breaking news
Cricket
-
టీమిండియాతో సిరీస్ ఖరారు.. భారత్లో వారి ఆతిథ్యం!
అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) టీమిండియాతో టీ20 సిరీస్ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టుతో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. అయితే, అఫ్గాన్ భారత్లోనే టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం.కాగా అఫ్గానిస్తాన్లో మ్యాచ్లు నిర్వహించే పరిస్థితి లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ భారత్ లేదంటే యూఏఈలలో పలు సిరీస్లకు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీమిండియాతో భారత్లో తలపడేందుకు సిద్ధమైంది.షెడ్యూల్ ఖరారుఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా- అఫ్గానిస్తాన్ మధ్య సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మూడు మ్యాచ్లు నిర్వహిస్తారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. గతంలో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లకు అఫ్గానిస్తాన్ భారత్లో ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2017లో ఐర్లాండ్తో వైట్బాల్ సిరీస్ ఆడిన అఫ్గాన్ జట్టు.. 2017లో విండీస్తో ఆల్ ఫార్మాట్ సిరీస్ ఆడింది.టెస్టు, వన్డేలలో ఓటమిఇక ఇటీవల అఫ్గానిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో జూన్లో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడింది. న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత్.. అఫ్గాన్ను ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఇక మూడు వన్డేల సిరీస్లోనూ ఆతిథ్య భారత జట్టు.. అఫ్గాన్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. తాజాగా మరోసారి అఫ్గాన్ టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈసారి భారత్లో ఆతిథ్య దేశంగా అఫ్గాన్.. శ్రేయస్ అయ్యర్ సేనతో టీ20 సిరీస్ ఆడుతుంది.పరాభవాల తర్వాత గెలుపు బాట పట్టిన భారత టీ20 జట్టుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భారత్ను చాంపియన్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన బీసీసీఐ.. శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. అయితే, యూకే టూర్లో భాగంగా అతడికి ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్లో భారత్ 2-0తో వైట్వాష్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలోనూ 4-0తో క్లీన్స్వీప్నకు గురై ఘోర పరాభవం ఎదుర్కొంది. అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లి.. ఆతిథ్య జట్టును 3-0తో వైట్వాష్ చేసి తిరిగి విజయాల బాట పట్టింది.శ్రీలంక పర్యటనలోఇక టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో గిల్ సేన రెండు మ్యాచ్లు ఆడుతుంది. ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు.. ఆగష్టు 23న రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్గా SRH మాజీ ప్లేయర్ -
అతడు లేకపోవడం టీమిండియాకు లోటు: శ్రీలంక మాజీ స్టార్
శ్రీలంక- టీమిండియా మధ్య టెస్టు సిరీస్కు రంగం సిద్ధమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక. కాగా భారత జట్టు శ్రీలంక గడ్డపై 2017 తర్వాత టెస్టు సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి.ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ ఆల్రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ లేనిలోటు టీమిండియాకు తప్పక కనిపిస్తుందన్నాడు. IANSతో మాట్లాడుతూ..అశూ లేకపోవడం అతిపెద్ద లోటు‘‘ఈసారి టీమిండియా అశ్విన్ను బాగా మిస్సవుతుంది. శ్రీలంక గడ్డ మీద అతడు గతంలో అద్భుతంగా రాణించాడు. ఇక్కడి టర్నింగ్ పిచ్లు అతడికి స్వర్గధామం. శ్రీలంక పిచ్ పరిస్థితులకు అశూ సరైన బౌలర్’’ అని ఫర్వేజ్ మహరూఫ్ పేర్కొన్నాడు.కాగా 2015, 2017లో శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్లలో టీమిండియా గెలుపులో అశ్విన్దే కీలక పాత్ర. ఆరు మ్యాచ్లలో కలిపి అతడు 38 వికెట్లు కూల్చాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేకాదు బ్యాట్తోనూ అశూ దుమ్ములేపాడు. రెండు అర్థ శతకాలతో సత్తా చాటాడు.అదరగొడుతున్న సుతార్ ఇదిలా ఉంటే.. శ్రీలంక పర్యటనకు వెళ్లిన తాజా భారత జట్టులో ప్రస్తుతం నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లతో పాటు యువ స్పిన్నర్ మానవ్ సుతార్, వెటరన్ ఆటగాడు సారాంశ్ జైన్ కూడా ఉన్నారు. మానవ్ ఇప్పటికే అరంగేట్రం చేయగా.. సారాంశ్ టీమిండియాకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.నాకు అవకాశం ఉంటే గనుక..ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి కూడా ఫర్వేజ్ మహరూఫ్ స్పందించాడు. ‘‘కొన్ని నెలల క్రితం అఫ్గానిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే రాణించాడు. ఇటీవల శ్రీలంక ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్లోనూ బంతి, బ్యాట్తో సత్తా చాటాడు.అయితే, తుదిజట్టులో రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్కు కూడా చోటిస్తారా? అనేదే ప్రస్తుత ప్రశ్న. కుల్దీప్ యాదవ్ ఎలాగో తుదిజట్టులో ఉంటాడు. ఇక సారాంశ్ జైన్ ఇంకా అరంగేట్రం చేయలేదు. అయితే, అతడు డీసెంట్ బౌలర్. నాకే గనుక అవకాశం ఉంటే.. గాలె టెస్టుకు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్లను ఎంపిక చేస్తాను’’ అని ఫర్వేజ్ మహరూఫ్ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంకతో సిరీస్ టీమిండియాకు అత్యంత ముఖ్యమైనది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో ఫైనల్ రేసులో ఉండాలంటే లంకను భారత్ 2-0తో వైట్వాష్ చేయాల్సిందే.చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్గా SRH మాజీ ప్లేయర్ -
అఫ్గానిస్తాన్ క్రికెటర్కు ఐసీసీ షాక్!
అఫ్గానిస్తాన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. కాగా అఫ్గాన్ జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఐరిష్ జట్టుతో ఐదు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు పూర్తి కాగా.. తొలి వన్డే వర్షం వల్ల రద్దైపోయింది. రెండు, మూడో వన్డేల్లో గెలిచి అఫ్గాన్ పటిష్ట స్థితిలో నిలిచింది. అంతేకాదు ప్రపంచకప్-2027 టోర్నీకి నేరుగా అర్హత సాధించింది కూడా!అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూఇదిలా ఉంటే.. ఐర్లాండ్తో శుక్రవారం జరిగిన రెండో వన్డే సందర్భంగా అజ్మతుల్లా ఒమర్జాయ్ నిబంధనలు అతిక్రమించాడు. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా అతడికి శిక్ష విధించిన విషయాన్ని ప్రకటించింది.కారణం ఇదే‘‘ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.8 నిబంధనను అజ్మతుల్లా ఒమర్జాయ్ ఉల్లంఘించాడు. అంతర్జాతీయ మ్యాచ్లో అంపైర్ నిర్ణయాన్ని అతడు వ్యతిరేకించాడు. నిబంధనల ప్రకారం.. అతడిని మందలిస్తూ.. గత 24 నెలల కాలంలో ఇదే మొదటి తప్పు కాబట్టి.. క్రమశిక్షణా పట్టికలో ఒక డిమెరిట్ పాయింట్ జతచేయడమైనది’’ అని ఐసీసీ సదరు ప్రకటనలో పేర్కొంది.కాగా అఫ్గాన్- ఐర్లాండ్ మధ్య రెండో వన్డేను వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో 41వ ఓవర్లో ఒమర్జాయ్ అవుటైనట్లు అంపైర్ ప్రకటించాడు. కానీ అతడు క్రీజును వీడకుండా తన చర్యల ద్వారా అంపైర్ నిర్ణయం పట్ల అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశాడు. విచారణలో భాగంగా అతడు తన తప్పును అంగీకరించడంతో తదుపరి చర్యలేమీ లేకుండా ఈ మేరకు పనిష్మెంట్తో ఐసీసీ సరిపెట్టింది. ఈ మ్యాచ్లో అజ్మతుల్లా 24 బంతుల్లో 33 పరుగులు చేశాడు. జై ముంద్రా బౌలింగ్లో లోర్కాన్ టక్కర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్గా SRH మాజీ ప్లేయర్ -
T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్గా SRH మాజీ ప్లేయర్
ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ మోజెస్ హెన్రిక్స్ పోర్చుగల్ క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్-2028 యూరోప్ సబ్ రీజినల్ క్వాలిఫయర్ ‘సి’లో భాగంగా నాయకుడిగా జట్టును ముందుకు నడిపించనున్నాడు. పోర్చుగల్ క్రికెట్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది.కాగా పోర్చుగల్లో జన్మించిన మోజెస్ హెన్రిక్స్ చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. అక్కడే క్రికెటర్గా ఓనమాలు నేర్చుకుని.. దేశవాళీ క్రికెట్లో న్యూ సౌత్వేల్స్ తరఫున 2006లో అరంగేట్రం చేశాడు.వేల పరుగులు.. వందల వికెట్లుమొత్తంగా 131 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, 141 లిస్ట్-ఎ మ్యాచ్లు. 301 టీ20 మ్యాచ్లు ఆడిన హెన్రిక్స్ ఆయా ఫార్మాట్లలో 6830, 3812, 5747 పరుగులు సాధించాడు. ఈ మీడియం పేసర్ మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 333 వికెట్లు పడగొట్టాడు. బిగ్బాష్ లీగ్లో 3324 రన్స్ చేశాడు హెన్రిక్స్. కెప్టెన్గా సిడ్నీ సిక్సర్స్కు 2019, 2020 సీజన్లలో వరుస టైటిళ్లు అందించాడు.ఇక అంతర్జాతీయ క్రికెట్లో 2009లో అడుగుపెట్టిన మోజెస్ హెన్రిక్స్.. మొత్తంగా ఆసీస్ తరఫున నాలుగు టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 164, వన్డేల్లో 117, టీ20 ఫార్మాట్లో 355 పరుగులు చేశాడు. అదే విధంగా టెస్టుల్లో రెండు, వన్డేల్లో ఎనిమిది, టీ20లలో ఏడు వికెట్లు పడగొట్టాడు.షెడ్యూల్ ఇదేఇక 2021లో ఆస్ట్రేలియా తరఫున చివరి మ్యాచ్ ఆడిన మోజెస్ హెన్రిక్స్ ఇటీవలే ఆసీస్ క్రికెట్కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. తాజాగా పుట్టిన దేశం పోర్చుగల్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో భాగంగా ఆగష్టు 14న ఇజ్రాయెల్, ఆగష్టు 15న జర్మనీ, ఆగష్టు 17న గ్రీస్, ఆగష్టు 20న చెజియాతో పోర్చుగల్ తలపడుతుంది. ఇదిలా ఉంటే.. హెన్రిక్స్ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2028 క్వాలిఫయర్స్కు పోర్చుగల్ జట్టుమోజెస్ హెన్రిక్స్ (కెప్టెన్), క్రెయిగ్ కచోపా, ఎడ్వర్డ్ ఫ్లెమింగ్, క్రిస్టోఫర్ డే ఫ్రెయిటాస్, రాహుల్కుమార్ హషూ, సిరాజ్ ఉల్లా ఖదీం, హర్దీప్ ఖట్టాన్, జెరెమీ మార్టిన్స, ధవళ్కుమార్ నొరోటామ్ (వికెట్ కీపర్), జోర్డాన్ నెట్టో, కార్లోస్ నూన్స్, సెబాస్టియన్ డి ఒలివెరా, ఉపేన్ శాంతూ, కామెరాన్ షెక్లెటన్.చదవండి: సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్!.. యాన్సెన్ కవల సోదరుడికి ఛాన్స్ -
బాబర్కు షాకిచ్చిన షాహిన్ ఆఫ్రిది!
పాకిస్తాన్ క్రికెట్లో గత కొన్నేళ్లుగా అనిశ్చితి కొనసాగుతోంది. ఆ జట్టు కెప్టెన్లు, హెడ్కోచ్లు తరచూ మారుతూ ఉంటారు. నాయకత్వ బృందంలో ఇలా నిలకడలేని కారణంగా ఇప్పటికే జట్టు ఎన్నో ఘోర పరాభవాలు చవిచూసింది. అయినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరులో మాత్రం మార్పు రావడం లేదు.ఇందులో భాగంగా ఇటీవలే టెస్టు కెప్టెన్సీ నుంచి షాన్ మసూద్ను తొలగించి.. తిరిగి బాబర్ ఆజంకే పగ్గాలు అప్పగించారు. త్వరలోనే వన్డే జట్టు సారథ్యం బాధ్యతలనూ తిరిగి బాబర్కే అప్పగించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి 2022 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్ టోర్నీలో వైఫల్యాల తర్వాత బాబర్ ఆజం స్వయంగా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో టెస్టులకు షాన్ మసూద్, వన్డేలకు మహ్మద్ రిజ్వాన్, టీ20 ఫార్మాట్కు సల్మాన్ ఆఘా సారథులుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత వన్డేల్లో రిజ్వాన్ను షాహిన్, తాజాగా టెస్టుల్లో మసూద్ను బాబర్ రీప్లేస్ చేశారు.ఇక వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి సమయం దగ్గరపడుతున్న వేళ యాజమాన్యం సారథిగా మరోసారి బాబర్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి టెస్టు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పుడే వన్డే పగ్గాలు అప్పగించాలని బాబర్ షరతు విధించినట్లు టెలికామ్ ఆసియా స్పోర్ట్ ఇటీవల తన కథనంలో పేర్కొంది.ఈ పరిణామాల నేపథ్యంలో వన్డే కెప్టెన్ మార్పు గురించి షాహిన్ ఆఫ్రిదికి తాజాగా ప్రశ్న ఎదురైంది. నేషనల్ చాంపియన్షిప్స్ 2026 ఆరంభం సందర్భంగా ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇప్పటి వరకైతే నేనే వన్డే కెప్టెన్’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. దీనిని బట్టి తన పదవి ఎప్పుడైనా ఊడిపోవచ్చనే సంకేతాలు ఇచ్చాడు.కాగా 2025లో షాహిన్ ఆఫ్రిది వన్డే కెప్టెన్గా నియమితుడయ్యాడు. అతడి సారథ్యంలో ఇప్పటికి 11 వన్డేలు ఆడిన పాకిస్తాన్.. ఏడింట గెలిచి.. నాలుగు ఓడింది. తద్వారా అతడి విజయాల శాతం 63.63గా నమోదైంది. మరోవైపు.. బాబర్ ఆజం కెప్టెన్గా 43 వన్డేలు ఆడగా.. ఇందులో 26 గెలిచి.. 16 ఓడిపోయాడు.ఇక బాబర్ ఆజం కెప్టెన్సీలో పాకిస్తాన్ 85 టీ20 మ్యాచ్లు ఆడగా.. 48 గెలిచి.. 38 మ్యాచ్లు ఓడిపోయింది. ఇటీవల టెస్టు కెప్టెన్గా తిరిగి వచ్చిన బాబర్ వెస్టిండీస్తో సిరీస్ను 1-1తో సమం చేసుకున్నాడు. -
సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్!.. యాన్సెన్ కవల సోదరుడికి ఛాన్స్
నమీబియా పర్యటన నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు లెఫ్టార్మ్ స్పిన్నర్ బిజోర్న్ ఫార్చూన్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి సౌతాఫ్రికాతో పాటు నమీబియా, జింబాబ్వే ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు మూడు జట్ల మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ జరుగనుంది. నమీబియా పర్యటనలో భాగంగా సౌతాఫ్రికా తొలుత జింబాబ్వేతో కలిసి ట్రై సిరీస్లో ఆడనుంది.అనంతరం నమీబియాతో సౌతాఫ్రికా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే, ఈ సిరీస్ నుంచి వైట్బాల్ కెప్టెన్లు తెంబా బవుమా (వన్డే), ఐడెన్ మార్క్రమ్ (టీ20)లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. వీరితో పాటు కగిసో రబడ, లుంగి ఎంగిడి, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్లకు కూడా రెస్ట్ ఇచ్చారు.ఈ నేపథ్యంలో 31 ఏళ్ల బిజోర్న్ ఫార్చూన్కు కెప్టెన్గా అవకాశం దక్కింది. ఇదిలా ఉంటే.. స్టార్ ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ కవల సోదరుడు డువాన్ యాన్సెన్కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. తొలిసారి అతడు సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.ఇక కార్బిన్ బాష్ సోదరుడు ఎథాన్కు తొలిసారి టీ20 జట్టులో చోటు దక్కడం మరో విశేషం. వీరితో పాటు కన్నోర్ ఎస్తెన్హూజెన్, నకొబాని మొకొయెనా కూడా తొలిసారి వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. హెర్మాన్ బ్రదర్స్ జోర్డాన్, రూబిన్లు కూడా జట్టులో చేరారు.నమీబియా పర్యటనకు క్రికెట్ సౌతాఫ్రికా ఎంపిక చేసిన జట్టుబిజోర్న్ ఫార్చూన్ (కెప్టెన్), ఈథన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, కన్నోర్ ఎస్తేర్హూజెన్, జోర్డాన్ హెర్మాన్, రూబిన్ హెర్మాన్, డువాన్ యాన్సెన్, క్వెనా మఫాక, నకోబని మొకొయెనా, నకబా పీటర్, లువాన్ డ్రి ప్రిటోరియస్, లూథో సిపమ్లా, జేసన్ స్మిత్, ప్రెనేలన్ సుబ్రేయన్.కాగా ఆగష్టు 28 నుంచి సెప్టెంబరు 13 వరకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు నమీబియాలో పర్యటించనుంది. ఆగష్టు 28- సెప్టెంబరు 6 వరకు ట్రై సిరీస్లో ఆడనున్న సౌతాఫ్రికా జట్టు.. సెప్టెంబరు 9, 11, 13 తేదీల్లో ఆతిథ్య నమీబియాతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ టూర్ మొత్తానికి విండ్హెక్లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్ వేదిక.చదవండి: శ్రీలంకతో తొలి టెస్టు.. భారత తుదిజట్టులో ఊహించని పేరు! -
ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అరెస్టు
ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్టయ్యాడు. అత్యాచార ఆరోపణల కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బెంగాల్కు చెందిన అభిషేక్ పోరెల్ 2023లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న 24 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఇప్పటికి 35 మ్యాచ్లు ఆడి 769 పరుగులు చేశాడు.పెళ్లి చేసుకుంటానని నమ్మించి..క్యాపిటల్స్ కీలక ప్లేయర్లలో ఒకడిగా ఎదిగిన అభిషేక్ పోరెల్పై జూన్లో అత్యాచార ఆరోపణలతో కేసు నమోదైంది. గత మూడేళ్లుగా తనతో రిలేషన్షిప్లో ఉన్న పోరెల్.. ఏడాది కాలంగా తనను దూరం పెట్టాడని వైద్య విద్యార్థిని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అన్ని రకాలుగా వాడుకున్నాడని ఫిర్యాదు చేసింది.ఈ క్రమంలో తనపై అనేకమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. తమ వ్యక్తిగత వీడియోలు రికార్డు చేసి ఇప్పుడు వాటిని చూపించి బెదిరిస్తున్నాడని బాధితురాలు తీవ్రమైన ఆరోపణలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బెంగాల్ పోలీసులు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో..ఈ క్రమంలో అభిషేక్ పోరెల్ మొబైల్ ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను వెంటనే సీజ్ చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. అతడిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో డుమ్ డుమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమామి సిటీ పోలీసులు అభిషేక్ పోరెల్ను తాజాగా అరెస్టు చేసినట్లు సమాచారం. హూగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వార్ భూషణ్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాగా అభిషేక్ పోరెల్ గతంలో భారత్-ఎ క్రికెట్ జట్టు తరఫున యూకే, ఆస్ట్రేలియా గడ్డ మీద మ్యాచ్లు ఆడాడు. ఇదిలా ఉంటే.. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని అభిషేక్ పోరెల్ కొట్టిపారేశాడు. కాగా బెంగాల్ తరఫున 2021-11 సీజన్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన అభిషేక్ పోరెల్.. 32 మ్యాచ్లు ఆడాడు. ఇక లిస్ట్-ఎ క్రికెట్లో అతడు 23 మ్యాచ్లలో భాగమయ్యాడు. -
స్టబ్స్ విధ్వంసం.. ట్రెంట్ రాకెట్స్కు షాక్!
హండ్రెడ్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సదరన్ బ్రేవ్.. వరుస విజయాలతో పట్టికలో తొలి స్థానంలో ఉన్న ట్రెంట్ రాకెట్స్ను ఊహించని దెబ్బ కొట్టింది. ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా ట్రెంట్ రాకెట్స్తో జరిగిన మ్యాచ్లో సదరన్ బ్రేవ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. మిచెల్ సాంట్నర్ (35 నాటౌట్), లూయిస్ జార్జరీ (28 నాటౌట్) ఆఖర్లో మెరవడంతో ట్రెంట్ రాకెట్స్ మంచి స్కోరును సాధించింది. అంతకముందు ఫిన్ అలెన్ (23) పర్వాలేదనిపించాడు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో నిఖిల్ చౌదరీ, డానియెల్ వోర్రల్, స్టోయినిస్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం సదరన్ బ్రేవ్ 97 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ట్రిస్టన్ స్టబ్స్ (28 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, మార్కస్ స్టోయినిస్ (25 బంతుల్లో 46) మెరిశాడు. ఓపెనర్ జేమి స్మిత్ (26) పరుగులు చేశాడు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో క్లావిన్ హారిసన్ 2 వికెట్లు తీయగా, బెన్ సాండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెరొక వికెట్ పడగొట్టారు.Tristan Stubbs reaches his 50 with a six! It's game on 👊#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/yfoaFvNGMK— The Hundred (@thehundred) August 8, 2026Read: లంకతో తొలి టెస్టుకు భారత జట్టు.. తెరపైకి ఊహించని పేరు! -
లంకతో తొలి టెస్టుకు భారత జట్టు.. తెరపైకి ఊహించని పేరు!
భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ శ్రీలంకతో టెస్టు సిరీస్కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. తన జట్టులో సర్ఫరాజ్ ఖాన్కు చోటు కల్పించిన కైఫ్.. ధ్రువ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది కూడా స్పష్టంగా వివరించాడు. ధ్రువ్ జురెల్తో పోలిస్తే సర్ఫరాజ్ స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఆడగలడని, గాలే పిచ్ పరిస్థితులకు సర్ఫరాజ్ బ్యాటింగ్ శైలి సరిగ్గా నప్పుతుందని పేర్కొన్నాడు. "ట్రెండ్ను ఫాలో అవుతూ ప్రస్తుతం ఉన్న జట్టులో జురెల్కు అవకాశం కల్పిస్తారేమో. అతడు నిలకడ ప్రదర్శన చేయనప్పటికీ, ఇప్పటికే జురెల్ జట్టులో భాగమని భావిస్తే మాత్రం సర్ఫరాజ్ అవకాశం కోసం వేచి చూడాల్సిందే. కానీ నా దృష్టిలో మాత్రం ఐదు లేదా ఆరో స్థానంలో స్పిన్ను సమర్థంగా ఆడగల సత్తా సర్ఫరాజ్ ఖాన్కు ఉందని అనుకుంటున్నా. సుదీర్ఘంగా సాగే టెస్టు ఫార్మాట్లో పిచ్ పరిస్థితులు అర్ధమయ్యేకొద్దీ సర్ఫరాజ్ రకరకాల షాట్లు ఆడుతూ తన శైలి బ్యాటింగ్ కొనసాగించగలడు. ముఖ్యంగా ఉపఖండపు పిచ్ల్లో టెస్టుల్లో నాలుగు లేదా ఐదో రోజు వచ్చేసరికి స్పిన్కు బాగా అనుకూలిస్తుంది. ఈ సమయంలో బ్యాటింగ్ కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలోనే సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు బాగా ఉపయోగపడగలడు. అతనికి స్వీప్లు, రివర్స్ స్వీప్లు, ఎక్స్ట్రా కవర్స్, బ్యాక్ఫుట్ ఇలా ఏ షాటైనా స్పిన్ బౌలింగ్లో ఆడగలడు. ఇక జురెల్ ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల శ్రీలంక ఎలెవెన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో జురెల్ రెండు ఇన్నింగ్స్లు కలిపి 18 పరుగులు మాత్రమే చేశాడు. దీన్నిబట్టి ఇటీవలి అతడి టెస్టు రికార్డు, ఫామ్ అంత గొప్పగా లేవనిపిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.ధ్రువ్ జురెల్ ఇప్పటివరకు 10 టెస్టులాడి 478 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. మరోవైపు 2024లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఆరు టెస్టుల్లో 371 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలున్నాయి. శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.కైఫ్ ప్లేయింగ్ ఎలెవెన్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్/ సారాంశ్ జైన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. -
కళ్లు చెదిరే ఎండార్స్మెంట్లు.. వైభవ్ సంపాదన ఎంతంటే?
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించాడు. మ్యాచ్ల పరంగా ఆట ఎలా ఉన్నా ఎండార్స్మెంట్ల విషయంలో మాత్రం వైభవ్ సూర్యవంశీ దూసుకెళ్తున్నాడు. దీంతో 15 ఏళ్ల వయసుకే కళ్లు చెదిరే మొత్తాన్ని అందుకుంటున్న వైభవ్ సంపాదనలోనూ స్టార్ హోదా పొందాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న సమయంలోనే వైభవ్ సూర్యవంశీ తన బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు పెంచినట్లు సమాచారం. అయినప్పటికీ అతడి కోసం ఎండార్స్మెంట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. వైభవ్ వాణిజ్య విలువకు సంబంధించి ఒక్కోటి కోటి రూపాయల మార్కును దాటినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అతడి నికర ఆస్తి విలువ రూ. 7 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. దీనికి తోడు ఐపీఎల్ జీతం, మ్యాచ్ ఫీజులు, దేశవాళీ క్రికెట్ రూపంలో వస్తున్న డబులు అదనమని చెప్పొచ్చు.వైభవ్ ఆమోదించిన బ్రాండ్లు..👉ఎస్ఎస్ బ్యాట్స్: సచిన్ టెండూల్కర్ తన ఐకానిక్ MRF బ్యాట్ స్పాన్సర్షిప్తో ప్రసిద్ధి చెందగా, సూర్యవంశీ ఇంకా ఏ కార్పొరేట్ దిగ్గజంతోనూ భారీ ఒప్పందం కుదుర్చుకోలేదు. అయితే, అతను ప్రస్తుతం సరీన్ స్పోర్ట్స్ (SS)తో సంవత్సరానికి సుమారు రూ. 50 లక్షల విలువైన పరికరాల ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు. SS మార్కెట్లో ప్రత్యేకమైన "వైభవ్ సూర్యవంశీ ఎడిషన్" బ్యాట్లను కూడా విడుదల చేసింది.👉కాంప్లాన్: 2026 ప్రారంభంలో వైభవ్ కాంప్లాన్ వారి "థోడా ప్లాన్, థోడా కాంప్లాన్" ప్రకటన ప్రచారానికి అంబాసిడర్గా మారాడు. సరైన పోషణ , అంకితభావంపై దృష్టి సారించే ఈ ప్రకటన, ఒక యువ అథ్లెట్గా సూర్యవంశీ నిజ జీవిత దినచర్యను ప్రతిబింబిస్తుండడం విశేషం.👉గూగుల్ పే: ప్రస్తుతం వైభవ్ గూగుల్ పే ప్రచారకర్తగా ఉన్నాడు. ఈ ప్రకటనలో, అతడు తన తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాకు అనుసంధానించబడిన UPIని ఉపయోగిస్తూ, టీనేజర్ల కోసం సురక్షితమైన డబ్బు నిర్వహణను హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడు.👉రెడ్బుల్: ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ జురెల్తో కలిసి వైభవ్ రెడ్బుల్ చాలెంజ్లో పాల్గొని అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు.👉జార్ఖండ్ ఆరోగ్యశాఖ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను చురుకుగా, ఫిట్గా, ఆరోగ్యంగా ఉండేలా ప్రేరేపించడానికి వైభవ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తామని జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి 2026 మేలో ఒక ప్రకటన విడుదల చేశారు.👉ఇక ఇంగ్లండ్ పర్యటన ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ గత నెలలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో రెండు మెరుపు అర్ధశతకాలతో 151 పరుగులు చేశాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఈస్ట్జోన్కు ప్రాతినిధ్యం వహించనున్న వైభవ్ వైస్కెప్టెన్గా జట్టును నడిపించనున్నాడు.Read: ‘అతడి జోలికి వెళ్లొద్దు’.. ఫిఫాకు ట్రంప్ వార్నింగ్! -
ఆ ముగ్గురి నుంచి ఫోన్కాల్.. అందరికీ ఒకటే సమాధానం!
అజింక్యా రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో స్వదేశంలో కంటే విదేశీ టూర్లలో ఎక్కువగా రాణించిన రహానే సంతృప్తిగానే వీడ్కోలు పలికినట్లు పేర్కొన్నాడు. అయితే తాను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించిన సమయంలో సచిన్, కోహ్లి, రోహిత్లు తనకు ఫోన్కాల్ చేసి నిర్ణయంపై పునరాలోచన చేయాలని తెలిపారు. కానీ ఆ ముగ్గురికి తాను ఒకటే సమాధానం చెప్పానని, ఇష్టపూర్వకంగానే తాను ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వాళ్లకు చెప్పానని రహానే చెప్పుకొచ్చాడు. వీళ్లతో పాటు ఇర్ఫాన్ పఠాన్, బుమ్రా నుంచి కూడా తనకు సందేశాలు వచ్చాయని తెలిపాడు. రిటైర్మెంట్ వీడియోనూ పోస్టు చేసిన తర్వాత తనకు మొదటి కాల్ సచిన్ టెండూల్కర్ నుంచి వచ్చిందని రహానే వెల్లడించాడు.'రహానే.. నువ్ ఇంకా ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడతావు అనుకున్నా' అని సచిన్ చెప్పినట్లు తెలిపాడు. ఇకపై క్రికెట్ను సాగదీయకుండా, ఎలాంటి అసంతృప్తి లేకుండా కెరీర్ ముగించాలనే నిర్ణయం తీసుకున్నానని సచిన్కు చెప్పినట్లు రహానే పేర్కొన్నాడు. ఇక మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా రహానేకి ఫోన్ చేసి మాట్లాడాడు. మరోవైపు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, చతేశ్వర్ పుజారా వంటి ఆటగాళ్లు రహానేకి మెసేజెస్ అండ్ కాల్స్ చేశారు. అయితే వీరందరికీ రహానే ఒకటే సమాధానం ఇచ్చినట్లు తెలిపాడు. క్రికెట్కు తాను పూర్తిగా న్యాయం చేశాననే సంతృప్తితో ఉన్నానని, తన నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేసినట్లు రహానే వెల్లడించాడు.కోహ్లి, పుజరాలతో ఉన్న బంధం గురించి రహానే స్పందించాడు. ‘దేశీయ క్రికెట్లో నేను, పుజారా చాలా కాలం కలిసి ఆడాము. అయితే, భారత్ తరఫున ఆడుతున్నప్పుడు నేను, విరాట్ ఎక్కువ సమయం కలిసి గడిపాము. కానీ మా మధ్య బంధం చాలా బలంగా ఉండేది. భారత టెస్ట్ జట్టును అగ్రస్థానానికి తీసుకెళ్లడమే మా ఉమ్మడి లక్ష్యం. 2015లో ఆరో, ఏడో ర్యాంకులో ఉన్న మేము, క్రమంగా నంబర్ 1 టెస్ట్ జట్టుగా ఎదిగాము. మేము నిరంతరం ఆట గురించి చర్చించుకుంటూ, విశ్లేషించుకుంటూ, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాము. చాంపియన్లుగా మారకముందు, టెస్టుల్లో మేమిద్దరం కలిసి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాము. అది ఎంతో ఆనందాన్నిచ్చింది.’ అని చెప్పుకొచ్చాడు.రహానే తన 15 ఏళ్ల కెరీర్లో భారత్ తరపున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 8414 పరుగులు చేశాడు. అందులో 5077 రన్స్ టెస్ట్ క్రికెట్లో సాధించినవే కావడం గమనార్హం. అతడి పేరిట 12 టెస్టు సెంచరీలు ఉన్నాయి.చదవండి: విండీస్ ఆశలపై నీళ్లు చల్లిన అఫ్గానిస్తాన్ -
విండీస్ ఆశలపై నీళ్లు చల్లిన అఫ్గానిస్తాన్
ఐర్లాండ్పై విజయంతో 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించిన అఫ్గానిస్తాన్.. వెస్టిండీస్ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని విండీస్ కోల్పోయింది. ఇక ప్రపంచకప్కు అర్హత సాధించేందుకు విండీస్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న ఎనిమిది జట్లు నేరుగా వన్డే ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. ఇక ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు కూడా అర్హత సాధించాయి. అయితే వెస్టిండీస్ ప్రస్తుతం ర్యాంకింగ్స్లో పదో స్థానంలో కొనసాగుతోంది. జింబాబ్వే 11వ స్థానంలో ఉన్నప్పటికీ ఆతిథ్య హోదాలో ఆ జట్టు అర్హత సాధించడంతో కటాఫ్ తేదీ సమయానికి వెస్టిండీస్కు టాప్-9లో ప్రవేశించేందుకు చాన్స్ లేదు. ఒకవేళ సెప్టెంబర్-అక్టోబర్లో భారత్తో జరగనున్న వన్డే సిరీస్లో వెస్టిండీస్ అన్ని మ్యాచ్లు గెలిచినప్పటికీ వరల్డ్కప్కు అర్హత సాధించే అవకాశం మాత్రం వారికి లేదు. సెప్టెంబర్ 30 డెడ్లైన్ ప్రకారం టాప్-8లో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అప్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్తో పాటు సౌతాఫ్రికా (ఆతిథ్య దేశం), జింబాబ్వే (ఆతిథ్య దేశం) నేరుగా వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించనున్నాయి. ఇక వెస్టిండీస్ మాత్రం వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించకపోవడం ఇది వరుసగా మూడోసారి. 2019, 2023 ఎడిషన్లలోనూ విండీస్ డైరెక్ట్ క్వాలిఫై సాధించడంలో విఫలమైంది. ఇక వెస్టిండీస్ ఈసారి కూడా ప్రపంచకప్లో ఆడాలంటే ఇతర అసోసియేట్ దేశాలతో కలిసి వరల్డ్కప్ క్వాలిఫయర్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా రెండో రౌండ్లో అడుగుపెడుతుంది.కాగా మిగిలిన జట్లు రెండో రౌండ్కు అర్హత సాధించేందుక సూపర్ సిరీస్ ఆడనున్నాయి. రెండుసార్లు వన్డే ప్రపంచకప్ విజేత అయిన వెస్టిండీస్ దారుణ ఆటతీరుతో ర్యాంకింగ్స్లో అట్టడుగు స్థానంలో నిలుస్తూ నేరుగా అర్హత సాధించడంలో విఫలమవుతూనే వస్తోంది.Read: ఐసీసీకీ షాక్.. ఆక్రోశం వెళ్లగక్కిన స్కాట్లాండ్, నెదర్లాండ్ -
ఐసీసీకీ షాక్.. ఆక్రోశం వెళ్లగక్కిన స్కాట్లాండ్, నెదర్లాండ్
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ 2027 ఫార్మాట్లో మార్పులు చేయడం పట్ల స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ ప్రకటన జారీ చేశాయి. ఐసీసీ చేపట్టిన చర్యలు అంతర్జాతీయ క్రికెట్ సమగ్రతను, విశ్వసనీయతను బలహీనపరిచే ప్రమాదం పొంచి ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేశాయి. వన్డే ప్రపంచకప్కు సంబంధించి మార్పుల ప్రక్రియను కూడా ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఎత్తి చూపాయి. క్వాలిఫికేషన్ సైకిల్ మధ్యలో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఫార్మాట్లను మార్చడం వల్ల జట్ల ప్రణాళికలు దెబ్బతింటాయని, ఇప్పటికే పరిమిత వనరులతో పనిచేస్తున్న బోర్డులపై అదనపు ఆర్థిక, కార్యచరణ భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.‘2027 వన్డే ప్రపంచకప్ పోటీ ప్రారంభానికి 18 నెలల కంటే తక్కువ సమయమే ఉంది. అయితే పురుషుల వన్డే ప్రపంచకప్ క్వాలిఫికేషన్కు అనుసరిస్తున్న నూతన విధానం, టోర్నమెంట్ ఫార్మాట్లో గణనీయమైన నిర్మాణాత్మక మార్పులు అమలు చేయాలన్న ఐసీసీ నిర్ణయం పట్ల క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ (నెదర్లాండ్స్) బోర్డులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ మార్పులు ఐసీసీలో అసోసియేట్ సభ్యదేశాల క్రికెట్కు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ప్రపంచ క్రికెట్ను అభివృద్ధి చేయాలనే ప్రయత్నంలో ఇటీవలి సంవత్సరాల్లో క్రికెట్లో సాధించిన పురోగతిని కూడా ఈ మార్పులు దెబ్బతీసే ప్రమాదముంది. క్రికెట్లో తమ పరిధిని విస్తరించుకోవాలనే ఐసీసీ ఆలోచన మంచిదే అయినప్పటికీ, ఇప్పుడిప్పుడే క్రికెట్లో అడుగుపెడుతున్న దేశాలకు మాత్రం ఇలాంటి మార్పులు అవకాశాలను తగ్గించేందుకు ఆస్కారముంటుంది.’ అని తమ ప్రకటనలో పేర్కొన్నాయి.2027 వన్డే ప్రపంచకప్ ఫార్మాట్ ఇదే..వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. అయితే, అర్హత సాధించిన జట్లలో చివరి మూడు జట్లు సూపర్ సిరీస్లో తలపడతాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు మిగతా 11 టీమ్ లతో కలిసి ప్రధాన రౌండ్కు అర్హత సాధిస్తుంది. అప్పుడు 12 జట్లను రెండు గ్రూప్లుగా విభజించి 30 మ్యాచ్లు నిర్వహిస్తారు.ప్రతి గ్రూప్ నుంచి టాప్-3లో నిలిచిన జట్లు తదుపరి రౌండ్కు క్వాలిఫై అవుతాయి. అంతేకాకుండా ఈ రెండు గ్రూప్ ల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన నాలుగో అత్యుత్తమ టీమ్ కూడా అర్హత సాధిస్తుంది. ఈ ఏడు జట్లు మూడో దశ అయిన సూపర్-7లోకి అడుగుపెడతాయి. ఈ రౌండ్లో 21 మ్యాచ్లు నిర్వహిస్తారు. టాప్-4 జట్లు సెమీ ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.BIG : Cricket Scotland and KNCB have jointly released a strongly worded statement against the ICC over the 2027 World Cup format changes.They say the changes were made without meaningful consultation with Associate Members, calling the ICC’s lack of response “disappointing and… pic.twitter.com/p6pN5DjXDX— Ragav X (@ragav_x) August 10, 2026Read: ‘నవ్వులాటగా ఉన్నా వారి చర్యలు హర్షనీయం’ -
రషీద్ మెరుపులు.. వన్డే ప్రపంచకప్కు అఫ్గానిస్తాన్ అర్హత
అఫ్గానిస్తాన్ జట్టు 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించింది. రషీద్ ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనకు తోడు ఐర్లాండ్తో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా అఫ్గానిస్తాన్ నేరుగా ఈ అవకాశాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన వన్డేలో అఫ్గాన్ మూడు వికెట్ల తేడాతో ఐర్లాండ్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 46.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. గావిన్ హోయ్ (36) టాప్ స్కోరర్గా నిలవగా, కేడ్ కార్మిచల్ (32), జై మూంద్రా (31) పర్వాలేదనిపించారు. అప్గానిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, గజన్ఫర్చెరో మూడు వికెట్లతో విజృంభించగా, యామిన్ అహ్మద్జయ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 44.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ (71) అర్ధసెంచరీతో రాణించగా, ఆఖర్లో రషీద్ ఖాన్ (37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఐర్లాండ్ బౌలర్లలో గావిన్ హోయ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో అఫ్గానిస్తాన్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే బుధవారం జరగనుంది.డెడ్లైన్ సెప్టెంబర్..సెప్టెంబర్ 2026 వరకు ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్–8 స్థానాల్లో ఉండే జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. దక్షిణాఫ్రికా ఆతిథ్య జట్టు కావడంతో టాప్–9కు అవకాశం దక్కుతుంది. బంగ్లాదేశ్ కూడా క్వాలిఫై అయింది. అయితే రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్ ఈ అవకాశం కోల్పోయింది. దాంతో విండీస్ వరల్డ్ కప్కు అర్హత సాధించాలంటే క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది.𝐌𝐀𝐓𝐂𝐇-𝐖𝐈𝐍𝐍𝐈𝐍𝐆 𝐑𝐀𝐒𝐇𝐈𝐃 𝐊𝐇𝐀𝐍! 🪄3/44 with the ball! 🎯37* with the bat! 💥@rashidkhan_19 delivered another brilliant all-round performance to guide Afghanistan to victory and claim his second successive Player of the Match award! 👏💙#AfghanAtalan |… pic.twitter.com/r4JZlbJJNk— Afghanistan Cricket Board (@ACBofficials) August 10, 2026Read: మాజీ క్రికెటర్ గంగూలీ దంపతులకు బెదిరింపు లేఖ! -
మాజీ క్రికెటర్ గంగూలీ దంపతులకు బెదిరింపు లేఖలు!
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఆయన భార్య డోనా గంగూలీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. గత ఆరు నెలలుగా గంగూలీ కార్యాలయానికి బెదిరింపు లేఖలు వస్తున్నట్లు తేలింది. అయితే మొదట్లో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. అయితే అదే పనిగా లేఖలు వస్తుండడంతో తాజాగా గంగూలీ మేనేజర్ తానియా భట్టాచార్య దక్షిణ కోల్కతాలోని ఠాకూర్పూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. గంగూలీ, అతని భార్య డోనాతో పాటు వారితో సన్నిహితంగా మెలుగుతున్న వ్యక్తులకు కూడా హాని చేస్తామని బెదిరిస్తూ గంగూలీ కార్యాలయానికి సోమవారం కూడా రెండు లేఖలు అందాయని మేనేజర్ స్పష్టం చేశారు. అయితే ఈ సంఘటనపై సౌరవ్ గంగూలీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. బెదిరింపు లేఖలు రావడంపై గంగూలీ మేనేజర్ మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
సవాల్కు సర్ఫరాజ్ సై
ముంబై: ‘నేను తగినవాడినో కాదు తెలీదు, కానీ నా వద్ద ఉన్నవాటితోనే నేను పోరాడతాను’... ఈ వ్యాఖ్యతో తెలుగు సినిమా జెర్సీలో హీరో నాని ఫోటోను జత కలిపి మూడు రోజుల క్రితం సర్ఫరాజ్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బహుశా భారత జట్టులో తనకు చాలా కాలంగా చోటు దక్కకపోవడంతో నిరాశను అతను ఈ రకంగా ప్రదర్శించినట్లున్నాడు. అయితే ఆదివారమే అతడిని శ్రీలంకతో సిరీస్ కోసం సెలక్టర్లు ఎంపిక చేశారు. 2024 నవంబర్లో తన చివరి టెస్టు ఆడిన సర్ఫరాజ్ ఇంతకాలం తర్వాత టీమ్లోకి పునరాగమనం చేశాడు. అయితే దీని వెనక కఠోర శ్రమ, పోరాటం ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ సాధన కొనసాగించి అతను సిద్ధమైన తీరు సర్ఫరాజ్ ఆటపై ఆశలు రేపుతోంది. తాను ఆడిన 6 టెస్టుల్లో సర్ఫరాజ్ 37.10 సగటుతో 371 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 3 అర్ధసెంచరీలు ఉండటం ఎలా చూసినా మెరుగైన ప్రదర్శనే.అనూహ్యంగా దూరమై...దాదాపు రెండేళ్ల క్రితం సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్లో వైఫల్యం తర్వాత సర్ఫరాజ్ జట్టులో కోల్పోయాడు. నిజానికి ఈ మ్యాచ్ తొలి టెస్టులో అతను సెంచరీతో సత్తా చాటాడు. తర్వాతి రెండు టెస్టుల్లో కలిపి 21 పరుగులే చేశాడు. అయితే భారత్ 0–3తో చిత్తయిన ఈ సిరీస్లో ఇతర ఆటగాళ్లంతా కూడా విఫలమైనా వేటు సర్ఫరాజ్పైనే పడింది. ఆ తర్వాత పునరాగమనం చాలా కష్టంగా మారిపోయింది. ఇంగ్లండ్ గడ్డపై భారత ‘ఎ’ జట్టు తరఫున 92 పరుగులు, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో సెంచరీ చేసినా ప్రయోజనం లేకపోయింది. నిజానికి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు ముందు టీమ్ మేనేజ్మెంట్ సర్ఫరాజ్ను తీసుకోవాలని భావించినా... సెలక్టర్లు అంగీకరించలేదని సమాచారం. ఎట్టకేలకు ఇప్పుడు మళ్లీ టీమిండియా పిలుపు దక్కింది.17 కిలోల బరువు తగ్గి...గత ఏడాదిన్నర కాలంలో సర్ఫరాజ్ శారీరకంగా ఎంతో కష్టపడ్డాడు. ఈ క్రమంలో తన బరువు, ఫిట్నెస్పై వస్తున్న సందేహాలను సమాధానం ఇచ్చేందుకు అతను సన్నద్ధమయ్యాడు. రంజీ ట్రోఫీలో సుదీర్ఘ సమయం పాట క్రీజ్లో నిలిచి ట్రిపుల్ సెంచరీ సాధించినా... ఈ విషయంలో అతనిపై సందేహాలు తీరలేదు. దాంతో పట్టుదలగా ప్రయతి్నంచి ఏకంగా 17 కిలోల బరువు తగ్గించుకున్నాడు. దాంతో అతని శరీరం మరింత చురుగ్గా మారింది. ముంబైలో ఎంసీఏ ఇండోర్ స్టేడియంలో ఆస్ట్రో టర్ఫ్ వికెట్పై ప్రాక్టీస్ చేసిన అతను... కుర్లాలోని ప్రైవేట్ అకాడమీలో పూర్తిగా సిద్ధం చేయని ఎర్రమట్టి పిచ్లపై గంటల పాటు సాధన కొనసాగించాడు. స్పిన్ బౌలర్లను మరింతగా సమర్థంగా ఎదుర్కొనేందుకు అతను దీనిని అనుసరించాడు. అయితే వర్షాల కారణంగా ప్రాక్టీస్ సాధ్యం కాకపోవడంతో అతను కశ్మీర్కు వెళ్లిన తన సాధన కొనసాగించాడు. శ్రీనగర్ సమీపంలోని షేర్–ఎ–కశ్మీర్ స్టేడియంలో సర్ఫరాజ్ సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్లోనే నిలిచి తన ఆటకు పదును పెట్టాడు.తుది జట్టులో పోటీ! శ్రీలంకతో రెండు టెస్టులకు ప్రస్తుతం సర్ఫరాజ్ ఎంపికైనా... తుది జట్టులో స్థానం దక్కడం కూడా కీలకమే. భారత జట్టు తమ చివరి టెస్టు ఆడిన తుది జట్టు (అఫ్గానిస్తాన్తో)ను చూస్తే సాయి సుదర్శన్ ఆడిన మూడో స్థానానికి దేవ్దత్ పడిక్కల్ సిద్ధంగా ఉన్నాడు. దేశవాళీలో మెరుగైన రికార్డు, ప్రాక్టీస్ మ్యాచ్లో ప్రదర్శనతో పాటు ఎడంచేతి వాటం కావడం అతని స్థానాన్ని దాదాపు ఖాయం చేశాయి. సర్ఫరాజ్ జట్టులో ఇప్పుడు ఆరో స్థానానికి పోటీ పడుతున్నాడు. ఇప్పటి వరకు ఇక్కడ ఆడుతున్న ధ్రువ్ జురేల్ నుంచి ఆశించిన ప్రదర్శన రావడం లేదు. వికెట్ కీపర్గా రిషభ్ పంత్ జట్టులో ఉండగా రెగ్యులర్ బ్యాటర్గా జురేల్ స్థానం ప్రశ్నార్ధకమే. పైగా స్పిన్ను ఆడటంలో అతను పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ విషయంలో సర్ఫరాజ్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాడు. ఒకవేళ తుది జట్టులో చాన్స్ లభిస్తే సత్తా చాటి తనను తాను నిరూపించుకోగల సామర్థ్యం సర్ఫరాజ్లో ఉందనేది వాస్తవం. -
గౌతమ్ గంభీర్ రికార్డుపై కన్నేసిన రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దాదాపు 8 నెలల తర్వాత తిరిగి జాతీయ జట్టు తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టులో జడేజా బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్కు ముందు జడేజాను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. జడేజా ముందున్న రికార్డులు ఇవే👉ఈ మ్యాచ్లో జడేజా మరో రెండు వికెట్లు పడగొడితే టెస్టుల్లో 350 వికెట్లు మైలు రాయిని అందుకున్న ఐదో భారత బౌలర్గా నిలుస్తాడు.👉అదేవిధంగా మరో 4 వికెట్లు సాధిస్తే శ్రీలంకపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో ఐదో స్దానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం ఈ రికార్డు వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ పేరిట ఉంది. ఇషాంత్ శర్మ 12 టెస్టుల్లో 36 వికెట్లు తీయగా, జడేజా 7 టెస్టుల్లోనే 23.72 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (74 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (62), హర్భజన్ సింగ్ (53), కపిల్ దేవ్ (45) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. 👉అదేవిధంగా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ రికార్డుపై కూడా అతడు కన్నేశాడు. మరో 60 పరుగులు చేస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గంభీర్(4,154)ను జడ్డూ అధిగమిస్తాడు. కాగా జడేజా మంచి టచ్లో ఉన్నాడు. శ్రీలంక ఎలెవన్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో జడేజా బ్యాట్తో పాటు బంతితో కూడా రాణించాడు.చదవండి: వైభవ్ కాదు.. అతడి సెలక్షన్ ఒక అద్భుతం! -
నేపాల్ జట్టు కెప్టెన్గా ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ స్పిన్నర్
ఏసీసీ ప్రీమియర్ కప్-2026 టోర్నీకి ముందు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (CAN) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు వన్డే కెప్టెన్గా రోహిత్ పౌడెల్ స్థానంలో స్టార్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్ సందీప్ లామిచానేను నియమించింది. ఈ విషయాన్ని సీఎఎన్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. కాగా లామిచానే తొలుత 2022లో నేపాల్ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు.కానీ ఓ వివాదంలో చిక్కుకోవడంతో కెప్టెన్సీ అతడు కోల్పోయాడు. అతడి స్ధానంలో రోహిత్ పౌడెల్ కెప్టెన్సీ పగ్గాలను అప్పగించారు. నేపాల్ జట్టును రోహిత్ అద్భుతంగా నడిపించాడు. నేపాల్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 63 వన్డే మ్యాచుల్లో జట్టును నడిపించిన రోహిత్, 31 విజయాలు అందించాడు. అయినప్పటికి తిరిగి లామిచానేను కెప్టెన్గా ఎంపిక చేయడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లామిచానే కెప్టెన్గా తన ప్రయాణాన్ని ఏసీసీ ప్రీమియర్ కప్తో ప్రారంభించనున్నాడు. ఈ టోర్నీలో నేపాల్ జట్టు సెప్టెంబర్ 1న మలేషియాలోని బాయుమాస్ ఓవల్లో సౌదీ అరేబియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత గ్రూప్-ఎలోని బహ్రెయిన్, మలేషియా, హాంగ్కాంగ్లతో తలపడనుంది.ఏసీసీ ప్రీమియర్ కప్ టోర్నీకి నేపాల్ జట్టు: సందీప్ లామిచానే (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అర్జున్ కుమాల్, రోహిత్ పౌడెల్, దేవ్ ఖనాల్, దీపేంద్ర సింగ్ ఐరీ, సుందీప్ జోరా, బాసిర్ అహ్మద్, ఇషాన్ పాండే, గుల్షన్ ఖా, షేర్ మల్లా, లలిత్ రాజ్బంశీ, కరన్ కేసీ, హేమంత్ ధామి. -
సీఎస్కే హెడ్కోచ్గా బ్రెండన్ మెక్కల్లమ్!
