Cricket
-
ఈ ‘వైభవం’ కొనసాగాలి!
క్రికెట్ బ్యాట్ పట్టడం కూడా తెలియని వ్యక్తి నుంచి మొదలుకొని... ఆటలో తలపండిన మేధావుల వరకు ఎక్కడ చూసినా ఒకటే చర్చ! ఊరు, వాడా, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఒకే పేరు! ‘ఏం కొట్టాడ్రా బాబు’ అని సాధారణ అభిమానులు కొనియాడుతుంటే... ఫ్లిక్, లాఫ్ట్, పుల్ అంటూ విశ్లేషకులు అతడి షాట్లను వర్ణిస్తున్నారు. ఒక్క ఇన్నింగ్స్తో యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఆ కుర్రాడే... బిహార్కు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. అంతర్జాతీయ స్థాయి క్రికెట్తో సరిసమానంగా ఒత్తిడి ఉండే ఐపీఎల్లో అతడు బాదిన బాదుడు క్రీడాలోకాన్ని నివ్వెరపరిచింది. అతని దూకుడుకు అపార అనుభవం ఉన్న బౌలర్లు సైతం స్కూలు కుర్రాళ్లలా కనిపించారనడంలో రవ్వంత అతిశయోక్తి లేదు. ఐపీఎల్లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్... మూడో ఇన్నింగ్స్లోనే రికార్డు సెంచరీ... మరో సచిన్ టెండూల్కర్ దొరికాడు అనే ప్రశంసలతో ఆ పాలబుగ్గల పసివాడు ప్రస్తుతానికి శిఖరమంత ఎత్తులో ఉన్నాడు! ఇదంతా నాణేనికి ఒకవైపే! మన దేశంలో ఇలా ఒక్క ఇన్నింగ్స్తో సంచలనాలు రేకెత్తించిన వాళ్లు కోకొల్లలు. దేశవాళీ, అంతర్జాతీయ, ఐపీఎల్ వేదికలపై తళుక్కున మెరిసి... అంతే త్వరగా కనుమరుగై పోయిన వారికి కొదవే లేదు. అంచనాలకు మించి వచ్చే పేరు ప్రతిష్టలు... అవసరానికి మించి వచ్చి పడే డబ్బు ప్రవాహం... అప్పనంగా వచ్చే ప్రచార ఆర్బాటం ఇలా ఆటగాళ్ల దృష్టి మరల్చేవి ఎన్నో. పిన్న వయసులోనే విశేష గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సొదిలోనే లేకుండా పోయిన వాళ్లు ఎందరో! సదానంద్ విశ్వనాథ్, వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా ఈ కోవలోకే వస్తారు. ప్రతిభకు క్రమశిక్షణ తోడైతేనే సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించగలం అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిరూపిస్తే... ఒక్కసారిగా వచ్చిన గుర్తింపుతో ఉక్కిరిబిక్కిరై కెరీర్ను నాశనం చేసుకున్న వాళ్లూ ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ కూడా ఇలా ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ కాకుండా ఉండాలంటే నిరంతర సాధన ముఖ్యమని మాజీలు సూచిస్తున్నారు. –సాక్షి క్రీడావిభాగం వయసుకు మించిన పరిణతితో అతడు బంతిని బాదుతుంటే... యావత్ ప్రపంచం విస్మయానికి గురైంది! బౌలర్తో సంబంధం లేకుండా అతడు విరుచుకుపడుతుంటే... అభిమాన గణం మైమరిచిపోయింది! ముఖంపై పసితనపు ఛాయలు కూడా పోని ఆ చిన్నోడు చిందేస్తుంటే... క్రీడా లోకం తన్మయత్వానికి లోనైంది! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్తో జైపూర్లో జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డులు తిరగరాశాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారతీయుడిగా... ఓవరాల్గా టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు్కడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ ఈ నలుగురు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన వారే. ఇక టి20 లీగ్ల్లో రికార్డులు తిరగరాసే అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరేసరి. ఇలాంటి బౌలర్లను ఎదుర్కొంటూ వైభవ్ సాగించిన ఊచకోత మాటలకందనిది! క్లాస్, మాస్, ఊరమాస్ ఇలా అతడి ఇన్నింగ్స్ను వర్ణించడానికి విశేషణాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. అతడి బాదుడుకు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం హోరెత్తింది. డగౌట్లో కూర్చున్న ప్రతి ఆటగాడు ఊగిపోతుంటే... మ్యాచ్ చూస్తున్న అభిమానులు బ్యాటింగ్ చేసేది తామే అన్నంతగా లీనమై పోయి ఆ ‘బుడ్డోడి’ ప్రతిభకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. రాహుల్ ద్రవిడ్ చొరవతో... ఐపీఎల్ ప్రారంభమైన మూడేళ్ల తర్వాత బిహార్లోని సమస్తీపూర్లో జని్మంచిన వైభవ్... కఠోర సాధన, పట్టువదలని తత్వంతో అంచలెంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. సహచరుడి తప్పిదం వల్ల రనౌట్ అయి బెంచ్మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్న వైభవ్ను చూసిన వీవీఎస్ లక్ష్మణ్... అతడిలో ఆత్మవిశ్వాసం నింపి రాహుల్ ద్రవిడ్ దృష్టికి తీసుకెళ్లడంతో వైభవ్ దశ తిరిగింది. ప్రతిభాన్వేషణ సమయంలో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, రాజస్తాన్ టీమ్ మేనేజర్ రోమి... వైభవ్ షాట్ల ఎంపికకు ముగ్ధులయ్యారు. దీంతో వారు వైభవ్ను ద్రవిడ్కు పరిచయం చేయడంతో అతడి జీవితం మారిపోయింది. ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుండే రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం గతేడాది ఐపీఎల్ వేలంలో రూ. 1 కోటీ 10 లక్షలకు వైభవ్ను కొనుగోలు చేసుకుంది. ద్రవిడ్ పర్యవేక్షణలో మరింత రాటుదేలిన వైభవ్... దాన్నే మైదానంలో చాటాడు. అప్పటికే భారత అండర్–19 జట్టుకు ఎంపికైన వైభవ్... గతేడాది జనవరిలోనే ముంబై జట్టుపై ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేశాడు. నెట్స్లో తీవ్రంగా శ్రమించడం, కోచ్ చెప్పిన అంశాలను ఆచరణలో పెట్టడం. ఎంత కష్టాన్నైనా ఓర్చుకోవడం వంటి సానుకూల లక్షణాలు అతడిని మూడో మ్యాచ్లోనే సెంచరీ హీరోగా నిలిపాయి. పొలం అమ్ముకున్న తండ్రి.. వైభవ్ విజయం వెనక... తాను సాధించలేకపోయిన దాన్ని కుమారుడైనా అందుకోవాలని తపన పడ్డ ఓ మధ్యతరగతి తండ్రి ఆశయం ఉంది. కుమారుడికి మెరుగైన శిక్షణ అందించేందుకు ఉన్న కాస్త పొలం అమ్ముకున్న ఆ తండ్రి ఇప్పుడు అత్యంత ఆనంద క్షణాలు అనుభవిస్తున్నాడు. గతంలో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ చేయగా... ఇప్పుడు ఈ ఎడంచేతి వాటం బ్యాటర్ 35 బంతుల్లోనే మూడంకెల స్కోరు చేసి కొత్త చరిత్ర లిఖించాడు. దీని వెనక రాయల్స్ యాజమాన్య ప్రోత్సాహం ఉందని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. ‘వైభవ్ మెరుపుల వెనక బిహార్ క్రికెట్ సంఘం చీఫ్ రాకేశ్ తివారీ, రాజస్తాన్ రాయల్స్ జట్టు కృషి ఎంతో ఉంది. ఇక రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గత మూడు, నాలుగు నెలలుగా పడ్డ కష్టానికి దక్కిన ఫలితమిది. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం’ అని సంజీవ్ అన్నాడు. అయితే ఈ మెరుపులు కేవలం ఒకటీ అరా మ్యాచ్లకు మాత్రమే పరిమితం కాకుండా ఉండాలంటే... ఇదే సాధన కొనసాగించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పేరు, డబ్బు తలకెక్కనివ్వకుండా క్రమశిక్షణతో ముందుకు సాగితే దేశానికి సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించగల ప్రతిభావంతుడు లభించినట్లే! అమ్మ, నాన్న కృషి వల్లే... తొలి బంతికి సిక్స్ కొట్టడం నాకు పెద్ద విషయం కాదన్న వైభవ్... అమ్మానాన్న కృషి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నాడు. ‘నేను ఇప్పటికే భారత అండర్–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించా. దేశవాళీల్లో తొలి బంతికి చాలాసార్లు సిక్స్ కొట్టా. మొదటి 10 బంతులు ఎదుర్కొనేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాను. బంతి నా పరిధిలో ఉంటే దాన్ని బలంగా కొట్టాలనే చూస్తా. తల్లిదండ్రుల సహకారం లేకుంటే నేను లేను. నా కోసం వాళ్లు ఎంతగానో కష్టపడ్డారు. తెల్లవారుజామను 3 గంటలకే నిద్రలేచే మా అమ్మ... మళ్లీ నేను పడుకున్న తర్వాత ఏ 11 గంటలకో గానీ నిద్రపోదు. వారు అలా నా కోసం అన్నీ వదిలేసుకొని శ్రమించడం వల్లే నేను ఆటపై దృష్టి సారించగలిగా. నాన్న నా వెంట ఉండటం వల్లే మరింత స్వేచ్ఛగా ఆడుతున్నా. కష్టానికి ఫలితం ఉంటుందని రుజువైంది. వారి కష్టానికి ప్రతిఫలమే ఇది’ అని వైభవ్ పేర్కొన్నాడు. మరో ఒకటీ రెండేళ్లలో వైభవ్ భారత టి20 జట్టులో చోటు దక్కించుకుంటాడని అతడి చిన్ననాటి కోచ్ మనీశ్ ఓఝా ఆశాభాహం వ్యక్తం చేశాడు. ‘కోచ్గా వైభవ్ను చూస్తే గర్వంగా ఉంది. బిహార్లో ఆటలకు పెద్దగా ఆదరణ ఉండదు. అలాంటి చోట నుంచి వచ్చి క్రికెట్పై తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు వైభవ్ ఎందరికో స్ఫూర్తి’ అని మనీశ్ ఓఝా అన్నాడు. రూ. 10 లక్షల నజరానా ఐపీఎల్లో సెంచరీతో రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీకి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భారీ నజరానా ప్రకటించారు. 14 ఏళ్ల వైభవ్కు రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. ‘గతేడాది వైభవ్తో మాట్లాడా. అతడిలో అపార ప్రతిభ ఉంది. తీవ్ర పోటీ ఉండే ఐపీఎల్లో 35 బంతుల్లో సెంచరీ చేయడం మామూలు విషయం కాదు. ఫోన్ ద్వారా అతడిని అభినందించా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైభవ్ సూర్యవంశీకి రూ. 10 లక్షల నజరానా అందిస్తాం. భవిష్యత్తులోనూ అతడు ఇదే ఆటతీరు కొనసాగించాలని కోరుకుంటున్నాం. వైభవ్ దేశం తరఫున కూడా రాణించి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాడని ఆశిస్తున్నాం’ అని నితీశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వైభవ్ ఆటతీరు చూస్తుంటే ముచ్చటేస్తోంది. అతడిలో భయం ఏ కోశాన కనిపించడం లేదు. బ్యాట్ వేగం, బంతిని అంచనా వేసే తీరు చాలా బాగున్నాయి. 38 బంతుల్లో 101 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్ ఆసాంతం అలరించింది. –సచిన్ టెండూల్కర్14 ఏళ్ల వయసులో మీరేం చేశారో గుర్తు చేసుకొండి. ఈ కుర్రాడు మాత్రం అంతర్జాతీయ బౌలర్ల భరతం పట్టాడు. భయమన్నదే లేకుండా బౌలర్లకు నిద్రలేని రాత్రి మిగిల్చాడు. భవిష్యత్తుపై మరింత భరోసా పెంచుతున్న ఇలాంటి ప్లేయర్లను చూస్తే గర్వంగా ఉంది. –యువరాజ్ సింగ్ -
ఇంగ్లండ్ మహిళల జట్టు కొత్త కెప్టెన్గా సీవర్ బ్రంట్
లండన్: ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు కొత్త సారథిగా ఆల్రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ ఎంపికైంది. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో నాయకత్వ మార్పు అనివార్యమైంది. తొమ్మిదేళ్లుగా హీథర్ నైట్ ఇంగ్లండ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా... గతేడాది టి20 ప్రపంచకప్లో ఆ జట్టు గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఇక ఆ్రస్టేలియాతో మూడు ఫార్మాట్లలో కలిపి 16 మ్యాచ్లాడి ఒక్క దాంట్లోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు హీథర్ నైట్ స్థానంలో... మూడేళ్లుగా జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సీవర్ బ్రంట్కు పగ్గాలు అప్పగించింది. మూడు ఫార్మాట్లలోనూ బ్రంట్ జట్టును నడిపించనుంది. ‘ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికవడం గర్వంగా భావిస్తున్నా. జట్టును విజయవంతంగా నడిపించేందుకు నావంతు కృషి చేస్తా. మెరుగైన ప్రదర్శనతో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తాం’ అని 32 ఏళ్ల బ్రంట్ పేర్కొంది. 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రంట్... ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 259 మ్యాచ్లాడింది. 2017లో ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ భాగంగా ఉంది. టెస్టుల్లో 46.47, వన్డేల్లో 45.91, టి20ల్లో 28.45 సగటుతో పరుగులు చేసిన బ్రంట్... మూడు ఫార్మాట్లలో కలిపి 181 వికెట్లు సైతం పడగొట్టింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో బ్రంట్ 3వ స్థానంలో ఉంది. మే 21 నుంచి వెస్టిండీస్తో ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. -
స్నేహ్ మాయాజాలం
భారత ఆఫ్స్పిన్నర్ స్నేహ్ రాణా 5 వికెట్ల ప్రదర్శన... వీటిలో ఒకే ఓవర్లో తీసిన 3 వికెట్లు... ప్రతీక రావల్ మరో అర్ధసెంచరీతో అద్భుత ఫామ్ కొనసాగింపు... తజ్మీన్ బ్రిట్స్ వీరోచిత సెంచరీ వృథా... భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో హైలైట్స్ ఇవి. ముక్కోణపు టోర్నీలో భాగంగా ఆడిన రెండో మ్యాచ్లోనూ గెలిచిన హర్మన్ బృందం తమ అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. కొలంబో: ముక్కోణపు వన్డే టోర్నీలో భారత మహిళలు మరో విజయాన్ని అందుకున్నారు. మంగళవారం జరిగిన పోరులో భారత్ 15 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మహిళల జట్టును ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ప్రతీక రావల్ (91 బంతుల్లో 78; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (32 బంతుల్లో 41; 4 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. తజ్మీన్ బ్రిట్స్ (107 బంతుల్లో 109; 13 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ చేయగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్నేహ్ రాణా (5/43) ఐదు వికెట్ల ప్రదర్శనతో సఫారీ టీమ్ను పడగొట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది. కీలక భాగస్వామ్యాలు... భారత్కు ప్రతీక, స్మృతి మంధాన (54 బంతుల్లో 36; 5 ఫోర్లు) శుభారంభం అందించారు. తొలి వికెట్కు వీరిద్దరు 18.3 ఓవర్లలో 83 పరుగులు జోడించారు. స్మృతి వెనుదిరిగిన తర్వాత ప్రతీకకు హర్లీన్ డియోల్ (47 బంతుల్లో 29; 4 ఫోర్లు) సహకారం అందించింది. 58 బంతుల్లో ప్రతీక అర్ధ సెంచరీ పూర్తయింది. ప్రతీక, హర్లీన్ మూడు పరుగుల వ్యవధిలో వెనుదిరగ్గా... హర్మన్, జెమీమా 59 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ను నడిపించారు. చివర్లో రిచా ఘోష్ (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన ఆటను ప్రదర్శించగా...ఆఖరి 10 ఓవర్లలో భారత్ 82 పరుగులు సాధించింది. బ్రిట్స్ సెంచరీ వృథా... బ్రిట్స్ వరుస బౌండరీలతో చెలరేగిపోవడంతో ఛేదనలో దక్షిణాఫ్రికాకు మరింత ఘనమైన ఆరంభం దక్కింది. బ్రిట్స్తో తొలి వికెట్కు 140 పరుగులు జోడించిన తర్వాత కెప్టెన్ లౌరా వాల్వార్ట్ (75 బంతుల్లో 43; 3 ఫోర్లు) అవుట్ కాగా, ఆ తర్వాత 103 బంతుల్లో బ్రిట్స్ శతకం పూర్తయింది. ఆ తర్వాత తీవ్ర వేడి కారణంగా బ్రిట్స్ రిటైర్ట్హర్ట్గా వెనుదిరగ్గా... ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. 80 పరుగుల వ్యవధిలో జట్టు చివరి 8 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఐదు వికెట్లతో చివరి 3 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సి ఉండగా... 48వ ఓవర్ వేసిన స్నేహ్ రాణా 3 వికెట్లు పడగొట్టింది. తిరిగి మైదానంలోకి వచ్చి ఆదుకునే ప్రయత్నం చేసిన బ్రిట్స్ కూడా ఇదే ఓవర్లో అవుట్ కావడంతో జట్టు ఆశలు కోల్పోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (బి) ఎమ్లాబా 78; స్మృతి (సి) మెసో (బి) డెర్క్సన్ 36; హర్లీన్ (బి) ఎమ్లాబా 29; హర్మన్ప్రీత్ (నాటౌట్) 41; జెమీమా (సి) ఖాకా (బి) క్లాస్ 41; రిచా (సి) లూస్ (బి) ఖాకా 24; దీప్తి (సి) ట్రైయాన్ (బి) డిక్లెర్క్ 9; కాశ్వీ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 276. వికెట్ల పతనం: 1–83, 2–151, 3–154, 4–213, 5–247, 6–259. బౌలింగ్: ఖాకా 8–1– 42–1, క్లాస్ 9–1–43–1, లూస్ 4–0–24–0, డిక్లెర్క్ 9–1–39–1, ఎమ్లాబా 10–0–55–2, డెర్క్సన్ 3–0– 40–1, ట్రైయాన్ 7–0–33–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్వార్ట్ (ఎల్బీ) (బి) దీప్తి 43; బ్రిట్స్ (సి అండ్ బి) స్నేహ్ రాణా 109, గుడాల్ (బి) స్నేహ్ రాణా 9; మెసో (బి) అరుంధతి రెడ్డి 7; లూస్ (సి) (సబ్) అమన్జోత్ (బి) శ్రీచరణి 28; ట్రైయాన్ (సి) (సబ్) అమన్జోత్ (బి) స్నేహ్ రాణా 18; డెర్క్సన్ (సి) హర్లీన్ (బి) స్నేహ్ రాణా 30; డిక్లెర్క్ (బి) స్నేహ్ రాణా 0; క్లాస్ (రనౌట్) 2; ఎమ్లాబా (రనౌట్) 8; ఖాకా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 261. వికెట్ల పతనం: 1–140, 2–151, 3–181, 4–207, 5–240, 6–250, 7–251, 8–252, 9–253, 10–261. బౌలింగ్: కాశ్వీ గౌతమ్ 7.2–0–47–0, అరుంధతి రెడ్డి 9–0–59–1, స్నేహ్ రాణా 10–0–43–5, శ్రీచరణి 10–0–51–1, దీప్తి శర్మ 10–0–40–1, ప్రతీక 3–0–17–0. -
నైట్రైడర్స్ గెలుపు బాట
ఐపీఎల్లో ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలకు పూర్తిగా తెర పడిపోకుండా కోల్కతా నైట్రైడర్స్ తమ ఆశలు సజీవంగా ఉంచుకుంది. గత మూడు మ్యాచ్ లలో రెండు పరాజయాలు, ఒక మ్యాచ్ రద్దు తర్వాత ఎట్టకేలకు ఆ జట్టు గెలుపు రుచి చూసింది. సమష్టి బ్యాటింగ్తో 200 పరుగుల స్కోరు దాటిన టీమ్... ఢిల్లీని వారి వేదికపై కట్టడి చేయడంలో సఫలమైంది. ముఖ్యంగా మ్యాచ్ చేజారుతున్న దశలో నరైన్ 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి ఆటను మలుపు తిప్పాడు. న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్కు ఐపీఎల్ 18వ సీజన్లో కీలక విజయం దక్కింది. గెలిస్తేనే నిలిచే స్థితిలో మంగళవారం బరిలోకి దిగిన కేకేఆర్ 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అంగ్కృష్ రఘువంశీ (32 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్లు), రింకూ సింగ్ (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడగా, స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. ఫాఫ్ డుప్లెసిస్ (45 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్లు), అక్షర్ పటేల్ (23 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్లు), విప్రాజ్ నిగమ్ (19 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సునీల్ నరైన్ (3/29) మూడు ప్రధాన వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు. పవర్ప్లేలో కోల్కతా ఇన్నింగ్స్ జోరుగా సాగింది. చమీరా ఓవర్లో సునీల్ నరైన్ (16 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్లు) 2 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టగా...స్టార్క్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదిన రహ్మనుల్లా గుర్బాజ్ (12 బంతుల్లో 26; 5 ఫోర్లు, 1 సిక్స్) అదే ఓవర్లో అవుటయ్యాడు. తొలి 6 ఓవర్లలో మొత్తం 79 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో నరైన్, అజింక్య రహానే (14 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (7) వికెట్లను కేకేఆర్ కోల్పోయింది. ఈ స్థితిలో రఘువంశీ, రింకూ ఐదో వికెట్కు 46 బంతుల్లో 61 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో కోల్కతా కట్టడి చేయడంలో ఢిల్లీ సఫలమైంది. 3 పరుగుల వ్యవధిలో రఘు, రింకూ వెనుదిరగ్గా... స్టార్క్ వేసిన చివరి ఓవర్లో వరుస బంతుల్లో 3 వికెట్లు పడ్డాయి. రాణించిన డుప్లెసిస్ ఛేదనలో ఢిల్లీకి సరైన ఆరంభం లభించలేదు. పొరేల్ (4), కరుణ్ నాయర్ (15), కేఎల్ రాహుల్ (7) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అయితే డుప్లెసిస్, అక్షర్ భాగస్వామ్యంతో ఢిల్లీ గెలుపుపై ఆశలు రేగాయి. నాలుగో వికెట్కు డుప్లెసిస్, అక్షర్ 42 బంతుల్లోనే 76 పరుగులు జత చేశారు. 41 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్ను నరైన్ అవుట్ చేయడంతో ఆట మలుపు తిరిగింది. అదే ఓవర్లో స్టబ్స్ (1) కూడా వెనుదిరగ్గా... నరైన్ తన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ను కూడా వెనక్కి పంపించాడు. 10 పరుగుల వ్యవధిలో ఈ 3 వికెట్లు పడ్డాయి. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) పొరేల్ (బి) స్టార్క్ 26; నరైన్ (ఎల్బీ) (బి) విప్రాజ్ 27; రహానే (ఎల్బీ) (బి) అక్షర్ 26; రఘువంశీ (సి) నాయర్ (బి) చమీరా 44; వెంకటేశ్ (సి) విప్రాజ్ (బి) అక్షర్ 7; రింకూ (సి) స్టార్క్ (బి) విప్రాజ్ 36; రసెల్ (రనౌట్) 17; పావెల్ (ఎల్బీ) (బి) స్టార్క్ 5; అనుకూల్ (సి) చమీరా (బి) స్టార్క్ 0; హర్షిత్ (నాటౌట్) 0; వరుణ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–48, 2–85, 3–91, 4–113, 5–174, 6–177, 7–203, 8–203, 9–203. బౌలింగ్: స్టార్క్ 4–0–43–3, చమీరా 3–0–46–1, ముకేశ్ 2–0–17–0, విప్రాజ్ 4–0–41–2, అక్షర్ పటేల్ 4–0–27–2, కుల్దీప్ 3–0–27–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) రసెల్ (బి) అనుకూల్ 4; డుప్లెసిస్ (సి) రింకూ (బి) నరైన్ 62; కరుణ్ నాయర్ (ఎల్బీ) (బి) అరోరా 15; రాహుల్ (రనౌట్) 7; అక్షర్ (సి) హర్షిత్ (బి) నరైన్ 43; స్టబ్స్ (బి) నరైన్ 1; విప్రాజ్ (బి) రసెల్ 38; అశుతోష్ (సి) నరైన్ (బి) వరుణ్ 7; స్టార్క్ (సి) గుర్బాజ్ (బి) వరుణ్ 0; చమీరా (నాటౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–60, 4–136, 5–138, 6–146, 7–160, 8–160, 9–189.బౌలింగ్: అనుకూల్ రాయ్ 4–0–27–1, వైభవ్ అరోరా 2–0–19–2, హర్షిత్ రాణా 4–0–49–0, వరుణ్ చక్రవర్తి 4–0–39–2, నరైన్ 4–0–29–3, రసెల్ 2–0–22–1. ఐపీఎల్లో నేడుచెన్నై X పంజాబ్ వేదిక: చెన్నై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: కేకేఆర్ ఈజ్ బ్యాక్.. ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో కోల్కతా నైట్రైడర్స్ తిరిగి పుంజుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 14 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగల్గింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(62) టాప్ స్కోరర్గా నిలవగా.. అక్షర్ పటేల్(43) ఫర్వాలేదన్పించాడు. వీరితో విప్రజ్ నిగమ్(19 బంతుల్లో 38) ఆఖరిలో మెరుపులు మెరిపించనప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, అనుకుల్ రాయ్,రస్సెల్, ఆరోరా తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: IPL 2025: వావ్.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్ -
వావ్.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ దుష్మంత చమీర అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. చమీరా సంచలన క్యాచ్తో అనుకుల్ రాయ్ను పెవిలియన్కు పంపాడు.చమీరా క్యాచ్ అంతా షాక్ అయిపోయారు. కేకేఆర్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన స్టార్క్ బౌలింగ్లో మూడో బంతికి రావ్మన్ పావెల్ వికెట్లు ముందు దొరికిపోయాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అనుకుల్ రాయ్కు స్టార్క్ నాలుగో బంతిని మిడిల్ అండ్ లెగ్ దిశగా సంధించాడు.ఆ డెలివరీని అనుకుల్ రాయ్ డీప్ స్వ్కెర్ లెగ్ దిశగా ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా బౌండరీ వెళ్తుందని భావించారు. కానీ స్వ్కెర్ లెగ్లో ఉన్న చమీరా అద్బుత విన్యాసం చేశాడు. స్వ్కెర్ లెగ్ నుంచి పరిగెత్తుకుంటూ గాల్లోకి జంప్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఒక్కసారిగా బిత్తరపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్లలో ఒకటిగా నెటిజన్లు కొనియాడుతున్నారు.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు.Two moments of brilliance ✌Andre Russell's 1️⃣0️⃣6️⃣m six 🤩Dushmantha Chameera's spectacular grab 🤯Which was your favourite out of the two? ✍Scorecard ▶ https://t.co/saNudbWINr #TATAIPL | #DCvKKR | @KKRiders | @DelhiCapitals pic.twitter.com/9griw9ji4f— IndianPremierLeague (@IPL) April 29, 2025 -
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ..
ఐపీఎల్-2025లో యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే దుమ్ములేపుతున్నారు. 14 ఏళ్ల సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ తరపున సంచలనాలు సృష్టిస్తుండగా.. ఆయుష్ మాత్రే సీఎస్కే తరపున అద్బుత ఇన్నింగ్స్లు ఆడుతున్నారు. సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ రికార్డు సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి తన పేరును ఐపీఎల్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ స్దానంలో జట్టులోకి వచ్చిన మాత్రే తన మెరుపు ఇన్నింగ్స్లతో అందరని ఆకట్టుకుంటున్నాడు. అయితే ఐపీఎల్ ముగిసిన అనంతరం ఈ ఇద్దరు యువ క్రికెటర్లు తిరిగి భారత అండర్-19 జట్టు తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జూన్లో భారత జూనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్తో భారత్ ఐదు వన్డేలు, రెండు టెస్ట్లు ఆడనున్నట్లు సమాచారం. ఈ ఇంగ్లండ్ టూర్కు సూర్యవంశీ, మాత్రే వెళ్లనున్నారు. సూర్యవంశీ గత ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో అరంగేట్రం చేశాడు. ఈ బిహారీ క్రికెటర్ జూనియర్ జాతీయ జట్టు తరపున రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు. గతేడాది అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత యువ జట్టుకు తొలి టూర్ కావడం గమనార్హం. అండర్ 19 ప్రపంచకప్-2026 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. కాగా ఇదే జూన్లో భారత సీనియర్ జట్టు కూడా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్కు వెళ్లనుంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రతీక రావల్ దుమ్ములేపుతోంది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ప్రతీక హాఫ్ సెంచరీతో మెరిసింది. రావల్ 91 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 78 పరుగులు చేసింది.ఈ క్రమంలో రావల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన బ్యాటర్గా ప్రతీక రికార్డులకెక్కింది. 24 ఏళ్ల ప్రతీక రావల్ (Pratika Rawal) తన వన్డే అరంగేట్రం నుంచి అదరగొడుతోంది.ఈ క్రమంలో కేవలం 8 మ్యాచ్లలోనే ప్రతీక 500 పరుగుల మార్క్ను అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ ప్లేయర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. 9 ఇన్నింగ్స్లలో ఆమె ఈ ఫీట్ను సాధించింది. తాజా మ్యాచ్తో ఎడ్వర్డ్స్ ఆల్టైమ్ రికార్డును రావల్ బ్రేక్ చేసింది.మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే..ప్రతికా రావల్ - 8 ఇన్నింగ్స్లుషార్లెట్ ఎడ్వర్డ్స్ - 9 ఇన్నింగ్స్లునికోల్ బోల్టన్ - 11 ఇన్నింగ్స్లుబెలిండా క్లార్క్ - 12 ఇన్నింగ్స్లువెండీ వాట్సన్ - 12 ఇన్నింగ్స్లుఇక ఈ మ్యాచ్లో సౌతాఫ్రికాపై 15 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 277 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా అమ్మాయిలు..49. 2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయాసంగా గెలిచే కన్పించిన సౌతాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా దెబ్బతీసింది. రాణా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది.చదవండి: సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం -
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్పై కేకేఆర్ ఘన విజయం
ఢిల్లీ క్యాపిటల్స్పై కేకేఆర్ ఘన విజయంఅరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 14 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగల్గింది.ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(62) టాప్ స్కోరర్గా నిలవగా.. అక్షర్ పటేల్(43) ఫర్వాలేదన్పించాడు. వీరితో విప్రజ్ నిగమ్(19 బంతుల్లో 38) ఆఖరిలో మెరుపులు మెరిపించనప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, అనుకుల్ రాయ్,రస్సెల్, ఆరోరా తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.ఢిల్లీకి షాక్.. ఓకే ఓవర్లో రెండు వికెట్లు14 ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి అక్షర్ పటేల్(43) ఔట్ కాగా.. ఆరో బంతికి స్టబ్స్ ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(62), విప్రజ్ నిగమ్(5) ఉన్నారు.ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ డౌన్..కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రాహుల్.. రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో ఫాఫ్ డుప్లెసిస్(32), అక్షర్ పటేల్(8) ఉన్నారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..కరుణ్ నాయర్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన నాయర్.. వైభవ్ ఆరోరా బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్.. అనుకుల్ రాయ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 178) పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(8), కరుణ్ నాయర్(4) ఉన్నారు.చెలరేగిన కేకేఆర్ బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు.కేకేఆర్ ఐదో వికెట్ డౌన్రఘువంశీ రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన రఘువంశీ.. చమీరా బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 142/414 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. క్రీజులో రఘువంశీ(35), రింకూ సింగ్(14) ఉన్నారు.రహానే ఔట్..కేకేఆర్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్ వేసిన విప్రజ్నిగమ్ బౌలింగ్లో సునీల్ నరైన్(27) ఔట్ కాగా.. 8 ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ రహానే(26) పెవిలియన్కు చేరాడు. 8 ఓవర్లకు కేకేఆర్ స్కోర్6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 79/06 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(26), రహానే(21) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్రహ్మానుల్లా గుర్బాజ్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన గుర్భాజ్..స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(20), రహానే(0) ఉన్నారు.ఐపీఎల్-2025లో అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. కేకేఆర్ మాత్రం తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రమణ్దీప్ సింగ్ స్ధానంలో అనుకుల్ రాయ్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రోవ్మన్ పావెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తిఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్ ), కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్ -
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్-2025లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ ట్రై సిరీస్లో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 277 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా అమ్మాయిలు..49. 2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయాసంగా గెలిచే కన్పించిన సౌతాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా దెబ్బతీసింది. 48వ ఓవర్లో మూడు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే రాణా మార్చేసింది. రాణా ఓవరాల్గా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. దక్షిణాఫ్రికా 11 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో టాజ్మిన్ బ్రిట్స్( 107 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 109) విరోచిత శతకంతో చెలరేగింది. ఆమెతో లారా వోల్వార్డ్ట్(43), అన్నేరీ డెర్క్సెన్(30) రాణించినప్పటికి.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.ప్రతీక సూపర్ ఇన్నింగ్స్..ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ప్రతీక రావల్(78) టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమెతో కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్(41), జెమీమా రోడ్రిగ్స్(41), మంధాన(36) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మ్లాబా రెండు వికెట్లు పడగొట్టగా..ఖాకా, క్లాస్ తలా వికెట్ సాధించారు.చదవండి: సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం -
ఇంగ్లండ్ కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్..
ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ నాట్ స్కైవర్-బ్రంట్ ఎంపికైంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. హీథర్ నైట్ స్దానాన్ని స్కైవర్ బ్రంట్ భర్తీ చేయనుంది. కాగా ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్సీ హీథర్ నైట్ రాజీనామా చేసింది.మహిళల యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలవ్వడంతో నైట్ ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ప్రధాన కోచ్ జాన్ లూయిస్పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. అతడి స్ధానంలో మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నియమించింది.ఇక ఇంగ్లండ్ కెప్టెన్గా ఎంపిక అయిన తర్వాత స్కైవర్-బ్రంట్ స్పందించింది. ఇంగ్లండ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎంతో అభిమానించే చార్లెట్ ఎడ్వర్డ్స్ సూచన మెరకు నా ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నాను.2013లో అరంగేట్రం నుంచి ఇంగ్లండ్ క్రికెట్కు నా వంతు సహకారం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. జట్టును విజయపథంలో నడిపించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని బ్రంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. స్కైవర్-బ్రంట్కు కెప్టెన్గా అనుభవం ఉంది. హీథర్ నైట్ గైర్హజరీలో 11 టీ20ల్లో ఇంగ్లండ్ జట్టుకు సారథ్యం వహించింది.చదవండి: సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం -
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. సోమవారం జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 14 ఏళ్ల సూర్యవంశీ సంచలన ప్రదర్శన కనబరిచాడు. అద్బుత సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అత్యంత చిన్న వయస్సులో ఐపీఎల్ సెంచరీ చేసిన ప్లేయర్గా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 38 బంతులు ఆడిన వైభవ్ సూర్యవంశీ ఏడు ఫోర్లు, పదకొండు సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. బిహార్కు చెందిన సూర్యవంశీపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో వైభవ్కు బిహార్ సీఎం నితీష్ కుమార్ రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు."ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 సంవత్సరాలు) నిలిచిన వైభవ్ సూర్యవంశీకి అభినందనలు. సూర్యవంశీ తన అద్బుత టాలెంట్తో భారత క్రికెట్కు భవిష్యత్తు ఆశాకిరణంగా నిలిచాడు. అతడి అంకితభావాన్ని, పట్టుదలను చూసి మేము గర్విస్తున్నాము.నేను 2024లో సూర్యవంశీ, అతడి తండ్రిని కలిశాను. ఐపీఎల్లో అతడి అద్భుతమైన ప్రదర్శన తర్వాత, ఫోన్లో సూర్యవంశీతో మాట్లాడాను. వైభవ్ సూర్యవంశీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేయనున్నాము. వైభవ్ భవిష్యత్తులో భారత జట్టుకు కూడా కొత్త రికార్డులు సృష్టిస్తాడని ఆశిస్తున్నాను" అని నితీష్ కుమార్ ఎక్స్లో పేర్కొన్నారు.చదవండి: IPL 2025: పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టాడు: వైభవ్ కోచ్ ఓఝాआई॰पी॰एल॰ के इतिहास में सबसे कम उम्र (14 साल) में शतक लगाने वाले खिलाड़ी बने बिहार के श्री वैभव सूर्यवंशी को बधाई एवं शुभकामनाएं। वे अपनी मेहनत और प्रतिभा के बलबूते भारतीय क्रिकेट की एक नई उम्मीद बन गए हैं। सभी को उन पर गर्व है। श्री वैभव सूर्यवंशी एवं उनके पिता जी से वर्ष 2024… pic.twitter.com/n3UmiqwTBX— Nitish Kumar (@NitishKumar) April 29, 2025 -
IPL 2025: పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టాడు: వైభవ్ కోచ్ ఓఝా
14 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను గడగడలాడిస్తూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్ సూర్యవంశీవైపు ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ కుర్రాడు ఎవరు..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని తెలుసుకునే పనిలో పడ్డారు క్రికెట్ అభిమానులు. ఈ క్రమంలో వైభవ్కు సంబంధించిన చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ చిన్ననాటి కోచ్ మనీశ్ ఓఝా చాలా విషయాలు చెప్పాడు. బ్రియాన్ లారాకు వీరాభిమాని అయిన వైభవ్లో నమ్మశక్యంకాని సిక్స్ హిట్టింగ్ ప్రతిభ ఉందని వెల్లడించాడు. వైభవ్ టాలెంట్ ముందు ఈ సెంచరీ చిన్నది అన్ని అన్నాడు. వైభవ్ పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టేవాడని.. రోజూ నెట్స్లో 350–400 బంతులు ఎదుర్కొనేవాడని తెలిపాడు.వైభవ్ గురించి అతడి ఓఝా మాటల్లో.. వైభవ్కు శిక్షణ ఇస్తున్న సమయంలో ఒక్కసారి కూడా తిట్టాల్సిన అవసరం రాలేదు. వైభవ్కు ఏ షాట్ నేర్పించినా, ఏ టెక్నిక్ను వివరించినా దాన్ని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. అతను వెంటనే గ్రహిస్తాడు. వైభవ్ను పదిన్నరేళ్ల వయసులో తొలిసారి చూశాను.ఆ వయసులోనే అతను ప్రపంచ స్థాయి బ్యాటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాడు. 2022లో ఓఝా కోచింగ్ సెంటర్లో నిర్వహించిన ఓ మ్యాచ్లో వైభవ్ 118 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో అతను కొట్టిన సిక్సర్లు ఇప్పుడు ప్రజలు చూస్తున్న సిక్సర్ల మాదిరిగానే ఉన్నాయి. ప్రతి సిక్సర్ 90 మీటర్లపైనే ఉండింది. ఆ సమయంలోనే వైభవ్ శక్తి, ఖచ్చితత్వం అసాధారణంగా ఉండేది. ఆ రోజే వైభవ్ అద్భుతాలు చేయగలడని నమ్మాను.14 ఏళ్ల పిల్లాడిలో ఇంత శక్తి ఎలా వస్తుందనే దానిపై స్పందిస్తూ.. వైభవ్లో ఈ అబ్బురపరిచే శక్తి ప్రమాదవశాత్తు వచ్చింది కాదు. అతను భారీ సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేయబట్టి నాలుగేళ్లవుతుంది. వైభవ్లో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అదే కాన్ఫిడెన్స్తో అతను భారీ షాట్లు ఆడుతాడు. వైభవ్కు ఈ స్థాయి సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం రావడానికి అతని కఠోర ప్రాక్టీస్ కూడా ఓ కారణం. వైభవ్ టైమింగ్, టెక్నిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. అతడికి ప్రాక్టీస్లో రోబోలతో త్రోలు వేయించేవాడిని. వైభవ్ ఎక్కువగా ఫుల్ టాస్ బంతులకు షాట్లు ప్రాక్టీస్ చేసేవాడు. రికార్డు సెంచరీకి ముందు రోజు కూడా వైభవ్తో మాట్లాడినట్లు ఓఝా తెలిపాడు.కాగా, ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, పొట్టి క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు.ఈ మ్యాచ్లో వైభవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లపై 11 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇందులో మూడు సిక్సర్లు 85 మీటర్లకు పైబడినవి కాగా.. రెండు 90 మీటర్లు దాటి ప్రయాణించాయి. కొన్ని సిక్సర్లు స్టేడియంలోని స్టాండ్స్ పైకప్పుపై కూడా పడ్డాయి. -
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేశారు. ఈ నలుగురిలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే.. నలుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే. పైగా నలుగురు 27 ఏళ్ల లోపు వారే. ఈ నలుగురు 45 బంతుల్లోపే సెంచరీలు పూర్తి చేశారు. వీరిలో ఇద్దరు సన్రైజర్స్ ఆటగాళ్లు కాగా.. ఒకరు పంజాబ్, ఒకరు రాజస్థాన్ ఆటగాడు.ఈ సీజన్లో తొలి సెంచరీని సన్రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ చేశాడు. సీజన్ రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఇషాన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన ఇషాన్, మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్లో ఇషాన్ చేసిన ఈ సెంచరీ 15వ వేగవంతమైన సెంచరీ.ఈ సీజన్లో రెండో సెంచరీని పంజాబ్ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య చేశాడు. సీజన్ 22వ మ్యాచ్లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ప్రియాంశ్ మూడంకెల స్కోర్ను సాధించాడు. ఈ మ్యాచ్లో ప్రియాంశ్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు.ప్రియాంశ్ ఈ సెంచరీని కేవలం 39 బంతుల్లో పూర్తి చేశాడు. ఐపీఎల్లో ఇది ఆరో వేగవంతమైన సెంచరీ. ప్రియాంశ్ ఈ రికార్డును సన్రైజర్స్ ఆటగాడు ట్రవిస్ హెడ్తో షేర్ చేసుకున్నాడు. ట్రవిస్ కూడా గత సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 39 బంతుల్లో శతక్కొట్టాడు.ఈ సీజన్లో మూడో సెంచరీని సన్రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ చేశాడు. సీజన్ 27వ మ్యాచ్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో 55 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 14 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 141 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అభిషేక్ది ఏడో వేగవంతమైన సెంచరీ.ఈ సీజన్లో నాలుగో సెంచరీని రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చేశాడు. సీజన్ 47వ మ్యాచ్లో వైభవ్ గుజరాత్ టైటాన్స్పై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో కేవలం 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. ఐపీఎల్లో ఫాస్టెస్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ (30 బంతుల్లో) పేరిట ఉంది.వైభవ్ ఈ సెంచరీ చేసే సమయానికి అతని వయసు కేవలం 14 ఏళ్ల 32 రోజులు. ఈ సెంచరీతో వైభవ్ చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో వైభవ్ అత్యంత పిన్న వయస్కుడు. -
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
శ్రీలంకతో జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్-2025లో భారత్ ఇవాళ (ఏప్రిల్ 29) సౌతాఫ్రికాతో తలపడుతుంది (కొలొంబో వేదికగా). ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్లో భారత్, సౌతాఫ్రికాతో పాటు శ్రీలంకు కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీ ఏప్రిల్ 27న ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్లో భారత్, శ్రీలంక తలపడ్డాయి. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్గా నిలిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు. ఈ టోర్నీలో భారత్ సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
ఇంకెంత దిగజారుతారు.. కార్గిల్లో ఓడించినా బుద్ధి రాలేదా.. అఫ్రిది వ్యాఖ్యలకు ధవన్ కౌంటర్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలకు టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ గట్టి కౌంటరిచ్చాడు. అఫ్రిదిని ట్యాగ్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. కార్గిల్లో ఓడించినా ఇంకా బుద్ధి రాలేదా..? ఇప్పటికే చాలా దిగజారారు. ఇంకెంత దిగజారుతారు. ఇలాంటి అర్ధరహిత వ్యాఖ్యలు చేసే బదులు మీ దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మాకు ఇండియన్ ఆర్మీ పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ మాతా కి జై. జై హింద్ అంటూ ట్వీట్ చేశాడు. Kargil mein bhi haraya tha, already itna gire hue ho aur kitna giroge, bewajah comments pass karne se acha hai apne desh ki taraqqi mai dimag lagao @SAfridiOfficial. Humein hamari Indian Army par bohot garv hai. Bharat Mata Ki Jai! Jai Hind!https://t.co/5PVA34CNSe— Shikhar Dhawan (@SDhawan25) April 28, 2025అఫ్రిదికి చురకలంటిస్తూ ధవన్ చేసిన ఈ ట్వీట్ సోషల్మీడియాలో వైరలవుతుంది. పాకీలకు ఈసారి మాటలతో బుద్ధి చెప్పినా ఉపయోగం లేదు. వారి అంతు చూడాల్సిందే అంటూ చాలా మంది భారతీయులు ధవన్ ట్వీట్కు రీట్వీట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అఫ్రిది వ్యాఖ్యలపై ధవన్ స్పందించిన వైనాన్ని మెచ్చుకుంటున్నారు.కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అఫ్రిది ఓ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ఆర్మీని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. భారత సైన్యం వైఫల్యం కారణంగానే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని అన్నాడు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉన్నప్పుడు ఈ దాడి ఎలా జరిగిందని ప్రశ్నించాడు. దీని అర్థం మీరంతా పనికిరాని వాళ్లనేగా అంటూ భారత సైన్యంపై అవాక్కులు చవాక్కులు పేలాడు.తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్పై నిందలు వేస్తోందని ఆరోపించాడు. భారత్లో చిన్న టపాసు పేలినా పాక్ను నిందించడం పరిపాటిగా మారిందని విమర్శించాడు. దమ్ముంటే ఈ దాడిలో పాక్ ప్రమేయాన్నిఆధారాల సహా నిరూపించాలని సవాల్ విసిరాడు.అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. అఫ్రిదిపై చాలామంది భారతీయులు సోషల్మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. భారత సైన్యంపై నోరు పారేసుకున్న ఆఫ్రిదిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన స్టయిల్లో కౌంటరిచ్చాడు. అఫ్రిది ఓ జోకర్, పనికిరాని వాడంటూ విమర్శించారు. పనికిరాని వాళ్ల వ్యాఖ్యలపై స్పందించడం అనవసరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించింది. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో పాక్ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. తాజాగా పాక్కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్లను కూడా బ్యాన్ చేసింది. -
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) వైభవ్ చాలా రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్లో వైభవ్ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్ 15.5 ఓవర్లలోనే గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది.వైభవ్ సాధించిన రికార్డులు..ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడు (35 బంతుల్లో)ఐపీఎల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడు (క్రిస్ గేల్ (30 బంతుల్లో) తర్వాత)ఐపీఎల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (11) కొట్టిన ఆటగాడు (మురళీ విజయ్తో కలిసి)టీ20 క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (17 బంతుల్లో)ఐపీఎల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడుమ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. వైభవ్ రికార్డు సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) చెలరేగడంతో మరో 25 మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రాయల్స్ గెలుపులో వైభవ్తో పాటు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు.మ్యాచ్ అనంతరం వైభవ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇది చాలా మంచి అనుభూతి. ఐపీఎల్లో సెంచరీ సాధించాలనేది నా కల. దీన్ని నా మూడో మ్యాచ్లోనే సాకారం చేసుకున్నాను. సీజన్ ప్రారంభానికి ముందు చేసిన కఠోర సాధనకు ఈ మ్యాచ్లో ఫలితం పొందాను. నేను బంతిని బాగా గమనించి ఆడతాను. నాకు భయం లేదు. నేను పెద్దగా ఆలోచించను. కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాను. జైస్వాల్తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. అతను నాకు ప్రతి విషయంలో గైడ్ చేస్తాడు. ఏమి చేయాలో, ఎలా ఆడాలో చెబుతాడు. నాలో సానుకూల విషయాలను నింపుతాడు.కాగా, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వైభవ్ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ సీజన్ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది. ఊహించినట్లుగానే వైభవ్ తొలి మ్యాచ్లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్లో మూడో మ్యాచ్లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. -
RR VS GT: వైభవ్ సృష్టించిన బీభత్సం మాటల్లో వర్ణించలేనిది: రాజస్థాన్ కెప్టెన్
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో వైభవ్ చాలా రికార్డులను కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్లో వైభవ్ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్ 15.5 ఓవర్లలోనే గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది. రాయల్స్ గెలుపులో వైభవ్లో పాటు (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు.అంతకుముందు శుభ్మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.ఈ మ్యాచ్లో వైభవ్ సృష్టించిన బీభత్సం పొట్టి క్రికెట్ బ్రతికున్నంతవరకు గుర్తుంటుంది. వైభవ్ కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ చేసిన విలయ తాండవాన్ని క్రికెట్ అభిమానులు ఎన్నటికి మర్చిపోరు. ఈ ఇన్నింగ్స్ తర్వాత వైభవ్పై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పాల బుగ్గల కుర్రాడు ఇలాంటి విలయాన్ని సృష్టించడమేంటని జనాలు ఆశ్చర్యపోతున్నారు.నిన్నటి మ్యాచ్ తర్వాత అందరి లాగే రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా వైభవ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. పరాగ్ మాటల్లో.. ఇది చాలా అద్భుతంగా ఉంది. మేము వైభవ్తో 2 నెలలు గడిపాము. అతను ఏమి చేయగలడో చూశాము. మాకందరికీ తెలుసు వైభవ్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ వస్తుందని. ప్రపంచ స్థాయి బౌలర్లైన గుజరాత్ బౌలర్లపై వైభవ్ సృష్టించిన బీభత్సకాండను మాటల్లో వర్ణించలేను.గత మూడు మ్యాచ్ల్లో స్వయంకృతాపరాధాల చేత చివరి నిమిషంలో మ్యాచ్లు కోల్పోయాము. ఈ మ్యాచ్లో అలా జరగకూడదనే మా ఆటతీరును మార్చాము. వీలైనంత త్వరగా మ్యాచ్ను ముగించాలని అనుకున్నాము. ఈ ఫలితం కోసం మేము చాలా కష్టపడ్డాము. మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలిగాము. ఐపీఎల్లో ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రయాణం. సూర్య భాయ్ ఆటతీరు. ఇలా చాలా విషయాలను గమనిస్తున్నాము. ఈ విజయం చాలా పెద్దది. ఇలాంటి విజయాల కోసమే మేము అన్వేషిస్తున్నాము. ఈ విజయం ఏకపక్షంగా వచ్చింది. ఇది చాలా సంతోషాన్నిస్తుంది. తదుపరి మ్యాచ్లో ఎలాంటి వికెట్ లభిస్తుందో చూడాలి. -
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఐపీఎల్ 2025 (Indian Premier League 2025) సీజన్లో ఒక సంచలనం. చిచ్చర పిడుగు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి చర్రితను తిరగరాసిన అద్భుత ప్రతిభావంతుడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్. రికార్డు బద్దలు కొట్టేశాడు. అయితే ఎవరి విజయమైనా అంత సులువుగా రాదు. కష్టాలు కన్నీళ్లు, కఠోర శ్రమతో తన కలను సాకారం చేసు కోవాల్సిందే. అలా అద్భుత ఇన్నింగ్స్ తో స్టార్గా మారిపోయాడు వైభవ. తరువాత ఈ సందర్బంగా కల తీరింది. భయంలేదు అంటూ తన జర్నీ గురించి మాట్లాడిన తీరు అమోఘంగా నిలిచింది. వైభవ్ సక్సెస్ జన్నీ ఎలా సాగింది, దేశంలోని అత్యుత్తమ క్రికెటర్గా తీర్చిదిద్దేందుకు వైభవ్ కుటుంబం చేసిన త్యాగం, కృషి ఏంటి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.వైభవ్ తండ్రి త్యాగం, పట్టుదల14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, T20లలో అర్ధశతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో యువ క్రికెటర్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కొడుకు కోసం స్వయంగా గ్రౌండ్, నాలుగేళ్ల క్రితం పొలం అమ్మేశాడువైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన కొడుకు క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చడానికి నాలుగు సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమిని అమ్మేశాడు. 2011 మార్చి 27న బిహార్లోని తాజ్పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఇష్టాన్ని, అతనిలోని ప్రతిభను తండ్రి , స్వయంగా క్రికెటర్ అయిన సంజీవ్ సూర్యవంశీ గుర్తించాడు. అంతే తనకున్న కొద్దిపాటి స్థలంలోనే వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంగా ఆయన చేతుల మీదిగా ఆ నేలను చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసి ఇచ్చాడు. అదే అతని కరియర్కు నాంది పలికింది. తొమ్మిదేళ్లు నిండగానే సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో చేర్పించారు సంజీవ్. అంతేకాదు కొడుకును క్రికెటర్గా తీర్చిదిద్దాలన్న కోరిక, కొడుకు క్రికెట్ కలను సాకారం కావాలనే ఆశయంతో తన పొలాన్ని అమ్మేశారు. తండ్రి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు కొడుకు. రెండున్నరేళ్ల శిక్షణ తరువాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16లో సత్తా చాటాడు వైభవ్. అలాగే ప్రతి రోజు సమస్తిపూర్ నుండి పాట్నాకు 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా శిక్షణలో మరింత రాటు దేలాడు. అలా గత ఏడాది ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ ఎంపిక చేయడం వరకు అతని జర్నీ సాగింది. వైభవ్ తనకొడుకు మాత్రమే కాదని, మొత్తం బిహార్కు కొడుకునని సంతోషంగా ప్రకటించారు తండ్రి సంజీవ్. చదవండి : ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్డోరేమాన్ నుంచి 13 ఏళ్లకే కోటీశ్వరుడుగాతాను కష్టపడి పనిచేసి వైభవ్కు శిక్షణ ఇప్పించాననీ, ఎనిమిదేళ్ల వయస్సు నుండి, క్రికెటర్ కావాలనే తన కలను సాధించేందుకు చాలా కష్టపడ్డాడంటూ కొడుకు పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు సంజీవ్. చిన్నపుడు డోరేమాన్ చూసేవాడు.. ఆ తరువాత క్రికెట్ ఒకటే.. అదే అతని ప్రాణం. ఎనిమిదేళ్లకే U-16 జిల్లా ట్రయల్స్లో రాణించాడన్నారు. క్రికెట్ కోచింగ్ కోసం సమస్తిపూర్కు తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడినంటూ ఆయన తన శ్రమను గుర్తు చేసుకున్నారు. తన శ్రమ, త్యాగం వృధా కాలేదు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైభవ్ను క్రికెటర్గా చూడాలన్న ఆశయంకోసం వ్యవసాయ భూమిని అమ్మేశాను.ఇప్పటికీ ఆర్థిక సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు.𝙏𝙖𝙡𝙚𝙣𝙩 𝙢𝙚𝙚𝙩𝙨 𝙊𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 🤗He announced his arrival to the big stage in grand fashion 💯It’s time to hear from the 14-year old 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝘂𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 ✨Full Interview 🎥🔽 -By @mihirlee_58 | #TATAIPL | #RRvGT https://t.co/x6WWoPu3u5 pic.twitter.com/8lFXBm70U2— IndianPremierLeague (@IPL) April 29, 2025 IPL 2025 వేలం రెండవ రోజున, రాజస్థాన్ రాయల్స్ వైభవ్ను రూ. 1.10 కోట్లు వెచ్చింది. ఈ ఎన్నిక అంత ఆషామాషీగా ఏం జరగలేదు. ఈ మెగా వేలానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నాగ్పూర్లో ఏర్పాటు చేసిన ట్రయల్స్ క్యాంప్లో సత్తా చాటుకున్నాడు. చిచ్చర పిడుగు సిక్సర్ల టాలెంట్ అప్పుడే బైటపడింది. ఇపుడు చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడి తన పేరును లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి తొలి బాల్ సిక్స్కొట్టి ఔరా అనిపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో మొదటి బంతికి సిక్స్ కొట్టిన పదో ఆటగాడిగా నిలిచాడు. అతని దూడుకును గమనిస్తే.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు రానున్నాయో అనిపించక మానదు. అందుకే యావత్ క్రికెట్ అభిమానులు ఆల్ ది బెస్ట్ అంటూ అభినందిస్తున్నారు. -
RR VS GT: ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగా, జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో వైభవ్ విధ్వంసకాండ ఓ పక్క కొనసాగుతుండగానే రాయల్స్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు.ఈ మ్యాచ్లో 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసిన జైస్వాల్.. రాయల్స్ను విజయతీరాలకు చేర్చడంతో పాటు ఆ జట్టు తరఫున 2000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఆటగాడిగా, ఓవరాల్గా ఐదో ప్లేయర్గా, ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాటర్గా, రాజస్థాన్ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ అరంగేట్రం నుంచి (2020) రాజస్థాన్ రాయల్స్కే ఆడుతున్న జైస్వాల్.. 62 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు ముందు రాయల్స్ తరఫున సంజూ శాంసన్ (3966), జోస్ బట్లర్ (3055), అజింక్య రహానే (2810), షేన్ వాట్సన్ (2372) 2000 పరుగులు పూర్తి చేశారు.ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్ గేల్- 48 ఇన్నింగ్స్ల్లోషాన్ మార్ష్- 52రుతురాజ్ గైక్వాడ్- 57కేఎల్ రాహుల్- 60యశస్వి జైస్వాల్- 62మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) సునామీ శతకంతో విరుచుకుపడటంతో రాయల్స్ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగానే జైస్వాల్ తన సహజ శైలిలో చెలరేగుతూ రాయల్స్ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అంతకుముందు శుభ్మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. -
IPL 2025: 35 బంతుల్లో సెంచరీ.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ కొట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. ఈ విధ్వంసకర ప్రదర్శనతో సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. సోషల్మీడియాలో ఎక్కడ చూసినా సూర్యవంశీ జపమే నడుస్తుంది. క్రికెట్ దిగ్గజాలు సూర్యవంశీ సృష్టించిన బీభత్సాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత మాజీ ఆల్రౌండర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్.. ఇలా చాలామంది భారత మాజీలు వైభవ్ను ఆకాశానికెత్తారు. సోషల్మీడియాలో అభిమానులు వైభవ్కు 'బేబీ బాస్'గా బిరుదు ఇచ్చారు.స్కూల్కు వెళ్లాల్సిన వయసులో (14 ఏళ్ల 32 రోజులు) వైభవ్ సృష్టించిన ఈ విధ్వంసకాండ పొట్టి క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోతుంది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వైభవ్ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ కుర్రాడిలో ఎదో మ్యాజిక్ ఉందని భావించి ఈ సీజన్ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది. ఊహించినట్లుగానే వైభవ్ తొలి మ్యాచ్లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఆ ఇన్నింగ్స్లో వైభవ్ తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్లో మూడో మ్యాచ్లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.ఈ ఇన్నింగ్స్లో మొత్తం 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో వైభవ్ చాలా రికార్డులను కొల్లగొట్టాడు.- ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా- ఐపీఎల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా (క్రిస్ గేల్ (30 బంతుల్లో) తర్వాత)- ఐపీఎల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా- ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా (మురళీ విజయ్తో కలిసి)- టీ20 క్రికెట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా - ఐపీఎల్లో హాఫ్ సెంచరీ (17 బంతుల్లో) చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులు నెలకొల్పాడు.ఈ మ్యాచ్లో ప్రదర్శనకు గానూ వైభవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగానూ వైభవ్ రికార్డుల్లోకెక్కాడు.ఈ ఇన్నింగ్స్లో వైభవ్ ఇషాంత్ శర్మపై ఎదురుదాడికి దిగిన వైనం మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వైభవ్ 3 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 28 పిండుకున్నాడు. అనుభవజ్ఞుడు, కోపిష్టి అయిన ఇషాంత్ 14 ఏళ్ల వైభవ్ షాట్లు ఆడుతుంటే నిస్సహాయస్థితిలో చూస్తుండిపోయాడు. వైభవ్ కరీమ్ జనత్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లోనూ శివతాండవం చేశాడు. ఆ ఓవర్లో అతను 3 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 30 పరుగులు రాబట్టాడు. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ ఏ బౌలర్నూ వదల్లేదు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో 2 సిక్సలు, 2 ఫోర్లు సహా 21 పరుగులు.. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే భారీ సిక్సర్.. ప్రస్తుత సీజన్లో అద్భుతాలు చేస్తున్న ప్రసిద్ద్ బౌలింగ్లో మరో భారీ సిక్సర్ ఇలా ప్రతి ఒక్క బౌలర్ను ఊచకోత కోశాడు. రషీద్ ఖాన్ ఒక్కడే తప్పించుకున్నాడు.వైభవ్ సృష్టించిన విధ్వంసం ధాటికి గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యం 15.5 ఓవర్లలోనే ఛేదించబడింది. ఐపీఎల్ చరిత్రలోనే 200 ప్లస్ టార్గెట్ ఇంత తక్కువ బంతుల్లో ఛేదించబడటం ఇదే మొదటిసారి. రాయల్స్ ఇన్నింగ్స్లో జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.అంతకుముందు శుభ్మన్ గిల్ (50 బంతుల్లో 84), జోస్ బట్లర్ (26 బంతులోల 50 నాటౌట్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. -
IPL 2025: విధ్వంసంలో వైభవం
సచిన్ వేగాన్ని ఆరాధించాం. సెహ్వాగ్ దూకుడును చూశాం. రో‘హిట్స్’ను ఆస్వాదించాం. కోహ్లి ‘షో’కు ముచ్చటపడ్డాం. వీళ్లందరూ ప్రొఫెషనల్ క్రికెటర్లు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం కాదు. 14 ఏళ్ల ఈ కుర్రాడు ఓ అనామకుడు. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాచ్కు ముందు బహుశా చాలా మందికి అతనెవరో తెలియదు. కానీ తెలుసుకుంటారు. నెట్టింట గూగుల్లో సెర్చ్ చేస్తారు. ‘లైక్’లు కొట్టే షాట్లను ఫోన్ కెమెరాల్లో బంధించారు. ‘షేర్’ చేసే సమయం ఇవ్వనంతగా సిక్స్ల ‘షో’ చూశారు. 35 బంతుల సెంచరీకి ‘సబ్ స్క్రైబ్’ అయిపోయారు. ఐపీఎల్ కొత్త వైభవానికి పండగ చేసుకున్నారు. జైపూర్: ఐపీఎల్ 2008లో పుట్టింది. లీగ్ పుట్టిన మూడేళ్ల (2011లో) తర్వాత లోకం చూసిన బుడ్డొడిని పురుడు పోసిన కొద్దిమందే చూశారు! 14 ఏళ్లు తిరిగేసరికి ఇప్పుడా కుర్రాడిని మొత్తం క్రికెట్ ప్రపంచమే చూసి మురిసింది. అ బుడ్డొడు... ఇప్పటి కుర్రాడు... వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో అతనొక సంచలనం. బ్యాటింగ్ మెరుపులకే వైభోగం. క్రికెట్ ప్రేక్షకులకి కనుల పండగ అతని శతకం. బంతి సిక్స్లకే ఫిక్స్ అయినట్లు... అతని బ్యాట్ షాట్లకే అలవాటైనట్లు... అతని ‘షో’కు బంతులన్నీ దాసోహమైనట్లు అలవోకగా ఆడేశాడు.వైభవ్ (38 బంతుల్లో 101; 7 ఫోర్లు, 11 సిక్స్లు) శతకానికి జైపూర్లో నిశిరాతిరి కూడా వెలుగులు విరజిమ్మింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీస్కోరు చేసింది. శుబ్మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్స్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 15.5 ఓవర్లలోనే కేవలం రెండే వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. యశస్వీ జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగాడు. ఫిఫ్టీలో 48 పరుగులు... సిక్స్లు, ఫోర్లతోనే... పెద్ద లక్ష్యం... ఛేదించడం కష్టం... ఇలాంటి పరిస్థితుల మధ్య పరుగుల వేట మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పరుగుల ఉప్పెన చూపెట్టారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ ఆట అసాంతం హైలైట్స్నే తలపించింది. సూర్యవంశీ షాట్ల ఎంపిక, సిక్స్ల తుఫాన్ ఒక్క మైదానాన్నే కాదు... క్రికెట్ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. జైస్వాల్ పరుగుతో మొదలైన తొలిఓవర్ వైభవ్ సిక్సర్తో ఊపందుకుంది. రెండో ఓవర్లో యశస్వి సిక్స్ బాదడంతో రెండు ఓవర్లలో 19 పరుగులు వచ్చాయి. కానీ ఆ తర్వాతే విధ్వంసరచన మొదలైంది. సిరాజ్ మూడో ఓవర్లో జైస్వాల్ 3 ఫోర్లు కొట్టాడు. 3 ఓవర్లలో జట్టు స్కోరు 32. అప్పటికింకా వైభవ్ (9) పది పరుగులైనా చేయలేదు. ఇషాంత్ నాలుగో ఓవర్తో అతని షో మ్యాచ్ రూపాన్ని మార్చింది. 6, 6, 4, 0, 6, వైడ్, వైడ్, 4లతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తర్వాత ఐదో ఓవర్లో జైస్వాల్ బౌండరీ, సింగిల్ తీసివ్వగా, వైభవ్ 6, 0, 6, 4... ఈ బౌండరీతోనే 17 బంతుల్లోనే అతని ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ అది కూడా ఐదో ఓవర్లోనే పూర్తయ్యింది. ఇందులో 3 బౌండరీలు, 6 సిక్స్లు అంటే 48 పరుగులు మెరుపులే! ఇలా ‘పవర్ ప్లే’నే పరుగెత్తుకున్న చందంగా, బౌండరీ లైన్–బంతి ముద్దు ముచ్చటలాడిన విధంగా అతని విధ్వంసం సాగింది. 35 బంతుల్లో భారతీయ శతకం రాయల్స్ జట్టు 6 ఓవర్లలో 87/0 స్కోరు చేసింది. జైస్వాల్ కొట్టిన వరుస బౌండరీలతో ప్రసిధ్ కృష్ణ 8వ ఓవర్లో జట్టు స్కోరు వందను దాటింది. ఇంకా డజను ఓవర్లు మిగిలివుంటే చేయాల్సిన లక్ష్యం (102) సగం కంటే తక్కువగా కరిగింది. ఐపీఎల్ అరంగేట్రం చేసిన కరీమ్ జనత్ వేసిన పదో ఓవర్లో అయితే వైభవ్ వీరబాదుడికి సిక్స్, ఫోర్ పోటీపడినట్లుగా అనిపించింది. 6, 4, 6, 4, 4, 6లతో 30 పరుగుల్ని రాబట్టాడు. 10 ఓవర్లలో 144/0 స్కోరు చేసింది. రషీద్ఖాన్ వేసిన మరుసటి ఓవర్లోనే మిడ్వికెట్ మీదుగా బాదిన సిక్స్తో వైభవ్ సెంచరీ 35 బంతుల్లోనే పూర్తయ్యింది. గేల్ (30 బంతుల్లో) తర్వాత ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం కాగా... భారత ఆటగాడు కొట్టిన తొలి ఫాస్టెస్ట్ సెంచరీగా పుటలకెక్కింది. 12వ ఓవర్లో వైభవ్ను బౌల్డ్ చేయడం ద్వారా ప్రసిధ్ కృష్ణ తొలివికెట్ను తీశాడు. 166 పరుగుల ఓపెనింగ్ వికెట్కు తెరపడింది. నితీశ్ (4) విఫలమైనా... మిగతా లాంఛనాన్ని జైస్వాల్, కెప్టెన్ రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా అంతే వేగంగా ముగించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) పరాగ్ (బి) తీక్షణ 39; గిల్ (సి) పరాగ్ (బి) తీక్షణ 84; బట్లర్ (నాటౌట్) 50; వాషింగ్టన్ సుందర్ (సి) హెట్మైర్ (బి) సందీప్ 13; తెవాటియా (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్ 9; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–93, 2–167, 3–193, 4–202. బౌలింగ్: ఆర్చర్ 4–0–49–1, తీక్షణ 4–0–35–2, యు«ద్వీర్ 3–0–38–0, సందీప్ శర్మ 4–0–33–1, పరాగ్ 1–0–14–0, హసరంగ 4–0–39–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 70; వైభవ్ (బి) ప్రసిధ్ కృష్ణ 101; నితీశ్ రాణా (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ ఖాన్ 4; పరాగ్ (నాటౌట్) 32; ఎక్స్ట్రాలు 5; మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–166, 2–171. బౌలింగ్: సిరాజ్ 2–0–24–0, ఇషాంత్ 2–0–36–0, సుందర్ 1.5–0–34–0, ప్రసిధ్ కృష్ణ 4–0–47–1, రషీద్ 4–0–24–1, కరీమ్ 1–0–30–0, సాయి కిషోర్ 1–0–16–0. వైభవ్ సూర్యవంశీ రికార్డులు → టి20 క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన పిన్న వయసు్కడిగా వైభవ్ (14 ఏళ్ల 32 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు భారత్కే చెందిన మహారాష్ట్ర ప్లేయర్ విజయ్ జోల్ (18 ఏళ్ల 118 రోజులు; ముంబైపై 2013లో) పేరిట ఉంది. → ఐపీఎల్లో అర్ధ సెంచరీ, సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా వైభవ్ ఘనత వహించాడు. గతంలో అర్ధ సెంచరీ రికార్డు రియాన్ పరాగ్ (17 ఏళ్ల 175 రోజులు; 2019లో) పేరిట, సెంచరీ రికార్డు మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు; 2009లో) పేరిట నమోదయ్యాయి. → ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారతీయ ప్లేయర్గానూ వైభవ్ గుర్తింపు పొందాడు. యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో ముంబై ఇండియన్స్పై 2010లో) పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ (30 బంతుల్లో 2013లో పుణే వారియర్స్పై) తర్వాత ఐపీఎల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ వైభవే కావడం విశేషం.చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్లో ఆడిన మూడో ఇన్నింగ్స్లోనే సెంచరీ చేయడం సంతోషం. మూడు, నాలుగు నెలల నుంచి పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. నేను బౌలర్లు ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోను. కేవలం బంతి మీదే దృష్టి పెడతా. యశస్వి జైస్వాల్తో కలిసి బ్యాటింగ్ చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడంతో పాటు ఆత్మవిశ్వాసం నింపుతాడు. దీంతో బ్యాటింగ్ చేయడం సులువవుతుంది. ఐపీఎల్లో సెంచరీ చేయాలన్నది నా కల. క్రీజులో అడుగు పెట్టాక భయపడను. అసలు వేరే ఏ అంశాలను పట్టించుకోను. కేవలం నా ఆటపైనే దృష్టి పెడతా. – వైభవ్ సూర్యవంశీ -
సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్.. గుజరాత్కు రాజస్తాన్ షాక్
ఐపీఎల్-2025లో జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ జూలు విధిల్చింది. ఈ మ్యాచ్లో గుజరాత్ను 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ చిత్తు చేసింది. ఈ విజయంతో రాజస్తాన్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీని అందుకున్నాడు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా 14 ఏళ్ల వైభవ్ రికార్డులకెక్కాడు. ఓవరాల్గా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు యశస్వి జైశ్వాల్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 70 నాటౌట్) సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ మాత్రమే చెరో వికెట్ సాధించారు.గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్మన్ గిల్ మరోసారి తన బ్యాట్కు పని చెప్పాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 84 పరుగులు చేసి గిల్ ఔటయ్యాడు. అతడితో పాటు బట్లర్(50), సాయిసుదర్శన్(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో థీక్షణ రెండు, అర్చర్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఐపీఎల్-2025లో జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 210 భారీ లక్ష్య చేధనలో 14 ఏళ్ల చిచ్చరపిడుగు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో వైభవ్ సిక్సర్ల వర్షం కురిపించాడు.మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సూర్యవంశీ ఊతికారేశాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. ఈ క్రమంలో వైభవ్ కేవలం 35 బంతుల్లోనే తన ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్కు ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. సూర్యవంశీ ఔటై పెవిలియన్కు వెళ్తుండగా స్టేడియంలో అందరూ నిలిచి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇక మెరుపు సెంచరీతో చెలరేగిన సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సూర్యవంశీ సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ యూసఫ్ పఠాన్ పేరిట ఉండేది. 2010 సీజన్లో ముంబై పై రాజస్తాన్ తరపున యూసఫ్ 37 బంతుల్లో శతకం సాధించాడు. తాజా మ్యాచ్లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన సూర్యవంశీ.. యూసుఫ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన జాబితాలో క్రిస్ గేల్(30 బంతులు) ఉన్నాడు.👉అదేవిధంగా టీ20 క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులెక్కాడు. వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల 32 రోజుల వయస్సులో ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు మహారాష్ట్ర ప్లేయర్ విజయ్ జోల్(18 సంవత్సరాల 118 రోజులు) పేరిట ఉండేది.ఈ మ్యాచ్తో జోల్ను వైభవ్ అధిగమించాడు. అదేవిధంగా ఐపీఎల్లో హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడు కూడా వైభవే కావడం విశేషం.టీ20ల్లో సెంచరీ చేసిన పిన్న వయష్కులు వీరే..వైభవ్ సూర్యవంశీ(14 సంవత్సరాల 32 రోజులు)విజయ్ జోల్(18 సంవత్సరాల 118 రోజులు)పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (18 సంవత్సరాలు 179 రోజులు)గుస్తావ్ మెక్కీన్(18 సంవత్సరాల 280 రోజులు ) Youngest to score a T20 1⃣0⃣0⃣ ✅Fastest TATA IPL hundred by an Indian ✅Second-fastest hundred in TATA IPL ✅Vaibhav Suryavanshi, TAKE. A. BOW 🙇 ✨Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/sn4HjurqR6— IndianPremierLeague (@IPL) April 28, 2025 -
'ముంబై మంచి రిథమ్లో ఉంది.. ప్రతీ జట్టు భయపడాల్సిందే'
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరంభంలో వరుస ఓటుములతో తడబడిన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చింది. ఆదివారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 54 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.ముంబైకి ఇది వరుసగా ఐదో విజయం కావడం గమనార్హం. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఇడియన్స్ మూడో స్ధానానికి చేరుకుంది. ఈ క్రమంలో ముంబై జట్టుపై టీమిండియా మాజీ ప్లేయర్ పీయాష్ చావ్లా ప్రశంసల వర్షం కురిపించాడు. ముంబై జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ప్రతీ జట్టు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు."ముంబై ప్లేయింగ్ ఎలెవన్లో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఈ రోజు జస్ప్రీత్ బుమ్రా వంతు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ముంబై ఇండియన్స్ మంచి రిథమ్లో ఉంది. ముంబై ఇటువంటి రోల్లో ఉన్నప్పుడు, కచ్చితంగా ఇతర జట్లు వారిని చూసి భయపడాలి. ముంబై ప్లేయింగ్ ఎలెవన్లో మొదటి నుంచి చివరి వరకు అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ర్యాన్ రికెల్టన్ ఈ రోజు మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విల్ జాక్స్ బంతితో ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్లో రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. ప్రస్తుతం ముంబై సరైన ట్రాక్లో ఉందని లక్నో మ్యాచ్ అనంతరం చావ్లా పేర్కొన్నాడు. -
రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న అశ్విన్! వీడియో
టీమిండియా మజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. సోమవారం (April 28) రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో.. ఈ అవార్డును అశ్విన్ స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. కాగా భారత క్రికెట్కు అందించిన సేవలకు గాను అశ్విన్కు ఈ అరుదైన గౌరవం లభించింది. ఈ ప్రత్యేక గౌరవం పొందినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అశ్విన్ను ప్రశంసించింది. "భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందుకున్న అశ్విన్కు అభినందనలు. ఇది అతడి కెరీర్లో సాధించిన అద్బుత విజయాలకు దక్కిన గౌరవమని" బీసీసీఐ ఎక్స్లో రాసుకొచ్చింది. అశ్విన్ తన 15 ఏళ్ల కెరీర్లో భారత్ తరపున 287 మ్యాచ్లు ఆడాడు. అందులో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఉన్నాయి. 106 టెస్టుల్లో అశ్విన్ 537 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా ఈ తమిళనాడు క్రికెటర్ కొనసాగుతున్నాడు. వన్డేల్లో 156 వికెట్లు, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్తో పాటు భారత హాకీ దిగ్గజం పిఆర్ శ్రీజేష్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. 2024 పారిస్ ఒలింపిక్స్లో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకోవడంలో శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. పారిస్ ఒలింపిక్స్ అనంతరం శ్రీజేష్ హాకీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. Congratulations to @ashwinravi99 on being conferred the prestigious Padma Shri award by the Hon'ble President of India @rashtrapatibhvn, honouring his remarkable achievements and an illustrious career with #TeamIndia pic.twitter.com/8HlYQx3Dsl— BCCI (@BCCI) April 28, 2025 -
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐపీఎల్లో 94 మ్యాచ్లు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్గా కొనసాగుతోంది. ఐపీఎల్ను మరింత ఆకర్షణగా మార్చేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత 74 మ్యాచ్ల నుండి టోర్నమెంట్ను 94 మ్యాచ్ల సీజన్కు విస్తరించాలని బీసీసీఐ భావిస్తోంది. 2028 నుంచే మ్యాచ్ల సంఖ్య పెంచేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశాడు."భవిష్యత్తులో ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్యను పెంచే అవకాశముంది. ఇదే విషయాన్ని ఐసీసీతో చర్చిస్తున్నాము. బీసీసీఐలో కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ను కూడా ఫ్యాన్స్ ఆదరిస్తున్నారు. మ్యాచ్ల సఖ్యను పెంచి అభిమానులకు మరింత వినోదాన్ని అందించడమే మా లక్ష్యం. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ తొమ్మిది వారాలు పాటు జరుగుతుంది. దాన్ని 11 వారాలకు పెంచాలని ఆలోచిస్తున్నాము. అంటే 74 మ్యాచ్ల నుంచి 84 లేదా 94కి పెంచవచ్చు. ప్రతి జట్టు సొంత గడ్డపై, ప్రత్యర్థి గడ్డపై రెండేసి మ్యాచ్లు ఆడేందుకు వీలు ఉంటుంది" అని ధుమాల్ పేర్కొన్నారు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి ఇప్పటిలో కొత్త ఫ్రాంచైజీలను తీసుకొచ్చే ఆలోచన లేదని ఆయన తెలిపారు. కాగా 59 మ్యాచ్లతో ప్రారంభమైన ఐపీఎల్.. ప్రస్తుతం 74 మ్యాచ్ల సీజన్గా కొనసాగుతోంది. -
సూర్యవంశీ సెంచరీ.. గుజరాత్ను చిత్తు చేసిన రాజస్తాన్
IPL Rajasthan Royals vs Gujarat Titans Live Updates:గుజరాత్ను చిత్తు చేసిన రాజస్తాన్జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్లో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్తాన్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీని అందుకున్నాడు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా 14 ఏళ్ల వైభవ్ రికార్డులకెక్కాడు. ఓవరాల్గా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు యశస్వి జైశ్వాల్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 70 నాటౌట్) సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ప్రసిద్ద్, రషీద్ ఖాన్ మాత్రమే చెరో వికెట్ సాధించారు.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్..సూర్యవంశీ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది.101 పరుగులు చేసిన సూర్యవంశీ.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు రాజస్తాన్ వికెట్ నష్టానికి 170 పరుగులు చేసింది.35 బంతుల్లో సూపర్ సెంచరీగుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ సూర్యవంశీ సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 11 సిక్స్లు ఉన్నాయి. 11 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 155 పరుగులు చేసింది. క్రీజులో సూర్యవంశీ(101), జైశ్వాల్(49) ఉన్నారు.సూర్యవంశీ విధ్వంసంగుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో 14 ఏళ్ల సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్స్లతో తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవన్షీ(35), యశస్వీ జైశ్వాల్ దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(21), వైభవ్ సూర్యవంశీ(9) ఉన్నారు.చెలరేగిన గిల్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్మన్ గిల్ మరోసారి తన బ్యాట్కు పని చెప్పాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 84 పరుగులు చేసి గిల్ ఔటయ్యాడు. అతడితో పాటు బట్లర్(50), సాయిసుదర్శన్(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో థీక్షణ రెండు, అర్చర్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు.గుజరాత్ రెండో వికెట్ డౌన్..శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 84 పరుగులుచేసిన గిల్.. థీక్షణ బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(37), సుందర్(1) ఉన్నారు.భారీ స్కోర్ దిశగా గుజరాత్..15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(30), గిల్(77) ఉన్నారు.శుబ్మన్ గిల్ ఫిప్టీ..జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు.51 పరుగులతో గిల్ తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. క్రీజులో గిల్తో పాటు సుదర్శన్(39) ఉన్నారు.3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 27/0మూడు ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(16), సుదర్శన్(11) ఉన్నారు.ఐపీఎల్-2025లో జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ రాజస్తాన్కు చాలా కీలకం. గుజరాత్పై గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలను రాజస్తాన్ సజీవంగా ఉంచుకుంటుంది.ఈ మ్యాచ్ రాయల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. మతీషా థీక్షణ,యుద్ద్వీర్ సింగ్ తుది జట్టులోకి వచ్చారు. అదేవిధంగా గుజరాత్ తరపున కరీమ్ జనత్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, కరీం జనత్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణరాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్ చరక్” -
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా రికార్డు
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ తమ జైత్ర యాత్ర కొనసాగుతోంది. హార్దిక్ సేన వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 54 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై ఆల్రౌండ్షోతో అదరగొట్టింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు.ముంబై సరికొత్త చరిత్ర..ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్లో 150 మ్యాచ్ల్లో గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు 271 మ్యాచ్లు ఆడిన ముంబై 150 విజయాలు సాధించింది. ఈ జాబితాలో ముంబై తర్వాతి స్దానంలో సూపర్ కింగ్స్ (248 మ్యాచ్లు) ఉంది. మూడు నాలుగు స్ధానాల్లో కేకేఆర్(134), ఆర్సీబీ(129) కొనసాగుతున్నాయి.చదవండి: నాకంటూ ఓ ప్రణాళిక ఉంటుంది.. అది మర్చిపోతే ఎలా?!: కోహ్లి కౌంటర్ -
నాకంటూ ఓ ప్రణాళిక ఉంటుంది.. అది మర్చిపోతే ఎలా?!: కోహ్లి కౌంటర్
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 108.51 స్ట్రైక్ రేట్తో 51 పరుగులు చేశాడు. 163 పరుగుల లక్ష్య చేధనలో 26 రన్స్కే 3 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది.ఈ సమయంలో కోహ్లి ఆచితూచి ఆడుతూ కృనాల్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉన్నప్పటికి కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ ఎంతో విలువైనది. ఈ క్రమంలో తన స్ట్రైక్ రేట్పై విమర్శల చేస్తున్నవారికి కోహ్లి మరోసారి కౌంటరిచ్చాడు.టీ20 క్రికెట్లో దూకుడు ఒక్కటే ముఖ్యం కాదని, పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయడం అవసరమని కోహ్లి అన్నాడు. "టీ20, వన్డే, టెస్టు.. ఫార్మాట్ ఏదైనా మనకంటూ ఒక ప్రణాళిక ఉండాలి. స్కోర్ బోర్డులో ఎంత మొత్తం ఉంచాలి,?మనం చేధించాల్సిన టార్గెట్ ఎంత? పిచ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ బౌలర్ను ఎటాక్ చేయాలి? ఏ బౌలర్ను ఎటాక్ చేయకూడదు? ఇవన్నీ ఆలోచించి వ్యూహత్మకంగా ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా ఛేజింగ్లో ఎప్పుడూ నాకంటూ ఓ ప్లానింగ్ ఉంటుంది. ఎక్కువగా సింగిల్స్, డబుల్స్పై దృష్టిపెడతాను. ఏదో విధంగా పరుగులు రాబట్టమే నా లక్ష్యం. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నిస్తాను. స్ట్రైక్స్ రొటేటింగ్, సింగిల్స్, డబుల్స్ తీయడమే నా గేమ్ ప్లాన్. అయితే టీ20 క్రికెట్లో భాగస్వామ్యం నెలకొల్పడం, గేమ్ను క్లోజ్గా తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో విమర్శకులు మర్చిపోతున్నారు అనుకుంటా. ఈ ఏడాది సీజన్లో ఏ బ్యాటర్ కూడా తొలి బంతి నుంచే బౌలర్ను ఎటాక్ చేయడం లేదు. పిచ్ పరిస్థితిని ఆర్ధం చేసుకోని, బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాలంటే మనంటూ ప్రొఫిషనలిజం ఉండాలి. స్లో పిచ్లపై స్ట్రైక్ రోటేట్ చేయడం అంత తేలిక కాదు. దానికంటూ ప్రత్యేక స్కిల్స్ ఉండాలి. నేను పిచ్ కండీషన్స్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడేందుకు ప్రయత్నిస్తాను. స్ట్రైక్ రోటేట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించేందుకు నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో విరాట్ పేర్కొన్నాడు.కాగా గతేడాది సీజన్లో కోహ్లి స్ట్రైక్ రేట్పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శలు చేశార. సింగిల్స్ తీస్తూ కోహ్లి చాలా నిదానమైన ఇన్నింగ్స్ ఆడాడని, ఆర్సీబీ ఇలాంటి ప్రదర్శను ఆశించట్లేదని గవాస్కర్ మండిపడ్డారు. అదేవిధంగా ఆర్సీబీ జట్టులో బిగ్ హిట్టర్లు ఉన్నప్పటికి కోహ్లి ఎటవంటి రిస్క్ తీసుకోకుండా స్లోగా ఆడాడని ఆయన అన్నారు. ఆ తర్వాత గవాస్కర్కు కోహ్లి కౌంటరిచ్చాడు. "చాలా మంది వ్యక్తులు నా స్ట్రైక్రేటు గురించి, స్పిన్లో సరిగా ఆడట్లేదని మాట్లాడుతున్నారు. జట్టుకు విజయం అందించడమే నా లక్ష్యం. మీరు పరిస్థితులను ఎదుర్కోకుండా కామెంటరీ బాక్స్లో కూర్చొని మాట్లాడటం సరికాదు" అని కోహ్లి పేర్కొన్నాడు.ఆ తర్వాత గవాస్కర్ కూడా కోహ్లి వ్యాఖ్యలకు బదులిచ్చారు. కోహ్లి స్ట్రైక్ రేట్పైన మాత్రమే కామెంటేటర్లు మాట్లాడారు. అంతే తప్ప ఆటగాళ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనే ఆలోచన ఏ వ్యాఖ్యతకు లేదు. ఓపెనర్గా వచ్చి.. 14-15 ఓవర్ వరుకు క్రీజులో ఉండి, 118 స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేస్తే పొగడ్తలు ఉండవు అని గవాస్కర్ రిప్లే ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి కోహ్లి వ్యాఖ్యలు చూస్తే గవాస్కర్కే కౌంటిరిచ్చినట్లు అన్పిస్తోంది. -
IPL 2025: ‘పంజాబ్ ఈసారీ టైటిల్ గెలవదు.. ఎందుకంటే?!’
ఐపీఎల్-2025 (IPL 2025)లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. గతేడాది పద్నాలుగింట కేవలం ఐదే గెలిచిన ఈ జట్టు.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సీజన్ను ముగించింది. అయితే, ఈసారి ఇప్పటికి ఆడిన తొమ్మిది మ్యాచ్లలో ఏకంగా ఐదు గెలిచింది.ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో శనివారం నాటి మ్యాచ్లోనూ 201 పరుగుల మేర భారీ స్కోరు చేసిన పంజాబ్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో 11 పాయింట్లతో పంజాబ్ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది.సానుకూల ఫలితాలుకొత్త కోచ్ రిక్కీ పాంటింగ్ (Ricky Ponting), నూతన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సారథ్యంలో పంజాబ్ ఈ మేరకు సానుకూల ఫలితాలు సాధిస్తోంది. ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న అపవాదును చెరిపి వేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి మాత్రం భిన్నంగా స్పందించాడు.ఈసారి కూడా పంజాబ్ ట్రోఫీ గెలవదుకేకేఆర్తో మ్యాచ్లో రిక్కీ పాంటింగ్ వ్యవహరించిన తీరు చూసిన తర్వాత.. ఈసారి కూడా పంజాబ్ ట్రోఫీ గెలవలేదంటూ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. ‘‘ఈ సీజన్లో కూడా పంజాబ్ టైటిల్ సాధించలేదని నాకు గట్టి నమ్మకం.ఎందుకంటే.. కేకేఆర్తో మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ చూసినప్పుడు నాకో విషయం అర్థమైంది. ఫామ్లో ఉన్న భారత బ్యాటర్లు నేహాల్ వధేరా, శశాంక్ సింగ్లను కాకుండా ఆ జట్టు కోచ్ విదేశీ ఆటగాళ్లను బ్యాటింగ్కు పంపించాడు.పాంటింగ్ వాళ్లను నమ్మడుభారత బ్యాటర్ల కంటే వారిపైనే ఎక్కువ నమ్మకం ఉంచాడు. కానీ వాళ్లు ఏమీ చేయలేకపోయారు. దీనిని బట్టి భారత ఆటగాళ్లపై కోచ్కు నమ్మకం లేదనిపిస్తోంది. అందుకే వాళ్లను లోయర్ ఆర్డర్లో పంపించాడు.అతడు ఇలాగే చేశాడంటే టాప్-2లోకి వచ్చినా వాళ్లు టైటిల్ మాత్రం గెలవలేరు’’ అని మనోజ్ తివారి ఎక్స్ వేదికగా రిక్కీ పాంటింగ్ తీరును విమర్శించాడు. అయితే, మనోజ్ తీరుపై పంజాబ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘వ్యూహంలో భాగంగా.. ఒత్తిడి లేని సమయంలో ఫామ్లో లేని ఆటగాళ్లను పరీక్షిస్తే వచ్చిన నష్టమేమిటి? వివిధ రకాల కాంబినేషన్లు ట్రై చేయడంలో తప్పేముంది?’’ అని మనోజ్ను ట్రోల్ చేస్తున్నారు. కాగా కేకేఆర్తో మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది.మెరుపు ఇన్నింగ్స్ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69), ప్రభ్సిమ్రన్ సింగ్(49 బంతుల్లో 83) మెరుపు ఇన్నింగ్స్తో దుమ్ములేపారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంలో వచ్చి 25 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక నాలుగో స్థానంలో వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ (7) మరోసారి నిరాశపరచగా.. ఈసారి మార్కో యాన్సెన్ (3) కూడా విఫలమయ్యాడు. ఐదో స్థానంలో వచ్చిన జోష్ ఇంగ్లిస్ (6 బంతుల్లో 11) అయ్యర్తో కలిసి ఆఖరి వరకు అజేయంగా ఉన్నాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఒక ఓవర్లో ఏడు పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ రద్దైపోయింది.చదవండి: అదరగొడుతున్నాడు.. అతడిని టీమిండియా టీ20 జట్టులోకి తీసుకోండి: పీటర్సన్ -
ఇలా ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదు: రిషభ్ పంత్ అసహనం!
