచయం ఏర్పడింది. స్టార్క్ కూడా వికెట్ కీపర్గానే కెరీర్ ప్రారంభించగా... వీరిద్దరి మనసులు కలిసి 2016లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఒకరికొకరు అండగా నిలుస్తూ... రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్నారు. ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్ ఆడిన తొలి భార్యాభర్తలుగా రికార్డు సృష్టించిన వీరిద్దరూ... పలు సందర్భాల్లో తమ మధ్య అవగాహనను బాహాటంగానే వెల్లడించారు. 2020లో మహిళల ప్రపంచకప్ ఫైనల్లో తన భార్య ఆట చూసేందుకు స్టార్క్ వన్డే సిరీస్ నుంచి సెలవు తీసుకొని స్వదేశానికి చేరడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. -
చెత్త ఫీల్డింగ్.. టీమిండియా గెలవలేదు: పాక్ మాజీ బౌలర్ ఓవరాక్షన్
పాకిస్తాన్ మాజీ బౌలర్ మహ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. భారత జట్టుకు ఫైనల్ చేరే సత్తా లేదంటూ అవాకులు చెవాకులు పేలాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ దశలో సూర్యకుమార్ సేన అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.అజేయంగా సూపర్-8గ్రూప్-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి.. సూపర్-8లో అడుగుపెట్టింది. అయితే, స్థాయికి తగ్గట్లు రాణించడంలో మాత్రం విఫలమైందనే చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్ స్థానిక మీడియాలో మాట్లాడుతూ.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్ సెమీస్ చేరతాయని.. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేదంటూ ఓవరాక్షన్ చేశాడు.అయితే, అతడి అంచనాలు తలకిందులు చేస్తూ భారత జట్టు సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా టాప్-4లో అడుగుపెట్టింది. దీంతో మహ్మద్ ఆమిర్ను చివాట్లు పెడుతూ టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.ఆ జట్టు ఫీల్డింగ్ చూడండిఅయినప్పటికీ ఆమిర్ తీరు మారలేదు. మరోసారి టీమిండియాను ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘క్రికెట్ కోణంలోనే నేను మాట్లాడుతున్నాను. నిజానికి టీమిండియా అంత గొప్పగా ఏమీ ఆడటం లేదు. ముఖ్యంగా ఆ జట్టు ఫీల్డింగ్ చూడండి.గత మ్యాచ్లో వాళ్లు 3-4 క్యాచ్లు వదిలేశారు. జస్ప్రీత్ బుమ్రా తప్ప ఇతర బౌలర్లు పెద్దగా రాణించడం లేదు. హార్దిక్ పాండ్యా పెద్ద జట్లపై ఆడలేడని నేను చెప్పాను. అందుకు తగ్గట్లేఅతడు నాలుగు ఓవర్లలో అతడు 40 పరుగులు ఇచ్చుకున్నాడు.టీమిండియా టైటిల్ ఫేవరెట్ కాదుఇక వెస్టిండీస్ బ్యాటర్లు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనూ చితక్కొట్టారు. సెమీ ఫైనల్లో భారత్తో ఆడే జట్టు స్పిన్నర్ల బౌలింగ్లో రాణించగల సత్తా కలిగి ఉంది. కాబట్టి నా దృష్టిలో టీమిండియా టైటిల్ ఫేవరెట్ కాదు. వాళ్లు ఫైనల్ చేరతారని నేను ఇప్పటికీ నమ్మడం లేదు’’ అని మహ్మద్ ఆమిర్ అతి చేశాడు. ఈ నేపథ్యంలో మరోసారి భారత నెటిజన్లు ఆమిర్కు చురకలు అంటిస్తున్నారు. ముందు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా పాక్ సూపర్-8 దశలోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్ను ఎదుర్కోనుంది. ముంబైలో గురువారం జరిగే ఈ మ్యాచ్కు వాంఖడే స్టేడియం వేదిక. చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
T20 WC: సంజూకు పొంచి ఉన్న ప్రమాదం.. వేటు తప్పదా?
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్.. రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్- టీమిండియా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.సఫారీ- కివీస్ జట్లు బుధవారం కోల్కతా వేదికగా అమీతుమీ తేల్చుకోనుండగా.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) ముంబై గురువారం సెమీ ఫైనల్లో పోటీపడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక సూపర్-8లో హ్యాట్రిక్ విజయాలతో ఇంగ్లండ్ జోరు మీద ఉండగా.. టీమిండియా మాత్రం సెమీస్ చేరేందుకు కష్టపడాల్సి వచ్చింది.వీరోచిత ఇన్నింగ్స్అయితే, వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ (50 బంతుల్లో 97 నాటౌట్)తో రాణించడంతో భారత్ గట్టెక్కి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ తప్పిదాలు.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్ప వేరే బౌలర్ ఎవరూ పెద్దగా రాణించకపోవడం.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ విఫలం కావడం సెమీస్కు ముందు ఆందోళన కలిగిస్తున్నాయి.సంజూకు పొంచి ఉన్న ప్రమాదంఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో సెమీస్లో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ నడుస్తోంది. గత మ్యాచ్లో అదరగొట్టిన సంజూకు ఈ మ్యాచ్లో మాత్రం జోఫ్రా ఆర్చర్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. గతేడాది అంతర్జాతీయ టీ20లలో ఈ ఇంగ్లండ్ పేసర్ సంజూను బాగా ఇబ్బంది పెట్టాడు.సంజూకు ఆర్చర్ 23 డెలివరీలు సంధించగా.. అతడు కేవలం 25 పరుగులే రాబట్టగలిగాడు. ఇందులో ఒక ఫోర్, రెండు సిక్స్లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు.. మూడుసార్లు ఆర్చర్ బౌలింగ్లో అవుటయ్యాడు.ఆర్చర్తో పాటు అతడూఒకవేళ ఇంగ్లండ్ ఈసారి కూడా ఆర్చర్తోనే బౌలింగ్ ఎటాక్ ఆరంభిస్తే.. ఓపెనర్ సంజూ మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇక సామ్ కర్రాన్ కూడా సంజూకు సవాలు విసిరే అవకాశం ఉంది. పొట్టి క్రికెట్లో నాలుగేళ్లలో సామ్ సంజూకు 16 డెలివరీలు సంధించగా.. అతడు 21 పరుగులు చేయగలిగాడు. రెండుసార్లు అవుటయ్యాడు. ఈ ప్రమాదాల్ని అధిగమిస్తేనే సంజూ టీమిండియాకు మంచి ఆరంభం ఇవ్వగలడు. గత గణాంకాలను బట్టి సంజూను తుదిజట్టులో ఆడిస్తారా?.. ఒకవేళ ఆడించినా ఓపెనర్గా పంపుతారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.వేటు పడుతుందా?అయితే, సంజూపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ విండీస్తో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ ఇంగ్లండ్తో సెమీ ఫైనల్ ఆడనున్నట్లు తెలుస్తోంది.కాగా గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమైన సంజూ ఓపెనర్గా, వికెట్ కీపర్గా జట్టులో స్థానం కోల్పోయాడు. టీ20 ప్రపంచకప్లో నమీబియాతో ఆడిన అతడు.. ఆ తర్వాత మళ్లీ సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్లతో ఆడాడు. మొత్తంగా మూడు మ్యాచ్లలో కలిపి 143 పరుగులు సాధించాడు.వెస్టిండీస్తో ఆడిన భారత తుదిజట్టుసంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