ఐపీఎల్-2027 సీజన్కు ముందు చెన్నై సూపర్ సూపర్ కింగ్స్ తమ కొత్త హెడ్కోచ్ కోసం వేట ప్రారంభించింది. హెమాంగ్ బదానీ, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ ద్రవిడ్ వంటి భారత మాజీ ఆటగాళ్ల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. సీఎస్కే మాత్రం విదేశీ హెడ్ కోచ్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో మరో న్యూజిలాండ్ లెజెండ్ బ్రెండన్ మెక్కల్లమ్ను తమ జట్టు ప్రధాన కోచ్గా ఎంపిక చేయాలని సీఎస్కే భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మెక్కల్లమ్ ఇటీవల ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్కోచ్ బాధ్యతల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే.అయితే అతడు ఇంగ్లీష్ జట్టు వైట్బాల్ కోచ్గా మాత్రం కొనసాగుతున్నాడు. త్వరలోనే ఈ పదవి నుంచి కూడా అతడు వైదొలిగే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇకపై అతడు ఫ్రాంచైజీ క్రికెట్పై దృష్టిసారించే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.కాగా మెక్కల్లమ్కు సీఎస్కేతో మంచి అనుబంధం ఉంది. అతడు ఫ్లెమింగ్ నాయకత్వంలో సీఎస్కే తరపున ఆడాడు. ఈ నేపథ్యంలోనే అతడిని తమ కోచ్గా నియమించాలని నియమించాలని భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కానీ దీనిపై సీఎస్కే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకోవడానికి కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్తో పాటు సీఎస్కే కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఫ్రాంచైజీ పూర్తి దృష్టి హెడ్ కోచ్ ఎంపికపైనే ఉందంట. కోచ్ ఎంపిక ఖారారైన తర్వాతే పాండ్యాపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. -
జై షా విజన్.. 40 ఎకరాల బీడు భూమి నుంచి సీఓఈ దాకా!
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గురుంచి ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్రమైన చర్చనడుస్తోంది. సీఓఈ క్లియరెన్స్ ఇచ్చిన కొద్ది రోజులకే ఆటగాళ్ల గాయాలు తిరగబెట్టడం పలు అనుమానులకు తావనిస్తోంది. పూర్తి ఫిట్నెస్ సాధించకుండానే సీఓఈ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ఇస్తుందనున్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత జట్టులోని జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు సీఓఈలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా, బోర్డు అధికారులు సీఓఈను సందర్శించారు. వీరంతా సీఓఈ హెడ్ వీవీయస్ లక్ష్మణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేవజిత్ సైకియా కీలక విషయాలను వెల్లడించారు. ఒకప్పుడు ఏ ఉపయోగం లేకుండా పడివున్న 40 ఎకరాల బంజారు భూమిని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దడంలో అప్పటి బీసీసీఐ సెక్రెటరీ జై షాది కీలక పాత్ర అని సైకియా తెలిపారు."బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఈరోజు అందుబాటులో ఉందంటే అందుకు ప్రధాన కారణం జై షా. 'సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్' ఏర్పాటు కోసం అతడు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లోని అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చాడు.ఎన్నో ఏళ్లుగా తాత్కాలిక ఏర్పాట్లతో సాగిన నేషనల్ క్రికెట్ అకాడమీ స్థానంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు ఉండే ఓ అత్యాధునిక ట్రైనింగ్ సెంటర్ను తీసుకురావాలని అతడు బలంగా నిశ్చయించుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును ప్రారంభించే క్రమంలో అనేక నిబంధనలను పాటించాల్సి వచ్చింది.చట్టపరమైన అడ్డంకులన్నింటినీ తొలగించేందుకు జై షా స్వయంగా పలుమార్లు ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా, 40 ఎకరాల బీడు భూమిని క్రమబద్ధీకరించే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఆ భూమి నిరుపయోగంగా పడి ఉండటంతో పాటు, చాలామంది దానిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు.అందుకే 2022 ఫిబ్రవరి 14న పనులు ప్రారంభించడానికి ముందే దానిని చట్టబద్ధంగా సొంతం చేసుకున్నాం. అడ్డంకులన్నింటినీ దాటుకుని ఈ రోజు అత్యాధునిక సౌకర్యాలతో ఈ సెంటర్ రూపుదిద్దుకుంది" అని సైకియా విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కాగా ఈ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యకలాపాలు నవంబర్ 2024లో ప్రారంభమయ్యాయి. -
వరుసగా 6 సిక్సర్లు బాదిన మరో ప్లేయర్
ప్రొఫెషనల్ క్రికెట్లో మరో ప్లేయర్ వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వన్డే కప్లో హాంప్షైర్ యువ బ్యాటర్ టోబీ ఆల్బర్ట్ ఈ ఘనత సాధించాడు. టోబీ వరుసగా ఆరు సిక్సర్లు బాదినా.. హెర్షల్ గిబ్స్, యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, దీపేంద్ర సింగ్ ఐరీ తదితరుల సరసన చేరలేకపోయాడు. వీరంతా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదగా.. టోబీ రెండు వేర్వేరు ఓవర్లలో ఈ ఫీట్ సాధించాడు. దీని వల్ల అతడికి గిబ్స్, యువీ, పోలార్డ్ ఉండే ఎలైట్ లిస్ట్లో చోటు దక్కలేదు.పూర్తి వివరాల్లోకి వెళితే.. ససెక్స్తో జరిగిన మ్యాచ్లో టోబీ 37 బంతుల్లో ఐదు ఫోర్లు, ఎనిమిది భారీ సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేశాడు. 43వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన టోబీ.. ఆ తర్వాతి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఈ ఆరు సిక్సర్లు ఒకే ఓవర్లు కొట్టినవి కానప్పటికీ.. వరుసగా తనెదుర్కొన్న ఆరు బంతుల్లోనే టోబీ ఈ ఫీట్ను సాధించాడు.Toby Albert is the 11th man to hit six consecutive sixes in a professional match 🤯Here's how he did it... 🧨 pic.twitter.com/UcFHT081xh— Hampshire Cricket (@hantscricket) August 10, 2026మ్యాచ్ విషయానికొస్తే.. టోబీకి విధ్వంసానికి తోడు ఓపెనర్లు అలిస్టర్ ఒర్ (105), బెన్ మేస్ (109) సెంచరీలతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ససెక్స్ సైతం పోరాడినప్పటికీ విజయతీరాలు చేరలేకపోయింది. 48.5 ఓవర్లలో ఆ జట్టు 332 పరుగులకే ఆలౌటైంది. చార్లీ టియర్ (111), జాక్ లీనింగ్ (92), డేనియల్ ఇబ్రహీం (55) ససెక్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.ప్రొఫెషనల్ క్రికెట్లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు- గ్యారీ సోబర్స్: దేశవాళీ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు- రవి శాస్త్రి: దేశవాళీ క్రికెట్లో ఆరు సిక్సర్లు- హెర్షెల్ గిబ్స్: 2007 వన్డే ప్రపంచకప్లో అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి ఈ ఘనత- యువరాజ్ సింగ్: 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో ఆరు సిక్సర్లు- కీరన్ పొలార్డ్: 2021లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరు సిక్సర్లు- దీపేంద్ర సింగ్ ఐరీ: 2024లో వరుసగా ఆరు సిక్సర్లు -
'సచిన్, కోహ్లి కాదు.. ప్రపంచ క్రికెట్లో అతడే గొప్ప ప్లేయర్'
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్ ఎవరనే చర్చ వచ్చినప్పుడు సచిన్ టెండూల్కర్, డోనాల్డ్ బ్రాడ్మన్ వంటి దిగ్గజాల పేర్లు ముందు వరుసలో ఉండటం సహజం. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్లీ.. బెస్ట్ బ్యాటర్, క్రికెటర్ ఎవరనే దానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. క్రికెట్ హిస్టరీలో సచిన్ టెండూల్కర్ కంటే గొప్ప బ్యాటర్ మరొకరు లేరని బ్రెట్ లీ స్పష్టం చేశాడు. కానీ గొప్ప క్రికెటర్ (Goat)అంటే మాత్రం తన దృష్టిలో జాక్వెస్ కల్లిస్ అని అతడు తెలిపాడు."అత్యుత్తమ బ్యాటర్ అంటే టెండూల్కర్ అని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. కానీ గ్రేటస్ట్ ఆల్టైమ్ క్రికెటర్ అంటే మాత్రం జాక్వస్ కల్లిస్కే నా ఓటు. ఎందుకంటే ఆల్రౌండర్గా కల్లిస్ ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించాడు. అత్యుత్తమ గణాంకాలు అతడి సొంతం. జాక్ దారిదాపుల్లో ఎవరూ లేరు. అతడొక పరిపూర్ణ ఆల్రౌండర్" అని బ్రెట్లీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా సౌతాఫ్రికాకు చెందిన కల్లిస్ వరల్డ్ క్రికెట్ చరిత్రలో తనంకటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకున్నాడు.టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ 10,000 కంటే ఎక్కువ పరుగులతో పాటు 250 పైగా వికెట్లు పడగొట్టిన ఏకైక ప్లేయర్ కల్లిస్ మాత్రమే. టెస్టుల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(23)లు గెలుచుకున్న రికార్డు కూడా కల్లిస్ పేరిట ఉంది. అంతేకాకుండా అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన జాబితాలో కల్లిస్(45) రెండో స్ధానంలో ఉన్నాడు. అతడు ఓవరాల్గా టెస్ట్, వన్డేల్లో కలిపి 25,000 కంటే ఎక్కువ పరుగులతో పాటు 570కి పైగా వికెట్లు సాధించాడు.చదవండి: వైభవ్ కాదు.. అతడి సెలక్షన్ ఒక అద్భుతం! -
టీమిండియా స్టార్లకు షాక్.. ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఐసీసీ జూలై నెల 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' నామినీస్లో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, వెస్టిండీస్ ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్, బంగ్లాదేశ్ బ్యాటర్ తంజిద్ హసన్ జూలై నెల పురుషుల నామినీస్ జాబితాలో ఉన్నారు.ఈ జాబితాలో భారత ఆటగాళ్లకు చోటు దక్కకపోవడానికి ప్రధాన కారణం ఇంగ్లండ్ పర్యటనలో రాణించకపోవడమే.హ్యారీ బ్రూక్.. భారత్పై దుమ్మురేపాడుఇంగ్లండ్ వైట్బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జూలైలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లలో విశేషంగా రాణించాడు. అతడి నాయకత్వంలో ఇంగ్లండ్ భారత్పై వన్డే, టీ20 సిరీస్లను గెలుచుకుంది. భారత్పై వచ్చిన విజయాలు, వ్యక్తిగతంగా అతడి ప్రదర్శన బ్రూక్ను ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలబెట్టాయి.జస్టిన్ గ్రీవ్స్.. బ్యాట్తో, బంతితో అదరగొట్టాడువెస్టిండీస్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ కూడా జూలై నెలలో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో సెంచరీలు సాధించడంతో పాటు బౌలింగ్లో ఐదు వికెట్ల ఘనత కూడా సాధించాడు. దీంతో ఒకే నెలలో బ్యాట్, బంతితో జట్టుకు కీలకంగా మారాడు. అతడి ఆల్రౌండ్ ప్రదర్శన ఐసీసీ అవార్డు నామినేషన్ దక్కేలా చేసింది.బంగ్లాదేశ్ నుంచి తంజిద్ హసన్బంగ్లాదేశ్ యువ బ్యాటర్ తంజిద్ హసన్ కూడా జూలై నెలలో వైట్బాల్ క్రికెట్లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కీలక ఇన్నింగ్స్లు ఆడిన తంజిద్.. జూలై నెలలో తన స్థాయిని మరోసారి చూపించాడు. దీంతో ఐసీసీ అతడిని కూడా ముగ్గురు నామినీల్లో చేర్చింది.టీమిండియా స్టార్లకు ఎందుకు చోటు దక్కలేదు..?జూలైలో భారత జట్టు ఇంగ్లండ్లో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. కానీ ఈ పర్యటనలో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేదు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ టీ20 సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను 0-4తో కోల్పోయింది.వన్డే సిరీస్లో మాత్రం భారత్ మంచి ఆరంభం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లండ్ను ఓడించింది. కానీ ఆ తర్వాత ఇంగ్లండ్ వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి, 3 మ్యాచ్ల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్లలో భారత్ తరఫున రోహిత్ శర్మ మాత్రమే ఓ వన్డే సెంచరీతో ఆకట్టుకున్నాడు.మహిళల విభాగానికొస్తే.. శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమ, వెస్టిండీస్కు చెందిన హేలీ మాథ్యూస్, ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సీవర్ బ్రంట్ జూలై నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్గా నిలిచారు. -
వైభవ్ కాదు.. అతడి సెలక్షన్ ఒక అద్భుతం!
పంజాబ్ యువ పేసర్ గుర్నూర్ బ్రార్ టీమిండియా తరపున అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లకు బ్యాకప్ బౌలర్ను వెతుకుతున్న సమయంలో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు గుర్నార్. 6 అడుగుల 5 అంగుళాల పొడవున్న ఈ రైట్ ఆర్మ్ పేసర్.. గంటకు 142 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. వన్డేల్లో తనను నిరూపించుకున్న గుర్నార్.. ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో గుర్నూర్ అరంగేట్రం చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుర్నూర్ బ్రార్పై టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గుర్నూర్కు మంచి బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని, సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని జహీర్ కొనియాడాడు."అధిక వేగంతో బౌలింగ్ చేయగల యువ ఫాస్ట్ బౌలర్లు భారత జట్టులోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గుర్నార్ బ్రార్ వంటి యంగ్ పేసర్ను త్వరితగతిన జట్టులోకి తీసుకోవడం చాలా మంచి నిర్ణయం. అతడికి అద్భుతమైన టాలెంట్ ఉంది. బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగలడు. కేవలం ఒక్క వేగమే కాదు సరైన లైన్ అండ్ లెంగ్త్తో కూడా బౌలింగ్ చేయగలడు.అతడు సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని నేను నమ్ముతున్నానని ఓ ఇంటర్వ్యూలో జహీర్ పేర్కొన్నాడు. కాగా 26 ఏళ్ల గుర్నార్ బ్రార్ గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో పంజాబ్ తరపున గుర్నార్ అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 7 మ్యాచ్లలోనే 26 వికెట్లు పడగొట్టి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఆ తర్వాత పంజాబ్ టీ20 లీగ్లో కూడా టాప్ వికెట్ టేకర్గా(22) అతడు నిలిచాడు. ఐపీఎల్లో మాత్రం అతడు ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అయినప్పటికి అతడి టాలెంట్ను పరిగణలోకి తీసుకుని జాతీయ జట్టులో సెలక్టర్లు చోటిచ్చారు. అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో అరంగేట్రం చేసిన గుర్నూర్ తన సూపర్ బౌలింగ్తో అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 వన్డేల్లో అతడు 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇప్పుడు టెస్ట్ జట్టులో కూడా అతడు చోటు కొట్టేశాడు.!చదవండి: Bhuvaneshwar Kumar: నేను ఎందుకు కాదంటాను? అంతా వాళ్ల చేతిలోనే ఉంది -
చరిత్ర సృష్టించిన మిచెల్ మార్ష్
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ మిచెల్ మార్ష్ పొట్టి క్రికెట్లో అరుదైన రికార్డు సాధించాడు. ఒకే ఏడాదిలో 1500 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి ఆసీస్ బ్యాటర్గా చరిత్రకెక్కాడు. హండ్రెడ్ 2026లో సన్రైజర్స్ లీడ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. తాజాగా వెల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో (34 బంతుల్లో 50) ఈ ఘనత సాధించాడు.మిచ్ మార్ష్కు ముందు ఈ రికార్డు టిమ్ డేవిడ్ పేరిట ఉండేది. 2022లో అతడు 1461 పరుగులు చేశాడు. 2024లో ట్రావిస్ హెడ్ 1442 పరుగులతో టిమ్కు దగ్గరగా వచ్చాడు.ఈ ఏడాది ఇప్పటివరకు 35 మ్యాచ్లు ఆడిన మార్ష్.. 44.17 సగటున, 160కి దగ్గరగా స్ట్రైక్రేట్తో, రెండు సెంచరీలు, 11 అర్ధ సెంచరీల సాయంతో 1502 పరుగులు చేసి టిమ్ డేవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు.మార్ష్ అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా తరఫున, బిగ్ బాష్ లీగ్లో పెర్త్ స్కార్చర్స్, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, ది హండ్రెడ్లో సన్రైజర్స్ లీడ్స్ తరఫున ఆడుతూ ఈ పరుగులు సాధించాడు.కోహ్లి, ఏబీడీ సరసన చోటుఈ ఏడాది టీ20ల్లో 1500 పరుగులు సాధించడంతో మార్ష్ విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ సరసన చేరాడు. విరాట్ 2016లో 1614 పరుగులు చేయగా.. ఏబీడీ 2019లో 1580 పరుగులు చేశాడు. ఓవరాల్గా ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగుల ప్రపంచ రికార్డు మాత్రం వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ పేరిట ఉంది. 2024లో పూరన్ ఏకంగా 2331 పరుగులు చేశాడు.హండ్రెడ్లోనూ చరిత్రకు చేరువలో..!హండ్రెడ్లోనూ మార్ష్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్ల్లో 374 పరుగులు చేసిన అతడు.. ఓ హండ్రెడ్ సీజన్లో అత్యధిక పరుగుల రికార్డుకు 51 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ రికార్డు ప్రస్తుతం జేమ్స్ విన్స్ పేరిట ఉంది. విన్స్ 2024లో సదర్న్ బ్రేవ్ తరఫున 424 పరుగులు చేశాడు.గత కొన్నేళ్లలో మార్ష్ తన బ్యాటింగ్ తీరును చాలా మార్చుకున్నాడు. ఒకప్పుడు ప్రధానంగా ఆల్రౌండర్గా కనిపించిన అతడు ఇప్పుడు టాపార్డర్లో విధ్వంసక బ్యాటర్గా మారాడు. మొత్తం టీ20 కెరీర్లో మార్ష్ ఇప్పటివరకు 7033 పరుగులు చేశాడు. అతడి సగటు 34.64 కాగా.. స్ట్రైక్రేట్ 141.48. -
జట్టుకు దూరమైన సర్ఫరాజ్ ఖాన్
ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మేజర్ టోర్నమెంట్కు దూరమయ్యాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ 2026 సీజన్కు అతడు అందుబాటులో ఉండటం లేదు. టీమిండియా నుంచి అకస్మాత్తుగా పిలుపు రావడంతో.. సర్ఫరాజ్ ఖాన్ వెస్ట్ జోన్ జట్టును వీడాడు.కాగా దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్కు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్క్లాస్క్రికెట్లో ఇప్పటికే ఐదు వేలకు పైగా పరుగులు సాధించిన ఈ ముంబైకర్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగపెట్టాడు.2024లో చివరిగా టీమిండియా తరఫునఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు టెస్టు మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 371 పరుగులు సాధించాడు. అయితే, అదే ఏడాది చివరగా న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్కు తర్వాత అవకాశాలు కనుమరుగయ్యాయి. దీంతో ఫిట్నెస్పై దృష్టి సారించిన సర్పరాజ్ ఖాన్.. భారీగా బరువు తగ్గి స్లిమ్గా తయారయ్యాడు.సాయి సుదర్శన్ స్థానంలోదేశీ క్రికెట్లోనూ మరోసారి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్ల నుంచి సర్ఫరాజ్కు పిలుపు రాలేదు. అయితే, శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఎంపికైన సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకోకపోవడం అతడి పాలిట వరంగా మారింది. దీంతో తాజాగా సాయి స్థానాన్ని సర్ఫరాజ్తో భర్తీ చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియాతో చేరేందుకు సర్ఫరాజ్ ఖాన్ శ్రీలంకకు పయనమయ్యాడు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ జట్టుకు అతడు దూరం కాగా.. సెలక్టర్లు జై గోహిల్కు పిలుపునిచ్చారు. ఈ విషయం గురించి వెస్ట్ జోన్, ముంబై చీఫ్ సెలక్టర్ రాజేశ్ పవార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. జై గోహిల్కు అవకాశం‘‘సర్ఫరాజ్ స్థానంలో గోహిల్ను ఎంపిక చేశాము. నిజానికి అతడు స్టాండ్ బై ప్లేయర్గా ఉండేవాడు. ఇప్పుడు ప్రధాన జట్టులోకి తీసుకున్నాము. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు’’ అని రాజేశ్ పవార్ పేర్కన్నాడు.కాగా వెస్ట్ జోన్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాగా.. షామ్స్ ములానీ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇక ఆగష్టు 23 నుంచి సెప్టెంబరు 10 వరకు దులిప్ ట్రోఫీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు.. టీమిండియా- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.దులిప్ ట్రోఫీ 2026 సీజన్కు వెస్ట్ జోన్ జట్టు (అప్డేటెడ్)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షామ్స్ ములాని (వైస్ కెప్టెన్), హర్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), జైమీద్ పటేల్, పృథ్వీ షా, శివాలిక్ శర్మ, సిద్దార్థ్ దేశాయ్, జై గోహిల్, ముషీర్ ఖాన్, అతీత్ షేత్, ముకుశ్ చౌదరి, తనుశ్ కొటియాన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే.చదవండి: నా కాబోయే భర్త అలా ఉండాలి: సారా టెండుల్కర్ -
నేను ఎందుకు కాదంటాను? అంతా వాళ్ల చేతిలోనే ఉంది: భువీ
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ రీఎంట్రీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్-2027 కోసం సెలక్టర్ల నుంచి పిలుపు వస్తే, తిరిగి జాతీయ జట్టు తరపున ఆడేందుకు సిద్దంగా ఉన్నానని భువీ తెలిపాడు. కాగా 36 ఏళ్ల భువనేశ్వర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు టైటిల్స్ను సొంతం చేసుకోవడంలో ఈ యూపీ పేసర్ది కీలక పాత్ర. ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్లు ఆడి 28 వికెట్లతో భువీ సత్తాచాటాడు. దీంతో అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. రవిచంద్రన్ అశ్విన్, రవి శాస్త్రి, దినేష్ కార్తీక్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం భువీని ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించారు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కుమార్ కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు తను రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు."జాతీయ జట్టు సెలెక్టర్ల నుంచి పిలుపు వస్తే నేను ఎందుకు కాదంటాను? భారత్ తరపున ఆడేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దమే. కానీ నా చేతుల్లో లేని విషయం గురుంచి ఎక్కువ నేను ఆలోచించను. నన్ను తీసుకోవాలా లేదా అన్నది సెలక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉటుంది. అయితే నా శరీరం అలిసిపోయేంతవరకు క్రికెట్ ఆడుతూనే ఉంటాను. అందుకే యూపీ టీ20 లీగ్ ఆడేందుకు ఇక్కడికి వచ్చాను. అంతేతప్ప మెరుగ్గా రాణించి ఎవరినో ఆకట్టుకోవాలని అయితే ఇక్కడికి రాలేదు. ఐపీఎల్లో కూడా అంతే. జట్టు కోసం రాణించి మ్యాచ్లు గెలవాలన్నదే నా లక్ష్యం. ఎవరో ఏదో అన్నారని లేదా మరో చోట ఎంపికవ్వాలనే ఆశతో నేను ఆడడం లేదు" అని హిందూస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భువీ పేర్కొన్నాడు. కాగా భువనేశ్వర్ చివరిసారిగా 2022లో భారత్ తరపున ఆడాడు.చదవండి: ఆ పేరంటే ద్వేషం: భారత బాక్సర్ మాటలకు మోదీ రియాక్షన్ వైరల్ -
కలిసి అరంగేట్రం చేశారు.. ఇప్పుడేమో కుస్తీ పడుతున్నారు..!
ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో ఆసక్తికర పోటీ నెలకొంది. ఒకప్పుడు ఒకే మ్యాచ్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్.. ఇప్పుడేమో ఒకే స్థానం కోసం కుస్తీ పడుతున్నారు.2024 ఫిబ్రవరి 15న రాజ్కోట్లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్లో ఇద్దరూ ఒకేసారి భారత టెస్ట్ క్యాప్ అందుకున్నారు. సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి జట్టులోకి రాగా.. రిషభ్ పంత్కు బ్యాకప్ వికెట్ కీపర్గా జురెల్కు అవకాశం దక్కింది.అయితే అరంగేట్రం తర్వాత ఇద్దరి ప్రయాణం పూర్తిగా మారిపోయింది. సుమారు రెండేళ్ల తర్వాత సర్ఫరాజ్ ఆరు టెస్టులకే పరిమితం కాగా.. జురెల్ 10 టెస్టులు ఆడి భారత జట్టు మేనేజ్మెంట్ నమ్మకాన్ని సంపాదించాడు.అయితే తాజాగా సమీకరణలు మారిపోయాయి. లంక టూర్కు తొలుత ఎంపికైన సాయి సుదర్శన్ గాయపడటంతో సర్ఫరాజ్ ఖాన్కు అనూహ్యంగా జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇదివరకే జట్టులో ఉన్న జురెల్ వార్మప్ మ్యాచ్లో విఫలం కావడంతో ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. వార్మప్ మ్యాచ్లో వన్ డౌన్లో బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీతో తుది జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకోగా.. సర్ఫరాజ్ రాకతో జురెల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది.స్పెషలిస్ట్ వికెట్కీపర్గా రిషబ్ పంత్ జట్టులో ఉన్న నేపథ్యంలో మేనేజ్మెంట్ జురెల్కు అవకాశం ఇస్తుందో లేక స్పెషలిస్ట్ బ్యాటర్ అన్న కోణంలో సర్ఫరాజ్కు రీఎంట్రీ అవకాశం ఇస్తుందో చూడాలి. మొత్తానికి కలిసి అరంగేట్రం చేసిన ఇద్దరు ప్లేయర్ల మధ్య ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొంది.శ్రీలంకతో తొలి టెస్ట్కు టీమిండియా (అంచనా)కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్/సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్ -
చరిత్ర సృష్టించనున్న టీమిండియా
భారత క్రికెట్ చరిత్రలో మరో అరుదైన అధ్యాయం ఆవిష్కృతం కానుంది. 2026 ఆగస్టు 15న, దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ టీమిండియా చారిత్రక 600వ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్తో భారత టెస్ట్ క్రికెట్లో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత్ ఈ చారిత్రక టెస్ట్ బరిలో దిగనుంది.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాత భారత్600 టెస్టులు ఆడిన జట్ల జాబితాలో ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ ప్రత్యేక జాబితాలో చేరనుంది. అలాగే 600 టెస్టుల మైలురాయిని తాకిన తొలి ఆసియా దేశంగానూ భారత్ చరిత్ర సృష్టించనుంది.టెస్ట్ క్రికెట్లో భారత ప్రస్థానం 1932లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 94 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత క్రికెట్ ఎన్నో మలుపులు, మరపురాని విజయాలు, దిగ్గజ ఆటగాళ్లను చూసింది.1932లో మొదలైన ప్రయాణంభారత్ తొలి టెస్ట్ మ్యాచ్ను 1932 జూన్ 25న ఇంగ్లండ్తో లార్డ్స్లో ఆడింది. సీకే నాయుడు నాయకత్వంలో ప్రారంభమైన ఆ ప్రయాణం ఇప్పుడు 600వ మ్యాచ్కు చేరుకుంది.భారత్ టెస్ట్ ప్రస్థానంలోని ముఖ్యమైన మైలురాళ్లు ఇవే:1వ టెస్ట్: 1932, ఇంగ్లండ్తో లార్డ్స్లో కెప్టెన్: సీకే నాయుడు100వ టెస్ట్: 1967, ఆస్ట్రేలియాతో కెప్టెన్: మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ200వ టెస్ట్: 1982, పాకిస్థాన్తో కెప్టెన్: సునీల్ గవాస్కర్500వ టెస్ట్: 2016, న్యూజిలాండ్తో కెప్టెన్: విరాట్ కోహ్లీ600వ టెస్ట్: 2026, శ్రీలంకతో కెప్టెన్: శుభ్మన్ గిల్స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రక ఘట్టంఆగస్టు 15.. భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. అదే రోజున టీమిండియా తన 600వ టెస్ట్ మ్యాచ్ ఆడటం ఈ ఘట్టానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తోంది.1932లో సీకే నాయుడు నాయకత్వంలో మొదలైన భారత టెస్ట్ ప్రయాణం.. పటౌడీ, గవాస్కర్, కపిల్ దేవ్, అజారుద్దీన్, సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ తరాలను దాటి ఇప్పుడు గిల్ తరం వరకు వచ్చింది.ఇదిలా ఉంటే, టీమిండియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ ఆగస్ట్ 15న ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్ కొలొంబో వేదికగా ఆగస్ట్ 23న మొదలవుతుంది. -
అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా: సారా టెండుల్కర్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను కోరుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తి తారసపడేంత వరకు పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. తన తల్లిదండ్రుల మధ్య బలమైన స్నేహ బంధం ఉందని.. అదే వారి అన్యోన్య దాంపత్యానికి పునాది అని పేర్కొంది.కాగా సచిన్ టెండుల్కర్ కెరీర్ తొలి నాళ్లలోనే డాక్టర్ అంజలితో ప్రేమలో పడ్డాడు. క్రికెటర్గా నిలదొక్కుకున్న తర్వాత ఇరుకుటుంబాలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వయసులో సచిన్ కంటే అంజలి ఆరేళ్లు పెద్ద. అయితే, ఇదేమీ వారి ప్రేమకు అడ్డంకి కాలేదు.అక్క కంటే ముందే తమ్ముడి పెళ్లిముప్పై ఏళ్లకు పైగా వివాహ బంధంలో కొనసాగుతున్న సచిన్- అంజలి నేటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా తొలుత కుమార్తె సారా.. ఆ తర్వాత అర్జున్ జన్మించారు. సారా న్యూట్రీషనిస్ట్. అదే విధంగా మెడల్, కంటెంట్ క్రియేటర్గా కొనసాగుతూ.. వెల్నెస్ బిజినెస్లోనూ అడుగుపెట్టింది.మరోవైపు.. అర్జున్ క్రికెటర్గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే, అక్క సారా కంటే ముందే అర్జున్ పెళ్లి పీటలెక్కాడు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెప్పిన సానియా చందోక్తో ఈ ఏడాది పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. అయితే, 28 ఏళ్ల సారా ఇప్పటికీ సింగిల్గానే ఉంది.అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటాఈ నేపథ్యంలో తాజాగా వోగ్ ఇండియాతో మాట్లాడిన సారా టెండుల్కర్ తన కాబోయే భర్త ఎలా ఉండాలన్న అంశంపై స్పందించింది. ‘‘నా తల్లిదండ్రులు భార్యాభర్తలు అవడానికంటే ముందు మంచి స్నేహితులు. ఇంట్లో వాళ్లిద్దరి సరదాగా గొడవపడుతూ ఉంటారు. వారిద్దరిని చూస్తే ముచ్చటేస్తుంది.వారి బంధం అత్యద్భుతంగా అనిపిస్తుంది. నాకు కూడా అలా స్నేహంగా ఉండే భాగస్వామి రావాలని కోరుకుంటున్నా. నా ప్రాణ స్నేహితులంతా నా సోల్మేట్స్ అనే చెప్తాను. అయితే, నా పార్ట్నర్ను రొమాంటిక్ సోల్మేట్గా చూస్తాను’’ అని సారా పేర్కొంది.ఇక జెన్ జీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘చాలా మంది త్వరత్వరగా నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లికి సమయం దగ్గరపడినపుడు ఒకవేళ.. సదరు వ్యక్తి తనకు సరైన భాగస్వామి అని అనిపించకపోతే.. నిర్భయంగా ఆ బంధాన్ని రద్దు చేసుకుంటున్నారు.నచ్చకపోతే ఎంగేజ్మెంట్ కూడా రద్దుముందు తరాల వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు భయపడేవారు. కానీ జెన్ జీ నిక్కచ్చిగా తమ నిర్ణయాలను అమలు చేస్తున్నారు. తమకు ఏదైనా విషయం లేదంటే వ్యక్తి నచ్చలేదు.. సదరు వ్యక్తిలో తప్పు ఉందని భావిస్తే వెంటనే ఆ బంధం నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు.జెన్ జీ ఆత్మవిశ్వాసం, సాధికారిత తమలో ఎక్కువని విశ్వసిస్తున్నారు’’ అని సారా పేర్కొంది. తాను కూడా తొందరపడి పెళ్లి బంధంలో అడుగుపెట్టబోనని.. సరైన పార్ట్నర్ దొరికినపుడే వివాహం చేసుకుంటానని కుండబద్దలు కొట్టింది. కాగా టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్తో సారా టెండుల్కర్ ప్రేమలో ఉందనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, తాను ఇలాంటి వదంతులను పట్టించుకోనని సారా కొట్టిపారేసింది.చదవండి: ఆ పేరంటే ద్వేషం: ప్రధాని మోదీతో బాక్సర్ -
‘షమీ అదొక్కటి చెయ్యు.. నీ రీఎంట్రీ తథ్యం’
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తు ఏంటనేది బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముందే చెప్పేశాడు. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం తాము యువ ఆటగాళ్లను ఎక్కువగా ప్రోత్సహించనున్నామని, షమీ లాంటి సీనియర్ ఆటగాళ్లు గతంలో టీమిండియాకు విలువైన సేవలు అందించినప్పటికీ ఇప్పుడు అతడి సేవలు జట్టుకు అవసరం లేదని భావిస్తున్నట్లు అగార్కర్ పరోక్షంగా పేర్కొన్నాడు. దీంతో షమీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే అనే వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందనే వార్తలు వినిపిస్తన్నాయి. అయితే బుమ్రా లాంటి టాప్ బౌలర్ తరచూ గాయాల బారిన పడుతుండడం ఇప్పుడు టీమిండియాను ఆందోళనలోకి నెట్టేస్తుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్.. షమీ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎంపిక కావడం లేదన్న నిరాశను పక్కనబెట్టి జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తూనే ఉండాలని, షమీకి తానిచ్చే సలహా అదొక్కటేనని జహీర్ పేర్కొన్నాడు.‘‘ముందుకు ఎలా వెళ్లాలో నిర్ణయించుకోవాల్సింది షమీనే. మ్యాచ్లు ఆడుతూ బాగా రాణిస్తే జాతీయ జట్టుకు అందుబాటులో ఉన్నట్టే. ప్రస్తుతం జట్టు ఆలోచన మరోలా ఉండొచ్చు. కానీ ఆటగాడిగా మన ఆలోచన, మనం జట్టుకు ఎలా ఉపయోగపడగలమన్నది ముఖ్యం. షమీ ఇప్పుడు చేస్తున్నదే కొనసాగించాలి. మ్యాచ్లు ఆడటం, రాణించడమే చాలా ముఖ్యం’’ అని జహీర్ చెప్పాడు.ఇక జస్ప్రీత్ బుమ్రా వరుస సిరీస్లకు ఫిట్గా ఉండకపోవడం, సుందర్, సాయి సుదర్శన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్లు ఫిట్నెస్ కాపాడుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జహీర్ టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడడంపై స్పందించాడు."గాయాలు ఆటలో సహజం. అవి ప్రతి వ్యక్తి ప్రయాణంలో అంతర్భాగం. ఆటగాళ్ల పని భారం తగ్గించడం అవసరమే అయినా.. పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. ముఖ్యంగా పేసర్ గాయపడినప్పుడు లేదా కష్టమైన దశను ఎదుర్కొంటు న్నప్పుడు మన నియంత్రణలో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలి. గాయానికి అసలు కారణం ఏంటో తెలుసుకునే వరకు ముందుకు సాగడం కష్టం" అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.Read: బాడీ షేమింగ్పై ట్రోల్స్.. కట్చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ! -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న భారత స్పిన్నర్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వన్డే కప్లో భారత లెగ్స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ మరోసారి సత్తా చాటాడు. ఈ టోర్నీలో నార్తంప్టన్షైర్ తరఫున ఆడుతున్న అతడు.. ఆదివారం సోమర్సెట్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.సోమర్సెట్ బ్యాటర్లను చహల్ తన స్పిన్ మాయాజాలంతో కట్టడి చేశాడు. తొలుత ఆర్చీ వాన్ను ఔట్ చేసిన చహల్.. ఆ తర్వాత జాక్ లీచ్, జేక్ బాల్ వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులు మాత్రమే ఇచ్చి 3/35 గణాంకాలు నమోదు చేశాడు. చహల్ ధాటికి సోమర్సెట్ 47 ఓవర్లలో కేవలం 185 పరుగులకే ఆలౌటైంది.అనంతరం లూక్ పాక్టర్ (85), నాథన్ మెక్స్వీని (69 నాటౌట్) రాణించడంతో నార్తంప్టన్షైర్ 30 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.7 మ్యాచ్ల్లో 15 వికెట్లుఈ టోర్నీలో చహల్ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.ప్రస్తుత వన్డే కప్లో చహల్ తీసిన వికెట్లు- తొలి మ్యాచ్లో 2 వికెట్లు- రెండో మ్యాచ్లో 2 వికెట్లు- మూడో మ్యాచ్లో 1 వికెట్- నాలుగగో మ్యాచ్లో 1 వికెట్- ఐదో మ్యాచ్లో 4 వికెట్లు- ఆరో మ్యాచ్లో 2 వికెట్లు- ఏడో మ్యాచ్లో 3 వికెట్లు -
స్పిన్నర్లతో తలనొప్పి.. కుల్దీప్ యాదవ్కు నో ఛాన్స్?!
శ్రీలంకతో టెస్టు సిరీస్కు టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ను భారత జట్టు సద్వినియోగం చేసుకుంది. సమిష్టిగా రాణించి విజయం సాధించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.ఈ నేపథ్యంలో గాలె వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో పాల్గొనే భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఎవరికి చోటు దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా శ్రీలంకలోనూ టర్నింగ్ పిచ్లు ఉంటాయి.అదరగొట్టిన జడ్డూ, మానవ్ఇక వార్మప్ మ్యాచ్లో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ అద్భుతంగా రాణించారు. లంక తొలి ఇన్నింగ్స్లో చెరో రెండు వికెట్లు తీసిన వీరిద్దరు.. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ రాణించారు. తొలి ఇన్నింగ్స్లో జడ్డూ 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా.. మానవ్ 41 పరుగులు సాధించాడు.తేలిపోయిన సారాంశ్ఇక లంక రెండో ఇన్నింగ్స్లో జడ్డూ రెండు వికెట్లు తీయగా.. మానవ్ పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయలేకపోయాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జడ్డూ 22 పరుగులు, మానవ్ 4 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగారు. అయితే, ఈ మ్యాచ్లో మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ వికెట్లు తీయలేకపోయాడు. పెద్దగా పరుగులు కూడా రాబట్టలేకపోయాడు.మరోవైపు.. లంక తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం బౌలింగ్కు రాలేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టు తుదిజట్టులో ఈ నలుగురిలో ఎవరికి అవకాశం వస్తుందన్న అంశంపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులె స్పందించాడు.కుల్దీప్నకు నో ఛాన్స్?!‘‘గాలెకు చేరుకుని పిచ్ను పరిశీలించిన తర్వాతే తుదిజట్టుపై నిర్ణయం జరుగుతుంది. అయితే, మా జట్టులోని నలుగురు స్పిన్నర్లు ఎవరికి వారే ప్రత్యేకం. జడ్డూ అనుభవజ్ఞుడు. మానవ్ సుతార్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు.ఇక సారాంశ్ జైన్ దేశీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టుకు ఎల్లప్పుడూ మణికట్టు స్పిన్నర్ అవసరం ఉంటుంది. మా నలుగురు స్పిన్నర్లు వైవిధ్యమైన బౌలర్లు. అయితే, పరిస్థితులకు తగ్గట్లే గాలెలో నిర్ణయం తీసుకుంటాం’’ అని సాయిరాజ్ బహుతులె తెలిపాడు.అందుకే బౌలింగ్ చేయలేదుఅదే విధంగా.. వార్మప్ మ్యాచ్లో లంక రెండో ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయకపోవడంపై సాయిరాజ్ వివరణ ఇచ్చాడు. ‘‘అతడు మెరుగ్గా ఆడాడు. వికెట్లు తీశాడు. అయితే, తనే విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. మిగిలిన వారికి కూడా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భావించాడు. కుల్దీప్ దాదాపు 20 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. కాబట్టి రెస్ట్ తీసుకున్నాడు’’ అని సాయిరాజ్ తెలిపాడు. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు మొదలుకానుండగా.. ఇందుకు గాలె వేదిక.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.చదవండి: గిల్, అభిషేక్ కాదు.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడే! -
బాడీ షేమింగ్ ట్రోల్స్.. కట్చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ!
