breaking news
Cricket
-
జింబాబ్వే ప్లేయర్ ప్రపంచ రికార్డు.. వన్డే క్రికెట్ చరిత్రలోనే
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే వెటరన్ బ్యాటర్, మాజీ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ అద్భుత హాఫ్ సెంచరీతో రాణించాడు. ఐదో స్థానంలో మైదానంలోకి దిగిన ఎర్విన్ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. మొత్తంగా 79 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ అద్భుత ఇన్నింగ్స్తో ఎర్విన్ వన్డే క్రికెట్లో ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న జట్ల తరఫున వన్డేల్లో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఎర్విన్ చరిత్ర సృష్టించాడు. 41 సంవత్సరాల 32 రోజుల వయస్సులో ఎర్విన్ ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ సీనియర్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ పేరిట ఉండేది. నబీ 40 ఏళ్ల 286 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, తాజాగా ఎర్విన్ దానిని అధిగమించాడు.వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కులు వీరేక్రెగ్ ఎర్విన్ (జింబాబ్వే): 41 ఏళ్ల 32 రోజులు (వర్సెస్ ఆస్ట్రేలియా, 2026)మహ్మద్ నబీ (అఫ్గానిస్థాన్): 40 ఏళ్ల 286 రోజులు (వర్సెస్ బంగ్లాదేశ్, 2025)మిస్బా ఉల్ హక్ (పాకిస్థాన్): 40 ఏళ్ల 283 రోజులు (వర్సెస్ దక్షిణాఫ్రికా, 2015)జియోఫ్రీ బాయ్కాట్ (ఇంగ్లండ్): 40 ఏళ్ల 226 రోజులు (వర్సెస్ ఆస్ట్రేలియా, 1981)క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్): 40 ఏళ్ల 155 రోజులు (వర్సెస్ శ్రీలంక, 1985)చరిత్రలో తొలిసారి!ఈ మ్యాచ్లో ఎర్విన్ రికార్డుతో పాటు మరొక అరుదైన రికార్డు నమోదైంది. జింబాబ్వే తుది జట్టులో క్రెగ్ ఎర్విన్, సికందర్ రజా, బ్రెండన్ టేలర్, గ్రేమ్ క్రీమర్ రూపంలో ఏకంగా నలుగురు 40 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు బరిలోకి దిగారు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక జట్టు తరఫున ఒకే మ్యాచ్లో నలుగురు 40 ప్లస్ ఏళ్ల ప్లేయర్లు ఆడటం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.చదవండి: IND vs WI: విండీస్ టీమ్లో మరో పూరన్.. ఈ కొత్త 'పూరన్' మామూలోడు కాదు! -
విండీస్ టీమ్లో మరో పూరన్.. ఈ కొత్త 'పూరన్' మామూలోడు కాదు!
భారత్తో జరిగే 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల సిరీస్ల కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తాజాగా తమ జట్టును ప్రకటించింది. ఈ జట్లకు టీమ్లకు కూడా షై హోప్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఇటీవల సొంతగడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్తో సిరీస్లు ఆడిన జట్లలో పెద్దగా మార్పులు చేయకుండా టీమ్లను ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకుంటున్న హెట్మైర్ను టీ20లకే ఎంపిక చేయగా, సీనియర్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్కు ఈ సిరీస్లనుంచి విశ్రాంతి కల్పించారు.ఎవరీ కామిల్ పూరన్?అయితే ఈ జట్టు ఎంపికలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు 'కామిల్ పూరన్'. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2026) లో సెయింట్ లూసియా కింగ్స్ తరఫున ఓపెనర్గా చెలరేగిపోవడంతో ఈ విధ్వంసకర ఆటగాడికి తొలిసారి జాతీయ టీ20 జట్టులో చోటు దక్కింది. స 8 ఇన్నింగ్స్ల్లోనే 160 స్ట్రైక్ రేట్, 39 సగటుతో 273 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు.30 ఏళ్ల పూరన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు ఆడుతున్నాడు. ఇప్పటివరకు 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలతో కలిపి 333 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయడం ఇతడి ప్రత్యేకం. లిస్ట్-ఎ క్రికెట్లో పెద్దగా రాణించకపోయినా, టీ20ల్లో మాత్రం పూరన్ ఫామ్ చూస్తుంటే భారత బౌలర్లకు అతడితో గండం తప్పదనిపిస్తోంది.భారత్కు విటల్ సవాల్?మరోవైపు విండీస్ 19 ఏళ్ల యంగ్ స్పిన్ సంచలనం 'విటల్ లాస్' నుంచి భారత బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. జూలైలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన లాస్.. తన సంచలన బౌలింగ్తో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు.స్పిన్ను అద్భుతంగా ఆడగలిగే కివీస్ బ్యాటర్లే అతడి ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడారు. ఇప్పటివరకు ఆడిన 5 వన్డేల్లో 5.3 ఎకానమీతో 8 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇటీవలి సీపీఎల్ లోనూ మెరిసిన ఈ యంగ్ స్పిన్నర్, టీమిండియాను ఏ మేర తిప్పలు పెడతాడో చూడాలి.విండీస్ వన్డే జట్టు: హోప్ (కెప్టెన్), జ్వెల్ ఆండ్రూ, జాన్ క్యాంప్బెల్, కీసీ కార్టీ, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జంగూ, అల్జారి జోసెఫ్, షామర్ జోసెఫ్, విటెల్ లాస్, గుడకేశ్ మోతీ, కీమో పాల్, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, జేడెన్ సీల్స్. విండీస్ టి20 జట్టు: హోప్ (కెపె్టన్), జ్వెల్ ఆండ్రూ, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, అకీల్ హొసీన్, షామర్ జోసెఫ్, గుడకేశ్ మోతీ, కీమో పాల్, కామిల్ పూరన్, రావ్మన్ పావెల్, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, క్వింటన్ సాంప్సన్, రొమారియో షెఫర్డ్, షామర్ స్ప్రింగర్.చదవండి: IND vs NZ: టీమిండియాకు కొత్త కెప్టెన్? -
జట్టు ప్రకటన.. కెప్టెన్గా మహ్మద్ సిరాజ్
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లోని మొదటి రెండు మ్యాచ్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నాయకత్వం వహించనుండగా, సి.వి. మిలింద్ వైస్ కెప్టెన్గా (డిప్యూటీ) ఎంపికయ్యాడు. తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరత్ రెడ్డి వంటి ప్రముఖ ప్లేయర్లకు ఈ జట్టులో చోటు దక్కింది.ఎలైట్ గ్రూప్-బిలో ఉన్న హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్లో త్రిపురతో (అక్టోబర్ 11-14) తలపడనుంది. అనంతరం విజయనగరం వేదికగా జరిగే రెండో మ్యాచ్లో ఆంధ్ర జట్టును ఢీకొట్టనుంది. అయితే ఈ మొదటి రెండు మ్యాచ్లకు మాత్రమే సిరాజ్ అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత అతడు న్యూజిలాండ్ పర్యటన కోసం భారత జట్టుతో కలిసి వెళ్లనున్నాడు.మరోవైపు కల్నల్ సి.కె. నాయుడు ట్రోఫీలో రైల్వేస్ (అక్టోబర్ 12), ఉత్తరాఖండ్ (అక్టోబర్ 19) జట్లతో తలపడే అండర్-23 జట్టును కూడా హెసీఎ ప్రకటించింది. ఈ జట్టుకు పేరాల అమన్ రావు నాయకత్వం వహించనుండగా, ఆరోన్ జార్జ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.హైదరాబాద్ రంజీ జట్టుమహ్మద్ సిరాజ్ (కెప్టెన్), సి.వి. మిలింద్ (వైస్-కెప్టెన్.), తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, రాహుల్ సింగ్, హిమ తేజ, రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), సాయి ప్రగ్నయ్ రెడ్డి (వికెట్ కీపర్), వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, రక్షన్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, రుతిక్ యాదవ్ మెండే, సాయి వికాస్ రెడ్డి.హైదరాబాద్ అండర్-23 జట్టుఅమన్రావు (కెప్టెన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెప్టెన్), ఎ. అవనీష్ రావ్ (వికెట్ కీపర్), రాఘవ్ పట్టాపు, వాఫీ కచ్చి, ఎ. విఘ్నేష్ రెడ్డి, సుంకరి ధీరజ్ (వికెట్ కీపర్), ఆర్. సాయి శరణ్, ప్రణవ్ వర్మ, మురుగన్ అభిషేక్, కుష్ అగర్వాల్, నిశాంత్ మహోద్లీ, డినేష్. రాహుల్. కార్తికేయ.చదవండి: IND vs NZ: టీమిండియాకు కొత్త కెప్టెన్? -
టీమిండియాకు కొత్త కెప్టెన్?
వెస్టిండీస్తో స్వదేశంలో వైట్-బాల్ సిరీస్ పూర్తి చేసుకున్న తర్వాత భారత క్రికెట్ జట్టు ఆల్-ఫార్మాట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య కివీస్ జట్టుతో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్లలో తలపడనుంది. అయితే వైట్-బాల్ మ్యాచ్లతో పోలిస్తే ఈ టూర్లో టెస్టు సిరీస్ భారత్కు అత్యంత కీలకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఖచ్చితంగా కివీస్ను ఓడించాల్సి ఉంది. ఇందుకోసం టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది.చివరి వన్డే ముగిసిన కేవలం మూడు రోజులకే మొదటి టెస్టు ప్రారంభం కానుంది. దీంతో కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు టెస్టు జట్టుకు ఎంపికైన ముఖ్య ఆటగాళ్లు చివరి రెండు వన్డేల నుంచి విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరంతా వెల్లింగ్టన్లో జరిగే మొదటి టెస్టు కోసం ముందుగానే రెడ్-బాల్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. గిల్ గైర్హాజరీలో చివరి రెండు వన్డేలకు భారత జట్టు నాయకత్వ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ చేపట్టే అవకాశం ఉంది. గిల్తో పాటు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ వంటి ప్లేయర్లు కివీస్తో చివరి రెండు వన్డేలకు దూరమయ్యే ఛాన్స్ ఉంది.టీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20: అక్టోబర్ 22 – క్రిస్ట్చర్చ్ (మధ్యాహ్నం 12:30) రెండో టీ20: అక్టోబర్ 24 – క్రిస్ట్చర్చ్ (మధ్యాహ్నం 12:30)మూడో టీ20: అక్టోబర్ 27- వెల్లింగ్టన్ (మధ్యాహ్నం 12:30)నాలుగో టీ20: అక్టోబర్ 30-ఆక్లాండ్ (మధ్యాహ్నం 12:30)ఐదో టీ20: నవంబర్ 1 – హామిల్టన్ (మధ్యాహ్నం 12:30)వన్డే సిరీస్ షెడ్యూల్తొలి వన్డే: నవంబర్ 4 – ఆక్లాండ్ (ఉదయం 7:30) రెండో వన్డే: నవంబర్ 7 – వెల్లింగ్టన్ ((ఉదయం 7:30)మూడువ వన్డే: నవంబర్ 10 - హామిల్టన్ (ఉదయం 7:30)నాలుగో వన్డే: నవంబర్ 13 : మౌంట్ మాంగనుయ్ -ఆక్లాండ్ (ఉదయం 7:30)5వ వన్డే: నవంబర్ 15 – మౌంట్ మాంగనుయ్ (బే ఓవల్) (ఉదయం 7:30)టెస్టు సిరీస్తొలి టెస్టు: నవంబర్ 19 - నవంబర్ 23 – వెల్లింగ్టన్ (ఉదయం 3:30)రెండో టెస్టు: నవంబర్ 27 - డిసెంబర్ 1 – హ్యాగ్లే ఓవల్, క్రిస్ట్చర్చ్ (ఉదయం 3:30) -
టీమిండియా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. ఫాస్టెస్ట్ సెంచరీ!
ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్ పోటీల్లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన రెండో సెమీఫైనల్లో 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసి తుది పోరుకు భారత్ అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ప్రీత్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగింది. షెఫాలీ 49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్ప్రీత్ కౌర్ (40), స్మృతి మంధాన(37) రాణించారు. అనంతరం ఈ భారీ లక్ష్య చేధనలో బంగ్లా జట్టు భారత బౌలర్ల ధాటికి 81 పరుగులకు కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్లో తుపాన్ సెంచరీతో విరుచుకుపడ్డ షెఫాలీ వర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.షెఫాలీ సాధించిన రికార్డులు ఇవే👉మహిళల ఆసియా గేమ్స్ క్రికెట్ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్గా షెఫాలీ రికార్డు సృష్టించింది.👉మహిళల టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన హర్మన్ప్రీత్ కౌర్ రికార్డును షాఫాలీ సమం చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఇంతకుముందు న్యూజిలాండ్పై 49 బంతుల్లోనే శతక్కొట్టింది.👉టీ20 సెంచరీ చేసిన మూడో భారత మహిళా బ్యాటర్గా షెఫాలీ నిలిచింది. ఆమె కంటే ముందు స్మృతి మంధాన (2 సెంచరీలు), హర్మన్ప్రీత్ కౌర్ ఈ ఫీట్ సాధించారు.👉మహిళల టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మార్కును అందుకున్న రెండో భారత బ్యాటర్గా షెఫాలీ రికార్డులకెక్కింది. ఓవరాల్గా ప్రపంచంలో ఐదో బ్యాటర్గా ఆమె నిలిచింది.👉మహిళల టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా షాఫాలీ వర్మ (104) రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ ఫీట్ మంధాన(100) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో ఆమెను షెఫాలీ అధిగమించింది.👉మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఈయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా షెఫాలీ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది టీ20ల్లో షెఫాలీ వర్మ ఏకంగా 35 సిక్సర్లు బాదింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు (32 సిక్సర్లు, 2024) పేరిట ఉండేది.👉ఒక క్యాలెండర్ ఇయర్లో భారత మహిళల జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా షెఫాలీ నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఆమె 815 పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు స్మృతి మంధాన (763 పరుగులు, 2024) పేరిట ఉండేది. తాజా నాక్తో మంధాన ఆల్టైమ్ రికార్డును షెఫాలీ బ్రేక్ చేసింది.చదవండి: టీమిండియాతో సిరీస్కు వెస్టిండీస్ జట్ల ప్రకటన -
షఫాలీ సెంచరీ, బౌలర్ల విజృంభణ.. ఫైనల్స్కు టీమిండియా
ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో భారత్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా బంగ్లాదేశ్పై 115 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, రెండో ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఇవాళ ఉదయమే జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్ను చిత్తు చేసి శ్రీలంక తొలి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. సెప్టెంబర్ 22న స్వర్ణ పతకం కోసం జరిగే ఫైనల్లో శ్రీలంక టీమిండియాను ఢీకొంటుంది. అదే రోజు కాంస్య పతకం కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడతాయి. ఫైనల్లో ఓడిన జట్టు రజతంతో సరిపెట్టుకుంటుంది.భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (49 బంతుల్లో 100 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్లో స్మృతి మంధన (19 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ (33 బంతుల్లో 40; 6 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. మిగతా ప్లేయర్లలో కమలిని (3), రిచా ఘోష్ (2) నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో షంజిద అక్తర్, రబేయా ఖాన్, నహిద అక్తర్, మరుఫా అక్తర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. పేసర్ నందిన శర్మ (4-0-25-3) అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లా పతనాన్ని శాశించింది. ఆమెకు స్పిన్నర్లు శ్రీచరణి (3-1-7-2), శ్రేయాంక పాటిల్ (3-0-22-1), దీప్తి శర్మ (2.4-0-7-3) సహకరించారు. మరో పేసర్ క్రాంతి గౌడ్ (3-0-20-1) కూడా తన పాత్రకు న్యాయం చేసింది. మొత్తంగా వీరి ధాటికి బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్లో దిల్హర అక్తర్ (27), షర్మిన్ అక్తర్ (10), సుల్తానా ఖాతూన్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన మంధన -
షఫాలీ విధ్వంసకర శతకం.. టీమిండియా భారీ స్కోర్
ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో సెమీఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (49 బంతుల్లో 100 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి బంతికి సింగిల్ తీసి షఫాలీ తన సెంచరీ పూర్తి చేసుకుంది. భారత ఇన్నింగ్స్లో స్మృతి మంధన (19 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ (33 బంతుల్లో 40; 6 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. మిగతా ప్లేయర్లలో కమలిని (3), రిచా ఘోష్ (2) నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో షంజిద అక్తర్, రబేయా ఖాన్, నహిద అక్తర్, మరుఫా అక్తర్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో శ్రీలంక పాక్ను చిత్తుగా ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విజేత స్వర్ణ పతకం కోసం జరిగే ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన మంధన -
చరిత్ర సృష్టించిన మంధన
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన మరో ఘనత సాధించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించింది. ఇవాళ బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ రెండో సెమీఫైనల్లో ఈ రికార్డు నెలకొల్పింది.ఈ రికార్డు సాధించే క్రమంలో మంధన న్యూజిలాండ్ మాజీ స్టార్ సుజీ బేట్స్ను అధిగమించింది. బంగ్లాదేశ్ మ్యాచ్లో 8 పరుగుల వద్ద మంధన ఈ రికార్డు సొంతం చేసుకుంది.మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లుస్మృతి మంధన- 4788సుజీ బేట్స్- 4758హర్మన్ప్రీత్ కౌర్- 4287చమారి ఆటపట్టు- 4282సోఫీ డివైన్- 3817మంధన ఇప్పటికే మహిళల అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గానూ కొనసాగుతుంది.మరో అరుదైన రికార్డుఈ మ్యాచ్లో మంధన మరో ప్రత్యేక ఘనతను కూడా నమోదు చేసింది. మహిళల టీ20 అంతర్జాతీయాల్లో 600 ఫోర్లు పూర్తి చేసిన తొలి క్రికెటర్గా నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. ఓపెనర్లు మంధన (19 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షఫాలీ వర్మ (28 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తమ సహజ శైలిలో రెచ్చిపోవడంతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 11 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోర్ 101-2గా ఉంది. మంధన, కమలిని (3) ఔట్ కాగా.. షఫాలీ, కెప్టెన్ హర్మన్ప్రీత్ (4) క్రీజ్లో ఉన్నారు. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో శ్రీలంక పాక్ను చిత్తుగా ఓడించి ఫైనల్కు దూసకెళ్లింది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విజేత ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది. ఇదీ చదవండి: Asian Games Cricket: ఫైనల్స్కు దూసుకెళ్లిన శ్రీలంక -
Asian Games Cricket: ఫైనల్స్కు దూసుకెళ్లిన శ్రీలంక
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన తొలి సెమీస్లో పాకిస్తాన్ను 8 వికెట్ల తేడాతో చిత్త చేసి, తుది బెర్త్ దక్కించుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అయేషా జాఫర్ (71), షవాల్ జుల్ఫికర్ (54) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మిగతా ప్లేయర్లలో గుల్ ఫెరోజా డకౌట్ కాగా.. సైరా జబీన్ 17, కెప్టెన్ ఫాతిమా సనా 20 (నాటౌట్), ఎయ్మాన్ ఫాతిమా 5 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో కావ్యా కవిండి, కెప్టెన్ చమారీ ఆటపట్టు, సుగంధిక కుమారి తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు రెచ్చిపోయారు. చమారీ ఆటపట్టు (50 బంతుల్లో 83 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆమెకు హాసిని పెరీరా (42), ఇమేషా దులానీ (27), హర్షిత సమరవిక్రమ (20 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, నష్రా సంధుకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో ఓడినా, పాక్ జట్టు బ్రాంజ్ మెడల్ మ్యాచ్కు అర్హత సాధించింది. ఇవాళే భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో ఓడిన జట్టుతో పాక్ సెప్టెంబర్ 22న బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఆడుతుంది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విజేత సెప్టెంబర్ 22నే జరిగే ఫైనల్లో శ్రీలంకను ఢీకొంటుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు స్వర్ణ పతకం సాధిస్తుంది. ఓడిన జట్టు రజతంతో సరిపెట్టుకుంటుంది. ఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు -
మ్యాక్స్వెల్ ఆల్రౌండ్ షో
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) 2026లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బెల్ఫాస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతడు, ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు. తాజాగా అమ్స్టర్డామ్ ఫ్లేమ్స్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి, తన జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు.ఈ మ్యాచ్లో తొలుత బంతితో అదరగొట్టిన అతడు.. ఆతర్వాత బ్యాటింగ్లోనూ చెలరేగిపోయాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అమ్స్టర్డామ్ను మ్యాక్స్వెల్ తన స్పిన్ మాయాజాలంతో (4-0-18-4) 133 పరుగులకే కుప్పకూల్చాడు. అతడికి మాథ్యూ హంఫ్రేస్ (4-0-22-3) సహకరించాడు. అమ్స్టర్డామ్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బెల్ఫాస్ట్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖర్లో మ్యాక్స్వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి లోర్కన్ టక్కర్ (34 నాటౌట్), డెవాన్ కాన్వే (35) సహకరించారు. ఇవాళ జరిగే తుదిపోరులో బెల్ఫాస్ట్ వోల్వ్స్.. ఎడిన్బర్గ్ క్యాజిల్ రాకర్స్తో తలపడనుంది. ఇదీ చదవండి: టీమిండియాతో సిరీస్కు వెస్టిండీస్ జట్ల ప్రకటన -
టీమిండియాతో సిరీస్కు వెస్టిండీస్ జట్ల ప్రకటన
త్వరలో భారత్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ల కోసం వెస్టిండీస్ క్రికెట్ జట్లను నిన్న ప్రకటించారు. రెండు జట్లకు కెప్టెన్గా షాయ్ హోప్ను ఎంపిక చేశారు.విధ్వంసకర బ్యాటర్ షిమ్రోన్ హెట్మైర్ వన్డేలకు దూరం కాగా.. టీ20 జట్టుకు అందుబాటులో ఉన్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026 తర్వాత రిఫ్రెష్ అయ్యేందుకు అతడికి విశ్రాంతి ఇచ్చారు. దీంతో నేరుగా టీ20 సిరీస్లో జట్టుతో చేరతాడు.మరోవైపు, ఆగస్టులో శస్త్రచికిత్స చేయించుకున్న అకీమ్ అగస్టే ఇంకా పునరావాస చికిత్స పొందుతున్నాడు. దీంతో అతడికి వన్డే జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో టాప్, మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయగల జువెల్ ఆండ్రూను ఎంపిక చేశారు. ఇవి మినహా జట్టులో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.వెస్టిండీస్ జట్టు సెప్టెంబర్ 27 నుంచి భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత మూడు వన్డేలు, ఆతర్వాత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. తొలి వన్డే తిరువనంతపురం వేదికగా సెప్టెంబర్ 27న జరుగనుండగా.. రెండో వన్డే సెప్టెంబర్ 30న గువాహటిలో, మూడో వన్డే అక్టోబర్ 3న న్యూ చండీగఢ్లో జరగనున్నాయి.భారత్తో వన్డే సిరీస్కు వెస్టిండీస్ జట్టుషాయ్ హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, జాన్ క్యాంప్బెల్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, విటెల్ లాస్, గుడాకేశ్ మోటీ, కీమో పాల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, జేడెన్ సీల్స్.అక్టోబర్ 6 నుంచి టీ20 సిరీస్వన్డే సిరీస్ అనంతరం అక్టోబర్ 6 నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టుకు కూడా షాయ్ హోప్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో యువ ఓపెనర్ కమిల్ పూరన్కు చోటు దక్కింది. CPL 2026లో పూరన్ అద్భుతంగా (8 ఇన్నింగ్స్ల్లో 159.64 స్ట్రైక్రేట్తో 273 పరుగులు) రాణించాడు. ఈ ప్రదర్శనతో అతడికి జాతీయ జట్టులో తొలిసారి అవకాశం లభించింది.2026 టీ20 ప్రపంచకప్లో ఆడిన క్వెంటిన్ సాంప్సన్కు కూడా జట్టులో చోటు కల్పించారు. మరోవైపు, స్టార్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్కు విశ్రాంతి ఇచ్చారు.భారత్తో టీ20 సిరీస్కు వెస్టిండీస్ జట్టుషాయ్ హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రోన్ హెట్మయర్, అకీల్ హొసేన్, షమర్ జోసెఫ్, గుడాకేశ్ మోటీ, కీమో పాల్, కమిల్ పూరన్, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, రొమారియో షెఫర్డ్, షమర్ స్ప్రింగర్.కాగా, 2022 తర్వాత వెస్టిండీస్ జట్టు తొలిసారి ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత్లో పర్యటించనుంది. ఈ జట్టు టీమిండియాతో ఆడిన గత ఐదు వన్డేల్లోనూ ఓటమి చవిచూసింది. చివరిసారిగా 2019లో భారత్పై వన్డే విజయం సాధించింది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో పదో స్థానంలో ఉన్న విండీస్.. 2027 వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు ఈ సిరీస్ను ఉపయోగించుకోనుంది.టీ20 సిరీస్ విషయానికొస్తే.. 2023లో భారత్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను వెస్టిండీస్ 3-2తో గెలుచుకుంది. మూడు సంవత్సరాల తర్వాత విండీస్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్కు ఈ సిరీస్ ద్వారా అవకాశం లభించనుంది. ఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు -
మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు
టీమిండియా జపాన్ పర్యటన కోసం మరో ముగ్గురికి పిలుపు వచ్చింది. జపాన్తో జరగనున్న టీ20 మ్యాచ్, అలాగే ఏషియన్ గేమ్స్లో పాల్గొనేందుకు జపాన్ వెళ్లనున్న భారత క్రికెట్ జట్టుకు ముగ్గురు యువ బౌలర్లు నెట్ బౌలర్లుగా ఎంపికయ్యారు. జమ్మూ కశ్మీర్కు చెందిన రసిఖ్ సలామ్ దార్, మహారాష్ట్రకు చెందిన విక్కీ ఓస్త్వాల్, ఉత్తరప్రదేశ్కు చెందిన కార్తిక్ త్యాగిలను జాతీయ సెలెక్టర్లు ఎంపిక చేశారు.ఈ ముగ్గురిని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టుతో అనధికారిక సభ్యులుగా జత చేశారు. వీరు ప్రాక్టీస్ సెషన్లలో జట్టు సభ్యులకు బౌలింగ్ చేస్తారు. నిన్న (సెప్టెంబర్ 19) రాత్రే వీరు న్యూఢిల్లీ నుంచి టోక్యోకు బయల్దేరారు.సెప్టెంబర్ 21న ప్రాక్టీస్.. 22న జపాన్తో మ్యాచ్భారత జట్టు సెప్టెంబర్ 21న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుంది. అనంతరం సెప్టెంబర్ 22న జపాన్తో టీ20 మ్యాచ్ ఆడుతుంది. ఆ మ్యాచ్ తర్వాత కూడా టీమిండియా మరికొన్ని రోజులు సానోలోనే ఉండి సాధన చేయనుంది. ఈ సమయంలో ముగ్గురు నెట్ బౌలర్లు జట్టుకు ఉపయోగపడనున్నారు.ఆ తర్వాత భారత జట్టు నాగోయాకు వెళ్లి ఆసియా గేమ్స్లో పాల్గొంటుంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో అదనపు బౌలర్లుఏషియన్ గేమ్స్ కోసం తొలుత ఎంపిక చేసిన భారత జట్టులో 15 మంది ఉండగా, నితీశ్ కుమార్ రెడ్డిని వెస్టిండీస్తో జరిగే స్వదేశీ వన్డే సిరీస్ కోసం టీమిండియాలోకి తీసుకున్నారు. దీంతో ఏషియన్ గేమ్స్ జట్టులో సభ్యుల సంఖ్య 14కు తగ్గింది. ఈ నేపథ్యంలో నెట్ ప్రాక్టీస్ కోసం ముగ్గురు అదనపు బౌలర్లను జట్టుతో కలిపారు.సెప్టెంబర్ 23న రిపోర్టింగ్మరోవైపు, వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టును సెప్టెంబర్ 23న తిరువనంతపురంలో రిపోర్ట్ చేయాలని బీసీసీఐ ఆదేశించింది. ఈ సిరీస్లోని తొలి వన్డే సెప్టెంబర్ 27న తిరువనంతపురంలోనే జరగనుండగా, రెండో వన్డే సెప్టెంబర్ 30న గువాహటిలో, మూడో వన్డే అక్టోబర్ 3న న్యూ చండీగఢ్లో జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 6 నుంచి లక్నో వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.ఇదీ చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్ మ్యాచ్? -
క్రికెట్ ఎలా ఆడతారంటే..!
నగోయా: ఆసియా క్రీడల్లో వరుసగా రెండో సారి క్రికెట్ భాగమైంది. అయితే చైనాలో జరిగిన గత క్రీడల తరహాలోనే ఈ సారి జపాన్లో కూడా ఆటపై పెద్దగా అవగాహన లేదు. జపాన్ జట్టు ఇప్పటికే ఐసీసీ గుర్తింపు పొంది 61 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడినా... సగటు క్రీడాభిమానికి అది ఇంకా చేరువ కాలేదు. ఇలాంటి స్థితిలో జపాన్లో ఆసియా క్రీడల్లో క్రికెట్ మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి. ఈ మెగా ఈవెంట్లో వేర్వేరు క్రీడలను ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధమైన జపాన్ అభిమానులు క్రికెట్ మ్యాచ్లకు కూడా వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్కు ఆటపై మరింత అవగాహన కలి్పంచాలని నిర్వాహకులు భావించారు. ఆటకు సంబంధించి ప్రాధమిక అంశాలను వివరిస్తూ ప్రత్యేకంగా బుక్లెట్లు తయారు చేశారు. క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న కరోగీ స్పోర్ట్స్ పార్క్లో వీటిని పంచుతున్నారు. జట్టులోని ఆటగాళ్ల సంఖ్య, ఫీల్డింగ్ స్థానాలు, పరుగుల లెక్క, అవుటయ్యే తీరు... ఇలా అంపైర్ల సైగలతో సహా ఈ బుక్లెట్లో ముద్రించారు. ఇవన్నీ కూడా స్థానిక జపానీ భాషలోనే ఉండటం విశేషం. -
భారత్ X బంగ్లాదేశ్
నిషిన్ (జపాన్): ఆసియా క్రీడల్లో పసిడి పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఆదివారం సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో అమీతుమీకి సిద్ధమైంది. క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య జపాన్పై అలవోక విజయం సాధించిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు... అదే జోరు కొనసాగిస్తూ ఫైనల్ చేరాలని భావిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చితే ఈ మ్యాచ్లో విజయం నల్లేరుపై నడకే. బంగ్లాతో జరిగిన గత తొమ్మిది మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించడం గమనార్హం. ఇటీవల ఆసియా కప్లో కూడా బంగ్లాదేశ్పై భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, భారతి ఫూల్మాలి, దీప్తి శర్మతో కూడిన భారత జట్టును ఎదుర్కోవాలంటే బంగ్లా శక్తికి మించి పోరాడాల్సి ఉంటుంది. బౌలింగ్లో ఆంధ్ర స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారగా... దీప్తి శర్మ, షఫాలీ, రాధ, నందని ఆమెకు సహకారం అందిస్తున్నారు. మరోవైపు కెపె్టన్ నిగార్ సుల్తానా, నహీద అక్తర్, రాబియా ఖాన్ రూపంలో బంగ్లా జట్టులోనూ అనుభవజు్ఞలు అందుబాటులో ఉన్నారు.ఏషియాడ్లో నేటి భారత షెడ్యూల్ -
బట్లర్ రికార్డుల మోత.. టీ20ల్లో నంబర్వన్గా ఇంగ్లండ్
శ్రీలంకను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్ తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానాన్ని అధిరోహించింది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా నంబర్వన్ ర్యాంకులో ఉన్న టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. ఇరుజట్ల మధ్య పాయింట్ల రేటింగ్ మధ్య వ్యత్యాసం లేకపోయినప్పటికీ, మ్యాచ్ పరంగా టీమిండియా (61)తో పోలిస్తే ఇంగ్లండ్ 41 మ్యాచ్లు ఆడింది. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సౌతాఫ్రికాలు వరుసగా మూడు, నాలుగు, స్థానాల్లో కొనసాగుతున్నాయి.👉ఇక మ్యాచ్లో అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించిన జోస్ బట్లర్ అరుదైన ఫీట్ సాధించాడు. టీ20ల్లో అత్యధిక అర్థసెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో బట్లర్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తాజా అర్థసెంచరీతో బట్లర్ ఖాతాలో 32 హాఫ్ సెంచరీలున్నాయి. బట్లర్ కంటే ముందు బాబర్ ఆజం (42 అర్థసెంచరీలు), విరాట్ కోహ్లి (39 అర్థసెంచరీలు), రోహిత్ శర్మ (37 అర్థసెంచరీలు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.👉ఇక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా బట్లర్ నిలిచాడు. లంకతో టీ20 సిరీస్లో బట్లర్ 171 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికాపై 173 పరుగులతో డేవిడ్ మలన్.. బట్లర్ కంటే ముందున్నాడు. ఇక కెప్టెన్ హ్యారీ బ్రూక్ (170 పరుగులు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.👉ఇక మ్యాచ్ విషయానికొస్తే శనివారం జరిగిన చివరి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఫలితంగా ఇంగ్లండ్ 3-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 18.5 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. పాతుమ్ నిస్సాంక (36), కమిందు మెండిస్ (35) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సొన్ని బేకర్, జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 9.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ జాస్ బట్లర్ (32 బంతుల్లో 62 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో విధ్వంసం సృష్టించగా, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (33) రాణించాడు. లంక బౌలర్లలో తరిందు రత్నాయకే ఒక వికెట్ తీశాడు. ఇరుజట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ మంగళవారం జరగనుంది.ఇదీ చదవండి: బట్లర్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక వైట్వాష్ -
బట్లర్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక వైట్వాష్
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో శ్రీలంక వైట్వాష్కు గురైంది. మాంచెస్టర్ వేదికగా శనివారం జరిగిన చివరి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఫలితంగా ఇంగ్లండ్ 3-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 18.5 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. పాతుమ్ నిస్సాంక (36), కమిందు మెండిస్ (35) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సొన్ని బేకర్, జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 9.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ జాస్ బట్లర్ (32 బంతుల్లో 62 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో విధ్వంసం సృష్టించగా, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (33) రాణించాడు. లంక బౌలర్లలో తరిందు రత్నాయకే ఒక వికెట్ తీశాడు. మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన సొన్ని బేకర్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 170 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కైవసం చేసుకున్నాడు. హ్యారీ బ్రూక్కు కెప్టెన్గా 26 మ్యాచ్ల్లో ఇది 23వ విజయం కావడం విశేషం. ఇరుజట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ మంగళవారం జరగనుంది.ఇదీ చదవండి: టీమిండియా చీఫ్ సెలెక్టర్ రేసులో ఊహించని వ్యక్తి.. ఎవరంటే? -
టీమిండియా చీఫ్ సెలెక్టర్ రేసులో ఊహించని వ్యక్తి.. ఎవరంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI).. జూనియర్ నేషనల్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కీలక బాధ్యతలను చేపట్టే రేసులో భారత మాజీ క్రికెటర్ రమేష్ పవార్ అందరికంటే ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.కాగా 48 ఏళ్ల పవార్కు భారత క్రికెట్తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ టీమిండియా తరఫున 2 టెస్టులు, 31 వన్డే మ్యాచ్లు ఆడారు. ముఖ్యంగా 2004 ప్రారంభంలో పాకిస్తాన్ గడ్డపై చారిత్రాత్మక వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టులో అతడు కూడా భాగమయ్యాడు.ఇక కేవలం ఆటగాడిగానే కాకుండా కోచ్గానూ అతడికి మంచి అనుభవం ఉంది. భారత మహిళా క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్గా సేవలు అందించారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో యువ ఆటగాళ్లను తాయారు చేయడంలో కూడా అతడు కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్లో ముంబై, గుజరాత్ జట్లకు వివిధ హోదాల్లో కోచ్గా వ్యవహరించారు. ఈ సుదీర్ఘ అనుభవం జూనియర్ స్థాయి నుంచి కొత్త ప్రతిభను వెలికితీసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బోర్డు భావిస్తోంది. త్వరలోనే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మరోవైపు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్ పదవి నుంచి అజిత్ అగార్కర్ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్ మ్యాచ్? -
బీసీసీఐ కీలక నిర్ణయం.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్ మ్యాచ్?
భారత క్రికెట్ నియంత్రణ మండలి తన 100 ఏళ్ల ఘనమైన ప్రయాణాన్ని అత్యంత వైభవంగా సెల్బ్రేట్ చేసుకోవడానికి సమాయత్తమవుతోంది. ఈ శతాబ్ది ఉత్సవాలను క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయంగా మార్చేందుకు ఒక ప్రత్యేక మ్యాచ్ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.ఈ ఉత్సవాల సందర్భంగా 'ఇండియా ఎలెవన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవన్' మధ్య ఒక చారిత్రక మ్యాచ్ జరగనున్నట్లు 'ఆనందబజార్ పత్రిక' తన కథనంలో పేర్కొంది. ఇది గనుక కార్యరూపం దాల్చితే భారత క్రికెట్ దిగ్గజాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల అగ్రశ్రేణి ఆటగాళ్లను ఒకే మైదానంలో చూసే అరుదైన అవకాశం అభిమానులకు దక్కుతుంది. ఈ శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీసీసీఐ ఏజీఎం ఇప్పటికే ఆమోదం తెలిపింది. కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాకుండా, గత వంద ఏళ్లలో భారత క్రికెట్ ప్రస్థానాన్ని మరియు ప్రపంచ క్రికెట్లో భారత్ సాధించిన విజయాలను ప్రతిబింబించేలా పలు విశేష క్రీడా కార్యక్రమాలను సైతం బీసీసీఐ నిర్వహించనుంది.భారత జట్టు 'రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవన్'తో తలపడటం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో 1994-95 సీజన్లో ఈ రెండు జట్ల మధ్య పరిమిత ఓవర్ల ప్రదర్శన (ఎగ్జిబిషన్) మ్యాచ్లు జరిగాయి. వీటిలో మొదటి మ్యాచ్ 1994 జూన్ 1న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో 45 ఓవర్ల డే-నైట్ మ్యాచ్గా జరిగింది.ఆ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఎలెవన్ 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోరు సాధించింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (151) అద్భుత సెంచరీతో విరుచుకుపడగా, వినోద్ కాంబ్లీ (45) కూడా రాణించాడు. అనంతరం 264 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 'రెస్ట్ ఆఫ్ ది వరల్డ్' నిర్ణీత 45 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులకే పరిమితమైంది.ఆ తర్వాత రెండో మ్యాచ్ 1995 మార్చి 24న కటక్లోని బారాబతి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో కూడా భారత్ 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ ఇదే. ఇప్పుడు మళ్లీ దాదాపు 31 ఏళ్ల తర్వాత ఇరు జట్లు ముఖాముఖి తలపడటానికి సిద్ధమవుతుండటం విశేషం.చదవండి: 'వైభవ్లో ఆ స్కిల్స్ లేవు.. టెస్టు క్రికెట్కు సెట్ కాడు' -
'వైభవ్లో ఆ స్కిల్స్ లేవు.. టెస్టు క్రికెట్కు సెట్ కాడు'
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్.. భవిష్యత్తులో టెస్టు ఫార్మాట్లో రాణించడానికి ఇబ్బంది పడతాడని పనేసర్ అభిప్రాయపడ్డాడు.అండర్-19 తో పాటు ఐపీఎల్లోనూ సంచలన ప్రదర్శన చేసి భారత సీనియర్ జట్టులోకి అడుగు పెట్టిన వైభవ్.. తన అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ఎంపికైనప్పటికి తుది జట్టులో మాత్రం ఈ చిచ్చర పిడుగుకు చోటు దక్కలేదు. కాగా సూర్యవంశీ కేవలం వైట్బాల్ క్రికెట్లోనే కాదు సుదీర్ఘ ఫార్మాట్లోనూ రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లోనూ ఈస్ట్జోన్ తరపున సూర్యవంశీ సత్తాచాటాడు. అంతకుముందు ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్టు సిరీస్లోనూ అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికి వైభవ్ టెస్టు క్రికెట్లో విజయవంతం కాలేడని పనేసర్ వ్యాఖ్యనిచండం గమనార్హం."వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్లో సక్సెస్ అవుతాడని నేను అనుకోవడం లేదు. అతడి ఆ స్ధాయికి తగ్గ స్కిల్స్ లేవు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్లో టెస్టులు, టీ20లు రెండింటిలోనూ టాప్-10లో కొనసాగుతున్న ఏకైక బ్యాటర్ హ్యారీ బ్రూక్ మాత్రమే" అని పనేసర్ పేర్కొన్నాడు.చదవండి: భారత జట్టులో అతడి పేరు చూసి షాకయ్యా! -
BAN vs AFG: ట్రిపుల్ సెంచరీ వీరుడికి పిలుపు!
యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్తో జరగనున్న ఏకైక టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా నజ్ముల్ హోస్సేన్ షాంటో వ్యవహరించనున్నాడు. అదేవిధంగా దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అఫీషియల్ టెస్ట్ మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీతో సత్తాచాటిన తౌహిద్ హృదయ్కు ఈ జట్టులో చోటు దక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్ జాకీర్ అలీ కూడా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. మరోవైపు యువ పేసర్ నహిద్ రానా గాయం కారణంగా అఫ్గాన్తో టెస్టుకు కూడా దూరమయ్యాడు. లిట్టన్ దాస్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్ వంటి సీనియర్ ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 9 నుంచి 13 వరకు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. కాగా బంగ్లా జట్టు ఇటీవలే ఆస్ట్రేలియా జట్టుకు వారి సొంతగడ్డపైన ఓడించిన సంగతి తెలిసిందే.అఫ్గాన్తో టెస్టుకు బంగ్లా జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్, షాద్మాన్ ఇస్లాం, సౌమ్య సర్కార్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్, ఎబాదోత్ ఇస్లాం, ఎబాదోత్ ఇస్లాం.ట్రావెలింగ్ రిజర్వ్: నయీమ్ హసన్, ముస్ఫిక్ హసన్, ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్చదవండి: భారత జట్టులో అతడి పేరు చూసి షాకయ్యా! -
భారత జట్టులో అతడి పేరు చూసి షాకయ్యా!
వెస్టిండీస్తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో జమ్మూ కాశ్మీర్ స్పీడ్స్టార్ ఆకిబ్ నబీకి చోటు దక్కిన సంగతి తెలిసిందే. అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఫ్రంట్ లైన్ పేసర్లు ఆసియా క్రీడల కోసం జపాన్ వెళ్లనుండటంతో నబీకి తొలిసారి భారత వన్డే జట్టులో అవకాశం లభించింది.29 ఏళ్ల నబీ.. స్టార్ పేసర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో కలిసి బౌలింగ్ పంచుకోనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులో నబీ పేరు చూసి తాను ఒకింత ఆశ్చర్యపోయానని జాఫర్ చెప్పుకొచ్చాడు."వైట్బాల్ క్రికెట్లో నబీకి అంతగా మంచి రికార్డు లేకపోయినా, విండీస్తో జరిగే వన్డేలకు అతడిని ఎంపిక చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఏ ఫార్మాట్లోనైనా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఒక ఆటగాడికి దక్కే గొప్ప గౌరవం. నబీ తనకు లభించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడని ఆశిస్తున్నాను. కానీ ఈ వన్డే జట్టులో చోటు దక్కిందనే కారణంతో అతడు న్యూజిలాండ్ టెస్టు సిరీస్కు పక్కన పెట్టకూడదు. ఈ సిరీస్లో అతడు విఫలమైనా కివీస్ టూర్కు అతడిని కచ్చితంగా ఎంపిక చేయాలి. అతడు రెడ్బాల్తో అద్భుతాలు చేయగలడు.అయితే ప్రస్తుతానికి వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో నబీ ఉన్నాడని నేను అనుకోవడం లేదు. కానీ విండీస్ సిరీస్లో గనుక అతడు అద్భుతంగా రాణిస్తే, ప్రపంచకప్ జట్టు రేసులోకి వచ్చే అవకాశం ఉంటుంది" అని జాఫర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా నబీ ఇప్పటివరకు 36 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడి 56 వికెట్లు పడగొట్టాడు.చదవండి: అతడి కోసం వీవీఎస్ లక్ష్మణ్, గంభీర్-గిల్ పట్టు.. ఎవరి మాట నెగ్గిందంటే? -
అతడి కోసం పట్టుబట్టిన వీవీఎస్ లక్ష్మణ్- గంభీర్.. ఆఖరికి!