ఐపీఎల్-2025 (IPL 2025)లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఆటగాడిగా పూర్తిగా విఫలమవుతున్నాడు. చెత్త బ్యాటింగ్తో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు అతడు నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 0, 15, 2, 2, 21, 63, 3, 0, 4.98.21 స్ట్రైక్రేటుతో మొత్తంగా కలిపి కేవలం 110 పరుగులు చేశాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్రకెక్కిన పంత్ నుంచి ఇలాంటి ఆట తీరు అస్సలు ఊహించనిది. దీంతో అభిమానులు సైతం అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే, కెప్టెన్గా మాత్రం రిషభ్ పంత్ ప్రదర్శన బాగానే ఉంది. అతడి సారథ్యంలో ఇప్పటి వరకు పది మ్యాచ్లు పూర్తి చేసుకున్న లక్నో ఐదింట గెలిచింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి ఐదో పరాజయం నమోదు చేసింది.ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిదిఈ నేపథ్యంలో ఓటమి అనంతరం బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన రిషభ్ పంత్కు అతడి ఫామ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది.పరిస్థితులు మనకు అనుకూలంగా లేనపుడు మన నైపుణ్యాలపై మనకే సందేహాలు తలెత్తుతాయి. అయితే, అలాంటి భావనలను దరిచేయనీయకూడదు. జట్టు బాగా ఆడుతున్నపుడు.. ఆ విషయంపైనే ఎక్కువగా దృష్టి సారించాలి.ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదుక్రికెట్ అంటేనే జట్టుగా ఆడాల్సిన ఆట. అవును.. ఒక్క ఆటగాడి వల్ల కూడా ప్రభావం ఉంటుంది. మ్యాచ్ దిశ మారిపోతుంది. కానీ ప్రతిసారి ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదనుకుంటా’’ అని పంత్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.కాగా హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన పోరులో ముంబై 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (32 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది.విల్ జాక్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతోలక్నో ఆటగాళ్లలో ఆయుశ్ బదోని (22 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్లు), మిచెల్ మార్ష్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. విల్ జాక్స్ బౌలింగ్లో కర్ణ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పెవిలియన్ చేరాడు.ఇదిలా ఉంటే.. ముంబౌ బౌలర్లలో బుమ్రా 4, బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టగా, ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన విల్ జాక్స్ (29, 2/18) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో అత్యధికంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసి పంత్ను కొనుగోలు చేసి.. కెప్టెన్గా నియమించిన విషయం తెలిసిందే.చదవండి: వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు ఆ పిచ్చి లేదు: సంజనా𝙂𝙖𝙢𝙚. 𝙎𝙚𝙩. 𝘿𝙤𝙣𝙚 ✅@mipaltan make it 5⃣ in 5⃣ and are marching upwards and onwards in the season 📈Scorecard ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/zW7EuWhU7j— IndianPremierLeague (@IPL) April 27, 2025 -
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ఐపీఎల్-2025 (IPL 2025)లో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 364 పరుగులు సాధించాడు. 60.66 సగటుతో 146.18 స్ట్రైక్రేటుతో మూడు అర్ధ శతకాల సాయంతో రాహుల్ ఈ మేర పరుగులు రాబట్టాడు.ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడని.. అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా ఐపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది.ఈ మ్యాచ్లో నాలుగో స్థానానికి ప్రమోట్ అయిన రాహుల్.. 39 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ కాస్త మెరుగ్గా ఆడి.. ఢిల్లీ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసిన ఢిల్లీ.. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.బెంగళూరు జట్టు ఈ టార్గెట్ను 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు చేతిలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన పీటర్సన్.. రాహుల్ ఆట తీరు పట్ల మాత్రం సంతృప్తి వ్యక్తం చేశాడు.అతడే నా మొదటి ఎంపిక‘‘టీమిండియా తరఫున టీ20 క్రికెట్లో కేఎల్ రాహుల్ను నాలుగో స్థానంలో ఆడించాలి. భారత జట్టులో చాలా మంది ఓపెనింగ్ బ్యాటర్లు ఉన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్.. ఇలా ఎవరైనా టాపార్డర్లో బ్యాటింగ్ చేయగలరు.అయితే, కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఆడుతున్న విధానం అమోఘం. నాలుగో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయడం సహా.. వికెట్ కీపర్గానూ బాధ్యతలు నిర్వర్తించగలడు. కాబట్టి టీమిండియా నంబర్ ఫోర్ బ్యాటర్, వికెట్ కీపర్గా అతడే మొదటి ఎంపిక’’ అని పీటర్సన్ పేర్కొన్నాడు.గతేడాది కాలంగా కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నాడని.. ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో అదరగొట్టాడని పీటర్సన్ ప్రశంసించాడు. వేర్వేరు ఫార్మాట్లలో రాణించగల సత్తా అతడికి ఉందని.. సానుకూల దృక్పథమే రాహుల్కు బలంగా మారిందని పేర్కొన్నాడు. ఆట పట్ల అంకితభావం, నెట్స్లో శ్రమించే తీరు.. జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే విధానం రాహుల్లో తనకు నచ్చాయని తెలిపాడు.చివరగా 2022లో టీమిండియా తరఫునకాగా 2016లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్.. చివరగా 2022లో టీమిండియా తరఫున పొట్టి మ్యాచ్ ఆడాడు. టీ20 ప్రపంచకప్-2022 సందర్భంగా ఇంగ్లండ్తో రెండో సెమీ ఫైనల్ సందర్భంగా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రాహుల్ ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు.ఇక ఆ తర్వాత మళ్లీ భారత టీ20 జట్టుకు రాహుల్ ఎంపిక కాలేదు. అయితే, టెస్టుల్లో, వన్డేల్లో మాత్రం ఆడుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా టెస్టు ఆడిన ఈ కర్ణాటక బ్యాటర్.. చాంపియన్స్ ట్రోఫీ-2025 (వన్డే) గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో గతేడాది వరకు లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు అతడిని కొనుగోలు చేయగా.. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు.చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్ -
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Incident) నేపథ్యంలో భారత ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడాడు. తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్పై నిందలు వేస్తోందని ఆరోపించాడు.బైసరన్ లోయలోభారత్లో చిన్న టపాసు పేలినా పాక్నే నిందిస్తున్నారని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలంటూ ఓ షోలో ఆఫ్రిది అతి చేశాడు. కాగా అందమైన కశ్మీరంలో ఉగ్రవాదులు ఇటీవల కల్లోలం సృష్టించిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో కాల్పులకు తెగబడి.. 26 మంది పర్యాటకులను చంపేశారు.కఠిన చర్యలకు ఉపక్రమంచిన భారత్ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ గట్టి షాకులు ఇచ్చింది. సింధు జలాల ఒప్పందం సహా పలు విషయాల్లో పాక్ను కోలుకోలేని దెబ్బకొట్టేలా ముందుకు సాగుతోంది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. అంతేకాదు.. తాజాగా పాక్కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను బ్యాన్ చేసింది.మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థంఈ క్రమంలో షాహిద్ ఆఫ్రిది స్పందిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్లో చిన్న పటాకా పేలినా వాళ్లు పాకిస్తాన్నే నిందిస్తారు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉంది. అయినా సరే ఇదెలా జరిగింది?.. మీరంతా పనికిరాని వాళ్లనేగా దీని అర్థం.ప్రజలకు కనీస భద్రత కల్పించడం కూడా మీకు చేతకావడం లేదు. ఘటన జరిగిన గంటలోపే మీడియా మొత్తం బాలీవుడ్ వైపే గురిపెట్టింది. వారి మాట తీరు నాకు ఆశ్చర్యం కలిగించింది.తమకు తాము విద్యావంతులమని చెప్పుకొంటారు. కానీ వారి ఆలోచనా విధానం ఇంత వరకే పరిమితం. ఇండియాలో ఇద్దరు టాప్ క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెట్కు అంబాసిడర్లుగా కొనసాగారు. కానీ వాళ్లు కూడా నేరుగా పాకిస్తాన్ వైపే వేలు చూపిస్తూ నిందిస్తున్నారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలి’’ అని షాహిద్ ఆఫ్రిది రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు.ఇదిలా ఉంటే.. పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మాత్రం పహల్గామ్ ఘటన నేపథ్యంలో తమ దేశ నాయకత్వ తీరుపై మండిపడ్డాడు. ఉగ్రదాడిని వెంటనే ఖండించకపోవడం అనుమానాలకు తావిచ్చిందని పేర్కొన్నాడు. ఇక పాక్ ఉప ప్రధాని ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తన వ్యాఖ్యల ద్వారా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది తామేనని నేరుగానే అంగీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముక్తకంఠంతో ఖండించారుఇక పహల్గామ్ ఉగ్రదాడిని భారత క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తదితరులు బాధితులకు, వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అదే విధంగా.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. పాక్ క్రికెట్తో సంబంధాలన్నీ తెంచుకోవాలని బీసీసీఐకి సూచించాడు. ప్రతి ఏడాది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఉగ్రవాదులకు అలవాటై పోయిందని.. ప్రభుత్వం కఠిన చర్యలతో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాలని కోరాడు.చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్ -
IPL 2025: ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం చేస్తున్న భువీ.. ఈ క్రమంలో అరుదైన ఘనత
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తలరాత మార్చే ప్రయత్నం (టైటిల్ సాధించడం) చేస్తున్న వ్యక్తుల్లో భువనేశ్వర్ కుమార్ ముఖ్యుడు. ఈ సీజన్లో భువీ ఆడిన ప్రతి మ్యాచ్లో సత్తా చాటి ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 9 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.తాజాగా (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేయడమే (4 ఓవర్లలో 33 పరుగులు) కాకుండా 3 వికెట్లు తీసి ఆర్సీబీ గెలుపులో ముఖ్య భూమిక పోషించాడు. ఈ క్రమంలో ఓ ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పియూశ్ చావ్లాను (192) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం భువీ ఖాతాలో 193 వికెట్లు (185 మ్యాచ్ల్లో) ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 169 మ్యాచ్ల్లో 214 వికెట్లు తీసి టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లుయుజ్వేంద్ర చహల్- 214భువనేశ్వర్ కుమార్- 193పియూశ్ చావ్లా- 192సునీల్ నరైన్- 187రవిచంద్రన్ అశ్విన్- 185ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భువీ ప్రదర్శనలు..సీఎస్కేపై 1/20 (ఆర్సీబీ గెలుపు)గుజరాత్పై 1/23 (ఆర్సీబీ ఓటమి)ముంబై ఇండియన్స్పై 1/48 (ఆర్సీబీ గెలుపు)ఢిల్లీ క్యాపిటల్స్పై 2/26 (ఆర్సీబీ ఓటమి)రాజస్థాన్ రాయల్స్పై 1/32 (ఆర్సీబీ గెలుపు)పంజాబ్ కింగ్స్పై 2/26 (ఆర్సీబీ ఓటమి)పంజాబ్ కింగ్స్పై 0/26 (ఆర్సీబీ గెలుపు)రాజస్థాన్ రాయల్స్పై 1/50 (ఆర్సీబీ గెలుపు)ఢిల్లీ క్యాపిటల్స్పై 3/33 (ఆర్సీబీ గెలుపు)35 ఏళ్ల భువీ ఆర్సీబీకి ముందు సన్రైజర్స్ హైదరాబాద్, పూణే వారియర్స్కు ప్రాతినిథ్యం వహించాడు. సన్రైజర్స్ తరఫున విశేషంగా రాణించిన భువీ.. ఆ ఫ్రాంచైజీ తరఫున 157 వికెట్లు తీశాడు. మధ్యలో రెండు సీజన్లు పుణేకు ఆడి 31 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఆడుతూ 9 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీశాడు. భువీ తన ఐపీఎల్ కెరీర్లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ (సీజన్లో అత్యధిక వికెట్లు) హోల్డర్గా నిలిచాడు. 2016, 20167 సీజన్ల వరుసగా ఈ ఫీట్ను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో కేవలం డ్వేన్ బ్రావో, హర్షల్ పటేల్ మాత్రమే రెండు సార్లు పర్పుల్ క్యాప్ సాధించారు.నిన్న జరిగిన ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్ విషయానికొస్తే.. భువీతో పాటు హాజిల్వుడ్ (4-0-36-2), సుయాశ్ శర్మ (4-0-22-0), కృనాల్ పాండ్యా (4-0-28-1) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 162 పరుగుల స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ ఆదిలో తడబడినప్పటికీ (4 ఓవర్లలో 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది).. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ (4-0-19-2), కుల్దీప్ యాదవ్ (4-0-28-0), చమీరా (3-0-24-1) బాగానే బౌలింగ్ చేసినప్పటికీ.. లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఆ జట్టు బౌలర్లలో స్టార్క్ (3-0-31-0), ముకేశ్ కుమార్ (3.3-0-51-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.ఢిల్లీపై గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) ఈ జట్టు సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. మే 9న ఎల్ఎస్జీని లక్నోను ఢీకొంటుంది. ఆతర్వాత సన్రైజర్స్, కేకేఆర్లను బెంగళూరులో ఎదుర్కొంటుంది. -
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సతీమణి సంజనా గణేషన్ (Sanjana Ganesan) నెటిజన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోదం కోసం తమ చిన్నారి కుమారుడి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. తమకేమీ ప్రచార పిచ్చి లేదని.. ఇకనైనా పిచ్చి వాగుడు కట్టిపెట్టాలంటూ చురకలు అంటించారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025) లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో బుమ్రా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు.ఐడెన్ మార్క్రమ్ (9), డేవిడ్ మిల్లర్ (24) రూపంలో రెండు కీలక వికెట్లు తీసిన బుమ్రా.. అబ్దుల్ సమద్ (2), ఆవేశ్ ఖాన్ (0)లను వచ్చీ రాగానే పెవిలియన్కు పంపాడు. తన పేస్ పదునుతో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించి ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.చిన్నారి అంగద్తోస్టేడియానికి సంజనఇదిలా ఉంటే.. ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్కు బుమ్రా భార్య, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ తమ కుమారుడు అంగద్తో కలిసి హాజరైంది. ఈ క్రమంలో చిన్నారి అంగద్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో అతడు కాస్త నీరసంగా ఉన్నట్లు కనిపించిందని.. డిప్రెషన్, ట్రామా వంటి పదాలు వాడుతూ కొంత మంది నెటిజన్లు బుమ్రా- సంజనాలను విమర్శించారు.PC: Xఈ విషయంపై సంజనా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు.. ‘‘మీ వినోదం కోసం మా కుమారుడి పేరు లాగొద్దు. జస్ప్రీత్, నేను అంగద్ను సోషల్ మీడియాకు వీలైనంత ఎక్కువ దూరంగానే ఉంచుతాం. ఎందుకంటే.. ఇంటర్నెట్లో ఎక్కువగా విద్వేషం, విషం చిమ్మే వాళ్లే ఉంటారని తెలుసు.మాకు అలాంటి పిచ్చిలేదుచిన్నారితో కలిసి క్రికెట్ స్టేడియానికి వెళ్తే ఎలాంటి విమర్శలు వస్తాయో నాకు తెలుసు. అక్కడ కెమెరాలు ఉంటాయనీ తెలుసు. అయితే, నేను, అంగద్ కేవలం జస్ప్రీత్కు మద్దతుగా మాత్రమే అక్కడకు వచ్చాం.మా కొడుకు ఇంటర్నెట్లో వైరల్ కంటెంట్గానో.. జాతీయ వార్తగానో మారిపోవాలని మాకు ఎంతమాత్రం లేదు. కీబోర్డు వారియర్లు అయితే ఏకంగా అంగద్ను మూడు సెకన్ల ఫుటేజ్లో చూసి ఏదేదో మాట్లాడేస్తున్నారు.మా గురించి మీకేం తెలుసు?.. వాడికి ఇప్పుడు ఏడాదిన్నర వయసు మాత్రమే. కానీ మీరు ట్రామా, డిప్రెషన్ వంటివి పదాలు వాడుతూ వాడి గురించి మాట్లాడుతున్నారు. ఇది నిజంగా విచారకరం. మా కొడుకు గురించి మీకు ఏం తెలుసు?మా జీవితాల గురించి మీకెంత తెలుసు. మీ అభిప్రాయాలను మీతోనే పెట్టుకోండి. ఎదుటివారి పట్ల దయ, సహానుభూతి కలిగి ఉండటం వంటివి ఈరోజుల్లో ఎంతో ముఖ్యమైన విషయాలుగా మారిపోయాయి’’ అని సంజనా గణేషన్ తన ఇన్స్టా స్టోరీలో భావోద్వేగపూరిత నోట్ రాశారు. దయచేసి చిన్నపిల్లల విషయంలోనైనా కాస్త సంయమనంతో వ్యవహరించాలని కోరారు. చదవండి: కేఎల్ రాహుల్తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్ కీపర్! వీడియో View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
IPL 2025: ప్రభ కోల్పోతున్న ఢిల్లీ .. ఇలాగే కొనసాగితే కష్టం..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ను వరుసగా నాలుగు విజయాలతో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ సాగే కొద్ది ప్రభ కోల్పోతున్నట్లు కనిపిస్తుంది. చివరి ఐదు మ్యాచ్ల్లో ఆ జట్టు మూడు పరాజయాలు ఎదుర్కొని రెండే విజయాలు సాధించింది. ఇందులో ఒకటి సూపర్ ఓవర్లో (రాజస్థాన్ రాయల్స్) గెలిచింది. తాజాగా (ఏప్రిల్ 27) ఈ జట్టు సొంత మైదానంలో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. ఈ ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. లీగ్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఢిల్లీని వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. తాజాగా ఢిల్లీపై గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. గుజరాత్ రెండో స్థానానికి పడిపోయింది. ఢిల్లీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 6 విజయాలు, 3 పరాజయలతో 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఆ జట్టు రన్రేట్ 0.482గా ఉంది. గుజరాత్, ముంబై కూడా చెరో 12 పాయింట్లు కలిగినప్పటికీ వారి రన్రేట్ ఢిల్లీ కంటే మెరుగ్గా ఉంది. ఢిల్లీ తదుపరి ఆడబోయే మ్యాచ్ల్లో ఇలాంటి ప్రదర్శనే కొనసాగిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదముంది. లీగ్ ప్రారంభంలో అద్భుత విజయాలు సాధించిన జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోలేని సందర్భాలు చాలా ఉన్నాయి. ఢిల్లీ ఇకనైనా జాగ్రత్త పడితేనే టైటిల్ వేట కొనసాగించగలదు.నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి అతి తక్కువ స్కోర్కు (162) పరిమితమైన ఢిల్లీ.. ఆ తర్వాత బౌలింగ్లోనూ పెద్దగా ప్రభావం చూపలేక ఓటమిపాలైంది. ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్ చేస్తూ ఢిల్లీ చేసిన అత్యల్ప స్కోర్ ఇదే. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై ఢిల్లీ బ్యాటర్లు తడబడ్డారు. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఇక్కడ క్రెడిట్ ఆర్సీబీ బౌలర్లకు ఇవ్వాలి. భువనేశ్వర్ కుమార్ (4-0-33-3), హాజిల్వుడ్ (4-0-36-2), సుయాశ్ శర్మ (4-0-22-0), కృనాల్ పాండ్యా (4-0-28-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ కూడా ఆదిలో తడబడినప్పటికీ (4 ఓవర్లలో 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది).. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ (4-0-19-2), కుల్దీప్ యాదవ్ (4-0-28-0), చమీరా (3-0-24-1) బాగానే బౌలింగ్ చేసినప్పటికీ.. లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఆ జట్టు బౌలర్లలో స్టార్క్ (3-0-31-0), ముకేశ్ కుమార్ (3.3-0-51-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్లో ఢిల్లీ అన్ని విభాగాల్లో సామర్థ్యం మేరకు రాణించలేక ఓటమిపాలైంది.మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 10-15 పరుగులు తక్కువగా చేశామని భావిస్తున్నాను. మేము బ్యాటింగ్ చేసేటప్పుడు మంచు కారణంగా వికెట్ కాస్త కఠినంగా ఉండింది. ఆర్సీబీ బ్యాటింగ్ చేసే సమయానికి వికెట్ సులువుగా మారింది. ఈ మ్యాచ్లో మేము కొన్ని ఈజీ క్యాచ్లను మిస్ చేశాము. ఆ క్యాచ్లను పట్టి ఉండాల్సింది. మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాము. ఓ బ్యాటర్ కొంత సమయం క్రీజ్లో గడిపి ఉంటే వేగంగా పరుగులు సాధించగలిగేవాడు. అదనంగా 10-15 పరుగులు వచ్చేవి. బ్యాటింగ్ ఆర్డర్లో ఓ స్థానం కిందికి రావడంపై స్పందిస్తూ.. రాహుల్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకే అతన్ని 4వ స్థానంలో పంపాము. మైదానంలో ఓ వైపు చిన్నగా ఉంది. రాహుల్ను ముందుగా పంపడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పాడు. -
‘వరుసగా ఐదో విజయం.. సెంటిమెంట్ ప్రకారం టైటిల్ మాదే!’
గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్ (MI).. ఐపీఎల్-2025 (IPL 2025)ని కూడా పేలవంగానే ఆరంభించింది. తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తై ఓటమితో ఈ ఎడిషన్ను మొదలుపెట్టింది.రెండో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైన హార్దిక్ సేన.. కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించి తొలి గెలుపు అందుకుంది. అయితే, ఆ తర్వాత మళ్లీ పాత కథే. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ముంబై ఇండియన్స్ ఆట తీరుపై విమర్శలు రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్పై గెలుపుతో మళ్లీ విజయాల బాట పట్టింది.వరుసగా ఐదు విజయాలు ఆ తర్వాత హార్దిక్ సేన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. సన్రైజర్స్ హైదరాబాద్ను రెండుసార్లు, చెన్నై సూపర్ కింగ్స్.. తాజాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్పై గెలిచి వరుసగా ఐదు విజయాలు అందుకుంది. ఏదేమైనా సీజన్ను చెత్తగా మొదలుపెట్టి.. ఇలా మళ్లీ గాడిలో పడటంతో ముంబై ఇండియన్స్ శిబిరం ఆనందంలో తేలిపోతోంది.సెంటిమెంట్ ప్రకారం ఈసారి మరోవైపు.. వరుస విజయాల నేపథ్యంలో ముంబై జట్టు అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు. ఇప్పటికి ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ఈ మేటి జట్టు.. సెంటిమెంట్ ప్రకారం ఈసారి కూడా ట్రోఫీని ముద్దాడుతుందని, టైటిల్ మాదే అని సంబరపడిపోతున్నారు.ఏకంగా నాలుగుసార్లు చాంపియన్గాకాగా గతంలో వరుసగా ఇలా ఐదుసార్లు (అంతకంటే ఎక్కువ) మ్యాచ్లు గెలిచిన ముంబై ఇండియన్స్.. ఏకంగా నాలుగుసార్లు చాంపియన్గా అవతరించింది. అంతేకాదు మరోసారి రన్నరప్గా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా వరుసగా ఐదు గెలిచాం అంటూ ఈసారి తమకు తిరుగులేదన్నట్లుగా ట్వీట్ చేశాడు.ఇక ముంబైకి ఐదుసార్లు టైటిల్ అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను యాజమాన్యం సారథిగా నియమించింది. అయితే, సొంత జట్టు అభిమానులకే ఇది ఏమాత్రం నచ్చలేదు. రోహిత్పై ప్రేమ.. హార్దిక్పై కోపానికి దారితీసింది. మైదానం వెలుపలా, బయటా అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.అందుకు అనుగుణంగానే ఐపీఎల్-2024లో హార్దిక్ కెప్టెన్సీ చెత్తగా సాగింది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంతో సీజన్ను ముగించింది. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం ముంబై మళ్లీ విజయపరంపరను పునరావృతం చేస్తోంది. తద్వారా ఆరో టైటిల్ దిశగా దూసుకుపోతోంది.ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ లక్నో👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్: లక్నో తొలుత బౌలింగ్👉ముంబై స్కోరు: 215/7 (20)👉లక్నో స్కోరు: 161 (20)👉ఫలితం: లక్నోపై 54 పరుగుల తేడాతో ముంబై విజయంఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు లేదంటే అంతకంటే ఎక్కువగా విజయాలు సాధించిన సందర్భాలు ఇవే..👉2008లో ఆరుసార్లు వరుసగా👉2010లో ఐదుసార్లు వరుసగా- రన్నరప్గా👉2013లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్గా👉2015లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్గా👉2017లో ఆరుసార్లు వరుసగా- చాంపియన్స్గా👉2020లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్గా👉2025లో ఐదుసార్లు వరుసగా..*.చదవండి: కేఎల్ రాహుల్తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్ కీపర్! వీడియో𝙂𝙖𝙢𝙚. 𝙎𝙚𝙩. 𝘿𝙤𝙣𝙚 ✅@mipaltan make it 5⃣ in 5⃣ and are marching upwards and onwards in the season 📈Scorecard ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/zW7EuWhU7j— IndianPremierLeague (@IPL) April 27, 2025 -
DC VS RCB: 3267 రోజుల తర్వాత చేసిన అర్ద సెంచరీ.. క్రెడిట్ విరాట్కే: కృనాల్ పాండ్యా
ఆర్సీబీ ఆటగాడు కృనాల్ పాండ్యా ఆల్రౌండరే అయినప్పటికీ.. ఐపీఎల్లో అతను బ్యాట్కు ఎక్కువగా పని చెప్పలేదు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కృనాల్ చాలాకాలం తర్వాత బ్యాట్తో రాణించాడు. ఈ మ్యాచ్లో 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు (నాటౌట్) చేసిన కృనాల్ ఆర్సీబీని గెలిపించాడు. ఈ గెలుపులో కృనాల్ది ప్రధానపాత్ర. తొలుత బౌలింగ్లో రాణించిన (4-0-28-1) అతను.. ఆతర్వాత బ్యాట్తో చెలరేగిపోయాడు. 3267 రోజుల తర్వాత కృనాల్ ఐపీఎల్లో చేసిన తొలి అర్ద శతకం ఇదే. 137 మ్యాచ్ల ఐపీఎల్ కెరీర్లో కృనాల్కు ఇది కేవలం రెండో అర్ద శతకం మాత్రమే. అతని తొలి అర్ద శతకం కూడా ఢిల్లీపైనే చేశాడు. 2016 సీజన్లో ఇది జరిగింది. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగే కృనాల్ పెద్దగా భారీ స్కోర్లు చేయనప్పటికీ.. మ్యాచ్ను ప్రభావితం చేసే స్వీట్ అండ్ షార్ట్ ఇన్నింగ్స్లు ఆడతాడు.నిన్నటి మ్యాచ్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (26/3, 4 ఓవర్లు) బరిలోకి దిగిన కృనాల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో తొలుత నిదానంగా ఆడిన కృనాల్.. ఆతర్వాత గేర్ మార్చి విధ్వంసం సృష్టించాడు. తొలి 28 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసిన కృనాల్.. ఆతర్వాత ఎదుర్కొన్న 19 బంతుల్లో ఏకంగా 48 పరుగులు పిండుకున్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో రెచ్చిపోయిన కృనాల్ ముకేశ్ కుమార్ బౌలింగ్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఆతర్వాత కుల్దీప్ బౌలింగ్లో ఓ సిక్సర్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో బ్యాట్తో పాటు బంతితో కూడా సత్తా చాటినందుకు కృనాల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.మ్యాచ్ అనంతరం కృనాల్ మాట్లాడుతూ ఇలా ఆన్నాడు. నా పాత్రకు న్యాయం చేసినందుకు ఆనందంగా ఉంది. విరాట్తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా సులువగా ఉంటుంది. అతను ప్రతి బంతికి ప్రోత్సహిస్తుంటాడు. ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. విరాట్ గైడెన్స్లో నేనే మంచి ఇన్నింగ్స్ ఆడాను. తొలి 20 బంతులు పరుగుల కోసం ఇబ్బంది పడ్డాను. అయితే విరాట్ నింపిన స్పూర్తితో లయను అందుకుని భారీ షాట్లు ఆడగలిగాను. క్రెడిట్ విరాట్కి దక్కుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని స్వల్ప స్కోర్కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. మే 9న ఎల్ఎస్జీని లక్నోను ఢీకొంటుంది. ఆతర్వాత సన్రైజర్స్, కేకేఆర్లను బెంగళూరులో ఎదుర్కొంటుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉన్న ఆర్సీబీ ఇంకో మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. -
కేఎల్ రాహుల్పై కోహ్లి సీరియస్!.. ఇచ్చిపడేశాడు! వీడియో వైరల్
సొంతమైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాభవానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా అక్షర్ సేనను వారి హోం గ్రౌండ్లో ఓడించి లెక్క సరిచేసింది. ఇక అరుణ్జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)- ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) మధ్య జరిగిన వాగ్వాదం హైలైట్ అయ్యింది.కేఎల్ రాహుల్ మరోసారిటాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ.. ఢిల్లీని 162 పరుగులకు కట్టడి చేసింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (28), ఫాఫ్ డుప్లెసిస్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34) రాణించగా.. కేఎల్ రాహుల్ (41) ఢిల్లీ ఇన్నింగ్స్లో టాప్ రన్స్కోరర్గా నిలిచాడు.ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు కూల్చగా.. జోష్ హాజిల్వుడ్ రెండు, కృనాల్ పాండ్యా- యశ్ దయాళ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఢిల్లీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే ఛేదించింది.కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్ఫిల్ సాల్ట్ స్థానంలో ఓపెనర్గా వచ్చిన జేకబ్ బెతెల్ (12) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ విరాట్ కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73), టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19) ధనాధన్ దంచికొట్టి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశారు.అయితే, లక్ష్య ఛేదన సమయంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లి - ఢిల్లీ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్తో వాదనకు దిగినట్లు కనిపించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఎనిమిదో ఓవర్ను ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న కోహ్లి సింగిల్ తీయగా.. మిగతా ఐదు బంతులను కృనాల్ పాండ్యా ఎదుర్కొన్నాడు.రాహుల్తో వాదనకు దిగిన కోహ్లి?!అయితే, ఆ ఓవర్లో మధ్యలోని నాలుగు బంతులు డాట్ కాగా.. ఆఖరి బంతికి మాత్రం కృనాల్ రెండు పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో మొత్తంగా ఎనిమిదో ఓవర్లో ఆర్సీబీకి కేవలం మూడు పరుగులే వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లి- రాహుల్తో వాదనకు దిగిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షించాయి.కానీ వీరిద్దరి మధ్య వాగ్వాదం ఎందుకు జరిగిందన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. ఈ క్రమంలో కామెంటేటర్, భారత మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా కోహ్లి- రాహుల్ మధ్య జరిగింది ఇదే అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు తన అభిప్రాయం పంచుకున్నాడు.గట్టిగానే బదులిచ్చాడు‘‘ఫీల్డింగ్ సెట్ చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త ఎక్కువగానే సమయం తీసుకుంటోందని.. బహుశా ఇదే విషయమై కోహ్లి రాహుల్కు ఫిర్యాదు చేసి ఉంటాడు. అయితే, వికెట్ కీపర్ రాహుల్ కూడా తన జట్టుకు మద్దతుగా కాస్త గట్టిగానే బదులిచ్చాడు. వ్యూహంలో భాగంగానే తమ కెప్టెన్ ఇలా చేస్తున్నాడని చెప్పి ఉంటాడు’’ అని చావ్లా అభిప్రాయపడ్డాడు. ఇక బ్రాడ్కాస్టర్ షేర్ చేసిన వీడియోలో.. తాను వికెట్లకు నిర్ణీత దూరంలోనే ఉన్నానని రాహుల్ బదులిచ్చినట్లు కనిపించడం గమనార్హం.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ బెంగళూరుఢిల్లీ స్కోరు: 162/8 (20)ఆర్సీబీ స్కోరు: 165/4 (18.3)ఫలితం: ఢిల్లీపై ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కృనాల్ పాండ్యా. చదవండి: IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్లో కోహ్లి, హాజిల్వుడ్ Things are heating up in Delhi! 🔥#ViratKohli and #KLRahul exchange a few words in this nail-biting match between #DC and #RCB. 💪Watch the LIVE action ➡ https://t.co/2H6bmSltQD#IPLonJioStar 👉 #DCvRCB | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star… pic.twitter.com/Oy2SPOjApz— Star Sports (@StarSportsIndia) April 27, 2025 -
DC VS RCB: భారీ రికార్డును తృటిలో మిస్సైన విరాట్
ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఏప్రిల్ 27) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ భారీ రికార్డును తృటిలో మిస్ అయ్యాడు. ఈ మ్యాచ్లో విరాట్ మరో 5 పరుగులు చేసుంటే ఐపీఎల్లో ఓ ప్రత్యర్థిపై (ఏ ప్రత్యర్థిపై అయినా) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పి ఉండేవాడు. ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ పంజాబ్ కింగ్స్పై 1134 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఓ ప్రత్యర్థిపై ఓ ఆటగాడు చేసిన అత్యధిక పరగులు ఇవే. నిన్నటి మ్యాచ్లో ఢిల్లీపై చేసిన 51 పరుగులతో ఆ ఫ్రాంచైజీపై విరాట్ చేసిన పరుగుల సంఖ్య 1130 పరుగులకు చేరింది. ఈ మ్యాచ్లో విరాట్ మరో 5 పరుగులు చేసుంటే వార్నర్ రికార్డు బద్దలు కొట్టి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకుని ఉండేవాడు. ఈ మ్యాచ్లో విరాట్ 47 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి దుష్మంత చమీరా బౌలింగ్లో మిచెల్ స్టార్క్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఐపీఎల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు1134 - డేవిడ్ వార్నర్ vs PBKS1130 - విరాట్ కోహ్లీ vs DC*1104 - విరాట్ కోహ్లీ vs PBKS1093 - డేవిడ్ వార్నర్ vs KKR1084 - విరాట్ కోహ్లీ vs CSK1083 - రోహిత్ శర్మ vs KKRకాగా, నిన్నటి మ్యాచ్లో విరాట్ బాధ్యాతాయుతమైన హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ ఇన్నింగ్స్తో విరాట్ సైతం అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నాడు. విరాట్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 6 అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి ఢిల్లీని స్వల్ప స్కోర్కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. -
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ప్రదర్శన జోరుగా సాగుతుంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. నిన్న (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్ను వారి సొంత ఇలాకాలో ఓడించిన ఆ జట్టు ఓ అరుదైన ఘనత సాధించింది. ఈ సీజన్లో 7 వేర్వేరు వేదికల్లో మ్యాచ్లు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. తొలుత కేకేఆర్పై కోల్కతాలో, ఆతర్వాత సీఎస్కేపై చెన్నైలో, ఎంఐపై ముంబైలో, ఆర్ఆర్పై జైపూర్లో, పంజాబ్పై చంఢీఘడ్లో, ఆర్ఆర్పై బెంగళూరులో, తాజాగా డీసీపై ఢిల్లీలో విజయాలు సాధించింది.ఈ సీజన్లో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్ను వారి సొంత మైదానంలో (లక్నో) ఓడిస్తే చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఆర్సీబీ లక్నోలో విజయం సాధిస్తే ఈ సీజన్లో ఆడిన 7 అవే మ్యాచ్ల్లో (ప్రత్యర్థి సొంత మైదానాల్లో జరిగే మ్యాచ్లు) విజయాలు సాధించిన జట్టుగా నిలుస్తుంది. తద్వారా ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. గతంలో ఏ జట్టు ఓ సీజన్లో ఆడిన అన్ని అవే మ్యాచ్ల్లో గెలవలేదు.ఆర్సీబీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 అవే మ్యాచ్లతో పాటు ఓ హోం గ్రౌండ్ (బెంగళూరు) మ్యాచ్లో విజయాలు సాధించింది. మే 9న జరిగే మ్యాచ్లో ఆర్సీబీ ఎల్ఎస్జీని లక్నోను ఢీకొంటుంది. అంతుకుముందు సీఎస్కేతో బెంగళూరులో (మే 3) తలపడుతుంది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సీఎస్కే, ఎల్ఎస్జీ మ్యాచ్ల తర్వాత సన్రైజర్స్, కేకేఆర్లతో బెంగళూరులోనే తలపడనుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉన్న ఆర్సీబీ ఇంకో మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని స్వల్ప స్కోర్కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. -
IPL 2025: మరోసారి 'ఆ బిరుదుకు' సార్థకత చేకూర్చిన విరాట్ కోహ్లి
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హవా కొనసాగుతుంది. నిన్న (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసిన అతను.. లీడింగ్ రన్ స్కోరర్గా అవతరించాడు. ఈ సీజన్లో విరాట్ ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 6 అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద సెంచరీలు ఛేజింగ్లో చేసినవే కావడం విశేషం.ఫార్మాట్ ఏదైనా విరాట్కు ఛేజింగ్ మాస్టర్గా బిరుదు ఉంది. ఆ బిరుదుకు విరాట్ మరోసారి సార్థకత చేకూర్చాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ఛేజింగ్కు దిగిన నాలుగు సందర్భాల్లో విరాట్ 4 అర్ద సెంచరీలు చేసి తన జట్టును గెలిపించాడు. ఇందులో మూడు సార్లు నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా విరాట్లో ఇంకా చేవ తగ్గలేదు.బ్యాటర్గా సూపర్ ఫామ్లో ఉండటమే కాకుండా తన జట్టును దాదాపు ప్రతి మ్యాచ్లో గెలిపిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ విఫలమైన మ్యాచ్ల్లో మాత్రమే ఆర్సీబీ ఓడింది. విరాట్ 30కి పైగా స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. అంతలా విరాట్ ఈ యేడు ఆర్సీబీ విజయాలను ప్రభావితం చేస్తున్నాడు. ప్రస్తుతం విరాట్ను చూస్తుంటే కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.ఇదే జోరును అతను మరో ఐదారు మ్యాచ్లు కొనసాగిస్తే ఆర్సీబీ ఈసారి టైటిల్ గెలవడం ఖాయం. ఆర్సీబీ ఈ సీజన్లో గతంలో ఎన్నడూ లేనంత జోష్లో కనిపిస్తుంది. జట్టులో అందరూ రాణిస్తున్నారు. కెప్టెన్గా పాటిదార్ తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు. కోహ్లి భీకర ఫామ్లో ఉన్నాడు. బౌలర్లలో హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కృనాల్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్లతో అదరగొడుతున్నాడు. పడిక్కల్, టిమ్ డేవిడ్ ఇరగదీస్తున్నారు.పాటిదార్ బ్యాటర్గా ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. జితేశ్ శర్మ, రొమారియో షెపర్డ్కు తమను తాము నిరూపించుకునే అవకాశం రాలేదు. యువ స్పిన్నర్ సుయాశ్ శర్మ వికెట్లు తీయలేకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. పేసర్ యశ్ దయాల్ నాట్ బ్యాడ్ అనిపిస్తున్నాడు.విరాట్ ఓపెనింగ్ పార్ట్నర్గా ఎవరూ సెట్ కాకపోవడమే ప్రస్తుతం ఆర్సీబీ వేధిస్తున్న ఏకైక సమస్య. సాల్ట్ ఓ మ్యాచ్లో మెరిసినా మిగతా అన్ని మ్యాచ్ల్లో తేలిపోయాడు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో జేకబ్ బేతెల్ను ప్రయోగించినా అతను కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఒక్క సమస్యను పక్కన పెడితే ఈ సీజన్లో ఆర్సీబీ టైటిల్ ఫేవరెట్లలో ముందు వరుసలో ఉంది. కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని స్వల్ప స్కోర్కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. -
IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్లో కోహ్లి, హాజిల్వుడ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ డిమినేషన్ కొనసాగుతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. నిన్న (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్ను వారి సొంత ఇలాకాలో ఓడించిన అనంతరం టాప్ ప్లేస్కు దూసుకొచ్చింది. ఈ గెలుపుతో కొద్ది రోజుల కిందట బెంగళూరులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రత్యర్థి హోం గ్రౌండ్స్లో ఆడిన ప్రతి మ్యాచ్లో గెలిచింది.నిన్నటి మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనల తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లి (47 బంతుల్లో 51; 4 ఫోరు), జోష్ హాజిల్వుడ్ (4-0-36-2 కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానానికి దూసుకొచ్చారు. బ్యాటింగ్లో విరాట్ (10 మ్యాచ్ల్లో 443 పరుగులు) టాప్ రన్ స్కోరర్గా.. బౌలింగ్లో హాజిల్వుడ్ (10 మ్యాచ్ల్లో 18 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచారు. ఓవరాల్గా ఈ సీజన్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయిస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతుంది.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు (ఆరెంజ్ క్యాప్)విరాట్ కోహ్లి- 443సూర్యకుమార్ యాదవ్- 427సాయి సుదర్శన్- 417నికోలస్ పూరన్- 404మిచెల్ మార్ష్- 378ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు (పర్పుల్ క్యాప్)జోష్ హాజిల్వుడ్- 18ప్రసిద్ద్ కృష్ణ- 16నూర్ అహ్మద్- 14ట్రెంట్ బౌల్ట్- 13కృనాల్ పాండ్యా- 13అత్యధిక హాఫ్ సెంచరీలు- విరాట్ (6)పాయింట్ల పట్టిక1. ఆర్సీబీ (14 పాయింట్లు, 0.521 రన్రేట్)2. గుజరాత్ టైటాన్స్ (12, 1.104)3. ముంబై ఇండియన్స్ (12, 0.889)4. ఢిల్లీ క్యాపిటల్స్ (12, 0.482)5. పంజాబ్ కింగ్స్ (11, 0.177)కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (51), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్ను ముగించాడు (18.3 ఓవర్లలో). ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్లో (మే 3) సీఎస్కేతో (బెంగళూరులో) తలపడనుంది. -
మరో విజయంపై గురి
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో వరస విజయాలతో జోరు మీదున్న మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్... వరస పరాజయాలతో డీలా పడ్డ రాజస్తాన్ రాయల్స్తో పోరుకు సిద్ధమైంది. ఆడిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకున్న గుజరాత్ ప్లే ఆఫ్స్ వైపు అడుగులు వేస్తుండగా... రాజస్తాన్ 9 మ్యాచ్ల్లో 2 విజయాలు, 7 ఓటములతో పట్టికలో కింది స్థానం కోసం పోటీ పడుతోంది. రాయల్స్ జట్టు ఆడిన చివరి 5 మ్యాచ్ల్లోనూ పరాజయం పాలైంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్తాన్పై గుజరాత్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. గత మూడు మ్యాచ్ల్లోనూ విజయానికి అతి చేరువగా వచ్చిన రాయల్స్... ఆఖర్లో ఒత్తిడికి చిత్తై ప్రత్యర్థికి మ్యాచ్లు అప్పగించింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ‘సూపర్ ఓవర్’ కూడా ఉంది. రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామ్సన్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా అతడి స్థానంలో రియాన్ పరాగ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాయల్స్... తెగించి పోరాడాలని చూస్తోంది. మరో రెండు విజాయలు సాధిస్తే టైటాన్స్కు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ గుజరాత్కు మంచి అవకాశం కానుంది. తెగించి కొట్లాడితేనే! ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008)లో చాంపియన్గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్... ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయింది. సారథులు, ఆటగాళ్లు, కోచ్లు ఎంతమంది మారినా జట్టు రాత మాత్రం మారలేదు. ఈసారి యువ ఆటగాళ్ల బృందంతో బరిలోకి దిగిన రాయల్స్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన వంతు ప్రయత్నం చేస్తున్నా... మిగతా వాళ్ల నుంచి సహకారం లభించడం లేదు. తాజా సీజన్లో 9 మ్యాచ్లాడిన జైస్వాల్ 39.56 సగటుతో 356 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధశతకాలు ఉన్నాయి. సంజూ దూరమవడంతో... 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్గా అవకాశం దక్కుతోంది. అందుకు తగ్గట్లే ఆరంభ మెరుపులు మెరిపిస్తున్న సూర్యవంశీ... ప్రతి బంతికి షాట్ కొట్టాలనే తొందరలో పెవిలియన్ చేరుతున్నాడు. రియాన్ పరాగ్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, శుభమ్ దూబేతో మిడిలార్డర్ పేపర్ మీద బలంగానే కనిపిస్తున్నా... మైదానంలో ప్రదర్శన అంతంత మాత్రమే. వెస్టిండీస్ వీరుడు హెట్మైర్ ధాటిగా ఆడటంలో విఫలమవుతున్నాడు. బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్, హసరంగ, ఫరూఖీ, సందీప్ శర్మ ప్రభావం చూపలేకపోతున్నారు. ఇక చేసేదేమీ లేని తరుణంలో ఈ మ్యాచ్లో జట్టు సమష్టిగా తెగించి పోరాడాలని చూస్తోంది. ఫుల్ ఫామ్లో టాప్–3... శుబ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్... చక్కటి ఫామ్లో ఉంది. బ్యాటింగ్లో టాప్–3 ప్లేయర్లు విజృంభిస్తుంటే... బౌలర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. 8 మ్యాచ్ల్లో 52.13 సగటుతో 417 పరుగులు చేసిన సాయి సుదర్శన్ ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో ముందు వరుసలో నిలవగా... గతంలో రాజస్తాన్కు ప్రాతినిధ్యం వహించిన బట్లర్ 71.20 సగటుతో 356 పరుగులు చేశాడు. సారథి గిల్ 43.57 సగటుతో 305 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురూ 150కి పైగా స్ట్రయిక్రేట్తో ఈ పరుగులు సాధించడం మరో విశేషం. మిడిలార్డర్లో షారుక్ ఖాన్, రూథర్ఫర్డ్, రాహుల్ తెవాటియా కీలకం కానున్నారు. ఇక దక్షిణాఫ్రికా పేసర్ రబడ లీగ్ మధ్యలో వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరుగు పయనమవడంతో... గుజరాత్ బౌలింగ్ బలహీన పడుతుందని భావిస్తే... విభిన్న కూర్పుతో మరింత రాటుదేలింది. గాయాల కారణంగా చాన్నాళ్లుగా లైమ్లైట్లో లేని ప్రసిధ్ కృష్ణ... 8 మ్యాచ్ల్లో 16 వికెట్లతో ‘పర్పుల్ క్యాప్’ రేసులో దూసుకెళ్తున్నాడు. హైదరాబాదీ పేసర్ సిరాజ్, సాయి కిషోర్ చెరో 12 వికెట్లు పడగొట్టి మంచి టచ్లో ఉన్నారు. వీరంతా మరోసారి విజృంభిస్తే... గుజరాత్ టైటాన్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’కు మరింత చేరువ కావడం ఖాయమే! తుది జట్లు (అంచనా) రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్మైర్, శుభమ్ దూబే, ఆర్చర్, హసరంగ, తుషార్ దేశ్పాండే, ఫజల్హక్ ఫరూఖీ, సందీప్ శర్మ. గుజరాత్ టైటాన్స్: శుబ్మన్ గిల్ (కెప్టెన్ ), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రూథర్ఫార్డ్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, -
బెంగళూరు ప్రతీకారం
దాదాపు రెండు వారాల క్రితం బెంగళూరు వేదికగా ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్... 163 పరుగులు చేసిన ఆర్సీబీ ఓటమి పాలైంది. అద్భుత ప్రదర్శనతో గెలిపించిన ‘లోకల్ ప్లేయర్’ కేఎల్ రాహుల్ మ్యాచ్ ముగిశాక ‘ఇది నా అడ్డా’ అన్నట్లుగా కాంతారా స్టయిల్లో సంబరం చేసుకున్నాడు. ఇప్పుడు అవే రెండు జట్ల మధ్య వేదిక ఢిల్లీకి మారింది. మ్యాచ్పై చర్చ కూడా కోహ్లి వర్సెస్ రాహుల్గానే సాగింది. ఈసారి ఆర్సీబీ విజయలక్ష్యం అదే 163 పరుగులు... 26/3తో బెంగళూరు కష్టాల్లో పడినట్లు కనిపించినా... కోహ్లి, కృనాల్ పాండ్యా శతక భాగస్వామ్యంతో ఆర్సీబీ ఘన విజయాన్ని అందుకొని బదులు తీర్చుకుంది. ఈసారి బ్యాటింగ్లో పరుగులు చేసేందుకు రాహుల్ తీవ్రంగా ఇబ్బంది పడగా... ‘దిల్లీవాలా’ కోహ్లి చక్కటి ఆటతో బెంగళూరు విజయానికి బాటలు వేశాడు. మ్యాచ్ ముగిశాక ప్రతీకార శైలిలో కోహ్లి విజయనాదం చేశాడు. న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య సమరం 1–1తో సమంగా ముగిసింది. సొంతగడ్డపై గత మ్యాచ్లో ఓడిన బెంగళూరు ఈసారి ప్రత్యర్థి మైదానంలో విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 41; 3 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే ఫర్వాలేదనిపించగా, భువనేశ్వర్ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు), విరాట్ కోహ్లి (47 బంతుల్లో 51; 4 ఫోర్లు) నాలుగో వికెట్కు 84 బంతుల్లో 119 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్యాటింగ్ తడబాటు... అభిషేక్ పొరేల్ (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు), స్టబ్స్ కలిసి 29 బంతుల్లో 62 పరుగులు చేయగా... మిగతా బ్యాటర్లంతా కలిసి 92 బంతుల్లో 96 పరుగులు మాత్రమే సాధించడం ఢిల్లీ బ్యాటింగ్ పరిస్థితిని చూపిస్తోంది. భువనేశ్వర్ ఓవర్లో 2 సిక్స్లతో ధాటిని ప్రదర్శించిన పొరేల్ ఎక్కువ సేపు నిలవలేకపోగా, కరుణ్ నాయర్ (4) విఫలమయ్యాడు. పవర్ప్లేలో జట్టు 52 పరుగులు చేసింది. అయితే ఆపై ఆర్సీబీ స్పిన్నర్లు సుయాశ్, కృనాల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల రాక కష్టంగా మారిపోయింది. ఈ ఇద్దరు బౌలర్లు కలిసి 8 ఓవర్లలో 2 ఫోర్లు, 1 సిక్స్ సహా 50 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఒత్తిడిలో డుప్లెసిస్ (22), అక్షర్ పటేల్ (15) వెనుదిరగ్గా... రాహుల్ కూడా షాట్లు ఆడేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. భువీ ఒకే ఓవర్లో రాహుల్, అశుతోష్ (2)లను అవుట్ చేయడంతో ఢిల్లీ 17 ఓవర్లలో 120/6 వద్ద నిలిచింది. అయితే స్టబ్స్ దూకుడుగా ఆడటంతో తర్వాతి రెండు ఓవర్లలో 36 పరుగులు వచ్చి స్కోరు 150 దాటింది. కీలక భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరుకు సరైన ఆరంభం లభించలేదు. ఆరు పరుగుల వ్యవధిలో బెథెల్ (12), పడిక్కల్ (0), పాటీదార్ (6) వెనుదిరగడంతో స్కోరు 26/3 వద్ద నిలిచింది. ఈ దశలో కోహ్లి, కృనాల్ కలిసి చక్కటి సమన్వయంతో జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా... నిలదొక్కుకున్న తర్వాత కృనాల్ ధాటిని పెంచాడు. 8 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సిన సమయంలో తర్వాతి 3 ఓవర్లలో బెంగళూరు 36 పరుగులు రాబట్టడంతో పని సులువైంది. ఈ క్రమంలో సిక్సర్లతో చెలరేగిన కృనాల్ 38 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 2016 సీజన్లో తన ఏకైక హాఫ్ సెంచరీని సాధించిన కృనాల్ ఇన్నేళ్లకు మళ్లీ ఆ మార్క్ను దాటడం విశేషం. ఆ తర్వాత కోహ్లి కూడా 45 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. విజయానికి 18 పరుగుల దూరంలో కోహ్లి అవుటైనా... కృనాల్, టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 9 బంతుల ముందే మ్యాచ్ను ముగించారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) జితేశ్ శర్మ (బి) హాజల్వుడ్ 28; డుప్లెసిస్ (సి) కోహ్లి (బి) కృనాల్ 22; కరుణ్ నాయర్ (సి) భువనేశ్వర్ (బి) దయాళ్ 4; రాహుల్ (సి) బెథెల్ (బి) భువనేశ్వర్ 41; అక్షర్ (బి) హాజల్వుడ్ 15; స్టబ్స్ (సి) హాజల్వుడ్ (బి) భువనేశ్వర్ 34; అశుతోష్ (బి) భువనేశ్వర్ 2; విప్రాజ్ (రనౌట్) 12; స్టార్క్ (నాటౌట్) 0; చమీరా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–33, 2–44, 3–72, 4–102, 5–118, 6–120, 7–158, 8–162. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–3, యశ్ దయాళ్ 4–0–42–1, హాజల్వుడ్ 4–0–36–2, సుయాశ్ శర్మ 4–0–22–0, కృనాల్ పాండ్యా 4–0–28–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: బెథెల్ (సి) నాయర్ (బి) అక్షర్ 12; కోహ్లి (సి) స్టార్క్ (బి) చమీరా 51; పడిక్కల్ (బి) అక్షర్ 0; పాటీదార్ (రనౌట్) 6; కృనాల్ (నాటౌట్) 73; డేవిడ్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 4; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–26, 4–145. బౌలింగ్: అక్షర్ పటేల్ 4–0–19–2, స్టార్క్ 3–0–31–0, ముకేశ్ కుమార్ 3.3–0–51–0, విప్రాజ్ 1–0–12–0, కుల్దీప్ 4–0–28–0, చమీరా 3–0–24–1. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X గుజరాత్ వేదిక: జైపూర్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
కృనాల్ ఆల్రౌండ్ షో.. ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్బుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లి తమ అద్బుత ఇన్నింగ్స్లతో విజయతీరాలకు చేర్చారు. కృనాల్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 73 పరుగులు చేయగా.. విరాట్ 46 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.ఆఖరిలో టిమ్ డేవిడ్(5 బంతుల్లో 19) మెరుపులు మెరిపించాడు. ఈ విజయంతో చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ చేతిలో ఎదురైన పరాభావానికి ఆర్సీబీ బదులు తీర్చుకుంది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా.. చమీరా ఓ వికెట్ సాధించాడు. మరో వికెట్ రనౌట్ రూపంలో లభించింది.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(41) టాప్ స్కోరర్గా నిలవగా.. స్టబ్స్(34),ఫాఫ్ డుప్లెసిస్(22), అభిషేక్ పోరెల్(28) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. హాజిల్వుడ్ రెండు, దయాల్, పాండ్యా తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్దానికి చేరుకుంది. -
జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్గా
ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 54 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. తన పేస్ బౌలింగ్తో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.బుమ్రా తన బౌలింగ్లో కోటాలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా జస్ప్రీత్ రికార్డులకెక్కాడు. ముంబై ఇండియన్స్ తరపున ఇప్పటివరకు 139 మ్యాచ్లు ఆడిన బుమ్రా.. 174 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ రికార్డు పేరిట ఉండేది. మలింగ 122 మ్యాచ్ ల్లో 170 వికెట్లు తీశాడు. ఇప్పుడు తాజా మ్యాచ్తో మలింగ రికార్డును బుమ్ బుమ్రా బ్రేక్ చేశాడు. అయితే ఐపీఎల్తో పాటు ఛాంపియన్స్ లీగ్ కూడా కలిపితే ముంబై తరపున అత్యధిక వికెట్ల వీరుడిగా మలింగ కొనసాగుతున్నాడు. ఈ శ్రీలంక దిగ్గజం రెండు లీగ్లు కలిపి ముంబై తరపున 195 వికెట్లు పడగొట్టాడు. మలింగ తర్వాతి స్దానంలో బుమ్రా(177) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 216 పరుగుల భారీ లక్ష్య చేధనలో లక్నో చతకలపడింది. 20 ఓవర్లో 61 పరుగులకు ఆలౌటైంది. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా..ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించాడు. -
IPL 2025: ఇదేమి ఆట బ్రో.. పంత్ నీవు ఇక మారవా? ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్.. చెత్త షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ముంబై స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడి తన వికెట్ను చేజార్చుకున్నాడు. ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడిన పంత్.. 12.22 సగటుతో కేవలం 110 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్ ఆట తీరును లక్నో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పంత్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇంత చెత్త ప్రదర్శనను చూడలేదంటూ నెటిజన్లు పోస్ట్లు చేస్తున్నారు. పంత్ నీవు ఇక మారవా? అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. కానీ ధరక తగ్గ న్యాయం పంత్ చేయలేకపోతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..ముంబై ఇండియన్స్ చేతిలో 54 పరుగుల తేడాతో లక్నో ఓటమి పాలైంది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా..ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు.Rishabh Pant, absolute garbage performance. If you have any shame, return the 27 crore.#MIvsLSG #MIvLSG pic.twitter.com/JEeboJpQWJ— Chintan (@CricketChintan) April 27, 2025 -
బుమ్ బుమ్ బుమ్రా.. లక్నోను చిత్తు చేసిన ముంబై
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 54 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇది ముంబైకి వరుసగా ఐదో విజయం కావడం గమనార్హం.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.బుమ్ బుమ్ బుమ్రా..అనంతరం 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చేరిగాడు. నాలుగు వికెట్లు పడగొట్టి లక్నోను దెబ్బ తీశాడు. బుమ్రాతో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్దానానికి చేరుకుంది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్గా -
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్గా
ఐపీఎల్లో టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 4,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ప్లేయర్గా సూర్యకుమార్ రికార్డులకెక్కాడు.ఐపీఎల్-2025లో ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్య ఈ ఫీట్ సాధించాడు. సూర్య ఈ మైలు రాయిని కేవలం 2714 బంతుల్లోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేష్ రైనా పేరిట ఉండేది.రైనా 2,881 బంతుల్లో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్లో రైనాను సూర్య అధిగమించాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన జాబితాలో సూర్య మూడో స్దానంలో నిలిచాడు. తొలి స్దానంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(2653 బంతులు) ఉండగా.. రెండో స్దానంలో ఏబీ డివిలియర్స్(2658) ఉన్నాడు. అదేవిధంగా సూర్య మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు.ఐపీఎల్లో వరుసగా 25 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రాబిన్ ఉతప్ప సరసన సూర్య నిలిచాడు. ఉతప్ప ఐపీఎల్లో వరుసగా 10 సార్లు 25 ప్లస్ పరుగులు చేయగా.. సూర్య కూడా సరిగ్గా వరుసగా 10 సార్లు 25 ప్లస్ రన్స్ చేశాడు. ఈ మ్యాచ్లో సూర్య కేవలం 26 బంతుల్లోనే 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన సూర్య.. 427 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్పై 54 పరగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. -
IPL 2025 DC vs RCB: ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ..
