breaking news
Cricket
-
న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
మహిళల వన్డే ప్రపంచకప్లో నేడు (గురువారం) జరిగిన మ్యాచ్లో టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్పై టీమిండియా గెలుపొందింది. 352 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దాంతో భారత మహిళల జట్టు 53 పరుగుల తేడాతో గెలిచారు.వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత్ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో హర్మన్ప్రీత్ కౌర్ 10, రిచా ఘోష్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana) (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రతిక రావల్ (Pratika Rawal) (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో చెలరేగిపోయారు.వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగెజ్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా సునామీ ఇన్నింగ్స్ ఆడింది. -
క్యాచ్లే కొంపముంచాయి.. ఓటమిపై శుభ్మన్ గిల్ కామెంట్స్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో (India vs Australia) టీమిండియా 2 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది. 17 ఏళ్ల తర్వాత అడిలైడ్లో భారత్కు ఇదే తొలి ఓటమి (వన్డేల్లో). మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఓటమిపై స్పందిస్తూ ఇలా అన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసి డీసెంట్ స్కోర్ చేశాం. అయితే కొన్ని క్యాచ్లు వదిలేయడం వల్ల ఆ స్కోర్ను కాపాడుకోలేకపోయాం.ప్రారంభంలో పిచ్ ఊహించిన దానికంటే ఎక్కువగా స్పందించింది. 15–20 ఓవర్ల తర్వాత పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. మొదటి మ్యాచ్లో టాస్ చాలా కీలకమైంది. వర్షం ప్రభావం ఉన్నందున అది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. అయితే రెండో మ్యాచ్లో టాస్ ప్రభావం పెద్దలా లేదు. ఇరు జట్లు దాదాపు 50 ఓవర్లు బ్యాటింగ్ చేశాయి.రోహిత్ శర్మపై ప్రశంసలుఏడు నెలల గ్యాప్ తర్వాత మునుపటి తరహాలో ఆడటం అంత ఈజీ కాదు. అయినా రోహిత్ ధైర్యంగా ఆడి, అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్లో అతను భారీ స్కోర్ మిస్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో వీరోచితంగా పోరాడాడు. రోహిత్ బ్యాటింగ్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను.కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలో కాస్త ఇబ్బంది పడినా.. రోహిత్ (73), శ్రేయస్ (61), అక్షర్ (44) బాధ్యతాయుతంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోర్ (264/9) చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా (24 నాటౌట్), అర్షదీప్ సింగ్ (13) అమూల్యమైన పరుగులు జోడించారు.ఛేదనలో ఆస్ట్రేలియా కూడా తడబడినప్పటికీ.. అంతిమంగా విజయం సాధించింది. మాథ్యూ షార్ట్ (74), కూపర్ కన్నోల్నీ (61 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో షార్ట్కు రెండు లైఫ్లు లభించాయి. కీలక సమయాల్లో అక్షర్ పటేల్, సిరాజ్ ఈజీ క్యాచ్లు నేలపాలు చేశారు. ఈ క్యాచ్లే మ్యాచ్ను ఆస్ట్రేలియాకు అనుకూలంగా మార్చాయి. ఈ సిరీస్లో నామమాత్రపు మూడో వన్డే సిడ్నీ వేదికగా అక్టోబర్ 25న జరుగనుంది. చదవండి: ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ -
ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana) (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రతిక రావల్ (Pratika Rawal) (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో చెలరేగిపోయారు.వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగెజ్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా సునామీ ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత్ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో హర్మన్ప్రీత్ కౌర్ 10, రిచా ఘోష్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో రోస్మేరీ మైర్, అమేలియా కెర్, సూజీ బేట్స్కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులు చేయాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో మొదటి మూడు సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.చదవండి: గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు -
గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్ (Bangladesh) పులులు గర్జించాయి. మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నాయి. ఢాకా వేదికగా ఇవాళ (అక్టోబర్ 23) జరిగిన సిరీస్ డిసైడర్లో ఆతిథ్య జట్టు 179 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బంగ్లా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగారు. వీరి గర్జనకు మాజీ ప్రపంచ ఛాంపియన్లు బిత్తరపోయారు.తొలుత బ్యాటింగ్కు దిగి భారీ స్కోర్ చేసిన బంగ్లాదేశ్.. బౌలింగ్లో ప్రత్యర్దిని ఉక్కిరిబిక్కిరి చేసింది. బంగ్లా బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగి విండీస్ బ్యాటర్ల భరతం పట్టారు.ఈ సిరీస్లోని తొలి వన్డేలోనూ బంగ్లాదేశ్ బౌలర్లు ఇదే రీతిలో చెలరేగిపోయారు. ఆ మ్యాచ్లో స్వల్ప స్కోర్ చేసినా విండీస్ను ఇంకా తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. రెండో వన్డేలోనూ ఇదే ప్రదర్శనను కొనసాగించారు. అయితే ఈసారి విండీస్ బ్యాటర్లు కాస్త ప్రతిఘటించడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో విండీస్ గెలుపొందింది.మూడో వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్ (80), సౌమ్య సర్కార్ (91) సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన తౌహిద్ హృదోయ్ (28), నజ్ముల్ హసన్ షాంటో (44) కూడా పర్వాలేదనిపించారు.అయితే ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓ దశలో సునాయాసంగా 350 పరుగులు చేస్తుందనుకున్న జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా 300లోపే పరిమితమైంది.తొలుత తడబడిన విండీస్ బౌలర్లు ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని బంగ్లాను 300లోపే కట్టడి చేశారు. అకీల్ హోసేన్ 4, అలిక్ అథనాజ్ 2, రోస్టన్ ఛేజ్, మోటీ తలో వికెట్ తీసి, బంగ్లాను భారీ స్కోర్ చేయకుండా నియంత్రించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చిన ఆ జట్టు 30.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బంగ్లా బౌలర్లు నసుమ్ అహ్మద్, రిషద్ హొసేన్ తలో 3, మెహిది హసన్, తన్వీర్ ఇస్లాం చెరో 2 వికెట్లు తీసి విండీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు.కాగా, ఇరు జట్ల ఈ నెల 27 నుంచి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 27, 29, 31 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. చదవండి: తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్మృతి మంధన సూపర్ సెంచరీ -
సౌతాఫ్రికాకు భారీ షాక్లు
పాకిస్తాన్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు (Pakistan vs South Africa) ముందు సౌతాఫ్రికాకు (South Africa) భారీ షాక్లు తగిలాయి. ఆ జట్టు టీ20 కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (David Miller), కీలక బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ (Gerald Coetzee) గాయాల కారణంగా ఈ సిరీస్లకు దూరమయ్యారు. మిల్లర్ కొద్ది రోజుల కిందట ప్రాక్టీస్ చేస్తూ గ్రేడ్-1 హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరికి గురి కాగా.. కొయెట్జీ నబీమియాతో ఇటీవల జరిగిన టీ20 సందర్భంగా కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో ఈ ఇద్దరు పాక్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరమయ్యారు.మిల్లర్ గైర్హాజరీలో టీ20 జట్టు కెప్టెన్గా అప్పటికే జట్టులో ఉన్న డొనోవన్ ఫెరీరాను ఎంపిక చేశారు. మిల్లర్ స్థానాన్ని మాథ్యూ బ్రీట్జ్కే భర్తీ చేశారు. కొయెట్జీ స్థానాన్ని టీ20ల్లో టోనీ డి జోర్జితో, వన్డేల్లో ఓట్నీల్ బార్ట్మన్తో భర్తీ చేశారు. ఈ రెండు మార్పులు మినహా ముందుగా ప్రకటించిన జట్టు యధాతథంగా కొనసాగనుంది.పాక్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రావల్పిండి వేదికగా.. రెండో టీ20 అక్టోబర్ 31న లాహోర్ వేదికగా.. మూడో టీ20 నవంబర్ 1న అదే లాహోర్ వేదికగా జరుగనున్నాయి.అనంతరం నవంబర్ 4 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 4, 6, 8 తేదీల్లో ఫైసలాబాద్ వేదికగా మూడు వన్డేలు జరుగనున్నాయి. పరిమిత ఓవర్ల సిరీస్లకు ముందు సౌతాఫ్రికా పాక్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడింది. ఇవాళే (అక్టోబర్ 23) ముగిసిన ఈ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తొలి టెస్ట్లో పాకిస్తాన్, రెండో టెస్ట్లో పర్యాటక సౌతాఫ్రికా గెలుపొందాయి.పాకిస్తాన్తో టీ20 సిరీస్కు సౌతాఫ్రికా జట్టు: డోనోవన్ ఫెరీరా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, లుంగీ ఎంగిడి, న్క్వాబా పీటర్, లూహాన్ డ్రి ప్రిటోరియస్, అండైల్ సైమ్లేన్, లిజాడ్ విలియమ్స్వన్డే జట్టు: మాథ్యూ బ్రీట్జ్కే (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, జోర్న్ ఫోర్టుయిన్, జార్జ్ లిండే, లుంగి ఎంగిడి, న్క్వాబా పీటర్, లుహాన్ డ్రి ప్రిటోరియస్, సినేతెంబా క్వెషైల్, లిజాడ్ విలియమ్స్చదవండి: తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్మృతి మంధన సూపర్ సెంచరీ -
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ప్రపంచ రికార్డు.. రిజ్వాన్ పేరు చెరిపేసి..
ఆస్ట్రియా బ్యాటర్ కరణ్బీర్ సింగ్ (Karanbir Singh) అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు సాధించిన బ్యాటర్గా ఘనత సాధించాడు.ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కరణ్బీర్ సింగ్ బద్దలు కొట్టాడు. రొమేనియా పర్యటన సందర్భంగా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ సందర్భంగా కరణ్బీర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. తొలి మ్యాచ్లో 27 బంతుల్లోనే 57 పరుగులు రాబట్టిన కరణ్బీర్.. రెండో మ్యాచ్లో 46 బంతుల్లోనే 90 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.విధ్వంసకర ఇన్నింగ్స్ఈ క్రమంలోనే రిజ్వాన్ను అధిగమించిన కరణ్బీర్ సింగ్.. ఆ తర్వాత కూడా తన ప్రభంజనం కొనసాగించాడు. రొమేనియా టూర్లో మూడో మ్యాచ్లో 44 బంతుల్లోనే 74 పరుగులు సాధించిన ఈ ఆస్ట్రియా బ్యాటర్.. తదుపరి 12 బంతుల్లో 27 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ఈ ఏడాదిలో 1488 పరుగుల మార్కును అందుకున్నాడు.ఇక రొమేనియాతో సిరీస్లో కరణ్బీర్ సింగ్ ఏకంగా 19 ఫోర్లు బాదాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో ఓవరాల్గా 127 ఫోర్లు నమోదు చేశాడు. అంతేకాదు.. అతడి ఖాతాలో 122 సిక్సర్లు కూడా ఉన్నాయి.వెయ్యి పరుగుల మైలురాయి దాటిన మరో బ్యాటర్రొమేనియాతో మొయేరా వ్లాసే క్రికెట్ గ్రౌండ్లో జరిగిన నాలుగో టీ20లో కరణ్బీర్తో పాటు.. అతడి సహచర ఆటగాడు బిలాల్ జల్మాయి కూడా అదరగొట్టాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో అతడు వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్గా నిలిచాడు. ఇక ఆస్ట్రియా రొమేనియా టూర్ కొనసాగుతున్న నేపథ్యంలో కరణ్బీర్ విధ్వంసం కూడా కొనసాగడం ఖాయంగానే కనిపిస్తోంది. అసోసియేట్ జట్లకు చెందిన ఈ ఆటగాళ్లు ఇంతలా విజృంభించడం జట్లబంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందంటూ పొట్టి క్రికెట్ అభిమానులు మురిసిపోతున్నారు.పురుషుల అంతర్జాతీయ టీ20లలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు🏏కరణ్బీర్ సింగ్ (ఆస్ట్రియా)- 2025లో 32 ఇన్నింగ్స్ ఆడి 1488*🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- 2021లో 26 ఇన్నింగ్స్ ఆడి 1326🏏సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 2022లో 31 ఇన్నింగ్స్ ఆడి 1164🏏బిలాల్ జల్మాయి (ఆస్ట్రియా)- 2025లో 35 ఇన్నింగ్స్లో 1008*🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- 2022లో 25 ఇన్నింగ్స్ ఆడి 996.చదవండి: బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ -
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్మృతి మంధన సూపర్ సెంచరీ
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సూపర్ సెంచరీతో కదంతొక్కింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న మ్యాచ్లో 88 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసింది. మంధనకు ఈ ఏడాది ఇది ఐదో శతకం. ఓవరాల్గా వన్డేల్లో 14వ శతకం. ప్రస్తుత ప్రపంచకప్లో తొలి మ్యాచ్ల్లో నిరాశపరిచిన మంధన.. గత రెండు మ్యాచ్లుగా సత్తా చాటుతూ వస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన చివరి రెండు మ్యాచ్ల్లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో మెరిసింది. వాస్తవానికి ఆ రెండు అర్ద సెంచరీలు కూడా సెంచరీల్లోకి మారాల్సింది. అయితే అవి తృటిలో చేజారాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. ఆది నుంచి నిలకడగా ఆడింది. ఓపెనర్లు మంధన, ప్రతీక రావల్ (77) సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ను నిర్మించారు. అర్ద సెంచరీ తర్వాత మంధన గేర్ మార్చగా.. ప్రతీక రావల్ అదే టెంపోలో బ్యాటింగ్ చేస్తుంది. 31 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 192 పరుగులుగా ఉంది. మంధన 100, ప్రతీక రావల్ 77 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో మొదటి మూడు సెమీస్ బెర్త్లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్కు అర్హత సాధిస్తుంది. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. చదవండి: IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం -
IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆతిథ్య ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పెర్త్లో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన కంగారూలు.. తాజాగా అడిలైడ్ వేదికగా రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లోనూ జయభేరి మోగించారు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాఅడిలైడ్ ఓవల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. పర్యాటక భారత జట్టును తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఒకే ఓవర్లో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (9)తో పాటు వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0) వికెట్ తీసి జేవియర్ బార్ట్లెట్ ఆసీస్కు శుభారంభం అందించాడు.రాణించిన రోహిత్, శ్రేయస్ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. రోహిత్ (97 బంతుల్లో 73), అయ్యర్ (77 బంతుల్లో 61) పరుగులతో రాణించగా.. మిగతా వారిలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44), హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (11) నితీశ్ రెడ్డి (8) రూపంలో కీలక వికెట్లు దక్కించుకున్నాడు. పేసర్లలో బార్ట్లెట్ గిల్, కోహ్లి, వాషింగ్టన్ సుందర్ (12) వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. మిచెల్ స్టార్క్ రోహిత్ శర్మ, అర్ష్దీప్ సింగ్ (13)లను అవుట్ చేశాడు.264 పరుగులుఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (11)ను అర్ష్దీప్ త్వరగానే పెవిలియన్కు పంపగా.. ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 28)ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు.అదరగొట్టిన షార్ట్, కన్నోలి అయితే, వన్డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ అద్భుత అర్ధ శతకం (74)తో మెరిసి మ్యాచ్ను తమ వైపు తిప్పే ప్రయత్నం చేయగా.. మ్యాట్ రెన్షా (30) అతడికి సహకరించాడు. షార్ట్, రెన్షా వేసిన పునాదిపై ఆల్రౌండర్ కూపర్ కన్నోలి మిచెల్ ఓవెన్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.Just the wicket #TeamIndia needed! 🤩#NitishKumarReddy gets the wicket and #MohammedSiraj makes amends for the dropped catch. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/YZwdPY0nr7— Star Sports (@StarSportsIndia) October 23, 2025 ఆఖర్లో వరుస విరామాల్లో వికెట్లు పడినా కన్నోలి పట్టుదలగా నిలబడ్డాడు. ఓవెన్ 23 బంతుల్లో 36 పరుగులతో వేగంగా ఆడి.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో వెనుదిరగగా.. బార్ట్లెట్ (3), స్టార్క్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.అయితే, కన్నోలి మాత్రం నిలకడగా ముందుకు సాగాడు. 53 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 61 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 46.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టపోయిన ఆస్ట్రేలియా లక్ష్యం పూర్తి చేసింది. రెండు వికెట్ల తేడాతో గెలిచి.. సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య శనివారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు సిడ్నీ వేదిక. కాగా వన్డే సారథిగా గిల్కు తొలి సిరీస్లోనే ఇలా చేదు అనుభవం ఎదురైంది. ఇక రెండో వన్డేలో జంపాకు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ -
సిరీస్ డిసైడర్.. ఆరంభం అదిరినా, ఆఖర్లో తడబడిన బంగ్లాదేశ్
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్ ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్ (80), సౌమ్య సర్కార్ (91) సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన తౌహిద్ హృదోయ్ (28), నజ్ముల్ హసన్ షాంటో (44) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓ దశలో సునాయాసంగా 350 పరుగులు చేస్తుందనుకున్న జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా 300లోపే పరిమితమైంది. మిడిలార్డర్ బ్యాటర్లు మహిదుల్ ఇస్లాం 6, రిషద్ హొసేన్ 3, నసుమ్ అహ్మద్ 1 పరుగుకు ఔటయ్యారు. ఆఖర్లో నురుల్ హసన్ (16 నాటౌట్), కెప్టెన్ మెహిది హసన్ (17) ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించడంతో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తొలుత తడబడిన విండీస్ బౌలర్లు ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని బంగ్లాను 300లోపే కట్టడి చేశారు. అకీల్ హోసేన్ 4, అలిక్ అథనాజ్ 2, రోస్టన్ ఛేజ్, మోటీ తలో వికెట్ తీసి, బంగ్లాను భారీ స్కోర్ చేయకుండా నియంత్రించారు.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి వన్డేలో బంగ్లాదేశ్, రెండో వన్డేలో వెస్టిండీస్ (సూపర్ ఓవర్) గెలిచాయి. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 27, 29, 31 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వెస్టిండీస్ బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది.చదవండి: IPL 2026: శ్రేయస్ అయ్యర్ టీమ్లో కీలక చేరిక -
IPL 2026: శ్రేయస్ అయ్యర్ టీమ్లో కీలక చేరిక
ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్కు ముందు గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ జోషి (2023-2025) స్థానంలో భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను (Sairaj Bahutule) కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించింది. బహుతులే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ పదని నుంచి వైదొలిగాడు. తదుపరి సీజన్లో బహుతులే రికీ పాంటింగ్ (హెడ్ కోచ్) నేతృత్వంలోని కోచింగ్ బృందంలో చేరతాడు. ఈ టీమ్లో బ్రాడ్ హడ్డిన్, జేమ్స్ హోప్స్ అసిస్టెంట్ కోచ్లుగా ఉన్నారు. బహుతులే చేరిక శ్రేయస్ (Shreyas Iyer) బృందానికి అదనపు బలాన్ని ఇస్తుందని పంజాబ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. 51 ఏళ్ల బహుతులేకు దేశవాలీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతను బెంగాల్, కేరళ, విదర్భ, గుజరాత్ జట్లకు కోచింగ్ను అందించాడు. భారత యువ బౌలర్లను తీర్చిదిద్దడంలో సాయిరాజ్ది అందవేసిన చెయ్యిగా చెబుతారు.సాయిరాజ్ చేరికపై పంజాబ్ కింగ్స్ సీఈవో సతీష్ మీనన్ స్పందించాడు. అతని మాటల్లో.. "ముందుగా సునీల్ జోషికి కృతజ్ఞతలు. ఇప్పుడు బహుతులే చేరడం మాకు గర్వకారణం. అతని అనుభవం, వ్యూహాత్మక దృష్టి మా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది".పంజాబ్ కింగ్స్తో డీల్ ఖరారయ్యాక సాయిరాజ్ కూడా స్పందించాడు. పంజాబ్ కింగ్స్లో చేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ జట్టు ప్రత్యేకమైన క్రికెట్ ఆడుతుంది. యువ ప్రతిభను మెరుగుపరచడంలో నా పాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. కాగా, పంజాబ్ కింగ్స్ గత సీజన్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై తృటిలో టైటిల్ను చేజార్చుకుంది. శ్రేయస్ అయ్యర్ గత సీజన్లోనే పంజాబ్ కింగ్స్ పగ్గాలు చేపట్టి అద్భుతంగా ముందుండి నడిపించాడు. వ్యక్తిగతంగానూ రాణించాడు. శ్రేయస్ అంతకుముందు సీజన్లో (2024) కేకేఆర్కు విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. గత సీజన్ వేలంలో శ్రేయస్ను పంజాబ్ యాజమాన్యం రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకుంది.చదవండి: NZ VS ENG: సిరీస్ ఇంగ్లండ్ వశం.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా బ్రూక్ -
బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు తిలక్ వర్మ (Tilak Varma). 2022లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన తిలక్.. ఆ మరుసటి ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు.ఆసియా కప్ హీరోఅనతికాలంలోనే భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. ఇటీవల ఆసియా టీ20 కప్-2025 టోర్నీలోనూ అదరగొట్టాడు. పాకిస్తాన్తో ఫైనల్లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున 32 టీ20 మ్యాచ్లు, నాలుగు వన్డేలు ఆడిన తిలక్ వర్మ.. ఆయా ఫార్మాట్లలో 962, 68 పరుగులు చేశాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ సీజన్ 2025-26 సీజన్తో బిజీగా ఉన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. హైదరాబాద్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఈ నేపథ్యంలో కెరీర్లోని చేదు అనుభవాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు తిలక్ వర్మ. గాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చేయిదాటిపోయిందని.. ఆ సమయంలో ముంబై ఫ్రాంఛైజీ సహ యజమాని ఆకాశ్ అంబానీ సాయం చేశారని తెలిపాడు. బ్రేక్ఫాస్ట్ విత్ చాంపియన్స్తో మాట్లాడుతూ..బ్యాట్ ఎత్తేందుకు కూడా శక్తి సరిపోలేదు‘‘2022లో బంగ్లాదేశ్లో మ్యాచ్ ఆడుతున్నాం. నేను భారత్-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నా. బ్యాటింగ్కు వచ్చిన కాసేపటి తర్వాత నా కళ్లు చెమ్మగా మారాయి. బ్యాట్ ఎత్తేందుకు కూడా శక్తి సరిపోవడం లేదు. నా నరాల్లో జీవం లేనట్లే అనిపించింది.ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారువెంటనే రిటైర్డ్ హర్ట్గా వెనక్కి వచ్చేశాను. ఆ సమయంలో విషయం తెలుసుకుని ఆకాశ్ అంబానీ ఫోన్ చేశారు. బీసీసీఐ పెద్దలతో మాట్లాడి.. నా పరిస్థితి గురించి చెప్పారు. నాకు చాలా సాయం చేశారు.బతికి బయటపడితే చాలుఆస్పత్రిలో వైద్యులు నన్ను హెచ్చరించారు. ఒకవేళ ఇంకాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే పరిస్థితి ఇంకా దిగజారిపోయేదన్నారు. నా శరీరంలోకి సూది కూడా దిగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో బతికి బయటపడితే చాలు అనుకున్నా’’ అని తిలక్ వర్మ చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2022 సీజన్ తర్వాత తిలక్ వర్మ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయితే, కోలుకోవడంపై దృష్టి పెట్టకుండా వరుస మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి.. ఆస్పత్రిలో చికిత్స తీసుకునేంత వరకు వచ్చింది. అయితే, అదృష్టవశాత్తూ త్వరగానే కోలుకున్న 22 ఏళ్ల తిలక్ వర్మ.. ప్రస్తుతం టీమిండియా తరఫున సత్తా చాటుతూ తనను తాను నిరూపించుకుంటున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన హిట్మ్యాన్.. ఆసియాలోనే తొలి క్రికెటర్గా రోహిత్ రికార్డు -
సిరీస్ ఇంగ్లండ్ వశం.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా బ్రూక్
న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో (New Zealand vs England) మరో మ్యాచ్ వర్షార్పణమైంది. ఆక్లాండ్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 23) జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు క్రైస్ట్చర్చ్లో జరగాల్సిన తొలి టీ20 కూడా వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది.మధ్యలో రెండో టీ20లో 65 పరుగుల తేడాతో గెలవడంతో సిరీస్ ఇంగ్లండ్ (England) వశమైంది (1-0). ఆ మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన హ్యారీ బ్రూక్కు (Harry Brookk) (35 బంతుల్లో 78; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.అక్టోబర్ 26 (మౌంట్ మాంగనూయ్), 29 (హ్యామిల్టన్), నవంబర్ 1 (వెల్లింగ్టన్) తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.3.4 ఓవర్ల పాటు సాగిన ఆటమూడో టీ20 3.4 ఓవర్ల పాటు సాగింది. టాస్ ఓడి ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ వర్షం ప్రారంభమయ్యే సమయానికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ (2) ఔట్ కాగా.. టిమ్ సీఫర్ట్ (23), రచిన్ రవీంద్ర (10) క్రీజ్లో ఉన్నారు.వన్డే సిరీస్కు ఇరు జట్లు..ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, టామ్ బాంటన్, జేమీ స్మిత్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, సోన్నీ బేకర్, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్, లూక్ వుడ్న్యూజిలాండ్: మార్క్ చాప్మన్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్వెల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జకరీ ఫౌల్క్స్, నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీ, మ్యాట్ హెన్రీచదవండి: Virat Kohli: చెరగని మరక.. 17 ఏళ్ల కెరీర్లో తొలిసారి..! -
IND vs NZ: సెమీస్ రేసు.. టాస్ ఓడిన భారత్.. తుదిజట్లు ఇవే
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Women's ODI World Cup) టోర్నమెంట్లో ఆఖరి సెమీ ఫైనల్ బెర్తు కోసం భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) ముఖాముఖి తలపడుతున్నాయి. నవీ ముంబై వేదికగా గురువారం నాటి మ్యాచ్లో గెలిస్తే హర్మన్ సేన ఎలాంటి సమీకరణలతో పని లేకుండా నేరుగా సెమీ ఫైనల్ చేరుతుంది.టాస్ ఓడిన భారత్మరోవైపు.. న్యూజిలాండ్కు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్గా మారింది. ఇందులో గెలిస్తేనే వైట్ఫెర్న్స్ సెమీస్ బెర్తు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.టాస్ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ముందుగా మేము బౌలింగ్ చేస్తాం. వికెట్ పాతబడే కొద్దీ మొత్తంగా మారిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో మేము సన్నద్ధమయ్యాము. రెండు అదనపు సెషన్లు ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేశాం.ఈ టోర్నీలో మాకు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అయితే, ఈరోజు ఎలాంటి ఆటంకం (వర్షం) ఉండదనే భావిస్తున్నాం. 100 ఓవర్ల పాటు మ్యాచ్ సాగాలి. ఇలాంటి తీవ్రమైన ఒత్తిడి ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే క్రికెటర్లు తమలోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీయాలి.ఇండియాలో ఇలాంటి పరిస్థితుల్లో గెలిచి సెమీస్ చేరితే అంతకంటే గొప్ప విషయం మాకు మరొకటి ఉండదు. భారత్తో మ్యాచ్ సవాలుతో కూడుకున్నదే. గత మ్యాచ్లో ఆడిన తుదిజట్టుతోనే ఇక్కడా బరిలోకి దిగుతున్నాం’’ అని పేర్కొంది.మూడు మార్పులుమరోవైపు.. తమ జట్టులో మూడు మార్పులు చేసినట్లు భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. అదనంగా ముగ్గురు బ్యాటర్లను తుదిజట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్లో దురదృష్టవశాత్తూ భారత జట్టు ఓడినప్పటికీ బంగ్లాదేశ్తో మ్యాచ్ రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఒకవేళ బంగ్లాను ఓడిస్తే సులువుగానే సెమీస్ చేరుతుంది. అదే సమయంలో న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడాల్సి ఉంటుంది. ఒకవేళ ఫలితం వేరుగా ఉంటే మాత్రం అప్పుడు నెట్ రన్రేటు కూడా కీలకం అవుతుంది. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మహిళా జట్లు సెమీ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లుభారత్ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.న్యూజిలాండ్సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్(వికెట్ కీపర్), జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్.చదవండి: WC 2025 Ind vs NZ: సెమీస్ సమీకరణం ఇదీ... -
Virat Kohli: చెరగని మరక.. 17 ఏళ్ల కెరీర్లో తొలిసారి..!
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో (India vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌటయ్యాడు. తొలి వన్డేల్లో 8 బంతులు ఆడి ఖాతా తెరవలేకపోయిన కోహ్లి.. ఇవాళ (అక్టోబర్ 23) తనకు అచ్చొచ్చే మైదానమైన అడిలైడ్లో 4 బంతుల డకౌట్ను నమోదు చేశాడు.కోహ్లి తన 17 ఏళ్ల కెరీర్లో వరుసగా రెండు వన్డేల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఈ డబుల్ డక్ కోహ్లి కెరీర్లో చెరగని మరకలా మిగిలిపోతుంది. కెరీర్ చరమాంకంలో రికార్డుల రారాజుకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం దురదృష్టకరం.టెస్ట్లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ఏడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన కోహ్లి మునుపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. రెండో వన్డేలో ఔటైన తర్వాత అతని ప్రవర్తన ఈ సిరీస్తో కెరీర్ ముగింపును సూచించింది. తమ ఆరాధ్య ఆటగాడు కెరీర్ చరమాంకంలో వరుస డకౌట్లు కావడాన్ని కోహ్లి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.డబుల్ డక్ తర్వాత కోహ్లి వన్డే సగటు కూడా పడిపోయింది. కోహ్లి ఫామ్లో ఉన్నప్పుడే రిటైరయ్యుంటే గౌరవంగా ఉండేదని అతని అభిమానులు అనుకుంటున్నారు. మరోపక్క కోహ్లిలాగే కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం రెండో వన్డేలో హిట్ అయ్యాడు.రోహిత్ కూడా తొలి వన్డేలో నిరాశపరిచినా రెండో వన్డేలో మాత్రం బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (73) జట్టును ఆదుకున్నాడు. ఈ ప్రదర్శనతో రోహిత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. హిట్మ్యాన్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్తో పాటు శ్రేయస్ అయ్యర్ (61), అక్షర్ పటేల్ (44) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ (264/9) చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా (24 నాటౌట్), అర్షదీప్ సింగ్ (13) అమూల్యమైన పరుగులు జోడించారు.ఛేదనలో ఆస్ట్రేలియా తడబడుతుంది. 54 పరుగులకే ఓపెనర్లు మిచెల్ మార్ష్ (11), ట్రవిస్ హెడ్ (28) వికెట్లు కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (32), మ్యాట్ రెన్షా (23) క్రీజ్లో ఉన్నారు. 19 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 96/2గాఉంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే ఆసీస్ మరో 169 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్లోని తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే.చదవండి: కొత్త బ్యాటర్.. ఆరంభంలోనే అదుర్స్! -
టీమిండియా న్యూ టాలెంట్.. రికార్డులే రికార్డులు
''కూతురు, కొడుకు అనే తేడా నాకు లేదు. ఇద్దరూ సమానమే. నా కుమారుడు ఇంజనీర్, అతనికి క్రికెట్ అంటే ఆసక్తి లేదు. కానీ నా కూతురు భారతదేశం తరపున క్రికెట్ ఆడుతోంది'' అంటున్నారు ప్రదీప్ రావల్. తన పిల్లలు ఎంచుకున్న కెరీర్ పట్ల ఆయన సంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో ఆడుతున్న భారత జట్టులో ఆయన కుమార్తె ప్రతీక రావల్ (Pratika Rawal) సభ్యురాలు.టీమిండియా (Team India) మహిళల జట్టు ఓపెనర్ అయిన ప్రతీక రావల్ తన ప్రతిభతో టీమ్లో కీలకంగా మారింది. 25 ఏళ్ల కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్మన్.. ఇప్పటికే పలు ఘనతలు సాధించింది. తాజాగా వరల్డ్కప్లోనూ అంచనాలకు తగినట్టుగా ఆడుతూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇదో జోరు కొనసాగిస్తే భవిష్యత్తులో ఆమె స్టార్ ప్లేయర్ల సరసన చేరడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటివరకు 22 అంతర్జాతీయ వన్డేలు ఆడిన ప్రతీక రావల్ 47 బ్యాటింగ్ సగటుతో 988 పరుగులు చేసింది. ఇందుల్లో సెంచరీతో పాటు 7 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 154. అంతేకాదు అప్పడప్పుడు బౌలింగ్ కూడా చేస్తోంది. 185 బంతులు విసిరి 5 వికెట్లు పడగొట్టింది. అతి తక్కువ అంతర్జాతీయ కెరీర్లోనే పలు రికార్డులు సాధించి దూసుకుపోతోంది.సరికొత్త చరిత్రమహిళల వన్డే క్రికెట్తో తొలి 15 మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ప్రతీక సరికొత్త చరిత్ర లిఖించింది. మొదటి 15 వన్డేల్లో 767 పరుగులు సాధించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డ్ను తిరగరాసింది. లానింగ్ తన వన్డే కెరీర్లో తొలి 15 మ్యాచ్లలో 707 రన్స్ చేసింది. ప్రపంచకప్కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లోనూ ప్రతీక సత్తా చాటింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానతో (Smriti Mandhana) కలిసి మరో రికార్డ్ క్రియోట్ చేసింది. ఓ క్యాలెండర్ ఇయర్లో ఏ వికెట్కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రికార్డ్ నెలకొల్పారు.తొలి జంటగా రికార్డ్ఏడాదిగా టీమిండియా ఓపెనర్లుగా వస్తున్న స్మృతి మంధాన- ప్రతీక రావల్ విశేషంగా రాణిస్తున్నారు. మహిళల వన్డే క్రికెట్లో అత్యుత్తమంగా 84.66 సగటుతో వెయ్యి పరుగులు చేసిన తొలి జంటగా వీరు చరిత్రకెక్కారు. భారత మహిళా వన్డే క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్లోనే ఎక్కువసార్లు 100 ప్లస్ ఓపెనింగ్ గణాంకాలు నమోదు చేసిన జోడీగానూ ఘనత సాధించారు.మూడేళ్ల వయసులోనే..దేశ రాజధాని ఢిల్లీలో క్రికెట్ను ఇష్టపడే కుటుంబంలో జన్మించిన ప్రతీక మూడేళ్ల వయసులోనే బ్యాట్ చేతబట్టింది. యూనివర్సిటీ స్థాయి క్రికెటర్, బీసీసీఐ లెవల్ 2 అంపైర్ అయిన ఆమె తండ్రి ప్రదీప్.. తాను సాధించలేని కలను తన కుమార్తె నెరవేర్చాలని కోరుకున్నాడు. అందుకే తన కూతురికి చిన్నప్పటి నుంచే క్రికెట్ నేర్పించడం మొదలుపెట్టాడు. తనకు సరైన మార్గదర్శకత్వం లేనందున జాతీయస్థాయి క్రికెటర్ కాలేకపోయానని, తన కూతురు విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో చిన్ననాటి నుంచి శిక్షణపై ఫోకస్ పెట్టానని వివరించారు. అదృష్టవశాత్తూ ప్రతీకకు కూడా క్రికెట్పై మక్కువ ఉండటంతో తన పని సులువువయిందన్నారు.ట్రైనింగ్.. ఫిట్నెస్ఆమెకు పదేళ్ల వయసు ఉన్నపుడు తన పాఠశాల తరపున కాలేజీ జట్టుతో ఆడిన ప్రతీక తన బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచిందని ప్రదీప్ గుర్తు చేసుకున్నారు. ఇంత చిన్నపిల్ల 50 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో అక్కడున్న వారందరూ చకితులయ్యారని వెల్లడించారు. అక్కడి నుంచి ఒక్కో అడుగు వేసింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రీడాకారిణి దీప్తి ధ్యాని (Deepti Dhyani) దృష్టిలో పడింది. ప్రతీక ఆటతీరును నిశితంగా గమనించి ఆమెకు కోచ్గా మారింది. ''ప్రతీక కొన్ని డ్రైవ్లు ఆడటం చూశాను. ఆమెకు మంచి టాలెంట్ ఉందని గ్రహించాను. చాలా మంది రాష్ట్ర స్థాయి ఆటగాళ్లకు ప్రతిభ ఉంటుంది, దాన్ని ప్రొఫెషనల్ క్రికెట్గా మార్చడమే సవాలు. అక్కడే కోచ్లుగా మేము అడుగుపెడతాము" అని దీప్తి చెప్పింది. ఆటతో పాటు ఫిట్నెస్పై ప్రతీక తీవ్రంగా కృషి చేసిందని వెల్లడించింది.స్పెషల్ టాలెంట్ప్రొఫెషనల్ క్రికెటర్గా మారినప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయలేదు ప్రతీక. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. మైదానంలో వ్యూహాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి చదువు ఆమెకు ఉపయోగపడింది. ఇదే ఆమెను మిగతా క్రికెటర్ల కంటే ప్రత్యేకంగా నిలుపుతుంది. మైదానం వెలుపల కూడా ప్రతీక స్పెషల్ టాలెంట్తో ప్రత్యేకత చాటుకుంటోంది. రూబిక్స్ క్యూబ్ను సులువుగా పరిష్కరించగలదు. చదవండి: టీమిండియా యంగె(టె)స్ట్ సూపర్స్టార్! టర్నింగ్ పాయింట్ఢిల్లీ అండర్-19 టీమ్ తరపున ఆడిన ప్రతీక తర్వాత రైల్వేస్ జట్టుకు మారింది. దేశీయ క్రికెట్లో స్థిరంగా రాణించినప్పటికీ గతేడాది మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో తనను విస్మరించడంతో నిరాశకు గురైంది. అదీ కొద్ది వారాలు మాత్రమే. తర్వాత ఆమెకు తొలిసారిగా టీమిండియా కాల్ వచ్చింది. 2024, డిసెంబర్లో వెస్టిండీస్పై అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి నిలకడగా ఆడుతూ జట్టులో కీలక సభ్యురాలిగా మారింది. తన 6వ మ్యాచ్లో ఐర్లాండ్పై 154 పరుగులు చేయడం ప్రతీక ఇంటర్నేషనల్ కెరీర్లో టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు.ఏ పాత్రకైనా సిద్ధంప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్లోనూ అంచనాల మేరకు ఆడుతూ జట్టు నమ్మకాన్ని చూరగొంటోంది. జట్టులో ఏ పాత్రకైనా తన కూతురు సిద్ధమని ప్రదీప్ రావల్ (Pradeep Rawal) అంటున్నారు. అంతేకాదు ఈసారి టీమిండియా వరల్డ్కప్ సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీకపైనా కూడా చాలా అంచనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. -
చరిత్ర సృష్టించిన ‘హిట్మ్యాన్’.. ఆసియాలోనే తొలి క్రికెటర్గా
ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) తిరిగి పుంజుకున్నాడు. పెర్త్లో జరిగిన తొలి వన్డేలో ఎనిమిది పరుగులే చేసిన ‘హిట్మ్యాన్’.. రెండో వన్డేలో మాత్రం రాణించాడు.అడిలైడ్ (IND vs AUS 2nd ODI)లో గురువారం నాటి మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ.. అర్ధ శతకం సాధించాడు. డెబ్బై నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొని 73 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు ఉన్నాయి.సరికొత్త చరిత్రఇక రోహిత్ బాదిన రెండు సిక్సర్లు కూడా భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వచ్చినవే. ఆసీస్ పేసర్ మిచెల్ ఓవెన్ బౌలింగ్లో తొలి బంతిని సిక్సర్గా మలిచిన హిట్మ్యాన్.. మూడో బంతిని కూడా బౌండరీ మీదుగా తరలించాడు. అయితే, తొలి సిక్సర్తోనే రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు.SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 సిక్సర్లు బాదిన ఆసియా తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు రో‘హిట్’ శర్మ SENA దేశాల్లో మూడు ఫార్మాట్లలో కలిపి 156 మ్యాచ్లు ఆడి 151 సిక్సర్లు బాదడం విశేషం.Oh my word! 🤩@ImRo45 is back to his very best. Just what #TeamIndia needed. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/P95TUGWl95— Star Sports (@StarSportsIndia) October 23, 2025SENA దేశాల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆసియా క్రికెటర్లు🏏రోహిత్ శర్మ (ఇండియా)- 156 మ్యాచ్లలో 151*🏏సనత్ జయసూర్య (శ్రీలంక)- 171 మ్యాచ్లలో 113🏏షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్)- 139 మ్యాచ్లలో 105🏏మహేంద్ర సింగ్ ధోని (ఇండియా)- 175 మ్యాచ్లలో 83🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 177 మ్యాచ్లలో 83.👉ఇదిలా ఉంటే.. శ్రేయస్ అయ్యర్ (61)తో కలిసి మూడో వికెట్కు 118 పరుగులు జతచేసిన రోహిత్ శర్మ.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో జోష్ హాజిల్వుడ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక రోహిత్, శ్రేయస్ అర్ధ శతకాలకు తోడు అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44), హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగలిగింది. చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్బై చెప్పేశాడా? -
అతడెందుకు అని తిట్టారు.. కట్ చేస్తే! 133.33 స్ట్రైక్ రేట్తో మెరుపులు
ఆస్ట్రేలియా టూర్కు ఎంపిక చేసిన భారత జట్టులో హర్షిత్ రాణాకు చోటు ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ గౌతం గంభీర్ సపోర్ట్తోనే అతడిని ఎంపిక చేశారని అశ్విన్, కృష్ణమచారి శ్రీకాంత్ దిగ్గజ క్రికెటర్ల సైతం మండిపడ్డారు.ఆ తర్వాత వారిద్దరికి గంభీర్ సైతం గట్టిగా కౌంటరిచ్చాడు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేశామని, రాణాకు బంతితో బ్యాట్తో రాణించే సత్తా ఉందని గౌతీ చెప్పుకొచ్చాడు. అయితే గంభీర్ చెప్పిన మాటలు నిజమేనని రాణా నిరూపించుకున్నాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో హర్షిత్ రాణా సత్తాచాటాడు.తొమ్మిదో స్దానంలో బ్యాటింగ్కు దిగిన రాణా.. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఆడమ్ జంపా వంటి స్టార్ స్పిన్నర్ను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. రాణా 18 బంతుల్లో మూడు ఫోర్లు సాయంతో 24 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రాణా 133.33 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. అతడి కీలక ఇన్నింగ్స్తో భారత స్కోర్ 250 పరుగుల మార్క్ దాటింది.రోహిత్, అయ్యర్ హాఫ్ సెంచరీలుకాగా అడిలైడ్ వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు.అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(61), అక్షర్ పటేల్(44) రాణించారు. ఆఖరిలో హర్షిత్తో పాటు అర్ష్దీప్ కూడా 13 పరుగులతో కీలక నాక్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా..బార్ట్లెట్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు సాధించాడు.Harshit Rana scored 24 unbeaten runs off 18 balls. It’s not a massive contribution but it clearly shows that he can bat. All those who troll him 24x7 will not a say a word about his good cameo. These runs can be a deciding factor sometimes. #INDvsAUS pic.twitter.com/eS6dTxiygJ— Madhav Sharma (@HashTagCricket) October 23, 2025 -
ఆసీస్ టూర్కు నో ఛాన్స్.. రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దాదాపు పది నెలల తర్వాత తిరిగి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో భాగంగా మధ్యప్రదేశ్తో మ్యాచ్కు ప్రకటించిన సౌరాష్ట్ర జట్టులో జడేజాకు చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్కు జడేజా ఎంపిక కాకపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు.ఈ క్రమంలో ఎంపీతో మ్యాచ్కు అందుబాటులో ఉంటాని జడేజా తనంతట తానే సౌరాష్ట్ర సెలక్టర్లకు తెలియజేసినట్లు తెలుస్తోంది. జడేజా జట్టులోకి వచ్చినప్పటికి సౌరాష్ట్ర కెప్టెన్గా జయదేవ్ ఉనద్కట్ కొనసాగనున్నాడు. అక్టోబర్ 25 నుంచి రాజ్కోట్ వేదికగా సౌరాష్ట్ర-మధ్యప్రదేశ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.సూపర్ ఫామ్లో జడ్డూ..కాగా జడేజా ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన జడ్డూ.. ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఆసీస్తో వన్డేలకు జడేజాను ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం ఎడమ చేతి వాటం స్పిన్నర్గా జడేజాకు బదులుగా అక్షర్ పటేల్ను తీసుకున్నారు.వాషింగ్టన్ సుందర్, పటేల్ను స్పిన్ ఆల్రౌండర్లగా ఎంపిక చేసిన సెలక్టర్లు.. జడేజాకు ఛాన్స్ ఇవ్వలేదు. అయితే జడ్డూతో చర్చించాకే సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సౌరాష్ట్ర క్రికెట్ తిరిగి వచ్చే నెలలో భారత జెర్సీలో కన్పించనున్నాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో జడ్డూ భాగంగా కానున్నాడు. ఈ సిరీస్ సన్నాహకంగా రంజీ ట్రోఫీ మ్యాచ్ను ఉపయోగించుకోవాలని జడేజా భావిస్తున్నాడు.సౌరాష్ట్ర జట్టు: హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), తరంగ్ గోహెల్, రవీంద్ర జడేజా, యువరాజ్సిన్హ్ దోడియా, సమ్మర్ గజ్జర్, అర్పిత్ వాసవాడ, చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్, జయదేవ్ ఉనద్కత్ (కెప్టెన్), ధర్మేంద్రసింగ్ జడేజా, చేతన్ సకారియా, అన్ష్ గోసాయి, జే గోహిల్, పార్త్ భుట్, కెవిన్ జీవరాజని, హెత్విక్ కోటక్ మరియు అంకుర్ పన్వర్. -
పాకిస్తాన్ను చిత్తు చేసిన సౌతాఫ్రికా..
రావల్పిండి వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 72 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని ప్రోటీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ సమమైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్లో ఐడైన్ మార్క్రమ్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. రికెల్టన్ 25 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో నోమన్ అలీ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు.తిప్పేసిన హర్మర్..అంతకుముందు 94/4 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన పాక్కు సౌతాఫ్రికా స్పిన్నర్ హర్మర్ చుక్కలు చూపించాడు. అతడు స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న పాక్..సెకెండ్ ఇన్నంగ్స్లో కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. 44 పరుగుల వ్యవధిలో ఆతిథ్య జట్టు ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. దీంతో సఫారీలు ముందు పాక్ జట్టు కేవలం 72 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది.సౌతాఫ్రికా బౌలర్లలో హర్మర్ ఆరు వికెట్లతో సత్తాచాటగా.. మహారాజ్ రెండు, రబాడ ఒక్క వికెట్ పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజం(50) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 404 పరుగులు భారీ స్కోర్ సాధించింది.టెయిలాండర్ బ్యాటర్లలు సెనురన్ ముత్తుస్వామి (155 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... కగిసో రబడ (61 బంతుల్లో 71; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అదరగొట్టారు. పాక్ తమ తొలి ఇన్నింగ్స్లో 333 పరుగులు చేసింది. కేశవ్ మహారాజ్కు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కగా.. హర్మర్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: ఎట్టకేలకు బాబర్ ఆజంను కనికరించిన సెలక్టర్లు.. రిజ్వాన్కు భారీ షాక్ -
రోహిత్, శ్రేయస్ ఫిఫ్టీలు.. అదరగొట్టిన అక్షర్, హర్షిత్.. ఆసీస్ లక్ష్యం ఎంతంటే?