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసి జోరు మీదున్న టీమిండియా.. తదుపరి వెస్టిండీస్తో తలపడేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై విండీస్ జట్టుతో సెప్టెంబరు 27- అక్టోబరు 17 మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది.ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే జట్లను ప్రకటించింది. అయితే, శుబ్మన్ గిల్ సారథ్యంలో వన్డే జట్టు స్వదేశంలో విండీస్తో తలపడనుండగా.. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని టీ20 జట్టు జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ఆడేలా షెడ్యూల్ ఖరారైంది.ఇక్కడ గంభీర్.. అక్కడ లక్ష్మణ్ఈ నేపథ్యంలో విండీస్తో సిరీస్కు హెడ్కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనం చేయనుండగా.. ఆసియా క్రీడల్లో వీవీఎస్ లక్ష్మణ్ భారత టీ20 జట్టుకు తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో టీమిండియా యువ ఆల్రౌండర్కు సంబంధించి గంభీర్- గిల్... వీవీఎస్ లక్ష్మణ్ మధ్య గట్టి వాదనలు జరిగినట్లు సమాచారం.అందుకే ఇద్దరూ అతడినే కోరుకున్నారుదైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను విండీస్తో వన్డేల్లో ఆడించాలని గంభీర్- గిల్ భావించినట్లు సమాచారం. కరేబియన్ జట్టులో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నందున వాషీ సేవలు కోరుకున్నట్లు తెలుస్తోంది.PC: BCCIఅయితే, ఇప్పటికే వాషీ ఆసియా క్రీడల జట్టులో ఉన్నాడు. ప్రతిష్టాత్మక టోర్నీలో నేరుగా క్వార్టర్ ఫైనల్కు చేరిన టీమిండియా.. నేపాల్తో తలపడటం దాదాపుగా ఖాయమే. ఆ జట్టులోనూ ఐదుగురు లెఫ్టాండర్ బ్యాటర్లు ఉన్నారు. కాబట్టి వాషీ తమతో పాటే జపాన్కు రావాలని వీవీఎస్ లక్ష్మణ్ బోర్డు వద్ద తన వాదన వినిపించినట్లు తెలుస్తోంది.ఎవరి మాట నెగ్గిందంటేఈ నేపథ్యంలో గంభీర్- గిల్తో జరిగిన వాదనలో లక్ష్మణ్ నెగ్గినట్లు తెలుస్తోంది. విండీస్తో వన్డేలకు ఎంపిక చేయకుండా.. ఆసియా క్రీడల జట్టుతోనే వాషింగ్టన్ సుందర్ను కొనసాగించడం ఇందుకు నిదర్శనం. అయితే, ఆసియా క్రీడలు ముగించుకున్న తర్వాత శ్రేయస్ సేన స్వదేశంలో విండీస్తో టీ20 సిరీస్లో తలపడనుండగా.. ఈ జట్టులో మాత్రం వాషీకి చోటు దక్కింది. కాగా ఎడమచేతి వాటం బ్యాటర్లను తిప్పలు పెట్టడంలో వాషీకి మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు వన్డే, టీ20లలో కలిపి 5.67 ఎకానమీ రేటుతో అతడు 37సార్లు లెఫ్టాండర్లను అవుట్ చేశాడు. చదవండి: నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్ -
ఐపీఎల్కే దిక్కులేదు.. వారికి టీమిండియాలో చోటా?
ఢిల్లీ వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన మూడో టీ20లో యువ పేసర్ యష్ ఠాకూర్ను ఆడించడాన్ని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తప్పుపట్టాడు. అతడు ఇండియన్ క్యాప్ ధరించేందుకు అర్హుడు కాదని శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా అఫ్గాన్తో టీ20లకు తొలుత ఎంపిక చేసిన జట్టులో యశ్ఠాకూర్కు చోటు దక్కలేదు. కానీ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా దూరం కావడంతో ఆఖరి నిమిషంలో సెలక్టర్ల నుంచి అతడు పిలుపు అందుకున్నాడు. అయినప్పటికి తొలి రెండు టీ20లకు అతడు బెంచ్కే పరిమితమయ్యాడు కానీ. ఆఖరి టీ20లో మాత్రం అర్ష్దీప్ సింగ్కు విశ్రాంతి ఇచ్చి యశ్కు తుది జట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్లో అతడికి కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం లభించింది. రెండు ఓవర్లలో అతడు 17 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిపై వరల్డ్కప్ విన్నర్ శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు."యష్ ఠాకూర్ లాంటి సాధారణ ఆటగాడికి భారత జట్టులో ఎలా చోటు ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఇలా ఎవరికి పడితే వారికి టీమిండియా క్యాప్ ఇస్తే.. జాతీయ జట్టులోకి రావడం చాలా సులభమనే తప్పుడు సంకేతాలు బయటకు వెళ్తాయి. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదు.భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే అద్భుతమైన ప్రతిభతో పాటు దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శనలు చేసిండాలి. భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ పేసర్లను పక్కన పెట్టి యష్ ఠాకూర్ను ఆడించడం అన్యాయం.యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్ వంటి వారు కనీసం తమ ఐపీఎల్ ఫ్రాంచైజీల్లోనే రెగ్యులర్ సభ్యులుగా లేరు. అలాంటిది వారిని నేరుగా తీసుకొచ్చి భారత జట్టు తరఫున ఆడిస్తున్నారు.మరోవైపు సడన్గా విప్రజ్ నిగమ్ జట్టులోకి ఎలా వచ్చాడు? ఏ ప్రాతిపదికన అతడిని ఎంపిక చేశారు? వరుణ్ చక్రవర్తికి ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసేంత గొప్ప బౌలరా అతడు? ఇలా ప్రతీ ఒక్కరికీ భారత జట్టు క్యాప్ను పంచేయలేరు. ఇదంతా చూస్తుంటే ఏదో షాప్లో టీమిండియా క్యాప్ను కొనుగోలు చేసినట్లుగా ఉంది" అని శ్రీకాంత్ తీవ్ర స్దాయిలో మండిపడ్డాడు.చదవండి: నా కెరీర్లో అదే అత్యంత కఠిన నిర్ణయం: గౌతమ్ గంభీర్ -
నా కెరీర్లో అదే అత్యంత కఠిన నిర్ణయం: గౌతమ్ గంభీర్
స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన మూడు టీ20ల సిరీస్ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ అసాంతం శ్రేయస్ అయ్యర్ సారధ్యంలోని టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఆఖరి టీ20లో అయితే భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లో శతక్కొట్టి, అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచూరియన్గా నిలవగా.. సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా శ్రేయస్ సేన ప్రత్యర్ధి ముందు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగల్గింది. అఫ్గాన్ ఈ కొండంత లక్ష్యాన్ని చేధించలేక 94 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తమ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20ల్లో 300 పరుగులు సాధించడమే మా లక్ష్యమని గంభీర్ అన్నాడు."అఫ్గానిస్తాన్తో చివరి మ్యాచ్లో భారత జట్టుకు మెరుపు ఆరంభం దక్కింది. మరీ ముఖ్యంగా పవర్ప్లేలో మనవాళ్లు చాలా దూకుడుగా ఆడారు. ఆరు ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగుల మార్క్ దాటింది. నా కోచింగ్ కాలంలో ఇదే అత్యధికం. దూకుడుగా ఇన్నింగ్స్ను ఆరంభించినప్పుడు అదే జోరు కొనసాగిస్తే భారీ స్కోరు సాధ్యమే. టి20ల్లో ఇప్పటి వరకు మన జట్టు 300 మైలురాయిని అందుకోలేదు.మా తదుపరి లక్ష్యం అదే. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ప్రతిభతో అదేం పెద్ద కష్టం కాదు. అభిషేక్ దూకుడు అందరికీ తెలిసిందే. అఫ్గాన్తో మూడో టి20లో అతడి సెంచరీ డ్రెస్సింగ్ రూమ్పై చాలా ప్రభావం చూపింది" అని గంభీర్ పేర్కొన్నాడు.కాగా సిరీస్లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ బెంచ్కే పరిమితం కావడంపై గంభీర్ స్పందించాడు. వైభవ్ సూర్యవంశీలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, అతడు స్వదేశంలో అరంగేట్రం చేసేందుకు మరికొంత కాలం వేచి చూడక తప్పదని గంభీర్ వెల్లడించాడు.ఇంగ్లండ్తో టి20 సిరీస్ సందర్భంగా సంజూ సామ్సన్ను తుది జట్టు నుంచి తప్పించడం తన కెరీర్లోనే అత్యంత కఠిన నిర్ణయమన్న గంభీర్... వన్డే, టెస్టు సారథి శుబ్మన్ గిల్కు సంపూర్ణ మద్దతు ఉంటుందని వివరించాడు.చదవండి: మరోసారి టీమిండియాకు అదే ‘గండం’.. స్పందించిన బీసీసీఐ -
నితీశ్ రెడ్డిపై గంభీర్ ప్రశంసలు.. వరల్డ్కప్ జట్టులో చోటు ఖాయమే!
ఆంధ్ర పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్లో పేస్ ఆల్రౌండర్ల ప్రాధాన్యం చాలా ఎక్కువ. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో అది మరింత అధికం. ఇలాంటి పరిస్థితుల్లో నితీశ్ కుమార్ రెడ్డి మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండటం శుభ పరిణామం’ అని పేర్కొన్నాడు.అదే విధంగా.. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే సీనియర్ పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను అంతర్జాతీయ మ్యాచ్లకు పరిశీలిస్తామని గంభీర్ అన్నాడు. హార్దిక్, నితీశ్లను ఒకే మ్యాచ్లో ఆడించే ఆలోచన కూడా ఉందని ఈ సందర్భంగా తెలిపాడు. వన్డే వరల్డ్కప్నకు ముందు తగినన్ని అవకాశాలు‘గాయం కారణంగా చాన్నాళ్లుగా ఆటకు దూరమైన హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. పది ఓవర్లు బౌలింగ్ చేయగల ఫిట్నెస్ సాధించిన అనంతరమే అతడి ఎంపికను పరిశీలిస్తాం.కోలుకోకముందే అతడిని అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిలో పడేయాలనుకోవడం లేదు. ప్రస్తుతం భారత ‘ఎ’జట్టు తరఫున అతడికి మంచి ప్రాక్టీస్ దక్కనుంది. పాండ్యా జట్టులోకి వచ్చిన తర్వాత అతడిని, నితీశ్ను కలిపి ఒకే జట్టులో ఆడించాలనుకుంటున్నాం.నితీశ్ రెడ్డిని ఆసియా క్రీడల జట్టు నుంచి తీసి... వెస్టిండీస్తో వన్డే సిరీస్ కోసం కేటాయించాం. వరల్డ్కప్ వంటి పెద్ద టోర్నీలకు ముందు అతడికి తగినన్ని అవకాశాలివ్వాలని అనుకుంటున్నాం. అతడి బౌలింగ్ పదునెక్కిందిఇటీవలి కాలంలో అతడి బౌలింగ్ పదునెక్కింది. అఫ్గానిస్తాన్తో మూడో టీ20లో అదే కనిపించింది. తొలి ఓవర్లో 15 పరుగులు ఇచ్చిన తర్వాత తిరిగి పుంజుకుని మూడు వికెట్లతో సత్తాచాటాడు. వన్డే, టీ20 ఫార్మాట్లలో అటు బౌలింగ్ చేయడంతో పాటు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయగల ప్లేయర్లకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే నితీశ్కు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం కల్పిస్తాము. ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయమే!అఫ్గాన్తో తొలి మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో అతడి బౌలింగ్ ప్రతిభ బయటపడింది’’ అని గంభీర్ నితీశ్ రెడ్డిని ప్రశంసించాడు. వన్డే వరల్డ్కప్-2027 జట్టులో ఈ ఆంధ్ర కుర్రాడికి చోటు ఖాయమైపోయిందనే సంకేతాలు ఇచ్చాడు. టీమిండియా అఫ్గానిస్తాన్తో మూడో టీ20లో గెలిచి.. సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ గంభీర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ అతడే: కమిన్స్ -
మరోసారి టీమిండియాకు అదే ‘గండం’.. స్పందించిన బీసీసీఐ
భారత మహిళా, పురుష క్రికెట్ జట్లకు మరోసారి ‘నక్వీ గండం’ ఎదురయ్యే అవకాశం ఉంది. ఆసియా కప్ తర్వాత ఆసియా క్రీడలు-2026 టోర్నీలోనూ అతడి చేతుల మీదుగానే ట్రోఫీ అందుకోవాల్సి వస్తే పరిస్థితి ఏమిటనే చర్చ మొదలైంది. కాగా ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడిగా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి, పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నక్వీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.రెండుసార్లు నిరాకరణఅయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా టీ20 కప్-2025లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టు, ఇటీవల 2026లో ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించాయి. దీంతో ఇంతవరకు ట్రోఫీలు భారత్కు అందకుండా నక్వీ పావులు కదుపుతున్నాడు.హాట్ ఫేవరెట్గా భారత జట్లుఈ నేపథ్యంలో ఆసియా క్రీడల్లోనూ ఇదే తరహా పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. జపాన్ వేదికగా ఈ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ విభాగంలో టీ20 ఫార్మాట్లో మ్యాచ్లు నిర్వహిస్తుండగా.. డిఫెండింగ్ చాంపియన్లు టీమిండియా, భారత మహిళా జట్టు హాట్ ఫేవరెట్గా ఉన్నాయి.ఇక్కడా అదే గండం.. నిరాకరిస్తే కష్టమే!ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉన్న ఇరుజట్లు దాదాపు స్వర్ణం గెలవడం ఖాయమే. ఈ నేపథ్యంలో ఆసియా ఒలింపిక్ మండలి (OCA)లో భాగమైన నక్వీకి గనుక పతకాలు ప్రదానం చేసే అవకాశం వస్తే.. భారత జట్లు తప్పక అతడి చేతుల మీదుగానే మెడల్స్ స్వీకరించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆసియా క్రీడలనే అవమానించినట్లుగా అవుతుంది. తద్వారా పతకాలు నిరాకరించిన జట్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.స్పందించిన బీసీసీఐఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా స్పందించారు. ‘‘ముందుగా మ్యాచ్లు గెలవడంపైనే మా దృష్టి ఉంది. భారత జట్లు స్వర్ణ పతకం గెలిచి పోడియం వద్దకు వెళ్లాలి. అప్పుడే మేము దీని గురించి నిర్ణయం తీసుకుంటాము.ప్రస్తుతం మా దృష్టి మొత్తం మ్యాచ్లు గెలవడం మీదే ఉంది. బోర్డు, ఆటగాళ్లకు ఇదే మొదటి ప్రాధాన్యం. ఇప్పటి వరకు జరగని దాని గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు’’ అని సైకియా పేర్కొన్నారు.నిబంధనలు ఇవేకాగా ఆసియా ఒలింపిక్ మండలి నియావళిలోని ఆర్టికల్ 66 ప్రకారం.. ‘విజయాలు, పతకాల ప్రదానోత్సం’లో భాగంగా విజేతలకు OCA అధ్యక్షుడు నేరుగా మెడల్ ప్రదానం చేయవచ్చు. లేదంటే.. మండలిలో భాగమైన ఇతర సభ్యులకు ఆ బాధ్యతను అప్పగించవచ్చు. ఇక్కడ ఎలాంటి రాజకీయ, మతపరమైన, వాణిజ్యపరమైన అంశాలకు తావు ఉండదు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్ -
నేను ఎదుర్కొన్న కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్
ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ ట్రోఫీ అందించిన కెప్టెన్లలో ప్యాట్ కమిన్స్ ఒకడు. అతడి సారథ్యంలో 2023లో ఆసీస్ భారత్ వేదికగా ఫైనల్లో టీమిండియాను ఓడించి వన్డే వరల్డ్కప్ టైటిల్ గెలుచుకుంది. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్లోనూ కమిన్స్ బృందం.. భారత్ను ఓడించి గదను అందుకుంది.రోహిత్- కోహ్లి కాదు!కాగా రైటార్మ్ పేసర్ అయిన కమిన్స్ తన కెరీర్లో ఇప్పటి వరకు ఎంతో మంది టీమిండియా స్టార్లకు బౌలింగ్ చేశాడు. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో కూడి ఉన్న భారత జట్లపై ఎక్కువగా ఆడాడు. అయితే, తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్గా కమిన్స్ వీరిద్దరిలో ఎవరి పేరును చెప్పలేదు.వంద డాట్ బాల్స్ను కూడా..ఇంతకీ కమిన్స్ బౌలింగ్కు పరీక్ష పెట్టి అతడికి కఠిన సవాలుగా నిలిచిన భారత బ్యాటర్ ఎవరూ అంటారా?.. ఈ విషయంపై కమిన్స్ స్వయంగా స్పందించాడు. ప్రైమ్వీడియోలో మాట్లాడుతూ.. ‘‘నేను ఎదుర్కొన్న టఫెస్ట్ ఇండియన్ బ్యాటర్ అంటే పుజారా పేరు చెప్తాను. అతడిని అవుట్ చేయడం అత్యంత కష్టం.అతడు పెద్దగా షాట్లు ఆడేందుకు ప్రయత్నించడు. అయినా సరే బౌలర్లకు తలనొప్పిగా మారతాడు. పుజారా తలచుకుంటే వంద డాట్ బాల్స్ను కూడా నవ్వుతూనే ఎదుర్కొంటాడు. బౌలర్కు అసలు అవుట్ చేసే అవకాశమే ఇవ్వడు’’ అని కమిన్స్ టీమిండియా టెస్టు స్పెషలిస్టుగా పేరొందిన ఛతేశ్వర్ పుజారాపై ప్రశంసలు కురిపించాడు.జాబితాలో వీరూ ఉన్నారుఇక తాను ఎదుర్కొన్న కఠినమైన బ్యాటర్ల జాబితాలో అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా), బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్), తిలకరత్నె దిల్షాన్ (శ్రీలంక), క్రిస్ గేల్ (వెస్టిండీస్) కూడా ఉన్నారని కమిన్స్ తెలిపాడు.దిగ్గజ టెస్టు బ్యాటర్ పుజారాకాగా గుజరాత్కు చెందిన ఛతేశ్వర్ పుజారా 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తన కెరీర్లో కేవలం ఐదు వన్డేలు ఆడిన పుజారా.. టెస్టుల్లో మాత్రం వంద మ్యాచ్ల మైలురాయిని దాటాడు. మొత్తంగా 103 టెస్టులు ఆడి 7195 పరుగులు సాధించాడు. ఇందులో 35 అర్ధ శతకాలు, 19 శతకాలు.. మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.విదేశీ గడ్డపై ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో పుజారా ఫాస్ట్బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ గంటల కొద్దీ క్రీజులో నిలబడేవాడు. ఆసీస్పై 2018-19, 20202-21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన ఘనత పుజారాకే దక్కుతుంది.ఆసీస్తో మొదలు.. కంగారూలతోనే ముగింపుఇక ఆసీస్తో 2010 నాటి టెస్టు సందర్భంగా టీమిండియా తరఫున కెరీర్ మొదలుపెట్టిన పుజారా.. 2023లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా ఆసీస్తోనే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం విశేషం. కాగా పుజారా ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.చదవండి: బట్లర్ ప్రపంచ రికార్డు -
వైభవ్ను అవుట్ చేసి లైమ్లైట్లోకి.. పట్టలేనంత ఆనందం!
సిక్కోలు క్రికెటర్ త్రిపురాన విజయ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత జట్టు వైపు అడుగులు వేస్తున్నాడు. టెక్కలికి చెందిన ఈ యువ ఆల్రౌండర్ తాజాగా భారత్–ఏ జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మల్లీడే (టెస్టు)మ్యాచ్లలో పాల్గొనే భారత్–ఏ జట్టుకు ఎంపికైనట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న తన కలకు ఒకే ఒక్క అడు గు దూరంలో నిలిచాడు. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 11 మధ్య రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీ స్ జట్టు భారత్కు వస్తున్న విషయం తెలిసిందే.బీసీసీఐ నుంచి పిలుపుకర్ణాటకకు చెందిన యువ పేసర్ విజయ్కుమార్ వైశాఖ్కు గాయం కారణంగా దూరం కావడంతో అనూహ్యంగా ఆంధ్రాకు చెందిన ఈ స్టార్ ఆల్రౌండర్కు బీసీసీఐ నుంచి పిలుపొచ్చింది. ఆసీస్తో జరిగే ఈ మ్యాచ్లో రాణించి భారత సెలక్షన్ కమిటీని ఆకట్టుకోవాలని విజయ్ భావిస్తున్నాడు. ఆల్రౌండర్గా కీర్తి గడించిన ఈ ఆఫ్ స్పిన్నర్ లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్గా ఆకట్టుకుంటున్నాడు. వీటికితోడు బెస్ట్ ఫీల్డర్గా అనేక మ్యాచ్ల్లో రివార్డులు అందుకున్నాడు. దులీప్ ట్రోఫీలో రాణింపుతో.. దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో రాణించడం ద్వారా సిక్కోలు యువతేజం విజయ్.. భారత–ఎ జట్టుకు ఎంపికయ్యాడు. వైభవ్ను అవుట్ చేసి లైమ్లైట్లోకి.. ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ వంటి ఇండియన్ టాప్క్లాస్ ప్లేయర్లను ఔట్ చేసి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. సౌత్జోన్కు ప్రధానమైన ఆఫ్ స్పిన్నర్గా సేవలు అందించాడు. ఇప్పటికే బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మక లీగ్ ఐపీఎల్కు 2025, 2026 రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. జూలై నెలలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన ఎమర్జింగ్ పురు షుల క్రికెట్ టోర్నీలో ఇండియా–బి జట్టుకు ప్రాతినిధ్యం వహించి మెరిశాడు. భారత్–ఏ జట్టుకు విజయ్ ఎంపికపై జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు, ప్రతినిధులు, కోచ్లు, సీనియర్ క్రికెటర్లు, విజయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెక్కలిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు త్రిపురాన విజయ్ తండ్రి త్రిపురాన వెంకట కృష్ణరాజు సమాచార శాఖ ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి లావణ్య గృహిణి. విజయ్ను కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అభినందించారు.పట్టలేనంత ఆనందంతో ఉన్నాను ఆసీస్తో జరిగే మల్టీ డే మ్యాచ్లో పాల్గొనే భారత–ఏ జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్లో నన్ను చేర్చినట్టు వర్తమానం వచ్చిన ఆనందక్షణాలు మర్చిపోలేను. ఇటీవలి ఎమర్జింగ్ టోర్నీ, దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో రాణింపుతో సెలెక్టర్లు అవకాశం ఇచ్చారని భావిస్తున్నాను. నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న క్రికెట్ సంఘ పెద్దలు, కోచ్లు, తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. – త్రిపురాన విజయ్, క్రికెటర్ -
హెట్మైర్ శతకం వృధా
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026 తుది అంకానికి చేరింది. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, జమైకా కింగ్స్మన్ జట్లు సెప్టెంబర్ 20న టైటిల్ కోసం పోరాడతాయి. ఇవాళ జరిగిన క్వాలిఫయర్-2లో గయానా అమెజాన్ వారియర్స్పై గెలిచి జమైకా కింగ్స్మన్ ఫైనల్కు చేరింది.ఈ మ్యాచ్లో వారియర్స్ భారీ స్కోర్ చేసినా, దాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో వారియర్స్ తరఫున షిమ్రోన్ హెట్మైర్ అజేయ మెరుపు శతకం (45 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 102 నాటౌట్) వృధా అయ్యింది. కింగ్స్మన్ను వారి కెప్టెన్ రోవ్మన్ పావెల్ సుడిగాలి ఇన్నింగ్స్ (17 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి గెలిపించారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్, హెట్మైర్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని కింగ్స్మన్ సునాయాసంగా ఛేదించింది. ఆ జట్టు తరఫున ప్రతి ఒక్కరు రాణించారు. కీసీ కార్తీ 56, మాజ్ సదాకత్ 41, కిర్క్ మెకెంజీ 34, సైమ్ అయూబ్ 23, రోవ్మన్ పావెల్ 40 పరుగులు చేశారు. ఇదీ చదవండి: పాక్ ప్లేయర్ హ్యాట్రిక్ -
భారత్తో సిరీస్కు ముందు న్యూజిలాండ్కు బిగ్ షాక్
త్వరలో భారత్తో జరుగబోయే టీ20 సిరీస్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర గాయంతో ఈ సిరీస్కు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఆక్లాండ్లో సెప్టెంబర్ 16న స్కై సంస్థ నిర్వహించిన ప్రమోషనల్ షూట్లో డైవింగ్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో రచిన్ కుడి భుజం డిస్లోకేషన్కు గురైంది. దీంతో అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో అతడు ఆడటం అనుమానంగా మారింది. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును వచ్చే వారం ప్రకటించనున్నారు. కాగా, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు ఐదు వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం అక్టోబర్ 22 నుంచి భారత జట్టు న్యూజిలాండ్లో పర్యటించనుంది.షెడ్యూల్అక్టోబర్ 22, 2026 తొలి టీ20 క్రైస్ట్చర్చ్ మధ్యాహ్నం 12:30 (భారతకాలమానం ప్రకారం)అక్టోబర్ 24, 2026 రెండో టీ20 క్రైస్ట్చర్చ్ మధ్యాహ్నం 12:30అక్టోబర్ 27, 2026 మూడో టీ20 వెల్లింగ్టన్ మధ్యాహ్నం 12:30అక్టోబర్ 30, 2026 నాలుగో టీ20 ఆక్లాండ్ మధ్యాహ్నం 12:30నవంబర్ 1, 2026 ఐదో టీ20 హామిల్టన్ మధ్యాహ్నం 12:30నవంబర్ 4, 2026 తొలి వన్డే ఆక్లాండ్ ఉదయం 6:30నవంబర్ 7, 2026 రెండో వన్డే వెల్లింగ్టన్ ఉదయం 6:30నవంబర్ 10, 2026 మూడో వన్డే హామిల్టన్ ఉదయం 6:30నవంబర్ 13, 2026 నాలుగో వన్డే టౌరంగ ఉదయం 6:30నవంబర్ 15, 2026 ఐదో వన్డే టౌరంగ ఉదయం 6:30నవంబర్ 19–23, 2026 తొలి టెస్టు వెల్లింగ్టన్ ఉదయం 3:30నవంబర్ 27–డిసెంబర్ 1, 2026 రెండో టెస్టు క్రైస్ట్చర్చ్ ఉదయం 3:30ఇదీ చదవండి: పాక్ ప్లేయర్ హ్యాట్రిక్ -
పాక్ ప్లేయర్ హ్యాట్రిక్
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో పాకిస్తాన్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ హ్యాట్రిక్తో చెలరేగాడు. ఈ టోర్నీలో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. గయానా అమెజాన్ వారియర్స్తో జరిగిన క్వాలిఫయర్-1 పోటీలో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో ఫాల్కన్స్ వారియర్స్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు దూసుకెళ్లింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వారియర్స్, షాదాబ్ ఖాన్ (4-0-16-4), సుఫ్యాన్ మొఖీమ్ (4-0-13-4) ధాటికి 15 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది.వారియర్స్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (16), మవేంద్ర దిండ్యాల్ (11), షాయ్ హోప్ (16), రొమారియో షెపర్డ్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయడంతో వారియర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం ఫాల్కన్స్ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 5.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రఖీమ్ కార్న్వాల్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి ఫాల్కన్స్ను గెలిపించాడు. మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్ (13 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఫాల్కన్స్ను విజయతీరాలకు చేర్చాడు.ఈ మ్యాచ్లో ఓడినా వారియర్స్కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. శుక్రవారం క్వాలిఫయర్-2లో కింగ్స్మెన్పై గెలిస్తే ఫైనల్కు చేరుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో ఫాల్కన్స్ను ఎదుర్కొంటుంది.ఇదీ చదవండి: ఆడమ్ జంపా 'డబుల్ సెంచరీ'.. జింబాబ్వేను చిత్తు చేసిన ఆసీస్ -
టీ20 క్రికెట్లో షఫాలీ వర్మ అరుదైన ఫీట్
భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు సాధించింది. ఒక క్యాలండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో షఫాలీ వర్మ రెండో స్థానంలో నిలిచింది. 2026లో షఫాలీ వర్మ 26 సిక్సర్లు కొట్టింది. అయితే ఈ జాబితాలో శ్రీలంక కెప్టెన్ చమేరీ ఆటపట్టు (32 సిక్సర్లు, 2024 ఏడాదిలో) తొలి స్థానంలో కొనసాగుతోంది. హర్మన్ప్రీత్ కౌర్ (2018లో 25 సిక్సర్లు), సోఫీ డివైన్ (2018లో 21 సిక్సర్లు, 2020లో 21 సిక్సర్లు) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.మహిళల టీ20 క్రికెట్లో బంతుల పరంగా భారత్ 90 బంతులు మిగిలి ఉండగానే జపాన్ విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో జింబాబ్వే మహిళల జట్టు (108 బంతులు వర్సెస్ ఎస్వాటిని), ఐర్లాండ్ మహిళలు (104 బంతులు వర్సెస్ ఫ్రాన్స్ ), జింబాబ్వే మహిళలు (98 బంతులు వర్సెస్ నైజిరీయా) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ మహిళల జట్టు 19.5 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌటైంది. అయకా కాటో స్టాఫోర్డ్ (25) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో శ్రీ చరణి 4 వికెట్లతో చెలరేగగా, షఫాలీ వర్మ 2, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. షఫాలీ వర్మ (15 బంతుల్లో 40 నాటౌట్) దనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా, రిచా ఘోష్ (12 నాటౌట్) ఆకట్టుకుంది. జపాన్ బౌలర్లలో నొనొహా యుమొటొ, అయ్కా కాటో చెరొక వికెట్ తీశారు.𝙎𝙝𝙪𝙧𝙪 𝙝𝙤𝙩𝙚 𝙝𝙞 𝙠𝙝𝙖𝙩𝙖𝙢 😅 Japan were bowled out for 58, and India wrapped it up in just 4.6 overs - with Shafali Verma putting the finishing touch with a six✨Catch India vs Japan at the Asian Games, LIVE NOW on Sony Sports Network & Sony LIV.… pic.twitter.com/nTfQ1rVlx5— Sony Sports Network (@SonySportsNetwk) September 18, 2026ఇదీ చదవండి: ఉత్తర కొరియా వల్ల 1,399 భూకంపాలు! -
ఆడమ్ జంపా 'డబుల్ సెంచరీ'.. జింబాబ్వేను చిత్తు చేసిన ఆసీస్
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో 84 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తొలుత ఆస్ట్రేలియాను బ్యాటింగ్ అహ్హనించాడు.ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (84 బంతుల్లో 112 రన్స్ - 15 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. యంగ్ ఆల్రౌండర్ కూపర్ కానల్లీ (78), కెప్టెన్ మిచెల్ మార్ష్ (53) అర్ధశతకాలు సాధించారు.ఆఖరిలో ఆలివర్ జాన్ పీక్ (18 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 48.3 ఓవర్లలో 272 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రెండన్ టేలర్ (39), సికందర్ రాజా (45), ఇన్నోసెంట్ కైయా (34) రాణించినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, కూపర్ కొన్నోలీ, ఆడమ్ జంపా, మాట్ రెన్షా తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇక ఈ మ్యాచ్లో జింబాబ్వే బ్యాటర్ ఇన్నోసెంట్ కైయా వికెట్ తీయడం ద్వారా వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని జంపా అందుకున్నాడు. తద్వారా ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో షేన్ వార్న్ (293 వికెట్లు) తర్వాత వన్డేల్లో 200 పైగా వికెట్లు తీసిన రెండో స్పిన్నర్గా నిలిచాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా తరఫున వేగంగా (123 మ్యాచ్ల్లో) 200 వన్డే వికెట్లు సాధించిన స్పిన్నర్గా షేన్ వార్న్ రికార్డును అధిగమించాడు.చదవండి: IND vs AUS: ద్రవిడ్, సెహ్వాగ్ కొడుకుల జోరు.. ఆసీస్పై భారత్ సంచలన విజయం -
'సర్' అభిషేక్.. నాకు ఇది ముందే తెలుసు: యువరాజ్
అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన అభిషేక్ శర్మపై అతడి మెంటార్, భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అభిషేక్ అద్భుత బ్యాటింగ్కు ఫిదా అయిన యువీ.. అతడిని 'సర్ అభిషేక్' అని సంబోధిస్తూ 'ఎక్స్' వేదికగా కొనియాడాడు.కాగా అఫ్గానిస్తాన్తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన ఈ పంజాబ్ క్రికెటర్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 108 పరుగులు చేసి అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలోనే అతడి గురువు యువరాజ్ సింగ్ ప్రత్యేకంగా అభినందించాడు."టీ20 క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన 'సర్' అభిషేక్కు హృదయపూర్వక అభినందనలు. నీకున్న టాలెంట్, నువ్వు పడే కష్టానికి ఏదో ఒక రోజు ఈ రికార్డు సాధిస్తావని నాకు ముందే తెలుసు. రాబోయే రోజుల్లో నువ్వు తిరగరాయబోయే రికార్డులకు ఇది ఆరంభం మాత్రమే.'జనాలు నీపై రాళ్లు విసిరినప్పుడు.. వాటిని మైలురాళ్లుగా మార్చుకుని నీ బ్యాట్తోనే సమాధానం చెప్పాలి' అని ఒక పెద్దాయన చెప్పాడు. నువ్వు ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎప్పుడూ ఇలాగే వినయంగా ఉంటూ మరిన్ని విజయాలు సాధించాలి." అని యువరాజ్ సింగ్ తన పోస్ట్లో పేర్కొన్నాడు.గురువు బాటలోనే శిష్యుడుఅభిషేక్ గొప్ప క్రికెటర్గా ఎదగడంలో యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో ఉంది. దీర్ఘకాలంగా అభిషేక్కు యువీ మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. మైదానంలో అద్భుతంగా ఆడితే మెచ్చుకునే యువీ, విఫలమైనప్పుడు అంతే తీవ్రంగా హెచ్చరిస్తుంటాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన అభిషేక్ శర్మ.. యువరాజ్ సింగ్ ఇచ్చిన సలహాలు, మార్గదర్శకత్వమే ఈ విధ్వంసకర శతకానికి కారణమని తెలిపాడు.చదవండి: IND vs AUS: ద్రవిడ్, సెహ్వాగ్ కొడుకుల జోరు.. ఆసీస్పై భారత్ సంచలన విజయం -
ద్రవిడ్, సెహ్వాగ్ కొడుకుల జోరు.. ఆసీస్పై భారత్ సంచలన విజయం
ఆస్ట్రేలియా అండర్-19తో జరుగుతున్న మూడు మ్యాచ్ల అనాధికారిక వన్డే సిరీస్లో భారత అండర్-19 జట్టు బోణీ కొట్టింది. శుక్రవారం రాజ్కోట్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 7 పరుగుల తేడాతో భారత్ సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది.భారత ఇన్నింగ్స్లో యశ్వర్ధన్ చౌహాన్ (34 బంతుల్లో 54) టాప్ స్కోరర్గా నిలవగా, అన్వయ్ ద్రవిడ్ (18 బంతుల్లో 38), అరంగేట్ర ప్లేయర్ ఆర్యవీర్ సెహ్వాగ్ (26 బంతుల్లో 28) ధనాధన్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లలో స్పెన్సర్ గ్రీన్, ఎలీ బ్రెయిన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసి ఓటమిపాలైంది.ఆసీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ జాక్ జోస్నెక్ (55) నీల్ పటేల్ (45), హేడెన్ బార్బులోవిక్ (40) రాణించినప్పటికీ మిడిలార్డర్ వైఫల్యంతో ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. భారత పేసర్ మోహిత్ ఉల్వా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్కు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో యశ్వర్ధన్ చౌహాన్ రెండు వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 21న జరగనుంది.చదవండి: IND vs AUS: సెహ్వాగ్ కొడుకు మెరుపులు.. ద్రవిడ్ కుమారుడి విధ్వంసం -
హెడ్ తుఫాన్ సెంచరీ.. రికార్డు స్కోర్ సాధించిన ఆస్ట్రేలియా!
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు జూలు విదిల్చారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (84 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112) భారీ సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ మిచెల్ మార్ష్ (53), కూపర్ కొన్నోలీ (78) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఆఖరిలో ఆలివర్ పీక్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41) మెరుపులు మెరిపించాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ మూడు, స్పిన్నర్ వెల్లింగ్టన్ మసకద్జా రెండు వికెట్లు తీశారు.విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్ ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో జింబాబ్వేపై అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆస్ట్రేలియన్ బ్యాటర్గా కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు మాట్ రెన్షా (86 బంతులు) పేరిట ఉండగా.. తాజా మ్యాచ్లో కేవలం 75 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకొని హెడ్ దానిని అధిగమించాడు. అంతేకాకుండా వన్డేల్లో జింబాబ్వేపై ఆస్ట్రేలియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. గతంలో 2014లో ఇదే హరారే మైదానంలో ఆసీస్ చేసిన 350 పరుగుల రికార్డును ప్రస్తుత మ్యాచ్తో తిరగరాశారు.చదవండి: AUS vs ZIM: ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ! -
బీసీసీఐ 95వ వార్షిక సమావేశం.. 10 కీలక నిర్ణయాలు ఇవే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 95వ వార్షిక సభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ముంబైలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన మీటింగ్కు బోర్డు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉప్యాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా పది కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ ఏజీఎం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే1. బీసీసీఐ జనరల్ బాడీలో భాగమైన అరుణ్ సింగ్ ధుమాల్ మరోసారి ఐపీఎల్ చైర్మన్గా ఖరారు కాగా.. ఖైరుల్ జమాల్ మజుందార్ సభ్యుడిగా చేరారు.2. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్కు బీసీసీఐ జనరల్ బాడీ ఆమోదం తెలిపింది.3. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బీసీసీఐ ఆడిట్ చేయబడిన ఖాతాల నివేదికను జనరల్ బాడీ ఆమోదించింది.4. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లను నియమించారు.5. అదేవిధంగా 2027లో జరగనున్న ఐపీఎల్ 20వ ఎడిషన్ను అత్యంత ఘనంగా నిర్వహించాలని జనరల్ బాడీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.6. బీసీసీఐ శత వసంత ఉత్సవాలు 2028లో ఘనంగా నిర్వహించాలని జనరల్ బాడీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టింది. డిసెంబరు 2027 నుంచి 2028 వరకు దాదాపు ఏడాది పాటు వేడుకలు చేయాలని నిర్ణయించింది. భారత క్రికెట్ చరిత్రలోని కీలక ఘట్టాన్ని వీలైనంత ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది.7.దేశవాళీ క్రికెట్లో పని చేస్తున్న అంపైర్లు, రిఫరీల వేతనాలను పెంచాలని బీసీసీఐ నిర్ణయించింది. 2026–27 సీజన్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దేశవాళీ అంపైర్లను ఎ, బి, సీ, డీ అనే నాలుగు గ్రేడ్లుగా విభజించేందుకు చర్యలు చేపట్టింది.8.లైంగిక వేధింపుల నిరోధక విధానంలో భాగంగా బీసీసీఐ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది.9.ఆటగాళ్ల వయసు నిర్దారణకు సంబంధించిన విధానంలో అప్డేట్ తీసుకువచ్చింది.10. దివ్యాంగ క్రికెటర్లకు మద్దతుగా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలు, వారికి కల్పించాల్సిన వనరులు, సౌకర్యాల గురించి రాష్ట్ర అసోసియేషన్లతో చర్చించింది. దివ్యాంగ క్రికెటర్ల అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. -
అంపైర్లు, రిఫరీల జీతాలు పెంపు
దేశవాళీ క్రికెట్లో పని చేస్తున్న అంపైర్లు, రిఫరీల వేతనాలను పెంచాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. 2026–27 సీజన్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అక్టోబర్ 11న రంజీ ట్రోఫీ ప్రారంభం కానుండగా, అప్పటి నుంచి కొత్త వేతనాలు వర్తిస్తాయి. ముంబైలో శుక్రవారం నాటి బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై అధికారికంగా ఆమోద ముద్ర వేస్తారు. దేశవాళీ అంపైర్లను ఎ, బి, సీ, డీ అనే నాలుగు గ్రేడ్లుగా విభజిస్తారు.రూ. 40 వేల చొప్పునతొలి రెండు గ్రేడ్లలో ఉన్నవారు సీనియర్ స్థాయి మ్యాచ్లకు, తర్వాతి రెండు గ్రేడ్లలో ఉన్నవారు జూనియర్ స్థాయి మ్యాచ్లకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం దేశంలో బీసీసీఐ గుర్తింపు పొందిన 20 మంది అంపైర్లకు రోజుకు రూ.40 వేల చొప్పున, ఇతర అంపైర్లు రోజుకు రూ.30 వేల చొప్పున ఇస్తున్నారు. టీ20 మ్యాచ్లకైతే రోజుకు రూ.20 వేలు లభిస్తాయి. రోజూవారీ భత్యం కింద ఇచ్చే రూ.500– రూ.1500 వరకు ఇచ్చే మొత్తం దీనికి అదనం. -
IND A vs AUS A: భారత్ను క్లీన్స్వీప్ చేసిన ఆసీస్
భారత మహిళల ‘ఎ’ జట్టు సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా ‘ఎ’ చేతిలో 0–3తో చిత్తయింది. న్యూ చండీగఢ్ వేదికగా గురువారం జరిగిన మూడో టీ20లో ఆసీస్ మహిళలు 7 పరుగుల తేడాతో భారత్ను ఓడించారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనిక లియరాయిడ్ (42 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్లు), కర్ట్నీ వెబ్ (42 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో సయాలీ సత్గరే, వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు దినేశ్ వృందా (41 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్స్లు), తేజల్ హస్నబిస్ (24 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడైన ఆటతో తొలి వికెట్కు 46 బంతుల్లోనే 84 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ఆ తర్వాతి బ్యాటర్లంతా విఫలం కావడంతో భారత్కు ఓటమి తప్పలేదు. టేలా వ్లామెనిక్, లిలీ మిలిస్ చెరో 3 వికెట్లతో భారత్ను దెబ్బ తీశారు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆదివారం మొదలవుతుంది. -
ఆసీస్పై సెహ్వాగ్ కొడుకు మెరుపులు.. ద్రవిడ్ కుమారుడి విధ్వంసం
రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనాధికారిక తొలి వన్డేలో భారత యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో యశ్వర్ధన్ చౌహాన్ (34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు) టాప్ స్కోరర్గా నిలిచాడు.అదరగొట్టిన అన్వయ్, ఆర్యవీర్ఈ మ్యాచ్లో యశ్తో పాటు భారత దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ల కుమారులు అన్వయ్ ద్రవిడ్, ఆర్యవీర్ సెహ్వాగ్లు మెరిశారు. భారత అండర్-19 జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఆర్యవీర్, తన తండ్రి శైలిలోనే దూకుడుగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.అతడు 26 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. అదేవిధంగా ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అన్వయ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: AUS vs ZIM: ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ! -
ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ!