IPL 2025 RCB vs DC Live Updates: ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ..ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్బుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లి తమ అద్బుత ఇన్నింగ్స్లతో విజయతీరాలకు చేర్చారు. కృనాల్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 73 పరుగులు చేయగా.. విరాట్ 46 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.ఆఖరిలో టిమ్ డేవిడ్(5 బంతుల్లో 19) మెరుపులు మెరిపించాడు. విరాట్ కోహ్లి ఔట్..విరాట్ కోహ్లి(51) రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. చమీరా బౌలింగ్లో కోహ్లి ఔటయ్యాడు. ఆర్సీబీ విజయానికి 12 బంతుల్లో 17 పరుగులు కావాలి.విజయం దిశగా ఆర్సీబీ..16 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి 24 బంతుల్లో 38 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి(49), కృనాల్ పాండ్యా(56) ఉన్నారు.తిరిగి పుంజుకున్న ఆర్సీబీ..ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ తిరిగి పుంజుకుంది. విరాట్ కోహ్లి(28), కృనాల్ పాండ్యా(17) ఆర్సీబీ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. 11 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.అక్షర్ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్లో జాకబ్ బెతల్(12), పడిక్కల్(0) ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(8), పాటిదార్(1) ఉన్నారు.రాణించిన ఢిల్లీ బ్యాటర్లు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్నమ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు కాస్త తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(41) టాప్ స్కోరర్గా నిలవగా.. స్టబ్స్(34),ఫాఫ్ డుప్లెసిస్(22), అభిషేక్ పోరెల్(28) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. హాజిల్వుడ్ రెండు, దయాల్, పాండ్యా తలా వికెట్ సాధించారు.ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్..ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(34), స్టబ్స్(3) ఉన్నారు.ఢిల్లీ మూడో వికెట్ డౌన్..ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన డుప్లెసిస్.. కృనాల్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(26), అక్షర్ పటేల్(15) ఉన్నారు.9 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 69/29 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(21), కేఎల్ రాహుల్(14) ఉన్నారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..45 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కరుణ్ నాయర్.. యశ్దయాల్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన పోరెల్.. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. మూడు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(28), ఫాఫ్ డుప్లెసిస్(4) ఉన్నారు.ఐపీఎల్-2025లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో జాకబ్ బెతల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్లోకి ఫాఫ్ డుప్లెసిస్ తిరిగొచ్చాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్ -
INDw Vs SLw: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా..
శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. ఈ సిరీస్లో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 39 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన శ్రీలంక 38.1 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఇండియన్ స్పిన్నర్ స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, నల్లపు రెడ్డి చరణి తలా రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో హసనీ పెరీరా(30) టాప్ స్కోరర్గా నిలవగా.. కవిషా దిల్హారి(25), సంజీవనీ(22) రాణించారు. కెప్టెన్ ఆతపట్టు(7)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 29.4 ఓవర్లలో చేధించింది.భారత బ్యాటర్లలో ప్రతీక రావల్(50 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరవగా.. మంధాన(43), డియోల్(48 నాటౌట్) రాణించారు. శ్రీలంక బౌలర్లలో రణవీర ఒక్క వికెట్ సాధించారు. టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 29న కొలంబో వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.చదవండి: IPL 2025: ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ -
ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రికెల్టన్ విధ్వంసం సృష్టించాడు. రికెల్టన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే లక్నో బౌలర్లపై విరుచుకుపడ్దాడు. ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు.ఈ క్రమంలో రికెల్టన్ కేవలం 25 బంతుల్లోనే తన రెండో ఐపీఎల్ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 32 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్.. 6 ఫోర్లు, 4 సిక్స్లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిసిన రికెల్టన్ ఓ రికార్డ్ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికెల్టన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు తిలక్ వర్మ పేరిట ఉండేది. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో వర్మ కేవలం 26 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. తాజా మ్యాచ్తో వర్మను రికెల్టన్ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: టీమిండియాపై సంచలన శతకం సాధించిన ఆటగాడిపై నిషేధం -
IPL 2025: ధోని ఇంకో సీజన్ కూడా ఆడతాడు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్లో సీఎస్కే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ.. అది ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. ఆ జట్టు తదుపరి ఆడబోయే ఐదు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలవాలి. అయినా సీఎస్కే భవితవ్యం ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటుంది.ఈ సీజన్లో సీఎస్కే దుస్థితికి జట్టు ఎంపికే ప్రధాన కారణమన్నది బహిరంగ రహస్యం. మెగా వేలంలో సీఎస్కే యాజమాన్యం రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఔట్ డేటెడ్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుని మూల్యం చెల్లించుకుంది. జట్టులో ఒక్క విధ్వంసకర బ్యాటర్ ఉండేలా కూడా జాగ్రత్త పడలేదు. బౌలింగ్ విభాగంలో పర్వాలేదనినపిస్తున్నా ప్రతి మ్యాచ్లో వారిని నుంచే ఆశించడం అత్యాశ అవుతుంది.ఈ సీజన్లో సీఎస్కే పేలవ ప్రదర్శనల నేపథ్యంలో ఆ జట్టు తాతాల్కిక సారధి ఎంఎస్ ధోని భవితవ్యంపై కూడా మరోసారి చర్చ మొదలైంది. ధోని కాస్తో కూస్తో ఫామ్లో ఉన్నప్పుడే హుందాగా తప్పుకుని ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వయసు మీద పడటంతో ధోని తన పాత్రకు అస్సలు న్యాయం చేయలేకపోతున్నాడని విశ్లేషకులు వాదిస్తున్నారు.ఐపీఎల్లో సీఎస్కే మరియు ధోని భవితవ్యంపై చిన్న తలా సురేశ్ రైనా స్పందించాడు. జతిన్ సప్రుతో చాట్లో మాట్లాడుతూ.. ధోని కనీసం ఇంకో సీజన్ ఆడతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. సీఎస్కే వచ్చే సీజన్లో మెరుగైన ప్రణాళికతో ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ధోని తన బ్రాండ్ మరియు అభిమానుల కోసమే క్రికెట్ ఆడుతున్నాడని అన్నాడు. 43 ఏళ్ల వయసులోనూ బ్యాటింగ్, వికెట్ కీపింగ్తో పాటు కెప్టెన్సీ బాధ్యతలు కూడా మోస్తూ సీఎస్కే కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నాడని తెలిపాడు. ధోని ఒక్కడే అన్ని బాధ్యతలను మోస్తుంటే మిగతా పది మంది ఆటగాళ్ళు ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు.జట్టు ఎంపికలో ధోనిదే తది నిర్ణయం అన్న ప్రచారాన్ని కొట్టి పారేశాడు. పలానా ఆటగాడితో కొనసాగాలా వద్దా అన్న దానిపై మాత్రం ధోనికి కాల్ రావచ్చని తెలిపాడు. తనకు తెలిసి జట్టు ఎంపిక ప్రక్రియలో ధోని ఎప్పుడూ పాల్గొనలేదని స్పష్టం చేశాడు. ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని సీఎస్కే కోర్ గ్రూప్ పర్యవేక్షిస్తుందని తెలిపాడు. ఒకవేళ కోర్ గ్రూప్ ధోనిని తన అభిప్రాయాన్ని వెల్లడించమని అడిగినా అతను నలుగురైదుగురు ఆటగాళ్ల పేర్లను సూచించి ఉండవచ్చని తెలిపాడు. -
LSG Vs MI: లక్నోపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
LSG vs MI Live Updates: ముంబై ఘన విజయంవాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 54 పరగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు.అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. బుమ్ బుమ్ బుమ్రా.. ఒకే ఓవర్లో మూడు వికెట్లుజస్ప్రీత్ బుమ్రా తన పేస్ బౌలింగ్తో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 16వ ఓవర్ వేసిన బుమ్రా ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. 18 ఓవర్లు ముగిసే సరికి లక్నో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.బదోని ఔట్..అయూష్ బదోని రూపంలో లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన బదోని.. బౌల్ట్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో డేవిడ్ మిల్లర్(24), సమద్(1) ఉన్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.లక్నో నాలుగో వికెట్ డౌన్..మిచెల్ మార్ష్(34) రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్లో మార్ష్ ఔటయ్యాడు. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ వచ్చాడు. లక్నో విజయానికి 42 బంతుల్లో 93 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్..లక్నో సూపర్ జెయింట్స్ 7వ ఓవర్లో రెండు కీలక వికెట్లను కోల్పోయింది. 7 ఓవర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్లో తొలి బంతికి పూరన్(27) ఔట్ కాగా.. మూడో బంతికి రిషబ్ పంత్(24) పెవిలియన్ చేరాడు. 8 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.లక్నో తొలి వికెట్ డౌన్..216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఐడైన్ మార్క్రమ్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజులో పూరన్(6), మార్ష్(13) ఉన్నారు.సూర్య, రికెల్టన్ హాఫ్ సెంచరీలు.. లక్నో టార్గెట్ ఎంతంటే?వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది.ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.ముంబై ఐదో వికెట్ డౌన్157 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. మయాంక్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 174/5ముంబై నాలుగో వికెట్ డౌన్తిలక్ వర్మ రూపంలో ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన తిలక్.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(44), హార్దిక్ పాండ్యా(5) ఉన్నారు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జాక్స్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(15) ఉన్నారు.ముంబై ఇండియన్స్ రెండో వికెట్ డౌన్..ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన రికెల్టన్.. దిగ్వేష్ రతి బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 11 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 115/26 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో అదరగొట్టింది. తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. రికెల్టన్ (24 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) జోరు మీద ఉన్నాడు. అతనికి జతగా విల్ జాక్స్ (3) క్రీజ్లో ఉన్నాడు. వరుసగా 2 సిక్సర్లు బాది ఔటైన రోహిత్ శర్మటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. మయాంక్ యాదవ్ బౌలింగ్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ (12) అదే ఓవర్లో ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 33/1గా ఉంది. రికెల్టన్ (19), జాక్స్ క్రీజ్లో ఉన్నారు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం కీలకమైన మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై సొంత మైదానమైన వాంఖడేలో ఈ మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా పరిగణించడుతుంది.ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్తో లక్నో స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మయాంక్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. సాంట్నర్ స్థానంలో కర్ణ్ శర్మ.. విజ్ఞేశ్ పుథుర్ స్థానంలో కార్బిన్ బాష్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మలక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ -
IPL 2025: ముంబై ఇండియన్స్తో కీలక మ్యాచ్కు ముందు లక్నో టీమ్కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం కీలకమైన మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై సొంత మైదానమైన వాంఖడేలో ఈ మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా పరిగణించడుతుంది.ఈ మ్యాచ్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు శుభవార్త తెలిసింది. గాయం కారణంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లకు దూరంగా ఉన్న స్పీడ్ గన్ మయాంక్ యాదవ్.. నేటి మ్యాచ్కు అందుబాటులోకి రానున్నాడని సమాచారం. మయాంక్ రీఎంట్రీపై ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ సోషల్మీడియా వేదికగా హింట్ ఇచ్చింది. వీడియోను రిలీజ్ చేస్తూ ముంబైతో జరుగబోయే మ్యాచ్లో ఓ భయంకరమైన శైలిని చూస్తారని సందేశాన్ని ఇచ్చింది.Kal dikhega tabadtod andaz 👊💥 pic.twitter.com/xl0YU6vhY2— Lucknow Super Giants (@LucknowIPL) April 26, 2025మయాంక్ రాకతో ఎల్ఎస్జీ పేస్ విభాగం మరింత పటిష్టమవుతుంది. ఇప్పటికే ఆ జట్టు పేస్ విభాగం ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్దీప్లతో స్ట్రాంగ్గా ఉంది. మయాంక్ జట్టులో చేరితే మరో పేసర్ ప్రిన్స్ యాదవ్పై వేటు పడే అవకాశం ఉంది. వెన్ను గాయం కారణంగా మయాంక్ ఈ సీజన్ తొలి అర్ద భాగానికి దూరంగా ఉన్నాడు. రాజస్థాన్, ఢిల్లీ మ్యాచ్లకు ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో ఉన్నప్పటికీ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.మయాంక్ గత ఐపీఎల్ సీజన్లో 150 కిమీ పైగా వేగంతో బంతులు సంధించి వెలుగులోకి వచ్చాడు. గత సీజన్ ప్రదర్శనల కారణంగా మయాంక్ టీమిండియాలో సైతం చోటు దక్కించుకున్నాడు. భారత జట్టుకు ఆడుతూ సత్తా చాటిన మయాంక్.. గతేడాది అక్టోబర్లో బంగ్లాదేశతో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను వెన్ను మరియు కాలి బొటన వేలు సమస్యలతో బాధపడుతూ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుత కీలక తరుణంలో మయాంక్ రీఎంట్రీ లక్నో టీమ్కు కొండంత బలాన్ని ఇస్తుంది. మయాంక్ తన స్పీడ్తో ఫలితాలను తారుమారు చేయగలడు. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో లక్నో, ముంబై ఇండియన్స్ తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్ 4న జరిగిన తొలి మ్యాచ్లో ముంబైపై లక్నో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), మార్క్రమ్ (53) అర్ద సెంచరీలతో రాణించగా.. బదోని (30), మిల్లర్ (27) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. హార్దిక్ పాండ్యా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం ఛేదనలో ముంబై గెలుపు దరిదాపుల్లోకి వచ్చి ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. దిగ్వేశ్ రాఠీ (4-0-21-1) ముంబైని ఇబ్బంది పెట్టాడు. నమన్ ధీర్ (46), సూర్యకుమార్ యాదవ్ (67) ముంబైని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖర్లో హార్దిక్ తిలక్ వర్మను రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు పంపాడు. అతని స్థానంలో వచ్చిన సాంట్నర్ ప్రభావం చూపలేకపోయాడు. ఆఖరి ఓవర్లో హార్దిక్ ఓవరాక్షన్ చేసి తిలక్కు బదులుగా వచ్చిన సాంట్నర్కు స్ట్రయిక్ ఇవ్వలేదు. చివరి ఓవర్ను ఆవేశ్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. -
IPL 2025: సీఎస్కేపై గెలుపు.. సేద తీరడానికి మాల్దీవ్స్కు వెళ్లిన సన్రైజర్స్ టీమ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతేడాది రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్కు ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ సీజన్లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై గెలిచిన సన్రైజర్స్.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడింది (లక్నో, ఢిల్లీ, కేకేఆర్,గుజరాత్). తర్వాత పంజాబ్పై సంచలన విజయం సాధించి (246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి).. ముంబై ఇండియన్స్ చేతుల్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడింది.తాజాగా సీఎస్కేను వారి సొంత ఇలాకాలో ఓడించి, సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో సన్రైజర్స్ ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. ఇకపై వారు ఆడాల్సిన ఐదు మ్యాచ్ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్కు చేరతారన్న గ్యారెంటీ లేదు. సన్రైజర్స్ తమ తదుపరి మ్యాచ్ను మే 2న (గుజరాత్తో) ఆడనుంది. ఆతర్వాత మే 5న ఢిల్లీతో, మే 10న కేకేఆర్తో, మే 13న ఆర్సీబీతో, మే 18న లక్నోతో తలపడనుంది.Sun, sea, and a team retreat for our Risers in the Maldives! 🏖️✈️ pic.twitter.com/CyE0MvZHy3— SunRisers Hyderabad (@SunRisers) April 26, 2025అత్యంత కీలకమైన మ్యాచ్లకు ముందు వారం రోజుల విరామం లభించడంతో సన్రైజర్స్ యాజమాన్యం తమ ఆటగాళ్లను రీ ఫ్రెష్మెంట్ కోసం మల్దీవ్స్కు పంపింది. మాల్దీవ్స్లో ఆరెంజ్ ఆర్మీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. తమ ఆటగాళ్లు మాల్దీవ్స్లో సేద తీరుతున్న దృశ్యాలను సన్రైజర్స్ తమ సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఏం పొడిచారని లీగ్ మధ్యలో సేద తీరడానికి వెళ్లారని కొందరంటుంటే.. సన్రైజర్స్ అభిమానులేమో కీలక మ్యాచ్లకు ముందు తమ ఆటగాళ్లకు ఈ మినీ వేకేషన్ అవసరమేనని సమర్దిస్తున్నారు.కాగా, ఈ సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్పై భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్లో ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్పై 286 పరుగుల రికార్డు స్కోర్ సాధించి విజయం సాధించింది. ఆ మ్యాచ్లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ గెలవడానికి సన్రైజర్స్కు ఐదు మ్యాచ్ల సమయం పట్టింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో సన్రైజర్స్ రెండో విజయం సాధించింది. తాజాగా సన్రైజర్స్ సీఎస్కేపై గెలిచినా అది వారిపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా లేదు. సీఎస్కే నిర్దేశించిన 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ జట్టు ఆపసోపాలు పడింది. -
IPL 2025: విరాట్ 30కి పైగా స్కోర్ చేశాడా, ఆర్సీబీ గెలిచినట్లే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 27) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీని ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకునే విషయంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ, ఆర్సీబీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ 8 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ తొమ్మిదింట ఆరు గెలిచి అదే 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఇరు జట్ల రన్రేట్లు కూడా దగ్గరగా ఉన్నాయి. ఢిల్లీ 0.657 రన్రేట్తో ఆర్సీబీ (0.482) కంటే కాస్త మెరుగ్గా ఉంది.ఇరు జట్లు ఈ సీజన్లో తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్ 10న ఆర్సీబీ ఇలాకా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో కేఎల్ రాహుల్ (93 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని ఒంటిచేత్తో గెలిపించాడు. మ్యాచ్ అనంతరం 'ఇది నా అడ్డా' అంటూ రాహుల్ చేసుకున్న సెలబ్రేషన్స్ సోషల్మీడియాలో వైరలయ్యాయి.ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ (4-0-18-2), కుల్దీప్ యాదవ్ (4-0-17-2), ముకేశ్ కుమార్ (3-1-26-1), మోహిత్ శర్మ (2-0-10-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని కట్టడి చేశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో సాల్ట్ (37), కోహ్లి (22), రజత్ పాటిదార్ (25), కృనాల్ పాండ్యా (18), టిమ్ డేవిడ్ (37 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ కూడా తొలుత తడబడింది. ఆ జట్టు 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్, స్టబ్స్ (38 నాటౌట్) ఢిల్లీని ఆదుకుని విజయతీరాలకు చేర్చారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ 2, యశ్ దయాల్, సుయాశ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో ఎదురైన పరాభవానికి ఆర్సీబీ నేటి మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఈ సీజన్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీ ప్రత్యర్థుల సొంత మైదానల్లో అపజయమనేదే లేకుండా దూసుకుపోతుంది. నేటి మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్లో కావడంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ తప్పక గెలుస్తుందని అంతా అనుకుంటున్నారు.ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలకపాత్ర పోషిస్తున్నాడు. విరాట్ 30కి పైగా స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. విరాట్ విఫలమైన మూడు మ్యాచ్ల్లో (గుజరాత్పై 7, ఢిల్లీపై 22, పంజాబ్పై 1) ఆర్సీబీ ఓడింది. ఈ లెక్కన చూస్తే నేడు ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్లో విరాట్ 30కి పైగా స్కోర్ చేస్తే ఆర్సీబీ గెలవడం ఖాయమని సెంటిమెంట్లు చెబుతున్నాయి. ఈ సీజన్లో విరాట్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీల సాయంతో 392 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. -
టీమిండియాపై సంచలన శతకం సాధించిన ఆటగాడిపై నిషేధం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాపై సంచలన శతకం సాధించి వార్తల్లో నిలిచిన బంగ్లాదేశ్ మిడిలార్డర్ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ నిషేధానికి గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ లీగ్-2025లో ఓ మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించినందుకు అతడిపై నాలుగు మ్యాచ్ల సస్పెన్షన్ (8 డీమెరిట్ పాయింట్లతో పాటు) విధించబడింది. దీంతో హృదోయ్ ఈ సీజన్లో అబాహీనీ జట్టుతో జరిగే కీలక మ్యాచ్తో పాటు వచ్చే సీజన్లో తొలి మూడు మ్యాచ్లకు దూరం కానున్నాడు. హృదోయ్ ఢాకా ప్రీమియర్ లీగ్లో (DPL) మొహమ్మదెన్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఘాజీ గ్రూప్తో జరిగిన మ్యాచ్లో 54 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటైన తర్వాత అంపైర్ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.24 ఏళ్ల హృదోయ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాతో జరిగిన మ్యాచ్లో అద్భుత సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా హృదోయ్ సూపర్ సెంచరీతో (118 బంతుల్లో 100; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నాడు. జాకిర్ అలీతో (68) కలిసి ఆరో వికెట్కు 154 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తద్వారా బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. అనంతరం భారత్ సులువగా లక్ష్యాన్ని ఛేదించినా హృదోయ్ ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీ (101 నాటౌట్) చేసి భారత్ను గెలిపించాడు. రోహిత్ శర్మ (41), కేఎల్ రాహుల్ (41 నాటౌట్) కీలకమైన ఇన్నింగ్స్లు ఆడారు. ఆ టోర్నీలో భారత్ ఫైనల్లో న్యూజిలాండ్పై విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమివ్వగా, భద్రతా కారణాల దృష్ట్యా భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడింది. -
భారీ సెంచరీతో కదంతొక్కిన స్టార్ క్రికెటర్ కొడుకు
ఆఫ్ఘనిస్తాన్ ఆల్టైమ్ గ్రేట్ ఆల్రౌండర్ మొహమ్మద్ నబీ కొడుకు హసన్ ఐసాఖిల్ స్వదేశంలో జరుగుతున్న ఓ ఇంటర్ రీజియన్ టోర్నీలో (మెర్వైస్ నికా రీజినల్ 3-డే ట్రోఫీ) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఈ టోర్నీలో అమో రీజియన్కు ఆడతున్న 18 ఏళ్ల హసన్.. బాంద్-ఎ-అమీర్తో జరిగిన మ్యాచ్లో 235 బంతుల్లో 143 పరుగులు (సెకెండ్ ఇన్నింగ్స్) చేసి ఔటయ్యాడు. ఈ ఫార్మాట్లో హసన్కు ఇది తొలి సెంచరీ.ఈ మ్యాచ్లో హసన్ కష్టాల్లో ఉన్న తన జట్టును గట్టెక్కించి భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అంతకుముందు కమాల్ ఖాన్ (105), సెదిఖుల్లా పచా (77) కూడా సత్తా చాటడంతో అమో రీజియన్ తొలి ఇన్నింగ్స్లో 350 పరుగులు చేసింది.అనంతరం బాంద్-ఎ-అమీర్ జట్టు ఓపెనర్ హరూన్ ఖాన్ (109) సెంచరీతో ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్లో 274 పరుగులు చేయగలిగింది. అమో బౌలర్లలో సఖీ 4 వికెట్లు తీశాడు. 76 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అమో టీమ్.. హసన్ సెంచరీతో సత్తా చాటడంతో 235 పరుగులు చేసి, ప్రత్యర్థి ముందు 312 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 45 బంతుల్లో 150 పరుగులుహసన్ గతేడాది తొలిసారి వార్తల్లో నిలిచాడు. కాబుల్ ప్రీమియర్ లీగ్ 2024లో 45 బంతుల్లో 150 పరుగులు చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో హసన్ రికార్డు స్థాయిలో 19 సిక్సర్లు కొట్టాడు. హసన్ గతేడాది అండర్-19 వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న హసన్ తండ్రి నబీ కొడుకుతో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ముచ్చట పడుతున్నాడు. -
IPL 2025 MI Vs LSG: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్లో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం లక్నోతో జరుగబోయే మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారతీయ బ్యాటర్గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 295 సిక్సర్లు (265 మ్యాచ్ల్లో) ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు క్రిస్ గేల్ ఒక్కడే 300 సిక్సర్లు మార్కును తాకాడు. గేల్ 142 మ్యాచ్ల్లో 357 సిక్సర్లు బాదాడు. గేల్, రోహిత్ తర్వాత ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 261 మ్యాచ్ల్లో 285 సిక్సర్లు కొట్టాడు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాటర్లుక్రిస్ గేల్- 357రోహిత్ శర్మ- 295విరాట్ కోహ్లి- 285ఎంఎస్ ధోని- 260ఏబీ డివిలియర్స్- 251ఓవరాల్గా టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉంది. గేల్ ఈ ఫార్మాట్లో 1056 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో గేల్ మినహా ఏ క్రికెటర్ 1000 సిక్సర్ల మార్కును తాకలేదు. గేల్ తర్వాత కీరన్ పోలార్డ్ రెండో స్థానంలో ఉన్నాడు. పోలీ తన టీ20 కెరీర్లో 908 సిక్సర్లు బాదాడు. గేల్, పోలీ తర్వాత రసెల్ (737), పూరన్ (630) అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-4 బ్యాటర్లు విండీస్ ఆటగాళ్లే కావడం విశేషం. ఈ జాబితాలో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో, విరాట్ కోహ్లి 20వ స్థానంలో ఉన్నారు. రోహిత్ తన టీ20 కెరీర్లో 540 సిక్సర్లు బాదగా.. విరాట్ 429 సిక్సర్లు కొట్టాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-10 ఆటగాళ్లుక్రిస్ గేల్- 1056కీరన్ పోలార్డ్- 908ఆండ్రీ రసెల్- 737నికోలస్ పూరన్- 630కొలిన్ మున్రో- 557అలెక్స్ హేల్స్- 552రోహిత్ శర్మ- 540గ్లెన్ మ్యాక్స్వెల్- 530జోస్ బట్లర్- 528డేవిడ్ మిల్లర్- 505ఇదిలా ఉంటే, ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఇవాళ మధ్యాహ్నం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్కు చేరే క్రమంలో నేటి మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ముంబై, లక్నో తలో 10 పాయింట్లు (9 మ్యాచ్లు) సాధించి పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ (12), ఢిల్లీ (12), ఆర్సీబీ (12), పంజాబ్ (11) టాప్-4లో ఉన్నాయి. -
IPL 2025, KKR VS PBKS: చరిత్ర సృష్టించిన ప్రభ్సిమ్రన్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి పంజాబ్ కింగ్స్ అన్ క్యాప్డ్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఏప్రిల్ 26) కేకేఆర్తో జరిగిన రద్దైన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. కెరీర్ ప్రారంభం నుంచి (2019) పంజాబ్ కింగ్స్కే ఆడుతున్న ప్రభ్సిమ్రన్ ఇప్పటివరకు 43 మ్యాచ్లు ఆడి 151.88 స్ట్రయిక్రేట్తో 1048 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన 10వ ఆటగాడిగా ప్రభ్సిమ్రన్ నిలిచాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున యువరాజ్ సింగ్, శిఖర్ ధవన్కు కూడా 1000 పరుగుల మార్కును తాకలేదు. పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. రాహుల్ 2018-2021 మధ్యలో 55 మ్యాచ్లు ఆడి 2548 పరుగులు చేశాడు.పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..కేఎల్ రాహుల్- 2548షాన్ మార్ష్- 2477డేవిడ్ మిల్లర్- 1974మయాంక్ అగర్వాల్- 1513మ్యాక్స్వెల్- 1431క్రిస్ గేల్- 1339సాహా- 1190మనన్ వోహ్రా- 1106మన్దీప్ సింగ్- 1073ప్రభ్సిమ్రన్ సింగ్- 1048కుమార సంగక్కర- 1009కాగా, నిన్న కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సెంచరీకి చేరువలో (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఔటైన ప్రభ్సిమ్రన్ తన జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో ప్రభ్సిమ్రన్ ఓ మోస్తరు ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 292 పరుగులు చేశాడు.నిన్నటి మ్యాచ్లో ప్రభ్సిమ్రన్ సహా ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ 25, జోస్ ఇంగ్లిస్ 11 (నాటౌట్) చేయగా.. మ్యాక్స్వెల్ (7) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. జన్సెన్ 7 బంతులు ఆడి కేవలం 3 పరుగులే చేసి ఔటయ్యాడు. కేకేఆర్ బౌలర్లలో వైభ్వ్ అరోరా 2 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం కేకేఆర్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్ తర్వాత వర్షం మొదలైంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. వర్షం ప్రారంభమయ్యే సమయానికి కేకేఆర్ స్కోర్ 7/0గా (ఒక ఓవర్లో) ఉంది. ఈ మ్యాచ్లో లభించిన పాయింట్తో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ టాప్-3లో ఉన్నాయి. -
ప్రతీకార పోరు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరగనున్న తొలి పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఆరంభంలో పరాజయాలు ఎదురైనా... ఆ తర్వాత చక్కటి ఆటతీరుతో గెలుపు బాట పట్టిన ముంబై మరో విజయంతో ‘ప్లే ఆఫ్స్’ వైపు మరో అడుగు ముందుకు వేయాలని భావిస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా మంచి టచ్లో ఉంది. అయితే ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు గత నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి మంచి జోరు మీద ఉంది. ఓవరాల్గా రెండు జట్లు 9 మ్యాచ్లాడి 5 విజయాలు, 4 పరాజయాలతో 10 పాయింట్లతో ఉన్నాయి. అయితే ఇరు జట్లు గెలిచిన ఐదు మ్యాచ్ల్లోనూ... వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం... సమష్టి కృషికి నిదర్శనం. ముంబై తరఫున అశ్వని కుమార్, కరణ్ శర్మ, విల్ జాక్స్, రోహిత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ ఈ అవార్డు దక్కించుకోగా... లక్నో సూపర్ జెయింట్స్ తరఫున శార్దుల్ ఠాకూర్, దిగ్వేశ్ రాఠీ, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్రమ్, అవేశ్ ఖాన్ గెలుచుకున్నారు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో లక్నో విజయం సాధించింది. లక్నో 203 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో ముంబై 191 పరుగులకే పరిమితమైంది. ఈ పోరులోనే భారీ షాట్లు ఆడలేక తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగాడు. మరి రెండో మ్యాచ్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. జోరు సాగిస్తేనే... హిట్మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి రావడంతో... ముంబై కష్టాలు తీరిపోయాయి. సీజన్ ఆరంభంలో పరాజయాలతో సతమతమైన ముంబై.. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రోహిత్ దంచికొడుతూ శుభారంభాలు అందిస్తుండగా... మిడిలార్డర్లో సూర్యకుమార్ తన విలువ చాటుకుంటున్నాడు. రికెల్టన్, విల్ జాక్స్ కూడా మంచి టచ్లో ఉండగా... తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ రూపంలో ముంబైకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. వీరంతా కలిసి కట్టుగా కదంతొక్కితే భారీ స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. సొంతగడ్డపై మ్యాచ్ జరగనుండడం ముంబైకి కలిసి రానుంది. ఇక బౌలింగ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ పేస్ భారం మోయనుండగా... విగ్నేశ్, సాంట్నర్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. టాపార్డర్పైనే భారం... లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లో ఐదు విజయాలు సాధించిందంటే... వారి టాప్–3 ఆటగాళ్లు రాణించడమే దానికి ప్రధాన కారణం. మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్ ఈ ముగ్గురూ దంచికొడుతుండటంతో... లక్నో భారీ స్కోర్లు చేస్తోంది. ముఖ్యంగా పూరన్ ఈ సీజన్లో 200 పైగా స్ట్రయిక్రేట్తో 377 పరుగులు చేశాడు. మార్క్రమ్, మార్ష్ కూడా ధాటిగా ఆడుతున్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ సీజన్లో లయ దొరకబుచ్చుకోలేకపోతున్న పంత్ 9 మ్యాచ్ల్లో 106 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఆయుశ్ బదోనీ, అబ్దుల్ సమద్ ఫర్వాలేదనిపిస్తుండగా... డేవిడ్ మిల్లర్ రాణించాల్సిన అవసరముంది. బౌలింగ్లో శార్దుల్, అవేశ్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠీ కీలకం కానున్నారు.తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రికెల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చహర్, బౌల్ట్, బుమ్రా, విగ్నేశ్. లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్ష్, పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. -
RCB Vs DC: కోహ్లి X రాహుల్
న్యూఢిల్లీ: భారత ప్రధాన బ్యాటర్లు... ఆ్రస్టేలియా ప్రధాన పేసర్ల మధ్య పోరులా అభివర్ణిస్తున్న మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో రాయల్ చెలంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఈ రెండు జట్లు... తాజా సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. కెపె్టన్లు కాకపోయినా... బెంగళూరు బ్యాటింగ్ భారాన్ని విరాట్ కోహ్లి మోస్తుండగా... ఢిల్లీ క్యాపిటల్స్కు కేఎల్ రాహుల్ వెన్నెముకగా నిలుస్తున్నాడు. సాధికారికంగా ఆడుతున్న ఈ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఇరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాహుల్ రాణించడంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది. స్వతహాగా కర్ణాటకకు చెందిన రాహుల్... ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ‘ఇది నా అడ్డా’ అన్న తరహాలో సంబరాలు జరుపుకొని వార్తల్లో నిలిచాడు. మరి ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లి ఆదివారం తన సొంత నగరంలో జరగనున్న పోరులో దీనికి సమాధానం చెప్తాడా చూడాలి. ఢిల్లీ స్టేడియంలో విరాట్కు మంచి రికార్డు ఉంది. ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్లాడిన కోహ్లి అందులో 5 అర్ధ శతకాలు సాధించి ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇక బౌలింగ్లోనూ ఇరు జట్ల ఆసీస్ పేసర్ల మధ్య పోటీ కనిపిస్తోంది. ఢిల్లీ ప్రధాన పేసర్ స్టార్క్ మంచి జోష్లో ఉండగా... బెంగళూరు తరఫున హాజల్వుడ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆసక్తికర పోరు ఖాయమే! డుప్లెసిస్ రాకతో... ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ఈ సీజన్లో అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తోంది. అక్షర్ పటేల్ సారథ్యంలో ముందుకు సాగుతున్న క్యాపిటల్స్... 8 మ్యాచ్ల్లో 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో ఉంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఫాఫ్ డుప్లెసిస్ తిరిగి అందుబాటులోకి రావడం ఆ జట్టు బలాన్ని మరింత పెంచుతోంది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ మంచి ఫామ్లో ఉండగా... కరుణ్ నాయర్ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది.స్టార్క్తో కలిసి ముకేశ్ కుమార్ పేస్ భారం పంచుకోనుండగా... కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. జోరు సాగేనా..! అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఆడుతున్న తొలి ఐపీఎల్లో విరాట్ దంచికొడుతున్నాడు. బరిలోకి దిగితే చివరి వరకు నిలవాలనే కసితో ముందుకు సాగుతున్నాడు. 65.33 సగటుతో అతడు పరుగులు రాబట్టాడు. ఈ సీజన్లో ప్రత్యర్థుల మైదానాల్లో ఆడిన అన్నీ మ్యాచ్ల్లోనూ గెలిచిన బెంగళూరు అదే కొనసాగించాలనుకుంటోంది. కోహ్లితో పాటు మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా మంచి టచ్లో ఉండగా... మిడిలార్డర్లో దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్, జితేశ్ శర్మ కీలకం కానున్నారు. టిమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్ ఫినిషర్ల బాధ్యతలు మోస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, హాజల్వుడ్, యశ్ దయాళ్ పేస్ భారం మోస్తుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఈ సీజన్లో 16 వికెట్లు తీసిన హాజల్వుడ్పై భారీ అంచనాలున్నాయి. తుది జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్), అభిషేక్ పొరెల్, డుప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, స్టార్క్, కుల్దీప్, ముకేశ్ కుమార్, చమీరా. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, పడిక్కల్, జితేశ్ శర్మ, షెఫర్డ్, డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హాజల్వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ. -
భారత్ X శ్రీలంక
కొలంబో: మహిళల ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరగనున్న తొలి పోరులో ఆతిథ్య శ్రీలంకతో భారత జట్టు తలపడుతోంది. భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా పాల్గొంటున్న ఈ టోర్నీలో మ్యాచ్లన్నీ ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఈ టోర్నీలో యువ ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించాలని భారత్ భావిస్తోంది. ముక్కోణపు టోర్నీ మొదటి మ్యాచ్లో గెలిచి శుభారంభం చేయాలని హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా చూస్తోంది. కెపె్టన్ హర్మన్ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఓపెనర్ షఫాలీ వర్మను సెలెక్టర్లు ఈ సిరీస్కు కూడా పరిగణనలోకి తీసుకోలేదు.గత రెండు సిరీస్ల్లోనూ చక్కటి విజయాలు సాధించిన టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ముక్కోణపు టోర్నీకి సిద్ధమైంది. వెస్టిండీస్, ఐర్లాండ్పై సిరీస్లు గెలిచిన టీమిండియా వరుసగా ఆరు వన్డేలు నెగ్గి శ్రీలంకలో అడుగుపెట్టింది. కాశ్వి గౌతమ్ అరంగేట్రం! బ్యాటింగ్లో బలంగా ఉన్న టీమిండియాకు పేస్ బౌలింగ్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రెగ్యులర్ బౌలర్లు రేణుక సింగ్, పూజ వస్త్రకర్, టిటాస్ సాధు గాయాలతో సతమతమవుతుండటంతో... యంగ్ ప్లేయర్లపై అధిక భారం పడనుంది. అండర్–19 మహిళల ప్రపంచకప్లో సత్తాచాటిన కాశ్వి గౌతమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయమే. ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహించిన కాశ్వి 9 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టింది. హైదరాబాద్ మీడియం పేసర్ అరుంధతి రెడ్డి, కాశ్వి తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమే. మీడియం పేస్ ఆల్రౌండర్ అమన్జ్యోత్ కౌర్ కూడా అందుబాటులో ఉంది. అయితే శ్రీలంక పిచ్లపై స్పిన్నర్ల ఆధిపత్యమే ఎక్కువ. ఆ కోణంలోనూ భారత్ మెరుగ్గా ఉంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ, స్నేహ్ రాణాతో పాటు డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆకట్టుకున్న శ్రీచరణి జట్టులో ఉన్నారు. మరోవైపు శ్రీలంక జట్టు కెపె్టన్ చమరి ఆటపట్టుపై అధికంగా ఆధారపడుతోంది. -
‘ఈడెన్’ను ముంచెత్తిన వాన
కోల్కతా: ఈ మ్యాచ్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘మెరుపులు... చినుకులు... రద్దు!’ పంజాబ్ ఓపెనర్ల బౌండరీతో మొదలైన ఈ మ్యాచ్ బ్యాటింగ్ వండర్గా సాగింది. మైదానంలో జోష్ తెచ్చింది. ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ ఇదంతా ఒక ఇన్నింగ్స్ వరకే పరిమితమైంది. కోల్కతా లక్ష్యఛేదన మొదలయ్యాక ఒకటే ఓవర్కు ఆట ముగించాల్సి వచ్చింది. వానొచ్చి మైదానంతో పాటు అంతకు ముందరి పరుగుల వరదను ముంచెత్తింది. భారీ వర్షంతో చాలా సేపు నిరీక్షించినా ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగారు.వీరిద్దరు తొలి వికెట్కు 72 బంతుల్లో 120 పరుగులు జోడించారు. ఆ తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి కోల్కతా నైట్రైడర్స్ ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ మ్యాచ్ రద్దు కావడం ఇదే మొదటిసారి! 120 దాకా జోరే జోరు! ఫోర్తో మొదలైన పంజాబ్ స్కోరు తర్వాత జోరందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్సిమ్రన్ల క్రమంగా హోరెత్తించడంతో మైదానం పరుగుల పండగ చేసుకుంది. ఇద్దరు ఫోర్లు, సిక్స్లను అలవోకగా దంచేయడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. 4.3 ఓవర్లలో కింగ్స్ 50 స్కోరును దాటింది. హర్షిత్ పదో ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 4, 6, 4 బాదాడంతో 27 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. తర్వాత నరైన్ 11వ ఓవర్ను ఇద్దరు కలిసి చితగ్గొట్టారు. ప్రియాన్ష్ ఓ సిక్స్ కొడితే... ప్రభ్సిమ్రన్ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 22 పరుగులొచ్చాయి. ఈ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. ఎట్టకేలకు 12వ ఓవర్లో రసెల్ ఓపెనింగ్ జోడీకి చెక్ పెట్టాడు. ప్రియాన్ష్ భారీ షాట్కు యత్నించి వైభవ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 38 బంతుల్లో ప్రభ్సిమ్రన్ అర్ధ సెంచరీ పూర్తయింది. సకారియా వేసిన 13వ ఓవర్లో ప్రభ్సిమ్రన్ వరుసగా 4, 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. వరుణ్ వేసిన 14వ ఓవర్ను పూర్తిగా ఆడిన ప్రభ్సిమ్రన్ 4, 0, 4, 6, 4, 1లతో 19 పరుగుల్ని పిండుకున్నాడు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే 37 పరుగులు రావడంతో 121/1 స్కోరు కాస్తా 158/1గా ఎగబాకింది. 15వ ఓవర్లో ప్రభ్సిమ్రన్ అవుట్ కావడంతోనే స్కోరు, జోరు అన్నీ తగ్గాయి. మ్యాక్స్వెల్ (7), మార్కో యాన్సెన్ (3) నిరాశపరచగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పెద్దగా మెరిపించలేకపోయాడు. దీంతో ఆఖరి 6 ఓవర్లలో పంజాబ్ 43 పరుగులే చేయగలిగింది. ఈడెన్ గార్డెన్స్లో ఏ మ్యాచ్ జరిగినా గంట మోగించే ఆట ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పహల్గాంలో ఉగ్ర ఘాతుకానికి నివాళిగా ఈ సారి గంట మోగించకుండా నల్ల రిబ్బన్లతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. మ్యాచ్ ఆరంభానికి ముందు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) పహల్గాంలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పించింది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) వైభవ్ (బి) రసెల్ 69; ప్రభ్సిమ్రన్ (సి) పావెల్ (బి) వైభవ్ 83; శ్రేయస్ నాటౌట్ 25; మ్యాక్స్వెల్ (బి) వరుణ్ 7; యాన్సెన్ (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 3; ఇన్గ్లిస్ నాటౌట్ 11; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–120, 2–160, 3–172, 4–184. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–34–2, చేతన్ సకారియా 3–0–39–0, హర్షిత్ రాణా 2–0–27–0, వరుణ్ చక్రవర్తి 4–0–39–1, సునీల్ నరైన్ 4–0–35–0, రసెల్ 3–0–27–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ నాటౌట్ 1; నరైన్ నాటౌట్ 4; ఎక్స్ట్రాలు 2; మొత్తం (1 ఓవర్లో వికెట్ కోల్పోకుండా) 7. బౌలింగ్: యాన్సెన్ 1–0–6–0. మాల్దీవుల్లో సన్రైజర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్ల ఒత్తిడికి దూరంగా కాస్త విరామం తీసుకున్నారు. తర్వాతి మ్యాచ్కు వారం రోజుల వ్యవధి ఉండటంతో సరదాగా గడిపేందుకు ఆటగాళ్లంతా శనివారం మాల్దీవులకు వెళ్లారు. చెన్నైలో సూపర్ కింగ్స్తో మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత అక్కడినుంచే టీమ్ సభ్యులు మాల్దీవులకు చేరుకున్నారు. సన్రైజర్స్ తమ తర్వాతి పోరులో శుక్రవారం అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్లలో 3 గెలిచి 6 ఓడిన టీమ్... మిగిలిన ఐదు మ్యాచ్లూ గెలిస్తేనే ‘ప్లే ఆఫ్స్’ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X బెంగళూరువేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
#Glenn Maxwell: మరి ఇంత చెత్త బ్యాటింగా? జట్టు నుంచి తీసేయండి
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో మాక్స్వెల్ తీవ్ర నిరాశపరిచాడు. గత మ్యాచ్కు దూరంగా ఉన్న మాక్సీకి పంజాబ్ మెనెజ్మెంట్ తిరిగి తుది జట్టులో చోటు ఇచ్చింది.మార్కస్ స్టోయినిష్ స్ధానంలో జట్టులోకి వచ్చిన మాక్స్వెల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్.. కేకేఆర్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాడు. మరోసారి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మాక్సీ పెవిలియన్కు చేరాడు. వరుణ్ అద్బుతమైన బంతితో ఈ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్లో 8 బంతులు ఎదుర్కొన్న మాక్స్వెల్..87.50 స్ట్రైక్ రేటుతో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన మాక్స్వెల్.. 8.00 సగటుతో కేవలం 48 పరుగులు చేశాడు. దీంతో మాక్స్వెల్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.ఐపీఎల్ చరిత్రలోనే చెత్త ప్లేయర్ అంటూ ఎక్స్లో ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(83) టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్(25) రాణించారు.చదవండి: IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్ -
ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్దానానికి దూసుకు వెళ్లాలని ఢిల్లీ భావిస్తోంది. ఈ కీలక మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఫాఫ్ గాయం కారణంగా వరుసగా నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పుడు ఫుల్ ఫిట్నెస్ సాధించడంతో ఆర్సీబీతో మ్యాచ్లో డుప్లెసిస్ ఆడనున్నాడు.ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ జాక్ ఫ్రెజర్ మెక్గర్క్ ధ్రువీకరించాడు. ఆర్సీబీతో మ్యాచ్కు ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో ఉండనున్నాడు. నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడని మెక్గర్క్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం నెట్స్లో డుప్లెసిస్ తీవ్రంగా శ్రమించాడు. దీంతో అతడు తిరిగి రావడం దాదాపు ఖాయమైంది. డుప్లెసిస్ తిరిగి వస్తే కరుణ్ నాయర్పై వేటు పడే అవకాశముంది.ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్(అంచనా): అభిషేక్ పోరెల్, ఫాఫ్ డు ప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీర, ముఖేష్ కుమార్ -
మూడేళ్లుగా సింగిల్గానే..: రిలేషన్షిప్పై నోరు విప్పిన శుబ్మన్ గిల్
టీమిండియా స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్ వ్యక్తిగత జీవితం గురుంచి గత కొంతకాలంగా పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో గిల్ ప్రేమాయణం సాగించినట్లు ప్రచారం జరిగింది. మళ్లీ కొంతకాలం తర్వాత వీళ్లిద్దరికి బ్రేకప్ అయిందని వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్తలపై గిల్ కానీ సారా కానీ ఎప్పుడు స్పందించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్తో గిల్ డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కానీ గిల్తో తాను డేటింగ్ చేయడం లేదని సారా అలీ ఖాన్ స్పష్టం చేసింది. వీరిద్దరి తర్వాత మరో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేతో గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అనన్య మాత్రం ఖండించింది. అవన్నీ వట్టి రూమర్సే అని కొట్టిపారేసింది. తాజాగా తన రిలేషన్షిప్పై వస్తున్న వార్తలపై గిల్ స్పందించాడు. గత మూడేళ్ల నుంచి తాను ఒంటరిగా ఉన్నానని గిల్ చెప్పుకొచ్చాడు."నేను ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేను. గత మూడేళ్ల నుంచి నేను ఒంటరిగా ఉన్నాను. ఇటీవల కాలంలో చాలా మందితో నన్ను ముడిపెట్టారు. నా వ్యక్తిగత జీవితంపై చాలా ఊహాగానాలు, పుకార్లు ప్రచారం చేశారు. నేను ఎప్పుడూ చూడని, కలవని వ్యక్తితో కూడా లింకులు పెడుతున్నారు. నిజంగా ఇది చాలా హాస్యాస్పదం. ప్రస్తుతం నేను నా ప్రొఫెషనల్ కెరీర్పై దృష్టి పెట్టాను. ప్రస్తుతం ఒకరితో ప్రేమాయణం నడిపే అంత సమయం నా దగ్గర లేదు. మేము ఎక్కడక్కడికో ప్రయాణిస్తుంటాము. ప్రొఫెషనల్ కెరీర్తో బీజీగా ఉన్నాను" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ వ్యవహరిస్తున్నాడు.చదవండి: బీసీసీఐ పొమ్మంది.. కట్ చేస్తే! అభిషేక్ నాయర్కు మరో ఆఫర్? -
IPL 2025 PBKS Vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
KKR vs PBKS Live Updates: వర్షం కారణంగా మ్యాచ్ రద్దుఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కేకేఆర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ ముగిసిన అనంతరం వరుణుడు మ్యాచ్కు అంతరాయం కలిగించాడు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుందని అంతాభావించారు. కానీ మైదానం సిద్దం చేసే సమయానికి వర్షం మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(83) టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్(25) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రస్సెల్ తలా వికెట్ సాధించారు. మ్యాచ్కు వర్షం అంతరాయంఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించాడు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. కేకేఆర్ ముందు భారీ టార్గెట్ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(83) టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్(25) రాణించారు.పంజాబ్ రెండో వికెట్ డౌన్..ప్రభుసిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 83 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సింగ్.. వైభవ్ ఆరోరా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 14.3 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 160/2పంజాబ్ తొలి వికెట్ డౌన్..ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 69 పరుగులు చేసిన ఆర్య.. రస్సెల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 12 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 121 పరుగులు చేసింది. 11 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 112/011 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 112 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(62), ప్రభుసిమ్రాన్ సింగ్(47) ఉన్నారు.8 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 71/08 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(38), ప్రభుసిమ్రాన్ సింగ్(31) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న పంజాబ్ కింగ్స్..4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(28), ప్రభుసిమ్రాన్ సింగ్(13) ఉన్నారు.ఐపీఎల్-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం.ఈ మ్యాచ్లో పంజాబ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. జట్టులోకి తిరిగి మాక్స్వెల్, ఓమర్జాయ్ వచ్చారు. కేకేఆర్ రెండు మార్పులు చేసింది. రావ్మన్ పావెల్తో పాటు చేతన్ సాకరియా కేకేఆర్ తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రోవ్మన్ పావెల్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి -
బీసీసీఐ పొమ్మంది.. కట్ చేస్తే! అభిషేక్ నాయర్కు మరో ఆఫర్?
టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ జట్టుతో తెగదింపులు చేసుకున్న నాయర్.. తిరిగి మళ్లీ కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో జతకట్టాడు. కేకేఆర్ కోచింగ్ స్టాప్లో అభిషేక్ భాగమయ్యాడు. గతేడాది సీజన్లో కోల్కతాను ఛాంపియన్గా నిలపడంలో నాయర్ది కీలక పాత్ర. మరోసారి తమ జట్టును విజయపథంలో నడిపిస్తాడని నాయర్పై కేకేఆర్ మెనెజ్మెంట్ గంపెడు ఆశలు పెట్టుకుంది.అయితే ఐపీఎల్ మధ్యలోనే నాయర్కు మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ముంబై టీ20 లీగ్లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ జట్టు మెంటార్గా నాయర్ ఎంపికనైట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. అభిషేక్ నాయర్ను ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ తమ మెంటార్గా నియమించింది.త్వరలోనే అభిషేక్ నాయర్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలవడనుంది అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ టోర్నమెంట్ మే 26 నుంచి ప్రారంభం కానుంది. అదేవిధంగా ఈ టోర్నీలో భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అంధేరీ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు. వీరితో పాటు ఓంకార్ సాల్వి సోబో ముంబై ఫాల్కన్స్కు, ఐపీఎల్ మాజీ స్టార్ ప్రవీణ్ తంబే నార్త్ ముంబై పాంథర్స్కు హెడ్ కోచ్గా ఎంపికయ్యారు.చదవండి: IPL 2025: 'శ్రేయస్ చాలా బాధపడ్డాడు.. కేకేఆర్కు చుక్కలు చూపిస్తాడు' -
'శ్రేయస్ చాలా బాధపడ్డాడు.. కేకేఆర్కు చుక్కలు చూపిస్తాడు'
ఐపీఎల్-2025లో శనివారం ఈడెన్గార్డెన్స్ వేదికగా కీలకపోరులో తలపడేందుకు పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ రేసులో ముందుకు వెళ్లళాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఐదో స్ధానంలో ఉండగా.. కోల్కతా ఏడో స్ధానంలో ఉంది. ఇరు జట్లకు ఇంకా ఆరు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్కు ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అయ్యర్ తన మాజీ జట్టు కేకేఆర్పై మరోసారి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్దంగా ఉన్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.కాగా శ్రేయస్ అయ్యర్ గతేడాది సీజన్లో కెప్టెన్గా కేకేఆర్కు టైటిల్ను అందించాడు. కానీ అనూహ్యంగా మెగా వేలానికి ముందు అయ్యర్ను రిటైన్ చేసుకోకుండా కేకేఆర్ ఫ్రాంచైజీ అందరికి షాకిచ్చింది. కేకేఆర్ నిర్ణయంతో శ్రేయస్ కూడా నిరాశచెందాడు. తనతో రిటెన్షన్ కోసం కనీసం సంప్రదింపులు కూడా జరపనట్లు శ్రేయస్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే వేలంలోకి వచ్చిన అయ్యర్ను రూ.26 .75 కోట్ల భారీ ధరకు పంజాబ్ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటికే కేకేఆర్ను ఓసారి పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని పంజాబ్ చరిత్ర సృష్టించింది. నేడు జరగనున్న మ్యాచ్లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని శ్రేయస్ సేన భావిస్తోంది."కేకేఆర్పై శ్రేయస్ అయ్యర్ చాలా కోపంగా ఉంటాడు. ఆటగాళ్లు ఫామ్లో లేకపోతే లేదా కెప్టెన్గా విఫలమైతే ఏ ఫ్రాంచైజీ అయినా వేలంలోకి విడిచిపెడుతోంది. కానీ అయ్యర్ కథ వేరు. టైటిల్ను అందించిన కెప్టెన్ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. నిజంగా ఈ నిర్ణయం ఎవరినైనా బాధిస్తుంది. టైటిల్ను అందించిన జట్టుకు ఏ కెప్టెనైనా ఉండాలని భావించడు.తనను రిటైన్ చేసుకోకపోవడంతో అయ్యర్ చాలా బాధపడ్డాడు. అయితే కేకేఆర్ విడిచిపెట్టడంతో అయ్యర్కు ఒకవంతు మంచే జరిగింది. అతడు భారీ ధరకు పంజాబ్ కింగ్స్ జట్టులోకి వచ్చాడు. మరోసారి కేకేఆర్పై తనంటో నిరూపించకోవాల్సిన సమయం వచ్చింది. పంజాబ్కు అయ్యర్ మరో రెండు పాయింట్లను తీసుకువస్తాడని ఆశిస్తున్నాను" అని స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు.చదవండి: ఈసారి వేలం వేస్ట్.. ధోని కేవలం బ్రాండ్ కోసమే ఆడుతున్నాడు: సురేశ్ రైనా విమర్శలు -
ఈసారి వేలం వేస్ట్.. ధోని బ్రాండ్ కోసమే ఆడుతున్నాడు: సురేశ్ రైనా
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం తీరుపై ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా (Suresh Raina) విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్-2025 (IPL 2025) వేలంలో సీఎస్కే వ్యూహాలు సరిగ్గా లేవని విమర్శించాడు. ఈసారి సరైన ఆటగాళ్లను ఎంచుకోవడంలో చెన్నై ఫ్రాంఛైజీ విఫలమైందన్నాడు. కాగా ఈ సీజన్లో సీఎస్కే దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. పదో స్థానంలో అట్టడుగునతాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో ఓడిపోయిన ధోని సేన.. ఈ సీజన్లో ఏడో పరాజయం నమోదు చేసింది. తద్వారా ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్లలో కేవలం రెండే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో అట్టడుగున ఉంది.ఈ నేపథ్యంలో సీఎస్కే తీరుపై విమర్శలు వస్తుండగా.. స్టార్ స్పోర్ట్స్ షోలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘సీఎస్కే వైఫల్యాలకు మేనేజ్మెంట్ను తప్పుబట్టాలా? లేదంటే.. మహేంద్ర సింగ్ ధోనిని విమర్శించాలా?’’ అన్న ప్రశ్న ఎదురైంది.అంతిమ నిర్ణయం వారిదేఇందుకు బదులిస్తూ.. ‘‘వేలం సమయంలో వాళ్లు కచ్చితంగా ఎంఎస్కు కాల్ చేస్తారు. కానీ నేను మాత్రం ఎప్పుడూ వేలంపాటలో భాగం కాలేదు. ఆ చర్చల్లోకే వెళ్లలేదు. అయితే, ఎంఎస్తో మాత్రం కచ్చితంగా చర్చిస్తారు. రిటైన్ చేసుకోవాల్సిన ప్లేయర్ల గురించి మాట్లాడతారు. ఆటగాళ్ల కొనుగోలు సమయంలోనూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందని అడుగుతారు. కానీ ఎంఎస్ పూర్తిగా ఇందులో భాగంకాడు.తనకు కావాల్సిన నలుగురు, ఐదుగురు ప్లేయర్ల గురించి మాత్రమే చెప్తాడు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో కోర్ గ్రూప్దే అంతిమ నిర్ణయం. కాశీ విశ్వనాథన్ సర్, రూపా మా అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఉంటారు. వారు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ ధోని గనుక పూర్తిగా వేలంలో భాగమై ఉంటే.. ఇలాంటి ఆటగాళ్లను కొనేవాడు అంటారా?!’’ అని రైనా పేర్కొన్నాడు.ధోని బ్రాండ్ కోసమే ఆడుతున్నాడుఇక సీఎస్కే పట్ల ధోని అంకితభావం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అన్క్యాప్డ్ ప్లేయర్గా ఈసారి రంగంలోకి దిగిన ఎంఎస్ ధోనిని చూడండి. 43 ఏళ్ల వయసున్న కెప్టెన్. ఇంకా జట్టు కోసం శాయశక్తులా కష్టపడుతున్నాడు. సీఎస్కే బ్రాండ్, అభిమానుల కోసం ఆడుతున్నాడు.ఈ వయసులోనూ కీపర్గా రాణిస్తున్నాడు. జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. జట్టు భారం మొత్తాన్ని ఒక్కడే తన భుజాలపై మోస్తున్నాడు.మరి మిగతా పది మంది ఆటగాళ్లు ఏం చేస్తున్నారు? రూ. 18 కోట్లు, 17 కోట్లు.. 12 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు కెప్టెన్కు ఎలాంటి సహకారం అందిస్తున్నారు?’’ అంటూ సురేశ్ రైనా సీఎస్కే ఆటగాళ్ల తీరుపై మండిపడ్డాడు. కాగా గతేడాది ధోని స్థానంలో పగ్గాలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్.. ఈ సీజన్లో ఐదుమ్యాచ్లు ఆడి గాయపడ్డాడు. ఈ క్రమంలో ధోని మరోసారి సీఎస్కే సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.చదవండి: ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వె ళ్లగక్కిన ధోని -
కేకేఆర్తో మ్యాచ్.. పంజాబ్ కింగ్స్ వ్యూహాత్మక నిర్ణయం
ఐపీఎల్-2025 (IPL 2025)లో మరో రసవత్తర పోరు.. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్- పంజాబ్ కింగ్స్ (KKR vs PBKS) మధ్య మ్యాచ్.. శనివారం నాటి ఈ పోరుకు ఈడెన్ గార్డెన్స్ వేదిక.ఈ సీజన్లో ఇప్పటికే ముఖాముఖి ఇరుజట్లు తలపడగా.. అతి స్వల్ప లక్ష్యాన్ని (112) కాపాడుకుని పంజాబ్ కేకేఆర్పై జయభేరి మోగించింది. తద్వారా కేకేఆర్ మాజీ కెప్టెన్, పంజాబ్ ప్రస్తుత సారథి శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన పాత జట్టుపై ప్రతీకారం తీర్చుకున్నాడు.వ్యూహాత్మక నిర్ణయంఇక సొంతగడ్డపై కేకేఆర్ను ఓడించాలనే పట్టుదలతో మరోసారి అయ్యర్ బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్తో మ్యాచ్కు ముందు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దేశీ స్పిన్నర్ తనూశ్ కొటియాన్ను నెట్ బౌలర్గా రప్పించింది. అతడి బౌలింగ్లో పంజాబ్ బ్యాటర్లు శుక్రవారం ప్రాక్టీస్ చేశారు.అతడే ఎందుకు?ఈ సందర్భంగా పంజాబ్ స్పిన్ బౌలింగ్ కోచ్ సునిల్ జోషి.. తనూశ్కు సలహాలు, సూచనలు ఇవ్వడం కనిపించింది. కాగా ఇప్పటికే పంజాబ్ జట్టులో యజువేంద్ర చహల్ రూపంలో మేటి స్పిన్నర్ అందుబాటులో ఉండగా.. హర్ప్రీత్బ్రార్, ప్రవీణ్ దూబే అతడికి సహకారం అందిస్తున్నారు. అయితే, వీరంతా మణికట్టు స్పిన్నర్లే.అందుకే వైవిధ్యం కోసం ఆఫ్ స్పిన్నర్ అయిన తనూశ్ కొటియాన్ను పంజాబ్ నాయకత్వ బృందం బరిలోకి దించింది. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్లు సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అతడి బౌలింగ్లో ప్రాక్టీస్ చేయించింది.ముంబైకి ప్రాతినిథ్యంకాగా 26 ఏళ్ల తనూశ్ కొటియాన్ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన అద్భుత స్పిన్ నైపుణ్యాలతో దిగ్గజ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వారసుడిగానూ నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, భారత్-ఎ జట్టుకు ఆడుతున్నా.. ఇంత వరకు ఒక్కసారి కూడా జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.ఇక ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై గెలవడంలో తనూశ్ది కీలక పాత్ర. ఈ ఆర్థోడాక్స్ ఆఫ్ స్పిన్నర్ ఇప్పటి వరకు 33 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 101 వికెట్లు తీశాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. వేలంలో అమ్ముడుపోలేదు.. నెట్బౌలర్గా వచ్చాడు అంతేకాదు రెండు శతకాలు, 13 ఫిఫ్టీల సాయంతో 1525 పరుగులు సాధించాడు. ఇక లిస్ట్-ఎ క్రికెట్లో 19 మ్యాచ్లు ఆడి 20 వికెట్లు తీయడంతో పాటు.. 90 రన్స్ చేశాడు. అదే విధంగా 25 టీ20 మ్యాచ్లలో కలిపి 25 వికెట్లు కూల్చాడు.కాగా తనూశ్ కొటియాన్ గతేడాది రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. వేలానికి ముందు ఫ్రాంఛైజీ అతడిని వదిలేయగా.. ఐపీఎల్-2025 మెగా ఆక్షన్లోకి రూ. 30 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు. కానీ పది ఫ్రాంఛైజీల్లో ఒక్కటీ తనూశ్పై ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇప్పుడు పంజాబ్ జట్టులోకి నెట్ బౌలర్గా ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్పై కావ్యా మారన్ ఫైర్ -
IPL 2025: ‘ఇదొక అద్భుత విజయం.. ప్లే ఆఫ్స్ చేరతాం’
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్రైజర్స్ హైదరాబాద్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఆరంభ మ్యాచ్లో గెలుపొందిన కమిన్స్ బృందం.. ఆ తర్వాత మళ్లీ ఒకే ఒక్కటి గెలిచి.. వరుసగా ఆరు మ్యాచ్లు ఓడింది. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH)తో శుక్రవారం తలపడ్డ సన్రైజర్స్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో జయభేరి మోగించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించి పన్నెండేళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో తొలి విజయం నమోదు చేసింది. అంతేకాదు.. ప్లే ఆఫ్స్ ఆశలను కూడా సజీవం చేసుకుంది.ఇదొక అద్భుత విజయంఈ క్రమంలో విజయానంతరం సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు మాకు అన్నీ కలిసివచ్చాయి. మా వాళ్లు గొప్పగా ఆడారు. ఇదొక అద్భుత విజయం. కష్టపడినందుకు ఫలితం దక్కింది.సీఎస్కేలో ప్రతిభావంతులైన టాపార్డర్ బ్యాటర్లు ఉన్నారు. మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా వారికి ఉంది. అయితే, మా బౌలర్లు మొమెంటమ్ను మార్చేశారు. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేసి ఇన్నింగ్స్ దిశను మార్చివేశారు.ప్లే ఆఫ్స్ చేరేందుకు కృషి చేస్తాంవారి ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. సీఎస్కేపై మాకు మంచి రికార్డు లేదు. కానీ ఈరోజు మేము గత పరాభవాలకు చెక్ పెట్టగలిగాం. ఈ సీజన్లో మాకు ఇంకా ఐదు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఎంత కష్టమైనా ప్లే ఆఫ్స్ చేరేందుకు కృషి చేస్తాం.ఇంతకంటే గొప్పగా గెలిచేందుకు ప్రయత్నిస్తాం. అయితే, ఏదేమైనా ఈనాటి విజయం మాకు ప్రత్యేకమైనది’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఈసారి కూడా ప్లే ఆఫ్స్ చేరతామనే నమ్మకం ఉందని పరోక్షంగా వెల్లడించాడు.వ్యూహంలో భాగమేఅదే విధంగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి చెబుతూ.. ‘‘వ్యూహం ప్రకారమే హెన్రిచ్ క్లాసెన్ను నాలుగో స్థానంలో పంపించాం. మధ్య ఓవర్లలో వారు స్పిన్ మంత్రంతో ముందుకు వస్తారని తెలుసు.అందుకే క్లాసెన్ ముందుగా బ్యాటింగ్కు వచ్చాడు. అదే విధంగా నితీశ్ రెడ్డికి ఫినిషర్ పాత్ర ఇచ్చాము’’ అని కమిన్స్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్ రన్నరప్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ సీజన్లో ఇప్పటికి ఆడిన తొమ్మిది మ్యాచ్లలో కేవలం మూడే గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవు.ఐపీఎల్-2025: సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్👉టాస్: ఎస్ఆర్హెచ్.. మొదట బౌలింగ్👉సీఎస్కే స్కోరు: 154 (19.5)👉ఎస్ఆర్హెచ్ స్కోరు: 155/5 (18.4)👉ఫలితం: సీఎస్కేపై ఐదు వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హర్షల్ పటేల్ (4/28).చదవండి: CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్పై కావ్యా మారన్ ఫైర్! -
ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్కే బాగుపడుతుంది: సెహ్వాగ్
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఘన చరిత్ర ఉన్న సీఎస్కే (CSK).. ఈసారి మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే గురిపెట్టిందని పేర్కొన్నాడు. తద్వారా ఆఖరి స్థానంలో ఉండటంలో ఉండే మజాను ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతోందంటూ సెటైర్లు వేశాడు.కాగా ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్గా నిలవడంతో పాటు అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా చెన్నైకి రికార్డు ఉంది. అయితే, ధోని (MS Dhoni) సారథ్య బాధ్యతల నుంచి నిష్క్రమించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గత సీజన్లో కెప్టెన్గా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయాడు.ఇక ఈ సీజన్లో ఐదు మ్యాచ్ల తర్వాత గాయపడి రుతు జట్టుకు దూరం కాగా.. ధోని మరోసారి పగ్గాలు చేపట్టాడు. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్తో శుక్రవారం నాటి మ్యాచ్లోనూ చెన్నై ఓటమి పాలైంది. ఈ ఎడిషన్లో సీఎస్కేకు తొమ్మిదింట ఇది ఏడో పరాజయం. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి.తొలిసారి అట్టడుగున.. ఆ కిక్కే వేరప్పా!ఈ నేపథ్యంలో కామెంటేటర్ వీరేందర్ సెహ్వాగ్ స్పందిస్తూ.. ‘‘చెన్నై పదో స్థానంతో ముగిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ వాళ్లు ఆ పని చేశారంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నపుడు.. ఆ అనుభూతి ఎలా ఉంటుందో వారు అనుభవించగలుగుతారు.ఎన్నో ఫైనల్స్ ఆడిన తర్వాత ఇలాంటి అనుభవం వారికి అవసరమే’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అదే విధంగా.. వచ్చే ఏడాది చెన్నై నలుగురు ప్లేయర్లను వదులుకుంటేనే బాగుంటుందంటూ ఇద్దరు దేశీ, ఇద్దరు విదేశీ క్రికెటర్ల పేర్లు చెప్పాడు.ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్కే బాగుపడుతుంది‘‘డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్.. వచ్చే ఏడాది సీఎస్కేలో వీరి పేర్లు ఉండకపోవచ్చు. ఒకవేళ నేను గనుక మేనేజ్మెంట్ స్థానంలో ఉంటే.. ఆ నలుగురి స్థానాలను కొత్త ముఖాలతో భర్తీ చేస్తాను.జట్టును నిర్మించడం అంటే ఒక్క సీజన్కే పరిమితం కాకూడదు. కనీసం పదేళ్ల పాటు ఆ జట్టు బలంగా ఉండాలి. అప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది’’ అని సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ హైదరాబాద్👉వేదిక: చెపాక్ స్టేడియం, చెన్నై👉టాస్: హైదరాబాద్.. తొలుత బౌలింగ్👉చెన్నై స్కోరు: 154 (19.5)👉హైదరాబాద్ స్కోరు: 155/5 (18.4)👉ఫలితం: చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన హైదరాబాద్.చదవండి: CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్పై కావ్యా మారన్ ఫైర్! A milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP— IndianPremierLeague (@IPL) April 25, 2025 -
జోక్ కాదు.. పాక్ క్రికెట్తో సంబంధాలన్నీ తెంచుకోండి: గంగూలీ
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్తో సంబంధాలన్నీ తెంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు. కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే.ప్రశాంతమైన బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులను లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. 2008 తర్వాత టీమిండియా ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ 2013లో భారత పర్యటనకు వచ్చింది.అనంతరం దాయాది దేశాల పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోయాయి. అయితే, ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రం భారత్- పాక్ (Ind vs Pak) ముఖాముఖి తలపడుతున్నాయి. కానీ తాజాగా పహల్గామ్ ఘటన నేపథ్యంలో సంబంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితి వచ్చింది.సంబంధాలు తెంచుకోవాలిఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘అవును.. వందకు వంద శాతం పాకిస్తాన్తో అన్ని సంబంధాలు తెంచుకోవాలి. కఠిన చర్యలు చేపట్టాలి. ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు జరగడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇదేమీ జోక్ కాదు. ఉగ్రవాదాన్ని సహించకూడదు. టెర్రరిజంను తుడిచిపెట్టేయాలి’’ అని పేర్కొన్నాడు.ఇక బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే పాక్తో భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్లు ఉండబోవని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం దాయాదితో ఆడుతున్నామని.. అయితే, పరిస్థితులన్నింటినీ ఐసీసీ కూడా గమనిస్తోందని తెలిపారు. భారత ప్రభుత్వం చెప్పినట్లే తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.ముక్తకంఠంతో ఖండించిన క్రీడా లోకంకాగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ‘‘బాధిత కుటుంబాలు ఊహించలేని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టకాలంలో భారత్తో పాటు యావత్ ప్రపంచం వారికి అండగా నిలుస్తోంది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తేలియజేస్తున్నా. న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నా’’ అని టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు.ఇక విరాట్ కోహ్లి సైతం.. ‘‘ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు శాంతి, బలం చేకూరాలని ప్రార్థిస్తున్నా. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. ఇలాంటి క్రూరమైన చర్యకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.మరోవైపు.. ‘‘అమాయకులైన పర్యాటకులపై దాడి హేయమైన చర్య. దీనికి రాబోయే కాలంలో మన ధైర్యవంతమైన సైనికులు గట్టి బదులిస్తారు. జమ్మూకశ్మీర్లో శాంతికి భంగం కలగించాలనుకునే వారి ప్రణాళికలు ఎప్పటికీ విజయవంతం కావు’’ అని బాక్సర్ విజేందర్ సింగ్ తన స్పందన తెలియజేశాడు.భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు స్పందిస్తూ.. ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి బాధితుల కోసం నా హృదయం తపిస్తోంది. ఎలాంటి కారణమైనా.. ఇంత క్రూరత్వాన్ని సమర్థించదు. బాధితుల దుఖం మాటల్లో చెప్పలేనిది. కానీ వారు ఒంటరి వారు కాదు. వారి వెంట యావత్ దేశం ఉంది. క్లిష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలుద్దాం. శాంతి పునరుద్ధరణ తప్పక జరుగుతుంది’’ అని పేర్కొంది.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక.. -
‘గోల్డెన్ ఛాన్స్ మిస్.. బుర్ర పనిచేయడం లేదా’?!.. కావ్యా మారన్ ఫైర్!
సన్రైజర్స్ హైదరాబాద్కు ఎట్టకేలకు ఓ విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కమిన్స్ బృందం సత్తా చాటింది.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH)ను తమ సొంత గడ్డపైనే ఓడించి ఈ సీజన్లో మూడో విజయం సాధించింది.అంతేకాదు.. పన్నెండేళ్ల తర్వాత మొట్టమొదటి సారి చెపాక్లో జయభేరి మోగించి.. చెన్నైకి ఊహించని షాకిచ్చింది. ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ యజమాని కావ్యా మారన్ (Kavya Maran) పలికించిన భావోద్వేగాలు, ఆమె ఇచ్చిన రియాక్షన్స్ వైరల్గా మారాయి.బుర్ర పనిచేయడం లేదా?!ముఖ్యంగా లక్ష్య ఛేదనలో రైజర్స్ స్టార్ కమిందు మెండిస్ (Kamindu Mendis) చేసిన పొరపాటు కావ్యకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ‘ఇంత చెత్తగా కూడా ఆడతారా?.. బుర్ర పనిచేయడం లేదా?!’ అన్నట్లు ఆమె ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. చెపాక్లో శుక్రవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బౌలింగ్ చేసింది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన చెన్నై.. రైజర్స్ బౌలర్ల ధాటికి 19.5 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. హర్షల్ పటేల్ నాలుగు వికెట్ల (28/4)తో చెలరేగి సీఎస్కేను దెబ్బకొట్టగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కట్ రెండేసి వికెట్లు కూల్చారు. మహ్మద్ షమీ, కమిందు మెండిస్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే రైజర్స్కు షాకులు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ట్రవిస్ హెడ్ (19) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టును ఆదుకున్నాడు. 34 బంతుల్లో 44 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.అయితే, ఇన్ఫామ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (7) విఫలం కావడం.. అనికేత్ వర్మ (19) కూడా పెవిలియన్కు చేరడంతో రైజర్స్ శిబిరంలో మరోసారి నిరాశ ఆవహించింది. ఈ క్రమంలో ఆల్రౌండర్లు కమిందు మెండిస్, నితీశ్ కుమార్ రెడ్డి చక్కటి సమన్వయంతో ఆడారు.మెండిస్ 22 బంతుల్లో 32, నితీశ్ 13 బంతుల్లో 19 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే, సన్రైజర్స్ ఇన్నింగ్స్ పదహారో ఓవర్లో చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ వేసిన బంతి నోబాల్గా తేలింది.గోల్డెన్ ఛాన్స్ మిస్ఈ క్రమంలో ఫ్రీ హిట్ రాగా.. కమిందు మెండిస్ మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతిని స్లాగ్ షాట్కు యత్రించి విఫలమయ్యాడు. ఇంతలో బంతి అందుకున్న వికెట్ కీపర్ ధోని.. స్టంప్స్ను గిరాటేశాడు. దీంతో ఒక్క పరుగు కూడా రాకుండానే ఫ్రీ హిట్ వృథా అయిపోయింది. ఇదే కావ్యా మారన్ ఆగ్రహానికి కారణమైంది.ఇక 18.4 ఓవర్లలోనే మెండిస్, నితీశ్ కలిసి లక్ష్యాన్ని పూర్తి చేయగానే.. కావ్యా మారన్ సంబరాలు అంబరాన్నంటాయి. తీవ్ర భావోద్వేగానికి గురైన ఈ విజయం ఎంతో ముఖ్యమైనది అంటూ పక్కన ఉన్న వాళ్లను ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనేEdge-of-the-seat drama! 😱🔥#NoorAhmad oversteps, but #KaminduMendis can’t cash in on the free hit! Tension through the roof! 😵💫Watch the LIVE action ➡ https://t.co/uCvJbWec8a#IPLonJioStar 👉 #CSKvSRH | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/bWQlW9VEna— Star Sports (@StarSportsIndia) April 25, 2025A milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP— IndianPremierLeague (@IPL) April 25, 2025 -
ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వెళ్లగక్కిన ధోని
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ కథ దాదాపు ముగిసినట్లే!.. సన్రైజర్స్ హైదరాబాద్ (CSK vs SRH)తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సీఎస్కే ఓటమిపాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) స్పందించాడు.తమ పరాజయానికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని స్పష్టం చేశాడు. చెపాక్ వికెట్ మీద తమ వాళ్లు బ్యాట్ ఝులిపించలేకపోయారని విచారం వ్యక్తం చేశాడు. చిదంబరం స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్కు దిగింది.బ్రెవిస్ ఒక్కడేఓపెనర్లలో షేక్ రషీద్ డకౌట్ కాగా.. ఆయుశ్ మాత్రే (19 బంతుల్లో 30) రాణించాడు. మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (21), దీపక్ హుడా (22) ఫర్వాలేదనిపించగా.. కొత్తగా జట్టుతో చేరిన డెవాల్డ్ బ్రెవిస్ ధనాధన్ దంచికొట్టాడు. ఈ సౌతాఫ్రికా స్టార్ 25 బంతుల్లో 42 పరుగులతో సీఎస్కే టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.రైజర్స్ గెలిచి నిలిచిందికెప్టెన్ ధోని (6) సహా మిగతా వాళ్లంతా విఫలం కావడంతో చెన్నై 19.5 ఓవర్లలోనే కేవలం 154 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రైజర్స్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి.. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడిన తొమ్మిదింట చెన్నైకి ఇది ఏడో పరాజయం.మా వాళ్లు విఫలంఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘‘తొలి ఇన్నింగ్స్లో వికెట్ మరీ అంత కఠినంగా ఏమీ లేదు. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. ఈ పిచ్ మీద 155 పరుగుల స్కోరు చెప్పుకోదగ్గది కానేకాదు. అసలు వికెట్ ఎక్కువగా టర్న్ కాలేదు.అయితే, 8-10 ఓవర్ల తర్వాత పిచ్ స్వభావం కాస్త మారింది. అయినా సరే పరుగులు రాబట్టేందుకు ఆస్కారం ఉన్నా మేము ఆ పని చేయలేకపోయాం. ఇక రెండో ఇన్నింగ్స్లో వికెట్ స్పిన్నర్లకు సహకరించింది.మా వాళ్లు నాణ్యంగానే బౌలింగ్ చేశారు. సరైన సమయంలో వికెట్లు తీశారు. కానీ మేము ఇంకో 15- 20 పరుగులు చేసి ఉంటే.. వాళ్లు సులువుగా పని పూర్తి చేసేవారు’’ అని పేర్కొన్నాడు.ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతేఇక డెవాల్డ్ బ్రెవిస్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మాకు మిడిలార్డర్లో అలాంటి ఆటగాడే కావాలి. స్పిన్నర్లు బరిలోకి దిగినప్పుడు మా వాళ్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు.అలాంటి సమయంలో బ్రెవిస్ లాంటి వాళ్లు నిలదొక్కుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది’’ అని ధోని తెలిపాడు. ఏదేమైనా జట్టులో ఒకరిద్దరు బాగా ఆడకపోయినా పెద్దగా తేడా ఉండదని.. అయితే, మూకుమ్మడిగా అందరూ విఫలమైతే ఇలాంటి ఫలితాలే వస్తాయని తలా అసంతృప్తి వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ప్రతిసారీ 180- 200 పరుగులు స్కోరు చేయాల్సిన అవసరం లేదన్న ధోని.. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా కనీస ప్రదర్శన చేయాలని తమ బ్యాటర్లను విమర్శించాడు. జట్టులో ఎక్కువ మంది విఫలమవుతుంటే ఎలాంటి మార్పులు చేయాలో కూడా అర్థం కాదంటూ పెదవి విరిచాడు. చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనేA milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP— IndianPremierLeague (@IPL) April 25, 2025 -
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
బిహార్ రాష్ట్రంలోని మారుమూల పల్లె అయిన తాజ్పూర్లో పుట్టిన ఆ బాలుడు ప్రస్తుతం క్రికెట్లో దూసుకుపోతున్నాడు. రైతుబిడ్డగా ఎదిగిన అతను ఆటలో ప్రావీణ్యం చూపుతూ అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. 14 ఏళ్లకే ఐపీఎల్కు ఎంపికైన ఘటన సాధించిన అతనే వైభవ్ సూర్యవంశీ. మార్చి 27, 2011న పుట్టిన సూర్యవంశీది రైతు కుటుంబం. పోలంలో పని చేస్తేనే ఇంట్లో అందరూ పోట్టనింపుకునే పరిస్థితి వారిది. చిన్ననాటి నుంచి క్రికెట్పై వైభవ్కు వల్లమాలిన ఇష్టం.ఆ ఇష్టాన్ని తండ్రి సంజీవ్ గమనించారు. ఎనిమిదేళ్ల తన కొడుకు ముందు ముందు క్రికెట్లో అద్భుతాలు సష్టిస్తాడని ఆయన అంచనా వేశారు. ఇందుకోసం తన మద్దతు అవసరం అని గ్రహించి, తన పోలాన్ని అమ్మేసి మరీ కొడుకుకు క్రికెట్లో శిక్షణ ఇప్పించారు. అప్పటినుంచి క్రికెట్పై దష్టి పెట్టిన వైభవ్ శిక్షణ కోసమే పూర్తి సమయాన్ని కేటాయించాడు. సమస్తిపూర్కు తండ్రితోపాటు వెళ్లి అక్కడ కోచ్ల దగ్గర శిక్షణ పోందేవాడు. 12 ఏళ్లకే శిక్షణలో రాటుదేలాడు. తొలిసారి రంజీ ట్రోఫీలో పాల్గొని ముంబయి జట్టుపై ఆడాడు. అక్కడే అతని ప్రతిభ అందరికీ తెలిసింది. అనంతరం అండర్–16, అండర్–19 టోర్నమెంట్లలో వైభవ్ తన సత్తా చాటాడు. ఒక్కో చోట తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ మేలైన క్రీడాకారుడిగా మారాడు. అండర్–19 ఏషియా కప్లో తన ఆటతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశాడు.ఇన్ని విజయాలు సాధించిన వైభవ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఎంపికై దేశమంతటికీ తెలిశాడు. 14 ఏళ్లకు రూ.1.10 కోట్ల పారితోషికంతో ఐపీఎల్కు ఎంపికై, అతి చిన్నవయస్కుడైన ఐపీఎల్ ఆటగాడిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ద్వారా మైదానంలో విజంభిస్తూ అందరి ప్రశంసలు పోందుతున్నాడు..pic.twitter.com/ElkZUyaI2z— Sujeet Suman (@sujeetsuman1991) April 24, 2025 -
KKR Vs PBKS: కోల్‘కథ’ మారేనా!