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అర్థ శతకాలతో రాణించగా.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్తో పాటు లోయర్ ఆర్డర్లో పేస్ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) అదరగొట్టారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగలిగింది. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాతో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య పెర్త్లో తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో ఆడిలైడ్లో గురువారం నాటి రెండో వన్డేలోనూ టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.A tough day for the King of Cricket 👑@imVkohli waved goodbye to the Adelaide crowd 🏏💬#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/yAG1uQFPA8— Star Sports (@StarSportsIndia) October 23, 2025గిల్, కోహ్లి ఫెయిల్ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (9)తో పాటు వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0)లను వరుస బంతుల్లో ఆసీస్ యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ పెవిలియన్కు పంపాడు. దీంతో ఆదిలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ, నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు.రోహిత్, శ్రేయస్ హాఫ్ సెంచరీలునెమ్మదిగా, నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 74 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. అయితే, మిచెల్ స్టార్క్ బౌలింగ్లో హాజిల్వుడ్కు క్యాచ్ ఇవ్వడంతో రోహిత్ పెవిలియన్కు చేరాడు.Making Head(s) turn! 🚨#AxarPatel sends it straight back over the bowler's head for a boundary. 💪#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/GSBJAAzEbG— Star Sports (@StarSportsIndia) October 23, 2025వేగంగా ఆడిన అక్షర్, హర్షిత్ఇక శ్రేయస్ అయ్యర్ 77 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు బాది 61 పరుగుల వద్ద.. ఆడం జంపా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 41 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టిన అక్షర్ హాఫ్ సెంచరీ (44)కి ఆరు పరుగుల దూరంలో ఉన్న వేళ.. జంపా బౌలింగ్లో అవుటయ్యాడు.Crucial runs for #TeamIndia from the blade of #HarshitRana! 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/lUjw3AVjEt— Star Sports (@StarSportsIndia) October 23, 2025ఇతరులలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (11), ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (12), నితీశ్ కుమార్ రెడ్డి (8) విఫలం కాగా.. టెయిలెండర్ హర్షిత్ రాణా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో పేసర్ అర్ష్దీప్ సింగ్ 14 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేశాడు.#ArshdeepSingh bhai, how much room is too much room? 🙌😄#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/bNwG2pNnt3— Star Sports (@StarSportsIndia) October 23, 2025జంపాకు నాలుగు వికెట్లుఈ నేపథ్యంలో తొమ్మిది వికెట్ల నష్టానికి టీమిండియా 264 పరుగులు సాధించి.. ఆసీస్కు 265 పరుగుల లక్ష్యం విధించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు బార్ట్లెట్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్బై చెప్పేశాడా? -
బాబర్ ఆజంను కనికరించిన సెలక్టర్లు.. రిజ్వాన్కు మరో భారీ షాక్
దాదాపు ఏడాది విరామం తర్వాత పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేయనున్నాడు. శ్రీలంక- జింబాబ్వే- పాకిస్తాన్ మధ్య జరిగే టీ20 ట్రై సిరీస్కు ముందుకు సెలక్టర్లు అతడిని కనికరించారు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ (Pak vs SA T20Is) ఆడే పాక్ జట్టులో అతడికి చోటు ఇచ్చారు.ఏడాది కాలంగా దూరంకాగా గతేడాది డిసెంబరులో సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా బాబర్ పాకిస్తాన్ తరఫున చివరగా టీ20 ఆడాడు. ఆ సిరీస్లో విఫలమైన కారణంగా సెలక్టర్లు బాబర్పై వేటు వేశారు. దాదాపు ఏడాది కాలంగా అతడిని టీ20 జట్టుకు దూరంగా ఉంచారు.అయితే, సొంతగడ్డపై జరిగే సౌతాఫ్రికాతో జరిగే తాజా టీ20 సిరీస్కు బాబర్ను ఎంపిక చేయడం విశేషం. ఆ తర్వాత పాక్ శ్రీలంక- జింబాబ్వేలతో టీ20 ట్రై సిరీస్ ఆడనుంది. నిజానికి శ్రీలంక- అఫ్గనిస్తాన్ జట్లతో పాక్ ముక్కోణపు టీ20 సిరీస్ ఆడాల్సింది.అయితే, పాక్ వైమానిక దాడుల్లో అఫ్గన్కు చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు దుర్మరణం చెందడంతో అఫ్గన్ బోర్డు ఈ సిరీస్ నుంచి విరమించుకుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేను బతిమాలుకున్న పాక్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు ఆ జట్టును సిరీస్ ఆడేలా ఒప్పించింది.రిజ్వాన్కు మరో భారీ షాక్ఇక సౌతాఫ్రికాతో టీ20 జట్టుకు సల్మాన్ ఆఘాను టీ20 కెప్టెన్గా కొనసాగించిన పాక్ బోర్డు.. వన్డేల్లో ఈ సిరీస్తో షాహిన్ ఆఫ్రిది కెప్టెన్గా ప్రయాణం ఆరంభిస్తాడని తెలిపింది. అయితే, వన్డే కెప్టెన్గా తప్పించిన మొహమ్మద్ రిజ్వాన్కు మాత్రం యాజమాన్యం మరో షాకిచ్చింది. కనీసం జట్టులోనూ అతడికిస్థానం ఇవ్వలేదు. ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయిన రిజ్వాన్కు.. వన్డేలలోనూ మొండిచేయే ఎదురైంది.కాగా పాక్ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్తో బిజీగా ఉంది. తొలి టెస్టులో వరల్డ్ చాంపియన్లను ఓడించిన షాన్ మసూద్ బృందం.. రెండో టెస్టులో మాత్రం ఓటమి పాలైంది. దీంతో రెండు టెస్టుల సిరీస్ సమమైంది.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు పాకిస్తాన్ జట్టు (అక్టోబరు 28- నవంబరు 1)సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీఖ్.సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు పాకిస్తాన్ జట్టు (నవంబరు 4- 8)షాహీన్ షా అఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్రమ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసీబుల్లా ఖాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, సయీమ్ ఆయుబ్, సల్మాన్ ఆఘా.చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్బై చెప్పేశాడా? -
ఏయ్.. ఏమి చేస్తున్నావు! శ్రేయస్పై రోహిత్ సీరియస్(వీడియో)
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) సత్తాచాటాడు. 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును అద్బుతమైన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో కలిసి మూడో వికెట్కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.తొలుత ఆచితూచి ఆడిన రోహిత్.. క్రీజులో సెటిల్ అయ్యాక దూకుడు పెంచాడు. 97 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్ 7 ఫోర్లు, 2 సిక్స్లతో 73 పరుగులు చేశాడు. అయితే భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే క్రమంలో రోహిత్-శ్రేయస్ అయ్యర్ మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది.ఏమి జరిగిందంటే?ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో రోహిత్ శర్మ ఎక్కువగా సింగిల్స్ పైన దృష్టిపెట్టాడు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన జోష్ హాజిల్వుడ్.. ఐదో బంతిని బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీగా రోహిత్కు సంధించాడు. ఆ బంతిని హిట్మ్యాన్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతడి ప్యాడ్లను తాకి కాస్త దూరంగా వెళ్లింది. దగ్గరలో ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో క్విక్ సింగిల్కు కాల్ ఇచ్చాడు. అయ్యర్ మాత్రం రోహిత్ పిలుపును తిరష్కరించాడు. అయితే రన్కు పిలిచిన శ్రేయస్ రాకపోవడంపై హిట్మ్యాన్ అసహనం వ్యక్తం చేశాడు. నువ్వు త్వరగా వచ్చి ఉంటే పరుగు పూర్తయ్యేది అని రోహిత్ అనగా.. అరె.. మీరే చూసుకుని రండి.. మళ్లీ నన్ను అంటారెందుకు? అని శ్రేయస్ గట్టిగానే బదులిచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా అయ్యర్(61) సైతం హాఫ్ సెంచరీతో రాణించాడు.చదవండి: #Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గంగూలీ ఆల్టైమ్ రికార్డు బ్రేక్Stump mic captures Rohit Sharma vs Shreyas Iyer 🤣🙌Whose call was it really?✍🏻👇#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/YipS5K9ioa— Star Sports (@StarSportsIndia) October 23, 2025 pic.twitter.com/mN9s6b7piw— crictalk (@crictalk7) October 23, 2025 -
అందుకే అతడిని సెలక్ట్ చేయలేదు: స్పందించిన బీసీసీఐ!
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ఆడే భారత్- ‘ఎ’ జట్టు (IND A vs SA A)ను ప్రకటించిన నాటి నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై విమర్శలు కొనసాగుతున్నాయి. రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్గా వ్యవహరించే ఈ జట్టులో ఉద్దేశపూర్వకంగానే సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి.ఇంటిపేరు కారణంగానే అంటూసొంతగడ్డపై సర్ఫరాజ్ ఖాన్ సత్తా చాటగలడని.. అయినా అతడిని పక్కనపెట్టడం ఏమిటని మాజీ క్రికెటర్లు సైతం విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేత షామా మొహమ్మద్ అయితే ఓ అడుగు ముందుకేసి.. ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్పై వేటు వేశారంటూ హెడ్కోచ్ గౌతం గంభీర్పై సంచలన ఆరోపణలు చేశారు.గజ్జల్లో గాయంఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు ఈ విషయంపై స్పందించినట్లు ఎన్డీటీవీ తెలిపింది. సర్ఫరాజ్ ఖాన్ను భారత్- ‘ఎ’ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి గల కారణం వెల్లడించినట్లు పేర్కొంది. ఈ మేరకు.. ‘‘సర్ఫరాజ్ గజ్జల్లో గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే రంజీ ట్రోఫీ మొదటి రౌండ్ సందర్భంగా ముంబై తరఫున కాంపిటేటివ్ క్రికెట్లో పునరాగమనం చేశాడు.త్వరలోనే తిరిగి జట్టులోకిరంజీ తాజా సీజన్లో అతడి ప్రదర్శన, ఫిట్నెస్ ఎలా ఉంటుందో అంచనా వేసిన తర్వాతే అతడిని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అందుకే భారత్-‘ఎ’ జట్టుకు ఎంపిక చేయలేదు. త్వరలోనే తిరిగి అతడు జట్టులోకి వస్తాడని నమ్ముతున్నాం’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు ఎన్డీటీవీ తెలిపింది.కాగా స్వదేశంలో దేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో ఈనెల 30 నుంచి నవంబర్ 9 వరకు జరిగే రెండు నాలుగు రోజుల (ఫస్ట్క్లాస్) అనధికారిక టెస్టు మ్యాచ్లలో తలపడే భారత ‘ఎ’ జట్టుకు పంత్ను కెప్టెన్గా ఎంపిక చేసింది బీసీసీఐ. పంత్ రీఎంట్రీబెంగళూరు వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్ల కోసం రెండు వేర్వేరు జట్లను మంగళవారం సెలక్టర్లు ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ తేదీలను దృష్టిలో ఉంచుకుంటూ ఆయా ఆటగాళ్ల అందుబాటును బట్టి జట్లను ఎంపిక చేశారు.కాగా ఇంగ్లండ్తో మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్టులో పేసర్ క్రిస్ వోక్స్ బంతి బలంగా తగలడంతో పంత్ కాలికి తీవ్ర గాయమైంది. దాంతో చివరి టెస్టు నుంచి తప్పుకున్న అతడు ఆ తర్వాత ఆసియా కప్ టీ20 టోర్నీ, వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్కు కూడా దూరమయ్యాడు. చికిత్స అనంతరం కోలుకున్న పంత్ ఆడేందుకు ఫిట్గా ఉన్నట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం ఇటీవలే సర్టిఫికెట్ ఇచ్చింది. దాంతో అతడిని ముందుగా ‘ఎ’ జట్టు తరఫున ఆడించాలని సెలక్టర్లు నిర్ణయించారు.అన్నీ సానుకూలంగా ఉంటే దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం పంత్ను ఎంపిక చేయడం లాంఛనమే. పంత్తో పాటు యువ బ్యాటర్ సాయి సుదర్శన్కు మరింత మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని భావించి అతడిని రెండు మ్యాచ్ల కోసం ఎంపిక చేశారు. దేశవాళీలో రాణిస్తూ ఫామ్లో ఉన్న రజత్ పాటీదార్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్, ఆకాశ్దీప్లను రంజీ కారణంగా ఒకే మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. మరోవైపు టెస్టు సిరీస్కు ముందు తమ ఆటకు పదును పెట్టాలని భావిస్తున్న రెగ్యులర్ టెస్టు జట్టు సభ్యులు కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ధ్రువ్ జురేల్ కూడా రెండో మ్యాచ్లో ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగుతారు. భారత్ ‘ఎ’ జట్టు (తొలి మ్యాచ్కు): రిషభ్ పంత్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), ఆయుశ్ మాత్రే, జగదీశన్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, హర్ష్ దూబే, తనుశ్ కొటియాన్, మానవ్ సుతార్, అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుశ్ బదోని, సారాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్. భారత్ ‘ఎ’ జట్టు (రెండో మ్యాచ్కు): పంత్ (కెప్టెన్), సాయిసుదర్శన్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుశ్ కొటియాన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్. చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్బై చెప్పేశాడా? -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గంగూలీ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును శ్రేయస్ అయ్యర్తో కలిసి రోహిత్ ఆదుకున్నాడు.తొలుత ఆచితూచి ఆడిన రోహిత్, క్రీజులో నిలదొక్కకున్నాక ప్రత్యర్ధి బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో 97 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్ 7 ఫోర్లు, 2 సిక్స్లతో 73 పరుగులు చేశాడు. సెంచరీ మార్క్ను అందుకునేలా కన్పించిన రోహిత్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే..👉వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో ఓపెనర్గా 9180* పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (9146 ) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో గంగూలీని రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్(15310) అగ్రస్ధానంలో ఉన్నాడు.👉ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ జట్టుపై 1,000 కంటే ఎక్కువ వన్డే పరుగులు తొలి భారత బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. ఓవరాల్గా ఐదో బ్యాటర్గా హిట్మ్యాన్ రికార్డులకెక్కాడు. అయితే ఈ ఫీట్ను అంత్యంత వేగంగా అందుకున్న రెండో బ్యాటర్ మాత్రం రోహిత్ శర్మనే కావడం గమనార్హం. రోహిత్ కేవలం 21 ఇన్నింగ్స్లలోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ (19) అగ్రస్దానంలో ఉన్నాడు.👉వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్ధానానికి చేరుకున్నాడు. రోహిత్ ఇప్పటివరకు 11225 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గంగూలీ(11221)ని రోహిత్ అధిగమించాడు.👉ఆసీస్పై వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా బ్రియాన్ లారా రికార్డును హిట్మ్యాన్ సమం చేశాడు. వీరిద్దరూ 18 హాఫ్ సెంచరీలు ఆసీస్పై సాధించారు.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.చదవండి: IND vs AUS: విరాట్ కోహ్లి మళ్లీ డకౌట్.. లండన్కు బ్యాగ్ సర్దుకోవాల్సిందే!? -
డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్బై చెప్పేశాడా?
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) వైఫల్యం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మరోసారి ఇదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. పెర్త్లో ఎనిమిది బంతులు ఎదుర్కొని మిచెల్ స్టార్క్ బౌలింగ్లో డకౌట్ అయిన కోహ్లి.. అడిలైడ్ వేదికగా రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లోనూ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. లెగ్ బిఫోర్ వికెట్గాభారత జట్టు ఇన్నింగ్స్లో ఏడో ఓవర్లో ఆస్ట్రేలియా యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ (Xavier Bartlett) బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొన్న కోహ్లి వికెట్ల ముందు అతడికి దొరికిపోయాడు. బార్ట్లెట్ సంధించిన బంతిని ఫ్లిక్ షాట్ ఆడబోయిన కోహ్లి విఫలమయ్యాడు. బంతి బ్యాట్కు బదులు ప్యాడ్కు తాకింది.VIRAT KOHLI GONE FOR HIS SECOND DUCK OF THE SERIES!#AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/jqIdvMeX9T— cricket.com.au (@cricketcomau) October 23, 2025 అయితే, ఫీల్డ్ అంపైర్ సామ్ నొగాజ్స్కి లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా ప్రకటించేందుకు తటపటాయించాడు. అయితే, ఆసీస్ బౌలర్లు అప్పీలు చేసిన వెంటనే అవుట్ అంటూ వేలు పైకెత్తాడు. దీంతో కోహ్లితో పాటు అడిలైడ్ స్టేడియంలోని అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. నాలుగు బంతులు ఎదుర్కొన్న కోహ్లి ఇలా మరోసారి సున్నా చుట్టడంతో స్టేడియం అంతా సైలెంట్ అయిపోయింది.ఇదే తొలిసారికాగా వన్డే క్రికెట్లో కోహ్లి తన పదిహేడేళ్ల కెరీర్లో వరుసగా రెండుసార్లు డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. అవుటైన తర్వాత పెవిలియన్కు చేరే క్రమంలో కోహ్లి గ్లోవ్స్ తీసి.. అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ డ్రెసింగ్ రూమ్ వైపు వెళ్లడం రిటైర్మెంట్ వదంతులకు ఊతమిచ్చింది.డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్బై చెప్పేశాడా?ఆస్ట్రేలియాతో గతేడాది బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లోనూ వరుస వైఫల్యాల నేపథ్యంలో కోహ్లి ఆఖరి మ్యాచ్లో ఇలాగే చేశాడంటూ ఫ్యాన్స్ గుర్తుచేసుకున్నారు. ఇక ఆ సిరీస్ తర్వాత కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి తాజా చర్య కూడా వన్డే రిటైర్మెంట్కు సంకేతమేనంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.మరికొంత మంది మాత్రం తనకెంతో ఇష్టమైన అడిలైడ్ వేదికపై కోహ్లి చివరి వన్డే ఆడేశాడని.. ఓవల్తో పాటు ఇక్కడి అభిమానులకు మాత్రమే గుడ్బై చెప్పాడని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తు ప్రశ్నార్థకంచివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 బరిలో దిగిన కోహ్లి ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ ఆసీస్తో వన్డేతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, పునరాగమనంలో ఇలా వరుసగా డకౌట్లు కావడం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. వన్డే వరల్డ్కప్-2027 ఆడాలని కోహ్లి పట్టుదలగా ఉండగా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం ఇది కుదరదనే సంకేతాలు ఇచ్చాడు. ఆసీస్తో వన్డే జట్టు ప్రకటన సందర్భంగా రోహిత్ శర్మ, కోహ్లి తమకు ఈ విషయమై హామీ ఇవ్వలేదని.. అందుకే రోహిత్ను వన్డే కెప్టెన్గా తొలగించినట్లు తెలిపాడు. కాగా రో- కో ఇప్పటికే పొట్టి ఫార్మాట్, టెస్టులకు గుడ్బై చెప్పి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇక ఆసీస్తో రెండో వన్డేలో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం.చదవండి: 'లేటుగా ఎంట్రీ ఇచ్చా.. లేదంటే సచిన్ను మించిపోయేవాడిని' End is very-very near guys, cherish each and every moment of Virat kohli in this tour.💔 pic.twitter.com/vgJ3Uy4rxO— U' (@toxifyy18) October 23, 2025 -
విరాట్ కోహ్లి మళ్లీ డకౌట్.. లండన్కు బ్యాగ్ సర్దుకోవాల్సిందే!?
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. అసీస్తో తొలి వన్డేలో డకౌటైన కోహ్లి.. ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్లో కూడా అదే తీరును కనబరిచాడు. 4 బంతులు ఎదుర్కొని తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.గిల్ ఔటైన తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కింగ్ కోహ్లి.. ఆసీస్ యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత ఇన్నింగ్స్ 7 ఓవర్ వేసిన బార్ట్లెట్ తొలి బంతికి కెప్టెన్ గిల్ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత అదే ఓవర్లో ఆఖరి బంతిని కోహ్లికి మిడిల్ స్టంప్ లైన్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సాధించాడు. ఆ బంతిని కోహ్లి ఫ్లిక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కనీ బంతి మాత్రం బ్యాట్కు మిస్స్ అయ్యి ఫ్రంట్ ప్యాడ్కు తాకింది. వెంటనే బౌలర్తో పాటు ఫీల్డర్లు ఎల్బీగా అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న రోహిత్ శర్మతో చర్చించాక రివ్యూ తీసుకోకుండానే కోహ్లి మైదానం వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రిప్లేలో బంతి మిడిల్ స్టంప్ను హిట్ చేస్తున్నట్లు కన్పించింది.ఇక తన ఇంటర్ననేషనల్ క్రికెట్ రీ ఎంట్రీలో దారుణ ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లిపై నెటిజన్లు ఫైరవతున్నారు. ఇక నీ పని అయిపోయింది.. లండన్కు బ్యాగ్ సర్దుకో అంటూ పోస్ట్లు పెడుతున్నారు. కాగా అడిలైడ్లో కోహ్లికి మంచి రికార్డు ఉన్నప్పటికి.. ఈ మ్యాచ్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు.ఈ మైదానంలో అతడికి రెండు సెంచరీలు ఉన్నాయి. కాగా 2027 వన్డే ప్రపంచకప్లో ఆడాలని లక్ష్యం పెట్టుకున్న కోహ్లి ఈ తరహా ప్రదర్శనలు కనబరిచడం అందరిని షాక్కు గురిచేస్తోంది. రెండో వన్డేలో భారత్ తడబడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.చదవండి: 'లేటుగా ఎంట్రీ ఇచ్చా.. లేదంటే సచిన్ను మించిపోయేవాడిని'VIRAT KOHLI GONE FOR HIS SECOND DUCK OF THE SERIES!#AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/jqIdvMeX9T— cricket.com.au (@cricketcomau) October 23, 2025 -
'లేటుగా ఎంట్రీ ఇచ్చా.. లేదంటే సచిన్ను మించిపోయేవాడిని'
మైఖేల్ హస్సీ.. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించకున్నాడు. 28 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటికి అన్ని ఫార్మాట్లలో కలిపి పన్నేండు వేలకు పైగా పరుగులు చేశాడు. 2007లో వన్డే వరల్డ్ కప్, , 2006, 2009లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ గెలుచుకున్న ఆసీస్ జట్టులో హస్సీ భాగమయ్యాడు.మిస్టర్ క్రికెట్గా పేరు గాంచిన హస్సీ తన అద్భుత ఇన్నింగ్స్లతో కంగారులకు చారిత్రత్మక విజయాలను అందించాడు. కాగా దేశవాళీ క్రికెట్లో మెరుగైన రికార్డులు ఉన్నప్పటికి.. ఆ సమయంలో తీవ్రమైన పోటీ వల్ల ఆసీస్ జట్టులో ఆలస్యంగా హస్సీకి జట్టులో చోటు దక్కింది. లేటుగా వచ్చినా అందరితో మాత్రం గ్రేట్ అని అన్పించుకున్నాడు. అయితే హస్సీ తాజాగా యూట్యూబ్ ఛానల్ ది గ్రేడ్ క్రికెటర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తాను త్వరగా క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ పరుగులు చేసేవాడినంటూ అతడు చెప్పుకొచ్చాడు."సచిన్ రికార్డులు గురుంచి నేను చాలాసార్లు ఆలోచించాను. నాకు ముందుగా ఆసీస్ జట్టులో చోటు దక్కింటే,సచిన్ టెండూల్కర్ కంటే 5,000 పరుగులు ఎక్కువ చేసేవాడిని. అంతేకాకుండా ఎక్కువ సెంచరీలు, ఎక్కువ యాషెస్ విజయాలు,వరల్డ్ కప్లు గెలిచేవాడినని కూడా అనిపిస్తుంది.కానీ దురదృష్టవశాత్తూ ఉదయం నిద్రలేవగానే మాయపోతున్నాయి. అప్పుడు అర్ధమైంది అదింతా కల అని. ముందే నాకు ఆడే ఛాన్స్ లభించింటే బాగుండేది. ఏదేమైనప్పటికి నాకు అవకాశం ఆలస్యంగా వచ్చినప్పటికీ గొప్పగా భావిస్తున్నా అని హస్సీ పేర్కొన్నాడు. ఈ ఆసీస్ గ్రేట్ ఐపీఎల్లో చాలా సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ప్రస్తుతం సీఎస్కే బ్యాటింగ్ కోచ్గా ఉన్నాడు.మైఖల్ హస్సీ తన అంతర్జాతీయ కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 49 సగటుతో 12,398 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు ఉన్నాయి. అయితే హస్సీతో పోలిస్తే టెండూల్కర్ కెరీర్ 24 సంవత్సరాలు ఎక్కువగా సాగింది. 16 ఏళ్ల వయసులోనే లిటల్ మాస్టర్ భారత క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్(34,357) అగ్రస్ధానంలో ఉన్నాడు. అయన దారిదాపుల్లో ఎవరూ లేరు.చదవండి: World cup 2025: ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్.. -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్..
మహిళల వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో జట్టు మరో అలవోక విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.టామీ బీమాంట్ (105 బంతుల్లో 78; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... అలైస్ క్యాప్సీ (38) రాణించింది. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3 వికెట్లు పడగొట్టగా... యాష్లే గార్డ్నర్, మోలినో చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఆ్రస్టేలియా 40.3 ఓవర్లలో 4 వికెట్లకు 248 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. యాష్లే గార్డ్నర్ (73 బంతుల్లో 104 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా... అనాబెల్ సదర్లాండ్ (112 బంతుల్లో 98 నాటౌట్; 9 ఫోర్లు 1 సిక్స్) త్రుటిలో శతకానికి దూరమైంది. ఒకదశలో ఆ్రస్టేలియా 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే గార్డ్నర్, సదర్లాండ్ ఐదో వికెట్కు అభేద్యంగా 180 పరుగులు జోడించి గెలిపించారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన సదర్లాండ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. గాయం కారణంగా కెప్టెన్ అలీసా హీలీ ఈ మ్యాచ్కు దూరమైనా ఆ్రస్టేలియాకు ఎలాంటి సమస్య ఎదురు కాలేదు.చదవండి: PKL 2025: భరత్ ఒంటరి పోరాటం.. హర్యానా చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తు -
IND Vs AUS: ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమి
IND vs Aus 2nd Odi live updates and Highlights: అడిలైడ్ వేదికగా రెండో వన్డేలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. రెండు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్ను కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (74), కూపర్ కన్నోలి (61 నాటౌట్) అద్భుత హాఫ్ సెంచరీలతో రాణించి ఆసీస్కు విజయం అందించారు. ఎనిమిదో వికెట్ డౌన్స్టార్క్ (4) రూపంలో ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఏడో వికెట్గా బార్ట్లెట్ (3) వెనుదిరిగాడు. 45 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసినన ఆసీస్.. విజయానికి 30 బంతుల్లో 10 పరుగుల దూరంలో ఉంది. కన్నోలి 56, స్టార్క్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి మిచెల్ ఓవెన్ (36) అవుటయ్యాడు. దీంతో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. అయితే, అర్ధ శతకంతో కూపర్ కన్నోలి జోరుమీద ఉన్నాడు. జేవియర్ బార్ట్లెట్ అతడికి సహకరిస్తున్నాడు. 43.1 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్ విజయానికి.. 41 బంతుల్లో కేవలం 16 పరుగులే అవసరం.ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్హర్షిత్ రాణా బౌలింగ్లో ఐదో వికెట్గా వెనుదిరిగాడు అర్థ శతక వీరుడు మాథ్యూ షార్ట్ (74). సిరాజ్కు క్యాచ్ ఇవ్వడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసిపోగా ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. మిచెల్ ఓవెన్ క్రీజులోకి వచ్చాడు. 39 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోరు 207-5. విజయానికి 66 బంతుల్లో 58 పరుగులు కావాలి. కన్నోలి 34, మిచెల్ ఓవెన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్26.2వ ఓవర్- 132 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అలెక్స్ క్యారీ (9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 30.3 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 143 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్లో ఆసీస్ గెలవాలంటే మరో 122 పరుగులు చేయాలి. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్21.4వ ఓవర్- 109 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో మ్యాట్ రెన్షా (30) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మాథ్యూ షార్ట్తో 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. షార్ట్కు (37) జతగా అలెక్స్ క్యారీ క్రీజ్లోకి వచ్చాడు.రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్12.2వ ఓవర్- 265 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 54 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి హెడ్ (28) ఔటయ్యాడు. అంతకుముందు 8వ ఓవర్ రెండో బంతికి అర్షదీప్ సింగ్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ మిచెల్ మార్ష్ (11) పెవిలియన్కు చేరాడు. రోహిత్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు.. భారత్ స్కోర్: 264/9అడిలైడ్ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(73) టాప్ స్కోరర్గా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(61), అక్షర్ పటేల్(44) రాణించారు. ఆఖరిలో హర్షిత్ రాణా(24), అర్ష్దీప్ సింగ్ కీలక ఇన్నింగ్స్లు ఆడారు. కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి(0), కేఎల్ రాహుల్(11) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా..బార్ట్లెట్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు సాధించాడు.భారత్ ఎనిమిదో వికెట్ డౌన్..అడిలైడ్ వన్డేలో భారత్ ఆలౌట్ దిశగా సాగుతోంది. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన నితీశ్.. ఆడమ్ జంపా బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. భారత్ స్కోర్: 229-8(46 ఓవర్లు)ఏడో వికెట్ కోల్పోయిన భారత్44.1: నిలకడగా ఆడుతున అక్షర్ పటేల్ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. జంపా బౌలింగ్లో స్టార్క్కు క్యాచ్ ఇవ్వడంతో అక్షర్ ధనాధన్ ఇన్నింగ్స్కు తెరపడింది. దీంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా క్రీజులోకి రాగా.. నితీశ్ రెడ్డి ఏడు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 223-7(44.1)వాషీ అవుట్.. ఆరో వికెట్ డౌన్41.5: బార్ట్లెట్ బౌలింగ్లో హాజిల్వుడ్కు క్యాచ్ ఇచ్చి అవుటైన వాషింగ్టన్ సుందర్ (12). దీంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి రాగా.. అక్షర్ పటేల్ 41 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 213-6(42). టీమిండియా ఐదో వికెట్ డౌన్టీమిండియా 174 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాహుల్.. ఆడమ్ జంపా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్శ్రేయస్ అయ్యర్ (61) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. జంపా బౌలింగ్లో అయ్యర్ బౌల్డ్. స్కోరు: 160-4(32.4). అక్షర్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు.రోహిత్ శర్మ ఔట్..రోహిత్ శర్మ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోంయింది. 73 పరుగులు చేసిన రోహిత్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు.అయ్యర్ హాఫ్ సెంచరీ..శ్రేయస్ అయ్యర్ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 67 బంతుల్లో అయ్యర్ తన 23వ ఆర్ధ శతకాన్ని అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 94-2 (29). రోహిత్ 72 పరుగులతో క్రీజులో ఉన్నాడు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ21.5: కన్నోలి బౌలింగ్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. 74 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న హిట్మ్యాన్. వన్డేల్లో ఇది 59వ ఫిఫ్టీ. టీమిండియా స్కోరు: 94-2 (22). అయ్యర్ 33 పరుగులతో ఆడుతున్నాడు.సిక్స్లు, ఫోర్.. 17 పరుగులు19వ ఓవర్లో రోహిత్ శర్మ రెండు సిక్స్లు బాదగా.. శ్రేయస్ అయ్యర్ ఓ ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మిచెల్ ఓవెన్ బౌలింగ్లో ఈ ఓవర్లో ఓవరాల్గా 17 పరుగులు వచ్చాయి. టీమిండియా స్కోరు 83-2.నిలకడగా ఆడుతున్న రోహిత్, అయ్యర్..15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(26), శ్రేయస్ అయ్యర్(13) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.టీమిండియాకు భారీ షాక్.. కోహ్లి డకౌట్విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్లో కోహ్లి వికెట్లు ముందు దొరికిపోయాడు. దీంతో ఖాతా తెరవకుండానే కోహ్లి పెవిలియన్కు చేరాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్..రెండో వన్డేలో కూడా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ విఫలమయ్యాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన గిల్.. బార్ట్లెట్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కోహ్లి వచ్చాడు.తడబడుతున్న గిల్..6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఓ వైపు శుభ్మన్ గిల్(8 బంతుల్లో 9) మంచి టచ్లో కన్పిస్తుంటే.. రోహిత్ శర్మ(28 బంతుల్లో 8) మాత్రం తడబడుతున్నాడు.అడిలైడ్ వేదికగా రెండో వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి స్టార్ ప్లేయర్లు అలెక్స్ క్యారీ, అడమ్ జంపా వచ్చారు. మరోవైపు భారత్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. పెర్త్లో ఆడిన జట్టునే కొనసాగించింది. కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యాడు.తుది జట్లుఆస్ట్రేలియా : మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కోనోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్భారత్ : రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ -
రసవత్తరంగా పాక్-సౌతాఫ్రికా రెండో టెస్టు..
రావల్పిండి వేదికగా పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆధిక్యం చేతులు మారుతున్న ఈ పోరులో మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 35 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (83 బంతుల్లో 49 బ్యాటింగ్; 7 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (16 బ్యాటింగ్) పోరాడుతున్నారు. ఇమాముల్ హక్ (9), అబ్దుల్లా షఫీఖ్ (6), కెపె్టన్ షాన్ మసూద్ (0), సౌద్ షకీల్ (11) విఫలమయ్యారు.దక్షిణాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మెర్ 3 వికెట్లు పడగొట్టగా... రబడ ఓ వికెట్ తీశాడు. చేతిలో 6 వికెట్లు ఉన్న ఆతిథ్య పాకిస్తాన్ జట్టు... ప్రస్తుతం 23 పరుగుల ఆధిక్యంలో ఉంది. సఫారీ బౌలర్ల ధాటికి ఒక దశలో 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును బాబర్ ఆదుకున్నాడు. కాస్త సంయమనం పాటిస్తూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ముత్తుస్వామి, రబడ మెరుపులు అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 185/4తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా... చివరకు 119.3 ఓవర్లలో 404 పరుగులు చేసింది. సెనురన్ ముత్తుస్వామి (155 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... కగిసో రబడ (61 బంతుల్లో 71; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అదరగొట్టాడు. పాక్ బౌలర్లను ఓ ఆటాడుకున్న ఈ జంట పదో వికెట్కు 98 పరుగులు జోడించడం విశేషం. ముత్తుస్వామి అచ్చమైన టెస్టు బ్యాటింగ్తో ఆకట్టుకోగా... రబడ టి20 తరహాలో రెచ్చిపోయాడు. ఎడాపెడా భారీ షాట్లు ఆడుతూ విలువైన పరుగులు రాబట్టాడు.ఈ ఇద్దరికీ ఇదే కెరీర్ బెస్ట్ స్కోరు కాగా... రబడ 38 బంతుల్లోనే టెస్టుల్లో తొలి అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. కేశవ్ మహరాజ్ (53 బంతుల్లో 30; 3 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో ఒకదశలో 210/7తో నిలిచిన దక్షిణాఫ్రికా... చివరి మూడు వికెట్లకు 194 పరుగులు జోడించింది. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టుకు 71 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాక్ ఫీల్డింగ్ తప్పిదాలు కూడా దక్షిణాఫ్రికా భారీ స్కోరుకు దోహదపడ్డాయి.చదవండి: PKL 2025: భరత్ ఒంటరి పోరాటం.. హర్యానా చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తు -
సిరీస్ కాపాడుకునేందుకు...
అడిలైడ్: శుబ్మన్ గిల్ నాయకత్వంలో తొలి వన్డే ఓడిన భారత జట్టు మరో పోరులో తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు జరిగే రెండో వన్డేలో ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. ప్రస్తుతం 0–1తో వెనుకంజతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో ఓడితే సిరీస్ను చేజార్చుకుంటుంది. వర్షం కారణంగా 26 ఓవర్లకే కుదించిన గత మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ్రస్టేలియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. సహజంగానే మరోసారి అందరి దృష్టీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపైనే ఉంది. తొలి వన్డేలో వీరిద్దరు విఫలం కావడం కొత్త చర్చకు దారి తీసింది. ప్రతీ మ్యాచ్ వీరికి పరీక్ష కాదని చీఫ్ సెలక్టర్ అగార్కర్ చెబుతున్నా... కచి్చతంగా రాణించాల్సిన ఒత్తిడి వీరిపై ఉందనేది వాస్తవం. అరంగేట్ర మ్యాచ్లో ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి తన ప్రభావం చూపించాలని పట్టుదలగా ఉన్నాడు. భారత్ తుది జట్టు విషయంలో మార్పు ఉండకపోవచ్చు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు అక్షర్, సుందర్లలో ఒకరిని తప్పించి రెగ్యులర్ స్పిన్నర్ కుల్దీప్కు అవకాశం ఇస్తారా అనేది సందేహమే. మరోవైపు ఆస్ట్రేలియా టీమ్లో ఫిలిప్స్, కునెమన్ స్థానాల్లో అలెక్స్ కేరీ, ఆడమ్ జంపా రావడం ఖాయమైంది. అడిలైడ్ మైదానం బ్యాటింగ్కు బాగా అనుకూలం కావడంతో భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. ఈ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడిన గత రెండు వన్డేల్లో (2012, 2019) భారత జట్టే గెలిచింది. -
సెమీఫైనల్లో స్థానం కోసం...