ఆ ఆరోపణల్లో నిజం లేదు!.. HCAకు వ్యతిరేకంగా ధర్నా
తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు అమర్నాథ్ కొట్టిపారేశారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి చెక్కు లపై సంతకాలు పెట్టలేదని స్పష్టం చేశారు. కాగా HCA నుంచి విశాఖ కంపెనీకి రూ. 69 కోట్లు చెల్లింపులు జరిగాయన్న అంశం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం జింఖానా గ్రౌండ్స్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అమర్నాథ్.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని పేర్కొన్నారు. ‘‘69 కోట్ల రూపాయలు HCA నుంచి విశాఖ కంపెనీ కి చెల్లింపుల వెనుక నా ప్రమేయం లేదు. నేను ఛార్జ్ తీసుకోక ముందే ప్రాసెస్ జరిగింది. డబ్బులు చెల్లించాలి అని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి’’ అని అమర్నాథ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఒకవైపు HCA ప్రెస్ మీట్ జరుగుతుండగానే క్రికెట్ సంఘాలు మెరుపు ధర్నాకు దిగాయి. HCAలో 70 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని.. నిధులు తప్పుదోవ పట్టించారని ఆందోళన చేపట్టాయి.మంత్రి వివేక్కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ కి 70 కోట్ల రూపాయలు అక్రమంగా చెల్లించారని ఆరోపణలు చేశాయి. మంత్రి ఆదేశాల మేరకు HCA లో ఉన్న పెద్దలు 70 కోట్లు విడుదల చేశారని క్రికెట్ సంఘాల ఆరోపించాయి. ఈ ఆరోపణను కొట్టి పారేస్తూ.. HCA ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగానే క్రికెట్ సంఘాలు మళ్లీ ఆందోళనకు దిగడం గమనార్హం. దీంతో జింఖానా గ్రౌండ్ లో గందరగోళం నెలకొంది. -
బ్యాటింగ్ చేయడు.. చెత్త ఫీల్డింగ్: భారత మాజీ క్రికెటర్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆట తీరుపై విమర్శల వర్షం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ చేసిన పరుగులు 80. ఇందులో మూడు డకౌట్లు.. ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి.సూపర్-8 దశలో వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లోనూ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్కు ముందు భారత శిబిరంలో ఆందోళన నెలకొంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి.. అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఆట తీరుపై మండిపడ్డాడు. నిర్లక్ష్యంగా ఆడితే.. తుదిజట్టులో చోటు కోల్పోయే దుస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఈ మేరకు క్రిక్బజ్తో మాట్లాడుతూ..తక్కువ సమయంలోనే సూపర్ స్టార్గా‘‘వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే చెత్త షాట్లతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అతి తక్కువ సమయంలోనే అభిషేక్ శర్మ సూపర్ స్టార్ అయ్యాడు. భవిష్యత్తులోనూ సూపర్స్టార్గా కొనసాగాలంటే జట్టుకు విజయాలు అందించాలి.భారత జట్టులో చోటు కోసం ఎంతో మంది పోటీపడుతున్నారు. ఎంతో మంది మ్యాచ్ విన్నర్లుగా ఇప్పటికే నిరూపించుకున్నారు. వాళ్లందరినీ దాటి జట్టులో కొనసాగాలంటే మెరుగ్గా ఆడాలి. బ్యాటింగ్ చేయడు.. చెత్త ఫీల్డింగ్వెస్టిండీస్తో మ్యాచ్లో అతడు బ్యాట్ ఝులిపించాల్సింది. అంతేకాదు రెండు క్యాచ్లు జారవిడిచి.. చెత్త ఫీల్డింగ్తోనూ నిరాశపరిచాడు. అతడి మైండ్సెట్ ఇప్పటికైనా మారాలి’’ అని మనోజ్ తివారి అభిషేక్ శర్మ ఆట తీరును విమర్శించాడు. మరోవైపు.. భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం అభిషేక్ ఫామ్లేమిపై ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ బ్యాటర్గా ఉన్న ఈ టీమిండియా ఓపెనర్ ఆటపై అభిమానులు సైతం గుర్రుగా ఉన్నారు.చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
IPL 2026: ఆర్సీబీ అభిమానులకు గుడ్న్యూస్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఐపీఎల్-2026లో ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్లు ఆడనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మీనన్ మంగళవారం ధ్రువీకరించాడు.తీవ్ర విషాదంకాగా 2008లో ఐపీఎల్ మొదలైన నాటి నుంచి క్రేజీ జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. గతేడాది వరకు టైటిల్ గెలవలేకపోయింది. పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2025లో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగిపోగా.. ఫ్రాంఛైజీ తొందరపాటు చర్య తీవ్ర విషాదానికి దారితీసింది.హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో.. అనుమతి లేకుండానే ఆర్సీబీ విజయోత్సవ సభ ఏర్పాటు చేయగా.. అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగి పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆర్సీబీపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.ఈ క్రమంలో ఐపీఎల్-2026లో ఆర్సీబీ తమ హోం గ్రౌండ్ను మారుస్తుందనే వార్తలు వచ్చాయి. పుణె, ముంబై సహా ఇతర నగరాల్లో తమ మ్యాచ్లు ఆడేలా ఆర్సీబీ యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే, కర్ణాటక ప్రభుత్వం అనుమతితో తిరిగి చిన్నస్వామి స్టేడియంలోనే తమ మ్యాచ్లు ఆడేందుకు ఆర్సీబీ నిర్ణయించుకుంది.ఎంతో సంతోషిస్తున్నాఈ విషయం గురించి ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మీనన్ స్పందిస్తూ.. ‘‘సుదీర్ఘ చర్చలు.. అన్ని అనుమతులు తీసుకున్న అనంతరం మీకు ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఆర్సీబీ ఈసారి ఐదు మ్యాచ్లు బెంగళూరులోనే ఆడుతుంది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు.బెంగళూరులో మ్యాచ్లు సజావుగా సాగేలా హామీ ఇచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు’’ అని ప్రకటన విడుదల చేశాడు. కాగా భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీతోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కెప్టెన్గా టైటిల్ అందుకోలేకపోయిన కోహ్లి.. గతేడాది రజత్ పాటిదార్ సారథ్యంలో తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ తమ మిగిలిన రెండు హోం మ్యాచ్లను రాయ్పూర్లో ఆడనుంది.చదవండి: అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్ వేస్ట్: గంభీర్ -