కోల్కతా: ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయిన జట్లు... 18వ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇలా నాలుగు జట్లు చక్కటి ఆటతీరుతో దూసుకెళ్తున్నాయి. తాజా సీజన్లో 8 మ్యాచ్లాడి 5 విజయాలు, 3 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ నేడు జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో తలపడనుంది. గత సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్... ఇప్పుడు పంజాబ్ కింగ్స్ సారథిగా ఈడెన్ గార్డెన్స్లో అడుగు పెట్టనున్నాడు. పుష్కర కాలం తర్వాత కేకేఆర్కు మూడో ఐపీఎల్ ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ను ఫ్రాంఛైజీ వేలానికి వదిలేస్తే... పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకొని కెప్టెన్ను చేసింది. కోచ్ రికీ పాంటింగ్తో కలిసి శ్రేయస్ జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్లో కేకేఆర్ 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 95 పరుగులకు ఆలౌటైంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోల్కతా చూస్తుంటే... గెలుపు జోరు కొనసాగిస్తూ ‘ప్లే ఆఫ్స్’ వైపు మరో అడుగు ముందుకు వేయాలని పంజాబ్ భావిస్తోంది. మిడిలార్డర్పైనే భారం! డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కోల్కతా... నిలకడగా విజయాలు సాధించడంలో విఫలమవుతోంది. 8 మ్యాచ్ల్లో 3 విజయాలు, 5 పరాజయాలతో 6 పాయింట్లు సాధించిన కోల్కతా పట్టిక ఏడో స్థానంలో ఉంది. కెపె్టన్ అజింక్యా రహానే ఒక్కడే ఓ మాదిరిగా ఆడుతుండగా... మిగిలిన వాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. 8 మ్యాచ్ల్లో 271 పరుగులు చేసిన రహానే జట్టులో అందరికంటే ముందున్నాడు. 19 ఏళ్ల అంగ్క్రిష్ రఘువంశీ 197 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్... 135 పరుగులే చేయగా... ఓపెనర్లు క్వింటన్ డికాక్ 143, సునీల్ నరైన్ 147 కూడా మెరుపులు మెరిపించలేకపోతున్నారు. రింకూ సింగ్, రసెల్, రమణ్దీప్ సింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. రింకూ 8 మ్యాచ్ల్లో 133 పరుగులే చేయగా... రసెల్ 55, రమణ్దీప్ 30 పరుగులు చేశారు. ఈ ముగ్గురు ఫినిషింగ్ టచ్తో జట్టుకు భారీ స్కోర్లు అందిస్తారనుకుంటే... వారు వరస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. బౌలింగ్లోనూ కేకేఆర్కు ఏదీ కలిసి రావడం లేదు. వరుణ్ చక్రవర్తి, నరైన్, మోయిన్ అలీ వంటి ముగ్గురు ప్రధాన స్పిన్నర్లు ఉన్నప్పటికీ పిచ్ వారికి అనుకూలంగా రూపొందించుకోలేక పోయిన కేకేఆర్ దానికి మూల్యం చెల్లించుకుంటోంది. పేసర్లు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా ఫర్వాలేదనిపిస్తున్నారు. కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ మ్యాచ్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు కోల్కతా సిద్ధమైంది. అన్నీ రంగాల్లో బలంగా... కేకేఆర్తో పోల్చుకుంటే పంజాబ్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఈ సీజన్లో శ్రేయస్ సారథ్యం... పాంటింగ్ వ్యూహాలు... ఓపెనర్ల మెరుపులు... చాహల్ స్పిన్ మాయాజాలం వెరసి పంజాబ్ బలంగా కనిపిస్తోంది. లీగ్ ఆరంభంలో దూకుడైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న శ్రేయస్... గత మూడు మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం కాస్త ఇబ్బంది పెడుతోంది. అయినప్పటికీ అతడు 8 మ్యాచ్ల్లో 263 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. అందులో 3 అర్ధశతకాలు ఉన్నాయి. ప్రియాన్ష్ఆర్య 254, ప్రభ్సిమ్రన్ సింగ్ 209, నేహల్ వధేరా 189, శశాంక్ సింగ్ 158 పరుగులు చేశారు. ఓపెనర్లు ఆర్య, ప్రభ్సిమ్రన్ జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తుండగా... శ్రేయస్, ఇన్గ్లిస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్ మిడిలార్డర్లో బరిలోకి దిగనున్నారు. బౌలింగ్లో ప్రధాన పేసర్ అర్‡్షదీప్ సింగ్ ఆకట్టుకుంటుండగా... యుజ్వేంద్ర చాహల్ ఫామ్లో ఉన్నాడు. అర్ష్ దీప్ 11 వికెట్లు తీయగా... కేకేఆర్తో గత మ్యాచ్లో చాహల్ 4 ప్రధాన వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో సమతూకంగా ఉన్న పంజాబ్కు మార్కో యాన్సెన్, స్టొయినిస్ రూపంలో నిఖార్సైన ఆల్రౌండర్లు ఉండటం అదనపు బలంగా మారింది. ఈ ఇద్దరు మంచి టచ్లో ఉన్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కేకేఆర్... పంజాబ్ జోరును ఎలా అడ్డుకుంటుందో చూడాలి!34 ఐపీఎల్ చరిత్రలో కోల్కతా, పంజాబ్ జట్లు ముఖాముఖిగా 34 సార్లు తలపడ్డాయి. 21 మ్యాచ్ల్లో కోల్కతా, 13 మ్యాచ్ల్లో పంజాబ్ గెలుపొందాయి. పంజాబ్పై కోల్కతా అత్యధిక స్కోరు 261 కాగా, అత్యల్ప స్కోరు 95 పరుగులు. కోల్కతాపై పంజాబ్ అత్యధిక స్కోరు 262 కాగా, అత్యల్ప స్కోరు 111 పరుగులు. -
SRH Vs CSK: గెలిచి నిలిచిన రైజర్స్
చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సన్రైజర్స్ హైదరాబాద్ గతంలో ఎప్పుడూ ఓడించలేదు. ఈసారి చక్కటి బౌలింగ్తో సూపర్ కింగ్స్ను 154 పరుగులకే పరిమితం చేసినా... వరుసగా విఫలమవుతున్న బ్యాటింగ్ బృందంతో గెలుపుపై మళ్లీ సందేహాలు. ప్రధాన బ్యాటర్లంతా నిష్క్రమించగా 37 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో జట్టు నిలిచింది. అయితే కమిందు మెండిస్కు ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి జత కలిశాడు. వీరిద్దరు ఎలాంటి సాహసాలకు పోకుండా చక్కటి సమన్వయంతో ఆడి రైజర్స్ శిబిరంలో ఆనందం నింపారు. టోర్నీలో మూడో విజయంతో హైదరాబాద్కు కాస్త ఊరట దక్కగా... ఏడో పరాజయంతో చెన్నై ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు దాదాపు ముగిసినట్లే! చెన్నై: ఐపీఎల్లో వరుసగా రెండు ఓటముల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్కు మరో విజయం దక్కింది. తొలిసారి చెన్నైని వారి వేదికపైనే ఓడించడంలో హైదరాబాద్ సఫలమైంది. శుక్రవారం జరిగిన పోరులో రైజర్స్ 5 వికెట్లతో సీఎస్కేపై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్లు), ఆయుశ్ మాత్రే (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షల్ పటేల్కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కమిందు మెండిస్ (22 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్రెవిస్ దూకుడు... తొలి బంతికే ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (0) అవుట్ కావడంతో చెన్నై ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. మరోవైపు గత మ్యాచ్ తరహాలో ఆయుశ్ మాత్రమే చక్కటి బౌండరీలతో ఆకట్టుకున్నాడు. మూడో స్థానంలో వచ్చిన స్యామ్ కరన్ (9) విఫలం కాగా... తర్వాతి ఓవర్లోనే ఆయుశ్ కూడా వెనుదిరిగాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 50/3 చేరింది. 8 పరుగుల వద్ద జడేజా ఇచ్చిన సునాయాస క్యాచ్ను హర్షల్ వదిలేశాడు. అయితే కొద్ది సేపటికే జడేజాను కమిందు బౌల్డ్ చేయగా... సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న బ్రెవిస్ మాత్రం కమిందు బౌలింగ్లో చెలరేగిపోయి 3 సిక్సర్లు బాదడం విశేషం. హర్షల్ వేసిన మరుసటి ఓవర్లో మరో సిక్స్ బాదిన బ్రెవిస్ తర్వాతి బంతికి కమిందు మెండిస్ కళ్లు చెదిరే క్యాచ్కు వెనుదిరిగాడు. శివమ్ దూబే (12), ధోని (6)లతో పాటు ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన అన్షుల్ కంబోజ్ (2) కూడా ప్రభావం చూపలేకపోయారు. చివర్లో దీపక్ హుడా (21 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించడంతో స్కోరు 150 దాటింది. రాణించిన ఇషాన్ కిషన్... ఛేదనలో సన్రైజర్స్కు కూడా సరైన ఆరంభం లభించలేదు. రెండో బంతికే అభిషేక్ శర్మ (0) అవుట్ కావడంతో తొలి దెబ్బ పడింది. ట్రవిస్ హెడ్ (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోగా పవర్ప్లేలో 37 పరుగులే వచ్చాయి. మరోవైపు ఇషాన్ కిషన్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (7) విఫలం కావడంతో రైజర్స్ కష్టాలు మరింత పెరిగాయి. వేగంగా ఆడే ప్రయత్నంలో రైజర్స్ వికెట్లు కోల్పోయింది. 16 పరుగుల వ్యవధిలో కిషన్, అనికేత్ వర్మ (19 బంతుల్లో 19; 2 సిక్స్లు) నిష్క్రమించడంతో గెలుపుపై సందేహాలు ఏర్పడ్డాయి. అయితే కమిందు, ఏడో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) ఒత్తిడిని అధిగమించి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరం చేర్చారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) అభిషేక్ (బి) షమీ 0; ఆయుశ్ (సి) ఇషాన్ కిషన్ (బి) కమిన్స్ 30; స్యామ్ కరన్ (సి) అనికేత్ (బి) హర్షల్ 9; జడేజా (బి) కమిందు 21; బ్రెవిస్ (సి) కమిందు (బి) హర్షల్ 42; శివమ్ దూబే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 12; హుడా (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 22; ధోని (సి) అభిషేక్ (బి) హర్షల్ 6; అన్షుల్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 2; నూర్ (సి) షమీ (బి) హర్షల్ 2; ఖలీల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 154. వికెట్ల పతనం: 1–0, 2–39, 3–47, 4–74, 5–114, 6–118, 7–131, 8–134, 9–137, 10–154. బౌలింగ్: షమీ 3–0–28–1, కమిన్స్ 4–0–21–2, ఉనాద్కట్ 2.5–0–21–2, హర్షల్ పటేల్ 4–0–28–4, అన్సారీ 3–0–27–0, కమిందు మెండిస్ 3–0–26–1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఆయుశ్ (బి) ఖలీల్ 0; హెడ్ (బి) కంబోజ్ 19; ఇషాన్ కిషన్ (సి) కరన్ (బి) నూర్ 44; క్లాసెన్ (సి) హుడా (బి) జడేజా 7; అనికేత్ (సి) హుడా (బి) నూర్ 19; కమిందు (నాటౌట్) 32; నితీశ్ రెడ్డి (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–37, 3–54, 4–90, 5–106. బౌలింగ్: ఖలీల్ 3–0–21–1, కంబోజ్ 3–0–16–1, నూర్ అహ్మద్ 4–0–42–2, జడేజా 3.4–0–22–1, స్యామ్ కరన్ 2–0–25–0, పతిరణ 3–0–27–0. ఐపీఎల్లో నేడుకోల్కతా X పంజాబ్ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
#SRH: సీఎస్కే కంచు కోట బద్దలు .. 12 ఏళ్ల తర్వాత తొలిసారి
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ 5 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్(44) టాప్ స్కోరర్గా నిలవగా.. కమిందు మెండిస్(32 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(19 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ తలా వికెట్ సాధించారు. కాగా చెపాక్లో సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ విజయం సాధించడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. సీఎస్కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. మాత్రే(30), రవీంద్ర జడేజా(21) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కట్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ ఓటమితో సీఎస్కే ప్లే ఆఫ్ ఆశలు దాదాపు గల్లంతు అయినట్లే.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే -
SRH Vs CSK: వారెవ్వా మెండిస్.. ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ కమిందు మెండిస్ సంచలన క్యాచ్తో మెరిశాడు. మెండిస్ అద్బుతమైన క్యాచ్తో సీఎస్కే ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ను పెవిలియన్కు పంపాడు.చెన్నై ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ ఐదో బంతిని బ్రెవిస్కు ఔట్ సైడ్ ఆఫ్ స్లో డెలివరీగా సంధించాడు. ఆ బంతిని బేబీ ఏబీడీ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ లాంగాఫ్లో ఉన్న మెండిస్ అద్భుతం చేశాడు. లాంగ్-ఆఫ్లో ఉన్న మెండిస్ గాలిలోకి తన ఎడమ వైపునకు దూకి సూపర్మ్యాన్లా క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన బ్రెవిస్ ఒక్కసారిగా షాక్ పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఏడాది సీజన్లో అత్యుత్తమ క్యాచ్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు.ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. చెన్నై బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. మాత్రే(30), రవీంద్ర జడేజా(21) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కట్ తలా రెండు వికెట్లు సాధించారు. సీఎస్కే కెప్టెన్ ధోనికి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం.Only a catch like that could’ve stopped that cameo from Brevis! 🤯Kamindu Mendis, take a bow 🙇#CSK 119/6 after 14 overs.Updates ▶ https://t.co/26D3UalRQi#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/NvthsQfpUj— IndianPremierLeague (@IPL) April 25, 2025 -
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
టీమిండియా స్టార్ పేసర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే అత్యధిక సార్లు వికెట్ తీసిన బౌలర్గా షమీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో ఓపెనర్ రషీద్ను మొదటి బంతికే ఔట్ చేసిన షమీ.. ఈ అరుదైన ఫీట్ను సాధించాడు.షమీ ఇప్పటివరకు ఇన్నింగ్స్ మొదటి బంతికి నాలుగు సార్లు వికెట్ సాధించాడు. జాక్వెస్ కాలిస్, కెఎల్ రాహుల్,ఫిల్ సాల్ట్, షేక్ రషీద్లను తొలి బంతికే షమీ ఔట్ చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ పేరిట ఉండేది. బౌల్ట్ మూడు సార్లు మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు. తాజా మ్యాచ్తో బౌల్ట్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే షమీ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో మాత్రం విఫలమవుతున్నాడు. భారీగా పరుగులు సమర్పించుకుని జట్టుకు భారంగా మారుతున్నాడు. ఈ మ్యాచ్లో కూడా మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. 28 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు.ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. సీఎస్కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. మాత్రే(30), రవీంద్ర జడేజా(21) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కట్ తలా రెండు వికెట్లు సాధించారు. సీఎస్కే కెప్టెన్ ధోనికి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం.చదవండి: విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా -
IPL 2025: ధోని అరుదైన రికార్డు..
టీమిండియా దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్లో 400వ టీ20 మ్యాచ్ మైలు రాయిని అందుకున్నాడు. ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ధోని ఈ ఘనత సాధించాడు. ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత క్రికెటర్గా ధోనీ రికార్డులకెక్కాడు.400 టీ20లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(456) అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్దానంలో దినేష్ కార్తీక్ ఉండగా.. మూడో స్ధానంలో విరాట్ కోహ్లి(407) కొనసాగుతున్నాడు. ధోని తన టీ20 కెరీర్లో భారత్, సీఎస్కే, రైజింగ్ పూణే సూపర్జెయింట్,జార్ఖండ్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.తన కెరీర్లో 400 టీ20లు ఆడి 135.90 స్ట్రైక్ రేట్తో 7,566 పరుగులు చేశాడు. అందులో 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా వికెట్ కీపర్గా 318 ఔట్లలో మిస్టర్ కూల్ భాగమయ్యాడు. ఇక ఓవరాల్గా వరల్డ్ టీ20 క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్(695) తొలి స్దానంలో ఉన్నాడు.అత్యధిక టీ20 మ్యాచ్లు ఆడిన భారత ప్లేయర్లు..రోహిత్ శర్మ- 455 మ్యాచ్లుదినేశ్ కార్తిక్- 412 మ్యాచ్లువిరాట్ కోహ్లీ- 407 మ్యాచ్లుఎంఎస్ ధోనీ- 399 మ్యాచ్లురవీంద్ర జడేజా- 340 మ్యాచ్లుసురేశ్ రైనా- 336 మ్యాచ్లుశిఖర్ ధావన్- 334 మ్యాచ్లురవిచంద్రన్ అశ్విన్- 331 మ్యాచ్లు -
సీఎస్కేపై సన్రైజర్స్ ఘన విజయం
Live Updates CSK vs SRH Live Updates:సీఎస్కేపై సన్రైజర్స్ ఘన విజయంఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ 5 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్(44) టాప్ స్కోరర్గా నిలవగా.. కమిందు మెండిస్(32 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(19 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ తలా వికెట్ సాధించారు. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 127/5సన్రైజర్స్ క్లాసెన్(7), అనికేత్ వర్మ(19) వికెట్లను కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ విజయానికి 24 బంతుల్లో 28 పరుగులు కావాలి.ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్..ట్రావిస్ హెడ్ రూపంలో సన్రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన హెడ్..అన్షుల్ కాంబోజ్ క్లీన్ బౌల్డయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్..రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్..155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో అభిషేక్ శర్మ డకౌటయ్యాడు.చెలరేగిన ఎస్ఆర్హెచ్ బౌలర్లు.. 154 పరుగులకే సీఎస్కే ఆలౌట్చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. సీఎస్కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. మాత్రే(30), రవీంద్ర జడేజా(21) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కట్ తలా రెండు వికెట్లు సాధించారు.సీఎస్కే ఏడో వికెట్ డౌన్..ఎంఎస్ ధోని రూపంలో సీఎస్కే ఏడో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ధోని.. హర్షల్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు.16 ఓవర్లకు సీఎస్కే స్కోర్:130/6సీఎస్కే వరుస క్రమంలో బ్రెవిస్(42), శివమ్ దూబే(12) వికెట్లను వరుస క్రమంలో కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్లో బ్రెవిస్ ఔట్ కాగా.. జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్లో శివమ్ దూబే ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజలో ధోని(6), హుడా(8) ఉన్నారు.సీఎస్కే నాలుగో వికెట్ డౌన్రవీంద్ర జడేజా(21) రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. కమిందు మెండిస్ బౌలింగ్లో జడ్డూ క్లీన్ బౌల్డయ్యాడు. 9.3 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 74/4సీఎస్కే మూడో వికెట్ డౌన్ఆయూష్ మాత్రే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన మాత్రే.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. సీఎస్కే రెండో వికెట్ డౌన్..సామ్ కుర్రాన్ రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగుల చేసిన కుర్రాన్.. హర్షల్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. యువ ఆటగాడు ఆయూష్ మాత్రే(29) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో రవీంద్ర జడేజా(6) క్రీజులో ఉన్నాడు.సీఎస్కే తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే ఆదిలోనే భారీ షాక్ తగిలింది. మహ్మద్ షమీ బౌలింగ్లో తొలి బంతికే షేక్ రషీద్ పెవిలియన్కు చేరాడు. 2 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. క్రీజులో మాత్రే(14), కుర్రాన్(2) పరుగులతో ఉన్నారు.ఐపీఎల్-2025లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ డూర్ ఆర్డై మ్యాచ్లో సీఎస్కే రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా వచ్చారు. రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్ను సీఎస్కే పక్కన పెట్టింది. మరోవైపు ఎస్ఆర్హెచ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. జట్టులోకి కమిందు మెండిస్, మహ్మద్ షమీ వచ్చారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది.తుది జట్లుసన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీచెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI: డెవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మ్హత్రే, షేక్ రషీద్, దీపక్ హుడా, సామ్ కర్రాన్, శివమ్ దూబే, MS ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా -
విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోహ్లికి ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.ఈ మ్యాచ్లో 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి కింగ్ కోహ్లి ఔటయ్యాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన విరాట్.. 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ చాలా త్వరగా అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్ ప్రకటించాడని, 2026 టీ20 ప్రపంచ కప్ వరకు ఆడింటే బాగుండేదని రైనా అభిప్రాయపడ్డాడు."విరాట్ కోహ్లి టీ20 క్రికెట్ నుంచి కాస్త ముందుగా రిటైర్ అయ్యాడని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. ప్రస్తుతం అతడు ఆడుతున్న తీరును చూస్తుంటే టీ20 ప్రపంచకప్-2026 కొనసాగింటే బాగుండేది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కోహ్లి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడు ఇప్పటికీ చాలా ఫిట్నెస్గా కన్పిస్తున్నాడు" అని స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్కప్-2024 విజయం అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు.కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో విరాట్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 125 మ్యాచ్లు ఆడి, 48.69 సగటుతో 4188 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు, 124 ఫోర్లు, 54 సిక్సర్లు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్లలో కోహ్లి 1292 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు -
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. సీఎస్కేలోకి విధ్వంసకర వీరుడు?
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా కీలక పోరులో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్లో సీఎస్కే ఓ కీలక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్కు తుది జట్టులోకి అవకాశమివ్వాలని సీఎస్కే మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బ్రెవిస్ డెబ్యూపై సీఎస్కే హెడ్కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ హింట్ ఇచ్చాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో బ్రెవిస్ ఆడే అవకాశముందని ఫ్లెమింగ్ తెలిపాడు."మాకు ఉన్న బ్యాటింగ్ అప్షన్స్లో బ్రెవిస్ ఒకడు. అతడికి రాబోయే మ్యాచ్ల్లో కచ్చితంగా అవకాశం దక్కుతుంది. అయితే ఇతర ఆటగాళ్లు టోర్నీ ఆరంభం నుంచి మా జట్టులో ఉన్నారు. తుది జట్టు ఎంపికలో వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నాము. ఈ మ్యాచ్లో బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్తో బరిలోకి దిగనున్నాము" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. కాగా తొలుత ఐపీఎల్-2025 మెగా వేలంలో బ్రెవిస్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే ఈ ఏడాది సీజన్కు గాయం కారణంగా దూరమైన గుర్జప్నీత్ సింగ్ స్థానంలో జూనియర్ ఏబీడీని సీఎస్కే తీసుకుంది.బ్రెవిస్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్లో 21 ఏళ్ల బ్రెవిస్ దుమ్ములేపాడు. బ్రెవిస్ మిడిలార్డర్లో వచ్చి అద్బుత ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ టోర్నీలో ఏంఐ కేప్ టౌన్ తరపున 12 మ్యాచ్లు ఆడిన బ్రెవిస్.. 184.17 స్ట్రైక్ రేట్తో 291 పరుగులు చేశాడు. బ్రెవిస్తో బంతితో కూడా మ్యాజిక్ చేసే సత్తాఉంది.ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు సీఎస్కే తుది జట్టు: షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోని (కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ, అశ్విన్చదవండి: IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్లు గెలవాలంటే? -
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్లు గెలవాలంటే?
ఐపీఎల్-2025 సీజన్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే దాదాపుగా సగం మ్యాచ్లు ముగిసినందున, ఆయా జట్లు తమ ప్లే ఆఫ్ బెర్త్లపై కన్నేశాయి. ప్లే ఆఫ్స్ రేసులో మొత్తం ఆరు జట్లు పోటీపడుతుంటే.. ఐదు సార్లు ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు వరుస ఓటములతో వెనకంజలో ఉన్నాయి. ఈ ఏడాదిలో సీజన్లో ఇంకా ఒక్కో జట్టు 6 నుంచి 5 లీగ్ మ్యాచ్లు మాత్రమే ఆడనున్నాయి. దీంతో సెకెండ్ హాఫ్లో ప్రతీ మ్యాచ్ ఆయా జట్లకు కీలకంగా మారనుంది. కేవలం విజయాలు మాత్రమే కాదు, నెట్ రన్ రేట్ కూడా టాప్-4 జట్లను నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. అయితే ప్రతీ జట్టుకు ఇంకా ప్లే ఆఫ్స్కు చేరే ఛాన్స్లు ఉన్నాయి. ఈ క్రమంలో మొత్తం 10 జట్లకు ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఓ లుక్కేద్దాం.గుజరాత్ టైటాన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ఈ ఏడాది సీజన్లో గుజరాత్ టైటాన్స్ దుమ్ములేపుతోంది. గుజరాత్ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి ఆరు విజయాలతో 12 పాయింట్లను సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.ఢిల్లీ సైతం 8 మ్యాచ్లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే గుజరాత్(+1.104) కంటే రన్రేట్ పరంగా కాస్త వెనకబడి ఉండడంతో ఢిల్లీ( +0.657) రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ రెండు జట్లకు ఇంకా ఆరు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ, గుజరాత్ జట్లు మిగిలిన ఆరు మ్యాచ్లలో రెండు విజయాలు సాధిస్తే చాలు ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టొచ్చు.ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ఈ ఏడాది సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా అదరగొడుతోంది. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. అయితే గుజరాత్, ఢిల్లీ కంటే రన్రేట్పరంగా వెనకబడి ఉండడంతో పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్లలో రెండు కచ్చితంగా గెలవాలి.మరోవైపు ఆరంభంలో తడబడ్డ ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. వరుస విజయాలతో దూసుకు పోతుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 5 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఖాతాలో ప్రస్తుతం 10 పాయింట్లు ఉన్నాయి. ముంబైకి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. . ఇందులో మూడు విజయాలు సాధిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతుంది.లక్నో సూపర్ జెయింట్స్ అండ్ పంజాబ్ కింగ్స్ఈ ఏడాది సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ 5 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అందులో మూడు విజయాలు సాధిస్తే లక్నోకు ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధిస్తోంది. అదేవిధంగా సీజన్లో ఆరంభంలో దుమ్ములేపిన పంజాబ్ కింగ్స్.. ప్రస్తుతం కాస్త తడబడుతోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 5 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ ఇంకా 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు విజయాలు సాధిస్తే పంజాబ్కు ప్లే ఆఫ్స్లో అడుగుపెడుతోంది.కోల్కతా నైట్ రైడర్స్ (KKR)ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన కోల్కతా నైట్రైడర్స్ 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్కు ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఐదు విజయాలు సాధిస్తేనే కోల్కతా ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. కేకేఆర్ రన్రేట్(+0.212) కాస్త మెరుగ్గా ఉండడంతో వారి ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.రాజస్తాన్ రాయల్స్..ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ కథ దాదాపుగా ముగిసినట్లే. ఇప్పటివరకు ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన రాజస్తాన్.. 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. సన్రైజర్స్ ఇంకా 5 మ్యాచ్లు ఆడనుంది. మొత్తం ఐదు మ్యాచ్లు గెలిచినా రాజస్తాన్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలు, రన్రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ రన్ రేట్(-0.625) కూడా మెరుగ్గా లేదు.ఎస్ఆర్హెచ్ అండ్ సీఎస్కే..ఇక పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్దానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ 2 విజయాలతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్ ఇంకా 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్లకు 6 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్క మ్యాచ్లో ఓడితో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. రెండు ఓడితే మాత్రం అధికారికంగా ఆరెంజ్ ఆర్మీ నిష్క్రమిస్తోంది. మరోవైపు సీఎస్కే పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 2 విజయాలతో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. చెన్నై ఇంకా 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్లకు 6 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్కటి ఓడినా.. ఇతర జట్ల ఫలితాలు, రన్రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. -
‘అంపైర్ కూడా డబ్బులు తీసుకుంటున్నాడు.. నీకెందుకంత తొందర?!’
గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు పూర్తి చేసుకున్న కమిన్స్ బృందం కేవలం రెండు మాత్రమే గెలిచింది. తద్వారా కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే సాధించి పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.ఇక సన్రైజర్స్ శుక్రవారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH)తో తలపడనుంది. చెపాక్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్ నుంచి వరుసగా విజయాలు సాధిస్తేనే కమిన్స్ బృందానికి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్లో సన్రైజర్స్ సొంత మైదానం ఉప్పల్లో ముంబై ఇండియన్స్తో తలపడిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్లో రైజర్స్ ముంబై చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రైజర్స్.. ఆది నుంచే తడ‘బ్యా’టుకు గురైంది. ముంబై బౌలర్ల ధాటికి టాపార్డర్ పెవిలియన్కు క్యూ కట్టింది.ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదంఓపెనర్లు ట్రవిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (8) పూర్తిగా విఫలం కాగా.. ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదంతో వికెట్ పారేసుకుని విమర్శలు మూటగట్టుకున్నాడు. రైజర్స్ ఇన్నింగ్స్లో మూడో ఓవర్ను దీపక్ చహర్ వేయగా.. బంతిని డౌన్ ది లెగ్ ఆడేందుకు ఇషాన్ ప్రయత్నించాడు.ఈ క్రమంలో బంతి వికెట్ కీపర్ రియాన్ రికెల్టన్ చేతిలో పడింది. అయితే, బాల్ ఇషాన్ బ్యాట్ లేదంటే గ్లౌవ్స్ను తాకిందా లేదా అన్న సందేహంతో ముంబై బౌలర్గానీ, వికెట్ కీపర్గానీ అప్పీలు చేయలేదు.అంపైర్ కూడా వెంటనే ఏ నిర్ణయానికీ రాలేదు. కానీ ఇంతలోనే తాను అవుటయ్యాయని ఫిక్స్ అయి ఇషాన్ క్రీజును వీడాడు. ఏం జరిగిందో అర్థం కాని అంపైర్.. అవుట్ ఇచ్చేందుకు వేలు పైకెత్తాలా అన్న సందిగ్దంలో ఆఖరికి అవుట్ ఇచ్చాడు.అయితే, రీప్లేలో మాత్రం ఇషాన్ కిషన్ నాటౌట్ అని తేలింది. దీంతో ఇషాన్ అమ్ముడుపోయాడంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఇక ఈ ఘటనపై భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు.అంపైర్ కూడా డబ్బులు తీసుకుంటున్నాడు‘‘చాలాసార్లు ఇలాగే మెదడు పనిచేయడం ఆగిపోతుంది. నిజంగా ఇదొక మతిలేని చర్య. కాసేపు ఆగితే ఏమయ్యేది?.. అంపైర్ కూడా తాను చేస్తున్న పనికి డబ్బు తీసుకుంటున్నాడు కదా!అతడు తన నిర్ణయం ప్రకటించేదాకానైనా ఎదురుచూడాలి. తన పనిని తనను చేసుకోనివ్వాలి. ఇదేం రకమైన నిజాయితీయో నాకైతే అర్థం కావడం లేదు. క్రీడాస్ఫూర్తిని పాటిస్తున్నానని అతడు ఇలా చేసి ఉండవచ్చు, కానీ అవుట్ కాకుండానే వెళ్లిపోవడం.. అది కూడా అంపైర్ను తికమకపెట్టేలా వ్యవహరించడం సరికాదు. హఠాత్తుగా అతడు అలా ఎందుకు వెళ్లిపోయాడో తెలియడం లేదు’’అంటూ సెహ్వాగ్ ఇషాన్కు చురకలు అంటించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) వల్ల ఈమాత్రం పరువునిలుపుకోగలిగింది. సన్రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలోనే ఛేదించింది.చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు! Fairplay or facepalm? 🤯 Ishan Kishan walks... but UltraEdge says 'not out!' What just happened?!Watch the LIVE action ➡ https://t.co/sDBWQG63Cl #IPLonJioStar 👉 #SRHvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/bQa3cVY1vG— Star Sports (@StarSportsIndia) April 23, 2025 -
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన చాలా మంది ఆటగాళ్లు.. అంతే త్వరగా కనుమరుగైపోయిన దాఖలాలు ఉన్నాయన్నాడు. కాబట్టి వైభవ్ ఆచితూచి అడుగేస్తూ కెరీర్ ప్లాన్ చేసుకోవాలని సూచించాడు.రూ. 1.10 కోట్లకుదేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్- 2025 (IPL 2025) మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ రాజస్తాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు అతడిని దక్కించుకుంది. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా వైభవ్కు అరంగేట్రం చేసే అవకాశం కూడా ఇచ్చింది.తొలి బంతినే సిక్సర్గా మలిచాడుకెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో వైభవ్ వచ్చాడు. టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్తో కలిపి రాజస్తాన్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. లక్నోతో మ్యాచ్ సందర్భంగా అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టిన క్రికెటర్గా చరిత్రకెక్కిన ఈ బిహార్ కుర్రాడు.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడు.అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది క్రికెటర్ల జాబితాలో వైభవ్ చేరిపోయాడు. ఆ మ్యాచ్లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 34 పరుగులు సాధించాడు. ఇక తాజాగా గురువారం ఆర్సీబీతో మ్యాచ్లోనూ వైభవ్ దూకుడుగానే ఆడాడు. రెండు సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేసి నిష్క్రమించాడు.కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడుఈ పరిణామాల నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘బాగా ఆడితే ప్రశంసిస్తారని.. ప్రదర్శన బాగా లేకుంటే విమర్శిస్తారని తెలిసిన ఆటగాడు గర్వం తలకెక్కించుకోకుండా ఉంటాడు. అతడి కాళ్లు భూమ్మీదే ఉంటాయి.కానీ చాలా మంది ఆటగాళ్లు.. ఒకటీ- రెండు మ్యాచ్ల ద్వారా ఫేమస్ అయిన వెంటనే దారి తప్పుతారు. తాము స్టార్ ప్లేయర్ అయిపోయామనే భ్రమలో ఆ తర్వాత కనీస ప్రదర్శన కూడా చేయలేకపోతారు.ఇక సూర్యవంశీ విషయానికొస్తే.. అతడు మరో 20 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడాలనే లక్ష్యంతో ఉండాలి. విరాట్ కోహ్లిని చూడండి.. తను 19 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పటికి 18 సీజన్లు పూర్తి చేసుకున్నాడు.కోహ్లి మాదిరే సూర్యవంశీ ఎదిగేందుకు ప్రయత్నించాలి. అలా కాకుండా.. ఈ ఐపీఎల్ సీజన్లో సాధించిన దానితో సంతోషపడి.. నేను కోటీశ్వరుడిని.. నా అరంగేట్రమే అద్భుతం.. తొలి బంతికే సిక్స్ కొట్టాను.. అనే ఆలోచనలతో ఉంటే.. బహుశా వచ్చే ఏడాది మనం అతడిని చూసే అవకాశం ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో మ్యాచ్లో రాజస్తాన్ ఆఖరి వరకు పోరాడి 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా బెంగళూరు జట్టు ఈ సీజన్లో సొంత మైదానంలో తొలి విజయం సాధించగా.. రాజస్తాన్ తొమ్మిదింట ఏడు పరాజయాలు నమోదు చేసి పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: క్రెడిట్ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q— IndianPremierLeague (@IPL) April 19, 2025 -
పాకిస్తాన్ ఉప ప్రధాని వ్యాఖ్యలు.. మండిపడ్డ పాక్ మాజీ క్రికెటర్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) స్పందించాడు. ఇషాక్ మాటలను బట్టి తాము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు పాక్ అంగీకరించినట్లు స్పష్టమైందన్నాడు. కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే.బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపిన తీవ్రవాదులు.. 26 మంది ప్రాణాలు తీశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత్కు సంఘీభావం ప్రకటించాయి. పాకిస్తాన్ కూడా పహల్గామ్ దాడిని ఖండించింది.స్వాతంత్ర్య సమరయోధులా?అయితే, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో దాడులు చేసిన ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా అభివర్ణించాడు. దీంతో ఇషాక్ దార్ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు భగ్గుమంటున్నారు.నేరుగా ఒప్పుకోవడమేఈ క్రమంలో పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా ఇషాక్ దార్ తీరుపై ఘాటుగా స్పందించాడు. ఎక్స్ వేదికగా అతడి వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘పాకిస్తాన్ ఉప ప్రధానే స్వయంగా ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులు అని పిలుస్తుంటే.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు.ఇది కేవలం సిగ్గుచేటు మాత్రమే కాదు.. తమ దేశం ఉగ్రవాదానికి దన్నుగా ఉందని నేరుగా ఒప్పుకోవడమే అవుతుంది’’ అని కనేరియా ట్వీట్ చేశాడు. కాగా పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కనేరియా.. జట్టులో ఉన్నపుడు తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని గతంలో చాలాసార్లు వెల్లడించాడు.అవమానాలు ఎదుర్కొన్నాహిందువును అయిన కారణంగా తనను సహచర క్రికెటర్లు వేరుగా చూస్తూ.. హేళన చేస్తూ ఇబ్బందులు పెట్టేవారని తెలిపాడు. పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కూడా కనేరియా జట్టులో ఉండటం చాలామందికి నచ్చేదికాదని పేర్కొనడం గమనార్హం.ఇక అంతర్జాతీయ క్రికెట్లో 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన 44 ఏళ్ల కనేరియా.. ఆయా ఫార్మాట్లలో 261, 15 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విభేదాల నేపథ్యంలో ప్రస్తుతం యూకేలో అతడు నివాసం ఉంటున్నట్లు సమాచారం.కాగా పహల్గామ్లో ఉగ్రదాడి జరగగానే కనేరియా స్పందించాడు. పాకిస్తాన్ హస్తం గనుక లేకపోతే.. పాక్ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు వెంటనే ఈ దాడిని ఖండించలేదని ప్రశ్నించాడు. పాక్ ప్రభుత్వమే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి పెంచి పోషిస్తోందని ఆరోపించాడు.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..When the Deputy Prime Minister of Pakistan calls terrorists “freedom fighters,” it’s not just a disgrace — it’s an open admission of state-sponsored terrorism. pic.twitter.com/QlS1UDzq20— Danish Kaneria (@DanishKaneria61) April 24, 2025 -
చరిత్ర సృష్టించిన జైస్వాల్.. ఐపీఎల్లో తొలి ప్లేయర్గా..
రాజస్తాన్ రాయల్స్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఇంత వరకు సాధ్యం కాని రికార్డు సాధించాడు. ఎదుర్కొన్న మొదటి బంతికే మూడుసార్లు సిక్సర్ బాదిన ఏకైక బ్యాటర్గా అరుదైన ఘనత సాధించాడు.రాయాల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్ సందర్భంగా జైస్వాల్ గురువారం ఈ ఫీట్ నమోదు చేశాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఆర్సీబీ- రాజస్తాన్ (RCB vs RR) గురువారం తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.205 పరుగులుఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (26) ఫర్వాలేదనిపించగా.. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 70) దంచికొట్టాడు. దేవదత్ పడిక్కల్ (27 బంతుల్లో 50), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 23), జితేశ్ శర్మ (10 బంతుల్లో 20 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. జైస్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసేందుకు ఆర్సీబీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రంగంలోకి దిగగా.. తొలి బంతినే జైసూ సిక్సర్గా మలిచాడు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్స్ కొట్టిన క్రికెటర్ల జాబితాలో ఉన్న జైసూ.. మూడుసార్లు ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో జైస్వాల్ మొత్తంగా 19 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఏకంగా 49 పరుగులు రాబట్టాడు. అయితే, జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో రొమారియో షెఫర్డ్కు క్యాచ్ ఇవ్వడంతో అతడి అద్భుత ఇన్నింగ్స్కు తెరపడింది.అంతేకాదు.. రాజస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా పతనమైంది. నితీశ్ రాణా (28), రియాన్ పరాగ్ (22), ధ్రువ్ జురెల్ (47) పోరాడినా.. 20 ఓవర్లలో రాజస్తాన్ 194 పరుగులే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఐపీఎల్లో తొలి బంతికే సిక్సర్లు బాదిన క్రికెటర్లు1.యశస్వి జైస్వాల్- 32. నమన్ ఓజా-13. మయాంక్ అగర్వాల్- 14. సునిల్ నరైన్- 15. విరాట్ కోహ్లి- 16. రాబిన్ ఊతప్ప- 17. ఫిల్ సాల్ట్- 18. ప్రియాన్ష్ ఆర్య- 1.చదవండి: ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా విరాట్ కోహ్లి ఘనత Woke up and said Pehla ball, JaisBall 🔥 pic.twitter.com/pg4w29Jl2G— Rajasthan Royals (@rajasthanroyals) April 24, 2025 -
క్రెడిట్ మొత్తం వాళ్లకే.. జట్టులో గొప్ప నాయకులు ఉన్నారు.. కానీ: పాటిదార్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం సాధించింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో చిన్నస్వామి స్టేడియంలో గురువారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. తద్వారా ఈ సీజన్లో హోం గ్రౌండ్లో తొలి గెలుపు నమోదు చేసి విమర్శలకు చెక్ పెట్టింది.క్రెడిట్ మొత్తం వారికేఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) హర్షం వ్యక్తం చేశాడు. విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మేము సత్ఫలితం రాబట్టాము. ఈరోజు వికెట్ కాస్త భిన్నంగా ఉంది. అయినా మా బౌలర్లు అద్భుతంగా రాణించారు.ఈ గెలుపులో క్రెడిట్ మొత్తం వారికే దక్కుతుంది. పదో ఓవర్ తర్వాత వారు చూపిన తెగువ అద్భుతం. ఇక ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు కూడా ఎంతో చక్కగా బ్యాటింగ్ చేశారు. వాళ్లకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే.గొప్ప నాయకులు ఉన్నారు.. కానీమేము వికెట్ల వేటలో ఉన్న వేళ మా మనసు చెప్పినట్లు విన్నాను. పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసినపుడే వికెట్లు కూడా తీయగలుగుతాం. జట్టులో ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు. వారిచ్చే సలహాలు, సూచనలు కూడా నన్ను నేను మెరుగుపరచుకునేందుకు దోహదం చేస్తాయి. అయితే, నా ప్రణాళికలకు అనుగుణంగానే నేను ముందుకు వెళ్తాను’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.కోహ్లి, పడిక్కల్ ధనాధన్కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు సాధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి (42 బంతుల్లో 70), దేవదత్ పడిక్కల్ (27 బంతుల్లో 50), టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 23), జితేశ్ శర్మ (10 బంతుల్లో 20 నాటౌట్) రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్కు శుభారంభం లభించింది.జైసూ విధ్వంసంఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 49 పరుగులతో దుమ్ములేపాడు. అయితే, జైసూ అవుటైన తర్వాత సీన్ మారిపోయింది. అంతకుముందు.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 16 పరుగులకే నిష్క్రమించగా.. నితీశ్ రాణా(28), కెప్టెన్ రియాన్ పరాగ్ (22) నిరాశపరిచారు.చెలరేగిన హాజిల్వుడ్ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (34 బంతుల్లో 47) విజయంపై ఆశలు పెంచాడు. అయితే, 20 ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు నష్టపోయిన రాజస్తాన్ 194 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా 11 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ నాలుగు వికెట్ల(4/33) చెలరేగగా.. కృనాల్ పాండ్యా రెండు, భువనేశ్వర్కుమార్, యశ్ దయాళ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి ఆడిన తొమ్మిది మ్యాచ్లలో ఇది ఆరో విజయం. ఈ నేపథ్యంలో పన్నెండు పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు.. తొమ్మిదింట ఏడు ఓడిన రాజస్తాన్ నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨 that speak louder than words 🥳#TATAIPL | #RCBvRR | @imVkohli | @RCBTweets pic.twitter.com/Q4B09fkllE— IndianPremierLeague (@IPL) April 24, 2025 -
మీరేం సాధించారు?.. మరో 78 వేల ఏళ్లైనా ఇదే పరిస్థితి: గావస్కర్ ఫైర్
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన (Pahalgam Incident) నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. డెబ్బై ఎనిమిదేళ్లుగా ఒక్క మిల్లీ మీటర్ భూమి కూడా చేతులు మారలేదని.. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు. మరి అలాంటప్పుడు శాంతియుత జీవనం గడపకుండా.. అమాయకుల ప్రాణాలు తీస్తే వచ్చే లాభమేమిటంటూ తీవ్రవాదులకు చురకలు అంటించారు.బైసరన్ లోయలోఉగ్రవాదులు, వారికి మద్దతుగా నిలిచే వారు ఇకనైనా వాస్తవాన్ని గుర్తించి.. ఇలాంటి పిరికిపంద చర్యలను చాలించాలని గావస్కర్ సూచించారు. కాగా జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్లో ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుగాంచిన బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26 మంది మృతి చెందారు. బాధితులకు అండగాఈ నేపథ్యంలో తీవ్రవాదుల చర్యను క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో మనమంతా ఒక్కటిగా ఉండి... బాధితులకు అండగా నిలవాల్సిన అవసరముందని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడ్డారు.క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, అనీల్ కుంబ్లే, రవిశాస్త్రి, శ్రీవత్స గోస్వామి, టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్, స్టార్ షట్లర్ పీవీ సింధు, సైనా నెహ్వాల్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, షూటర్ అభినవ్ బింద్రా, బాక్సర్ నిఖత్ జరీన్, పీఆర్ శ్రీజేశ్ తదితరులు ఉగ్రవాదుల దాడిని ఖండించారు. అంతేకాదు.. పాకిస్తాన్తో క్రీడా సంబంధాలు ఎప్పటికీ పునరుద్ధరించకూడదని పలువురు ప్లేయర్లు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై సునిల్ గావస్కర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. భారతీయులందరిపై దీని ప్రభావం ఉంటుంది.మరో 78 వేల ఏళ్లు గడిచినా ఇదే పరిస్థితిదుశ్చర్యలకు పాల్పడేవారిని, వారికి మద్దతునిచ్చే వారిని నేను ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా.. ఇలాంటి పనుల వల్ల మీరు ఏం సాధించారు? ఇకపై ఏం సాధిస్తారు?గత 78 ఏళ్లుగా ఒక్క మిల్లీ మీటర్ భూభాగం కూడా చేతులు మారలేదు. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాదు. మరి అలాంటపుడు శాంతియుతంగా జీవిస్తూ.. దేశాభివృద్ధిపైన దృష్టి పెట్టడం మంచిది కదా! దయచేసి ఇకనైనా పిరికిపంద చర్యలు మానుకుని.. బుద్ధిగా ఉండండి’’ అని ఉగ్రవాదులకు హితవు పలికారు.చదవండి: PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక.. -
PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అసలే అంతంత మాత్రంగా కొనసాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్రసారాలు భారత్లో బంద్ అయిపోయాయి. పాక్ బోర్డుకు చెందిన పీఎస్ఎల్ టోర్నీని భారత్లో ప్రసారం చేస్తున్న ‘ఫ్యాన్ కోడ్’ మొబైల్ స్ట్రీమింగ్ సంస్థ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గావ్ ఘటన నేపథ్యంలో భారత్లో ఇకపై పీఎస్ఎల్ టోర్నీ ప్రసారం చేయమని ప్రకటించింది. భారతీయుల మనోభావాలను గౌరవిస్తూ పీఎస్ఎల్లో మిగిలిన మ్యాచ్లను ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్లు ‘ఫ్యాన్ కోడ్’ వెల్లడించింది. మరోవైపు పీఎస్ఎల్ టోర్నీ కోసం పాకిస్తాన్లో ఉండి మ్యాచ్ల ప్రసారానికి సంబంధించిన వేర్వేరు సాంకేతిక విభాగాల్లో పని చేస్తున్న భారతీయులను వెనక్కి పంపాలని ఆ దేశ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. భారత్కు చెందిన దాదాపు రెండు డజన్ల మంది పీఎస్ఎల్లో ఇంజినీర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, కెమెరామెన్లు, ప్లేయర్ ట్రాకింగ్ ఎక్స్పర్ట్లుగా పని చేస్తున్నారు. రెండు రోజుల్లోగా వీరంతా దేశం వీడాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. నిషేధం కొనసాగుతుంది: బీసీసీఐమరోవైపు- టీమిండియా- పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లపై ఉన్న నిషేధం ఇక ముందు కూడా కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఉండవని ఆయన పునరుద్ఘాటించారు. భారత్, పాక్ మధ్య 2013లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బ తినడంతో ఆ తర్వాత ఎలాంటి సిరీస్ను నిర్వహించలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రం రెండు జట్లూ తలపడుతూ వస్తున్నాయి. తాజాగా కశ్మీర్లోని పహల్గాంలో పాక్ తీవ్రవాదుల చేతుల్లో 26 మంది భారత పర్యాటకులు మరణించిన నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్లపై మళ్లీ చర్చ మొదలైంది. ‘పాక్తో క్రికెట్ సిరీస్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. వారు చెప్పిందే మేం వింటాం. కాబట్టి ఇకపై కూడా పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అవకాశం లేదు.ఐసీసీతో ఒప్పందాల కారణంగానే వేర్వేరు టోర్నీల్లో ఆ జట్టుతో తలపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అవగాహన ఉన్న ఐసీసీ కూడా ఈ విషయాన్ని గమనిస్తోంది. ఇకపై ఏదైనా ఐసీసీ టోర్నీ వచ్చినపుడు తగిన విధంగా స్పందిస్తాం’ అని రాజీవ్ శుక్లా వివరించారు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినా... టీమిండియా అక్కడికి వెళ్లలేదు. తటస్థ వేదిక దుబాయ్లోని అన్ని మ్యాచ్లు ఆడింది. పాక్ను లీగ్ దశలో ఓడించడం సహా టోర్నీ చాంపియన్గా నిలిచింది. చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
CSK vs SRH: గెలిచి నిలిచేనా!