శ్రీలంకతో టెస్టు సిరీస్కు గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్కు జట్టులో అవకాశం కల్పించింది. అయితే రెండేళ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ తన ఎంపికపై తొలిసారి స్పందించాడు. తన బాడీషేమింగ్పై వచ్చిన ట్రోల్స్ను చాలెంజ్గా తీసుకున్న సర్ఫరాజ్ ఖాన్ సీరియస్ వర్కౌట్స్ చేసి బరువు తగ్గిన కొత్త ఫొటోలను పంచుకున్నాడు. తొలి ఫోటోలో తనను జట్టులోకి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతగా షేక్ హ్యాండ్ ఇస్తున్న ఎమోజీతో పాటు లవ్ ఇండియా సింబల్ను ట్యాగ్ చేశాడు. ఇక రెండో ఫొటోలో తన తండ్రి నౌషద్ ఖాన్తో కలిసి ఉన్న క్లిప్ను పంచుకున్నాడు. స్వతహాగా క్రికెట్ కోచ్ అయిన నౌషద్ ఖాన్ భారత్ తరఫున తన కుమారుడి అంతర్జాతీయ అరంగేట్రం కోసం చాలానే కష్టపడ్డాడు. 2024లో తన కుమారుడు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంలో నౌషద్ ఖాన్ హర్షం వ్యక్తం చేసిన ఫొటోలు అప్పట్లో వైరలయ్యాయి. తండ్రి పర్యవేక్షణలో..అంతేకాదు ఫామ్లేమి, ఫిట్నెస్ సమస్యలతో జట్టులో చోటు కోల్పోయి ఇబ్బంది పడుతున్న కొడుకుకు అండగా నిలిచి, అతడు బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో గాయపడ్డ సాయి సుదర్శన్ స్థానంలో జట్టుకు ఎంపిక కావడంతో సర్ఫరాజ్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. కాగా తండ్రితో కలిసి దిగిన ఫొటోకు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. 13 గంటల్లోనే 169 లక్షల వ్యూస్ రావడం విశేషం.2024లో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు అనూహ్యంగా చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ ఆ సిరీస్లో 371 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. సూపర్ ఫామ్తో న్యూజీలాండ్తో సిరీస్కు కూడా ఎంపికయ్యాడు. అయితే తొలి మ్యాచ్లో 150 పరుగుల ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఆ తర్వాత వరుసగా 11, 9, 0, 1.. విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు.జురెల్, పడిక్కల్తో పోటీఇదే సమయంలో ధ్రువ్ జురెల్ ఎంట్రీ ఇవ్వడం, ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ రాణించడంతో సర్ఫరాజ్ ఖాన్ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే తాజాగా సాయి సుదర్శన్ గాయంతో లంకతో సిరీస్కు దూరమవ్వడంతో అతడి స్థానంలో సర్ఫరాజ్ జట్టులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్ ఇప్పటికే జట్టులో ఉండడంతో లంకతో తొలి టెస్టుకు సర్ఫరాజ్కు అవకాశం రావడం కష్టమే.2024లో టీమిండియాలో చోటు కోల్పోయిన సర్ఫరాజ్ తొలుత ఫిట్నెస్పై దృష్టి సారించాడు. కఠిన శిక్షణతో బరువు తగ్గిన సర్ఫరాజ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఆ తర్వాత 2025-26 రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ తొమ్మిది ఇన్నింగ్స్ల్లో ఒక డబుల్ సెంచరీ సాయంతో 429 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతోనే సర్ఫరాజ్.. ఆరో స్థానం కోసం ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్తో పోటీ పడుతున్నాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పడిక్కల్ తొలి టెస్టులో ఆడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక లంకతో తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.Sarfaraz Khan in India kit with his Father. Deserved comeback 🤝. pic.twitter.com/asooA1XJxY— CricketGully (@thecricketgully) August 10, 2026SARFARAZ KHAN ON THE WAY TO SRI LANKA 🔥 [Sahil Malhotra] - All the best, Sarfaraz Khan. pic.twitter.com/dBp2cQ2RC7— Johns. (@CricCrazyJohns) August 9, 2026 Sarfaraz Khan’s special words for his son after being picked once again for the Indian Test team.🇮🇳❤️ pic.twitter.com/VogFjGFOZ4— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 10, 2026Read: భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్! -
గిల్, అభిషేక్ కాదు.. అత్యధిక ధరకు అమ్ముడుపోయింది ఇతడే
టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్ షేర్- ఈ- పంజాబ్ టీ20 కప్ 2026 టోర్నీలో భాగం కానున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్కు సంబంధించి ఆదివారం ఆటగాళ్ల వేలం జరిగింది.ప్రత్యేక ఆకర్షణగా అభిషేక్ శర్మఇందులో టీమిండియా టీ20 సూపర్స్టార్ అభిషేక్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అమృత్సర్ సుర్మాస్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఆ ఫ్రాంఛైజీ అధికారులతో కలిసి వేలంలో పాల్గొన్నాడు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆరు ఫ్రాంఛైజీలుకాగా ఈ లీగ్లో ఆరు ఫ్రాంఛైజీలు ఫజిల్క ఫాల్కన్స్, అమృత్సర్ సుర్మాస్, లుథియానా లయన్స్, భటిండా రాయల్స్, జలంధర్ వారియర్స్, మొహాలీ కింగ్స్ టైటిల్ కోసం రంగంలోకి దిగనున్నాయి.అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడేఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ లీగ్ 2026 సీజన్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సన్వీర్ సింగ్ నిలిచాడు. ఫజిల్క ఫాల్కన్స్ రూ. 13.02 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (2023, 2024)కు ఆడాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరు మ్యాచ్లు ఆడిన 29 ఏళ్ల సన్వీర్ 25 పరుగులు చేశాడు. టీమిండియా ప్లేయర్ల ధర ఎంతంటే?టీమిండియా స్టార్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఫజిల్క ఫాల్కన్స్, అభిషేక్ శర్మను అమృత్సర్ సుర్మాస్, అర్ష్దీప్ సింగ్ను లుథియానా లయన్స్, గుర్నూర్ బ్రార్ను భటిండా రాయల్స్ సొంతం చేసుకున్నాయి.ఇక ప్రభ్సిమ్రన్ సింగ్ను జలంధర్ వారియర్స్, రమణ్దీప్ సింగ్ను మొహాలీ కింగ్స్ కొనుక్కున్నాయి. వీరందరిని ఆయా ఫ్రాంఛైజీలు రూ. 10 లక్షల ధరకు రిజర్వు చేసుకున్నాయి.షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ వేలం-2026లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే1. సన్వీర్ సింగ్ (ఫజిల్క ఫాల్కన్స్)- రూ. 13.02 లక్షలు2. నమన్ ధిర్ (అమృత్సర్ సుర్మాస్)- రూ. 10.80 లక్షలు3. రాహుల్ కుమార్ (అమృత్సర్ సుర్మాస్)- రూ. 8.40 లక్షలు4. అన్మోల్ప్రీత్ సింగ్ (మొహాలీ కింగ్స్)- రూ. 8.20 లక్షలు5. సలీల్ అరోరా (లుథియానా లయన్స్)- రూ. 8 లక్షలు6. హర్నూర్ సింగ్ (భటిండా రాయల్స్)- రూ. 7 లక్షలు7. అశ్వనీ కుమార్ (భటిండా రాయల్స్)- రూ. 7 లక్షలు8. అన్మోల్ మల్హోత్రా (జలంధర్ వారియర్స్)- రూ. 6.20 లక్షలు9. సుఖ్దీప్ బజ్వా (జలంధర్ వారియర్స్)- రూ. 6 లక్షలు10. ఆయుశ్ గోయల్ (మొహాలీ కింగ్స్)- రూ. 4.60 లక్షలు. చదవండి: సిరాజ్ సిక్సర్ల జోరు.. భారత్ గెలుపు View this post on Instagram A post shared by Sher-E-Punjab T20 League (@sherepunjabt20) -
భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ ఫిట్నెస్పై జట్టు మేనేజ్మెంట్ కీలక అప్డేట్ ఇచ్చింది. తొలి టెస్టుకు ముందు లంకతో ఆడిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో బరిలోకి దిగిన గిల్ చేతి వేలికి చిన్న గాయమైన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దూరంగా ఉన్న గిల్.. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చి 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బ్యాటింగ్ చేసే సమయంలో గిల్ చేతి వేలి గాయంతో ఏమైనా బాధపడ్డాడా లేక బాగానే ఉన్నాడా అన్నదానిపై భారత బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించాడు. 'నెట్ ప్రాక్టీస్ సందర్భంగా స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ చేతి వేలికి చిన్న గాయమైంది. అయితే అతడికి అయిన గాయం మైనర్దే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే వార్మప్ మ్యాచ్లో తొలి రెండు రోజులు ఆటకు దూరంగానే ఉన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన గిల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపించాడు. దీంతో అతడి చేతివేలి గాయం పూర్తిగా తగ్గిపోయినట్లే. తన బ్యాటింగ్తో తొలి టెస్టుకు దూరమవుతాడన్న సందేహాలను కూడా గిల్ పటాపంచలు చేశాడు. ఇది చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే టీమిండియాకు ఎంపికైన 13 మంది ఆటగాళ్లు ప్రస్తుతం గాయాల బారిన పడి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో పునరావాస కేంద్రంలో గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో మరే ఆటగాడు గాయపడ్డా టీమిండియాకు ఎదురుదెబ్బ అవుతుందని భయపడుతున్నాం. అందుకే గిల్కు చిన్న గాయమే అయినప్పటికీ, పూర్తిగా కోలుకోవాలనే వార్మప్ మ్యాచ్లో తొలి రెండు రోజులు ఆడించలేదు. చేతి వేలి గాయం మానడంతో చివరి రోజు బ్యాటింగ్కు దిగిన గిల్ మంచి ఈజ్తో బ్యాటింగ్ చేసి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలిచ్చాడు.' అని చెప్పుకొచ్చాడు. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన గిల్ 55 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 21వ ఓవర్లో కేషారా నువంతా బౌలింగ్లో గిల్ వెనుదిరిగాడు. ఇక గిల్ గాయం మొదట మేనేజ్మెంట్ను భయపెట్టినప్పటికీ, అతడు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక 2025 నుంచి గిల్ టెస్టుల్లో నాలుగో స్థానంలో వస్తున్నాడు. అంతకముందు 2020 నుంచి 2023 వరకు గిల్ టెస్టుల్లో ఓపెనర్గా ఆడాడు. అయితే జైస్వాల్కు జతగా కేఎల్ రాహుల్ ఓపెనర్గా అదరగొట్టడంతో వీరి జోడినే శ్రీలంక టెస్టు సిరీస్లోనూ కంటిన్యూ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ లెక్కన గిల్ మరోసారి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్కు రానున్నాడు. ఇక టెస్టుల్లో గిల్కు నాలుగో స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 ఇన్నింగ్స్ల్లో 88.75 సగటుతో గిల్ ఆరు సెంచరీలు సాధించడం విశేషం. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది.Read: ఐదేళ్ల వయసులోనే MMA చాంపియన్.. ఎవరీ బుడ్డోడు! -
‘రోబోలు కాదు’.. ఆటగాళ్ల గాయాలపై లక్ష్మణ్ ఆగ్రహం!
టీమిండియాలో చాలా మంది ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆటగాళ్ల రీఫ్రెష్మెంట్కు రీహాబిలిటేషన్ సెంటర్లా ఉపయోగపడాల్సిన సీవోఈ కేంద్రం ఇప్పుడు ఆసుపత్రి వార్డులా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీవోఈలో చికిత్స తీసుకుంటున్న ఆటగాళ్లతో ఒక జట్టునే తయారు చేయొచ్చని సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈవో) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీవోఈ కేంద్రంలోని ఆటగాళ్ల పునరావాసం, ఎంత వేగంగా కోలుకుంటున్నారనే దానిపై సమీక్షించేందుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆదివారం లక్ష్మణ్ను కలిశారు. వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గాయపడిన క్రీడాకారుడు అనుకున్న సమయానికి వేగంగా కోలుకోవడానికి వారేమీ రోబోలు లేదా యంత్రాలు కాదని స్పష్టం చేశారు. ప్రతీ ఆటగాడి శరీరం స్పందించే తీరు వేరువేరుగా ఉంటుందని, తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన ఆధునిక క్రికెట్లో గాయపడిన ప్లేయర్కు అవసరమైనంత కోలుకునే సమయం ఇవ్వడం అత్యంత కీలకమని లక్ష్మణ్ తెలిపాడు. ప్రతి ఒక్కరి నుంచి ఒకే విధమైన రికవరీ సమయాన్ని ఆశించడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు.ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ స్థానంలో కొత్తగా పునర్నిర్మించిన 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీహాబిలిటేషన్ సెంటర్లో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, వికెట్ కీపర్-బ్యాటర్ సాయి సుదర్శన్, నితీశ్ కుమార్రెడ్డి, అశోక్ శర్మ సహా మొత్తంగా 13 మంది ఆటగాళ్లు రీహాబిలిటేషన్లో గడుపుతున్నారు. అయితే వీరంతా వేగంగా కోలుకుంటున్నారని లక్ష్మణ్ వెల్లడించాడు. భారత క్రికెటర్ల ఫిట్నెస్ను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడంలో, వారికి అవసరమైన హై-టెక్ రీహాబిలిటేషన్ సదుపాయాలు అందించడంలో సీవోఈ ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందన్నాడు. టీమ్ మేనేజ్మెంట్, ఫిజియోలు, సీవోఈ వైద్య నిపుణుల మధ్య అత్యుత్తమ సమన్వయం ఉందన్న ఆయన.. ఆటగాళ్ల భవిష్యత్తు, శారీరక దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకుని నిపుణుల పర్యవేక్షణలోనే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు.నితీశ్ రెడ్డి గాయంపై స్పందించిన లక్ష్మణ్.. ఒక ఆల్రౌండర్గా పనిభారాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడం కోసమే అతడిని పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించేవరకు శిక్షణ తీసుకుంటాడని తెలిపాడు. ఇక యో-యో అనేది ఆటగాడి అనెరోబిక్ సామర్థ్యాన్ని పరీక్షించే ఒక పరీక్ష అని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లు ఒక సిరీస్లో భాగంగా ఉన్నప్పుడు యో-యో చేయడాని వీలు ఉండదు, అంతేకాదు దాని నుంచి కోలుకోవడానికి శరీరానికి చాలా కష్టంగా ఉంటుందన్నాడు.అందుకే బ్రాంకో టెస్ట్ ఒక కండిషనింగ్ సెషన్లా పనిచేస్తుందని, ఇది పరోక్షంగా ఆటగాడి ఫిట్నెస్ స్థాయిలను, అనెరోబిక్ ఫిట్నెస్ స్థాయిలను కూడా పరీక్షిస్తుందని తెలిపాడు. దీనిని వివిధ వయసుల వారిలో పరిగణనలోకి తీసుకుంటామని, సీజన్ పొడవునా దీనిని నిర్వహిస్తామని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.చదవండి: నామమాత్రపు మ్యాచ్.. లివింగ్స్టోన్, జూనియర్ ఏబీ విధ్వంసం -
నామమాత్రపు మ్యాచ్.. లివింగ్స్టోన్, జూనియర్ ఏబీ విధ్వంసం
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ నుంచి ఇప్పటికే వైదొలిగిన లండన్ స్పిరిట్, బర్మింగ్హమ్ ఫోనిక్స్ మధ్య నామమాత్రపు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లండన్ స్పిరిట్ బ్యాటర్లు లియామ్ లివింగ్స్టోన్, డెవాల్డ్ బ్రెవిస్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బర్మింగ్హమ్ ఫోనిక్స్పై 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ ఫోనిక్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ జో క్లార్క్ (42 బంతుల్లో 73) రాణించగా, ఆఖర్లో సీన్ డిక్సన్ (28 బంతుల్లో 51 నాటౌట్), డొనోవన్ ఫెరీరా (5 బంతుల్లో 14 నాటౌట్) విధ్వంసం చేయడంతో బర్మింగ్హమ్ భారీ స్కోరు సాధించింది. లండన్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, జేమ్స్ కోల్స్, మాసన్ క్రేన్, హెన్రీ క్రొకొంబెలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లండన్ స్పిరిట్ 82 బంతుల్లోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 166 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ లియామ్ లివింగ్స్టోన్ (30 బంతుల్లో 66), డెవాల్డ్ బ్రెవిస్ (31 బంతుల్లో 55 నాటౌట్) విధ్వంసంతో లండన్ స్పిరిట్ ఈజీ విక్టరీ అందుకుంది. బర్మింగ్హమ్ బౌలర్లలో జోర్డాన్ థాంప్సన్, సకిబ్ మహ్మూద్, టామ్ హెల్మ్లు తలా ఒక వికెట్ తీశారు. టోర్నీలో చివరి రెండు స్థానాల్లో ఉన్న లండన్ స్పిరిట్, బర్మింగ్ హమ్ ఫోనిక్స్ ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ కాగా, ట్రెంట్ రాకెట్స్ ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలతో టాప్లో నిలిచి క్వాలిఫయర్కు అర్హత సాధించింది. -
సిరాజ్ సిక్సర్ల జోరు
కొలంబో: శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత బ్యాటర్లకు చక్కటి ప్రాక్టీస్ లభించింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 15 నుంచి రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుండగా... దానికి ముందు నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఎలెవన్తో జరిగిన ఈ మూడు రోజుల పోరులో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్క్లాస్ హోదా లేని ఈ మ్యాచ్లో చివరి రోజైన ఆదివారం ఇరు జట్లు చెరో 45 ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేశాయి. మొదట శ్రీలంక 45 ఓవర్లలో 200/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ ఫెర్నాండో (73 బంతుల్లో 63; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా ... భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, గుర్నూర్ బ్రార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రధాన పేసర్లు మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులతో కలుపుకొని భారత జట్టు ముందు 207 పరుగుల లక్ష్యం నిలవగా... టీమిండియా 45 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి గెలిచింది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (46 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకంతో మెరిశాడు. ఇక గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగని భారత రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (44; 7 ఫోర్లు) చక్కటి షాట్లు ఆడాడు. రిషబ్ పంత్ (28; 1 ఫోర్, 3 సిక్స్లు), ధ్రువ్ జురేల్ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఆఖర్లో సిరాజ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు) భారీ సిక్స్లతో విరుచుకుపడి జట్టును గెలిపించడం విశేషం. సిరాజ్ సిక్స్ల ‘హ్యాట్రిక్’ కేవలం ప్రాక్టీస్ కోసమే జరిగిన మ్యాచ్ కావడంతో... జట్టు విజయం కోసం పెద్దగా ప్రయత్నించలేదు. 44 ఓవర్లు ముగిసేసరికి భారత్ 191/4తో నిలిచింది. భారత్ విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం. అప్పటికే ఒక సిక్స్ కొట్టి క్రీజులో ఉన్న సిరాజ్... కేషారా నువాంతా వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతులకు సిక్స్లు కొట్టడంతో భారత్ విజయం ఖరారైంది. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో లంక జట్టు మిగిలిన రెండు బంతులు కూడా వేసి నిర్ణీత 45 ఓవర్లు పూర్తి చేసింది. సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్గాయం కారణంగా శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. 28 ఏళ్ల సర్ఫరాజ్ టీమిండియా తరఫున 6 టెస్టులు ఆడి 371 పరుగులు చేశాడు. -
సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్.. బీసీసీఐ అధికారిక ప్రకటన
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాలో కీలక మార్పు జరిగింది. గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. సాయి కుడి కాలివేలికి గాయం కావడంతో శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు.బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స తీసుకుంటున్న సాయి.. జట్టుతో చేరేందుకు అవసరమైన ఫిట్నెస్ క్లియరెన్స్ పొందలేకపోయాడు. సాయి గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడని, బీసీసీఐ మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని బోర్డు వెల్లడించింది.శ్రీలంకకు వెళ్లనున్న సర్ఫరాజ్సర్ఫరాజ్ ఖాన్ కొలంబోలో భారత జట్టుతో కలవనున్నాడు. అక్కడి నుంచి టీమిండియా గాలేకు వెళ్లనుంది. శ్రీలంకతో తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.సాయి స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్కు తుది జట్టులో చోటు దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వార్మప్ మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ సెంచరీ చేయడంతో నంబర్ 3 స్థానం అతడికి దాదాపుగా ఖరారైపోయింది.శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు అప్డేటెడ్ టీమిండియా ఇదే..శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారంశ్ జైన్, ఆకిబ్ నబీ, సర్ఫరాజ్ ఖాన్ఊహించని అవకాశందేశవాళీ క్రికెట్లో భారీగా పరుగులు సాధించిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ 2024లో ఇంగ్లండ్తో రాజ్కోట్ టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి సిరీస్లోనే అతడు ఆకట్టుకున్నాడు. మూడు అర్ధ సెంచరీల సాయంతో 200 పరుగులు చేశాడు.అదే ఏడాది బెంగళూరులో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు. అయితే ఆ తర్వాతి మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారత టెస్టు జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది.2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతడికి ఒక్క మ్యాచ్లోనూ అవకాశం రాలేదు. ఆ తర్వాత సర్ఫరాజ్ భారత టెస్టు జట్టు నుంచి దాదాపుగా కనుమరుగయ్యాడు.ఇప్పటివరకు సర్ఫరాజ్ ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి టెస్టు బ్యాటింగ్ సగటు 37.1గా ఉంది. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే..!
భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి కొలొంబోలో జరుగనుంది.దీనికి ముందు శ్రీలంక ఎలెవెన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మాంచి జోరు ప్రదర్శించింది. ఈ మ్యాచ్తో భారత్కు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. సాయి సుదర్శన్ గైర్హాజరీలో దేవదత్ పడిక్కల్ రూపంలో వన్ డౌన్లో మంచి ఆప్షన్ లభించింది. రెగ్యులర్ బ్యాటర్లు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్. కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా బ్యాట్తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో పేసర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా, స్పిన్నర్లు పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకొని తొలి టెస్ట్లో టీమిండియా ఎలా ఉండబోతుందో ఓ అంచనా వేద్దాం.ఓపెనర్లు: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్తొలి టెస్ట్లో వీరిద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. ఇద్దరూ వార్మప్ మ్యాచ్లో పరుగులు సాధించడం సానుకూల అంశం. జైస్వాల్ దూకుడుగా ఆడితే.. రాహుల్ పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్ను నిర్మించగలడు. శ్రీలంక బౌలర్లను ఎదుర్కోవడంలో ఈ జోడీ కీలకంగా మారనుంది.నంబర్ 3లో దేవదత్ పడిక్కల్సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో నంబర్ 3 స్థానంలో దేవదత్ పడిక్కల్కు అవకాశం దక్కడం ఖాయమైపోయింది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పడిక్కల్ అద్భుతమైన సెంచరీ సాధించి తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు.నాలుగో స్థానంలో గిల్నంబర్ 4లో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గాయం కారణంగా బ్యాటింగ్కు రాని గిల్.. రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగి మంచి టచ్లో కనిపించాడు.నంబర్ 5లో రిషభ్ పంత్కు చోటు దక్కే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అతడు విఫలమైనప్పటికీ.. టెస్టుల్లో భారత్కు ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్-బ్యాటర్లలో పంత్ ఒకడు. అందువల్ల అతడికి తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమే.నంబర్ 6లో ధ్రువ్ జురెల్కు అవకాశం లభించవచ్చు. వార్మప్ మ్యాచ్లో అతడూ పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ టెస్టుల్లో బ్యాటింగ్ లైనప్ను మరింత లోతుగా ఉంచాలన్న భారత వ్యూహంలో భాగంగా జురెల్ను ఆడించే అవకాశం ఉంది.ఆల్రౌండర్లుగా జడేజా, సుతార్ఆల్రౌండర్ స్థానాల్లో రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జడేజా టెస్టు క్రికెట్లో భారత్కు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. బ్యాటింగ్లో 38కు పైగా సగటుతో అతడు మిడిలార్డర్కు అదనపు బలం అందించగలడు.మరోవైపు సుతార్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో సుమారు 26 సగటు కలిగి ఉన్నాడు. నంబర్ 8 వరకు బ్యాటింగ్ను తీసుకెళ్లడంతో పాటు స్పిన్ బౌలింగ్లోనూ అతడు ఉపయోగపడనున్నాడు.స్పిన్ బాధ్యతలు కుల్దీప్వేగాలే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ ముగ్గురు ప్రధాన స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా, సుతార్తో పాటు కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్గా వ్యవహరించనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. గాలేలో టర్నింగ్ పిచ్ లభిస్తే శ్రీలంక బ్యాటర్లకు అతడు పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. శ్రీలంకలో ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన కుల్దీప్.. ఆ మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.పేసర్లుగా సిరాజ్, గర్నూర్ బ్రార్తొలి టెస్ట్లో భారత్ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తే.. సిరాజ్తో పాటు గర్నూర్ బ్రార్కు అవకాశం లభించవచ్చు. బ్రార్ వార్మప్ మ్యాచ్లో ఆకట్టుకున్నాడు.శ్రీలంకతో తొలి టెస్ట్కు టీమిండియా (అంచనా)కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్ -
సిరాజ్ హ్యాట్రిక్ సిక్సర్స్.. టీమిండియా గెలుపు
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో డకౌటైన యశస్వి జైస్వాల్ (61 రిటైర్ట్ హర్ట్) మెరుపు అర్ద సెంచరీ చేసి భారత గెలుపుకు గట్టి పునాది వేశాడు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగని కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ (44) ఆడాడు. ఆఖర్లో సిరాజ్ (32 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) హ్యాట్రిక్ సిక్సర్స్తో విరుచుకుపడి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. టార్గెట్ 207లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.పడిక్కల్ అజేయ శతకంభారత్ తొలి ఇన్నింగ్స్ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి మొదలుకానుంది. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్ట్ 23న ప్రారంభం కానుంది. -
టీమిండియాకు గ్రేట్ న్యూస్.. టచ్లోకి వచ్చిన జైస్వాల్, గిల్
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ భారత బ్యాటింగ్ విభాగానికి బాగా ఉపయోగపడింది. ప్రతి బ్యాటర్ ఏదో ఒక ఇన్నింగ్స్లో మంచి ప్రాక్టీస్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్), రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్), కేఎల్ రాహుల్ (40).. రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (61 రిటైర్డ్ హర్ట్), శుభ్మన్ గిల్ (44) పరుగులు రాబట్టారు. ఆగస్ట్ 15 నుంచి శ్రీలంకతో జరుగబోయే తొలి టెస్ట్కు ముందు ఇది శుభపరిణామం. ఇదే జోరును బ్యాటర్లు తొలి టెస్ట్లోనూ కొనసాగిస్తే టీమిండియా గెలుపు తథ్యం.టచ్లోకి వచ్చిన జైస్వాల్, గిల్తొలి ఇన్నింగ్స్లో డకౌటై నిరాశపర్చిన యశస్వి జైస్వాల్, రెండో ఇన్నింగ్స్లో పుంజుకొని మెరుపు అర్ద సెంచరీతో చెలరేగాడు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దూరంగా ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్లో గాయాన్ని అధిగమించడంతో పాటు ఫామ్ను కూడా చాటుకున్నాడు. జైస్వాల్, గిల్ టచ్లోకి రావడం టీమిండియాకు శుభసూచకం. వీరికి పడిక్కల్, రాహుల్ కూడా తోడైతే తొలి టెస్ట్లో టీమిండియా గెలుపును లంక బౌలర్లు అడ్డుకోలేరు.విజయం దిశగా భారత్207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ గెలుపు దిశగా సాగుతోంది. ఆట చివరి రోజు కావడం, అందులోనూ సమయం కూడా కొద్దిగానే ఉండటంతో భారత బ్యాటర్లు వేగంగా ఆడుతున్నారు. ముఖ్యంగా జైస్వాల్ పరిమిత ఓవర్ల తరహాలో బ్యాటింగ్ చేసి భారత గెలుపుకు పునాది వేశాడు. 30 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 152-2గా ఉంది. పంత్ (28), జడేజా (0) క్రీజ్లో ఉన్నారు. మరో 55 పరుగులు చేస్తే ఈ మ్యాచ్లో టీమిండియా గెలుస్తుంది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన పంత్ ఈ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే భారత్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జురెల్ (17) ఒక్కడే కాస్త నిరుత్సాహపరిచాడు.టార్గెట్ 207లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.పడిక్కల్ అజేయ శతకంభారత్ తొలి ఇన్నింగ్స్ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
టీమిండియాతో మరిన్ని సిరీస్లు.. ఈసీబీ కీలక ప్రకటన
భారత క్రికెట్కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) భావిస్తోంది. టీమిండియాతో మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించేందుకు ఈసీబీ ఆసక్తి చూపుతోంది. ముఖ్యంగా వన్డేల్లో మూడు దేశాల ట్రై-సిరీస్లను తిరిగి తీసుకురావాలని యోచిస్తోంది. అలాగే భారత్తో ఐదు టెస్టుల సిరీస్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఈసీబీ సీఈఓ రిచర్డ్ గౌల్డ్ వెల్లడించారు.12-18 నెలల్లో ట్రై-సిరీస్లు..?వన్డే క్రికెట్లో మూడు దేశాల ట్రై-సిరీస్లను తిరిగి ప్రవేశపెట్టే దిశగా చర్చలు జరుగుతున్నాయని రిచర్డ్ గౌల్డ్ తెలిపారు. వచ్చే 12 నుంచి 18 నెలల్లో కొన్ని ట్రై-సిరీస్లు నిర్వహించే అంశంపై ఇప్పటికే ప్రణాళికలు రూపొందుతున్నాయని ఆయన వెల్లడించారు.భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా అంతర్జాతీయ క్రికెట్లో ట్రై-సిరీస్లను తిరిగి తీసుకురావాలని గతంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఈసీబీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ట్రై-సిరీస్లు సాధారణంగా ఉండేవి. అయితే గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్లు, ఐసీసీ టోర్నీలకే ఎక్కువ ప్రాధాన్యం లభించడంతో మూడు దేశాల సిరీస్లు దాదాపుగా కనుమరుగయ్యాయి.భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య చివరి ప్రధాన పురుషుల వన్డే ట్రై-సిరీస్ 2015లో జరిగింది. ఆ టోర్నీలో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.భారత్తో ఐదు టెస్టుల సిరీస్కు ప్రాధాన్యంవన్డేలతో పాటు టెస్టు క్రికెట్పైనా ఈసీబీ ప్రత్యేక దృష్టి పెట్టింది. భారత్, ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల సిరీస్లను ఇంగ్లండ్ క్రికెట్లో అత్యున్నత స్థాయి పోటీగా రిచర్డ్ గౌల్డ్ అభివర్ణించారు. భారత్తో ఐదు టెస్టుల సిరీస్లు ఆడేందుకు ఈసీబీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో దక్షిణాఫ్రికాతో కూడా ఇలాంటి సుదీర్ఘ టెస్టు సిరీస్లు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు.ఐదు టెస్టుల సిరీస్ వల్ల ఇరు జట్లకు పుంజుకునే అవకాశం లభించడంతో పాటు, ఆటగాళ్ల సామర్థ్యానికి అసలైన పరీక్ష ఎదురవుతుంది. ఫ్రాంచైజీ టీ20 లీగ్ల ప్రభావం పెరుగుతున్న సమయంలో టెస్టు క్రికెట్కు ఇలాంటి సుదీర్ఘ సిరీస్లు మరింత ప్రాధాన్యం కలిగిస్తాయని ఈసీబీ భావిస్తోంది.మళ్లీ వన్డేల వైపు ఎందుకు..?ప్రస్తుతం టెస్టు, టీ20 క్రికెట్ మధ్య వన్డే ఫార్మాట్ తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పోరాడుతోంది. ద్వైపాక్షిక వన్డే సిరీస్లకు పెద్ద టోర్నీలతో పోలిస్తే అంతగా ఆదరణ లభించడం లేదు.అయితే వన్డేలకు ఇప్పటికీ ప్రత్యేక ఆకర్షణ ఉంది. టీ20లకు దూరమైన పలువురు స్టార్ ఆటగాళ్లు వన్డేల్లో కొనసాగుతున్నారు. అందువల్ల టెస్టు క్రికెట్, ఫ్రాంచైజీ టీ20ల మధ్య వన్డేలు ఒక కీలకమైన వారధిగా మారే అవకాశం ఉంది.భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు పాల్గొనే వన్డే ట్రై-సిరీస్లకు భారీ ప్రేక్షకాదరణ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్వైపాక్షిక సిరీస్లకు భిన్నంగా ట్రై-సిరీస్లో ప్రతి మ్యాచ్కు పాయింట్ల పట్టిక పరంగా ప్రాధాన్యం ఉంటుంది.వన్డేలకు కొత్త ఊపు వస్తుందా..?ట్రై-సిరీస్లు తిరిగి వస్తే వన్డే క్రికెట్కు కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. ప్రతి మ్యాచ్కు ఫలితంతో పాటు పాయింట్ల పట్టిక ప్రభావం ఉండటం వల్ల పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది.అంతేకాకుండా, ఐసీసీ టోర్నీలకు ముందు యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు భారత్, ఇంగ్లండ్ వంటి జట్లకు ఇవి మంచి వేదికగా మారవచ్చు. కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తూనే కొత్త ఆటగాళ్లకు అవకాశాలు కల్పించే అవకాశం కూడా ఉంటుంది.మొత్తంగా చూస్తే, ట్రై-సిరీస్ల పునరాగమనం, భారత్తో ఐదు టెస్టుల సిరీస్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఈసీబీ వైఖరి అంతర్జాతీయ క్రికెట్లో భారత్-ఇంగ్లండ్ సంబంధాలకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. -
కెనడా ఓపెన్లో సంచలనం.. వరల్డ్ నంబర్ 1 సబలెంకాకు షాక్
కెనడా ఓపెన్లో సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్ వన్, నాలుగు సార్లు గ్రాండ్స్లామ్ విజేత ఆర్యనా సబలెంకా అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. నాలుగో రౌండ్లో రష్యాకు చెందిన 16వ సీడ్ ఎకతెరీనా అలెగ్జాండ్రోవా చేతిలో సబలెంకా ఓటమిపాలైంది.దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన హోరాహోరీ పోరులో అలెగ్జాండ్రోవా 7-6(3), 4-6, 6-4తో సబలెంకాపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.ఈ ఓటమి సబలెంకా యూఎస్ ఓపెన్ సన్నాహకాలకు గట్టి దెబ్బగా మారింది. గత ఏడాది యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సబలెంకా.. ఈసారి కూడా తన టైటిల్ రక్షణకు సిద్ధమవుతున్న సమయంలో కెనడా ఓపెన్లోనే అనూహ్యంగా నిష్క్రమించింది.తొలి సెట్లో టైబ్రేక్.. సబలెంకాకు షాక్మ్యాచ్ ఆరంభంలో సబలెంకా బ్రేక్ సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే అలెగ్జాండ్రోవా వెంటనే పుంజుకుని స్కోరును సమం చేసింది. చివరకు తొలి సెట్ టైబ్రేక్కు వెళ్లగా.. రష్యా ప్లేయర్ 7-3తో టైబ్రేక్ను సొంతం చేసుకుంది. దీంతో సబలెంకా మ్యాచ్లో వెనుకబడింది.రెండో సెట్లో పుంజుకున్న నంబర్ వన్రెండో సెట్లో సబలెంకా తన అనుభవాన్ని చూపించింది. 4-3తో ఆధిక్యంలో ఉన్న సమయంలో అలెగ్జాండ్రోవా సర్వీస్ను బ్రేక్ చేసిన సబలెంకా.. ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకుని సెట్ను 6-4తో గెలుచుకుంది. దీంతో మ్యాచ్ నిర్ణాయక మూడో సెట్కు చేరింది.కీలక సమయంలో సబలెంకా తప్పిదాలుమూడో సెట్లో అలెగ్జాండ్రోవా దూకుడైన షాట్లతో సబలెంకాపై ఒత్తిడి పెంచింది. మరోవైపు సబలెంకా తప్పిదాల సంఖ్య పెరగడంతో రష్యా ప్లేయర్కు అవకాశాలు లభించాయి.4-5తో వెనుకబడి మ్యాచ్లో నిలవాలంటే తప్పక సర్వీస్ నిలబెట్టుకోవాల్సిన సమయంలో సబలెంకా రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుంది. అయితే మూడో మ్యాచ్ పాయింట్ వద్ద డబుల్ ఫాల్ట్ చేయడంతో మ్యాచ్ అలెగ్జాండ్రోవా చేతుల్లోకి వెళ్లిపోయింది.క్వార్టర్స్లో స్వితోలినాతో పోరుక్వార్టర్ ఫైనల్లో అలెగ్జాండ్రోవా ఉక్రెయిన్ స్టార్ ఎలినా స్వితోలినాను ఎదుర్కోనుంది. నాలుగో రౌండ్లో స్వితోలినా అమెరికా ఎనిమిదో సీడ్ అమాండా అనిసిమోవాను 6-2, 6-4తో ఓడించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. -
టీమిండియా టార్గెట్ 207
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో భారత్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆట ఇవాళ (మూడో రోజు) చివరి రోజు కావడంతో ఫలితం తేలే అవకాశం లేదు. ఆటలో మరో సెషన్ మాత్రమే మిగిలి ఉంది.లంక ఎలెవెన్ రెండో ఇన్నింగ్స్లో నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి మొదలుకానుంది. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్ట్ 23న ప్రారంభం కానుంది. -
వైభవ్కు నిజంగా 15 ఏళ్లేనా? ఆసీస్ దిగ్గజం బ్రెట్లీ సమాధానమిదే
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయస్సులోనే అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు ఐపీఎల్, జూనియర్ క్రికెట్లో దుమ్ములేపిన వైభవ్.. ఇప్పుడు సీనియర్ జట్టు తరపున కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.తన అరంగేట్ర సిరీస్లో విఫలమైనప్పటికి జింబాబ్వే పర్యటనలో మాత్రం అదరగొట్టాడు. జింబాబ్వే బౌలర్లను ఎదుర్కోవడానికి అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్లు ఇబ్బంది పడినప్పటికి .. సూర్యవంశీ మాత్రం వారిని ఉతికారేశాడు. అంతకుముందు ఐపీఎల్లో కూడా వరల్డ్క్లాస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హేజిల్వుడ్, కమిన్స్ను కూడా వైభవ్ వదల్లేదు.అయితే చిన్న వయసులోనే ఇంతటి పరిణతి సాధించడం వల్ల విదేశీ క్రికెట్ వర్గాలలో వైభవ్ వయస్సుపై ఇంకా సందేహలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ వయస్సుతో సంబంధం లేదని, అతడు ఎంత గొప్పగా క్రికెట్ ఆడుతున్నాడనే దానిపైనే అందరూ దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డాడు. 17 లేదా 18 ఏళ్లు ఉన్నా సరే పర్వాలేదు."వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడికి నిజంగా 15 ఏళ్లేనా? అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. కానీ నాకు అతడి వయసుతో సంబంధం లేదు. అతడు 15 ఏళ్ల కుర్రాడైతే చాలా సంతోషం. ఒకవేళ 17 లేదా 18 ఏళ్లు ఉన్నా సరే నాకు అనవసరం. అతడు అత్యున్నత స్ధాయిలో ఎలా క్రికెట్ ఆడుతున్నాడన్నదే ముఖ్యం. టీమిండియాకు దొరికిన గొప్ప ఆణిముత్యం అతడు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తాడు. అతడు ఇప్పటికే వరల్డ్ బెస్ట్ టీ20 లీగ్ ఐపీఎల్లో సత్తాచాటాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో అతడు ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్ నేను ఎప్పటికి మర్చిపోను. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. వారు ఎంత వేగంతో బౌలింగ్ చేస్తే వైభవ్ అంతే అలవోకగా షాట్లు ఆడాడు. అతడి బ్యాట్ స్పీడ్ నిజంగా అద్భుతం. సరైన టైమింగ్ కూడా అతడి వద్ద ఉంది. అతను ఇప్పటికీ ఒక చిన్నపిల్లవాడే, అతనిపై అనవసర ఒత్తిడి పెట్టకుండా ఆడుకోనివ్వాలి" అని బీర్ బైసెప్స్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్లీ పేర్కొన్నాడు. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. టీమిండియాకు గుడ్ న్యూస్
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. ప్రాక్టీస్ సెషన్లో కుడి చేతి వేలికి గాయం కావడంతో తొలి టెస్టుకు కెప్టెన్ శుబ్మన్ గిల్ అందుబాటులో ఉంటాడా?లేదా? ఆందోళన అందరిలోనూ నెలకొంది.అయితే ఇప్పుడు గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు తిరిగి నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ సెకెండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది.ఈ చేతి వేలి గాయం కారణంగానే తొలి రెండు రోజుల ఆటకు మాత్రం అతడు దూరంగా ఉన్నాడు. మూడో రోజు ఫీల్డింగ్ రానప్పటికి బ్యాటింగ్ మాత్రం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గిల్ గైర్హజరీలో భారత కెప్టెన్గా రాహుల్ వ్యహరిస్తున్నాడు.ఇప్పటికే శ్రీలంకతో సిరీస్కు ఇన్ఫామ్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, సాయిసుదర్శన్లు గాయం కారణంగా దూరమయ్యారు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా తొలి టెస్ట్లో ఆడేది అనుమానమే. ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక జట్టు తమ తొలి ఇన్నింగ్స్ను 363/8 డిక్లేర్ చేసింది.మొదటి ఇన్నింగ్స్లో భారత పేసర్లు ఆకట్టుకోలేకపోయారు. కుల్దీప్ యాదవ్, జడేజా, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 357/6 వద్ద డిక్లేర్ చేసింది. దేవ్దత్ పడిక్కల్ (164 బంతుల్లో18 ఫోర్లతో 142 ) భారీ సెంచరీతో కదం తొక్కాడు. నాలుగో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా 63 పరుగులు సాధించాడు. ఇక మూడో రోజు లంచ్ సమయానికి శ్రీలంక 24 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. -
సునీల్ నరైన్ మ్యాజిక్.. నైట్రైడర్స్ శుభారంభం
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ త్రిన్బాగో నైట్ రైడర్స్ (TKR) శుభారంభం చేసింది. శనివారం సెయింట్ విన్సెంట్ వేదికగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జరిగిన మ్యాచ్లో 19 పరుగుల తేడాతో(డక్ వర్త్ లూయిస్) టీకేఆర్ ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. టీకేఆర్ స్టార్ స్పినర్ సునీల్ నరైన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి పేట్రియాట్స్ పతనాన్ని శాసించాడు. పేట్రియాట్స్ ఓ దశలో 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెవిన్ విక్హామ్ (38) ఒంటరి పోరాటం చేయడంతో పేట్రియాట్స్ ఆ మాత్రం స్కోరైనా సాధించగల్గింది.అనంతరం 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ ఆరంభంలోనే ఓపెనర్లు అలెక్స్ హేల్స్, కోలిన్ మున్రోల వికెట్లును కోల్పోయింది. కానీ మిడిలార్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (35*), జాషువా డా సిల్వా (18*) నిలకడగా ఆడి జట్టును విజయం వైపు నడిపించాడు. అయితే గెలుపు దిశగా సాగుతున్న సమయంలో నైట్రైడర్స్ స్కోర్ 94/2 వద్ద ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఆ సమయానికి డీఎల్ఎస్ పార్ స్కోర్ కంటే 19 పరుగుల ముందుండడంతో టీకేఆర్నే విజయం వరించింది. -
ఇండియన్ క్రికెట్ ట్రైనింగ్ సెంటరా? లేదా ఆస్పత్రి వార్డా?
భారత పురుషల క్రికెట్ జట్టు గతంలో ఎన్నడూ లేనంత విధంగా గాయాల సమస్యను ఎదుర్కొంటుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రస్తుతం ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చే కేంద్రంలా కాకుండా ‘ఆస్పత్రి వార్డు’ను తలపిస్తోంది. జట్టులో చాలా మంది కీలక ఆటగాళ్లు అక్కడే చికిత్స పొందుతున్నారు.మైదానంలో మెరుపులు మెరిపించాల్సిన మన స్టార్ క్రికెటర్లు సీఓఈలో గాయాలతో పోరాడుతున్నారు. ప్రస్తుతం సీఓఈలో ఉన్న ఆటగాళ్లతో ఒక జట్టునే తాయారు చేయొచ్చు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్తో అత్యవసర భేటీకి సిద్ధమయ్యారు.ఈ క్రమంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావసం పొందుతున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. దైనిక్ జాగరణ్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రస్తుతం 13 మంది భారత క్రికెటర్లు సీఓఈలో ఉన్నారు. వారిలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా టాప్ క్రికెటర్లు ఉన్నారు.జస్ప్రీత్ బుమ్రాపేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఎడమ మోకాలి సమస్యతో బాధపడుతున్నాడు. మోకాలి కీలులో చేరిన వాటర్ను తొలగించి జాయింట్ ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందిస్తున్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్ సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని సెలక్టర్లు భావించారు. కానీ రన్నింగ్, డ్రిల్స్ చేసే సమయంలో మోకాలిలో అతడికి ఇంకా నొప్పి ఉంది. పూర్తి స్థాయి బౌలింగ్ వర్క్లోడ్ను తట్టుకునే స్థితిలో అతడు లేడు. దీంతో జస్ప్రీత్ లంక టూర్కు దూరమయ్యాడు.హార్దిక్ పాండ్యా ఇక స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయాలు కొత్తేమి కాదు. ఈ బరోడా క్రికెటర్ జట్టులో కంటే ఎక్కువగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే ఎక్కువగా గడుపుతుంటాడు. ఐపీఎల్ తర్వాత ఇప్పటివరకు అతడు ఇంకా జాతీయ జట్టులోకి తిరిగి రాలేదు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే అతడు తొడ కండరాల గాయం కారణంగా సీఓఈలో చేరాడు. అయితే అతడు వేగంగా కోలుకోవడంతో అఫ్గాన్తో వన్డే సిరీస్కు సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ సిరీస్ ఆరంభానికి ముందు మళ్లీ అతడి గాయం తిరగబెట్టింది. దీంతో అతడు అఫ్గాన్తో పాటు ఇంగ్లండ్తో వన్డేలకు దూరమయ్యాడు. అయితే తాజాగా మళ్లీ అతడు కుడి కాలి పిక్క గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా రన్నింగ్, బౌలింగ్ ఆపేయాలని డాక్టర్లు సూచించారు.వాషింగ్టన్ సుందర్తమిళనాడు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ భారత జట్టులో ప్రస్తుతం కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో అతడి కుడి కాలి తొడ కండరానికి గాయమైంది. దీంతో స్వదేశంలో అఫ్గాన్తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్లకు వాషీ దూరమయ్యాడు.అయితే శ్రీలంకతో టెస్టు సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని ప్రధాన జట్టులో చోటు కల్పించారు. కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. దీంతో శ్రీలంక టూర్కు కూడా సుందర్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.సాయిసుదర్శన్ యువ బ్యాటర్ సాయిసుదర్శన్ కూడా సీఓఈలో ఉన్నాడు. కుడి కాలి బొటనవేలి నొప్పి తగ్గకపోవడంతో అతడిని శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి తప్పించారు.శుబ్మన్ గిల్భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా తాజాగా ఈ జాబితాలోకి చేరాడు. శ్రీలంకతో టెస్టులకు ముందు ప్రాక్టీస్ లో గిల్ కుడిచేతి వేలికి దెబ్బ తగిలింది. దీంతో ముందుస్తు జాగ్రత్త చర్య భాగంగా వార్మాప్ మ్యాచ్లో గిల్ బరిలోకి దిగలేదు. రాహుల్ భారత కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.వీరితో పాటు నితీష్ కుమార్ రెడ్డి (ఎడమ తొడ కండరాల గాయం), హర్షిత్ రాణా (కుడి తొడ కండరాల గాయం), ఆకాశ్ దీప్(వెన్ను గాయం), వరుణ్ చక్రవర్తి(ఎడమ తొడ కండరాల గాయం), రియాన్ పరాగ్ ( భుజం గాయం), సుయాష్ శర్మ(మోకాలి గాయం), యుధ్వీర్ సింగ్(కుడి భుజం గాయం), అశోక్ శర్మ( వెన్ను గాయం)లు కూడా తమ తమ గాయాల నుంచి కోలుకుంటున్నారు. -
సచిన్ మెరుపులు వృథా.. 240 టార్గెట్ హాంఫట్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)-2026 సీజన్లో మదురై పాంథర్స్ తమ జోరును కొనసాగిస్తోంది. శనివారం దిండిగల్ వేదికగా కోవై కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో మదురై పాంథర్స్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కోవై కింగ్స్ బ్యాటర్లలో బాలసుబ్రహ్మణ్యం సచిన్(43 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 84), ఆండ్రే సిద్ధార్థ్(42 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 87) మెరుపు హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. మదురై బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ రెండు, పి. శరవణన్, గణేషన్ తలా రెండు వికెట్లు సాధించారు.సచిన్, సిద్ధార్థ్ మెరుపులు వృథాఅనంతరం కోవై కింగ్స్ నిర్దేశించిన 240 పరుగుల భారీ లక్ష్యాన్ని మధురై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో ఊదిపడేసింది. తద్వారా టీఎన్పీఎల్ చరిత్రలోనే అత్యధిక టార్గెట్ను విజయవంతంగా చేధించిన జట్టుగా మదురై నిలిచింది.ఈ లక్ష్య చేధనలో మదురై కెప్టెన్ ఎన్.ఎస్. చతుర్వేద్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే 15 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 121 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు సిద్ధార్థ్ మహాదేవన్ (41 పరుగులు), అనిరుధ్ సీతా రామ్ (37 నాటౌట్) రాణించారు. కోవై కింగ్స్ బౌలర్లలో జాతవేద సుబ్రమణ్యన్ రెండు వికెట్లు పడగొట్టగా.. లింగేష్ ఓ వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ విజయంతో మదురై పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది. -
మిచెల్ శాంట్నర్ విధ్వంసం.. ముంబై జట్టుకు రాకెట్స్ షాక్
ది హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026లో ట్రెంట్ రాకెట్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. శనివారం కెన్నింగ్టన్ ఓవరల్ వేదికగా ఎంఐ లండన్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ట్రెంట్ రాకెట్స్ ఘన విజయం సాధించింది. ఇది ట్రెంట్స్ రాకెట్స్కు ఆరో విజయం కావడం గమనార్హం.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఎంఐ ఇన్నింగ్స్లో సామ్ కుర్రాన్(72) టాప్ స్కోరర్గా నిలవగా.. విల్ జాక్స్(39) రాణించాడు. మిగితా పూరన్, విన్స్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమయ్యారు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో లూయిస్ గ్రెగొరీ రెండు వికెట్లు పడగొట్టాడు.శాంట్నర్ మెరుపులు వృథాఅనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని రాకెట్స్ జట్టు కేవలం 90 బంతుల్లోనే 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ట్రెంట్ రాకెట్స్ ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్ బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 23 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్లతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు టిమ్ డేవిడ్(32), డొనాల్డ్ (10 బంతుల్లో 23) దూకుడుగా ఆడారు.చదవండి: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే 9 టెస్టుల్లో 7 గెలవాలి! -
పడిక్కల్ బ్యాటింగ్ జోరు
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా జరుగుతున్న వామప్ మ్యాచ్లో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (164 బంతుల్లో 142 నాటౌట్; 18 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా సాయి సుదర్శన్ శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ నుంచి తప్పుకోగా... తుది జట్టులో అతడి స్థానంలో పడిక్కల్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్లో శనివారం రెండో రోజు ఆట ముగిస సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. పడిక్కల్ భారీ శతకంతో కదం తొక్కగా... రవీంద్ర జడేజా (117 బంతుల్లో 63; 7 ఫోర్లు) హాఫ్సెంచరీతో రాణించాడు. గిల్ స్థానంలో ఈ మ్యాచ్లో భారత కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ (40; 5 ఫోర్లు, 1 సిక్స్), మానవ్ సుతార్ (41; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో గుర్నూర్ బ్రార్ (18 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) ఐదు బంతుల వ్యవధిలో నాలుగు సిక్స్లు కొట్టడం విశేషం. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్, అసాంక మనోజ్ చెరో రెండు వికెట్లు తీశారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... ఇరు జట్లు చెరో 45 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయనున్నాయి. జైస్వాల్, పంత్ విఫలం... ఓవర్నైట్ స్కోరు 363/8 వద్దే శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) రెండో బంతికే అవుటయ్యాడు. ఈ దశలో రాహుల్తో కలిసి పడిక్కల్ ఇన్నింగ్స్ను నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 96 పరుగులు జోడించారు. అనంతరం రాహుల్ అవుట్ కాగా... నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చక్కటి డిఫెన్స్తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లు ఎంత ప్రయత్నించినా పడిక్కల్, జడ్డూ జోడీని విడదీయలేకపోయారు. హాఫ్ సెంచరీ అనంతరం జడేజా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా... రిషభ్ పంత్ (2) విఫలమయ్యాడు. ధ్రువ్ జురేల్ (1) కూడా త్వరగానే అవుట్ కాగా... మానవ్ సుతార్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పడిక్కల్ పకడ్బందీ డిఫెన్స్, పక్కా టైమింగ్తో షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు.సుదర్శన్ అవుట్ఈ నెల 15 నుంచి శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు టీమిండియా బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యాడు. జట్టు ఎంపిక సమయంలోనే బుమ్రా, సుదర్శన్ ఫిట్నెస్ సాధిస్తేనే సిరీస్లో ఆడించనున్నట్లు సెలక్టర్లు ప్రకటించగా... ఇప్పుడు ఆ ఇద్దరూ జట్టుకు దూరమయ్యారు. గత నెల భారత ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక ‘ఎ’ జట్టుతో ఆడుతున్న సమయంలో సుదర్శన్ కాలి వేలికి గాయమైంది. అప్పటి నుంచి సుదర్శన్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ)లో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. ‘సుదర్శన్ లంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతడు పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని వైద్య బృందం తెలిపింది’ అని బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఆంధ్ర ఆటగాడు రషీద్ ఖాన్, మహారాష్ట్ర ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్లో ఒకరిని భారత జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. -
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే 9 టెస్టుల్లో 7 గెలవాలి!