సొంతగడ్డపై మహిళల వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్స్లో ఒక జట్టుగా బరిలోకి దిగిన భారత్ ఐదు మ్యాచ్ల తర్వాత కూడా ఇంకా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోలేకపోయింది. వరుసగా మూడు ఓటములతో దెబ్బతిన్న టీమిండియా ముంగిట ఇప్పుడు మరో అవకాశం నిలిచింది. ఈ మ్యాచ్లో గెలిస్తే హర్మన్ప్రీత్ బృందానికి అధికారికంగా సెమీఫైనల్లో చోటు ఖాయమవుతుంది. మరోవైపు బలహీన జట్లతో గెలిచే అవకాశం ఉన్న రెండు వరుస మ్యాచ్లు వానబారిన పడటంతో వెనుకబడిన న్యూజిలాండ్ కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో నిలిచింది. నవీ ముంబై: వన్డే వరల్డ్ కప్లో కీలక పోరుకు భారత మహిళల బృందం సిద్ధమైంది. లీగ్ దశలో భాగంగా నేడు జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్తో టీమిండియా తలపడుతుంది. తొలి రెండు మ్యాచ్లలో గెలిచి ఉత్సాహంతో కనిపించిన భారత్ ఆ తర్వాత అనూహ్యంగా మూడు ఓటములను ఎదుర్కొంది. మూడు సందర్భాల్లోనూ మెరుగ్గానే ఆడి మ్యాచ్ను నియంత్రణలోనే ఉంచుకున్నా... చివరికొచ్చేసరికి చేతులెత్తేసింది. అయితే పరిస్థితి ఇంకా భారత్ చేయిదాటిపోలేదు. కివీస్పై గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరుతుంది. అయితే పటిష్ట ప్రత్యర్థి, మాజీ చాంపియన్తో పోరు అంత సులువు కాదు. ఓడితే సెమీస్ అవకాశాలు కోల్పోనున్న కివీస్ పట్టుదలగా పోరాడుతుందనడంలో సందేహం లేదు. 2022 నుంచి కివీస్తో 9 వన్డేలు ఆడిన భారత్ 6 మ్యాచ్లలో ఓడింది. మార్పు చేస్తారా! వరుసగా నాలుగు మ్యాచ్ల తర్వాత గత పోరులో భారత్ ఒక కీలక మార్పు చేసింది. ఆరో బౌలర్తో బౌలింగ్ను పటిష్ట పర్చుకోవడంలో భాగంగా రేణుకా సింగ్ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్పై వేటు పడింది. అయితే ఇంగ్లండ్పై అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. రేణుక ఒక్క వికెట్ కూడా తీయకపోగా, విజయానికి చేరువగా వచి్చన జట్టు చివర్లో బ్యాటింగ్ తడబాటుతో చేజేతులా ఓడింది. స్మృతి కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. ఈ నేపథ్యంలో మళ్లీ జెమీమాకు అవకాశం కల్పిస్తారా చూడాలి. గత పోరులో ప్రధాన బ్యాటర్లు స్మృతి, కెప్టెన్ హర్మన్లతో పాటు మరో సీనియర్ దీప్తి శర్మ కూడా అర్ధసెంచరీలు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. ఇలాంటి తడబాటును అధిగమించి టాప్ ప్లేయర్లు మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. ఇతర బ్యాటర్లలో ప్రతీక, హర్లీన్ మినహా మరో చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం కూడా జట్టు వద్ద లేదు. రిచా ఘోష్ తనదైన శైలిలో దూకుడుగా ఆడితే జట్టుకు అదనపు ప్రయోజనం కలుగుతుంది. టోర్నీ ఆరంభంలో ఆకట్టుకున్న పేసర్ క్రాంతి గౌడ్ పదును మ్యాచ్ మ్యాచ్కూ తగ్గుతూ వచ్చింది. అమన్జోత్ మీడియం పేస్ కూడా అంతగా ప్రభావం చూపడం లేదు. గత మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లూ విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో మన స్పిన్నర్లు ప్రత్యర్థిని ఎలా కట్టడి చేస్తారో చూడాలి. సోఫీ డివైన్ మినహా... మహిళల క్రికెట్లో పటిష్టమైన జట్లలో ఒకటైన న్యూజిలాండ్ ఈసారి ప్రభావవంతంగా కనిపించడం లేదు. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాల చేతిలో ఓడిన కివీస్ ఒక్క బంగ్లాదేశ్పై మాత్రమే గెలిచింది. పాక్, శ్రీలంకలతో మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. టోరీ్నలో ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలు సాధించిన కెపె్టన్ సోఫీ డివైన్పైనే జట్టు బ్యాటింగ్ ఆధారపడుతోంది. ఓపెనర్లు సుజీ బేట్స్, ప్లిమ్మర్ పూర్తిగా విఫలమయ్యారు. ఆల్రౌండర్ అమెలియా కెర్తోపాటు స్పిన్నర్ కార్సన్ కూడా ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. గత మ్యాచ్ ఆడని ప్రధాన పేసర్ తహుహు ఈ మ్యాచ్లో మళ్లీ బరిలోకి దిగుతోంది. మిడిలార్డర్లో హ్యాలిడే, గ్రీన్, ఇసాబెల్లా బ్యాటింగ్లో రాణిస్తేనే కివీస్ చెప్పుకోదగ్గ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. పిచ్, వాతావరణం నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానం పిచ్ ప్రధానంగా బ్యాటింగ్కు అనుకూలం. భారీ స్కోరుకు అవకాశం ఉంది. భారత జట్టు సభ్యులందరికీ ఇక్కడ ఎక్కువగా ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించవచ్చు.సెమీస్ సమీకరణం ఇదీ... → న్యూజిలాండ్పై గెలిస్తే భారత్ 6 పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుతుంది. → ఒకవేళ భారత్ ఓడితే తర్వాతి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడాల్సి ఉంటుంది. అప్పుడు బంగ్లాదేశ్పై నెగ్గితే మనకు సెమీస్ స్థానం ఖాయమవుతుంది. → ఇంగ్లండ్పై కివీస్ నెగ్గి 6 పాయింట్లతో సమమైనా... అది కివీస్కు 2వ విజయం అవుతుంది. ఎక్కువ మ్యాచ్లు గెలిచినందుకు భారత్ (3) ముందంజ వేస్తుంది. → కివీస్తో మ్యాచ్ రద్దయితే బంగ్లాదేశ్ను భారత్ ఓడిస్తే చాలు. ఒకవేళ మనం బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైనా...న్యూజిలాండ్, శ్రీలంక తమ తర్వాతి మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంటుంది. → భారత్ ఆడాల్సిన రెండు మ్యాచ్లూ రద్దయినా... కివీస్ను ఇంగ్లండ్ ఓడిస్తే సరిపోతుంది. -
ఎక్కువ సేపు ఆపలేకపోయాను చిట్టి తల్లి..! పాక్ క్రికెటర్ హృదయ విదారక పోస్ట్
పాకిస్తాన్ అప్ కమింగ్ ఆల్రౌండర్ ఆమిర్ జమాల్ (Aamer Jamal) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జమాల్ అప్పుడే పుట్టిన తన బిడ్డను కోల్పోయాడు. ఈ విషయాన్ని సోషల్మీడియా వేదికగా పంచుకున్నాడు.చనిపోక ముందు బిడ్డ తన చేతి వేళ్లను పట్టుకున్న దృష్యాన్ని షేర్ చేస్తూ.. "అల్లా దగ్గరి నుండి వచ్చి, తిరిగి అల్లానే చేరుకుంది. నిన్ను ఎక్కువ సేపు ఆపలేకపోయాను చిట్టి తల్లి. అమ్మా, నాన్న నిన్ను చాలా మిస్ అవుతారు. స్వర్గంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నానంటూ" బాధను వ్యక్తం చేశాడు.ఈ పోస్ట్కు సోషల్మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. బిడ్డను కోల్పోయిన బాధలో జమాల్ పెట్టిన సందేశం నెటిజన్లను కలిచి వేస్తుంది. జమాల్కు సానుభూతి సందేశాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులు జమాల్ను ఓదారుస్తున్నారు.జమాల్ ఇటీవలే పీసీబీ కాంట్రాక్ట్ను కూడా కోల్పోయాడు. ప్రస్తుతం అతను పాకిస్తాన్ దేశవాలీ టోర్నీ Quaid-e-Azam Trophyలో ఆడుతున్నాడు. 28 ఏళ్ల జమాల్ పాక్ తరఫున 8 టెస్ట్లు, 3 వన్డేలు, 6 టీ20లు ఆడి మొత్తంగా 26 వికెట్లు తీశాడు. టెస్ట్ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 352 పరుగులు, వన్డేల్లో 5, టీ20ల్లో 88 పరుగులు చేశాడు. కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన జమాల్ 2022లో టీ20ల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది సిడ్నీలో ఆస్ట్రేలియాపై అతనాడిన 82 పరుగుల ఇన్నింగ్స్ హైలైటైంది. జమాల్ ఫస్ట్ క్లాస్ కెరీర్ కూడా అద్భుతంగా ఉంది. 40 మ్యాచ్ల్లో 99 వికెట్లు తీసి, 1103 పరుగులు చేశాడు. చదవండి: శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం -
రాణించిన ఆసీస్ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన ఇంగ్లండ్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 22) ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు (Australia vs England) తలపడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. అన్నాబెల్ సదర్ల్యాండ్ (10-1-60-3), సోఫీ మోలినెక్స్ (10-0-52-2), ఆష్లే గార్డ్నర్ (9-0-39-2), అలానా కింగ్ (10-1-20-1), కిమ్ గార్త్ (7-2-43-0) ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ (78) మాత్రమే సత్తా చాటింది. అలైస్ క్యాప్సీ (38), ఛార్లోట్ డీన్ (26), సోఫీ డంక్లీ (22), హీథర్ నైట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. యామీ జోన్స్ 18, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ 7, ఎమ్మా ల్యాంబ్ 7, లిన్సే స్మిత్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్ 10, లారెన్ బెల్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇదివరకే సెమీస్కు అర్హత సాధించాయి. దీంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ రెండు జట్లతో పాటు సౌతాఫ్రికాకు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. చదవండి: శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం -
శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ను (Lanka Premier League) వాయిదా వేసింది. వచ్చే ఏడాది స్వదేశంలో జరుగనున్న పురుషుల టీ20 వరల్డ్కప్ (T20 World Cup 2026) దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. లీగ్ ముందుగా షెడ్యూలైన సమయాన్ని స్టేడియాల మరమ్మత్తులకు కేటాయించన్నుట్లు తెలిపింది. ప్రేక్షకుల స్టాండ్లు, డ్రెస్సింగ్ రూములు, ట్రైనింగ్ ఏరియాలు, బ్రాడ్కాస్ట్ సదుపాయాలు ఆధునీకరించనున్నట్లు వెల్లడించింది. మహిళల వన్డే ప్రపంచకప్ దృష్ట్యా స్టేడియాల మరమ్మత్తులకు బ్రేక్ పడిందని తెలిపింది. LPL 2025ను మరో సూటబుల్ విండోలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. లీగ్ తదుపరి నిర్వహించబోయే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. ముందస్తు షెడూల్య్ ప్రకారం ఈ ఏడాది లంక ప్రీమియర్ లీగ్డిసెంబర్ 1-23 మధ్యలో జరగాల్సి ఉండింది. లంక ప్రీమియర్ లీగ్ వాయిదా పడటంతో ఆటగాళ్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. లీగ్ వాయిదా నిర్ణయంతో లంక క్రికెట్ బోర్డు వాణిజ్య పరంగా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం శ్రీలంకలో మహిళల వన్డే ప్రపంచకప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి శ్రీలంక, భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 2026 పురుషుల టీ20 ప్రపంచకప్కు కూడా శ్రీలంక, భారత్ ఆతిథ్యమిస్తున్నాయి. చదవండి: చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వే చారిత్రక విజయం -
జింబాబ్వే చరిత్రాత్మక విజయం
స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే (Zimbabwe) ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తుగా ఓడించింది. 12 ఏళ్ల తర్వాత జింబాబ్వే గెలిచిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. మూడు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్లో జింబాబ్వే అన్ని విభాగాల్లో సత్తా చాటింది. బౌలర్లు రెండో ఇన్నింగ్స్ల్లో ఆఫ్ఘనిస్తాన్ కనీసం 200 స్కోర్ కూడా చేయనివ్వలేదు. బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి సత్తా చాటారు. ఓపెనర్ బెన్ కర్రన్ (Ben Curran) కెరీర్లో తొలి సెంచరీతో కదంతొక్కాడు. సికందర్ రజా అర్ద సెంచరీతో రాణించాడు. నిక్ వెల్చ్ 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించాడు. ముజరబానీ 3 వికెట్లతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్లో రిచర్డ్ నగరవ 5 వికెట్లతో చెలరేగాడు. ముజరబానీ ఈ ఇన్నింగ్స్లోనూ రాణించి 3 వికెట్లు తీశాడు.ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్కు (Afghanistan) ఒకే ఒక సానుకూల అంశం ఉంది. పేసర్ జియా ఉర్ రెహ్మాన్ 7 వికెట్లతో చెలరేగాడు. ఆఫ్ఘన్ స్టార్ బ్యాటర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (37, 9) ఇబ్రహీం జద్రాన్ (19, 42) పెద్దగా రాణించలేకపోయారు. అయినా తొలి ఇన్నింగ్స్లో గుర్బాజ్, రెండో ఇన్నింగ్స్లో జద్రానే టాప్ స్కోరర్లు కావడం విశేషం. కెప్టెన్ హష్మతుల్లా షాహీది (7, 7) రెండు ఇన్నింగ్స్ల్లో నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్లో బషీర్ షా (32) ఓ మోస్తరు స్కోర్ చేశాడు.మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై, ఇన్నింగ్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన జింబాబ్వే ఆటగాడు బెన్ కర్రన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.స్కోర్ వివరాలు..జింబాబ్వే-359ఆఫ్ఘనిస్తాన్-127 & 159కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి.చదవండి: బుమ్రాను భయపెడుతున్న పాకిస్తాన్ బౌలర్ -
బుమ్రాను భయపెడుతున్న పాకిస్తాన్ బౌలర్
టీమిండియా స్టార్ బౌలర్, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను (Jasprit Bumrah) పాకిస్తాన్ వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ (Noman Ali) భయపెడుతున్నాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో నౌమన్ బుమ్రాకు అతి సమీపంగా వచ్చాడు. గత వారం అద్భుత ప్రదర్శన కారణంగా నౌమన్ ఈ వారం ర్యాంకింగ్స్లో ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని, రెండో స్థానానికి ఎగబాకాడు. టాప్ ర్యాంక్లో ఉన్న బుమ్రాకు నౌమన్కు కేవలం 29 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.గత వారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో నౌమన్ తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు సహా 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.39 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన నౌమన్ గత కొంతకాలంగా టెస్ట్ల్లో విశేషంగా రాణిస్తున్నాడు. చివరి 5 టెస్ట్ల్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు సహా 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. కెరీర్లో 21 టెస్ట్లు ఆడిన నౌమన్ 95 వికెట్లు తీశాడు.బుమ్రా విషయానికొస్తే.. ఇతను ఈ నెలలో వెస్టిండీస్తో ఆడిన రెండు టెస్ట్ల్లో పెద్దగా వికెట్లు తీయలేకపోయాడు. తొలి టెస్ట్లో 3, రెండో టెస్ట్లో 4 వికెట్లు మాత్రమే తీశాడు.ఈ వారం ర్యాంకింగ్స్లో నౌమన్తో పాటు మరో బౌలర్ భారీగా లబ్ది పొందాడు. సౌతాఫ్రికాకు చెందిన సెనూరన్ ముత్తుసామి పాక్తో జరిగిన తొలి టెస్ట్లో 11 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఏకంగా 38 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతను 55 స్థానంలో ఉన్నాడు. ఈ రెండు భారీ మార్పులు మినహా ఈ వారం ర్యాంకింగ్స్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. భారత బౌలర్లు సిరాజ్, కుల్దీప్, జడేజా 12, 14, 18 స్థానాల్లో కొనసాగుతున్నారు.టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రూట్, బ్రూక్, కేన్ టాప్-3లో కొనసాగుతుండగా.. టీమిండియా ఆటగాళ్లు జైస్వాల్, పంత్, గిల్ 5, 8, 12 స్థానాల్లో ఉన్నారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ స్పిన్నర్.. 92 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు -
ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?.. మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ కౌంటర్
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత్- ‘ఎ’ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు దక్కలేదు. రిషభ్ పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు వైస్ కెప్టెన్గా సాయి సుదర్శన్ (Sai Sudharsan)ను ఎంపిక చేశారు సెలక్టర్లు.కావాల్సినంత ప్రాక్టీస్అదే విధంగా రెండో అనధికారిక టెస్టులో కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ వంటి టీమిండియా స్టార్లకు కూడా చోటిచ్చారు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు సన్నాహకంగా ఉండే ఈ రెడ్బాల్ సిరీస్తో ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.పక్కనపెట్టడంపై విమర్శలుఇక ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సర్ఫరాజ్ ఖాన్కు ప్రధాన జట్టులో స్థానం దక్కదనే స్పష్టంగానే తెలుస్తోంది. ఇటీవలే పదిహేడు కిలోల బరువు తగ్గడంతో పాటు రెడ్ బాల్ టోర్నీల్లో సెంచరీ చేసినా సెలక్టర్లు అతడిని ఇలా పక్కనపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ సంచలన ట్వీట్ చేశారు.ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?‘‘ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు ఎంపిక కాలేదా?.. ఊరికే అడుగుతున్నా అంతే!.. ఈ విషయంలో గౌతం గంభీర్ విధానాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా!’’ అంటూ హెడ్కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతం గంభీర్ను షామా మొహమ్మద్ టార్గెట్ చేశారు.కరెక్ట్ కాదు మేడమ్..ఈ నేపథ్యంలో షామా ట్వీట్పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అయితే, మెజారిటీ మంది ఆమె ఆలోచనా విధానాన్ని తప్పుబడుతున్నారు. మొహమ్మద్ సిరాజ్ జట్టులోని ప్రధాన బౌలర్లలో ఒకడన్న విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలుకుతున్నారు. ఆటలో ఇలాంటి రాజకీయాలకు తావు లేదని.. ఇలాంటి మాటలతో చిచ్చు పెట్టాలని చూడటం సరికాదని పేర్కొంటున్నారు.భారత క్రికెట్లో ఎప్పుడూ ఇలా జరుగలేదుఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్.. షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా విషాదకరం. ఇలాంటి మాటలు వద్దు. సర్ఫరాజ్ ఖాన్ జట్టులో ఉండేందుకు అర్హుడు.అయితే, అతడికి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదన్న మాట వాస్తవమే. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు అర్థంలేనివి. భారత క్రికెట్లో ఎప్పుడూ ఇలా జరుగలేదు. అజర్ హయాంలోనూ కొందరు ఇలాంటి మాటలే మాట్లాడారు.కానీ ఇందులో మతపరమైన కోణం ఉంటుందని నేను అస్సలు అనుకోను. సర్ఫరాజ్ ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగానే జట్టులోకి ఎంపిక కాలేడు. చాన్నాళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తున్న ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది.సర్ఫరాజ్కు తగినన్ని ఛాన్సులు రాలేదు.. కానీఅయితే, ఓ ప్లేయర్ ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన పక్కన పెట్టడం సరికాదు. సర్ఫరాజ్ ఖాన్కు తగినన్ని ఛాన్సులు రాలేదు. ఒకవేళ గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన రిషభ్ పంత్.. తర్వాత విఫలమైనా అతడిని పక్కనపెట్టడం జరగదు.జట్టు ప్రయోజనాల కోసం కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీటిని ఎవరూ మార్చలేరు’’ అని అతుల్ వాసన్ చెప్పుకొచ్చాడు. కాగా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి ఓ సెంచరీ, మూడు అర్థ శతకాల సాయంతో 371 పరుగులు చేశాడు. రోహిత్ లావుగా ఉన్నాడని..కాగా షామా మొహమ్మద్ గతంలోనూ రోహిత్ శర్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉన్నాడని.. అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడే తప్ప అతడికి అంత సీన్ లేదని వ్యాఖ్యానించారు. కాగా భారత్కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత రోహిత్ శర్మది.చదవండి: ఓపెనర్గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్ -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ స్పిన్నర్.. 92 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
పాకిస్తాన్ వెటరన్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది Asif Afridi) అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించాడు. రావల్పిండి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో (Pakistan Vs South Africa) ఐదు వికెట్ల ఘనత సాధించిన ఇతను.. టెస్ట్ అరంగేట్రంలో ఈ ఘనత సాధించిన అతి పెద్ద వయస్కుడిగా, 92 ఏళ్ల కిందటి (1933) ప్రపంచ రికార్డును (World Record) బద్దలు కొట్టాడు. ఈ రికార్డు గతంలో ఇంగ్లండ్కు చెందిన ఛార్లెస్ మారియట్ పేరిట ఉండేది. మారియట్ 37 ఏళ్ల 332 రోజుల వయసులో ఫైఫర్ సాధించగా.. ఆసిఫ్ అఫ్రిది 38 ఏళ్ల 299 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.కాగా, ఈ మ్యాచ్లో హసన్ అలీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆసిఫ్ అఫ్రిది అంచనాలకు మించి రాణించి సౌతాఫ్రికాను ఇబ్బంది పెట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, రబాడ లాంటి కీలక వికెట్లు సహా ఆరు వికెట్లు తీశాడు. ఆసిఫ్ ఆరేసినా ఈ ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా భారీ స్కోర్ (404) చేయగలిగింది.ట్రిస్టన్ స్టబ్స్ (76), టోనీ డి జోర్జి (55) అర్ద సెంచరీలకు తోడు ఆఖర్లో సెనురన్ ముత్తుసామి (89 నాటౌట్), రబాడ (71) చెలరేగారు. ఫలితంగా సౌతాఫ్రికా అత్యంత కీలకమైన 71 పరుగుల ఆధిక్యం సాధించింది.ముత్తుసామి, రబాడ పాక్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ పదో వికెట్కు రికార్డు స్థాయిలో 98 పరుగులు జోడించారు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ముత్తుసామి చివరి వరుస బ్యాటర్లతో కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పి సౌతాఫ్రికాకు కీలక ఆధిక్యాన్ని అందించాడు. పాక్ బౌలర్లలో ఆసిఫ్ అఫ్రిది 6, నౌమన్ అలీ 2, షాహీన్ అఫ్రిది, సాజిద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్లో 333 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్ (57), షాన్ మసూద్ (87), సౌద్ షకీల్ (66) అర్ద సెంచరీలతో రాణించగా.. సల్మాన్ అఘా (45) పర్వాలేదనిపించాడు. కేశవ్ మహారాజ్ (42.4-5-102-7) అద్బుత ప్రదర్శనతో పాక్ పతనాన్ని శాశించాడు. సైమన్ హార్మర్ 2, రబాడ ఓ వికెట్ తీశారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో పాక్ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది.చదవండి: ఆసీస్తో రెండో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి -
పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన ముత్తుసామి, రబాడ
రావల్పిండి వేదికగా పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ (Pakistan Vs South Africa) హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 333 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా ధీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 404 పరుగులు చేసి కీలకమైన 71 పరుగుల ఆధిక్యం సాధించింది.ఈ ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా టెయిలెండర్లు పాక్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముఖ్యంగా సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) (89 నాటౌట్), రబాడ (Kagiso Rabada) (71) పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరు పదో వికెట్కు రికార్డు స్థాయిలో 98 పరుగులు జోడించారు. అంతకుముందు కేశవ్ మహారాజ్ (30) కూడా పాక్ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ముత్తుసామి చివరి వరుస బ్యాటర్లతో కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పి సౌతాఫ్రికాకు కీలక ఆధిక్యాన్ని అందించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (76), టోనీ డి జోర్జి (55) అర్ద సెంచరీలతో రాణించి సౌతాఫ్రికా ఇన్నింగ్స్ను మంచి పునాది వేశారు.పాక్ బౌలర్లలో అరంగేట్రం స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది 6 వికెట్లతో చెలరేగగా.. నౌమన్ అలీ 2, షాహీన్ అఫ్రిది, సాజిద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.పాక్ తొలి ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (57), షాన్ మసూద్ (87), సౌద్ షకీల్ (66) అర్ద సెంచరీలతో రాణించగా.. సల్మాన్ అఘా (45) పర్వాలేదనిపించాడు. కేశవ్ మహారాజ్ (42.4-5-102-7) అద్బుత ప్రదర్శనతో పాక్ పతనాన్ని శాశించాడు. సైమన్ హార్మర్ 2, రబాడ ఓ వికెట్ తీశారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో పాక్ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది.చదవండి: ఆసీస్తో రెండో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి -
ఆసీస్తో రెండో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య రేపు (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.ఈ మ్యాచ్లో విరాట్ 54 పరుగులు చేస్తే వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరతాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.సచిన్ టెండూల్కర్-18426కుమార సంగక్కర-14234విరాట్ కోహ్లి-14181ఈ మ్యాచ్లో విరాట్ 68 పరుగులు చేస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో (వన్డేలు, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 463 వన్డేల్లో 18426 పరుగులు, ఒకే ఓక టీ20లో 10 పరుగులు సహా 18436 పరుగులు చేయగా.. విరాట్ 303 వన్డేల్లో 14181 పరుగులు, 125 టీ20ల్లో 4188 పరుగులు 18369 చేశాడు.ఈ మ్యాచ్లో విరాట్ సెంచరీ చేస్తే సచిన్ పేరిటే ఉన్న మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. ఏదైనా సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ప్రస్తుతం విరాట్, సచిన్ల పేరిట సంయుక్తంగా ఉంది. విరాట్ వన్డేల్లో 51 సెంచరీలు చేయగా.. టెస్ట్ల్లో సచిన్ పేరిట 51 శతకాలు ఉన్నాయి.కాగా, టెస్ట్లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. ఆరు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) ప్రస్తుత ఆసీస్ సిరీస్తోనే రీఎంట్రీ ఇచ్చాడు. తొలి వన్డేలో 8 బంతులు ఆడి డకౌటైన విరాట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. రేపు జరుగబోయే రెండో వన్డేలో విరాట్ చెలరేగడం ఖాయమని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఈ మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్లో విరాట్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 4 వన్డేల్లో 2 సెంచరీల సాయంతో 244 పరుగులు చేశాడు. ఈ మైదానంలో మిగతా రెండు ఫార్మాట్లలో కూడా విరాట్కు మంచి రికార్డు ఉంది. 5 టెస్ట్ల్లో 3 సెంచరీలు, ఓ అర్ద సెంచరీ సాయంతో 527 పరుగులు... 3 టీ20ల్లో 3 అర్ద సెంచరీల సాయంతో 204 పరుగులు చేశాడు.రేపటి మ్యాచ్లో విరాట్ 25 పరుగలు చేస్తే అడిలైడ్లో 1000 పరుగులు (మూడు ఫార్మాట్లలో) పూర్తి చేసుకుంటాడు. ఇదిలా ఉంటే, పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా మరో 29 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: ఓపెనర్గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్ -
ఓపెనర్గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు టీమిండియా స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) సన్నద్ధమయ్యాడు. ఆప్షనల్ సెషన్లో భాగంగా నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చిన హిట్మ్యాన్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. త్రోడౌన్స్ ఎదుర్కొంటూ బిజీబిజీగా గడిపాడు.అయితే, ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న తర్వాత రోహిత్ శర్మ మైదానాన్ని వీడే క్రమంలో ముభావంగా కనిపించడం చర్చకు దారితీసింది. ఇందుకు ప్రధాన కారణం.. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir), చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చర్యలే అని తెలుస్తోంది.అందుకే రోహిత్పై వేటుకెప్టెన్ హోదాలో భారత్కు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన 38 ఏళ్ల రోహిత్ శర్మపై యాజమాన్యం ఊహించని రీతిలో వేటు వేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని రోహిత్ను తప్పించి.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్ ఆసీస్ పర్యటన జట్టు ప్రకటన సందర్భంగా తెలిపాడు.రోహిత్కు ఇష్టం లేకపోయినా..అయితే, ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. వన్డే కెప్టెన్గా కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ బలవంతంగానే రోహిత్ను తప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వచ్చాయి.ఓపెనర్గానూ చోటివ్వరా?ఇక ఈ పరిణామాల నేపథ్యంలో.. భారత్కు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే జట్టులో ఓపెనర్గా మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే, ఆ స్థానానికీ గంభీర్- అగార్కర్ ఎసరు పెట్టినట్లు తాజా ఊహాగానాల ద్వారా తెలుస్తోంది.ఆసీస్తో రెండో వన్డేకు ముందు అడిలైడ్ ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న వేళ.. గంభీర్, అగార్కర్.. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదే రోహిత్ మూడ్ ఆఫ్ అవడానికి కారణమని రెవ్స్పోర్ట్స్ కథనం ద్వారా అర్థమవుతోంది.జైసూతో చర్చలకు అర్థం ఏమిటి?కాగా ఇప్పటికే టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. వన్డేల్లో మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. రోహిత్- గిల్ వన్డే ఫార్మాట్లో ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న నేపథ్యంలో జైసూకు ఇంత వరకు ఒకే ఒక్క వన్డే ఆడే అవకాశం వచ్చింది.అయితే, తాజాగా ఆసీస్తో వన్డే సిరీస్ నేపథ్యంలో జైస్వాల్ను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేశారు సెలక్టర్లు. కెప్టెన్గా తుదిజట్టులో గిల్ స్థానానికి వచ్చిన ఢోకా లేదు. మరోవైపు.. రోహిత్ కూడా పది కిలోల బరువు తగ్గి పూర్తి ఫిట్గా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో గంభీర్, అగార్కర్ జైసూకు ప్రాధాన్యం ఇస్తూ చర్చలు జరపడం.. రోహిత్ అభిమానులను ఆందోళనలోకి నెట్టేసింది.భవిష్యత్తు ప్రణాళికలు అంటూ.. రోహిత్ను జట్టు నుంచే తప్పించి జైస్వాల్ ఆడిస్తారా ఏమిటి? అనే సందేహాలు ఫ్యాన్స్ను వెంటాడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్యూర్ బ్యాటర్ అయిన జైస్వాల్.. నెట్స్లో లెగ్ స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం గమనార్హం. గంభీర్ ఆల్రౌండర్లకే పెద్దపీట వేస్తాడన్న పేరుంది. కాబట్టి తనలోని ఆల్రౌండ్ నైపుణ్యాలతో గంభీర్ను ఆకట్టుకుని తుదిజట్టులో చోటు సంపాదించాలని జైసూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ ఆప్షనల్ సెషన్కు విరాట్ కోహ్లితో పాటు గిల్ కూడా డుమ్మాకొట్టినట్లు సమాచారం.విఫలమైన రో- కోకాగా ఆసీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య గురువారం జరిగే రెండో వన్డేకు అడిలైడ్ ఓవల్ వేదిక. ఇక ఏడు నెలల తర్వాత టీమిండియా తరఫున తొలి వన్డేతో రీఎంట్రీ ఇచ్చిన రో- కో నిరాశపరిచారు. రోహిత్ 8 పరుగులే చేసి అవుట్ కాగా.. కోహ్లి డకౌట్గా వెనుదిరిగాడు. చదవండి: కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు: టీమిండియా కోచ్ కామెంట్స్ వైరల్ -
అఫ్గనిస్తాన్తో ‘ట్రై’ సిరీస్.. ధనాధన్కు వైభవ్ సూర్యవంశీ రెడీ!
పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). బిహార్కు చెందిన ఈ పిల్లాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) నమోదు చేసిన తర్వాత.. భారత అండర్-19 జట్టు తరఫునా మెరుపులు మెరిపిస్తున్నాడు.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు వైభవ్. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్తో బిజీగా ఉన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. బిహార్ జట్టు వైస్ కెప్టెన్ (Bihar Vice Captain)గానూ వ్యవహరిస్తున్నాడు.మరోసారి భారత్కు ప్రాతినిథ్యంఅయితే, వచ్చే నెలలో వైభవ్ సూర్యవంశీ మరోసారి భారత్కు ప్రాతినిథ్యం వహించబోతున్నట్లు తెలుస్తోంది. తమ అండర్-19 జట్టు భారత్లో పర్యటించనున్నట్లు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఇటీవలే ప్రకటించింది. భారత అండర్-19 స్థాయిలోని ‘A’, ‘B’ జట్లతో యూత్ వన్డే ట్రై సిరీస్ ఆడనున్నట్లు వెల్లడించింది.జట్టులో చోటు లాంఛనమేఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్ సూర్యవంశీ మళ్లీ భారత జెర్సీలో కనిపించడం లాంఛనమే అని తెలుస్తోంది. ఇక అఫ్గన్- భారత అండర్-19 జట్ల మధ్య ఈ ట్రై సిరీస్ డబుల్ రౌండ్- రాబిన్ ఫార్మాట్లో జరుగనుంది. ప్రతి జట్టు నాలుగు మ్యాచ్లు ఆడుతుంది. మెరుగ్గా ఆడిన రెండు జట్లు ఫైనల్కు చేరతాయి.వరల్డ్కప్ టోర్నీ సన్నాహకంగాకాగా నవంబరు 17 నుంచి నవంబరు 30 వరకు భారత్- అఫ్గన్ అండర్-19 జట్ల మధ్య యూత్ వన్డే ట్రై సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇందుకు వేదిక. కాగా ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్కప్ టోర్నీకి ముందు ఈ సిరీస్ ఇరుజట్లకు సన్నాహకంగా నిలవనుంది. వైభవ్ సూర్యవంశీ వంటి యువ స్టార్లు అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో అడుగుపెట్టేందుకు బాటలు వేయనుంది.ఇదిలా ఉంటే.. భారత్ అండర్-19 జట్టుకు ముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఆయుశ్ జట్టును ముందుకు నడిపించగా.. వైభవ్ ఓపెనర్గా భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు.భారత్- అఫ్గన్ అండర్-19 జట్ల వన్డే ట్రై సిరీస్ షెడ్యూల్ ఇదే👉నవంబరు 17: భారత్-‘ఎ’ వర్సెస్ భారత్-‘బి’👉నవంబరు 19: భారత్-‘బి’ వర్సెస్ అఫ్గనిస్తాన్👉నవంబరు 21: భారత్-‘ఎ’ వర్సెస్ అఫ్గనిస్తాన్👉నవంబరు 23: భారత్-‘ఎ’ వర్సెస్ భారత్-‘బి’👉నవంబరు 25: భారత్-‘బి’ వర్సెస్ అఫ్గనిస్తాన్👉నవంబరు 27: భారత్-‘ఎ’ వర్సెస్ అఫ్గనిస్తాన్👉నవంబరు 30: ఫైనల్.చదవండి: కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు: టీమిండియా కోచ్ కామెంట్స్ వైరల్ -
విరాట్ కోహ్లి ‘వదినమ్మ’పై అనుష్క శర్మ కామెంట్.. వైరల్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ రన్మెషీన్గా పేరొందిన ఈ ఢిల్లీ ఆటగాడు.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. గతేడాది పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక సోషల్ మీడియాలో పాతిక కోట్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న కోహ్లి.. కుటుంబానికి సంబంధించి అరుదుగా పోస్టులు పెడుతుంటాడు. వీటిలోనూ ఎక్కువగా భార్య, నటి అనుష్క శర్మ (Anushka Sharma)తో ఉన్న ఫొటోలే పంచుకుంటాడు. కాగా విరుష్క దంపతులు ఇప్పటి వరకు తమ కుమార్తె వామిక (Vamika), కుమారుడు అకాయ్ (Akaay)ల ఫొటోలు కూడా రివీల్ చేయలేదు.కుటుంబంతో కలవరా?ఇదిలా ఉంటే.. విరాట్ కుటుంబంతో అనుష్క శర్మ ఎక్కువగా కలిసినట్లే కనిపించదు. విరాట్ అక్క భావనా కోహ్లి ధింగ్రా, అన్న వికాస్ కోహ్లి భార్య చేతన కోహ్లి మాత్రం.. కోహ్లి, అతడి పిల్లల గురించి అప్పుడప్పుడూ పోస్టులు పెడుతుంటారు. అయితే, వీరికి సంబంధించిన ఫొటోలను మాత్రం అనుష్క ఎక్కువగా పోస్ట్ చేయదు. కానీ వారి పోస్టులకు లైకులు మాత్రం కొడుతుంది.తోటి కోడలిని ప్రశంసించిన అనుష్కఈ నేపథ్యంలో అనుష్క శర్మ తాజాగా.. తన తోటి కోడలు చేతన కోహ్లిని ప్రశంసిస్తూ ఇన్స్టా స్టోరీ పెట్టడం వైరల్గా మారింది. చేతన యోగాసనంలో ఉన్న ఫొటోను పంచుకున్న అనుష్క .. ‘‘ప్రతి భంగిమలోనూ యోగానే ఈమె ప్రతిబింబిస్తోంది. స్ట్రెంత్, గ్రేస్ అన్నీ తనలో ఉన్నాయి. నిన్ను చూసి గర్విస్తున్నా చేట్స్’’ అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని జతచేసింది. 'ఈ పోస్టుకు చేతనను ట్యాగ్ చేయగా.. ఆమె కూడా స్పందించింది. ‘‘కృతజ్ఞతలు అనుష్క.. నాలో ఉన్న గ్రేస్ గుర్తించినందుకు థాంక్యూ’’ అంటూ చేతన హర్షం వ్యక్తం చేసింది. లండన్లోనే నివాసంకాగా కుమారుడు అకాయ్ జన్మించిన తర్వాత విరాట్- అనుష్క లండన్లోనే నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. మ్యాచ్ల కోసం మాత్రమే కోహ్లి భారత్కు వస్తున్నాడు.ఇక ప్రస్తుతం అతడు వన్డే సిరీస్ ఆడేందుకు టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లి నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఎనిమిది బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు.చదవండి: రూ. 80 కోట్ల ప్రాపర్టీ అన్నకు ఇచ్చేసిన కోహ్లి.. ట్విస్ట్ ఏంటంటే? -
కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు: టీమిండియా కోచ్ కామెంట్స్
దాదాపు ఏడు నెలల తర్వాత టీమిండియా తరఫున పునరాగమనం చేసిన దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఊహించని రీతిలో విఫలమయ్యారు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఇద్దరూ తేలిపోయారు. ఓపెనర్ రోహిత్ శర్మ 14 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది ఎనిమిది పరుగులు చేయగా.. వన్డౌన్ బ్యాటర్ కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు.కోహ్లి.. తొలిసారి డకౌట్ఎనిమిది బంతులు ఎదుర్కొన్న కోహ్లి పరుగుల ఖాతా తెరవకుండానే.. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) బౌలింగ్లో కూపర్ కన్నోలికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తద్వారా ఆసీస్తో వన్డేల్లో కోహ్లి తొలిసారి డకౌట్ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో రో- కో వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండగా.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించిన తీరు చర్చకు దారితీసింది.కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు‘‘వాళ్లిద్దరు ఐపీఎల్ ఆడారు. కాబట్టి రీఎంట్రీ సన్నాహకాల గురించి సందేహాలు అవసరమే లేదు. నాకు తెలిసి వాతావరణం కారణంగానే ఇలా జరిగింది. ఒకవేళ ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్కు వచ్చిన వాళ్ల టాపార్డర్కు ఇలాగే జరిగి ఉండేది.నాలుగైదుసార్ల అంతరాయం తర్వాత బ్యాటింగ్కు వెళితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వాళ్లిద్దరు తిరిగి పుంజుకుంటారు’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘వాళ్లిద్దరు అనుభవజ్ఞులైన బ్యాటర్లు. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే ముందు ఇద్దరూ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు.ఇప్పుడే వాళ్ల ప్రదర్శను జడ్జ్ చేయడం సరికాదు. ఇటీవలే వాళ్లు టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు. ఆ వెంటనే ఈ సిరీస్ ఆడేందుకు వచ్చారు. ఇద్దరూ పూర్తి ఫిట్గా ఉన్నారు. సీనియర్లకు ప్రత్యేకంగా మేము ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని సితాన్షు కొటక్ రోహిత్- కోహ్లిలను వెనకేసుకువచ్చాడు.వాళ్లిద్దరు అసలు క్రీజులోనే ఉంటేనే కదా!అయితే, కొటక్ చెప్పినట్లు రోహిత్- కోహ్లి వర్షం అంతరాయం కలిగించేంత వరకు క్రీజులోనే లేరు. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఈ నేపథ్యంలో.. ‘‘వాళ్లిద్దరు అసలు క్రీజులోనే ఉంటేనే కదా.. అంతరాయాల వల్ల డిస్టర్బ్ అవడానికి’’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా ఆసీస్- భారత్ మధ్య పెర్త్లో జరిగిన తొలి వన్డేను వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం తమకు విధించిన 131 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: ఆసియా కప్ భారత్దే.. కానీ నా చేతుల మీదుగానే ట్రోఫీ ఇస్తా: నఖ్వీ ఓవరాక్షన్ -
పంత్ కారణంగానే సర్ఫరాజ్ ఖాన్పై వేటు.. అసలు విషయమేంటి?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో గాయపడి ఆటకు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తిరిగి మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో అక్టోబరు 30 నుంచి నవంబర్ 9 వరకు జరిగే రెండు నాలుగు రోజుల (ఫస్ట్క్లాస్) అనధికారిక టెస్టు మ్యాచ్లలో తలపడే భారత ‘ఎ’ జట్టుకు పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు.బెంగళూరు వేదికగా జరిగే ఈ రెండు మ్యాచ్ల కోసం రెండు వేర్వేరు జట్లను మంగళవారం సెలక్టర్లు ప్రకటించారు. అయితే, ఇందులో ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు దక్కలేదు. కాగా స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ను ఆడిస్తామని సెలక్టర్లు నమ్మకంగానే అతడికి చెప్పినట్లు సమాచారం.పదిహేడు కిలోల మేర బరువు తగ్గి..ఈ నేపథ్యంలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న వేళ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్నెస్పై మరింతగా దృష్టి సారించాడు. ఏకంగా పదిహేడు కిలోల మేర బరువు తగ్గి స్లిమ్గా మారాడు. అయితే, సెలక్టర్లను మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టులకు ముందు జరిగే అనధికారిక టెస్టు సిరీస్కు సెలక్టర్లు సర్ఫరాజ్ను ఎంపిక చేయలేదు. ఇందుకు ప్రధాన కారణం అతడి బ్యాటింగ్ ఆర్డరే అని తెలుస్తోంది. సాధారణంగా ముంబై జట్టులో సర్ఫరాజ్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.పంత్ రాకతోఅయితే, భారత- ‘ఎ’ జట్టు కెప్టెన్గా తిరిగి వచ్చిన పంత్ కూడా అదే స్థానంలో ఆడతాడన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ టాపార్డర్కు ప్రమోట్ అవుదామనుకున్నా.. ఓపెనర్లుగా ఆయుశ్ మాత్రే- నారాయణ్ జగదీశన్ వచ్చే అవకాశం ఉండగా.. వన్డౌన్లో వైస్ కెప్టెన్ సాయి సుదర్శన్ ఉండనే ఉన్నాడు.ఇక ఆ తర్వాతి స్థానం కోసం దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ పోటీపడుతున్నారు. ఇక మిడిలార్డర్లో ఐదో నంబర్లో పంత్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. ఇక టీమిండియాలోనూ ఆరో స్థానం నుంచి ఆల్రౌండర్లే ప్రధానంగా బ్యాటింగ్కు వస్తున్నారు.బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చించాలిఇలాంటి సమీకరణల నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్కు ‘ఎ’ జట్టులోనూ చోటు కరువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఒకరు పీటీఐతో మాట్లాడుతూ..‘‘ముంబై మేనేజ్మెంట్తో సర్ఫరాజ్ ఖాన్ తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చించాలి. లేదంటే.. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేతో మాట్లాడాలి. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కొత్త బంతిని ఎదుర్కునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.చాలానే ఆప్షన్లు ఉన్నాయివన్డౌన్లో నిలదొక్కుకుంటే భవిష్యత్తులోనైనా అవకాశాలు వస్తాయి. అలా కాకుండా ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడతానంటే సర్ఫరాజ్ కెరీర్ ప్రశ్నార్థకమే అవుతుంది. ఎందుకంటే.. ఐదో స్థానంలో పంత్తో పాటు.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి రూపంలో మేనేజ్మెంట్కు చాలానే ఆప్షన్లు ఉన్నాయి.ఈ ముగ్గురు ఫిట్గా ఉండి.. సెలక్షన్కు అందుబాటులో ఉంటే సర్ఫరాజ్ ఖాన్కు మొండిచేయి తప్పదు. ఒకవేళ పంత్ గాయపడినా ధ్రువ్ జురెల్ ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడతాడు. కాబట్టి సర్ఫరాజ్ మూడో స్థానంలో ఆడటంపై దృష్టి పెడితే బాగుంటుంది’’ అని సదరు సెలక్టర్ అభిప్రాయపడ్డాడు.కాగా ముంబై తరఫున రంజీల్లో పరుగుల వరద పారించిన 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
రిజ్వాన్పై వేటుకు కారణం అదే!.. వెలుగులోకి సంచలన విషయాలు!
పాకిస్తాన్ వన్డే కెప్టెన్గా మొహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan)ను తప్పించడానికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రెసింగ్ రూమ్లో మతపరమైన విషయాలను రిజ్వాన్ ఎక్కువగా చర్చిస్తున్నాడని.. అందుకే అతడిపై వేటు పడి ఉండవచ్చని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటివి జట్టుకు మేలు చేయవని భావించిన కోచ్ మైక్ హసన్ రిజ్వాన్కు ఉద్వాసన పలకాలనే ఉద్దేశంతోనే బోర్డును ఒత్తిడి చేశాడని లతీఫ్ ఆరోపించాడు. అయితే, తాజాగా రిజ్వాన్ తొలగింపునకు గల ప్రధాన కారణం ఇదేనంటూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఇచ్చిన కథనం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంటా బయటా పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు... వన్డే కెప్టెన్ను మార్చిన విషయం తెలిసిందే. షాహీన్ షా అఫ్రిదికి పగ్గాలువికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ నుంచి సారథ్య బాధ్యతలు తప్పించి... స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది (Shaheen Shah Afridi)కి కట్టబెట్టింది. ప్రస్తుతం సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ జట్టు... నవంబర్ 4 నుంచి 8 మధ్య సఫారీ జట్టుతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. వచ్చే నెల నుంచి షాహీన్ అఫ్రిది జట్టు పగ్గాలు చేపట్టనున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మంగళవారం వెల్లడించింది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన సమావేశంలో జాతీయ సెలెక్టర్లు, అడ్వైజరీ బోర్డు సభ్యులు, హెడ్ కోచ్ మైక్ హసన్ చర్చించిన అనంతరం ఈ కెప్టెన్సీ మార్పు జరిగింది. అయితే సారథ్య మార్పునకు గల కారణాన్ని మాత్రం బోర్డు వెల్లడించలేదు.రిజ్వాన్ సారథ్యంలో కీలక విజయాలు..గతంలో టీ20 కెప్టెన్గా వ్యవహరించిన 25 ఏళ్ల షాహీన్... పాకిస్తాన్ జాతీయ జట్టు తరఫున 66 వన్డేలు, 92 టీ20లు, 32 టెస్టులు ఆడాడు. మొహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలో ఆడిన 20 వన్డేల్లో పాకిస్తాన్ జట్టు 9 విజయాలు సాధించి మరో 11 మ్యాచ్ల్లో ఓడింది. ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికాలో రిజ్వాన్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు వన్డే సిరీస్లు గెలిచింది. అయితే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పేలవ ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా రిజ్వాన్ కెప్టెన్సీలో ఆటకంటే ఆధ్యాత్మిక చర్చ ఎక్కువైపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. దానికి తోడు హెడ్ కోచ్ పట్టుబట్టడంతోనే కెప్టెన్సీ మార్పు జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రోజుకు ఐదుసార్లుఈ నేపథ్యంలో పీటీఐ కథనం ఆసక్తికరంగా మారింది. ‘‘క్రికెట్లో రిజ్వాన్ మతపరమైన విషయాలను తీసుకువస్తున్నాడని బోర్డు పెద్దలు భావించారు. ఇది కొంతమంది ప్లేయర్లకు అసౌకర్యం కలిగించింది. రిజ్వాన్ తన మతపరమైన విశ్వాసాలను మీడియా ముఖంగానూ వెల్లడించడంలో సంశయించడు.పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ చెప్పిన వివరాల ప్రకారం.. రిజ్వాన్.. జట్టు బస చేసే హోటళ్లలో ప్రత్యేకంగా సెషన్లు ఏర్పాటు చేసి మరీ.. రోజుకు ఐదుసార్లు ప్రార్థన చేయాలనే నియమం పెట్టాడు’’ అని పీటీఐ కథనం పేర్కొంది.సరోగేట్ యాడ్స్కు అతడు వ్యతిరేకం!అయితే, పీసీబీ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఇందుకు భిన్నమైన వాదన వినిపించాయి. ‘‘బెట్టింగ్ కంపెనీలను ప్రమోట్ చేయలేనని రిజ్వాన్ పీసీబీకి చెప్పాడు. బెట్టింగ్ సంస్థల కోసం పీసీబీ చేసే సరోగేట్ యాడ్స్కు అతడు వ్యతిరేకం. అందుకే అతడిపై వేటు వేశారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి -
వచ్చి తీసుకోవాల్సిందే: నఖ్వీ ఓవరాక్షన్.. బీసీసీఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచి దాదాపు నెల రోజులు కావస్తున్నా టోర్నీకి సంబంధించిన ట్రోఫీ మాత్రం ఇంకా టీమ్కు అందలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ (Mohsin Naqvi) ఆదేశాల మేరకు ఇప్పటికీ ట్రోఫీ దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. ఈ విషయంపై దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి ఏసీసీకి లేఖ రాసింది. ఏసీసీలోని సభ్య దేశాలైన శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లు కూడా బీసీసీఐకి మద్దతు పలుకుతూ వెంటనే ట్రోఫీని భారత జట్టుకు అందించాలని కోరాయి. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, రాజీవ్ శుక్లా లేఖ రాసిన విషయాన్ని ఏసీసీ అధికారి ఒకరు నిర్ధారించారు. అయితే నఖ్వీ మాత్రం తన మొండితనాన్ని వీడలేదు. బీసీసీఐకి సంబంధించినవారు ఎవరైనా దుబాయ్కు వచ్చి తన చేతుల మీదుగా తీసుకుంటేనే దానిని అందిస్తామని అతడు పునరుద్ఘాటించాడు. అయితే బీసీసీఐ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. దాంతో ఆసియా కప్ ఫైనల్ రోజులాంటి యథాతథ స్థితి ఇంకా కొనసాగుతోంది. నా చేతుల మీదుగా తీసుకోవచ్చుబీసీసీఐ లేఖపై తాజాగా నఖ్వీ స్పందించాడు. ‘ఆసియా కప్ ఫైనల్ రోజు నా చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని భారత్ చివరి క్షణం వరకు చెప్పలేదు. వేదికపై అతిథులంతా చేరిన తర్వాత ఆ విషయం తెలిసింది. మేం 40 నిమిషాలు వేచి చూసినా ఎవరూ రాలేదు. ఆసియా కప్ ట్రోఫీ భారత్దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి బీసీసీఐ ప్రతినిధి ఎవరైనా ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన ఆటగాడు ఒకరితో కలిసి ఇక్కడికి వచ్చి నా చేతుల మీదుగా తీసుకోవచ్చు’ అని అదే మాట చెప్పాడు. ఈ ప్రతిష్టంభనకు ఏసీసీలో పరిష్కారం లభించదని భారత బోర్డుకు అర్థమైంది. త్వరలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి సమావేశంలో నఖ్వీపై ఫిర్యాదు చేయాలని... అక్కడే ఏదో ఒకటి తేల్చుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది.చదవండి: పాకిస్తాన్ అవుట్ -
పాకిస్తాన్ అవుట్
కొలంబో: మహిళల వన్డే వరల్డ్ కప్లో సెమీఫైనల్ అవకాశాలు కోల్పోయిన రెండో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. సోమవారమే బంగ్లాదేశ్ నిష్క్రమించగా... ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది. కొలంబోలో వాన బారిన పడిన మరో మ్యాచ్లో ఫాతిమా సనా సారథ్యంలోని పాక్ జట్టు చిత్తుగా ఓడింది. ఆ జట్టుకిది నాలుగో పరాజయం. మంగళవారం జరిగిన ఈ పోరులో దక్షిణాఫ్రికా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 150 పరుగుల తేడాతో పాకిస్తాన్ను ఓడించి 10 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా వరుసగా ఐదు మ్యాచ్లు గెలవడం ఇదే మొదటిసారి. టాస్ ఓడిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్కు దిగింది. అయితే 2 ఓవర్లకే వర్షం రావడంతో ఆట ఆగిపోయింది. దాదాపు రెండు గంటల తర్వాత ఆట మళ్లీ మొదలు కాగా... మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. అన్ని వరల్డ్ కప్లలో కలిపి దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు. కెపె్టన్ లారా వోల్వర్ట్ (82 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్స్లు) త్రుటిలో శతకం చేజార్చుకోగా... మరిజాన్ కాప్ (43 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు), సూన్ లూస్ (59 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఓపెనర్ తజ్మీన్ బ్రిట్స్ (0) టోర్నీలో మూడోసారి డకౌటైన అనంతరం వోల్వర్ట్, లూస్ కలిసి రెండో వికెట్కు 93 బంతుల్లోనే 118 పరుగులు జోడించారు. చివర్లో డి క్లెర్క్ (16 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో సఫారీ టీమ్ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. ఆఖరి 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 72 పరుగులు సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో నష్రా సంధు, సాదియా ఇక్బాల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలయ్యాక వాన కారణంగా పలు మార్లు అంతరాయం ఏర్పడటంతో మళ్లీ మళ్లీ లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చింది. చివరకు పాక్ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234 పరుగులుగా నిర్దేశించారు. అయితే పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 83 పరుగులే చేయగలిగింది. సిద్రా నవాజ్ (22 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచింది. కెప్టెన్ ఫాతిమా సనా రెండు పరుగులే చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజాన్ కాప్ 3 వికెట్లు పడగొట్టగా, షాంగసే 2 వికెట్లు తీసింది. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన మరిజాన్ కాప్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకుంది. ఇండోర్లో నేడు జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో ఇంగ్లండ్ తలపడుతుంది. -
ఉత్కంఠ సమరం.. సూపర్ ఓవర్లో బంగ్లాదేశ్పై విండీస్ విజయం
బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య (Bangladesh Vs West Indies) ఇవాళ (అక్టోబర్ 21) ఉత్కంఠ సమరం జరిగింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్పై వెస్టిండీస్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది.స్పిన్నర్లకు స్వర్గధామమైన ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ఊహించిన విధంగానే పిచ్ సహకరించడంతో విండీస్ స్పిన్నర్లు చెలరేగిపోయారు.బంగ్లాదేశ్ను 213 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. మోటీ 3, అకీల్ హోసేన్, అలిక్ అథనాజ్ తలో 2 వికెట్లు తీశారు. బంగ్లా ఇన్నింగ్స్లో 45 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (39 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ కూడా తడబడింది. ఓ దశలో పూర్తిగా చేతులెత్తేసింది. అయితే షాయ్ హోప్ (53 నాటౌట్) టెయిలెండర్ల సహకారంతో మ్యాచ్ను చివరి బంతివరకు తీసుకొచ్చాడు. చివరి బంతికి 3 పరుగులు అవసరం కాగా.. ఖారీ పియెర్రీ రెండు పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసింది.సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. ఛేదనలో విండీస్ 9 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో విండీస్ ఓ కనీవినీ ఎరుగని రికార్డు సెట్ చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో 50 ఓవర్లను స్పిన్నర్లతో బౌలింగ్ చేయించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. నిర్ణయాత్మక చివరి వన్డే ఢాకా వేదికగానే అక్టోబర్ 23న జరుగనుంది.చదవండి: పాకిస్తాన్ మరో ఫార్మాట్ కెప్టెన్గా ఇంకో అఫ్రిది -
విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. పాకిస్తాన్ ముందు అతి భారీ లక్ష్యం
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 21) జరుగుతున్న మ్యాచ్లో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (90), సూన్ లస్ (68 నాటౌట్), మారిజన్ కాప్ (67 నాటౌట్), నదినే డి క్లెర్క్ (41) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.ఆఖర్లో నదినే డి క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. 38వ ఓవర్లో 2 సిక్సర్లు, 39వ ఓవర్లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ బాదింది. 40వ ఓవర్లో బౌండరీ కొట్టిన అనంతరం ఔటైంది. ఆ ఓవర్లో సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయింది. అయినా అంతిమంగా భారీ స్కోర్ చేయగలిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో ముగ్గురు (తజ్మిన్ బ్రిట్జ్, కరాబో మెసో, మ్లాబా) డకౌట్లైనా ఇంత స్కోర్ రావడం విశేషం. పాక్ బౌలర్లలో నష్రా సంధు, సదియా ఇక్బాల్ తలో 3 వికెట్లు తీయగా.. కెప్టెన్ ఫాతిమా సనా ఓ వికెట్ పడగొట్టింది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఇదివరకే సెమీస్కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్తో నాలుగో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఆడిన 5 మ్యాచ్ల్లో మూడింట ఓడిన పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. చదవండి: చెలరేగిన అఫ్రిది.. బ్రెవిస్ డకౌట్.. తడబడిన సౌతాఫ్రికా -
శతక్కొట్టిన కర్రన్.. ఫ్యామిలీలో మొదటి వ్యక్తి..!