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన ఫామ్పై వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో హెడ్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. తొలి వన్డేలో ఘోరంగా విఫలమైన హెడ్.. ఈ మ్యాచ్లో మాత్రం ఆతిథ్య జట్టును బౌలర్లను ఉతికారేశాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ ప్రేక్షకులను అలరించిన హెడ్.. కేవలం 75 బంతుల్లోనే తన 8వ వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తంగా 84 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.ఈ ఇన్నింగ్స్తో హెడ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో జింబాబ్వేపై అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాట్ రెన్షా పేరిట ఉండేది. హరారేలో జరిగిన తొలి వన్డేలో రెన్షా 86 బంతుల్లో శతకం సాధించగా, కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఆ రికార్డును హెడ్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్లో ఆసీస్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 45 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 295 పరుగుల భారీ స్కోర్ సాధించింది.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, ఇన్నోసెంట్ కైయా, బ్రెండన్ టేలర్(వికెట్ కీపర్), క్రెయిగ్ ఎర్విన్, సికందర్ రజా(కెప్టెన్), వెస్లీ మాధవెరె, బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, న్యూమాన్ న్యామ్హురి, బ్లెస్సింగ్ ముజరబానీఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, కూపర్ కానలీ, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, మాట్ రెన్షా, ఆలివర్ పీక్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్వుడ్, బిల్లీ స్టాన్లేక్చదవండి: SA vs AUS: సౌతాఫ్రికాకు ఊహించని షాక్! ఇక అంతే సంగతి? -
సౌతాఫ్రికాకు ఊహించని షాక్! ఇక అంతే సంగతి?
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గాయాల వల్ల స్టార్ పేసర్లు కగిసో రబాడా, ఒట్నీల్ బార్ట్మన్లు దూరం కాగా.. తాజాగా స్పీడ్స్టార్ లుంగి ఎంగిడి కూడా ఈ జాబితాలో చేరాడు. కుడి కాలి తొడ కండరాల గాయం కారణంగా అతడు ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.ఈ నెల ఆరంభంలో డాల్ఫిన్స్తో జరిగిన ఫస్ట్-క్లాస్ మ్యాచ్లో టైటాన్స్ తరఫున ఆడుతున్న సమయంలో ఎంగిడి గాయపడ్డాడు. తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడిన అతడికి ఆస్పత్రిలో స్కాన్ నిర్వహించగా గాయం తీవ్రత బయటపడింది. వైద్యులు అతడికి నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో ఆసీస్తో వన్డే సిరీస్ నుంచి అతడు తప్పుకున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.ఎంగిడి స్థానంలో 20 ఏళ్ల యువ పేసర్ న్కోబాని మోకోయెనాను ప్రొటీస్ సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 24 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రబాడా, బార్ట్మన్, ఎంగిడి వంటి కీలక పేసర్లు లేకుండా సౌతాఫ్రికా యువ బౌలింగ్ విభాగం పటిష్టమైన ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ను ఏమేరకు అడ్డుకుంటుందో చూడాలి.ఆసీస్తో వన్డే సిరీస్కు ప్రోటీస్ జట్టుటెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, జోర్న్ ఫోర్టుయిన్, డువాన్ జాన్సెన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, న్కోబానీ మోకోనా, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్.చదవండి: IND vs AUS: భారత జట్టులో సిక్కోలు కుర్రాడికి చోటు!? -
IND vs AFG: వేరే దారి లేదు.. మా ఓటమికి కారణాలు ఇవే!
భారత్లో తొలిసారి టీమిండియాకు టీ20 సిరీస్లో ఆతిథ్యం ఇచ్చిన అఫ్గానిస్తాన్కు చేదు అనుభవమే మిగిలింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సిరీస్లో భారత్.. అఫ్గాన్పై ఏకపక్ష విజయాలు సాధించింది.అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం జరిగిన మూడో టీ20లో అఫ్గాన్ను ఏకంగా 127 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన టీమిండియా.. 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ స్పందించాడు.నిరాశ కలిగింది.. పవర్ ప్లేలో పర్లేదు‘‘కచ్చితంగా నిరాశ కలిగించే సిరీస్ ఇది. అయితే, పవర్ప్లేలో మేము కాస్త మెరుగయ్యాము. అందుకు నేను కాస్త సంతోషంగా ఉన్నాను. అయితే, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయాము.సిరీస్ మొదటి నుంచే మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయితే, రోజురోజుకీ ఆటను మెరుగుపరచుకునేందుకు కృషి చేస్తున్నాము. టీ20 ప్రపంచకప్ తర్వాత మాకిదే తొలి సిరీస్. ఇంకా ఎన్నో పటిష్ట జట్లతో మరిన్ని మ్యాచ్లు, సిరీస్లు ఆడాల్సి ఉంది. అందుకు తగినట్లుగా ప్రణాళికలు రచించుకోవాల్సి ఉంది’’ అని ఇబ్రహీం జద్రాన్ పేర్కొన్నాడు.భారత ఓపెనర్లు అద్భుతంమరోవైపు.. అఫ్గానిస్తాన్ హెడ్కోచ్ రిచర్డ్ పైబస్ కూడా స్పందించాడు.. ‘‘మా ఆట చాలా చెత్తగా సాగింది. అయితే టాస్ గెలవడం కాస్త ఊరటనిచ్చినా.. తొలి పది ఓవర్ల ఆట మా నియంత్రణలో లేకుండా పోయింది. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108), సంజూ శాంసన్ (35 బంతుల్లో 50) అద్భుతంగా, అందంగా బ్యాటింగ్ చేశారు.మా బౌలర్లు తిరిగి పుంజుకున్నారుఅయితే, తర్వాతి పది ఓవర్లలో మా బౌలర్లు తిరిగి పుంజుకున్నారు. ఇది మాకు సానుకూల అంశం. నిజంగానే మా వాళ్లు అద్బుతంగా పోరాటం చేశారు. ఫీల్డింగ్లోనూ రాణించారు. కానీ 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మా వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయారు.వేరే దారి లేకుండా పోయిందిఓవర్కు పదకొండు పరుగుల చొప్పున రాబట్టడం కష్టమే. పరిస్థితిని ఎదుర్కోవడం తప్ప వేరే దారి లేదు. మా ప్రణాళికలకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయాము. ఓపెనర్లు ఇబ్రహీం (25), గుర్బాజ్ (15) దూకుడుగా మొదలుపెట్టినా దానిని కొనసాగించలేకపోయారు. లోపాల్ని సరిచేసుకుని ముందుకు సాగుతాము’’ అని రిచర్డ్ పైబస్ చెప్పుకొచ్చాడు. చదవండి: అభిషేక్ శర్మ అద్భుతం.. అఫ్గాన్ ఆట ప్రశంసనీయం: శ్రేయస్ అయ్యర్! -
IND vs AUS: భారత జట్టులో సిక్కోలు కుర్రాడికి చోటు!
ఆస్ట్రేలియా- ‘ఎ’తో తలపడే భారత్- ‘ఎ’ జట్టులో ఒక మార్పు చోటు చేసుకున్నట్లు సమాచారం. కర్ణాటక పేసర్ విజయ్ కుమార్ వైశాఖ్ గాయం వల్ల జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది.పుదుచ్చేరి వేదికగాకాగా సెప్టెంబరు 22- అక్టోబరు 11 మధ్య రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీస్ జట్టు భారత్కు వస్తోంది. ఇందుకు పుదుచ్చేరి వేదిక. ఈ క్రమంలో ఇప్పటికే ఆసీస్-‘ఎ’తో మల్టీ సిరీస్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్లను ప్రకటించింది.ఆసీస్తో అనధికారిక వన్డేలకు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది యాజమాన్యం. గాయం నుంచి కోలుకున్న అతడికి ఈ సిరీస్ ప్రాక్టీస్గా ఉపయోగపడనుంది. ఇక అనధికారిక వన్డేలకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఎంపిక కాగా.. అనధికారిక టెస్టులకు దేవదత్ పడిక్కల్ సారథ్యం వహిస్తాడు.గాయం వల్ల దూరం!ఇక విజయ్ కుమార్ వైశాఖ్కు అనధికారిక టెస్టు జట్టులో చోటు దక్కింది. అయితే, ఫిట్నెస్ ఆధారంగానే అతడు ఆడతాడని జట్టు ప్రకటన సమయంలోనే యాజమాన్యం పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. విజయ్ కుమార్ వైశాఖ్ తొడకండరాల గాయం నుంచి ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆసీస్తో మల్డీ డే మ్యాచ్లకు వైశాఖ్ దూరం కాగా.. ఆంధ్ర రైటార్మ్ స్పిన్నర్, సిక్కోలు కుర్రాడు త్రిపురాన విజయ్కు భారత్-‘ఎ’ జట్టులో చోటు దక్కినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అయితే, ఇందుకు సంబంధించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.దులిప్ట్రోఫీలో సత్తా చాటికాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన విజయ్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇటీవల ఈస్ట్ జోన్తో దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో భాగంగా సౌత్ జోన్కు ఆడిన ఈ స్పిన్ బౌలర అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు కూల్చిన పాతికేళ్ల విజయ్.. రెండో ఇన్నింగ్స్లో అద్భుత బంతితో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని అవుట్ చేశాడు. అయితే, ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సంపాదించిన ఈస్ట్ జోన్ నిబంధనల ప్రకారం టైటిల్ను కైవసం చేసుకుంది.చదవండి: సంజూను పక్కన పెట్టాను.. వైభవ్ వేచి చూడాల్సిందే: గంభీర్Vijaykumar Vyshak has been ruled out of India A’s two four-day matches against Australia A due to injury.Andhra off-spinner Tripurana Vijay has been named as his replacement.— Pratyush Raj (@pratyush93_raj) September 18, 2026 -
భారత్ ఘన విజయం.. సెమీ ఫైనల్లో ప్రత్యర్థి ఎవరంటే?
ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఆతిథ్య జపాన్ మహిళా జట్టుతో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది.. సెమీస్కు దూసుకువెళ్లింది.అదరగొట్టిన కడప అమ్మాయినిశిన్లోని కరోగి స్పోర్ట్స్ పార్కులో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జపాన్ 57 పరుగులకే కుప్పకూలింది. Sree Charani keeps it tight and bowls a brilliant maiden over! 👏Catch India vs Japan at the Asian Games, LIVE NOW on Sony Sports Network & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026 #BaarBaarBharatHarBaarBharat pic.twitter.com/HZFN7vGlYr— Sony Sports Network (@SonySportsNetwk) September 18, 2026భారత బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణి (4/10) అద్భుత ప్రదర్శన కనబరచగా.. షఫాలి వర్మ (2/13), శ్రేయాంక పాటిల్ (1/9), దీప్తి శర్మ (1/14) కూడా రాణించారు. ఇక జపాన్ విధించిన 58 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి కేవలం ఐదు ఓవర్లలోనే ఊదేసింది. షఫాలి విధ్వంసంవైస్ కెప్టెన్ స్మృతి మంధానకు బదులుగా ఓపెనర్ వచ్చిన 18 ఏళ్ల గుణాలన్ కమిలిని డకౌట్ కాగా.. మరో ఓపెనర్ షఫాలి వర్మ తనదైన శైలిలో దూకుడుగా ఆడింది. కేవలం 15 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగి.. 40 పరుగులతో అజేయంగా నిలిచింది. ఐదో ఓవర్లో ఆఖరి బంతికి సిక్సర్ బాది టీమిండియా గెలుపును ఖరారు చేసింది.మిగిలిన వారిలో వన్డౌన్లో వచ్చిన భారతి ఫుల్మలి ఆరు పరుగులు చేసి అవుట్ కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ 6 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచింది. జపాన్ బౌలర్లలో నొనొహ యసుమొటో, అయాక కాటో- స్టఫోర్ట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా సెమీ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ను ఎదుర్కోనుంది.సెమీస్ చేరిన జట్లు ఇవేనిశిన్ వేదికగా గురువారం బంగ్లాదేశ్- చైనా మధ్య తొలి క్వార్టర్ ఫైనల్ వర్షం వల్ల రద్దు కాగా.. ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లా సెమీస్కు చేరింది. రెండో క్వార్టర్ ఫైనల్లో థాయ్లాండ్పై పాకిస్తాన్ గెలిచి.. టాప్-4కు అర్హత సాధించింది. తాజాగా శుక్రవారం నాటి మూడో క్వార్టర్ ఫైనల్లో మలేషియాపై శ్రీలంక.. జపాన్పై భారత్ గెలిచి సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.సెమీ ఫైనల్ షెడ్యూల్ ఇదేసెప్టెంబరు 20 (ఆదివారం)- తొలి సెమీ ఫైనల్- పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక- భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు మ్యాచ్ ఆరంభంసెప్టెంబరు 20 (ఆదివారం)- రెండో సెమీ ఫైనల్- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ఆరంభంవేదిక: కరోగి స్పోర్ట్స్ పార్కు, నిశిన్, జపాన్.చదవండి: సంజూను పక్కన పెట్టాను.. అతడు వేచి చూడాల్సిందే: గంభీర్ -
చెలరేగిన భారత స్పిన్నర్.. జపాన్ 57 ఆలౌట్
జపాన్తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా బౌలర్ శ్రీ చరణి అద్భుత ప్రదర్శన కనబరిచింది. నాలుగు వికెట్లతో చెలరేగిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేసింది. శ్రీ చరణితో పాటు షఫాలి వర్మ, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ కూడా రాణించారు. ఫలితంగా జపాన్ మహిళా క్రికెట్ జట్టు కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్- జపాన్ పోటీకి దిగాయి. జపాన్లోని నిశిన్ వేదికగా టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది.ఓపెనర్లు హరునా ఇవాసాకి పది పరుగులు చేయగా.. అయాక కాటో- స్టఫోర్డ్ 25 పరుగులతో సత్తా చాటింది. అయితే, హరూనాను అవుట్ చేసి శ్రీ చరణి వికెట్ల వేట మొదలుపెట్టగా.. అయాకను షఫాలి వర్మ పెవిలియన్కు పంపింది.ఇక వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ మైయ్ యనగిడను శ్రీ చరణి డకౌట్ చేయగా.. ఎరికా ఓడా (5)ను దీప్తి శర్మ వెనక్కి పంపింది. ఐదో స్థానం నుంచి మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. షిమాకో కాటో 3, అకారి నిశిముర కానో 2, వికెట్ కీపర్ బ్యాటర్ హినాసే గోటో 1, అహిల్య చందేల్ 0, ఆయుమి ఫుజికావా 4 (నాటౌట్), ఎరికా టొగుచి క్విన్ 0, నొనొహ యసుమొటో 0 పరుగులు చేశారు.శ్రీచరణి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 10 పరుగులే ఇచ్చి.. హరునా, మైయ్, అకారి, ఎరిక వికెట్లు పడగొట్టింది. షఫాలి వర్మ నాలుగు ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్ 3.5 ఓవర్లలో తొమ్మిది పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది. దీప్తి శర్మ పూర్తి కోటా బౌలింగ్ చేసి 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది. నిజానికి పసికూన జపాన్ 19.5 ఓవర్ల పాటు ఆలౌట్ కాకుండా ఉండటమే విశేషం.తుదిజట్లుభారత్స్మృతి మంధాన, షఫాలి వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, నందిని శర్మజపాన్హరునా ఇవాసాకి, ఆకారి నిశిముర కానో, మైయ్ యనగిడ (కెప్టెన్), ఎరిక ఓడా, అహిల్య చందేల్, షిమాకో కాటో, అయాక కాటో- స్టఫోర్డ్, ఆయుమి ఫుజికావా, హినాసే గోటో (వికెట్ కీపర్), ఎరిక టొగుచి క్విన్, నొనొహా యసుమొటో. -
సెమీ ఫైనల్లో శ్రీలంక.. పాకిస్తాన్తో ఢీ!
ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్లో శ్రీలంక జట్టు సత్తా చాటింది. జపాన్లోని నిశిన్ వేదికగా జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మలేషియాను చిత్తుగా ఓడించింది. తద్వారా సెమీస్కు అర్హత సాధించింది.ఆటపట్టు మెరుపు అర్ధ శతకంకరోగి స్పోర్ట్స్ పార్కులో శుక్రవారం ఉదయం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో ఇమేషా దులాని (2) విఫలమైనప్పటికీ.. కెప్టెన్ చమరి ఆటపట్టు మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటింది. కేవలం 37 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఆటపట్టు 63 పరుగులు సాధించింది.కవిశా ధనాధన్మిగిలిన వారిలో హాసిని పెరీరా (26 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించగా.. కవిశా దిల్హరి ధనాధన్ (27 బంతుల్లో 44 నాటౌట్) దంచికొట్టింది. ఆఖర్లో హర్షిత సమరవిక్రమ (18 బంతుల్లో 25) కూడా వేగంగా ఆడింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.74 పరుగులకే పరిమితంమలేషియా బౌలర్లలో నురిన్ ఇమానైనా మూడు వికెట్లు తీసి సత్తా చాటింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన మలేషియా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బౌలర్లు మిథాలి అయోధ్య, కవిశా దిల్హరి, చమరి ఆటపట్టు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి.. తలా రెండు వికెట్లు కూల్చి.. ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు.సెమీస్లో పాక్తో ఢీమలేషియా బ్యాటర్లలో వినిఫ్రెడ్ దురైసింగం (28), మహిరా ఇజాతి ఇస్మాయిల్ (24) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఇక మలేషియాపై 86 పరుగుల తేడాతో జయభేరి మోగించిన శ్రీలంక.. సెమీ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. ఇక ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్- శ్రీలంక తలపడేందుకు సిద్ధమయ్యాయి.చదవండి: సంజూను పక్కనపెట్టాను.. వైభవ్ వేచి చూడాల్సిందే: గంభీర్ -
సంజూను పక్కనపెట్టాను.. వైభవ్ వేచి చూడాల్సిందే: గంభీర్
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్లో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఢిల్లీ వేదికగా అఫ్గాన్ ఆతిథ్యం ఇచ్చిన మూడు టీ20లలోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ బెంచ్కే పరిమితం అయ్యాడు. గత సిరీస్లో భాగంగా జింబాబ్వేపై టీమిండియా 3-0తో క్లీన్స్వీప్ చేయడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు.మెరుపు అర్ద శతకాలుఅయినప్పటికీ అఫ్గాన్తో సిరీస్లో యాజమాన్యం వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి రావడంతో అభిషేక్ శర్మకు జోడీగా అతడినే ఓపెనర్గా కొనసాగించింది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ (10)లో విఫలమైనప్పటికీ మిగిలిన రెండు టీ20లలో సంజూ మెరుపు అర్ధ శతకాల (57, 50)తో దుమ్ములేపాడు.కుండబద్దలు కొట్టిన గంభీర్ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తుదిజట్టులో చోటు కోసం మరికొన్నాళ్లు వేచి చూడకతప్పని పరిస్థితి నెలకొంది. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించాడు. ‘‘వైభవ్ దృష్టి కోణం నుంచి చూసినప్పటికీ.. అతడు మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది.అతడు ఎంతటి ప్రతిభావంతుడో మాకూ తెలుసు. అద్భుతాలు చేయగల సామర్థ్యం అతడికి ఉంది. అయితే, గత కొన్నేళ్లుగా అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లకు తొలి ప్రాధాన్యం దక్కడం సహజం. అలాంటి ప్లేయర్లకు దీర్ఘకాలం అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఇక సంజూ శాంసన్ సత్తా ఏమిటో అందరికీ తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన ఆటగాడు అతడు. ప్రతిభ లేకుండా ఎవరూ ఈ స్థాయికి చేరుకోలేరు కదా!.. తన శక్తి మేర జట్టు కోసం అతడు పనిచేశాడు.సంజూను పక్కనపెట్టాను.. అదే కఠిన నిర్ణయంఏదేమైనా ఇంగ్లండ్ పర్యటనలో సంజూను తప్పించి వైభవ్కు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. నా కోచింగ్ కెరీర్లో ఇదే అత్యంత కఠిన నిర్ణయం అనుకుంటాను. ఐర్లాండ్తో సిరీస్లో అతడు విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు.అయితే, కొన్నిసార్లు ఫామ్లో ఉన్న ఆటగాళ్లను కొనసాగిస్తాం. మరికొన్నిసార్లు ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీలో సత్తా చాటిన కాంబినేషన్ను కొనసాగించాలని భావిస్తాం. రెండు, మూడు మ్యాచ్లలో విఫలమైనంత మాత్రాన వారిపై చెత్త ఆటగాళ్లుగా ముద్రవేయలేము.మా జట్టు బాగుందిఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో మాకు చేదు అనుభవం ఎదురైన మాట వాస్తవమే. కానీ గత ప్రపంచకప్లో విజేతగా నిలిచిన జట్టు.. ఆ తర్వాత వెంటనే మరో వరల్డ్కప్ టోర్నీలో టైటిల్ గెలిచిన జట్టు.. ఒకటీ రెండు ఓటముల కారణంగా చెడ్డది అయిపోదు’’ అని గంభీర్ శ్రేయస్ అయ్యర్ సేనను సమర్థించాడు.కాగా అఫ్గాన్ను 3-0తో టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. అంతకుముందు జింబాబ్వే పర్యటనలో కూడా ఇదే ఫలితం సాధించింది. అయితే, యూకే టూర్లో భాగంగా ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో శ్రేయస్ అయ్యర్ సేన క్లీన్స్వీప్ అయింది. చదవండి: అభిషేక్ ఓ అద్భుతం.. వాళ్ల ఆట తీరు ప్రశంసనీయం! -
టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్
ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 టోర్నీలో భాగంగా నాలుగో క్వార్టర్ ఫైనల్లో భారత్- జపాన్ పోటీకి దిగాయి. నిశిన్లోని కరోగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు సెమీస్ బెర్తులు ఖరారుకాగా సెప్టెంబరు 17- 22 మధ్య ఆసియా క్రీడల-2026 మహిళల టీ20 టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో గురువారం నాటి తొలి క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్- చైనా తలపడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ రద్దైపోయింది. ఫలితంగా ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ సెమీ ఫైనల్కు నేరుగా అర్హత సాధించింది.ఇక రెండో క్వార్టర్ ఫైనల్లో థాయ్లాండ్పై మూడు వికెట్ల తేడాతో గట్టెక్కి పాకిస్తాన్ సెమీస్కు చేరింది. మరోవైపు.. మూడో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక మలేషియాపై 86 పరుగుల తేడాతో గెలిచి టాప్-4లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్- శ్రీలంక తలపడనుండగా.. భారత్- జపాన్ మధ్య మ్యాచ్ విజేతతో బంగ్లాదేశ్ రెండో సెమీస్ మ్యాచ్లో పోటీకి దిగనుంది.తుదిజట్లుభారత్స్మృతి మంధాన, షఫాలి వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, నందిని శర్మ జపాన్హరునా ఇవాసాకి, ఆకారి నిశిముర కానో, మైయ్ యనగిడ (కెప్టెన్), ఎరిక ఓడా, అహిల్య చందేల్, షిమాకో కాటో, అయాక కాటో- స్టఫోర్డ్, ఆయుమి ఫుజికావా, హినాసే గోటో (వికెట్ కీపర్), ఎరిక టొగుచి క్విన్, నొనొహా యసుమొటో. -
మన మహిళా క్రికెటర్లు బరిలోకి
నగోయా: ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పతక వేటలో నేడు తొలి పోరులో బరిలోకి దిగనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న భారత జట్టు ఈ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను ఎదుర్కొంటుంది. ఇటీవలే ఆసియా కప్ను గెలుచుకున్న హర్మన్ప్రీత్ కౌర్ బృందానికి ఈ మ్యాచ్లో గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న భారత్ను నిలువరించడం ప్రత్యరి్థకి అసాధ్యం. మరోవైపు ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 61 టి20 మ్యాచ్ల అనుభవం ఉన్నా... పెద్ద జట్లతో ఎప్పుడూ ఆడని జపాన్ ఈ ఆసియా క్రీడల్లో ఒక్క మ్యాచ్లోనైనా ప్రభావం చూపించాలని ఆశగా ఉంది. 2028 లాస్ ఏంజెలిస్లో జరిగే ఒలింపిక్ క్రీడలకు సన్నాహకంగా ఈ ఆసియా క్రీడలు పనికొస్తాయని భారత కోచ్ అమోల్ మజుందార్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్తో పెద్దగా పరిచయం లేని జట్లతో కూడా ఆడుతున్న తమకు ఒలింపిక్స్లోనూ ఇదే తరహా పరిస్థితులు ఎదురవుతాయని అతను వ్యాఖ్యానించాడు. నేడు జరిగే మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మలేసియాతో శ్రీలంక తలపడుతుంది. సెమీస్లో పాక్, బంగ్లాదేశ్... ఆసియా క్రీడల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మహిళల జట్లు సెమీస్లోకి అడుగు పెట్టాయి. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో థాయ్లాండ్పై 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. బంగ్లాదేశ్, చైనా మధ్య జరిగిన మరో క్వార్టర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా...ర్యాంకింగ్ ప్రకారం బంగ్లాదేశ్ ముందంజ వేసింది. -
‘అభిషేక్ ఒక అద్భుతం.. వాళ్ల ఆటతీరు ప్రశంసనీయం’
అఫ్గానిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-0తో టీమిండియా క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన చివరి టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. ‘‘నిజానికి ఇది సులభమైన వికెట్ కాదు. కానీ అభిషేక్ ఆడిన తీరు కంటికి ఇంపుగా ఉంది. అతడొక అద్భుతం. అతడు శతకం సాధించడం చాలా ఆనందం కలిగించింది. అఫ్గానిస్తాన్ సిరీస్ కోల్పోయినప్పటికీ వాళ్లు మా మనసులు గెలిచారు. ఈ సిరీస్కు వాళ్లు ఆతిథ్యం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఓడినప్పటికీ ఆఫ్గన్ జట్టు ప్రదర్శన కూడా ప్రశంసనీయం. టాస్కు ముందే ఆఫ్గన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్తో క్లుప్తంగా మాట్లాడిన తర్వాతే మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. మ్యాచ్లో మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. అభిషేక్ విధ్వంసానికి తోడు శాంసన్ రాణించడంతో 200లకు పైగా రన్స్ను స్కోరుబోర్డుపై చేర్చగలిగాం. అక్షర్ పటేల్ కీలక సమయంలో రాణిండంలో సిద్ధహస్తుడు. గతంలో చాలా సందర్భాల్లో జట్టును గెలిపించాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలనేది అతడికి బాగా తెలుసు. మొదటి నుండి నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి అతడికి నా ప్రత్యేక అభినందనలు.’’ అని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం -
'వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా; ఇదే నా స్టైల్'
అఫ్గానిస్తాన్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే సెంచరీ సాధించి పలు రికార్డులు బద్దలుకొట్టాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును అభిషేక్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఆ రికార్డు రోహిత్ శర్మ (35 బంతులు) పేరిట ఉండేది. ఇక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 3-0తో ఆఫ్గన్ను క్లీన్స్వీప్ చేసింది.ఇక మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా 127 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్తాన్ను మట్టికరిపించింది. మ్యాచ్ విజయం అనంతరం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్న అభిషేక్ శర్మ తన ప్రదర్శనపై స్పందించాడు. రికార్డులు తనకు ముఖ్యం కాదని, మ్యాచ్లో బరిలోకి దిగితే వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా అన్నట్లుగా తన బ్యాటింగ్ స్టైల్ ఉంటుందని అభిషేక్ తెలిపాడు.Photo Credit: BCCI Twitter"ముందుగా ఇవాళ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. నేను సాధించిన సెంచరీ వారికి గిఫ్ట్ అని భావిస్తున్నా. ఇక రెండు సంవత్సరాల క్రితం, మేము ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఆడి అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయించాలని నిర్ణయించుకున్న విషయం నాకు బాగా గుర్తుంది. ఆ ప్రణాళిక ఒక సంవత్సరం పాటు చక్కగానే పనిచేసింది. ఈలోగా రెండు (ఇంగ్లండ్, ఐర్లాండ్) సిరీస్లు మాకు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి. కానీ ఒకటి రెండు చెడ్డ సిరీస్లు మా బ్యాటింగ్ను నిర్వచించలేవు. ఆడుతుంది చిన్న జట్టుతోనే, పెద్ద జట్టుతోనా అనేది పక్కనబెట్టి జట్టు విజయం కోసం మేమంతా సమిష్టి ప్రదర్శన చేశాము. ఇక నా విషయానికొస్తే ప్రతీ సిరీస్కు ముందు నేను అనుసరించే ప్రక్రియపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని భావిస్తున్నా. ఎవరితో ఆడుతున్నాను, బౌలర్లు ఎవరు అనే విషయాలు నాకు ప్రత్యేకం. కాబట్టి వ్యక్తిగతంగా ఒక బ్యాటర్గా నా దృష్టి ఎప్పుడూ బ్యాటింగ్ పవర్ ప్లేపైనే ఉంటుంది. Photo Credit: BCCI Twitterమైదానంలో దూకుడుగా ఆడాలంటే ముందుగా సరైన ప్రిపరేషన్ అవసరం. అదే నా విజయానికి కారణం. ఆఫ్గన్తో టీ20 సిరీస్లో బ్యాటింగ్కు సంబంధించి పెద్దగా ప్రణాళికలంటూ ఏమీ లేవు. ఆది నుంచి వారిపై ఆధిపత్యం ప్రదర్శిస్తే జట్టుకు భారీ స్కోరు ఇవ్వగలననే అంశాన్ని మాత్రమే మైండ్లో పెట్టుకొని ఆడుతూ వచ్చాను. రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోను. జట్టుకు అవసరమైనప్పుడు బాధ్యతాయుతంగా ఆడి పని పూర్తి చేయడంపైనే దృష్టి సారిస్తాను. కెప్టెన్, కోచ్ నుంచి మద్దతు ఉండడం వల్లే ఇదంతా సాధ్యమైంది." అని చెప్పుకొచ్చాడు. ఇక అభిషేక్ శర్మ అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచ్లు ఆడి 269 స్ట్రైక్రేట్తో 229 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, అర్థసెంచరీ ఉన్నాయి.ABHISHEK SHARMA SPEAKS: 🗣️“Personally me as a batter, it's always been about the process - How I'm gonna utilize the power play.” pic.twitter.com/IjTqcFZ8lR— Maina Singh (@Maina_Singhx77) September 17, 2026ఇదీ చదవండి: మూడో టీ20లో టీమిండియా విజయం.. ఆఫ్గన్ క్లీన్స్వీప్ -
మూడో టీ20లో టీమిండియా విజయం.. ఆఫ్గన్ క్లీన్స్వీప్
స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా 127 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్పై విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ భారత బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలో 94 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (25) మినహా మిగతావాళ్లు బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయి చెరో 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 2 వికెట్లు, యశ్ ఠాకూర్, బుమ్రాలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) శతకంతో విధ్వంసం సృష్టించగా.. సంజూ శాంసన్ (35 బంతుల్లో 50) అర్థసెంచరీ సాధించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29) రాణించాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జయ్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జయ్ చెరొక వికెట్ తీశారు. అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ టీమిండియానే విజయం సాధించి ఆఫ్గన్ను క్లీన్స్వీప్ చేసింది. శతకంతో చెలరేగిన ఓపెనర్ అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.As clinical and commanding as it gets 🇮🇳#TeamIndia with a massive 1️⃣2️⃣7️⃣-run victory to clinch the Friendship Cup 3️⃣-0️⃣ 🏆Scorecard ▶️ https://t.co/Zixki4RhPt#AFGvIND pic.twitter.com/ZDY4ZzdaxY— BCCI (@BCCI) September 17, 2026ఇదీ చదవండి: అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్ -
అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ (221-7) చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడగా.. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (35 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు అర్ద సెంచరీతో రాణించాడు. వీరిద్దరు ఔటయ్యాక భారత్ స్కోర్ నెమ్మదించింది. తిలక్ వర్మ (2), శివమ్ దూబే (12), ఇషాన్ కిషన్ (10), నితీశ్ కుమార్ రెడ్డి (1), శ్రేయస్ అయ్యర్ (29) వేగంగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. అక్షర్ పటేల్ (5), రవి బిష్ణోయ్ (0) అజేయంగా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2, రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్జాయ్ తలో వికెట్ పడగొట్టగా.. ముగ్గురు భారత బ్యాటర్లు రనౌటయ్యారు. ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్లో అభిషేక్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో, భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్కు ముందు భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతులు) పేరిట ఉంది.ఓవరాల్గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫాహద్ 29 బంతుల్లో సెంచరీలు చేసి, అభిషేక్ కంటే ముందున్నారు. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. 30 బంతుల్లోనే సెంచరీ -
అరుదైన మైలురాయిని తాకిన సంజూ శాంసన్
ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో 35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి ఔటైన అతడు.. టీ20 క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల క్లబ్లో చేరాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 34వ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు 351 మ్యాచ్లు ఆడిన సంజూ 140కి పైగా స్ట్రయిక్రేట్తో 8 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 9027 పరుగులు చేశాడు. భారత్ తరఫున సంజూకు ముందు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సూర్యకుమార్ యాదవ్ మాత్రమే 9000 టీ20 పరుగులు పూర్తి చేశారు.సంజూ విషయాన్ని అటుంచితే.. ఈ మ్యాచ్లో మరో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో, భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్కు ముందు భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతులు) పేరిట ఉంది.ఓవరాల్గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫాహద్ 29 బంతుల్లో సెంచరీలు చేసి, అభిషేక్ కంటే ముందున్నారు.34 బంతుల్లో 11 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 108 పరుగులు చేసిన తర్వాత అభిషేక్ ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 184-3గా ఉంది. శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబే (13) క్రీజ్లో ఉన్నారు.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. 30 బంతుల్లోనే సెంచరీ -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. 30 బంతుల్లోనే సెంచరీ
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్.. ఆతర్వాత 50 పరుగులు పూర్తి చేసేందుకు మరో 14 బంతులు మాత్రమే తీసుకున్నాడు. అభిషేక్ ఆ బౌలర్ ఈ బౌలర్ అన్న తేడా లేకుండా ఆఫ్ఘన్ బౌలింగ్ మొత్తాన్ని ఊచకోత కోశాడు.సెంచరీ తర్వాత కూడా అభిషేక్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు 33 బంతులు ఎదుర్కొన్న అతడు, 11 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 108 పరుగులతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్లో సంజూ శాంసన్ కూడా ధాటిగానే ఆడుతున్నాడు. సంజూ 25 బంతుల్లో 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 34 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 9.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 142-0గా ఉంది.భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీటీ20ల్లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తాజాగా ఈ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. ఓవరాల్గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫాహద్ 29 బంతుల్లో సెంచరీలు చేసి, అభిషేక్ కంటే ముందున్నారు. టెస్ట్ ప్లేయింగ్ దేశాల్లో మాత్రం అభిషేక్దే ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ. ఇదీ చదవండి: ఆఫ్ఘన్తో మూడో టీ20.. టీమిండియాలో ఓ మార్పు -
అభిషేక్ మహోగ్రరూపం.. 36 బంతుల్లోనే భారత్ సెంచరీ
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగగా.. ఆభిషేక్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఆతర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. అభిషేక్కు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా తోడవ్వడంతో భారత్ కేవలం 3.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది.తొలి ఓవర్ నుంచి ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించిన అభిషేక్.. రెండో, మూడు, ఐదు, ఆరు ఓవర్లలో ఉగ్రరూపం దాల్చాడు. అభిషేక్ ధాటికి భారత్ 6 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును తాకింది. పవర్ప్లేలో 100 పరుగుల మార్కును తాకడం భారత్కు ఇది తొలిసారి. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 100-0గా ఉంది. అభిషేక్ 22 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 76 పరుగులు, సంజూ శాంసన్ 14 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 24 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.ఇదీ చదవండి: ఆఫ్ఘన్తో మూడో టీ20.. టీమిండియాలో ఓ మార్పు -
ఆఫ్ఘన్తో మూడో టీ20.. టీమిండియాలో ఓ మార్పు
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆఫ్ఘన్ జట్టు రెండు మార్పులు చేయగా.. భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆఫ్ఘన్ తరఫున గుల్బదిన్ నైబ్, నూర్ అహ్మద్ స్థానాల్లో అబ్దుల్లా అహ్మద్జాయ్, నూర్ ఉల్ రహ్మాన్ బరిలోకి దిగనుండగా.. భారత్ తరఫున అర్షదీప్ స్థానంలో యశ్ ఠాకూర్ బరిలోకి దిగుతున్నాడు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు గెలిచిన భారత్ ఇదివరకే సిరీస్ కైవసం చేసుకుంది.తుది జట్లు.. ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): ఇబ్రహీం జద్రాన్ (సి), రహమానుల్లా గుర్బాజ్ (డబ్ల్యు), సెడిఖుల్లా అటల్, అబ్దుల్లా అహ్మద్జాయ్, దర్విష్ రసూలీ, నూర్ ఉల్ రెహమాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబుల్ ఉర్ రహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, అబ్దుల్లా అహ్మద్జాయ్భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రాఇదీ చదవండి: ఆసీస్ వరల్డ్కప్ విన్నర్ షాకింగ్ నిర్ణయం -
ఆసీస్ వరల్డ్కప్ విన్నర్ షాకింగ్ నిర్ణయం
ఆస్ట్రేలియా వెటరన్ వికెట్కీపర్ బ్యాటర్, టీ20 ప్రపంచకప్ విజేత మాథ్యూ వేడ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. స్థానికంగా జరిగే బిగ్బాష్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు (రిటైర్మెంట్) ప్రకటించాడు. 38 ఏళ్ల వేడ్ 2024లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగా, ఇప్పుడు దేశవాళీ టీ20 లీగ్ నుంచి కూడా తప్పుకున్నాడు.బిగ్బాష్ లీగ్ ప్రారంభం నుంచి (2011-12) వివిధ ఫాంచైజీలకు (హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్, మెల్బోర్న్ స్టార్స్) ప్రాతినిథ్యం వహించిన వేడ్.. 2026-27 సీజన్కు ముందు ఆటగాడిగా తన ప్రయాణాన్ని ముగించాడు. కోచింగ్ కెరీర్పై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వేడ్ ప్రకటించాడు. ప్రస్తుతం వేడ్ ఆస్ట్రేలియా పురుషుల వైట్-బాల్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా పనిచేస్తున్నాడు.టెస్ట్ వికెట్కీపర్గా కెరీర్ ప్రారంభించిన వేడ్.. ఆ తర్వాత స్పెషలిస్ట్ మిడిలార్డర్ బ్యాటర్గా మారాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్కీపర్-ఫినిషర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021 టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోనూ అతను కీలక సభ్యుడిగా ఉన్నాడు. గత సీజన్లో హోబర్ట్ హరికేన్స్ తరఫున బీబీఎల్ ఆడుతూనే ఆస్ట్రేలియా పురుషుల జట్టుతో కోచింగ్, కన్సల్టింగ్ బాధ్యతల్లో పనిచేశాడు. 2020 ఎడిషన్లో అడిలైడ్ స్ట్రైకర్స్పై చేసిన విధ్వంసకర శతకం (61 బంతుల్లో 130 నాటౌట్) వేడ్ బీబీఎల్ కెరీర్లో అత్యుత్తమంగా నిలిచింది. వేడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ పలు సీజన్లలో ఆడాడు. 2011లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున.. 2022, 2024 సీజన్లలో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా నాలుగు మ్యాచ్లు ఆడాడు. మొత్తంగా వేడ్ ఐపీఎల్లో 15 మ్యాచ్లు ఆడి 13.07 బ్యాటింగ్ సగటుతో 8 క్యాచ్లు, ఒక స్టంపింగ్ నమోదు చేశాడు.ఇదీ చదవండి: ఐసీసీలో చారిత్రక నియామకం -
అప్పటికి 40 ఏళ్లు.. దయచేసి కెప్టెన్గా దిగిపో!