చిల్లర.. సంకుచిత బుద్ధి: పాక్ బోర్డుపై మండిపడ్డ ఆఫ్రిది
ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్ మరోసారి నిరాశపరిచింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పేలవ ప్రదర్శనతో ‘సూపర్–8’ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సీనియర్లపై గుర్రుగా ఉంది.ఈ నేపథ్యంలో ఆటగాళ్ల పారితోషికాలు, మ్యాచ్ ఫీజుల్లో కోత విధించేందుకు పీసీబీ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ‘‘ఈ విషయంలో బోర్డు తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఫీజుల్లో కోత విధించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఆటగాళ్ల చెత్త ప్రదర్శనకు ఈ విధంగా మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది’’ అని పీసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.చిల్లర.. సంకుచిత బుద్ధిఈ విషయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) ఘాటుగా స్పందించాడు. పీసీబీ విధించే జరిమానా చిల్లరలా ఉందని.. ఇంత సంకుచిత స్వభావం పనికిరాదంటూ బోర్డు తీరును విమర్శించాడు. చెత్తగా ఆడి దేశం పరువు తీసిన వాళ్లకు ఇంతకంటే కఠినమైన శిక్షలు విధించాలంటూ పాక్ జట్టు తీరుపై మండిపడ్డాడు.‘‘ఇది చాలా చిన్న మొత్తం. యాభై లక్షల రూపాయలతో మీరేం చేస్తారు? ఇది అసలు జరిమానాలా అనిపించడమే లేదు. ఇంత సంకుచిత బుద్ధి పనికిరాదు. సరిగ్గా ఆడని క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.రెండేళ్లు పక్కన పెట్టండిఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని చెప్పాలి. జట్టులో ‘ఇంకొందరు మహానుభావులు’ ఉన్నారు. వాళ్లనైతే మరో రెండేళ్లపాటు జాతీయ జట్టుకు ఎంపిక చేయకూడదు. వాళ్లకు ఇలాంటి శిక్ష అయితేనే సరిగ్గా ఉంటుంది’’ అని షాహిద్ ఆఫ్రిది ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా బాగా ఆడని ఆటగాళ్లకు పాకిస్తాన్ కరెన్సీలో రూ. 50 లక్షలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 16 లక్షలు) జరిమానా వేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆఫ్రిది అన్నట్లు పాక్ ఆటగాళ్లకు ఇదేమీ చిన్నమొత్తం కాదు. వార్షిక కాంట్రాక్టులలో గ్రేడ్ సి, డిలలో ఉన్న వాళ్లకు పాక్ కరెన్సీలో కేవలం రూ. 10- 17 లక్షల పారితోషికం మాత్రమే ఉంటుంది.నానాటికీ తీసికట్టుగాఇదిలా ఉంటే.. మేజర్ టోర్నీల్లో పాకిస్తాన్ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఐసీసీ ఈవెంట్లలో కనీసం సెమీస్ కూడా చేరకుండా జట్టు నిష్క్రమించడం వరుసగా ఇది నాలుగోసారి.ఈ నేపథ్యంలో బోర్డు కఠిన నిర్ణయాలకు వెనుకాడటం లేదు. మరోవైపు.. ప్రపంచకప్ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడిన పాకిస్తాన్ ఆదివారం రాత్రి కొలంబో నుంచి నేరుగా లాహోర్ చేరుకుంది. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లంతా గప్చుప్గా ఇంటిబాట పట్టారు. కాగా వరల్డ్కప్ టోర్నీలో సల్మాన్ ఆఘా కెప్టెన్సీలో పాక్.. గ్రూప్ దశలో పసికూనలు నెదర్లాండ్స్, అమెరికా, నమీబియాలపై గెలిచింది. టీమిండియా చేతిలో మాత్రం చిత్తుగా ఓడింది. సూపర్-8 దశలో న్యూజిలాండ్తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. తదుపరి ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఆఖరిగా శ్రీలంకపై గెలిచినా నెట్ రన్రేటు పరంగా వెనుకబడి సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్!
ఆకిబ్ నబీ.. భారత క్రికెట్లో ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో అతడి అత్యద్భుత ప్రదర్శనలు ఇందుకు కారణం. జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో ఈ పేస్ బౌలర్ది కీలక పాత్ర.స్పందించిన బీసీసీఐసీజన్ ఆసాంతం అద్భుత ఆట తీరుతో జట్టును గెలిపించిన ఆకిబ్ నబీ (Auqib Nabi Dar)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని భారత టెస్టు జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు.అతడిదే కీలక పాత్రత్వరలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. అయితే, ఆకిబ్ ఎంపిక విషయంలో తుది నిర్ణయం మాత్రం సెలక్టర్లదేనని స్పష్టం సైకియా చేశాడు. ‘‘అతడు అద్భుతంగా ఆడాడు. జట్టు విజయాల్లో అతడిదే కీలక పాత్ర.క్వార్టర్ ఫైనల్లో ఐదు వికెట్లు తీశాడు. సెమీ ఫైనల్లోనూ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక ఫైనల్లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేశాడు. ఐదు వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అతడి బౌలింగ్ ఫైనల్ రాతను మార్చింది. కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టిని అతడు ఆకర్షించగలిగాడు.రంజీ ట్రోఫీకి సంబంధించి ప్రతి మ్యాచ్కు మా సెలక్టర్లు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశాము. ఫైనల్ సహా కీలక మ్యాచ్లన్నీ మా సెలక్టర్లు వీక్షించారు. వాళ్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారనే అనుకుంటున్నా. ఇప్పటికే అతడు లైమ్లైట్లో ఉన్నాడు. సెలక్టర్లే అతడి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?ప్రతిభ ఉన్న వాళ్లకు అన్యాయం జరగకుండా బీసీసీఐ సరైన చర్యలు తీసుకుంటుంది. మా సెలక్టర్లు అతడితో పాటు మ్యాచ్లో మెరుగ్గా రాణించిన అందరి ఆటను గమనించారు. నబీని వెలుగులోకి తీసుకుచ్చింది ఎవరు?.. అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. జమ్మూ కశ్మీర్ సెలక్టర్లే కదా!.. దేశీ క్రికెట్లో రాష్ట్ర జట్టు తరఫున అదరగొట్టిన వారికి బీసీసీఐ సెలక్టర్లు కచ్చితంగా అవకాశం ఇస్తారు’’ అని దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.60 వికెట్లు కూల్చాడుకాగా కర్ణాటకతో ఫైనల్లో జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ ఐదు వికెట్లతో రాణించి.. కర్ణాటక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్లో జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా అవతరించింది. తాజా రంజీ సీజన్లో 29 ఏళ్ల కుడిచేతి వాటం పేసర్ ఏకంగా 60 వికెట్లు కూల్చాడు. ఇందులో ఎనిమిది ఫైవ్ వికెట్లు హాల్స్ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆకిబి నబీ అరంగేట్రానికి డిమాండ్లు పెరుగుతున్నాయి. చదవండి: ప్రపంచకప్ వైఫల్యాల తర్వాత కూడా బాబర్ ఆజమ్కు కెప్టెన్సీ పగ్గాలు -
అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్ వేస్ట్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కీలక ముందడుగు వేసింది టీమిండియా. సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ముంబై వేదికగా వాంఖడే మైదానంలో గురువారం ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది. ముంబైకి చేరుకున్న టీమిండియాఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ముంబైకి చేరుకుంది. కాగా ఈ ఎడిషన్ ఆరంభంలో నేపాల్ వంటి పసికూన జట్టుతో సవాలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత ఇంగ్లండ్ పుంజుకున్న తీరు అమోఘం.Touchdown, Mumbai! 📍#TeamIndia are in and gearing up for the semi-final in just three days! 👏ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 5:30 PM pic.twitter.com/gfOBk4T29X— Star Sports (@StarSportsIndia) March 2, 2026అందరూ మేటి ఆటగాళ్లేముఖ్యంగా సూపర్-8లో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించి.. హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్.. ఇంగ్లండ్ గట్టి ప్రత్యర్థి అని.. ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఆ జట్టులో ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, విల్ జాక్స్ సహా అందరు మేటి ఆటగాళ్లేనని అన్నాడు.వాంఖడే పిచ్ పరిస్థితులు వేరుగా ఉంటాయని... అటువంటి చోట ఇంగ్లండ్ లాంటి జట్టును ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదే అని గౌతీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ వంటి జట్టును ఓడించేందుకు తాము ఇంకాస్త ఎక్కువగానే శ్రమించాల్సి ఉంటుందని అన్నాడు.సంజూ సత్తా ఏంటో నాకు బాగా తెలుసుఅదే విధంగా.. వెస్టిండీస్తో మ్యాచ్లో భారత్ గెలిచిన తీరుపై కూడా గౌతీ స్పందించాడు. ఈ మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన సంజూ శాంసన్ను ప్రశంసించాడు. అయితే, క్రికెట్ జట్టు క్రీడ అని అందరూ కలసి కట్టుగా ఆడాల్సిందే... జట్టుగా గెలవాల్సిందేనని పేర్కొన్నాడు.‘‘సంజూ సత్తా ఏంటో నాకు బాగా తెలుసు. మెగా ఈవెంట్కు ముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ అతనికి క్లిష్టంగా గడిచింది. అందుకే కాస్త విశ్రాంతి ఇచ్చాము. ఇప్పుడు వెస్టిండీస్తో కీలకమైన ‘సూపర్–8’ మ్యాచ్లో శాంసన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు’’ అని గంభీర్ కితాబిచ్చాడు.🚨 BIG STATEMENT BY GAUTAM GAMBHIR 🚨 "For so many year, we only glorified individual success. But this Indian Team is different, we play as a team. Shivam Dube's 2 boundaries is as important as Sanju Samson 97*."What's your take 🤔pic.twitter.com/zdecRc7PVJ— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 3, 2026అదే విధంగా తిలక్ వర్మ, శివమ్ దూబే తదితర సహచరులు కూడా బాగా ఆడారని గౌతీ అన్నాడు. తాను కోచ్గా ఉన్నంతకాలం జట్టు విజయంలో భాగమైన ప్రతి ఆటగాడి సహకారానికి తగిన గుర్తింపు లభిస్తుందన్నాడు. అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్ వేస్ట్!‘క్రికెట్ ఎప్పటికైనా టీమ్ గేమ్. ఓ జట్టుగా ఆడాలి. జట్టుగానే గెలవాలి. కొన్నేళ్లుగా మనం ఒకరిద్దరి సేవలగురించే ప్రత్యేకంగా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరి సహకారం గురించి ప్రస్తావించడం నాకూ ఆనందంగానే ఉంది’ అని గంభీర్ ఫలానా ఆటగాడి పేరుచెప్పకుండా తన శైలిలో సమాధాన మిచ్చాడు.‘జట్టు విజయంలో ఎవరైనా పెద్ద స్కోరు చేస్తే పతాక శీర్షికలకెక్కుతారు. కానీ నా దృష్టిలో మాత్రం ఆ పెద్ద స్కోరుకు విలువపెంచే భాగస్వామ్యంలో తక్కువ పరుగులు చేసినా విజయంలో ఈ రెండూ విలువైనవే! ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ కాదు. ఎందుకంటే కీలకమైన సమయంలో శివమ్ దూబే కొట్టిన రెండు విలువైన బౌండరీలు లక్ష్యఛేదనకెంతో ఉపయోగపడ్డాయి. అవే లేకపోయినా... ఫలితం ప్రతికూలంగా ఉన్నా... సామ్సన్ (97 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ మరుగున పడేది’ అని గౌతీ వివరించాడు.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
టీ20 ప్రపంచకప్పై యుద్ద ప్రభావం
అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ద ప్రభావం భారత్, శ్రీలంక దేశాల్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026పై పడింది. ఈ మెగా టోర్నీలో సూపర్-8 దశలో నిష్క్రమించిన వెస్టిండీస్ జట్టు.. అంతర్జాతీయ ఎయిర్స్పేస్ పరిమితుల కారణంగా భారత్లోనే చిక్కుకుపోయింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు ప్రతిగా ఇరాన్ పలు గల్ఫ్ ప్రాంతాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. విండీస్ జట్టు స్వదేశానికి చేరాలంటే దుబాయ్ మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే యుద్ద నేపథ్యంలో పరిస్థితులు అనూకలించకపోవడంతో విండీస్ జట్టు భారత్లోనే హాల్ట్ అయ్యింది. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. వీలైనంత త్వరగా తమ జట్టును స్వదేశానికి చేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విషయంలో విండీస్ బోర్డుకు ఐసీసీ, బీసీసీఐ సహకరిస్తున్నాయి. మరోవైపు విండీస్లాగే మరో జట్టు కూడా భారత్లోనే ఇరుక్కుపోయింది. విండీస్లాగే సూపర్-8లోనే నిష్క్రమించిన జింబాబ్వే కూడా యుద్ద ప్రభావం చేత విమాన రాకపోకలు నిలిచిపోవడంతో భారత్లో హాల్ట్ అయ్యింది. జింబాబ్వే కూడా స్వదేశానికి వెళ్లలంటే దుబాయ్ మీదుగా వెళ్లాల్సిందే. జింబాబ్వే పరిస్థితిని కూడా ఐసీసీ దగ్గరగా పర్యవేక్షిస్తుంది. వీలైనంత త్వరగా జింబాబ్వే జట్టును స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంది.ఇదిలా ఉంటే వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ప్రపంచకప్లో సూపర్-8లోనే నిష్క్రమించాయి. ఈ రెండు జట్లు భారత్తో పాటు గ్రూప్-1లో ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, సౌతాఫ్రికా సెమీస్కు చేరాయి. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్-4కు అర్హత సాధించాయి.తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది. -