స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే ఆటగాడు బెన్ కర్రన్ (Ben Curran) సెంచరీతో కదంతొక్కాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కర్రన్, టామ్ కర్రన్లకు సోదరుడైన బెన్ కర్రన్ జింబాబ్వే తరఫున టెస్ట్ల్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు జింబాబ్వే తరఫున వన్డేల్లో కూడా సెంచరీ చేసిన బెన్.. కర్రన్ ఫ్యామిలీలో రెండు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి వ్యక్తిగా రికార్డుల్లోకెక్కాడు.కర్రన్ కుటుంబంలో మొత్తం నలుగురు క్రికెటర్లు ఉన్నారు. సామ్, టామ్, బెన్ కర్రన్ల తండ్రి కెవిన్ కర్రన్ జింబాబ్వే తరఫున 11 వన్డేలు ఆడాడు. ఇందులో 9 వికెట్లు తీసి, 2 అర్ద సెంచరీల సాయంతో 287 పరుగులు చేశాడు.బెన్ సోదరుడు సామ్ కర్రన్ ఇంగ్లండ్ తరఫున 24 టెస్ట్లు, 35 వన్డేలు, 63 టీ20లు ఆడినా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. మరో కర్రన్ టామ్ కూడా ఇంగ్లండ్ తరఫున 2 టెస్ట్లు, 28 వన్డేలు, 30 టీ20లు ఆడినా ఒక్క మూడంకెల స్కోర్ కూడా చేయలేదు. తండ్రి కెవిన్, సామ్ కర్రన్లు ఆల్రౌండర్లు కాగా.. టామ్ స్పెషలిస్ట్ బౌలర్. వీరికి టాపార్డర్లో బ్యాటింగ్ అవకాశాలు పెద్దగా రాలేదు.అయితే బెన్ అలా కాదు. అతను జింబాబ్వే తరఫున స్పెషలిస్ట్ బ్యాటర్గా, ఓపెనర్గా బరిలోకి దిగుతాడు. అందుకే అతనికి వన్డేల్లో, టెస్ట్ల్లో సెంచరీ చేసే అవకాశం దక్కింది. తండ్రి జన్మస్థలం కావడంతో బెన్ జింబాబ్వే పౌరసత్వం పొంది, ఆ దేశానికి ఆడుతున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బెన్ సెంచరీతో (121) చెలరేగడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. రెండో రోజు టీ విరామం సమయానికి 6 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ (6), నిక్ వెల్చ్ (49), బ్రెండన్ టేలర్ (32), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (5), సికందర్ రజా (65) ఔట్ కాగా.. ట్సిగా (11), బ్రాడ్ ఈవాన్స్ క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో జియా ఉర్ రెహ్మాన్ 3, ఇస్మత్ ఆలం 2, షరాఫుద్దీన్ ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్పై 175 పరుగుల ఆధిక్యం సాధించింది.ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 127 పరుగులకే ఆలౌటైంది. యువ పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) చెలరేగిపోయాడు. 9.3 ఓవర్లలో 22 పరుగుల మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈవాన్స్కు బ్లెస్సింగ్ ముజరబానీ (11-1-4-3), తనక చివంగ (6-0-29-1) కూడా తోడవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ స్వల్ప స్కోర్కు కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్గా నిలిచాడు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి. చదవండి: చెలరేగిన అఫ్రిది.. బ్రెవిస్ డకౌట్.. తడబడిన సౌతాఫ్రికా -
చెలరేగిన అఫ్రిది.. బ్రెవిస్ డకౌట్.. తడబడిన సౌతాఫ్రికా
రావల్పిండి వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్ట్లో (Pakistan vs South Africa) పర్యాటక సౌతాఫ్రికా ఎదురీదుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 148 పరుగులు వెనుకపడి ఉంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (32), ర్యాన్ రికెల్టన్ (14), టోనీ డి జోర్జి (55), డెవాల్డ్ బ్రెవిస్ (0) ఔట్ కాగా.. ట్రిస్టన్ స్టబ్స్ (68), కైల్ వెర్రిన్ (10) క్రీజ్లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆసిఫ్ అఫ్రిది 2, షాహీన్ అఫ్రిది, సాజిద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు కేశవ్ మహారాజ్ (42.4-5-102-7) చెలరేగడంతో పాక్ తొలి ఇన్నింగ్స్లో 333 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్ (57), షాన్ మసూద్ (87), సౌద్ షకీల్ (66) అర్ద సెంచరీలతో రాణించారు. సల్మాన్ అఘా (45) పర్వాలేదనిపించాడు. సైమన్ హార్మర్ 2, రబాడ ఓ వికెట్ తీశారు.తడబడిన సౌతాఫ్రికాపాక్ను ఓ మోస్తరు స్కోర్కు పరిమితం చేశాక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ వికెట్ కోల్పోయింది. ఆతర్వాత కొద్ది సేపటికే మార్క్రమ్ కూడా ఔటయ్యాడు. ఈ దశలో స్టబ్స్, జోర్జి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరు మూడో వికెట్కు 113 పరుగులు జోడించారు.అయితే ఆట చివరి అర్ద గంటలో సౌతాఫ్రికా తడబడబాటుకు లోపైంది. ఆసిఫ్ అఫ్రిది చెలరేడంతో నాలుగు పరుగుల వ్యవధిలో సెట్ బ్యాటర్ జోర్జి, అప్పుడే క్రీజ్లోకి వచ్చిన విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ వికెట్లు కోల్పోయింది. స్టబ్స్, వెర్రిన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను ముగించారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో పాక్ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది.చదవండి: పాకిస్తాన్ మరో ఫార్మాట్ కెప్టెన్గా ఇంకో అఫ్రిది -
అక్షర్తో పాటు వరల్డ్కప్ జట్టులో అతడూ ఉండాలి.. ఎందుకంటే...
ఐసీసీ వన్డే వరల్డ్కప్-2027 (ICC ODI WC 2027) కోసం టీమిండియా రూట్మ్యాప్ సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే కెప్టెన్ను మార్చినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) వెల్లడించాడు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి.. అతడి స్థానంలో యువ ఆటగాడు శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించినట్లు స్పష్టం చేశాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు జట్టు ప్రకటన సందర్భంగా అగార్కర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్క్ సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను సెలక్టర్లు ఎంపిక చేయని సంగతి తెలిసిందే.సెలక్షన్ నా చేతుల్లో లేదుజడ్డూకు మొండిచేయి చూపి స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేశారు. ఈ విషయంపై జడ్డూ స్పందిస్తూ.. ‘‘సెలక్షన్ నా చేతుల్లో లేదు. అయితే, ఈ టూర్లో ఆడాలని ఆశపడిన మాట వాస్తవమే.కానీ జట్టు యాజమాన్యం, సెలక్టర్లు, కోచ్, కెప్టెన్ ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. నన్ను ఈ సిరీస్కు ఎంపిక చేయకపోవడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అయితే, జట్టు ప్రకటనకు ముందే నాతో ఈ విషయం గురించి చర్చించడం సంతోషం కలిగించింది.అందుకే జట్టులో నా పేరు లేనపుడు పెద్దగా ఆశ్చర్యపోలేదు. నన్ను ఎందుకు తప్పించారో చెప్పినందుకు కాస్త ఊరటగా అనిపించింది’’ అని జడేజా కాస్త ఘాటుగానే స్పందించాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిలు వన్డే వరల్డ్కప్ ఆడే విషయంపై హామీ ఇవ్వలేదని అగార్కర్ ఇదివరకే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.తద్వారా దిగ్గజ బ్యాటర్లను మెగా టోర్నీ దాకా కొనసాగించే పరిస్థితి లేదనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జడ్డూకు కూడా రో-కో మాదిరి తిప్పలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి జడ్డూ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.భారత జట్టులో అతడు తప్పక ఉండాలిఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరు 2027 వరల్డ్కప్ గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో దయచేసి రవీంద్ర జడేజా పేరు విస్మరించకండి. అతడు కూడా ప్రణాళికల్లో ఉంటాడు. ఇందులో సందేహానికి తావులేదు.ఇప్పటికీ ఏడు- ఎనిమిదేళ్ల క్రితం మాదిరే అతడు ఫీల్డింగ్ చేస్తున్నాడు. మైదానంలో చురుగ్గా కదులుతున్నాడు. బంతి కోసం అతడు పాదరసంలా పరుగులు తీస్తుంటే చూడటం ముచ్చటగా అనిపిస్తుంది. ఆస్ట్రేలియాతో వన్డేలకు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నేను అర్థం చేసుకోగలను. అయితే, వన్డే వరల్డ్కప్ టోర్నీకి వేదికైన సౌతాఫ్రికాలో పిచ్ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అక్షర్ పటేల్తో పాటు రవీంద్ర జడేజా తప్పక జట్టులో ఉండాలి’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి వన్డేలో గిల్ సేన ఆసీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
పాకిస్తాన్ మరో ఫార్మాట్ కెప్టెన్గా మరో అఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు (Pakistan) ఇవాళే (అక్టోబర్ 21) మరో అఫ్రిది కెప్టెన్గా ఎంపికయ్యాడు. తొలుత వన్డే జట్టుకు షాహీన్ షా అఫ్రిదిని (Shaheen Afridi) కెప్టెన్గా ఎంపిక చేసిన పాక్ సెలెక్టర్లు.. తాజాగా సూపర్-6 ఫార్మాట్ కెప్టెన్గా అబ్బాస్ అఫ్రిదిని (Abbas Afridi) నియమించారు. హాంగ్కాంగ్ సిక్సస్ టోర్నీలో (Hong Kong Sixes 2025) పాల్గొనబోయే పాక్ జట్టుకు అబ్బాస్ అఫ్రిది కెప్టెన్గా ఎంపికయ్యాడు.అబ్బాస్ అఫ్రిది పాక్ మాజీ పేసర్ ఉమర్ గుల్కు మేనల్లుడు. అబ్బాస్ను ఇటీవలే పాక్ జట్టు నుంచి తప్పించారు. ఆసియా కప్ జట్టులో చోటు ఆశించిన అబ్బాస్కు నిరాశ ఎదురైంది. తాజాగా పాక్ సెలెక్టర్లు అబ్బాస్కు న్యాయం చేశారు. సూపర్ సిక్సస్ జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేశారు. జాతీయ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనుండటం అబ్బాస్కు ఇదే తొలిసారి.ఈ పాక్ జట్టులో అబ్బాస్తో పాటు అబ్దుల్ సమద్, మోహమ్మద్ షెహజాద్, ఖవాజా నఫాయ్, మాజ్ సదాఖత్, సాద్ మసూద్, షాహిద్ అజీజ్కు చోటు దక్కింది. డానిశ్ అజీజ్, మొహమ్మద్ ఫైక్ రిజర్వ్లుగా ఎంపికయ్యారు.హాంగ్కాంగ్ సూపర్ సిక్సస్ టోర్నీ నవంబర్ 7 నుంచి 9 వరకు హాంగ్కాంగ్లోని Tin Kwong Road Recreation Ground వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉంటారు. ఇన్నింగ్స్కు ఆరు ఓవర్లు ఉంటాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్తో పాటు భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కువైట్, హాంగ్కాంగ్, సౌతాఫ్రికా దేశాల జట్లు పాల్గొంటున్నాయి. భారత్ తరఫున ఇటీవలే ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నాడు. టీమిండియాకు దినేశ్ కార్తీక్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.కాగా, హాంగ్కాంగ్ సిక్సస్ అనే టోర్నీ 1992లో పరిచయమైంది. తొలి ఎడిషన్లో పాక్ విజేతగా నిలిచింది. ఆతర్వాత వరుసగా ఐదేళ్లు నిరంతరాయంగా సాగిన ఈ టోర్నీకి బ్రేక్ పడింది. 2001లో పునఃప్రారంభమైంది. అప్పటి నుంచి 2012 వరకు నిరాటంకంగా సాగింది. మధ్యలో 2017లో జరిగింది. తిరిగి 2024లో పునఃప్రారంభమైంది. గత ఎడిషన్ ఫైనల్లో శ్రీలంక పాక్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ 2005లో ఛాంపియన్గా నిలిచింది. చదవండి: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి -
బాబర్ ఆజం ఖేల్ ఖతం!.. పాక్ హెడ్కోచ్ ఏమన్నాడంటే..
ప్రపంచంలోని ఉత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరొందిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో కెప్టెన్సీ కోల్పోయిన ఈ కుడిచేతి వాటం ఆటగాడికి.. టీ20 జట్టులో స్థానం కూడా కరువైంది.పేలవ ప్రదర్శన అయితే, వన్డే, టెస్టుల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న బాబర్ ఆజం స్థాయికి తగ్గట్లు ఆడలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్లో మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 56 పరుగులే చేసిన బాబర్.. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్లోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.కనీసం ఒక్క సెంచరీ కూడా లేదులాహోర్ వేదికగా తొలి టెస్టులో బాబర్ రెండు ఇన్నింగ్స్లో చేసిన పరుగులు 23, 47. ఇక రావల్పిండిలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 16 పరుగులే చేసి నిష్క్రమించాడు. కాగా గత 75 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్లో బాబర్ కనీసం ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు.గత మూడేళ్ల కాలంలో టెస్టు క్రికెట్లో బాబర్ బ్యాటింగ్ సగటు 30కి తక్కువగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ పవర్ తగ్గిపోయిందని.. రిటైర్ అయితే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఒత్తిడికి లోనవుతున్నాడు..అయితే, పాకిస్తాన్ హెడ్కోచ్ అజర్ మహమూద్ మాత్రం బాబర్ ఆజంపై నమ్మకం ఉంచాడు. ‘‘ఒత్తిడి కారణంగానే ఇలా జరుగుతుంది. ప్రతి మ్యాచ్లోనూ బాబర్ రాణించాలని అంతా కోరుకుంటారు. దీంతో అతడు భారమంతా తనపైనే ఉందనే ఒత్తిడికి లోనవుతున్నాడు.అతడొక అద్భుతమైన ప్లేయర్. ప్రపంచంలోని ఉత్తమ బ్యాటర్లలో ఒకడు. గత మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 40కి పైగా పరుగులు చేశాడు. ఒక్కసారి ఒత్తిడిని అధిగమించాడంటే.. కనీసం ఒక్క ఫిఫ్టీ చేసినా అతడు మళ్లీ గాడిలో పడతాడు’’ అని అజర్ మహమూద్ ధీమా వ్యక్తం చేశాడు.కాగా తొలి టెస్టులో ఊహించని రీతిలో వరల్డ్చాంపియన్ సౌతాఫ్రికాకు షాకిచ్చిన పాకిస్తాన్.. 93 పరుగులు తేడాతో గెలిచింది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 333 పరుగులకు ఆలౌట్ అయిన పాక్.. సఫారీలను నిలువరించేందుకు గట్టిగానే కృషి చేస్తోంది.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. వన్డే క్రికెట్లో తొలిసారి
వెస్టిండీస్ క్రికెట్ జట్టు (West Indies) సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. ఓ వన్డే మ్యాచ్లో తొలి ఐదుగురితో స్పిన్ బౌలింగ్ వేయించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్లో ఇప్పటివరకు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు.తొలి నలుగురితో స్పిన్ బౌలింగ్ చేయించిన దాఖలాలు (ఐదు సందర్భాల్లో) ఉన్నా, అవి అసోసియేట్ దేశాల క్రికెట్లో జరిగాయి. ఓ ఫుల్ మెంబర్ జట్టు తొలి ఐదుగురి బౌలర్లతో స్పిన్ వేయించడం మాత్రం వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో వన్డేలో (Bangladesh Vs West Indies) ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. విండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ తొలుత బౌలింగ్ చేస్తూ.. ఐదుగురు స్పిన్నర్లను ప్రయోగించాడు. రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లతోనే దాడి ప్రారంభించాడు. ఇలా జరగడం కూడా వన్డే క్రికెట్ చరిత్రలో ఐదోసారి మాత్రమే.గత మూడు ఘటనలు ఇదే వేదికగా జరిగాయి. మూడు సందర్భాల్లో కూడా బంగ్లాదేశే ఈ ప్రయోగాన్ని చేసింది. న్యూజిలాండ్ జట్టు వన్డే క్రికెట్లో తొలిసారి ఈ ప్రయోగాన్ని చేసిన జట్టుగా నిలిచింది. 2017లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లతో (జీతన్ పటేల్, సాంట్నర్) బౌలింగ్ ప్రారంభించింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. ఇవాళ (అక్టోబర్ 21) జరుగుతున్న మ్యాచ్కు సంబంధించిన పిచ్ కూడా అలాగే ఉంది. దీంతో తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చిన విండీస్ కేవలం స్పిన్నర్లతోనే బరిలోకి దిగింది.అకీల్ హోసేన్, రోస్టన్ ఛేజ్తో బౌలింగ్ అటాక్ను ప్రారంభించిన విండీస్.. ఆతర్వాత కూడా స్పిన్నర్లనే (ఖారీ పియెర్రీ, గుడకేశ్ మోటీ, అలిక్ అథనాజ్) కొనసాగించింది. అంచనాలకు తగ్గట్టుగానే విండీస్ స్పిన్నర్లు చెలరేగిపోయారు.ఆతిథ్య జట్టును 213 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. మోటీ 3, అకీల్ హోసేన్, అలిక్ అథనాజ్ తలో 2 వికెట్లు తీశారు. బంగ్లా ఇన్నింగ్స్లో 45 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (39 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.విండీస్ ప్రపంచ రికార్డురెండు వైపుల నుంచి బౌలింగ్ అటాక్ను స్పిన్నర్లతోనే ప్రారంభించి, ఆతర్వాత కూడా మరో ముగ్గురు స్పిన్నర్లనే కొనసాగించి, ఓ వన్డే మ్యాచ్లో తొలి ఐదుగురు బౌలర్లతో స్పిన్ వేయించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది. వన్డే క్రికెట్ చరిత్రలో 50 ఓవర్లు స్పిన్నర్లతోనే వేయించిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.కాగా, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ల కోసం విండీస్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు 74 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. చదవండి: పాపం సర్ఫరాజ్ ఖాన్.. ఎందుకిలా..? -
BCCI: ఇస్తారా? లేదా?.. పీసీబీ చీఫ్ నక్వీకి బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్
ఆసియా టీ20 కప్-2025 ట్రోఫీ ఇంత వరకు టీమిండియాకు అందనే లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB), ఆసియా క్రికెట్ మండలి (ACC) చైర్మన్ మొహ్సిన్ నక్వీ మొండి వైఖరి ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నక్వీకి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.తీవ్ర పరిణామాలుట్రోఫీ గనుక టీమిండియాకు అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీసీసీఐ నక్వీకి అధికారికంగా ఇ- మెయిల్ పంపినట్లు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఇండియా టుడే పేర్కొంది. ఒకవేళ నక్వీ గనుక తమకు సరైన రీతిలో సమాధానం ఇవ్వకుంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని ఆశ్రయిస్తామని చెప్పినట్లు తెలిపింది.అదే జరిగితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని హెచ్చరించామని.. వీలైనంత త్వరగా ట్రోఫీ పంపించాలని మెయిల్ రాసినట్లు పేర్కొంది. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.టీమిండియా నిరాకరణలీగ్, సూపర్-4 దశల్లో పరాజయమన్నదే ఎరుగక ఫైనల్ చేరిన సూర్యకుమార్ సేన.. టైటిల్ పోరు (సెప్టెంబరు 28)లో దాయాది పాకిస్తాన్ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. అయితే, ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న నక్వీ నుంచి కప్ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. మరోవైపు.. నక్వీ మాత్రం పట్టువీడలేదు. ట్రోఫీ, మెడల్స్ తీసుకుని హోటల్కు పారిపోయాడు.పద్ధతి ప్రకారమేతన చేతుల మీదుగానే టీమిండియా ట్రోఫీ తీసుకోవాలని.. ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగినా ట్రోఫీ ఇవ్వొద్దని నక్వీ ఏసీసీ ప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం. దీంతో బీసీసీఐ కూడా ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకుంది. పద్ధతి ప్రకారమే ట్రోఫీని తమ వద్దకు రప్పించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే మెయిల్ కూడా పంపినట్లు తెలుస్తోంది.పూర్తి స్పృహలో ఉండేకాగా నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని టీమిండియా నిరాకరించడానికి గల కారణాన్ని సైకియా గతంలో వెల్లడించాడు. ‘‘ఏసీసీ చైర్మన్గా ఉన్న వ్యక్తి పాకిస్తాన్ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. పూర్తి స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకున్నాము’’ అని దేవజిత్ సైకియా తెలిపాడు.ఉగ్రదాడికి నిరసనగాపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా పాక్ ఆటగాళ్లతో షేక్హ్యాండ్కు నిరాకరించింది. దీంతో రచ్చకెక్కిన పీసీబీ.. అతి చేసింది.ఇందుకు అనుగుణంగానే పాక్ ఆటగాళ్లు హ్యారిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు, అభిమానులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి.. ఐసీసీతో చివాట్లు తిన్నారు. ఆ తర్వాత ఫైనల్లో దాయాది చేతిలో ఓడి ఇంటిబాట పట్టగా.. పీసీబీ చైర్మన్ నక్వీ ఇలా మెడల్స్, ట్రోఫీ ఎత్తుకెళ్లడం గమనార్హం.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
పాపం సర్ఫరాజ్ ఖాన్.. ఎందుకిలా..?
త్వరలో స్వదేశంలో సౌతాఫ్రికా-ఏతో జరుగబోయే రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్ల కోసం రెండు వేర్వేరు భారత-ఏ జట్లను ఇవాళ (అక్టోబర్ 21) ప్రకటించారు. రెండు జట్లకు రిషబ్ పంత్ కెప్టెన్గా, సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన పంత్ ఈ సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు. దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, మొహమ్మద్ సిరాజ్ రెండో టెస్ట్ జట్టుకు మాత్రమే ఎంపికయ్యారు.కాగా, ఈ రెండు జట్లలో ఇన్ ఫామ్ ఆటగాళ్లు మహ్మద్ షమీ (Mohammed Shami), సర్ఫరాజ్ ఖాన్కు (Sarfaraz Khan) చోటు దక్కకపోవడం అందరికీ ఆశ్యర్యాన్ని కలిగించింది. షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తాజాగా ముగిసిన రంజీ మ్యాచ్లో 7 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. వాస్తవానికి షమీ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులోనే చోటు ఆశించాడు. అయితే ఫిట్నెస్పై అప్డేట్ లేదన్న కారణం చెప్పి సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు సౌతాఫ్రికా-ఏతో సిరీస్కు కూడా షమీని ఎంపిక చేయకపోవడంతో సెలెక్టర్లపై విమర్శలు వస్తున్నాయి. ఫిట్గా ఉండి, ఫామ్లో ఉన్నా షమీని సౌతాఫ్రికా-ఏతో సిరీస్కు ఎందుకు ఎంపిక చేయలేదని అభిమానులు నిలదీస్తున్నారు. మరోవైపు యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ సెలెక్టర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో పాటు అంచనాలకు మించి బరువు తగ్గి, ఫామ్ను చాటుకున్న సర్ఫరాజ్ ఖాన్ను సౌతాఫ్రికా-ఏతో సిరీస్కు ఎందుకు ఎంపిక చేయలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ తాజాగా ముగిసిన రంజీ మ్యాచ్లో 74 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అంతకుముందు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆథ్వర్యంలో జరిగిన బుచ్చిబాబు టోర్నీలో వరుసగా రెండు సెంచరీలు చేశాడు. దీనికి ముందు భారత్-ఏ తరఫున కూడా సర్ఫరాజ్ సత్తా చాటాడు. ఇంగ్లండ్ పర్యటన తొలి మ్యాచ్లో 92 పరుగులు చేశాడు. ఇంత చేసినా సర్ఫరాజ్ను ఏ జట్టుకు కూడా ఎంపిక చేయకపోవడం విచారకరమని అభిమానులు అంటున్నారు. సర్ఫరాజ్, షమీ.. ఏం నేరం చేశారని వారికి అవకాశాలు ఇవ్వడం లేదని అభిమానులు సెలెక్టర్ల నిలదీస్తున్నారు.సౌతాఫ్రికా-ఏతో తొలి మ్యాచ్కు భారత జట్టు (అక్టోబరు 30- నవంబరు 2):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సారాంశ్ జైన్.సౌతాఫ్రికా-ఏతో రెండో మ్యాచ్కు భారత జట్టు (నవంబరు 6- నవంబరు 9):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.చదవండి: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ ఔట్ -
గిల్తో పాటే అరంగేట్రం.. పాపం ఆ ఐదుగురు.. జాడైనా లేదు!
న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా 2019లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు శుబ్మన్ గిల్ (Shubman Gill). కివీస్తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాదే టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2023లో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు టీమిండియా తరఫున 56 వన్డేలు, 28 టీ20లు, 39 టెస్టులు ఆడిన గిల్.. వన్డేల్లో 2785, టీ20లలో 705, టెస్టుల్లో 2839 పరుగులు సాధించాడు. బ్యాటర్గా తనను తాను నిరూపించుకున్న గిల్.. ఐదేళ్ల కాలంలోనే కెప్టెన్గానూ ఎదిగాడు.ప్రస్తుతం టీమిండియా, వన్డే జట్లకు కెప్టెన్గా ఉన్న గిల్.. టీ20 ఫార్మాట్లో వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. త్వరలోనే పొట్టి క్రికెట్లోనూ టీమిండియాను ముందుకు నడిపించనున్నాడు. మరి గిల్తో పాటే ఆయా ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఓ ఐదుగురు ప్లేయర్లు మాత్రం జాతీయ జట్టులో చోటు కోసం కనీసం పోటీపడే స్థితిలో కూడా లేకుండా పోయారు.విజయ్ శంకర్ (Vijay Shankar)గిల్తో పాటు 2019లో వన్డేల్లో అడుగుపెట్టాడు తమిళనాడు ప్లేయర్ విజయ్ శంకర్. 2019లో వన్డే వరల్డ్కప్ ఆడే సువర్ణావకాశం వచ్చిన దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎనిమిది ఇన్నింగ్స్లో కలిపి 223 పరుగులు చేయడంతో పాటు తొమ్మిది మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.ఆ తర్వాత కూడా పెద్దగా రాణించకపోవడంతో విజయ్ శంకర్కు టీమిండియా తలుపులు మూసుకుపోయాయి. ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన శంకర్ ఇక్కడా ఫెయిలయ్యాడు.నవదీప్ సైనీ (Navdeep Saini)వన్డేల్లో గిల్తో పాటే జాతీయ జట్టులో అడుగుపెట్టాడు నవదీప్ సైనీ. ఈ పేస్ బౌలర్ నిలకడలేమి ఆట కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు.ఫిట్నెస్ సమస్యలు కూడా వెంటాడటంతో కెరీర్ కష్టాలు తప్పడం లేదు.టీమిండియా తరఫున రెండు టెస్టుల్లో నాలుగు, 8 వన్డేల్లో ఆరు, 11 టీ20లలో 13 వికెట్లు తీసిన ఈ హర్యానా రైటార్మ్ పేసర్.. 2021లో చివరగా టీమిండియాకు ఆడాడు.టి.నటరాజన్ (T. Natarajan)తమిళనాడుకు చెందిన టి.నటరాజన్ 2020-21 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. కానీ లెఫ్టార్మ్ పేసర్ను గాయాల బెడద వేధించడంతో త్వరగానే కనుమరుగైపోయాడు.టీమిండియా తరఫున ఒక టెస్టు, రెండు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్లు ఆడిన నటరాజన్.. ఆయా ఫార్మాట్లలో 3, 3, 7 వికెట్లు తీశాడు.పృథ్వీ షా (Prithvi Shaw)భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్. ఈ టోర్నీలో పృథ్వీ సారథ్యంలో గిల్ ఆడాడు. తర్వాత ఇద్దరూ ఒకేసారి టీమిండియాలోకి వచ్చారు.ఓపెనింగ్ స్థానం కోసం జరిగిన పోటీలో గిల్ ముందుకు సాగిపోగా.. సచిన్ టెండుల్కర్ అంతటి వాడు అవుతాడనుకున్న పృథ్వీ కెరీర్ ఊహించని రీతిలో పతనమైంది.క్రమశిక్షణారాహిత్యం, ఫిట్నెస్ సమస్యలు ఇందుకు కారణం. పాతికేళ్ల పృథ్వీ షా ఐదు టెస్టుల్లో 339, ఆరు వన్డేల్లో 189 పరుగులు సాధించాడు. ఆడిన ఒకే ఒక్క టీ20లో డకౌట్ అయ్యాడు. చివరగా 2021లో టీమిండియాకు ఆడాడు పృథ్వీ షా.శివం మావి (Shivam Mavi)గిల్తో కలిసి ఉత్తరప్రదేశ్ పేసర్ శివం మావి 2023లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు. ఈ ఫార్మాట్లో 26 ఏళ్ల గిల్ వైస్ కెప్టెన్గా ఎదగగా.. అదే ఏజ్లో ఉన్న శివం మాత్రం రెండేళ్ల క్రితమే తన చివరి మ్యాచ్ ఆడేశాడు. టీమిండియా తరఫున మొత్తంగా ఆరు టీ20లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ ఏడు వికెట్లు తీయగలిగాడు.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ ఔట్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) టేబుల్ టాపర్గా కొనసాగుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు (Australia) భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఇన్ ఫామ్ బ్యాటర్, కెప్టెన్ అయిన అలైస్సా హీలీ (Alyssa Healy) గాయం (కాలు వెనుక భాగంలో) కారణంగా ఇంగ్లండ్తో రేపు (అక్టోబర్ 23) జరుగబోయే మ్యాచ్కు దూరమైంది.ప్రస్తుత ప్రపంచకప్లో హీలీ అరివీర భయంకరమైన ఫామ్లో ఉంది. భారత్, బంగ్లాదేశ్పై వరుసగా రెండు మ్యాచ్ల్లో విధ్వంసకర శతకాలు బాదింది. బంగ్లాదేశ్తో మ్యాచ్ ముగిశాక ప్రాక్టీస్ సమయంలో హీలీ గాయపడినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్తో మ్యాచ్లో హీలీ స్థానంలో బెత్ మూనీ వికెట్ కీపింగ్ చేస్తుందని ఆసీస్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఓపెనర్గా హీలీ స్థానాన్ని 22 ఏళ్ల జార్జియా వాల్ భర్తీ చేస్తుందని వెల్లడించింది.ఆసీస్ శిబిరంలో కలవరంహీలీ గాయం నేపథ్యంలో ఆసీస్ శిబిరం కలవరపడుతుంది. ఆమె గాయం తీవ్రతపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతుంది. ఆసీస్ ఇదివరకే సెమీస్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఒకవేళ హీలీ సెమీస్ మ్యాచ్కు కూడా దూరమైతే ఆసీస్ విజయావకాశాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఇంగ్లండ్తో తర్వాత ఆసీస్ లీగ్ దశలో మరో మ్యాచ్ (సౌతాఫ్రికా) ఆడుతుంది. ఆ మ్యాచ్ అక్టోబర్ 25న జరుగుతుంది. సెమీఫైనల్ మ్యాచ్లు అక్టోబర్ 29, 30 తేదీల్లో జరుగనున్నాయి. ఆ సమయానికి హీలీ కోలుకుంటుందని ఆసీస్ శిబిరం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఇదివరకే సెమీస్కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్తో నాలుగో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. తొలి ప్లేయర్గా రికార్డు -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. తొలి ప్లేయర్గా రికార్డు
శ్రీలంక మహిళల జట్టు కెప్టెన్ చమరి ఆతపట్టు అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో 4000 పరుగుల మార్క్ను అందుకున్న తొలి శ్రీలంక ఉమెన్ క్రికెటర్గా ఆతపట్టు చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా సోమవారం ముంబై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆమె ఈ ఫీట్ సాధించింది.మహిళల వన్డేల్లో ఈ రికార్డు సాధించిన నాలుగో ఆసియా బ్యాటర్గా ఆతపట్టు నిలిచింది. ఈ శ్రీలంక ఉమెన్ క్రికెటర్గా ఆమె దారిదాపుల్లో లేరు. లంక తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శశికళ సిరివర్ధనే 2029 పరుగులతో రెండో స్థానంలో ఉంది.కాగా ఈ మ్యాచ్లో ఆతపట్టు దూకుడుగా ఆడింది. కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్స్లతో 46 పరుగులు చేసి ఔటైంది. బౌలింగ్లో అయితే ఆమె సత్తాచాటింది. చివరి ఓవర్లో బంగ్లా విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. ఆతపట్టు బంతితో మ్యాజిక్ చేసింది.ఓ రనౌట్తో పాటు వరుసగా నాలుగు వికెట్లు సాధించింది. మధ్యలో రనౌట్ ఉండడంతో ఆమె హ్యాట్రిక్ పొందే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె సంచలన బౌలింగ్ కారణంగా బంగ్లాపై 7 వికెట్ల తేడాతో లంక విజయం సాధించింది.టోర్నీ నుంచి ఔట్..కాగా ఈ టోర్నీలో శ్రీలంక జట్టు మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. శ్రీలంక మూడు మ్యాచ్లలో ఓటమి పాలవ్వగా.. మరో రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. ప్రస్తుతం ఆతపట్టు సేన పాయింట్ల పట్టికలో ఆరో స్దానంలో ఉంది. లంక జట్టు సెమీస్కు చేరడం దాదాపు ఆసాధ్యం అనే చెప్పాలి. ఈ జట్టుకు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది.చదవండి: IND vs SA: అగార్కర్తో విభేదాలు.. మహ్మద్ షమీకి ఊహించని షాక్ -
అగార్కర్తో విభేదాలు.. మహ్మద్ షమీకి ఊహించని షాక్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరోసారి మొండి చేయి చూపించింది. స్వదేశంలో సౌతాఫ్రికా-ఎతో జరగనున్న రెండు మ్యాచ్ల అనాధికారిక టెస్టు సిరీస్కు ఇండియా-ఎ జట్టును సెలక్టర్లు ప్రకటించారు.ఈ జట్టులో కూడా షమీకి చోటు దక్కలేదు. కనీసం నాలుగు రోజుల పాటు జరిగే మ్యాచ్లకు కూడా అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. షమీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఫిట్నెస్ పరంగా మెరుగ్గా కన్పిస్తున్నాడు. అయినప్పటికి సెలకర్ల దృష్టిలో షమీ ఎందుకు లేడో ఆర్ధం కావడం లేదు.అగార్కర్తో విభేదాలు..అయితే ప్రస్తుతం షమీకి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మధ్య విభేదాలు తలెత్తాయి. షమీ ఇటీవల అగార్కర్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన ఫిట్గా ఉన్నప్పటికి కావాలనే ఎంపిక చేయడం లేదని షమీ విమర్శించాడు. రంజీల్లో ఆడే వాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు.షమీ వ్యాఖ్యలపై అగార్కర్ స్పందించాడు. షమీ ఫిట్నెస్ గురించి తమకు అప్డేట్ లేదని, అతడు తన ముందు ఉండుంటే సమాధానము చెప్పేవాడిని అని అగర్కార్ పేర్కొన్నాడు. అంతేకాకుండా ఫిట్గా లేకపోవడం వల్లే ఇంగ్లండ్తో సిరీస్కు ఎంపిక చేయలేకపోయామని తన నిర్ణయాన్ని అజిత్ సమర్ధించుకున్నాడు. అయితే అగార్కర్ కామెంట్స్కు షమీ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. "నేను ఫిట్గా ఉన్నాను. ఎలా బౌలింగ్ చేస్తున్నారో మీరే చూస్తున్నారు. అతడు ఏం చెప్పుకొన్న పర్వాలేదు" అని షమీ అన్నాడు. ఇప్పుడు ఇండియా-ఎ జట్టుకు కూడా ఎంపిక కాకపోవడంపై షమీ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.కెప్టెన్గా రిషబ్ పంత్..ఇక ఇది ఇలా ఉండగా.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పునరాగమనానికి సిద్దమయ్యాడు. సౌతాఫ్రికా-ఎతో సిరీస్లో భారత్-ఎ జట్టు కెప్టెన్గా పంత్ వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్ సాయిసుదర్శన్ ఎంపికయ్యాడు. తొలి అనాధికారిక టెస్టుకు దూరం ఉన్న స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్.. రెండో మ్యాచ్లో మాత్రం ఆడనున్నారు.సౌతాఫ్రికా- ‘ఎ’తో తొలి ఫోర్-డే మ్యాచ్కు భారత జట్టు (అక్టోబరు 30- నవంబరు 2):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సారాంశ్ జైన్.సౌతాఫ్రికా- ‘ఎ’తో రెండో ఫోర్-డే మ్యాచ్కు భారత జట్టు (నవంబరు 6- నవంబరు 9):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపై ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు
టీమిండియా తరఫున పునరాగమనంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్రంగా నిరాశపరిచారు. చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 బరిలో దిగిన రో-కో తాజాగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. అయితే, పెర్త్లో జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 14 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేయగా.. కోహ్లి మరీ ఘోరంగా విఫలమయ్యాడు.ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్గా వెనుదిరిగాడు కోహ్లి. ఆసీస్తో వన్డేల్లో కోహ్లి ఇలా సున్నా చుట్టడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan).. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల ఆట తీరును విమర్శించాడు. గతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT) నాటి కోహ్లి వైఫల్యాలు పునరావృతం అవుతున్నాయని పేర్కొన్నాడు.ఆ వైఫల్యాలే వెంటాడుతున్నాయి.. ఇలా అయితే కష్టంకాగా బీజీటీ టెస్టు సిరీస్లో కోహ్లి ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడబోయి దాదాపు ఎనిమిదిసార్లు అవుటైన విషయం తెలిసిందే. మరోవైపు.. రోహిత్ కూడా నాటి సిరీస్లో పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, ఈ ఇద్దరు ఇప్పుడు సరికొత్తగా తిరిగివచ్చారు. టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన రో- కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.ఇక ఫిట్నెస్కు మారుపేరైన కోహ్లి నెట్స్లో చెమటోడ్చి ఆస్ట్రేలియాకు చేరుకోగా.. రోహిత్ ఏకంగా పది కిలోల మేర బరువు తగ్గి మరింత ఫిట్గా తయారయ్యాడు. అయితే, ఇద్దరూ రీఎంట్రీలో విఫలం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ..‘‘ఫిట్నెస్ వేరు. మ్యాచ్ ఫిట్నెస్ వేరు. ఆసీస్తో తొలి వన్డేలో పరుగులు రాబట్టేందుకు రోహిత్ చాలా కష్టపడ్డాడు. ఇక విరాట్కేమో బీజీటీ కష్టాలు మళ్లీ తిరిగి వచ్చినట్లే కనిపిస్తోంది. అడిలైడ్, సిడ్నీ వన్డేల్లో మాత్రం వీరు కచ్చితంగా లోపాలను అధిగమించి సత్తా చాటుతారనే ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడటం ఉత్తమంఇక తొలి వన్డేలో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిన నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచన చేశాడు. ‘‘ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పర్యటించేటపుడు.. కాస్త ముందుగానే అక్కడికి వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడటం ఉత్తమం.నేరుగా వెళ్లి మ్యాచ్లు ఆడటం అంటే.. టీమిండియాకు కఠిన సవాలే. అక్కడి పిచ్ పరిస్థితులకు అంత తేలికగా అలవాటుపడలేము. బౌన్సీ పిచ్లు మనల్ని పరీక్షిస్తాయి. మన బౌలర్లు తొలి వన్డేలో సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయలేకపోయారు. ఇకనైనా పొరపాట్లు సరిచేసుకుంటే బాగుంటుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ హితవు పలికాడు.చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి -
7 వికెట్లతో చెలరేగిన మహారాజ్.. పాక్ 333 పరుగులకు ఆలౌట్
రావల్పిండి వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మహారాజ్ 7 వికెట్లతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 333 పరుగులకు ఆలౌటైంది. 259/5 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజును ఆటను ఆరంభించిన పాకిస్తాన్ అదనంగా 72 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది.259/5 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజును ఆటను ఆరంభించిన పాకిస్తాన్ అదనంగా 72 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ షాన్ మసూద్ (87), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (57), షకీల్(66) అర్ద సెంచరీలతో సత్తాచాటగా.. సల్మాన్ అలీ అఘా(45) రాణించారు.స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్ (16), మహ్మద్ రిజ్వాన్ (19) మరోసారి విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో మహారాజ్తో పాటు హర్మర్ రెండు, రబాడ ఓ వికెట్ సాధించారు. మహారాజ్కు ఇది ఓవరాల్గా 12వ టెస్టు వికెట్ హాల్ కావడం గమనార్హం.తుది జట్లుపాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, ముహమ్మద్ రిజ్వా (వికెట్ కీపర్), సల్మాన్ అఘా, నోమన్ అలీ,సాజిద్ ఖాన్, షాహీన్ అఫ్రిది, ఆసిఫ్ అఫ్రిదిసౌతాఫ్రికాఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రీవిస్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), సెనురన్ ముత్తుసామి, మార్కో జాన్సెన్, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడచదవండి: Pro Kabaddi: 11 ఓటములు.. విసిగి పోయిన హెడ్ కోచ్! ఏమి చేశాడంటే? -
సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పునరాగమనం ఖరారైంది. గాయం నుంచి కోలుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు (Ind A vs SA A)తో జరిగే నాలుగు రోజుల మ్యాచ్ల రెడ్బాల్ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడిని సారథిగా ఎంపిక చేసింది.కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా ఉన్న టీమిండియా.. నవంబరు 14 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో వరుస సిరీస్లు ఆడనుంది. సఫారీలతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.ముందుగా నాలుగు రోజుల మ్యాచ్లు అయితే, అంతకంటే ముందే.. భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య అక్టోబరు 30- నవంబరు 9 వరకు రెడ్బాల్ ఫార్మాట్లో నాలుగు రోజుల మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్ కాగా.. టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్కు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ దక్కింది.పంత్ సేనలోకి ఆ టీమిండియా స్టార్లు కూడాఇక సౌతాఫ్రికా- ‘ఎ’తో రెండో మ్యాచ్ నుంచి టీమిండియా స్టార్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా పంత్ సేనలో చేరనున్నారు. కాగా భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగే ఈ రెడ్బాల్ సిరీస్కు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదిక. కాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా పంత్ కుడికాలికి గాయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ విశ్రాంతి తర్వాత అతడు ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.సౌతాఫ్రికా- ‘ఎ’తో తొలి ఫోర్-డే మ్యాచ్కు భారత జట్టు (అక్టోబరు 30- నవంబరు 2):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సారాంశ్ జైన్.సౌతాఫ్రికా- ‘ఎ’తో రెండో ఫోర్-డే మ్యాచ్కు భారత జట్టు (నవంబరు 6- నవంబరు 9):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులో బవుమా దక్షిణాఫ్రికా రెగ్యులర్ టెస్టు కెప్టెన్ తెంబా బవుమా... టీమిండియా పర్యటన కోసం కసరత్తులు చేస్తున్నాడు. గాయం కారణంగా పాకిస్తాన్తో సిరీస్కు దూరమైన బవుమా... ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో పాటు భారత్కు రానున్నాడు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.నవంబర్ 14న ప్రారంభం కానున్న ఈ పర్యటన... డిసెంబర్ 19తో ముగియనుంది. దానికి ముందు ఇక్కడి పరిస్థితులపై అంచనా కోసం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు... భారత ‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడనుంది. ఈ నెల 30న బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుండగా... నవంబర్ 6 నుంచి రెండో మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్ల్లో బవుమా... దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. దీంతో ఇక్కడి పరిస్థితులపై అవగహనకు రావొచ్చని దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్యం భావిస్తోంది. అకెర్మన్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులో బవుమాతో పాటు జుబేర్ హంజా, ప్రెనెలన్ సుబ్రాయన్ కూడా ఉన్నారు. చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి -
244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) తమ అంతర్జాతీయ క్రికెట్ రీ ఎంట్రీ మ్యాచ్లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు నెలల తర్వాత భారత్ తరపున ఆడిన ఈ సీనియర్ ద్వయం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. కోహ్లి డకౌట్గా వెనుదిరిగారు. బౌన్స్ అండ్ ఫాస్ట్ పెర్త్ పిచ్పై ఆసీస్ బౌలర్లను ఎదుర్కొవడానికి వీరిద్దరూ ఇబ్బంది పడ్డారు. హిట్మ్యాన్ జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్లో ఓ బౌన్సర్ బంతికి దొరికి పోగా.. స్టార్క్ బౌలింగ్లో డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఇక ఆడిలైడ్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో అందరి కళ్లుపై వీరిద్దరి పైనే ఉన్నాయి. తొలి వన్డేలో విఫలమైన రో-కో అడిలైడ్లోనైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆడిలైడ్ ఓవల్లో రోహిత్, కోహ్లి ట్రాక్ రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.కోహ్లి రికార్డు అదుర్స్.. ఈ మైదానంలో కోహ్లికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడిన కోహ్లి.. 61.00 సగటుతో 244 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఈ మైదానంలో అతడు చివరగా 2019లో ఆడాడు. అయితే ఈ ఓవల్ స్టేడియంలోని పిచ్ తొలుత ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించినప్పటికి.. నెమ్మదిగా స్పిన్నర్లు గేమ్లోకి వస్తారు. కాబట్టి ఈ మ్యాచ్లో కోహ్లి సత్తాచాటే అవకాశముంది. ఈ ఓవల్ మైదానంలో కోహ్లికి టెస్టుల్లో కూడా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 5 టెస్టులు ఆడిన కింగ్ కోహ్లి.. 52.70 సగటుతో 527 పరుగులు చేశాడు. ఈ చారిత్రత్మక మైదానంలో అతడి పేరిట మూడు టెస్టు సెంచరీలు ఉన్నాయి.రోహిత్.. నో హిట్అయితే ఈ మైదానంలో గత రికార్డులు రోహిత్ శర్మను భయపెడుతున్నాయి. అడిలైడ్లో హిట్మ్యాన్ ట్రాక్ రికార్డు అస్సలు బాగోలేదు. ఇప్పటివరకు ఈ మైదానంలో 6 వన్డేలు ఆడిన ఈ మాజీ కెప్టెన్.. 21.83 సగటుతో కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 44గా ఉంది. టెస్టుల్లో కూడా రోహిత్ తన మార్క్ను చూపించలేకపోయాడు.చదవండి: 352 వికెట్లు.. 10,470 రన్స్.. కట్ చేస్తే! రిటైర్మెంట్తో షాకిచ్చిన టీమిండియా క్రికెటర్ -
విరాట్ కోహ్లి కెప్టెన్సీలో డెబ్యూ.. కట్ చేస్తే! టీమిండియా క్రికెటర్ షాకింగ్ రిటైర్మెంట్
టీమిండియా వెటరన్, జమ్మూ అండ్ కాశ్మీర్ లెజండరీ ఆల్రౌండర్ పర్వేజ్ రసూల్(Parvez Rasool) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 36 ఏళ్ల పర్వేజ్ సోమవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జమ్మూ కాశ్మీర్ నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తొలి క్రికెటర్గా నిలిచిన రసూల్.. ఇకపై కోచింగ్ కెరీర్పై సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. రసూల్ ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో లెవల్-2 కోచింగ్ సర్టిఫికేట్ పూర్తి చేశాడు."నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. భారత జట్టుకు అత్యున్నత స్ధాయి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్ పరంగా వెనకబడిన జమ్మూ కాశ్మీర్ నుంచి రంజీ ట్రోఫీలో రెండు సార్లు ఉత్తమ ఆల్రౌండర్గా లాలా అమర్నాథ్ అవార్డును సొంతం చేసుకున్నాను.అదేవిధంగా ఐపీఎల్లో కూడా జమ్మూ నుంచి ఆడిన తొలి క్రికెటర్గా నిలిచారు. నా కెరీర్లో ఇవన్నీ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే భారత్కు టెస్టు ఫార్మాట్లో ప్రాతినిథ్యం వహంచలేకపోవడం చాలా బాధగా ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో (చెన్నైలో, ఫిబ్రవరి 2013) బోర్డు ప్రెసిడెంట్స్ XI తరపున ఏడు వికెట్లు తీసిన తర్వాత నాకు సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందని ఆశించాను. కానీ నేను అనుకున్నది జరగలేదు. ఇకపై కోచ్గా నా కెరీర్ను ఆరంభించాలని అనుకుంటున్నాను" అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో రసూల్ పేర్కొన్నాడు.కాగా పర్వేజ్ రసూల్ భారత్ తరపున 2014 ఒక టీ20, 2017లో వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. తన అంతర్జాతీయ కెరీర్లో రెండు మ్యాచ్లు ఆడిన పర్వేజ్.. 3 వికెట్లు, 5 పరుగులు సాధించాడు. రైనా కెప్టెన్సీలో వన్డేల్లో అరంగేట్రం చేసిన రసూల్.. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఈ జమ్మూ కాశ్మీర్ దిగ్గజం ఐపీఎల్లో పుణె వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తరపున కూడా ఆడాడు.చదవండి: రిజ్వాన్పై వేటు.. పాకిస్తాన్కు కొత్త కెప్టెన్! ఎవరంటే? -
4 బంతుల్లో 4 వికెట్లు.. ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ ఓటమి
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ముంబై వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై 7 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. 203 పరుగుల లక్ష్య చేధనలో అద్భుతంగా పోరాడిన బంగ్లా బ్యాటర్లు.. ఆఖరిలో చేతులుత్తేయడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.బంగ్లా విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్ వేసే బాధ్యతను శ్రీలంక కెప్టెన్ చమిరి అతపట్టు తీసుకుంది. చివరి ఓవర్లో అతపట్టు అద్భుతం చేసింది. తొలి బంతికే రబేయా ఖాన్ ఎల్బీగా ఔటయ్యింది. రెండో బంతికి నిహిదా అక్తర్ రనౌట్. మూడో బంతికి సుల్తానా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.మళ్లీ నాలుగో బంతికి మరుఫా అక్తర్ ఎల్బీగా వెనుదిరిగింది. లంక కెప్టెన్ దెబ్బకు బంగ్లా జట్టు వరుసగా నాలుగు బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. ఆఖరి రెండు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చేంది. దీంతో బంగ్లా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది.బంగ్లా బ్యాటర్లలో షర్మిన్ అక్తర్(64),నిగర్ సుల్తానా(77) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. వీరిద్దరూ ఔటైన తర్వాత మ్యాచ్ శ్రీలంక వైపు మలుపు తిరిగింది. లంక బౌలర్లలో చమిరి ఆతపట్టు నాలుగు వికెట్లు పడగొట్టగా.. కుమారి రెండు, ప్రభోధిని ఓ వికెట్ సాధించారు.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో హాసిని పెరీరా(85) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆతపట్టు(46),నీలాక్షి డిసిల్వా(37) రాణించారు. బంగ్లా బౌలర్లలో షోరినా అక్తర్ మూడు, రబియా ఖాన్ రెండు వికెట్లు పడగొట్టారు.ఈ ఓటమితో బంగ్లా జట్టు సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే.చదవండి: రిజ్వాన్పై వేటు.. పాకిస్తాన్కు కొత్త కెప్టెన్! ఎవరంటే? -
రిజ్వాన్పై వేటు.. పాకిస్తాన్కు కొత్త కెప్టెన్! ఎవరంటే?