తొలి రెండు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లలో రన్నరప్గా నిలిచిన భారత జట్టు గత ఏడాది ఫైనల్కు చేరడంలో విఫలమైంది. ఇప్పుడు 2027 ఫైనల్ లక్ష్యంగా కొత్త సీజన్కు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా అవకాశాలు కాస్త సంక్లిష్టంగానే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆడిన 9 టెస్టుల్లో 4 గెలిచి 4 ఓడి మరొకటి ‘డ్రా’గా ముగించిన జట్టు 48.15 పాయింట్ల శాతం (మొత్తం పాయింట్లు 52)తో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. మరో 9 టెస్టులు మిగిలి ఉండగా 2 శ్రీలంకలో, 2 న్యూజిలాండ్లో ఆడనున్న టీమ్ ఆ్రస్టేలియాతో సొంతగడ్డపై 5 టెస్టులు ఆడాల్సి ఉంది. ఫైనల్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కనీసం 60 పాయింట్ల శాతాన్ని అందుకోవాలి. అంటే కనీసం మరో 78 పాయింట్లు కావాలి. దీని ప్రకారం భారత్ కనీసం 6 గెలిచి 2 డ్రా చేసుకోవాలి. లేదా 7 టెస్టులు గెలవాలి. లంకతో సవాల్ తర్వాత కివీస్ గడ్డపై కూడా జట్టుకు అంత సులువు కాదు. గత 18 ఏళ్లలో ఆసీస్తో భారత్లో 12–2తో మనదే పైచేయిగా ఉన్నా... ఇటీవల జట్టు ఫామ్...న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతుల్లో పరాజయాలను బట్టి చూస్తే కంగారూలపై కూడా టీమిండియా బాగా శ్రమించాల్సి ఉంటుంది. -
కీలక టోర్నీ నుంచి టీమిండియా స్టార్ ఔట్
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలకమైన హండ్రెడ్ లీగ్ నుంచి మధ్యలోనే వైదొలిగింది. హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఆమె భారత్కు తిరిగి రానుంది. త్వరలో జరుగబోయే ఆసియా కప్కు కూడా ఆమె అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.హండ్రెడ్ లీగ్లో జెమీ సదర్న్ బ్రేవ్కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె కోసం ఫ్రాంచైజీ ఏకంగా 60,000 పౌండ్లు చెల్లించింది. అయితే గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు ఆమె దూరం కానుంది.చార్లీ నాట్కు అవకాశంజెమీమా స్థానంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ చార్లీ నాట్ను సదర్న్ బ్రేవ్ ఎంపిక చేసింది. ఈ సీజన్లో జెమీమా 6 మ్యాచ్ల్లో 143 పరుగులు చేసింది. ఆమె సగటు 35.75గా ఉంది. ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయకపోయినా వరుసగా మూడు మ్యాచ్ల్లో 25కు పైగా పరుగులు సాధించింది.మరోవైపు చార్లీ నాట్ ఇటీవల ముగిసిన టీ20 బ్లాస్ట్లో అద్భుతంగా రాణించింది. 13 ఇన్నింగ్స్ల్లో 40.40 సగటున, 404 పరుగులు చేసి ఆకట్టుకుంది.సదర్న్ బ్రేవ్కు ఈ సీజన్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆరు మ్యాచ్ల్లో 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.ఆసియా కప్ కూడా దూరమయ్యే ప్రమాదంగాయం కారణంగా హండ్రెడ్ లీగ్కు దూరమైన జెమీమా, ఆగస్టు 28 నుంచి జరుగబోయే ఆసియా కప్కు కూడా దూరమయ్యే ప్రమాదముందని తెలుస్తోంది. ఈ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టులో జెమీమాకు ఇప్పటికే చోటు దక్కింది.ఆసియా కప్ 2026 కోసం భారత జట్టు..హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జీ. కమలిని (వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, ప్రేమా రావత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, ఎన్. శ్రీ చరణి, నందిని శర్మ.రిజర్వ్ ఆటగాళ్లు: ప్రతికా రావల్, ఉమా చెత్రీ, వైష్ణవి శర్మ, సయాలి సత్ఘరే, మిన్ను మణి.జెమీమా ఆడకపోతే ఎవరికి అవకాశం..?జెమీమా ఆసియా కప్కు దూరమైతే ఆమె స్థానాన్ని భర్తీ చేసే అవకాశాల్లో ప్రతికా రావల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత జట్టులో ప్రధాన బ్యాటర్లలో జెమీమా స్థానాన్ని భర్తీ చేయగల రిజర్వ్ ఆటగాళ్లలో ప్రతికా కీలకంగా కనిపిస్తోంది.అయితే ప్రతికా ఇప్పటివరకు భారత తరఫున టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఆసియా కప్లో అవకాశం వస్తే ఆమెకు అదే తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చు. -
మరోసారి దొరికిపోయిన జైస్వాల్.. లోపం ఎక్కడుంది?
శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. కొలంబో వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆటలో లంక బౌలర్ విశ్వ ఫెర్నాండో బౌలింగ్లో.. దిలుమ్ సుదీరకు క్యాచ్ ఇచ్చి డకౌట్గా పెవిలియన్ చేరాడు.ఈ నేపథ్యంలో లెఫ్టార్మ్ సీమర్లను ఎదుర్కోవడంలో జైసూ వైఫల్యం మరోసారి బయటపడింది. తన టెస్టు కెరీర్లో జైస్వాల్ ఇప్పటి వరకు 29 టెస్టులు ఆడి 2535 పరుగులు సాధించి మంచి రికార్డు కలిగి ఉన్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి.కేవలం 200 పరుగులుఅయితే, ఎడమచేతి వాటం ఉన్న ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ను ఎదుర్కోవడంలో జైస్వాల్ ముందు నుంచే ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటి వరకు తన కెరీర్లో లెఫ్టార్మ్ సీమర్ల బౌలింగ్లో జైసూ కేవలం 200 పరుగులు చేసి.. తొమ్మిది సందర్భాల్లో అవుటయ్యాడు. సగటు 22.2గా ఉంది. రైటార్మ్ సీమర్ల బౌలింగ్లో మాత్రం జైసూ సగటున 42 పరుగులతో ఏకంగా 1184 పరుగులు రాబట్టాడు.నిజానికి లెఫ్టార్మ్ పేసర్ల యాంగిల్ కారణంగా రైటార్మ్ బ్యాటర్లు ఇబ్బంది పడతారు. కానీ లెఫ్టాండ్ బ్యాటర్ అయిన జైసూ ఇలా వీరి బౌలింగ్లో ఇబ్బంది పడటం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే అని విశ్లేషకులు అంటున్నారు.వారి బౌలింగ్లో మరీ కష్టంకాగా లెఫ్టార్మ్ సీమర్లలో ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో జైసూ 133 పరుగులు చేసి.. మూడు సార్లు అవుటయ్యాడు. సగటు 44.3. అయితే, సౌతాఫ్రికా స్టార్లు మార్కో యాన్సన్, నండ్రీ బర్గర్ మాత్రం జైసూను మరింత ఇబ్బంది పెట్టారు. యాన్సెన్ బౌలింగ్లో జైసూ 42 పరుగులు చేసి మూడుసార్లు అవుట్ కాగా.. బర్గర్ బౌలింగ్లో కేవలం 21 పరుగులే చేసి మూడుసార్లు పెవిలియన్ చేరాడు.కేవలం టెస్టుల్లోనే కాదు టీ20 ఫార్మాట్లోనూ జైస్వాల్ లెఫ్టార్మ్ సీమర్లను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పటికి వారి బౌలింగ్లో 135 పరుగులు చేసి ఐదుసార్లు అవుటయ్యాడు. నెట్స్లో గంట ప్రాక్టీస్కాగా లెఫ్టాండ్ బ్యాటర్ అయిన జైసూకు లెఫ్టార్మ్ పేసర్ వేసే బంతి భిన్నమైన కోణంలో వస్తుంది. బౌలర్ బంతిని రిలీజ్ చేసిన మూమెంట్ మీదే అతడు ఎలాంటి షాట్ ఆడాలన్న నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా జైస్వాల్ మరోసారి లెప్టార్మ్ పేసర్ చేతికి దొరికిపోయి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో డకౌట్ అయిన వెంటనే నెట్స్లో తిరిగి ప్రాక్టీస్కు వెళ్లిన 24 ఏళ్ల జైస్వాల్.. గంటపాటు అక్కడే శ్రమించినట్లు తెలుస్తోంది.చదవండి: పడిక్కల్ భారీ శతకం.. జడ్డూ ఫిఫ్టీ.. బ్రార్ మెరుపులు -
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన అనామక బ్యాటర్
ఇంగ్లండ్కు చెందిన 33 ఏళ్ల జేక్ లిబ్బీ అనే అనామక బ్యాటర్ బ్యాటింగ్ దిగ్గజమైన విరాట్ కోహ్లి, టీమిండియా బ్యాటింగ్ సంచలనం రుతురాజ్ గైక్వాడ్ రికార్డులను బద్దలు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్ల జాబితాలో వీరిద్దరిని అధిగమించి టాప్ ప్లేస్కు చేరాడు. ఇంగ్లండ్ కౌంటీ జట్టు వోర్సెస్టర్షైర్కు ప్రాతినిథ్యం వహించే లిబ్బీ.. వన్డే కప్లో వరుసగా మూడు సెంచరీలు సాధించి, లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్గా అవతరించాడు.లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక బ్యాటింగ్ సగటుజేక్ లిబ్బీ- 61.4 (18 హాఫ్ సెంచరీలు, 6 సెంచరీలు, 2456 పరుగులు)రుతురాజ్ గైక్వాడ్- 58.61 (20, 21, 5334)సామ్ హెయిన్- 58.18 (18, 10, 3084)మైకేల్ బెవాన్- 57.86 (116, 13, 15103)విరాట్ కోహ్లి- 57.8 (88, 59, 16591)లిబ్బీ తాజా సెంచరీ విషయానికొస్తే.. సర్రేపై 334 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన లిబ్బీ, 96 బంతుల్లో అజేయమైన 109 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఈ సెంచరీతో లిబ్బీ లిస్ట్-ఏ సగటు ఏకంగా 61.40కి చేరింది. లిస్ట్-ఏ చరిత్రలో కనీసం 2400 పరుగులు చేసిన బ్యాటర్లలో 60 సగటు దాటిన తొలి బ్యాటర్గానూ లిబ్బీ చరిత్ర సృష్టించాడు.వరుసగా మూడు సెంచరీలులిబ్బీ ప్రస్తుతం జరుగుతున్న వన్డే కప్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సర్రేపై 109 పరుగులతో పాటు అంతకుముందు ససెక్స్, మిడిల్సెక్స్, ఎసెక్స్పై కూడా సెంచరీలు సాధించాడు. వన్డే కప్లో లిబ్బీ ఇప్పటివరకు ఆడిన ఆరు ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలతో, 91.50 సగటున, 366 పరుగులు చేశాడు. తాజా ప్రదర్శనలతో లిబ్బీ ఇంగ్లండ్ వన్డే జట్టులోకి వస్తాడేమే చూడాలి. -
పడిక్కల్ భారీ శతకం.. జడ్డూ ఫిఫ్టీ.. బ్రార్ మెరుపులు
శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టుకు టీమిండియా ధీటుగా బదులిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్లో శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. దేవదత్ పడిక్కల్ భారీ శతకం, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ, గుర్నూర్ బ్రార్ మెరుపుల కారణంగా మంచి స్కోరు సాధించింది.శ్రీలంక 363 డిక్లేర్డ్శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా.. శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. కొలంబోలో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.ఫలితంగా శ్రీలంక క్రికెట్ ఎలెవన్.. తొలిరోజు ఆటలో ఎనిమిది వికెట్ల నష్టానికి 363 పరుగులు సాధించింది. ఇక శనివారం నాటి రెండో రోజు ఆటలో ఓవర్నైట్ స్కోరు వద్దనే తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.జైసూ, పంత్, జురెల్ విఫలం ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 40 పరుగులతో రాణించాడు. వన్డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ 121 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్లు రిషభ్ పంత్ (2), ధ్రువ్ జురెల్ (1) పూర్తిగా విఫలమయ్యారు.ఇలాంటి తరుణంలో నాలుగో స్థానంలో వచ్చిన స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు.. మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ మానవ్ సుతార్ తోడయ్యాడు. జడ్డూ 117 బంతుల్లో 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరగా.. మానవ్ 90 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అయితే, అసంక మనోజ్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా మానవ్ వెనుదిరిగాడు.గుర్నూర్ బ్రార్ మెరుపులు ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చి 15 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ 8 బంతుల్లో ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఆల్రౌండర్ సారాంశ్ జైన్ 22 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా.. గుర్నూర్ బ్రార్ మెరుపులు మెరిపించాడు.వరుస విరామాల్లో ఆటగాళ్లు పెవిలియన్ చేరిన తర్వాత పడిక్కల్ మళ్లీ బ్యాటింగ్కు దిగాడు. 103 పరుగులతో తిరిగి బ్యాటింగ్ మొదలుపెట్టిన పడిక్కల్.. ఆట ముగిసేసరికి మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 142 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 18 ఫోర్లు ఉన్నాయి.ఆరు పరుగుల తేడాఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. పడిక్కల్ 142 పరుగులతో ఉండగా.. బ్రార్ 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక క్రికెట్ ఎలెవన్ కంటే కేవలం ఆరు పరుగులు వెనుకబడి ఉంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్కు ఆదివారం చివరి రోజు. చదవండి: ద్రవిడ్ వద్దన్నాడు.. యువీ ఉంటే కథ వేరుగా ఉండేది -
ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్పై మాజీ భార్య సంచలన ఆరోపణలు
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ ఆష్లే గార్డ్నర్పై ఆమె మాజీ భార్య మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేసింది. గార్డ్నర్ సహచర క్రికెటర్ జార్జియా వోల్తో సంబంధం పెట్టుకుందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో గార్డ్నర్ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించకపోవడాన్ని ప్రశ్నించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్లేయర్లు ఆదర్శంగా ఉండాలని పేర్కొంది.కాగా, వాల్ చేసిన ఆరోపణలను క్రికెట్ ఆస్ట్రేలియా వ్యక్తిగత అంశంగా పరిగణిస్తుంది. మరోవైపు గార్డ్నర్కు ఆమె బిగ్బాష్ లీగ్ జట్టు సిడ్నీ సిక్సర్స్ మాత్రం మద్దతుగా నిలిచింది. గార్డ్నర్ను వచ్చే సీజన్లో కూడా కెప్టెన్గా కొనస్తామని తెలిపింది. గార్డ్నర్ గతేడాదే ఎలీస్ పెర్రీ స్థానంలో సిక్సర్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టింది.పెళ్లైన కొన్ని నెలలకే..!మోనికా రైట్, ఆష్లే గార్డ్నర్ 2025 ఏప్రిల్లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని నెలలకే వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కొద్ది రోజల కిందట గార్డ్నర్, రైట్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి కలిసి ఉన్న ఫొటోలను తొలగించారు. ప్రస్తుతం ఇద్దరూ విడాకుల ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. -
వీవీఎస్ లక్ష్మణ్తో సైకియా భేటీ.. కారణం ఇదే!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా.. హెడ్ ఆఫ్ క్రికెట్ వీవీఎస్ లక్ష్మణ్తో ఆదివారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హుటాహుటిన ఆయన బెంగళూరుకు బయల్దేరినట్లు సమాచారం. కాగా గత కొంతకాలంగా టీమిండియా గాయాల బెడదతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.స్టార్ ఆటగాళ్లంతా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నారు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.. అదే విధంగా బౌలర్లు వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్.. బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా గాయాల నుంచి కోలుకోలేదు.ఇక తొడకండరాల నొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా పరిస్థితిలో ఏమాత్రం పురోగతి లేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేవజిత్ సైకియా బెంగళూరుకు వెళ్లి లక్ష్మణ్తో కలిసి పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమైనట్లు బీసీసీఐ వర్గాలు తాజాగా పీటీఐకి వెల్లడించాయి.‘‘అవును.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా బెంగళూరులో వీవీఎస్ లక్ష్మణ్తో భేటీ అవుతారు. ఇరువురి మధ్య చర్చ జరుగుతుంది. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆన్లైన్లో ఈ భేటీలో పాల్గొంటారనే సమాచారం ఉన్నా.. స్పష్టత మాత్రం లేదు.ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యల గురించి సైకియా- లక్ష్మణ్ చర్చిస్తారు. ఇద్దరూ కలిసి మీడియా ఎదుటకు వచ్చి అన్ని ప్రశ్నలకు బదులిస్తారు’’ అని బీసీసీఐ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి. కాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE), టీమిండియా సెలక్టర్ల మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ గురించి పూర్తి సమాచారం ఇవ్వకుండానే.. వారిని రిలీజ్ చేయడం సరికాదని సెలక్టర్లు హితవు పలికినట్లు సమాచారం. ఇటీవల హర్షిత్ రాణా.. తాజాగా బుమ్రా, సాయి సుదర్శన్ల ఫిట్నెస్ గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వకలేదని తెలుస్తోంది.దీంతో వారిని తొలుత పలు సిరీస్లకు ఎంపిక చేసి.. ఆ తర్వాత వారి స్థానాలను వేరే వారితో భర్తీ చేయడంలో ఇబ్బందులు తలెత్తిన విషయాన్ని CoE దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. బుమ్రా, సుదర్శన్ రిలీజ్ చేయడం వల్ల జట్టు ఎంపిక సమయంలో క్లారిటీ లేకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్లో మూడు సార్లు ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి స్పిన్నర్గా చరిత్రకెక్కాడు. ఐర్లాండ్తో జరిగిన రెండో వన్డేలో 7.4 ఓవర్లలో 34 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి ఈ రికార్డు సృష్టించాడు.రషీద్ 2017లో తొలిసారి ఆరు వికెట్ల ప్రదర్శన (ఐర్లాండ్పైనే) నమోదు చేశాడు. అదే ఏడాది విండీస్పై 7-18 ప్రదర్శన నమోదు చేసి రెండోసారి ఈ ఘనత సాధించాడు. తాజాగా ఐర్లాండ్పై మరోసారి 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి, వన్డే క్రికెట్లో మూడోసారి ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించాడు.ఓవరాల్గా వన్డేల్లో అత్యధిక సార్లు 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రికార్డు పాక్ స్పీడ్స్టర్ వకార్ యూనిస్ పేరిట ఉంది. వకార్ ఏకంగా ఐదుసార్లు 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. స్నిన్ విభాగంలో రషీద్ తర్వాతి స్థానంలో వనిందు హసరంగ (2) ఉన్నాడు. పేస్ విభాగంలో వకార్ తర్వాతి స్థానంలో ట్రెంట్ బౌల్ట్ (2) ఉన్నాడు. భారత్ తరఫున ఆశిష్ నెహ్రా వన్డేల్లో రెండుసార్లు ఆరు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. రషీద్ ఖాన్ వన్డేల్లో ఇప్పటివరకు ఏడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు. టెస్ట్ల్లో ఐదు సార్లు, టీ20ల్లో రెండు సార్లు ఈ ఘనత సాధించాడు.ఇదిలా ఉంటే, రషీద్ స్పిన్న్ మాయాజాలం దెబ్బకు రెండో వన్డే ఐర్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేయగా.. ఐర్లాండ్ 33.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్ను తలో 47 ఓవర్లకు కుదించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లోని తొలి వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. మూడో వన్డే బెల్ఫాస్ట్ వేదికగా ఆగస్ట్ 10న జరుగనుంది. -
‘ద్రవిడ్ వద్దన్నాడు.. యువీ ఉంటే నా షర్ట్ విప్పేసేవాడు’
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా సాధించిన చిరస్మరణీయ విజయాల్లో నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్-2002కు ప్రత్యేక స్థానం ఉంది. ఇంగ్లండ్- భారత్- శ్రీలంక మధ్య జరిగిన ఈ ముక్కోణపు వన్డే సిరీస్లో ఆతిథ్య ఇంగ్లిష్ జట్టు, టీమిండియా టైటిల్ పోరుకు అర్హత సాధించాయి.గెలిపించిన కైఫ్క్రికెట్ పుట్టినిల్లు లండన్లోని లార్డ్స్ మైదానంలో నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్ను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. ఇంగ్లండ్ విధించిన 326 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు ఉండగానే ఛేదించింది. నాటి ఫైనల్లో మహ్మద్ కైఫ్ 75 బంతుల్లోనే 87 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ను గెలిపించాడు.గంగూలీ మెరుపులు.. రాణించిన సెహ్వాగ్, యువీ ఇక ఓపెనర్లు వీరేందర్ సెహ్వాగ్ 45 పరుగులు చేయగా.. కెప్టెన్ సౌరవ్ గంగూలీ (43 బంతుల్లో 60) మెరుపులు మెరిపించాడు. ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా అర్ధ శతకం (69)తో రాణించాడు. కాగా లార్డ్స్లో ఈ విజయంతో టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి.బాల్కనీలో ఉన్న కెప్టెన్ గంగూలీ షర్టు విప్పేసి మరీ దూకుడుగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ ఫొటో విరివిగా వైరల్ అయింది. తాజాగా ఈ విషయం గురించి గుర్తుచేసుకున్న భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ద్రవిడ్ వద్దన్నాడు.. యువీ ఉంటే నా షర్ట్ విప్పేసేవాడుచీకీ సింగిల్స్ ఎపిసోడ్లో మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నేను షర్టు విప్పకుండా రాహుల్ ద్రవిడ్ ఆపాడు. వద్దని వారించాడు. ఒకవేళ నేను గనుక నా జెర్సీ విప్పేసి ఉంటే.. గంగూలీ మాదిరే నా ఫొటో కూడా వైరల్ అయ్యేది.గంగూలీ తర్వాత నేను కూడా అదే పని చేద్దామనుకున్నాను. దేవుడి దయ వల్ల అప్పుడు నా పక్కన ద్రవిడ్ ఉండి.. నన్ను వారించాడు. ఒకవేళ ద్రవిడ్ కాకుండా ఆరోజు యువరాజ్ సింగ్ నా పక్కన ఉండి ఉండే.. తనే నా షర్టు విప్పేసేవాడు. ఏదేమైనా ద్రవిడ్కు నేను రుణపడి ఉంటాను’’ అని భజ్జీ సరదాగా వ్యాఖ్యానించాడు.కాగా నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో హర్భజన్ సింగ్ పది ఓవర్ల బౌలింగ్లో 53 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాటింగ్లో ఎనిమిదో స్థానంలో వచ్చి 13 బంతుల్లో 15 పరుగులు చేశాడు. మరోవైపు.. ద్రవిడ్ ఈ మ్యాచ్లో 12 బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు.చదవండి: విండీస్కు భారీ షాక్.. -
8 వికెట్లతో ఆసీస్ బౌలర్ విజృంభణ
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై కాలుమోపిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు తొలి మ్యాచ్లోనే ఘోర పరాభవం ఎదురైంది. టెస్ట్ సిరీస్కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో ఆ జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తొలి ఇన్నింగ్స్లో మెహిది హసన్ మిరాజ్ అజేయ సెంచరీతో (109) ఆదుకోవడంతో ఓ మోస్తరు స్కోర్ (263) చేసిన బంగ్లా జట్టు.. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ యువ సంచలన పేసర్ క్యాంప్బెల్ థాంప్సన్ (11-2-25-8) ధాటికి 54 పరుగులకే కుప్పకూలింది. మధ్యలో టేగ్ విల్లీ (130) శతక్కొట్టడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 355 పరుగులు చేసింది. థాంప్సన్ వీర విజృంభణ దెబ్బకు ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఆసీస్తో రెగ్యులర్ టెస్ట్ సిరీస్ ఆగస్ట్ 13 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ డార్విన్ వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 22 నుంచి మెక్కేలో ప్రారంభం కానుంది.తాజా సంచలన ప్రదర్శన తర్వాత క్యాంప్బెల్ థాంప్సన్ క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాడు. ఈ 22 ఏళ్ల ఎడమచేతి వాటం పేసర్ ఎవరా అని ఆరా తీయడం ప్రారంభించారు.ఎవరీ క్యాంప్బెల్ థాంప్సన్..?దక్షిణ ఆస్ట్రేలియాలోని మౌంట్ బార్కర్కు చెందిన థాంప్సన్ 2023లో క్లబ్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2025 ఆగస్టులో అడిలైడ్ స్ట్రైకర్స్ అకాడమీలో చోటు సంపాదించాడు. అక్కడ ఐదు మ్యాచ్లు ఆడిన తర్వాత 2025 నవంబర్లో ఇంగ్లాండ్ XIతో జరిగిన మ్యాచ్లో ప్రైమ్ మినిస్టర్స్ XI తరఫున అరంగేట్రం చేశాడు.2025-26 షెఫీల్డ్ షీల్డ్ సీజన్లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేశాడు. క్వీన్స్లాండ్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.అయితే బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ అతడి కెరీర్లోనే అతిపెద్ద బ్రేక్థ్రూ. రెండో ఇన్నింగ్స్లో 8/25తో చెలరేగి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.స్టార్క్కు వారసుడవుతాడా..?వేగంగా బంతులు వేయడంతో పాటు కొత్త బంతితో స్వింగ్ చేయగల సామర్థ్యం థాంప్సన్కు అతిపెద్ద బలం. ఇదే అతడిని ఆస్ట్రేలియా భవిష్యత్ పేస్ దళంలో కీలక ఆటగాడిగా మార్చే అవకాశం ఉంది.ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కెరీర్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో.. అతడి స్థానాన్ని భర్తీ చేసే యువ పేసర్లను ఆస్ట్రేలియా వెతుకుతోంది. ఈ క్రమంలో థాంప్సన్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది.ప్రస్తుతం అతడి ఫస్ట్క్లాస్ అనుభవం చాలా తక్కువే. కానీ బంగ్లాదేశ్పై చేసిన ప్రదర్శన మాత్రం అతడి సామర్థ్యాన్ని చాటింది. ఇదే స్థాయిలో రాణిస్తే.. త్వరలోనే ఆస్ట్రేలియా జాతీయ జట్టులోకి థాంప్సన్కు పిలుపు రావడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు.భవిష్యత్తులో భారత్తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనైనా.. అంతకంటే ముందే అయినా.. ఈ యువ ఎడమచేతి పేసర్కు అవకాశం దక్కుతుందేమో చూడాలి. థాంప్సన్కు బ్యాటింగ్లోనూ మంచి సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. అతడి ప్రొఫైల్ ప్రకారం అతడు కుడి చేతి వాటం బ్యాటర్. అతన్ని బౌలింగ్ ఆల్రౌండర్గా పరిగణిస్తారు. -
IND vs SL: పంత్, జురెల్ ఫెయిల్.. జడ్డూ ఫిఫ్టీ
శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో వార్మప్ మ్యాచ్లో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ విఫలమయ్యారు. ఈ ఇద్దరు వికెట్ కీపర్లు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో పంత్, జురెల్ ఆట తీరుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్లలో తలపడేందుకు అక్కడికి వెళ్లింది. గాలె, కొలంబో వేదికలుగా ఆగష్టు 15 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఇందుకు సన్నాహకంగా టీమిండియా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది.కొలంబో వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా ఎనిమిది వికెట్ల నష్టానికి 363 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్లు నిశాన్ మధుష్క (66), రవిందు రశాంత (71), కెప్టెన్ సోనాల్ దినుష (52) అర్ధ శతకాలతో రాణించారు.జైసూ డకౌట్.. పడిక్కల్ శతకంఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనూహ్య రీతిలో బౌల్డ్ అయ్యాడు. అయితే, వన్డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ అద్భుత శతకం (121 బంతుల్లో 103) సాధించాడు. ఆ వెంటనే రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు.పంత్, జురెల్ విఫలంఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వచ్చీ రాగానే వెనుదిరిగాడు. రమేశ్ మెండిస్ బౌలింగ్లో అనవసరపు షాట్కు ప్రయత్నించి.. నిశాన్ మధుష్కకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఐదు బంతులు ఎదుర్కొన్న పంత్.. కేవలం రెండు పరుగులు చేసి నిష్క్రమించాడు.మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సైతం తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. దీంతో పంత్, జురెల్ ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జడేజా అర్ధ శతకం పూర్తిఇదిలా ఉంటే.. తొలి రోజు ఆటలో భాగంగా రెండు వికెట్లు తీసిన స్పిన్బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. బ్యాటింగ్లోనూ అదరగొడుతున్నాడు. 88 బంతుల్లో జడ్డూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 55 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక ఎలెవన్ కంటే మరో 154 పరుగులు వెనుకబడి ఉంది. మానవ్ సుతార్ ఏడు పరుగులతో ఉన్నాడు.చదవండి: విండీస్కు భారీ షాక్.. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అప్గాన్ అర్హత -
టీమిండియాకు మరో భారీ షాక్
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు ముందు టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే సిరీస్కు దూరం కాగా.. తాజాగా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు.తొలుత లంక సిరీస్కు బుమ్రాతో పాటు సాయి సుదర్శన్ను కూడా ఎంపిక చేశారు. వీరిద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటారనుకుంటే, అది జరగలేదు. బుమ్రా ఎడమ మోకాలిలో గాయం.. సాయి సుదర్శన్ కాలి బొటనవేలికి గాయం నుంచి కోలుకునేందుకు గత కొంతకాలంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబిలిటేషన్లో ఉన్నారు.అయితే గాయాలు ఎంతకీ మానకపోవడంతో తొలుత బుమ్రా, తాజాగా సాయి సుదర్శన్ లంక సిరీస్ నుంచి తప్పుకున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు రెగ్యులర్ ఆటగాళ్లు వైదొలగడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బే అనుకోవాలి. ఇప్పుడు వీరిద్దరికి ప్రత్యామ్నాయాలుగా ఎవరికి ఎంపిక చేస్తారో చూడాలి. తొలి టెస్ట్ (ఆగస్ట్ 15, గాలే) ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది.లంకలో పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా ప్రస్తుతం ఆ దేశ క్రికెట్ ఎలెవెన్ జట్టుతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక ఎలెవెన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్లో భారత బౌలర్లు పెద్దగా ఆకట్టకోలేకపోయారు. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ తలో 2 వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. సీనియర్ పేసర్లు సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. స్పిన్నర్ సరాన్ష్ జైన్ 11 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ దక్కలేదు.అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ సెంచరీతో (103 రిటైర్డ్ హర్ట్) సత్తా చాటగా.. కేఎల్ రాహుల్ (40) రాణించాడు. యశస్వి జైస్వాల్ డకౌటై నిరాశపర్చగా.. పంత్ (2), జురెల్ (1) కూడా విఫలమయ్యారు. ప్రస్తుతం రెండో రోజు ఆట (టీ విరామం) కొనసాగుతోంది. -
ఆండ్రీ రసెల్ సెంచరీ
వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ టీ20 క్రికెట్లో మరో అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ లీగ్లో సెంచరీ వికెట్లు పూర్తి చేసిన ఐదో ఆటగాడయ్యాడు.2026 ఎడిషన్లో భాగంగా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్తో జరిగిన మ్యాచ్లో జమైకా కింగ్స్మెన్కు ఆడుతూ ఈ ఫీట్ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో అతడు 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో CPLలో అతడి వికెట్ల సంఖ్య 101కి చేరింది.రసెల్కు ముందు సునీల్ నరైన్ (133), ఇమ్రాన్ తాహిర్ (130), డ్వేన్ బ్రావో (129), జేసన్ హోల్డర్ (110) మాత్రమే CPLలో 100కుపైగా వికెట్లు సాధించారు.రసెల్ CPLలో కేవలం బంతితోనే కాకుండా బ్యాట్తోనూ విధ్వంసకర రికార్డులు సృష్టించాడు. 2021లో జమైకా తరఫున కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి CPL చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డును నెలకొల్పాడు.2016లో 42 బంతుల్లో సెంచరీ చేసిన రసెల్.. 2018లో అదే ట్రిన్బాగో నైట్ రైడర్స్పై కేవలం 40 బంతుల్లో శతకం బాదాడు. అదే మ్యాచ్లో హ్యాట్రిక్ కూడా సాధించాడు.CPL చరిత్రలో రసెల్ బ్యాటింగ్ స్ట్రైక్రేట్ 169.36. ఈ విభాగంలో అతడిదే అత్యుత్తమ రికార్డు. 107 ఇన్నింగ్స్ల్లో ఈ స్ట్రైక్రేట్ సాధించడం అతడి విధ్వంసక బ్యాటింగ్కు నిదర్శనం.IPL నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రసెల్ 2026లో MLCలో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ తరఫున ఆడి 11 ఇన్నింగ్స్ల్లో 18 వికెట్లు తీశాడు. ఇప్పుడు CPLలో 100 వికెట్ల మైలురాయిని అందుకోవడంతో టీ20 క్రికెట్లో అతడి సుదీర్ఘ ఆధిపత్యానికి కొనసాగింపు లభించినట్లైంది.ఇక రసెల్ తాజాగా ఆడిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో అతడి జట్టు (జమైకా కింగ్స్మెన్) 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రసెల్ తొలుత బ్యాట్తో (10 బంతుల్లో 8) ఆకట్టకోలేకపోయాడు. ఆతర్వాత బంతితో రాణించినా అతడి జట్టుకు ఓటమి తప్పలేదు. -
IND vs SL: శ్రీలంక గడ్డపై శతక్కొట్టిన పడిక్కల్
శ్రీలంక ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా స్టార్ దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో మెరిశాడు. కొలంబోలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా 121 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా రెండు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. రెండో రోజు ఆట సందర్భంగా 363 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జైసూ డకౌట్అనంతరం భారత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 67 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే, కేశారా నువాంత బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.అయితే, వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మాత్రం సెంచరీతో దుమ్ములేపాడు. 61 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరో 60 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్.. 103 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్లో 14 ఫోర్లు ఉన్నాయి. ఇక పడిక్కల్ స్థానంలో.. రవీంద్ర జడేజాకు తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. పంత్ విఫలంఅయితే, పంత్ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. 42 ఓవర్ల ఆట ముగిసేసరికి జడ్డూ 23 పరుగులతో ఉండగా.. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు.చదవండి: మూడేళ్లుగా తిరుగుతున్నా.. సాయం చేయండి సీఎం గారూ: పంత్ -
దంచికొట్టిన రికెల్టన్.. దూసుకెళ్తున్న సన్రైజర్స్
‘ది హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్’-2026 టోర్నీలో సన్రైజర్స్ లీడ్స్ వరుస విజయాలతో దూసుకువెళ్తోంది. తాజాగా బర్మింగ్హామ్ ఫొనిక్స్ జట్టును ఓడించిన సన్రైజర్స్.. సీజన్లో నాలుగో విజయం నమోదు చేసింది. తద్వారా పదహారు పాయింట్లతో పట్టికలో రెండోస్థానానికి దూసుకువచ్చింది.సన్రైజర్స్ లీడ్స్ ప్రయాణం ఇలాది హండ్రెడ్ తాజా ఎడిషన్లో భాగంగా సన్రైజర్స్ తొలి మ్యాచ్లో ఎంఐ లండన్ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం సదరన్ బ్రేవ్తో తలపడి ఐదు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. విజయాల ఖాతా తెరిచింది. ఆ తర్వాత మాంచెస్టర్ సూపర్ జెయింట్స్పై గెలిచిన సన్రైజర్స్కు.. ట్రెంట్ రాకెట్స్ షాకిచ్చింది. దీంతో సీజన్లో రెండో పరాజయం చవిచూసిన సన్రైజర్స్.. లండన్ స్పిరిట్పై గెలిచి మరోసారి గెలుపుబాట పట్టింది.దంచికొట్టిన రికెల్టన్తాజాగా బర్మింగ్హాన్ ఫినిక్స్తో తలపడ్డ సన్రైజర్స్ 45 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా టాస్ ఓడిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లలో మిచెల్ మార్ష్ (34) ఫర్వాలేదనిపించగా.. రియాన్ రికెల్టన్ దంచికొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 65 పరుగులు సాధించాడు.Easy picking ft. Rickelton 🙌 pic.twitter.com/HGftI8yMmi— SunRisers Leeds (@sunrisersleeds) August 7, 2026మిగిలిన వారిలో హ్యారీ బ్రూక్ 19, డాన్ లారెన్స్ 14 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ జాక్ క్రాలే (3) విఫలమయ్యాడు. ఫలితంగా నిర్ణీత 100 బంతుల్లో సన్రైజర్స్ ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బర్మింగ్హామ్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్ రెండు వికెట్లు తీయగా.. క్రిస్ వుడ్, టామ్ హెల్మ్, జోర్డాన్ థాంప్సన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.124 పరుగులకే పరిమితంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బర్మింగ్హామ్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో ఎనిమిది వికెట్లు నష్టపోయి 124 పరుగులకే పరిమితమైంది. దీంతో సన్రైజర్స్ 45 పరుగుల తేడాతో గెలిచింది. బర్మింగ్హామ్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ జో క్లార్క్ 25, సీన్ డెక్సాన్ 34, జోర్డాన్ థాంప్సన్ 25 (నాటౌట్) ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు.రెండోస్థానానికిసన్రైజర్స్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. నాథన్ ఎల్లిస్, అబ్రార్ అహ్మద్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సీజన్లో సన్రైజర్స్కు ఆరింట ఇది నాలుగో విజయం. ఎంఐ లండన్తో పాయింట్ల పరంగా (16) సమానంగా ఉన్నప్పటికీ.. నెట్రన్రేటు పరంగా మెరుగైన స్థితిలో ఉన్న సన్రైజర్స్ (+0.674) పట్టికలో రెండోస్థానానికి చేరుకుంది. మరోవైపు.. బర్మింగ్హామ్ జట్టు ఎలిమినేట్ అయింది.చదవండి: IND vs SL: కేఎల్ రాహుల్ అలా.. పడిక్కల్ ఇలా -
సన్రైజర్స్ ఓపెనర్ విధ్వంసం.. టోర్నీ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫిప్టీ
హండ్రెడ్ మహిళల కాంపిటేషన్- 2026లో సన్రైజర్స్ లీడ్స్ జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా బర్మింగ్హామ్ ఫీనిక్స్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో సన్రైజర్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హామ్ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది. సన్రైజర్స్ బౌలర్లలో దీప్తీ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. కాట్ క్రాస్ రెండు, జానెసన్, సదర్లాండ్ తలా వికెట్ సాధించారు. ఫినిక్స్ బ్యాటర్లలో ఎమ్మా లాంబ్(47), కెప్టెన్ పెర్రీ(31) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.లిచ్ఫీల్డ్ విధ్వంసంఅనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సన్రైజర్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 69 బంతుల్లోనే ఊదిపడేసింది. యువ ఓపెనర్, ఆసీస్ స్టార్ ఫీబీ లిచ్ఫీల్డ్ విధ్వంసం సృష్టించింది. బర్మింగ్హామ్ బౌలర్లను ఉతికారేసింది. కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం సాధించి అందరిని ఆశ్చర్యపరించింది.తద్వారా ది హండ్రెడ్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన మహిళా బ్యాటర్గా ఆమె రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత ఓపెనర్ షఫాలీ వర్మ పేరిట ఉండేది. 2021లో బర్మింగ్హామ్ ఫీనిక్స్తో జరిగిన మ్యాచ్లో షఫాలీ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. తాజా మ్యాచ్లో షఫాలీ ఆల్టైమ్ రికార్డును లిచ్ఫీల్డ్ బ్రేక్ చేసింది. ఓవరాల్గా మ్యాచ్లో లిచ్ఫీల్డ్ 33 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్తో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.చదవండి: 'మూడేళ్లుగా తిరుగుతున్నా.. ప్లీజ్ హెల్ప్ చేయండి -
విండీస్కు భారీ షాక్.. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అఫ్గాన్ క్వాలిఫై
బ్రెడీ క్రికెట్ క్లబ్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 92 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ గెలుపొందింది. దీంతో ఐసీసీ వన్డే ప్రపంచకప్-2027కు అఫ్గానిస్తాన్ నేరుగా అర్హత సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం వన్డే ర్యాంకింగ్స్లో టాప్-8లో నిలిచే జట్లు మాత్రమే ఈ మెగా టోర్నీకి డైరక్ట్గా క్వాలిఫై అవుతాయి.అఫ్గాన్ ప్రస్తుతం ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్ధానంలో ఉంది. అయితే వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్నకు క్వాలిఫై కావాలంటే అఫ్గాన్కు ఐర్లాండ్ సిరీస్లో ఒక్క విజయం అవసరముండేది. ఇప్పుడు రెండో వన్డేలో గ్రాండ్ విక్టరీ సాధించడంతో అఫ్గాన్ ప్రపంచకప్ బెర్త్ అధికారికంగా ఖారరైంది. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అఫ్గాన్ నేరుగా అర్హత సాధించడం ఇదే కేవలం రెండోసారి మాత్రమే.ఐర్లాండ్, విండీస్కు బిగ్ షాక్కాగా అఫ్గాన్ గెలుపుతో ఐర్లాండ్, వెస్టిండీస్లకు భారీ షాక్ తగిలింది. ఐర్లాండ్ నేరుగా క్వాలిఫై కావాలంటే అఫ్గానిస్తాన్తో సిరీస్ను 4-0తో క్లీన్స్వీప్ చేయాల్సి ఉండగా.. తొలి మ్యాచ్ వర్షార్పణం కావడం, రెండో మ్యాచ్లో ఓడిపోవడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి.మరోవైపు అఫ్గాన్పై ఐర్లాండ్ గెలిస్తే.. భారత్తో సిరీస్లో ఒక్క విజయం సాధించి వరల్డ్కప్ టోర్నీకి నేరుగా క్వాలిఫై కావాలనుకున్న విండీస్ ఆశలు కూడా ఆడియాశలయ్యాయి. వెస్టిండీస్ ప్రస్తుతం ర్యాంకింగ్స్లో పదివ స్ధానంలో ఉంది.చివరగా జరిగిన 2023 వరల్డ్ కప్లో కూడా కరేబియన్ జట్టు భాగం కాలేదు. అప్పుడు వన్డే ర్యాంకింగ్స్లో టాప్-8లో నిలవలేక ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ ఆడింది. సూపర్-6 దశలో స్కాట్లాండ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసి తొలిసారి వన్డే ప్రపంచకప్నకు దూరమైంది. కాగా వచ్చే ఏడాది జరగనున్న ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలు ఆతిథ్యమివ్వనున్నాయి.చదవండి: 'మూడేళ్లుగా తిరుగుతున్నా.. ప్లీజ్ హెల్ప్ చేయండి' -
IND vs SL: జైస్వాల్ విఫలం.. రాహుల్ అలా.. పడిక్కల్ ఇలా
శ్రీలంక ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతుండగా.. వన్డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు.వర్షం వల్ల ఆటకు అంతరాయంఫలితంగా శనివారం నాటి రెండో రోజు ఆటలో భోజన విరామ సమయానికి టీమిండియా.. 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేయగలిగింది. అయితే, అంతకంటే ముందే వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) తాజా ఎడిషన్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది.హాఫ్ సెంచరీలతో అలరించారుఅయితే, ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం నుంచి శ్రీలంక ఎలెవన్తో టీమిండియా వార్మప్ మ్యాచ్ మొదలుపెట్టింది. కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని మంచి స్కోరు సాధించింది. ఓపెనర్లు నిశాన్ మధుష్క (66), రవిందు రశాంత (71) అర్ధ శతకాలతో మెరిశారు.మిగిలిన వారిలో పసిందు సూరియబండారా (35), పవన్ రత్ననాయకె (39), అహాన్ విక్రమసింఘే (31), రమేశ్ మెండిస్ (32) ఫర్వాలేదనిపించారు. వికెట్ కీపర్ అంజాలా బండారా (13) విఫలం కాగా.. కెప్టెన్ సోనాల్ దినుష (52) హాఫ్ సెంచరీతో అలరించాడు.మనోళ్లు తేలిపోయారుఫలితంగా శ్రీలంక ఎలెవన్ 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. పేసర్లంతా తేలిపోయారు. గుర్నూర్ బ్రార్ ఒక్కడు మాత్రం ఒక వికెట్ తీశాడు. ఈ క్రమంలో ఓవర్నైట్ స్కోరు 363-8 వద్ద రెండో రోజు శ్రీలంక ఎలెవన్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆదిలోనే జైస్వాల్ వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి మరో ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 23, పడిక్కల్ 52 బంతుల్లో 44 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇద్దరూ కలిసి యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.పడిక్కల్ ఫిఫ్టీఇక భోజన విరామం తర్వాత కాసేపటికే పడి క్కల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. రాహుల్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఇదిలా ఉంటే.. గాయం వల్ల రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలిరోజు మైదానంలో దిగలేదు. చదవండి: మూడేళ్లుగా తిరుగుతున్నా.. సాయం చేయండి: పంత్ -
ఆండ్రూ ఫ్లింటాఫ్ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్కు గుడ్బై
ఇంగ్లండ్ లయన్స్ ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ వైదొలిగాడు. బిగ్ బాష్ లీగ్లోని 'సిడ్నీ థండర్' జట్టుకు ప్రధాన కోచ్గా ఎంపిక కావడంతో ఫ్లింటాఫ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సెప్టెంబర్ 2024లో లయన్స్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన ఫ్లింటాప్.. దాదాపు రెండేళ్ల పాటు యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు."ఇంగ్లండ్ లయన్స్ హెడ్కోచ్ పదవి నుంచి వైదొలగుతున్నందుకు చాలా బాధపడుతున్నాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. దేశంలోని యువ క్రికెటర్లతో పనిచేసే అవకాశం రావడం, వారు అత్యుత్తమ ఆటగాళ్లగా ఎదగడంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. నాకు అండగా నిలిచిన సపోర్ట్ స్టాఫ్కు, నాపై నమ్మకం ఉంచిన ఇంగ్లండ్ క్రికెట్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మేనెజ్మెంట్కు ధన్యవాదాలు. త్వరలోనే సిడ్నీ థండర్తో నా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని ఫ్లింటాఫ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.'ఫ్రెడ్డీ' స్ధానంలో స్ధానంలో మైక్ యార్డీ లయన్స్ జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ కూడా ఇంగ్లండ్ సీనియర్ క్రికెట్ జట్టు వైపు దూసుకొస్తున్నాడు. రాకీ తండ్రి శిక్షణలోనే రాటుదేలాడు. యువ పేసర్ జోష్ హల్ ఇంగ్లండ్ సీనియర్ జట్టుకు ఎంపిక కావడంలో కూడా ఫ్లింటాఫ్ది కీలక పాత్ర. -
టీవీ నటిని పెళ్లాడిన భారత క్రికెటర్.. ఫొటోలు వైరల్