T20 WC 2026: సెమీస్కు అంపైర్లు వీరే..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.ఈ మ్యాచ్లకు అఫీషియల్స్ జాబితాను (అంపైర్లు, రిఫరీలు) ఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఎనిమిది మంది అంపైర్లు, ఇద్దరు మ్యాచ్ రిఫరీల పేర్లను వెల్లడించింది. ఎప్పటిలాగే తటస్థ అధికారులను నియమించింది. సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్ - ఆన్ ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్ - థర్డ్ అంపైర్: నితిన్ మెనన్ - నాలుగో అంపైర్లు: రాడ్ టక్కర్ - మ్యాచ్ రిఫరీ: జవగల్ శ్రీనాథ్ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్ - ఆన్ ఫీల్డ్ అంపైర్లు: క్రిస్ గాఫనీ, అల్లాహుద్దీన్ పాలేకర్ - థర్డ్ అంపైర్లు: ఎడ్రియన్ హోల్డ్స్టాక్ - నాలుగో అంపైరు: పాల్ రైఫెల్ - మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్ -
బాబర్ ఆజమ్కు కెప్టెన్సీ పగ్గాలు
టీ20 ప్రపంచకప్ 2026లో వరుస వైఫల్యాల తర్వాత కూడా పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం.. బాబర్ ఆజమ్ నేషనల్ టీ20 కప్ 2026లో లాహోర్ రీజియన్ వైట్స్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 5న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో లాహోర్ వైట్స్, పెషావర్ రీజియన్ను ఎదుర్కొంటుంది. గత ఎడిషన్లో లాహోర్ వైట్స్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరినా, అబ్బొటాబాద్ రీజియన్ చేతిలో ఓటమిపాలైంది. ఈసారి బాబర్ నాయకత్వంలో లాహోర్ వైట్స్ మెరుగైన ఫలితాలు సాధించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రపంచకప్ 2026 ఎడిషన్లో పాక్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేసినా సూపర్-8 దశలోనే నిష్క్రమించింది. చివరి మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధించినా, న్యూజిలాండ్ కంటే మెరుగైన రన్రేట్ లేని కారణంగా సెమీస్కు అర్హత సాధించలేకపోయింది. ఆరంభ మ్యాచ్లలో దారుణంగా విఫలమైనందుకు బాబార్ ఆజమ్ను శ్రీలంక మ్యాచ్ నుంచి తప్పించారు.ఈ ప్రపంచకప్లో బాబర్ 4 ఇన్నింగ్స్ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 22.75 కాగా, స్ట్రైక్ రేట్ 112.34గా ఉంది. ఈ చెత్త ప్రదర్శనలతో బాబర్ పాకిస్తాన్ జట్టుకు భారంగా మారాడు. గత కొన్ని సంవత్సరాలుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఇదే తీరు కొనసాగుతుంది.2023 వన్డే వరల్డ్కప్ తర్వాత బాబర్ 23 ఇన్నింగ్స్ల్లో కేవలం 772 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ శతకం, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత అతను 20 ఇన్నింగ్స్ల్లో 451 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 26.52, స్ట్రైక్ రేట్ 118.99గా ఉంది. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.టీ20 ప్రపంచకప్లో ఘోర ప్రదర్శనల తర్వాత జాతీయ జట్టులో స్థానమే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో బాబర్కు దేశవాలీ జట్టు పగ్గాలు దక్కడం ఆశ్చర్యంగా ఉంది. త్వరలో బంగ్లాదేశ్తో జరిగే వన్డే సిరీస్కు బాబర్తో పాటు సీనియర్లను తప్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. -
IND VS ENG Semis: చరిత్ర పునరావృతమవుతుందా.. లేక..!
టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీకి సిద్దంగా ఉన్నాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ హోరాహోరీ సమరం జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్కు ముందు ఓ ఆసక్తికర అంశం సోషల్మీడియాలో హైలైట్ అవుతుంది. గత మూడు టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్లోనే ఎదురెదురుపడ్డాయి. 2022 ఎడిషన్లో ఇంగ్లండ్ భారత్ను ఓడించి ఫైనల్కు చేరడమే కాకుండా, రెండోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది.2024 ఎడిషన్లో భారత్ ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్కు చేరడమే కాకుండా రెండోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. 2026 ఎడిషన్లోనూ ఇరు జట్లు సెమీస్లో ఎదురెదురుపడటంతో, సెంటిమెంట్ ప్రకారం ఈ మ్యాచ్ విజేత టైటిల్ కూడా ఎగరేసుకుపోతుందని చర్చ నడుస్తుంది. అయితే ఈ సెంటిమెంట్ రిపీటైతే భారత్కు ప్రతికూల ఫలితం వచ్చే ప్రమాదం కూడా ఉంది.ఎందుకుంటే, గత రెండు ఎడిషన్లలో గెలుపు చేతులు మారింది. 2022 ఎడిషన్లో ఇంగ్లండ్ భారత్ను ఓడిస్తే.. 2024 ఎడిషన్లో భారత్ ఇంగ్లండ్ను ఓడించింది. ఈ లెక్కన రొటేషన్ పద్దతిలో ఈసారి ఇంగ్లండ్ గెలుస్తుందని సెంటిమెంట్లు ఫాలో అయ్యే వారు విశ్వసిస్తున్నారు.అయితే క్రికెట్ లాంటి క్రీడల్లో సెంటిమెంట్లకు విశ్వసనీయత లేదని గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది. కాబట్టి ఆ రోజు ఏ జట్టు అత్యుత్తమంగా రాణిస్తుందో ఆ జట్టుకే విజయం దక్కే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగనీ సెంటిమెంట్లను తీసి వేయడానికి కూడా వీల్లేదు. కొన్ని సందర్భాల్లో అవి కూడా వర్కౌటవుతాయి.సెంటిమెంట్ల విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుత ఎడిషన్లో భారత్, ఇంగ్లండ్ జట్లు పటిష్టంగా ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే..ఇంగ్లండ్ కంటే టీమిండియానే క్తాస మెరుగ్గా ఉంది. ఈసారి హాట్ ఫేవరెట్ కూడా ఇండియానే. అలాగనీ ఇంగ్లండ్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వారిదైన రోజున వారు అద్భుతాలు చేస్తారు. ప్రస్తుతం వారి జట్టు బ్యాటింగ్ టాపార్డర్ కాస్త బలహీనంగా ఉంది. ఓపెనర్లు సాల్ట్, బట్లర్ సహా జేకబ్ బేతెల్ తరుచూ విఫలమవుతున్నారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్, మిడిలార్డర్ బ్యాటర్ల సాయంతోనే ఆ జట్టు ఈ ఎడిషన్లో విజయాలు సాధించింది. బ్యాటింగ్తో పోలిస్తే.. ఆ జట్టు బౌలింగ్ విభాగంలో కాస్త మెరుగ్గా ఉంది. అయితే ఈ రెండు విభాగాల్లో ఇంగ్లండ్ కంటే భారత్ ఇంకాస్త మెరుగ్గా ఉంది. ఫీల్డింగ్ మినహా భారత్ అన్ని విషయాల్లో ఇంగ్లండ్పై పైచేయి సాధించే అవకాశం ఉంది. సెమీస్కు ముందు టీమిండియాను ఫీల్డింగ్ విషయం చాలా కలవరపెడుతుంది. తాజాగా విండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 క్యాచ్లు నేలపాలు చేశారు. సూపర్-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త ఫీల్డింగ్ ప్రదర్శన టీమిండియాదే. ఫీల్డింగ్ మినహా మిగతా అన్ని విభాగాల్లో భారత్దే పైచేయిగా ఉంది. మ్యాచ్కు ముందు ప్రదర్శనలు ఎలా ఉన్నా, ఆ రోజు మ్యాచ్లో ఎవరు రాణిస్తే వారికే అంతిమ విజయం దక్కుతుంది. -
ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ దూరం
పెర్త్లోని ప్రసిద్ధ WACA మైదానం వేదికగా మార్చి 6 నుంచి 9 వరకు భారత్తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 13 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును నిన్న (మార్చి 2) ప్రకటించారు. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ ఫార్మాట్లో పింక్ బాల్తో జరుగుతుంది. పేసర్ కిమ్ గార్త్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరం కాగా.. రాచెల్ ట్రెనమన్, మైట్లాన్ బ్రౌన్ జట్టులోకి వచ్చారు. వీరిద్దరు గాయాల బారిన పడిన స్టార్ ఆల్రౌండర్ ఎల్లిస్ పెర్రీ, స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ ప్రత్యామ్నాయంగా ఎంపికయ్యారు.24 ఏళ్ల ట్రెనమన్కు సీనియర్ జట్టు తరఫున ఇది తొలి అవకాశం. ఇటీవలికాలంలో ఆమె అద్భుతమైన ఫామ్లో ఉంది. ఈ సీజన్ విమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్లో టస్మానియా తరఫున ఓపెనింగ్ చేస్తూ 81 సగటున 648 పరుగులు చేసి సెలెక్టర్లను ఆకట్టుకుంది. బ్రౌన్ విషయానికొస్తే.. ఈ 28 ఏళ్ల పేసర్ 2021 తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఆమె న్యూ సౌత్ వేల్స్ తరఫున 10 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసి మంచి ఫామ్లో ఉంది. గత ఆగస్టులో ఇండియా-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో ఆస్ట్రేలియా A తరఫున ఆడి 4 వికెట్లతో సత్తా చాటింది. చివరి మ్యాచ్ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీకి అంతర్జాతీయ క్రికెట్లో చివరి మ్యాచ్. హీలీ చాలా రోజుల ముందే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. హీలీ.. తాజాగా ఆడిన తన చివరి వన్డేలో అద్భుత శతకంతో (158) చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా భారత్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను ఆసీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత జట్టు ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.భారత్తో ఏకైక టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టు.. - అలీస్సా హీలీ (కెప్టెన్) - డార్సీ బ్రౌన్ - మైట్లాన్ బ్రౌన్ - అశ్లే గార్డ్నర్ - లూసీ హామిల్టన్ - అలానా కింగ్ - ఫీబీ లిచ్ఫీల్డ్ - బెత్ మూనీ - తాలియా మెక్గ్రాత్ - ఎలీస్ పెర్రీ - అన్నాబెల్ సతర్లాండ్ - జార్జియా వోల్ - జార్జియా వారెహామ్ -
పాక్ ప్రపంచకప్ హీరోకు ఘోర అవమానం
పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ హీరో సాహిబ్జాదా ఫర్హాన్కు ఘోర అవమానం జరిగింది. హండ్రెడ్ లీగ్ 2026 వేలం తుది జాబితాలో అతనికి అవకాశం దక్కలేదు. ప్రపంచకప్ 2026లో రెండు సెంచరీలు సహా పలు భారీ రికార్డులు నెలకొల్పినా ఫర్హాన్ పేరు వేలం జాబితాలో కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫర్హాన్ సహా 49 పాక్ ఆటగాళ్ల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది.కాగా, ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్లో తొలిసారి వేలం ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ వేలం మార్చి 11, 12 తేదీల్లో లండన్ వేదికగా జరుగనుంది. ఈ వేలంలో తొలుత 710 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 63 మంది పాకిస్తానీ క్రికెటర్లు ఉన్నారు. అయితే ఫ్రాంచైజీలు 75–100 మంది ఆటగాళ్లను మాత్రమే షార్ట్లిస్ట్ చేయమని ఆదేశించడంతో, చివరికి 243 మంది ఆటగాళ్లు మాత్రమే తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారిలో పాకిస్తాన్ నుంచి కేవలం 14 మంది (షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్) అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే సాహిబ్జాదా ఫర్హాన్ సహా 49 మంది పాక్ ఆటగాళ్ల పేర్లు గల్లంతయ్యాయి. ఫర్హన్.. టీ20 ప్రపంచకప్ 2026లో 76.60 సగటున 383 పరుగులు చేసి ప్రస్తుతానికి లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ సింగిల్ ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. ఫర్హాన్ నమీబియా, శ్రీలంకపై అద్భుత శతకాలు సాధించాడు. పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్కు చేరకపోయినా, ఫర్హాన్ వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అయినా, హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీలు అతన్ని పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. మరోవైపు, వరల్డ్ కప్ జట్టులో లేని పాక్ పేసర్ హారిస్ రౌఫ్ వేలంలో మార్కీ ఆటగాడిగా ఎంపిక కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రౌఫ్తో పాటు జో రూట్, జానీ బెయిర్స్టో వంటి ఇంగ్లండ్ స్టార్లు.. డేవిడ్ మిల్లర్, సునీల్ నరైన్ వంటి విదేశీ ఆటగాళ్లు కూడా మార్కీ జాబితాలో ఉన్నారు. కాగా, హండ్రెడ్ లీగ్ వేలం జాబితాలో పాక్ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ పేర్లు కూడా లేవు. ఈ ఇద్దరు విండీస్తో టెస్ట్ సిరీస్ కారణంగా తమ పేర్లు నమోదు చేసుకోలేదు. -