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకుంది. తమ వన్డే జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్పై పీసీబీ వేటు వేసింది. అతడి స్ధానంలో స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిని పీసీబీ సెలక్షన్ కమిటీ నియమించింది. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల సిరీస్ నుంచి పాకిస్తాన్ వన్డే జట్టు పగ్గాలను అఫ్రిది చేపట్టనున్నాడు.రిజ్వాన్ సారథ్యంలో పాక్ మెరుగైన ప్రదర్శన చేయలేకపోయిది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన మెన్ ఇన్ గ్రీన్.. వెస్టిండీస్, న్యూజిలాండ్తో వన్డే సిరీస్లను కూడా కోల్పోయింది. రిజ్వాన్ నాయకత్వంలో పాక్ కేవలం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై మాత్రమే వన్డే సిరీస్ విజయాలు సాధించింది. ఈ క్రమంలోనే రిజ్వాన్ను కెప్టెన్సీ నుంచి సెలక్టర్లు తప్పించారు.సోమవారం పాకిస్తాన్ సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు వైట్ బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వన్డే జట్టు కెప్టెన్గా షాహీన్ షా అఫ్రిదిని ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ నుంచి పాక్ వన్డే జట్టుకు షాహీన్ నాయకత్వం వహిస్తాడని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో పాక్ జట్టుకు ఇప్పుడు మూడు ఫార్మాట్లలో వెర్వేరు కెప్టెన్లు ఉన్నారు. టెస్టుల్లో షాన్ మసూద్ పాక్ సారథి ఉండగా.. టీ20ల్లో సల్మాన్ అలీ అఘా, వన్డేల్లో షాహీన్ సారథిలుగా ఉన్నారు. షాహీన్ ఇంతకుముందు పాక్ టీ20 కెప్టెన్గా ఎంపికయ్యాడు. కానీ న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-4 తేడాతో పాక్ కోల్పోవడంతో అతడిని కెప్టెన్సీ నుంచి సెలక్టర్లు తప్పించారు. మళ్లీ ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లో పాక్ జట్టు పగ్గాలను చేపట్టేందుకు అఫ్రిది సిద్దమయ్యాడు. 25 ఏళ్ల షాహీన్ పాకిస్తాన్ తరపున 66 వన్డేలు ఆడి 131 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో తలపడుతోంది. చదవండి: సిరాజ్ను వెనక్కు నెట్టిన జింబాబ్వే బౌలర్ -
సిరాజ్ను వెనక్కు నెట్టిన జింబాబ్వే బౌలర్
టెస్ట్ క్రికెట్లో ఈ ఏడాది టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 26.91 సగటున 37 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్గా ఉండేవాడు. తాజాగా జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ (Blessing Muzarabani) సిరాజ్ను వెనక్కు నెట్టి, అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు. ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 20) మొదలైన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన ముజరబానీ తన వికెట్ల సంఖ్యను 39కి (10 మ్యాచ్ల్లో) పెంచుకున్నాడు. ముజరబానీ, సిరాజ్ తర్వాత ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మిచెల్ స్టార్క్ (7 మ్యాచ్ల్లో 29 వికెట్లు), నౌమన్ అలీ (26), నాథన్ లియోన్ (24) ఉన్నారు.ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో ముజరబానీతో పాటు (11-1-47-3), బ్రాడ్ ఈవాన్స్ (9.3-2-22-5), తనక చివంగ (6-0-29-1) చెలరేగడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్ను తొలి ఇన్నింగ్స్లో 127 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్గా నిలిచాడు.ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే.. మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ (6) ఔట్ కాగా.. బెన్ కర్రన్ (34), నిక్ వెల్చ్ (40) క్రీజ్లో ఉన్నారు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి.చదవండి: PAK VS SA 2nd Test: బాబర్ విఫలమైనా, ఆదుకున్న కెప్టెన్ -
చెలరేగిన బంగ్లాదేశ్ బౌలర్లు.. కుదేలైన శ్రీలంక బ్యాటింగ్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 20) శ్రీలంక, బంగ్లాదేశ్ (Sri Lanka Vs Bangladesh) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 48.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. హాసిని పెరీరా (85) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆమెకు కెప్టెన్ చమారీ ఆటపట్టు (46), నిలాక్షి డిసిల్వ (37) సహకరించారు. పై ముగ్గురు మినహా లంక ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. బంగ్లా బౌలర్లలో షోర్నా అక్తర్ (10-4-27-3) అద్భుతంగా బౌలింగ్ చేసింది. రబేయా ఖాన్ 2, నహిదా అక్తర్, నిషిత అక్తర్, మరుఫా అక్తర్ తలో వికెట్ తీశారు.టాస్ గెలిచాక తాము తీసుకున్న నిర్ణయం సరైంది కాదని శ్రీలంకకు తొలి బంతికే తెలిసింది. ఓపెనర్ విష్మి గౌతమ్ను మరుఫా అక్తర్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔట్ చేసింది. అనంతరం కెప్టెన్ చమారీ ఆటపట్టు (46), హాసిని పెరీరా (85) లంక ఇన్నింగ్స్ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్కు 72 పరుగులు జోడించారు. ఆతర్వాత ఆటపట్టును రబేయా ఖాన్ ఔట్ చేసింది. 28 పరుగుల వ్యవధిలో శ్రీలంక మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హాసిని, నీలాక్షి లంకను ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 74 పరుగులు జోడించారు. ఆతర్వాత లంక ఇన్నింగ్స్ ఒక్కసారిగా పతనమైంది. 28 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీస్కు చేరడం దాదాపుగా అసాధ్యం. ప్రస్తుతం ఈ జట్లు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు మూడు సెమీస్ బెర్త్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి.చదవండి: PAK Vs SA: మరోసారి తుస్సుమన్న బాబర్.. 73 ఇన్నింగ్స్లు అయ్యాయి, ఎలా భరిస్తున్నార్రా సామీ..! -
PAK VS SA 2nd Test: బాబర్ విఫలమైనా, ఆదుకున్న కెప్టెన్
రావల్పిండి వేదికగా పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 20) రెండో టెస్ట్ మ్యాచ్ (Pakistan vs South Africa) మొదలైంది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట బ్యాలెన్స్గా సాగింది. ఇరు జట్లు ఆధిపత్యం విషయంలో సమంగా నిలిచాయి. ఓ సెషన్లో పాక్ ఆధిపత్యం సాధిస్తే.. మరో సెషన్లో సౌతాఫ్రికా ఆధిక్యత ప్రదర్శించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్ (16), మహ్మద్ రిజ్వాన్ (19) విఫలమైనా.. కెప్టెన్ షాన్ మసూద్ (87), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (57) అర్ద సెంచరీలతో తమ జట్టును ఆదుకున్నారు. సౌద్ షకీల్ (42), సల్మాన్ అఘా (10) క్రీజ్లో ఉన్నారు.పాకిస్తాన్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 17 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హాక్ను 35 పరుగుల వద్దే సైమన్ హార్మర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (Shan Masood) పాక్ ఇన్నింగ్స్ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్కు 111 పరుగులు జోడించారు.ఆతర్వాత హార్మర్ పాక్కు మరో స్ట్రోక్ ఇచ్చాడు. 146 పరుగుల వద్ద షఫీక్ను ఔట్ చేశాడు. ఈ దశలో ఎప్పటిలాగే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన బాబర్ ఆజమ్ (Babar Azam) వరుస బౌండరీలతో అలరించాడు.16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్ను కేశవ్ మహారాజ్ దెబ్బేశాడు. కేశవ్ బౌలింగ్లో టోనీ డి జోర్జీకి క్యాచ్ ఇచ్చి బాబర్ పెవిలియన్కు చేరాడు. ఆతర్వాత షాన్ మసూద్.. సౌద్ షకీల్తో కలిసి నాలుగో వికెట్కు 45 పరుగులు జోడించి ఔటయ్యాడు. సెంచరీకి 13 పరుగుల ముందు మసూద్ను కేశవ్ మహారాజ్ ఔట్ చేశాడు.ఆతర్వాత వచ్చిన మరో పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 19 పరుగులు చేసి రబాడ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రిజ్వాన్ వికెట్ పడ్డాక జాగ్రత్తగా ఆడిన పాకిస్తాన్ మరో వికెట్ కోల్పోకుండా తొలి రోజు ఆట ముగించింది.కాగా, రెండు టెస్ట్లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో పాక్ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది.చదవండి: ఆఫ్ఘనిస్తాన్ భరతం పట్టిన జింబాబ్వే బౌలర్ -
ఆఫ్ఘనిస్తాన్ భరతం పట్టిన జింబాబ్వే బౌలర్
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే యువ పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) చెలరేగిపోయాడు. 9.3 ఓవర్లలో 22 పరుగుల మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈవాన్స్కు బ్లెస్సింగ్ ముజరబానీ (11-1-4-3), తనక చివంగ (6-0-29-1) కూడా తోడవ్వడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్ను 127 పరుగులకే ఆలౌట్ చేసింది.ఇవాళే మొదలైన (అక్టోబర్ 20) ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలో ఆఫ్ఘనిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే బ్రాడ్ ఈవాన్స్ ఒక్కసారిగా చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్ స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. ఈవాన్స్ తన కెరీర్లో రెండో టెస్ట్లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే కూడా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 6 పరుగులకే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ను జియా ఉర్ రెహ్మాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. బెన్ కర్రన్ (2), నిక్ వెల్చ్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి. చదవండి: రిటైరయ్యే వయసులో అరంగేట్రం.. పాక్ ప్లేయర్ అరుదైన ఘనత -
PAK Vs SA: రిటైరయ్యే వయసులో అరంగేట్రం.. పాక్ ప్లేయర్ అరుదైన ఘనత
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో రిటైరవుతుంటారు. అలాంటిది ఈ మధ్య వయసులో అరంగేట్రం చేయడమంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తాజాగా ఓ పాక్ ఆటగాడు 38 ఏళ్ల 299 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు. ఇది చూసి అభిమానులు రిటైరయ్యే వయసులో అరంగేట్రం ఏంటని అనుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్లోని పెషావర్కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది (Asif Afridi) వయసు 38 ఏళ్ల 299 రోజులు. ఈ లేటు వయసులో అతను పాక్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. రావల్పిండిలో సౌతాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్ 20) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్లో (Pakistan Vs South Africa) ఆసిఫ్ అఫ్రిది అరంగేట్రం చేశాడు. తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) నుంచి ఆసిఫ్ అఫ్రిది అరంగేట్రం క్యాప్ అందుకోవడం విశేషం.ఈ వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ద్వారా ఆసిఫ్ అఫ్రిది ఓ అరుదైన ఘనత సాధించాడు. పాక్ తరఫున రెండో అతి పెద్ద వయస్కుడైన టెస్ట్ అరంగేట్రీగా రికార్డుల్లోకెక్కాడు. పాక్ తరఫున అత్యంత లేటు వయసులో అరంగేట్రం చేసిన రికార్డు మిరాన్ బక్ష్ (Miran Bakhsh) పేరిట ఉంది. 1955లో ఇతను 47 ఏళ్ల 284 రోజుల వయసులో భారత్పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఓవరాల్గా చూస్తే.. ప్రపంచంలో అత్యంత లేటు వయసులో అరంగేట్రం చేసిన రికార్డు ఇంగ్లండ్కు చెందిన జే సౌథర్టన్ పేరిట ఉంది. ఇతను టెస్ట్ క్రికెట్ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 49 ఏళ్ల 119 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. అత్యంత లేటు వయసులో టెస్ట్ అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆసిఫ్ అఫ్రిదిది 24వ స్థానం.ఆసిఫ్ అఫ్రిది అరంగేట్రం చేసిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 81 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 236 పరుగులుగా ఉంది. అబ్దుల్లా షఫీక్ (57), ఇమామ్ ఉల్ హక్ (17), బాబర్ ఆజమ్ (16), కెప్టెన్ షాన్ మసూద్ (87) ఔట్ కాగా..సౌద్ షకీల్ (36), మహ్మద్ రిజ్వాన్ (13) క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్కు తలో రెండు వికెట్లు దక్కాయి.చదవండి: మరోసారి తుస్సుమన్న బాబర్.. 73 ఇన్నింగ్స్లు అయ్యాయి, ఎలా భరిస్తున్నార్రా సామీ..! -
మరోసారి తుస్సుమన్న బాబర్.. ఎలా భరిస్తున్నార్రా సామీ..!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) మరోసారి విఫలమయ్యాడు. రావల్పిండి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో (Pakistan Vs South Africa) 16 పరుగులకే ఔటయ్యాడు. బాబర్ వరుస వైఫల్యాలు చూసి సొంత అభిమానులే విసుగెత్తిపోయారు. మిగతా దేశ క్రికెట్ అభిమానులైతే.. వీడిని ఎలా భరిస్తున్నార్రా సామీ అంటూ తలలు బాదుకుంటున్నారు. పాక్ క్రికెట్ బోర్డుకు గతిలేక ఈ జింబాబర్ను పట్టుకొని వేలాడుతుందని కామెంట్లు చేస్తున్నారు.రెండేళ్లైపోయింది..!బాబర్ అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసి రెండేళ్లైపోయింది. అతను చివరిగా 2023 ఆగస్ట్ 30న పసికూన నేపాల్పై వన్డే సెంచరీ చేశాడు. అప్పటి నుంచి 73 అంతర్జాతీయ ఇన్నింగ్స్లు ఆడిన బాబర్ ఒక్కసారి కూడా మూడంకెల మార్కును తాకలేకపోయాడు. మధ్యలో అడపాదడపా అర్ద సెంచరీలు మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆల్ ఫార్మాట్ కెప్టెన్సీని కోల్పోయిన బాబర్ ప్రస్తుతం జట్టులో చోటు కూడా ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. అతన్ని పొట్టి ఫార్మాట్ నుంచి ఇదివరకే పక్కన పెట్టేశారు. వన్డేల్లో, టెస్ట్ల్లో గత్యంతరం లేక పాక్ క్రికెట్ బోర్డు అతన్ని కొనసాగిస్తుంది. రెండేళ్లకు పైగా ఫామ్ కోల్పోయిన బాబర్ను పాక్ అభిమానులు ఓ దశలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో పోల్చారు. ఇప్పుడు కూడా కొందరు పాకీలు బాబర్ ఆజమ్ విరాట్ కంటే మెరుగైన బ్యాటర్ అని నిస్సిగ్గుగా చెప్పుకుంటుంటారు. సోషల్మీడియాలో బాబర్ అభిమానుల ఓవరాక్షన్కు కొందరు చురుకలంటిస్తుంటారు. అయినా వారి తంతు అలాగే కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, రెండు టెస్ట్లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో పాక్ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బాబర్ వరుసగా రెండు ఇన్నింగ్స్ల్లో (23, 42) విఫలమయ్యాడు. తాజాగా రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లోనూ అదే తంతు కొనసాగింది. ఇవాళే (అక్టోబర్ 20) మొదలైన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 69 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 3 వికెట్ల నష్టానికి 199 పరుగులుగా ఉంది. అబ్దుల్లా షఫీక్ (57), ఇమామ్ ఉల్ హక్ (17), బాబర్ ఆజమ్ (16) ఔట్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (85), సౌద్ షకీల్ (21) క్రీజ్లో ఉన్నారు. చదవండి: సాల్ట్, బ్రూక్ విధ్వంసం.. రషీద్ మాయాజాలం.. ఇంగ్లండ్ ఘన విజయం -
సాల్ట్, బ్రూక్ విధ్వంసం.. రషీద్ మాయాజాలం.. ఇంగ్లండ్ ఘన విజయం
మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (అక్టోబర్ 20) రెండో టీ20 జరిగింది. క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో (New Zealand vs England) పర్యాటక జట్టు 65 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో వర్షం కారణంగా ఫలితం రాలేదు. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా అక్టోబర్ 23న జరుగనుంది. అనంతరం 26, 29, నవంబర్ 1 తేదీల్లో మౌంట్ మౌంగనూయ్, హ్యామిల్టన్, వెల్లింగ్టన్ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి.సాల్ట్, బ్రూక్ విధ్వంసంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (Phil Salt) (56 బంతుల్లో 85; 11 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) (35 బంతుల్లో 78; 5 సిక్సర్లు, 6 ఫోర్లు) విధ్వంసం సృష్టించారు.జేకబ్ బేతెల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ బాంటన్ (12 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. జోస్ బట్లర్ (4) ఒక్కడే నిరుత్సాహపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 2, డఫీ, బ్రేస్వెల్కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ చేసిన స్కోర్ టీ20ల్లో న్యూజిలాండ్పై రెండో అత్యధికం. రషీద్ మాయాజాలం237 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. ఒక్క బ్యాటర్ కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. ఓటమి ఖరారయ్యాక కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (36) బ్యాట్ ఝులిపించాడు. టిమ్ సీఫర్ట్ (39), చాప్మన్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆదిల్ రషీద్ (Adil Rashid) (4-0-32-4) తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. అతనికి లూక్ వుడ్ (4-0-36-2), బ్రైడన్ కార్స్ (3-0-27-2), లియామ్ డాసన్ (4-0-38-2) సహకరించారు. వీరి ధాటికి న్యూజిలాండ్ 18 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 10 మంది ఆటగాళ్లు క్యాచ్ ఔట్ల రూపంలో ఔటయ్యారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇలా జరగడం కేవలం 13వ సారి మాత్రమే.చదవండి: ఆల్ ఫార్మాట్ గ్రేట్గా ఎదుగుతాడు: నితీశ్ రెడ్డిపై రోహిత్ శర్మ ప్రశంసలు -
ఆల్ ఫార్మాట్ గ్రేట్గా ఎదుగుతాడు: నితీశ్ రెడ్డిపై రోహిత్ శర్మ ప్రశంసలు
టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కమార్ రెడ్డి (Nitish Kumar Reddy)పై భారత దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ప్రశంసలు కురిపించాడు. ఈ ఆంధ్ర ఆటగాడు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటి ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని పేర్కొన్నాడు.అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండ్ నైపుణ్యాలతో జట్టులోకి వచ్చిన నితీశ్ రెడ్డి.. ఇప్పటికే టెస్టుల్లో కీలక ఆటగాడిగా మారాడు. అంతకుముందే టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేసిన ఈ విశాఖ కుర్రాడు.. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్తో వన్డేల్లోనూ అడుగుపెట్టాడు.ఆల్ ఫార్మాట్ గ్రేట్గా టీమిండియా దిగ్గజ సారథి రోహిత్ శర్మ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్నాడు నితీశ్ రెడ్డి. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘క్యాప్ నంబర్ 260. నితీశ్ రెడ్డి. నీ ఆటిట్యూడ్, నైపుణ్యాలతో కెరీర్ను గొప్పగా ఆరంభించావు. ఇదే జోరును కొనసాగిస్తే వందకు 110 శాతం.. నువ్వు టీమిండియాతో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేస్తావని చెప్పగలను. ఆల్ ఫార్మాట్ గ్రేట్గా ఎదగబోతున్నావని అనిపిస్తోంది. నీపై నాకు ఆ నమ్మకం ఉంది. ప్రతి ఫార్మాట్లోనూ ఆడాలన్న నీ కల నెరవేరింది. అందరూ నీకు తోడుగా ఉంటారునీకు జట్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆటగాడిగా నీకేం కావాలో అన్నీ సమకూరుస్తుంది. ఎప్పుడు, ఏం కావాలన్నా అందరూ నీకు తోడుగా ఉంటారు. ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. గుడ్ లక్. నీ కెరీర్ గొప్పగా ఉండాలి’’ అంటూ రోహిత్ శర్మ నితీశ్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆసీస్తో తొలి వన్డేలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన నితీశ్ రెడ్డి 11 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున టీ20 మ్యాచ్లు, తొమ్మిది టెస్టులు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టెస్టుల్లో ఎనిమిది, టీ20లలో మూడు వికెట్లు తీశాడు.అపుడు కోహ్లి.. ఇపుడు రోహిత్అదే విధంగా ఈ కుడిచేతి వాటం బ్యాటింగ్ ఆల్రౌండర్ ఖాతాలో టెస్టుల్లో 386, టీ20లలో 90 పరుగులు ఉన్నాయి. కాగా గతేడాది పెర్త్ వేదికగా భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్న 22 ఏళ్ల నితీశ్ రెడ్డి.. తాజాగా అదే వేదిక మీద రోహిత్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకోవడం విశేషం. తన కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే ఈ క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గిల్ సేనకు ఓటమిఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆసీస్తో తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.ఇక డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా తమ ముందు 131 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 21.1 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి.. మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య గురువారం అడిలైడ్ వేదికగా రెండో వన్డే నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
ENG vs NZ: హ్యారీ బ్రూక్ విధ్వంసం... ఫిల్ సాల్ట్ ధనాధన్
న్యూజిలాండ్తో రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) ధనాధన్ దంచికొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడి ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన బ్రూక్.. 22 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (NZ vs ENG)కు వెళ్లింది. ఇందులో భాగంగా శనివారం తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో క్రైస్ట్చర్చ్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ జట్టు.. ఇంగ్లండ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఫిల్ సాల్ట్ ధనాధన్.. బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ క్రమంలో ఓపెనర్ జోస్ బట్లర్ (4) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ మాత్రం అదరగొట్టాడు. 56 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 85 పరుగులు సాధించాడు. వన్డౌన్లో వచ్చిన జేకబ్ బెతెల్ కాసేపు మెరుపులు (12 బంతుల్లో 24) మెరిపించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. ఆరు ఫోర్లు, ఐదు సిక్స్లు బాది 78 పరుగులు సాధించాడు. మిగతా వారిలో సామ్ కర్రాన్ 3 బంతుల్లో 8, టామ్ బాంటన్ 12 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 236 పరుగులు సాధించింది.కివీస్ ఎదుట భారీ లక్ష్యంతద్వారా న్యూజిలాండ్కు 237 పరుగుల మేర భారీ లక్ష్యం విధించింది. ఇదిలా ఉంటే.. క్రైస్ట్చర్చ్లోని హాగ్లే ఓవల్ మైదానంలో ఏ జట్టుకైనా టీ20లలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఇక న్యూజిలాండ్ బౌలర్లలో కైలీ జెమీషన్ రెండు వికెట్లు కూల్చగా.. జేకబ్ డఫీ, మైకేల్ బ్రాస్వెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అరుదైన మైలురాయిని చేరుకున్న హ్యారీ బ్రూక్అంతర్జాతీయ టీ20లలో హ్యారీ బ్రూక్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున ఈ ఫార్మాట్లో 51 మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ప్రస్తుతం 1012 పరుగులు ఉన్నాయి.అంతేకాదు.. న్యూజిలాండ్తో రెండో టీ20లో కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న హ్యారీ బ్రూక్ మరో ఘనతను సాధించాడు. ఇంగ్లండ్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్గా నిలిచాడు. ఈ జాబితాలో ఇయాన్ మోర్గాన్ (21 బంతుల్లో) ముందు వరుసలో ఉన్నాడు. ఇక సారథిగా బ్రూక్కు ఇదే తొలి టీ20 ఫిఫ్టీ కాగా.. ఓవరాల్గా ఐదవది కావడం గమనార్హం.చదవండి: ‘నా వల్లే జట్టు ఓడింది.. ఓటమికి బాధ్యత నాదే.. తెలివిగా ఆడితే బాగుండేది’ -
‘అగార్కర్, గంభీర్లను తొలగిస్తేనే సరి!’.. సిగ్గు పడండి!
టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu)కు కోపం వచ్చింది. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సోషల్ మీడియా వేదికగా ఈ మాజీ ఓపెనర్ మండిపడ్డాడు. ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయొద్దంటూ సదరు నెటిజన్కు చురకలు అంటించాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆసీస్తో వన్డేలకు ఎంపిక చేసిన జట్టుపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్కోచ్ గౌతం గంభీర్ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడం.. మొహమ్మద్ షమీని కాదని హర్షిత్ రాణా (Harshit Rana)కు జట్టులో చోటివ్వడం ఇందుకు ప్రధాన కారణాలు.ఏడు వికెట్ల తేడాతో ఓటమిఈ క్రమంలో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి నేపథ్యంలో మరోసారి మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్లో గిల్ సేన ఆసీస్ చేతిలో.. ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్లో డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం విజేతను తేల్చారు.అగార్కర్, గంభీర్లను తొలగిస్తేనే సరి?ఇదిలా ఉంటే.. ఆసీస్తో వన్డేలో టీమిండియా ఓటమి తర్వాత నవజ్యోత్ సింగ్ సిద్ధు.. గంభీర్, అగార్కర్లను ఘాటుగా విమర్శించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. జాడ్ ఇన్సానే అనే అకౌంట్ నుంచి ‘‘ఒకవేళ టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలవాలనుకుంటే.. బీసీసీఐ అజిత్ అగార్కర్, గౌతం గంభీర్లను వీలైనంత త్వరగా తమ పదవుల నుంచి తప్పించాలి.అదే విధంగా పూర్తి గౌరవ మర్యాదలతో కెప్టెన్సీని రోహిత్ శర్మకు తిరిగి అప్పగించాలి’’ అని సిద్ధు అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇందుకు సిద్ధుతో పాటు గౌతీ, అగార్కర్ల ఫొటోలను కూడా సదరు నెటిజన్ జతచేశారు.సిగ్గు పడండిఈ విషయంపై స్పందించిన సిద్ధు.. ‘‘నేను ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు. అసత్యపు వార్తలను ప్రచారం చేయకండి. అసలు ఇలాంటివి కూడా చేస్తారని అస్సలు ఊహించలేదు. సిగ్గు పడండి’’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఈ టూర్ కొనసాగుతుంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్.. టిక్కెట్ ధర 60 రూపాయలే
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఈ ఏడాది నవంబర్లో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టులో సఫారీలు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టెస్టు సిరీస్తో ప్రోటీస్ భారత పర్యటన ప్రారంభం కానుంది. నవంబర్ 14 నుంచి 18 వరకు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది.అయితే ఈ మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను బెంగాల్ క్రికెట్ అసోయేషిన్ సోమవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ప్రకారం..టిక్కెట్ల కనీసం ధర రోజుకు 60 రూపాయలుగా నిర్ణయించారు. మొత్తం ఐదు రోజులకు టిక్కెట్ కావాలనుకుంటే 300 రూపాయలు చెల్లాంచాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రోజు 250 రూపాయల వరకు (మొత్తం అయిదు రోజులకు రూ.1,250) ఉంటాయని క్యాబ్ అధికారులు పేర్కొన్నారు. ఈ మ్యాచ్ టిక్కెట్లను డిస్ట్రిక్ట్ యాప్, అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫిజికల్ టిక్కెట్లు అవసరం లేదు. నేరుగా అన్లైన్ టిక్కెట్ ఉంటే చాలు స్టేడియంలోకి అనుమతి ఇస్తారు.కాగా 2019లో బంగ్లాదేశ్తో జరిగిన పింక్ బాల్ టెస్టు తర్వాత ఈడెన్ గార్డెన్స్లో టెస్టు మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC 2025/27) సైకిల్లో భాగంగా జరగనుంది.చదవండి: పాకిస్తాన్ కెప్టెన్గా బాబర్ ఆజం..!? -
అదేంటో.. ఎవరికీ అర్థం కాదు: DLS పద్ధతిపై గావస్కర్ విమర్శలు
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం ఆటంకం కలిగించిన కారణంగా 26 ఓవర్లకు ఈ మ్యాచ్ను కుదించగా.. భారత్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసింది.డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యం 131 పరుగులుగా నిర్దేశించగా.. 21.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి కంగారూలు పనిపూర్తి చేశారు. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆసీస్ ఆధిక్యంలో నిలిచింది.అదేంటో.. ఎవరికీ అర్థం కాదుఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డీఎల్ఎస్ (Duckworth–Lewis–Stern method) పద్ధతి ద్వారా లక్ష్యాలు ఎలా నిర్దేశిస్తారో ఎవరికీ అర్థం కాదని వాపోయాడు. ‘‘ఈ మెథడ్ అందరికీ అర్థం అవుతుందని నేను అనుకోను. అయితే, సుదీర్ఘ కాలంగా ఈ పద్ధతినే వాడుతున్నారు.ఇలా మ్యాచ్లకు వర్షాలు ఆటంకం కలిగించినపుడు.. గతంలో ఓ భారతీయుడు VJD (వి. జయదేవన్ మెథడ్)మెథడ్ను ప్రవేశపెట్టాడు. దేశవాళీ క్రికెట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇదే ఉపయోగించేది. అయితే, ఇప్పుడు ఉపయోగిస్తున్నారో లేదో తెలియదు.ఇరుజట్లకు సమన్యాయం జరిగేలాఏదేమైనా వర్షం వల్ల మ్యాచ్కు అంతరాయం కలిగినపుడు.. ఇరుజట్లకు సమన్యాయం జరిగేలా ఉండే పద్ధతులను వాడితే బాగుంటుంది. లక్ష్యం నిర్దేశించేందుకు ప్రామాణికం ఏమిటో వివరించాల్సి ఉంటుంది’’ అని సునిల్ గావస్కర్ ఇండియా టుడేతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.అదే విధంగా.. భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆసీస్తో తొలి వన్డేలో విఫలం కావడంపై కూడా గావస్కర్ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘టీమిండియా ఐదు నెలల క్రితమే చాంపియన్స్ ట్రోపీ గెలిచింది. జట్టు బాగుంది.రో- కో ఒక్కసారి ఫామ్లోకి వస్తేరోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తదుపరి మ్యాచ్లలో భారీగా పరుగులు రాబట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చాన్నాళ్ల తర్వాత వారు మైదానంలో అడుగుపెట్టారు. నెట్స్లో రిజర్వు బౌలర్ల త్రోడౌన్స్ను ఎదుర్కొన్నారు. వాళ్లిద్దరు ఫామ్లోకి వస్తే టీమిండియా 300- 320 పరుగులు చేయగలదు’’ అని గావస్కర్ రో-కోకు మద్దతుగా నిలిచాడు.కాగా అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన టీమిండియా యాజమాన్యం.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్ను నయా సారథిగా ఎంపిక చేసింది. ఇక గిల్ ఇప్పటికే టెస్టు జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసీస్- భారత్ మధ్య గురువారం జరిగే రెండో వన్డేకు అడిలైడ్ వేదిక.చదవండి: ‘నా వల్లే జట్టు ఓడింది.. ఓటమికి బాధ్యత నాదే.. తెలివిగా ఆడితే బాగుండేది’ -
పాకిస్తాన్ కెప్టెన్గా బాబర్ ఆజం..!?
పాకిస్తాన్ వన్డే కెప్టెన్సీలో మరోసారి మార్పు చోటుచేసుకోనుందా? మళ్లీ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం(Babar Azam) జట్టు పగ్గాలను చేపట్టనున్నాడా? అంటే అవునానే అంటున్నాయి పీసీబీ వర్గాలు. ప్రస్తుత వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్పై వేటు వేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది.రిజ్వాన్ నాయకత్వంలోని పాక్ జట్టు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లను సొంతం చేసుకున్నప్పటికి.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మాత్రం దారుణమైన ప్రదర్శన కనబరిచింది. వ్యక్తిగత ప్రదర్శనపరంగా కూడా అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని పీసీబీ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా జియో న్యూస్ ప్రకారం.. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ సెలక్టర్లు కొత్త వన్డే కెప్టెన్ కోసం ముగ్గురిని షార్ట్ లిస్టు చేసిందంట. అందులో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది, సల్మాన్ అలీ ఆఘా ఉన్నారు. అయితే వీరిలో బాబర్ ఆజం ముందుంజలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబర్ గత రెండేళ్లలో రెండు సార్లు పాకిస్తాన్ వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. వన్డే ప్రపంచకప్-2023లో పాక్ జట్టు దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న బాబర్.. ఆ తర్వాత మళ్లీ 2024 మార్చి జట్టు పగ్గాలను అతడు చేపట్టాడు. అయితే ఆరు నెలల తిరిగకుముందే మరోసారి కెప్టెన్సీని ఆజం వదులుకున్నాడు.ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పాక్ కెప్టెన్గా ఎంపికయ్యేందుకు ఈ స్టార్ బ్యాటర్ సిద్దమయ్యాడు. బాబర్ ప్రస్తుతం గడ్డు పరిస్థుతులను ఎదుర్కొంటున్నాడు. అతడు అంతర్జాతీయ సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు అవుతోంది. అంతేకాకుండా టీ20 జట్టు నుంచి కూడా సెలక్టర్లు అతడిని తప్పించారు. అయితే సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్కు అతడు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైనప్పటికి... కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హర్మన్.. మరో సీనియర్ ప్లేయర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. మొత్తంగా 70 బంతులు ఎదుర్కొన్న కౌర్.. 10 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. మంధానతో కలిసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపు బాట వేసింది. కానీ తర్వాత వచ్చిన బ్యాటర్లు చేతులెత్తేయండంతో భారత్ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.హర్మన్ సాధించిన రికార్డులు ఇవే..👉మహిళల ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్గా ఆమె నిలిచింది. ఆమె కెరీర్లో ఇది ఐదవ ప్రపంచకప్. ఇప్పటివరకు హర్మన్ 31 మ్యాచ్లలో 1017 పరుగులు సాధించింది. ఇందులో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫీట్ హర్మన్ కంటే మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సాధించింది. ఓవరాల్గా ఈ జాబితాలో హర్మన్ ఏడో స్దానంలో ఉంది.👉అదేవిధంగా మహిళల వన్డే వరల్డ్కప్లో నెంబర్ 4 లేదా అంతకంటే తక్కువ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి 1000 పరుగుల మైలురాయిని చేరిన తొలి ప్లేయర్గా ప్రపంచరికార్డు హర్మన్ నెలకొల్పింది.👉మహిళల వన్డేల్లో నాలుగో స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో (4289) అత్యధిక పరుగులు చేసిన జాబితాలో హర్మన్ప్రీత్ అగ్రస్థానంలో ఉంది. నాట్ స్కైవర్ 4205 పరుగులతో రెండవ స్థానంలో ఉంది.చదవండి: మా ఓటమికి కారణమదే.. చాలా బాధగా ఉంది: టీమిండియా కెప్టెన్ -
‘నా వల్లే జట్టు ఓడింది.. నేను కాస్త తెలివిగా ఆడాల్సింది’
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ODI World Cup 2025)లో భారత జట్టు మరో పరాజయం చవిచూసింది. స్వీయ తప్పిదాల కారణంగా ఇంగ్లండ్ మహిళా జట్టు (IND W vs ENG W)తో గెలవాల్సిన మ్యాచ్లో.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. తద్వారా సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.ఈ నేపథ్యంలో ఇండోర్ వేదికగా ఇంగ్లండ్ చేతిలో ఓటమిపై భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) స్పందించింది. తాను కాస్త తెలివిగా ఆడి ఉంటే మ్యాచ్ తప్పక గెలిచేవాళ్లమని పేర్కొంది. గెలవాల్సిన మ్యాచ్లో ఓడటానికి తాను ప్రధాన కారణమంటూ ఓటమికి బాధ్యత వహించింది. 88 పరుగులు చేసి..నిజానికి ఇంగ్లండ్తో మ్యాచ్లో స్మృతి అదరగొట్టింది. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 94 బంతులు ఎదుర్కొని 88 పరుగులు చేసి.. జట్టును విజయం దిశగా నడిపించింది. చేతిలో ఏడు వికెట్లు.. గెలుపునకు 53 బంతుల్లో 55 పరుగులు అవసరమైన వేళ అనూహ్య రీతిలో స్మృతి అవుటైంది.లిన్సే స్మిత్ బౌలింగ్లో లాంగాఫ్ మీదుగా షాట్ బాది అలిస్ కాప్సేకి క్యాచ్ ఇచ్చిన స్మృతి మంధాన.. పెవిలియన్కు చేరింది. ఇక కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా అద్బుత అర్ధ శతకం (70)తో రాణించింది. మరోవైపు.. దీప్తి శర్మ 50 పరుగులతో అదరగొట్టింది. కానీ స్మృతి అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.The skipper’s looking solid and locked on to the chase! 🤜🏻🤛🏻Will Harmanpreet Kaur turn this start into a big one and guide #TeamIndia through in this do-or-die clash? 😮💨Catch the LIVE action ➡https://t.co/WF0rXIHjl8#CWC25 👉 #INDvENG | LIVE NOW on Star Sports & JioHotstar pic.twitter.com/vTs7nP01Tb— Star Sports (@StarSportsIndia) October 19, 2025 ఇంగ్లండ్ విధించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 284 పరుగుల వద్ద నిలిచింది. దీంతో ఓటమి ఖరారైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం స్మృతి మంధాన తీవ్ర భావోద్వేగానికి లోనైంది.నా వల్లే జట్టు ఓడింది.. నేను కాస్త తెలివిగా ఆడాల్సింది‘‘అవును.. మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ప్రతి ఒక్కరు ఇది చూసే ఉంటారు. మా షాట్ సెలక్షన్లు మరింత మెరుగ్గా ఉండాల్సింది. ముఖ్యంగా నేను.. ఇంకాస్త తెలివిగా ప్రవర్తించాల్సింది. మా బ్యాటింగ్ ఆర్డర్ పతనం నాతోనే మొదలైంది. ఇందుకు నేను నైతిక బాధ్యత వహిస్తాను.నాదే బాధ్యతమేము ఓవర్కు కేవలం ఆరు పరుగులు చేసి ఉంటే గెలిచేవాళ్లం. కానీ పరిస్థితి మరోలా మారిపోయింది. ఏదేమైనా ఈ మ్యాచ్లో మా బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి నాదే బాధ్యత’’ అని స్మృతి మంధాన పేర్కొంది. కాగా తాజా వన్డే వరల్డ్కప్ టోర్నీలో భారత్కు ఇది హ్యాట్రిక్ ఓటమి.ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మహిళా జట్లు సెమీ ఫైనల్ చేరగా.. భారత్పై గెలుపుతో ఇంగ్లండ్ కూడా సెమీస్కు అర్హత సాధించింది. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్తో భారత్ పోటీ పడుతోంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
అతడిని ఎక్స్పోజ్ చేయండి.. దాచి పెడతారెందుకు?.. జస్సీ లేనపుడు..