హర్మన్ప్రీత్ కౌర్.. భారత మహిళా జట్టుకు తొలి ప్రపంచకప్ టైటిల్ అందించిన కెప్టెన్. సొంతగడ్డపై గతేడాది ఆమె సారథ్యంలో భారత్ వన్డే వరల్డ్కప్-2025 ట్రోఫీని కైవసం చేసుకుంది.తొలి ఐసీసీ టైటిల్నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఫైనల్లో హర్మన్ సేన.. సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి చాంపియన్గా అవతరించింది. ఈ క్రమంలో భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ సొంతం చేసుకోగా.. హర్మన్ప్రీత్ కౌర్ పేరు సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోయింది.అయితే, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మాత్రం భారత జట్టు సత్తా చాటలేకపోయింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో సెమీ ఫైనల్ చేరకుండానే ఇంటిబాటపట్టింది. అయితే, ఇటీవల ఆసియా టీ20 కప్-2026 టోర్నీలో మాత్రం హర్మన్ జట్టును విజేతగా నిలపగలిగింది.కెప్టెన్ మార్పు అనివార్యంఈ పరిణామాల నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్ను ఉద్దేశించి భారత మహిళా క్రికెట్ దిగ్గజం డయానా ఎడుల్జి తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. వన్డే వరల్డ్కప్-2029 టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో కెప్టెన్ మార్పు అనివార్యమని డయానా అభిప్రాయపడింది. 37 ఏళ్ల హర్మన్ప్రీత్ కెప్టెన్సీకి రాజీనామా చేసి.. వైస్ కెప్టెన్, దిగ్గజ ఓపెనర్ 30 ఏళ్ల స్మృతి మంధాను పగ్గాలు ఇవ్వాలని సూచించింది.అప్పటికి 40 ఏళ్లు.. దయచేసి కెప్టెన్గా దిగిపో!‘‘స్మృతి మంధాన దీర్ఘకాలంగా జట్టుతో కొనసాగుతోంది. వచ్చే ప్రపంచకప్ నాటికి హర్మన్ వయసు 40 ఏళ్లకు చేరుతుంది. కాబట్టి ఇప్పుడే స్మృతికి పగ్గాలు ఇవ్వడం మంచిది. ఆమె నాయకత్వంలో ఇద్దరు యువ ప్లేయర్లకు వైస్ కెప్టెన్లుగా అవకాశం ఇవ్వాలి.హర్మన్కు ఇదే నా మర్యాదపూర్వక విన్నపం. జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ వైస్ కెప్టెన్సీకి మంచి ఆప్షన్లు’’ అని డయానా ఎడుల్జి పేర్కొంది. కాగా ప్రస్తుతం భారత మహిళా జట్టు ఆసియా క్రీడలు-2026 టోర్నీ (టీ20)కి సన్నద్ధంగా ఉంది. సెప్టెంబరు 18న జపాన్తో క్వార్టర్ ఫైనల్లో హర్మన్సేన తలపడుతుంది. చదవండి: మా దారులు వేరయ్యాయి: పృథ్వీ షా పెళ్లి రద్దు -
ఐసీసీలో చారిత్రక నియామకం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో చారిత్రక నియామకం జరిగింది. బోర్డు చరిత్రలో తొలిసారి జింబాబ్వేకు చెందిన వ్యక్తికి కీలక పదవి దక్కింది. తవెంగ్వా ముకుహ్లాని ఐసీసీ డిప్యూటీ చైర్మన్గా ఎంపికైన తొలి జింబాబ్వియన్గా చరిత్రకెక్కాడు. ముకులాని ఐసీసీ అధ్యక్షుడు జై షాకు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. జింబాబ్వే క్రికెట్కు దక్కిన అత్యున్నత గౌరవం ఇది. ఇమ్రాన్ ఖ్వాజా ఐసీసీ డిప్యూటీ చైర్మన్గిరికి రాజీనామా చేయడంతో ముకుహ్లాని ఎంపిక జరిగింది.ప్రస్తుతం ముకుహ్లాని ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ (F&CA), నామినేషన్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. అలాగే హెచ్ఆర్ అండ్ రెమ్యునరేషన్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. 2027 పురుషుల వన్డే ప్రపంచకప్కు జింబాబ్వే సహ ఆతిథ్య దేశంగా వ్యవహరించనున్న సమయంలో ముకుహ్లాని నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. 2027 ప్రపంచకప్ ద్వారా 24 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ మళ్లీ ఆఫ్రికా ఖండానికి చేరుకోనుంది. ఇదీ చదవండి: టీమిండియాను గడగడలాడించిన ప్లేయర్కు ప్రతిష్టాత్మక అవార్డు -
మా దారులు వేరయ్యాయి: భారత క్రికెటర్ పెళ్లి రద్దు
భారత క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్నాళ్ల క్రితం నటి ఆకృతి అగర్వాల్తో అతడు నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రేయసితో ఏడడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఈ ఏడాది మార్చిలో ఫొటోలు పంచుకున్నాడు పృథ్వీ షా.మా దారులు వేరయ్యాయిఈ నేపథ్యంలో ఇక పెళ్లే తరువాయి అనుకున్న తరుణంలో ఆకృతి అగర్వాల్ ఊహించని షాకిచ్చింది. తమ వివాహం రద్దైపోయిందని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ‘‘మా దారులు వేరయ్యాయి. మా లక్ష్యాలు వేరు. పరిస్థితులు వేరు.అందుకే నేను, నా కాబోయే భర్త కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను.మా భవిష్యత్తు గురించి ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాము. మేము ఒకరి పట్ల ఒకరం ఎంతో ప్రేమను కలిగి ఉన్నాము. ఒకరి గురించి మరొకరం ఎంతగానో ఆలోచించేవాళ్లము. అయితే, మా దారులు వేరని.. కాబట్టి కలిసి జీవించడం కుదరని తెలిసివచ్చింది.దయచేసి అసత్యాలు ప్రచారం చేయకండిమాకున్న బాధ్యతలు, ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న పరిస్థితుల కారణంగా ఇద్దరం కలిసే విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాము. భవిష్యత్తు ఉత్తమంగా, శాంతితో కూడి ఉండాలని.. ఇద్దరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఇలాంటి కష్టమైన తరుణంలో ప్రతి ఒక్కరు మా గోప్యతను గౌరవించి.. మేము విడిపోవడానికి గల కారణాలు ఇవేనంటూ చిలువలు పలువలు చేసి వదంతులు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఊహాగానాలతో ఇష్టం వచ్చినట్లు రాయకండి. ధన్యవాదాలు’’ అని ఆకృతి పేర్కొంది. అయితే, పృథ్వీ షా మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఎలాంటి పోస్టు పెట్టలేదు.ఎవరీ ఆకృతి?ఉత్తరప్రదేశ్లోని లక్నో ఆకృతి అగర్వాల్ స్వస్థలం. నటిగా ఎదుగుతున్న 22 ఏళ్ల ఆకృతి అగర్వాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా!. ఉన్నత విద్య కోసం ముంబైకి వచ్చిన ఆమె మోడలింగ్ చేసింది. త్రిముఖ అనే సినిమాలో తొలిసారి నటించింది.గతేడాది ఓ రొమాంటిక్ రీల్ చేస్తూ పృథ్వీ షాతో తన బంధం గురించి సంకేతాలు ఇచ్చింది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ల పెళ్లికి పృథ్వీ షాతో జంటగా హాజరై తమ రిలేషన్షిప్ను బహిర్గతం చేసింది. ఆ తర్వాత వారం రోజుల్లోపే ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడిలా విడిపోతున్నామంటూ ఆకృతి షాకిచ్చింది.ఎత్తుపళ్లాల కెరీర్క్రికెటర్గా చిన్న వయసులోనే సత్తా చాటిన పృథ్వీ షా.. సారథిగా భారత్కు అండర్-19 ప్రపంచకప్ అందించాడు. తద్వారా టీమిండియాలోకి దూసుకువచ్చి ఓపెనర్గా సత్తా చాటాడు. కానీ ఆ తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ ఈ ముంబైకర్.. టీమిండియా నుంచి కనుమరుగైపోయాడు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా అతడి కెరీర్ దెబ్బతింది. ఈ క్రమంలో దేశీక్రికెట్లో సత్తా చాటి కెరీర్ మెరుగుపరచుకునే క్రమంలో తాజాగా వ్యక్తిగత జీవితంలో ఇలా ఎదురుదెబ్బ తగిలింది.చదవండి: అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత.. -
టీమిండియాను గడగడలాడించిన ప్లేయర్కు ప్రతిష్టాత్మక అవార్డు
ఇటీవల జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియాను గడగడలాడించిన శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్ సోనల్ దినుషాకు ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ఆగస్ట్) అవార్డు లభించింది. ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్, బంగ్లాదేశ్ సంచలన పేసర్ హసన్ మహముద్ పోటీపడినప్పటికీ.. దినుషానే ఈ అవార్డు వరించింది.వీరు ముగ్గురు ఆగస్ట్ నెలలో టెస్ట్ క్రికెట్లో విశేషంగా రాణించారు. దినుషా భారత్తో ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో 140 సగటున ఏకంగా 420 పరుగులు (3 శతకాలు, ఓ హాఫ్ సెంచరీ) సాధించగా.. పాకిస్తాన్తో జరిగిన తొలి రెండు టెస్ట్ల్లో రాబిన్సన్ 16 వికెట్లు తీశాడు. హసన్ మహముద్ ఆసీస్తో జరిగిన తొలి టెస్ట్లో 9 వికెట్లతో చెలరేగి, ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్కు చారిత్రక విజయాన్నందించాడు.మహిళల విషయానికొస్తే.. ఆగస్ట్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐల్ ఆఫ్ మ్యాన్ క్రికెటర్ లూసీ బార్నెట్కు లభించింది. థాయ్లాండ్ స్పిన్నర్ సులీపోర్న్ లావోమీ, వికెట్కీపర్-బ్యాటర్ నన్నపట్ కొంచరోయెంకై నుంచి పోటీ ఎదుర్కొన్న 19 ఏళ్ల బార్నెట్ ఈ అవార్డు దక్కించుకుంది. ఆగస్ట్ నెలలో బార్నెట్ విశేషంగా రాణించింది. నాలుగు ఇన్నింగ్స్ల్లోనే 257 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపికైంది.ఇదీ చదవండి: విండీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన పాక్ ప్లేయర్ -
విండీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన పాక్ ప్లేయర్
పాకిస్తాన్ యువ ఓపెనర్ మాజ్ సదాకత్ విండీస్ గడ్డపై చరిత్ర సృష్టించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో జమైకా కింగ్స్మన్కు ఆడుతున్న ఈ 21 ఏళ్ల పాక్ ఓపెనర్.. బార్బడోస్ ట్రైడెండ్స్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో కేవలం 44 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా కరీబియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (21 ఏళ్ల 124 రోజులు) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు విండీస్ విధ్వంసకర బ్యాటర్ షిమ్రోన్ హెట్మైర్ పేరిట ఉండేది. హెట్మైర్ 21 ఏళ్ల 235 రోజుల వయసులో సీపీఎల్ సెంచరీ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మాజ్ సదాకత్ సుడిగాలి శతకంతో (49 బంతుల్లో 112; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో అతడి జట్టు జమైకా కింగ్స్మన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వాలిఫయర్-2కు చేరింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రైడెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగా.. జమైకా కింగ్స్మన్ కేవలం 14.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ట్రైడెంట్స్ ఇన్నింగ్స్లో క్వింటన్ డికాక్ (71), క్రిస్ గ్రీన్ (57 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. కింగ్స్మన్ తరఫున మాజ్ సదాకత్ సోలో ఫైట్ చేశాడు. సదాకత్కు టీ20ల్లో ఇది తొలి సెంచరీ. ఇతను త్వరలో జరుగబోయే ఏషియన్ గేమ్స్లో పాక్ తరఫున బరిలోకి దిగనున్నాడు. సదాకత్ ఇప్పటివరకు పాక్ తరఫున 6 వన్డేలు ఆడి ఓ అర్ద సెంచరీ సాయంతో 134 పరుగులు చేశాడు. ఇదీ చదవండి: చచ్చీ చెడి సెమీస్కు చేరిన పాక్ -
చచ్చీ చెడి సెమీస్కు చేరిన పాక్
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్లో పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు థాయ్లాండ్పై అతికష్టం మీద 3 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్-4కు అర్హత సాధించింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.నన్నపట్ కొంచరోయెంకై (49) రాణించడంతో థాయ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా 2, నష్రా సంధు ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 92 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్ నానా కష్టాలు పడింది. మరో 2 బంతులు మాత్రమే మిగిలుండగా, 7 వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద గెలుపు తీరాలు చేరింది. ఒకట్రెండు బంతులు అటుఇటైనా పాక్కు ఘోర పరాభవం ఎదురయ్యేది. చచ్చీ చెడి తృటిలో ఆ పరాభవాన్ని తప్పించుకొని సెమీస్కు చేరింది.షవాల్ జుల్ఫికర్ (25), ఫాతిమా సనా (21) ఓ మోస్తరు స్కోర్లు చేసి, పాక్ గెలుపుకు జీవం పోశారు. ఆఖర్లో తుబా హసన్ (13) బ్యాట్ ఝులిపించడంతో పాక్ బయటపడింది. థాయ్లాండ్ బౌలర్లు ఒన్నిచా కాంచోంపు (3-0-37-3), సులీపోర్న్ లావోమీ (2-0-3-1), సునిద (2-0-23-2) పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.వాష్ అవుట్తో సెమీస్కు బంగ్లాదేశ్మరో క్వార్టర్ఫైనల్లో బంగ్లాదేశ్, హాంకాంగ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ తడి అవుట్ఫీల్డ్ కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. అధిక సీడింగ్ కారణంగా బంగ్లాదేశ్ సెమీఫైనల్కు అర్హత సాధించింది.ఇదీ చదవండి: ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ -
IND vs AFG: తుదిజట్టు ఇదే.. అభిషేక్, సంజూతో పాటు వైభవ్!
అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది. తొలి టీ20లో ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో ఓడించిన శ్రేయస్ అయ్యర్ సేన... రెండో మ్యాచ్లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా- అఫ్గాన్ మధ్య గురువారం నామమాత్రపు మూడో టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. దీంతో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరిగింది.ఇషాన్కు విశ్రాంతిఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘సిరీస్ గెలిచాం కాబట్టి మూడో టీ20లో వైభవ్ను ఆడించడం మంచి ఆప్షనే అవుతుంది. నా అభిప్రాయం ప్రకారం.. రెండు మ్యాచ్లలో సత్తా చాటిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లలో ఎవరో ఒకరికి విశ్రాంతినిచ్చినా బాగానే ఉంటుంది.ఇటీవల దులిప్ట్రోఫీలోనూ ఇషాన్ అదరగొట్టాడు. కాబట్టి అతడికి బ్రేక్ ఇవ్వడం మంచిది. అభిషేక్ లేదంటే సంజూతో కలిసి వైభవ్ ఓపెనింగ్ చేస్తాడు. కావాలనుకుంటే సంజూ మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు’’ అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. కాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గాన్ బోర్డు టీమిండియాకు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.అఫ్గానిస్తాన్తో మూడో టీ20కి వసీం జాఫర్ సూచించిన భారత తుదిజట్టుసంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. -
‘నిన్ను పట్టించుకోమని టీమిండియా సెలక్టర్లు చెప్పేశారు’
వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం జట్టును ప్రకటించింది. శుబ్మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో పదిహేను మంది సభ్యులకు చోటిచ్చింది.ఇద్దరికీ మొండిచేయిఅయితే, గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఈ సిరీస్తో వన్డే జట్టులోకి పునరాగమనం చేస్తారని విశ్లేషకులు భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం వీరిద్దరికి మొండిచేయి చూపారు. హార్దిక్ భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమైనప్పటికీ.. అతడి స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డిని విండీస్తో వన్డే జట్టుకు ఎంపిక చేశారు.ఊహించని రీతిలోఅదే విధంగా.. పంత్ను కాదని యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. నిజానికి రెగ్యులర్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు బ్యాకప్గా ఇషాన్ కిషన్ లేదంటే పంత్నే ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇషాన్ టీ20 జట్టుతో బిజీగా ఉన్నందున పంత్ రాక ఖాయమని అభిమానులు సైతం భావించారు.కానీ సెలక్టర్లు ఊహించని రీతిలో వన్డేల్లో ఇంకా అరంగేట్రం చేయని ధ్రువ్ జురెల్కు యాజమాన్యం అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ను ఇక పట్టించుకునే ప్రసక్తే లేదని సెలక్టర్లు చెప్పకనే చెప్పారని పేర్కొన్నాడు.నిన్ను మేము పట్టించుకోవడం లేదుఈ మేరకు.. ‘‘బ్యాకప్ వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లేరు కాబట్టి వన్డే జట్టులో రిషభ్ పంత్కు చోటు దక్కాల్సింది. కానీ సెలక్టర్లు ధ్రువ్ జురెల్కు ప్రాధాన్యం ఇచ్చారు. పంత్ను వెనక్కి నెట్టి జురెల్ ముందుకు వచ్చేశాడు.తద్వారా.. ‘నిన్ను మేము పట్టించుకోవడం లేదు’ అని సెలక్టర్లు పంత్కు నేరుగానే చెప్పినట్లు అనిపించింది. గత రెండు సిరీస్లలో కూడా అతడికి అవకాశం ఇవ్వలేదు. దీనిని బట్టి సెలక్టర్ల మనసులో ఏముందో అర్థం చేసుకోవచ్చు. ఫామ్ గురించే సమస్య అనుకోవడానికి వీలులేదు.పంత్ స్థానం గల్లంతే!ఎందుకంటే పంత్ ఇటీవల శ్రీలంక పర్యటనలో మంచి స్కోర్లే సాధించాడు. ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. అయితే, చాన్నాళ్లుగా టెస్టు జట్టులో మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా వచ్ఛేశాడు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. పంత్ స్థానాన్ని జురెల్ మెల్లగా పూర్తిస్తాయిలో లాగేసుకోవడానికి ఎక్కువ కాలం పట్టదని అభిప్రాయపడ్డాడు.ఆ జట్టు కెప్టెన్గాకాగా వెస్టిండీస్తో వన్డేల నుంచి పంత్ను పక్కనపెట్టిన యాజమాన్యం.. రెడ్బాల్ టోర్నీ ఇరానీ కప్-2026లో భాగంగా రెస్టాఫ్ ఇండియా జట్టుకు అతడిని కెప్టెన్గా నియమించింది. ఇదిలా ఉంటే.. పంత్ చివరగా 2024లో శ్రీలంక పర్యటన సందర్భంగా టీమిండియా తరఫున వన్డే ఆడాడు. నాటి మ్యాచ్లో నాలుగో స్థానంలో వచ్చి కేవలం ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు.చదవండి: విండీస్తో సిరీస్.. భారత జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు -
ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టును అదృష్టం వరించింది. మ్యాచ్ ఆడే అవసరం లేకుండానే ఆసియా క్రీడల సెమీ ఫైనల్లో బంగ్లా అడుగుపెట్టింది. అసలేం జరిగిందంటే.. జపాన్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 మధ్య ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే.చైనాతో మ్యాచ్ఇందులో భాగంగా మహిళల క్రికెట్ జట్ల మధ్య సెప్టెంబరు 17 నుంచి సెప్టెంబరు 22 వరకు టీ20 ఫార్మాట్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్- చైనా మహిళా జట్లు మ్యాచ్ ఆడాల్సి ఉంది.ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దుఅయితే, వర్షం కారణంగా టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం.. చైనా కంటే మెరుగైన స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ నేరుగా సెమీ ఫైనల్కు అర్హత సాధించింది. మరోవైపు.. ఒక్క బంతి కూడా పడకుండానే చైనా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.చైనా జట్టు (PC: X)సెమీస్కు బంగ్లాదేశ్ అర్హతకాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో బంగ్లాదేశ్ మహిళా జట్టు పదో స్థానంలో ఉండగా.. చైనా 36వ స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. రెండో క్వార్టర్ ఫైనల్లో థాయ్లాండ్- పాకిస్తాన్ జట్లు గురువారమే తలపడనున్నాయి.మరోవైపు.. మూడో క్వార్టర్ ఫైనల్లో మలేషియా- శ్రీలంక మహిళా జట్లు పోటీ పడనుండగా.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో భారత్- జపాన్ జట్లు తలపడతాయి. కరోగి స్పోర్ట్స్ పార్క్లో సెప్టెంబరు 18న జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్లో గెలిచిన జట్టును బంగ్లాదేశ్ సెమీస్లో ఢీకొంటుంది. సెమీ ఫైనల్లో భారత్తో ఢీబలాబలాలు, ర్యాంకింగ్స్ ఆధారంగా హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు జపాన్ కంటే పటిష్ట స్థితిలో ఉంది. కాబట్టి సెప్టెంబరు 20న జరిగే తొలి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ టీమిండియాను ఎదుర్కొనే అవకాశం ఉంది.చదవండి: అగార్కర్ అవుట్.. టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్! -
IND vs WI: భారత జట్లు, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్లలో తలపడనుంది. ఇరుజట్ల మధ్య సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 17 మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇందుకు సంబంధించి తమ వన్డే, టీ20 జట్లను బుధవారం ప్రకటించింది.హార్దిక్, పంత్లకు దక్కని చోటువెస్టిండీస్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం శుబ్మన్ గిల్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకుంటున్న పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్లకు ఈ జట్టులో చోటు దక్కలేదు. వారికి తొలి పిలుపుఅయితే, పంజాబ్ ఆల్రౌండర్ నమన్ ధీర్, జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. దేశవాళీల్లో పంజాబ్ తరఫున నిలకడగా రాణిస్తున్న నమన్ ధీర్... ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. ఇక కౌంటీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆఖిబ్ నబీకి వన్డే జట్టు నుంచి పిలుపు వచ్చింది.దిగ్గజాలతో పాటు జడ్డూ కూడాఇక టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే జట్టులో చోటు నిలబెట్టుకోగా... స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సెలక్టర్లు సీనియర్ ప్లేయర్లపై విశ్వాసం ఉంచినట్లు కనిపిస్తోంది.ఇదిలా ఉంటే.. ఈ నెల 20 వరకు పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించనుండగా... భారత్ ‘ఎ’ తరఫున ఆడిన తర్వాతే అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేసే అంశాన్ని పరిశీలించే అవకాశాలున్నాయి. నితీశ్ రెడ్డి రాకఇక పాండ్యా అందుబాటులో లేకపోవడంతో ఆసియా క్రీడలకు ఎంపికైన జట్టులో ఉన్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని వెస్టిండీస్తో వన్డే జట్టులో చేర్చారు. హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ రూపంలో ముగ్గురు పేసర్లు ఉండగా... అదనంగా నబీని ఎంపిక చేశారు.గతంలోనే నబీ శ్రీలంకతో సిరీస్కు భారత టెస్టు జట్టులోకి ఎంపికైనా... ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. బుమ్రా లేడుఇక వెస్టిండీస్తో తలపడే టీ20 జట్టు విషయానికి వస్తే ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టులో స్వల్ప మార్పులతో విండీస్తో సిరీస్కు జట్టును ఎంపిక చేశారు. ఆసియా క్రీడల్లో ఆడనున్న జట్టులోని యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ల స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ను ఎంపిక చేశారు.అయితే ప్రస్తుతం అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ ఆడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆ తర్వాత ఆసియా క్రీడల్లో పాల్గొననున్నాడు. విండీస్తో వన్డే, టి20 సిరీస్ల కోసం ప్రకటించిన జట్లలో మాత్రం అతడి పేరు లేదు. దీనిపై సెలెక్టర్లు కూడా ఎలాంటి స్పష్టతనివ్వలేదు.విండీస్తో సిరీస్కు భారత వన్డే జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురేల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మెహమ్మద్ సిరాజ్, ఆఖిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.విండీస్తో సిరీస్కు భారత టీ20 జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్‡్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్. భారత్ వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయాలు వన్డే సిరీస్👉సెప్టెంబరు 27- తొలి వన్డే- త్రివేండ్రం- మధ్యాహ్నం రెండు గంటల నుంచి 👉సెప్టెంబరు 30- రెండో వన్డే- గువాహటి- మధ్యాహ్నం రెండు గంటల నుంచి 👉అక్టోబర్ 3- మూడో వన్డే- న్యూచండీగఢ్- మధ్యాహ్నం రెండు గంటల నుంచిటీ20 సిరీస్👉అక్టోబర్ 6- తొలి టీ20- లక్నో- రాత్రి ఏడు గంటల నుంచి 👉అక్టోబర్ 9- రెండో టీ20- రాంచీ- రాత్రి ఏడు గంటల నుంచి👉అక్టోబర్ 11- మూడో టీ20- ఇండోర్- రాత్రి ఏడు గంటల నుంచి👉అక్టోబర్ 14- నాలుగో టీ20- హైదరాబాద్- రాత్రి ఏడు గంటల నుంచి👉అక్టోబర్ 17- ఐదో టీ20- బెంగళూరు- రాత్రి ఏడు గంటల నుంచిప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ), జియో హాట్స్టార్ (డిజిటల్). -
అగార్కర్ అవుట్.. టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్!
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ నెల (సెప్టెంబరు)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడి కాంట్రాక్టును పొడిగించేందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వన్డే ప్రపంచకప్-2027 వరకు అగార్కర్నే సెలక్షన్ కమిటీ చైర్మన్గా కొనసాగించాలని బోర్డు భావించినట్లు తెలిసింది.అయితే, అగార్కర్ మాత్రం చీఫ్ సెలక్టర్గా కొనసాగేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తాజా సమాచారం. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు బుధవారం భారత వన్డే, టీ20 జట్లను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలక్షన్ కమిటీ చైర్మన్గా అగార్కర్కు ఇదే ఆఖరి సమావేశం అని సమాచారం.రేసులో వారేఈ నేపథ్యంలో ఎన్డీటీవీ కథనం ఆసక్తికర విషయం వెల్లడించింది. చీఫ్ సెలక్టర్గా అగార్కర్ స్థానాన్ని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ లేదంటే.. మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా భర్తీ చేయనున్నట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొనట్లు తెలిపింది. కాగా పార్థివ్ పటేల్ (గుజరాత్), ప్రజ్ఞాన్ ఓజా ఇద్దరూ టీమిండియా తరఫున సత్తా చాటడంతో పాటు మూడుసార్లు టైటిళ్లు గెలిచిన ఐపీఎల్ జట్లలో సభ్యులు కావడం విశేషం. ఇక ఒడిశాకు చెందిన ఓజా ఇప్పటికే సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.ఘనమైన విజయాలుకాగా 2023 జూలైలో అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్గా నియమితుడయ్యాడు. అతడి హయాంలో భారత జట్టు 2023 వన్డే వరల్డ్కప్లో ఫైనల్కు చేరింది. ఇక 2024, 2026 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో చాంపియన్గా నిలిచింది. అదే విధంగా 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అంతేకాదు గతేడాది ఆసియా కప్ టైటిల్ను కూడా సొంతం చేసుకుంది.ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జూన్లోనే అగార్కర్ పదవీకాలం ముగిసినప్పటికీ బీసీసీఐ అతడిపై నమ్మకంతో అక్టోబరు 4 దాకా గడువు పొడిగించింది. అయితే, దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను వన్డే ప్రపంచకప్-2027 దాకా కొనసాగించే విషయంలో అగార్కర్- బీసీసీఐ పెద్దల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.అందుకే విభేదాలు!రో-కో ప్రపంచకప్ ఆడే విషయంపై స్పష్టత ఇవ్వలేదంటూ అగార్కర్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రో- కో మాత్రం తాము కచ్చితంగా వన్డే వరల్డ్కప్ ఆడతామనే సంకేతాలు ఇచ్చారు. ఇక రోహిత్- కోహ్లి అర్దంతరంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం కూడా అగార్కర్ వైఖరేనని గతంలో వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో తలెత్తిన విభేదాల కారణంగా బీసీసీఐ పెద్దలు, అగార్కర్ మధ్య దూరం పెరిగిందని.. అందుకే అగార్కర్ ఇక తన పదవి నుంచి దిగిపోకతప్పలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.చదవండి: ఆసియా క్రీడలకు నితీశ్ కుమార్ రెడ్డి దూరం -
ఈసారి భారత్లోనే ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: మూడేళ్ల విరామం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం కార్యక్రమం భారత్లో జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ధ్రువీకరించారు. ‘ప్రతి ఏడాది ఐపీఎల్ వేలం కార్యక్రమం భారత్లోనే నిర్వహించాలని అనుకుంటాం. కానీ పెళ్లిళ్ల సీజన్ కారణంగా వేదిక లభించడం కష్టమవుతోంది. అయితే ఈసారి మాత్రం ఐపీఎల్ వేలం భారత్లోనే ఉంటుంది. ఈసారి మినీ వేలం కావడంతో వేదిక లభిస్తుందనే ఆశిస్తున్నాం’ అని రేపు జరిగే బీసీసీఐ ఏజీఎంలో మరోసారి ఐపీఎల్ చైర్మన్గా ఎన్నిక కానున్న అరుణ్ ధుమాల్ తెలిపారు. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఫ్రాంచైజీలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. 2024 ఐపీఎల్ వేలం జిద్దాలో... 2025 ఐపీఎల్ వేలం దుబాయ్లో... 2026 వేలం అబుదాబిలో నిర్వహించారు. -
వైభవ్కు చాన్స్ దక్కేనా!
న్యూఢిల్లీ: సమష్టి ప్రదర్శనతో అఫ్గానిస్తాన్పై వరుస మ్యాచ్ల్లో విజయాలు సాధించి... సిరీస్ పట్టేసిన టీమిండియా చివరి మ్యాచ్లో రిజర్వ్ బలాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు టి20ల్లో గెలిచిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. గురువారం ఇరు జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో చివరి టి20 మ్యాచ్ జరగనుంది. గత రెండు మ్యాచ్ల్లోనూ టాస్ గెలిచి లక్ష్యఛేదనకు మొగ్గుచూపిన టీమిండియా... ఈసారి అవకాశం వస్తే మొదట బ్యాటింగ్ చేస్తూ తమ బలాన్ని సరిచూసుకోవాలని భావిస్తోంది. అలాగే రిజర్వ్ ప్లేయర్లను ఈ మ్యాచ్లో పరీక్షించే అవకాశాలున్నాయి. మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు ఎంత పోరాడినా గత రెండు మ్యాచ్ల్లో టీమిండియాకు సరైన పోటీనివ్వలేకపోయింది. ముగ్గురు ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నా... వారి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రెండో టి20లో రషీద్ ఖాన్ చక్కటి బౌలింగ్తో ఆకట్టుకోవడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్తో పాటు గుర్బాజ్, సాధిఖుల్లా, నైబ్, డార్విష్, అజ్మతుల్లా, నబీ కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరముంది. గత రెండు మ్యాచ్ల మాదిరిగానే పిచ్ బ్యాటింగ్కు సహకరించనుంది. ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశలు పెద్దగా లేవు. భిన్నమైన కూర్పుతో... ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా చూడాలి. రెండో మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ... చివరి పోరులో భిన్నమైన కూర్పును ప్రయత్నిస్తామని వెల్లడించాడు. ఏషియన్ గేమ్స్ ప్రారంభానికి ముందు ప్లేయర్లందరికీ తగినంత మ్యాచ్ టైమ్ దక్కాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్ చెరో మ్యాచ్లో హాఫ్సెంచరీలు బాదిన నేపథ్యంలో ఎవరి స్థానంలో సూర్యవంశీని తీసుకుంటారనేది ఆసక్తికరం. ఇంగ్లండ్, జింబాబ్వేలో అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడిన వైభవ్... సొంతగడ్డపై ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. ఇటీవలి కాలంలో ఫార్మాట్తో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తున్న ఇషాన్కు విశ్రాంతినిస్తారా చూడాలి. బౌలర్లకు మరింత వెసులుబాటు కల్పించేందుకు అదనపు బౌలర్ను పరీక్షించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే జరిగితే బ్యాటింగ్ ఆర్డర్లో ఓ ప్లేయర్ తగ్గనున్నాడు. దీంతో పేస్ ఆల్రౌండర్, ఆంధ్ర ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్పై బ్యాటింగ్ భారం పెరగనుంది. బౌలింగ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతుండగా... అర్ష్ దీప్ సింగ్ అతడికి అండగా నిలుస్తున్నాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే యశ్ ఠాకూర్కు మరోసారి అవకాశం దక్కొచ్చు. గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్కు దూరం కాగా... అతడి స్థానంలో అవకాశం దక్కించుకున్న రవి బిష్ణోయ్ రెండో మ్యాచ్లో ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్లో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా... ఫీల్డింగ్లో మాత్రం టీమిండియా మరింత మెరుగవ్వాల్సిన అవసరముంది. భారత జట్టుతో జపాన్ రాయబారి భేటీ ఈనెల 22న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో జపాన్ జట్టుతో భారత జట్టు తొలిసారి టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బుధవారం భారత్లో జపాన్ రాయబారి ఒనో కెచీ బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్తో పాటు భారత క్రికెటర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్కు జపాన్లో అదృష్ట చిహ్నానికి ప్రతీకగా భావించే ‘దారుమా’ బొమ్మను ప్రదానం చేశారు. తుది జట్లు (అంచనా) భారత్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, ఇషాన్/వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, అక్షర్, నితీశ్ రెడ్డి, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అర్ష్ దీప్, బుమ్రా. అఫ్గానిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), గుర్బాజ్, సాధిఖుల్లా, నైబ్, డారి్వష్, అజ్మతుల్లా, నబీ, రషీద్ ఖాన్, ముజీబ్/నవీన్, ఫజల్హక్ ఫారూఖి. -
ఆసియా గేమ్స్కు స్టార్ ఆల్రౌండర్ దూరం
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్లో పాల్గొనే టీమిండియా జట్టులో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటికే గాయం కారణంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తప్పించిన బీసీసీఐ తాజాగా స్టార్ ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డిని కూడా జట్టు నుంచి విడుదల చేసింది. ఇక గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో విప్రజ్ నిగమ్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇదే సమయంలో వెస్టిండీస్తో జరగనున్న వన్డే సిరీస్కు మాత్రం నితీశ్రెడ్డి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. అయితే ఆసియా గేమ్స్ నుంచి నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించడం వెనుక బీసీసీఐ స్పష్టమైన సమాచారం ఇవ్వనప్పటికీ, రాబోయే ఏడాదిలో టీమిండియా వన్డే ప్రపంచకప్ ఆడనుంది. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా భావిస్తున్న నితీశ్రెడ్డికి వీలైనంత ఎక్కువగా వన్డే మ్యాచ్ల్లో అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్న నితీశ్రెడ్డి వన్డేల్లోనూ అదే తరహా ప్రదర్శన చేయాలని బీసీసీఐ ఆశిస్తోంది. ఇప్పటివరకు ఆరు వన్డేలు మాత్రమే ఆడిన నితీశ్రెడ్డి వంద పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్కు మాత్రం నితీశ్కుమార్ రెడ్డిని ఎంపిక చేయడం జరిగింది.ఆసియా గేమ్స్కు టీమిండియా:శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రజ్ నిగమ్. -
కెప్టెన్గా రిషబ్ పంత్ ఎంపిక
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఇవాళ వెస్టిండీస్ సిరీస్కు భారత జట్ల ప్రకటనతో పాటు ఇరానీ కప్ 2026 కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును కూడా ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా రిషబ్ పంత్ను ఎంపిక చేసింది. పంత్కు విండీస్తో వన్డే, టీ20 సిరీస్లకు ఎంపిక చేసిన జట్లలో చోటు దక్కలేదు.రంజీ ట్రోఫీ 2025-26 విజేత జమ్మూ కశ్మీర్తో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ఇరానీ కప్లో తలపడనుంది. ఈ వన్-ఆఫ్ మ్యాచ్ అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనుంది.ఇరానీ కప్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియ జట్టురిషబ్ పంత్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), సనత్ సాంగ్వాన్, శిఖర్ మోహన్, సుదీప్ ఘరామి, సర్ఫరాజ్ ఖాన్ (వైస్ కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, మానవ్ సుతార్, సరాన్ష్ జైన్, ఆకాశ్ దీప్ (ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి), ముఖేష్ కుమార్, ముకేష్ చౌదరి, ఆర్యన్ జుయల్ (వికెట్కీపర్), ఆర్యన్ పాండే, అనుకూల్ రాయ్, ఆయుష్ దోసెజాఇదీ చదవండి: విండీస్ సిరీస్కు భారత జట్ల ప్రకటన.. రోహిత్, కోహ్లి కొనసాగింపు -
విండీస్ సిరీస్కు భారత జట్ల ప్రకటన.. రోహిత్, కోహ్లి కొనసాగింపు
ఈ నెలాఖరులో వెస్టిండీస్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత జట్లను ఇవాళ ప్రకటించారు. వన్డే జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్, టీ20 జట్టుకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ కొనసాగారు. కేఎల్ రాహుల్, తిలక్ వర్మ వన్డే, టీ20 జట్లకు ఉప నాయకులుగా వ్యవహరించనున్నారు. స్టార్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే జట్టులో కొనసాగగా.. రిషబ్ పంత్కు అవకాశం దక్కలేదు. ఆకిబ్ నబీ, నమన్ ధిర్కు తొలిసారి వన్డే జట్టులో అవకాశం దక్కింది. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. రెండు జట్లలో అతడికి చోటు దక్కలేదు.వన్డే సిరీస్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (సి), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధిర్టీ20 సిరీస్కు భారత జట్టుశ్రేయస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), సంజు శాంసన్ (వికెట్కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.వన్డే సిరీస్ షెడ్యూల్ తొలి వన్డే: ఆదివారం, సెప్టెంబర్ 27 - మధ్యాహ్నం 2:00 గంటలకు - గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురంరెండో వన్డే: బుధవారం, సెప్టెంబర్ 30 - మధ్యాహ్నం 2:00 గంటలకు - బర్సపారా క్రికెట్ స్టేడియం, గౌహతిమూడో వన్డే: శనివారం, అక్టోబర్ 3 - మధ్యాహ్నం 2:00 గంటలకు - మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ముల్లన్పూర్, న్యూ చండీగఢ్టీ20 సిరీస్ షెడ్యూల్తొలిటీ20: మంగళవారం, అక్టోబర్ 6 - సాయంత్రం 7:00 గంటలకు - భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నోరెండో టీ20: శుక్రవారం, అక్టోబర్ 9 - సాయంత్రం 7:00 గంటలకు - జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచీమూడో టీ20: ఆదివారం, అక్టోబర్ 11 - సాయంత్రం 7:00 గంటలకు - హోల్కర్ స్టేడియం, ఇండోర్నాలుగో టీ20: బుధవారం, అక్టోబర్ 14 - సాయంత్రం 7:00 గంటలకు - రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్ఐదో టీ20: శనివారం, అక్టోబర్ 17 - సాయంత్రం 7:00 గంటలకు - ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరుఇదీ చదవండి: రోహిత్ శర్మను అధిగమించిన బట్లర్.. మిగిలింది అతనొక్కడే..! -
మహ్మద్ నబీ అరుదైన రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 అంతర్జాతీయాల్లో 2500 పరుగులు, 100 ప్లస్ వికెట్లు తీసిన నాలుగో ఆల్రౌండర్గా నిలిచాడు. భారత్తో నిన్న జరిగిన రెండో టీ20లో నబీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 14 బంతుల్లో 20 పరుగులు చేసిన నబీ, 2500 పరుగులు పూర్తి చేశాడు.నబీకి (2501, 111) ముందు బంగ్లా ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ (2551 పరుగులు, 149 వికెట్లు), జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా (3244, 114), మలేషియా ఆల్రౌండర్ విరన్దీప్ సింగ్ (3402, 126) ఈ ఘనత సాధించారు.ఈ మ్యాచ్తో నబీ మరో ఘనత కూడా సాధించాడు. భారత గడ్డపై టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మూడో అత్యంత వయసైన (41 సంవత్సరాల 257 రోజులు) క్రికెటర్గా నిలిచాడు. ఈ రికార్డుకు సంబంధించి హాంకాంగ్కు చెందిన ర్యాన్ క్యాంప్బెల్ (44 సంవత్సరాల 34 రోజుల వయసులో) అగ్రస్థానంలో ఉండగా.. ఇటలీకి చెందిన వేన్ మాడ్సెన్ (42 సంవత్సరాల 38 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరగులు చేయగా.. భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.ఇదీ చదవండి: రోహిత్ శర్మను అధిగమించిన బట్లర్.. మిగిలింది అతనొక్కడే..! -
కీలక టోర్నీ నుంచి సీఎస్కే స్టార్ ఔట్..!
చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే మరో కీలక దేశవాళీ టోర్నీకి దూరం కానున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వచ్చే నెలలో జరిగే ఇరానీ కప్కు అతడు అందుబాటులో ఉండడని సమాచారం. నివేదికల ప్రకారం.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఆయుష్కు ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ రాలేదు.అక్టోబర్ 1 నుంచి ఇరానీ కప్రంజీ ట్రోఫీ 2025-26 విజేత జమ్మూ కశ్మీర్తో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ఇరానీ కప్లో తలపడనుంది. ఈ వన్-ఆఫ్ మ్యాచ్ అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనుంది. బీసీసీఐ త్వరలో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఫిట్నెస్ క్లియరెన్స్ లేకపోవడంతో ఆయుష్ మాత్రే పేరును పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.ఐపీఎల్ 2026లో ఆరు మ్యాచ్లే..!ఆయుష్ మాత్రేకు గాయం సమస్యలు ఐపీఎల్ 2026లోనే మొదలయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అతడు టోర్నీ మధ్యలో హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. దీంతో ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026లో ఆయుష్ ఆరు మ్యాచ్ల్లో 201 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 33.50 కాగా, స్ట్రైక్రేట్ 177.87గా ఉంది.ముంబై టీ20 లీగ్కు కూడా దూరంఐపీఎల్ గాయం నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఆయుష్కు మరో గాయమైంది. ముంబై టీ20 లీగ్ 2026కు ముందు అతడికి మణికట్టు గాయం కావడంతో ఆ టోర్నీకి కూడా దూరమయ్యాడు.ప్రస్తుతం ఆయుష్ ఇండోర్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, పోటీ క్రికెట్లోకి తిరిగి రావాలంటే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాల్సి ఉంది.ఇదీ చదవండి: మహిళల ఐపీఎల్కు సంబంధించి బిగ్ అప్డేట్స్ -
మహిళల ఐపీఎల్కు సంబంధించి బిగ్ అప్డేట్స్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఐదో సీజన్కు (2027) సంబంధించి బిగ్ అప్డేట్స్ వచ్చాయి. అక్టోబర్ 28న కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్లో వేలం జరుగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 మధ్యలో టోర్నీ జరుగనున్నట్లు వెల్లడించింది. రిటెన్షన్ ప్రక్రియకు సెప్టెంబర్ 28 చివరి తేదీగా పేర్కొంది. టోర్నీకి సంబంధించిన వేదికలను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. ముంబై, వడోదరలో మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సీజన్లో కూడా ఈ రెండు నగరాల్లోనే మ్యాచ్లు జరిగాయి. సీజన్-4 ఫైనల్ను ఫిబ్రవరి 5న వడోదరలో నిర్వహించారు.సెప్టెంబర్ 28లోగా రిటెన్షన్లుఐదు జట్లకు ప్లేయర్ల రిటెన్షన్, రిలీజ్పై నిర్ణయం తీసుకునేందుకు సెప్టెంబర్ 28 వరకు గడువు ఇచ్చారు. ప్రతి జట్టులో గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లు ఉండవచ్చు. ఇందులో గరిష్ఠంగా ఆరుగురు విదేశీ ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత సైకిల్కు సంబంధించిన జట్టు శాలరీ క్యాప్ రూ.15 కోట్లుగా ఉంది.కాగా, గత WPL సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, తమ రెండో టైటిల్ను కైవసం చేసుకుంది. ఇదీ చదవండి: పాక్ ప్లేయర్ను కిందకు తోసిన అభిషేక్ -
రోహిత్ శర్మను అధిగమించిన బట్లర్.. మిగిలింది అతనొక్కడే..!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ మరో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 15) జరిగిన తొలి టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్ (44 బంతుల్లో 80; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడిన అతడు.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో హిట్మ్యాన్ రోహిత్ శర్మను అధిగమించి రెండో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో పాక్ ప్లేయర్ బాబర్ ఆజం టాప్ ప్లేస్లో ఉండగా.. విరాట్ కోహ్లి, పాల్ స్టిర్లింగ్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుబాబర్ ఆజం- 4596జోస్ బట్లర్- 4292రోహిత్ శర్మ- 4231విరాట్ కోహ్లి- 4188పాల్ స్టిర్లింగ్- 3895ఈ ఇన్నింగ్స్తో బట్లర్ యావత్ టీ20 ఫార్మాట్లో తన పరుగుల సంఖ్యను 14970 పరుగులకు పెంచుకొని, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రపీఠం దిశగా మరో అడుగు ముందుకేశాడు. ప్రస్తుతం టాప్ ప్లేస్లో ఉన్న కీరన్ పోలార్డ్ (14999)కు బట్లర్కు ఇక మిగిలింది కేవలం 29 పరుగుల వ్యత్యాసమే. బట్లర్ మరో 30 పరుగులు చేస్తే, పోలార్డ్ రికార్డును బద్దలు కొట్టి పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరిస్తాడు. ఈ జాబితాలో పోలార్డ్, బట్లర్ తర్వాతి స్థానాల్లో అలెక్స్ హేల్స్ (14581), క్రిస్ గేల్ (14562), డేవిడ్ వార్నర్ (14284) ఉన్నారు.ఈ ఇన్నింగ్స్తో బట్లర్ మరో రికార్డు కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన వికెట్కీపర్ల జాబితాలో పాక్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. వీరిద్దరు తలో 28 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో బట్లర్, రిజ్వాన్ తర్వాతి స్థానంలో క్వింటన్ డికాక్ ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బట్లర్తో పాటు బ్రూక్ శతక్కొట్టుడుతో శ్రీలంకపై ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేయగా.. శ్రీలంక 19 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సోనీ బేకర్ (4-1-12-3), లియామ్ డాసన్ (2-23), ఓవర్టన్ (2-20) అద్భుతంగ బౌలింగ్ చేసి లంక పతనాన్ని శాశించారు. ఇదీ చదవండి: శతకంతో చెలరేగిన బ్రూక్.. లంకపై ఇంగ్లండ్ విజయం -
అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత..