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్లో పరాజయలతో సతమతమవుతోన్న గత ఏడాది రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)... ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మాజీ చాంపియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లు ఎనిమిదేసి మ్యాచ్లు ఆడి... 2 విజయాలు, 6 పరాజయాలతో నాలుగేసి పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. పట్టికలో సన్రైజర్స్ తొమ్మిదో స్థానంలో ఉండగా... చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగిలిన అన్నీ మ్యాచ్ల్లోనూ విజయం తప్పనిసరి అయిన నేపథ్యంలో... ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. చెన్నై జట్టు ఈ ఏడాది కనీస ప్రదర్శన కనబర్చలేక ఇబ్బంది పడుతుంటే... బ్యాటర్ల వైఫల్యంతో హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంటోంది. ఇరు జట్లకు మరో ఆరేసి మ్యాచ్లు మిగిలి ఉండగా... అన్నీ మ్యాచ్ల్లో విజయాలు సాధిస్తేనే సులువుగా ప్లే ఆఫ్స్కు చేరే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో... స్పిన్కు అనుకూలించే అవకాశం ఉన్న పిచ్పై హైదరాబాద్ను పడగొట్టి ముందంజ వేయాలని ధోనీ సారథ్యంలోని చెన్నై భావిస్తోంది.మరోవైపు బ్యాటింగ్ లోపాలను సరిచేసుకొని తిరిగి భారీ స్కోర్లతో విజృంభించాలని ఎస్ఆర్హెచ్ చూస్తోంది. బుధవారమే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ముంబై చేతిలో ఓటమి మూటగట్టుకున్న రైజర్స్... 48 గంటలు తిరిగేసరికి చెన్నైతో మ్యాచ్కు రెడీ అయింది. మరి ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో పరాజయాలతో సహవాసం చేస్తున్న ఇరు జట్లలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి! తీవ్ర ఒత్తిడిలో ధోనీ సేన... సాధారణంగా చెపాక్లో మ్యాచ్ అంటే... చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగడం పరిపాటి. అయితే ఈ సీజన్లో మాత్రం ఫలితాలు అందుకు భిన్నంగా వస్తున్నాయి. ధోని సేన స్పిన్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుంటంతో ఆ జట్టుకు పరాజయాలు తప్పడం లేదు. కోల్కతాతో మ్యాచ్లో అయితే చెన్నై మరీ నాసిరకం ఆటతీరు కనబర్చింది. క్రీజులో నిలవడమే తెలియదన్నట్లు బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరమవడంతో... జట్టు పగ్గాలు అందుకున్న ధోని కూడా సీఎస్కే రాత మార్చలేకపోతున్నాడు. టాపార్డర్లో ధాటిగా ఆడే బ్యాటర్ లేకపోవడం... మిడిలార్డర్లో మునుపటి మెరుపులు లోపించడం... ధోని స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడలేకపోవడం... ప్రత్యర్థి స్పిన్నర్లు విజృంభిస్తున్న చోట చెన్నై బౌలర్లు నామమాత్ర ప్రదర్శన కనబర్చడం... వెరసి చెన్నై తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు కాస్త ఆశ ఏదైనా ఉంది అంటే... అది యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే మెరుపులే. గత మ్యాచ్ ద్వారానే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 17 ఏళ్ల మాత్రే... ముంబై పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 15 బంతుల్లో 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తుండగా... రచిన్ రవీంద్రలో నిలకడ కొరవడింది. మిడిలార్డర్లో జడేజా, దూబే, విజయ్ శంకర్ కీలకం కానున్నారు. ఓవర్టన్, పతిరణ, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, అశ్విన్, జడేజాతో బౌలింగ్ మెరుగ్గా ఉంది. ఏవీ ఆ మెరుపులు! సీజన్ ఆరంభ పోరులోనే దాదాపు మూడొందల పరుగులతో బీభత్సం సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత లయ కోల్పోయింది. పంజాబ్ కింగ్స్పై భారీ లక్ష్యాన్ని ఛేదించి తిరిగి గాడిన పడింది అనుకుంటే... పాత పాటే పునరావృతం చేస్తోంది. గత రెండు మ్యాచ్లను ముంబైతోనే ఆడిన సన్రైజర్స్ కనీస ప్రతిఘటన లేకుండానే పరాజయం పాలైంది. రైజర్స్ ఓటముల సంఖ్య కన్నా... ఆరెంజ్ ఆర్మీ ఆడుతున్న తీరే అభిమానులను కలవరపెడుతోంది. పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వెనుదిరగడం... జట్టు ఆలోచన విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిõÙక్ శర్మ నిలకడ కొనసాగించలేకపోతుండగా... ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో క్లాసెన్పై అధిక భారం పడుతోంది. అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ నుంచి టీమ్ మేనేజ్మెంట్ మరింత ఆశిస్తోంది. దూకుడుకు మారుపేరుగా నిలిచిన రైజర్స్... ఇప్పుడు అదే తొందరపాటులో వికెట్లు కోల్పోయి చతికిలబడుతోంది. ఇక చెన్నైలో రైజర్స్కు మంచి రికార్డు లేదు. చెపాక్లో చెన్నై సూపర్ కింగ్స్పై ఆరెంజ్ ఆర్మీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. కమిన్స్, షమీ, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ ఇషాన్ మలింగతో కూడిన బౌలింగ్ బృందం ఎలాంటి అద్భుతాలు చేయలేకపోతోంది. ‘అభిషేక్, హెడ్ విఫలమవుతున్నప్పుడు ఇతర ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాల్సిన అవసరముంది. ఈ సీజన్లో అదే కొరవడింది. భాగస్వామ్యాలు నమోదు చేయడంలో మా ఆటగాళ్లు విఫలమవుతున్నారు’ అని సన్రైజర్స్ కోచ్ వెటోరీ అన్నాడు. 400టి20ల్లో ధోనికి ఇది 400వ మ్యాచ్. ఈ మార్క్ చేరుకున్న నాలుగో భారత ప్లేయర్గా అతడు నిలవనున్నాడు. రోహిత్ శర్మ (456), దినేశ్ కార్తీక్ (412), విరాట్ కోహ్లి (407) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. తుది జట్లు (అంచనా)సన్రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగ. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్), రచిన్ రవీంద్ర, షేక్ రషీద్, ఆయుశ్ మాత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, జేమీ ఓవర్టన్, అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరణ. -
RCB Vs RR: చిన్నస్వామిలో బెంగళూరు చిందు
రాజస్తాన్ విజయానికి చివరి 3 ఓవర్లలో 40 పరుగులు కావాలి... భువనేశ్వర్ వేసిన 18వ ఓవర్లో జురేల్ 2 ఫోర్లు, 2 సిక్స్లు బాదడంతో 22 పరుగులు వచ్చాయి. సమీకరణం 12 బంతుల్లో 18 పరుగులకు మారడంతో గెలుపు ఖాయమనిపించింది. అయితే 19వ ఓవర్లో హాజల్వుడ్ ఒకటే పరుగు ఇచ్చి 2 వికెట్లు తీయడంతో రాయల్స్ ఆశలు కోల్పోయింది. చివరి ఓవర్లో దయాళ్ 5 పరుగులే ఇచ్చాడు. దాంతో ఈ సీజన్లో చిన్నస్వామి మైదానంలో ఆడిన నాలుగో మ్యాచ్లో బెంగళూరుకు తొలి గెలుపు దక్కగా ...విజయానికి చేరువగా వచ్చి రాజస్తాన్ వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది. బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన పోరులో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 70; 8 ఫోర్లు, 2 సిక్స్లు), దేవదత్ పడిక్కల్ (27 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. రెండో వికెట్కు వీరిద్దరు 51 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులే చేసింది. యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 49; 7 ఫోర్లు, 3 సిక్స్లు), ధ్రువ్ జురేల్ (34 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించగా ... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హాజల్వుడ్ (4/33) ప్రత్యర్థిని పడగొట్టడంతో కీలక పాత్ర పోషించాడు. సమష్టి ప్రదర్శన... బెంగళూరుకు ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 26; 4 ఫోర్లు), కోహ్లి శుభారంభం అందించడంతో ఆ జట్టు పవర్ప్లే ముగిసే సరికి 59 పరుగులు సాధించింది. హసరంగ తొలి ఓవర్లోనే సాల్ట్ను అవుట్ చేసి తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్ మరింత దూకుడుగా ఆడాడు. మరోవైపు కోహ్లి... సందీప్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 32 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం వరుసగా పరాగ్, దేశ్పాండే వేసిన రెండు ఓవర్లలో కోహ్లి, పడిక్కల్ కలిసి 5 భారీ సిక్స్లతో మొత్తం 37 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత 11 బంతుల వ్యవధిలో 7 పరుగులు మాత్రమే చేసిన జట్టు కోహ్లి, పడిక్కల్, పాటీదార్ (1) వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ దూకుడు... భారీ ఛేదనలో రాజస్తాన్ ఇన్నింగ్స్ జోరుగా మొదలైంది. తొలి బంతికే సిక్స్ కొట్టిన జైస్వాల్... దయాళ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత హాజల్వుడ్ ఓవర్లోనూ అతను వరుసగా మూడు ఫోర్లు బాదాడు. రెండు సిక్స్లతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ (16) ఎక్కువ సేపు నిలవలేదు. అనంతరం హాజల్వుడ్ ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన జైస్వాల్ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. పవర్ప్లేలో రాయల్స్ 72 పరుగులు రాబట్టడం విశేషం. ఆ తర్వాత మరో రెండు ఓవర్లు నితీశ్ రాణా (22 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), రియాన్ పరాగ్ (10 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిని ప్రదర్శించడంతో 49 బంతుల్లోనే స్కోరు 100 పరుగులకు చేరింది. అయితే ఆ తర్వాత ఆర్సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్తో రాయల్స్ను నిలువరించడంలో సఫలమైంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) హెట్మైర్ (బి) హసరంగ 26; కోహ్లి (సి) రాణా (బి) ఆర్చర్ 70; పడిక్కల్ (సి) రాణా (బి) సందీప్ 50; టిమ్ డేవిడ్ (రనౌట్) 23; పాటీదార్ (సి) జురేల్ (బి) సందీప్ 1; జితేశ్ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–61, 2–156, 3–161, 4–163, 5–205. బౌలింగ్: ఆర్చర్ 4–0–33–1, ఫారుఖీ 3–0–30–0, తుషార్ దేశ్పాండే 2–0–36–0, సందీప్ శర్మ 4–0–45–2, హసరంగ 4–0–30–1, పరాగ్ 3–0–30–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) షెఫర్డ్ (బి) హాజల్వుడ్ 49; వైభవ్ (బి) భువనేశ్వర్ 16; రాణా (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 28; పరాగ్ (సి) జితేశ్ (బి) కృనాల్ 22; జురేల్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 47; హెట్మైర్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 11; శుభమ్ దూబే (సి) సాల్ట్ (బి) దయాళ్ 12; ఆర్చర్ (సి) పాటీదార్ (బి) హాజల్వుడ్ 0; హసరంగ (రనౌట్) 1; దేశ్పాండే (నాటౌట్) 1; ఫారుఖీ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–52, 2–72, 3–110, 4–134, 5–162, 6–189, 7–189, 8–189, 9–191. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–50–1, యశ్ దయాళ్ 3–0–33–1, హాజల్వుడ్ 4–0–33–4, రొమారియో షెఫర్డ్ 1–0–15–0, సుయాశ్ శర్మ 4–0–31–0, కృనాల్ పాండ్యా 4–0–31–2. ఐపీఎల్లో నేడుచెన్నై X హైదరాబాద్వేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025 RCB vs RR: గెలిచే మ్యాచ్లో ఓడిన రాజస్తాన్..
ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 11 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఓ దశలో సునయాసంగా గెలిచేలా కన్పించిన రాజస్తాన్.. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేయగల్గింది. రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 49), ధ్రువ్ జురెల్(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47) అద్భుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్యా రెండు, భువనేశ్వర్, యశ్ దయాల్ తలా వికెట్ సాధించారు.అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(70), పడిక్కల్(50) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్(23),జితేష్ శర్మ(20) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హసరంగ, ఆర్చర్ తలా వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో కింగ్ కోహ్లి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రాజస్తాన్ బౌలర్లను విరాట్ ఊతికారేశాడు. ఫిల్ సాల్ట్, పడిక్కల్తో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. విరాట్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉టీ20 క్రికెట్లో ఒకే వేదికపై 3500 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో 105 టీ20 ఇన్నింగ్స్లలో కోహ్లి 3500 పరుగులు చేశాడు.టీ20ల్లో ఒకే స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..3500 - బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ(భారత్)3373 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్లో ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్)3253 - రోజ్ బౌల్, సౌతాంప్టన్లో జేమ్స్ విన్స్ (ఇంగ్లండ్)3241 - ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్లో అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)3238 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్లో తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)👉అదేవిధంగా టీ20 క్రికెట్లో మొదట బ్యాటింగ్ చేసిన సందర్బాల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్గా విరాట్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 62 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ బాబర్(61) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బాబర్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.👉ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.టీ20ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్లు వీరే..62 - విరాట్ కోహ్లీ*61 - బాబర్ అజామ్57 - క్రిస్ గేల్55 - డేవిడ్ వార్నర్52 - జోస్ బట్లర్52 - ఫాఫ్ డు ప్లెసిస్ -
ధోని.. ఆ పేరు అలాంటిది మరి!: సహచర క్రికెటర్కు సెహ్వాగ్ కౌంటర్
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. సన్రైజర్స్ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడి 6 ఓటుమలతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదివ స్ధానంలో కొనసాగుతోంది. కాగా ఎస్ఆర్హెచ్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనంతరం భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్,అమిత్ మిశ్రాలు క్రిక్బజ్ లైవ్ షోలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా అమిత్ మిశ్రాకు సెహ్వాగ్ కౌంటరిచ్చాడు.అసలేమి జరిగిందంటే?పోస్ట్ మ్యాచ్ లైవ్ షోలో మిశ్రా, సెహ్వాగ్లు సన్రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు గురించి చర్చించారు. అయితే మిశ్రా మాత్రం ఈ అంశం నుండి దృష్టి మరల్చి, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ప్లేఆఫ్కు చేరుకునే వారి అవకాశాల గురించి మాట్లాడాడు."సీఎస్కే ప్లే ఆఫ్స్కు చేరడం దాదాపు అసాధ్యం అనుకుంటున్నాను. వారు ప్రస్తుతం ఆడుతున్న క్రికెట్ బ్రాండ్ ప్రకారం.. వరుసగా ఆరు మ్యాచ్లను గెలవడం కష్టం. ఒకవేళ గెలవాలంటే చెన్నై అన్ని విభాగాల్లోనూ బాగా రాణించాలి. ధోని బ్యాటింగ్కు వస్తే కనీసం 30 బంతులు ఆడాలి. వారి టాప్ ఆర్డర్ కూడా రాణించాలి" అని మిశ్రా పేర్కొన్నాడు. వెంటనే సెహ్వాగ్ జోక్యం చేసుకుని ప్రశ్న సీఎస్కే గురుంచి కాదు, ఎస్ఆర్హెచ్ గురించి అని మిశ్రాతో అన్నాడు. దీంతో మిశ్రా వెంటనే క్షమాపణలు చెప్పాడు. అందుకు ఇదంతా ధోనికి ఉన్న పేరు వల్లే అంటూ సెహ్వాగ్ సమాధానమిచ్చాడు.చదవండి: అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్ -
IPL 2025: రాజస్తాన్పై ఆర్సీబీ విజయం..
RCB vs RR Live Updates:రాజస్తాన్పై ఆర్సీబీ విజయం..చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 11 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఓ దశలో సునయాసంగా గెలిచేలా కన్పించిన రాజస్తాన్.. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేయగల్గింది.రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 49), ధ్రువ్ జురెల్(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 47) అద్భుత ఇన్నింగ్స్లు ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్యా రెండు, భువనేశ్వర్, యశ్ దయాల్ తలా వికెట్ సాధించారు.అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(70), పడిక్కల్(50) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్(23),జితేష్ శర్మ(20) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హసరంగ, ఆర్చర్ తలా వికెట్ సాధించారు.16 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 160/416 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో షిమ్రాన్ హెట్మైర్(11), ధ్రువ్ జురెల్(31) ఉన్నారు.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్.. దూకుడుగా ఆడుతున్న యశస్వి జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 49 పరుగులు చేసిన జైశ్వాల్.. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..వైభవ్ సూర్యవంశీ రూపంలో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన సూర్యవంశీ.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు.5 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(35), రాణా(6) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(35),సూర్యవంశీ(10) ఉన్నారు.చెలరేగిన విరాట్, పడిక్కల్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(70), పడిక్కల్(50) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్(23),జితేష్ శర్మ(20) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హసరంగ, ఆర్చర్ తలా వికెట్ సాధించారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు..17వ ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్లో ఆర్సీబీ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. దేవ్దత్త్ పడిక్కల్(50), పాటిదార్(1) ఔటయ్యారు. 18 ఓవర్లకు ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. క్రీజులో జితేష్ శర్మ(9), టిమ్ డేవిడ్(14) ఉన్నారు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన కోహ్లి.. జోఫ్రా అర్చర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 15.1 ఓవర్లకు ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(50), టిమ్ డేవిడ్(0) ఉన్నారు.విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ..రాజస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోహ్లి 56 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లితో పాటు పడిక్కల్(29) ఉన్నాడు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్..61 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. హసరంగా బౌలింగ్లో ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(28), పడిక్కల్(1) ఉన్నారు.2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 18/02 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(5), సాల్ట్(6) ఉన్నారు.ఐపీఎల్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు కూడా రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పరాగ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్లో రాజస్తాన్ ఓ మార్పుతో బరిలోకి దిగగా.. ఆర్సీబీ ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఆర్సీబీ ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్రాజస్తాన్ యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్హాక్ ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే -
అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
బీహార్కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ తరపున సూర్యవంశీ డెబ్యూ చేశాడు.ఈ యువ ఆటగాడు తొలి మ్యాచ్లోనే 34 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్తో అందరిని ఆకట్టుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అందరి కళ్లు ఈ యువ ఆటగాడిపైనే ఉన్నాయి. గురువారం బెంగళూరు వేదికగా ఆర్సీబీతో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో వైభవ్ ఎలా ఆడుతాడో అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సూర్యవంశీపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యవంశీ అతి త్వరలో టీమిండియా తరఫున అరంగేట్రం చేయబోతున్నాడని శాంసన్ జోస్యం చెప్పాడు."అతడు చాలా కాన్ఫిడెంట్గా కన్పిస్తున్నాడు. అతడిలో చాలా పవర్ ఉంది. మా క్రికెట్ ఆకాడమీలో గ్రౌండ్ బయటకు సిక్సర్లు కొట్టేవాడు. ఇంత చిన్న వయస్సులో అతడు భారీ సిక్సర్లు ఎలా కొడుతున్నాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.అతడు నాకు తమ్ముడు లాంటి వాడు. సూర్యవంశీ ఒకట్రెండు సంవత్సరాలలో భారత్ తరపున ఆడే అవకాశం ఉందని" శాంసన్ పేర్కొన్నాడు. కాగా సూర్యవంశీ అండర్-14, అండర్-16 స్థాయిలలో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే గతేడాది జరిగిన వేలంలో వైభవ్ను రూ. 1.1 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.చదవండి: IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా? -
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్గేల్ అవుతాడు’
తండ్రి దిగ్గజ క్రికెటర్.. అంతర్జాతీయ స్థాయిలో వంద శతకాలు సాధించిన ఏకైక ఆటగాడు.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటలు లిఖించుకున్న లెజెండ్.. కానీ ఆయన కుమారుడు మాత్రం క్రికెటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాడు.ఆ తండ్రి స్పెషలిస్టు బ్యాటర్.. అయితే, కుమారుడు మాత్రం ఆల్రౌండర్. ఇప్పటికే ఆ తండ్రీకుమారులు ఎవరో అర్థమైపోయి ఉంటుంది...! అవును సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)- అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) గురించే ఈ పరిచయ వ్యాఖ్యాలు. సచిన్ తనయుడిగా మాత్రమే లోకానికి సుపరిచితమైన అర్జున్.. మేటి క్రికెటర్గా ఎదగాలంటే ఒక్కటే మార్గం ఉందంటున్నాడు యోగ్రాజ్ సింగ్.రాసి పెట్టుకోండి..‘‘అర్జున్ బౌలింగ్పై తక్కువగా బ్యాటింగ్పై ఎక్కువగా దృష్టి సారించాలి. సచిన్, యువరాజ్ సింగ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇదైతే రాసి పెట్టుకోండి.. ఒకవేళ యువీ గనుక సచిన్ కుమారుడిని తన వద్దకు రప్పించుకుని.. మూడు నెలల పాటు శిక్షణ ఇస్తే.. అర్జున్ మరో క్రిస్ గేల్ అవుతాడు.ఫాస్ట్ బౌలర్గా ఉన్న అర్జున్ ఒకవేళ తీవ్రంగా గాయపడితే కెరీర్కు ప్రమాదం. ముందుగా చెప్పినట్లు అర్జున్ ఒక్కసారి యువరాజ్ దగ్గర శిక్షణ తీసుకుంటే మాత్రం అతడు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు’’ అని యోగ్రాజ్ సింగ్ క్రిక్నెక్ట్స్ తో పేర్కొన్నాడు. కాగా అర్జున్ ఒకప్పుడు తన దగ్గర శిక్షణ తీసుకున్నట్లు యోగ్రాజ్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.బౌలింగ్ ఆల్రౌండర్కాగా 25 ఏళ్ల అర్జున్ టెండుల్కర్ బౌలింగ్ ఆల్రౌండర్. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ అయిన అతడు.. ఎడమచేతి వాటం బ్యాటర్. దేశవాళీ క్రికెట్లో గోవాకు ఆడుతున్న ఈ ముంబై కుర్రాడు.. 2024-25 సీజన్లో పూర్తిగా నిరాశపరిచాడు.దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లో రెండు ఇన్నింగ్స్ ఆడి కేవలం 40 పరుగులు చేశాడు. అదే విధంగా మూడు మ్యాచ్లలో కలిపి నాలుగు వికెట్లు తీశాడు. ఇక రంజీ ట్రోఫీలో మూడు ఇన్నింగ్స్లో కలిపి 51 పరుగులు చేసిన అర్జున్.. బౌలర్గా మాత్రం ఆకట్టుకున్నాడు. నాలుగు మ్యాచ్లు ఆడి పదహారు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉండటం విశేషం.ఇక దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 2024-25 సీజన్లో రెండు మ్యాచ్లు ఆడి 21 పరుగులు చేసిన అర్జున్.. ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ జట్టుతో ఉన్నాడు. మెగా వేలం-2025లో అర్జున్ను ముంబై రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. చదవండి: IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా? -
టీమిండియా దిగ్గజం బర్త్డే.. సారా టెండుల్కర్ పోస్ట్ వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 24). ఈరోజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 52వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ (BCCI) ఈ లెజెండరీ బ్యాటర్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.శతక శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‘‘664 అంతర్జాతీయ మ్యాచ్లు.. 34,357 పరుగులు.. 201 అంతర్జాతీయ వికెట్లు.. 2011 వన్డే వరల్డ్కప్ విజేత.. కల్నల్ సీకే నాయుడు జీవనసాఫల్య పురస్కారం అందుకున్న విజేత..అంతర్జాతీయ క్రికెట్లో శతక శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్.. దిగ్గజ, స్ఫూర్తిదాయక ఆటగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని ఎక్స్ వేదికగా విషెస్ చెప్పింది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్ తదితరులు సచిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.హ్యాపీ బర్త్డే బాబాఇక సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తండ్రి బర్త్డే సందర్భంగా తాను అమూల్యంగా భావించే ఫొటోలను పంచుకుంది. అంతేకాదు తన తండ్రి గొప్పదనాన్ని వివరిస్తూ.. ‘‘ఎవరికీ భయపడొద్దు.. అయితే, ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని నేర్పించిన వ్యక్తికి...ఫ్రాక్చర్ అయిన తన భుజంపై నన్ను మోసుకువెళ్లిన దృఢమైన సారథికి.. నా ఫొటోషూట్లను మరింత ప్రత్యేకంగా మార్చే వ్యక్తికి.. అన్నిటికంటే ముఖ్యంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ నవ్వులతో ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పే వ్యక్తికి హ్యాపీ బర్త్డే బాబా’’ అంటూ సారా క్యాప్షన్ జత చేయగా.. ఆమె పోస్ట్ వైరల్గా మారింది.కాగా 1989లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన సచిన్ టెండుల్కర్ లిటిల్ మాస్టర్ నుంచి క్రికెట్ దేవుడిగా ఎదిగాడు. తన ఇరవై రెండేళ్ల కెరీర్లో లెక్కలు మిక్కిలి రికార్డులు సాధించిన మాస్టర్ బ్లాస్టర్.. తన కెరీర్లో అంతర్జాతీయ స్థాయిలో ఏకైక టీ20 ఆడాడు.సచిన్ కెరీర్లో టాప్-9 రికార్డ్స్ ఇవే👉టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్- 15,921👉వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్- 18,426👉అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్- 463👉అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్- 200👉వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్👉అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్👉దేశవాళీ క్రికెట్లో ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ అరంగేట్రంలోనే శతక్కొట్టిన వీరుల జాబితాలో తొలి స్థానం👉టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్- 51👉వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్- 2278.చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం -
IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ అంటే ఫోర్లు, భారీ సిక్సర్లే కాదు.. వాటిని బాదిన ఆటగాళ్లు, వారు ఆడిన షాట్లను విశ్లేషిస్తూ.. వారి ఆట కట్టించేందుకు బౌలర్లు రచించే వ్యూహాలు.. ఇలా ఒక్కటేమిటి.. మ్యాచ్ ఆసాంతం తమ అద్భుతమైన గొంతుతో ఆటను కళ్లకు గట్టినట్లు చూపుతున్నారే అనేలా వ్యాఖ్యానం చేసే కామెంటేటర్లు కూడా ఇందులో భాగమే!భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్కు చెందిన ఎంతో మంది దిగ్గజాలు ఐపీఎల్లో వ్యాఖ్యాతలుగా అలరిస్తున్నారు. మరి.. వాళ్లకు ఇచ్చే పారితోషికం ఎంత? అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కామెంటేటర్ ఎవరు?.. హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల్లో కామెంట్రీ చేసే సీనియర్, జూనియర్ల జీతాలు ఎంత? తదితర విషయాలు గమనిద్దామా?టీమిండియా దిగ్గజాలు సునిల్ గావస్కర్, అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి నుంచి ఆకాశ్ చోప్రా, హర్షా భోగ్లే, ఇయాన్ బిషప్ వరకు అత్యధిక పారితోషికం అందుకునే కామెంటేటర్ల జాబితాలో ఉన్నారు. వీరిలో సునిల్ గావస్కర్ అత్యధికంగా ఇంగ్లిష్ కామెంట్రీకి రూ. 4.17 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.ఐపీఎల్-2024కు గానూ అత్యధిక పారితోషికం అందుకున్న టాప్-10 కామెంటేటర్లు 1. సునిల్ గావస్కర్ (భారత్)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు2. మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు3. కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు4. ఇయాన్ బిషప్ (వెస్టిండీస్)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు5. హర్షా భోగ్లే (భారత్)- ఇంగ్లిష్- రూ. 4.1 కోట్లు6. రవిశాస్త్రి (భారత్)- ఇంగ్లిష్- రూ. 4 కోట్లు7. ఆకాశ్ చోప్రా (భారత్)- హిందీ- రూ. 2.92 కోట్లు8. సంజయ్ మంజ్రేకర్ (భారత్)- హిందీ- రూ. 2.8 కోట్లు9. సురేశ్ రైనా (భారత్)- హిందీ- రూ. 2.5 కోట్లు10. హర్భజన్ సింగ్ (భారత్)- హిందీ- రూ. 1.5 కోట్లు11. జతిన్ సప్రూ (భారత్)- హిందీ- ఒక్కో మ్యాచ్కు రూ. 1.5 లక్షల చొప్పునటాప్ టైర్, జూనియర్ కామెంటేటర్ల జీతాల మధ్య భారీ వ్యత్యాసం (ఒక్కో మ్యాచ్కు)ఇంగ్లిష్- టాప్ టైర్ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పునహిందీ- టాప్ టైర్ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పునతమిళ్ లేదా ఇతర ప్రాంతీయ భాషలు- టాప్ టైర్ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పునఆటగాళ్లతో పాటు కామెంటేటర్లపైనా కనక వర్షం కురిపించేదే ఐపీఎల్. మరి క్యాష్ రిచ్ లీగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా! అంటారా?!చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం -
పాక్ ఆటగాడిని వారి సొంత అడ్డాలోనే నిర్భయంగా నిలదీసిన న్యూజిలాండ్ ఆటగాడు
న్యూజిలాండ్ విధ్వంసకర వీరుడు కొలిన్ మున్రో ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఆడుతున్నాడు. ఈ లీగ్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ను ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్లో ఇస్లామాబాద్ ముల్తాన్ సుల్తాన్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో ఇస్లామాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో మున్రో కీలకపాత్ర పోషించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్లో మున్రో తన ఆటతీరుతో కాకుండా వేరే విషయం కారణంగా వార్తల్లో నిలిచాడు. మున్రో బ్యాటింగ్ చేస్తుండగా సుల్తాన్స్ బౌలర్ ఇఫ్తికార్ అహ్మద్తో గొడవ జరిగింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ మూడో బంతిని ఇఫ్తికార్ బ్లాక్హోల్లోకి వేయగా మున్రో దాన్ని విజయంవంతంగా అడ్డుకున్నాడు. అయితే ఇఫ్తికార్ చక్ (చట్టవిరుద్ధమైన బౌలింగ్ శైలి) చేస్తున్నాడని మున్రో ఆరోపించాడు.iftikhar vs munro 😳 pic.twitter.com/kYqHo0R4OU— IF7 (@IF7____) April 23, 2025దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఇఫ్తికార్ మున్రో వైపు దూసుకొచ్చి ఏదో అన్నాడు. దీనికి మున్రో కూడా ధీటుగానే సమాధానం చెప్పాడు. చకింగ్ చేస్తున్నావని చెప్పడంలో తప్పేముందున్నట్లు నిలదీశాడు. మధ్యలో సుల్తాన్స్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ జోక్యం చేసుకున్నాడు. అతను కూడా మున్రోతో వాగ్వాదానికి దిగాడు. దీంతో మైదానంలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.చివరికి అంపైర్ల జోక్యంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ఆతర్వాత కూడా ఇఫ్తికార్ వివాదాస్పద శైలితోనే బౌలింగ్ కొనసాగించాడు. లీగ్ వారిదే కావడంతో మున్రో చేసేదేమీ లేక బ్యాటింగ్ను కొనసాగించాడు. ఛేదనలో తన జట్టు విజయానికి మంచి పునాది వేసి ఔటయ్యాడు. ఆండ్రియస్ గౌస్ (80 నాటౌట్) చివరి వరకు క్రీజ్లో ఉండి ఇస్లామాబాద్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఇఫ్తికార్ 2 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 20 పరుగులు సమర్పించుకున్నాడు. పాక్ ఆటగాడిని వారి సొంత అడ్డాలోనే నిర్భయంగా నిలదీయడంతో క్రికెట్ అభిమానులు మున్రో ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అలాగే చట్టవిరుద్ధమైన శైలితో బౌలింగ్ చేస్తున్నా పట్టించుకోని పాక్ అంపైర్లను చీవాట్లు పెడుతున్నారు. పాకిస్తాన్లో క్రికెట్ అంటే ఇంత కంటే గొప్పగా ఏమీ ఆశించలేమని సర్దుకు పోతున్నారు. మున్రో పేరిట న్యూజిలాండ్ తరఫున రెండో వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డు ఉంది. 38 ఏళ్ల మున్రో న్యూజిలాండ్ తరఫున 3 టీ20 సెంచరీలు చేశాడు. -
వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఇంకా కొన్ని మ్యాచ్లే ఉన్నాయి: కమిన్స్
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్రైజర్స్ హైదరాబాద్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్లు పూర్తి చేసుకున్న కమిన్స్ బృందం కేవలం రెండు మాత్రమే గెలిచింది. ముంబై ఇండియన్స్ (SRH vs MI)తో బుధవారం నాటి పోరులో ఓటమిపాలై ఈ సీజన్లో ఆరో ఓటమిని నమోదు చేసింది.కుప్పకూలిన టాపార్డర్సొంత మైదానం ఉప్పల్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. పేలవ ప్రదర్శన కనబరిచింది. ముంబై పేసర్ల ధాటికి రైజర్స్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (8) దారుణంగా విఫలం కాగా.. ఇషాన్ కిషన్ (1) మరోసారి చేతులెత్తేశాడు.నితీశ్ రెడ్డి (2) సైతం నిరాశపరిచాడు. ఇలాంటి దశలో వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 71) అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43)తో కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ఏకంగా నాలుగు వికెట్లు కూల్చగా.. దీపక్ చహర్ రెండు, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక సన్రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలో ఛేదించింది. రోహిత్ శర్మ (46 బంతుల్లో 70), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్) రాణించారు.వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమి అనంతరం సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) స్పందించాడు. బ్యాటర్ల వైఫల్యమే తమ ఓటమికి కారణమని పేర్కొన్నాడు. ఈ సీజన్లో తమకు ఇంకా కొన్ని మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని.. వికెట్ను సరిగ్గా అంచనా వేయగలిగితేనే ఇకపై ముందుకు సాగే అవకాశం ఉందని కమిన్స్ వ్యాఖ్యానించాడు.‘‘అభినవ్, క్లాసీ వల్ల మేము చెప్పుకోగదగ్గ స్కోరు చేయగలిగాం. కానీ ఈ ఇన్నింగ్స్లో మా జట్టు ప్రదర్శన అస్సలు బాలేదు. కనీసం ఇంకొక్కరైనా పట్టుదలగా నిలబడి ఉంటే బాగుండేది.ఇంకా కొన్ని మ్యాచ్లే ఉన్నాయిఇదే పిచ్పై మా తొలి మ్యాచ్లో 280 పరుగులు స్కోరు చేశాం. కానీ ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీ20 మ్యాచ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సమయానుగుణంగా ఇన్నింగ్స్ ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటే మంచిది.లేదంటే పరిస్థితి చేజారుతుంది. మాకింకా కొన్ని మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వికెట్ను కచ్చితంగా అంచనా వేసి.. అందుకు అనుగుణంగా ఆడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలము. అయితే, కొన్నిసార్లు మనం సఫలమైతే.. మరికొన్ని సార్లు ప్రత్యర్థి జట్టు పైచేయి సాధిస్తుంది’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.కాగా గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్కు ఈ సీజన్లో ఇంకా ఆరు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఆరింటిలోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు సన్రైజర్స్పై గెలిచిన ముంబై.. తొమ్మిదింట ఐదో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి దూసుకువచ్చింది. చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం4️⃣th consecutive win for the @mipaltan 👌They make it 2️⃣ in 2️⃣ against #SRH this season 👏Scorecard ▶ https://t.co/nZaVdtwDtv #TATAIPL | #SRHvMI pic.twitter.com/wZMMQnOEi0— IndianPremierLeague (@IPL) April 23, 2025 -
ఇషాన్ కిషన్పై దుమ్మెత్తిపోస్తున్న ఎస్ఆర్హెచ్ అభిమానులు.. అమ్ముడుపోయాడంటూ కామెంట్లు
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ట్రెంట్ బౌల్ట్ (4-0-26-4), దీపక్ చాహర్ (4-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయినా.. రోహిత్ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.ఈ మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వ్యవహరించిన తీరుపై సొంత అభిమానులే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇషాన్ ముంబై ఇండియన్స్తో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. ఇషాన్ తమను నమ్మించి వెన్నుపోటు పొడిచాడని దుయ్యబడుతున్నారు. ఇకపై సన్రైజర్స్ యాజమాన్యం అతనికి అవకాశాలు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు.అసలేం జరిగిందంటే.. సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్ నిన్న ముంబై ఇండియన్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో ఇషాన్ అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా తనంతట తానే మైదానాన్ని వీడాడు. హెడ్ ఔటయ్యాక మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్.. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతిని లెగ్ సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఇషాన్ బ్యాట్ను మిస్సై వికెట్ కీపర్ రికెల్టన్ చేతికి వెళ్లింది. బంతికి బ్యాట్కు తాకిందని భావించిన ఇషాన్ అంపైర్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఔటయ్యానని అనుకుని పెవిలియన్ బాట పట్టాడు. రీ ప్లేలో బంతి బ్యాట్కు కానీ శరీరానికి కానీ తగల్లేదని తేలింది. దీంతో ఇషాన్పై ఎస్ఆర్హెచ్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పటికే హెడ్ ఔటై కష్టాల్లో ఉన్నామని తెలిసి కూడా ఇషాన్కు ఇంత నిర్లక్షమా అని మండిపడుతున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్నా ఇషాన్కు ఏ మాత్రం పట్ట లేదని దుయ్యబడుతున్నారు. రూ. 15.25 కోట్లు పెట్టి కొనుక్కుంటే ఇలాగేనా చేసేదని దుమ్మెత్తిపోస్తున్నారు.కాగా, ఈ సీజన్లో ఇషాన్ తన తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై సెంచరీ చేశాడు. అప్పుడు సన్రైజర్స్ అభిమానులు ఇషాన్ను ఆహా ఓహో అంటూ ఆకాశానికెత్తారు. ఆ మ్యాచ్ తర్వాత ఇషాన్ వరుసగా 7 మ్యాచ్ల్లో విఫలమై అభిమానులను నిరాశలో ముంచెత్తాడు. సరిగ్గా ఆడకపోతే ఫామ్లో లేడని భావించిన ఫ్యాన్స్, ఔట్ కాకపోయినా ఔటయ్యానని తనకు తానే ప్రకటించుకోవడంపై ఫైరవుతున్నారు. ముంబై ఇండియన్స్ నుంచి వచ్చాడు. ఆ ఫ్రాంచైజీకి అమ్ముడుపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సీజన్లోనే ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో ఇషాన్ ఆ జట్టు ఓనర్ నీతా అంబానీతో చనువుగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇలా చేసినందుకు నీతా మేడం ఇషాన్కు రిలయన్స్ మార్ట్ నుండి సరుకులు పంపుతుందని జోక్ చేస్తున్నారు. ఇషాన్ ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్లోనే కొనసాగిన విషయం తెలిసిందే. -
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
ప్రశాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమని పునరుద్ఘాటించింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ.. ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది.పాకిస్తాన్తో ఇకపై కూడా..బీసీసీఐ తరఫున కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ఈ మేరకు తమ స్పందన తెలియజేశారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘బాధిత కుటుంబాలకు మా మద్దతు. ఉగ్రవాదుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.ప్రభుత్వ నిర్ణయానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. పాకిస్తాన్తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోము. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాం. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదు.అయితే, ఐసీసీ ఈవెంట్లలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లు ఆడుతుంది. ప్రస్తుత పరిస్థితులను ఐసీసీ కూడా నిశితంగా గమనిస్తోంది’’ అని స్పోర్ట్స్తక్తో పేర్కొన్నారు.మాటలకు అందని విషాదంఇక బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. ‘‘పహల్గామ్లో జరిగిన పాశవిక ఉగ్రదాడి కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.బీసీసీఐ తరఫున ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయంలో వారంతా ధైర్యం కోల్పోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో చోటు చేసుకున్న ఈ విషాదాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవడం లేదు. మనమంతా వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు.బాధితులకు నివాళికాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్-2025లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ బాధితులకు నివాళి అర్పించింది. ఆటగాళ్లంతా నిమిషం పాటు మౌనం పాటించారు. అదే విధంగా చీర్లీడర్స్ ప్రదర్శనలు లేకుండా చూసుకున్నారు. బాణసంచా కూడా కాల్చలేదు.చివరగా 2008లోఇదిలా ఉంటే.. భారత జట్టు చివరగా 2008లో పాకిస్తాన్లో పర్యటించింది. అదే విధంగా పాక్ జట్టు 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు భారత్కు వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు భారత పర్యటనకు రాగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికైన దుబాయ్లో రోహిత్ సేన తమ మ్యాచ్లు ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవగా.. ఆతిథ్య పాక్ జట్టు ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది.కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో గల బైసారన్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి దిగారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు.చదవండి: Pahalgam Incident: "గౌతమ్ గంభీర్ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు -
పాకిస్తాన్కు వెళ్లిపోయిన కేన్ మామ
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఆడేందుకు పాకిస్తాన్కు వెళ్లిపోయాడు. కేన్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో ప్రారంభం నుండి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కేన్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను పీఎస్ఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. పీఎస్ఎల్లోని కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ కేన్ను రూ. 86 లక్షలకు కొనుగోలు చేసింది. ఇదే కరాచీ కింగ్స్ ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ను రూ. 2.57 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ కూడా కట్టబెట్టింది. కేన్ పీఎస్ఎల్లో తదుపరి మ్యాచ్లు వార్నర్ కెప్టెన్సీలో ఆడతాడు. కేన్ పీఎస్ఎల్లో ఆడటం ఇదే మొదటిసారి. పాక్ జట్టుతో చేరిన విషయాన్ని కరాచీ కింగ్స్ యాజమాన్యం సోషల్మీడియా వేదికగా వెల్లడించింది.𝐇𝐢 𝐊𝐚𝐫𝐚𝐜𝐡𝐢 𝐟𝐚𝐧𝐬! 𝐈 𝐡𝐚𝐯𝐞 𝐚𝐫𝐫𝐢𝐯𝐞𝐝 👋The wait is over! Kane Williamson has joined the #KingsSquad 🤩#YehHaiKarachi | #KarachiKings | #HBLPSLX pic.twitter.com/R2z8nEpXbp— Karachi Kings (@KarachiKingsARY) April 24, 2025కేన్ 2015 నుండి 2024 వరకు ఐపీఎల్లో ఆడాడు. 9 సీజన్లలో అతను అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. ఎక్కువ కాలం సన్రైజర్స్కు ఆడిన కేన్.. ఆ జట్టును 2018 సీజన్లో ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు. ఆ సీజన్లో కేన్ 17 మ్యాచ్ల్లో 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. కేన్ను ఎస్ఆర్హెచ్ అభిమానులు ముద్దుగా కేన్ మామ అని పిలుచుకుంటారు. కేన్ను 2022 సీజన్లో ఎస్ఆర్హెచ్ వదిలేసింది. ఆతర్వాత అతను గుజరాత్ టైటాన్స్తో జత కట్టాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు గుజరాత్ కూడా కేన్ను వదిలేసింది. మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నా కేన్ను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. ఘన చరిత్ర కలిగిన కేన్ ఐపీఎల్లో 79 మ్యాచ్లు ఆడి 18 అర్ద సెంచరీల సాయంతో 2128 పరుగులు చేశాడు.పీఎస్ఎల్లో కేన్ సహా చాలామంది న్యూజిలాండ్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఐపీఎల్లో అవకాశాలు రాకపోవడంతో వీరంతా పీఎస్ఎల్ పంచన చేరారు. పీఎస్ఎల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ (1.88 కోట్లు) కాగా.. టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్, మార్క్ చాపమన్, ఆడమ్ మిల్నే, కొలిన్ మున్రో, మైఖేల్ బ్రేస్వెల్, కైల్ జేమీసన్ ఓ మోస్తరు వేతనంతోనే సరిపెట్టుకున్నారు. పీఎస్ఎల్-2025లో కేన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరాచీ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్లో క్వెట్టా గ్లాడియేటర్స్తో (ఏప్రిల్ 25) తలపడనుంది. ఈ మ్యాచ్తో కేన్ పీఎస్ఎల్ అరంగేట్రం చేస్తాడు. -
SRH VS MI: రికార్డుల్లోకెక్కిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరోసారి రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో అత్యంత అరుదైన 12000 పరుగుల మైలురాయిని తాకాడు. నిన్న (ఏప్రిల్ 23) సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా (443 ఇన్నింగ్స్ల్లో) నిలిచాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన రికార్డు క్రిస్ గేల్ (345 ఇన్నింగ్స్లు) పేరిట ఉంది. గేల్ తర్వాత విరాట్ (360), వార్నర్ (368), అలెక్స్ హేల్స్ (432) అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకారు. ఓవరాల్గా టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన 8వ ఆటగాడిగా హిట్మ్యాన్ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్ తన టీ20 కెరీర్లో 8 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు చేశాడు.నిన్నటి మ్యాచ్లో రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ముంబై బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (4-0-26-4), దీపక్ చాహర్ (4-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయినా రోహిత్ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. -
"గౌతమ్ గంభీర్ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్కు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. హతమారుస్తామంటూ (IKILLU) ఐసిస్ కశ్మీర్ రెండు ఈ-మెయిల్స్ చేసింది. ఈ విషయాన్ని గంభీర్ వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఢిల్లీలోని రాజీందర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించినందుకు గంభీర్కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని గంభీర్ ఢిల్లీ పోలీసులను కోరాడు.Praying for the families of the deceased. Those responsible for this will pay. India will strike. #Pahalgam— Gautam Gambhir (@GautamGambhir) April 22, 2025గంభీర్ పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకుంటారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు.కాగా, ఐపీఎల్ కారణంగా గంభీర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. గంభీర్ ఇటీవలే కుటుంబంతో కలిసి ఫ్రాన్స్లో హాలిడే ఎంజాయ్ చేసి వచ్చాడు. గంభీర్ గతేడాది జులైలో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. భారత్ టీ20 వరల్డ్కప్ గెలిచాక రాహుల్ ద్రవిడ్ నుంచి బాధ్యతలు స్వీకరించాడు. టీమిండియా కోచ్గా గంభీర్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గంభీర్ నేతృత్వంలో భారత్.. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్, న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్-గవాస్కర్ సిరీస్ల్లో ఓటమిపాలైంది. మధ్యలో కొన్ని చిన్నాచితక విజయాలతో పాటు భారత్ గంభీర్ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. -
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
కశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం జరిగిన భయానమైన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే-తోయిబా ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. లష్కరే-తోయిబాకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.If Pakistan truly has no role in the Pahalgam terror attack, why hasn’t Prime Minister @CMShehbaz condemned it yet? Why are your forces suddenly on high alert? Because deep down, you know the truth — you’re sheltering and nurturing terrorists. Shame on you.— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర నిజంగా లేకపోతే ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించాడు. దాడి తర్వాత పాక్ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయిని నిలదీశాడు. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, పెంచి పోషిస్తుందని ఆరోపించాడు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని ట్విటర్ వేదికగా పాక్ ప్రభుత్వంపై అసహనాన్ని ప్రదర్శించాడు.Why is it that they never target local Kashmiris, but consistently attack Hindus — be it Kashmiri Pandits or Hindu tourists from across India? Because terrorism, no matter how it’s disguised, follows one ideology — and the whole world is paying the price for it. #Pahalgam— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025దీనికి ముందు కూడా కనేరియా ఓ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు స్థానిక కశ్మీరీలను ఎందుకు టార్గెట్ చేయరని ప్రశ్నించాడు. హిందువులే లక్ష్యంగా ఎందుకు దాడులకు తెగబడతారని నిలదీశాడు. ఉగ్రవాదం కారణంగా యావత్ ప్రపంచం మూల్యం చెల్లించుకుంటుందని వాపోయాడు.తాజాగా కనేరియా మరో ట్వీట్ కూడా చేశాడు. నేను ఏదైనా ట్వీట్ చేసినప్పుడల్లా కొంతమంది భారతీయ ముస్లింలు ఎందుకు బాధపడతారని ప్రశ్నించాడు.Why do some Indian Muslims get offended whenever I tweet something? Genuinely curious — just asking.— Danish Kaneria (@DanishKaneria61) April 23, 202544 ఏళ్ల కనేరియా పాక్ తరఫున క్రికెట్ ఆడిన రెండో హిందు ఆటగాడు. గతంలో అతని కజిన్ అనిల్ దల్పత్ పాక్కు ప్రాతినిథ్యం వహించాడు. కనేరియా 2000-2019 మధ్యలో పాక్ తరఫున 61 టెస్ట్లు ఆడి 261 వికెట్లు పడగొట్టాడు. 18 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. కనేరియా హిందువన్న కారణంగా పాక్ క్రికెట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అతను టీమ్లో ఉండటం చాలామంది పాక్ క్రికెటర్లకు నచ్చేది కాదని ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్వయంగా చెప్పాడు. కనేరియా స్పాట్ ఫిక్సంగ్ కేసులో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్ మరియు ఆ దేశ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా కనేరియా ఆ దేశాన్ని విడిచి వెళ్లాడు. ప్రస్తుతం అతను యూకేలో తలదాచుకుంటున్నాడు.Sad & heartbroken 💔 #PahalgamTerroristAttack— Mohammad Hafeez (@MHafeez22) April 23, 2025కాగా, పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ కూడా స్పందించాడు. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ విచారం వ్యక్తం చేశాడు. -
SRH Vs MI: లైన్లోకి వచ్చారా వార్ వన్ సైడే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ను ముంబై ఇండియన్స్ చెత్తగా ప్రారంభించి, తిరిగి గాడిలో పడింది. తొలి ఐదు మ్యాచ్ల్లో నాలుగు పరాజయాల తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఆ జట్టుకు పడి లేవడం కొత్త కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే తొలుత పరాజయాలు ఎదుర్కొని ఆతర్వాత టైటిల్ రేసులో నిలిచింది. ప్రస్తుత సీజన్లోనూ ముంబై ఇండియన్స్ అదే ఒరవడిని కొనసాగిస్తుంది.ఆ జట్టు ఆటగాళ్లు ఒక్కసారి ఊపులోకి వస్తే వార్ సైడ్ అవుతుంది. ఇది మరోసారి నిరూపితమైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ల్లో రోహిత్ శర్మ విఫలం కావడం.. బ్యాటర్లలో పెద్దగా ఆత్య విశ్వాసం లేకపోవడం.. పేసర్లు లయను అందిపుచ్చుకోలేకపోవడం, బుమ్రా అందుబాటులో లేకపోవడం వంటివి జరిగాయి. ఈ కారణాల చేత ముంబై తొలి మ్యాచ్ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంది.అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది. రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. బుమ్రా జట్టులో చేరడమే కాకుండా, సామర్థ్యం మేరకు సత్తా చాటుడుతున్నాడు. బ్యాటర్లు తిరిగి ఆత్మ విశ్వాసాన్ని పొందారు. బౌలర్లు, ముఖ్యంగా పేసర్లు లయను అందుకున్నారు. దీపక్ చాహర్, సూర్యకుమార్, బౌల్ట్, మిచెల్ సాంట్నర్ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవకాశం వచ్చిన ప్రతిసారి చెలరేగుతున్నాడు.నిన్న (ఏప్రిల్ 23) సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో పైన పేర్కొన్న ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై ఇండియన్స్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ సీజన్లో ముంబై సన్రైజర్స్ను ఓడించడం ఇది రెండో సారి. నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచి సన్రైజర్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన ముంబై.. ఆ జట్టును స్వల్ప స్కోర్కే పరిమతం చేసింది. పేసర్లు బౌల్ట్, చాహర్ చెలరేగడంతో సన్రైజర్స్ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకోవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది. బౌల్ట్ 4, చాహర్ 2, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ తీసి సన్రైజర్స్ పుట్టి ముంచారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయినా.. రోహిత్ (46 బంతుల్లో 70).. విల్ జాక్స్తో (22) పాటు ఇన్నింగ్స్ను నిర్మించాడు. జాక్స్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్) తన సహజ శైలిలో రెచ్చిపోయి బౌండరీతో మ్యాచ్ను ముగించాడు. రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి విజయానికి చేరువలో ఔటయ్యాడు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ జట్టు చివరిగా 2020 సీజన్లో నాలుగు అంతకంటే ఎక్కువ విజయాలు సాధించింది. ఆ సీజన్లో ముంబై వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి టైటిల్ను ఎగరేసుకుపోయింది. అదే ముంబై ఇండియన్స్ను చివరి (ఐదో) టైటిల్. -
చిన్నస్వామిలో చిందేసేనా!