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టును ప్రకటించిన నాటి నుంచి చర్చనీయాంశమైన పేరు హర్షిత్ రాణా (Harshit Rana). హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రియ శిష్యుడైన కారణంగానే అతడికి జట్టులో చోటు దక్కిందనే విమర్శలు వచ్చాయి. భారత మాజీ క్రికెటర్లు క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవిచంద్రన్ అశ్విన్ ప్రధానంగా ఈ విషయంపై వీడియోలు చేశారు.27 పరుగులు ఇచ్చిఅయితే, గంభీర్ కూడా వారికి అదే రీతిలో బదులిచ్చాడు. యూట్యూబ్ చానెళ్ల వ్యూస్ కోసం 23 ఏళ్ల కుర్రాడి భవిష్యత్తు నాశనం చేస్తారా? అంటూ మండిపడ్డాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో తొలి వన్డే (IND vs AUS 1st ODI) తుదిజట్టులోనూ హర్షిత్ రాణాకు స్థానం దక్కింది. ఈ రైటార్మ్ యువ పేసర్ కేవలం నాలుగు ఓవర్ల బౌలింగ్లోనే 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానంలో వచ్చి రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు హర్షిత్ రాణా. ఈ నేపథ్యంలో భారత-‘ఎ’ జట్టు మాజీ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ హర్షిత్కు మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇవ్వడాన్ని విమర్శించాడు.అతడిని ఎక్స్పోజ్ చేయండి.. దాచి పెడతారెందుకు?ఈ మేరకు.. ‘‘ఒకవేళ హర్షిత్ రాణాను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడానికే జట్టులోకి తీసుకుంటే.. అతడిని తనను తాను నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. ఎక్స్పోజ్ చేయండి. రెండేళ్ల పాటు ఆ పాత్రలో తనను కొనసాగించండి.అంతేగానీ.. అదనపు బ్యాటర్ను జట్టులోకి తీసుకుని హర్షిత్ను కాపాడటం ఎందుకు? జస్సీ లేనపుడు..ఆల్రౌండర్లు నితీశ్ రెడ్డి లేదంటే వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించాల్సింది. జస్సీ (జస్ప్రీత్ బుమ్రా) గైర్హాజరీలో.. అతడు లేని లోటు పూడుస్తూ కుల్దీప్ వికెట్లు తీసేవాడు కదా!’’ అని ప్రియాంక్ పాంచల్ సోషల్ మీడియా వేదికగా మేనేజ్మెంట్ తీరుపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా పంచుకున్నాడు.ఓటమితో మొదలుకాగా పెర్త్లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో గిల్ సేన తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులే చేసింది. డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఆసీస్ తమ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 21.1 ఓవర్లలో 131 పరుగులు చేసి జయభేరి మోగించింది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
మా ఓటమికి కారణమదే.. చాలా బాధగా ఉంది: టీమిండియా కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 289 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చివరి ఓవర్లలో తడబడిన భారత జట్టు.. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకుంది.ఇది భారత్కు వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్లను గెలిస్తేనే మన అమ్మాయిల జట్టు నేరుగా సెమీఫైనల్స్కు ఆర్హత సాధించనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్పందించింది. స్మృతి మంధాన వికెట్తో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు టర్న్ అయిందని హర్మన్ చెప్పుకొచ్చింది."గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది. స్మృతీ మంధాన వికెట్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు మేము గేమ్లో ఉన్నాము. ఈజీగా గెలుస్తామనుకున్నాము. మంధాన వికెట్ పడిన తర్వాతే మేము పట్టు కోల్పోయాము. కానీ ఇంగ్లండ్ బౌలర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాలి.వారు ఆఖరి వరకు అద్భుతంగా బౌలింగ్ చేసి మాపై ఒత్తడి పెంచారు. వరుస క్రమంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నారు. ఈ మ్యాచ్లో మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము. ప్రతీది మేము అనుకున్నట్లు సాగింది. కానీ చివరి ఐదు-ఆరు ఓవర్లలో విఫలమయ్యాము. నిజంగా మాకు ఇది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. గత కొంతకాలంగా మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగిస్తున్నాము. కానీ దురదృష్టవశాత్తూ ఓడిపోతున్నాము. మాకు తదుపరి మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి విజయం సాధిస్తాము అని ఆశిస్తున్నాను.ఈ మ్యాచ్లో బౌలర్లు కూడా మెరుగ్గా రాణించారు. నాట్ స్కీవర్, హీథర్ క్రీజులో ఉన్నప్పుడు ఇంగ్లండ్ భారీ స్కోర్ చేస్తుందని భావించాము. కానీ మా బౌలర్లు కమ్బ్యాక్ ఇచ్చి వారిని 300 పరుగులలోపు కట్టడి చేశారు. కానీ బౌలింగ్లో కూడా చివరి ఐదు ఓవర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నాము. మేము ఈ విషయంపై డ్రెస్సింగ్ రూమ్లో చర్చించుకుంటున్నాము. ఈ మ్యాచ్లో అదనపు బౌలర్తో ఆడాలనుకున్నాము. అందుకే జెమిమా స్దానంలో రేణుకాను ఆడించాలనుకున్నాము. స్మతి, నేనూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాము. ఆ తర్వాత రిచా, అమన్ జోత్, దీప్తి లాంటి ప్లేయరర్లు ఉండడంతో ఈజీగా గెలుస్తామనుకున్నాము. ఏదేమైనప్పటికి ఈరోజు అదృష్టం మా వైపు లేదు. తర్వాత మ్యాచ్లో తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం ఉంది అని హర్మన్ పేర్కొంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం (IND vs AUS 1st ODI) పాలైంది. ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు గుప్పించాడు.పెర్త్ వన్డేలో భారత తుదిజట్టు కూర్పు సరిగ్గా లేదని.. బ్యాటింగ్ డెప్త్ కోసం బౌలింగ్ విభాగాన్ని నీరుగార్చారని అశూ మండిపడ్డాడు. వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) ఆసీస్తో సిరీస్తో తన ప్రయాణం మొదలుపెట్టాడు. పెర్త్ స్టేడియంలో టాస్ ఓడిన భారత్.. ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది.రో- కో ఫెయిల్ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ 8, గిల్ 10 పరుగులు చేయగా.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) కూడా విఫలం కాగా.. అక్షర్ పటేల్ 31, కేఎల్ రాహుల్ 38 పరుగులతో రాణించి జట్టు పరువు కాపాడారు. ఆల్రౌండర్లలో వాషింగ్టన్ సుందర్(10), నితీశ్ కుమార్ రెడ్డి 19 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు.రాణించిన మిచెల్ మార్ష్వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టీమిండియా తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులే చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 21.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసి.. డీఎల్ఎస్ పద్ధతితో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్), జోష్ ఫిలిప్ (37), మ్యాట్ రెన్షా (21 నాటౌట్) రాణించారు.Just when #TeamIndia needed it most! @Sundarwashi5 breaks a crucial partnership. 👏#AUSvIND 👉 1st ODI | LIVE NOW 👉 https://t.co/FkZ5L4CrRl pic.twitter.com/6e1VZmbAjz— Star Sports (@StarSportsIndia) October 19, 2025 తేలిపోయిన భారత బౌలర్లువికెట్ తీయడానికి తిప్పలు పడ్డ భారత బౌలర్లలో పేసర్ అర్ష్దీప్ సింగ్, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం గురించి అశ్విన్ మాట్లాడుతూ.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయంలో మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు‘‘వాళ్లు కేవలం ఇద్దరు స్పిన్నర్లతోనే ఎందుకు ఆడారో నేను అర్థం చేసుకోగలను. పేస్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడించింది బ్యాటింగ్లో డెప్త్ కోసమే. ఇక స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయగలరు కాబట్టి నితీశ్ను వారికి జతచేశారు.కానీ ఇదేం పద్ధతి?అసలు మీరెందుకు బౌలింగ్పై దృష్టి పెట్టడం లేదు బాస్. ఇలాంటి పెద్ద మైదానాల్లో కాకపోతే కుల్దీప్ యాదవ్ ఇంకెక్కడ స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలడు? ఈ పిచ్పై బంతిని తిప్పుతూ అతడు బౌన్స్ కూడా రాబట్టగలడు.అత్యుత్తమ బౌలర్లను పక్కన పెడతారా?ఏమైనా అంటే.. బ్యాటింగ్ డెప్త్ అని మాట్లాడతారు. బ్యాటింగ్ ఆర్డర్ రాణించాలంటే... బ్యాటర్లే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కదా! పరుగులు రాబట్టడం బ్యాటర్ల పని. అదనపు బ్యాటర్ కోసం ఆల్రౌండర్లను దించి వారి పని మరింత సులువు చేయాల్సిన అవసరం ఏముంది? జట్టులో అత్యుత్తమ బౌలర్లను పక్కనపెట్టడం ఎంత వరకు సమంజసం?కేవలం బ్యాటింగ్ ఆర్డర్ను పొడిగించుకోవడానికి తుదిజట్టు కూర్పు విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి’’ అని అశ్విన్.. టీమిండియా యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆసీస్- భారత్ మధ్య గురువారం రెండో వన్డేకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అడిలైడ్ వేదిక.చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే? -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కేన్ మామ వచ్చేశాడు
స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు 14 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తిరిగొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత విలియమ్సన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు.ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో సెలక్టర్లు అతడికి అవకాశమిచ్చారు. అతడితో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ నాథన్ స్మిత్ కూడా పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టు కెప్టెన్గా ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ వ్యవహరించాడు. అదేవిధంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ గాయం కారణంగా దూరమయ్యాడు.లాథమ్తో పాటు మొహమ్మద్ అబ్బాస్ ఫిన్ అల్లెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, విల్ ఓ'రూర్కే , గ్లెన్ ఫిలిప్స్, బెన్ సియర్స్ గాయాల కారణంగా ఈ సిరీస్కు అందుబాటులో లేరు. టీ20ల్లో సత్తాచాటుతున్న జాక్ ఫాల్క్స్కు కివీస్ సెలక్టర్లు వన్డేలకు పిలుపునిచ్చారు.ప్రస్తుతం కివీస్ జట్టు ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడుతోంది. తొలి టీ20 వర్షర్పాణం కాగా.. రెండో టీ20 సోమవారం జరగనుంది. అక్టోబర్ 26 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే? -
సోదరా... రోహిత్కు పాప్కార్న్ ఇవ్వకు: అభిషేక్
భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే సందర్భంగా జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా మ్యాచ్కు పలుమార్లు అంతరాయం వాటిల్లగా... చివరకు 26 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది.అయితే మ్యాచ్కు పదేపదే వర్షం ఆటంకం కల్పించినప్పుడు ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్లో సేదతీరుతూ కనిపించారు. ఆ సమయంలో వ్యాఖ్యాతగా ఉన్న టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తన స్నేహితుడైన రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి పాప్కార్న్ తింటున్న రోహిత్ను చూస్తూ... ‘అరే భాయ్ ఉసే పాప్కార్న్ మత్ దే’ (సోదరా అతడికి పాప్కార్న్ ఇవ్వకు) అంటూ కామెంట్ చేశాడు.టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ... ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తున్న హిట్మ్యాన్... ఇటీవల ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వచ్చిన విరామంలో... ఏకంగా 11 కేజీల బరువు తగ్గాడు. దీనిపై మ్యాచ్కు ముందు అభిషేక్ మాట్లాడుతూ... ‘రోహిత్ పూర్తిగా మారిపోయాడు. మరింత ఫిట్గా, మరింత దృఢంగా మారాడు. ఫిట్నెస్ పెంపొందించుకుంటే... నైపుణ్యం దానంతటదే పెరుగుతుంది. ఈ విషయంలో రోహిత్ చాలా కష్టపడ్డాడు. ఇదంతా 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకునే కావచ్చు. అప్పటి వరకు ఆటలో కొనసాగాలంటే మొదట తన బరువు తగ్గించుకోవాలని రోహిత్ బలంగా అనుకున్నాడు. దాని వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇప్పుడతడు నవ యువకుడిలా కనిపిస్తున్నాడు’ అని అన్నాడు.చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే? -
ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే?
మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా అనుహ్యంగా 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓ దశలో సునయాసంగా గెలిచేలా కన్పించిన హర్మన్ సేన.. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు సెమీస్కు ఆర్హత సాధించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్లో అడుగు పెట్టగా.. మూడో జట్టుగా ఇంగ్లండ్ తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. మిగిలిన ఒక్క స్ధానం కోసం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ నెలకొంది.భారత్ సెమీస్ చేరాలంటే?ఇక ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం 4లో కొనసాగుతున్నప్పటికి.. సెమీస్ చేరాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన భారత్ కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.మన అమ్మాయిల జట్టు ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. అదేవిధంగా న్యూజిలాండ్ వద్ద కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే కివీస్(-0.245) కంటే భారత్(+0.526) రన్ రేటు మెరుగ్గా ఉండడంతో మూడో స్ధానంలో నిలిచింది. కాగా వరుసగా కివీస్ ఆడాల్సిన రెండు మ్యాచ్లు రద్దు అయ్యాయి.శ్రీలంక, పాకిస్తాన్లపై న్యూజిలాండ్ గెలవడం అంత కష్టమేమి కాదు. ఒకవేళ అదే జరిగింటే భారత్ సెమీస్ ఆశలు గల్లంతు అయ్యి ఉండేవి. భారత్కు, న్యూజిలాండ్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అక్టోబర్ 23న ముంబై వేదికగా కివీస్తో హర్మన్ సారథ్యంలోని భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా సెమీస్ భవితవ్యం దాదాపు తేలిపోతుంది. కివీస్పై భారత్ విజయం సాధిస్తే 6 పాయింట్లతో మెరుగైన స్థితికి చేరుకుంటుంది. అప్పుడు టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. బంగ్లాపై భారత్కే గెలిచే ఛాన్స్లు ఎక్కువ. కాబట్టి ఎటువంటి సమీకరణాలు లేకుండా మన జట్టు సెమీస్ చేరుతుంది. ఇక న్యూజిలాండ్ జట్టుకు కూడా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ కివీస్ చేతిలో భారత్ ఓటమి పాలైనప్పటికి నకౌట్కు అర్హత సాధించే అవకాశముంది. ఎలా అంటే న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడనుంది. ప్రస్తత పరిస్థితుల్లో ఇంగ్లండ్ను న్యూజిలాండ్ ఓడించడం అంత సులువు కాదు. అదే సమయంలో భారత్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించాలి. అప్పుడు ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయి.. బంగ్లాపై మనం ఘన విజయం సాధిస్తే పాయింట్ల పరంగా ఇరు జట్లు సమంగా నిలుస్తాయి. అప్పుడు మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ కివీస్ రెండు మ్యాచ్లు గెలిచిందంటే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించిక తప్పదు.చదవండి: టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్ -
ఆల్ ఫార్మాట్ రౌండర్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మెరుపులు మెరిపించి జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డ నితీశ్ కుమార్ రెడ్డి... ఏడాది తిరిగేలోపు జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. గతేడాది అక్టోబర్లో టీమిండియా తరఫున తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన నితీశ్ రెడ్డి... ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టాడు. ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ద్వారా సుదీర్ఘ ఫార్మాట్ బరిలోకి దిగిన ఈ ఆంధ్ర ఆల్రౌండర్... ఆ సిరీస్లో జరిగిన ఐదు మ్యాచ్ల్లోనూ ఆడాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చి ధాటిగా షాట్లు ఆడగల సత్తా... ఉపయుక్తమైన మీడియం పేస్ బౌలింగ్ అతడికి వరుసగా అవకాశాలు కల్పించింది. హార్దిక్ పాండ్యా టెస్టు ఫార్మాట్కు దూరం కావడంతో... సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు చాలా కాలంగా పేస్ ఆల్రౌండర్ కోసం నిరీక్షిస్తోంది. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకున్న నితీశ్ ఇప్పుడు తాజాగా వన్డే ఫార్మాట్లో సైతం అవకాశం దక్కించుకున్నాడు. పాండ్యా గైర్హాజరీలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన పోరులో ఆఖర్లో బ్యాటింగ్కు వచి్చన ఈ ఆల్రౌండర్ 11 బంతులెదుర్కొని 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా సాగకపోవడంతో అతడికి క్రీజులో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కలేదు. బౌలింగ్లో మాత్రం 2.1 ఓవర్లు వేసిన నితీశ్ 16 పరుగులిచ్చాడు. వికెట్ తీయలేకపోయాడు. టెస్టు అరంగేట్రం చేసిన చోటే... ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా పెర్త్ టెస్టు ద్వారానే తొలి టెస్టు ఆడిన 23 ఏళ్ల నితీశ్ రెడ్డి... మళ్లీ ఇప్పుడు అక్కడే వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో టాపార్డర్ మొత్తం విఫలమైన చోట... ధనాధన్ బ్యాటింగ్తో 41 పరుగులు చేసిన నితీశ్... రెండో ఇన్నింగ్స్లో అయితే ఏకంగా టి20 మ్యాచ్ ఆడాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో అజేయంగా 38 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిచెల్ స్టార్క్, జోష్ హాజల్వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ అతడు చూపిన తెగువ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో టీమ్ మేనేజ్మెంట్ సైతం నితీశ్కు విరివిగా అవకాశాలు ఇచి్చంది. వాటిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో జరిగిన పోరులో నితీశ్ వీరవిహారం చేశాడు. ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచి్చన అతను ఆసీస్ బౌలింగ్ను ఓ ఆటాడుకొని సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత మరో నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో పాటు... గాయాల బారిన పడి కాస్త వెనుకబడ్డాడు. అయితే క్లిష్టమైన విదేశీ పర్యటనల్లో సత్తాచాటిన నితీశ్పై సెలెక్టర్లు నమ్మకముంచారు. గాయం నుంచి కోలుకొని... ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన నితీశ్ జట్టుకు దూరమయ్యాడు. గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చాక అతడు పూర్తిగా మారిపోయాడు. సమయపాలన, క్రమశిక్షణ మొదటి నుంచే ఉన్న నితీశ్ రెడ్డి... వాటిని మరింత కఠినతరం చేశాడు. సరదాలు, షికార్లు పక్కనపెట్టి పూర్తిగా క్రికెట్పై దృష్టి పెట్టాడు. అదే సమయంలో తండ్రికి మోకాలి శస్త్రచికిత్స జరిగినా ఇంటికి వెళ్లకుండా పూర్తిగా సాధనకే పరిమితమయ్యాడు. విశాఖపట్నంలో ఉన్నన్ని రోజులు... జిమ్ లేదంటే మైదానంలోనే గడిపేవాడని అతడి తండ్రి ముత్యాల రెడ్డి పేర్కొన్నారు. అలా గంటల తరబడి శిక్షణ సాగిస్తూ మరింత రాటుదేలాడు. మోకాలి శస్త్రచికిత్స అనంతరం అతడి ఫిట్నెస్ మునుపటికంటే రెట్టింపు అయింది. అది ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో ప్రస్ఫుటమైంది. సూపర్ క్యాచ్ వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో నితీశ్ ఫర్వాలేదనిపించాడు. స్పిన్కు సహకరించే భారత పిచ్లపై పేస్ ఆల్రౌండర్గా ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం దక్కని ఆంధ్ర ప్లేయర్... బ్యాటింగ్లో రాణించాడు. వెస్టిండీస్తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో నితీశ్ పట్టిన క్యాచ్ చూస్తే... అతడి ఫిట్నెస్ స్థాయి ఏంటో అర్థమవుతుంది. స్క్యేర్ లెగ్లో విండీస్ బ్యాటర్ ఇచ్చిన క్యాచ్ను చిరుతలా దూకుతూ అందుకున్న తీరు చూసి తీరాల్సిందే. ప్రస్తుతం జట్టులో ఉన్న ఫిటెస్ట్ ప్లేయర్లలో అతడు ఒకడు అనడంలో సందేహం లేదు. యో–యో టెస్టు, బ్రంకో టెస్టుల్లో టీమిండియాలో అందరికంటే మెరుగైన స్కోరు నితీశ్ రెడ్డిదే అని సమాచారం. విండీస్తో టెస్టు సిరీస్లో ఎక్కువ బౌలింగ్ చేసే అవకాశం రాకున్నా... హెడ్ కోచ్ గంభీర్ మాత్రం నితీశ్పై నమ్మకముందని అతడికి అండగా ఉంటామని స్పష్టంచేశాడు. ‘నితీశ్ ఎన్ని ఓవర్లు వేశాడనేది ముఖ్యం కాదు. జట్టుతో ఉండటమే ప్రధానం. అది ఎంతో నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. 23 ఏళ్ల కుర్రాడిని కేవలం విదేశీ పిచ్లపైనే పరీక్షించాలనే ఆలోచన మాకు లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా స్వదేశంలో సైతం అతడికి చాన్స్లు ఇస్తాం. ప్రస్తుతం పేస్ ఆల్రౌండర్లు చాలా తక్కువ మంది అందుబాటులో ఉన్నారు. అందుకే నితీశ్కు అండగా ఉంటాం’ అని గంభీర్ అన్నాడు. వన్డే, టి20 ఫార్మాట్లలో హార్దిక్ పాండ్యా వంటి నిఖార్సైన పేస్ ఆల్రౌండర్ అందుబాటులో ఉండగా... టెస్టుల్లో ఆ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు... పరిమిత ఓవర్లలోనూ తనదైన ముద్ర వేయాలని నితీశ్ భావిస్తున్నాడు. -
ఆశలు రేపి... ఆఖర్లో కూల్చారు!
లక్ష్యఛేదనలో 253/4 స్కోరు వద్ద భారత్ 30 బంతుల్లో 36 పరుగుల సమీకరణమపుడు గెలుపే... భారత్వైపు తొంగిచూస్తోంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో హిట్టర్ రిచా ఘోష్, ఫిఫ్టీ చేసిన దీప్తిశర్మ అవుటవడంతోనే మహిళల జట్టు గెలుపునకు దూరమైంది. క్రీజులో ఉన్న అమన్జోత్, స్నేహ్రాణా సింగిల్స్కే పరిమితం కావడం... భారీ షాట్లు ఆడలేకపోవడంతో గెలుపు దారితప్పి ఓటమిబాట పట్టింది.ఇండోర్: ఇక గెలుపు ఖాయమేలే... విజయానికి చేరువయ్యామని అనుకుంటుండగా ఊహించని ఫలితం భారత శిబిరాన్ని ముంచేసింది. విజయం ఆశలు రేపిన మహిళలు ఆఖరికొచ్చేసరికి తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో గెలుపుదాకా వచ్చిన భారత్ 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇంగ్లండ్ అమ్మాయిల చేతిలో ఓడిపోయింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు వరుసగా మూడో మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించింది. అమీ జోన్స్ (68 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధశతకం చేసింది. దీప్తిశర్మ (4/51) ప్రత్యర్థి బ్యాటింగ్కు దెబ్బతీయగా, శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి ఓడింది. స్మృతి మంధానా (94 బంతుల్లో 88; 8 ఫోర్లు), కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ (70 బంతుల్లో 70; 10 ఫోర్లు), దీప్తిశర్మ (57 బంతుల్లో 50; 5 ఫోర్లు)ల అర్ధశతకాల మోత బూడిదలో పోసిన పన్నీరైంది. ప్రత్యర్థి బౌలర్లలో నాట్ సీవర్ బ్రంట్ 2 వికెట్లు తీసింది. కదంతొక్కిన హీథర్నైట్ ఓపెనర్ బ్యూమోంట్ (22) తక్కువ స్కోరుకే అవుటైనా... మరో ఓపెనర్ అమీ జోన్స్ ఫిఫ్టీతో, టాపార్డర్ బ్యాటర్ హీథర్నైట్ శతకంతో ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. కెపె్టన్ నాట్ సీవర్ బ్రంట్ (38; 4 ఫోర్లు), హీథర్నైట్ మూడో వికెట్కు 113 పరుగులు జోడించారు. దీప్తి శర్మ వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి స్కోరు మరింత పెరగకుండా చేసింది. 289 పరుగుల లక్ష్యఛేదనలో ప్రతీక (6) వికెట్ను కోల్పోయినప్పటికీ స్మృతి, హర్లీన్ (24), కెపె్టన్ హర్మన్, దీప్తిల రాణింపుతో విజయంవైపు అడుగులు వేసింది. అయితే 234 స్కోరు వద్ద మంధాన అవుటవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. రిచా, దీప్తిలు అవుటవడంతో పరాజయం ఖాయమైంది.స్కోరు వివరాలు ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: బ్యూమోంట్ (బి) దీప్తి 22; అమీ జోన్స్ (సి) మంధాన (బి) దీప్తి 56; హీథర్నైట్ (రనౌట్) 109; నాట్ సీవర్ (సి) హర్మన్ప్రీత్ (బి) శ్రీచరణి 38; సోఫియా (సి) దీప్తి (బి) శ్రీచరణి 15; ఎమా లంబ్ (సి) మంధాన (బి) దీప్తి 11; అలైస్ క్యాప్సీ (సి) హర్లీన్ (బి) దీప్తి 2; చార్లీ (నాటౌట్) 19; సోఫీ ఎకిల్స్టోన్ రనౌట్ 3; లిన్సే స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–73, 2–98, 3–211, 4–249, 5–254, 6–257, 7–276, 8–280. బౌలింగ్: రేణుక 8–0–37–0, క్రాంతి 8–0–46–0, స్నేహ్ రాణా 10–0–56–0, శ్రీచరణి 10–0–68–2, దీప్తిశర్మ 10–0–51–4, అమన్జోత్ 4–0–26–0. భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతీక (సి) అమీజోన్స్ (బి) లారెన్ బెల్ 6; స్మృతి (సి) క్యాప్సీ (బి) లిన్సే స్మిత్ 88; హర్లీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చార్లీ 24; హర్మన్ప్రీత్ (సి) ఎమా లంబ్ (బి) నాట్ సీవర్ 70; దీప్తి (సి) సోఫియా (బి) ఎకిల్స్టోన్ 50; రిచా (సి) హీథర్నైట్ (బి) నాట్ సీవర్ 8; అమన్జోత్ (నాటౌట్) 18; స్నేహ్ రాణా (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–13, 2–42, 3–167, 4–234, 5–256, 6–262. బౌలింగ్: లారెన్ బెల్ 9–0–52–1, లిన్సే స్మిత్ 10–0–40–1, నాట్ సీవర్ 8–0–47–2, చార్లీ డీన్ 10–0–67–1, సోఫీ ఎకిల్స్టోన్ 10–0–58–1, అలైస్ క్యాప్సీ 3–0–20–0. -
ఓడినా సంతృప్తిగా ఉన్నాం.. ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం గిల్
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు తొలి మ్యాచ్లోనే ఓటమి ఎదురైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో (India vs Australia) భారత్ 7 వికెట్ల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం) పరాజయంపాలైంది. వర్షం అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31), ఆఖర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్; 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించి టీమిండియా పరువు కాపాడారు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత) రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా గిల్ తొలి మ్యాచ్లోనే (10) నిరాశపరిచాడు. ఓవర్ హైప్ మధ్య శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా భారత్ పవర్ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయి ఆదిలోనే మ్యాచ్పై పట్టు కోల్పోయింది.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగలిగింది.అనంతరం డక్వర్త్ లూయిస్ పద్దతిన కుదించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లో రెండో వన్డే అడిలైడ్ వేదికగా అక్టోబర్ 23న జరుగనుంది.గిల్ ఆసక్తికర వ్యాఖ్యలుమ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "పవర్ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పుడు, ఆట మొత్తం క్యాచ్-అప్ గేమ్గా మారుతుంది. ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకున్నాం. కొన్ని పాజిటివ్లు కూడా ఉన్నాయి. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లాం. దానికి సంతృప్తిగా ఉన్నాం" అని అన్నాడు.అభిమానుల మద్దతుపై కూడా గిల్ స్పందించాడు. "అభిమానులు భారీగా వచ్చారు. మేము అదృష్టవంతులం. అడిలైడ్లో కూడా మాకు ఇలాగే మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం" అని అన్నాడు.కాగా, గిల్ తన వన్డే కెప్టెన్సీ కెరీర్ను ఓటమితో ప్రారంభించాడు. తద్వారా విరాట్ కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్లో ఓటమిని ఎదుర్కొన్న భారత కెప్టెన్గా నిలిచాడు. ఈ ఓటమితో టీమిండియా జైత్రయాత్రకు కూడా బ్రేక్ పడింది. ఈ ఏడాది ఎనిమిది వరుస విజయాల తర్వాత (వన్డేల్లో) భారత్కు ఇది తొలి పరాజయం. చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. తొలి భారత ప్లేయర్ -
CWC 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (Deepthi Sharma) వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. 2000 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన ఫీట్ను నమోదు చేసిన నాలుగో క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది.వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) భాగంగా ఇండోర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో (India vs England) ఈ గ్రాండ్ డబుల్ను సాధించింది. ఈ మ్యాచ్లో దీప్తి మొత్తం 4 వికెట్లు తీసి తన వన్డే వికెట్ల సంఖ్యను 153కి పెంచుకుంది. బ్యాటింగ్లో దీప్తి 2607 పరుగులు చేసింది.దీప్తికి ముందు స్టెఫనీ టేలర్ (వెస్టిండీస్, 5873 పరుగులు, 155 వికెట్లు), ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా , 4414, 166), మారిజన్ కాప్ (దక్షిణాఫ్రికా, 3397, 172) మాత్రమే వన్డేల్లో 2500 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన ఆల్రౌండర్లుగా ఉన్నారు.దీప్తి ప్రభంజనంప్రస్తుత వన్డే ప్రపంచకప్లో దీప్తి ప్రభంజనం కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో ఆమె ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి లీడింగ్ వికెట్టేకర్గా కొనసాగుతోంది. టోర్నీ ఓపెనర్లో శ్రీలంకపై హాఫ్ సెంచరీ సహా 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. దీప్తి శర్మ (10-0-51-4) బంతితో రాణించినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. హీథర్ నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది.మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మతో పాటు శ్రీ చరణి (10-0-68-2) మాత్రమే వికెట్లు తీసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42 పరుగులకే ప్రతిక రావల్ (6), హర్లీన్ డియోల్ (24) వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతుంది. స్మృతి మంధన (34), కెప్టెన్ హర్మన్ (33) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 19.1 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 100/2గా ఉంది. చదవండి: టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్ -
మళ్లీ శతక్కొట్టిన సీవీ ఆనంద్
తెలంగాణ హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి, హైదరాబాద్ నగర మాజీ పోలీస్ కమిషర్ సీవీ ఆనంద్ మంచి క్రికెటర్ అన్న విషయం మనలో చాలామందికి తెలీకపోవచ్చు.సీవీ ఆనంద్ అండర్-19 క్రికెట్లో భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. అలాగే అండర్-19, 22 విభాగాల్లో హైదరాబాద్ జట్టుకు కూడా ఆడారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో చాలా టోర్నీల్లో పాల్గొన్నారు.ఇండియన్ పోలీస్ సర్వీసెస్కు ఎంపిక కావడంతో సీవీ ఆనంద్ క్రికెటింగ్ కెరీర్కు బ్రేక్ పడింది. అయినా వీలు చిక్కినప్పుడల్లా క్రికెట్ ఆడుతుంటారు.తాజాగా సీవీ ఆనంద్ హెచ్సీఏ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్షిప్లో సికింద్రబాద్ క్లబ్కు ఆడుతూ మెరుపు సెంచరీ చేశారు. వారం రోజుల వ్యవధిలో అతనికి ఇది రెండో సెంచరీ.గత ఆదివారం బేగంపేటలో హెచ్పీఎస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 89 బంతుల్లో 111 పరుగులు చేసిన ఆనంద్.. తాజాగా సికింద్రబాద్ క్లబ్లో తారకరామ జట్టుతో జరిగిన మ్యాచ్లో 94 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశారు.ఈ మ్యాచ్లో సికింద్రబాద్ క్లబ్ జట్టు 36 పరుగుల తేడాతో తారకరామ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సికింద్రబాద్.. సీవీ ఆనంద్ శతక్కొట్టడంతో 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరగులు చేసింది. ఛేదనకు దిగిన తారకరామ జట్టు 34.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. -
శతక్కొట్టిన హీథర్ నైట్.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 19) భారత్, ఇంగ్లండ్ జట్లు (india vs England) తలపడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. వన్ డౌన్ బ్యాటర్ హీథర్ నైట్ (Heather Knight) (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది. మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టగా.. శ్రీ చరణి 2 వికెట్లు తీసింది.ప్రస్తుత ప్రపంచకప్లో హీథర్ నైట్ చేసిన సెంచరీ ఎనిదవది. ఆమె తన 300వ అంతర్జాతీయ మ్యాచ్లో మూడంకెల మార్కును చేరుకుంది. హీథర్కు ముందు ప్రస్తుత ప్రపంచకప్లో అలైస్సా హీలీ 2 సెంచరీలు, సోఫీ డివైన్, నాట్ సీవర్ బ్రంట్, ఆష్లే గార్డ్నర్, తజ్మిన్ బ్రిట్స్, బెత్ మూనీ తలో సెంచరీలు చేశాడు.కాగా, ప్రస్తుత ఎడిషన్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్కు అర్హత సాధించాయి. భారత్తో మ్యాచ్లో గెలిస్తే ఇంగ్లండ్ కూడా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే విషయంలో భారత్కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. భారత్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో రెండింట ఓడి నాలుగో స్థానంలో ఉంది. చదవండి: బ్యాటర్ల వైఫల్యం.. ఆసీస్ చేతిలో చిత్తైన టీమిండియా -
టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్
వన్డే క్రికెట్లో టీమిండియా (Team India) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా 8 మ్యాచ్ల్లో గెలిచిన భారత జట్టు.. శుభ్మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో తొలి పరాజయాన్ని ఎదుర్కొంది.పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో (India vs Australia) భారత్ 7 వికెట్ల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) ఓటమిపాలైంది. వన్డేల్లో దాదాపుగా రెండేళ్ల తర్వాత భారత్కు ఇది తొలి పరాజయం. భారత్ చివరిగా 2023 డిసెంబర్ 19న సౌతాఫ్రికా చేతిలో ఓడింది.లేట్గా పలకరించిన పరాజయంఈ ఏడాది వన్డేల్లో భారత్ను పరాజయం చాలా లేట్గా పలకరించింది. 1991 తర్వాత ఓ ఏడాది అత్యంత లేట్గా పలకరించిన పరాజయం ఇది. నాడు భారత్కు తొలి వన్డే పరాజయం అక్టోబర్ 23న ఎదురైంది.టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ వేసిన గిల్వన్డేల్టో టీమిండియా జైత్రయాత్రకు శుభ్మన్ గిల్ బ్రేక్లు వేశాడు. భారత వన్డే జట్టుకు రెగ్యులర్ కెప్టెన్గా గిల్ తన ప్రయాణాన్ని ఓటమితో ప్రారంభించాడు.కోహ్లి సరసన గిల్ఈ ఓటమితో గిల్ మరో అప్రతిష్టను కూడా మూటగట్టుకున్నాడు. విరాట్ కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్లో ఓటమిపాలైన భారత కెప్టెన్గా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పెర్త్లో కొత్తగా నిర్మించిన ఓపస్ స్టేడియంలో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వర్షం అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 136 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్) ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (38) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ (10) కూడా తొలి మ్యాచ్లో నిరాశపరిచాడు.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: Test Twenty: క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం -
బ్యాటర్ల వైఫల్యం.. ఆసీస్ చేతిలో చిత్తైన టీమిండియా
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా (Team India) ఓటమితో ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో (India vs Australia) 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి ఆటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.వరుణుడి ఆటంకాలు.. 26 ఓవర్ల మ్యాచ్పలు అంతరాయాల తర్వాత మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆదుకున్న రాహుల్, అక్షర్.. నితీశ్ మెరుపులువికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.దారుణంగా విఫలమైన రోహిత్, కోహ్లినాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. సత్తా చాటిన ఆసీస్ బౌలర్లుఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.సునాయాసంగా ఛేదించిన ఆసీస్26 ఓవర్లలో భారత్ 136 పరుగులు చేసినప్పటికీ.. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు.ఈ సిరీస్లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: Test Twenty: క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం -
క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం
క్రికెట్కు సరికొత్త ఫార్మాట్ పరిచయం కాబోతుంది. టెస్ట్, టీ20ల కలబోతతో ఈ ఫార్మాట్కు టెస్ట్ ట్వంటీగా (Test Twenty) నామకరణం చేశారు. ఈ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్ వ్యూహాత్మకతను, టీ20ల వేగాన్ని కలిపిన హైబ్రిడ్ ఫార్మాట్గా ఉండబోతుంది.దీని తొలి ఎడిషన్ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఈ ఫార్మాట్కు దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, మాథ్యూ హేడెన్, హర్భజన్ సింగ్, సర్ క్లైవ్ లాయిడ్ మద్దతిచ్చారు. యువ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్ పట్ల ఆసక్తి పెంచడమే లక్ష్యంగా ఈ ఫార్మాట్ను కనిపెట్టినట్లు నిర్వహకులు తెలిపారు. క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా మార్చడమే ఉద్దేశమని వారు పేర్కొన్నారు.టెస్ట్ ట్వంటీ నియమాలు.. ఈ ఫార్మాట్లో మ్యాచ్లు ఒకే రోజులో పూర్తవుతాయి. మ్యాచ్ మొత్తం 80 ఓవర్ల పాటు జరుగుతుంది. టెస్ట్ల తరహాలో రెండు ఇన్నింగ్స్లు ఉంటాయి. ఒక్కో ఇన్నింగ్స్లో ఒక్కో జట్టు 20 ఓవర్లు ఆడుతుంది. టెస్ట్ల తరహాలో స్కోర్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. రెండు ఇన్నింగ్స్ల స్కోర్లు కలిపి ఫలితం నిర్ణయించబడుతుంది.ఫలితాలు విజయం, ఓటమి, టై, డ్రాగా ఉంటాయి.డ్రా అయితే చివరి బంతి వరకు 5 వికెట్లు మిగిలి ఉండాలి.డ్రా అయితే సూపర్ ఓవర్ కూడా ఉంటుంది.ప్రతి మ్యాచ్కు ఒక్క పవర్ ప్లే ఉంటుంది.ఇందులో 4 ఓవర్లు మాత్రమే ఉంటాయి.పవర్ ప్లేను కెప్టెన్ ఎంచుకుంటాడు.మొదటి ఇన్నింగ్స్లో తీసుకుంటాడా లేదా రెండో ఇన్నింగ్స్లో తీసకుంటాడా అన్నది అతని ఛాయిస్. పవర్ ప్లేలో ఫీల్డింగ్ పరిమితులు ఉంటాయి.30-యార్డ్ సర్కిల్ వెలుపల కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు.ఈ ఫార్మాట్లో ఫాలో ఆన్ నిబంధన కూడా ఉంటుంది. కనీసం 75 పరుగుల వెనకబడితేనే ఫాలో ఆన్ అమల్లోకి వస్తుంది.ఈ ఫార్మాట్లో అర్లీ కొలాప్స్ క్లాజ్ (early collapse clause) అనే సరికొత్త నిబంధన ఉండనుంది. ఈ నబంధన ప్రకారం ప్రత్యర్థిని 10 ఓవర్లలోపు ఆలౌట్ చేస్తే, వారికి అదనంగా 3 ఓవర్లు పొందే అవకాశం ఉంటుంది.ఈ ఫార్మాట్లో మ్యాచ్లో ఐదుగురు మాత్రమే బౌలింగ్ చేయాలి.ఒక్కో బౌలర్ గరిష్టంగా 8 ఓవర్లు వేయవచ్చు.ఆరు ఫ్రాంచైజీలు..ఈ ఫార్మాట్ తొలి ఎడిషన్కు ఆరు ఫ్రాంచైజీలు ఖరారైనట్లు తెలుస్తుంది. దుబాయ్, లండన్, అమెరికా దేశాల నుంచి తలో ఫ్రాంచైజీ.. భారత్ నుంచి మూడు ఫ్రాంచైజీలు ఉండనున్నట్లు సమాచారం. ఒక్కో ఫ్రాంచైజీలో 16 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇందులో ఎనిమిది మంది భారతీయులు, ఎనిమిది మంది అంతర్జాతీయ ఆటగాళ్లకు అవకాశం ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే ఆటగాళ్లు అక్టోబర్ 16 నుంచి వారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. చదవండి: విరాట్ కోహ్లి డకౌట్.. చరిత్రలో తొలిసారి..! -
విరాట్ కోహ్లి డకౌట్.. చరిత్రలో తొలిసారి..!