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్లలో సర్ వివియన్ రిచర్ట్స్కు ప్రత్యేక స్థానం ఉంది. డెబ్బై, ఎనభైవ దశకాల్లోనే టీ20 తరహాలో దూకుడైన, విధ్వంసకర బ్యాటింగ్తో తనదైన శైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హెల్మెట్ లేకుండానే మైదానంలోకి మెల్లగా నడుచుకుంటూ వచ్చి.. స్టైలిష్గా షాట్లు బాదే ఈ ‘స్వాగర్’పై అప్పట్లో చాలా మంది అమ్మాయిలు మనసు పారేసుకున్నారు.అలా పరిచయంఅందులో బాలీవుడ్ నటి నీనా గుప్తా కూడా ఒకరు. ఎనభైవ దశకంలో జైపూర్ మహారాణి ఇచ్చిన విందులో రిచర్డ్స్ను నేరుగా కలిసే అవకాశం వచ్చింది నీనాకు. అంతకుముందు రోజే అతడి మ్యాచ్ చూసిన ఆమెకు రిచర్డ్స్తో పరిచయం చెప్పలేని సంతోషాన్నిచ్చింది.ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అయితే, రిచర్డ్స్ వెస్టిండీస్కు తిరిగి వెళ్లిపోయిన తర్వాత కాంటాక్ట్ మిస్ అయింది. ఓ రోజు అనుకోకుండా ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. నవ్వుతూ పలకరించుకున్నారు. అప్పటి నుంచి స్నేహం పెరిగి ఇద్దరి మధ్య ‘బంధం’ మొదలైంది.అప్పటికే అతడికి పెళ్లి అయిపోయిందిఅలా ఇద్దరూ ఒక్కటి కాగా.. నీనా గుప్త గర్భం దాల్చింది. అయితే, అప్పటికే వివియర్ రిచర్డ్స్ వెస్టిండీస్కు వెళ్లిపోగా... ఆ తర్వాతే నీనాకు ఈ విషయం తెలిసింది. అయితే, అప్పటికే వివియన్ రిచర్డ్స్కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇలాంటి తరుణంలో గర్భం కొనసాగించేందుకే నిర్ణయించుకున్న నీనా గుప్తా.. కూతురు మసాబా గుప్తాకు 1989లో జన్మనిచ్చింది. సింగిల్ పేరెంట్గా ఆమెను పెంచి పెద్ద చేసి ఫ్యాషన్ డిజైనర్గా తీర్చిదిద్దింది. అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడుఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాత విషయాలు గుర్తు చేసుకున్న నీనా గుప్తా వివియన్ రిచర్డ్స్తో తనకున్న అనుబంధం గురించి వివరించింది. దీంతో వీరి రిలేషన్షిప్ మరోసారి తెరమీదకు వచ్చింది.ఇక తన ఆటోబయోగ్రఫీ ‘సచ్ కహూన్ తో’లోనూ నీనా గుప్తా వివియన్ రిచర్డ్స్ గురించి ప్రస్తావించింది. ‘‘వివియన్కు, నాకు మధ్య అఫైర్ నడిచింది. అలా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. తల్లిని కాబోతున్నానన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.అయితే, తన బిడ్డను మోయాలా? లేదా? అనే విషయాన్ని వివియన్తో చర్చించాలని నిర్ణయించుకున్నా. నేను గర్భవతినన్న విషయం తెలిసేసరికే వివియన్ వెస్టిండీస్ చేరుకున్నాడు. ఎలాగోలా అతడి నంబర్ సంపాదించి ప్రెగ్నెంట్ అన్న విషయం చెబితే నాకు నచ్చినట్లే ముందుకు సాగమని చెప్పాడు. తన బిడ్డను నేను కనడంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు’’ అని నీనా పేర్కొంది.అందుకే పెళ్లి చేసుకోలేదుఇక మరో ఇంటర్వ్యూలో వివియన్ రిచర్డ్స్ను నిజంగానే ప్రేమించి ఉంటే ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న ప్రశ్న నీనాకు ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అతడిని ఇదే ప్రశ్న అడగడానికి చాలా మంది భయపడతారు. మరి నన్నెందుకు ఇంత సులువుగా అడిగేస్తున్నారు. మేము ప్రేమించుకున్నామనే నేను అనుకుంటున్నాను.కలిసి ఉన్న కొంతకాలంలోనే మాకు ఎన్నో మధురు జ్ఞాపకాలు మిగిలాయి. నటిగా ఉండటం నాకిష్టం. వివియన్ను పెళ్లి చేసుకుని నేను విండీస్కు వెళ్లలేను. అతడు కూడా నా కోసం తన కెరీర్ వదులుకుని ఇండియాకు రాలేడు. అందుకే పెళ్లి గురించి ఆలోచించలేదు’’ అని నీనా తెలిపింది. మసాబాకు సారీ చెప్తూనే ఉంటాఅదే విధంగా.. ‘‘ఏదేమైనా నేను పెళ్లి చేసుకోకుండా బిడ్డను కనాల్సి కాదు. ప్రతీ బిడ్డకు తల్లి.. తండ్రి.. ఇద్దరి ప్రేమా అవసరం. నేను నా కూతురు మసాబాకు ఈ విషయంలో రోజూ క్షమాపణలు చెబుతూ ఉంటా. తండ్రి లేకుండా పెరిగే క్రమంలో తను చాలా బాధ పడింది. కానీ నాపై మాత్రం ఆమెకు ప్రేమ తగ్గలేదు’’ అని నీనా గుప్తా ఉద్వేగానికి లోనైంది.కాగా మసాబాకు తండ్రి వివియన్ రిచర్డ్స్తో మంచి అనుబంధం ఉంది. వీలు చిక్కినప్పుడల్లా మసాబా తన తండ్రిని కలుసుకుంటూ ఉంటుంది. నీనా, ఆమె భర్త సైతం అతడితో స్నేహంగానే ఉంటారు. మసాబా పెళ్లిలో వీరు ముగ్గురు కలిసి కనిపించడం విశేషం.ఎవరి జీవితాల్లో వారు బిజీఇదిలా ఉంటే.. నీనా గుప్తా తనకు 49 ఏళ్ల వయసు ఉన్నపుడు 2008లో వివేక్ మెహ్రా అనే వ్యక్తిని పెళ్లాడింది. అమెరికాలో అత్యంత సన్నిహితుల నడుమ వీరి వివాహం జరిగింది. మరోవైపు.. వివియన్ రిచర్డ్స్- మిరియం రిచర్డ్స్ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. నీనాతో రిలేషన్షిప్ తర్వాత వివియన్- మిరియం మధ్య విభేదాల కారణంగా కొన్నాళ్లు దూరంగా ఉన్నట్లు సమాచారం.కాగా 74 ఏళ్ల వివియన్ రిచర్డ్స్ 1974- 1991 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. వెస్టిండీస్ తరఫున 121 టెస్టుల్లో 8540, 187 వన్డేల్లో 6721 పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. తన అద్భుతమైన ఆట తీరుతో సర్ వివియన్ రిచర్డ్స్గా ఖ్యాతిగాంచాడు.చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. విలువ ఎంతంటే? -
పాక్ ప్లేయర్ను కిందకు తోసిన అభిషేక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. గత వారం మూడో స్థానంలో ఉన్న అతడు.. ఈ వారం పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ను ఓ స్థానం కిందకు తోసి, రెండో స్థానానికి ఎగబాకాడు. మరో టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ టాప్ ప్లేస్ను నిలబెట్టుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ఓ స్థానాన్ని కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోగా.. మరో టీమిండియా డాషింగ్ ఓపెనర్ సంజూ శాంసన్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 30వ స్థానానికి ఎగబాకాడు. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరు స్థానాలు కోల్పోయి 29వ స్థానానికి పడిపోయాడు.బౌలర్ల ర్యాంకింగ్స్లోనూ భారత ప్లేయర్లు సత్తా చాటారు. వరుణ్ చక్రవర్తి రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకగా.. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి.. మరో పేసర్ అర్షదీప్ సింగ్ 11 స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్-3 ర్యాంక్లను కాపాడుకున్నారు.ఆల్రౌండర్ల విభాగానికొస్తే.. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా, పాకిస్తాన్ సైమ్ అయూబ్, నేపాల్ దీపేంద్ర సింగ్ టాప-3లో కొనసాగుతున్నారు. భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 2 స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేయడంతో భారత ఆటగాళ్ల ర్యాంకింగ్స్ భారీగా మెరుగుపడ్డాయి. ఇదీ చదవండి: టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్..! -
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్..!
ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ20కి ముందు టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడిన (సైడ్ స్ట్రెయిన్) విషయం తెలిసిందే. గాయం పెద్దది కావడంతో వరుణ్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తో పాటు ఏషియన్ గేమ్స్కు కూడా దూరమయ్యాడని తెలుస్తోంది.ఈ క్రమంలో భారత మేనేజ్మెంట్ ఏషియన్ గేమ్స్ కోసం వరుణ్ ప్రత్యామ్నాయంగా ఎవరూ ఊహించని ప్లేయర్ను ఎంపిక చేసినట్లు సమాచారం. 22 ఏళ్ల రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.వరుణ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు విప్రాజ్ నిగమ్తో పాటు కుల్దీప్ యాదవ్ పేరును కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే కుల్దీప్ యాదవ్ ఈ నెలాఖర్లో వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్లో ఆడనున్న నేపథ్యంలో విప్రాజ్ నిగమ్ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై అతి త్వరలో అధికారిక సమాచారం రావొచ్చు.ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న విప్రాజ్ ఐపీఎల్లో ఇప్పటివరకు 19 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ అతడు తన సత్తా చాటాడు. ఐపీఎల్ కెరీర్లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్రేట్ సుమారు 176గా ఉంది.సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభంజపాన్లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే పురుషుల క్రికెట్ పోటీలు మాత్రం సెప్టెంబర్ 24 నుంచి మొదలవుతాయి. భారత్ నేరుగా క్వార్టర్ఫైనల్ దశలో బరిలోకి దిగనుంది.ఇదీ చదవండి: శతక్కొట్టిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు -
అతడు బంగారం.. ఇతడేమో అంచనాలు పెంచేశాడు!
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ ద్వారా టీమిండియాలోకి పునరాగమనం చేశాడు యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి. చాన్నాళ్లుగా గాయం కారణంగా బీసీసీఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందిన ఈ ఆంధ్ర ఆటగాడు.. ఆదివారం నాటి తొలి టీ20 సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.తొలి మ్యాచ్లో విఫలంఢిల్లీ వేదికగా అఫ్గాన్తో తొలి టీ20లో నితీశ్ రెడ్డి.. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా ముప్పై పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ వికెట్ మాత్రం తీయలేకపోయాడు. దీంతో ఈ పేస్బౌలింగ్ ఆల్రౌండర్ బౌలింగ్పై విమర్శలు వచ్చాయి.తిరిగి పుంజుకుని.. అద్భుత ప్రదర్శనఅయితే, మంగళవారం నాటి రెండో టీ20 సందర్భంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్ రెడ్డి.. విమర్శకులకు చెక్ పెట్టాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేవలం ఇరవై నాలుగు పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు కూల్చాడు. అఫ్గానిస్తాన్ ఓపెనర్, కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (37), గుల్బదిన్ నైబ్ (10), రషీద్ ఖాన్ (28)లను అవుట్ చేశాడు.తద్వారా అఫ్గాన్ను 159 పరుగులకే చేయడంలో నితీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 14.5 ఓవర్లలోనే పని పూర్తి చేయగా.. 23 ఏళ్ల నితీశ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా నితీశ్ రెడ్డిపై ప్రశంసలు కురిపించాడు.PC: BCCI Xఅతడు బంగారంతన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఐదో బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేయగలడా? వికెట్లు తీయగలడా? టీమిండియాకు ఉన్న సమస్య ఇదే. రెండో టీ20లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో 25 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. అతడు బంగారం.Nabi looks to clear the ropes, but Shreyas Iyer makes no mistake in the deep.Watch #AFGvIND 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork pic.twitter.com/BEld9G9uat— Sony Sports Network (@SonySportsNetwk) September 15, 2026జట్టుకు అవసరమైనపుడు అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ఇక అర్ష్దీప్ సింగ్ నాలుగు ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 28 పరుగులే ఇచ్చాడు. ఇక రవి బిష్ణోయి 32 పరుగులిచ్చి వికెట్ తీశాడు.నితీశ్ రెడ్డి అంచనాలు పెంచేశాడువీరందరిని పక్కనపెడితే.. నితీశ్ కుమార్ రెడ్డి.. మూడు ఓవర్లలో కేవలం 24 పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు కూల్చాడు. అతడిని ఇరవయ్యో ఓవర్లోనూ రంగంలోకి దించవచ్చు. నిజంగా నితీశ్ రెడ్డి అంచనాలు పెంచేశాడు. హార్దిక్ పాండ్యా తర్వాత టీమిండియాకు ఆ స్థాయి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఎవరన్న ప్రశ్న ఉండేది. హార్దిక్ వారసుడిగా తానే సరైన వాడినంటూ నితీశ్ బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడ్డాడు’’ అని ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు.చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్తో పోటీ.. సంజూ స్పందన ఇదేStraight off the top edge and straight into Samson’s hands! 🧤💥Nitish Reddy struck again with the first ball of the over, sending Gulbadin Naib back to the pavilion. Watch #AFGvIND 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork pic.twitter.com/JO6xMI3jwy— Sony Sports Network (@SonySportsNetwk) September 15, 2026 -
శతక్కొట్టిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు
శ్రీలంకతో మొదటి టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం సాధించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కేవలం 49 బంతుల్లోనే 114 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్డౌన్లో వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్లో పది ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.119 పరుగుల తేడాతో ఘన విజయంబ్రూక్ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా లంకతో తొలి టీ20లో ఇంగ్లండ్ ఏకంగా 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక లంకతో తొలి టీ20 సందర్భంగా సెంచరీతో చెలరేగిన బ్రూక్.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక శతకాలు బాదిన ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టు కెప్టెన్గా బ్రూక్ ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా 2025లో జోస్ బట్లర్ నుంచి ఇంగ్లండ్ వైట్బాల్ సారథిగా పగ్గాలు అందుకున్నాడు బ్రూక్.ప్రపంచ రికార్డుఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా తొలిసారి కెప్టెన్ హోదాలో పాకిస్తాన్ (ఫిబ్రవరి 24, 2026)పై శతక్కొట్టిన బ్రూక్.. తాజాగా శ్రీలంక (సెప్టెంబరు 15, 2026)పై సెంచరీ సాధించాడు. తద్వారా ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా రెండు టీ20 శతకాలు బాదిన ఫుల్ మెంబర్ జట్టు సారథిగా బ్రూక్ నిలిచాడు.అతడికి అగ్రస్థానంఇదిలా ఉంటే.. ఓవరాల్గా ఈ జాబితాలో అసోసియేట్ జట్టు ఎస్వతిని కెప్టెన్ ఆదిల్ బట్ మూడు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. 2026లో అతడు మొజాంబిక్, లెసొతో (రెండుసార్లు) జట్లపై సెంచరీలు సాధించాడు.శ్రీలంక ఇంగ్లండ్ పర్యటనఇంగ్లండ్తో మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు శ్రీలంక జట్టు అక్కడికి వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య సౌతాంప్టన్లో మంగళవారం తొలి టీ20 జరిగింది. ది రోజ్ బౌల్ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బట్లర్, బ్రూక్ తుపాన్ ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 254 పరుగులు స్కోరు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (44 బంతుల్లో 80), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (49 బంతుల్లో 114 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్తో లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. 19 ఓవర్లలో కేవలం 135 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోనీ బేకర్ మూడు వికెట్లు తీయగా.. లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్ చెరో రెండు.. జోష్ టంగ్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్తో పోటీ.. సంజూ స్పందనSimply sensational from Harry Brook 🔥Watch all of his boundaries this evening ⤵️ pic.twitter.com/SuOIAwKFiv— England Cricket (@englandcricket) September 15, 2026 -
వాటర్బాయ్గా వైభవ్!.. సూర్యవంశీ తండ్రి స్పందన ఇదే
అఫ్గానిస్తాన్తో రెండు టీ20 మ్యాచ్లలో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ బెంచ్కే పరిమితమయ్యాడు. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్, ఓపెనర్ సంజూ శాంసన్ రాక కారణంగా ఈ పదిహేనేళ్ల పిల్లాడికి తుదిజట్టులో చోటు దక్కడం లేదు. దీంతో వైభవ్ జట్టుకు వాటర్ బాయ్గా సేవలు అందిస్తున్నాడు.సిరీస్ టీమిండియా కైవసంఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. కాగా అఫ్గాన్ బోర్డు ఢిల్లీ వేదికగా టీమిండియాకు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం నాటి తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. మంగళవారం జరిగిన రెండో టీ20లోనూ ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ కంటే ముందు భారత టీ20 జట్టు జింబాబ్వేలో పర్యటించింది. జింబాబ్వేలో ధనాధన్ఇందులో భాగంగా మూడు మ్యాచ్లు ఆడగా.. వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్లలో కలిపి 151 పరుగులు సాధించి.. జట్టు క్లీన్స్వీప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.అయితే, జింబాబ్వేతో సిరీస్కు దూరమైన వరల్డ్కప్ వీరుడు సంజూ శాంసన్ అఫ్గాన్తో సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. దీంతో వైభవ్పై వేటు పడింది. అయితే ,తొలి టీ20లో సంజూ 10 పరుగులే చేసి అవుటయ్యాడు. దీంతో వైభవ్ను కాకుండా సంజూను ఆడించి తప్పుచేశారనే విమర్శలు వచ్చాయి.మావాడు సిద్ధంగానే ఉన్నాడు.. కానీఈ నేపథ్యంలో అఫ్గాన్తో టీమిండియా రెండో టీ20కి ముందు స్టేడియానికి వచ్చిన వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీని స్పోర్ట్స్తక్ పలకరించింది. వైభవ్కు తుదిజట్టులో చోటు దక్కడం లేదు.. రెండో మ్యాచ్లోనైనా అవకాశం వస్తుందనుకుంటున్నారా? అని ప్రశ్నించింది.ఇందుకు బదులిస్తూ.. ‘‘మీ అందరి ఆశీర్వాదాలు వైభవ్పై ఉండాలి. మాకు అదే పదివేలు. జట్టుకు అవసరమైన వేళ అతడు సిద్ధంగా ఉంటాడు. నా కుమారుడు ఇప్పటికీ పూర్తిస్థాయి ప్రదర్శన ఇచ్చేందుకు సన్నద్ధంగానే ఉన్నాడు. ఏదేమైనా జట్టు గెలవడం ముఖ్యం. మాకు అదిచాలు’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.కాగా రెండో టీ20లోనూ వైభవ్ బెంచ్కే పరిమితం కాగా.. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా సంజూ బరిలోకి దిగాడు. కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా విమర్శలకు చెక్ పెట్టాడు. అయితే, నామమాత్రపు మూడో టీ20లో మాత్రం మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వైభవ్ను ఆడిస్తామని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంకేతాలు ఇచ్చాడు. చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్తో పోటీ.. స్పందించిన సంజూ -
నన్ను ఎవరు తొలగిస్తారు?.. పాక్ చీఫ్ సెలక్టర్
పాకిస్తాన్ క్రికెట్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో టెస్టుల్లో పాక్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టు చేతిలో బాబర్ ఆజం బృందం 3-0తో క్లీన్స్వీప్ అయింది.ఏం చేసినా ఫలితం శూన్యంఅయితే, మూడో టెస్టుకు ముందే పాక్ క్రికెట్ బోర్డు (PCB) జట్టుకు సంబంధించి గణనీయమైన మార్పులు చేసింది. ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేయడంతో పాటు.. టెస్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను తమ పదవుల నుంచి తొలగించింది.ఇన్ని మార్పుల తర్వాత కూడా పాక్ ఆట తీరులో మార్పు రాలేదు. ఇంగ్లండ్ చేతిలో మూడో టెస్టులోనూ ఓడి.. పరాజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు తీరుపై.. ముఖ్యంగా చీఫ్ సెలక్టర్ ఆకిబ్ జావేద్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.పాకిస్తాన్ మాజీ హెడ్కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం జేసన్ గిల్లెస్పి సైతం ఆకిబ్పై మండిపడ్డాడు. అతడు వచ్చిన తర్వాతే పాక్ క్రికెట్ నాశనం మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పులను ఒప్పుకోకుండా... నెపాన్ని మాజీ కోచ్లమైన నాపై, గ్యారీ కిర్స్టెన్పై నెట్టేస్తున్నాడంటూ ఆరోపించాడు.వేటుకు రంగం సిద్ధంఈ పరిణామాల నేపథ్యంలో పీసీబీ చీఫ్ మోసిన్ నక్వీ సైతం ఆకిబ్ జావేద్పై గుర్రుగా ఉన్నాడని.. అతడిపై వేటు వేసేందుకు బోర్డు రంగం సిద్ధం చేసిందని వార్తలు వచ్చాయి. ప్రక్షాళనలో భాగంగా ఆకిబ్ తొలగింపు లాంఛనమేనని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆకిబ్ జావేద్ ఈ పరిణామాలపై తాజాగా స్పందించాడు.నన్ను ఎవరూ తొలగించడం లేదుపాక్ మీడియా డాన్ న్యూస్ ప్రకారం.. ‘నేను నా చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేయడం లేదు. బోర్డులో నేను పోషిస్తున్న ఇతర బాధ్యతల నుంచి కూడా వైదొలగడం లేదు. మీరు విన్నవన్నీ అవాస్తవాలు, కల్పితాలు. నన్ను ఎవరూ తొలగించడం లేదు’’ అని ఆకిబ్ జావేద్ చెప్పినట్లు తెలుస్తోంది.కాగా 2024లో ఆకిబ్ జావేద్ పాక్ జట్టు చీఫ్ సెలక్టర్గా వచ్చాడు. అతడి హయాంలో ఇప్పటి వరకు పాకిస్తాన్ 101 మ్యాచ్లు ఆడి 53 గెలిచింది. తద్వారా విజయాల శాతం 52.47గా నమోదైంది. ఆకిబ్ రావడానికి ముందు రెండేళ్ల కాలంలో పాక్ జట్టు 78 మ్యాచ్లలో కేవలం 33 గెలిచింది. దీనిని బట్టి ఆకిబ్ వచ్చిన తర్వాతే పాక్ పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు కనిపిస్తుంది. కాబట్టి అతడిని మరికొంతకాలం కొనసాగించాలని పీసీబీ యోచిస్తున్నట్లు సమాచారం.చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్తో పోటీపై సంజూ స్పందన -
అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్తో పోటీ.. స్పందించిన సంజూ
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. అఫ్గానిస్తాన్తో రెండో టీ20 సందర్భంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు అర్ధ శతకంతో అలరించాడు. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 57 పరుగులు సాధించాడు.తొలి మ్యాచ్లో విఫలం కావడంతోకాగా జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న సంజూ శాంసన్.. అఫ్గాన్తో ఢిల్లీలో జరుగుతున్న టీ20 సిరీస్తో టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో కేవలం పది పరుగులే చేసి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో సంజూపై విమర్శల వర్షం కురిసింది.బ్యాట్తోనే సమాధానం సంజూకు బదులు.. జింబాబ్వేలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా పంపాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, విమర్శలకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు సంజూ. రెండో టీ20లో భారత ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచి తన బ్యాటింగ్ పదును తగ్గలేదని నిరూపించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు.వైభవ్, అభిషేక్తో పోటీపై స్పందనఈ నేపథ్యంలో అఫ్గాన్పై విజయానంతరం సంజూ శాంసన్ మీడియాతో మాట్లాడగా.. సహచర ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలతో పోటీ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘బయటి ప్రపంచం దృష్టిలోనే వాళ్లిద్దరు (అభిషేక్, వైభవ్) నాకు పోటీదారులు. అయితే, జట్టుగా మేమంతా ఒకటే.దేశం కోసం ఆడుతున్నాము. అన్నింటికంటే జట్టు విజయమే మా మొదటి ప్రాధాన్యం. ఆ తర్వాతే వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తాము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకరి పట్ల ఒకరికి ప్రతికూల ఆలోచనలు ఉండవు. కోపం తెచ్చుకునే మైండ్సెట్ కూడా ఉండదు.నన్ను కాదని అతడిని ఎలా ఆడిస్తారు?‘నాకు కాకుండా.. అతడికే ఎందుకు అవకాశం ఇచ్చారు?.. నన్ను కాదని అతడిని ఎలా ఆడిస్తారు?’ అనే ప్రశ్నలకు తావు లేదు. అలాంటి మనస్తత్వం ఉంటే ఇక్కడ పనికిరాదు’’ అని సంజూ శాంసన్ విలేకరులతో పేర్కొన్నాడు. ఏదేమైనా గతంలో విమర్శల గురించి ఆలోచిస్తూ బాధపడేవాడినన్న ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ప్రస్తుతం తానెంతో పరిణతి సాధించానని తెలిపాడు.కచ్చితగా ప్రభావం ఉంటుంది.. కానీ‘‘ప్రస్తుతం నాకు తగినంత అనుభవం, పరిణతి వచ్చాయి. కెరీర్ ఆరంభంలో ట్రోల్స్ చూసి బాధపడేవాడిని. నేనేమీ యంత్రాన్ని కాదు. ఆటగాళ్లు రోబోలు కాదు. కాబట్టి.. ‘అలాంటి మాటలు నాపై ప్రభావం చూపలేవు’ అని సులువుగా చెప్పలేము. ఎందుకంటే కొంతమంది మాటలు తప్పకుండా ప్రభావం చూపుతాయి.అయితే, గతంలో మాదిరి నేను ఇప్పుడు ఆ మాటల్ని పట్టించుకోవడం మానేశాను. ఒక షాట్ ఆడేముందు గతంలో చాలా ఆలోచించేవాడిని. సోషల్ మీడియాలో ఎలాంటి విమర్శలు వస్తాయో ఊహించుకునేవాడిని. కానీ ఇప్పుడు కేవలం ఆట మీదే పూర్తిగా దృష్టి పెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదనే పరిణతి సాధించాను’’ అని సంజూ శాంసన్ ట్రోల్స్కు కౌంటర్ ఇచ్చాడు.చదవండి: ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డుSanju Samson putting Mohammed Nabi through the boundary tour. 😮💨 Watch #AFGvIND 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork pic.twitter.com/hNKWkuiSbL— Sony Sports Network (@SonySportsNetwk) September 15, 2026 -
వైభవ్ ఆడడంపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్పై ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. సంజూ శాంసన్ (57) అర్థసెంచరీతో రాణించగా, అభిషేక్ శర్మ (39), ఇషాన్ కిషన్ (34 నాటౌట్) రాణించారు. చివర్లో తిలక్ వర్మ (15 నాటౌట్) జట్టును గెలిపించాడు. రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. కాగా మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. తనపై వచ్చిన విమర్శలకు సంజూ శాంసన్ నోటితోనే సమాధానం చెప్పాడని పేర్కొన్నాడు. బౌలర్ల సమిష్టి ప్రదర్శన ఈ విజయాన్ని అందించిందని తెలిపాడు.తొలి మ్యాచ్ ఆటతీరును దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్లో భారీ విజయాన్ని ఆశించామని.. దానికి తగ్గట్టుగానే భారత ప్లేయర్లు అద్భుతంగా రాణించారని తెలిపాడు. మైదానంలో ప్లేయర్లు చూపిన పట్టుదల, ప్లాన్ అమలు తీరు తమకు అనుకూలంగా ఫలితాన్ని ఇచ్చిందన్నాడు. మొదట్లో కొన్ని విషయాలను జీర్ణించుకోవడం కష్టంగా అనిపించినప్పటికీ, క్రీడా ప్రయాణం అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిదని పేర్కొన్నాడు. ఏ పరిస్థితిలోనైనా కూల్ గా ఉండటం చాలా ముఖ్యమని, గతాన్ని ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకున్నానని చెప్పాడు. ఒత్తిడిని ఎంతగా ఆస్వాదిస్తే పరిస్థితులు అంతగా అనుకూలంగా మారుతాయని తాను గతంలో కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు.ఇక సిరీస్ ఇప్పటికే 2-0తో కైవసం కావడంతో చివరి, మూడో టీ20 మ్యాచ్లో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చాడు. దీంతో తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన వైభవ్ సూర్యవంశీ మూడో టీ20లో ఆడే అవకాశముంది. అందరినీ ఇక్కడి పిచ్ వాతావరణానికి అలవాటు చేయడం, మైదానంలో తగినంత ప్రాక్టీస్ కల్పించడం ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. అందువల్ల ఇప్పటివరకు బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్లకు మూడో మ్యాచ్ లో అవకాశాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నామని.. జట్టు కాంబినేషన్లో కూడా కొన్ని చిన్నపాటి మార్పులు చేసే అవకాశం ఉందని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.ఇదీ చదవండి: శతకంతో చెలరేగిన బ్రూక్.. లంకపై ఇంగ్లండ్ విజయం -
శతకంతో చెలరేగిన బ్రూక్.. లంకపై ఇంగ్లండ్ విజయం
సౌతాంప్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర సెంచరీకి తోడు బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. హ్యారీబ్రూక్ (49 బంతుల్లో 114 నాటౌట్, 10 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో చెలరేగగా, ఓపెనర్ జాస్ బట్లర్ (44 బంతుల్లో 80; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకంతో రాణించాడు. లంక బౌలర్లలో చమీరా, దునిత్ వెల్లలగె, ఇషాన్ మలింగ, వనిందు హసరంగ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీ టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 19 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. దునిత్ వెల్లలగె (33) టాప్ స్కోరర్గా నిలవగా, దాసున్ షనక (24) ప్రభావం చూపించలేకపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సొన్ని బేకర్ 3 వికెట్లు తీయగా, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 42 బంతుల్లో సెంచరీ సాధించిన బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 రేపు మాంచెస్టర్ వేదికగా జరగనుంది.ఇదీ చదవండి: షేక్ హసీనా సన్నిహితులకు మరణశిక్ష!ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు -
పంత్కు పిలుపు దక్కేనా!
న్యూఢిల్లీ: ఒకవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టి20 జట్టు అఫ్గానిస్తాన్తో టి20 సిరీస్ ఆడుతుండగా... మరోవైపు ఈ నెలాఖరున ప్రారంభమయ్యే వెస్టిండీస్తో వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ బుధవారం జట్టును ఎంపిక చేయనుంది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్తో టి20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు ఆ తర్వాత నేరుగా... జపాన్ వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లనుంది. కాగా... ఈ నెల 27 నుంచి వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఇందులో భాగంగా 27న తిరువనంతపురం వేదికగా తొలి వన్డే, 30న గువాహటిలో రెండో వన్డే, అక్టోబర్ 3న చండీగఢ్లో మూడో వన్డే జరగనున్నాయి. అనంతరం ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ జరగనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొన్న జట్టే విండీస్తో టి20 సిరీస్లో పాల్గొననుంది. అయితే వన్డే సిరీస్ కోసం మాత్రం సెలెక్టర్లు ఈ రోజు జట్టును ఎంపిక చేయనున్నారు. ‘రో–కో’ రీ ఎంట్రీ... టెస్టు, టి20లకు వీడ్కోలు పలికి కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానుండగా... గాయం నుంచి కోలుకున్న పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక తథ్యమే. నితీశ్ కుమార్ రెడ్డి ఆసియా క్రీడల్లో పాల్గొంటుండగా... అదనపు పేస్ ఆల్రౌండర్గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. వెంకటేశ్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే ప్రస్తుతం గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. కేఎల్ రాహుల్ రూపంలో రెగ్యులర్ వన్డే వికెట్ కీపర్ అందుబాటులో ఉండగా... అదనపు కీపర్గా రిషబ్ పంత్కు చోటు దక్కుతుందా చూడాలి. చాన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈసారి కూడా అతడిని ఎంపిక చేయకపోతే... రిజర్వ్ కీపర్గా ధ్రువ్ జురేల్కు అవకాశం దక్కొచ్చు. అదే జరిగితే పంత్ ఇరానీ కప్లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు సారథ్యం వహించాల్సి ఉంటుంది. షమీకి చివరి చాన్స్ వచ్చేనా! రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లితో టాపార్డర్లో ఎలాంటి ఇబ్బందులు లేకపోగా... టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో నాలుగో స్థానంలో ఖాళీని రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటిదార్లలో ఒకరితో నింపే అవకాశాలున్నాయి. యశస్వి జైస్వాల్ను రిజర్వ్ ఓపెనర్గా ఎంపిక చేయనుండగా... సీనియర్ స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను కొనసాగిస్తారా లేక మానవ్ సుతార్కు అవకాశం ఇస్తారా అనేది కీలకం. విప్రాజ్ నిగమ్, జీషన్ అన్సారీ రూపంలో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.అయితే వన్డే ప్రపంచకప్ టోరీ్నకి మరో ఏడాది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో సెలెక్టర్లు ప్రయోగాల జోలికి వెళ్లకుండా... పాత జట్టుకే మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో భారీ మద్దతు కూడగట్టుకున్న మొహమ్మద్ షమీకి ఈసారైనా జాతీయ జట్టులో అవకాశం దక్కుతుందా చూడాలి.దేశవాళీల్లో ఫార్మాట్తో సంబంధం లేకుండా మెరుగైన బౌలింగ్తో సత్తాచాటుతున్న షమీని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్ భారీగా వినిపిస్తున్న నేపథ్యంలో సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరం. బుమ్రా ఆసియా క్రీడల బరిలో ఉన్న నేపథ్యంలో సిరాజ్కు వన్డే పిలుపు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. -
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ప్రపంచ రికార్డు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇషాన్ కిషన్ రెండో స్థానంలో నిలిచాడు. 2026 ఏడాదిలో ఇషాన్ కిషన్ 173.2 స్ట్రైక్రేట్తో 892 పరుగులు సాధించాడు. తొలి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ (2022లో 187.43 స్ట్రైక్రేట్తో 1164 పరుగులు) కొనసాగుతున్నాడు. ఇక 2025లో అభిషేక్ శర్మ 193.46 స్ట్రైక్రేట్తో 859 పరుగులు సాధించి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ముగ్గురి తర్వాత విరాట్ కోహ్లి (2022లో 781 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (2023లో 733 పరుగులు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. సంజూ శాంసన్ (57) అర్థసెంచరీతో రాణించగా, అభిషేక్ శర్మ (39), ఇషాన్ కిషన్ (34 నాటౌట్) రాణించారు. చివర్లో తిలక్ వర్మ (15 నాటౌట్) జట్టును గెలిపించాడు. రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (37) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీశ్కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీయగా, అర్ష్దీప్ సింగ్ 2 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్, బిష్ణోయిలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇరుజట్ల మధ్య చివరి టీ20 గురువారం ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.Most runs for India in a calendar year in T20Is :1164 - Suryakumar Yadav in 2022 (SR: 187.43)892 - Ishan Kishan in 2026 (SR: 173.2)*WHAT A COMEBACK FOR ISHAN KISHAN 🔥 pic.twitter.com/8Cds0c4w5a— Vipin Tiwari (@Vipintiwari952) September 15, 2026ఇదీ చదవండి: యూపీఐ చార్జీలు.. ఏటా 84 వేల కోట్ల ఆదాయం!శాంసన్ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం -
శాంసన్ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్పై ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ సంజూ శాంసన్ (57) అర్థసెంచరీ చేయగా, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (39) రాణించాడు. చివర్లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (34 నాటౌట్), తిలక్ వర్మ (15 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (37) టాప్ స్కోరర్గా నిలవగా, డార్విష్ రసూలీ (26), రషీద్ ఖాన్ (28) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో నితీశ్కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీయగా, అర్ష్దీప్ సింగ్ 2 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్, బిష్ణోయిలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇరుజట్ల మధ్య చివరి టీ20 గురువారం ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.Series victory sealed 🔒Superb from start to finish as #TeamIndia make it 2️⃣-0️⃣ in the Friendship Cup 🇮🇳👏Scorecard ▶️ https://t.co/96e4nhbYLf#AFGvIND pic.twitter.com/zvWVii5nBC— BCCI (@BCCI) September 15, 2026ఇదీ చదవండి: రెన్షా శతకం, ఇల్లిస్ విజృంభణ.. తొలి వన్డే ఆసీస్దే..! -
రెన్షా శతకం, ఇల్లిస్ విజృంభణ.. తొలి వన్డే ఆసీస్దే..!