టీమిండియాలో ఆందోళన.. తప్పు జరిగిందా, చరిత్ర హీనులవుతారు..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.కాగా, ఇంగ్లండ్తో సెమీస్కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. భారత ఫీల్డింగ్ ప్రతి భారత క్రికెట్ అభిమానిని ఆందోళనకు గురి చేస్తోంది. విండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 మ్యాచ్లు నేలపాలు చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కీలక దశలో రెండు క్యాచ్లు జారవిడిచాడు. ఓ క్యాచ్ను తిలక్ వర్మ వదిలేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియాకు ప్రతికూల ఫలితం వచ్చుంటే, అభిషేక్, తిలక్పై ముప్పేట దాడి జరిగుండేది. టీమిండియా గెలవడంతో ఈ ఇద్దరు భారీ ట్రోలింగ్ను తప్పించుకున్నారు.విండీస్తో మ్యాచ్ ఒక్కటే కాదు, మెగా టోర్నీ ప్రారంభం నుంచి టీమిండియా ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉంది. సూపర్-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త క్యాచింగ్ ప్రదర్శనలు మనవే. భారత ఫీల్డర్లు 100లో కేవలం 71 శాతం క్యాచ్లను మాత్రమే పట్టారు. మొత్తంగా సూపర్-8కు చేరిన జట్లలో ఏ జట్టు వదలని విధంగా ఏకంగా 13 క్యాచ్లు నేలపాలు చేశాడు. అదనంగా భారత ఫీల్డర్లు మిస్ ఫీల్డింగ్ కూడా చేసి ప్రత్యర్దిని అదనపు పరుగులు సమకూర్చారు.సెమీస్లో ఇదే పరిస్థితి కొనసాగితే టీమిండియా తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్యాచ్లు మ్యాచ్లు గెలిపిస్తాయన్న విషయాన్ని భారత ఆటగాళ్లు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. గత ప్రపంచకప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచే భారత్ను జగజ్జేతగా నిలిపిన విషయాన్ని ప్రస్తుత టీమిండియా సభ్యులు గుర్తు పెట్టుకోవాలి. క్యాచ్లు నేలపాలు చేసినా, మిస్ ఫీల్డింగ్ చేసి అదనపు పరుగులు సమర్పించుకున్నా, సరిదిద్దుకోవడానికి జరగబోయేది సామాన్యమైన మ్యాచ్ కాదు. ఒక్కసారి తప్పు జరిగిపోతే, ఎంతటి స్టార్ ఆటగాడైనా చరిత్ర హీనుడవ్వాల్సిందే. కాబట్టి, సెమీఫైనల్లో ప్రతి భారత ఆటగాడు ఫీల్డ్లో జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. -
T20 WC 2026: అదే జరిగితే భారత్కు చుక్కెదురే..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.ఈ మ్యాచ్లకు వరుణుడు నుంచి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. ఏదైనా కారణం చేత రద్దైతే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఈ నాకౌట్ మ్యాచ్లకు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. షెడ్యూలైన రోజు మ్యాచ్ జరుగకపోయినా లేక పాక్షికంగా జరిగి ఆగిపోయినా, ఆగిన చోటి నుంచి మరుసటి రోజు మ్యాచ్ను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం సూపర్-8 దశలో మెరుగైన ఫలితాలు సాధించిన జట్టు ఫైనల్స్కు చేరుకుంటుంది.ఈ లెక్కన తొలి సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-1 టాపర్గా ఉన్న సౌతాఫ్రికా ఫైనల్కు వెళ్తుంది. న్యూజిలాండ్ ఇంటిముఖం పడుతుంది. రెండో సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-2 టాపర్గా ఉన్న ఇంగ్లండ్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి, ఏ కారణంగా కూడా సెమీస్ రద్దు కాకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. -
మధ్యప్రాచ్యంలో యుద్దం.. ఆపదలో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జానీ బెయిర్స్టో ఆపదలో ఉన్నాడు. అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ద నేపథ్యంలో కుటుంబంతో సహా దుబాయ్లో చిక్కుకుని, బిక్కుబిక్కుమంటున్నాడు. బెయిర్స్టో కొద్ది రోజుల కిందట కుటుంబంతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లాడు. వారు తిరిగి స్వదేశానికి బయల్దేరాల్సిన సమయంలో మధ్యప్రాచ్యంలో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. దీంతో దుబాయ్ విమానాశ్రయం సహా మధ్యప్రాచ్యంలోని అన్ని విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి. ఎక్కడి వారు అక్కడే బిక్కుబిక్కుమంటూ కలం వెల్లదీస్తున్నారు.For those writing that I’m with the England Lions team… I am not. I am with my young family in Dubai…sure the England Lions security staff will be doing all they can to get them out of Abu Dhabi but I am trying to keep my family safe and get us out of here!!— Jonny Bairstow (@jbairstow21) March 2, 2026ముందుగా బెయిర్స్టో అబుదాబీలో పర్యటిస్తున్న ఇంగ్లండ్ లయన్స్ బృందంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని బెయిర్స్టో స్వయంగా స్పష్టం చేశాడు. తాను కుటుంబంతో సహా దుబాయ్లో చిక్కుకున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించాడు.ఇంగ్లండ్ లయన్స్ను భద్రతా సిబ్బంది అబుదాబి నుండి బయటకు తీసుకురావడానికి చేయగలిగినదంతా చేస్తుందని అనుకుంటున్నాను. నేను నా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకొని, ఇక్కడి నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని ఎక్స్లో రాసుకొచ్చాడు.కాగా, మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావం క్రికెట్పై కూడా పడింది. ఈ యుద్ధం కారణంగా అబుదాబీలో జరగాల్సిన పాకిస్తాన్ షాహీన్స్-ఇంగ్లండ్ లయన్స్ వన్డే సిరీస్ రద్దైంది. ఇక్కడే ఏర్పాటు చేసిన ఇంగ్లండ్ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. త్వరలో దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కూడా సందిగ్దంలో పడింది. మరోవైపు సౌతాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్ ముగించుకున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు కూడా దుబాయ్ విమానాశ్రయం మూసివేయడంతో డర్బన్లోనే ఇరుక్కుపోయింది. -
ధన్యవాదాలు.. సంజు సామ్సన్