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 19) జరుగుతున్న తొలి వన్డేలో (India Vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) డకౌటయ్యాడు. 8 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. తొలి బంతి నుంచే ఇబ్బంది పడిన కోహ్లి.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కూపర్ కొన్నోలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో కోహ్లికి ఇది తొలి డకౌట్.ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 29 మ్యాచ్లు ఆడిన కోహ్లి ఐదు సెంచరీలు, 51కు పైగా సగటుతో పరుగులు చేశాడు. కానీ ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. చాలా విరామం తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన కోహ్లి డకౌట్ కావడంతో అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.ఓవరాల్గా కోహ్లికి వన్డేల్లో ఇది 17వ డకౌట్. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక డకౌట్లైన రికార్డు సచిన్ టెండూల్కర్ (20) పేరిట ఉంది. ఓవరాల్గా ఈ రికార్డు సనత్ జయసూర్య (34) ఖాతాలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, భారత జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్, అనంతరం 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs AUS: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోని సరసన -
రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోనిల సరసన
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్ల మైలు రాయిని అందుకున్నాడు. ఆదివారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా రోహిత్ ఈ ఫీట్ను నమోదు చేశాడు. ఈ ఫీట్ అందుకున్న ఐదో భారత క్రికెటర్గా హిట్మ్యాన్ నిలిచాడు.ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని లు ఉన్నారు. 38 ఏళ్ల రోహిత్ భారత తరపున ఇప్పటివరకు 274 వన్డేలు, 67 టెస్టులు,159 టీ20లు ఆడాడు. గత ఏడాది జూన్లో టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. నాలుగు నెలల కింద టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. ఈ ముంబైకర్ ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్లో 19,708 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 264(వన్డేల్లో)గా ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం తర్వాత రోహిత్ భారత్ తరపున ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.500 పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన టీమిండియా ప్లేయర్స్ వీరే👉 సచిన్ టెండూల్కర్ – 664 మ్యాచ్లు👉విరాట్ కోహ్లి – 551 మ్యాచ్లు👉ఎంఎస్ ధోని – 535 మ్యాచ్లు👉 రాహుల్ ద్రవిడ్ – 504 మ్యాచ్లు👉రోహిత్ శర్మ – 500 మ్యాచ్లుచదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు -
న్యూజిలాండ్, ఇంగ్లండ్ తొలి టీ20 రద్దు
న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరు భారీ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టు... నిర్ణీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.సామ్ కరన్ (35 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అతడు రెండు ఫోర్లు, ఒక సిక్స్తో మొత్తం 19 పరుగులు రాబట్టడంతో ఇంగ్లండ్ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. జోస్ బట్లర్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (20; 1 ఫోర్, 2 సిక్స్లు) తలా కొన్ని పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, కైల్ జెమీసన్, మిచెల్ సాంట్నర్, జేమ్స్ నీషమ్, బ్రాస్వెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు భారీ వర్షం ముంచెత్తింది. ఎంతసేపటికీ తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు పలుమార్లు పరీక్షించిన అనంతరం మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య సోమవారం ఇక్కడే రెండో టి20 జరగనుంది. -
చెత్త షాట్ ఆడి ఔట్.. కట్ చేస్తే! పాప్ కార్న్ తింటూ రిలాక్స్(వీడియో)
టీమిండియా టెస్టు కెప్టెన్సీని అద్బుతమైన సెంచరీతో ఆరంభించిన శుభ్మన్ గిల్.. వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. భారత వన్డే సారథిగా తొలి మ్యాచ్లో గిల్ విఫలమయ్యాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో గిల్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఔటైన సమయంలో బాధ్యతయతంగా ఆడాల్సిన గిల్.. పేలవ షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. భారత ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన నాథన్ ఈల్లీస్.. తొలి బంతిని గిల్కు లైగ్ సైడ్ డెలివరీగా సంధించాడు. బౌలర్ ట్రాప్లో పడ్డ గిల్ ఆ డెలివరీని డౌన్ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో వికెట్ కీపర్ ఫిలిప్ తన ఎడమ వైపునకు డైవ్ చేస్తూ క్యాచ్ను అందుకున్నాడు. అయితే గిల్ ఔటయ్యాక మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన గిల్.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి పాప్ కార్న్ తింటూ రిలాక్స్గా కన్పించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కొంచెం బాధ లేకుండా పాప్ కార్న్ తింటూ రిలాక్స్ అవుతున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 48 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం కారణంగా మ్యాచ్ను 32 ఓవర్లకు కుదించారు. ఇంకా 17 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లి(0), శ్రేయస్ అయ్యర్(11) తీవ్ర నిరాశపరిచారు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు😭😭 #RohitSharma𓃵 #ShubmanGillpic.twitter.com/DCNj5q3Spu— 𝓗𝓲𝓽𝓶𝓪𝓷 (@Slefless45) October 19, 2025 -
చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు
టీమిండియా యువ ఆల్రౌండర్, ఆంధ్ర స్టార్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఇకపై ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా కొనసాగనున్నాడు. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లలో భారత్కు వహిస్తున్న నితీశ్ .. తాజాగా వన్డేల్లోకి కూడా అడుగుపెట్టాడు.పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా నితీశ్ భారత్ తరపున 50 ఓవర్ల క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తేడాది నవంబర్ 22వ తేదీ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టెస్ట్ డెబ్యూ క్యాప్ అందుకున్న ఈ తెలుగు కుర్రాడు.. ఇప్పుడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదగా వన్డే క్యాప్ను తీసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన నితీశ్..93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో పెర్త్ వేదికగా టెస్ట్, వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 1932 నుంచి భారత్ క్రికెట్ ఆడుతున్నప్పటికి ఎవరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు. 2024/25 బోర్డర్-గవాస్కర్ సిరీస్లో పెర్త్ వేదికగా టెస్టుల్లో డెబ్యూ చేసిన నితీశ్.. యాదృఛ్చికంగా ఏడాది తర్వాత అదే మైదానంలో వన్డే అరంగేట్రం చేశాడు.ఇంతకముందు పెర్త్ వేదికగా బరిందర్ శ్రణ్, సుబ్రోతో బెనర్జీలు భారత్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేయగా.. హర్షిత్ రాణా, వినయ్ కుమార్లు టెస్టుల్లో అరంగేట్రం చేశారు. కానీ నితీష్ ఒక్కడే రెండు వైట్ బాల్ ఫార్మాట్లలోనూ పెర్త్లో డెబ్యూ చేశాడు.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. 37 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), కోహ్లి(0), గిల్(10) తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్ వుడ్, ఈల్లీస్ తలా వికెట్ సాధించారు. అయితే వర్షం కారణంగా ఆట ఆగిపోయింది.చదవండి: Virat Kohli: రీ ఎంట్రీలో అట్టర్ ప్లాప్.. విరాట్ కోహ్లి డకౌట్! ఇలా అయితే కష్టమే? -
డబుల్ సెంచరీతో చెలరేగిన రాహుల్
అనంతపురం కార్పొరేషన్: ఆంధ్ర ఆటగాడు ఎస్వీ రాహుల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. వికెట్ కీపర్ ఎస్డీఎన్వీ ప్రసాద్ మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 630/6 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఢిల్లీ జట్టు ఆటముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి ఎదురీదుతోంది. వివరాలిలా ఉన్నాయి. సీకే నాయుడు ట్రోఫీ అండర్–23లో భాగంగా శనివారం అనంత క్రీడా గ్రామంలో మూడో రోజు ఓవర్నైట్ స్కోర్ 470/4తో ప్రారంభించిన ఆంధ్ర జట్టు స్కోర్ వేగాన్ని చకచకా పెంచింది.ఎస్వీ రాహుల్, వికెట్ కీపర్ ప్రసాద్లు ఢిల్లీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. అవకాశం దొరికినప్పుడుల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో ఎస్వీ రాహుల్ 386 బంతుల్లో 18 ఫోర్లు, 2 భారీ సిక్సర్ల సహాయంతో 203 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మరో బ్యాటర్ ప్రసాద్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 91 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 94 పరుగులు చేశాడు. రాహుల్, ప్రసాద్లు ఆరో వికెట్కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఢిల్లీ బౌలర్లలో దేవ్ లక్ర, మన్నన్ భరద్వాజ్, యుగల్ షైనీ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.ఢిల్లీ 200/5 ఆంధ్ర బౌలర్ల ధాటికి ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆటముగిసే సమయానికి 63 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. జట్టులో ఆల్రౌండర్ దేవ్ లక్ర 91 పరుగుల(13 ఫోర్లు, 2 సిక్సర్లు)తో నాటౌట్గా నిలిచాడు. యుగల్ షైనీ 44 పరుగులు చేశాడు. ఆంధ్ర బౌలర్ ఆదిత్యరెడ్డి 3/39 వికెట్లు తీసుకుని ఢిల్లీని కట్టడి చేశాడు. -
రీ ఎంట్రీలో అట్టర్ ప్లాప్.. విరాట్ కోహ్లి డకౌట్! ఇలా అయితే కష్టమే?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తన రీ ఎంట్రీ మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆతృతగా ఎదురు చూసిన అభిమానులను కింగ్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ డకౌటయ్యాడు. 8 బంతులు ఆడిన కోహ్లి తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.కెప్టెన్ రోహిత్ శర్మ త్వరగా ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్ను చక్కదిద్దుతాడని అంతా భావించారు. కానీ ఈ ఢిల్లీ ఆటగాడు అందరి అంచనాలను తారుమారు చేశాడు. తను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే అతడు ఇబ్బంది పడుతూ కన్పించాడు. వరుసుగా ఏడు బంతుల్లో సింగిల్ రన్ కూడా రాకపోవడంతో విరాట్పై ఒత్తడి పెరిగింది. ఈ క్రమంలో 7 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ తొలి బంతిని ఆఫ్ స్టంప్కు వెలుపుల లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని కోహ్లి డ్రైవ్ ఆడాలని ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బ్యాక్వర్డ్ పాయింట్లో కూపర్ కొన్నోలీ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. దీంతో కోహ్లి డకౌట్గా మైదానాన్ని వీడాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో కోహ్లి డకౌట్ కావడం ఇదే తొలిసారి.అయితే వన్డే ప్రపంచకప్-2027లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్ కోహ్లి.. ఈ తరహా ప్రదర్శనలు కనబరిస్తే భారత జట్టులో చోటు గల్లంతే అని చెప్పుకోవాలి. ఫిట్నెస్ పరంగా అతడికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ వరల్డ్కప్ టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో అప్పటివరకు అతడు ఫామ్ ఎలా ఉంటుందన్నది ప్రశ్నర్థకంగా మారింది. మరోవైపు యువ ఆటగాళ్ల నుంచి కోహ్లి తీవ్ర పోటీ ఎదురు అవుతోంది. దీంతో కనీసం మిగిలిన రెండు వన్డేల్లోనైనా అతడు సత్తాచాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తన రీఎంట్రీలో నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.చదవండి: IND vs AUS: ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు..? ఎన్నో ఆశలు పెట్టుకున్నాముగాMitchell Starc gets Virat Kohli. pic.twitter.com/zsdEltOHRe— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2025 -
ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు..? ఎన్నో ఆశలు పెట్టుకున్నాముగా
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit sharma) తన పునరాగమనంలో తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.7 నెలల తర్వాత భారత జట్టులోకి హిట్మ్యాన్పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.కానీ అందరి ఆశలను ఈ మాజీ కెప్టెన్ ఆడియశలు చేశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడానికి రోహిత్ ఇబ్బంది పడ్డాడు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్లు బౌన్సర్లతో రోహిత్ను భయపెట్టారు.భారత్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన హేజిల్వుడ్ బౌలింగ్లో రోహిత్ స్లిప్స్లో దొరికిపోయాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని హేజిల్వుడ్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బౌన్స్ ఎక్కువగా ఉండడంతో ఆ బంతిని రోహిత్ ఆడకుండా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ బంతిని ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్లో ఉన్న మాట్ రెన్షా చేతికి వెళ్లింది. దీంతో 14 బంతులు ఆడి కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ.. మైదానం వీడాల్సి వచ్చింది. పెర్త్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్ శర్మ.. ఈ విధంగా ఔట్ అవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు అని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కాగా ఆసీస్ పర్యటనకు ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్దానంలో శుభ్మన్ గిల్కు జట్టు పగ్గాలను అప్పగించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్కు భారత్ తరపున ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్చదవండి: కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్రతిమాలుకున్న పాకిస్తాన్ -
పాక్, కివీస్ మ్యాచ్ వర్షార్పణం.. సెమీఫైనల్లో సౌతాఫ్రికా
మహిళల వన్డే ప్రపంచకప్లో కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లను వరుణుడు వీడటం లేదు. వాన కారణంగా ఇప్పటికే ఇక్కడ మూడు మ్యాచ్లు రద్దు కాగా... ఇప్పుడు ఆ జాబితాలో మరో మ్యాచ్ చేరింది. శనివారం కొలంబో వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన పోరు భారీ వర్షం కారణంగా రద్దు అయింది.దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్కు అర్హత సాధించింది. ఇప్పటికే ఆ్రస్టేలియా సెమీస్ చేరగా... ఇప్పడు సఫారీ జట్టు రెండో బెర్త్ దక్కించుకుంది. ఇక మిగిలిన రెండు స్థానాలు తేలాల్సి ఉంది. శనివారం పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టు 25 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఆలియా రియాజ్ (52 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), మునీబా అలీ (22; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. లీ తహూహు 2 వికెట్లు పడగొట్టింది. ఈ దశలో మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించగా... సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వర్షం కాస్త తెరిపినివ్వగా... మ్యాచ్ను 36 ఓవర్లకు కుదించారు. అయితే మరోసారి వర్షం ముంచెత్తడంతో... మ్యాచ్ను నిలిపి వేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.చదవండి: కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్రతిమాలుకున్న పాకిస్తాన్ -
ఆసీస్తో తొలి వన్డే.. టీమిండియా ఓటమి
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.వికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.అనంతరం డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్7.5వ ఓవర్- 44 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో మాథ్యూ షార్ట్ (8) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్26 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అయితే డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఛేదనను ఆసీస్ ఘనంగా ప్రారంభించింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో హెడ్ రెండు బౌండరీలు బాదాడు. అయితే రెండో ఓవర్లో ఆసీస్కు షాక్ తగిలింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్లో హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి హెడ్ (8) ఔటయ్యాడు. స్వల్ప స్కోర్కే పరిమితమైన భారత్పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా19.6వ ఓవర్- 84 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కుహ్నేమన్ బౌలింగ్లో రెన్షాకు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ (310 ఔటయ్యాడు. రాహుల్కు (17) జతగా వాషింగ్టన్ సుందర్ క్రీజ్లోకి వచ్చాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 26 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. భారత్ నాలుగో వికెట్ డౌన్..శ్రేయస్ అయ్యర్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన అయ్యర్.. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(10), కేఎల్ రాహుల్(0) ఉన్నారు. మరి కాసేపట్లో ఆట మొదలుమరో 10 నిమిషాల్లో ఆట తిరిగి ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ను వర్షం కారణంగా 35 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.మరోసారి వర్షం అడ్డంకి..పెర్త్ వన్డేకు వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. భారత్ స్కోర్ 37/3 వద్ద ఉండగా.. వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు.11 ఓవర్లకు భారత్ స్కోర్: 35/311 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(6), శ్రేయస్ అయ్యర్(6) ఉన్నారు.వర్షం అటంకి..తొలి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఆట నిలిచే పోయే సమయానికి భారత్ స్కోర్: 25/3.కెప్టెన్ గిల్ ఔట్.. భారత్కు వరుస షాక్లు తగిలాయి. కెప్టెన్ గిల్ ఔట్. ఇన్నింగ్స్లో 10 పరుగులు చేసిన గిల్.. ఇల్లీస్ బౌలింగ్లో ఔటయ్యాడు. కింగ్ కోహ్లీ ఔట్..భారత్ మరో షాక్ తగిలింది. రోహిత్ బాటలోనే కింగ్ కోహ్లీ కూడా వెనుదిరిగాడు. స్టార్క్ బౌలింగ్లో కోహ్లీ.. క్యాచ్ అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఔట్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 14/1ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు..3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా13 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్(5), రోహిత్ శర్మ(8) ఉన్నారు.బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్..పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ తరపున నితీశ్ కుమార్ రెడ్డి వన్డే అరంగేట్రం చేశాడు. అదేవిధంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు ఆల్రౌండర్లతో టీమిండియాకు బరిలోకి దిగింది.మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లు ఫాస్ట్ బౌలర్లగా చోటు దక్కించుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. అయితే స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు చోటు దక్కలేదు.రోహిత్, విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఆసీస్ తరపున ఇద్దరు ఆటగాళ్లు డెబ్యూ చేశారు. మాట్ రెన్షా, మిచెల్ ఓవెన్లకు వన్డే క్యాప్లను అందించారు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్ -
కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్రతిమాలుకున్న పాకిస్తాన్
శ్రీలంక-పాకిస్తాన్తో జరగనున్న టీ20 ట్రై సిరీస్ నుంచి అఫ్గానిస్తాన్ వైదొలిగిన సంగతి తెలిసిందే. తమ దేశంపై పాకిస్తాన్ సైన్యం చేసిన వైమానిక దాడిని ఖండిస్తూ అఫ్గన్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్లోని అర్గున్, బర్మల్ జిల్లాలపై పాక్ సైన్యం చేసిన దాడిలో ముగ్గురు వర్ధమాన క్రికెటర్లు మృతి చెందారు ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన అఫ్గన్ బోర్డు పాక్ గడ్డపై క్రికెట్ ఆడేది లేదని తేల్చి చెప్పింది.అయితే అఫ్గానిస్తాన్ తప్పుకొన్నప్పటికి ఈ ముక్కోణపు టోర్నీ షెడ్యూల్ ప్రకారం జరగనుంది. ఈ టోర్నీలో అఫ్గాన్ స్ధానాన్ని జింబాబ్వేతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. ఇప్పటికే ఈ విషయంపై జింబాబ్వే క్రికెట్ బోర్డుతో పీసీబీ చర్చలు జరిపింది. అందుకు జింబాబ్వే క్రికెట్ కూడా అంగీకరించనట్లు పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా అఫ్గానిస్తాన్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు నేపాల్, యూఏఈ క్రికెట్ బోర్డులతో కూడా పాక్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కానీ అందుకు ఆయా క్రికెట్ బోర్డులు కాస్త సమయం కోరినట్లు సమాచారం. కానీ అంతలోనే జింబాబ్వే ఒప్పుకోవడంలో అప్డేటడ్ షెడ్యూల్ను పీసీబీ విడుదల చేసింది.అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శల వర్షం కురుస్తోంది. మీ దేశం చేసిన దాడిలో ముగ్గురు యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోతే .. సంతాపం తెలపాల్సింది బదులు కొత్త షెడ్యూల్ రిలీజ్ చేస్తారా? అంటూ ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు.నవంబర్ 17 నుండి 29 వరకు జరగనున్న ఈ ముక్కోణపు సిరీస్కు రావల్పిండి, లహోర్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ సిరీస్ టీ20 ప్రపంచకప్-2026 సన్నాహాకాల్లో భాగంగా జరగనుంది. కాగా ఈ యువ క్రికెటర్ల మృతి పట్ల ఐసీసీ, బీసీసీఐ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.ట్రైసిరీస్ షెడ్యూల్17 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి19 నవంబర్ – శ్రీలంక వర్సెస్ జింబాబ్వే, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి22 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, గడాఫీ స్టేడియం, లాహోర్23 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే, గడాఫీ స్టేడియం, లాహోర్25 నవంబర్ – శ్రీలంక వర్సెస్ జింబాబ్వే, గడాఫీ స్టేడియం, లాహోర్27 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, గడాఫీ స్టేడియం, లాహోర్29 నవంబర్ – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్ -
ఆసీస్తో తొలి వన్డే.. రోహిత్, కోహ్లి ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్కు సమయం అసన్నమైంది. పెర్త్ వేదికగా ఆదివారం జరగనున్న తొలి వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుండగా.. ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆడనుంది.అందరి దృష్టి భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) పైనే ఉన్నాయి. వీరిద్దరూ దాదాపు ఏడు నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నారు. దీంతో రో-కో ద్వయం ఎలా ఆడుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టీమిండియా ఫ్యాన్స్కు ఓ బ్యాడ్ న్యూస్.పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే సమయంలో వరుణుడు పలు మార్లు ఆటకు అంతరాయం కలిగించే అవకాశముంది. వర్షం పడేందుకు 35 శాతానికి పైగా అస్కారం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం కూడా అక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.అయితే వర్షం కారణంగా పూర్తిగా రద్దు అయ్యే సూచనలు అయితే కన్పించడం లేదు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెర్త్ స్టేడియంలోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామమే అనే చెప్పుకోవాలి. కాబట్టి భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్చదవండి: ప్లే ఆఫ్స్కు చేరిన తెలుగు టైటాన్స్ -
రిషాద్ ‘సిక్సర్’
మీర్పూర్: ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్లో ‘వైట్ వాష్’కు గురైన వెస్టిండీస్ జట్టు... బంగ్లాదేశ్ పర్యటనను కూడా పరాజయంతోనే ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 74 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ హృదయ్ (90 బంతుల్లో 51; 3 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... మహిదుల్ ఇస్లామ్ (46), నజ్ముల్ హుసేన్ షంటో (32) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 3 వికెట్లు పడగొట్టగా... రోస్టన్ చేజ్, జస్టన్ గ్రీవ్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సులభతర లక్ష్యఛేదనలో కరీబియన్ జట్టు విఫలమైంది. బ్యాటర్లంతా తేలపోవడంతో చివరకు 39 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (60 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) కాస్త పోరాడాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుసేన్ 35 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి విండీస్ టాపార్డర్ పెవిలియన్కు క్యూ కట్టింది. బ్యాటింగ్లోనూ 13 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, 2 సిక్స్ల సాయంతో 26 పరుగులు చేసిన రిషాద్... బౌలింగ్ అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇక్కడే రెండో వన్డే జరగనుంది. -
షమీ 'సూపర్' స్పెల్
కోల్కతా: టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ సత్తా చాటడంతో... రంజీ ట్రోఫీ తాజా సీజన్లో బెంగాల్ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా శనివారం ఉత్తరాఖండ్తో ముగిసిన పోరులో బెంగాల్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 165/2తో శనివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్... చివరకు 96.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ కునాల్ చండేలా (235 బంతుల్లో 72; 8 ఫోర్లు), వికెట్ కీపర్ ప్రశాంత్ చోప్రా (163 బంతుల్లో 82; 10 ఫోర్లు) హాఫ్సెంచరీలు చేశారు. బెంగాల్ బౌలర్లలో షమీ 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, ఆకాశ్దీప్, ఇషాన్ పొరేల్ చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన షమీ... రెండో ఇన్నింగ్స్లో కీలక సమయంలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. ఫలితంగా బెంగాల్ ముందు 156 పరుగుల లక్ష్యం నిలవగా... ఆ జట్టు 29.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (82 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో జట్టును గెలిపించాడు. ఫిట్నెస్ కారణాలతో ఆ్రస్టేలియా పర్యటనకు ఎంపిక కాలేకపోయిన షమీ... రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. తమిళనాడు ఓటమి బ్యాటర్లు విఫలమవడంతో... రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో తమిళనాడు జట్టు పరాజయం పాలైంది. కోయంబత్తూర్ వేదికగా జరిగిన పోరులో జార్ఖండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో తమిళనాడును మట్టికరిపించింది. ఓవర్నైట్ స్కోరు 52/3తో శనివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన తమిళనాడు... 79 ఓవరల్లో 212 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రె సిద్ధార్థ్ (180 బంతుల్లో 80; 12 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. జార్ఖండ్ బౌలర్లలో రిశవ్ రాజ్ 4, అనుకూల్ రాయ్ 3 వికెట్లు పడగొట్టారు. అంతకముందు జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 419 పరుగులు చేయగా... తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 93 పరుగులకే పరిమితమై ఫాలోఆన్ ఆడింది. భారీ సెంచరీతో కదం తొక్కిన జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ముంబై ఘనవిజయం ఆల్రౌండర్ షమ్స్ ములానీ అదరగొట్టడంతో ముంబై జట్టు రంజీ ట్రోఫీ తాజా సీజన్లో బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో ముంబై 35 పరుగుల తేడాతో జమ్మూ కశ్మీర్ను చిత్తుచేసింది. శ్రీనగర్ వేదికగా జరిగిన పోరులో 243 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 21/1తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూ కశ్మీర్ చివరకు 64.4 ఓవర్లలో 207 పరుగులకే పరిమితమైంది. ఖమ్రాన్ ఇక్బాల్ (107 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధ శతకం సాధించగా.. కెప్టెన్ పారస్ డోగ్రా (29), అఖీబ్ నబీ (37), సాహిల్ లోత్రా (29) తలా కొన్ని పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ 7 వికెట్లతో విజృంభించాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 386 పరుగులు చేయగా... జమ్మూకశ్మీర్ 325 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో 181 పరుగులు చేసిన ముంబై... ప్రత్యర్థి ముందు 243 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 132 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టిన ముంబై ఆల్రౌండర్ షమ్స్ ములానీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. » టీమిండియా ప్లేయర్లు హనుమ విహారి, విజయ్ శంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న త్రిపుర జట్టు... ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్లో సర్వీసెస్ చేతిలో ఇన్నింగ్స్ 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సర్వీసెస్ బౌలర్ అర్జున్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇదే గ్రూప్లో భాగంగా అస్సాం, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. » ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన పోరులో బరోడా జట్టు 7 వికెట్ల తేడాతో ఒడిశాపై గెలుపొందింది. కటక్ వేదికగా జరిగిన మ్యాచ్లో అదరగొట్టిన బరోడా బ్యాటర్ శివాలిక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. » తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని భయపెట్టిన గోవా జట్టు... ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో చండీగఢ్పై ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదే గ్రూప్లో భాగంగా మహారాష్ట్ర, కేరళ జట్ల మధ్య తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. మధ్యప్రదేశ్, పంజాబ్ మధ్య మ్యాచ్ కూడా ‘డ్రా’ కాగా... మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటీదార్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. » రంజీ ట్రోఫీలో ఎలైట్ గ్రూప్ల్లో మొత్తం 32 జట్లు... నాలుగు గ్రూప్లుగా పోటీపడుతున్నాయి. మ్యాచ్ గెలిచిన జట్టుకు 6 పాయింట్లు, ఇన్నింగ్స్ తేడాతో నెగ్గిన జట్టుకు 7 పాయింట్లు కేటాయించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టుకు 3 పాయింట్లు దక్కాయి. ‘డ్రా’ చేసుకున్న జట్టుకు ఒక పాయింట్ దక్కింది. మానవ్ మాయాజాలం రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఛత్తీస్గఢ్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ స్పిన్నర్ మానవ్ సుతార్ (8/42) అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో ప్రత్యర్థి బ్యాటర్లకు అర్థంకాని బంతులతో విజృంభించి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఓవర్నైట్ స్కోరు 64/4తో శనివారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఛత్తీస్గఢ్ చివరకు 49.3 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది.ఆయుశ్ పాండే (27), సంజీత్ దేశాయ్ (24) తలా కొన్ని పరుగులు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మానవ్ సుతార్ 22.3 ఓవర్లలో 42 పరుగులిచ్చి 8 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన సుతార్... రెండో ఇన్నింగ్స్లో ఛత్తీస్గఢ్ బ్యాటర్లను క్రీజులో నిలవనివ్వలేదు. అనంతరం 56 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్తాన్ 11.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. మహిపాల్ లోమ్రర్ (35 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అంతకుముందు ఛత్తీస్గఢ్ 332 పరుగులు చేయగా... రాజస్తాన్ 386 పరుగులు చేసింది. -
భారత్ x ఆస్ట్రేలియా
ఆసియా కప్ టి20ల్లో అజేయంగా ట్రోఫీ గెలుపు, అంతకు ముందు ఇంగ్లండ్తో టెస్టుల్లో అద్భుత ప్రదర్శన...ఇప్పుడు కొంత విరామానంతరం భారత జట్టు మూడో ఫార్మాట్లో పెద్ద టీమ్తో సమరానికి సిద్ధమైంది. ఈ సారి ఎదురుగా ఉంది వన్డే ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా. ఆసీస్ గడ్డపైనే జరిగే ఈ మూడు వన్డేల పోరులో పైచేయి సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కొత్త కెప్టెన్ గిల్ నేతృత్వంలో ఈ సమరానికి భారత్ సిద్ధం కాగా... ఈ ఫార్మాట్లో ఆల్టైమ్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఇద్దరైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల ఆటపైనే అందరి దృష్టీ నిలిచింది. మరో వైపు పలువురు కీలక ఆటగాళ్లు దూరమైనా...ఆసీస్ తమ స్వదేశంలో పటిష్టమైన బలగంతోనే బరిలోకి దిగుతోంది. పెర్త్: చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన దాదాపు ఏడు నెలల తర్వాత భారత జట్టు వన్డేల్లో బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మధ్య నేడు (ఆదివారం) తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇరు జట్లు చివరిసారిగా తలపడిన వన్డేలో (చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్) భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియాకు సంబంధించి కెప్టెన్ గా శుబ్మన్ గిల్ రావడం ప్రధాన మార్పు కాగా...గాయంతో ప్యాట్ కమిన్స్ తప్పుకోవడంతో మిచెల్ మార్ష్ ఆసీస్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఆటగాళ్లంతా ఫామ్లో... చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ 2027 వరల్డ్ కప్ జట్టు విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకున్నా...దానికి చాలా సమయం ఉందని కోచ్ గంభీర్ చెబుతున్నా వాస్తవ పరిస్థితి ఏమిటో సగటు క్రికెట్ అభిమానులందరికీ తెలుసు. ఈ సిరీస్ గెలిచినా గెలవకపోయినా స్టార్ బ్యాటర్లు కోహ్లి, రోహిత్ ఎలా ఆడతారనేదే అన్నింటికంటే ముఖ్యం. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంతకంటే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొన్న సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నా...ఇలాంటి అనుభవం పూర్తిగా భిన్నం. వీరిద్దరు పరస్పర కెప్టెన్సీలో కాకుండా మరో సారథి (ధోని) నాయకత్వంలో ఆడి తొమ్మిదేళ్లయింది. ఇప్పుడు ఎంతో జూనియర్ అయిన గిల్ కెప్టెన్సీలో ఆడటంతో పాటు కచ్చితంగా రాణించాల్సిన స్థితిలో వీరిద్దరు ఉన్నారు. ఆట, అనుభవం విషయంలో కొత్తగా చెప్పాల్సింది లేకపోయినా, ఇక్కడా బాగా ఆడాలని అంతా కోరుకుంటున్నారు. ఇతర బ్యాటర్లలో గిల్, శ్రేయస్, రాహుల్ కీలకం కానున్నారు. వన్డే టీమ్లోనూ జట్టులో పలువురు ఆల్రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అక్షర్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లతో పాటు ఆంధ్ర ఆటగాడు నితీశ్ రెడ్డి బరిలోకి దిగడం కూడా ఖాయం. రెగ్యులర్ స్పిన్నర్గా కుల్దీప్ ఆడతాడు. బుమ్రా వన్డే సిరీస్కు లేకపోవడంతో ప్రధాన పేసర్గా సిరాజ్ బాధ్యతలు తీసుకోనుండగా, ఆసీస్ పరిస్థితులను బట్టి చూస్తే రెండో పేసర్గా ప్రసిధ్ లేదా అర్ష్ దీప్ లలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. మొత్తంగా జట్టు అన్ని విధాలా పటిష్టంగా కనిపిస్తోంది. కొత్త ఆటగాళ్లతో... వేర్వేరు కారణాలతో పలువురు ఆస్ట్రేలియా రెగ్యులర్ వన్డే ఆటగాళ్లు ఈ మ్యాచ్కు దూరమయ్యారు. వారి స్థానాల్లో యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెన్షా, ఒవెన్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. ఆసీస్ టాప్ పేసర్లు స్టార్క్, హాజల్వుడ్తో పాటు కమిన్స్ గైర్హాజరు ఎలిస్కు అవకాశం ఇస్తోంది. ఫామ్లో ఉన్న ఓపెనర్లు హెడ్, మార్ష్తమ దూకుడైన బ్యాటింగ్తో మ్యాచ్ను ప్రభావితం చేయగలరు. మిగతా ప్రధాన బ్యాటర్లకు పెద్దగా అనుభవం లేకపోయినా సొంతగడ్డ అనుకూలత వారికి బలం కానుంది.పిచ్, వాతావరణం ఆప్టస్ స్టేడియం బ్యాటింగ్కు పెద్దగా అనుకూలించే మైదానం కాదు. బౌలర్లే ప్రభావం చూపిస్తారు. గత ఆరేళ్లలో మూడు వన్డేలే జరగ్గా, అన్నింటిలో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. ఆసీస్ ఇక్కడ ఆడిన మూడూ ఓడింది. మ్యాచ్కు స్వల్ప వర్ష సూచన ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్, రాహుల్, నితీశ్, సుందర్, కుల్దీప్, సిరాజ్,ప్రసిధ్/ అర్ష్ దీప్. ఆ్రస్టేలియా: మార్ష్(కెప్టెన్), హెడ్, షార్ట్, రెన్షా, ఫిలిప్, ఒవెన్, కనోలీ, స్టార్క్, ఎలిస్, కునెమన్,హాజల్వుడ్. -
హర్మన్ బృందానికి పరీక్ష
ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు అత్యంత కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం ఇంగ్లండ్తో తలపడుతుంది. తొలి రెండు మ్యాచ్లలో శ్రీలంక, పాకిస్తాన్లను ఓడించి సానుకూలంగా టోర్నీని మొదలుపెట్టిన భారత్ ఆ తర్వాత తడబడింది. రెండు పటిష్ట జట్లు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా చేతిలో పరాజయంపాలైంది. ఇప్పుడు మరో కఠిన ప్రత్యర్థి ఇంగ్లండ్ రూపంలో ఎదురైంది. ఇటీవలి కాలంలో ఈ జట్టుపై మన రికార్డు బాగున్నా... వరల్డ్ కప్ ఒత్తిడిని అధిగమించి పైచేయి సాధించడం ముఖ్యం. ఈ మ్యాచ్లో ఓడితే తర్వాతి రెండు మ్యాచ్లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్లపై భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. మరో వైపు నాట్ సివర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు గెలిచి (ఒకటి రద్దు) జోరు మీదుంది. అమన్జోత్ స్థానంలో రేణుక! తొలి మూడు మ్యాచ్లతో పోలిస్తే ఆ్రస్టేలియాపై భారత్కు మెరుగైన ఆరంభం లభించింది. స్మతి మంధాన, మరో ఓపెనర్ ప్రతీక కూడా అర్ధసెంచరీలు సాధించారు. హర్లీన్, జెమీమా కూడా కీలక పరుగులు సాధించారు. అయితే హర్మన్ మరోసారి అంచనాలకు తగినట్లు ఆడటంలో విఫలమైంది. రిచా ఘోష్ దూకుడుగా ఆడటం పెద్ద సానుకూలాంశం. దీప్తి చాలా కాలంగా బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోతోంది. మరో సారి ప్రధాన బ్యాటర్లంతా మెరుగ్గా ఆడితే భారీ స్కోరుకు అవకాశం ఉంది. అయితే ఆసీస్పై 330 పరుగులు చేసి కూడా భారత్ మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది. ఇలాంటి స్థితిలో బౌలింగ్ బలహీనత బయటపడింది. ఐదుగురు రెగ్యులర్ బౌలర్లు విఫలమైనా మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. అయినా సరే అదే వ్యూహాన్ని జట్టు కొనసాగించే అవకాశం ఉంది. హర్మన్ ఎలాగూ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలదు. ఆల్రౌండర్ అమన్జోత్ స్థానంలో పేసర్ రేణుక జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. యువ బౌలర్లు క్రాంతి, చరణి ఒత్తిడిని అధిగమించాల్సి ఉంది. చరణితో పాటు దీప్తి, స్నేహ్ స్పిన్తో ఇంగ్లండ్కు కట్టడి చేయాలని భారత్ భావిస్తోంది. ఫామ్లో కెప్టెన్... పాకిస్తాన్తో గత మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, అంతకు ముందు బలహీన బంగ్లా, శ్రీలంకను ఇంగ్లండ్ ఓడించింది. తొలి పోరులో దక్షిణాఫ్రికాను 69కే కుప్పకూల్చినా... జట్టు బ్యాటింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. కెపె్టన్ సివర్ బ్రంట్, హీతర్ నైట్ మాత్రమే ఫామ్లో ఉన్నారు. ఎమీ జోన్స్, బీమాంట్లలో ఇంకా తడబాటు కనిపిస్తోంది. సోఫీయా డంక్లీ, ఎమా ల్యాంబ్లనుంచి జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. బ్యాటింగ్తో పోలిస్తే ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్ కూడా బలంగా ఉండటం విశేషం. భారత్పై పలు మార్లు చక్కటి ప్రదర్శన కనబర్చిన సోఫీ ఎకెల్స్టోన్తో పాటు మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ లిన్సీ స్మిత్ కూడా వరల్డ్ కప్లో చక్కగా రాణిస్తున్నారు. ప్రధాన పేసర్ లారెన్ బెల్ ఆరంభంలో ప్రత్యర్థిని నిలువరించగలదు. -
BCCI: పిరికిపందల దాడి.. అఫ్గన్ బోర్డుకు మద్దతుగా బీసీసీఐ ప్రకటన
అఫ్గనిస్తాన్ క్రికెటర్ల మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB)కు సంఘీభావం ప్రకటించింది. తమ క్రికెటర్ల మరణానికి కారణమైన దేశంతో.. అఫ్గన్ బోర్డు సిరీస్ రద్దు చేసుకోవడాన్ని బీసీసీఐ స్వాగతించింది.పిరికిపందల దాడి.. ఈ మేరకు.. ‘‘సరిహద్దులోని పక్తికా ప్రావిన్స్లో పిరికిపందలు జరిపిన సీమాంతర వైమానిక దాడుల్లో అఫ్గనిస్తాన్ యువ క్రికెటర్లు కబీర్ ఆఘా, సిబ్ఘతుల్లా, హరూన్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. వీరి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.ఈ కష్ట సమయంలో బీసీసీఐ అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుకు మద్దతుగా నిలుస్తుంది. అఫ్గన్ క్రికెట్ ప్రపంచానికి, మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. మీ దుఃఖాన్ని మేమూ పంచుకుంటాం. ఇందుకు కారణమైన అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.తీవ్రంగా కలచివేస్తోందివైమానిక దాడుల్లో మరణించిన అమాయక ప్రజలు.. ముఖ్యంగా క్రీడల్ని భవిష్యత్తుగా ఎంచుకున్న వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేస్తోంది. అఫ్గనిస్తాన్ ప్రజలకు బీసీసీఐ హృదయపూర్వకంగా సానుభూతి ప్రకటిస్తోంది. వారి బాధను మేమూ పంచుకుంటాము’’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేరిట బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది.కాగా పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గన్లోని పక్తికా ప్రావిన్స్లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ వైఖరికి నిరసనగా పాకిస్తాన్తో ఆడాల్సిన ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకొంటున్నట్లు అఫ్గన్ బోర్డు ప్రకటించింది.ఆట కంటే దేశమే ముఖ్యంఅఫ్గన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్తో పాటు పలువురు క్రికెటర్లు బోర్డు నిర్ణయాన్ని స్వాగతించారు. ఆట కంటే దేశమే ముఖ్యమని పేర్కొన్నారు. కాగా రావల్పిండి వేదికగా నవంబరు 19 నుంచి పాకిస్తాన్- శ్రీలంక- అఫ్గనిస్తాన్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది.అయితే, పాక్ దుశ్చర్య కారణంగా అఫ్గన్ బోర్డు ఈ సిరీస్ను బహిష్కరించగా.. తాము మరో జట్టు కోసం వెతుకుతున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ‘‘అప్గనిస్తాన్ తప్పుకొన్నా ట్రై సిరీస్ కచ్చితంగా జరుగుతుంది. అఫ్గన్ జట్టు స్థానాన్ని భర్తీ చేయగల టీమ్ కోసం చూస్తున్నాం’’ అని పీసీబీ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి.చదవండి: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! -
బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా చాముండేశ్వరనాథ్
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా ఆంధ్ర మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరనాథ్ ఎన్నికయ్యారు. ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) పురుషుల క్రికెటర్ల ప్రతినిధిగా ఆయన కౌన్సిల్కు ఎన్నికయ్యారు. బుధ, గురువారాల్లో జరిగిన ఐసీఏ ఎన్నికల్లో అపెక్స్ కౌన్సిల్ పదవి కోసం ఎన్నిక జరిగింది. ఇందులో చాముండి 755–83 ఓట్ల తేడాతో రాజేశ్ జడేజాపై గెలుపొందారు. ఇప్పటి వరకు చాముండి ఐసీఏ ప్రతినిధిగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ఉన్నారు. దిలీప్ వెంగ్సర్కార్ స్థానంలో ఎపెక్స్ కౌన్సిల్లోకి వచ్చిన ఆయన మూడేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఐసీఏ ఎన్నికల్లో భారత మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి అధ్యక్షురాలిగా, వి.సుందరమ్ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఎపెక్స్ కౌన్సిల్ మహిళా క్రికెటర్ల ప్రతినిధిగా సుధా షా ఎంపిక కాగా...ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో శుభాంగి కులకర్ణికి అవకాశం దక్కింది. చదవండి: IND vs AUS: కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని భయపడ్డా: సూర్యకుమార్ యాదవ్ -
పబ్లిక్గా అంత మాట అంటావా? ముందు నీ పనేంటో చూసుకో గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) తీరుపై భారత మాజీ క్రికెటర్ బల్విందర్ సంధు (Balvinder Sandhu) ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోచ్గా చేయాల్సిన పని మీద మాత్రమే దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికాడు. ప్రతీ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుని.. దిగ్గజాల గురించి కఠినంగా మాట్లాడాల్సిన అవసరం లేదంటూ చురకలు అంటించాడు.అసలేం జరిగిందంటే.. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఆసీస్తో వన్డే సిరీస్కు ప్రకటించిన జట్టులో యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana)కు చోటు ఇవ్వడం పట్ల విమర్శలు వచ్చాయి. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తాను ఫిట్గానే ఉన్నానని చెప్పినా.. అతడిని కాదని హర్షిత్కు పెద్ద పీట వేయడం విమర్శలకు దారితీసింది.ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్కు ఆడుతున్న క్రమంలో అప్పటి మెంటార్ గంభీర్కు ప్రియ శిష్యుడైన కారణంగానే.. ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రధానంగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. తనదైన శైలిలో గంభీర్- హర్షిత్ల గురించి కామెంట్ చేశాడు.చిక్కాపై గంభీర్ ఫైర్ఈ నేపథ్యంలో ఇటీవల వెస్టిండీస్తో రెండో టెస్టు ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన గంభీర్ స్పందించాడు. ‘‘యూట్యూబ్ చానెళ్ల వ్యూస్ కోసం 23 ఏళ్ల కుర్రాడిని టార్గెట్ చేస్తారా? కావాలంటే నన్ను ఏమైనా అనండి. అతడి జోలికి మాత్రం వెళ్లవద్దు. వాళ్ల నాన్న క్రికెటరో, సెలక్టరో కాదు’’ అంటూ చిక్కాపై ఫైర్ అయ్యాడు.ఈ క్రమంలో భారత మాజీ పేసర్, 1983 గెలిచిన భారత జట్టులో చిక్కా సహచర సభ్యుడైన బల్విందర్ సంధు గంభీర్ వ్యాఖ్యలపై స్పందించాడు. మిడ్-డేతో మాట్లాడుతూ.. ‘‘ఏ విషయం గురించైనా ప్రతి ఒక్కరికి తమకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటితో ఇతరులు ఏకీభవించాలన్న నియమం లేదు.పబ్లిక్గా అంత మాట అంటావా?అయితే, పబ్లిక్గా చిక్కా గురించి అలా మాట్లాడంలో అర్థం లేదు. అవును.. శ్రీకాంత్ బ్యాటింగ్లాగే.. అతడి మాటలు కూడా ఉంటాయి. అందుకే అతడిని చాలా మంది ఇష్టపడతారు కూడా!.. సెలక్షన్ గురించి విమర్శించేటపుడు కొంతమంది మాజీ క్రికెటర్లు హద్దులు దాటుతున్న మాట వాస్తవమే.అందుకు సోషల్ మీడియాలో వారిపై భారీ ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అయినంత మాత్రాన స్వేచ్ఛగా మాట్లాడే మాజీ ప్లేయర్ల హక్కును హరించేందుకు వీలులేదు. దేశం కోసం కష్టపడి, ఇష్టపడి ఆడిన వాళ్లు ఇలాంటి వాటిని పొందేందుకు ఎంత మాత్రం అర్హులు కాదు.హెడ్కోచ్గా నీ పనేంటో చూసుకోసలహాలు ఇస్తే క్రీడాస్ఫూర్తితో స్వీకరించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. హెడ్కోచ్గా మైదానంలో ఎలాంటి వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్న అంశం మీద మాత్రమే దృష్టి పెడితే బాగుంటుంది. అలా కాకుండా ఇలా ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని వేలాడితే అసలు లక్ష్యం పక్కదారి పడుతుంది.శ్రీకాంత్ అభిప్రాయాల గురించి గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు చదువుతుంటే నా మనసుకు ఎంతో బాధ కలిగింది. మాజీ ఆటగాడిని ఉద్దేశించి మీడియా ముఖంగా ఇలా మాట్లాడటం ఎంతమాత్రం సరికాదు’’ అని బల్విందర్ సంధు గంభీర్ తీరును విమర్శించాడు. చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్మన్ గిల్ -
చరిత్ర సృష్టించిన రింకూ సింగ్
టీమిండియా టీ20 స్పెషలిస్టు రింకూ సింగ్ (Rinku Singh) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ను అద్భుతంగా ఆరంభించాడు. ఈ దేశవాళీ రెడ్బాల్ టోర్నీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ మొదటి మ్యాచ్లోనే భారీ శతకంతో మెరిశాడు. తద్వారా ఫస్ట్క్లాస్ క్రికెట్లో తన సగటును 54.68 నుంచి 57.39కి పెంచుకున్నాడు.దిగ్గజాలను దాటేసి..తద్వారా యాభై ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న తర్వాత అత్యుత్తమ సగటు కలిగి ఉన్న ఆటగాడిగా రింకూ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), సబా కరీం, జడేజాతో పాటు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను అధిగమించాడు. ఓవరాల్గా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ సగటు కలిగి ఉన్న భారత ఆటగాళ్ల జాబితాలో పదో స్థానంలో నిలిచాడు.ఈ లిస్టులో విజయ్ మర్చంట్ 71.64 సగటుతో 13 వేల పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షంతను సుగ్వేకర్, కేసీ ఇబ్రహీం 60కి పైగా సగటుతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా రంజీ టోర్నీ తాజా సీజన్ బుధవారం మొదలైంది.ఆంధ్ర క్రికెటర్ల శతకాలుఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా కాన్పూర్ వేదికగా ఉత్తరప్రదేశ్- ఆంధ్ర జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (142), వన్డౌన్ బ్యాటర్ షేక్ రషీద్ (136) భారీ శతకాలతో సత్తా చాటారు.ఈ క్రమంలో ఆంధ్ర జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 143 ఓవర్లలో 470 పరుగులకు ఆలౌట్ అయింది. యూపీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ నాలుగు వికెట్లు తీయగా.. ఆకిబ్ ఖాన్ రెండు, శివం మావి, శివం శర్మ, కెప్టెన్ కరణ్ శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రింకూ సింగ్ భారీ శతకంఅనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన యూపీ శుభారంభమే అందుకుంది. ఓపెనర్లలో అభిషేక్ గోస్వామి (24) నిరాశపరచగా.. మాధవ్ కౌశిక్ (54), వన్డౌన్ బ్యాటర్ ఆర్యన్ జుయాల్ (66) అర్ధ శతకాలతో రాణించారు. అయితే, కెప్టెన్ కరణ్ శర్మ (2) విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో ప్రియమ్ గార్గ్ (18), ఆరాధ్య యాదవ్ (17) ఇలా వచ్చి అలా వెళ్లారు.ఇలాంటి దశలో ఐదో నంబర్ బ్యాటర్ రింకూ సింగ్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. మొత్తంగా 273 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 165 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా విప్రజ్ నిగమ్ 42, శివం శర్మ 38, శివం మావి 20 (నాటౌట్) రాణించారు.యూపీదే పైచేయిఫలితంగా 169 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఉత్తరప్రదేశ్ జట్టు 471 పరుగులు సాధించింది. శనివారం ఆఖరి రోజు ఆట కావడంతో ఫలితం తేలకుండానే మ్యాచ్ ముగిసిపోయింది. అయితే, తొలి ఇన్నింగ్స్లో ఆంధ్ర కంటే ఒక్క పరుగు ఆధిక్యం సంపాదించిన యూపీ.. మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు.. ఆంధ్రకు ఒక పాయింట్ దక్కింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ముందు రింకూ రెడ్బాల్ క్రికెట్లో ఈ మేరకు సెంచరీతో సత్తా చాటడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. రింకూకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం.చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్మన్ గిల్ -
రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం!