జింబాబ్వేలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా గెలుపుతో బోణీ కొట్టింది. హరారే వేదికగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో మ్యాట్ రెన్షా, బౌలింగ్లో నాథన్ ఇల్లిస్ సత్తా చాటి ఆసీస్ను గెలిపించారు.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా (109) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. కూపర్ కన్నోల్లీ (51) కూడా రాణించాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (36), ఒలివర్ పీక్ (30), అలెక్స్ క్యారీ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ట్రవిస్ హెడ్ (4), జోష్ ఇంగ్లిస్ (4), జేవియర్ బార్ట్లెట్ (5) నిరాశపరిచారు. జింబాబ్వే బౌలర్లలో న్యుమ్యాన్ న్యామ్హురి (5-62) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. బ్రాడ్ ఈవాన్స్ 2, కెప్టెన్ సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే తడబడింది. నాథన్ ఇల్లిస్ (5-31) విజృంభించడంతో 45.1 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్, రెన్షా, ఆడమ్ జంపా, కూపర్ కన్నోల్లీ తలో వికెట్ తీసి, జింబాబ్వే పతనంలో పాలుపంచుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో క్రెయిగ్ ఎర్విన్ (59), కెప్టెన్ సికందర్ రజా (57) అర్ద సెంచరీలతో పోరాడినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. వీరికి మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ఈ సిరీస్లో రెండో వన్డే సెప్టెంబర్ 18న ఇదే హరారే వేదికగా జరుగనుంది.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన బుమ్రా -
IND VS AFG 2nd T20: సత్తా చాటిన టీమిండియా బౌలర్లు
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. నితీశ్ కుమార్ రెడ్డి (3-0-24-3), అర్షదీప్ సింగ్ (4-0-35-2), జస్ప్రీత్ బుమ్రా (4-1-25-1), అక్షర్ పటేల్ (4-0-28-1), రవి బిష్ణోయ్ (4-0-32-1) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. ఆఖర్లో రషీద్ ఖాన్ (28) బ్యాట్ ఝులిపించడంతో ఆఫ్ఘన్ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో ఇబ్రహీం జద్రాన్ 37, రహ్మానుల్లా గుర్బాజ్ 0, సెదిఖుల్లా అటల్ 12, గుల్బదిన్ నైబ్ 10, దర్విష్ రసూలీ 26, అజ్మతుల్లా ఒమర్జాయ్ 11, మొహమ్మద్ నబీ (15), నూర్ అహ్మద్ (7 నాటౌట్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు -
చరిత్ర సృష్టించిన బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో (పూర్తి సభ్య దేశాల బౌలర్లలో) అత్యధిక మెయిడిన్ ఓవర్లు (13) వేసిన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ జరుగుతున్న రెండో టీ20లో ఇన్నింగ్స్ తొలి ఓవరే మెయిడిన్ వేసి ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్కు ముందు బుమ్రా, జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ చెరో 12 మెయిడిన్ ఓవర్లతో సమంగా ఉండేవారు. తాజాగా బుమ్రా సోలోగా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 10 మెయిడిన్ ఓవర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. 17.4 ఓవర్లు ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 132-6గా ఉంది. ఇబ్రహీం జద్రాన్ 37, రహ్మానుల్లా గుర్బాజ్ 0, సెదిఖుల్లా అటల్ 12, గుల్బదిన్ నైబ్ 10, దర్విష్ రసూలీ 26, అజ్మతుల్లా ఒమర్జాయ్ 11 పరుగులు చేసి ఔట్ కాగా.. మొహమ్మద్ నబీ (15), రషీద్ ఖాన్ (17) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి తలో 2 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.ఇదీ చదవండి: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు -
శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు
భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 కెప్టెన్గా మొదటి 12 మ్యాచ్ల్లో అత్యధిక సార్లు (11) టాస్ గెలిచిన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ20లో టాస్ గెలవడంతో ఈ ఘనత సాధించాడు. ఖతార్ కెప్టెన్ మిర్జా బేగ్ (10), ఫిలిప్పీన్స్ కెప్టెన్ హెన్రీ టైలర్ (10)ను అధిగమించి సోలోగా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.ఐసీసీ పూర్తి సభ్య దేశాల కెప్టెన్లను పరిశీలిస్తే.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మహ్మదుల్లా తమ తొలి 12 టీ20ల్లో తొమ్మిది సార్లు టాస్ గెలిచారు. శ్రేయస్ వీరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, లిటన్ దాస్, షై హోప్ వంటి ప్రముఖ కెప్టెన్లు తమ తొలి 12 టీ20ల్లో కేవలం రెండేసి టాస్ విజయాలు మాత్రమే సాధించి ఈ జాబితాలో అట్టడుగు స్థానాల్లో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. శ్రేయస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి గాయపడటంతో అతడి స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ శ్రేయస్ అయ్యర్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 9.2 ఓవర్లలో 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీశారు. ఆఫ్ఘన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 37, రహ్మానుల్లా గుర్బాజ్ 0, సెదిఖుల్లా అటల్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. గుల్బదిన్ నైబ్ (7) క్రీజ్లో ఉన్నాడు. ఇదీ చదవండి: సచిన్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్ -
బంగ్లాదేశ్ కెప్టెన్ సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని రాతపూర్వకంగా బోర్డుకు తెలియజేసింది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుని బ్యాటింగ్, వికెట్ కీపింగ్పై మరింత దృష్టి పెట్టాలని నిగర్ భావిస్తోంది. అయితే వన్డే ఫార్మాట్లో మాత్రం కెప్టెన్గా కొనసాగనుంది.నిగర్ 2022లో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టింది. ఆమె కెప్టెన్సీలో జట్టు కొన్ని కీలక విజయాలు సాధించింది. 2024 టీ20 ప్రపంచకప్లో స్కాట్లాండ్పై విజయం బంగ్లాదేశ్కు ప్రత్యేకంగా నిలిచింది. ప్రపంచకప్లో దాదాపు పదేళ్ల తర్వాత బంగ్లాదేశ్కు ఇదే తొలి విజయం.ఆ టోర్నీలో నిగర్ సుల్తానా బ్యాట్తోనూ, వికెట్ కీపర్గా కూడా రాణించింది. నాలుగు ఇన్నింగ్స్ల్లో 104 పరుగులు చేయడంతో పాటు వికెట్ల వెనుక ఏడు డిస్మిసల్స్లో భాగమైంది.ఇటీవలి ఫలితాలతో ఒత్తిడిటీ20 ఫార్మాట్లో నిగర్ సుల్తానాకు ఇటీవల మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 2026 టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో బంగ్లాదేశ్ అజేయంగా ఛాంపియన్గా నిలిచినప్పటికీ.. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ను 1-2తో కోల్పోయింది.స్కాట్లాండ్-నెదర్లాండ్స్తో జరిగిన ట్రై-సిరీస్లోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టీ20 ప్రపంచకప్లో ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలు మాత్రమే దక్కాయి.కాగా, ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ పోటీల్లో బంగ్లాదేశ్ నిగర్ నేతృత్వంలోనే బరిలోకి దిగనుంది. ఈ పోటీలు సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభం కానుండగా.. బంగ్లాదేశ్ ఆరంభ రోజునే తొలి మ్యాచ్లో చైనాతో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. ఇదీ చదవండి: ఆసీస్పై 5 వికెట్ల ప్రదర్శన.. రికార్డులు కొల్లగొట్టిన జింబాబ్వే బౌలర్ -
ఆఫ్ఘన్తో రెండో టీ20.. టీమిండియాలో ఓ మార్పు
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి గాయపడటంతో అతడి స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.తుది జట్లు..ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్(c), సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నైబ్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీభారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఇదీ చదవండి: సచిన్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్ -
ఆసీస్పై 5 వికెట్ల ప్రదర్శన.. రికార్డులు కొల్లగొట్టిన జింబాబ్వే బౌలర్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే యువ పేసర్ న్యూమన్ న్యామ్హురి సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్లో అతడు ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. తద్వారా ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి జింబాబ్వే పేసర్గా రికార్డు నెలకొల్పాడు.అలాగే ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో జింబాబ్వే బౌలర్గా నిలిచాడు. అంతకుముందు స్పిన్నర్ ర్యాన్ బర్ల్ ఈ ఘనత సాధించాడు.మరో ఘనతన్యామ్హురి తాజా ప్రదర్శనతో మరో ఘనత కూడా సాధించాడు. వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అత్యంత పిన్న వయస్కుడైన (20 ఏళ్ల 239 రోజులు) జింబాబ్వే బౌలర్గా నిలిచాడు. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు ల్యూక్ జోంగ్వే (20 ఏళ్ల 330 రోజులు) పేరిట ఉండేది.ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుల జాబితాలో న్యామ్హురి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ (18 ఏళ్ల 266 రోజులు) అగ్రస్థానంలో ఉండగా.. అదే దేశానికి చెందిన సక్లైన్ ముష్తాక్ (19 ఏళ్ల 352 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. న్యామ్హురి ఐదేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగులకే పరిమితమైంది. న్యామ్హురి వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆసీస్ 300కు పైగా స్కోర్ చేయలేకపోయింది. న్యామ్హురి తన స్పెల్లో కీలక వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, జేవియర్ బార్ట్లెట్, ఆలివర్ పీక్లతో పాటు సెంచరీ సాధించిన మ్యాట్ రెన్షాను (109) ఔట్ చేశాడు.రెన్షాతో పాటు ఆసీస్ ఇన్నింగ్స్లో కూపర్ కన్నోల్లీ (51) కూడా రాణించాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (36), ఒలివర్ పీక్ (30), అలెక్స్ క్యారీ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ట్రవిస్ హెడ్ (4), జోష్ ఇంగ్లిస్ (4), జేవియర్ బార్ట్లెట్ (5) నిరాశపరిచారు. కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జింబాబ్వేలో పర్యటిస్తుంది.ఇదీ చదవండి: సచిన్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్ -
శతక్కొట్టిన రెన్షా.. ఆస్ట్రేలియా భారీ స్కోర్
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 15) తొలి వన్డే జరుగుతుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.మిడిలార్డర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా (109) తన కెరీర్లో తొలి వన్డే శతకంతో కదంతొక్కడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ (294-4) చేసింది. రెన్షాతో పాటు ఆసీస్ ఇన్నింగ్స్లో కూపర్ కన్నోల్లీ (51) కూడా రాణించాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (36), ఒలివర్ పీక్ (30), అలెక్స్ క్యారీ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ట్రవిస్ హెడ్ (4), జోష్ ఇంగ్లిస్ (4), జేవియర్ బార్ట్లెట్ (5) నిరాశపరిచారు. జింబాబ్వే బౌలర్లలో న్యుమ్యాన్ న్యామ్హురి (5-62) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. బ్రాడ్ ఈవాన్స్ 2, కెప్టెన్ సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టాడు.ఈ మ్యాచ్లో బరిలోకి దిగడంతో జింబాబ్వే వెటరన్ వికెట్కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ భారీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్లో సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన ఆటగాడిగా అవతరించాడు. సచిన్ తన వన్డే కెరీర్ను 22 ఏళ్ల 91 రోజుల పాటు కొనసాగించగా.. టేలర్ 22 ఏళ్ల 148 రోజుల తర్వాత కూడా తన వన్డే కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్ -
సచిన్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్
జింబాబ్వే వెటరన్ ప్లేయర్ బ్రెండన్ టేలర్, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ భారీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్లో సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన ఆటగాడిగా టేలర్ అవతరించాడు. సచిన్ తన వన్డే కెరీర్ను 22 ఏళ్ల 91 రోజుల పాటు కొనసాగించగా.. టేలర్ 22 ఏళ్ల 148 రోజుల తర్వాత కూడా తన వన్డే కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా టేలర్ ఈ ఘనత సాధించాడు.40 ఏళ్ల టేలర్ 2004 ఏప్రిల్ 20న శ్రీలంకతో జరిగిన మ్యాచ్తో వన్డే అరంగేట్రం చేశాడు. వికెట్కీపర్ బ్యాటర్ అయిన టేలర్ ఇప్పటివరకు 207 వన్డేలు ఆడి 11 సెంచరీలు, 39 అర్ద సెంచరీల సాయంతో 6704 పరుగులు చేశాడు. జింబాబ్వే తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్గా కూడా టేలర్ కొనసాగుతున్నాడు.అత్యంత సుదీర్ఘ వన్డే కెరీర్లుబ్రెండన్ టేలర్ – 22 ఏళ్ల 148 రోజులుసచిన్ టెండూల్కర్ – 22 ఏళ్ల 91 రోజులుసనత్ జయసూర్య – 21 ఏళ్ల 184 రోజులుజావెద్ మియాందాద్ – 20 ఏళ్ల 272 రోజులుసీన్ విలియమ్స్ – 20 ఏళ్ల 187 రోజులుక్రిస్ గేల్ – 19 ఏళ్ల 337 రోజులుషోయబ్ మాలిక్ – 19 ఏళ్ల 245 రోజులురోహిత్ శర్మ – 19 ఏళ్ల 21 రోజులుఅరవింద డి సిల్వా – 18 ఏళ్ల 352 రోజులురోహిత్ శర్మకు అవకాశం ఉందా..?ఈ జాబితాలో ప్రస్తుతం ఆడుతున్న భారత ఆటగాడిగా రోహిత్ శర్మ మాత్రమే ఉన్నాడు. అతడి వన్డే కెరీర్ వ్యవధి 19 ఏళ్ల 21 రోజులు. అయితే టేలర్ రికార్డును అందుకోవడం రోహిత్కు అంత సులభం కాదు.రోహిత్ ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో ఉన్నాడు. వన్డే జట్టులో అతడి స్థానం, 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. ఒకవేళ ఆ ప్రపంచకప్ ఆడినా.. అది టీమిండియా తరఫున అతడి చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల టేలర్ నెలకొల్పిన ఈ సుదీర్ఘ వన్డే కెరీర్ రికార్డును బద్దలు కొట్టడం రోహిత్కు సాధ్యం కాకపోవచ్చు. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్ -
మరో లీగ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న వార్నర్
ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ మరో క్రికెట్ లీగ్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సీజన్ నేపాల్ ప్రీమియర్ లీగ్లో అతడు బరిలోకి దిగనున్నాడు. ఖాట్మండు గోర్ఖాస్ ఫ్రాంచైజీతో వార్నర్ ఒప్పందం చేసుకున్నాడు. నేపాల్ ప్రీమియర్లో ఆడటం వార్నర్కు ఇదే మొదటిసారి.ఖాట్మండు గోర్ఖాస్ జట్టులో వార్నర్తో పాటు మాజీ భారత వికెట్ కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్ కూడా ఉన్నాడు. ఈ జట్టుకు నేపాల్ ఆటగాడు కరణ్ కేఎస్ నాయకత్వం వహిస్తాడు. 2024లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి గోర్ఖాస్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్కు చేరలేదు. 2025 ఎడిషన్లో ఎలిమినేటర్లో ఓటమిపాలైంది.వార్నర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక, ప్రపంచవ్తాప్తంగా లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. అతడు చివరిగా ఇదే ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడాడు. ఆ టోర్నీలో కరాచీ కింగ్స్ తరఫున బరిలోకి దిగి ఏడు ఇన్నింగ్స్ల్లో 51.20 సగటున, 150 స్ట్రైక్రేట్తో 256 పరుగులు చేశాడు.టీ20ల్లో మేటిగా గుర్తింపు తెచ్చుకున్న వార్నర్కు ఐపీఎల్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్లో అతడు ఏకంగా 184 మ్యాచ్లు ఆడాడు. సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్గా వ్యవహరించి 2016లో ఆ జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఏకైక ఆటగాడిగాయ కొనసాగుతున్నాడు.చదవండి: కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్న టీమిండియా ప్లేయర్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్
టీమిండియా స్పిన్ బౌలర్ శ్రీ చరణి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో 804 రేటింగ్ పాయింట్లు సాధించిన ఆమె.. 800 పాయింట్ల మార్క్ను తాకిన తొలి భారత బౌలర్గా రికార్డు నెలకొల్పింది.టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ చరిత్రలో శ్రీ చరణితో పాటు మరో ఇద్దరు మాత్రమే 800 రేటింగ్ పాయింట్ల మార్క్ను తాకారు. వీరిలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మేగన్ షట్ (806) అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ (802) శ్రీ చరణి తర్వాతి స్థానంలో ఉంది.అగ్రస్థానంలోనే చరణితాజా ర్యాంకింగ్స్లో చరణి తన అగ్రస్థానాన్ని మరింత బలపరుచుకుంది. తాజాగా శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో చరణి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఈ ప్రదర్శనతో టోర్నీలో ఆమె మొత్తం వికెట్ల సంఖ్య 12కు చేరింది. ఫైనల్లో భారత్ 72 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి ఆసియా కప్ను సొంతం చేసుకోవడంలో చరణి కీలక పాత్ర పోషించింది.రెండో స్థానానికి ఎగబాకిన దీప్తి శర్మఆసియా కప్లో అద్భుత ప్రదర్శనలు చేసిన దీప్తి శర్మకు కూడా తాజా ర్యాంకింగ్స్లో మంచి ఫలితం దక్కింది. టోర్నీ మొత్తంలో 14 వికెట్లు తీసిన దీప్తి.. నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో దీప్తి 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసి భారత విజయానికి తోడ్పడింది.బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆసియా కప్లో అదరగొట్టిన భారత డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ ఓ స్థానం మెరుగుపర్చుకొని ఆరో స్థానానికి ఎగబాకింది. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లోనూ షఫాలీ ఐదు స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకుంది. మరో టీమిండియా బ్యాటర్ స్మృతి మంధన ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసీస్కు చెందిన బెత్ మూనీ, జార్జియా వాల్ టాప్-2లో కొనసాగుతున్నారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో విండీస్కు చెందిన హేలీ మాథ్యూస్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. భారత స్టార్ దీప్తి శర్మ ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇదీ చదవండి: కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్న టీమిండియా ప్లేయర్ -
ZIM vs AUS: ట్రవిస్ హెడ్కు దిమ్మతిరిగే షాక్!
జింబాబ్వేతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రవిస్ హెడ్ పూర్తిగా విఫలమయ్యాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కేవలం ఒక ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో జింబాబ్వే గడ్డ మీద అత్యల్ప స్కోరుకే అవుటైన ఆసీస్ ఓపెనర్గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.మూడు వన్డేల సిరీస్కాగా వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్ను మంగళవారం మొదలుపెట్టింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.క్లీన్ బౌల్డ్ఈ క్రమంలో రెండో ఓవర్లో జింబాబ్వే పేసర్ బ్రాడ్ ఎవాన్స్ బంతితో రంగంలోకి దిగగా.. రెండో బాల్కు ఫోర్ బాది హెడ్ తన పరుగుల ఖాతా తెరిచాడు. అయితే, అదే ఓవర్లో ఐదో బంతికే ఎవాన్స్ అద్భుత బంతితో హెడ్ను బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో షాట్కు యత్నించిన హెడ్ బౌల్డ్ అయి తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు.భారీ అంచనాలతో బరిలోకి దిగిన మొత్తంగా ఐదు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో హెడ్ షాట్ సెలక్షన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. జింబాబ్వే గడ్డ మీద అత్యల్ప వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆసీస్ ఓపెనర్గా ట్రవిస్ హెడ్ అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్లో మరో ఓపెనర్, ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. తద్వారా హెడ్తో పాటు ఈ జాబితాలో చేరిపోయాడు.A familiar dismissal for Travis Head!😬He edges one onto the stumps — and Brad Evans strikes! 🎯🔥#ZIMvAUS #Australia #Zimbabwe #ODI #Harare #TravisHead pic.twitter.com/C2qqleXPM5— lightningspeed (@lightningspeedk) September 15, 2026జింబాబ్వే గడ్డ మీద అత్యల్ప వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన ఆసీస్ ఓపెనర్లు👉ట్రవిస్ హెడ్- 4 పరుగులు (హరారే, 2026)👉ఆడం గిల్క్రిస్ట్- 14 పరుగులు(బులవాయో, 1999)👉మాథ్యూ హెడెన్- 34 పరుగులు (బులవాయో, 2003)👉మిచెల్ మార్ష్- 36 పరుగులు (హరారే, 2026)👉బ్రాడ్ హాడిన్- 46 పరుగులు (హరారే, 2014).చదవండి: టీమిండియాలో కొందరు కోహ్లిని వ్యతిరేకించారు: భువీ -
కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్న టీమిండియా ప్లేయర్
టీమిండియా పేసర్ ముకేశ్ కుమార్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నాడు. 2026 కౌంటీ ఛాంపియన్షిప్లో చివరి రెండు మ్యాచ్లకు నాటింగ్హామ్షైర్ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. ఇవాళ ససెక్స్తో జరిగే మ్యాచ్తో నాటింగ్హామ్షైర్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు. అనంతరం సెప్టెంబర్ 24న యార్క్షైర్తో జరిగే మ్యాచ్లోనూ ఆడనున్నాడు.డివిజన్-1 టైటిల్ రేసులో నాటింగ్హామ్షైర్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండటంతో ముకేశ్ రాక ఆ జట్టు బౌలింగ్ విభాగానికి అదనపు బలాన్ని ఇవ్వనుంది. ఇంగ్లండ్ పరిస్థితుల్లో ముకేశ్ స్వింగ్, సీమ్ బౌలింగ్ నాటింగ్హమ్కు ఉపయోగపడే అవకాశం ఉంది.నాటింగ్హామ్షైర్తో జతకట్టక ముందు ముకేశ్ దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. టోర్నీలో 12 వికెట్లు పడగొట్టి సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.మొత్తంగా ముకేశ్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 60 మ్యాచ్ల్లో 233 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున మూడు టెస్టులు కూడా ఆడిన ముకేశ్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో విస్తృత అనుభవం ఉంది. ముకేశ్ టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. అయితే ప్రస్తుతం జట్టులో తీవ్ర పోటీ ఉండటంతో అవకాశాలు దొరకడం లేదు. నాటింగ్హ్షైర్ తరఫున సత్తా చాటి తిరిగి జట్టులోకి రావాలని ముకేశ్ భావిస్తున్నాడు.చదవండి: బాబర్ ఆజం సంచలన నిర్ణయం! -
అంబానీ ఇంట పూజ.. ప్రత్యేక ఆకర్షణగా సారా, సానియా.. వీడియో
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇంట వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబైలోని సచిన్ నివాసంలో అందమైన అలంకరణలో బుజ్జి గణేశుడు కొలువుదీరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సచిన్ కుమార్తె సారా టెండుల్కర్ మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది.‘‘మోదకాలు, హారతి, నైవేద్యాలు, కుటుంబం, స్నేహితులు.. ఇంట్లో గణపతి బప్పా.. ఇంతకంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. అందరికీ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు’’ అంటూ సారా తాజాగా ఫొటోలు పంచుకుంది.PC: Instagram View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar)అంబానీ ఇంట పూజఇదిలా ఉంటే... భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతుల ఇంట గణేశ్ చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముంబైలోని అంబానీల నివాసం యాంటిలియాలో కొలువుదీరిన గణనాథుని పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భార్య అంజలి, కుమార్తె సారా, కుమారుడు అర్జున్, కోడలు సానియాతో కలిసి సచిన్ అంబానీ నివాసానికి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.PC: Instagramఇక అంబానీ ఇంట పూజకు అంజలి, సారా, సానియా సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ముగ్గురూ చీరలు కట్టుకుని ముచ్చటగా కనిపించారు. కాగా అక్క సారా కంటే అర్జున్ ముందుగా పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ముంబైలోని ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన సానియా చందోక్ను ఈ ఏడాది మార్చి 5న అర్జున్ వివాహమాడాడు. కాగా సానియా- సారా ప్రాణ స్నేహితులు. ఇక సచిన్తో పాటు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ సతీమణులతో కలిసి అంబానీ ఇంట పూజకు విచ్చేశారు. చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్... ఆస్తి విలువ ఎంతంటే? View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) -
నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదు: బీసీసీఐ
మహిళల ఆసియా కప్-2026 ట్రోఫీ నిరాకరణ అంశం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా స్పందించింది. ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా బహుమతి అందుకోమని ముందుగానే బోర్డుకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.నక్వీ అందుకు అభ్యంతరం చెప్పలేదుఈ విషయం గురించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునే విషయం గురించి మేము ముందుగానే చర్చించుకున్నాము. అతడే ట్రోఫీ ఇస్తానని పట్టుబడితే తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చాము. జట్టుకు ఇదే విషయాన్ని తెలియజేశాము.ఇది బోర్డు సామూహిక నిర్ణయం. ఇందుకు నక్వీ కూడా అభ్యంతరం చెప్పలేదు. అందుకే వేదిక దగ్గరకు వచ్చి ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు’’ అని తెలిపారు. కాగా మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీలో భారత జట్టు చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే.అపుడు కూడా ఇలాగేదుబాయ్ వేదికగా ఆదివారం ముగిసిన ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తు చేసి హర్మన్ సేన టైటిల్ గెలుచుకుంది. అయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది ఆసియా కప్ గెలిచినప్పటికీ భారత పురుషుల క్రికెట్ జట్టు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.తాజాగా 2026లో చాంపియన్గా నిలిచిన భారత మహిళా జట్టు సైతం అదే బాటలో నడిచింది. అయితే, ఈసారి తాము ముందుగానే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోమని బీసీసీఐ ఏసీసీకి సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ నక్వీ తానే స్వయంగా బహుమతి ప్రదానం చేస్తానని వేదిక వద్దకు రాగా.. భారత జట్టు కిందే ఉండిపోగా.. రన్నరప్ శ్రీలంకకు చెక్ ఇచ్చి నక్వీ వెళ్లిపోయాడు.ట్రోఫీ ఇంకా చేతికి రాలేదుఇదిలా ఉంటే.. పురుషుల జట్టుకు రావాల్సిన ఆసియా కప్ ట్రోఫీ ఇంకా బీసీసీఐ చేతికి అందనేలేదు. తాజాగా మహిళల ట్రోఫీ కూడా ఎప్పుడు చేతికి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ఏసీసీతో సంప్రదించి త్వరలోనే రెండు ట్రోఫీలు దేశానికి చేరేలా చూస్తామని వెల్లడించారు. కాగా టీమిండియా గతేడాది ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించగా.. నక్వీ తనతో పాటే ట్రోఫీని ఎత్తుకెళ్లాడనే ప్రచారం జరిగింది. దీంతో తాజాగా మహిళల ఫైనల్ ముగిసిన తర్వాత నక్వీ స్టేడియంలోకి రాగా..‘ట్రోఫీ చోర్’ అంటూ టీమిండియా అభిమానులు నినాదాలు చేశారు. చదవండి: బాబర్ ఆజం సంచలన నిర్ణయం! -
టీమిండియాలో కొందరు కోహ్లిని వ్యతిరేకించారు: భువీ
టీమిండియా టెస్టు అత్యుత్తమ కెప్టెన్లలో విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉంటాడు. ఈ బ్యాటింగ్ దిగ్గజం సారథ్యంలో సంప్రదాయ క్రికెట్లో భారత జట్టు ఉన్నత శిఖరాలకు చేరింది. కోహ్లి కెప్టెన్గా ఉన్న ఏడేళ్ల కాలంలో విదేశాల్లో చిరస్మరణీయ విజయాలు నమోదు చేయడంతో పాటు.. ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది.అయితే, టెస్టు సారథిగా కోహ్లి పగ్గాలు చేపట్టిన తర్వాత డ్రెసింగ్రూమ్లో చాలా మంది అతడి ఆలోచనా విధానాన్ని వ్యతిరేకించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. టీమిండియా వెటరన్ పేస్ బౌలర్, కోహ్లి సహచర ఆటగాడు భువనేశ్వర్ కుమార్ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.జతిన్ సప్రూనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా టెస్టు సారథిగా విరాట్ కోహ్లిగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. అతడి ఆలోచనా విధానం, ఉద్దేశాలు అర్థం చేసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. కొన్ని సిరీస్లు ఆడిన తర్వాత అతడి గురించి మాకు అవగాహన వచ్చింది.కొందరు కోహ్లిని వ్యతిరేకించారుఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కెప్టెన్గా వచ్చిన కోహ్లి తన తొలి ప్రసంగంలోనే ఫిట్నెస్, డైట్ సంస్కృతి గురించి మాట్లాడాడు. అప్పుడు కొంతమంది వీటి అవసరం ఏముంది? అంటూ కోహ్లిని వ్యతిరేకించారు. కోహ్లి ఆలోచనలను ప్రశ్నించారు.అయితే, ఆ తర్వాత కొంతకాలానికే ప్రతి ఒక్కరు కోహ్లి దారిలోకి వచ్చేశారు. ఫిట్నెస్, డైట్ ప్రాముఖ్యాన్ని తెలుసుకుని అతడితో కలిసి ముందుకు నడిచారు’’ అని భువీ చెప్పుకొచ్చాడు. కాగా కోహ్లి వైఖరి కారణంగా తాము వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతగానో విజయవంతమయ్యామని పలువురు టీమిండియా ఫాస్ట్ బౌలర్లు సంతోషం వ్యక్తం చేశారు.రోహిత్ శర్మపైనే ఆ ఎఫెక్ట్!ఇదిలా ఉంటే.. భువీ ఎవరి పేర్లను ప్రస్తావించనప్పటికీ కోహ్లిని వ్యతిరేకించిన వాళ్లలో రోహిత్ శర్మ ముందున్నాడనే ప్రచారం గతంలో జరిగింది. కోహ్లి డిప్యూటీగా వ్యవహరించిన హిట్మ్యాన్.. యో-యో టెస్టు (ఫిట్నెస్)లో విఫలం కావడంతో 2017 ఇంగ్లండ్ పర్యటనలో అతడిని కేవలం వైట్బాల్ సిరీస్లకే ఎంపిక చేశారు.ఆ తర్వాత 2020-21లో ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సమయంలోనూ రోహిత్ శర్మ తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. దీంతో రోహిత్- కోహ్లి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయనే విమర్శలు వచ్చాయి. అయితే, ఇవన్నీ వట్టి వదంతులేనని.. కేవలం జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తామని రో-కో పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పారు.విజయవంతమైన కెప్టెన్కాగా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా 2014లో టెస్టు పగ్గాలు చేపట్టిన కోహ్లి.. ర్యాంకింగ్స్లో ఏడో స్థానం నుంచి టీమిండియాను నంబర్ వన్ స్థానానికి చేర్చాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డ మీద విజయాలు అందించాడు. 2018-19లో తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్లో భారత్ను గెలిపించాడు.భువీకి మద్దతుగా కోహ్లికోహ్లి కెప్టెన్సీలో టీమిండియా 68 టెస్టు మ్యాచ్లు ఆడి.. 40 గెలిచింది. ఇదిలా ఉంటే.. భువీకి మద్దతుగా నిలిచిన కోహ్లి.. అతడికి వరుస అవకాశాలు ఇచ్చాడు. అయితే, రోహిత్ శర్మ సారథిగా వచ్చిన తర్వాత భువీ కనుమరుగైపోయాడు. ప్రస్తుతం కోహ్లితో కలిసి ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడుతున్న భువీ.. 2025,2026 సీజన్లలో జట్టు చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా సారథులుగా పనిచేసిన రో-కో.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇద్దరూ వన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా కొనసాగుతున్నారు. ఇక నాడు కోహ్లి ఫిట్నెస్ మంత్రాకు అనుకూలంగా లేడన్న అపవాదు ఎదుర్కొన్న రోహిత్.. ఇటీవల పది కిలోలకు పైగా బరువు తగ్గి ఫిట్గా మారడం కొసమెరుపు.చదవండి: బాబర్ ఆజం సంచలన నిర్ణయం! -
బాబర్ ఆజం సంచలన నిర్ణయం!
పాకిస్టాన్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏడేళ్ల తర్వాత తొలిసారి దేశవాళీ రెడ్బాల్ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అవును.. మా జట్టుకే ఆడుతున్నాడుఈ విషయాన్ని ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (OGDCL) స్పోర్ట్స్ హెడ్ ఫరా ధ్రువీకరించారు. ‘‘బాబర్ ఆజం యూకే నుంచి సెప్టెంబరు 16న పాకిస్తాన్కు తిరిగి వస్తాడు. ఆ మరుసటి రోజు OGDCL జట్టుతో చేరతాడు. ఇప్పటికే బాబర్కు సంబంధించి కిట్ ఆర్డర్ చేశాము.ఈ సీజన్లో జట్టు ఆడే రెండు, లేదంటే మూడో మ్యాచ్ నుంచి బాబర్ జట్టుతో ఉంటాడు. ఇది అతడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’’ అని ఫరా తెలిపారు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందే బాబర్ ఆజం మరోసారి పాకిస్తాన్ టెస్టు సారథిగా తిరిగి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.గాయంతో మొదలు..యూకే టూర్లో భాగంగా తొలుత కౌంటీ క్లబ్ సెలెక్ట్ ఎలెవన్తో మ్యాచ్లో ఆడిన బాబర్ ఆజం గాయపడ్డాడు. దీంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఇక రెండో టెస్టుతో తిరిగి వచ్చిన బాబర్.. దారుణంగా విఫలమయ్యాడు. లార్డ్స్లో జరిగిన ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో వరుసగా 8, 6 పరుగులు చేశాడు.వరుస వైఫల్యాల తర్వాత..ఇక ఆఖరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఏడు పరుగులకే అవుటైన బాబర్.. రెండో ఇన్నింగ్స్తో ఫామ్లోకి వచ్చాడు. మొత్తంగా 103 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 76 పరుగులతో రాణించాడు. అయితే, కెప్టెన్గా మాత్రం బాబర్కు చేదు అనుభవం మిగిలింది.బాబర్ ఆజం సారథ్యంలో ఇంగ్లండ్ చేతిలో పాక్ 3-0తో వైట్వాష్ అయింది. అంతేగాక మూడో టెస్టులో స్లో ఓవర్రేటు కారణంగా జరిమానాతో పాటు పాయింట్ల కోత (11 పాయింట్లు) ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2027 ఫైనల్ రేసు నుంచి పాక్ అనధికారికంగా నిష్క్రమించింది.చివరగా అప్పుడేఈ నేపథ్యంలోనే బోర్డు ఆదేశాల మేరకు తిరిగి దేశీ రెడ్బాల్ క్రికెట్ ఆడేందుకు బాబర్ ఆజం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ దిగ్గజ బ్యాటర్ చివరగా 2019లో క్వైడ్ ఈ ఆజం ట్రోఫీ టోర్నీలో భాగంగా సెంట్రల్ పంజాబ్ సారథిగా వ్యవహరించాడు. నాడు బాబర్ కెప్టెన్సీలో సెంట్రల్ పంజాబ్ టైటిల్ గెలిచింది. ఇక తాజాగా రీఎంట్రీ ఇస్తున్న బాబర్.. ప్రెసిడెంట్స్ ట్రోఫీ గ్రేడ్ 1 ఫస్ట్క్లాస్ టోర్నమెంట్లో భాగంగా OGDCL జట్టుకు ఆడతాడు. గెస్ట్ ప్లేయర్గా అతడు OGDCLతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పాక్ మీడియా తెలిపింది. ఇక బాబర్ కంటే ముందే పేసర్ షాహిన్ ఆఫ్రిది, టీ20 కెప్టెన్ సల్మాన్ ఆఘా దేశీ రెడ్బాల్ క్రికెట్ బరిలో దిగారు.చదవండి: ‘వైభవ్ ఎందుకు ఆడట్లేదని నా భార్య అరిచేసింది’ -
IND vs AFG: భారత తుదిజట్టు ఇదే.. ఒకే ఒక్క మార్పు!
అఫ్గానిస్తాన్తో రెండో టీ20కి టీమిండియా సిద్ధమైంది. తొలి మ్యాచ్లో జయభేరి మోగించిన శ్రేయస్ అయ్యర్ సేన.. మంగళవారం నాటి మ్యాచ్లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.సునాయాస విజయంకాగా ఢిల్లీ వేదికగా ఆతిథ్య అఫ్గాన్తో తొలి టీ20లో టీమిండియా మంచినీళ్లప్రాయంగా గెలుపొందింది. అఫ్గాన్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 13.4 ఓవర్లలోనే ఊదేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 82) కారణంగా భారత్కు ఈ విజయం సాధ్యమైంది.ఇక ఈ మ్యాచ్తో తిరిగి టీమిండియాలోకి వచ్చిన మరో ఓపెనర్ సంజూ శాంసన్ మాత్రం విఫలమయ్యాడు. కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని తిరిగి తుదిజట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. గత సిరీస్లో జింబాబ్వేలో సత్తా చాటిన ఈ పదిహేనేళ్ల పిల్లాడిని పక్కనపెట్టి.. సంజూకు అవకాశం ఇస్తే అతడు మాత్రం తేలిపోయాడనే విమర్శలు వస్తున్నాయి.వైభవ్ మరోసారి బెంచ్కే పరిమితం!ఈ నేపథ్యంలో అఫ్గాన్తో రెండో టీ20లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ మొదలైంది. సంజూను తప్పించి వైభవ్ను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. మెజారిటీ మంది విశ్లేషకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. సంజూకు మరో అవకాశం ఇస్తారని.. ఈ మ్యాచ్లోనూ విఫలమైతే అతడిని ఇక పూర్తిగా పక్కనపెట్టేస్తారని అభిప్రాయపడుతున్నారు.వరుస మ్యాచ్లలో విఫలమైన తర్వాత జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ.. సీనియారిటి, ప్రపంచకప్-2026 ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు ఇంకో ఛాన్స్ ఇవ్వడమే సరైందని పేర్కొంటున్నారు. ఒక మార్పు అనివార్యం!ఇదిలా ఉంటే.. సంజూ- వైభవ్ విషయం ఎలా ఉన్నా.. భారత తుదిజట్టులో ఒక మార్పు మాత్రం అనివార్యం కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా అఫ్గాన్తో మిగిలిన రెండు మ్యాచ్ల నుంచి దూరమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండో టీ20లో రవి బిష్ణోయి వరుణ్ స్థానాన్ని భర్తీ చేస్తాడని తెలుస్తోంది.అఫ్గానిస్తాన్తో రెండో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయి. -
‘నా భార్య అరిచేసింది.. ఆమెకు కూడా అన్నీ అర్థమవుతున్నాయి’
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 జట్టు ఓపెనింగ్ విషయంలో మేనేజ్మెంట్కు స్పష్టత లేదని.. ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని మండిపడ్డాడు. టీమిండియా నాయకత్వ బృందం కేవలం విశ్లేషకులకే కాకుండా.. సగటు అభిమానులకు కూడా చిరాకు తెప్పిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా జింబాబ్వే పర్యటన తర్వాత భారత టీ20 జట్టు తాజాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో సిరీస్ ఆడుతోంది. ఢిల్లీలో అఫ్గాన్ మూడు టీ20లకు ఆతిథ్యం ఇస్తుండగా.. తొలి మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, అఫ్గాన్తో తొలి టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు.వైభవ్ బెంచ్కే పరిమితంజింబాబ్వే పర్యటనలో సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు పొందినప్పటికీ.. సీనియర్, వరల్డ్కప్-2026 వీరుడు సంజూ శాంసన్ రాక వల్ల వైభవ్ బెంచ్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే, ఈ లెఫ్టాండర్ బ్యాటర్ను కాదని సంజూతో ఓపెనింగ్ చేయించగా.. అతడు కేవలం పది పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.నా భార్య అరిచేసింది..ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఆదివారం మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడలేదు. దీంతో మేము మ్యాచ్ను పక్కనపెట్టేసి మూవీతో టైమ్పాస్ చేయాల్సి వచ్చింది. అసలు వైభవ్ను ఎందుకు ఆడించడం లేదని నా భార్య అరిచేసింది.గత సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు గెలిచిన ప్లేయర్ను ఎలా పక్కనపెడతారని ప్రశ్నించింది. నా భార్యకు కూడా ఆట, సెలక్షన్ తీరు గురించి ఇంతలా అర్థమవుతోంది. సగటు అభిమానులకు కూడా మీ వ్యూహాలు మింగుడుపడటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి.తప్పుడు సంకేతాలు ఇస్తున్నారుసూర్యవంశీ సేవల్ని మీరు సరిగ్గా వాడుకోవడం లేదు. ఇక రెండో టీ20లో అతడికి అవకాశం ఇస్తారేమో. ఒకవేళ అతడు ఆ మ్యాచ్లో విఫలమైతే మాత్రం మళ్లీ తుదిజట్టు నుంచి తప్పిస్తారు. ఆటగాళ్లకు మీరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ప్రదర్శన ఎలా ఉన్నా మరుసటి మ్యాచ్లో చోటు దక్కుతుందో లేదోనన్న ఆందోళన పెంచుతున్నారు. వైభవ్ సూర్యవంశీ ఇటీవల దులిప్ ట్రోఫీ టోర్నీలోనూ అదరగొట్టాడు. అంతకుముందు ఐపీఎల్, భారత్-ఎ జట్టు తరఫున.. అదే విధంగా అంతర్జాతీయ టీ20లలో రాణించాడు. సంజూను చూస్తే జాలేస్తుందిఅయినా సరే అతడి విషయంలో ఇలా ఎందుకు చేస్తున్నారు’’ అని హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీరుపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా వైభవ్ ఒక్కడి విషయంలోనే కాకుండా.. సంజూ శాంసన్ విషయంలోనూ మేనేజ్మెంట్ వైఖరి సరిగ్గా లేదని చిక్కా విమర్శించాడు. సంజూను చూస్తే జాలేస్తుందని.. వైభవ్ రాకతో అతడి స్థానానికి ఎసరు వచ్చిందన్నాడు. యాజమాన్యానికి నిజంగా సంజూ పట్ల సానుకూల వైఖరి ఉంటే వరుస అవకాశాలు ఇవ్వాలని.. వైభవ్తోనే కొనసాగాలని భావిస్తే అతడిని పక్కనపెట్టేయాలని సూచించాడు. అంతేతప్ప దాగుడుమూతలు ఆడటం సరికాదని క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. కాగా భారత్- అఫ్గాన్ మధ్య మంగళవారం రెండో టీ20 జరుగనుండగా.. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.చదవండి: మా వాడు వైభవ్ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్ కెప్టెన్ -
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. విధ్వంసకర బ్యాటర్ అరంగేట్రం
మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 15న సౌతాంప్టన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. విధ్వంసకర బ్యాటర్, ఓపెనర్ అనెరిన్ డొనాల్డ్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. ఫిల్ సాల్ట్ కుడి తొడ కండరాల గాయంతో సిరీస్కు దూరం కావడంతో అనెరిన్ డొనాల్డ్కు అవకాశం దక్కింది. జేకబ్ బేతెల్ స్థానంలో వచ్చిన జోర్డన్ కాక్స్కు కూడా తుది జట్టులో చోటు లభించింది. ఆల్రౌండర్లుగా జాక్స్, డాసన్, ఓవర్టన్ తమ స్థానాలను పదిలంగా ఉంచుకున్నారు. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్కు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో సోనీ బేకర్కు అవకాశం లభించింది. స్పిన్ విభాగంలో అనుభవజ్ఞుడైన ఆదిల్ రషీద్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పేస్ విభాగంలో జోష్ టంగ్ కూడా తుది జట్టులో ఉన్నాడు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది.శ్రీలంకతో తొలి టీ20కి ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్జోస్ బట్లర్ (వికెట్ కీపర్), అనెరిన్ డొనాల్డ్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోర్డాన్ కాక్స్, టామ్ బాంటన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్, సోనీ బేకర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్ఇదీ చదవండి: టీమిండియాకు ఊహించని షాక్ -
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్
ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ20కి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని సమాచారం. వరుణ్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏషియన్ గేమ్స్లోనూ ఆడటం అనుమానమేనని తెలుస్తోంది.వరుణ్ సైడ్ స్ట్రెయిన్తో బాధపడుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నిన్న జరిగిన తొలి టీ20లో వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో అతడు నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు.న్యూఢిల్లీలో రేపు జరుగబోయే రెండో టీ20లో వరుణ్ లేకపోతే టీమిండియా ఇబ్బంది పడవచ్చు. ఇటీవలికాలంలో వరుణ్ టీ20 ఫార్మాట్లో భారత్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాడు. రెండో టీ20కి వరుణ్ దూరమైతే అతడి స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి రావచ్చు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లు న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్నాయి. తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్లో తొలుత బౌలర్లు రెచ్చిపోగా.. ఆతర్వాత బ్యాటర్లు తమ పని కానిచ్చారు. బౌలింగ్లో వరుణ్తో పాటు అర్షదీప్ (4-0-19-3), బుమ్రా (4-0-26-1), అక్షర్ పటేల్ (4-0-27-1) సత్తా చాటగా.. బ్యాటింగ్లో అభిషేక్ (32 బంతుల్లో 82; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించారు.ఇదీ చదవండి: టీమిండియాకు ఊహించని షాక్ -
పాక్ క్రికెట్ జట్లకు వరుస ఎదురుదెబ్బలు.. గంటల వ్యవధిలో..!
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్లకు గడ్డుకాలం నడుస్తోంది. ఆ దేశ పురుష, మహిళా జట్లు చెత్త ప్రదర్శనలతో ఆడిన ప్రతి మ్యాచ్లో ఘోర పరాజయాలు ఎదుర్కొంటున్నారు. ఇవి చాలవన్నట్లు ఆ జట్లకు ఐసీసీ వరుస షాక్లు ఇస్తుంది.మహిళల ఆసియా కప్లో భాగంగా భారత్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో ఓవరాక్షన్ చేసినందుకు ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు అక్షింతులు వేసింది ఐసీసీ. ఇది జరిగి రోజులు గడవకముందే ఆ దేశ పురుషుల జట్టును కూడా ఐసీసీ తలంటింది.డబ్ల్యూటీసీలో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్ట్లో స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసినందుకు పాక్ జట్టు మొత్తానికి 50 శాతం జరిమానా విధించారు. అలాగే 11 డబ్ల్యూటీసీ పాయింట్లు కోత విధించారు.ఇది జరిగిన రోజే ఐసీసీ పాక్ మహిళల జట్టుకు మరోసారి షాకిచ్చింది. పురుషుల జట్టుకు భారీ శిక్ష పడిన గంటల వ్యవధిలోనే మహిళల జట్టుపై మరోసారి కొరడా ఝులిపించింది. ఆసియా కప్ సెమీఫైనల్లో (శ్రీలంకపై) స్లో ఓవర్రేట్తో బౌలింగ్ చేసినందుకు మ్యాచ్ ఫీజ్లో 5 శాతం జరిమానా విధించింది.ప్రదర్శనల విషయానికొస్తే.. పాక్ మహిళల జట్టు ఆసియా కప్ సెమీఫైనల్లోనే శ్రీలంక చేతిలో చావుదెబ్బ తిని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. టైటిల్ గెలిచికా భారత జట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా అయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకుండా పాక్కు బుద్ది చెప్పింది.పురుషుల జట్టు విషయానికొస్తే.. ఈ జట్టు ప్రదర్శనల పరంగానే కాకుండా ప్రవర్తన విషయంలోనూ నవ్వులపాలైంది. ఆ జట్టులోని ఏడుగురు సభ్యులను ఇంగ్లండ్ పర్యటన మధ్యలోనే క్రమశిక్షణ చర్యల పేరుతో స్వదేశానికి పిలిపించుకున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను పాక్ 0-3 తేడాతో కోల్పోయి, ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఇదీ చదవండి: టీమిండియాకు ఊహించని షాక్ -
టీమిండియాకు ఊహించని షాక్
మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై ఘన విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. వికెట్ తీసిన అనంతరం దూకుడుగా సంబురాలు చేసుకున్నందుకు స్టార్ పేసర్ క్రాంతి గౌడ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్లో క్రాంతి గౌడ్ తొలి ఓవర్లోనే ఇమేషా దులానిని క్లీన్ బౌల్డ్ చేసింది. వికెట్ తీసిన ఆనందంలో ఆమె దూకుడుగా సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా క్రాంతి ప్రదర్శించిన హావభావాలపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని లెవల్-1 నిబంధనను ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది.వికెట్ తీసిన తర్వాత అతడిని లేదా ఆమెను అవమానించేలా, లేదా దూకుడుగా స్పందించేలా ప్రేరేపించే భాష, చర్యలు లేదా హావభావాలు చేయడాన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. దీంతో ఐసీసీ క్రాంతి గౌడ్పై చర్యలు తీసుకుంది. 24 నెలల వ్యవధిలో ఆమెకు ఇది తొలి తప్పిదం కావడంతో జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్తో సరిపెట్టారు.తనపై వచ్చిన అభియోగాన్ని క్రాంతి అంగీకరించడంతో ప్రత్యేకంగా ఫార్మల్ హియరింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదని ఐసీసీ వెల్లడించింది. కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్ను కైవసం చేసుకుంది. ఇదీ చదవండి: పాకిస్తాన్కు మరో భారీ షాక్ -
వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్లో పెను సంచలనంగా మారిన టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ.. డబ్బు సంపాదనలోనూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. నివేదికల ప్రకారం వైభవ్ ఒక్క రోజు బ్రాండ్ ఎండార్స్మెంట్ షూట్కు సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని AMP Sports & Entertainment వ్యవస్థాపకుడు, CEO ఇంద్రనీల్ దాస్ స్వయంగా చెప్పాడు.రాబోయే రెండు మూడేళ్లలో వైభవ్ బ్రాండ్ విలువ మరింత పెరిగి, ప్రస్తుతం తీసుకుంటున్న ఫీజుకు రెట్టింపు అవుతుందని ఆయన అంచనా వేశాడు.సచిన్తో పోలికబ్రాండ్ విలువలో వైభవ్ను మార్కెట్ నిపుణులు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్తో పోలుస్తున్నారు. Houlihan Lokey IPL Valuation Study 2026 ప్రకారం, వైభవ్కు ఉన్న ఆకర్షణ సచిన్ స్థాయికి దగ్గరగా ఉంది. భయమెరుగని బ్యాటింగ్ శైలి వైభవ్ క్రేజ్ను మరింత పెంచుతుంది. కొందరు క్రికెటేతర అభిమానులు కేవలం వైభవ్ బ్యాటింగ్ చూసేందుకే స్టేడియాలకు తరలి వస్తున్నారు.13 ఏళ్లకే కోటీశ్వరుడువైభవ్ 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి అతి పిన్న వయస్కుడైన కోటీశ్వరుడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025కు ముందు రాజస్థాన్ రాయల్స్ అతడిని జట్టులోకి తీసుకుంది. తొలి సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడిన వైభవ్, 206 స్ట్రైక్రేట్తో 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ సునామీ శతకం కూడా ఉంది.రెండో సీజన్లో మరింత విధ్వంసంతన రెండో ఐపీఎల్ సీజన్లో (2026) వైభవ్ మరింత రెచ్చిపోయాడు. ఏకంగా 776 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గానిలిచాడు. అతడి స్ట్రైక్రేట్ ఏకంగా 237.31గా ఉంది.టీమిండియాలోనూ చోటుఐపీఎల్లో అద్బుత ప్రదర్శనల తర్వాత బీసీసీఐ కూడా వైభవ్పై నమ్మకం ఉంచింది. యూకే పర్యటనకు అతడిని ఎంపిక చేసింది. ఇప్పటివరకు 6 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన వైభవ్, ఐపీఎల్ తరహా ప్రదర్శనలు చేయనప్పటికీ.. ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. ఇదీ చదవండి: మావాడు ఇప్పటికే వైభవ్ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్ కెప్టెన్ -
మయాంక్ మాయాజాలం.. పంజాబ్ టీ20 లీగ్ విజేతగా అమృత్సర్
షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ 2026 విజేతగా అమృత్సర్ సూర్మాస్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో లూధియానా లయన్స్పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ను కైవసం చేసుకుంది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న అమృత్సర్.. లూధియానా బ్యాటర్లను కట్టడి చేసింది. సూర్మాస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో లూధియానా భారీ స్కోరు చేయలేకపోయింది. ఒక దశలో లూధియానా జట్టు 86 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.మయాంక్ మాయాజాలంఅమృత్సర్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మిగతా బౌలర్లు కూడా క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో లూధియానా జట్టు 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది.లూధియానా ఇన్నింగ్స్లో అభిజిత్ గార్గ్ (37), హరీశ్ కుమార్ (22), మాధవ్ సింగ్ (21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.అనంతరం 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అమృత్సర్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ సహజ్ ధవన్ (63) అజేయ అర్ద సెంచరీతో ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి రాహుల్ కుమార్ (42 నాటౌట్), కెప్టెన్ నమన్ ధిర్ (29) సహకరించారు. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన నమన్ ధిర్కు (10 మ్యాచ్ల్లో 655 పరుగులు, 2 సెంచరీలు) ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. చదవండి: ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్ -
ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్
ఇటీవల పాకిస్తాన్ క్రికెట్లో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల్లో టెస్ట్ జట్టుకు దూరమైన ఆ దేశ టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, స్థానికంగా జరిగిన ఓ దేశవాలీ మ్యాచ్లో అజేయ ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కాడు.ప్రెసిడెంట్స్ ట్రోఫీలో కింగ్స్మెన్ అకాడమీ తరఫున బరిలోకి దిగిన అతడు, మార్కోర్ ఐటీ సొల్యూషన్స్ జట్టుపై 336 బంతుల్లో 42 బౌండరీలు, 6 సిక్సర్ల సాయంతో 300 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అఘా ట్రిపుల్ సెంచరీతో చెలరేగడంతో అతడి జట్టు భారీ స్కోర్ చేసింది.ఈ ట్రిపుల్తో అఘా పాక్ జాతీయ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్దంతరంగా స్వదేశానికి పంపిన ఏడుగురు పాక్ ఆటగాళ్లలో అఘా ఒకడు. ఇంగ్లండ్ పర్యటనలో తొలి రెండు టెస్ట్ల ఓటముల తర్వాత అఘాతో పాటు మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రమ్ షహజాద్ను జట్టు నుంచి తొలగించి స్వదేశానికి పంపించారు. అలాగే హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్ను కూడా బృందం నుంచి తప్పించారు.రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అందుబాటులో లేకపోవడంతో లీడ్స్లో జరిగిన తొలి టెస్టుకు అఘానే కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే పేలవ ఫామ్ కారణంగా రెండో టెస్టులో అతడికి అవకాశం దక్కలేదు. ఇక, మూడో టెస్టుకు ముందు జరిగిన పరిణామాల్లో అఘాను ఏకంగా స్క్వాడ్ నుంచే విడుదల చేశారు.జట్టు నుంచి తప్పించిన రోజుల వ్యవధిలోనే అఘా ట్రిపుల్ సెంచరీ బాదడం పాక్ క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. అతడిని తిరిగి టెస్ట్ జట్టులోకి తీసుకోవాలని పాక్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అఘాకు పీసీబీ ఛైర్మన్ నఖ్వీ కూడా మద్దతుగా నిలిచాడు. అఘా మంచి ఆటగాడే కానీ, కొన్ని కారణాల వల్ల ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడని అన్నాడు. కాగా, ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమైన పాక్ జట్టు 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. చదవండి: పాకిస్తాన్కు మరో భారీ షాక్ -
మావాడు వైభవ్ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్ కెప్టెన్
టీమిండియాతో చారిత్రక మ్యాచ్ ఆడేందుకు జపాన్ క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్.. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విధ్వంసకర ఓపెనర్ దూకుడుకు కళ్లెం వేసేందుకు తమ దగ్గర అస్త్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు.భారత్- జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇరుదేశాల పురుషుల క్రికెట్ జట్ల మధ్య తొలిసారి మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 22న ఇరుజట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరుగనుంది. జపాన్లోని సానో అంతర్జాతీయ మైదానం ఇందుకు వేదిక.ఇప్పటికే వైభవ్ను ఓసారి అవుట్ చేశాడుఈ నేపథ్యంలో జపాన్ కెప్టెన్ కెండెల్ ‘విజ్డెన్’ షోలో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ సూర్యవంశీని ఎదుర్కొనే విషయంలో మాకు ఎలాంటి ఆందోళనా లేదు. ఎందుకంటే.. మా జట్టులో ఉన్న పదిహేడేళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆసియా కప్ అండర్-19 టోర్నీలో ఇప్పటికే వైభవ్ను అవుట్ చేశాడు. దూకుడుకు కళ్లెం వేసి అతడి పనిపట్టాడు. కాబట్టి ఇంకేం భయం?’’ అని పేర్కొన్నాడు.చార్లీ హరా బౌలింగ్లోకాగా అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీలో భాగంగా జపాన్తో మ్యాచ్ సందర్భంగా పరుగులు రాబట్టేందుకు వైభవ్ సూర్యవంశీ ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 23 పరుగులే చేయగలిగాడు. భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో జపాన్ యువ స్పిన్నర్ చార్లీ హరా-హింజే వైభవ్ను అవుట్ చేశాడు.అంత ఈజీ కాదు.. కథ వేరుగా ఉందిఅయితే, జపాన్ కెప్టెన్ కెండెల్ చెప్పినట్లు వైభవ్ సూర్యవంశీని తమ యువ స్పిన్నర్తో కట్టడి చేయడం అంత తేలికేమీ కాదు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ స్సిన్నర్ల బౌలింగ్లో 17 ఇన్నింగ్స్లో కలిపి 146 బంతుల్లో 336 పరుగులు సాధించాడు. సగటు 37 కాగా.. స్ట్రైక్రేటు 228.08. ఇందులో 20 ఫోర్లు, 34 సిక్సర్లు ఉండటం విశేషం.ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం ఆరు టీ20 మ్యాచ్లు ఆడిన పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ.. 193 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 23 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 1028 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్తో బిజీగా ఉన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. సంజూ శాంసన్ రాక వల్ల తొలి టీ20 సందర్భంగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.చదవండి: వైభవ్ను కాదని నీకు ఛాన్స్ ఇస్తే ఏం చేశావు? -
పాకిస్తాన్కు మరో భారీ షాక్
తాజాగా ఇంగ్లండ్ చేతిలో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయి బాధలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు, ఆ పరాభవం నుంచి తేరుకోకముందే మరో షాక్ తగిలింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన చివరి టెస్టులో స్లో ఓవర్రేట్ కారణంగా ఆ జట్టు ఖాతా నుంచి 11 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్లు కోత విధించారు. దీంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా పడింది.ఎడ్జ్బాస్టన్ టెస్టులో పాక్ తొలి ఇన్నింగ్స్లో 89 ఓవర్లు బౌలింగ్ చేసింది. సమయానికి సంబంధించిన అనుమతులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా నిర్ణీత ఓవర్రేట్ కంటే 11 ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలింది.ఐసీసీ WTC ప్లేయింగ్ కండిషన్స్లోని ఆర్టికల్ 16.11.2 ప్రకారం నిర్ణీత ఓవర్ల కంటే ప్రతి ఓవర్ తక్కువగా వేసినందుకు ఒక WTC పాయింట్ కోత విధిస్తారు. అదే విధంగా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ప్రతి ఓవర్కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. అయితే ఈ జరిమానా గరిష్ఠంగా 50 శాతానికి పరిమితం.ఇప్పటికే WTC పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న పాకిస్థాన్, తాజా కోతతో మరింత దారుణ పరిస్థితిలోకి వెళ్లింది. ఈ WTC సైకిల్లో తొమ్మిది టెస్టులు, నాలుగు సిరీస్ల తర్వాత ఆ జట్టు పాయింట్స్ పర్సెంటేజ్ 4.63కి పడిపోయింది. దీంతో WTC ఫైనల్కు చేరే అవకాశం దాదాపుగా లేనట్లే.చదవండి: ఇంగ్లండ్దే మూడో టెస్టు.. పాకిస్తాన్ క్లీన్స్వీప్ -
విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి...