భారత క్రికెటర్ రమణ్దీప్ సింగ్ ఓ ఇంటివాడయ్యాడు. బుల్లితెర నటి చార్లీ చౌహాన్ను పెళ్లి చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చార్లీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయడంతో వైరల్గా మారాయి.కేకేఆర్ ఆల్రౌండర్గా..ఈ క్రమంలో నూతన వధూవరులు రమన్దీప్ సింగ్- చార్లీ చౌహాన్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చండీగఢ్లో 1997లో జన్మించిన రమణ్దీప్ సింగ్.. క్రికెట్పై మక్కువతో బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఎదిగాడు. దేశవాళీ క్రికెట్లో పంజాబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 2022లో అరంగేట్రం చేశాడు.ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్కు ఆడుతున్న రమణ్దీప్ సింగ్.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 38 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 299 పరుగులు తీయడంతో పాటు.. ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ మీడియం పేసర్.టీమిండియా తరఫున అరంగేట్రంఇక ఐపీఎల్లో సత్తా చాటిన రమణ్దీప్ సింగ్కు 2024లో టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. భారత్ తరఫున ఇప్పటికి రెండు మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కేవలం 15 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీయగలిగాడు.ఎవరీ చార్లీ చౌహాన్?చార్లీ చౌహాన్ బుల్లితెర నటి. బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ సిరీస్లో ఏలా అనే పాత్రతో ఆమె గుర్తింపు పొందింది. ఆ తర్వాత కైసీ యే యారియాన్లో ముక్తి వర్ధన్ అనే పాత్ర పోషించింది. అదే ఎంటీవీ రోడీ సీజన్ 7లోనూ చార్లీ పాల్గొంది.నటుడు కున్వార్ అమర్తో కలిసి నచ్ బలియే అనే డ్యాన్స్ ప్రోగ్రామ్లోనూ చార్లీ భాగమైంది. గతంలో వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇక యే హై ఆషికి 4 వంటి షార్ట్ ఫిలిమ్స్లోనూ చార్లీ నటించింది.కేవలం నటనకే పరిమితం కాకుండా సంగీతం, రైటింగ్లోనూ చార్లీకి ప్రవేశం ఉంది. పలు మ్యూజిక్ ఆల్బమ్స్కి ఆమె రచయితగా పనిచేసింది. అయితే, రమణ్దీప్ సింగ్తో చార్లీ ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పెళ్లి ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ఎనిమిదేళ్లుగా మేము.. ఇప్పుడిలా.. శాశ్వత బంధంలోకి అడుగుపెట్టాము’’ అని చార్లీ చౌహాన్ ఇచ్చిన క్యాప్షన్ను బట్టి ఇది నిజమని తేలింది.చదవండి: మూడేళ్లుగా తిరుతుగున్నా... ప్లీజ్ సాయం చేయండి: పంత్ -
ఇంటి స్థలం కోసం పంత్ ట్వీట్.. స్పందించిన సీఎం
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక విజ్ఞప్తి తీవ్ర చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్లో ఇంటి స్థలం కోరుతూ శుక్రవారం అర్ధరాత్రి పుష్కర్ సింగ్ను ట్యాగ్ చేస్తూ పంత్ ట్వీట్ చేశాడు. అయితే రిషబ్ చేసిన ట్వీట్పై పుష్కర్ సింగ్ ధామీ సానుకూలంగా స్పందించారు. నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు."ప్రియమైన రిషభ్. నువ్వు ఉత్తరాఖండ్కు గర్వకారణం. నీ అద్భుతమైన ఆటతో దేవభూమికి దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చావు. మాతృభూమిపై నీకున్న ప్రేమ, ఇక్కడికి వచ్చి సేవ చేయాలనే నీ సంకల్పం ఎంతో ప్రశంసనీయం. ఈ విషయం గురుంచి సంబంధిత అధికారులకు తెలియజేశాను. వారు త్వరలోనే నిన్ను సంప్రదించి నిబంధనలకు లోబడి మీకు సహకారం అందిస్తారు" అని ఆయన రిప్లే ఇచ్చారు.కాగా ఆర్ధ రాత్రి 12.46 గంటలకు పోస్ట్లు పెట్టడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పోస్ట్లో ఉన్న వ్యాకరణ దోషాలు చూసి అభిమానులు మొదట్లో పంత్ సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిందేమోనని అనుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ నిర్దేశిత ధరకే స్థలాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, గత మూడేళ్లుగా అనువైన స్థలం లభించక ఇబ్బంది పడుతున్నందునే సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు పంత్ మరో పోస్ట్లో స్పష్టం చేశాడు.పంత్ ట్వీట్స్లో ఏముందంటే?పుష్కర్ సింగ్ ధామీ సార్ ఎలా ఉన్నారు? ఉత్తరాఖండ్ స్థానికుడిగా నేను ఇక్కడికి తిరిగివచ్చేందుకు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు ఇళ్లు కట్టుకునేందుకు అనువైన, విశాలమైన స్థలం దొరకడం లేదు. నా ఉత్తరాఖండ్ అంటే ఎంతో ఇష్టం.ఈ భూసేకరణ విషయంలో దయచేసి నాకు సహాయం చేయండి. గతంలో రాష్ట్ర ప్రచారకర్తగా ఉన్నప్పుడు నాకు రావాల్సిన స్థలం కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ విషయం పక్కన పెడితే నాకు ఉత్తరాఖండ్కు వచ్చి నివాసముండాలని ఉంది. మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా నాకు స్థలం దొరకడం లేదు. దయచేసి నాకు ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఇప్పించండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ పంత్ ఎక్స్లో రాసుకొచ్చాడు.అయితే కాసేపటికే పంత్ మరో పోస్ట్ చేశాడు. "అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నందుకు ప్రభుత్వం తనకు ఆ స్థలాన్ని గిప్ట్ ఇస్తే బాగుంటుందని లేదా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేసేందుకు తను సిద్దంగా ఉన్నానని" తెలిపాడు.చదవండి: బంగ్లాదేశ్కు తిరిగొస్తా.. కానీ వన్ కండీషన్: షకీబ్ -
శ్రీలంకతో మ్యాచ్.. యశస్వి జైశ్వాల్ డకౌట్
కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్తో జరుగుతున్న వార్మాప్ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే జైశ్వాల్ తన ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న యశస్వి.. విశ్వ ఫెర్నాండో బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. జైశ్వాల్ మరోసారి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌలింగ్లోనే ఔట్ కావడం గమనార్హం. ఈ ముంబై ఆటగాడు గత కొంతకాలంగా ఎడమ చేతి వాటం పేసర్లను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడు.కాగా ప్రధాన సిరీస్కు ముందు జరుగుతున్న సన్నాహక మ్యాచ్లో జైశ్వాల్ విఫలం కావడం మేనెజ్మెంట్ను నిరాశపరిచింది. డగౌట్ నుంచి మ్యాచ్ వీక్షిస్తున్న హెడ్కోచ్ గౌతమ్ గంభీర్.. జైశ్వాల్ ఔటైన వెంటనే నో అంటూ తల ఊపాడు. ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక ఎలెవన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ను 363/8 వద్ద డిక్లేర్ చేసింది.లంక బ్యాటర్లలో రవిందు రసంతా (143 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్), నిషాన్ ఫెర్నాండో (65 బంతుల్లో 66; 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సొనాల్ దినుషా (72 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అయితే కొత్తగా జట్టులోకి వచ్చిన సారాంశ్ జైన్ 11 ఓవర్లలో వికెట్ పడగొట్టకుండా 54 పరుగులు ఇచ్చాడు. కాగా ఈ వార్మాప్ మ్యాచ్కు భారత రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.శ్రీలంక ఎలెవన్ జట్టునిశాన్ మధుష్క (వికెట్ కీపర్), నిపుణ్ ధనంజయ, రవిందు రశాంత, పవన్ రత్ననాయకె, అహాన్ విక్రమసింఘే, సోనాల్ దినుష (కెప్టెన్), రమేశ్ మెండిస్, దిలుమ్ సుదీర, విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, పసిందు సూరియబండారా, ఇసిత విజేసుందెర, అసంక మనోజ్, అంజలా బండారా, కేశరా నువాంత.చదవండి: 'మూడేళ్లుగా తిరుగుతున్నా.. ప్లీజ్ హెల్ప్ చేయండి' -
6 వికెట్లతో చెలరేగిన రషీద్.. ఐర్లాండ్ను చిత్తు చేసిన అఫ్గాన్
బ్రిడీ క్రికెట్ క్లబ్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ 92 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి అఫ్గాన్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ను వర్షం కారణంగా 47 ఓవర్లకు 47 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ (84) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడు సెదికుల్లా అటాల్(45)తో కలిసి రెండో వికెట్కు 116 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.ఆ తర్వాత కెప్టెన్ రహమత్ షా(30), ఆజ్మతుల్లా ఒమర్జాయ్(33), హష్మతుల్లా షాహిదీ (36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఐరీష్ బౌలర్లలో జై ముంద్రా, మార్క్ అడైర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు గావిన్, క్యాంఫ్హార్, హ్యారీ టెక్టర్ చెరో వికెట్ తీశారు.రషీద్ స్పిన్ మ్యాజిక్అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్కు అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ముప్పుతిప్పలు పెట్టాడు. అతడి స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ఐరీష్ బ్యాటర్లు విలవిల్లాడారు. ఐర్లాండ్ పవర్ప్లేలో 65/1తో నిలిచినప్పటికి.. మిడిల్ ఓవర్లలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. రషీద్ దెబ్బకు ఆతిథ్య జట్టు టాపార్డర్ కుప్పకూలింది. మొత్తంగా రషీద్ ఖాన్ 7.4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ ఇన్నింగ్స్ను దెబ్బతీశాడు. ఫలితంగా ఐర్లాండ్ లక్ష్య చేధనలో 33.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే సోమవారం బెల్ఫాస్ట్ వేదికగా జరగనుంది. కాగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. మూడో వన్డేలో అఫ్గానిస్తాన్ గెలిస్తే 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఒకవేళ ఐర్లాండ్ గెలిస్తే సిరీస్ సమమవుతోంది. -
'మూడేళ్లుగా తిరుగుతున్నా.. ప్లీజ్ హెల్ప్ చేయండి'
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన మకాంను ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్కు మార్చేందుకు సిద్దమయ్యాడు. అక్కడ ఇల్లు కట్టుకునేందుకు రిషబ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు అక్కడ స్థలం కొనుగోలు చేసేందుకు సహకరించాలని కోరుతూ నేరుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ఎక్స్ వేదికగా పంత్ విజ్ఞప్తి చేశాడు."పుష్కర్ సింగ్ ధామీ సార్ ఎలా ఉన్నారు? ఉత్తరాఖండ్ స్థానికుడిగా నేను ఇక్కడికి తిరిగివచ్చేందుకు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు ఇళ్లు కట్టుకునేందుకు అనువైన, విశాలమైన స్థలం దొరకడం లేదు. నా ఉత్తరాఖండ్ అంటే ఎంతో ఇష్టం. ఈ భూసేకరణ విషయంలో దయచేసి నాకు సహాయం చేయండి. గతంలో రాష్ట్ర ప్రచారకర్తగా ఉన్నప్పుడు నాకు రావాల్సిన స్థలం కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ విషయం పక్కన పెడితే నాకు ఉత్తరాఖండ్కు వచ్చి నివాసముండాలని ఉంది. మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా నాకు స్థలం దొరకడం లేదు. దయచేసి నాకు ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఇప్పించండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ పంత్ ఎక్స్లో రాసుకొచ్చాడు.@pushkardhami hello sir how’s you ??? It’s a long time for me especially being local from Uttrakhand . I have been trying to buy land to shift my base from Delhi to Uttrakhand and I couldn’t find anything facilitating and big to live here I love my Uttrakhand. My humble request…— Rishabh Pant (@RishabhPant17) August 7, 2026అయితే కాసేపటికే పంత్ మరో పోస్ట్ చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నందుకు ప్రభుత్వం తనకు ఆ స్థలాన్ని గిప్ట్ ఇస్తే బాగుంటుందని లేదా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేసేందుకు తను సిద్దంగా ఉన్నానని పేర్కొన్నాడు. కాగా పంత్ ఈ పోస్ట్లు అర్ధరాత్రి ఒంటి గంటసమయంలో చేయడం గమనార్హం. అర్ధరాత్రి పూట పంత్ చేసిన ఈ ట్వీట్స్పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంత్ ప్రస్తుతం రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టుతో పాటు శ్రీలంకలో ఉన్నాడు. -
బంగ్లాదేశ్కు తిరిగొస్తా.. కానీ వన్ కండీషన్: షకీబ్
బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ప్రభుత్వం తన భద్రతకు పూర్తి హామీ ఇస్తే బంగ్లాకు తిరిగి వస్తానని షకీబ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అదేవిధంగా తనపై ఉన్న హత్య కేసులతో సహా అన్ని అభియోగాలపై విచారణను ఎదుర్కోవడానికి తాను సిద్దంగా ఉన్నానని అతడు స్పష్టం చేశాడు. కాగా బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ తరఫున షకీబ్ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. 2024లో హసీనా ప్రభుత్వం రద్దు అయిన నేపథ్యంలో అతడి పదవి కూడా పోయింది. అంతేకాకుండా అతడిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు.అప్పటి నుంచి షకీబ్ దేశం విడిచి కుటంబంతో కలిసి అమెరికాలో నివసిస్తున్నాడు. అయితే ఇటీవలషేక్ హసీనా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో షకీబ్ వర్చువల్గా పాల్గొన్నాడు. దీంతో బంగ్లాలోని అతడి ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబులు బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో అతడు తిరిగి బంగ్లాకు వస్తానని ప్రకటించడం గమనార్హం.ప్రభుత్వం నాకు తగిన భద్రత కల్పిస్తే బంగ్లాదేశ్కు తిరిగి వచ్చి కోర్టు విచారణను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాను. నేను ఎలాంటి తప్పూ చేయలేదు. నాపై మోపిన ఆరోపణలన్నీ అబద్ధాలే. మా కెప్టెన్ (షేక్ హసీనా) ఏది చెబితే అది వింటాం. ఆమె దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. నేను ప్రస్తుతం చాలా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడుతున్నాను. ఆటను ఆస్వాదిస్తున్నాను. కానీ వయసు అవుతున్న కొద్దీ ఆటలో కొనసాగేందుకు కాస్త ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేను ఎక్కువ కాలం కొనసాగలేను అనుకుంటున్నా. అందుకే బంగ్లాకు వచ్చి ఫేర్వేల్ సిరీస్ ఆడి రిటైర్ అవ్వాలని ఉంది" అని రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీబ్ పేర్కొన్నాడు. కాగా మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్లో బంగ్లాదేశ్ తిరిగి రావడానికి సిద్దమవుతున్నారు. ఆమెతో పాటు షకీబ్ కూడా బంగ్లాకు వెళ్లే అవకాశముంది. -
ఆకట్టుకోని మన బౌలర్లు
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా వామప్ మ్యాచ్లో భారత బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఎలెవన్తో జరుగుతున్న ప్రాక్టీస్ పోరులో మన ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. మూడు రోజుల మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఎల్సీ ఎలెవన్ జట్టు శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. రవిందు రసంతా (143 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్), నిషాన్ ఫెర్నాండో (65 బంతుల్లో 66; 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సొనాల్ దినుషా (72 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించారు. పసిండు సూర్యబండారా (35; 6 ఫోర్లు), పవన్ రత్నాయకే (39; 3 ఫోర్లు, 2 సిక్స్లు), అహాన్ విక్రమసింఘే (31; 4 ఫోర్లు), రమేశ్ మెండిస్ (32; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టు మంచి స్కోరు సాధించింది.ఓపెనర్లు నిషాన్, రవిందు తొలి వికెట్కు 110 పరుగులు జోడించి జట్టుకు గట్టి పునాది వేశారు. భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ (13 ఓవర్లలో 0/44), ప్రసిధ్ కృష్ణ (8 ఓవర్లలో 0/32) పెద్దగా ప్రభావం చూపకపోవడంతో... లంక ఓపెనర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. తొలి సెషన్ పూర్తిగా లంక ఆధిపత్యం సాగగా... రనౌట్ రూపంలో భారత్కు మొదటి వికెట్ దక్కింది. అయితే ఆ తర్వాత కూడా ఎస్ఎల్సీ ఎలెవన్ జట్టు ఎక్కడా తగ్గలేదు. క్రీజులోకి వచ్చిన ప్రతీఒక్కరూ తమవంతు పరుగులు రాబట్టడంతో వాళ్ల ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లు ఓడిపోయిన భారత జట్టు... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మార్గాన్ని సుగమం చేసుకోవాలంటే లంకపై సిరీస్ విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆడుతున్న ఈ మ్యాచ్లో భారత పేసర్లు ఆకట్టుకోలేకపోగా... స్పిన్నర్లు ఫర్వాలేదనిపించారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సారాంశ్ జైన్ 11 ఓవర్లలో వికెట్ పడగొట్టకుండా 54 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్కు ఫస్ట్ క్లాస్ హోదా లేకపోవడంతో తొలి రోజంతా శ్రీలంక క్రికెట్ ఎలెవన్ బ్యాటింగ్ చేయగా... శనివారం మనవాళ్లు బ్యాటింగ్ చేయనున్నారు. చివరిదైన మూడో రోజు ఆదివారం చెరో 45 ఓవర్లు ఆడనున్నారు. గిల్కు గాయం గాయం కారణంగా భారత రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ ఈ వామప్ మ్యాచ్ బరిలోకి దిగలేదు. గురువారం నెట్ ప్రాక్టీస్ సమయంలో గిల్ కుడి చేతి వేలికు గాయమైంది. దీంతో ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతినిచ్చారు. గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు కెపె్టన్గా వ్యవహరిస్తున్నాడు. ‘గిల్ కుడి చేతి ఉంగరం వేలికి గాయమైంది. అందుకే వామప్ మ్యాచ్ తొలి రోజు అతడు మైదానంలోకి రాలేదు. బీసీసీఐ వైద్య బృందం అతడిని పరిశీలిస్తోంది. గిల్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ జట్టును నడిపిస్తాడు’ అని బీసీసీఐ ‘ఎక్స్’లో పేర్కొంది. గిల్ పూర్తిగా కోలుకుంటేనే బ్యాటింగ్కు రానున్నాడు. లేకపోతే... ఈ నెల 15 నుంచి శ్రీలంక జట్టుతో జరగనున్న తొలి టెస్టులోనే నేరుగా బరిలోకి దిగుతాడు. -
వన్డే క్రికెట్లో అరుదైన మైలురాయి.. 55 ఏళ్లు.. 5,000 మ్యాచ్లు
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లీగ్-2లో పోర్ట్హిల్ వేదికగా స్కాట్లాండ్- కెనడా మధ్య జరిగిన మ్యాచ్ ఓ చారిత్రత్మక రికార్డుకు వేదికైంది. ఈ పోరుతో అంతర్జాతీయ వన్డే క్రికెట్ 5,000 మ్యాచ్ల మైలురాయిని చేరుకుంది. 1971లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగింది. వన్డే క్రికెట్ ప్రారంభంలో ఇన్నింగ్స్కు 60 ఓవర్లు ఉండేవి. 1975, 1979, 1983 ప్రపంచకప్లు 60 ఓవర్ల ఫార్మాట్లోనే జరిగాయి. ఆ తర్వాత 1987 ప్రపంచకప్ నుంచి 50 ఓవర్ల ఫార్మాట్గా మారింది. తొలి 1,000 మ్యాచ్లు పూర్తికావడానికి 24 ఏళ్లు (1995) పట్టగా.. తదుపరి 31 ఏళ్లలోనే వన్డేల సంఖ్య 5,000కు చేరుకోవడం విశేషం. అయితే అత్యధిక వన్డు మ్యాచ్లు ఆడిన జట్టుగా టీమిండియా కొనసాగుతోంది. భారత్ ఇప్పటివరకు 1050కు పైగా వన్డేలు ఆడింది. ఆ తర్వాతి స్ధానాల్లో ఆస్ట్రేలియా(1000కు పైగా), పాకిస్తాన్(970+) ఉన్నాయి. కాగా ఈ ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన జట్టుగా మాత్రం ఆసీస్ టాప్ ప్లేస్లో ఉంది. 6 వన్డే ప్రపంచకప్లు, 600కు పైగా విజయాలు ఇప్పటివరకు కంగారులు సాధించారు.5000 వన్డేల మైలురాళ్ల ప్రయాణంమొదటి వన్డే: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ (మెల్బోర్న్, 1971)1000వ వన్డే: వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ (నాటింగ్హామ్, 1995)2000వ వన్డే: పాకిస్థాన్ వర్సెస్ జింబాబ్వే (షార్జా, 2003)3000వ వన్డే: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ (సౌతాంప్టన్, 2010)4000వ వన్డే: హాంకాంగ్ వర్సెస్ పాపువా న్యూ గినియా (హరారే, 2018)5000వ వన్డే: కెనడా వర్సెస్ స్కాట్లాండ్ (డూండీ, 2026) -
'ఓటముల్లోనూ అదే శాంతం'.. శ్రేయస్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం
టీమిండియా టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాక ఏడు మ్యాచ్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ గెలుపు రుచిని చూసిన సంగతి తెలిసిందే. అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు ఐర్లాండ్ (0-2), ఇంగ్లాండ్ (0-4) సిరీస్లలో వరుస ఓటములను చవిచూసింది. అనంతరం జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్ను మాత్రం భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అయ్యర్కు కెప్టెన్గా ఇదే తొలి సిరీస్ విజయం. అయితే శ్రేయస్ కెప్టెన్గా తొలి ఏడు మ్యాచ్లలో విఫలమైనప్పటికి వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం ఆకట్టుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లో ఈ ముంబైకర్ బ్యాట్తో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అయ్యర్పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఫలితాలు అనుకూలంగా రాకపోయినప్పటికి శ్రేయస్ అయ్యర్ చాలా ప్రశాంతంగా వ్యవహరించాడని చోప్రా కొనియాడాడు."శ్రేయస్ అయ్యర్కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అతడు ఎప్పుడూ ప్రతికూల విషయాల గురుంచి ఆలోచించడం, మాట్లడడం గానీ చేయడు. మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుందనే సూత్రాన్నిఅతడు బలంగా నమ్ముతాడు. ఆ మైండ్సెట్ వల్లే జట్టులో ఎప్పుడూ నెగెటివిటీకి తావివ్వడు.ఆటగాళ్లు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలరు. సహజంగా క్రికెట్ లాంటి క్రీడల్లో ప్రతీ ఒక్కరిపై ఒత్తిడి ఎలానూ ఉంటుంది. అదనంగా కెప్టెన్ లేదా కోచ్ కూడా ఒత్తిడి పెంచితే ఆటగాళ్లు రాణించలేరు. కానీ అయ్యర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. చాలా కూల్గా ఉండి ఆటగాళ్లకు పూర్తి స్వేఛ్చను ఇస్తాడు. ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ జట్టులో మంచి వాతావరణాన్ని పెంపొందించే వారే నిజమైన కెప్టెన్" అని దూరదర్శన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: భారత్తో టెస్టు సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు ఊహించని నిర్ణయం -
భారత్తో టెస్టు సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు ఊహించని నిర్ణయం
టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు అభిమానులకు శ్రీలంక క్రికెట్ (SLC) తీపి కబురు అందించింది. గాలే, కొలంబోలలో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్లను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. టెస్టు క్రికెట్కు ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఎల్సీ పేర్కొంది.కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకం. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. అనంతరం రెండో టెస్టుకు(ఆగస్టు 23 నుండి 27) కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యమివ్వనుంది. కాగా పెద్ద సంఖ్యలో వస్తారని ప్రేక్షకులు అంచనా వేస్తున్న శ్రీలంక క్రికెట్ బోర్డు.. రెండు మైదానాల్లోనూ ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేసింది.సిరీస్ షెడ్యూల్ అండ్ స్టేడియం ఎంట్రీ వివరాలు:తొలి టెస్టు మ్యాచ్తేదీలు: ఆగస్టు 15 నుండి 19 వరకు వేదిక: గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంఉచిత ఎంట్రీ గేట్: గేట్ నంబర్ 4 ద్వారా మాత్రమే ప్రవేశం రెండో టెస్టు మ్యాచ్తేదీలు: ఆగస్టు 23 నుండి 27 వరకు వేదిక: సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC), కొలంబో ఉచిత ఎంట్రీ గేట్లు: గేట్ నంబర్లు 3, 4, 5, 7 చదవండి: IND vs SL: విఫలమైన భారత బౌలర్లు.. భారీ స్కోర్ సాధించిన శ్రీలంక -
విఫలమైన భారత బౌలర్లు.. భారీ స్కోర్ సాధించిన శ్రీలంక
కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో భారత బౌలర్లు తేలిపోయారు. తొలి రోజు ఆటముగిసే సమయానికి లంక జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆతిథ్య జట్టు వికెట్లు పడగొట్టేందుకు టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు నిశాన్ మధుష్క(66), రవిందు రసంత(71) అద్భుతమైన ఆరంభాన్ని వచ్చారు.వారిద్దరూ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. తొలి వికెట్కు ఏకంగా 110 పరుగుల భాగస్వామ్య నెలకొల్పి ఇండియన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే సమన్వయ లోపం కారణంగా మధుష్క రనౌట్ కావడంతో భారత్కు తొలి వికెట్ దక్కింది. నిశాన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా కూడా రాణించాడు. అయితే రసంత, సూరియబండారా(35)లను వరుస ఓవర్లలో ఔట్ చేసి భారత్ కాస్త కమ్బ్యాక్ ఇచ్చినట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన పవన్ రాత్నాయకే(39), అహన్ విక్రమసింఘే(31), కెప్టెన్ సోనల్ దినుష(52), రమేష్ మెండిస్(32) నిలకడగా ఆడి జట్టు స్కోర్ 350 పరుగుల మార్క్ను దాటించారు. ప్రస్తుతం క్రీజులో కేశర నువాంత(9), సుదీరా(1) ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు గుర్నూర్ బ్రార్ఘ ఓ వికెట్ తీశాడు. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ 13 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. -
అభిషేక్ బచ్చన్ టీమ్లోకి అజింక్య రహానే
టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే తన కెరీర్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దమయ్యాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రహానే మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్-2026లో ఆడేందుకు అమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ జట్టుతో అజింక్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం నేడు అధికారికంగా వెల్లడించింది.ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ అతడిని తమ కీలక ఆటగాడిగా ఎంపిక చేసింది. కాగా ఈ లీగ్ తొలి సీజన్ ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. ఇందులో గ్లాస్గో, అమ్స్టర్డామ్, ఎడిన్బర్గ్, డబ్లిన్, బెల్ఫాస్ట్, రోటర్డామ్ నగరాలకు చెందిన ఆరు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.అమ్స్టర్డామ్ ఫ్రాంచైజీ యాజమానులగా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా, ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్లు ఉన్నారు. కాగా 38 ఏళ్ల రహానేకు టీ20ల్లో ఆటగాడిగా, కెప్టెన్గా అపారమైన అనుభవం ఉంది. అతడు ఐపీఎల్లో 212 మ్యాచ్లు ఆడి 5,367 పరుగులు సాధించాడు. ఐపీఎల్-2023 సీజన్ ఛాంపియన్గా నిలిచిన జట్టులో రహానే సభ్యుడిగా ఉన్నాడు. 2025, 2026 సీజన్లలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు కెప్టెన్గా అజింక్య వ్యవహరించాడు.చదవండి: పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. స్టార్ ఆల్రౌండర్పై 2 ఏళ్ల బ్యాన్ -
పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. స్టార్ ఆల్రౌండర్పై 2 ఏళ్ల బ్యాన్
పాకిస్తాన్ యువ ఆల్రౌండర్ హంజా నజర్కు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించినందుకు గాను నజర్పై రెండేళ్ల నిషేధాన్ని పీసీబీ విధించింది. అంతేకాకుండా 1 మిలియన్ పాకిస్తానీ రూపాయల జరిమానా చెల్లించాలని కూడా బోర్డు ఆదేశించింది. నజర్ సమర్పించిన సమాచారంపై విచారణ జరిపేందుకు పీసీబీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందు హాజరైన హంజా తన వివరణ ఇచ్చినా, నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో పాక్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండేళ్ల కాలంలో హంజా నజర్ ఎలాంటి క్రికెట్ టోర్నీల్లో కూడా భాగం కాకూడదు. కాగా 31 ఏళ్ల హంజా ఇంకా పాక్ జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేయలేదు. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనకు అతడు పాక్ తరపున వెళ్లాల్సి ఉండేది. కానీ ఈ వీసా వివాదం కారణంగానే అతడిని సెలక్టర్లు పక్కన పెట్టారు. సియాల్కోట్కు చెందిన హంజా నజర్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. క్వాయిడ్-ఎ-ఆజమ్ ట్రోఫీ 2025లో 245 పరుగులు చేయడంతో పాటు 18 వికెట్లు తీసి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. రెడ్బాల్ క్రికెట్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్గా 175గా ఉంది. అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికి పీసీబీ నిబంధనలను ఉల్లఘించించడం వల్ల హంజా కెరీర్లో సందిగ్ధంలో పడింది.చదవండి: IND vs SL: టీమిండియాతో టెస్టు సిరీస్.. శ్రీలంకకు డబుల్ షాక్!? -
టీమిండియాతో టెస్టు సిరీస్.. శ్రీలంకకు డబుల్ షాక్!?
టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు శ్రీలంకకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ తొడ కండరాల గాయం కారణంగా భారత్తో టెస్టు సిరీస్ నుంచి వైదొలగే పరిస్థితి ఏర్పడగా.. తాజాగా ఈ జాబితాలో మరో యువ బ్యాటర్ చేరాడు.ఓపెనర్ పాథుమ్ నిస్సాంక మణికట్టు గాయం కారణంగా ఆగస్టు 15న ప్రారంభం కానున్న తొలి టెస్ట్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. నిస్సాంక దీర్ఘకాలంగా వేధిస్తున్న మణికట్టుసమస్యను పరిష్కరించుకోవడానికి గత నెలలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు.ఈ క్రమంలోనే అతడు లంక ప్రీమియర్ లీగ్-2026కు దూరమయ్యాడు. అయితే భారత్తో టెస్టు సిరీస్ సమయానికి నిస్సాంక కోలుకుంటాడని లంక సెలక్టర్లు భావించారు. కానీ అతడి పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనుంది. దీంతో తొలి టెస్టు కోసం జట్టు సెలక్షన్కు అతడు అందుబాటులో లేడు.మరోసారి అతడికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో నిస్సాంక ఉత్తీర్ణుడైతే రెండో టెస్టులో ఆడే అవకాశముంది. ఇక వీరిద్దరి స్ధానాలని భర్తీ చేసేందుకు నిషాన్ మధుష్క, పసిందు సూరియబండార, అంజలా బండార వంటి యువ ఆటగాళ్ల పేర్లను సెలక్టర్లు పరిశీలిస్తున్నారు.కొలంబో వేదికగా భారత్తో జరుగుతున్న వార్మాప్ మ్యాచ్లో నిషాన్ మధుష్క, రవిందు రసంత హాఫ్ సెంచరీలతో మెరిశారు. మధుష్కకు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. దాదాపుగా అతడినే నిస్సాంక స్ధానంలో జట్టులోకి తీసుకోవచ్చు. ఈ సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించలేదు.చదవండి: అతడికి అసలైన పరీక్ష ఇక్కడే: శ్రీలంక మాజీ క్రికెటర్ వార్నింగ్ -
అతడికి అసలైన పరీక్ష ఇక్కడే: శ్రీలంక మాజీ క్రికెటర్
శ్రీలంక మాజీ క్రికెటర్ హషాన్ తిలకరత్నె టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్పై ప్రశంసలు కురిపించాడు. గిల్ బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతమని కొనియాడాడు. అయితే, శ్రీలంక గడ్డపై మాత్రం అతడికి కఠిన సవాలు తప్పదని పేర్కొన్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. 2017 తర్వాత లంక గడ్డ మీద భారత్ టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో శుబ్మన్ గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆరు శతకాలుటెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొమ్మిది మ్యాచ్లలో కలిపి ఏకంగా ఆరు శతకాలు బాదాడు. సగటు 82కు పైగా ఉండటం విశేషం. ఇంగ్లండ్లో అత్యుత్తమంగా రాణించాడు.అయితే, శ్రీలంకలో గిల్ రెడ్బాల్ మ్యాచ్ ఆడటం మాత్రం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో లంక మాజీ బ్యాటర్ హషాన్ తిలకరత్నె రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘గిల్ బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడే అసలైన పరీక్షబ్యాటింగ్ పిచ్ల మీద అందమైన షాట్లు ఆడటం అతడికే చెల్లింది. అయితే, శ్రీలంకలో టర్నింగ్ పిచ్ల మీద అతడు ఎలా ఆడతాడన్నదే ఇప్పుడు ఆసక్తికర విషయం. ఈ సిరీస్ అతడికి నిజమైన పరీక్ష. ఇక్కడ అతడికి కఠిన సవాలు ఎదురవుతుంది. శ్రీలంక వికెట్ల మీద గిల్ ఎలా ఆడతాడో చూద్దాం’’ అని పేర్కొన్నాడు.కాగా శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి వేలికి గాయమైంది. ఇందుకు సంబందించి బీసీసీఐ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక గాయం కారణంగా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం మొదలైన మూడు రోజుల వార్మప్ మ్యాచ్కు గిల్ దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో సీనియర్ బ్యాటర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. కాగా భారత్-శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు.చదవండి: భారత్ తోమ్యాచ్.. వన్డే తరహాలో లంక ఓపెనర్ దూకుడు -
టీమిండియా వైపు దూసుకొస్తున్న నయా పేస్ గుర్రం.. ఎవరంటే?
టీమిండియా వైపు మరో పేస్ సంచలనం దూసుకొస్తున్నాడు. గంటకు 145 కి.మీ వేగానికి పైగా బంతులు విసిరి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్లో భారత తరపున అదరగొట్టిన ఈ యువ పేసర్.. ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్లోనూ సత్తాచాటాడు.అతడే 18 ఏళ్ల స్పీడ్స్టర్ దీపేష్ దేవేంద్రన్. దీపేష్ బుధవారం తిరుచ్చి గ్రాండ్ చోళాస్తో జరిగిన మ్యాచ్లో మధురై పాంథర్స్ తరపున టీఎన్పీఎల్ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లోనే దేవేంద్రన్ అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. తన 4 ఓవర్ల కోటాలో 25 పరుగలిచ్చి 1 వికెట్ పడగొట్టాడు.ఈ రైట్ ఆర్మ్ పేసర్ వికెట్లు ఎక్కువగా తీయకపోయినప్పటికి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 16వ ఓవర్ మొదటి బంతిని ఏకంగా 146 కి.మీ/గం వేగంతో విసిరి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. అదే ఓవర్లో మరో మూడు సార్లు 140 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బంతులు విసురుతూ, కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడి బౌలింగ్కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు అతడు కచ్చితంగా భారత సీనియర్ జట్టులోకి వస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే అతడి టీమ్మేట్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.కాగా గత కొంత కాలంగా దీపేష్ వైట్బాల్ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఆసియాకప్-2025 ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటికి.. దీపేష్ టోర్నీ అసాంతం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కేవలం 5 మ్యాచ్ల్లోనే 14 వికెట్లు తీసి టోర్నీలోనే అత్యుత్తమ బౌలర్గా నిలిచాడు. ఆ తర్వాత ఆసీస్ గడ్డపై జరిగిన యూత్ టెస్టు సిరీస్లోనూ అతడు అదరగొట్టాడు.బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో 5 వికెట్ల హాల్ సాధించాడు. మొత్తంగా రెండు మ్యాచ్లు కలిసి దీపేష్ పది వికెట్లు పడగొట్టాడు. వినూ మన్కడ్ ట్రోఫీలోనూ తమిళనాడు తరఫున అతడు సత్తాచాటాడు. ఇక అండర్ 19 ప్రపంచకప్-2026ను భారత్ సొంతం చేసుకోవడంలో దీపేష్ది కీలక పాత్ర. సెమీస్, ఫైనల్లో కలిపి అతడు నాలుగు వికెట్లు పడగొట్టాడు.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. వన్డే మాదిరి లంక బ్యాటర్ల విధ్వంసం -
భారత్తో మ్యాచ్.. వన్డే మాదిరి లంక బ్యాటర్ల విధ్వంసం
టీమిండియాతో ప్రాక్టీస్ మ్యాచ్లో శ్రీలంక ఎలెవన్ ఓపెనర్ నిశాన్ మధుష్క దుమ్ములేపాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి వన్డే మాదిరి బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 52 బంతుల్లోనే నిశాన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.కాగా రెండు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. కొలంబో వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.రనౌట్ కావడంతో....ఓపెనర్ నిశాన్ మధుష్క భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న అతడు పదకొండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 66 పరుగులు చేశాడు. అతడిని అవుట్ చేసేందుకు భారత పేసర్లు, స్పిన్నర్లు ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.అయితే, 21వ ఓవర్లో మానవ్ సుతార్ వేసిన బంతిని ఎదుర్కొని పరుగు తీసే క్రమంలో రవిందు రశాంతతో సమన్వయ లోపం కారణంగా.. నిశాన్ రనౌట్ అయ్యాడు. దీంతో ఎట్టకేలకు భారత్కు ఒక వికెట్ దక్కింది. ఇక మరో ఓపెనర్ రవిందు కూడా నిలకడగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 82 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.తొలి వికెట్కు ఏకంగా 110 పరుగుల భాగస్వామ్యంనిశాన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా కూడా నిలకడగానే ఆడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో భోజన విరామ సమయానికి శ్రీలంక ఎలెవన్ జట్టు 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 138 పరుగులు సాధించింది. రవిందు 50, పసిందు 16 పరుగులతో క్రీజులో నిలిచారు. నిశాన్- రవిందు కలిసి తొలి వికెట్కు ఏకంగా 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.భారత బౌలర్లు విఫలంభారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, రవీంద్ర జడేజా, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్.. ఇలా ఒక్కరు కూడా ప్రభావం చూపలేకపోయారు. బ్రార్ నాలుగు ఓవర్లలోనే అత్యధికంగా 25 పరుగులు సమర్పించుకోగా.. సుతార్, సిరాజ్ 5 ఓవర్ల బౌలింగ్లో కేవలం 14 పరుగులే ఇచ్చి పొదుపు పాటించారు. జడ్డూ 5 ఓవర్లలో 29, కుల్దీప్ 5 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చుకున్నారు. ప్రసిద్ 5 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: టీమిండియా-శ్రీలంక ఎలెవన్ మ్యాచ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్ -
పాతికేళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
ఇంగ్లండ్ క్రికెటర్ జాన్ టర్నర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. పాతికేళ్ల వయసులోనే ఆటకు రిటైర్మెంట్కు ప్రకటించాడు. సౌతాఫ్రికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న జాన్ టర్నర్.. ఆ తర్వాత ఇంగ్లండ్కు మకాం మార్చాడు.ఈ క్రమంలో 2021లో హాంప్షైర్ జట్టులో చేరిన జాన్ టర్నర్ (John Turner).. దేశీ క్రికెట్లో సత్తా చాటాడు. ది హండ్రెడ్ కాంపిటిషన్లోనూ రాణించిన ఈ రైటార్మ్ పేస్ బౌలర్.. 2024లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.గాయాల బెడదఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో రెండు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్లు ఆడిన టర్నర్.. వన్డేల్లో రెండు, టీ20 ఫార్మాట్లో ఒక వికెట్ పడగొట్టాడు. చివరగా 2024లో ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. తరచూ గాయాల బారిన పడుతున్నాడు. గతేడాది దేశీ క్రికెట్లో కేవలం మూడు మ్యాచ్లే ఆడాడు.అనంతరం వెన్నునొప్పి ఎక్కువ కావడంతో టర్నర్ ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలనేది నా కల. హాంప్షైర్కు ప్రాతినిథ్యం వహించాలనే కోరికా పూర్తిగా తీరలేదు. అయితే, భారమైన హృదయంతో రిటైర్ అవ్వాలనే నేను నిర్ణయించుకున్నాను.అందుకే ఈ కఠిన నిర్ణయంనా జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం ఇదే. వెన్నునొప్పి వల్ల గతేడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్నాను. ఈ గాయం మానడం లేదు. క్రికెటర్గా, వ్యక్తిగా నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని జాన్ టర్నర్ పేర్కొన్నాడు.కాగా టర్నర్ చిన్న వయసులోనే రిటైర్ కావడం పట్ల హాంప్షైర్ క్రికెట్ డైరెక్టర్ గిల్స్ వైట్ విచారం వ్యక్తం చేశాడు. ప్రతిభావంతుడైన ఆటగాడి సేవలు తాము కోల్పోయామని.. ఏదేమైనా అతడి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 10 మ్యాచ్లు ఆడిన టర్నర్ 25 వికెట్లు కూల్చాడు.ఆ రంగంలో కెరీర్?ఇక లిస్ట్-ఎ క్రికెట్లో 37 వికెట్లు పడగొట్టిన టర్నర్.. ది హండ్రెడ్-2024 సీజన్లో పది మ్యాచ్లు ఆడి ఐదు వికెట్లు తీశాడు. కాగా జాన్ టర్నర్ ఎకానమిక్స్, ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ చేశాడు. ఆటకు వీడ్కోలు చెప్పిన అతడు ఫైనాన్స్ రంగలో కెరీర్ నిర్మించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: శ్రీలంకతో మ్యాచ్.. గిల్ బదులు కెప్టెన్గా కేఎల్ రాహుల్ -
అతడి సెలక్షన్ దారుణం.. ఇప్పటికైనా సంతోషమే!
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ విషయంలో సెలక్టర్ల తీరు సరిగా లేదని విమర్శించాడు. కాగా రంజీ ట్రోఫీ టోర్నీలో గత రెండేళ్లుగా ఆకిబ్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.గత రెండు సీజన్లలో ఏకంగా వందకు పైగా వికెట్లు తీసిన ఆకిబ్ నబీ.. జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్తో స్వదేశంలో ఇటీవల జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు.అపుడు మొండిచేయికానీ టీమిండియా సెలక్టర్లు మాత్రం నబీకి మొండిచేయి చూపారు. సీనియర్ల గైర్హాజరీలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. అయితే, వీళ్లిద్దరికి ఈ మ్యాచ్లో ఆడే అవకాశం రాకపోయినా.. ఆ తర్వాత ఇద్దరూ వైట్బాల్ క్రికెట్లో అరంగేట్రం చేశారు.ఇదిలా ఉంటే.. శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన జట్టులోనూ ఆకిబ్ నబీకి తొలుత స్థానం దక్కలేదు. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఎట్టకేలకు నబీకి సెలక్టర్లు పిలుపునిచ్చారు. బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీని ఎంపిక చేశారు.అతడి సెలక్షన్ దారుణం.. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ నబీ విషయంలో సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. ‘‘నిజంగా ఇదొక గొప్ప విషయం. నాకు చాలా సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడిన తర్వాత ఎట్టకేలకు ఆకిబ్ నబీకి జాతీయ జట్టులో చోటు దక్కింది.ఇప్పటికైనా సంతోషమే!అయితే, అతడు రీప్లేస్మెంట్లా కాకుండా ముందుగానే జట్టులోకి రావాల్సింది. అయినా ఎప్పటికీ ఎంపిక చేయకపోవడం కంటే.. ఆలస్యంగానైనా పిలుపునివ్వడం మంచిదే. ఏదేమైనా శ్రీలంకకు ఎంపిక చేసిన జట్టులో ప్రధాన ఆటగాడిగా ఉండేందుకు అతడు అర్హుడు. కానీ ఆలస్యమైనా అతడికి మంచే జరిగింది’’ అని వసీం జాఫర్ పేర్కొన్నాడు.కాగా నబీ ఇటీవల శ్రీలంక-ఎ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్లో భారత్-ఎ తరఫున ఆరు వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె, కొలంబో వేదికలు.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
గిల్కు గాయం.. బీసీసీఐ అధికారిక ప్రకటన
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక అప్డేట్ అందించింది. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. కాగా గిల్ ఇటీవల తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా కండరాల నొప్పితో గిల్ ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న గిల్.. శ్రీలంకతో టెస్టు సిరీస్కు సిద్ధమయ్యాడు. అతడి సారథ్యంలో టీమిండియా లంకతో రెండు మ్యాచ్లు ఆడనుంది.ఫైనల్ రేసులో ఉండాలంటే గాలె, కొలంబో వేదికలుగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్ ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ ఈ సిరీస్లో ఆతిథ్య శ్రీలంకను 2-0తో వైట్వాష్ చేయాల్సిందే.గిల్కు గాయంకాగా టీమిండియా శ్రీలంక గడ్డ మీద చివరగా 2017లో టెస్టు సిరీస్ ఆడింది. ఈ నేపథ్యంలో స్థానిక పిచ్ పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో టీమిండియా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. అయితే, గురువారం నెట్స్లో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ కుడిచేతి వేలికి గాయమైంది.ఈ క్రమంలో టీమ్ డాక్టర్ వచ్చి పరిశీలించి బాండ్ఎయిడ్ వేయగా.. గిల్ తిరిగి బ్యాటింగ్ చేశాడు. అయితే, శ్రీలంక ఎలెవన్తో టాస్ సందర్భంగా గిల్ మైదానంలోకి రాలేదు. అతడికి బదులు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్కు వచ్చాడు.బీసీసీఐ అధికారిక ప్రకటనఈ నేపథ్యంలో బీసీసీఐ గిల్ గాయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయపడ్డాడు. గురువారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి ఉంగరం వేలుకు గాయమైంది.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్తో వామప్ మ్యాచ్లో తొలిరోజు గిల్ మైదానంలోకి రాడు. బీసీసీఐ వైద్యబృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. గిల్ గైర్హాజరీలో ఈ మ్యాచ్లో కేఎల్ జట్టును ముందుకు నడిపిస్తాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
IND vs SL: టాస్ గెలిచిన శ్రీలంక.. భారత కెప్టెన్గా కేఎల్ రాహుల్
శ్రీలంకతో టెస్టు సిరీస్కు టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి శ్రీలంక ఎలెవన్ జట్టుతో మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. కొలంబోలోని నాండెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ ఇందుకు వేదిక. ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన శ్రీలంక ఎలెవన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది.గిల్కు గాయం.. సారథిగా రాహుల్ఇదిలా ఉంటే.. టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్కు బదులు.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చాడు. నెట్స్లో గురువారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గిల్ కుడిచేతి వేలికి గాయమైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో శ్రీలంక ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్లో శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో గిల్కు విశ్రాంతినిచ్చారు. ఇందుకు సంబంధించి బీసీసీఐ అధికారిక అప్డేట్ అందించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గిల్ తొలి రోజు వామప్ మ్యాచ్కు అందుబాటులో ఉండడని తెలిపింది. భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.శ్రీలంక ఎలెవన్ జట్టునిశాన్ మధుష్క (వికెట్ కీపర్), నిపుణ్ ధనంజయ, రవిందు రశాంత, పవన్ రత్ననాయకె, అహాన్ విక్రమసింఘే, సోనాల్ దినుష (కెప్టెన్), రమేశ్ మెండిస్, దిలుమ్ సుదీర, విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, పసిందు సూరియబండారా, ఇసిత విజేసుందెర, అసంక మనోజ్, అంజలా బండారా, కేశరా నువాంత.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
వచ్చాడు.. సిక్సర్లతో గెలిపించాడు!