అఫ్గనిస్తాన్ టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)తో తెగదెంపులు చేసుకున్నట్లు అతడు సంకేతాలు ఇచ్చాడు. పాకిస్తాన్ వైమానిక దాడిలో అఫ్గన్ పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రషీద్ ఖాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అఫ్గనిస్తాన్లోని పక్తికా ప్రావిన్స్పై పాకిస్తాన్ శుక్రవారం వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది మృత్యువాత పడగా.. ఇందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు ఉన్నారు. వీరిని కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్గా గుర్తించారు.మానవ హక్కుల ఉల్లంఘనపక్తికా రాజధాని షరానాలో ఫ్రెండ్లీ మ్యాచ్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్ స్పందిస్తూ.. పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండించాడు. ‘‘అఫ్గనిస్తాన్లో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం.దేశమే ముఖ్యంఇదొక చట్టవ్యతిరేక చర్య. మానవ హక్కుల ఉల్లంఘన. ఇందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. పాకిస్తాన్తో జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి వైదొలుగుతూ అఫ్గన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని రషీద్ ఖాన్ ఈ సందర్భంగా సమర్థించాడు. బోర్డు నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతునిస్తున్నానని.. అన్నిటికంటే దేశ సమగ్రతే ముఖ్యమని పేర్కొన్నాడు.డిలీట్ కొట్టేశాడుతాజాగా రషీద్ ఖాన్ మరో నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా బయోలో అతడు చేసిన మార్పు ద్వారా స్పష్టమవుతోంది. 27 ఏళ్ల ఈ వరల్డ్క్లాస్ స్పిన్నర్.. పాకిస్తాన్ సూపర్ లీగ్లో లాహోర్ ఖలందర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2021లో ఈ జట్టుతో చేరిన రషీద్.. మూడు టైటిళ్లు గెలిచాడు. గతేడాది కూడా ఇదే జట్టు ట్రోఫీ గెలుచుకుంది.అయితే, తన ఎక్స్ ఖాతా బయో నుంచి ఈ జట్టు పేరును రషీద్ తొలగించాడు. అఫ్గన్ బోర్డుతో పాటు గుజరాత్ టైటాన్స్, బిగ్బాష్ లీగ్ స్ట్రైకర్స్, ఇన్సిగ్నియా స్పోర్ట్స్ అనే అకౌంట్లను బయోలో కొనసాగించిన రషీద్.. లాహోర్ ఖలందర్ పేరును మాత్రం డిలీట్ చేశాడు. తద్వారా పాకిస్తాన్ సూపర్ లీగ్ను బాయ్కాట్ చేస్తాననే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాక్ వక్రబుద్ధి తగిన విధంగా.. ఇలాగే బుద్ది చెప్పాలంటూ రషీద్ చర్యను అభినందిస్తున్నారు.చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్మన్ గిల్ -
IND vs AUS: కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని భయపడ్డా: సూర్యకుమార్
భారత క్రికెట్ జట్టు యువ రక్తంతో నిండిపోతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ మార్పు కూడా జరిగింది. టెస్టులకు రోహిత్ శర్మ (Rohit Sharma) స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించగా.. వన్డే కెప్టెన్సీ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడిని తప్పించింది.ఇక ఈ రెండు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ స్థానాన్ని యువ ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill) భర్తీ చేశాడు. ఇప్పటికే టెస్టు సారథిగా ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్ను 2-2తో సమం చేసిన గిల్.. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్ను 2-0తో వైట్వాష్ చేశాడు.త్వరలోనే టీ20 పగ్గాలు కూడా అతడికేఈ క్రమంలో వన్డే సారథిగా తొలి ప్రయత్నంలోనే ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గిల్కు కఠిన సవాలు ఎదురుకానుంది. ఇదిలా ఉంటే.. మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలని భావిస్తున్నామని.. త్వరలోనే టీ20 పగ్గాలు గిల్కు అప్పగిస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల సంకేతాలు ఇచ్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘గిల్ రెండు ఫార్మాట్లకు కెప్టెన్ కావడం పట్ల సంతోషంగా ఉంది. తను అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే, టీ20 కెప్టెన్సీ విషయంలో నేను అబద్ధం చెప్పను.కెప్టెన్సీ చేజారుతుందనే భయంఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా కెప్టెన్సీ చేజారుతుందనే భయం ఉంటుంది. అయితే, ఆ భయం నుంచే నన్ను నేను మరింత మెరుగుపరచుకోవాలనే ప్రేరణ కూడా వస్తుంది. మైదానం లోపల, వెలుపల గిల్తో నా రిలేషన్ అత్యద్భుతంగా ఉంది. సోదర భావంతో మెలుగుతాం.మనిషిగా, ఆటగాడిగా తను ఎలాంటివాడో నాకు పూర్తిగా తెలుసు. తను ఈ స్థాయికి చేరడం పట్ల సంతోషంగా ఉంది. అందరికీ అతడు స్ఫూర్తిగా నిలిచాడు కూడా!’’ అని సూర్యకుమార్ యాదవ్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా అక్టోబరు 18- నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరుగుతాయి.ఆసియా కప్ విజేతగాఇందుకోసం గిల్ సారథ్యంలోని వన్డే జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకోగా.. సూర్య సేన టీ20 సిరీస్కు ముందు అక్కడికి చేరుకుంటుంది. కాగా ఆసియా కప్ టీ20- 2025 టోర్నీలో సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమిండియా ఇటీవలే చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్మన్ గిల్ -
అందరికీ తెలుసు: అగార్కర్కు ఇచ్చిపడేసిన షమీ.. స్ట్రాంగ్ కౌంటర్
టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)- చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు షమీని ఎంపిక చేయలేదు యాజమాన్యం. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అతడి ఫిట్నెస్ గురించి తమకు సమాచారం లేదని అగార్కర్ జట్టు ప్రకటన సందర్భంగా మీడియా ముఖంగా వెల్లడించాడు.ఇందుకు షమీ ఘాటుగానే స్పందించాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడేవాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు. తాను పూర్తి ఫిట్గా ఉన్నానని స్పష్టం చేశాడు. సెలక్షన్ అనేది తన చేతుల్లో లేదని.. ఫిట్నెస్ గురించి ఎవరూ అడగకపోయినా చెప్పడం సరికాదంటూ.. సెలక్టర్లు జట్టు ఎంపిక సమయంలో తనను సంప్రదించలేదని సంకేతాలు ఇచ్చాడు.ఫిట్గా లేకపోవడం వల్లేఈ క్రమంలో షమీ వ్యాఖ్యలపై అగార్కర్ శుక్రవారం స్పందించాడు. ఎన్డీటీవీ వేదికగా మాట్లాడుతూ.. ‘‘షమీ నా ముందు ఉండి ఉంటే సమాధానం ఇచ్చేవాడిని. అతడు నిజంగా ఫిట్గా ఉంటే అలాంటి బౌలర్ను ఎవరైనా కాదనుకుంటారా. గత ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో నేను అతడితో చాలాసార్లు మాట్లాడాను.ఫిట్గా లేకపోవడం వల్లే ఇంగ్లండ్తో సిరీస్కు ఎంపిక చేయలేకపోయాం’ అని ఈ భారత మాజీ పేసర్ స్పష్టం చేశాడు. తాము ఆడిన రోజుల్లో సెలక్టర్లకు ఏనాడూ ఫోన్ చేయలేదని, ఇప్పుడు కాలం మారిందన్న అగార్కర్... జట్టుకు ఎంపిక కాని యువ ఆటగాళ్లు తనకు వెంటనే ఫోన్ చేస్తారని, వారికి వంద శాతం నిజాయితీగా తాను సమాధానం ఇస్తానని చెప్పాడు.అంతా మీ కళ్ల ముందే ఉంది కదా!ఈ నేపథ్యంలో అగార్కర్కు షమీ మరోసారి గట్టిగానే కౌంటర్ ఇచ్చిపడేశాడు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘అతడు ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వండి. నేను ఎలా బౌలింగ్ చేస్తున్నారో మీరే చూస్తున్నారు. నేనెంత ఫిట్గా ఉన్నానో.. ఎలా ఆడుతున్నానో.. అంతా మీ కళ్ల ముందే ఉంది కదా!’’ అంటూ అగార్కర్కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు.కాగా షమీ చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా ప్రాతినిథ్యం వహించాడు. ఈ మెగా వన్డే టోర్నమెంట్లో తొమ్మిది వికెట్లు కూల్చిన ఈ కుడిచేతి వాటం పేసర్.. వరుణ్ చక్రవర్తితో కలిసి భారత్ తరఫున సంయుక్తంగా లీడ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం ఈ సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఈ సీజన్లో షమీ ఆడిన తొమ్మిది మ్యాచ్లలో కలిపి.. 11.23 ఎకానమీతో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. కాగా ఫామ్లేమి, పనిభారం కారణంగా ఇంగ్లండ్తో టెస్టులకు షమీని ఎంపిక చేయలేదనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆసీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి కూడా అతడిని తప్పించడం గమనార్హం.దుమ్ములేపిన షమీఇదిలా ఉంటే.. షమీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్తో బిజీగా ఉన్నాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ యూపీ బౌలర్.. ఉత్తరాఖండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 14.5 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన షమీ.. రెండో ఇన్నింగ్స్లో 24.4 ఓవర్లలో కేవలం 38 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.తద్వారా బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు షమీ. కాగా ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్లో భాగంగా బెంగాల్ జట్టు ఉత్తరాఖండ్పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.చదవండి: సెలక్షన్ విషయంలో ద్రవిడ్తో విభేదాలు.. మా నిర్ణయమే ఫైనల్: అగార్కర్ -
రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్మన్ గిల్
టీమిండియా వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma) విజయశాతం 75. ఆటగాడిగానూ యాభై ఓవర్ల ఫార్మాట్లో హిట్మ్యాన్కు తిరుగులేదు. రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్కప్లో భారత్ను ఫైనల్కు చేర్చిన రోహిత్.. ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) గెలిచాడు. రానున్న వన్డే వరల్డ్కప్లోనూ అతడే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని అంతా అనుకున్నారు.పది కిలోల బరువు తగ్గి అందుకు అనుగుణంగానే ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పిన రోహిత్.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించాడు. తద్వారా తన దృష్టి మొత్తం వన్డేలపైనే ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అంతేకాదు.. 38 ఏళ్ల రోహిత్ ఇటీవలే పది కిలోల బరువు కూడా తగ్గి మునుపటి కంటే కూడా మరింత ఫిట్గా తయారయ్యాడు.అయితే, అనూహ్య రీతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థాయంలో యువ ఆటగాడు, టెస్టు సారథి అయిన శుబ్మన్ గిల్కే వన్డే జట్టు బాధ్యతలూ అప్పగించింది. వన్డే వరల్డ్కప్-2027ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్న ట్లు బోర్డు తెలిపింది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో పాటు గిల్తోనూ రోహిత్కు విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది.రెండింటికీ చాలా తేడా ఉంటుందిఈ క్రమంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు శనివారం మీడియాతో మాట్లాడిన గిల్.. ఈ విషయంపై స్పందించాడు. ‘‘బయట మా గురించి జరుగుతున్న ప్రచారానికి, అంతర్గత విషయాలకు చాలా తేడా ఉంటుంది. మా మధ్య ఉన్న బంధాన్ని ఎవరూ చెరిపివేయలేరు.ఇంతకు ముందు మేమెలా కలిసి ఉన్నామో.. ఇప్పుడూ అలాగే ఉన్నాము. అతడు పూర్తి సహాయసహకారాలు అందించే వ్యక్తి. ఇన్నేళ్ల అనుభవం కారణంగా.. నేనేదైనా తప్పు చేసినట్లు భావిస్తే.. నా తప్పులను సరిదిద్దుతాడు. ఒకవేళ నాకు ఆయన సలహాలు అవసరమని భావిస్తే.. తప్పక అడుగుతా.అంతిమ నిర్ణయం నాదేప్రతి ఒక్కరి ఆలోచనలను నేను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తా. అలాగే మ్యాచ్ విషయంలో పరిస్థితులకు అనుగుణంగా నేనే అంతిమ నిర్ణయం తీసుకుంటా. రోహిత్ భాయ్, విరాట్ భాయ్తో నాకు మంచి రిలేషన్ ఉంది.నాకు ఏవైనా సందేహాలు వస్తే.. వారి సలహాలు తీసుకుంటా. నాకు సహాయం చేసేందుకు వాళ్లు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు’’ అని శుబ్మన్ గిల్ తెలిపాడు. తద్వారా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. కాగా రోహిత్ పాటు టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: IND vs AUS: జట్లు, షెడ్యూల్, వేదికలు, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
సెలక్షన్ విషయంలో ద్రవిడ్తో విభేదాలు.. మా నిర్ణయమే ఫైనల్: అగార్కర్
టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తనదైన ముద్ర వేశాడు. రెండున్నరేళ్ల పాటు అతడి మార్గదర్శనంలో ముందుకు సాగిన భారత జట్టు టీ20 ప్రపంచకప్-2024 రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచింది. అంతకుముందు.. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలో అజేయంగా ఫైనల్కు చేరి.. రన్నరప్గా నిలిచింది.ఇక ద్రవిడ్ జట్టులో నింపిన స్ఫూర్తి కారణంగానే తాము టీ20 ప్రపంచకప్తో పాటు.. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ కూడా గెలిచామని టీమిండియా తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇటీవలే వెల్లడించాడు. ద్రవిడ్ భాయ్ తమలో గెలవాలన్న పట్టుదలను మరింత పెంచి జట్టు బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా రోహిత్- ద్రవిడ్ కాంబోలో టీమిండియా మంచి ఫలితాలు రాబట్టిందని చెప్పవచ్చు.ద్రవిడ్తో మాకు విభేదాలుభారత క్రికెట్లో ద్రవిడ్కు సౌమ్యుడనే పేరుంది. ఈ మాజీ కెప్టెన్ కెరీర్లో వివాదాలకు తావులేదు. అయితే, అలాంటి ద్రవిడ్ కోచ్గా మారిన తర్వాత మాత్రం జట్టు విషయంలో తగ్గేదేలే అన్నట్లు సెలక్టర్లతో వాదనలకు దిగేవాడట. తన ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా జట్టు కూర్పు ఉండాల్సిందేనని పట్టుబట్టేవాడట.టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘రాహుల్ ద్రవిడ్ నాకు ప్రియమైన స్నేహితుడు. అయితే, అతడు కోచ్గా ఉన్న సమయంలో మా మధ్య విభేదాలు వచ్చిన మాట వాస్తవం. అవి తగువులాటలు అని నేను చెప్పను.మా నిర్ణయమే ఫైనల్కానీ ఇద్దరి మధ్య కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చేవి. కొన్ని విషయాల్లో తను అనుకున్నట్లే జరగాలని ద్రవిడ్ పట్టుబట్టేవాడు. ఏదేమైనా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే మా ఆలోచనలు ఉండేవి.జట్టు ఎంపిక పూర్తిగా మా నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందు రాహుల్.. ఇప్పుడు గంభీర్.. గతంలో రోహిత్.. ఇప్పుడు శుబ్మన్.. ఇలా కోచ్లు, కెప్టెన్లుగా ఎవరున్నా సరే.. వారికి కూడా జట్టు ఎంపిక విషయంలో జోక్యం కల్పిస్తాం. వారితో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తాం.మా పని అదేకోచ్, కెప్టెన్ పని సులువు చేసే విధంగా అత్యుత్తమైన పదిహేను మంది ఆటగాళ్లను ఎంపిక చేయడమే మా పని. ఒకవేళ కోచ్, కెప్టెన్ను గనుక సెలక్షన్ విషయంలో భాగం చేయకపోతే.. అంతకంటే తెలివితక్కువతనం మరొకటి ఉండదు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు.కాగా టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ సిరీస్కు ముందే కెప్టెన్గా రోహిత్ను తప్పించిన యాజమాన్యం.. గిల్కు వన్డే పగ్గాలూ అప్పగించింది. ఇక ఇప్పటికే అతడు టెస్టు సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే కెప్టెన్గా రోహిత్ను తొలగించిన నేపథ్యంలో గంభీర్తో పాటు అగార్కర్పైనా విమర్శలు వెల్లువెత్తాయి.చదవండి: IND vs AUS: జట్లు, షెడ్యూల్, వేదికలు, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
ఆసీస్తో తొలి వన్డే.. డేంజర్లో సచిన్ వరల్డ్ రికార్డు
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి దాదాపు 7 నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నాడు. ఆదివారం పెర్త్ వేదికగా జఆస్ట్రేలియాతో జరుగునున్న తొలి వన్డేలో సత్తాచాటేందుకు కింగ్ కోహ్లి సిద్దమయ్యాడు. మూడు రోజుల కిందట జట్టుతో పాటు ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన విరాట్.. ఈ సిరీస్ కోసం నెట్స్లో తీవ్రంగా శ్రమించాడు. వన్డే వరల్డ్కప్-2027లో ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్కు ఈ సిరీస్ చాలా కీలకం. ఈ క్రమంలో తొలి వన్డేకు ముందు కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లి..అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(100) అగ్రస్ధానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సచిన్ తన సుదీర్ఘ కెరీర్లో 51 టెస్టు, 49 వన్డేలు సెంచరీలు సాధించాడు. సచిన్ తర్వాతి స్ధానంలో 82 సెంచరీలతో విరాట్ కోహ్లి రెండో స్దానంలో ఉన్నాడు.ఈ మాజీ కెప్టెన్ వన్డేల్లో 51 శతకాలు సాధించగా.. టెస్టుల్లో 30 సెంచరీలు, టీ20ల్లో ఒకటి బాదాడు. ప్రస్తుతం ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కోహ్లి, సచిన్ పేరిట సంయుక్తంగా ఉంది. కోహ్లి వన్డేల్లో 51 సెంచరీలు చేయగా.. సచిన్ టెస్టుల్లో 51 శతకాలు చేశాడు. ఈ క్రమంలో పెర్త్ వన్డేలో కోహ్లి శతక్కొడితే.. ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ను అధిగమిస్తాడు. తొలి వన్డేలో సచిన్ రికార్డు బ్రేక్ అవ్వకపోయినా మిగిలిన రెండు వన్డేల్లోనైనా కోహ్లి ఈ ఫీట్ను అందుకునే ఛాన్స్ ఉంది. కోహ్లికి ఆసీస్ గడ్డపై అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు అక్కడ 29 వన్డేలు ఆడిన విరాట్ 51.03 సగటుతో 1,327 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టు ఇదే..శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.చదవండి: IND vs AUS: 25 ఫోర్లు,8 సిక్స్లు.. పెర్త్లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ! -
గిల్, శ్రేయస్ కాదు.. అతడే టీమిండియా లీడింగ్ రన్ స్కోరర్: క్లార్క్
ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే పెర్త్ వేదికగా ఆదివారం(అక్టోబర్ 19) జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను విజయంతో ఆరంభించాలని ఇరు భావిస్తున్నాయి. అందు కోసం తమ తమ వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు దాదాపు ఏడు నెలల తర్వాత ఆడనుండడంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టాప్ రన్స్కోరర్ ఎవరు? లీడింగ్ వికెట్ టేకర్ ఎవరు? విజేత ఎవరు? అన్న ఆంశాలపై తమ అంచనాలను మాజీలు వెల్లడిస్తున్నారు. ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ చేరాడు. క్లార్క్ ఇటీవలే Beyond23 క్రికెట్ పోడ్కాస్ట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్బంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భారత్ తరపున ఎవరు టాప్ స్కోరర్గా నిలుస్తారన్న ప్రశ్న క్లార్క్కు ఎదురైంది. అందుకు బదులుగా విరాట్ కోహ్లి(Virat Kohli) పేరును క్లార్క్ చెప్పుకొచ్చాడు."నా అభిప్రాయం ప్రకారం.. ఈ సిరీస్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లిలో ఎవరు ఒకరో నిలుస్తారు. వారికి ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన అని అనుకుంటున్నారు. కాబట్టి వారు ఈ టూర్ను విజయవంతంగా ముగించే అవకాశముంది.అయితే ఆస్ట్రేలియా పిచ్లో ఓపెనర్గా వచ్చి కొత్త బంతిని ఎదుర్కొవడం అంత సులువు కాదు. అదే మూడు, నాలుగో స్దానంలో బ్యాటింగ్ చేయడం సులభం. ఎందుకంటే బంతి పాతబడి ఉంటుంది, అంతేకాకుండా పిచ్ కూడా బ్యాటర్లకు సహకరించనుంది. కాబట్టి రోహిత్ కంటే కోహ్లికే లీడింగ్ రన్స్కోరర్కే నిలిచే అవకాశాలు ఉన్నాయి" అని క్లార్క్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ పేరును క్లార్క్ చెప్పకపోవడం గమనార్హం. గిల్ కెప్టెన్గా తన తొలి టెస్టు సిరీస్లో ఇంగ్లండ్పై అదరగొట్టాడు. 700 పైగా పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అయితే ఆస్ట్రేలియాపై వన్డేల్లో గిల్కు అంత మంచి రికార్డు లేదు. గిల్ ఇప్పటివరకు 8 వన్డే ఇన్నింగ్స్లలో 35.00 సగటుతో కేవలం 280 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: IND vs AUS: 25 ఫోర్లు,8 సిక్స్లు.. పెర్త్లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ! -
రింకూ సింగ్ సూపర్ సెంచరీ..
రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా కాన్పూర్ వేదికగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ ఆటగాడు రింకూ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 185 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో రింకూ తన ఎనిమిదవ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.అతడు తన బ్యాటింగ్ను 124 పరుగులతో కొనసాగిస్తున్నాడు. విప్రజ్ నిగమ్, ఆర్యన్లతో కలిసి రింకూ కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఉత్తరప్రదేశ్ 143 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. యూపీ ఇంకా 100 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో రింకూతో పాటు శివమ్ శర్మ(9) ఉన్నారు. అంతకుముందు మాధవ్ కౌశిక్(54), ఆర్యన్(66) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆంధ్ర బౌలర్లలో ఇప్పటివరకు రిక్కీ భుయ్, పృథ్వీ రాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శశికాంత్, సౌరభ్ కుమార్లతో తలా వికెట్ పడగొట్టారు. ఇక ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్లో 470 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బ్యాటర్లలో కేఎస్ భరత్(142), షేక్ రషీద్(136) సెంచరీలతో సత్తాచాటారు. రింకూ సింగ్ ఈ మ్యాచ్ తర్వాత టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు.చదవండి: IND vs AUS: 25 ఫోర్లు,8 సిక్స్లు.. పెర్త్లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ! -
25 ఫోర్లు, 8 సిక్స్లు.. పెర్త్లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం (అక్టోబర్ 19) నుంచి ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది. ఇప్పటికే పెర్త్కు చేరుకున్న భారత జట్టు నెట్ ప్రాక్టీస్లో తీవ్రంగా శ్రమిస్తోంది.మరోవైపు ఆస్ట్రేలియా కూడా తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంది. రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరం కావడంతో ఆసీస్ జట్టు పగ్గాలను మిచెల్ మార్ష్ చేపట్టాడు. ఇక మొన్నటివరకు టీమిండియా వన్డే కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్ శర్మ.. ఇప్పడు కేవలం ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. భారత వన్డే జట్టు సారథ్య బాధ్యతలను యువ ఆటగాడు శుభ్మన్ గిల్కు అప్పగించారు. భారత వన్డే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత హిట్మ్యాన్ ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది.ఆసీస్ గడ్డపై అదుర్స్..కాగా ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. ఆసీస్లో ఇప్పటివరకు ఇప్పటివరకు 30 వన్డేలు(ప్రపంచకప్ మ్యాచ్లతో కలిపి) ఆడిన రోహిత్ శర్మ.. 53.12 సగటుతో 1,328 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఐదు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాడు.అదేవిధంగా కంగారుల గడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ల్లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. 19 వన్డేల్లో 58.23 సగటుతో 990 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. అత్యదిక స్కోర్ 171 పరుగులుగా ఉంది.పెర్త్లో తిరుగులేని హిట్మ్యాన్..ఇక తొలి వన్డే జరిగే పెర్త్లో కూడా రోహిత్ మంచి రికార్డు ఉంది. పెర్త్ మైదానంలో హిట్మ్యాన్ కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడి 122.5 సగటుతో ఏకంగా 245 పరుగులు చేశాడు. ఈ వేదికగా 2016లో ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేశాడు. ఈ మైదానంలో రోహిత్ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్లో 163 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్..13 ఫోర్లు, 7 సిక్స్లతో 171 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. పెర్త్లోనే వాకా స్టేడియంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు అదే జోరును కనబరిచాలని రోహిత్ అభిమానులు కోరుకుంటున్నారు.చదవండి: 'ఇదొక క్రూరమైన చర్య'.. అఫ్గాన్ క్రికెటర్ల మృతిపై రషీద్ ఖాన్ దిగ్భ్రాంతి -
శ్రీలంక చిత్తు.. 10 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం
మహిళల వన్డే వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం వాన అంతరాయం కలిగించిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. వర్షంతో కొలంబోలో మూడు మ్యాచ్లు రద్దయిన తర్వాత ఎట్టకేలకు ‘టి20’ ఫార్మాట్లో ఫలితం రావడం విశేషం. టాస్ గెలిచిన లంక 12 ఓవర్లలో లంక 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం కారణంగా సుదీర్ఘ సమయం పాటు ఆట నిలిచిపోయింది. చివరకు అంపైర్లు మ్యాచ్కు 20 ఓవర్లకు కుదించారు. 20 ఓవర్లలో శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి 105 పరుగులు సాధించింది. విష్మి గుణరత్నే (34; 6 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా... ఎంలాబా 3, క్లాస్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని డక్వర్త్–లూయిస్ పద్ధతి ప్రకారం 20 ఓవర్లలో 121 పరుగులుగా నిర్దేశించారు. దక్షిణాఫ్రికా జట్టు 14.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 125 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ లారా వోల్వార్ట్ (47 బంతుల్లో 60 నాటౌట్; 8 ఫోర్లు), తజ్జీమన్ బ్రిట్స్ (42 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయంగా మ్యాచ్ను ముగించారు. నేడు కొలంబోలో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్తో న్యూజిలాండ్ తలపడుతుంది.చదవండి: పాకిస్తాన్ దాడి.. ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్ల మృతి -
'ఇదొక క్రూరమైన చర్య'.. అఫ్గాన్ క్రికెటర్ల మృతిపై రషీద్ ఖాన్ దిగ్భ్రాంతి
పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది. అఫ్గానిస్తాన్లోని పక్తికా ప్రావిన్స్లో శుక్రవారం సాయంత్రం పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో మొత్తం 8 మంది మృతి చెందారు. అందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు కూడా ఉన్నారు.ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు షరానా పట్టణానికి వెళ్లి.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో పాక్ దుశ్చర్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటనపై అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. పాకిస్తాన్పై రషీద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనను అత్యంత క్రూరమైన చర్యగా అతడు పేర్కొన్నాడు."పాకిస్తాన్ జరిపిన దాడిలో పౌరులు, దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సాధారణ ప్రజులు నివసించే ప్రాంతాలను టార్గెట్ చేసి దాడి చేయడం ఒక క్రూరమైన చర్య. ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యలు మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనను సూచిస్తాయి. పాకిస్తాన్తో జరగబోయే మక్కోణపు సిరీస్ నుంచి వైదొలగాలనే ఏసీబీ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవాలనుకుంటున్నాను. దేశమే అన్నింటికంటే ముందు అని రషీద్ ఎక్స్లో రాసుకొచ్చాడు. అదేవిధంగా మహ్మద్ నబీ, రెహ్మతుల్లా గుర్భాజ్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా తమ సంతాపం తెలియజేశారు.చదవండి: పాకిస్తాన్ దాడి.. ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్ల మృతి -
పాకిస్తాన్ దాడి.. ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్ల మృతి
అఫ్గానిస్తాన్ క్రికెట్(Afghanistan) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాక్ సరిహద్దులోని తూర్పు పాక్తిక ప్రావిన్స్లో పాకిస్తాన్(Pakistan) సైన్యం జరిపిన బాంబు దాడిలో ముగ్గురు అఫ్గాన్ దేశవాళీ క్రికెటర్లు మృతి చెందారు. ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రకారం.. ఆటగాళ్లు తూర్పు పాక్టికా ప్రావిన్స్లోని ఉర్గున్ నుండి షరానాకు ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. మృతి చెందిన క్రికెటర్లను కబీర్, సిబాతుల్లా, హరూన్గా గుర్తించారు. ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి తిరిగి వస్తుండగా పాక్ సైనం కృరత్వానికి వారు బలై అయిపోయారు.ఈ దాడిలో క్రికెటర్లతో మరో ఐదుగురు అఫ్గాన్ పౌరులు సైతం ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడి కారణంగా నవంబర్లో శ్రీలంక-పాకిస్తాన్తో జరిగాల్సిన ట్రై సిరీస్ నుంచి అఫ్గానిస్తాన్ తప్పుకొంది."ఈ హృదయ విదారక ఘటనలో ఉర్గున్ జిల్లాకు చెందిన మా ముగ్గురు ఆటగాళ్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్లను కోల్పోయాము. ఉర్గున్ కు తిరిగి వచ్చాక ఓ సమావేశంలో ఈ దాడి జరిగింది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన పిరికి పంద చర్య. మా క్రికెటర్లతో పాటు మరో ఐదుగురు అఫ్గాన్ పౌరులు మృతి చెందారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. బాధితులకు గౌరవ సూచకంగా నవంబర్ చివరలో జరగనున్న పాకిస్తాన్తో జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాము అని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా అక్టోబర్ 11 నుంచి పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత తాలిబాన్లపై పాకిస్తాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించగా.. ప్రతీకారంగా తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యం ఔట్ పోస్టులపై డ్రోన్ బాంబులతో దాడి చేశారు. ఇరువైపుల కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. సీజ్ ఫైర్ ముగిసిన వెంటనే పాక్ మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
మహారాష్ట్ర బ్యాటర్ కిరణ్ నవ్గిరే(Kiran Navgire) మహిళల టి20 క్రికెట్లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. బీసీసీఐ సీనియర్ మహిళల టి20 ట్రోఫీ (ఎలైట్)లో భాగంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కిరణ్ 34 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసింది. దీంతో మహిళల టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్గా నవ్గిరే నిలిచింది.ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ పేరిట ఉండేది. డివైన్ సూపర్ స్మాష్ టీ20 లీగ్ 2021లో 36 బంతుల్లో శతక్కొట్టింది. తాజా ఇన్నింగ్స్లో డివైన్ ఆల్టైమ్ రికార్డును నవ్గిరే బ్రేక్ చేసింది.శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో కిరణ్ మొత్తం 35 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అంతకుముందు పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 110 పరుగులు చేయగా... కిరణ్ విధ్వంసంతో మహారాష్ట్ర 8 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 113 పరుగులు సాధించింది.కిరణ్ మినహా ఇతర బ్యాటర్లు ఈశ్వరి 1, ముక్త 6 పరుగులు మాత్రమే చేశారు! మహిళల టి20ల్లో 300కు పైగా స్ట్రయిక్ రేట్తో నమోదైన సెంచరీ (302.86) ఇదొక్కటే కావడం విశేషం. 31 ఏళ్ల కిరణ్ నవ్గిరే 2022లో భారత్ తరఫున 6 టి20లు ఆడి 17 పరుగులు మాత్రమే చేయడంతో జట్టులో స్థానం కోల్పోయింది.చదవండి: పాకిస్తాన్ టీమ్కు కొత్త కెప్టెన్!? -
‘గిల్ నాయకుడిగా ఎదుగుతాడు’
పెర్త్: స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సమక్షంలో శుబ్మన్ గిల్ వన్డే కెప్టెన్గా రాటుదేలుతాడని భారత ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అభిప్రాయ పడ్డాడు. ఇద్దరు సీనియర్ బ్యాటర్లు తమ అనుభవంతో గిల్కు సరైన మార్గనిర్దేశనం చేయగలరని అతను అన్నాడు. ‘గిల్కు కెప్టెన్గా ఇది సరైన సమయం. కెప్టెన్లుగా పని చేసిన రోహిత్, కోహ్లి జట్టుతో ఉన్నారు. వారు అతనికి తమ వైపునుంచి సహాయపడగలరు. ఇది గిల్ నాయకుడిగా ఎదగడంలో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు తాను కెప్టెన్గా వ్యవహరించిన మ్యాచ్లలో ఎప్పుడూ ఒత్తిడికి లోను కాకపోవడం గిల్కు సంబంధించి అతి పెద్ద సానుకూలత’ అని అక్షర్ వ్యాఖ్యానించాడు. కోహ్లి, రోహిత్ల ఆట గురించి తాను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అక్షర్ గుర్తు చేశాడు. ‘కోహ్లి, రోహిత్ అత్యున్నత స్థాయి క్రికెటర్లు. వారి ఫామ్లో ఎలా ఉందో తొలి వన్డేలో తెలుస్తుంది. ప్రొఫెషనల్ ఆటగాళ్లుగా తాము ఏం చేయాలో వారిద్దరికి బాగా తెలుసు. సీఓఈలో ప్రాక్టీస్ చేసి ఈ సిరీస్కు సిద్ధమయ్యారు. నెట్స్లో, ఫిట్నెస్పరంగా కూడా చాలా చురుగ్గా కనిపిస్తున్నారు’ అని అక్షర్ వెల్లడించాడు. ఆ్రస్టేలియాలో ఎలాంటి పిచ్లు ఎదురైనా తమకు ఇబ్బంది లేదని, తాము పిచ్ల గురించి మాట్లాడటం మానేసి వ్యూహాలపైనే చర్చిస్తున్నామని అతను స్పష్టం చేశాడు. ‘ఒకప్పుడు మన జట్టు ఆ్రస్టేలియాకు వస్తే పిచ్లు, పరిస్థితులు, బౌన్స్ల గురించి చర్చ జరిగేది. మేం చాలా తక్కువగా కూడా అక్కడ ఆడేవాళ్లం. కానీ 2015 వరల్డ్ కప్ తర్వాత పరిస్థితి మారింది. మేం ఇక్కడ ఎక్కువగా ఆడటం మొదలు పెట్టడంతో బ్యాటింగ్ కూడా మెరుగైంది. ఇప్పుడైతే ఆ్రస్టేలియాలో ఆడుతున్నట్లు అనిపించడం లేదు. ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరమూ లేదు. పిచ్ గురించి కాకుండా పరుగులు ఎలా చేయాలి తదితర ప్రణాళికల గురించే మాట్లాడుకుంటున్నాం’ అని అక్షర్ వివరించాడు. ఆసియా కప్లో తాను బాగా ఆడానని, ఆ్రస్టేలియా గడ్డపై సవాల్కు తాను సిద్ధంగా ఉన్నట్లు అతను పేర్కొన్నాడు. -
విదర్భ విజయఢంకా
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో... డిఫెండింగ్ చాంపియన్ విదర్భ శుభారంభం చేసింది. గత సీజన్లో చక్కటి ఆటతీరుతో ట్రోఫీ చేజిక్కించుకున్న విదర్భ... తాజా సీజన్ ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆడిన తొలి పోరులో భారీ విజయం నమోదు చేసుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన పోరులో ఇరానీ కప్ విజేత విదర్భ జట్టు... ఇన్నింగ్స్ 179 పరుగుల తేడాతో నాగాలాండ్ను చిత్తు చేసింది. ఓవర్నైట్ స్కోరు 81/3తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నాగాలాండ్ జట్టు 69.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. డేగ నిశ్చల్ (146 బంతుల్లో 50; 3 ఫోర్లు), చేతన్ బిస్త్ (91 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. విదర్భ బౌలర్లలో నచికేత్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఫాలోఆన్ ఆడిన నాగాలాండ్ రెండో ఇన్నింగ్స్లో 46.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. చేతన్ బిస్త్ (88 బంతుల్లో 55; 8 ఫోర్లు) మరో హాఫ్సెంచరీ చేయగా మిగతా వారు విఫలమయ్యారు.విదర్భ బౌలర్లలో ఎడంచేతి వాటం స్పిన్నర్ హర్ష్ దూబే 4 వికెట్లు పడగొట్టగా... పార్థ్ రేఖడే, దర్శన్ నల్కండే చెరో 2 వికెట్లు తీశారు. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్లో 463 పరుగులు చేసింది. భారీ సెంచరీతో చెలరేగిన అమన్ మోఖడేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఫాలోఆన్లో తమిళనాడు బ్యాటర్లు ముకుమ్మడిగా విఫలమవడంతో... జార్ఖండ్తో రంజీ మ్యాచ్లో తమిళనాడు జట్టు ఫాలోఆన్లో పడింది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా కోయంబత్తూర్ వేదికగా జరుగుతున్న పోరులో ఓవర్నైట్ స్కోరు 18/5తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన తమిళనాడు చివరకు 50.4 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌటైంది. అంబరీష్ (28; 5 ఫోర్లు) టాప్స్కోరర్ కాగా... మరో ఇద్దరు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జార్ఖండ్ బౌలర్లలో జతిన్ పాండే 5 వికెట్లతో అదరగొట్టగా... సాహిల్ రాజ్ 4 వికెట్లు తీశాడు. అనంతరం ఫాలోఆన్ బరిలోకి దిగిన తమిళనాడు శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 27 ఓవర్లలో 3 వికెట్లకు 52 పరుగులు చేసింది. కెప్టెన్ జగదీశన్ (21), అంబరీష్ (15), ప్రదోశ్ (8) అవుటయ్యారు. చేతిలో 7 వికెట్లు ఉన్న తమిళనాడు జట్టు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ఇంకా 274 పరుగులు చేయాల్సి ఉంది. ఆండ్రె సిద్ధార్థ్ (3 బ్యాటింగ్), జగన్నాథన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జార్ఖండ్ బౌలర్లలో రిషవ్ రాజ్ 2 వికెట్లు తీశాడు. రైల్వేస్పై హరియాణా విజయం ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హరియాణా జట్టు రంజీ ట్రోఫీ తాజా సీజన్లో తొలి విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా సూరత్ వేదికగా శుక్రవారం ముగిసిన పోరులో హరియాణా 96 పరుగుల తేడాతో రైల్వేస్ జట్టును మట్టికరిపించింది. 249 పరుగుల లక్ష్యఛేదనలో రైల్వేస్ జట్టు చివరకు 49.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు సూరజ్ అహుజా (61 బంతుల్లో 44; 7 ఫోర్లు), వివేక్ సింగ్ (64 బంతుల్లో 44; 6 ఫోర్లు) తొలి వికెట్కు 90 పరుగులు జోడించి శుభారంభం ఇశ్మీచ్చినా... ఆ తర్వాత వశ్మీచ్చిన బ్యాటర్లు నిలవలేకపోవడంతో రైల్వేస్కు పరాజయం తప్పలేదు. హర్యానా బౌలర్లలో నిఖిల్ కశ్యప్ 5, నిశాంత్ సింధు 4 వికెట్లు పడగొట్టారు. అంతకముందు హరియాణా తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులు చేయగా... రైల్వేస్ 128 పరుగులకు పరిమితమైంది. అనంతరం హరియాణా రెండో ఇన్నింగ్స్లో 205 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు ఉరించే లక్ష్యాన్నిం ఉచింది. హరియాణా బ్యాటర్ పార్థ్ వత్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఓటమి అంచున త్రిపుర... ఆంధ్ర ఆటగాడు హనుమ విహారితో పాటు తమిళనాడు ప్లేయర్ విజయ్ శంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న త్రిపుర జట్టు ఇన్నింగ్స్ పరాజయం అంచున నిలిచింది. గ్రూప్ ‘సి’లో భాగంగా సర్వీసెస్తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 176 పరుగులకే ఆలౌటైన త్రిపుర శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 42 ఓవర్లలో 7 వికెట్లకు 114 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో విహారి (16) విఫలం కాగా... విజయ్ శంకర్ (132 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో హనుమ విహారి 7 పరుగులే చేయగా... విజయ్ శంకర్ 8 పరుగుల వద్ద అవుటయ్యాడు. చేతిలో 3 వికెట్లు ఉన్న త్రిపుర జట్టు ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకోవాలంటే ఇంకా 69 పరుగులు చేయాల్సి ఉంది. జమ్మూకశ్మీర్ లక్ష్యం 243 బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో... ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా శ్రీనగర్ వేదికగా జమ్మూకశ్మీర్తో జరుగుతున్న పోరులో ముంబై రెండో ఇన్నింగ్స్లో 181 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ప్లేయర్ అజింక్యా రహానే (0), ముషీర్ ఖాన్ (8), ఆయుశ్ మాత్రే (13), సిద్ధేశ్ లాడ్ (10), శార్దుల్ ఠాకూర్ (9), తనుశ్ కొటియాన్ (10) విఫలం కాగా... సర్ఫరాజ్ ఖాన్ (32), షమ్స్ ములానీ (41), ఆకాశ్ ఆనంద్ (31) ఫర్వాలేదనిపించారు. జమ్మూకశ్మీర్ బౌలర్లలో అఖీబ్ నబీ 5 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 386 పరుగులు చేయగా... జమ్మూకశ్మీర్ జట్టు 325 పరుగులు చేసింది. దీంతో కశ్మీర్ ముందు 243 పరుగుల లక్ష్యం నిలవగా... శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 7 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 21 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న జమ్మూకశ్మీర్ జట్టు విజయానికి ఇంకా 222 పరుగులు చేయాల్సి ఉంది. » కేరళతో జరుగుతున్న మ్యాచ్లో మహారాష్ట్ర జట్టు స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకుంది. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 239 పరుగులకు ఆలౌట్ కాగా... కేరళ జట్టు 219 పరుగులకే పరిమితమైంది. మూడో రోజు ఆట ముగిసే సరికి మహారాష్ట్ర 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. » రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో బాగంగా ఒడిశాతో మ్యాచ్లో బరోడా జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకుంది. ఒడిశా తొలి ఇన్నింగ్స్లో 271 పరుగులకు పరిమితం కాగా... మూడో రోజు ఆట ముగిసే సమయానికి బరోడా తొలి ఇన్నింగ్స్లో 146 ఓవర్లలో 7 వికెట్లకు 413 పరుగులు చేసింది. శివాలిక్ శర్మ (124; 10 ఫోర్లు, 2 సిక్స్లు), మితేశ్ పటేల్ (100 బ్యాటింగ్; 11 ఫోర్లు) సెంచరీలు బాదారు. రజత్ డబుల్ సెంచరీ రజత్ పాటీదార్ (332 బంతుల్లో 205 బ్యాటింగ్; 26 ఫోర్లు) అజేయ ద్విశతకంతో చెలరేగడంతో... మధ్యప్రదేశ్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఇండోర్ వేదికగా పంజాబ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ జట్టు 146 ఓవర్లలో 8 వికెట్లకు 519 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 305/6తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్... వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్లో మరో మూడు వికెట్లు కోల్పోయి 200 పైచిలుకు పరుగులు జత చేసింది. క్రితం రోజే సెంచరీ పూర్తి చేసుకున్న పాటీదార్... డబుల్ సెంచరీ ఖాతాలో వేసుకోగా... అర్షద్ ఖాన్ (60 బంతుల్లో 60; 3 ఫోర్లు, 5 సిక్స్లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సారాంశ్ జైన్ (30), సాగర్ సోలంకి (26) ఫర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో ప్రేరిత్ దత్తా 4 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు పంజాబ్ 232 పరుగులకే ఆలౌటైంది. చేతిలో మరో రెండు వికెట్లు ఉన్న మధ్యప్రదేశ్ జట్టు ప్రస్తుతం 287 పరుగుల ఆధిక్యంలో ఉంది. రజత్ పాటీదార్తో పాటు అర్షద్ ఖాన్ క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు చివరి రోజు. -
IND vs AUS: జట్లు, షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు వెళ్లింది. ఇందులో భాగంగా ఆదివారం (అక్టోబరు 19)నాటి మ్యాచ్తో తొలుత వన్డే సిరీస్కు తెరలేస్తుంది. అనంతరం ఆసీస్- భారత్ (IND vs AUS) ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు ముహూర్తం ఖరారైంది.ఇందుకోసం ఇప్పటికే టీమిండియా- ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందాం!ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా వన్డే సిరీస్ షెడ్యూల్🏏తొలి వన్డే: అక్టోబరు 19 (ఆదివారం)- పెర్త్ స్టేడియం, పెర్త్🏏రెండో వన్డే: అక్టోబరు 23 (గురువారం)- అడిలైడ్ ఓవల్, అడిలైడ్🏏మూడో వన్డే: అక్టోబరు 25 (శనివారం)- సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం ఆసీస్- భారత్ వన్డే మ్యాచ్లు ఉదయం 9 గంటలకు ఆరంభంఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్🏏తొలి టీ20: అక్టోబరు 29 (బుధవారం)- మనుకా ఓవల్, కాన్బెర్రా🏏రెండో టీ20: అక్టోబరు 31 (శుక్రవారం)- మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్🏏మూడో టీ20: నవంబరు 2 (ఆదివారం)- బెలిరివ్ ఓవల్, హోబర్ట్🏏నాలుగో టీ20: నవంబరు 6 (గురువారం)- బిల్ పిప్పెన్ ఓవల్, గోల్డ్ కోస్ట్🏏ఐదో టీ20: నవంబరు 8 (శనివారం)- ది గాబా, బ్రిస్బేన్.👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు టీ20 మ్యాచ్లు ఆరంభం.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..👉జియో హాట్స్టార్ యాప్, వెబ్సైట్లో మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం👉టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్స్లో ప్రసారంఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు భారత జట్టుఅభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మార్నస్ లబుషేన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.భారత్తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టు (తొలి రెండు మ్యాచ్లకు మాత్రమే)మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ -
రీఎంట్రీలో అదరగొట్టిన సంజూ శాంసన్.. ‘మెరుపు’ అర్ధ శతకం
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో శుభారంభం అందుకున్నాడు. మహారాష్ట్రతో మ్యాచ్లో ఈ కేరళ బ్యాటర్ ‘మెరుపు’ అర్ధ శతకం సాధించాడు. దేశీ ఫస్ట్క్లాస్ టోర్నీ రంజీ తాజా సీజన్ బుధవారం మొదలైన విషయం తెలిసిందే.రుతురాజ్ గైక్వాడ్ పోరాటంఈ క్రమంలో ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళ- మహారాష్ట్ర (Kerala Vs Maharashtra) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. మహారాష్ట్ర బ్యాటింగ్కు దిగింది. టాపార్డర్ విఫలమైన చోట రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad- 151 బంతుల్లో 91; 11 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడటంతో... మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 84.1 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్ల ధాటికి ఒక దశలో 18/5తో నిలిచిన మహారాష్ట్ర ఆ తర్వాత లోయర్ ఆర్డర్ పోరాటంతో తేరుకుంది. జలజ్ సక్సేనా (49; 4 ఫోర్లు), వికీ ఓస్త్వాల్ (38), రామకృష్ణ ఘోష్ (31) ఆకట్టుకున్నారు.కేరళ బౌలర్లలో నిదీశ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టు గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10.4 ఓవర్లలో 3 వికెట్లకు 35 పరుగులు చేసింది.ఘీ క్రమంలో 35/3 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలు పెట్టిన కేరళ ఇన్నింగ్స్ను సంజూ చక్కదిద్దాడు.సంజూ శాంసన్ ‘మెరుపు’ అర్ధ శతకంఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సంజూ 63 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 54 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అజారుద్దీన్ 36 పరుగులతో ఆకట్టుకోగా.. సల్మాన్ నిజార్ 49 పరుగులతో రాణించాడు.అయితే, మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం అందకపోవడంతో 63.2 ఓవర్లలో కేరళ 219 పరుగులకు ఆలౌట్ అయింది. సంజూ పోరాడినప్పటికీ కేరళను ఆధిక్యంలోకి తీసుకురాలేకపోయాడు. ఇరవై పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు శుభారంభమే దక్కింది. ఆధిక్యంలో మహారాష్ట్రతొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఓపెనర్లు పృథ్వీ షా 37, అర్షిన్ కులకర్ణి 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసేసరికి తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా మహారాష్ట్ర 51 పరుగులు చేసింది. తద్వారా కేరళ కంటే 71 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.ఆసీస్తో టీ20 సిరీస్ ఆడేందుకు సంజూకాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు టీమిండియా సెలక్టర్లు సంజూ శాంసన్ను ఎంపిక చేయలేదన్న విషయం తెలిసిందే. దీంతో అతడు సొంత జట్టు కేరళ తరఫున రీఎంట్రీ ఇస్తూ రంజీ బరిలో దిగాడు. అయితే, ఆసీస్తో టీ20 సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో త్వరలోనే సంజూ జట్టును వీడనున్నాడు. ఇక అక్టోబరు 19- 29 వరకు ఆసీస్- భారత్ మధ్య వన్డే సిరీస్.. అక్టోబరు 29- నవంబరు 8 మధ్య టీ20 సిరీస్ జరుగునుంది. చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ -
‘సిగ్గుచేటు’ అంటూ గంభీర్ ఫైర్.. అశ్విన్ స్పందన ఇదే
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్తో కలిసి సంజూ శాంసన్ (Sanju Samson)ను కాదని.. ధ్రువ్ జురెల్ను ఎంపిక చేయడం.. అదే విధంగా.. యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana)కు ఈ జట్టులో చోటివ్వడం విమర్శలకు దారితీశాయి.టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్కు ప్రియ శిష్యుడు గనుకే హర్షిత్ రాణాకు వరుస అవకాశాలు ఇస్తున్నారని మాజీ క్రికెటర్లు విమర్శించారు. చెన్నై దిగ్గజాలు క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రధానంగా ఈ మేరకు విమర్శలు చేశారు. ఈ క్రమంలో హర్షిత్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.‘సిగ్గుచేటు’ అంటూ గంభీర్ ఫైర్ఈ నేపథ్యంలో వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా గెలిచిన తర్వాత గంభీర్ ఈ విషయంపై స్పందించాడు. యూట్యూబ్ చానెళ్ల వ్యూస్ కోసం కుర్రాడి జీవితాన్ని నాశనం చేస్తారా?.. సిగ్గుచేటు అని మండిపడ్డాడు. కావాలంటే తనను ఏమైనా అనొచ్చని.. కానీ 23 ఏళ్ల హర్షిత్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. అతడి తండ్రి మాజీ క్రికెటరో, సెలక్టరో కాదని.. నైపుణ్యాలతోనే అవకాశాలు దక్కించుకుంటున్నాడని గంభీర్ పేర్కొన్నాడు.కచ్చితంగా విమర్శిస్తానంటూనే.. ఈ క్రమంలో అశ్విన్ తాజాగా గంభీర్ వ్యాఖ్యలపై తన స్పందన తెలియజేశాడు. అయితే, ఈసారి అశూ మాట మార్చడం విశేషం. హర్షిత్ నైపుణ్యాలను కచ్చితంగా విమర్శిస్తానంటూనే.. వ్యక్తిగతంగా ఎవరూ ఎవరినీ టార్గెట్ చేయవద్దంటూ హితవు పలికాడు. సోషల్ మీడియాలో ప్రతికూల విషయాలే తొందరగా వ్యాప్తి చెందుతాయని.. వీటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.పగ పెట్టుకోలేదు‘‘నేను మరోసారి చెప్తున్నా.. ఏ ఆటగాడిని వ్యక్తిగతంగా విమర్శించవద్దు. పర్సనల్ అటాక్కి దిగితే జానర్ మారిపోతుంది. నా కెరీర్ ఆసాంతం సంజయ్ మంజ్రేకర్ నన్ను విమర్శిస్తూనే ఉన్నారు. అయినా సరే నేనేమీ ఆయన మీద పగ పెట్టుకోలేదు.విమర్శలు చెప్పేది సరైంది లేదంటే తప్పు కావొచ్చు. కానీ ముందుగా చెప్పినట్లు అది వ్యక్తిగతంగా ఉండకూడదు. ఒకవేళ హర్షిత్ రాణా.. తనను ఎవరైనా కఠిన పదజాలంతో విమర్శించిన వీడియో చూస్తే అతడి పరిస్థితి ఏమై పోతుంది?మ్యాచ్కు ముందు ఇలాంటివి జరిగితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది?.. ఒకవేళ అతడి తల్లిదండ్రులు, స్నేహితులు ఎవరైనా ఈ వీడియోల గురించి తనకు చెబితే పరిస్థితి ఏంటి? ఓ ఆటగాడి నైపుణ్యాలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది.దానికే ఇక్కడ డిమాండ్ ఎక్కువకానీ వ్యక్తిగతంగా మాత్రం వద్దు. ఇలా చేయడం ఒకటీ రెండు సార్లు బాగుంటుంది. ఆ తర్వాత పరిస్థితి గంభీరంగా మారిపోతుంది. ఈరోజుల్లో నెగటివిటీ అమ్ముడుపోయే వస్తువుగా మారిపోయింది. ఎందుకంటే దానికే ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది.ప్రస్తుతం హర్షిత్ రాణాను అన్ని కోణాల్లో టార్గెట్ చేస్తున్న వాళ్లు.. అతడు ఒకవేళ వచ్చే ఏడాది బాగా ఆడితే.. తన నైపుణ్యాల గురించి ఇదే స్థాయిలో ప్రశంసిస్తారా? లేదంటే కేవలం ప్రతికూలతల వరకే పరిమితం అవుతారా?’’ అంటూ అశూ ఫైర్ అయ్యాడు. హర్షిత్ నైపుణ్యాలను మాత్రమే తాను విమర్శించానంటూ పరోక్షంగా చిక్కాపైకే అంతా నెట్టేశాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లకు ముహూర్తం ఖరారైంది.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్