టీమిండియా వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ సోదరుడు, క్రికెటర్ మహ్మద్ కైఫ్పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని తనను మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి...దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. క్రికెటర్ షమీ సోదరుడు కైఫ్పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న సదరు మహిళకు కైఫ్ మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు.హోటల్కు రప్పించిబలవంతం మీద ఆమెను సెప్టెంబరు 9, 2023న కోల్కతాలోని ఓ హోటల్కు రప్పించి శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని కోరగా.. ఆమెతో స్నేహాన్ని తెంచుకున్నాడు. ఈ మేరకు సదరు మహిళ ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని అర్షియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కైఫ్పై కేసు నమోదైందని రిపోర్టర్ అభిషేక్ త్రిపాఠి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.అన్న మాదిరే బెంగాల్కు ఆడుతూ..కాగా అన్న షమీ మాదిరే కైఫ్ కూడా క్రికెటర్. ఉత్తరప్రదేశ్ వీరి సొంత రాష్ట్రం అయినప్పటికీ అన్న బాటలోనే దేశవాళీ క్రికెట్లో కైఫ్ బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్మద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు పలు దేశీ టోర్నమెంట్లలో ఆడుతున్నాడు. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన అతడు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటికి 40కి పైగా వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. ఇంతకుముందు కూడా ఓ మహిళ కైఫ్పై ఇదే తరహాలో ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఆరోపించింది. అయితే, అధికారికంగా కేసు మాత్రం పెట్టలేదని సమాచారం. కాగా షమీపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.షమీపై కూడా గతంలో ఆరోపణలుషమీ భార్య హసీన్ జహాన్ స్వయంగా తీవ్రమైన ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కింది. అతడికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించడంతో పాటు ఫిక్సింగ్ చేస్తాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పటి నుంచి విడిగా ఉంటున్న వీరు.. భరణానికి సంబంధించి తరచూ ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తున్నారు. కాగా హసీన్ జహాన్ ఐపీఎల్లో చీర్ గర్ల్గా ఉన్న సమయంలో ఆమె ప్రేమలో పడ్డ షమీ.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అయితే, అప్పటికే హసీన్కు వివాహమై కూతురు కూడా ఉన్నట్లు సమాచారం. షమీ- హసీన్కు కూడా ఓ కుమార్తె జన్మించింది.చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి? -
‘సంతోషంగా ఉంది.. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు’
ఊహించిందే జరిగింది.. మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీ విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.గతేడాది పురుషుల జట్టు మాదిరిగానే ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది హర్మన్ సేన. ఫలితంగా.. ముందే సమాచారం ఇచ్చినప్పటికీ చాంపియన్కు తానే ట్రోఫీ ప్రదానం చేస్తానని పట్టుబట్టిన నక్వీకి భంగపాటు ఎదురైంది. ‘ట్రోఫీ దొంగ’ అంటూఅతడి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు నిరాకరించగా.. స్టేడియంలో ఉన్నవాళ్లు ‘ట్రోఫీ దొంగ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు.. రన్నరప్ శ్రీలంక మాత్రం నక్వీ చేతుల మీదుగా చెక్ అందుకుంది.ఈ నేపథ్యంలో నక్వీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండగా.. పాకిస్తాన్ అభిమానులు మాత్రం అతడిని ప్రశంసిస్తూ అతి చేయడం కెమెరా కంటికి చిక్కింది. కాగా దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్-2026 ఫైనల్లో భారత జట్టు శ్రీలంకను 72 పరుగుల తేడాతో మట్టికరిపించింది.పాత కథ పునరావృతం కాకుండా..తద్వారా ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆసియా కప్లో భారత పురుషుల జట్టు చాంపియన్గా నిలిచినప్పటికీ.. నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది.దీంతో నక్వీ ట్రోఫీని తనతోపాటే తీసుకువెళ్లడం సహా.. తన అనుమతి లేకుండా భారత్కు ట్రోఫీని అందజేయవద్దనే ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ ముందుగానే ఆసియా క్రికెట్ మండలికి సమాచారం ఇచ్చింది. తమ జట్టు ఆసియా కప్ ఫైనల్లో విజేతగా నిలిస్తే నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోదని తేల్చి చెప్పింది.అయినప్పటికీ నక్వీ మొండిగా ముందుకు వెళ్లి.. చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. దీంతో దుబాయ్ స్టేడియం వీడి కారులో నక్వీ తిరిగి వెళ్తున్న వేళ కొంతమంది పాక్ అభిమానులు అతడిని చుట్టుముట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.సంతోషంగా ఉంది. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు‘మంచి పని చేశారు సర్. మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది. వాళ్లకు ట్రోఫీ అందుకునే అర్హత లేదు’ అంటూ ఓ అభిమాని మాట్లాడటం రికార్డు అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు పాక్ ఫ్యాన్స్, నక్వీ తీరుపై మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.55 పరుగులకే ఆలౌట్ అయిన వాళ్లకే ఆ అర్హత ఉంది‘‘అవును.. టోర్నీ ఆసాంతం ఒక్క ఓటమి కూడా లేకుండా చాంపియన్గా నిలిచిన హర్మన్సేనకు.. ఇలాంటి వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు అర్హత ఎందుకు ఉంటుంది?.. భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్ అయిన పాక్ మహిళా జట్టుకు మాత్రమే ఆ అర్హత ఉంది. నక్వీ, పాక్ జట్టు.. వారికి వారే తగినవారు. శునకానందం పొందండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా గ్రూప్ దశలో భారత జట్టుతో తలపడ్డ పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన హర్మన్సేన 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఇక సెమీ ఫైనల్లో భారత్ బంగ్లాపై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించగా.. శ్రీలంక చేతిలో ఓడి పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. దుబాయ్లో ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా అవతరించింది.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మHumiliation for Mohsin Naqvi 🔥😂“Good job, sir. We are happy with you. They don’t deserve the trophy,” a Pakistani fan tells Mohsin Naqvi. pic.twitter.com/6OSfKSNtzV— Anamika (@TheRubric_Medic) September 14, 2026 -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆసియా క్రికెటర్గా రికార్డు సాధించాడు. అఫ్గానిస్తాన్తో ఆదివారం నాటి తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ ఈ ఫీట్ నమోదు చేశాడు. 13.4 ఓవర్లలోనేకాగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు అఫ్గాన్ ఢిల్లీలో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం తొలి టీ20 జరుగగా.. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్గాన్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే ఛేదించింది.తుఫాన్ ఇన్నింగ్స్ఇందులో అభిషేక్ శర్మదే కీలక పాత్ర. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 32 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. స్ట్రైక్రేటు 256.25. అయితే, మహ్మద్ నబీ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్కు తెరపడింది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్తో మ్యాచ్లో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా అభిషేక్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పొట్టి క్రికెట్లో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 3420 బంతుల్లోనే అభిషేక్ ఈ మార్కును అందుకున్నాడు.ఆసియాలోనే తొలి ప్లేయర్గా..ఈ క్రమంలో అత్యంత వేగంగా టీ20లలో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆసియా క్రికెటర్గా.. ఓవరాల్గా రెండో ప్లేయర్గా నిలిచాడు. కాగా దేశీ క్రికెట్లో పంజాబ్ తరఫున.. ఐపీఎల్లో.. టీమిండియా తరఫున కలిపి అభిషేక్ శర్మ ఈ మేరకు భారీగా పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.ఫాస్టెస్ట్ 6000 రన్స్ (బంతుల పరంగా)👉ఫిన్ అలెన్ (న్యూజిలాండ్)- 3386 బంతుల్లో👉అభిషేక్ శర్మ (ఇండియా)- 3420 బంతుల్లో👉ఆండ్రీ రసెల్ (వెస్టిండీస్)- 3550 బంతుల్లో👉టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా)- 3681 బంతుల్లో👉విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్)- 3857 బంతుల్లో.చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?𝐓𝐇𝐈𝐒 𝐊𝐈𝐍𝐃 𝐎𝐅 𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆. 🤌💥When Abhishek Sharma gets going, the bat does the talking. 🔥Watch #AFGvIND 1st T20I, LIVE NOW on Sony Sports Ten 5 & Sony MAX.#SonySportsNetwork #SonyMAX #ExtraaaInnings pic.twitter.com/aLu13MB9JF— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
వైభవ్ను కాదని నీకు ఛాన్స్ ఇచ్చి ఏం లాభం?
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి విఫలమయ్యాడు. అఫ్గానిస్తాన్తో తొలి టీ20 సందర్భంగా కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో సంజూ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అప్పటి నుంచి విఫలంటీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ.. ఆ ఈవెంట్ తర్వాత టీమిండియా తరఫున ఇప్పటికి ఆడిన ఐదు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 43 పరుగులే చేయడం ఇందుకు కారణం.ఈ నేపథ్యంలో సంజూను కాదని అభిషేక్ శర్మకు జోడీగా వైభవ్ సూర్యవంశీని ఫిక్స్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఫామ్లో ఉన్న వైభవ్ను కాదని.. సంజూను ఆడించడాన్ని తప్పుబట్టాడు.వైభవ్ను కాదని ఛాన్స్ ఇచ్చి ఏం లాభం?ఈ మేరకు క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘అప్పుడప్పుడు సంజూకు తుదిజట్టులో అవకాశం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? అతడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఓసారి జట్టు నుంచి తప్పించిన తర్వాత సహజంగానే ఆటగాడు ఫామ్ కోల్పోతాడు. కానీ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తాడు.అయితే, సంజూ విషయంలో ఇది జరుగలేదు. అయినా సరే అతడికి ఎందుకు అవకాశం ఇస్తున్నట్లు? ఇదే అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. జింబాబ్వే సిరీస్లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గానూ నిలిచాడు.PC: Xనేనేం తప్పు చేశాను?అయినా సరే జింబాబ్వేలో ఆడిన ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ- వైభవ్ సూర్యవంశీలను ఎందుకు విడదీసినట్లు? ఇది మరో ప్రశ్న. ఇప్పటికీ టీ20లలో తమ అత్యుత్తమ ఓపెనింగ్ కాంబినేషన్ ఏదోనన్న అంశంపై టీమిండియా స్పష్టతకు రాలేకపోతోందా? ఇంకెంత కాలం ఈ విషయం గురించి ఆలోచిస్తారు?వైభవ్ కచ్చితంగా.. ‘నేనేం తప్పు చేశాను’ అని అడిగే ఉంటాడు. ఇంతటి గందగోళం ఎందుకు? ఓపెనింగ్కు సంబంధించిన సరైన కూర్పు ఏదో తెలుసుకోండి’’ అని మహ్మద్ కైఫ్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు.అందుకే ఆడించారేమో!అయితే, అదే షోలో పాల్గొన్న మరో మాజీ క్రికెటర్ మోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘సంజూ సీనియర్ ఆటగాడు. ప్రపంచకప్ టోర్నీలో గొప్పగా ఆడాడు. మరో విషయం ఏమిటంటే.. వైభవ్ ఆడితే తుదిజట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య పెరుగుతుంది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం కూడా సంజూ వైపు మొగ్గు చూపి ఉంటారు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ అఫ్గాన్పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు అర్ధ శతకం (32 బంతుల్లో 82)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42) కూడా రాణించాడు. మరోవైపు.. సంజూ ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసి.. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్లో డార్విష్ రసూలీకి క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు.చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి? -
వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?
ఆసియా కప్ ట్రోఫీ బహూకరణ విషయంలో మరోసారి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు (ఏసీసీ), పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ వైఖరి కారణంగా భారత జట్టు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకోవాల్సి వచ్చింది.ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరణకాగా గతేడాది పురుషుల ఆసియా కప్ టీ20 టోర్నీలో టీమిండియా ఫైనల్లో పాక్ను ఓడించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత జట్టు నక్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో నక్వీ ట్రోఫీని తనతో పాటే తీసుకువెళ్లగా.. సూర్యకుమార్ సేన రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది.ఇప్పటికీ ట్రోఫీ భారత్ చేతికి రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలోనూ భారత జట్టు చాంపియన్గా నిలిచింది. దుబాయ్ వేదికగా ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి టైటిల్ గెలిచింది. అయితే, ట్రోఫీ అందించే విషయంలో నక్వీ మొండిపట్టుదల కారణంగా హర్మన్సేన విషయంలో పాత కథే పునరావృతమైంది.𝗧𝗛𝗘 𝗪𝗜𝗖𝗞𝗘𝗧. 𝗧𝗛𝗘 𝗥𝗢𝗔𝗥. 𝗧𝗛𝗘 𝗖𝗥𝗢𝗪𝗡! 👑8 titles. One unstoppable dynasty 💙 #SonySportsNetwork #SonyLIV #NotAGentlemansGame #DPWorldWomensAsiaCup2026 pic.twitter.com/NG3DRF52Xd— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026ముందుగానే సమాచారంనిజానికి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ట్రోఫీ బహూకరణ అంశం గురించి ముందుగానే ఏసీసీకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ..‘‘పురుషుల ఆసియా కప్ మాదిరే ఈసారి కూడా ట్రోఫీ అందుకునే విషయంలో మా వైఖరి గురించి ముందుగానే స్పష్టంగా చెప్పాము. ఇప్పటికీ గతేడాది ట్రోఫీ ఇంకా మా చేతికి రాలేదు. అయినా సరే కొంతమంది విదేశీ వ్యక్తుల చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు ఈసారి కూడా సుముఖంగా లేమని చెప్పేశాము.ఆయన చేతుల మీదుగా అయితే ఓకేఒకవేళ ఏసీసీ డిప్యూటీ చైర్పర్సన్ ట్రోఫీని ఖలీద్ అల్ జరూనీ ప్రదానం చేస్తే తీసుకుంటామని చెప్పాము. కానీ మా అభ్యర్థనను తిరస్కరించారు. కాబట్టి ట్రోఫీని ఆ వ్యక్తి (నక్వీ) చేతుల మీదుగా తీసుకోవద్దమని మేము నిర్ణయించుకున్నాము’’ అని సైకియా తెలిపాడు.‘‘ఏదేమైనా ట్రోఫీ చేతికి రానంత మాత్రాన మా జట్టు సాధించిన విజయం వృథాగా పోదు. దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిన అమ్మాయిలకు అభినందనలు. ఏదో ఒకరోజు రెండు ట్రోఫీలు మన చేతికి వస్తాయి’’ అని సైకియా పేర్కొన్నాడు.వద్దన్నా వినడు.. ఇదేం బుద్ధి?బీసీసీఐ ముందుగానే ఏసీసీకి సమాచారం ఇచ్చినప్పటికీ మోసిన్ నక్వీ ట్రోఫీ తానే ఇస్తానని గట్టిగా నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా జియో న్యూస్ వెల్లడించింది. ఏదేమైనా ట్రోఫీ చాంపియన్ చేతికి అందుతుందని.. ఈ విషయంలో ఏసీసీ సుముఖంగానే ఉందని పేర్కొంది.కాగా నక్వీ తీరుపై టీమిండియా అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ముందుగా చెప్పినా వినకుండా మొండిపట్టు పట్టడం దేనికి?.. ఇదేం బుద్ధి?.. కావాలనే భారత్కు ట్రోఫీలు రాకుండా అల్ప సంతోషం పొందడం పాక్ మంత్రికి అలవాటై పోయింది’’ అని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. 🚨 NO TROPHY FROM MOHSIN NAQVI! 🇮🇳India Women chose not to collect the Asia Cup trophy from Pakistan’s Mohsin Naqvi.Smriti Mandhana simply turned around and headed back to the dugout! 🔥WELL DONE GIRLS! 🙌 pic.twitter.com/XwnW5eW8nW— The Khel India (@TheKhelIndia) September 14, 2026 -
మనమే చాంపియన్స్
దుబాయ్: ఫార్మాట్ ఏదైనా ఆసియా పరిధిలో తమకు ఎదురులేదని భారత మహిళల క్రికెట్ జట్టు నిరూపించింది. ఆసియాకప్ టి20 టోర్నీలో భారత జట్టు ఎనిమిదోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 72 పరుగుల ఆధిక్యంతో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక జట్టును ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు సాధించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (39 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్లు), స్మృతి మంధాన (39 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. తొలి వికెట్కు వీరిద్దరు 129 పరుగులు జోడించారు. రిచా ఘోష్ (14; 1 ఫోర్), హర్మన్ప్రీత్ (17; 1 ఫోర్, 1 సిక్స్), కమలిని (5 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కూడా రాణించారు. అనంతరరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టును భారత స్పిన్నర్లు దెబ్బ కొట్టారు. ఏదశలోనూ లక్ష్యం దిశగా సాగని శ్రీలంక సరిగ్గా 20 ఓవర్లు ఆడి 111 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 20 పరుగులిచ్చి 4 వికెట్లు, దీప్తి శర్మ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. వన్డే, టి20 ఫార్మాట్లు కలిపి ఆసియాకప్ ఇప్పటి వరకు 10 సార్లు జరిగింది. 10 సార్లు భారత జట్టు ఫైనల్కు చేరింది. వన్డే ఫార్మాట్లో భారత జట్టు 2004, 2005, 2006, 2008లలో విజేతగా నిలిచింది. టి20 ఫార్మాట్లో 2012, 2016, 2022, 2026లలో టైటిల్ గెలిచింది. 2018లో, 2024లలో టీమిండియా రన్నరప్గా నిలిచింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (రనౌట్) 59; షఫాలీ వర్మ (సి) చమరి (బి) ప్రబోద 68; హర్మన్ప్రీత్ కౌర్ (సి) కవింది (సబ్) (బి) మిథాలీ అయోధ్య 14; రిచా ఘోష్ (సి) దిల్హారి (బి) చమరి 17; దీప్తి శర్మ (రనౌట్) 5; భారతి ఫుల్మాలి (నాటౌట్) 5; కమలిని (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–129, 2–132, 3–160, 4–166, 5–167. బౌలింగ్: మిథాలీ అయోధ్య 4–0–33–1, కవిషా దిల్హారి 3–0–29–0, సుగందిక కుమారి 4–0–31–0, చమరి అటపట్టు 4–0–34–1, చముడి ప్రబోద 4–0–40–1, నీలాక్షిక సిల్వా 1–0–15–0. శ్రీలంక ఇన్నింగ్స్: ఇమేశా దులాని (బి) క్రాంతి గౌడ్ 4; చమరి అటపట్టు (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) దీప్తి శర్మ 36; విశ్మీ గుణరత్నే (బి) దీప్తి శర్మ 20; హర్షిత సమరవిక్రమ (సి అండ్ బి) శ్రీచరణి 9; నీలాక్షిక సిల్వా (సి) కమలిని (బి) శ్రీచరణి 22; కవిషా దిల్హారి (సి) నందని శర్మ (బి) శ్రీచరణి 7; హాసిని పెరీరా (సి) శ్రీచరణి (బి) షఫాలీ వర్మ 1; కౌషిని నుత్యాంగణ (బి) దీప్తి శర్మ 9; సుగందిక కుమారి (సి) నందని శర్మ (బి) శ్రీచరణి 1; మిథాలీ అయోధ్య (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ప్రేమ రావత్ 0; చముడి ప్రబోద (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1–4, 2–62, 3–63, 4–86, 5–100, 6–101, 7–103, 8–104, 9–107, 10–111. బౌలింగ్: క్రాంతి గౌడ్ 2–0–8–1, నందని శర్మ 3–0–17–0, షఫాలీ వర్మ 4–0–23–1, శ్రీచరణి 4–1–20–4, దీప్తి శర్మ 4–0–19–3, ప్రేమ రావత్ 3–0–22–1. ట్రోఫీ స్వీకరించేందుకు నిరాకరణ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్గా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోహసిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించేందుకు భారత క్రికెట్ జట్టు నిరాకరించింది. శ్రీలంక జట్టు క్రికెటర్లు మెడల్స్ను స్వీకరించిన తర్వాత బహుమతి ప్రదానోత్సవం ముగిసింది. -
అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా అఫ్గాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.టీమిండియా బౌలర్ల విజృంభణఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ నామమాత్రపు స్కోరు చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) కూడా తేలిపోయాడు. మిగిలిన వారిలో సెదీకుల్లా అటల్ (13), గుల్బదిన్ నైబ్ (2), డార్విష్ రసూలీ (2) పేలవ ప్రదర్శన కనబరిచారు.దీంతో జట్టు కష్టాల్లో కూరుకుపోగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64)తో ఆదుకున్నాడు. సీనియర్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ 33 పరుగులతో రాణించాడు. దీంతో అఫ్గాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ 10 పరుగులు చేసి.. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 22 బంతుల్లోనేఅఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్ కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీకి చేరువవుతున్న వేళ మహ్మద్ నబీ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42) రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 8, తిలక్ వర్మ 3 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 13.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 157 పరుగులు సాధించి టార్గెట్ పూర్తి చేసింది. తద్వారా అఫ్గాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.చదవండి: Asia Cup 2026 Final: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్𝐓𝐇𝐈𝐒 𝐊𝐈𝐍𝐃 𝐎𝐅 𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆. 🤌💥When Abhishek Sharma gets going, the bat does the talking. 🔥Watch #AFGvIND 1st T20I, LIVE NOW on Sony Sports Ten 5 & Sony MAX.#SonySportsNetwork #SonyMAX #ExtraaaInnings pic.twitter.com/aLu13MB9JF— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
Asia Cup 2026 Final: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్
భారత యువ క్రికెటర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ మహిళల టోర్నమెంట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్గా నిలిచింది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో ఆదివారం నాటి ఆసియా టీ20 కప్-2026 ఫైనల్ సందర్భంగా 22 ఏళ్ల షఫాలీ వర్మ ఈ ఘనత సాధించింది.శ్రీలంతో టైటిల్ పోరులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆది నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్ షఫాలీ వర్మ 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. అయితే, భారత ఇన్నింగ్స్లో చముడి ప్రబోద బౌలింగ్లో పదమూడో ఓవర్ ఐదో బంతికి.. చమరి ఆటపట్టుకు క్యాచ్ ఇవ్వడంతో షఫాలీ అవుటైంది.షఫాలీతో పాటు స్మృతి కూడామొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న షఫాలీ వర్మ 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తొలి వికెట్గా వెనుదిరిగింది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక మరో ఓపెనర్ స్మృతి మంధాన కూడా హాఫ్ సెంచరీ (39 బంతుల్లో 59) సాధించింది.భారత్ స్కోరు ఎంతంటే?మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 14 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ 17 పరుగులు చేసింది. ఆఖర్లో కమలిని 5 బంతుల్లో 15 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్.. 183 పరుగులు చేసింది.శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, కెప్టెన్ చమరి ఆటపట్టు, చముడి ప్రబోద తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.మహిళల ఆసియా టీ20 కప్ టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు👉షఫాలీ వర్మ- 24 బంతుల్లో- దుబాయ్ వేదికగా 2026లో శ్రీలంక మీద👉స్మృతి మంధాన- 25 బంతుల్లో- సెల్హైట్ వేదికగా 2022లో శ్రీలంక మీద👉రిచా ఘోష్- 26 బంతుల్లో- దంబుల్లా వేదికగా 2024లో యూఏఈ మీద👉షఫాలీ వర్మ- 26 బంతుల్లో- దంబుల్లా వేదికగా 2024లో నేపాల్ మీద👉షఫాలీ వర్మ- 26 బంతుల్లో- దుబాయ్ వేదికగా 2026లో థాయ్లాండ్ మీద.చదవండి: అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనతShafali Verma is accelerating and we're just getting started! 🔥Watch #INDvSL in the Final of the #DPWorldWomensAsiaCup2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #NotAGentlemansGame pic.twitter.com/u0js1RtZWo— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనత
అఫ్గానిస్తాన్తో తొలి టీ20తో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన ఈ పేస్గుర్రం.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొంది పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలో ఫిట్నెస్ పరీక్ష పాసైన బుమ్రా ఆదివారం నాటి మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు.ఇక ఢిల్లీ వేదికగా టీమిండియాకు అఫ్గాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.రెండో బంతికే వికెట్ఈ క్రమంలో బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన బుమ్రా వైడ్తో ఆరంభించినప్పటికీ.. రెండో బంతికే అఫ్గాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ను అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి గుర్బాజ్ డకౌట్గా వెనుదిరిగాడు.కాగా టీ20 ఫార్మాట్లో బుమ్రాకు ఇది 350 వికెట్ కావడం విశేషం. తద్వారా పొట్టి క్రికెట్లో 350 వికెట్ల క్లబ్లో చేరిన మూడో భారత బౌలర్గా ఈ రైటార్మ్ పేసర్ నిలిచాడు. అంతకు ముందు స్పిన్నర్ యజువేంద్ర చహల్, పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ ఘనత సాధించారు.టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్లుయజువేంద్ర చహల్- 396 వికెట్లు (హర్యానా, టీమిండియా, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ )భువనేశ్వర్ కుమార్- 363 వికెట్లు (ఉత్తరప్రదేశ్, టీమిండియా, ఇండియా-ఎ, పూణే వారియర్స్, ఆర్సీబీ, సన్రైజర్స్, )జస్ప్రీత్ బుమ్రా - 350 వికెట్లు* (గుజరాత్, టీమిండియా, ముంబై ఇండియన్స్).అఫ్గాన్ స్కోరు ఎంతంటేఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) విఫలమయ్యాడు. మిగతా వారిలో సెదీకుల్లా అటల్ (13) నిరాశపరచగా.. గుల్బదిన్ నైబ్ (2), డార్విష్ రసూలీ (2) తేలిపోయారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64) చేయగా.. మహ్మద్ నబీ 33 పరుగులతో రాణించాడు. దీంతో అఫ్గాన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తికి తలా ఒక వికెట్ దక్కింది. చదవండి: షఫాలీ మెరుపు హాఫ్ సెంచరీ𝐓𝐰𝐨 𝐛𝐚𝐥𝐥𝐬 𝐢𝐧𝐭𝐨 𝐡𝐢𝐬 𝐫𝐞𝐭𝐮𝐫𝐧 𝐚𝐧𝐝 𝐁𝐎𝐎𝐌! 💥Jasprit Bumrah gets the extra bounce, Abhishek Sharma completes the catch, and Rahmanullah Gurbaz has to walk!Watch #AFGVIND 1st T20I LIVE NOW on Sony Sports Ten 5 & Sony MAX.#SonySportsNetwork #SonyMax… pic.twitter.com/AKLHpuipyB— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
Asia Cup 2026 Final: షఫాలీ, స్మృతి ఫిఫ్టీలు.. కమలిని మెరుపులు
దుబాయ్ వేదికగా మహిళల ఆసియా టీ20 కప్ -2026 టోర్నమెంట్ ఫైనల్లో భారత్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్.. శ్రీలంకను బౌలింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 59), షఫాలీ వర్మ (39 బంతుల్లో 68) అర్ధ శతకాలతో అలరించారు. మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 14, రిచా ఘోష్ 17 పరుగులు చేయగా.. ఆఖర్లో కమలిని మెరుపులు (5 బంతుల్లో 15 నాటౌట్) మెరిపించింది. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, కెప్టెన్ చమరి ఆటపట్టు, చముడి ప్రబోద తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.UPDATES👉నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసిన భారత్👉పందొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 167-5👉18.5వ ఓవర్: మిథాలి బౌలింగ్లో భారతి ఫుల్మలి బంతిని ఎదుర్కోగా.. సింగిల్ తీసే క్రమంలో దీప్తి (5) రనౌట్ అయింది. దీంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. కమలిని క్రీజులోకి వచ్చింది. భారతి ఒక పరుగుతో ఉంది.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్👉18.4వ ఓవర్: మిథాలి అయోధ్య బౌలింగ్లో సబ్స్టిట్యూట్ కావ్యా కవిందికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హర్మన్ (14). భారతి ఫుల్మలి క్రీజులోకి రాగా.. దీప్తి 5 పరుగులతో ఉంది. స్కోరు: 166-4👉పద్దెనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 163-3దీప్తి 2, హర్మన్ 14 పరుగులతో ఉన్నారు.👉మూడో వికెట్ కోల్పోయిన భారత్17.1వ ఓవర్: ఆటపట్టు బౌలింగ్లో కవిశా దిల్హరికి క్యాచ్ ఇచ్చిన రిచా ఘోష్ (17). దీప్తి శర్మ క్రీజులోకి వచ్చింది.👉పదిహేడు ఓవర్లలో భారత్ స్కోరు: 160-2రిచా 17, హర్మన్ 13 పరుగులతో ఉన్నారు. 👉పదహారు ఓవర్లలో భారత్ స్కోరు: 147-2రిచా 5, హర్మన్ 12 పరుగులతో ఉన్నారు.👉పదిహేను ఓవర్లలో భారత్ స్కోరు: 140-2రిచా 3, హర్మన్ 7 పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన భారత్13.4వ ఓవర్: చమరి ఆటపట్టు బౌలింగ్లో హర్మన్ పరుగు తీసే క్రమంలో స్మృతితో సమన్వయ లోపం కారణంగా స్మృతి రనౌట్ (39 బంతుల్లో 59) అయింది. రిచా ఘోష్ క్రీజులోకి రాగా.. హర్మన్ 3 పరుగులతో ఉంది. 14 ఓవర్లలో స్కోరు: 134-2.👉షఫాలీ వర్మ అవుట్12.5వ ఓవర్: చముడి ప్రబోద బౌలింగ్లో చమరి ఆటపట్టుకు క్యాచ్ ఇచ్చిన షఫాలీ (68) తొలి వికెట్గా వెనుదిరిగింది. స్కోరు: 130-1 (13). హర్మన్ప్రీత్ కౌర్ క్రీజులోకి రాగా.. స్మృతి 58 పరుగులతో ఉంది.👉పన్నెండు ఓవర్లలో భారత్ స్కోరు: 121-0షఫాలీ 67, స్మృతి 51 పరుగులతో ఉన్నారు.👉పదకొండు ఓవర్లలో భారత్ స్కోరు: 113-0👉స్మృతి హాఫ్ సెంచరీషఫాలీ 61 పరుగులతో ఉండగా.. స్మృతి మంధాన 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకుంది.👉పది ఓవర్లలో భారత్ స్కోరు: 98-0స్మృతి 38, షఫాలీ 59 పరుగులతో ఉన్నారు.తొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 91-0👉స్మృతి 32, షఫాలీ 58 పరుగులతో ఉన్నారు.👉24 బంతుల్లోనే షఫాలీ అర్ధ శతకం.. అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఆమెకు ఇది 21వ హాఫ్ సెంచరీ.👉ఎనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 78-0షఫాలీ 25 బంతుల్లో 53, స్మృతి మంధాన 23 బంతుల్లో 24 పరుగులతో ఉన్నారు.👉ఏడు ఓవర్లలో భారత్ స్కోరు: 69-0షఫాలీ 48, స్మృతి 21 పరుగులతో ఉన్నారు.👉పవర్ ప్లేలో భారత్ స్కోరు: 57-0 (6 ఓవర్లు)షఫాలీ 19 బంతుల్లో 38 పరుగులతో జోరు మీదుండగా.. స్మృతి 17 బంతుల్లో 19 పరుగులు చేసింది.👉ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 56-0షఫాలీ 37, స్మృతి 19 పరుగులతో ఉన్నారు.👉నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 35-0షఫాలీ 18, స్మృతి 17 పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు👉మూడు ఓవర్లలో భారత్ స్కోరు: 29-0👉రెండు ఓవర్లలో భారత్ స్కోరు: 18-0తొలి ఓవర్లో ఐదు పరుగులేమిథాలి అయోధ్య పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ తొలి ఓవర్లో ఐదు పరుగులే చేసింది. ఓపెనర్లలో స్మృతి మంధాన తొలి బంతికే ఫోర్ బాది ఖాతా తెరవగా.. షఫాలీ సున్నా పరుగులతో ఉంది.తుదిజట్టులో మార్పుటైటిల్ పోరు కోసం తమ తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు హర్మన్ టాస్ సందర్భంగా వెల్లడించింది. ప్రతికా రావల్కు విశ్రాంతినిచ్చామన్న హర్మన్.. యువ ప్లేయర్ కమలినిని ఆడిస్తున్నట్లు తెలిపింది. కాగా ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పటి వరకు ఏడుసార్లు చాంపియన్గా నిలిచింది. మరోవైపు.. గత ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన శ్రీలంక.. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తోంది. అయితే, గత ఎడిషన్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని హర్మన్ సేన పట్టుదలగా ఉంది. దీంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది.తుదిజట్లుభారత మహిళల జట్టుస్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణలన్ కమిలిని, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమా రావత్, శ్రీచరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మ.శ్రీలంక మహిళల జట్టుచమరి ఆటపట్టు (కెప్టెన్), ఇమేషా దులాని, విష్మి గుణరత్నె, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశా దిల్హరి, నీలాక్షిక సిల్వ, కౌశిని నుత్యాంగన (వికెట్ కీపర్), సుగందిక కుమారి, చముడి ప్రబోద, మిథాలి అయోధ్య.చదవండి: అఫ్గాన్తో తొలి టీ20.. తుదిజట్టులో వైభవ్కు దక్కని చోటు -
భారత బౌలర్ల విజృంభణ.. అఫ్గాన్ నామమాత్రపు స్కోరు
అఫ్గానిస్తాన్తో తొలి టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన అ ప్గాన్ భారత బౌలర్లు విజృంభించడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కాగా భారత్ వేదికగా అఫ్గాన్ బోర్డు.. టీమిండియాకు మూడు మ్యాచ్ల సిరీస్కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.UPDATES:ఇరవై ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 156-8ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) నిరాశపరిచాడు. మిగిలిన వారిలో సెదీకుల్లా అటల్ 13 పరుగులు చేయగా.. గుల్బదిన్ నైబ్ (2), డార్విష్ రసూలీ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64) చేయగా.. మహ్మద్ నబీ 33 పరుగులతో రాణించాడు. ఫలితంగా అఫ్గాన్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు.పదిహేను ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 104-5అజ్మతుల్లా 33, నబీ 26 పరుగులతో ఉన్నారు.సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి అఫ్గాన్ స్కోరు: 56-5 (10)అజ్మతుల్లా ఒమర్జాయ్ 10, నబీ 4 పరుగులతో ఉన్నారు. అంతకు ముందు ఏడో ఓవర్ ఆఖరి బంతికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో డార్విష్ రసూలీ (2) బౌల్డ్ అయి ఐదో వికెట్గా వెనుదిరిగాడు.పవర్ ప్లేలో అఫ్గాన్ స్కోరు: 41-4 (6 ఓవర్లు)ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ను జస్ప్రీత్ బుమ్రా డకౌట్ చేయగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) రనౌట్ అయ్యాడు. వన్డౌన్ బ్యాటర్ సెదీకుల్లా అటల్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. గుల్బదిన్ నైబ్ ఆరు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో నాలుగో వికెట్గా వెనుదిరిగాడు.టాస్ గెలిచిన టీమిండియా.. వైభవ్ ఆడటం లేదుఇక టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. ఢిల్లీ వికెట్ మీద తొలుత బౌలింగ్ చేస్తే అనుకూలంగా ఉంటుంది. జింబాబ్వే పర్యటనలో మాకెన్నో సానుకూల అంశాలు కనిపించాయి. ఇక్కడా అదే జోరు కొనసాగిస్తాం. అయితే, వైభవ్ సూర్యవంశీ ఆడటం లేదు’’ అని తెలిపాడు.తిరిగి వచ్చిన సంజూకాగా జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా వచ్చిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. ఈ సిరీస్లో భారత్ 3-0తో జింబాబ్వేను క్లీన్స్వీప్ చేయగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును వైభవ్ గెలుచుకున్నాడు. అయితే, అఫ్గాన్తో సిరీస్తో సంజూ తిరిగి రావడంతో వైభవ్కు తుదిజట్టులో చోటు కరువైంది. ఇదిలా ఉంటే.. గాయాల నుంచి కోలుకున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులోకి వచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు మాత్రం ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు.తుదిజట్లుభారత్సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.అఫ్గానిస్తాన్ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదీకుల్లా అటల్, డార్విష్ రసూలి, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారూకీ.చదవండి: పంత్వి పిల్లాడి చేష్టలు: సంజీవ్ గోయెంకా -
పిల్లాడి చేష్టలు!.. పంత్పై వేటు.. తొలిసారి స్పందించిన యజమాని
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా వ్యవహరించిన టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్కు చేదు అనుభవమే మిగిలింది. ఇటు బ్యాటర్గా.. అటు సారథిగా అతడు పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే.ఈ ఏడాది ఐపీఎల్లో 13 ఇన్నింగ్స్ ఆడిన పంత్ 312 పరుగులే చేశాడు. ఇక అతడి సారథ్యంలో లక్నో పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదోస్థానంలో నిలిచింది. అదే విధంగా.. గతేడాది కూడా పంత్ విఫలమైన విషయం తెలిసిందే.ఐపీఎల్-2025లో పంత్ పద్నాలుగు మ్యాచ్లలో కలిపి కేవలం 269 పరుగులకే పరిమితం కాగా.. లక్నో పద్నాలుగింట ఆరు మ్యాచ్లే గెలిచి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇలా రెండు సీజన్లలో దారుణ ప్రదర్శన కనబరిచిన పంత్పై లక్నో యాజమాన్యం వేటు వేసింది. కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించింది.అంతేకాదు.. 2025 వేలంలో రికార్డు స్థాయిలో లీగ్లోనే అత్యధిక ధరకు రూ. 27 కోట్లకు పంత్ను కొనుగోలు చేసిన లక్నో.. 2027 వేలానికి ముందే అతడిని రూ. 15 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్కు ట్రేడ్ చేసుకుంది. ఈ నేపథ్యంలో.. పంత్ను పదిహేనేళ్ల పాటు తమతో కొనసాగిస్తామన్న లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కేవలం రెండు సీజన్లకే అతడిని వదిలించుకోవడం చర్చనీయాంశమైంది.అంతేకాదు జట్టు ఓడిన సందర్భాల్లో మైదానంలోనే పంత్కు గోయెంకా క్లాస్ పీకడం చూసి.. 2024లో కేఎల్ రాహుల్ మాదిరే ఈసారి పంత్ను బలిచేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంజీవ్ గోయెంకా తాజాగా మౌనం వీడాడు.శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘నాకు పంత్ అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. అతడిలో కుర్రతనం ఇంకా పోలేదు. పంత్ది చిన్నపిల్లాడి మనస్తత్వం. అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి ఆలింగనం చేసుకుంటాడు. ప్రాంక్ చేస్తుంటాడు. చిన్న పిల్లల మాదిరే అతడి చేష్టలు ఉంటాయి. అతడంటే నాకు అభిమానం’’ అని సంజీవ్ గోయెంకా పేర్కొన్నాడు.ఈ క్రమంలో పంత్తో ట్రేడింగ్ గురించిన సంభాషణే ఆఖరిదా? అని హోస్ట్ ప్రశ్నించగా.. ‘‘కేవలం ట్రేడ్ గురించి మాత్రమే మేము మాట్లాడుకోలేదు. ఆ తర్వాత కూడా మా మధ్య మాటలు కొనసాగాయి. అతడికి గుడ్ లక్. త్వరలోనే డిన్నర్కి కలవాలనే ప్రణాళిక ఉంది’’ అని సంజీవ్ గోయెంకా చెప్పుకొచ్చాడు. తద్వారా వృత్తి, వ్యాపారపరంగానే పంత్ విషయంలో తాను కఠిన నిర్ణయం తీసుకున్నానని.. వ్యక్తిగతంగా తమ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే గోయెంకా సంకేతాలు ఇచ్చాడు. కాగా పంత్ను రూ. 15 కోట్లకు ఢిల్లీకి ట్రేడ్ చేసిన లక్నో.. అక్కడి నుంచి కుల్దీప్ యాదవ్ను రూ. 13.5 కోట్లకు తెచ్చుకుంది. -
PhD స్టూడెంట్తో పెళ్లి బంధంలోకి క్రికెటర్
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి, జీవిత భాగస్వామిగా కొనసాగుతున్న ఎమిలీ రెడ్వుడ్ను సెప్టెంబరు 4న వివాహమాడాడు. ఈ విషయాన్ని గ్రీన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.ఈ సందర్భంగా తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన గ్రీన్.. ‘‘భార్యాభర్తలుగా సెప్టెంబరు 4న ఇలా’’ అంటూ లవ్ ఎమోజీని జతచేశాడు. ఈ క్రమంలో కొత్త జంట గ్రీన్- ఎమిలీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్లుగా సహ జీవనంగ్రీన్- ఎమిలీ ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు ఆసీస్ మీడియా వెల్లడించింది. ఇక గతేడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. తాజాగా అత్యంత సన్నిహితులు, బంధువుల నడుమ పెళ్లి చేసుకున్నారు. పెర్త్లో జరిగిన తమ వివాహ వేడుకలో గ్రీన్ నల్ల రంగు టక్సిడోలో మెరిసిపోగా.. ఎమిలి తెల్లటి గౌనులో తళుక్కుమంది.ఎవరీ ఎమిలి?ఎమిలీ వృత్తి రీత్యా డైటీషియన్, న్యూట్రీషియన్. ఆమె వైద్య రంగంలో పీహెచ్డీ కూడా చేస్తున్నట్లు సమాచారం. గ్రీన్ కిడ్నీ సమస్యతో బాధపడినపుడు ఎమిలీ దగ్గరుండి అతడిని చూసుకున్నట్లు తెలుస్తోంది.కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న వేళ కూడా ఎమిలీ గ్రీన్కు మద్దతుగా నిలిచింది. గత ఐదారేళ్లుగా ఇలా ఒకరికి ఒకరై జీవిస్తున్న గ్రీన్- ఎమిలీ తమ బంధాన్ని చట్టబద్ధంగా ముందుకు తీసుకువెళ్లారు.ఆసీస్ తరఫున కెరీర్ ఇలాఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్.. 2020లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఈ 27 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. 39 టెస్టులు, 37 వన్డేలు, 28 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 1920, వన్డేల్లో 946, టీ20లలో 638 పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.అదే విధంగా.. ఈ రైటార్మ్ పేసర్ ఖాతాలో టెస్టుల్లో 39, వన్డేల్లో 21, టీ20లలో 14 వికెట్లు ఉన్నాయి. ఇక ఇప్పటికి 43 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన గ్రీన్.. 1029 పరుగులు చేయడంతో పాటు.. 23 వికెట్లు కూల్చాడు.ఐపీఎల్ వేలం-2026లో కోల్కతా నైట్ రైడర్స్ అత్యధికంగా రికార్డు ధర రూ. 25.20 కోట్లకు కామెరాన్ గ్రీన్ను కొనుగోలు చేయగా.. అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 14 మ్యాచ్లు ఆడి 322 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు పడగొట్టాడు.చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే? -
అన్నా.. ఇది కల కాదు కదా! విజయ్ శంకర్ '3డి' విధ్వంసం
యూరోపియన్ టీ20 ప్రిమియర్ లీగ్ గ్లాస్గో కాస్మిక్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శనివారం డబ్లిన్ వేదికగా జరిగిన మ్యాచ్లో డబ్లిన్ గార్డియన్స్ గ్లాస్గో కాస్మిక్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన డబ్లిన్ గార్డియన్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులు చేసింది. జేమ్స్ విన్స్, డేవిడ్ విల్లీ, హ్యారీ టెక్టర్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట.. భారత మాజీ క్రికెటర్ విజయ్ శంకర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి శంకర్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు. 3 సిక్స్లతో 67 పరుగులు చేశాడు. అతడి వీరోచిత పోరాటం ఫలితంగా డబ్లిన్ ప్రత్యర్ధి ముందు ఫైటింగ్ టోటల్ను ఉంచగల్గింది. విజయ్ శంకర్ బ్యాటింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అన్నా.. ఇది కల కాదు కాదా? అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కాగా భారత క్రికెట్తో పూర్తి తెగదింపులు చేసుకున్న శంకర్.. ప్రస్తుతం విదేశీ లీగ్ల్లో ఆడుతున్నాడు. ఇక గ్లాస్గో బౌలర్లలో అలీ ఖాన్ నాలుగు, టైమల్ మిల్స్ మూడు వికెట్లు పడగొట్టారు.మున్సీ మెరుపులుఅనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని గ్లాస్కో.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ జార్జ్ మున్సీ(33 బంతుల్లో 50) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అతడితో పాటు ఫిన్ అలెన్(30), లివింగ్స్టోన్)29) రాణించారు. గ్లాస్గో విజయం సాధించడంతో విజయ్ శంకర్ వీరోచిత ఇన్నింగ్స్ వృథా అయిపోయింది.Shankar turning it on in the #ETPL 💥 pic.twitter.com/vHr3zsMwKf— European T20 Premier League (ETPL) (@etplofficial) September 12, 2026 -
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్లు?