‘ది హండ్రెడ్ మెన్స్ కాంపిటిషన్’-2026 ఎడిషన్లో లండన్ స్పిరిట్ ప్రయాణం ముగిసిపోయింది. ఎంఐ లండన్తో కీలక మ్యాచ్లో లివింగ్స్టోన్ బృందం తేలిపోయింది. ప్రత్యర్థి జట్టు చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.160 పరుగులులండన్లోని లార్డ్స్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఎంఐ లండన్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన లండన్ స్పిరిట్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో ఐదు వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది.ఓపెనర్లలో లువాన్ డ్రి ప్రిటోరియస్ మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 52) సాధించగా.. జానీ బెయిర్ స్టో (13) విఫలమయ్యాడు. వన్డౌన్లో వచ్చిన లండన్ స్పిరిట్ కెప్టెన్ లియామ్ లివింగ్స్టోన్ (6), డెవాల్డ్ బ్రెవిస్ (4) కూడా తేలిపోయారు.మిగిలిన వారిలో డేవిడ్ విల్లే (18 బంతుల్లో 31), జేమ్స్ కోల్స్ (23 బంతుల్లో 30 నాటౌట్), జేమీ ఓవర్టన్ (6 బంతుల్లో 13 నాటౌట్) వేగంగా ఆడటంతో ఈ స్కోరు సాధ్యమైంది. ఎంఐ లండన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, నాథన్ సోటర్ రెండేసి వికెట్లు కూల్చగా.. రిచర్ట్ గ్లీసన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఓపెనర్లు విఫలమైనాలండన్ స్పిరిట్ విధించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎంఐ లండన్ ఆదిలో తడబడింది. ఓపెనర్లు విల్ జాక్స్ (18), జేమ్స్ విన్స్ (15) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అయితే, వన్డౌన్లో వచ్చిన నికోలస్ పూరన్, కెప్టెన్ సామ్ కర్రాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.రజా మెరుపులునికోలస్ 25 బంతుల్లో 39, సామ్ 23 బంతుల్లో 33 పరుగులతో రాణించారు. వీరికి తోడుగా సికిందర్ రజా దుమ్ములేపాడు. కేవలం 16 బంతుల్లోనే నాలుగు సిక్సర్ల సాయంతో 32 పరుగులు రాబట్టాడు. మిగిలిన వారిలో షెర్ఫానే రూథర్ఫర్డ్ (4) విఫలం కాగా.. టామ్ కర్రాన్ 8, ఓలీ పోప్ 5 పరుగులతో అజేయంగా నిలిచి ఎంఐ లండన్ విజయాన్ని ఖరారు చేశారు.Welcome to the Hundred @SRazaB24 🔥#MILondon 💙💚 pic.twitter.com/8DpJc4IMQ7— MI London (@MILondonCricket) August 6, 2026మొత్తానికి సామ్ కర్రాన్ బృందం 94 బంతుల్లో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక లండన్ స్పిరిట్కు ఆరింట ఇది ఐదో ఓటమి. దీంతో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిపోయింది.రషీద్ ఖాన్ స్థానంలోజింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ సికిందర్ రజా ఎంఐ లండన్ జట్టులో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇందుకు సంబంధించి ఫ్రాంఛైజీ ఆగష్టు 5న ప్రకటన విడుదల చేసింది.రషీద్ ఖాన్ ఐర్లాండ్తో సిరీస్ సందర్భంగా అఫ్గాన్ తరఫున విధుల్లోకి వెళ్లగా.. సికిందర్ రజాకు ఈ మేరకు బంపరాఫర్ వచ్చింది. ఇక వచ్చీరాగానే లండన్ స్పిరిట్తో మ్యాచ్లో రజా అదరగొట్టాడు. మెరుపు ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు రజా. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఎంఐ లండన్కు ఆరింట ఇది నాలుగో విజయం. తద్వారా 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్
టీమిండియా కీలక సిరీస్కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సీజన్లో భాగంగా శ్రీలంకతో రెండు మ్యాచ్లు ఆడనుంది. అయితే, అంతకంటే ముందు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీలంక ఎలెవన్తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా ఆతిథ్య శ్రీలంకను 2-0 తేడాతో వైట్వాష్ చేయాల్సిందే. ఇక ఈ సిరీస్ కంటే ముందు డబ్ల్యూటీసీలో భాగంగా సౌతాఫ్రికాతో స్వదేశంలో రెండు టెస్టులు ఆడిన గిల్ సేన.. ప్రొటిస్ జట్టు చేతిలో దాదాపు పాతికేళ్ల తర్వాత 2-0తో క్లీన్స్వీప్ అయిన సంగతి తెలిసిందే.దీంతో హెడ్కోచ్ గౌతం గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇటీవల గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా వరుస టీ20 సిరీస్లలో వైట్వాష్లు ఎదుర్కొంది. ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్కు శ్రీలంక టెస్టు సిరీస్ అగ్నిపరీక్షగా నిలిచింది.ఈ నేపథ్యంలో శ్రీలంక గడ్డపై ప్రాక్టీస్ మ్యాచ్కు ముందు రోజు గంభీర్ జట్టు సభ్యులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లంతా పూర్తి స్థాయి సామర్థ్యంలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలని, తమ బాధ్యత ఏమిటో అందరూ గుర్తించాలని వారికి సూచించాడు.‘మన ఎదురుగా ఎలాంటి లక్ష్యం ఉందో, ఎందుకు ఆడుతున్నామో అందరికీ తెలుసు. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగల సత్తా మనకు ఉంది. ఆగస్టు 15 ఉదయం ముందుగా బ్యాటింగ్ చేసినా, ముందుగా బౌలింగ్ చేసినా మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. మనపైకి సంధించే ప్రతీ ప్రశ్నకు మన వద్ద సమాధానం ఉండాలి. ఇక కొత్తగా జట్టులోకి వచ్చి న సారాంశ్ జైన్, ఆకిబ్ నబీలకు నా అభినందనలు. ఈ స్థాయి వరకు వచ్చేందుకు ఎంతో శ్రమించిన మీరు మీ కుటుంబ సభ్యులు, దేశం గర్వించేలా ఆడాలి’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా 33 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్, జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ శ్రీలంకతో టెస్టుల సందర్భంగా తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సారాంశ్, జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీ జట్టులోకి వచ్చారు. -
IND vs SL: స్పిన్ ప్రాక్టీస్పై దృష్టి
కొలంబో: సొంతగడ్డపై భారత జట్టు ఇటీవల రెండు టెస్టు సిరీస్లు కోల్పోయింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిన ఈ సిరీస్లలో అనూహ్యంగా ప్రత్యర్థి స్పిన్నర్లు మనపై ఆధిపత్యం ప్రదర్శించారు. స్పిన్ బౌలింగ్ను ఆడటంలో తిరుగులేని రికార్డు ఉన్న టీమిండియా కూడా పూర్తిగా తడబడింది. ఇప్పుడు శ్రీలంకతో భారత్కు అదే తరహా సవాల్ ఎదురు కావచ్చు. లంక జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో పాటు సొంతగడ్డపై వారి బలం రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్కు ముందు స్పిన్లో మరింత సాధన అవసరమని జట్టు భావిస్తోంది. అందుకే నేటి నుంచి జరిగే వామప్ మ్యాచ్లో స్పిన్ను ఎదుర్కోవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ మూడు రోజుల పోరులో శ్రీలంక క్రికెట్ (ఎస్ఎస్సీ) ఎలెవన్లో భారత్ తలపడుతుంది. స్థానిక ఎన్సీసీ గ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్ శ్రీలంకలోని పరిస్థితులపై అలవాటు పడేందుకు కూడా ఉపయోగపడనుంది. భారత్ చివరిసారిగా 2017లో శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడింది. నాటి జట్టులో ఉన్న కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మాత్రమే ఇప్పుడు మళ్లీ ఆడుతున్నారు. మిగతా వారందరికీ లంకలో టెస్టు ఆడటం ఇదే మొదటిసారి కానుంది. వామప్ పోరులో భారత బ్యాటర్లంతా బరిలోకి దిగే అవకాశం ఉంది. బౌలింగ్లో ప్రధాన పేసర్ సిరాజ్తో పాటు ప్రసిధ్, గుర్నూర్, ఆకిబ్ నబీ ఉన్నారు. కొత్త స్పిన్నర్లు సుతార్, సారాంశ్లకు తమ స్పిన్ బలాన్ని ప్రదర్శించేందుకు ఇది మంచి అవకాశం. ఇటీవల భారత ‘ఎ’ జట్టు తరఫున బ్రార్, సారాంశ్ మెరుగైన ప్రదర్శన కనబర్చడం సానుకూలాంశం. మరోవైపు శ్రీలంక తరఫున 3 టెస్టులు ఆడిన సొనాల్ దినుష ఎస్ఎల్సీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. ఇషిత విజేసుందర్, రమేశ్ మెండిస్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. -
రూట్ సారథ్యంలో...
లండన్: రెండేళ్ల విరామం అనంతరం డాన్ లారెన్స్ ఇంగ్లండ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నెల 19 నుంచి పాకిస్తాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ గురువారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం తిరిగి జో రూట్ సారథిగా ఎంపిక కాగా... గాయం కారణంగా జాకబ్ బెథెల్ ఈ సిరీస్కు దూరమయ్యాడు. 2024లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన లారెన్స్... బ్యాటింగ్ ఆర్డర్లో స్టోక్స్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఆఫ్స్పిన్ వేయగలగడం లారెన్స్కు అదనపు బలం.బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో ఇటీవల ఇంగ్లండ్ హెడ్కోచ్గా ఎంపికైన స్టీఫెన్ ఫ్లెమింగ్ గైర్హాజరీలో ట్రెస్కోథిక్ జట్టుకు తాత్కాలిక కోచ్గా వ్యవహరించనున్నాడు. గత తొమ్మిది టెస్టుల్లో ఏడింట ఓడిన ఇంగ్లండ్... 2024 డిసెంబర్ తర్వాత టెస్టు సిరీస్ గెలవలేదు. ఇంగ్లండ్ జట్టు: రూట్ (కెప్టెన్), ఆర్చర్, అట్కిన్సన్, బషీర్, బ్రూక్, కార్స్, సామ్ కుక్, కాక్స్, డకెట్, ఫిషెర్, ఎమిలియో, లారెన్స్, పోప్, రాబిన్సన్, జేమీ స్మిత్, టంగ్. -
భారత్-పాక్ సమరానికి డేట్ ఫిక్స్
మహిళల ఆసియా కప్ 2026లో భారత్-పాకిస్తాన్ క్రికెట్ సమరం ఖరారైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 5న ఇరు జట్లు తలపడనున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ గురువారం ఈ టోర్నీ పూర్తి షెడ్యూల్ను ప్రకటించింది.ఆగస్టు 28న టోర్నీ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్లో థాయ్లాండ్-హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈసారి టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి.భారత్, పాక్ ఒకే గ్రూప్లోభారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్-Aలో ఉన్నాయి. వీటితో పాటు థాయ్లాండ్, హాంకాంగ్, చైనా కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఇండోనేషియా జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 13న ఫైనల్ జరగనుంది.దుబాయ్లోనే అన్ని మ్యాచ్లుఈసారి మొత్తం మ్యాచ్లను దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే నిర్వహించనున్నారు. అన్ని మ్యాచ్లు ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగనున్నాయి.ఇది టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఆరో మహిళల ఆసియా కప్. భారత్-పాక్ మ్యాచ్ టోర్నీలోనే అత్యంత ఆసక్తికరమైన పోరుగా నిలవనుంది. -
‘మీ పిల్లాడి క్రమశిక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దు’
క్రికెట్ ప్రపంచంలోకి దూసుకువచ్చిన నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ. పద్నాలుగేళ్ల వయసులోనే ఫార్మాట్లకు అతీతంగా అదరగొట్టాడు. భారత్ అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. వరల్డ్కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన వైభవ్.. ఈ ఏడాది అత్యధిక పరుగుల వీరుడిగా ఏకంగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో పదిహేనేళ్ల వయసులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ గడ్డపైతద్వారా అత్యంత చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్గా దిగ్గజ సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఇంగ్లండ్ గడ్డపై తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన వైభవ్ సూర్యవంశీ.. వరుసగా మూడు మ్యాచ్లలో (13,15,14) విఫలమయ్యాడు. అయితే, జింబాబ్వేతో టీ20 సిరీస్లో మాత్రం రెండు అర్ధ శతకాలతో రాణించాడు. టీమిండియా జింబాబ్వేను 3-0తో క్లీన్స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్.వైభవ్ కుటుంబానికి కీలక సూచనలుఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రపంచ క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అతడి ఆట గురించే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే వైభవ్ సూర్యవంశీ కుటుంబానికి కీలక సూచనలు చేశాడు.ఇంగ్లండ్ మాజీ స్టార్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్, డేవిడ్ లాయిడ్, ఫిల్ టఫ్నిల్తో కలిసి ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సమయంలోనే వైభవ్కు సరైన మార్గదర్శనం అవసరం. అతడి కుటుంబం మాత్రమే ఇది చేయగలదు.ప్రస్తుతం అతడికి ఏది అత్యంత ముఖ్యమో అతడి కుటుంబమే చెప్పాలి. అతడి కోసం షెడ్యూల్, ప్రణాళికలను రచించాలి. ముఖ్యంగా చిన్న వయసులోనే వచ్చిన కీర్తిప్రతిష్టలు చూసి అతడు పక్కదారి పట్టకుండా కాపాడుకోవాలి.క్రమశిక్షణ ముఖ్యంజట్టుతో పాటు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్నో కొత్త పరిచయాలు అవుతాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అతడికి చెప్పాలి. కుటుంబమే అతడి బలం. వచ్చే ఐదు, పదేళ్లలో వైభవ్ను వారెంత క్రమశిక్షణగా ఉంచుతారో అదే అతడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది’’ అని రహానే పేర్కొన్నాడు. కాగా వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలకు అతడితో పాటు తల్లిదండ్రులను కూడా అనుమతించింది. వైభవ్ వయసు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. చదవండి: ధోని గది తలుపు ఒక్కసారి మూతపడితే అంతే ఇక! -
టీమిండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్
శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియాకు తొలి సవాలుకే వాతావరణం అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా, రేపటి నుంచి (ఆగస్టు 7) కొలంబోలో శ్రీలంక ‘ఏ’తో భారత్ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.తొలి రోజు ఏకంగా 97 శాతం వర్షావకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఆకాశం 99 శాతం మేఘావృతమై ఉంటుందని అంచనా. ఉష్ణోగ్రత సుమారు 30 డిగ్రీలుగా ఉండనుంది.రెండో రోజు పరిస్థితి మరింత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 8న వర్షం పడే అవకాశం 99 శాతంగా ఉండటంతో పాటు 89 శాతం మేఘావృత వాతావరణం ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి.మూడో రోజు కూడా వర్షం ముప్పు తప్పేలా లేదు. ఆగస్టు 9న వర్షం పడే అవకాశం 91 శాతంగా, మేఘావృతం 95 శాతంగా ఉండొచ్చని అంచనా.టీమిండియా ప్రాక్టీస్కు కీలక మ్యాచ్శ్రీలంకలో టెస్టు సిరీస్కు ముందు భారత ఆటగాళ్లకు ఈ వార్మప్ మ్యాచ్ చాలా కీలకం. ముఖ్యంగా శ్రీలంకలోని నెమ్మదైన, స్పిన్కు అనుకూలించే పిచ్లపై బ్యాటర్లు, బౌలర్లు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం.కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మినహా ప్రస్తుత భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు శ్రీలంక గడ్డపై టెస్టు అనుభవం తక్కువ. సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లకు స్థానిక పరిస్థితులపై కొంత అనుభవం ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి టెస్టు సిరీస్ అనుభవం లేదు.వార్మప్ రద్దయితే ఇబ్బందే!మూడు రోజులూ వర్షం ముప్పు అధికంగా ఉండటంతో వార్మప్ మ్యాచ్ పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ పూర్తిగా రద్దయితే శ్రీలంక పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లకు మరో అవకాశం ఉండదు.గతంలోనూ వర్షం కారణంగా ప్రాక్టీస్ మ్యాచ్లు రద్దై, విదేశీ పర్యటనల్లో టీమిండియా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొలంబోలోనూ అదే పరిస్థితి ఎదురైతే, ఆగస్టు 15న గాలేలో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు భారత్కు ఇది ఎదురుదెబ్బగా మారొచ్చు. -
‘ఒక్కసారి తలుపు మూతపడితే.. ఎవరినీ రానివ్వడు’
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెప్టెన్గా టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత అతడిది. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013లను భారత్ కైవసం చేసుకుంది.ఇక ఐపీఎల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ను ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు ధోని. కాగా ధోనికి మిస్టర్ కూల్ అన్న ‘బిరుదు’ ఉన్న ఉన్న సంగతి తెలిసిందే. మైదానంలో ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహనం కోల్పోకుండా వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట.అదే విధంగా ఆటగాళ్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మార్గనిర్దేశనం చేస్తాడనే పేరు అతడికి ఉంది. టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన అజింక్య రహానే సైతం ఇదే మాట అంటున్నాడు. ఓవర్ల్యాప్ క్రికెట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఒకేసారి 10- 15 మంది ఆటగాళ్లు‘‘ధోని కామ్గా, కూల్గా ఉంటాడు. అందరిలాగే తానూ ఒకడినంటూ చాలా సాధారణంగా ఉంటాడు. ధోని గది ఎల్లప్పుడూ ఆటగాళ్లతో నిండి ఉంటుంది. ఒకేసారి 10- 15 మంది ఆటగాళ్లు అతడి రూమ్లోకి వచ్చి ఆట గురించి మాట్లాడుతూ ఉంటారు.ఒక్కోసారి జట్టు మొత్తం అక్కడే ఉంటుంది. అయితే, అంతా అయిపోయి ఒక్కసారి ధోని గది తలుపు మూతపడిందంటే మాత్రం.. మళ్లీ ఎవరికీ లోపలికి అనుమతి ఉండదు’’ అని రహానే చెప్పుకొచ్చాడు. రహానే గుడ్బైకాగా రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్లో సారథిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన ఘనత అతడికి ఉంది.టీమిండియా తరఫున 2011లో అరంగేట్రం చేసిన రహానే.. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 12 శతకాల సాయంతో 5077 పరుగులు సాధించాడు. వన్డేల్లో 2962, టీ20లలో 375 పరుగులు చేసిన రహానే.. ఐపీఎల్లో మొత్తంగా 5367 పరుగులు సాధించాడు. ధోని కెప్టెన్సీలో 2023లో చెన్నై టైటిల్ గెలవడంలో రహానే (326 రన్స్) తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ODI WC: ‘భారత జట్టులో ఆ ఇద్దరికి చోటు దక్కదు’ -
ODI WC: ‘భారత జట్టులో ఆ ఇద్దరికి చోటు దక్కదు’
వన్డే ప్రపంచకప్-2027 టోర్నీలో ఆడబోయే భారత ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశంపై చర్చ కొనసాగుతోంది. చాలా ఏళ్లుగా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ- శుబ్మన్ గిల్ వన్డే ఓపెనర్లుగా కొనసాగుతున్నారు. కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసిన తర్వాత గిల్.. ఇటీవల అఫ్గానిస్తాన్తో సిరీస్లో మాత్రం వన్డౌన్లో వచ్చాడు.గిల్కు బదులుగిల్కు బదులు యశస్వి జైస్వాల్ అఫ్గాన్తో మ్యాచ్లో రోహిత్తో పాటు ఓపెనింగ్ చేశాడు. రెగ్యులర్ వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరం కావడం వల్ల జైసూకు జట్టులో చోటు దక్కగా.. గిల్ అతడిని ఓపెనర్గా ప్రమోట్ చేసి.. తాను వన్డౌన్లో వచ్చాడు.మరోవైపు.. లార్డ్స్లో ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేనే రోహిత్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అనే ప్రచారం జరిగింది. అయితే, బీసీసీఐతో పాటు రోహిత్ ఈ వదంతుల్ని కొట్టిపారేశాడు. లార్డ్స్లో సెంచరీతో కదం తొక్కి తన విలువేంటో చాటుకున్నాడు హిట్మ్యాన్. అయినప్పటికీ వన్డే వరల్డ్కప్లో ఆడించే విషయంలో యాజమాన్యం ఇప్పటికైతే స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలో యశస్వి జైస్వాల్తో పాటు రుతురాజ్ గైక్వాడ్ పేరు తెరమీదకు వచ్చింది. వీరిద్దరిలో ఒకరు బ్యాకప్ ఓపెనర్గా వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. ఆ ఇద్దరికి చోటు దక్కదు‘‘నిజానికి రుతురాజ్ గైక్వాడ్ రెండు పనులు చేయగలడు. ఓపెనర్గా, మిడిలార్డర్లోనూ రాణించగలడు. అతడు పక్కా ఓపెనింగ్ బ్యాటర్. కానీ టీమిండియాకు అవసరమైనపుడు మిడిలార్డర్లోనూ ఆడాడు.ఆ స్థానంలో ఫిఫ్టీ, సెంచరీ బాదాడు. మరోవైపు.. యశస్వి జైస్వాల్ ఇందుకు విరుద్ధం. అతడు కేవలం బ్యాకప్ ఓపెనర్గా మాత్రమే ఉండగలడు. ఏదేమైనా ప్రపంచకప్ జట్టులో వీరిద్దరికి స్థానం దక్కదని నేను నమ్ముతున్నాను’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ఇక ప్రపంచకప్ జట్టులో ఇద్దరు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్లతో పాటు.. ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లకు చోటు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉంటారు.ఇక ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లేదంటే రిషభ్ పంత్ స్థానం దక్కించుకుంటారు. టాపార్డర్ ఎలాగో మారదు. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ లేదంటే యశస్వి జైస్వాల్కు జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువ’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే, మిడిలార్డర్లో మాత్రం రుతుకు బ్యాకప్ బ్యాటర్గా చోటు దక్కే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు.చదవండి: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో మార్పు! -
టీమిండియాతో తొలి టెస్టు.. శ్రీలంకకు భారీ షాక్!
భారత్తో టెస్టు సిరీస్కు ముందు శ్రీలంకకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆగస్టు 15న ప్రారంభయ్యే తొలి టెస్ట్కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. 31 ఏళ్ల కుశాల్ మెండిస్ లంక ప్రీమియర్ లీగ్-2026లో తొడ కండరాల గాయం బారిన పడ్డాడు.దీంతో అతడు టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. అయితే భారత్తో టెస్టు సిరీస్ సమయానికి కుశాల్ కోలుకుంటాడని లంక సెలక్టర్లు భావించారు. కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు శ్రీలంక ప్రముఖ జర్నలిస్ట్ దనుష్క అరవింద పేర్కొన్నారు.ఒకవేళ మెండిస్ దూరమైతే శ్రీలంకకు భారీ షాక్ అనే చెప్పాలి. కుశాల్ సొంత గడ్డపై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు శ్రీలంకలో 59 టెస్ట్ ఇన్నింగ్స్లు ఆడిన మెండిస్ 41.49 సగటుతో 2365 పరుగులు చేశాడు. ఓవరాల్గా 75 టెస్ట్ల్లో 4836 రన్స్ చేశాడు. తొలి టెస్ట్ సమయానికి మెండిస్ ఫిట్నెస్ సాధించకపోతే అతడి స్ధానంలో నిషాన్ మదుష్క వికెట్ కీపర్గా వ్యవహరించే అవకాశముంది. మరోవైపు కుశాల్కు ప్రత్నామ్యాయంగా మరో యువ ఆటగాడు పాసిందు సూరియబండార పేరును లంక సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.గత నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక టెస్టు జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. కానీ తుది జట్టులో అతడికి అవకాశం లభించలేదు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉంది. లోయర్-మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చి దూకుడుగా ఆడడం అతడి స్పెషాలిటి. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో సూరియబండార 102 ఇన్నింగ్స్లలో 4893 పరుగులు సాధించాడు. -
ఆసీస్ గడ్డపై బంగ్లా ప్లేయర్ సూపర్ శతకం
23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్కు తొలి ప్రాక్టీస్ మ్యాచ్లోనే భారీ ఊరట లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ అద్భుత సెంచరీతో చెలరేగాడు.మర్రారా క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్కు శుభారంభం లభించలేదు. 101 పరుగులకే ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది.ఈ దశలో బరిలోకి దిగిన మిరాజ్ పట్టుదలతో బ్యాటింగ్ చేసి సూపర్ సెంచరీతో మెరిశాడు. సౌమ్య సర్కార్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం టెయిలెండర్లతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. చివరి వికెట్కు సయ్యద్ ఖలేద్ అహ్మద్తో కలిసి ఏకంగా 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో 141 బంతులు ఎదుర్కొని 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిరాజ్ పోరాటంతో బంగ్లాదేశ్ 75.5 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది.బంగ్లా బౌలర్ల మెరుపు ఆరంభంబ్యాటింగ్లో మిరాజ్ ఆదుకోగా.. బౌలింగ్లో హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్ అదరగొట్టారు. ఆసీస్ ఓపెనర్లు సామ్ కొన్స్టాస్, క్యాంప్బెల్ కెల్లవేలను తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్కు పంపారు.అయితే కర్టిస్ ప్యాటర్సన్, జోష్ ఫిలిప్ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. మూడో వికెట్కు అజేయంగా 49 పరుగులు జోడించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సీఏ ఎలెవెన్ 2 వికెట్ల నష్టానికి 51 పరుగుఉలు చేసింది.23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో బంగ్లాదేశ్బంగ్లాదేశ్ చివరిసారిగా 2003లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. అప్పటితో పోలిస్తే ప్రస్తుత బంగ్లా జట్టు చాలా మెరుగుపడింది.టెస్టులకు ముందు మంచి సన్నాహకంఆస్ట్రేలియాతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ బలమైన జట్టుతో వచ్చింది. తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఎబాదత్ హొస్సేన్, సయ్యద్ ఖలేద్ అహ్మద్, మహ్మద్ ముస్ఫిక్ హసన్లతో పేస్ విభాగం బలంగా కనిపిస్తోంది. -
షకీబ్ ఇంటిపై దాడి.. కారణం ఇదే..!
బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి దేశానికి వస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే (ఆగస్ట్ 5) ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పూర్వీకుల ఇంటిపై (మగురా పట్టణం) దాడి జరిగింది. దుండగులు పెట్రోల్ బాంబులు విసరడంతో పాటు ఇంటి కిటికీలను ధ్వంసం చేశారు. పై అంతస్తులో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.షేక్ హసీనా కార్యక్రమంలో షకీబ్ పాల్గొనడంతోనేనా..?ఈ దాడికి కొన్ని గంటల ముందు షకీబ్ అల్ హసన్ ఓ వర్చువల్ మీడియా కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో షేక్ హసీనా కూడా ప్రసంగించారు. 2024లో అధికారాన్ని కోల్పోయి భారత్లో ఉంటున్న హసీనా.. డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వస్తానని స్పష్టం చేశారు.“నేను నా ప్రజల వద్దకు తిరిగి వస్తాను. నన్ను జైలులో పెట్టినా, చంపినా తిరిగి వెళ్లాల్సిందే” అని హసీనా పేర్కొన్నట్లు సమాచారం.హసీనా ప్రభుత్వాన్ని 2024లో జరిగిన విద్యార్థి ఉద్యమం కూలదోసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె భారత్కు వచ్చారు. ప్రస్తుతం ఆమెపై బంగ్లాదేశ్లో పలు కేసులు ఉన్నాయి. గతేడాది ఆమెకు మరణశిక్ష కూడా విధించారు. అయితే, తనపై ఆరోపణలను హసీనా రాజకీయ ప్రేరేపితమైనవిగా కొట్టిపారేశారు.షకీబ్పైనా పలు కేసులుషకీబ్ అల్ హసన్ కూడా అవామీ లీగ్ తరఫున 2024లో పార్లమెంట్కు ఎన్నికయ్యారు. అయితే హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత ఆయన బంగ్లాదేశ్కు దూరంగా ఉంటున్నారు. షకీబ్పై హత్య, అవినీతి, మోసం, మనీలాండరింగ్ తదితర ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల్లో దర్యాప్తులు కొనసాగుతున్నాయి.భారత్పై బంగ్లాదేశ్ అసంతృప్తిషేక్ హసీనా న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడటంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె మీడియా కార్యక్రమంలో పాల్గొనడం తమ దేశ సార్వభౌమత్వానికి అవమానకరమని పేర్కొంది. ఈ పరిణామం భారత్-బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.ఇదిలా ఉండగా, హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించాలని ఢాకా ఇప్పటికే భారత్ను కోరింది. ఈ అభ్యర్థనను భారత ప్రభుత్వం న్యాయపరమైన విధానాల ప్రకారం పరిశీలిస్తోంది. -
భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో మార్పులు
భారత మహిళల జట్టు ఈ ఏడాది డిసెంబర్లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ టూర్లో దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేల సిరీస్తో పాటు ఓ టెస్ట్ ఆడాల్సి ఉంది. అయితే తాజాగా ఈ షెడ్యూల్ను సౌతాఫ్రికా క్రికెట్ (CSA) సవరించింది. టెస్టు, వన్డే సిరీస్లతో పాటు అదనంగా మూడు మ్యాచ్ల టీ20లను జోడించినట్లు సీఎస్ఎ వెల్లడించింది.2027 ఫిబ్రవరిలో శ్రీలంక వేదికగా జరగనున్న తొలి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి ఇరు జట్లను సిద్ధం చేయడంలో భాగంగా ఈ టీ20 సిరీస్ను చేర్చినట్లు సీఎస్ఎ అధికారులు స్పష్టం చేశారు. ఈ పర్యటన డిసెంబర్ 9 నుంచి 30 వరకు జరగనుంది.పూర్తి షెడ్యూల్ వివరాలు (డిసెంబర్ 2026):ఏకైక టెస్టు: డిసెంబర్ 9 - 12: గెబెర్హా (స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు)వన్డే సిరీస్: 1వ వన్డే: డిసెంబర్ 16, పార్ల్ (ఉదయం 10 గంటలకు) 2వ వన్డే: డిసెంబర్ 19, కేప్ టౌన్ (మధ్యాహ్నం 2 గంటలకు) 3వ వన్డే: డిసెంబర్ 22, బ్లూమ్ఫోంటెయిన్ (మధ్యాహ్నం 2 గంటలకు)టీ20 సిరీస్: 1వ టీ20: డిసెంబర్ 26, బెనోని (సాయంత్రం 6 గంటలకు) 2వ టీ20: డిసెంబర్ 29, పోచెఫ్స్ట్రూమ్ (సాయంత్రం 6 గంటలకు) 3వ టీ20: డిసెంబర్ 30, పోచెఫ్స్ట్రూమ్ (సాయంత్రం 6 గంటలకు) -
IND vs SL: శుబ్మన్ గిల్కు గాయం!
శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమచారం. కెప్టెన్ శుబ్మన్ గిల్ వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంకకు వెళ్లింది. గాలె, కొలంబో వేదికలుగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.బలంగా తాకిన బంతిఅయితే, అంతకంటే ముందు భారత్.. శ్రీలంక ఎలెవన్ జట్టుతో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ గాయపడినట్లు రెవ్స్పోర్ట్స్ వెల్లడించింది. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ కుడిచేతి బొటనవేలికి బంతి బలంగా తాకిందని పేర్కొంది.ఈ క్రమంలో టీమ్ డాక్టర్ వచ్చి గిల్ గాయాన్ని పరిశీలించాడు. ట్రీట్మెంట్ తీసుకున్న గిల్.. కాసేపటి తర్వాత బ్యాటింగ్ సెషన్ కొనసాగించినట్లు పేర్కొంది. కాగా భారత్- శ్రీలంక ఎలెవన్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్కు కొలంబోలోని నోండెస్ప్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC) వేదిక.ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా శ్రీలంకలో సత్తా చాటాల్సిందే. ఆతిథ్య జట్టును 2-0తో వైట్వాష్ చేస్తేనే గిల్ సేన అవకాశాలు మెరుగుపడతాయి. చివరగా వైట్వాష్డబ్ల్యూటీసీలో భాగంగా చివరగా స్వదేశంలో సౌతాఫ్రికాతో తలపడ్డ టీమిండియా ప్రత్యర్థి చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. అనంతరం.. అఫ్గానిస్తాన్తో ఇటీవల నామమాత్రపు టెస్టులో మాత్రం విజయం సాధించింది. అయితే, ఇది డబ్ల్యూటీసీలో భాగం కాదు.ఇక ఇప్పటికే టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంకతో సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో బారాముల్లా ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటన సందర్భంగానే బుమ్రాతో పాటు గాయపడ్డ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో సెలక్టర్లు 33 ఏళ్ల సారాంశ్ జైన్ను తొలిసారి టీమిండియాకు ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గిల్ కండరాల నొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్నెస్ ఆధారంగా), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.చదవండి: రూ. కోటిన్నర నజరానా!.. అస్మితకు భారీ షాక్! -
భారత్తో మ్యాచ్.. శ్రీలంక జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?
భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా ఆగస్టు 7 నుంచి కొలంబో వేదికగా శ్రీలంక-ఎతో మూడు రోజుల వార్మాప్ మ్యాచ్లో తలపడనుంది. ఈ క్రమంలో వార్మప్ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా సోనాల్ దినుషాను నియమించారు.ఈ జట్టులో రమేష్ మెండిస్, లహిరు కుమార వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. అదేవిధంగా దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న నిషాన్ మదుష్క, పసిందు సూరియబండార వంటి యువ ఆటగాళ్లను లంక సెలక్టర్లు 'ఎ' జట్టుకు ఎంపిక చేశారు.కాగా శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే శ్రీలంక గడ్డపై అడుగు పెట్టింది. అయితే ఈ టూర్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. అతడి స్దానంలో జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ ఆకిబ్ నబీకి సెలక్టర్లు అవకాశమిచ్చారు.భారత్తో ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లంక-ఎ జట్టునిషాన్ మదుష్క, రవిందు రశాంత, పసిందు సూరియబండార, పవన్ రత్నాయకే, అహన్ విక్రమసింఘే, సోనాల్ దినుషా(కెప్టెన్), అంజల బండార(వికెట్ కీపర్), నిపున్ దనంజయ, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, అసంక మనోజ్, ఇసిత విజేసుందర, దిలుమ్ రమేష్ మెండిస్చదవండి: DPL 2026: పప్పూ యాదవ్ తనయుడి విధ్వంసం.. 7 ఫోర్లు, 8 సిక్స్లతో -
విండీస్ ప్లేయర్ అరుదైన రికార్డు
వెస్టిండీస్ విధ్వంసకర ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. గత 14 నెలల కాలంలో ఏకంగా ఐదు ఛాంపియన్షిప్ టైటిళ్లు సాధించాడు. ప్రపంచ క్రికెట్లో బహుశా ఏ ఆటగాడు ఇలాంటి ఘనత సాధించి ఉండడు. షెపర్డ్ ఆడిన ప్రతి టైటిల్ గెలిచి 100 పర్సెంట్ స్ట్రయిక్ రేట్ మెయింటైన్ చేశాడు. తాజాగా అతడు గయానా అమెజాన్ వారియర్స్ తరఫున టైటిల్ సాధించాడు. ఈ జట్టు ఈ టైటిల్ గెలవడం వరుసగా ఇది రెండోసారి. ఈ ఏడాదే షెపర్డ్ ఆర్సీబీ తరఫున కూడా టైటిల్ సాధించాడు. ఈ ఫ్రాంచైజీ కూడా టైటిల్ గెలవడం వరుసగా ఇది రెండోసారి. షెపర్డ్ తన జాతీయ జట్టుకు ఏమో కానీ, ఫ్రాంచైల పాలిట లక్కీ లెగ్గా మారాడు. షెపర్డ్ గెలిచిన 5 టీ20 టైటిళ్లు2025- IPL (ఆర్సీబీ) 2025- Global Super League (గయానా అమెజాన్ వారియర్స్)2025- Major League Cricket (ఎంఐ న్యూయార్క్)2026- IPL (ఆర్సీబీ) 2026- Global Super League (గయానా అమెజాన్ వారియర్స్)ఇదిలా ఉంటే, తాజాగా షెపర్డ్ టైటిల్ గెలిచిన గ్లోబల్ సూపర్ లీగ్లో వివిధ దేశాలకు చెందిన ఫ్రాంచైజీలు పోటీపడతాయి. తాజా ఎడిషన్ ఫైనల్లో వారియర్స్ శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్పై 6 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. వారియర్స్కు 47 ఏళ్ల ఇమ్రాన్ తాహిర్ టైటిల్ గెలిపించాడు. ఈ టోర్నీలో షెపర్డ్ వ్యక్తిగతంగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. -
పాక్తో టెస్టు సిరీస్కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన
పాకిస్తాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు 16 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. మోకాలి గాయం కారణంగా యువ ఆల్రౌండర్ జేకబ్ బేతెల్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో జోర్డాన్ కాక్స్కు తుది జట్టులో చోటు దక్కింది.ఓల్లీ పోప్, బ్రైడన్ కార్స్, డాన్ లారెన్స్ తిరిగి చోటు సంపాదించారు. ముఖ్యంగా లారెన్స్ రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు.సర్రే తరఫున కౌంటీ ఛాంపియన్షిప్లో అద్భుతంగా రాణిస్తున్న లారెన్స్ ప్రస్తుతం డివిజన్-1లో రెండో అత్యధిక పరుగుల స్కోరర్గా ఉన్నాడు. అతడు ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా, ఇటీవల న్యూజిలాండ్తో సిరీస్లో నంబర్-6లో ఆడిన జేమీ స్మిత్ ఏడో స్థానానికి వెళ్లనున్నాడు.బేతెల్ స్థానంలో నంబర్-3లో జోర్డాన్ కాక్స్ బ్యాటింగ్ చేయనున్నాడు. భారత్తో గత నెల జరిగిన వన్డే సిరీస్లో కుడి మోకాలికి గాయం కావడంతో బేతెల్ పాక్ సిరీస్కు దూరమయ్యాడు.పోప్, కార్స్కు కూడా పునరాగమనంఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్ తర్వాత తొలిసారి ఓలీ పోప్, బ్రైడన్ కార్స్ టెస్టు జట్టులోకి తిరిగి వచ్చారు. గాయం కారణంగా కొంతకాలం క్రికెట్కు దూరమైన కార్స్ తిరిగి జట్టులోకి రాగా, బ్యాటింగ్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పోప్ను గతంలో జట్టు నుంచి తప్పించారు.ఇక పేసర్ సామ్ కుక్కు కూడా రీకాల్ లభించింది. అతడు గత ఏడాది జింబాబ్వేతో టెస్టు అరంగేట్రం చేశాడు.జో రూట్ మళ్లీ ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ఈ సిరీస్ ఇంగ్లండ్ టెస్టు క్రికెట్లో కొత్త శకానికి నాంది కానుంది. బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, జో రూట్ 2022 తర్వాత మళ్లీ పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.బ్రెండన్ మెకల్లమ్ తర్వాత టెస్టు కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ నియమితుడైనా, అతడు ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి బాధ్యతలు చేపట్టనున్నాడు. అందువల్ల పాక్ సిరీస్కు మార్కస్ ట్రెస్కోథిక్ తాత్కాలిక ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు.పాక్తో టెస్ట్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు:జో రూట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, ఎమిలియో గే, డాన్ లారెన్స్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, జేమీ స్మిత్, జోష్ టంగ్.**ఆగస్టు 19న తొలి టెస్టుఇంగ్లండ్-పాకిస్తాన్ టెస్టు సిరీస్ ఆగస్టు 19న లీడ్స్లో ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 27 నుంచి లార్డ్స్లో, మూడో టెస్టు సెప్టెంబర్ 9 నుంచి ఎడ్జ్బాస్టన్లో జరగనుంది.ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో ఇంగ్లండ్ ఏడో స్థానంలో ఉండగా, పాక్ ఎనిమిదో స్థానంలో ఉంది. -
పప్పూ యాదవ్ తనయుడి విధ్వంసం.. 7 ఫోర్లు, 8 సిక్స్లతో
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ బోణీ కొట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈస్ట్ ఢిల్లీ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో నార్త్ ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.ఫస్ట్ డౌన్ బ్యాటర్ సుజల్ సింగ్(50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 82) టాప్ స్కోరర్గా నిలిచాడు. నార్త్ ఢిల్లీ బౌలర్లలో మయాంక్ దాగర్ రెండు, వికాస్ దీక్షిత్, వైభవ్ తలా వికెట్ సాధించారు.సార్థక్ విధ్వంసంఅనంతరం 172 పరుగుల లక్ష్య చేధనలో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ కెప్టెన్, స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ తనయుడు సార్థక్ రంజన్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా సిమర్జీత్ సింగ్కు సార్థక్ చుక్కలు చూపించాడు.అతడు వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో సార్థక్ వరుసగా 4 సిక్సర్లు, ఒక ఫోర్ బాది, చివరి బంతికి సింగిల్ తీశాడు. ఆ ఓవర్లో అతడు ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. కేవలం 50 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సార్థక్ రంజన్.. 8 సిక్సర్లు, 7 ఫోర్లతో 95 పరుగులు చేశాడు.అతడి తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా నార్త్ ఢిల్లీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి కేవలం 16 ఓవర్లలోనే ఊదిపడేసింది. కాగా సార్థక్ రంజన్ ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడిని రూ.30 లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్-2026లో సీజన్ మొత్తం అతడు బెంచ్కే పరిమితమయ్యాడు.చదవండి: ఈ టీమిండియా క్రికెటర్లు ప్రభుత్వ ఉద్యోగులు.. ఎవరికి ఏ జాబ్? -
జట్టు మారిన జడేజా
సౌరాష్ట్ర క్రికెట్లో గత 13 ఏళ్లుగా కీలక ఆటగాడిగా ఉన్న ఎడమచేతి స్పిన్నర్ ధర్మేంద్రసిన్హ్ జడేజా ఆ జట్టును వీడనున్నాడు. రవీంద్ర జడేజాకు ఎలాంటి సంబంధం లేకపోయినా, అతడిలాగే ఎడమచేతి స్పిన్నర్గా గుర్తింపు పొందిన 36 ఏళ్ల ధర్మేంద్రసిన్హ్.. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి NOC పొందాడు. రాబోయే దేశవాళీ సీజన్లో ఛత్తీస్గఢ్ తరఫున ఆడనున్నాడు.ధర్మేంద్రసిన్హ్ జడేజా ఇప్పటివరకు 100 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 423 వికెట్లు పడగొట్టాడు. 90 లిస్ట్-A మ్యాచ్లు, 73 టీ20లు కూడా ఆడాడు. 2019-20, 2022-23 సీజన్లలో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్లలో అతడు సభ్యుడిగా ఉన్నాడు.2017-18 సీజన్ నుంచి దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు (293) తీసిన బౌలర్గా జడేజా రికార్డు కలిగి ఉన్నాడు. జడేజాకు వైట్బాల్ క్రికెట్లో తన పాత్రపై సౌరాష్ట్ర జట్టు మేనేజ్మెంట్తో అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. జడేజా రెడ్బాల్తో పాటు వైట్బాల్ ఫార్మాట్లోనూ కొనసాగాలని కోరుకోగా, సౌరాష్ట్ర మేనేజ్మెంట్ అతడిని ప్రధానంగా రెడ్బాల్ క్రికెట్కు పరిమితం చేయాలని భావించింది.శశాంక్ సింగ్ పుదుచ్చేరికిఇదిలా ఉంటే, ఛత్తీస్గఢ్ నుంచి కీలక ఆటగాడు శశాంక్ సింగ్ పుదుచ్చేరికి మారాడు. రాబోయే దేశవాళీ సీజన్లో అతడు పుదుచ్చేరి తరఫున ఆడనున్నాడు.ఇక విదర్భకు చెందిన లలిత్ యాదవ్, బరోడాకు చెందిన నినాద్ రాథ్వా ఒడిశా జట్టులో ప్రొఫెషనల్ ఆటగాళ్లుగా చేరారు. ఇద్దరూ తమ తమ రాష్ట్ర క్రికెట్ సంఘాల నుంచి NOCలు పొందారు.మరోవైపు గత సీజన్లో మహారాష్ట్ర తరఫున ఆడిన రజనీష్ గుర్బానీ తిరిగి తన సొంత రాష్ట్రం విదర్భకు చేరాడు.రాబోయే దేశవాళీ సీజన్కు ముందు జరుగుతున్న ఈ మార్పులతో పలు రాష్ట్రాల జట్ల కూర్పులో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. -
IND vs SL: బ్యాటింగ్కు అనుకూలమే.. టీమిండియాకు నచ్చలేదు!
టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్లు జరుగనుండగా.. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. అయితే, తొలి టెస్టు కంటే ముందు భారత్ శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడనుంది.టీమిండియా అసంతృప్తి కొలంబోలోని నోండెస్ప్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC)లో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. కాగా శ్రీలంకలో పిచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం NCC తయారు చేసిన వికెట్ మాత్రం భారత శిబిరానికి అస్సలు నచ్చలేదని సమాచారం. పిచ్ మీద పచ్చిక ఉండటం ఏమిటని భారత బృందం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి NCC అధికారి ఫ్రాంకీ రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘వికెట్ మీద పచ్చిక ఎక్కువగా ఉందని భారత క్రికెట్ జట్టు చెప్పింది. నిజానికి ఇది మూడు రోజుల మ్యాచ్ కాబట్టే మేమిలా గ్రాస్ వదిలేశాము. పచ్చిక లేకుండా వికెట్ ఇవ్వడం సరికాదు. ఇదొక మంచి వికెట్.బ్యాటింగ్కు అనుకూలంఏదో ఒక జట్టుకు అనుకూలంగా ఉండేలా మేము ఇది తయారు చేయలేదు. ఆయా జట్ల సత్తాను బట్టే వాళ్లు ముందుకు వెళ్లగలరు. నిజానికి శ్రీలంక క్రికెట్ అభ్యర్థన మేరకే మేము ఇలాంటి పిచ్ తయారు చేశాము. NCC వికెట్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయి.ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయని మేము భావిస్తున్నాము. గాలె మ్యాచ్ కంటే ముందు భారత బ్యాటర్లకు ఇక్కడ మంచి ప్రాక్టీస్ లభిస్తుందని చెప్పగలను. మా వికెట్ రెండు లేదా మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలిస్తుందని చెప్పగలము.ఇరుజట్లకూ కీలకంఅయితే, ఇక్కడ టాస్ గెలిచిన వాళ్లు ముందుగా బ్యాటింగ్ చేస్తేనే మంచిది. మేము ఎల్లప్పుడూ మంచి వికెట్లనే రూపొందిస్తాము. పక్షపాతం ఉండదు’’ అని పేర్కొన్నారు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా కచ్చితంగా శ్రీలంకను 2-0తో వైట్వాష్ చేయాల్సిందే.మరోవైపు.. శ్రీలంక సైతం సొంతగడ్డపై సత్తా చాటి తామూ పోటీలో నిలవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కాగా.. పిచ్ రూపకల్పన కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: ఈ టీమిండియా క్రికెటర్లు ప్రభుత్వ ఉద్యోగులు.. ఎవరికి ఏ జాబ్? -
ఆసీస్ గడ్డపై వినూత్న సిరీస్.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
న్యూజిలాండ్-ఎ జట్టు వైట్బాల్ సిరీస్లలో తలపడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా కివీస్ జట్టు టాప్ ఎండ్ టీ20 సిరీస్తో పాటు ప్రత్యేకమైన వన్డే సిరీస్లోనూ పాల్గొననుంది. ఈ సిరీస్ల కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇందులో ఏకంగా 13 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండడం గమనార్హం. కివీస్ తొలుత టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ టాప్ ఎండ్ టీ20 సిరీస్లో మొత్తం 9 జట్లు పాల్గోనున్నాయి. ప్రతి జట్టు 6 రౌండ్-రాబిన్ మ్యాచ్లు ఆడుతుంది. అనంతరం టాప్-4 జట్లు సెమీఫైనల్స్, ఫైనల్ ఆడతాయి. ఈ సిరీస్ డార్విన్లో ఆగస్టు 21 నుండి 30 వరకు జరగనుంది. అనంతరం న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లు ఆస్ట్రేలియా-ఎతో కాకుండా టాస్మానియా, సౌత్ ఆస్ట్రేలియా, నేపాల్ వంటి జట్లతో కివీస్ ఆడనుండడం విశేషం.న్యూజిలాండ్ ‘ఎ’ 16 మంది సభ్యుల జట్టుముహమ్మద్ అబ్బాస్, ఆదిత్య అశోక్, మ్యాట్ బాయిల్, మ్యాక్స్ చూ, కటేన్ క్లార్క్ (టీ20లకు మాత్రమే), క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, మ్యాట్ ఫిషర్, డీన్ ఫోక్స్క్రాఫ్ట్, జాక్ గిబ్సన్, మిచ్ హే, బెవాన్ జేకబ్స్, జేడెన్ లెన్నాక్స్, బెన్ లకేర్, రైస్ మారియూ (వన్డేలకు మాత్రమే), టిమ్ రాబిన్సన్. -
టీమిండియాలో నో చాన్స్.. కౌంటీ బరిలో సీనియర్ క్రికెటర్!