చక్కటి ఇన్నింగ్స్తో జట్టును గెలిపించి సెమీస్కు చేర్చిన టీమిండియా బ్యాటర్ సంజు సామ్సన్పై ప్రశంసలు కురుస్తున్నాయి. టి20 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఆఖరివరకు క్రీజ్లో నిలబడి విజయాన్ని అందించిన ఈ కేరళ క్రికెటర్పై అభిమానులతో పాటు ప్రముఖులు పొగుడుతున్నారు. ముఖ్యంగా సొంత రాష్ట్రానికి చెందిన సినిమా స్టార్స్ ప్రశంసలతో ముంచెత్తారు. సంజు సూపర్ ఇన్నింగ్స్ కీర్తిస్తూ మాలీవుడ్ ప్రముఖులు మోహన్లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, బాసిల్ జోసఫ్, నవిన్ పాలీ తదితరులు ఎక్స్లో పోస్టులు పెట్టారు.Exhilarating to watch @IamSanjuSamson in such sublime form! A truly masterful innings that speaks volumes of his character and talent. Hearty congratulations to the entire Indian team for storming into the #T20WorldCup2026 Semi-Finals. Keep the flag flying high! 🇮🇳 pic.twitter.com/jLMYCQSOWc— Mohanlal (@Mohanlal) March 1, 2026విజయకేతనం ఎగురవేయండిమాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్తో సంజు సామ్సన్ సత్తా చాటాడని ప్రముఖ నటుడు మోహన్లాల్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. సంజు ఫామ్లోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సెమీ-ఫైనల్స్కు దూసుకెళ్లిన టీమిండియాకు అభినందనలు తెలిపారు. సెమీస్లోనూ విజయకేతనం ఎగురవేయాలని ఆయన ఆకాంక్షించారు. స్వచ్ఛమైన ఆధిపత్యంసంజు సామ్సన్ అద్భుతంగా ఆడాడని విలక్షణ నటుడు మమ్ముట్టి ప్రశంసించారు. అతిపెద్ద వేదికపై స్వచ్ఛమైన ఆధిపత్యం చెలాయించారని వ్యాఖ్యానించారు. సెమీఫైనల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్.. ఇన్స్టాగ్రామ్లో సంజు ఫొటో పోస్ట్ చేసి హార్ట్, క్లాప్స్ ఎమోజీలను జోడించారు.What a knock, @IamSanjuSamsonPure class. Pure dominance. A fearless statement on the biggest stage.Congratulations to the Indian cricket team for marching into the #T20WorldCup2026 Semi Final. pic.twitter.com/j8Di5hYY7C— Mammootty (@mammukka) March 1, 2026 చిరస్మరణీయ ఇన్నింగ్స్'టి20 గొప్ప ఇన్నింగ్స్లో ఇదీ ఒకటి. కీలక క్వార్టర్ ఫైనల్లో సంజు సామ్సన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడ'ని నటుడు-చిత్రనిర్మాత- దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. “నిన్ను చూసి గర్వంగా ఉంది మచా. (మిత్రుడు)” అని నటుడు కాళిదాస్ జయరామ్ మెచ్చుకున్నారు. వాట్ యాన్ ఇన్నింగ్స్ అంటూ నటుడు టొవినో థామస్ పొగిడారు. 'థ్యాంక్యూ సంజు సామ్సన్' అంటూ ప్రకాశ్రాజ్ అభినందించారు.THE KERALA STORY: Sanju Samson takes India to the semis.— CS Amudhan (@csamudhan) March 1, 2026 ది రియల్ కేరళ స్టోరీకాగా, కేరళ స్టోరీ 2 సినిమాకు కొంతమంది కౌంటర్ ఇచ్చారు. తమిళ దర్శకుడు సిఎస్ అముధన్ సంజు విజయాన్ని ‘ది కేరళ స్టోరీ: టీమిండియాను సంజు సామ్సన్ సెమీస్ ఫైనల్కు చేర్చాడని ఎక్స్లో పోస్ట్ చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత సంజు చేసిన ప్రార్థనలు మతసామరస్యానికి చిరునామాగా నిలిచాయని, ఇదే రియల్ కేరళ స్టోరీ అంటూ సోషల్ మీడియాలో నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ఎవరినీ హర్ట్ చేయకుండా అన్ని మతాలను గౌరవించాడని పేర్కొంటూ ధన్యవాదాలు చెబుతున్నారు. The Real Kerala Story ☪️✝️🕉️ft. Sanju Samson ❤️ pic.twitter.com/slCZHUHvWA— Luckyram9887.base.eth π² (@Luckyram9887) March 2, 2026 -
యుద్ధ ప్రభావం.. అక్కడే ఇరుక్కుపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో ఇరుక్కుపోయింది. సౌతాఫ్రికాలో వైట్ బాల్ సిరీస్ ముగించుకున్న పాకిస్తాన్ జట్టు ఇవాళ (మార్చి 2) రాత్రి డర్బన్ నుంచి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉంది. అయితే, యుద్ధం కారణంగా దుబాయ్ విమానాశ్రయం మూసివేయడటంతో ఈ ప్రయాణం నిలిచిపోయింది. దీంతో పాక్ జట్టు డర్బన్లోనే ఆగిపోయింది. తిరుగు ప్రయాణంపై స్పష్టత లేకపోవడంతో పాక్ బృందం ఆందోళన చెందుతుంది. తమను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని పీసీబీకి విజ్ఞప్తులు చేస్తుంది.యుద్ధం కారణంగా అబుదాబీలో జరగాల్సిన పాకిస్తాన్ షాహీన్స్-ఇంగ్లండ్ లయన్స్ వన్డే సిరీస్ కూడా రద్దైంది. ఇక్కడే ఏర్పాటు చేసిన ఇంగ్లండ్ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. యుద్ద ప్రభావం యావత్ క్రికెట్ ప్రపంచంపై పడే అవకాశం ఉంది. త్వరలో దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కూడా సందిగ్దంలో పడింది.ఇదిలా ఉంటే, పాక్ మహిళల క్రికెట్ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించింది. ఈ రెండు సిరీస్లను సౌతాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే చివరిదైన మూడో టీ20లో గెలిచి పాక్ ఊరట పొందింది. డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాక్ 119 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. -
బీసీసీఐలో చేరిన హర్భజన్ సింగ్
భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐలో చేరాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, యువ స్పిన్నర్లకు మార్గదర్శకత్వం చేయనున్నాడు. ఇప్పటికే మరో భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఫాస్ట్ బౌలర్లతో పని చేస్తున్నాడు. తాజాగా హర్భజన్ సింగ్ ఈ జాబితాలో చేరాడు.బీసీసీఐ మార్చి మొదటి వారంలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రాంలో రెడ్ బాల్ స్పెషలైజ్డ్ క్యాంపులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ శిబిరాలు అండర్-19 మరియు ఇండియా A జట్లలో ప్రతిభ చూపిన ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వీరిని త్వరలోనే సీనియర్ జట్టులోకి తీసుకురావడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. మరో దిగ్గజం కూడా..!యువ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత మాజీలు క్యూ కడుతున్నారు. జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ ఇప్పటికే రంగంలోకి దిగగా.. మరో దిగ్గజ బౌలర్ కూడా తన స్పెషలైజేషన్లో యువ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్టైమ్ గ్రేట్ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రిస్ట్ స్పిన్నర్ల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం కార్యక్రమాన్ని మరో భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సమన్వయం చేస్తున్నారు. ఇతర మాజీ ఆటగాళ్లను కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి అతను సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, బీసీసీఐలో ఇలాంటి శిక్షణా శిబిరాలు కొత్తవి కావు. జగ్మోహన్ దాల్మియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మాజీ ఆటగాళ్లను యువ క్రికెటర్లకు మార్గదర్శకులుగా ఆహ్వానించే పద్ధతి ప్రారంభమైంది. అప్పట్లో చందు బోర్డే, ఎరపల్లి ప్రసన్న, సయ్యద్ కిర్మాణి వంటి ప్రముఖులు జోనల్ అకాడమీ శిబిరాల్లో శిక్షణ ఇచ్చారు.