ఈ నెలఖారులో వెస్టిండీస్తో ప్రారంభం కానున్న వన్డే, టీ20 సిరీస్కు భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించే అవకాశముంది. అయితే మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసియా క్రీడల కోసం జపాన్కు వెళ్లనుండడంతో అతడి స్దానంలో గైక్వాడ్ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్-వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుండగా.. అదే సమయంలో భారత మరో జట్టు ఆసియా క్రీడల్లో బిజీగా ఉండనుంది. ఒకే సమయంలో రెండు వేర్వేరు టోర్నీలు జరుగుతుండటంతో జట్ల ఎంపిక సెలక్టర్లకు పెద్ద సవాలుగా మారింది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ వంటి కీలక ప్లేయర్లు ఏషియన్ గేమ్స్ కారణంగా విండీస్తో వన్డేలకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ బుమ్రా ఆసియా క్రీడల్లో పాల్గొనకపోతే కచ్చితంగా విండీస్ సిరీస్లో ఆడుతాడు. రుతురాజ్ చివరగా డిసెంబర్ 2025లో దక్షిణాఫ్రికాపై భారత తరపున ఆడాడు. ఈ మ్యాచ్లో సెంచరీ సాధించినప్పటికి, జట్టులో పోటీ కారణంగా అతడు చోటు కోల్పోయాడు.సీనియర్ జట్టులో లేకపోయినా భారత 'ఎ' జట్టులో మాత్రం రెగ్యులర్ సభ్యునిగా రుతురాజ్ ఉన్నాడు. ఆస్ట్రేలియా 'ఎ'తో జరగనున్న అనాధికరిక వన్డే సిరీస్లో ఇండియా-ఎ కెప్టెన్గా గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. ఇక గైక్వాడ్తో పాటు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా తిరిగి వన్డే జట్టులోకి రానున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్కు బ్యాకప్గా అతడిని తీసుకోవాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఆసియాకప్, విండీస్ వన్డే షెడ్యూల్సెప్టెంబర్ 27: విండీస్తో తొలి వన్డేసెప్టెంబర్ 28: ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్సెప్టెంబర్ 30: గౌహతిలో విండీస్తో రెండో వన్డేఅక్టోబర్ 1: ఆసియా క్రీడల సెమీ-ఫైనల్అక్టోబర్ 3: విండీస్తో మూడో వన్డే.. అదే రోజు ఆసియా క్రీడల స్వర్ణ, కాంస్య పతకాల మ్యాచ్లుచదవండి: హెడ్కోచ్గా సౌరవ్ గంగూలీ.. బ్యాటింగ్ కోచ్గా యువరాజ్! -
హెడ్కోచ్గా సౌరవ్ గంగూలీ.. బ్యాటింగ్ కోచ్గా యువరాజ్!
ఐపీఎల్-2027 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచింగ్ స్టాప్లో సమూల మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా సేవలందిస్తున్న సౌరవ్ గంగూలీ.. వచ్చే సీజన్లో ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.గతంలో ఢిల్లీ మెంటార్గా వ్యవహరించిన గంగూలీ, ఇప్పటివరకు ఐపీఎల్లో హెడ్కోచ్గా పనిచేయలేదు. కాగా తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ వచ్చే ఎడిషన్కు సపోర్ట్ స్టాఫ్ను మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గంగూలీతో పాటు మరికొంత మంది దిగ్గజాలను బ్యాక్రూమ్ స్టాప్లోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.బ్యాటింగ్ కోచ్గా యువీ!టీమిండియా మాజీ ఆల్రౌండర్కు బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో యువీ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తన అనుభవాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కోసం ఉపయోగించనున్నారు.శ్రీలంక దిగ్గజ పేసర్ చమింద వాస్ బౌలింగ్ కోచ్గా నియమితులయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో 355 టెస్టు, 400 వన్డే వికెట్లు పడగొట్టిన వాస్కు లంక జాతీయ జట్టుతో పాటు పలు ఫ్రాంచైజీలకు కోచ్గా పనిచేసిన అనుభవం ఉంది. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచిన మిశ్రాను స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించనున్నట్లు తెలుస్తోంది.భారతీయ పిచ్లు, కండిషన్స్పై ఆయనకు మెండుగా అనుభవం ఉంది. భారత క్రికెట్కు దశాబ్దాల పాటు సేవలందించిన ఈ దిగ్గజాల రాకతోనైనా ఢిల్లీ క్యాపిటల్స్ రాతను మారుస్తుందేమో చూడాలి.చదవండి: IND vs AFG: 'వైభవ్ అంటే భయం లేదు.. మా ప్లాన్స్ మాకున్నాయి' -
'వైభవ్ అంటే భయం లేదు.. మా ప్లాన్స్ మాకున్నాయి'
భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ పోరుకు సమయం అసన్నమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ షురూ కానుంది. అయితే, ఈ మ్యాచ్లో అందరి కళ్లు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. గత జింబాబ్వే సిరీస్లో ధనాధన్ బ్యాటింగ్తో దుమ్ములేపిన వైభవ్.. ఇప్పుడు సొంత గడ్డపై ఎలా రాణిస్తాడా? అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వైభవ్ గురించి అఫ్గానిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని కట్టడి చేయడానికి తమ జట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని, అతడి వికెట్ సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని జద్రాన్ స్పష్టం చేశాడు.కాగా సూర్యవంశీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరపున వైభవ్ సంచలన ప్రదర్శన చేశాడు. 5 ఇన్నింగ్స్లలో అతను మొత్తం 192 పరుగులు చేశాడు. రెడ్-బాల్ క్రికెట్లో తన ప్రతిభను చాటిన ఈ యువ సంచలనం.. ఇప్పుడు తనకు కలిసొచ్చిన టీ20 ఫార్మాట్లో మెరుపులు మెరిపించేందుకు సిద్దమయ్యాడు."వైభవ్ సూర్యవంశీ అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు. ఐపీఎల్లోనే కాకుండా వివిధ స్థాయిలలో ఆడుతూ ఇప్పటికే తన టాలెంట్ను నిరూపించుకున్నాడు. అతడి బ్యాటింగ్ గురించి మా జట్టులో విస్తృతంగా చర్చించాం. మా జట్టులోని కొందరు ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉన్నవారు కావడంతో.. వైభవ్ బలాలు, బలహీనతలపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది.అంతేకాకుండా అతడి బ్యాటింగ్ వీడియోలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. అతడిని త్వరగా అవుట్ చేసేందుకు మా వ్యూహాలను సిద్ధం చేసుకున్నాం" అని జద్రాన్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! వెస్టిండీస్లో? -
సన్రైజర్స్ ఆటగాడి మహోగ్రరూపం.. 7 ఫోర్లు, 10 సిక్స్లతో విధ్వంసం
షేర్-ఈ-పంజాబ్ టీ20 లీగ్లో లూధియానా లయన్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం మొహాలీ స్టేడియం వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో జలంధర్ వారియర్స్పై 17 పరుగుల తేడాతో విజయం సాధించిన లూథియనా.. తొలిసారి తుది పోరుకు అర్హత సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు, లూథియానా కెప్టెన్ సైల్ ఆరోరా విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో ఆరోరా కేవలం 50 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న ఆరోరా 7 ఫోర్లు, 10 సిక్స్లతో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మాధవ్ సింగ్(22 బంతుల్లో 42) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.బాస్కర్ మ్యాజిక్అనంతరం లక్ష్య చేధనలో జలంధర్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. జలంధర్ కెప్టెన్ ప్రభ్సిమ్రన్ సింగ్( 35 బంతుల్లో 63 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. రైట్ ఆర్మ్ పేసర్ సాహిల్ బాస్కర్ బంతితో మ్యాజిక్ చేశాడు. బాస్కర్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! వెస్టిండీస్లో?Salil Arora scored Century in Sher E Punjab league Semi Final🧡💪🏻Took his team from 27-3(4.2) to 220-5(20) batting at No. 03 scored 120(56)* pic.twitter.com/C9QMXqVxTY— Neil🔪 (@PsychDominant) September 12, 2026 -
టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! వెస్టిండీస్లో?
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ హర్లీన్ డియోల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు డియోల్ సిద్దమైంది. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ 'బార్బడోస్ రాయల్స్' జట్టుతో ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చండీగఢ్ క్రికెటర్ ఇప్పటికే బార్బడోస్ చేరుకుంది.కాగా 28 ఏళ్ల హర్లీన్ డియోల్ సీనియర్ భారత జట్టులో గానీ, 'ఇండియా ఎ' జట్టులో గానీ సభ్యురాలు కాకపోవడంతో ఈ టోర్నమెంట్ మొత్తానికి అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ సీపీఎల్లో మొత్తం ఐదుగురు భారత మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు.హర్లీన్ డియోల్, కిరణ్ నవ్గిరే, పూజా వస్త్రాకర్లు బార్బడోస్ రాయల్స్లో భాగం కాగా.. శిఖా పాండే, యస్తికా భాటియా ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నారు. డియోల్ భారత్ తరఫున 28 టీ20 మ్యాచ్లలో 92.01 స్ట్రైక్ రేట్తో 311 పరుగులు చేసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆమె చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది. అయితే డబ్ల్యూపీఎల్లో మంచి రికార్డు ఉన్న హర్లీన్, 28 మ్యాచ్లలో 649 పరుగులు సాధించింది.చదవండి: యూఎస్ ఓపెన్ విజేతగా రైబాకినా -
టి20ల్లో జోరు కొనసాగించేందుకు...
ఒక వైపు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ప్రాధాన్యత నేపథ్యంలో వరుసగా టెస్టు మ్యాచ్లు... ఏడాది కాలంలో వన్డే వరల్డ్ కప్ ఉండటంతో జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపికపై వ్యూహాలు... వీటి మధ్య ఇప్పుడు కాస్త ఆటవిడుపుగా భారత జట్టు టి20 మ్యాచ్లకు సన్నద్ధమైంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వేలలో టి20 సిరీస్లు ఆడి వచ్చిన భారత్ ఇప్పుడు స్వదేశంలో అఫ్గానిస్తాన్తో పోరుకు సై అంటోంది. అయితే మూడు మ్యాచ్లకు వేదిక భారత రాజధాని అయినా... అధికారికంగా ఈ సిరీస్కు అఫ్గానిస్తాన్ బోర్డు ఆతిథ్యం ఇస్తోంది. న్యూఢిల్లీ: భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు ఫిరోజ్షా కోట్లా మైదానంలో తొలి పోరుకు రంగం సిద్ధమైంది. బలాబలాలను బట్టి చూస్తే ప్రత్యర్థికంటే భారత్ అన్ని విధాలా పటిష్టంగా ఉంది. కెప్టెన్గా రెండు సిరీస్లు కోల్పోయిన తర్వాత జింబాబ్వేతో సిరీస్ విజయాన్ని అందుకున్న శ్రేయస్ అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. అన్నింటికి మించి హార్దిక్ పాండ్యా మినహా టీమిండియా రెగ్యులర్ ఆటగాళ్లతో పూర్తి స్థాయి జట్టుగా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా గాయంనుంచి కోలుకొని పునరాగమనం చేస్తున్న బుమ్రాపై అందరి దృష్టీ నిలిచింది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడు సంచలనాలతో సత్తా చాటిన అఫ్గాన్ టీమ్ ఇక్కడా తమదైన ముద్ర చూపించాలని పట్టుదలగా ఉంది. పలువురు ఐపీఎల్ ఆటగాళ్లు తమ జట్టులో ఉండటం కూడా అఫ్గాన్కు కొంత సానుకూలాంశం. ఈ సిరీస్లో ఆడుతున్న భారత జట్టే జపాన్లో జరిగే ఆసియా క్రీడలకు కూడా వెళుతుంది. రెండో ఓపెనర్ ఎవరు? ఈ సిరీస్లో ఒకే ఒక ప్రశ్న ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ ముందు నిలిచింది. అభిషేక్ శర్మతో పాటు రెండో ఓపెనర్గా సంజు సామ్సన్, వైభవ్ సూర్యవంశీలలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్తో సామ్సన్ 2 మ్యాచ్లు, ఇంగ్లండ్పై తొలి మ్యాచ్ ఆడిన తర్వాత అతడిని తప్పించి వరుసగా మూడు మ్యాచ్లలో వైభవ్ను ఆడించారు. ఆపై చివరి మ్యాచ్కు మళ్లీ సామ్సన్ జట్టులోకి రాగా... జింబాబ్వేతో సామ్సన్ లేకపోవడంతో వైభవ్ మూడు మ్యాచ్లూ ఆడాడు.ఇప్పుడు ఇద్దరు అందుబాటులో ఉన్నారు.దులీప్ ట్రోఫీలో చెలరేగిన ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఫార్మాట్కు తగినట్లుగా తమ బ్యాటింగ్ శైలిని మార్చుకొని చెలరేగేందుకు ఉత్సాహంగా ఉన్నారు. బ్యాటింగ్పరంగా జింబాబ్వేలో ఆశించిన ప్రభావం చూపలేకపోయిన కెప్టెన్ అయ్యర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు రెగ్యులర్ పేసర్లతో బరిలోకి దిగనుండగా, పేస్ ఆల్రౌండర్గా నితీశ్కుమార్ రెడ్డి అందుబాటులో ఉన్నాడు. రషీద్పై ఆశలు... భారత గడ్డపై ఆడటం అఫ్గానిస్తాన్ ఆటగాళ్లకు కొత్త కాదు. ఇక్కడి పరిస్థితులపై వారికి మంచి అంచనా ఉంది. ముఖ్యంగా రషీద్ ఖాన్ ఐపీఎల్లో చూపించిన ప్రభావం అసాధారణం. వన్డేల్లో రషీద్ బౌలింగ్లో పదును కనిపించకపోయినా, టి20ల్లో అతను ఎప్పుడైనా ప్రమాదకారి. గుర్బాజ్, నబీ, అజ్మతుల్లా, ముజీబ్, నూర్, నవీన్, ఫారుఖీ వంటి ఐపీఎల్ ఆటగాళ్లతో జట్టు నిండి ఉంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్పై ఉదాసీనత ప్రదర్శిస్తే టీమిండియాకు ఇబ్బంది ఎదురు కావచ్చు. కొత్త కెప్టెన్ ఇబ్రహీమ్ నాయకత్వంలో టీమ్ ఈ సిరీస్కు సిద్ధమైంది.9 భారత్, అఫ్గానిస్తాన్ మధ్య 9 టి20లు జరగ్గా... భారత్ 7 గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా, మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. అఫ్గాన్ ఇప్పటి వరకు ఓడించని పెద్ద జట్లు భారత్ మాత్రమే.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: శ్రేయస్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్/ వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్, అక్షర్, సుందర్, నితీశ్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్. అఫ్గానిస్తాన్: ఇబ్రహీమ్ (కెప్టెన్), గుర్బాజ్, నైబ్, సాదిఖుల్లా, రసూలీ, అజ్మతుల్లా, నబీ, రషీద్, ముజీబ్, నూర్, ఫారూఖీ/ నవీన్. -
మహిళల ఆసియాకప్ ఫైనల్లో నేడు శ్రీలంకతో భారత్ ఢీ
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో ఎదురులేకుండా సాగుతున్న భారత జట్టు... నేడు శ్రీలంకతో ఫైనల్కు సిద్ధమైంది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఈ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడుసార్లు ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియా... ఎనిమిదో టైటిల్పై గురి పెట్టింది. గత ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకున్న టీమిండియా... ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి... సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. మరోవైపు శ్రీలంక కూడా గ్రూప్ దశలో అన్నీ మ్యాచ్లు నెగ్గి సెమీస్లో పాకిస్తాన్ను ఓడించి ఫైనల్ చేరింది. ఫామ్పరంగా చూసుకుంటే ఈ టోర్నమెంట్లో తొలిసారి భారత జట్టుకు కాస్త ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలున్నాయి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ రూపంలో భారత జట్టుకు బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. స్మృతి ఇప్పటికే ఈ టోర్నీలో ‘శత’క్కొట్టగా... షఫాలీ 168 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతోంది. స్పిన్కు సహకరిస్తున్న దుబాయ్ పిచ్పై ఈ జంట జట్టుకు ఎలాంటి ఆరంభం ఇస్తుందనేదే కీలకం కానుంది. వన్డౌన్లో బ్యాటింగ్ చేస్తున్న ప్రతీకా రావల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా... హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, భారతి ఫూల్మాలితో భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్లో సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మ కీలకం కానుంది. ఈ టోర్నీలో 11 వికెట్లు తీసి శ్రీలంక సారథి చమరి ఆటపట్టుతో కలిసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్న దీప్తి ఫైనల్లోనూ రాణించాల్సిన అవసరముంది. ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి తన స్పిన్తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతుండగా... పేసర్లు నందని శర్మ, క్రాంతి గౌడ్ ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే భారత జట్టుకు ఫీల్డింగ్లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు శ్రీలంక జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో సారథి చమరి ఆటపట్టుపైనే ఎక్కువ ఆధారపడుతోంది. -
ఆఫ్ఘన్తో తొలి టీ20.. తీవ్ర ఉత్కంఠ
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రేపు న్యూఢిల్లీ వేదికగా తొలి టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు ముందు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రేపటి మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది . దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఢిల్లీలో గత రెండు వారాలుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. అక్యూ వెదర్ అంచనాల ప్రకారం రేపు వర్షం పడే అవకాశం 64 శాతంగా ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో భారీ వర్ష సూచన ఉంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.అక్యూ వెదర్ నివేదిక ప్రకారం మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం లేకపోయినా, ఓవర్ల కోత తప్పకపోవచ్చని తెలుస్తోంది.శ్రేయస్కు తొలి పరీక్షఈ సిరీస్ శ్రేయస్ అయ్యర్కు ప్రత్యేకమైనది. భారత టీ20 కెప్టెన్గా భారత్లో అతడికి ఇదే తొలి సిరీస్. ఇప్పటికే ఇంగ్లండ్, జింబాబ్వే పర్యటనల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన అయ్యర్.. తొలిసారి స్వదేశంలో భారత జట్టును నడిపించనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా ఆతిథ్య జట్టు అయినప్పటికీ, మ్యాచ్లు భారత్లో జరుగుతున్న విషయం తెలిసిందే.మిశ్రమ ఫలితాలుఇటీవల టీ20 క్రికెట్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20ల సిరీస్ను 0-2తో కోల్పోయిన టీమిండియా, ఆతర్వాత ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను కూడా 0-4తో కోల్పోయింది. అయితే జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో భారత్ అద్భుతంగా పుంజుకొని, 3-0తో క్లీన్స్వీప్ చేసింది.ఇదీ చదవండి: ఇషాన్ గాయంపై అప్డేట్ ఇచ్చిన శ్రేయస్ -
టీమిండియా షెడ్యూల్లో మార్పులు
2026 ఏషియన్ గేమ్స్లో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పురుషుల నాకౌట్ మ్యాచ్ల్లో కొన్ని మ్యాచ్లను అరగంట ముందుకు మార్చారు. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం, మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచ్లు ఇకపై స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. గతంలో ఈ మ్యాచ్లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. మహిళల క్రికెట్ మ్యాచ్ల సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.సెప్టెంబర్ 28న తొలి మ్యాచ్ఐచి-నగోయా (జపాన్) వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్లో భారత పురుషుల జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. సెప్టెంబర్ 28న జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో భారత్ బరిలోకి దిగనుంది.ఈ మ్యాచ్ జపాన్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ కంటే జపాన్ 3 గంటల 30 నిమిషాలు ముందుండటంతో.. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 10 గంటలకు మొదలవుతుంది.అలాగే అక్టోబర్ 1న జరిగే రెండో సెమీఫైనల్, అక్టోబర్ 3న జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 1.30 గంటలకే ప్రారంభం కానున్నాయి. భారత్ సెమీఫైనల్కు చేరితే ఆ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది.జపాన్లో ముందుగానే చీకటి పడటమే కారణంమ్యాచ్ల సమయాలను మార్చడానికి ప్రధాన కారణం జపాన్లో త్వరగా చీకటి పడటమేనని సమాచారం. మ్యాచ్లు జరిగే వేదికలో ఫ్లడ్లైట్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పురుషుల మ్యాచ్లు సాధారణంగా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండటంతో.. చీకటి పడేలోపు మ్యాచ్లను పూర్తి చేసేందుకు ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం.ముందుగా మరో మ్యాచ్ఏషియన్ గేమ్స్లో తమ తొలి అధికారిక పోటీకి ముందు భారత్ ఆతిథ్య జట్టు జపాన్తో ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది.ఇదీ చదవండి: ఇషాన్ గాయంపై అప్డేట్ ఇచ్చిన శ్రేయస్ -
ఇషాన్ గాయంపై అప్డేట్ ఇచ్చిన శ్రేయస్
ఆఫ్ఘనిస్తాన్తో రేపు జరుగబోయే తొలి టీ20కి ముందు టీమిండియాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ మ్యాచ్కు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహాలపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు.దులీప్ ట్రోఫీ ఫైనల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్లు (270, 80) ఆడటం వల్ల ఇషాన్ కొంత అలసటకు గురయ్యాడని, ప్రస్తుతం అతడు సౌకర్యంగానే ఉన్నాడని ఆయన చెప్పాడు. ఇషాన్ దులీప్ ట్రోఫీ ఫైనల్ తర్వాత నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ స్వల్ప గాయానికి గురయ్యాడు. దీంతో అతడు తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్కు కూడా దూరంగా ఉన్నాడు.ఇషాన్ ఆడకపోతే సంజూకు అవకాశం?ఒకవేళ ఇషాన్ కిషన్ పూర్తిగా కోలుకోకపోతే తొలి టీ20లో అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే సంజూ శాంసన్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు.ఇషాన్ స్థానంలో ఒకవేళ ఆల్రౌండర్ను తీసుకోవాలని భావిస్తే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి టీ20 రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు -
ఇంగ్లండ్దే మూడో టెస్టు.. పాకిస్తాన్ క్లీన్స్వీప్
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో పాకిస్తాన్ వైట్వాష్కు గురైంది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పాకిస్తాన్పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ 24.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లిద్దరు డకౌట్ అయినప్పటికీ, జోర్డాన్ కాక్స్ (59 నాటౌట్), కెప్టెన్ జో రూట్ (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీలు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 453 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (75), జేమీ స్మిత్ (69), డాన్ లారెన్స్ (65), ఎమిలో గే (60), ఓలీ రాబిన్సన్ (50) అర్థసెంచరీలు సాధించారు. అయితే ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 133 పరుగులకే కుప్పకూలింది. జోష్ టంగ్ 4 వికెట్లు తీయగా, రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్లు చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఫాలోఆన్ ఆడిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 449 పరుగులకు ఆలౌటైంది. షాన్ మసూద్ (95), బాబర్ ఆజం (76), రజాఉల్లాహ్ (81), అజన్ అవైస్ (59) అర్థసెంచరీలు సాధించారు. డాన్ లారెన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.సంక్షిప్త స్కోర్లుపాకిస్తాన్ 133 & 449ఇంగ్లండ్ 453 & 130/2👉టెస్టుల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ వైట్వాష్కు గురవ్వడం ఇది రెండోసారి. 2022-23లో పాక్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్ను కూడా ఇంగ్లండ్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇక ఇంగ్లండ్కు టెస్టుల్లో ప్రత్యర్థిపై ఇది 15వ క్లీన్స్వీప్. అదే సమయంలో పాకిస్తాన్ టెస్టుల్లో వైట్వాష్కు గురవ్వడం ఇది పదకొండోసారి.👉ఇంగ్లండ్ గడ్డపై ఒక మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఒక్క సెంచరీ నమోదు కాకపోవడం ఇది రెండోసారి కాగా, గతంలో 1888 యాషెస్ సిరీస్లోనూ ఒక్క సెంచరీ నమోదు కాలేదు. ఇక ఓవరాల్గా టెస్టు క్రికెట్లో ఒక టెస్టు సిరీస్లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం ఇది ఎనిమిదోసారి.3-0 SERIES SWEEP! 💪 pic.twitter.com/TTCM4ZHvWb— England Cricket (@englandcricket) September 12, 2026ఇదీ చదవండి: #80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్! -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక అర్ద సెంచరీలు చేసిన బ్యాటర్గా అవతరించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు.టెస్టుల్లో అత్యధిక అర్ధశతకాలు69* - జో రూట్68 - సచిన్ టెండూల్కర్66 - ఎస్. చందర్పాల్63 - అలెన్ బోర్డర్63 - రాహుల్ ద్రవిడ్62 - రికీ పాంటింగ్రూట్ (62 నాటౌట్)తో పాటు జోర్డన్ కాక్స్(59 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో మూడో టెస్ట్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. ఫలితంగా స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.ఈ మ్యాచ్లో పాక్ తొలి ఇన్నింగ్స్లో 133 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 449 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 453, రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఇదీ చదవండి: #80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్! -
మరోసారి పేట్రేగిపోయిన ముంబై ఇండియన్స్ బ్యాటర్
షేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ బ్యాటర్, అమృత్సర్ సూర్మాస్ కెప్టెన్ నమన్ ధిర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుత ఎడిషన్లో ఇప్పటికే రెండు విధ్వంసకర శతకాలు సహా, పలు మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన అతడు.. తాజాగా మరోసారి పేట్రేగిపోయాడు.మొహాలీ కింగ్స్తో ఇవాళ జరిగిన తొలి సెమీస్ ధిర్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 37 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేసి, తృటిలో సీజన్లో తన మూడో సెంచరీని చేజార్చుకున్నాడు. ధిర్ సునామీ ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో ప్రత్యర్ది నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని అమృత్సర్ జట్టు 16.3 ఓవర్లలోనే ఊదేసింది. ఫలితంగా ఫైనల్స్కు దూసుకెళ్లింది. ధిర్ ఔటయ్యాక అభయ్ చౌదరి (48 నాటౌట్), రాహుల్ కుమార్ (26 నాటౌట్) అమృత్సర్ను విజయతీరాలకు చేర్చారు.అంతకుముందు మొహాలీ కింగ్స్ నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఈ జట్టు తరఫున కెప్టెన్ రమన్దీప్ సింగ్ (42), అన్మోల్ప్రీత్ సింగ్ (43), హర్ప్రీత్ బ్రార్ (32 నాటౌట్), సొహ్రబ్ ధలీవాల్ (26) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అమృత్సర్ బౌలర్లలో జైప్రతాప్ సింగ్ 3, ఆకాశ్ పాండే 2 వికెట్లతో సత్తా చాటారు. కాగా, ఇవాళ రాత్రి 7 గంటలకు రెండో సెమీఫైనల్ మొదలవుతుంది. లుథియానా లయన్స్, జలంధర్ వారియర్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్లో విజేత సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్స్లో అమృత్సర్ జట్టుతో అమీతుమీ తేల్చుకుంటుంది. చదవండి: క్రికెటర్ శ్రీశాంత్ ఇంట తీవ్ర విషాదం -
#80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్!
భారత్ను ప్రస్తుతం ‘80s’ ట్రెండ్ షేక్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసుకున్నా ‘80s’ ట్రెండ్ పిచ్చ వైరల్గా మారిపోయింది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా తమకు నచ్చిన ఫొటోను చాట్ జీపీటీకి ఇచ్చి ప్రాంప్ట్ సహాయంతో ‘80s’ ట్రెండ్ ఫొటోలను సృష్టించి స్టేటస్లుగా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదే ‘80s’ ట్రెండ్ టీమిండియా క్రికెట్కు కూడా పాకింది. తాజాగా బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో టీమిండియా క్రికెటర్ల 80s ట్రెండ్ ఫొటోలను పంచుకుంది. అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ నేపథ్యంలో రేపటి నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న టీమిండియా క్రికెటర్లకు వారి ‘80s’ ఫొటోలను చూపించింది. దీనిపై ఒక్కో క్రికెటర్ ఒక్కోలా రియాక్ట్ అవ్వడం కనిపించింది. Photo Credit: BCCI Twitterముఖ్యంగా అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, అభిషేక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అర్షదీప్ సింగ్లు తమ ‘80s’ ఫొటోలు చూసుకొని తెగ మురిసిపోయారు. అభిషేక్ శర్మ అయితే అచ్చం హాలీవుడ్ హీరోని తలపించే విధంగా ఉన్నాడంటూ ఇషాన్ కిషన్ ఆటపట్టించడం విశేషం. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. బుమ్రా, సంజూ శాంసన్ ఇలా అందరు క్రికెటర్లు తమ ఫొటోలను గుర్తుపట్టగా.. రవి బిష్ణోయి, యష్ ఠాకూర్లు మాత్రం తమ ఫొటోలను పోల్చుకోలేకపోయారు. Photo Credit: BCCI Twitterమొదట శివమ్ దూబే తన ఫొటో బదులు యశ్ ఠాకూర్ను చూపించాడు. అయితే వెంటనే తన ఫొటోను చూపిస్తూ.. ఇందాకా చూపించింది యశ్ ఠాకూర్ది అని పేర్కొన్నాడు. ఇక బుమ్రా మాత్రం తన ఫొటోను చూసుకోవడానికి ఇష్టపడలేదు. 2 నిమిషాల 40 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.Photo Credit: BCCI Twitterఇక రేపు (ఆదివారం) భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జట్టు కూర్పు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినప్పటికీ, ఓపెనింగ్ విషయంలోనే మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఓపెనింగ్లో వైభవ్ లేదా శాంసన్లలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. విశ్వసనీయ సమాచారం మేరకు వైభవ్ను బెంచ్కు పరిమితం చేసి శాంసన్కు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో అన్ని మ్యాచ్లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.Vintage vibes. Priceless reactions. 😂🎥 #TeamIndia takes on the 1980s trend 😉 - By @RajalArora #AFGvIND pic.twitter.com/nSaClHHdyn— BCCI (@BCCI) September 12, 2026ఇదీ చదవండి: ఆసియా గేమ్స్కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా! -
‘అలా అయితే డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు.. మంచి పనే చేశారు’
హర్షిత్ రాణా.. ఐపీఎల్లో సత్తా చాటి అనతికాలంలోనే టీమిండియాలో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో ఒకడు. హెడ్కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడిగా పేరొందిన ఈ ఢిల్లీ పేసర్.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ అడుగుపెట్టాడు.టీమిండియా తరఫున ఇప్పటి వరకు రెండు టెస్టులు, పద్నాలుగు వన్డేలు, పద్నాలుగు టీ20 మ్యాచ్లు ఆడిన 24 ఏళ్ల హర్షిత్ రాణా.. ఆయా ఫార్మాట్లలో వరుసగా నాలుగు, 26, 16 వికెట్లు కూల్చాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడు.గాయాలతో సావాసంఅయితే, గత కొంతకాలంగా హర్షిత్ రాణా గాయాల వల్ల ఇబ్బందిపడుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ రైటార్మ్ పేసర్ గాయపడ్డాడు. మోకాలి నొప్పితో విలవిల్లాడిన అతడు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఐపీఎల్-2026 మొత్తానికి ఈ కోల్కతా నైట్ నైడర్స్ ఆటగాడు దూరమయ్యాడు.ఇలా వచ్చి.. అలా వెళ్లాడుఈ క్రమంలో జూన్లో ఐర్లాండ్ పర్యటన సందర్భంగా భారత టీ20 జట్టులోకి హర్షిత్ రాణా పునరాగమనం చేశాడు. అయితే, ఇంగ్లండ్తో ట్రెంట్ బ్రిడ్జ్ వన్డే సందర్భంగా అతడికి తొడ కండరాల గాయమైంది. దీంతో హర్షిత్ రాణా మరోసారి జట్టుకు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో హర్షిత్ రాణా పునరావాసం పొందుతున్నాడు. అయితే, అఫ్గానిస్తాన్తో స్వదేశంలో సెప్టెంబరు 13న మొదలయ్యే టీ20 సిరీస్కు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ తొలుత ప్రకటించింది.సిరీస్ మొత్తానికి దూరంఅయితే, ఫిట్నెస్ పరీక్ష సమయంలో హర్షిత్ రాణా మరోసారి గాయపడటంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ప్రకటించింది. అతడి స్థానంలో యశ్ ఠాకూర్ను ఎంపిక చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ జట్టు హెడ్కోచ్ శరణ్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత హర్షిత్ను టీమిండియాలో ఆడించాలని శరణ్దీప్ సింగ్ సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో యాజమాన్యం తొందరపడి అతడిని తీసుకురాకుండా మంచి పని చేసిందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఫ్యాన్కోడ్తో మాట్లాడుతూ....డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంది‘‘ఒక్కసారి టీమిండియాలోకి తిరిగి వస్తే అదనంగా శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టి గాయం మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హర్షిత్ రాణాను మరికొంత కాలం పక్కనపెట్టడం సానుకూల విషయమే. లేదంటే వరుస గాయాల వల్ల హర్షిత్ డిప్రెషన్లో కూరుకుపోయే అవకాశం ఉంటుంది.ఒత్తిడి పెరిగి అతడి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం భారత జట్టులో అతడు కీలక సభ్యుడిగా ఉన్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు అవసరమైనపుడు బ్యాటింగ్ కూడా చేయగలడు. గతేడాది కాలంగా బాగా రాణించాడు. అయితే, గాయాల వల్ల కాస్త వెనుకబడ్డాడు. అతడు త్వరలోనే ఫిట్గా మారి తిరిగి వస్తాడని ఆశిస్తున్నా’’ అని శరణ్దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్హౌజ్.. ఆస్తి విలువ ఎంతంటే? -
ఆసియా గేమ్స్కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా!
సెప్టెంబర్ 19 నుంచి అధికారికంగా మొదలుకానున్న ఆసియా క్రీడలకు టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ నీలం రంగు (Blue) జెర్సీకి బదులు నారింజ రంగు (Orange) జెర్సీ ధరించి టీమిండియా మ్యాచ్లు ఆడనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, ఆసియా క్రీడలకు మాత్రం టీమిండియా జెర్సీలో మార్పు ఖాయమన్న విషయం స్పష్టమవుతోంది. అయితే ఇటీవలే భారత హాకీ జట్టు మాత్రం కాషాయ రంగు జెర్సీ నుంచి బ్లూ జెర్సీలోకి మారిన సంగతి తెలిసిందే. రాబోయే ఆసియా క్రీడలకు కూడా మన హాకీ జట్టు ఆటగాళ్లు నీలం రంగు జెర్సీలతోనే బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే హాకీ ఇండియా స్పష్టం చేసింది. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్లు కాషాయ రంగు జెర్సీ ధరించిన ఫొటోలు (ఏఐ) సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే.. అభిమానులు మాత్రం నారింజ రంగు వద్దని, అచ్చొచ్చిన నీలం రంగు జెర్సీతోనే ఆసియా గేమ్స్లో పాల్గొనాలని కామెంట్లు చేశారు. కొందరు మాత్రం నారింజ, నీలం రంగులు కలిసిన జెర్సీని ధరిస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు.ఇక జపాన్లోని నగోయా వేదికగా సెప్టెంబర్ 10 నుంచే ఆసియా గేమ్స్ ప్రారంభమైనప్పటికీ అధికారికంగా మాత్రం సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్నాయి. మొత్తం 43 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇక పురుషుల క్రికెట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 మధ్య, మహిళల క్రికెట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు జరగనున్నాయి. టాప్-10లో ఉండడంతో భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఆడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 28న ఆడనుంది. ఇక మహిళల క్రికెట్లో మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరగనుండగా, సెప్టెంబర్ 18న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో జపాన్తో భారత్ తలపడనుంది.🚨 NEW JERSEY FOR TEAM INDIA IN ASIAN GAMES 2026 !🧡🇮🇳- According to reports, Team India are set to move away from their iconic blue jersey and feature a new orange kit at the upcoming Asian Games. [News Arena] pic.twitter.com/3NpG2VXkDT— lndian Sports Network (@IS_Netwrk29) September 12, 2026చదవండి: యూఏఈ క్రికెటర్పై నేపాల్ ఆటగాళ్ల దౌర్జన్యం!