భారత జట్టులో అవకాశాలు రాకపోవడంతో వెటరన్ క్రికెటర్ జైదేవ్ ఉనాద్కట్ కౌంటీ క్రికెట్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ససెక్స్ తరఫున కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు జైదేవ్ ఉనాద్కట్ ఈ వారం చివర్లో ఇంగ్లండ్కు బయల్దేరి వెళ్లనున్నాడు. ప్రస్తుతం హండ్రెడ్ టోర్నీతో పాటు వన్డే కప్ జరుగుతుండడంతో కౌంటీ క్రికెట్కు చిన్న బ్రేక్ వచ్చింది. కౌంటీ క్రికెట్ ప్రారంభమవ్వగానే ఉనాద్కట్ జట్టుతో జాయిన్ అవనున్నాడు. ఓలీ రాబిన్సన్ నేతృత్వంలోని ససెక్స్ జట్టు ఈ సీజన్లో మంచి ప్రదర్శనే చేసింది. ఆడిన 8 మ్యాచ్ల్లో నాలుగు విజయాలు, రెండు ఓటములు, రెండు డ్రాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆగస్టు 20న తిరిగి ప్రారంభం కానున్న కౌంటీ చాంపియన్షిప్లో ఉనాద్కట్ ససెక్స్ తరఫున వార్విక్షైర్తో బర్మింగ్హమ్ వేదికగా మ్యాచ్లో ఆడనున్నాడు. కాగా ఉనాద్కట్ 2023 నుంచే కౌంటీల్లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. మొత్తం ఇప్పటివరకు ససెక్స్ తరఫున 13 మ్యాచ్లాడిన ఉనాద్కట్ 57 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా తరఫున ఉనాద్కట్ నాలుగు టెస్టులు, ఎనిమిది వన్డేలు, 10 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇక ఉనాద్కట్ చివరగా ఆగస్టు 2023లో వెస్టిండీస్తో వన్డే మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తోనే చివరి టెస్టు ఆడాడు. ఇక ఉనాద్కట్ చివరి టీ20 మ్యాచ్ ఆడి 8 సంవత్సరాలు దాటింది. ఇక జైదేవ్ ఉనాద్కట్తో పాటు ప్రస్తుతం చాహల్ నాటింగ్హమ్షైర్కు, సర్రీ తరఫున రాహుల్ చాహర్ ఆడుతున్నారు. ఇక యార్క్షైర్ తరఫున కుల్దీప్ యాదవ్ వన్డే కప్ ఆడుతుండగా, స్నిన్నర్ మానవ్ సుతార్ వార్విక్షైర్ తరఫున రెండు కౌంటీ మ్యాచ్లు ఆడాడు.చదవండి: ‘వైభవ్ వాటికి దూరంగా ఉండు.. లేదంటే మరో పృథ్వీ షానే!’ -
ఈ టీమిండియా క్రికెటర్లు ప్రభుత్వ ఉద్యోగులు.. ఎవరికి ఏ జాబ్?
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. క్రికెట్ నుంచి కాస్త విరామం తీసుకుని ఉద్యోగిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో కిషన్ దర్శనమిచ్చాడు. క్రికెటర్గా ఉన్న కిషన్ బ్యాంక్లో ఉద్యోగం చేయడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఈ పూర్తి కథనం చదవాల్సిందే.ఇషాన్కు స్పోర్ట్స్ కోటాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అతడు పాట్నాలోని ఆర్బీఐ రీజనల్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్లో విరామం దొరకడంతో కిషన్ పనిచేసేందుకు పాట్నా ఆర్బీఐ బ్రాంచ్కు వెళ్లాడు.ఐడీ కార్డ్ ధరించి తన సహచరలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లగా ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి గురుంచి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ జాబితాలో చాలా మంది పురుష, మహిళ క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనిలు సాయుధ దళాల్లో గౌరవ హోదాలు పొందారు.కపిల్ దేవ్: భారత్కు తొలి వరల్డ్కప్ అందించిన కపిల్ దేవ్కు ఇండియన్ ఆర్మీ 2008లో 'లెఫ్టినెంట్ కల్నల్' గౌరవ హోదాను ప్రధానం చేసింది. వాస్తవానికి కపిల్ దేవ్ సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అతడి తండ్రి రామ్ లాల్ నిఖాంజ్ భారత సైన్యంలో పని చేశారు.సచిన్ టెండూల్కర్: 24 ఏళ్ల పాటు భారత క్రికెట్కు సేవలందించినందుకు గానూ సచిన్ టెండూల్కర్కు ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్ గౌరవ ర్యాంక్ లభించింది. 2010లో అతడికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ 'గ్రూప్ కెప్టెన్' హోదా పొందిన తొలి క్రీడాకారుడిగా సచిన్ నిలిచాడు.ఎంఎస్ ధోని: భారత్కు రెండు ఐసీసీ ప్రపంచకప్లను అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కూడా సాయుధ దళాల్లో భాగమయ్యాడు. ధోని ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను కలిగి ఉన్నాడు. ధోని ఇప్పటికే పలుమార్లు మిలిటరీ శిక్షణలో పాల్గొన్నాడు.కేఎల్ రాహుల్: ఇషాన్ కిషన్ మాదిరే మరో వికెట్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. యువతను బ్యాంకింగ్ రంగం వైపు ఆకర్షించే క్రమంలో అతడికి ఆర్బీఐ ఈ ఉద్యోగం కట్టబెట్టింది. ఆర్బీఐ అవగాహన కార్యక్రమాల్లోనూ రాహుల్ పాల్గొంటున్నాడు.యుజ్వేంద్ర చాహల్: భారత వెటరన్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్ 2018 నుంచి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు.మహమ్మద్ సిరాజ్: టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచిన భారత జట్టులో భాగమైనందుకు గాను పేసర్ మహ్మద్ సిరాజ్ను తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో సత్కరించింది. అతడికి నివాస స్థలాన్ని సర్కార్ కూడా కేటాయించింది.ముకేష్ కుమార్, ఆకాష్ దీప్: భారత జట్టులో చోటు దక్కించుకుని రాణిస్తున్నందుకు స్పీడ్ స్టార్స్ ముకేష్ కుమార్, ఆకాష్ దీప్లకు బిహార్ ప్రభుత్వం డీఎస్పీ హోదా ఇచ్చి గౌరవించింది.రింకూ సింగ్సాధరణ స్ధాయి నుంచి అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగిన రింకూ సింగ్ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నియమించింది. అతడికి ఈ ఉద్యోగంతో పాటు రూ.3 కోట్ల క్యాష్ రివార్డును కూడా యోగి సర్కార్ అందజేసింది.హర్మన్ప్రీత్ కౌర్ : భారత మహిళల జట్టు కెప్టెన్గా అందించిన సేవలకు గానూ పంజాబ్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్నారు.దీప్తి శర్మ: భారత మహిళల జట్టు తొలి వన్డే ప్రపంచకప్ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ దీప్తి శర్మకు ఉత్తర్ప్రదేశ్ సర్కార్ డీఎస్పీ పదవిని కట్టబెట్టింది.రిచా ఘోష్: 2025 మహిళల వన్డే ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు రిచా ఘోష్ను బెంగాల్ ప్రభుత్వం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా నియమించింది. ఆమె ప్రస్తుతం సిలిగురి పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. -
‘వైభవ్ వాటికి దూరంగా ఉండు.. లేదంటే మరో పృథ్వీ షానే!’
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో వైట్బాల్ ఫార్మాట్లో తనదైన ముద్ర వేయగల సామర్థ్యం వైభవ్ కలిగి ఉన్నాడని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. గతంలో పృథ్వీ షా తక్కువ వయసులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత వేరే విషయాలపై దృష్టి పెట్టడంతో కెరీర్ దారి తప్పిందని, వైభవ్ అలా దారి తప్పకూడదని పరోక్షంగా హెచ్చరించాడు.ఒక మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఊతప్ప మాట్లాడాడు. ‘వైట్బాల్ క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే వైభవ్ ఎక్కువ ప్రభావం చూపగలడు. ఎందుకంటే సచిన్ లాగే చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. సచిన్ ఎంతటి పేరు ప్రతిష్టలు సాధించాడన్నది అందరికీ తెలిసింది. మరి వైభవ్ దానిని ఎలా నిలబెట్టుకుంటాడనేది ఆసక్తిగా మారింది. అంధఃపాతాళానికి పృథ్వీ షా..‘భారత క్రికెట్లో చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో పైకి వచ్చినవాళ్లను అరుదుగా చూశాం. ఉదాహరణకు వినోద్ కాంబ్లీ, పృథ్వీ షాలను తమ కెరీర్ను 17-18 ఏళ్ల వయసులోనే ప్రారంభించారు. ఈ ఇద్దరు భారత క్రికెట్లో ఎంతో ముద్ర వేస్తారని అంతా భావించారు. కాంబ్లీ సంగతి పక్కనబెడితే, పృథ్వీ షా కెరీర్ ట్రాక్ తప్పడానికి ప్రధాన కారణం అతడి వయస్సే. చిన్న వయసులోనే స్టార్డమ్ చూసిన పృథ్వీ షాకు కెరీర్ కంటే మిగతా విషయాలపై ఫోకస్ పెరిగింది. గర్ల్ఫ్రెండ్స్ మోజుతో పాటు ఎండార్స్మెంట్ రూపంలో యాడ్ చేయడంతో సంపాదనపై ఆసక్తి పెరిగింది. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న పృథ్వీ షా కెరీర్ అంధఃపాతాళానికి పడిపోయింది. కాబట్టి వైభవ్ సూర్యవంశీకి అతడి వయస్సే పెద్ద సవాల్ కానుంది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసున్న వైభవ్ రానున్న ఐదేళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా ఆటపై దృష్టి పెడతాడా అన్నది చూడాలి. వీలైనంత వరకు వయసు రీత్యా గర్ల్ఫ్రెండ్స్పై మోజు, ఎడాపెడా ఎండార్స్మెంట్లకు సంతకాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. సరైన దారిలోనే..ఇప్పటికైతే వైభవ్ తనకు ఎలాంటి ఎండార్స్మెంట్ ఆఫర్ వచ్చినా ఆలోచించి అడుగు వేస్తున్నాడు. అంతేకాదు కేవలం ఆటపైనే దృష్టి పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే వైట్బాల్లో సచిన్ను మించిన అద్భుతం అవుతాడు. అలా కాదని వ్యవహరిస్తే మాత్రం మరో పృథ్వీషాగా మిగిలిపోవడం ఖాయం. ఇప్పటికిప్పుడు సచిన్తో పోల్చడం సరైన చర్య కాకపోయినప్పటికీ, వైభవ్లో దాగున్న అపారమైన సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలుపుతుంది’ అని చెప్పుకొచ్చాడు.Read: సామ్ బిల్లింగ్స్ సిక్సర్ల వర్షం.. దూసుకెళ్తున్న ట్రెంట్ రాకెట్స్ -
వన్డే వరల్డ్కప్ కోసం భారత జట్టు ఇదే.. గంభీర్ ఫేవరేట్కు ఛాన్స్!?
వన్డే ప్రపంచకప్-2027కు ఆతిథ్యమిచ్చేందుకు సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వంటి ఆఫ్రికా దేశాలు సిద్దమవుతున్నాయి. వచ్చే ఏడాది ఆక్టోబర్లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే వేదికలను సైతం ఐసీసీ ఖారారు చేసింది. మొత్తం మూడు దేశాల్లోని 12 నగరాల్లో ఈ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్కు ఇంకా 14 నెలల సమయం ఉన్నప్పటికి ఇప్పటి నుంచే భారత జట్టు ఎంపికపై అంచనాలు మొదలయ్యాయి. 2011 తర్వాత ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ గెలవని టీమిండియా.. వచ్చే ఏడాది జరిగే మెగా టోర్నీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం పటిష్టమైన జట్టును ఆఫ్రికాకు పంపాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ కోసం భారత జట్టును దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంచనా వేశారు. కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లకు గవాస్కర్ టాప్-5లో చోటిచ్చారు. అదేవిధంగా వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ను ఆయన ఎంపిక చేశారు. ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డికి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా గవాస్కర్ ఛాన్స్ ఇచ్చారు. అయితే రవీంద్ర జడేజా భారత వన్డే ప్రపంచకప్ లేనిట్లు తెలుస్తోంది. అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లకు జడేజాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అయినప్పటికి జడేజా లాంటి సీనియర్ ఆల్రౌండర్ను వరల్డ్కప్కు ఎంపిక చేయాలని సెలక్టర్లు సన్నీ సూచించారు. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లకు గవాస్కర్ అవకాశమిచ్చారు. కాగా హర్షిత్ రాణాను భారత జట్టుకు ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గంభీర్ సపోర్ట్తోనే అతడికి జట్టులో చోటు దక్కుతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గవాస్కర్ వంటి లెజెండరీ క్రికెటర్ హర్షిత్ను వరల్డ్కప్కు ఎంపిక చేయమని సూచించడం గమనార్హం.గవాస్కర్ ఎంపిక చేసిన భారత జట్టు ఇదేశుబ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా , జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ -
సామ్ బిల్లింగ్స్ సిక్సర్ల వర్షం.. దూసుకెళ్తున్న ట్రెంట్ రాకెట్స్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్-2026లో ట్రెంట్ రాకెట్స్ ఐదో విజయాన్ని అందుకొని టాప్గేర్లో దూసుకెళ్తోంది. కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ విధ్వంసానికి తోడు ఓపెనర్లు రాణించడంతో 7 వికెట్ల తేడాతో బర్మింగ్హమ్ ఫోనిక్స్పై గెలుపొందింది. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్ 83 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. సామ్ బిలింగ్స్ (19 బంతుల్లో 31 నాటౌట్, 1 ఫోర్, మూడు సిక్సర్లు) అజేయం కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించగా, ఓపెనర్లు బెన్ డకెట్ (22), ఫిన్ అలెన్ (28) రాణించారు. బర్మింగ్హమ్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్ 2 వికెట్లు తీయగా, బెన్డార్ఫుసిస్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ ఫొనిక్స్ 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. జో క్లార్క్ (45 బంతుల్లో 62) అర్ధసెంచరీ మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. లారి ఎవన్స్ (19) పర్వాలేదనిపించాడు. ట్రెంట్ బౌలర్లలో లూయిస్ గ్రెగొరి 2 వికెట్లు తీయగా, మొహమ్మద్ ఆమిర్, మాట్ హెన్రీ,మిచెల్ సాంట్నర్ తలా ఒక వికెట్ తీశారు. ఆరు మ్యాచ్ల్లో ఐదో విజయంతో ట్రెంట్ రాకెట్స్ 20 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉండగా, బర్మింగ్హమ్ ఫొనిక్స్ నాలుగో పరాజయంతో పట్టికలో అట్టడుగున నిలిచింది. 🚨 Crowd catch! Sam Billings smashes it into the crowd, and the safe hands of this fan 🙌#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/8MTtMl4pbT— The Hundred (@thehundred) August 5, 2026Sam Billings Is A Very Clean Hitter. Great Technique pic.twitter.com/7nZ2qPFP2m— Aryan Goel 2.0 (@AryanGoelNew) August 5, 2026చదవండి: కళ్లు చెదిరేలా షకీబ్ అల్ హసన్ ఆస్తుల విలువ! -
నా వరల్డ్ రికార్డును బద్దలు కొట్టేది అతడే: బట్లర్
టీ20 క్రికెట్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా బట్లర్ రికార్డులకెక్కాడు. 'ది హండ్రెడ్' టోర్నీలో భాగంగా వేల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరపున ఆడిన బట్లర్ కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ గుజరాత్ టైటాన్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు 522 మ్యాచ్ల్లో 14,833 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ కీరన్ పొలార్డ్ పేరిట ఉండేది. పొలార్డ్ 746 మ్యాచ్ల్లో 14,803 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో పొలార్డ్ను బట్లర్ అధిగమించాడు. ఈ ఫీట్ సాధించిన అనంతరం బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో తన రికార్డును బద్దలు కొట్టే అవకాశముందని బట్లర్ అన్నాడు."టీ20 క్రికెట్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఏదో ఒక రోజు నా రికార్డును వేరొకరు బద్దలు కొడతారు. ఆ ఆటగాడు బహుశా వైభవ్ సూర్యవంశీ కావచ్చు. క్రికెట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. పరిస్థితులు త్వరగా మారుతుంటాయి.కొన్ని నెలల క్రితం నేను ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు నాకెరీర్లోనే అత్యుత్తమంగా బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఒడిదొడుకులు ఎదురైనప్పుడు వదిలేయడం లేదా ఫామ్ కోసం కష్టపడడం అనే రెండు మార్గాలే ఉంటాయి. నేను శ్రమించడానికే మొగ్గు చూపాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో బట్లర్ పేర్కొన్నాడు.చదవండి: కళ్లు చెదిరేలా షకీబ్ అల్ హసన్ ఆస్తుల విలువ! -
కళ్లు చెదిరేలా షకీబ్ అల్ హసన్ ఆస్తుల విలువ!
బంగ్లాదేశ్లో రాజకీయం మరోసారి వేడెక్కింది. బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ ఇంటిపై జరిగిన పెట్రోల్ బాంబు దాడి కలకలం రేపింది. కాగా తన ఇంటిపై దాడితో షకీబ్ అల్ హసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో పాటు విదేశాల్లోనూ అనేక అక్రమాస్తులు కూడగట్టాడన్న ఆరోపణలు షకీబ్ అల్ హసన్పై వెల్లువెత్తాయి. దీంతో అసలు షకీబ్ అల్ హసన్ ఆస్తుల నికర విలువ మొత్తం ఎంత? ఏయే దేశాల్లో అతడి పేరిట ఆస్తులు ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.బంగ్లాదేశ్ క్రికెట్లో స్టార్ ఆల్రౌండర్గా పేరు పొందిన షకీబ్ అల్ హసన్ నికర ఆస్తుల విలువ అంచనా 20 నుంచి 25 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 190 నుంచి 230 కోట్ల పైచిలుకు మాటే) ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రిటైర్మెంట్ ప్రకటించకపోవడంతో బంగ్లాదేశ్ అగ్రశ్రేణి క్రికెటర్గా, షకీబ్ అల్ హసన్ తన సహచరులందరికంటే అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడు. Photo Credit: Twitterకోట్ల ఆస్తులు..బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో అతని సెంట్రల్ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజులు , బోనస్లతో కలిపి, సాధారణంగా సంవత్సరానికి సుమారు రూ. 2.85 కోట్ల నుంచి 4.75 కోట్ల వరకు అందుకుంటున్నాడు. దీంతో పాటు షకీబ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో సహా ఇతర టీ20 లీగ్ల ద్వారా కూడా భారీ మొత్తంలో అందుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో యాక్టివ్గా లేనప్పటికీ, ఇతర టీ20 లీగుల్లో ఆడుతూ బాగానే సంపాదిస్తున్నాడు. ఇక బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఇతర ఫ్రాంచైజీ లీగ్లను పరిగణలోకి తీసుకొని, పన్నులు, ఇతర ఖర్చులు పోను క్రికెట్ రూపంలోనే షకీబ్ ఏడాదికి 95 నుంచి వంద కోట్ల రూపాయలు అర్జిస్తున్నాడు. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు నుంచి వచ్చిన షకీబ్కు ఇది పెద్ద మొత్తమనే చెప్పొచ్చు. అమెరికా నుంచి బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని పొందిన షకీబ్ అల్ హసన్.. షకీబ్ మోనార్క్ హోల్డింగ్స్ అనే బ్రోకరేజ్ సంస్థకు చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. ఇక బురాక్ కమోడిటీస్ ఎక్స్చేంజీ ద్వారా బంగారం వ్యాపారంలోనూ షకీబ్ యాక్టివ్గా కొనసాగుతున్నాడు. ఇవే గాక విదేశాల్లోనూ షకీబ్ పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం.స్టార్ ఆల్రౌండర్గా..2006లో బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షకీబ్ అల్ హసన్ జట్టులో స్టార్ ఆల్రౌండర్గా ఎదిగాడు. షకీబ్ తన కెరీర్లో 71 టెస్టుల్లో 4,609 పరుగులు చేయడంతో పాటు 246 వికెట్లు తీశాడు. 247 వన్డేల్లో 7,570 పరుగులు, 317 వికెట్లు, 129 టీ20ల్లో 2551 పరుగులు, 149 వికెట్లు పడగొట్టాడు. ఇక షకీబ్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్ 19 టెస్టుల్లో 4 విజయాలు, 62 వన్డేల్లో 27 విజయాలు, 39 టీ20ల్లో 16 విజయాలు సాధించింది.Photo Credit: Twitterవివాదాలు..షకీబ్ క్రికెట్ ప్రపంచంలోనూ, వెలుపలా అత్యంత వివాదాస్పద వ్యక్తిగా ఉన్నాడు. ఒక క్రికెటర్గా, అతను తన తొందరపాటు స్వభావం, దుష్ప్రవర్తనకు సంబంధించిన అనేక క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని నివేదించడంలో విఫలమైనందుకు, ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందున షకీబ్పై రెండేళ్ల నిషేధం విధించింది.ఇక 2024లో షకీబ్పై స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలు రాగా, బంగ్లాదేశ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అతనికి జరిమానా విధించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే, 2017లో అతని కంపెనీ IFIC బ్యాంక్ నుండి తీసుకున్న చెల్లించని రుణానికి సంబంధించి చెక్ మోసం ఆరోపణలు అతనిపై వచ్చాయి. 2025 ప్రారంభంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో, షకీబ్పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పాటు ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది.Photo Credit: Twitterవ్యక్తిగత జీవితం..2012లో షకీబ్ అల్ హసన్.. బంగ్లాదేశీ అమెరికన్ అయిన ఉమ్మే అహ్మద్ శిశిర్ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. షకీబ్ ఇంగ్లీష్ క్లబ్ వోర్సెస్టర్షైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆమెను తొలిసారి కలిశాడు. వారికి అలైనా, ఎర్రమ్ అనే ఇద్దరు కుమార్తెలు సహా ఐజా అనే కుమారుడు ఉన్నారు.చదవండి: స్వదేశానికి రషీద్ ఖాన్.. జింబాబ్వే ఆల్రౌండర్కు జాక్పాట్! -
స్వదేశానికి రషీద్ ఖాన్.. జింబాబ్వే ఆల్రౌండర్కు జాక్పాట్!
జింబాబ్వే స్టార్ ఆల్రౌండర్ సికందర్ రజా హండ్రెడ్ కాంపిటీషన్లో బంపరాఫర్ కొట్టేశాడు. ఐర్లాండ్తో వన్డే సిరీస్ కారణంగా అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎంఐ లండన్ను వీడాడు. దీంతో రషీద్ ఖాన్ స్థానంలో సికందర్ రజాను తాత్కాలిక విదేశీ ఆటగాడిగా ఎంపిక చేసినట్లు ఎంఐ లండన్ ఫ్రాంచైజీ తెలిపింది. ఐర్లాండ్తో సిరీస్ కోసం రషీద్ వెళ్లిపోవడంతో రజాతో ఒప్పందం కుదుర్చుకున్న ఎంఐ లండన్ మిగతా మ్యాచ్లకు అతడిని అందుబాటులో ఉండాలని కోరింది. దీనికి సికందర్ రజా కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఎంఐ లండన్ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది. 'రషీద్ ఖాన్ స్థానంలో తాత్కాలిక ఆటగాడిగా జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజాను ఎంపిక చేశాం. రషీద్ స్థానంలో మిగిలిన మ్యాచ్లను సికందర్ రజా ఆడనున్నాడు. ఎంఐ లండన్లోకి నీకు స్వాగతం రజా' అని తెలిపింది. ఇక హండ్రెడ్ టోర్నీలో చాంపియన్గా నిలవాలని తాపత్రయపడుతున్న ఎంఐ లండన్ జట్టులో సికందర్ రజా చేరికతో మిడిలార్డర్ బలోపేతం కావడంతో పాటు అతడి స్పిన్ సేవలు జట్టుకు ఎంతో ఉపయోగపడనుందని చెప్పొచ్చు.ఇక సికందర్ రజా స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్లతో జరిగిన వైట్బాల్ సిరీస్ అనంతరం వైటాలిటీ బ్లాస్ట్ టోర్నీలో పాల్గొన్నాడు. టోర్నీలో వోర్సెస్టర్షైర్ తరఫున ఆడిన సికందర్ రజా తొమ్మిది మ్యాచ్లాడి 258 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఎంఐ లండన్ ప్రాంచైజీ నుంచి పిలుపు రావడంతో సికందర్ రజా హండ్రెడ్ టోర్నీ ఆడేందుకు లండన్కు చేరుకున్నాడు. ఇటీవలి కాలంలో టీ20 క్రికెట్లో సికందర్ రజా బెస్ట్ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 376 టీ20 మ్యాచ్లాడిన సికందర్ రజా 136 స్ట్రైక్రేట్తో 7,609 పరుగులు సాధించాడు. ఇక తన ఆఫ్ స్పిన్ బౌలింగ్తో 255 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్లో తన సారథ్యంలోనే జింబాబ్వే సూపర్-6 స్టేజీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాకౌట్ స్టేజీల్లో సికందర్ రజాకు మంచి రికార్డు ఉంది.Sikandar Raza will temporarily replace Rashid Khan as an overseas player for MI London.Rashid Khan has joined up with Afghanistan for their white-ball series in Ireland. The experienced Zimbabwe all-rounder joins MI London after being on international duty for his home… pic.twitter.com/zSufGHOwZu— MI London (@MILondonCricket) August 5, 2026Read: విండీస్పై పాక్ విజయం.. డబ్ల్యూటీసీ లెక్కలు తారుమారు! -
విండీస్పై పాక్ విజయం.. డబ్ల్యూటీసీ లెక్కలు తారుమారు!
వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. అయితే డబ్ల్యూటీసీ పాయింట్ల విషయంలో విండీస్పై విజయం పాకిస్తాన్కు కాస్త ఉపశమనమిచ్చింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పరంగా మార్పు లేనప్పటికీ పాకిస్తాన్ ఒక స్థానం ఎగబాకి 8వ స్థానానికి చేరుకోగా, విండీస్ 9వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం పాక్ ఆరు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి 22.22 పర్సంటేజ్ పాయింట్లు (పీసీటీ) కలిగి ఉంది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 87.50 పీసీటీతో టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ ఆడిన 8 మ్యాచ్ల్లో ఏడు విజయాలు అందుకుంది. ఇక ఆ తర్వాత సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వరుసగా 75, 72.22 పీసీటీతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. వీరి తర్వాత బంగ్లాదేశ్ 58.33 పీసీటీతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రా నమోదు చేసింది. టీమిండియా 48.15 పీసీటీతో ఐదో స్థానంలో కొనసాగుతుంది. అయితే శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేస్తే పాయింట్ల పరంగా భారత్ టాప్-3కి దూసుకెళ్లే అవకాశముంది. ఇప్పటివరకు భారత్ 9 మ్యాచ్ల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములు, ఒక డ్రా చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంక (41.67), ఇంగ్లండ్ (24.36) పర్సంటేజ్ పాయింట్లతో ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 2027లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుండడంతో టీమిండియా మూడోసారి ఫైనల్కు చేరుకుంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్తో రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్లోని తొలి మ్యాచ్లో వెస్టిండీస్ గెలిచింది. ఓవర్నైట్ స్కోరు 103/6తో బుధవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ చివరకు 46.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హెడ్జ్ (71 బంతుల్లో 34; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... తేజ్నారాయన్ చందర్పాల్ (17), అమిర్ జంగూ (13), కెప్టెన్ రోస్టన్ చేజ్ (17), షై హోప్ (15), సీల్స్ (0), గ్రీవ్స్ (3) విఫలమయ్యారు.పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం 75 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 23.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి గెలుపొందింది. అజాన్ అవైస్ (18), ఇమాముల్ హక్ (9) ఎక్కువసేపు నిలవలేకపోగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అబ్దుల్లా షఫీఖ్ (24 నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 344 పరుగులు చేయగా... పాకిస్తాన్ జట్టు 387 పరుగులు చేసింది. 2023 తర్వాత విదేశాల్లో పాకిస్తాన్కిదే తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. 📊 The World Test Championship standings have a new look! 🏏The points table has been updated after the West Indies vs Pakistan Test series. West Indies now sit at the bottom, while Pakistan are second-last as the race to the WTC Final continues to heat up. 👀🔥#WTC… pic.twitter.com/OU6eTJj1W6— Sportskeeda (@Sportskeeda) August 5, 2026చదవండి: లైవ్ మ్యాచ్.. హఠాత్తుగా పిడుగు; ఫుట్బాలర్ మృత్యువాత! -
టీ20 క్రికెట్లో జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్జెయింట్స్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా వెల్ష్ఫైర్తో జరిగిన మ్యాచ్లో బట్లర్ 20 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలిచి టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు (491 ఇన్నింగ్స్ల్లో 14,833 పరుగులు) చేసిన బ్యాటర్గా బట్లర్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (14,803 పరుగులు)రికార్డు బట్లర్ బద్దలు కొట్టాడు. బట్లర్, పొలార్డ్ తర్వాత విండీస్ హార్డ్ హిట్టర్, మాజీ ఆటగాడు క్రిస్ గేల్ (14, 562 పరుగులు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వెల్ష్ఫైర్పై మాంచెస్టర్ సూపర్జెయింట్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వెల్ష్ఫైర్ విధించిన 156 పరుగుల టార్గెట్ను మాంచెస్టర్ జెయింట్స్ మరో 31 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (36 బంతుల్లో 62 నాటౌట్), బట్లర్ (20 బంతుల్లో 51 నాటౌట్) ధాటిగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. మరో ఓపెనర్ పాల్ వాల్టర్ (18 బంతుల్లో 37) రాణించాడు. అంతకముందు వెల్ష్ ఫైర్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ (47 బంతుల్లో 71) విధ్వంసం సృష్టించగా, మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (48) రాణించాడు. మాంచెస్టర్ బౌలర్లలో గస్ అకిన్సన్ 2 వికెట్లు తీయగా, జోష్ టంగ్, పాల్ వాల్టర్ చెరొక వికెట్ తీశారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.మార్కరమ్ స్థానంలో కెప్టెన్గాఇక మాంచెస్టర్ రెగ్యులర్ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలగడంతో బట్లర్ తొలిసారి జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే విజయాన్ని సాధించాడు. ఇప్పటికే సౌతాఫ్రికా వెళ్లిపోయిన మార్కరమ్ మిగతా టోర్నీకి దూరమవ్వడంతో బట్లర్ జట్టును నడిపించనున్నాడు. ఇక బట్లర్ బ్యాటర్గా హండ్రెడ్ టోర్నీలో అదరగొడుతున్నాడు. ఈ వికెట్ కీపర్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో 92.3 స్ట్రైక్ రేట్తో 277 పరుగులు సాధించాడు. ఇక మార్కరమ్ స్థానంలో మైకెల్ బ్రాస్వెల్ను తీసుకున్నట్లు మాంచెస్టర్ ఫ్రాంచైజీ ప్రకటించింది. #JosButtler leaves the bowlers stunned 💥He has now surpassed #KieronPollard to become the leading run scorer in T20 history! 🙌#TheHundred 2026 👉 Welsh Fire vs Manchester Super Giants | LIVE NOW! pic.twitter.com/AO9Q7O9TbK— Star Sports (@StarSportsIndia) August 5, 2026 Record breaker 📈👑 @josbuttler Congratulations to Jos Buttler on becoming the all-time leading run scorer in T20 cricket. ⚡️ #StrikeTogether pic.twitter.com/FMuMEetTzL— Lancashire Cricket (@lancscricket) August 5, 2026 There’s a new king of T20 batting 👑Jos Buttler surpasses Kieron Pollard’s 14,803 runs to become the leading run-scorer in T20 history ✨ pic.twitter.com/QlAYAFwKFU— Cricinfo (@cricinfo) August 5, 2026Read: నా ఫెవరేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: షమీ -
రెండో టెస్టులో పాకిస్తాన్ విజయం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్): బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో వెస్టిండీస్తో రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమంగా ముగించింది. సిరీస్లోని తొలి మ్యాచ్లో వెస్టిండీస్ గెలిచింది. ఓవర్నైట్ స్కోరు 103/6తో బుధవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ చివరకు 46.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హెడ్జ్ (71 బంతుల్లో 34; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... తేజ్నారాయన్ చందర్పాల్ (17), అమిర్ జంగూ (13), కెప్టెన్ రోస్టన్ చేజ్ (17), షై హోప్ (15), సీల్స్ (0), గ్రీవ్స్ (3) విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం 75 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 23.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి గెలుపొందింది. అజాన్ అవైస్ (18), ఇమాముల్ హక్ (9) ఎక్కువసేపు నిలవలేకపోగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అబ్దుల్లా షఫీఖ్ (24 నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 344 పరుగులు చేయగా... పాకిస్తాన్ జట్టు 387 పరుగులు చేసింది. 2023 తర్వాత విదేశాల్లో పాకిస్తాన్కిదే తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. -
చరిత్ర సృష్టించిన మిచెల్ మార్ష్.. తొలి క్రికెటర్
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సన్రైజర్స్ ఫ్రాంచైజీలకు (మూడు జట్లకు) ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.మార్ష్ ఇప్పటికే ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున.. ఇంగ్లండ్లో జరిగే ది హండ్రెడ్ టోర్నీలో సన్రైజర్స్ లీడ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.తాజాగా అతను దక్షిణాఫ్రికా టీ20 లీగ్ SA20లోకి కూడా అడుగుపెట్టాడు. సీజన్-5 కోసం సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ అతడిని జట్టులోకి తీసుకుంది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్, సన్రైజర్స్ లీడ్స్, సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్.. ఈ మూడు గ్లోబల్ ఫ్రాంచైజీలకు ఆడిన తొలి ఆటగాడిగా మారాడు.కాగా, SA20 2027 సీజన్కు సంబంధించి ఆరు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్లు, ప్రీ-ఆక్షన్ సైనింగ్లను ఖరారు చేశాయి. చాలామంది స్టార్ ప్లేయర్లు ప్రీ-ఆక్షన్ సైనింగ్స్లో భాగమయ్యారు. డర్బన్ సూపర్ జెయింట్స్ సామ్ కర్రన్తో, జోబర్గ్ సూపర్ కింగ్స్ జేసన్ హోల్డర్తో, ఎంఐ కేప్టౌన్ విల్ జాక్స్తో, పార్ల్ రాయల్స్ జో రూట్తో, ప్రిటోరియా క్యాపిటల్స్ ఫిల్ సాల్ట్తో ఒప్పందాలు చేసుకున్నాయి. -
పాక్తో రెండో టెస్ట్.. విండీస్కు భారీ ఎదురుదెబ్బ
పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్ బ్రాండన్ కింగ్ గాయం కారణంగా మ్యాచ్లో మిగిలిన భాగానికి దూరమయ్యాడు. ఆగస్టు 4న మూడో రోజు ఆట సందర్భంగా అతడికి తీవ్ర లోయర్ బ్యాక్ మసిల్ స్పాసమ్స్ వచ్చాయి.పాక్ ఇన్నింగ్స్లో 75వ ఓవర్ సందర్భంగా బాబర్ ఆజమ్ రనౌట్లో కింగ్ కీలక పాత్ర పోషించాడు. బాబర్ సింగిల్ కోసం ప్రయత్నించగా, తిరిగి క్రీజులోకి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో కవర్ ప్రాంతం నుంచి కింగ్ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో బాబర్ రనౌట్ అయ్యాడు.అయితే ఈ అద్భుతమైన ఫీల్డింగ్ ప్రయత్నం కింగ్కు తీవ్ర గాయాన్ని మిగిల్చింది. బంతిని అందుకుని డైరెక్ట్ త్రో వేసే సమయంలో అతడు ఇబ్బందికరంగా ల్యాండ్ కావడంతో వెన్ను కండరాల్లో తీవ్ర నొప్పి వచ్చింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అతడిని స్ట్రెచర్పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.క్రికెట్ వెస్టిండీస్ వైద్య బృందం ప్రాథమిక పరీక్షల అనంతరం కింగ్కు లోయర్ బ్యాక్ మసిల్ స్పాసమ్స్ ఉన్నట్లు నిర్ధారించింది. వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. గాయం మరింత తీవ్రం కాకూడదనే ఉద్దేశంతో మిగిలిన మ్యాచ్కు అతడిని దూరంగా ఉంచారు.కింగ్ తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులు చేశాడు. అతడి గైర్హాజరీ వెస్టిండీస్ బ్యాటింగ్ కూర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్లో అతడు బ్యాటింగ్కు రాలేడు.కింగ్ లేని లోటు ఈ మ్యాచ్లో విండీస్ గెలుపోటములను శాశించే స్థితిలో ఉంది. ఆట నాలుగో రోజు విండీస్ రెండో ఇన్నింగ్స్లో ఘోరంగా పతనమైంది. తొలి సెషన్ సమయానికి ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (3), షమార్ జోసఫ్ (9) క్రీజ్లో ఉన్నారు. మరో రెండు వికెట్లు పడితే విండీస్ ఇన్నింగ్స్ ముగుస్తుంది. సాజిద్ ఖాన్ (4 వికెట్లు), అలీ ఉస్మాన్ (3 వికెట్లు) విండీస్ను ఘెరంగా దెబ్బతీశారు. ప్రస్తుతం విండీస్ కేవలం 72 పరుగుల లీడ్లో ఉంది. ఈ మ్యాచ్లో విండీస్ ఓటమి తప్పించుకోవాలంటే ఏదైనా మహాద్భుతమే జరగాలి. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి టెస్ట్ గెలవడంతో విండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. -
2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ షెడ్యూల్ ఖరారు
2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు మ్యాచ్లు జరుగనున్నాయి. ఐసీసీ టోర్నీ తేదీలను ఖరారు చేసినప్పటికీ, వేదికను ఇంకా నిర్ణయించలేదు. మొత్తం 10 జట్లు ఈ క్వాలిఫయర్లో పోటీ పడనున్నాయి.ఈసారి క్వాలిఫికేషన్ విధానంలో కీలక మార్పులు ఉన్నాయి. 10 జట్లు క్వాలిఫయర్లో పాల్గొంటాయి. ఇక్కడ చాంపియన్గా నిలిచిన జట్టు నేరుగా 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధిస్తుంది. 2, 3, 4 స్థానాల్లో నిలిచే జట్లు కొత్తగా ప్రవేశపెట్టిన సూపర్ సిరీస్ దశకు వెళ్తాయి. సూపర్ సిరీస్లో విజేతకు ప్రపంచకప్ ప్రధాన దశలో మిగిలిన ఒక బెర్త్ దక్కుతుంది.ఏ జట్లు క్వాలిఫయర్కు వస్తాయి..?10 జట్లలో 2 జట్లు 2026 సెప్టెంబర్ 30 నాటికి వన్డే ర్యాంకింగ్స్లో దిగువన ఉండే ఫుల్ మెంబర్ జట్లు. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఇందుకు మినహాయింపు. 4 జట్లు క్రికెట్ వరల్డ్కప్ లీగ్ 2లో టాప్-4 జట్లు. మిగతా 4 జట్లు వరల్డ్కప్ క్వాలిఫయర్ ప్లేఆఫ్లో టాప్-4 జట్లు.విండీస్ పరిస్థితి ఆసక్తికరంప్రస్తుతం వెస్టిండీస్ పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. వన్డే ర్యాంకింగ్స్లో 10వ స్థానంలో ఉన్న ఆ జట్టు సెప్టెంబర్ 30 కట్ఆఫ్కు ముందు భారత్తో రెండు మ్యాచ్లు ఆడనుంది. ఆ రెండు మ్యాచ్ల ఫలితాలు, అలాగే ఆఫ్ఘనిస్తాన్-ఐర్లాండ్ సిరీస్ ఫలితాలు వారి ప్రపంచకప్ మార్గాన్ని ప్రభావితం చేస్తాయి. 2027 ODI ప్రపంచకప్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది. -
యశ్ ధుల్ విధ్వంసకర శతకం
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అదరగొట్టింది. పూరానీ ఢిల్లీ 6పై ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ విజయానికి యువ బ్యాటర్ యశ్ ధుల్ సంచలన సెంచరీ ప్రధాన కారణంగా నిలిచింది.141 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ధుల్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో అజేయ సెంచరీ బాదాడు. ధుల్ ఒంటిచేత్తో సెంట్రల్ ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు. అతడికి మరో ఎండ్లో యుగల్ సైనీ (27 నాటౌట్) నామమాత్రపు అండగా ఉన్నాడు. సైనీతో కలిసి ధుల్ అజేయమైన 81 పరుగులు జోడించి మ్యాచ్ను ఏకపక్షం చేశాడు. అంతకుముందు ధుల్ సహ ఓపెనర్ సిద్దార్థ్ జూన్ (8)తో తొలి వికెట్కు 60 పరుగులు జోడించాడు. ధుల్ ధాటికి సెంట్రల్ ఢిల్లీ 13.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత పురానీ ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్ సమర్థ్ సేథ్ (32) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. ఆఖర్లో అశ్విని చిల్లర్ (38), రోహన్ రాఠీ (46) బ్యాట్ ఝులిపించారు. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లలో మోనీ గ్రేవాల్ 3, ఖురానా 2, బరోకా ఓ వికెట్ తీశారు.ధుల్ 2022 అండర్-19 ప్రపంచకప్లో భారత్కు కెప్టెన్గా వ్యవహరించి టైటిల్ గెలిపించాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అతడు 110 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ టోర్నీలో ధుల్ 4 మ్యాచ్ల్లో 229 పరుగులు చేశాడు. సగటు 76.33.అదే ఏడాది అండర్-19 ఆసియా కప్ గెలిచిన భారత్ జట్టులోనూ ధుల్ కీలక సభ్యుడు. అండర్-19 ప్రదర్శనల తర్వాత ధుల్ను భారత క్రికెట్లో భవిష్యత్ టాపార్డర్ బ్యాటర్గా పరిగణించారు. అయితే దురదృష్టవశాత్తు అతడు పెద్దగా రాణించలేకపోయాడు. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో చేసిన సెంచరీ అతడి కెరీర్ను మలుపు తప్పుతుందేమో చూడాలి. -
ఇదేమి ఆటతీరు.. స్వల్ప ఛేదనలో నానా తంటాలు!
సాధారణంగా 100 బంతుల్లో 86 పరుగుల టార్గెట్ అంటే సునాయాసంగా ఊదిపారేయచ్చు. కానీ వెల్ష్ ఫైర్ జట్టు మాత్రం ఆ చిన్న టార్గెట్ను అందుకోవడానికి నానా తంటాలు పడింది. చివరకు ఎలాగోలా 3 వికెట్ల తేడాతో గెలిచి గట్టెక్కింది. హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్జెయింట్స్పై వెల్ష్ఫైర్ కష్టపడి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. రియానా మెక్డొనాల్డ్ (18), స్మృతి మంధాన (15) పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లలో ఎవరు పెద్దగా రాణించలేదు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో ఒర్లా ప్రెండెగాస్ట్ 4 వికెట్లతో చెలరేగగా, హెథర్ గ్రహమ్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెల్ష్పైర్ కూడా పూర్తిగా తడబడినప్పటికీ మరో 9 బంతులు మిగిలి ఉండగా 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. అయితే ఒక దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన వెల్ష్ఫైర్ను హెథర్ గ్రాహం (16 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. ఓపెనర్లు జార్జియా వోల్ (16), సారా బ్రైస్ (16) రాణించారు. మాంచెస్టర్ బౌలర్లలో సోఫీ ఎసెల్స్టోన్ 3 వికెట్లు తీయగా, రెబెక్కా టైసన్, మాడీ విల్లర్స్, కేథరిన్ బ్రైస్ తలా ఒక వికెట్ తీశారు.కాగా వెల్ష్ఫైర్కు ఇది ఆరు మ్యాచ్ల్లో మూడో విజయం కాగా, మాంచెస్టర్ సూపర్జెయింట్స్కు రెండో పరాజయం. 14 పాయింట్లతో మాంచెస్టర్ జెయింట్స్ మూడో స్థానంలో ఉండగా, వెల్ష్ఫైర్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.Read: ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్గా ఆసీస్ దిగ్గజం! -
ఒకే లీగ్లో 4 రోజుల్లోనే రెండు ఫ్రాంఛైజీలతో ఒప్పందం!
లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)-2026 టోర్నమెంట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెటర్ ఇఫ్తికార్ అహ్మద్ అసాధారణ రీతిలో నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు ఫ్రాంఛైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ‘ఇదెక్కడి చోద్యంరా బాబూ’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హల్హల్ చేస్తున్నాయి.అసలేం జరిగిందంటే.. 35 ఏళ్ల ఇఫ్తికార్ అహ్మద్ బ్యాటింగ్ ఆల్రౌండర్. కుడిచేతి వాటం గల బ్యాటర్ అయిన అతడు.. రైటార్మ్ స్పిన్నర్ కూడా! పాక్ తరఫున ఇప్పటికి 4 టెస్టులు, 28 వన్డేలు, 66 టీ20 మ్యాచ్లు ఆడిన ఇఫ్తికార్.. ఆయా ఫార్మాట్లలో 61, 614, 998 పరుగులు చేశాడు.పీఎస్ఎల్లో పర్లేదుఅదే విధంగా టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో 16, టీ20లలో ఎనిమిది వికెట్లు కూల్చాడు. ఇక 2024లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇఫ్తికార్ అహ్మద్.. ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఓ మోస్తరుగా రాణించాడు. పది మ్యాచ్లలో కలిపి 72 పరుగులు చేయడం(నాలుగుసార్లు నాటౌట్)తో పాటు.. 12 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు నేషనల్ టీ20 కప్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఆడాడు.మొన్న అలా. . ఇపుడిలాఇదిలా ఉంటే.. ఆగష్టు 2న లంక ప్రీమియర్ లీగ్లో భాగమైన దంబుల్లా సిక్సర్స్తో ఇఫ్తికార్ అహ్మద్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, ఆ రోజే జాఫ్నా కింగ్స్తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో దంబుల్లా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి పరాభవంతో ఇంటిబాటపట్టింది.ఈ నేపథ్యంలో ఇఫ్తికార్ అహ్మద్ ఊహించని రీతిలో ఆగష్టు 5న క్యాండీ రాయల్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ జట్టు లీగ్ దశలో ఎనిమిదింట మూడు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ చేరింది. ఈ క్రమంలో ఇఫ్తికార్ ప్లే ఆఫ్స్ దశలో క్యాండీ రాయల్స్కు ఆడేందుకు సిద్ధమయ్యాడు. అంటే నాలుగు రోజుల వ్యవధిలోనే దంబుల్లాను వీడి అతడు క్యాండీ రాయల్స్తో జట్టుకట్టాడు.అంతంతమాత్రంగానేఈ విషయాన్ని క్యాండీ రాయల్స్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇఫ్తికార్ అహ్మద్కు స్వాగతం చెబుతూ అతడు ప్లే ఆఫ్స్లో కీలక పాత్ర పోషించబోతున్నాడనే సంకేతాలు ఇచ్చింది. కాగా 2023లో ఇఫ్తికార్ లంక ప్రీమియర్ లీగ్లో ఆడాడు. అప్పుడు అతడు కొలంబో క్యాప్స్కి ప్రాతినిథ్యం వహించి.. రెండు మ్యాచ్లలో రెండు వికెట్లు తీయడంతో పాటు నాలుగు ఇన్నింగ్స్ ఆడి 25 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే.. బుధవారం క్వాలిఫయర్-1లో జాఫ్నా కింగ్స్- గాలే గాలంట్స్ తలపడుతుండగా.. ఎలిమినేటర్ మ్యాచ్లో క్యాండీ రాయల్స్ కొలంబో క్యాప్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక శుక్రవారం క్వాలిఫయర్-2, శనివారం లంక ప్రీమియర్ లీగ్ ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: RBI అసిస్టెంట్ మేనేజర్ విధుల్లో ఇషాన్ కిషన్ -
ఐర్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్ రద్దు
ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య బ్రెడీ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 5) జరగాల్సి ఉన్న తొలి వన్డే వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 10:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో 12:27 గంటల సమయంలో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.ఈ మ్యాచ్ ఐర్లాండ్ కొత్త ప్రధాన కోచ్ గ్యారీ విల్సన్కు తొలి మ్యాచ్ కావాల్సింది. 2025 మే తర్వాత ఐర్లాండ్ ఆడుతున్న తొలి 50 ఓవర్ల మ్యాచ్ కూడా ఇదే. వర్షం కారణంగా ఈ రెండు సందర్భాలు వాయిదా పడ్డాయి. జూన్లో భారత్పై 2-0తో టీ20 సిరీస్ విజయం సాధించిన తర్వాత ఐర్లాండ్ ఆడాల్సిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఇదే.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఐర్లాండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని మిగతా నాలుగు వన్డేలు ఆగస్ట్ 7, 10, 12, 14 తేదీల్లో జరుగనున్నాయి. రెండో వన్డే బ్రెడీలో, ఆఖరి మూడు వన్డేలు బెల్ఫాస్ట్లో షెడ్యూలయ్యాయి.క్రికెట్ ఐర్లాండ్ అసంతృప్తిఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల నేపథ్యంలో ఆ దేశానికి ఆతిథ్యం ఇవ్వడంపై ఐర్లాండ్ క్రికెట్ అసౌకర్యం వ్యక్తం చేసింది. ఆ దేశ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సారా కీన్ ఈ విషయమై నైతిక అసౌకర్యం ఉందని గతంలోనే పేర్కొంది. అయినప్పటికీ, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఐర్లాండ్ ఈ సిరీస్కు ఆతిథ్యం ఇస్తోంది. -
ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్గా ఆసీస్ దిగ్గజం!
ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు కోచ్గా బాధ్యతలు చేపట్టిన కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ ఇదే విషయమై మైక్ హస్సీని సంప్రదించినట్లు సమాచారం. మైక్ హస్సీ కూడా ప్లెమింగ్ ప్రతిపాదనపై సానుకూల స్పందనే వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం మైక్ హస్సీ హండ్రెడ్ కాంపిటీషన్లో వెల్ష్ ఫైర్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక గతంలో ప్లెమింగ్, మైక్ హస్సీ కలిసి 15 ఏళ్ల పాటు చెన్నై సూపర్కింగ్స్ మేనేజ్మెంట్లో కలిసి పని చేశారు. చాలాకాలం పాటు సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన మైక్ హస్సీ ఆ తర్వాత సీఎస్కేకు మెంటార్గా వ్యహరించాడు. ఈ సమయంలో స్టీఫెన్ ప్లెమింగ్ హెడ్కోచ్గా ఉన్నాడు. 15 ఏళ్ల బంధమే ఇవాళ ప్లెమింగ్ను ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ పదవికి మైక్ హస్సీ పేరును ప్రతిపాదించేలా చేసిందని చెప్పొచ్చు.ఇక న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం బ్రెండన్ మెక్కల్లమ్ టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో స్టీఫెన్ ప్లెమింగ్ను రెడ్బాల్ క్రికెట్ కోచ్ పదవికి ఎంపిక చేసింది. ఇక స్టీఫెన్ ప్లెమింగ్ సీఎస్కే జట్టు కోచ్ పదవికి రాజీనామా చేసి 18 ఏళ్ల బంధానికి స్వస్తి పలికాడు. ప్రస్తుతం సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్తో టెస్టు సిరీస్ ఆడనుంది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 19 నుంచి 23 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది. ఆగస్టు 27 నుంచి 31 వరకు రెండో టెస్టు, సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు మూడో టెస్టు మ్యాచ్ ఆడనుంది.ఆస్ట్రేలియా తరఫున 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మైక్ హస్సీ ఆ జట్టు తరఫున బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున హస్సీ 79 టెస్టుల్లో 6,235 పరుగులు, 185 వన్డేల్లో 5,442 పరుగులు, 38 టీ20ల్లో 721 పరుగులు సాధించాడు. తన కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 22 సెంచరీలు సాధించాడు. ఇక ఐపీఎల్లో 59 మ్యాచ్లు ఆడిన మైక్ హస్సీ 1,977 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ ఉండడం విశేషం.England Head Coach Stephen Fleming has approached Mike Hussey to become England’s batting coach. (Tom Morris). pic.twitter.com/Jr1cdsaSyl— Mufaddal Vohra (@mufaddal_vohra) August 5, 2026Read: ఈసీబీ కీలక నిర్ణయం.. ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై నిషేధం? -
కెప్టెన్ మార్పు.. మార్క్రమ్ స్థానంలో మరో స్టార్ ప్లేయర్
ది హండ్రెడ్ 2026 సీజన్ మధ్యలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. బుధవారం వెల్ష్ ఫైర్తో జరిగే ఆరో లీగ్ మ్యాచ్కు ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది.మార్క్రమ్ టోర్నీ మధ్యలో వైదొలగడంతో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఇంగ్లండ్ మాజీ వైట్బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ను కెప్టెన్గా నియమించింది. మిగిలిన సీజన్ మొత్తానికి అతడే కెప్టెన్గా కొనసాగుతాడని పేర్కొంది.బట్లర్కు అంతర్జాతీయ కెప్టెన్సీలో మంచి అనుభవం ఉంది. ఇంగ్లండ్కు 95 వన్డేల్లో కెప్టెన్గా వ్యవహరించిన అతడు 44 విజయాలు సాధించాడు. 51 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఇంగ్లండ్కు నాయకత్వం వహించి 26 విజయాలు అందించాడు.టోర్నీలో కష్టాల్లో ఉన్న సూపర్ జెయింట్స్ను బట్లర్ తన నాయకత్వంతో నాకౌట్ దశకు తీసుకెళ్తాడని ఫ్రాంచైజీ ఆశిస్తోంది.మార్క్రమ్ స్థానంలో మైకేల్ బ్రేస్వెల్మార్క్రమ్ నిష్క్రమణను ప్రకటించిన వెంటనే అతడి స్థానంలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ను తీసుకున్నట్లు సూపర్ జెయింట్స్ వెల్లడించింది. మార్క్రమ్ స్థానాన్ని భర్తీ చేయడం సులభం కాకపోయినా.. బ్రేస్వెల్ బ్యాట్తో పాటు బంతితోనూ జట్టుకు ఉపయోగపడగలడు. 218 టీ20 మ్యాచ్ల్లో అతడు 3,717 పరుగులు చేసి, 105 వికెట్లు తీశాడు. ఇటీవల పీఎస్ఎల్ 2026లో పెషావర్ జల్మీ టైటిల్ గెలవడంలోనూ బ్రేస్వెల్ కీలక పాత్ర పోషించాడు.సూపర్ జెయింట్స్కు నాకౌట్ అవకాశాలున్నాయా..?ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఆరో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలు, మూడు ఓటములను ఎదుర్కొంది. ఇంకా మూడు లీగ్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వెల్ష్ ఫైర్, సదరన్ బ్రేవ్, సన్రైజర్స్ లీడ్స్తో తలపడాల్సి ఉంది.మూడు మ్యాచ్ల్లోనూ గెలిస్తే సూపర్ జెయింట్స్ గరిష్ఠంగా 16 పాయింట్లు సాధించగలదు. దీంతో టాప్-3లోకి వెళ్లే అవకాశం ఇంకా ఉంది. అయితే నాకౌట్ బెర్త్ పూర్తిగా వారి చేతుల్లో లేదు. మిగతా జట్ల ఫలితాలు కూడా అనుకూలంగా రావాల్సి ఉంటుంది.ది హండ్రెడ్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా లార్డ్స్లో జరిగే ఫైనల్కు అర్హత సాధిస్తుంది. రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్లో తలపడతాయి. -
ఈసీబీ కీలక నిర్ణయం.. ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై నిషేధం?
అప్గానిస్తాన్తో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ నిర్వహణకు సిద్ధమైన ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అఫ్గాన్తో వన్డే సిరీస్ ఆడడం ఇంగ్లండ్కు ఇష్టం లేదు. దీనికి ప్రధాన కారణం ఆఫ్గన్లో మహిళల పట్ల తాలిబన్ల ప్రవర్తన, లింగ వివక్ష అని తెలుస్తోంది. 2025 చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్తాన్తో ఇంగ్లండ్ తలపడినప్పుడు లండన్లో వివిధ పార్టీలకు చెందిన 160 మంది ఎంపీల బృందం ఈసీబీని తీవ్రంగా విమర్శించింది. అప్పటి నుంచి అఫ్గాన్తో క్రికెట్ ఆడేందుకు నిరాకరించిన ఇంగ్లండ్ కేవలం ఐసీసీ మేజర్ టోర్నీల్లో మాత్రమే మ్యాచ్లు ఆడుతోంది. తాజాగా తమ కనుసన్నల్లో ఉండే ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆఫ్గన్తో సిరీస్ నిర్వహణకు సిద్దమవ్వడం ఈసీబీకి కోపం తెప్పించింది. ఈ చర్య వల్ల ఇంగ్లండ్తో భవిష్యత్తులో ఆడాల్సిన అంతర్జాతీయ మ్యాచ్లను ఐర్లాండ్ కోల్పోయే ప్రమాదముందని చెప్పొచ్చు. గతంలో స్వదేశంలో యాషెస్ సిరీస్ ఆడడానికి ముందు ఇంగ్లండ్ సన్నాహకంగా ఐర్లాండ్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. 2019, 2023లో ఇది రిపీట్ అయింది. అయితే 2027 యాషెస్ సిరీస్కు ముందు మాత్రం ఈసారి ఐర్లాండ్తో కాకుండా బంగ్లాదేశ్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాలని ఈసీబీ నిర్ణయం తీసుకోవడం చూస్తే ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై ఏర్పడిన వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుతో (ఏసీబీ) సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నట్లు కనిపిస్తోంది. గత 10 సంవత్సరాల్లో ఐర్లాండ్, ఆఫ్గన్ల మధ్య ఇది ఐదో సిరీస్ కావడం విశేషం.అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ నిర్వహించడంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు స్వదేశంలో ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ఆడడంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బిగ్-త్రీ (బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా)లో రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తీరును వ్యతిరేకిస్తున్న వేళ అది క్రమంగా ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.చదవండి: తొలి టెస్టులో చోటు కష్టమే.. అందుకేనా బ్యాటింగ్ ప్రాక్టీస్! -
ఆసీస్తో టెస్ట్ సిరీస్ మధ్యలో మరో సిరీస్ ఆడనున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఒకేసారి రెండు సిరీస్లు ఆడనున్నాయి. సీనియర్ పురుషుల జట్టు ఆసీస్తో రెండు మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్ ఆడనుండగా.. బంగ్లాదేశ్ హై పెర్ఫార్మెన్స్ (HP) జట్టు టాప్ ఎండ్ టీ20 సిరీస్ 2026లో పాల్గొననుంది.వార్మప్ మ్యాచ్తో ప్రారంభంబంగ్లాదేశ్ ఆస్ట్రేలియా పర్యటన ఆగస్టు 6న క్రికెట్ ఆస్ట్రేలియా XIతో జరిగే మూడు రోజుల వార్మప్ మ్యాచ్తో ప్రారంభమవుతుంది.ఆ తర్వాత ఆగస్టు 13న డార్విన్లోని మారారా క్రికెట్ గ్రౌండ్లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. రెండో టెస్టు మెక్కేలో ఆగస్టు 22న మొదలవుతుంది. 23 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతున్న ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ ఇది.అదే రోజు బంగ్లాదేశ్ HP జట్టు టాప్ ఎండ్ టీ20 సిరీస్లో తన పోరాటాన్ని ప్రారంభించనుంది. బంగ్లాదేశ్ HP జట్టు వరుసగా మూడో ఏడాది టాప్ ఎండ్ టీ20 సిరీస్లో పాల్గొంటోంది. ఈసారి ఈ టోర్నీలో మొత్తం 30 మ్యాచ్లు జరగనున్నాయి. సెమీఫైనల్స్, ఫైనల్ ఒకే రోజు నిర్వహించనున్నారు.ఈ టోర్నీలో బంగ్లాదేశ్ HPతో పాటు నేపాల్, న్యూజిలాండ్ A, ఆతిథ్య NT స్ట్రైక్, హోబార్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్, విక్టోరియా జట్లు పాల్గొంటాయి.2024లో ఫైనల్కు చేరిన బంగ్లాదేశ్టాప్ ఎండ్ టీ20 సిరీస్ 2024లో అక్బర్ అలీ నేతృత్వంలోని బంగ్లాదేశ్ HP జట్టు ఫైనల్కు చేరింది. అయితే టైటిల్ పోరులో అడిలైడ్ స్ట్రైకర్స్ చేతిలో ఓటమిపాలైంది.ఆ టోర్నీలో బంగ్లాదేశ్ బౌలర్ రిపోన్ మొండోల్ 15 వికెట్లతో అత్యధిక వికెట్ టేకర్గా నిలిచాడు. బ్యాటింగ్లో పర్వేజ్ హొసైన్ ఎమోన్ ఎనిమిది ఇన్నింగ్స్ల్లో 186 పరుగులతో ఆకట్టుకున్నాడు.అయితే 2025 సీజన్లో బంగ్లాదేశ్ HP ఆరు మ్యాచ్ల్లో కేవలం రెండు విజయాలే సాధించింది. నేపాల్, NT స్ట్రైక్పై గెలిచిన బంగ్లాదేశ్.. పాకిస్థాన్ A, పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ స్టార్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ చేతిలో ఓడిపోయింది. -
తొలి టెస్టులో చోటుకోసం కుల్దీప్ మాస్టర్ ప్లాన్!
శ్రీలంకతో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు కోసం మాస్టర్ప్లాన్ వేసినట్లు అనిపిస్తోంది. తొలి టెస్టుకు సంబంధించి తుది జట్టును ప్రకటించినప్పటికీ, కుల్దీప్ తొలి టెస్టులో ఆడుతాడా లేదా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో లంక గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా బృందం ఇప్పటికే కొలంబో మైదానంలో ప్రాక్టీస్ను ఆరంభించింది. ఈ ప్రాక్టీస్లో కుల్దీప్ తన శైలికి భిన్నంగా బంతితో కాకుండా బ్యాట్తో ప్రాక్టీస్ చేయడం విశేషం. దాదాపు 40 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ కొనసాగించిన కుల్దీప్ ఒక్కసారి కూడా బౌలింగ్ వేయలేదు. అయితే తొలి టెస్టులో కుల్దీప్కు చోటు దక్కడం అనుమానంగా ఉండడంతో జట్టులో బ్యాటర్గానైనా చాన్స్ అందుకోవాలనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.టీమిండియాను వరుస గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్ గాయాలతో దూరమవ్వగా, ఫిట్నెస్ టెస్టు పాసైనప్పటికీ బుమ్రా కూడా చివరి నిమిషంలో లంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. దీంతో లంకతో సిరీస్కు కుల్దీప్ ఎంపికైనప్పటికీ, ఆప్షనల్గా కనిపించాడు. ఇప్పుడు టీమిండియాను గాయాలు వెంటాడడంతో కుల్దీప్ తొలి టెస్టు ఆడే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే మాత్రం జడేజాతో కలిసి కుల్దీప్ బౌలింగ్ను పంచుకోనున్నాడు. అంతేకాదు కుల్దీప్ యాదవ్కు టెస్టుల్లో బ్యాటింగ్లోనూ మంచి రికార్డే ఉంది. ఈ మణికట్టు స్పిన్నర్ ఇప్పటివరకు 18 టెస్టుల్లో 234 పరుగులు సాధించాడు. 40 పరుగులు అతడి అత్యుత్తమంగా ఉంది. అయితే తొలి టెస్టులో కుల్దీప్ చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది జట్టు ప్రకటన వరకు ఎదురుచూడాల్సిందే. అయితే లంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు కొలంబో వేదికగా మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక తొలి టెస్టు ఆగస్టు 15న గాలే వేదికగా, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా జరగనున్నాయి.లంకతో టెస్టు సిరీస్ భారత్కు కీలకమైంది. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించాలంటే లంకపై సిరీస్ గెలవడం తప్పనిసరి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, లంక ఆరో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: శకం ముగిసింది.. డబ్ల్యూడబ్ల్యూఈకి స్టార్ రెజ్లర్ గుడ్ బై -
సూపర్ కింగ్స్లోకి హోల్డర్.. సీనియర్ ప్లేయర్కు గుడ్బై
వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్కు టీ20 ఫార్మాట్లో అదిరిపోయే సీజన్ కొనసాగుతోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్లో సత్తా చాటిన అతడు.. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున కూడా కీలక ప్రదర్శనలు చేశాడు. దీంతో వచ్చే సీజన్ SA20 కోసం జోహన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్ అతడిని సొంతం చేసుకుంది.SA20 2027 సీజన్కు సంబంధించి ఆరు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్లు, ప్రీ-ఆక్షన్ సైనింగ్లను ఖరారు చేయగా.. హోల్డర్ను జోహన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకుంది. హోల్డర్ రాకతో ఆ జట్టు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ విభాగం కూడా మరింత బలపడనుంది. ముఖ్యంగా మిడిలార్డర్, ఫినిషింగ్ విభాగంలో అతడు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.గుజరాత్ టైటాన్స్ తరఫున అదరగొట్టిన హోల్డర్ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున హోల్డర్ అద్భుతంగా రాణించాడు. కేవలం 11 మ్యాచ్ల్లోనే 17 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు చేరుకోవడంలో అతడి బౌలింగ్ కీలకంగా వ్యవహరించింది.బ్యాటింగ్లోనూ ఐదు లేదా ఆరో స్థానంలో ఆడుతూ ఫినిషర్గా సేవలందించగల హోల్డర్.. జోహన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్కు ఉపయోగపడనున్నాడు. ముఖ్యంగా అతడి స్లో కట్టర్లు, వైవిధ్యమైన బౌలింగ్ SA20లో కీలక ఆయుధంగా మారవచ్చు.ఫాఫ్ డుప్లెసిస్కు గుడ్బైఇదిలా ఉంటే, జోహన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్ తమ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ను రిటైన్ చేసుకోలేదు. గత నాలుగు సీజన్లుగా జట్టుకు నాయకత్వం వహించిన డుప్లెసిస్కు ఇది ఊహించని ముగింపుగా మారింది.SA20 2025-26 సీజన్లో డుప్లెసిస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఏడు మ్యాచ్ల్లో 135 పరుగులు, 27 సగటు, 151.68 స్ట్రైక్రేట్తో ముగించాడు.చెన్నై సూపర్ కింగ్స్, జోహన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్తో పాటు MLCలోని టెక్సాస్ సూపర్ కింగ్స్కు కూడా ప్రాతినిధ్యం వహించిన డుప్లెసిస్.. జోహన్నెస్బర్గ్ ఫ్రాంచైజీతో తన ప్రయాణాన్ని ముగించాడు.SA20 2027కి ముందు జోహన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్ స్క్వాడ్విదేశీ ఆటగాళ్లు: లూస్ డుప్లూయ్, జేసన్ హోల్డర్, అకీల్ హొసైన్, జేమ్స్ విన్స్దక్షిణాఫ్రికా ఆటగాళ్లు: మాథ్యూ డి విలియర్స్, డొనోవన్ ఫెరీరా, డియాన్ ఫోరెస్టర్, డువాన్ జాన్సెన్, రిలీ రొసోవ్, జాంకో స్మిత్, ప్రెనెలన్ సుబ్రయన్అండర్-23 ఆటగాడు: జారెన్ బాచర్ఇప్పటివరకు భర్తీ చేసిన స్థానాలు: 11మిగిలిన స్థానాలు: 8 -
RBI అసిస్టెంట్ మేనేజర్గా ఇషాన్ కిషన్.. జీతం ఎంతంటే?
టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ విధుల్లో భాగంగా.. సహచర ఉద్యోగులతో అతడు కలిసి ఉన్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.టీమిండియా రీఎంట్రీలో అదుర్స్అసలు విషయం ఏమిటంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా టీమిండియా తరఫున బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఈ జార్ఖండ్ పాకెట్ డైనమైట్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్-2026లో అదరగొట్టి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వే పర్యటనలతో బిజీగా గడిపిన ఇషాన్ కిషన్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీమిండియా టెస్టు సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లగా ఇషాన్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. దీంతో స్వస్థలంలో ఉన్న అతడు.. ఆర్బీఐ విధుల్లో చేరినట్లుగా ఉన్న ఫొటో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.పాట్నాలోని ప్రాంతీయ కార్యాలయంలోకాగా స్పోర్ట్స్ కోటాలో భాగంగా ఇషాన్ కిషన్కు చాన్నాళ్ల క్రితమే ఆర్బీబీలో ఉద్యోగం వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూస్18 కథనం ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం లభించగా.. ఇషాన్ ఆర్బీఐ విధుల్లో చేరాడు. పాట్నాలోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లిన ఇషాన్కు సహచర ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. అతడితో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్గా మారాయి.జీతం ఎంతంటే..?కాగా ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్గా నెలకు ఇషాన్ కిషన్కు రూ. 1.22 లక్షల నుంచి 1.24 లక్షల వరకు వేతనం అందుతున్నట్లు తెలుస్తోంది. ప్రొవిడెంట్ ఫండ్ సహా మిగతా కటింగ్స్ అన్నీ పోనూ చేతికి దాదాపు రూ. 1.12 లక్షలు అందుతున్నట్లు సమాచారం.ఇక ఆగష్టు 23 నుంచి దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. త్వరలోనే మళ్లీ అతడు ఆటతో బిజీ కానున్నాడు. ఈ జట్టుకు బిహార్ చిచ్చరపిడుగు, టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్.కాగా 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు 32 వన్డేలు, 55 టీ20 మ్యాచ్లు, 2 టెస్టు మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో 1107, టీ20లలో 1608 పరుగులు.. టెస్టుల్లో 78 రన్స్ చేశాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.చదవండి: అనుష్క శర్మ అలా చేస్తే తప్పేంటి?: షమీIndian cricketer Ishan Kishan has reportedly resumed work as an Assistant Manager at the Reserve Bank of India office in Patna during his break from competitive cricket. Kishan was appointed to the post through the sports quota and was seen carrying out his official… pic.twitter.com/AZPdCflCrM— News18 (@CNNnews18) August 5, 2026 -
అనుష్క శర్మ అలా చేస్తే తప్పేంటి?: షమీ
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మద్దతుగా నిలిచాడు. భార్యాభర్తలు పరస్పరం ఇష్టాలు గౌరవించుకుంటారని.. తమకు నచ్చినట్లు ఉండే స్వేచ్ఛ వారికి ఉందని పేర్కొన్నాడు.భారత్కు వచ్చిన ప్రతిసారీకోహ్లికి ప్రతీ విషయంలోనూ పూర్తి స్పష్టతతో ఉంటాడని.. అతడిని ఎవరూ పెద్దగా ప్రభావితం చేయలేరని షమీ పేర్కొన్నాడు. కాగా కోహ్లి గత కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక బాట పట్టిన సంగతి తెలిసిందే. భార్య అనుష్క, పిల్లలు వామిక, అకాయ్లతో కలిసి లండన్లో సెటిల్ అయినప్పటికీ.. భారత్కు వచ్చిన ప్రతిసారీ ప్రేమానంద్ మహర్షిని కలిసేందుకు అతడు బృందావనం (UP) వెళ్తూ ఉంటాడు.జెన్ జీ నిరసనల సమయంలోనూ..ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్ జీ నిరసనలు చేస్తున్న వేళ కూడా అనుష్కతో కోహ్లి బృందావనానికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో విరుష్క జోడీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఓవైపు విద్యార్థులు, యువత ప్రభుత్వ జవాబుదారీతనం కోసం పోరాడుతుంటే.. అందరికీ రోల్మోడల్గా భావించే కోహ్లి కనీసం స్పందించకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి.అనుష్కను పెళ్లి చేసుకున్న తర్వాతే కోహ్లి ఇలా మారిపోయాడని.. విద్యార్థుల పక్షాన నిలబడే చిన్న ప్రయత్నం కూడా చేయలేదని నెటిజన్లు అతడిపై మండిపడ్డారు. ఈ విషయం గురించి.. ఇటీవల ‘టైమ్స్ నౌ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీకి ప్రశ్న ఎదురైంది.ఒక్కసారి నమ్మితే ప్రాణం పెడతాడుఇందుకు స్పందిస్తూ.. ‘‘అవును అతడు ఆధ్యాత్మిక భావనలో ఉన్నాడు. ఇదేమీ అకస్మాత్తుగా ఇప్పుడే జరిగింది కాదే. తాను నమ్మిన వ్యక్తి, వ్యవస్థ కోసం కోహ్లి నిలబడతాడు. ఒక్కసారి నమ్మితే ప్రాణం పెడతాడు. మహారాజ్ను కలవడం అతడి సొంత ఇష్టం.అనుష్క శర్మ అలా చేస్తే తప్పేంటి?ఇందులో మనం అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు. ఎవరి నమ్మకాలు, ఇష్టాలు వాళ్లవి. మీరు ఏది నమ్మితే దానికే ప్రాధాన్యం ఇస్తారు కదా. కోహ్లి కూడా అంతే. అనుష్క- కోహ్లి భార్యాభర్తలు. ఒకవేళ ఆమె అతడిని ఆధ్యాత్మికత వైపు నడిపించి ఉంటే.. అందులో తప్పేముంది?దాని వల్ల ఎవరికైనా నష్టం వాటిల్లిందా? అసలు ఇందులో ఆమెను తప్పుబట్టడానికి ఏముందో నాకైతే అర్థం కావడం లేదు’’ అని షమీ విరుష్క జోడీని సమర్థించాడు. కాగా కోహ్లి ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఇక షమీ గతేడాది చివరగా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: ఆర్నెళ్లు లేదంటే ఏడాది బ్రేక్ తీసుకో! -
AUS vs BAN: ఆస్ట్రేలియాకు భారీ షాక్
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ వెన్ను నొప్పితో బాధపడుతుండగా.. తాజాగా ఈ జాబితాలో ఆల్రౌండర్ మైఖేల్ నెసర్ కూడా చేరాడు. బ్రిస్బేన్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ క్యాంప్లో నెసర్ కుడి పిక్క గాయానికి గురయ్యాడు.ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతడికి కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే బంగ్లాతో టెస్టు సిరీస్కు నెసర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా హెడ్కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ ధ్రువీకరించాడు.కాగా బంగ్లాతో టెస్టుల కోసం ప్రకటించిన 13 మంది సభ్యుల ఆసీస్ ప్రధాన జట్టులో నెసర్ లేడు. కానీ కమిన్స్, హేజిల్వుడ్లకు బ్యాకప్ బౌలర్గా తీసుకోవాలని ఆసీస్ సెలక్టర్లు భావించారు. కానీ ఇప్పుడు అతడు గాయపడడంతో మరో ప్రత్యామ్నాయ బౌలర్ను వెతుక్కోవాల్సి వచ్చింది. యాషెస్ సిరీస్లో ఆడిన బ్రెండన్ డాగెట్ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశముంది. అయితే వెన్ను గాయంతో బాధపడుతున్న జోష్ ఇంగ్లిష్ మాత్రం తొలి టెస్ట్ సమయానికి కోలుకుంటున్నాడని మెక్డొనాల్డ్ స్పష్టం చేశాడు. ఇక ఆగస్టు 13 నుంచి డార్విన్ వేదికగా బంగ్లాదేశ్-ఆసీస్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టునజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షాద్మాన్ ఇస్లాం, తంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అమిత్ హసన్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లాం, టాస్కిన్ అహ్మద్, హసన్ మహ్ముద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఎబాడత్ హొస్సేన్ చౌదరి, ముష్ఫిక్ హసన్, లిట్టన్ దాస్.బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు..పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్ -
‘ఆర్నెళ్లు లేదంటే ఏడాది బ్రేక్ తీసుకో.. సగం సగం వద్దు’
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాల బారిన పడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఈ ఏడాది ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇప్పటికే అతడు ఎన్నో మ్యాచ్లకు దూరమయ్యాడు. తాజాగా శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్కు కూడా బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు.ఆర్నెళ్లు లేదంటే ఏడాది బ్రేక్ తీసుకోగతంలో వెన్నునొప్పితో సుదీర్ఘకాలం జట్టుకు దూరమైన బుమ్రా.. ఈసారి మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ కర్సాన్ ఘవ్రీ బుమ్రాను ఉద్దేశించి కీలక సూచనలు చేశాడు. మిడ్-డేతో మాట్లాడుతూ..‘‘బుమ్రా ఐదు నుంచి ఆరు నెలలు.. లేదంటే ఓ సంవత్సరం పాటు విరామం తీసుకోవాలి. వందశాతం ఫిట్నెస్ సాధించిన తర్వాతే తిరిగి మైదానంలో అడుగుపెట్టాలి. అలా కాకుండా ప్రతీసారి హడావుడిగా జట్టుతో చేరి.. మధ్యలోనే గాయం వల్ల నిష్క్రమిస్తే కూర్పు దెబ్బతింటుంది.జట్టు ప్రణాళికలు అప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది. పనిభారం తగ్గించేందుకు మధ్య మధ్యలో విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ఇదంతా వృథా ప్రయాస. ఏదైనా సిరీస్ లేదంటే.. టోర్నీ మొత్తం పనిభారం అనే ప్రస్తావన లేకుండా జట్టుతో కొనసాగే ఆటగాడికే పెద్దపీట వేయాలి.భువీ, షమీలను పిలిపించండిబుమ్రా కూడా పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే అతడిని జట్టులో చేర్చాలి. నిజానికి భారత వెటరన్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఐపీఎల్లో నిలకడగా ఆడుతున్నారు. గాయాల బెడద లేకుండా వరుస టోర్నీల్లో పాల్గొంటున్నారు. వారిని తిరిగి టీమిండియాలోకి తీసుకుంటే బాగుంటుంది.సెలక్టర్లు షమీ, భువీల పేర్లు పరిగణనలోకి తీసుకోవాలి. ఫాస్ట్ బౌలర్లలకు గాయాలు సహజం. అయితే, బుమ్రా గత రెండు- మూడేళ్ల నుంచి తరచూ గాయపడుతున్నాడు. మెజారిటీ, కీలక మ్యాచ్లకు అతడు దూరమవుతున్నాడు. టీమిండియాకు ఇది ఎంతమాత్రమూ శుభసూచకం కాదు’’ అని ఘవ్రీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. బుమ్రా స్థానంలో..కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగమైన శ్రీలంకతో టెస్టు సిరీస్కు బుమ్రా దూరం కాగా.. అతడి స్థానంలో జమ్మూ కశ్మీర్ పేస్ బౌలర్ ఆఖిబ్ నబీకి మొదటిసారి భారత జట్టు పిలుపు లభించింది.కాగా 29 ఏళ్ల నబీ దేశవాళీ క్రికెట్లో గత రెండేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ రెండు వరుస సీజన్లలో కలిపి అతను ఏకంగా 104 వికెట్లు పడగొట్టాడు. 2025–26 సీజన్లో 60 వికెట్లు తీసిన నబీ... జమ్మూ కశ్మీర్ క్రికెట్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. చదవండి: సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం -
చరిత్ర సృష్టించిన పాక్ స్టార్ బ్యాటర్.. 68 ఏళ్ల రికార్డు బ్రేక్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ టెస్టుల్లో తన పునరాగమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో షఫీక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 323 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 160 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.పాక్ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు సాధించడంలో షఫీక్ది కీలక పాత్ర. ఈ అజేయ ఇన్నింగ్స్తో షఫీక్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెగ్యులర్గా పాక్ ఇన్నింగ్స్ను ప్రారంభించే షఫీక్ ఈ మ్యాచ్లో మాత్రం మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చాడు. తద్వారావిండీస్ గడ్డపై మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన పాకిస్తాన్ బ్యాటర్గా అవతరించాడు. ఇంతకుముందు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ సయీద్ అహ్మద్ పేరిట ఉండేది. 1958లో సయీద్ అహ్మద్ విండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 150 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో షఫీక్ ఏకంగా 68 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ పట్టు బిగించింది. విండీస్ తమ రెండో ఇన్నింగ్స్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం కరేబియన్ జట్టు 60 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. -
పంత్ హవా.. ఆదాయపు పన్ను చెల్లింపులో అగ్రస్థానం!
దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్న జాబితాలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు సంపాదించాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి ఉత్తరాఖండ్లో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా పంత్ రికార్డులకెక్కాడు. ఆదాయపు పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరాఖండ్ ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న వ్యక్తుల జాబితాను విడుదల చేయగా.. అందులో పంత్ అత్యధిక పన్ను చెల్లించి అగ్రస్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. రూర్కీలో జన్మించిన పంత్ బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్లో ప్రస్తుతం లక్నో క్యాపిటల్స్ నుంచి అందుకున్న మొత్తం, మ్యాచ్ ఫీజులు, ఇతర వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు ఇతరత్రా ఆదాయ మార్గాల ద్వారా సంపాదిస్తున్నాడు. అయితే గతేడాదితో పోలిస్తే పంత్ ఈసారి చెల్లించిన పన్ను మొత్తం రెండింతలకు పైనే ఉండడం గమనార్హం. గతేడాది పంత్ సుమారు రూ. 10.5 కోట్ల పన్ను చెల్లించాడు. ఈసారి మాత్రం అతడి పన్ను చెల్లింపు మొత్తం గణీనీయంగా పెరిగింది. రికార్డు స్థాయిలో రూ. 23.84 కోట్లు చెల్లించి రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా పంత్ నిలిచాడు. మరోవైపు జార్ఖండ్-బీహార్ రాష్ట్రాల్లో అత్యధిక పన్ను చెల్లిస్తున్న వారిలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు.ప్రస్తుతం రిషబ్ పంత్ శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. లంక గడ్డపై రాణించాలనే పట్టుదలతో ఉన్న పంత్ ఇటీవలే తన గురువు ఎంఎస్ ధోని వద్ద ప్రత్యేక సలహాలు, సూచనలు అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో తరఫున పంత్ 14 మ్యాచ్లో 312 పరుగులు సాధించాడు. లక్నోను క్వాలిఫయర్ చేర్చడంలో పంత్ విఫలమయ్యాడు. ఇక ఇటీవల స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో ఆడిన పంత్ 81 పరుగులతో రాణించాడు. ఇక పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడి రెండేళ్లు కావొస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది. PANT BECOMES THE HIGHEST TAXPAYER FROM UTTARAKHAND. 💰 - Rishabh Pant emerged as the highest individual taxpayer in Uttarakhand after paying ₹23.84cr income tax for 2025-26 financial year. (ABP). pic.twitter.com/33xkT1Ev6r— Mufaddal Vohra (@mufaddal_vohra) August 5, 2026చదవండి: నా ఫెవరేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: షమీ -
వైభవ్నే పక్కనపెడతారా?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం విషయంలో మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు సరికాదని విమర్శించాడు. ఈ పిల్లాడిని ఐర్లాండ్పై గడ్డపై ఆడిస్తే ఫలితం వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్, భారత అండర్-19 జట్టు తరఫున అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీని టీమిండియా సెలక్టర్లు యూకే పర్యటనకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత ఐర్లాండ్, ఆ తర్వాత ఇంగ్లండ్తో టీ20 సిరీస్లు ఆడింది భారత జట్టు.సంజూ వరుస వైఫల్యాలుఅయితే, ఐర్లాండ్లో సంజూ శాంసన్- అభిషేక్ శర్మను ఓపెనింగ్ జోడీగా కొనసాగించిన యాజమాన్యం.. వైభవ్ను బెంచ్కే పరిమితం చేసింది. ఈ సిరీస్లో భారత జట్టు ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. ఇక సంజూ ఐర్లాండ్తో రెండు మ్యాచ్లలోనూ తేలిపోయాడు.అరంగేట్రంలో తేలిపోయిన వైభవ్అనంతరం ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ సంజూ విఫలం కావడంతో.. ఎట్టకేలకు వైభవ్కు రెండో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. అయితే, పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు.. తొలి మ్యాచ్లో కేవలం 13 పరుగులే చేశాడు. ఆ తర్వాత 15,14 పరుగులకే నిష్క్రమించాడు.జింబాబ్వే గడ్డ మీద దూకుడుదీంతో ఇంగ్లండ్తో ఐదో టీ20 నుంచి వైభవ్ను తప్పించి మరోసారి సంజూకే అవకాశమిచ్చారు. అయితే, జింబాబ్వేతో టీ20 సిరీస్ నుంచి సంజూకు విశ్రాంతినివ్వగా.. వైభవ్కు మళ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ సిరీస్లో భాగంగా ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 50, 20, 81 పరుగులు సాధించాడు.జింబాబ్వేను 3-0తో క్లీన్స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు.ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‘‘వైభవ్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో అతడి సత్తా ఏమిటో అంతా చూశారు. వరుస మ్యాచ్లలో అదరగొట్టి ఏకంగా ఆరెంజ్క్యాప్ గెలుచుకున్నాడు.నిజానికి ఐర్లాండ్లోనే అతడి అరంగేట్రం జరగాల్సింది. అప్పుడే అతడు నిర్భయంగా ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టి.. అక్కడా రాణించేవాడు. కానీ మేనేజ్మెంట్ ఏం చేసింది. ఆరెంజ్ క్యాప్ విన్నర్ను ఐర్లాండ్లో పక్కనపెట్టి.. నీళ్ల బాటిళ్లు మోయమని బెంచ్కే పరిమితం చేసింది.వైభవ్ ఒక ప్రత్యేకమైన ఆటగాడు. అతడిని మీరు ఐర్లాండ్లోనే ఆడిస్తే.. గొప్పగా ఉండేది. ఇంగ్లండ్లో అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేవాడు. కానీ ఇంగ్లండ్లో అతడు తేలిపోయాడు. దీంతో మళ్లీ తుదిజట్టు నుంచి అతడిని తప్పించారు.అతడినే పక్కనపెడతారా?జోఫ్రా ఆర్చర్కు వైభవ్ ఆట తీరు తెలుసు కాబట్టి అతడిని సులువుగానే అవుట్ చేయగలిగాడు. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున మున్ముందు అదరగొట్టడం ఖాయం. కానీ ఆరంభమే ఇంకాస్త సులువుగా ఉంటే బాగుండేది.అతడొక స్పెషల్ టాలెంట్. అతడిని తుదిజట్టు నుంచి తప్పించి ప్రయోగాలు చేయొద్దు. జింబాబ్వే మీద అతడు ఎలా ఆడాడో చూశారు కదా!.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు’’ అని మహ్మద్ కైఫ్ మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు గుప్పించాడు.చదవండి: సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లోనే 241 రన్స్ -
పీకల్లోతు కష్టాల్లో వెస్టిండీస్.. పట్టు బిగించిన పాకిస్తాన్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ పూర్తి ఆధిపత్యం సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 60 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.క్రీజులో ఉన్న జస్టిన్ గ్రీవ్స్ వికెట్ను పాక్ బౌలర్లు పడగొడితే విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్ను త్వరగా ముగించవచ్చు. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (160) భారీ సెంచరీకి తోడు బాబర్ ఆజమ్ (88), అజాన్ అవైస్ (55) అర్ధ శతకాలతో రాణించారు.అయితే ఓ దశలో పాక్ జట్టు భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. కానీ మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో 400 పరుగుల మార్క్ను పర్యాటక జట్టు దాటలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్లో పాక్కు 43 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం 43 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన విండీస్కు పాక్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా స్పిన్నర్ సాజిద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టి విండీస్ టాపార్డర్ను దెబ్బ తీశాడు. అదేవిధంగా ఓపెనర్ బ్రాండెన్ కింగ్ తొడ కండరాల గాయం బారిన పడడంతో అతడు ఇంకా సెకెండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ రాలేదు. అతడు తిరిగి బ్యాటింగ్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. కాగా వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 344 పరుగులు చేసింది. కానీ రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఆతిథ్య జట్టు బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.చదవండి: క్రికెట్ జట్టు యజమానిగా జహీర్ ఖాన్ -
క్రికెట్ జట్టు యజమానిగా జహీర్ ఖాన్
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ వ్యాపార రంగంలో మరో కీలక అడుగు వేశాడు. లంక ప్రీమియర్ లీగ్ (LPL) చరిత్రలోనే అత్యంత విజయవంతమైన 'జాఫ్నా కింగ్స్' జట్టు సహ యజమానిగా జహీర్ మారాడు. కాగా జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీ వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది.మొన్నటి వరకు ఈ ఫ్రాంచైజీ ఓనర్గా 'స్పోర్ట్స్ కమ్యూన్' సంస్థ ఉండేది. ఇందులో వాటాను భారత మాజీ అండర్-19 క్రికెటర్ మంజోత్ కాల్రా కొనుగోలు చేసి కో-ఓనర్గా మారాడు. అయితే ఎల్పీఎల్-2026 ప్రారంభమైన కొద్ది రోజులకే మంజోత్ కాల్రాను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీలంక స్పోర్ట్స్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అరెస్ట్ చేసింది. అదేవిధంగా స్పోర్ట్స్ కమ్యూన్ సంస్థ కూడా ఆర్థికంగా దివాలా తీసింది.ఆటగాళ్లకు వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. ఈ వివాదాల నేపథ్యంలో పాత యాజమాన్యాన్ని తొలగించి, కొత్త వారికి ఫ్రాంచైజీ హక్కులను కట్టబెట్టాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలోనే జాఫ్నా జట్టును యాంకర్ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది. అందులో వాటాను జహీర్ ఖాన్ కొనుగోలు చేశాడు.ఇకపై ఈ జట్టును యాంకర్ జాఫ్నా కింగ్స్ అని పిలవనున్నారు. కాగా యాంకర్ స్పోర్ట్స్ సంస్థకు ఇప్పటికే యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్లో 'యాంట్వెర్ప్ యాంకర్స్', కెనడా సూపర్స్ 60 లీగ్లో వాంకోవర్ యాంకర్స్ జట్లు ఉన్నాయి. యాంట్వెర్ప్ యాంకర్స్ ఫ్రాంచైజీలో కూడా జహీర్ ఖాన్ భాగస్వామిగా ఉన్నాడు.చదవండి: సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లో 241 రన్స్ -
సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లో 241 రన్స్
ది హండ్రెడ్ మెన్స్ టోర్నీలో సన్రైజర్స్ లీడ్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. మంగళవారం హెడింగ్లే వేదికగా లండన్ స్పిరిట్తో జరిగిన మ్యాచ్లో 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.తొలుత ఓపెనర్లు మిచెల్ మార్ష్, ర్యాన్ రికెల్టన్ లండన్ స్పిరిట్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ హెడింగ్లే మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించారు. మార్ష్ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, రికెల్టన్ కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. వీరిద్దరూ తొలి వికెట్కు కేవలం 54 బంతుల్లోనే 131 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.తద్వారా పురుషుల హండ్రెడ్ లీగ్లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్ ఓడిగా మార్ష్-రికెల్టన్ రికార్డు సృష్టించారు. మార్ష్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లతో 76 పరుగులు చేసి ఔటైనప్పటికి రికెల్టన్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు.ర్యాన్ కేవలం 42 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్లతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ హ్యారీ బ్రూక్(18 బంతుల్లో 5 ఫోర్లు,5 సిక్స్లతో 55) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా సన్రైజర్స్ నిర్ణీత 100 బంతుల్లో 2 వికెట్ల నష్టానికి 241 పరుగులు భారీ స్కోర్ నమోదు చేసింది.విల్లీ మెరుపులు వృథాభారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన లండన్ స్పిరిట్కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఓపెనర్లు జానీ బెయిర్స్టో(0), లువాన్-డ్రే ప్రిటోరియస్(5)లను రీస్ టోప్లే పెవిలియన్కు పంపాడు. లియామ్ లివింగ్స్టోన్ (13బంతుల్లో 34) కౌంటర్ ఎటాక్ చేసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.ఒకానొక దశలో స్పిరిట్ 56 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో లోయార్డర్ బ్యాటర్ డేవిడ్ విల్లీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 46 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 83 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓవర్టన్(15 బంతుల్లో 27) దూకుడుగా ఆడాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో లండన్ జట్టు నిర్ణీత వంద బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమైంది. -
ఆఖరి బంతికి అద్భుతం.. క్రికెట్ చరిత్రలోనే క్రేజీ రనౌట్
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2026లో మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా న్యూఢిల్లీ టైగర్స్, ఔటర్ ఢిల్లీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్కు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూఢిల్లీ టైగర్స్కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 37 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి న్యూఢిల్లీ కష్టాల్లో పడింది. అయితే వరుణుడు మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. మ్యాచ్ తిరిగి ప్రారంభయ్యాక న్యూఢిల్లీ ఇన్నింగ్స్ను కెప్టెన్ హిమ్మత్ సింగ్, లక్షయ్ థరేజాలు చక్కదిద్దారు. ప్రత్యర్ధి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. హిమ్మత్ సింగ్ (25 బంతుల్లో 61 , 5 సిక్సర్లు, 4 ఫోర్లు), లక్షయ్ థరేజా (41 బంతుల్లో 62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు.. ఫలితంగా టైగర్స్ నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగుల భారీ స్కోరు సాధించింది. వారియర్స్ బౌలర్లలో సిద్ధాంత్ శర్మ (2/25) రాణించాడు.అనంతరం లక్ష్య చేధనలో ఔటర్ ఢిల్లీ వారియర్స్కు ఓపెనర్ యజస్ శర్మ(25 బంతుల్లో 52) విధ్వంసకర బ్యాటింగ్తో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ యజస్ మినహా మిగతా టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ వారియర్స్ 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఏడో నంబర్ బ్యాటర్ మోను శుక్లా అద్భుతం చేశాడు. మోను కేవలం 17 బంతుల్లో 45 పరుగులు చేసి తిరిగి ఢిల్లీ వారియర్స్ను గేమ్లోకి తెచ్చాడు. 13 ఓవర్లో మోను ఔటైనప్పటికి క్రీజులోకి శివమ్ శర్మ సైతం దూకుడుగా ఆడాడు.ఆఖరి బంతికి ఊహించని ట్విస్ట్!ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో వారియర్స్ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. శివం శర్మ మొదటి బంతికి ఫోర్, రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతి నో-బాల్ కావడంతో వారియర్స్ ఈజీగా టార్గెట్ ఫినిష్ చేస్తుందని అంతా భావించారు. కానీ ఫ్రీ హిట్ బంతికి కేవలం సింగిల్ మాత్రమే వచ్చింది. నాలుగో బంతికి కూడా సింగిల్ రావడంతో స్కోర్లు సమమయ్యాయి. చివరి రెండు బంతుల్లో వారియర్స్ తొలి విజయానికి కేవలం ఒక్క పరుగు దూరంలో మాత్రమే నిలిచింది. ఈ సమయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అనుహ్యంగా ఐదో బంతికి సిద్ధాంత్ శర్మ రనౌట్ అయ్యాడు.దీంతో ఆఖరి బంతికి వారియర్స్ గెలుపునకు 1 పరుగు కావాల్సి వచ్చింది. క్రీజులోకి వచ్చిన ప్రథమ్ సలుజా మిడ్-ఆఫ్ దిశగా ఆడి సింగిల్ కోసం నాన్స్ట్రైకర్ ఎండ్వైపు పరిగెత్తాడు. అయితే మిడ్-ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న హిమ్మత్ సింగ్ బంతిని సరిగ్గా అందుకోవడంలో విఫలమమయ్యాడు. సహనం కోల్పోయిన హిమ్మత్ బంతిని కాలితో తన్నాడు. అయితే ఆ బంతి నేరుగా వెళ్లి నాన్-స్ట్రైకర్ ఎండ్లోని వికెట్లను తాకింది. స్టంప్స్ కింద పడేటప్పటికి బ్యాటర్ క్రీజుకు దూరంగా ఉండడంతో బ్యాటర్ థర్డ్ అంపైర్ రనాట్గా ప్రకటించాడు. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు దారి తీసింది. కానీ సూపర్ ఓవర్లో మాత్రం న్యూఢిల్లీ టైగర్స్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. వారియర్స్ నిర్ధేశించిన 21 పరుగుల లక్ష్యాన్ని టైగర్స్ టీమ్ చేధించలేకపోయింది.pic.twitter.com/qWcaaN7ewD— ' (@stumpsrattled) August 4, 2026 -
సౌత్ జోన్ జట్టులో గోదావరి కుర్రాడు
నాగమల్లితోట జంక్షన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. జిల్లాకు చెందిన ప్రతిభావంతుడైన ఆంధ్ర రంజీ క్రికెటర్ కావూరి సాయి తేజ ప్రతిష్టాత్మక ‘దులీప్ ట్రోఫీ’కి ఎంపికయ్యారు. సౌత్ జోన్ జట్టులో సాయితేజ చోటు దక్కించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ నిలకడగా రాణిస్తుండడంతో అతడికి ఈ అవకాశం దక్కింది.సుదీర్ఘ కాలం తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి ఒక ఆటగాడు దులీప్ ట్రోఫీకి ఎంపిక కావడం ఉభయ గోదావరి జిల్లాల క్రికెట్కు గర్వకారణమని క్రీడాభిమానులు అంటున్నారు. పిఠాపురానికి చెందిన కె.నాగ గంగాధర్ దిలీప్ ట్రోఫీ మేనేజర్గా నియమితులయ్యారు.ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మాట్లాడుతూ సాయి తేజ దిలీప్ ట్రోఫీకి ఎంపిక కావడం మన జిల్లాకు ఎంతో గర్వకారణమని అన్నారు.