బెంగళూరు: ఐపీఎల్ 18వ సీజన్లో ప్రత్యర్థుల మైదానాల్లో దుమ్మురేపుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో మాత్రం విజయం కోసం నిరీక్షిస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన బెంగళూరు... రాజస్తాన్ రాయల్స్పై అయినా గెలవాలని చూస్తోంది. తాజా సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లాడిన ఆర్సీబీ 5 విజయాలు, 3 పరాజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్ వైపు దూసుకెళ్తుంటే... మరోవైపు రాజస్తాన్ రాయల్స్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గత నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిన రాజస్తాన్ విజయం కోసం ఎదురుచూస్తోంది. మిగిలిన స్టేడియాలతో పోల్చుకుంటే కాస్త చిన్నదిగా ఉండే... చిన్నస్వామి మైదానంలో బెంగళూరు బ్యాటర్లు సమష్టిగా సత్తా చాటాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫుల్ఫామ్లో ఉండగా... సాల్ట్, పడిక్కల్, రజత్ పాటీదార్ నుంచి మరిన్ని మెరుపులు రావాల్సి ఉంది. రాజస్తాన్ రాయల్స్ రెగ్యులర్ సంజూ సామ్సన్ గాయంతో జట్టుకు దూరం కావడంతో... అతడి స్థానంలో రియాన్ పరా గ్ సారథిగా వ్యవహరించనున్నాడు. గత మ్యాచ్తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 14 ఏళ్ల ప్లేయర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. సొంతగడ్డపై ఓ విజయం కోసం! ఐపీఎల్ ఆరంభం నుంచి బరిలోకి దిగుతున్నా... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఆర్సీబీ... ఈసారి మెరుగైన ప్రదర్శనతో తమ చిరకాల కల నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. వరుస విజయాలు సాధించలేకపోతున్నా... మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి బెంగళూరు బౌలింగ్ దళం మెరుగైన ప్రదర్శన చేస్తుండగా... బ్యాటర్లు ఫర్వాలేదనిపిస్తున్నారు. భువనేశ్వర్, యశ్ దయాళ్, హాజల్వుడ్, కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మతో కూడిన బౌలింగ్ బృందం ఆర్సీబీకి ప్రధాన బలంగా మారింది. ఇక బ్యాటింగ్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి చక్కటి ఆటతీరు కనబరుస్తుండగా... కెప్టెన్ రజత్ పాటీదార్ నుంచి యాజమాన్యం మరింత ఆశిస్తోంది. మిడిలార్డర్లో జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, డేవిడ్, కృనాల్ కీలకం కానున్నారు. వీరంతా కలిసికట్టుగా కదంతొక్కితే బెంగళూరు భారీ స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నుంచి ఆర్సీబీకి ప్రధాన సవాలు ఎదురుకానుంది. అందరి చూపు... వైభవ్ వైపు మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన రాయల్స్... ఆ తర్వాత రెండు మ్యాచ్లు నెగ్గింది. అనంతరం ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ రాజస్తాన్కు పరాజయాలే పలకరించాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన స్థితిలో బెంగళూరుతో పోరుకు రెడీ అయింది. బౌలర్ల ఫామ్ లేమి, బ్యాటర్ల నిలకడ లేమికి తోడు... కెప్టెన్ సామ్సన్ గాయం రాజస్తాన్ను ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు సానుకూల అంశం ఏదైనా ఉంది అంటే... గత మ్యాచ్ ద్వారానే ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ. తొలి పోరులో అంతర్జాతీయ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ 14 ఏళ్ల బుడ్డోడు... ఆడిన మొదటి బంతికే సిక్స్ కొట్టి సంచలనం రేపాడు. క్రీజులో ఉన్నంతసేపు లక్నో బౌలర్లను ఓ ఆటాడుకున్న సూర్యవంశీ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంచి ఫామ్లో ఉండగా... నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్మైర్, శుభమ్ దూబే రాణించాల్సిన అవసరముంది. అటు కెప్టెన్ గా, ఇటు మిడిలార్డర్ బ్యాటర్గా రియాన్ పరాగ్పై అదనపు బాధ్యతలు ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే పేస్ బాధ్యతలు చూసుకోనుండగా... వణిండు హసరంగా స్పిన్ భారం మోయనున్నాడు.33 ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, రాజస్తాన్ జట్లు ముఖాముఖిగా 33 సార్లు తలపడ్డాయి. 16 మ్యాచ్ల్లో బెంగళూరు, 14 మ్యాచ్ల్లో రాజస్తాన్ విజయం సాధించాయి. 3 మ్యాచ్లు రద్దయ్యాయి. రాజస్తాన్పై బెంగళూరు అత్యధిక స్కోరు 200కాగా, అత్యల్ప స్కోరు 70 పరుగులు. బెంగళూరుపై రాజస్తాన్ అత్యధిక స్కోరు 217కాగా, అత్యల్ప స్కోరు 58 పరుగులు. తుది జట్లు (అంచనా) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, పడిక్కల్, జితేశ్ శర్మ, షెఫర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హాజల్వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ. రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్ ), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్మైర్, శుభమ్ దూబే, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ. -
శ్రీలంక జట్టులో భారీ మార్పులు
కొలంబో: స్వదేశంలో జరగనున్న మహిళల ముక్కోణపు వన్డే టోర్నమెంట్ కోసం శ్రీలంక జట్టు భారీ మార్పులు చేసింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టోర్నీ కోసం శ్రీలంక జట్టు 8 మార్పులు చేసి బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో పాటు భారత్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు 0–2తో సిరీస్ కోల్పోవడంతో జట్టును ప్రక్షాళన చేసింది. సీనియర్ బ్యాటర్ చమరి ఆటపట్టు లంక జట్టుకు సారథ్యం వహిస్తుండగా... న్యూజిలాండ్తో టి20 సిరీస్లో ఆకట్టుకున్న మీడియం పేసర్ మల్కీ మదారాకు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నమెంట్లో ఒక్కో జట్టు మిగిలిన రెండు జట్లతో రెండేసి సార్లు తలపడనుంది. మ్యాచ్లన్నీ ప్రేమదాస స్టేడియంలోనే జరగనున్నాయి. వచ్చే నెల 11న ఫైనల్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంకతో భారత అమ్మాయిల జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. శ్రీలంక జట్టు: చమరి ఆటపట్టు (కెప్టెన్ ), హర్షిత సమరవిక్రమ, విష్మీ గుణరత్నె, నీలాక్షిక సిల్వ, కవిషా దిల్హారి, అనుష్క సంజీవని, మనుడి ననయక్కర, హాసిని పెరెరా, ఆచిని కులసూర్య, పియూమి బడాల్గే, దేవ్మి విహంగ, హన్సిమ కరుణరత్నె, మల్కీ మదారా, ఇనోషి ప్రియదర్శిని, సుగంధిక కుమారి, రష్మిక, ఇనోక రణవీర. -
SRH Vs MI: రైజర్స్ పరాజయాల ‘సిక్సర్’
ఐపీఎల్–2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు ముగిసినట్లే అనిపిస్తోంది... గత ఏడాది రన్నరప్ ఈసారి పేలవ ప్రదర్శనతో ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఆరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది...ముంబై పేసర్లు బౌల్ట్, చహర్ ధాటికి 13/4 వద్ద నిలిచి, ఆపై ఎలాగోలా 143 వరకు చేరినా... ఆ స్కోరు ఓటమిని తప్పించలేకపోయింది. రోహిత్ శర్మ మరో చక్కటి అర్ధ సెంచరీతో ముందుండి నడిపించగా మరో 26 బంతుల ముందే ముంబై విజయతీరం చేరింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో మ్యాచ్ మ్యాచ్కీ జోరు పెంచుతూ చెలరేగుతున్న ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై నెగ్గింది. ముందుగా రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్లాసెన్ (44 బంతుల్లో 71; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీ చేయగా, అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీశాడు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 146 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆదుకున్న క్లాసెన్... ఒకటి, రెండు, మూడు, నాలుగు... సన్రైజర్స్ టాప్–4 బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో ఇన్నింగ్స్ మరీ పేలవంగా ప్రారంభమైంది. హెడ్ (0), అభిషేక్ శర్మ (8), నితీశ్ కుమార్ రెడ్డి (2) చెత్త షాట్లు ఆడి నిష్క్రమించగా, ఇషాన్ కిషన్ (1) తన వికెట్ తానే ఇచ్చుకున్నాడు. ఈ సీజన్లో అత్యల్ప పవర్ప్లే స్కోరు (24) సన్రైజర్స్ నమోదు చేసింది. కొద్దిసేపటికి అనికేత్ వర్మ (12) కూడా వెనుదిరగడంతో 35/5 వద్ద రైజర్స్ కష్టాలు మరింత పెరిగాయి. స్కోరు 100 దాటుతుందా అనే సందేహం కనిపించింది. బ్యాటింగ్ కుప్పకూలటంతో ఇంపాక్ట్ ప్లేయర్గా అదనపు బ్యాటర్ మనోహర్ను తీసుకోవాల్సి వచ్చింది. క్లాసెన్, మనోహర్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. 34 బంతుల్లో క్లాసెన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. బుమ్రా బౌలింగ్లో రివర్స్ స్కూప్తో అతను కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. క్లాసెన్, మనోహర్ ఆరో వికెట్కు 63 బంతుల్లో 99 పరుగులు జోడించారు. చకచకా లక్ష్యం వైపు... స్వల్ప ఛేదనలో ముంబై ఆరంభంలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత జట్టుకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, విల్ జాక్స్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్కు 46 బంతుల్లోనే 64 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. జాక్స్ వెనుదిరిగిన తర్వాత రోహిత్కు సూర్య జత కలిశాడు. 35 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. హర్షల్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి మరింత జోరు ప్రదర్శించిన రోహిత్ ఎట్టకేలకు విజయానికి మరో 14 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) నమన్ (బి) బౌల్ట్ 0; అభిషేక్ (సి) పుతూర్ (బి) బౌల్ట్ 8; ఇషాన్ కిషన్ (సి) రికెల్టన్ (బి) దీపక్ చహర్ 1; నితీశ్ రెడ్డి (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 2; క్లాసెన్ (సి) తిలక్ (బి) బుమ్రా 71; అనికేత్ (సి) రికెల్టన్ (బి) పాండ్యా 12; మనోహర్ (హిట్ వికెట్) (బి) బౌల్ట్ 43; కమిన్స్ (బి) బౌల్ట్ 1; హర్షల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–13, 4–13, 5–35, 6–134, 7–142, 8–143. బౌలింగ్: దీపక్ చహర్ 4–0– 12–2, బౌల్ట్ 4–0–26–4, బుమ్రా 4–0–39–1, సాంట్నర్ 4–0–19–0, పాండ్యా 3–0–31–1, పుతూర్ 1–0–15–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి అండ్ బి) ఉనాద్కట్ 11; రోహిత్ (సి) అభిషేక్ (బి) మలింగ 70; జాక్స్ (సి)మనోహర్ (బి) అన్సారీ 22; సూర్యకుమార్ (నాటౌట్) 40; తిలక్వర్మ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 1; మొత్తం (15.4 ఓవర్లలో 3 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–13, 2–77, 3–130. బౌలింగ్: కమిన్స్ 3–0–31–0, ఉనాద్కట్ 3–0–25–1, హర్షల్ 3–0–21–0, ఇషాన్ మలింగ 3–0–33–1, అన్సారీ 3.4–0–36–1. అవుట్ కాకుండానే... సన్రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అనూహ్య రీతిలో వెనుదిరిగాడు. దీపక్ చహర్ వేసిన బంతి అతని లెగ్సైడ్ దిశగా వెళ్లగా కిషన్ గ్లాన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే కీపర్ రికెల్టన్ బంతిని అందుకున్న మరుక్షణమే కిషన్ అవుట్గా భావించి స్వచ్ఛందంగా పెవిలియన్ వైపు నడిచాడు. నిజానికి ముంబై ఆటగాళ్లు ఎవరూ గట్టిగా అప్పీల్ కూడా చేయకపోగా... అంపైర్ వినోద్ శేషన్ కూడా వైడ్గా ప్రకటించేందుకు రెండు చేతులు పైకెత్తబోయాడు. అయితే కిషన్ స్పందనను చూసిన అతను తన నిర్ణయాన్ని మార్చుకొని అవుట్గా ఖాయం చేశాడు. కిషన్ తనంతట తానే వెళ్లిపోవడాన్ని ముంబై కెప్టెన్ పాండ్యా భుజం తట్టి మరీ అభినందించాడు. అయితే ఆ తర్వాత రీప్లేల్లో అతని బ్యాట్కు బంతి తగల్లేదని, నాటౌట్ అని తేలింది. ఇషాన్ కిషన్ అతిగా స్పందించకుండా ఉంటే వికెట్ చేజారేదే కాదు.ఐపీఎల్లో నేడుబెంగళూరు X రాజస్తాన్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై విజయ భేరి మోగించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలోనే చేధించింది.ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 70) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40 నాటౌట్) మెరుపు మెరిపించాడు. సన్రైజర్స్ బౌలర్లలో ఉనద్కట్, మలింగ, అన్సారీ తలా వికెట్ సాధించారు. క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ వృధా..సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ను క్లాసెన్ విరోచిత పోరాటంతో ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అభినవ్ మనోహర్ కీలక నాక్ ఆడాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు. -
IPL 2025: జస్ప్రీత్ బుమ్రా 'ట్రిపుల్ సెంచరీ'..
టీమిండియా పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20ల్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ వికెట్తో బుమ్రా ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన రెండో ఇండియన్ ఫాస్ట్ బౌలర్గా బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో బుమ్రా కంటే ముందు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(318) ఉన్నాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్గా బుమ్రా నిలిచాడు. అదేవిధంగా మరో ఘనతను బుమ్రా ఈ మ్యాచ్లో సాధించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ(170) రికార్డును బుమ్రా సమం చేశాడు.మరో వికెట్ పడగొడితే మలింగను జస్ప్రీత్ అధిగమిస్తాడు. అయితే ఈ మ్యాచ్లో బుమ్రా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 39 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్లు వీరే యుజ్వేంద్ర చాహల్ - 373పీయూష్ చావ్లా - 319భువనేశ్వర్ కుమార్ - 318రవిచంద్రన్ అశ్విన్ - 315జస్ప్రీత్ బుమ్రా - 300 -
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో భారీ సిక్సర్ నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్బుతమైన సిక్స్ బాదాడు. అతడు కొట్టిన షాట్కు బంతి 107 మీటర్ల దూరం వెళ్లి ప్రేక్షకుల మధ్య పడింది.ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన ముంబై స్పిన్నర్ విఘ్నేష్ పుథూర్.. తొలి బంతిని క్లాసెన్కు షార్ట్బాల్గా సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఈ షాట్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరిట ఉండేది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో శర్మ 106 సిక్సర్ల బాదాడు. తాజా మ్యాచ్తో అభిషేక్ను క్లాసెన్ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్లో క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ను క్లాసెన్ తన ఫైటింగ్ నాక్తో ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు. Upping the ante. Heinrich Klaasen and Abhinav Manohar on the move 👌A fighting 34-ball FIFTY from Heinrich Klaasen 👏Updates ▶ https://t.co/nZaVdtxbj3 #TATAIPL | #SRHvMI | @SunRisers pic.twitter.com/6waLHTurl5— IndianPremierLeague (@IPL) April 23, 2025 -
ఇషాన్ కిషన్.. నీకు కొంచమైనా తెలివి ఉందా? వీడియో వైరల్
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఔటైన విధానం తీవ్ర చర్చనీయాంశమైంది. అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా కిషన్ మాత్రం తనంతట తానే మైదానాన్ని వీడేందుకు సిద్దం కావడం అందరని షాక్కు గురిచేసింది.అసలేమి జరిగిందంటే?ట్రావిస్ హెడ్ ఔటయ్యాక క్రీజులోకి ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు వచ్చాడు. ఈ క్రమంలో 3వ ఓవర్ వేసిన దీపక్ చాహర్ తొలి బంతిని కిషన్కు లెగ్ సైడ్ వైపునకు సంధించాడు. ఆ బంతిని డౌన్ ది లెగ్ ఆడటానికి ఇషాన్ ప్రయత్నించాడు. కానీ బంతి కిషన్ బ్యాట్ మిస్స్ అయ్యి వికెట్ కీపర్ రికెల్టన్ చేతికి వెళ్లింది. వెంటనే కిషన్ మాత్రం ఔట్ అని భావించి పెవిలియన్కు వైపు నడిచాడు. అప్పటికి బౌలర్, వికెట్ కీపర్ కనీసం అప్పీల్ కూడా చేయలేదు. ఎప్పుడైతే కిషన్ వెళ్లిపోవడం చూసి అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. కిషన్ ఏదో క్రీడా స్పూర్తి ప్రదర్శించి వెళ్లిపోయాడని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. రిప్లేలో బంతి కనీసం బ్యాట్ కి గాని గ్లౌస్కి, బాడీ కి గానీ తగిలిన ఆనవాళ్లు రిప్లేలో కన్పించలేదు. అతడు ఔటైన తర్వాత ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో కిషన్పై ఎస్ఆర్హెచ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కొంచెం అయినా తెలివి ఉందా అంటూ పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.Fairplay or facepalm? 🤯 Ishan Kishan walks... but UltraEdge says 'not out!' What just happened?!Watch the LIVE action ➡ https://t.co/sDBWQG63Cl #IPLonJioStar 👉 #SRHvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/bQa3cVY1vG— Star Sports (@StarSportsIndia) April 23, 2025Mumbai Indians players forgot the entire script, But thanks to umpire and Ishan Kishan who remembered it correctly...#SRHvsMI pic.twitter.com/dN7f5oZEub— Dr Artistic Soul (@dr_artisticsoul) April 23, 2025 -
IPL 2025: ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన ముంబై..
IPL 2025 SRH Vs MI Live updates: ఐపీఎల్-2025లో ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన ముంబై..ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 70) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40 నాటౌట్) మెరుపు మెరిపించాడు. సన్రైజర్స్ బౌలర్లలో ఉనద్కట్, మలింగ, అన్సారీ తలా వికెట్ సాధించారు. ముంబై రెండో వికెట్ డౌన్..రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన రోహిత్.. మలింగ బౌలింగ్లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 32 బంతుల్లో 14 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(26) ఉన్నాడు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. రోహిత్ శర్మ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో రోహిత్(52) తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న రోహిత్..4 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(25), విల్ జాక్స్(7) ఉన్నారు.ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్..144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్.. జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్లో ఔటయ్యాడు.చెలరేగిన క్లాసెన్.. ముంబై టార్గెట్ ఎంతంటే?టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ను క్లాసెన్ విరోచిత పోరాటంతో ఆదుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అభినవ్ మనోహర్ కీలక నాక్ ఆడాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. చాహర్ రెండు, బుమ్రా, హార్దిక్ తలా వికెట్ సాధించారు.హెన్రిచ్ క్లాసెన్ ఫిప్టీ..హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తన ఫైటింగ్ నాక్తో ఎస్ఆర్హెచ్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్తున్నాడు.15 ఓవర్లు ముగిసే సరికి సన్రైజర్స్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.దూకుడు పెంచిన క్లాసెన్..10 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(25), మనోహర్(1) ఉన్నారు.పీకల్లోతు కష్టాల్లో ఎస్ఆర్హెచ్.. 13 పరుగులకే 4 వికెట్లుఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ కేవలం 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ట్రావిస్ హెడ్(0), కిషన్(1), అభిషేక్ శర్మ(8),నితీష్ రెడ్డి(2) వరుస క్రమంలో పెవిలియన్కు చేరారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ తలా రెండు వికెట్లు సాధించారు.ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్కు భారీ షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్(0) రూపంలో సన్రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్లో హెడ్ పెవిలియన్కు చేరాడు.2 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.👉ఈ మ్యాచ్కు ముందు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా సన్రైజర్స్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఓ నిమిషం మౌనం పాటించారు.ఐపీఎల్-2025లో ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అఫీషియల్స్ నల్లటి బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు.ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. పేసర్ అశ్వినీ కుమార్ స్దానంలో విఘ్నేష్ పుత్తర్ తుది జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ఎస్ఆర్హెచ్ పక్కన పెట్టింది. అతడి స్ధానంలో జయదేవ్ ఉనద్కట్ జట్టులోకి వచ్చాడు.తుది జట్లుసన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్ -
ఇక చాలు.. పాకిస్తాన్తో క్రికెట్ ఆడొద్దు: విరాట్ కోహ్లి ఫ్రెండ్
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ క్రీడా లోకం విచారం వ్యక్తం చేస్తోంది. ఈ క్రూరమైన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ.. అందుకు బాధ్యలైన వారికి తగిన గుణపాఠం చెప్పాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి తీవ్రంగా స్పందించాడు. భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలను పూర్తిగా నిలిపివేయాలని అతడు బీసీసీఐకి లేఖకు రాశాడు. ఇందుకు సంబంధించిన లెటర్ను తన ఎక్స్ ఖాతాలో గోస్వామి పోస్ట్ చేశాడు."ఈ విషాదకర ఘటన సమయంలో నేను ఒక విషయం చెప్పాలనకుంటున్నాను. ఇకపై పాకిస్తాన్తో క్రికెట్ ఆడడం మానేయాలి. ఇప్పుడే కాదు పాక్తో పూర్తిగా క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును పాకిస్తాన్కు పంపనందుకు ఆ దేశ మాజీ క్రికెటర్లు కొంతమంది ఏదో ఏదో మాట్లాడారు.ఆటను రాజకీయాలను కలపొద్దంటూ లేనిపోని మాటలు చెప్పారు. వారు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారు. అమాయక భారతీయులను హత్య చేయడమే వారి జాతీయ క్రీడలా కనిపిస్తోంది. బ్యాట్లు, బంతులతో కాకుండా వారి బాషలోనే మనం కూడా సమాధానం చెప్పాలి" అని గోస్వామి తన నోట్లోపేర్కొన్నాడు. కాగా ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఐపీఎల్ 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన శ్రీవత్స్ గోస్వామి, ఆ తర్వాత కోల్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్లకు ప్రాతినిథ్యం వహించాడు. అదేవిధంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో కలిసి భారత్ అండర్-19 జట్టుకు గోస్వామి ఆడాడు. -
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన భారత క్రికెటర్లు..
పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. మంగళవారం దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు విచాక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.దేశ వ్యాప్తంగా ఈ టెర్రర్ ఎటాక్పై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని 140 కోట్ల మంది భారతీయలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉగ్రదాడి ఘటనను భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్తో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ మృతుల కుటంబాలకు సంతాపం తెలియజేశారు."పహల్గామ్లో అమాయక ప్రజలపై జరిగిన దారుణమైన దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు ఆ బలాన్ని చేకూర్చాలని ఆ దేవుడును ప్రార్థిస్తున్నాను"- విరాట్ కోహ్లి2 Virat Kohli pic.twitter.com/eAUtXo8hYZ— Virushka🫶❤️ (@KohliTheGOAT18) April 23, 2025"పహల్గామ్లో జరిగిన దాడి గురించి తెలిసిన వెంటనే నా హృదయం బరువెక్కిపోయింది. బాధితుల కుటంబాలకు ఆ దేవుడు తోడుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. ఇలాంటి హింసకు మన దేశంలో చోటు లేదు"- శుబ్మన్ గిల్"కశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలలకు బలం చేకూరాలని ఆ దేవడును ప్రార్థిస్తున్నాను"-కేఎల్ రాహుల్"బాధిత కుటుంబాల కోసం మనమంతా అండగా నిలుద్దాం. ఎవరైతే ఈ దుశ్చర్యకు బాధ్యులో వారు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. తప్పకుండా భారత్ స్ట్రైక్ అవుతుంది"-గౌతం గంభీర్👉భారత కెప్టెన్ రోహిత్ శర్మ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీలను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.👉పెహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, మంబై ఇండియన్స్ మధ్య జరగనున్న మ్యాచ్లో ఆటగాళ్లు నల్లటి బ్యాండ్లు ధరించి బరిలోకి దిగనున్నారు. అదేవిధంగా ఈ మ్యాచ్ను చీర్లీడర్స్ లేకుండా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాణాసంచా కూడా పేల్చవద్దు అని నిర్ణయించారు -
బంగ్లాకు భారీ షాక్.. జింబాబ్వే సంచలన విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు వారి సొంతగడ్డపై పసి కూన జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. సిల్హాట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్పై 3 వికెట్ల తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ (52) టాప్ స్కోరర్గా నిలవగా..బెన్ కుర్రాన్(44) పరుగులతో రాణించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మెహాది హసన్ మిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. తైజుల్ ఇస్లాం రెండు వికెట్లు సాధించాడు. కాగా ఇది జింబాబ్వేకు నాలుగేళ్ల తర్వాత దక్కిన తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. జింబాబ్వే బౌలర్లు చెలరేగడంతో తమ బౌలర్లు చెలరేగడంతో మొదటి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలింది.జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. న్యాయుచి, మదెవెరె చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్లో 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) పర్వాలేదన్పించారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్లో కూడా బంగ్లా బ్యాటర్లు తీరు ఏ మాత్రం మారలేదు. సెకెండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 255 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శాంటో(60), జాకీర్(58), మోమినల్(47) మినహా మిగితా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే ముందు కేవలం 174 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి పర్యాటక జట్టు చేధించింది. బంగ్లాపై జింబాబ్వేకు ఇది రెండో టెస్టు విజయం. కాగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఏప్రిల్ 28 నుంచి ఛటోగ్రామ్ వేదికగా జరగనుంది. -
సంచలన విజయం దిశగా జింబాబ్వే
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న జింబాబ్వే క్రికెట్ జట్టు.. సిల్హెట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో సంచలన విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్లో జింబాబ్వే గెలుపుకు మరో 57 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్లో జింబాబ్వే గెలిస్తే ఆరేళ్ల తర్వాత బంగ్లా గడ్డపై విజయం సాధించినట్లవుతుంది. చివరిగా జింబాబ్వే 2018 నవంబర్లో బంగ్లాదేశ్ను వారి సొంతగడ్డపై ఓడించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే కుప్పకూలింది. ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ దెబ్బకొట్టారు. బంగ్లాదేశ్కు సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోర్.బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హక్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (40), జాకిర్ అలీ (28), మహ్మదుల్ హసన్ రాయ్ (14), షద్మాన్ ఇస్లాం (12), హసన్ మహమూద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం 4, మెహిది హసన్ మిరాజ్ 1, తైజుల్ ఇస్లాం 3, నహిద్ రాణా డకౌటయ్యారు. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (57), సీన్ విలియమ్స్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్కీపర్ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్ నగరవ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.మిగతా బ్యాటర్లలో బెన్ కర్రన్ 18, నిక్ వెల్చ్ 2, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 8, వెల్లింగ్టన్ మసకద్జ 6, ముజరబానీ 17, న్యాయుచి 7 పరుగులకు ఔటయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్ రాణా 3, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.82 వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చి 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో జింబాబ్వే ముందు కేవలం 174 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే అద్భుతంగా ఆడుతూ విజయం దిశగా సాగుతుంది. నాలుగో రోజు టీ విరామం సమయానికి జింబాబ్వే గెలుపుకు 57 పరగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్లో జింబాబ్వే స్కోర్ 117/2గా ఉంది. బ్రియాన్ బెన్నెట్ (52), సీన్ విలియమ్స్ (0) క్రీజ్లో ఉన్నారు. -
ఇలాంటివన్ని పాకిస్తాన్ క్రికెట్లోనే జరుగుతాయి.. సహచరుడికే ఇచ్చి పడేసిన బౌలర్
చిత్రవిచిత్ర ఘటనలన్నీ పాకిస్తాన్ క్రికెట్లోనే జరుగుతాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో భాగంగా ఓ ఆటగాడు వికెట్ తీసిన ఆనందంలో సొంత జట్టు ఆటగాడిపైనే దాడి చేశాడు (అనుకోకుండా). ఈ ఘటనలో బాధిత ఆటగాడి తలకు గాయమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది.Update: Everyone is ok 🤗Khel Khel main 😄#HBLPSLX l #ApnaXHai l #MSvLQ pic.twitter.com/sJBcX91wai— PakistanSuperLeague (@thePSLt20) April 22, 2025ఇంతకీ ఏం జరిగిందంటే.. పీఎస్ఎల్ 2025లో భాగంగా నిన్న లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ లాహోర్ ఖలందర్స్పై 33 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది. ఖలందర్స్ను సుల్తాన్స్ బౌలర్ ఉబైద్ షా 3 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు.ఈ ఉబైద్ షానే ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వికెట్ (సామ్ బిల్లింగ్స్) తీసిన ఆనందంలో పొరపాటున సహచరుడు ఉస్మాన్ ఖాన్ (వికెట్కీపర్) తలపై దాడి చేశాడు. వికెట్ తీశాక సంబరాల్లో భాగంగా ఉబైద్ షా సహచరులకు హై ఫై ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఉస్మాన్ ఖాన్ కూడా తన చేయి పైకి లేపాడు. అప్పటికే జోరుమీదున్న ఉబైద్.. పొరపాటు ఉస్మాన్ చేయిపై కాకుండా తలపై హై ఫై ఇచ్చాడు. ఈ ఘటనతో దిమ్మతిరిగిపోయిన ఉస్మాన్ తల పట్టుకుని నేల వాలాడు. ఇది చూసి మైదానంలో ఉన్న వారంతా పక్కున నవ్వుకున్నారు.ఊహించని చర్యతో షాక్కు గురైన ఉస్మాన్ కొద్ది సేపు మైదానంలో పడిపోయాడు. ఫిజియో పరిశీలించాక ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఉస్మాన్ మ్యాచ్లో కొనసాగాడు. ఈ ఘటన కారణంగా మ్యాచ్కు కొద్ది సేపు అంతరాయం కలిగింది. కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్-2025 గత కొన్ని రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ లీగ్లోని ఓ ఫ్రాంచైజీ (కరాచీ కింగ్స్) బాగా రాణించిన తమ ఆటగాళ్లకు హెయిర్ డ్రయర్లు, హెయిర్ ట్రిమ్మర్లు బహుమతులగా ఇచ్చి నవ్వులపాలైంది. ఈ ఏడాది పీఎస్ఎల్ ఐపీఎల్కు పోటీగా ఒకే సమయంలో జరుగుతుంది. ఐపీఎల్ కంటే తమ లీగే గొప్పదంటూ ఢాంబికాలకు పోయిన పాక్ క్రికెట్ బోర్డు ఇలా చేసింది. తీరా చూస్తే ఐపీఎల్ కారణంగా ఒకరిద్దరున్న పీఎస్ఎల్ అభిమానులు కూడా ఆ లీగ్ను చూడటం మానేశారు. ఐపీఎల్తో పోటీ కారణంగా ఈ సీజన్లో పీఎస్ఎల్ అభిమానులు ఒక్కసారిగా తగ్గిపోయారు. స్టేడియంలో స్టాండ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక పాక్ క్రికెట్ బోర్డు అధికారులు తలలు పట్టుకుని కూర్చున్నారు. -
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు (ఏప్రిల్ 23) ఐపీఎల్లో జరుగబోయే సన్రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్కు ముందు ఓ నిమిషం మౌనం పాటించాలని నిర్ణయించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అఫీషియల్స్ నల్లటి బ్యాండ్లు ధరించాలని పిలుపునిచ్చింది. మ్యాచ్ సమయంలో బాణసంచా కాల్చకూడదని గైడ్ లైన్స్ జారీ చేసింది. మ్యాచ్ సందర్భంగా చీర్ లీడర్ల ప్రదర్శనలు ఉండవని స్పష్టం చేసింది.కాగా, కశ్మీర్లోని పహల్గామ్లో నిన్న (ఏప్రిల్ 22) మధ్యాహ్నం భయానమైన ఉగ్రవాద దాడి జరిగింది. పహల్గామ్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు. 2019 పుల్వామా దాడి తర్వాత కశ్మీర్లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడి ఇదే. ఈ విషాద ఘటనతో దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. బీసీసీఐ సహా భారత క్రికెటర్లు బాధితులకు నివాళులర్పించి, సంతాపం తెలియజేశారు.ఇదిలా ఉంటే, ఇవాళ (ఏప్రిల్ 23) రాత్రి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు తలపడటం ఇది రెండోసారి. ఏప్రిల్ 17న తమ హోం గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ముంబై హైదరాబాద్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో సన్రైజర్స్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్లో ఓడితే సన్రైజర్స్ అనధికారికంగా లీగ్ నుంచి నిష్క్రమించినట్లే. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్కు కూడా కీలకమే. ఆ జట్టు కూడా ఈ మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఈ సీజన్లో సన్రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో ఐదింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ముంబై 8 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి ఆరో స్థానంలో కొనసాగుతుంది.నేటి మ్యాచ్ సన్రైజర్స్ తమ సొంత ఇలాకాలో ఆడుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. తమ విధ్వంసకర ఆటగాళ్లు ఈ మ్యాచ్లో తప్పక చెలరేగుతారని సన్రైజర్స్ అభిమానులు ఆశిస్తున్నారు. సన్రైజర్స్కు హోం గ్రౌండ్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ ఆడిన మ్యాచ్ల్లో ఆ జట్టు ఆటగాళ్లు పేట్రేగిపోయారు. నేటి మ్యాచ్లో అదే జోరు కొనసాగిస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. తుది జట్లు (అంచనా)సన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (c), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (wk), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్ -
PSL 2025: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ టీ20ల్లో అత్యంత అరుదైన 13000 పరుగుల క్లబ్లో చేరాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో కరాచీ కింగ్స్కు ఆడుతున్న వార్నర్.. పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్లో ఈ మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ (47 బంతుల్లో 60; 8 ఫోర్లు) చేసిన వార్నర్.. పొట్టి క్రికెట్లో 13000 పరుగులు పూర్తి చేసిన ఆరో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన మూడో ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. వార్నర్ 403 ఇన్నింగ్స్ల్లో 13000 పరుగులు పూర్తి చేశాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ కేవలం 381 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. గేల్ తర్వాత విరాట్ కోహ్లి (386 ఇన్నింగ్స్ల్లో) అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించాడు.టీ20ల్లో 13000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్ గేల్- 14562అలెక్స్ హేల్స్- 13610షోయబ్ మాలిక్- 13571కీరన్ పోలార్డ్- 13537విరాట్ కోహ్లి- 13208డేవిడ్ వార్నర్- 13019టీ20ల్లో అత్యంత వేగంగా 13000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్ గేల్- 381 ఇన్నింగ్స్లువిరాట్ కోహ్లి- 386డేవిడ్ వార్నర్- 403అలెక్స్ హేల్స్- 474షోయబ్ మాలిక్- 487కీరన్ పోలార్డ్- 594కరాచీ కింగ్స్, పెషావర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ రాణించడంతో పెషావర్ జల్మీపై కరాచీ కింగ్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది.పెషావర్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (46) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో మహ్మద్ హరీస్ (28), అల్జరీ జోసఫ్ (24 నాటౌట్), తలాత్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. సైమ్ అయూబ్ 4, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ 7, మిచెల్ ఓవెన్ 5, అబ్దుల్ సమద్ 2, లూక్ వుడ్ 2 పరుగులకు ఔటయ్యారు. కరాచీ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో 3 వికెట్లు తీయగా.. ఆమెర్ జమాల్, మీర్ హమ్జా చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ కూడా ఒక్కో పరుగు సాధించేందుకు చాలా ఇబ్బంది పడింది. అతి కష్టం మీద ఆ జట్టు 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కరాచీ గెలుపుకు ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (60) గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. అయితే చివర్లో ఖుష్దిల్ షా (23 నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేసి కరాచీని విజయతీరాలకు చేర్చాడు. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ 3, అలీ రజా 2, అల్జరీ జోసఫ్, ఆరిఫ్ యాకూబ్ తలో వికెట్ పడగొట్టారు. -
LSG VS DC: ఆ కారణం చెప్పి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు: పంత్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 22) రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ, ఎల్ఎస్జీ తలపడ్డాయి. లక్నో హోం గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. మార్క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) తొలి వికెట్కు 10 ఓవర్లలో 87 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చినా ఆ ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు సరిగ్గా ఆడకపోవడంతో లక్నో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆఖర్లో ఆయుశ్ బదోని (21 బంతుల్లో 36) బ్యాట్ ఝులిపించడంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన పంత్ రెండు బంతులు ఆడి డకౌటయ్యాడు. మార్క్రమ్ ఔటయ్యాక మూడో స్థానంలో బ్యాటింగ్కు రావాల్సిన పంత్ ఆఖరి ఓవర్లో బ్యాటింగ్కు రావడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్లో ఆటగాడిగానే కాకుండా, కెప్టెన్గా కూడా విఫలమైన పంత్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్లో లక్నోకు ఢిల్లీ చేతిలో ఇది రెండో ఓటమి. వైజాగ్లో జరిగిన తొలి మ్యాచ్లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది.నిన్నటి మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చాలా బాధగా కనిపించాడు. ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 20 పరుగులు తక్కువ చేశామని తెలుసు. ఈ మైదానంలో టాస్ చాలా కీలకపాత్ర పోషిస్తుంది. తొలుత బౌలింగ్ చేసే జట్టుకు వికెట్ నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఛేజింగ్ సమయంలో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. ఈ పిచ్పై ఇది ఎప్పుడూ జరిగేదే. దీన్ని సాకుగా చూసి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు.బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కు వెళ్లడంపై స్పందిస్తూ.. వికెట్ తీరును సద్వినియోగం చేసుకుంటాడని సమద్ను ముందుగా పంపాము. మిల్లర్ను సైతం అదే ఉద్దేశంతో నా కంటే ముందు బరిలోకి దించాము. వికెట్ తీరు ముందు ఇవేవి వర్కౌట్ కాలేదు. తదుపరి మ్యాచ్లపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు. బృంద సభ్యులందరం కలిసి కూర్చుంటాము. అప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్పై డిస్కస్ చేస్తాము. ఈ ఓటమిని ఇక్కడే మరచిపోయే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాము. ఈ మ్యాచ్లో ఓడినా లక్నో పాయింట్ల పట్టికలో మరో స్థానం కిందికి దిగజారలేదు. అయితే రన్రేట్ మాత్రం మైనస్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు -0-054 రన్రేట్తో ఐదో స్థానంలో (10 పాయింట్లు) కొనసాగుతుంది. గుజరాత్, ఢిల్లీ చెరి 12 పాయింట్లతో టాప్-2లో ఉండగా.. ఆర్సీబీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీత్ స్టాక్పోల్ (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను గుండెపోటుతో మరణించారని తెలుస్తుంది. కీత్కు 60వ దశకంలో మంచి బ్యాటర్గా పేరుంది. లెగ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన కీత్ ఆస్ట్రేలియా తరఫున 43 టెస్ట్లు, 6 వన్డేలు ఆడి 7 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు చేశాడు.1966లో ఇంగ్లండ్పై మిడిలార్డర్ బ్యాటర్గా కెరీర్ ప్రారంభించిన కీత్.. 1969లో ఓపెనర్గా మారాడు. ఆ సమయంలో అతను బిల్ లారీతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ను ప్రారంభించేవాడు. కీత్కు ఇంగ్లండ్పై మంచి ట్రాక్ రికార్డు ఉంది. 1972 యాషెస్ సిరీస్లో అతను 53.88 సగటున 3 సెంచరీల సాయంతో 485 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. కీత్ తన కెరీర్ బెస్ట్ స్కోర్ 207 పరుగులను కూడా ఇంగ్లండ్పైనే చేశాడు. కీత్ 1973లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. కీత్ మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బెయిర్డ్ సంతాపం వ్యక్తం చేశారు. దేశవాలీ క్రికెట్లో విక్టోరియాకు ప్రాతినిథ్యం వహించిన కీత్.. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 10100 పరుగులు చేసి 148 వికెట్లు పడగొట్టాడు. కీత్ రిటైర్మెంట్ (1974) తర్వాత టీవీ మరియు రేడియో వ్యాఖ్యాతగా కూడా పని చేశారు. కీత్ చాలామంది ఆసీస్ ప్లేయర్లకు మెంటార్గా కూడా పని చేశాడు. కీత్.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొట్టమొదటి వన్డేలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్లో అతను 3 వికెట్లు తీశాడు. -
LSG VS DC: పంత్పై మండిపడుతున్న అభిమానులు.. గొయెంకాకు సరైన శాస్తి జరిగింది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చెత్త ప్రదర్శన కొనసాగుతుంది. నిన్న (ఏప్రిల్ 22) ఢిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి రెండు బంతులు ఆడి డకౌటయ్యాడు. ఈ సీజన్లో పంత్కు ఇది రెండో డకౌట్.ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో పంత్ కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ చెత్త ఆటతీరు, కెప్టెన్గా తీసుకున్న చెత్త నిర్ణయాలు నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో లక్నో కొంపముంచాయి. ఓపెనర్లు మార్క్రమ్, మార్ష్ మంచి ఆరంభం ఇచ్చినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో లక్నో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించారు.వరుస వైఫల్యాల నేపథ్యంలో పంత్ భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నాడు. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా రాహుల్ లాంటి ఆణిముత్యాన్ని వదులుకుని పంత్ లాంటి చెత్తను రూ. 27 కోట్లకు కొనుక్కున్నాడని కామెంట్లు చేస్తున్నారు. రాహుల్ను కాదనుకుని ఎంతో నమ్మకంతో కెప్టెన్సీ కూడా కట్టబెడితే ఇదేనా వెలగబెట్టేదని మండిపడుతున్నారు. పంత్కు 27 లక్షలు కూడా దండగే అని అంటున్నారు. ఈ దెబ్బతో పంత్ పని అయిపోయిందని చర్చించుకుంటున్నారు.కాగా, నిన్నటి మ్యాచ్లో పంత్ ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గా కూడా ఘోరంగా విఫలమయ్యాడు. మార్క్రమ్ ఔటైన తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్కు రాకుండా పెద్ద తప్పిదమే చేశాడు. మూడో స్థానంలో కాకపోయినా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చినా లక్నో ఓ మోస్తరుకు మించి భారీ స్కోరే చేసేది. బ్యాటింగ్లో విఫలం కావడంతో పంత్ ఫీల్డింగ్ సమయంలో చాలా చిరాకుగా ఉన్నాడు. సహచరులపై అరుస్తూ కనిపించాడు. బౌలర్లను సరిగ్గా రొటేట్ చేయలేకపోయాడు. ఫలితంగా రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ రెచ్చిపోయారు.రాహుల్ గత సీజన్లో లక్నో యజమాని సంజీవ్ గొయెంకా చేతిలో ఎదురైన అవమానానికి నిన్నటి మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకున్నాడు. రాహుల్ గొయెంకాకు బ్యాట్తో బుద్ది చెప్పడమే కాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత అసలు రివెంజ్ తీర్చుకున్నాడు. గొయెంకా కరచాలనం చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేయగా రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఆ సమయంలో గొయెంకా పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ. లోలోపల రాహుల్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు బెంబేలెత్తిపోయుంటాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్కు ఇచ్చి పడేసిన రాహుల్
గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా తన పట్ల వ్యవహరించిన తీరుకు నాటి లక్నో కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీపై విజయానంతరం గొయెంకా కరచాలనం చేస్తూ తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. రాహుల్ చర్యకు గొయెంకా సహా మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటబ్బా రాహుల్ ఇలా ప్రవర్తించాడని అనుకున్నారు.THE COMEBACK MAN - KL RAHUL. 🦁 pic.twitter.com/EQ67LvjLVl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2025అయితే దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. గత సీజన్లో సన్రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా రాహుల్ను బహిరంగంగా అవమానించాడు. అందరి ముందు నిలదీశాడు. గొయెంకా చర్యకు మనసు నొచ్చుకున్న రాహుల్ లక్నోను వీడి ఢిల్లీ పంచన చేరాడు. ఇప్పుడు అవకాశం రావడంతో లక్నో ఓనర్కు తన ఆటతీరుతోనే బుద్ది చెప్పాడు. తనను ఘోరంగా అవమానించిన గొయెంకాపై వారి సొంత మైదానంలోనే ప్రతీకారం తీర్చుకున్నాడు. Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో రాహుల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఢిల్లీని గెలిపించాడు. సిక్సర్తో మ్యాచ్ ముగించి గొయెంకాకు తానేమి చేయగలనో నిరూపించాడు. ఈ సీజన్లో లక్నోపై ఢిల్లీకి ఇది రెండో విజయం. వైజాగ్లో జరిగిన తొలి మ్యాచ్లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో రాహుల్ ఆ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచే గొయెంకాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసిన రాహుల్.. నిన్న అవకాశం రావడంతో తన దెబ్బను రుచి చూపించాడు. ఈ సీజన్లో రాహుల్ మాంచి కసితో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 323 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్లో రాహుల్ ఓ భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఎల్ఎస్జీలో రాహుల్ ప్రస్తానంలక్నో ఐపీఎల్ అరంగేట్రం నుంచి కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్.. తొలి రెండు సీజన్లలో (2022, 2023) ఆ జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చాడు. అయితే గత సీజన్లో రాహుల్ లక్నోను ప్లే ఆఫ్స్కు చేర్చలేకపోయాడు. గత సీజన్లో నెమ్మదిగా ఆడుతున్నాడని కూడా రాహుల్పై విమర్శలు వచ్చాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
ఉప్పల్లో సన్‘రైజ్’ అయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 18వ సీజన్లో నిలకడ కనబర్చలేకపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఏడు మ్యాచ్లాడి 2 విజయాలు 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న సన్రైజర్స్... బుధవారం మరో మారు ముంబై ఇండియన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. గత గురువారం వాంఖడే వేదికగా ముంబైతోనే తమ చివరి మ్యాచ్ ఆడిన ఎస్ఆర్హెచ్... స్వల్ప విరామం అనంతరం మరోసారి ముంబైతోనే తలపడుతోది. ఈ సీజన్లో ఆడితే బ్రహ్మండం... లేదంటే శూన్యం అన్నట్లు సాగుతున్న హైదరాబాద్... ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలుపు తప్పనిసరి. జట్టులో లెక్కకు మిక్కిలి హిట్టర్లు ఉన్నా... వారంతా కలిసి కట్టుగా కదం తొక్కలేకపోతుండటమే ఎస్ఆర్హెచ్ను ఇబ్బంది పెడుతోంది. సొంతగడ్డపై బీభత్సం సృష్టించే ఆరెంజ్ ఆర్మీ... ఉప్పల్లో అయినా తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది. మరోవైపు గత మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఫామ్లోకి వచ్చిన ముంబై ఇండియన్స్... అదే జోరు కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో పైపైకి దూసుకెళ్లాలని భావిస్తోంది. తాజా సీజన్లో ఆడిన తొలి 5 మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయమే సాధించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత గాడిన పడింది. స్టార్ పేసర్ బుమ్రా వచ్చాక బౌలింగ్ మరింత రాటుదేలగా... గత మ్యాచ్తో హిట్మ్యాన్ రోహిత్ శర్మ లయ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉప్పల్లో సన్రైజర్స్ పరుగుల ఉప్పెన సృష్టిస్తుందా లేక ముంబై గెలుపు జోరు కొనసాగుతుందా చూడాలి! టాపార్డర్ రాణిస్తేనే... గతేడాది నిలకడైన ప్రదర్శనతో రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ జట్టు... ఈసారి అదే తీవ్రత కొనసాగించలేకపోతోంది. తొలి పోరులో భారీ స్కోరు చేసి ప్రత్యర్థులను బెదరగొట్టిన రైజర్స్... ఆ తర్వాత మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది, ఎస్ఆర్హెచ్ తరఫున ఆడిన తొలి పోరులోనే సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత ఆకట్టుకోలేకపోతుండగా... గత సీజన్లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు’ దక్కించుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమవుతూ ఉన్నాడు. ఓపెనర్లు అభిõÙక్ శర్మ, ట్రావిస్ హెడ్పై జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. దానికి తగ్గట్లు వీరిద్దరు ఆడిన రోజు టీమ్ మొత్తం చెలరేగుతుండగా... ఓపెనర్లు విఫలమైన సందర్భంలో మాత్రం ఓ మాదిరి స్కోరు చేసేందుకు కూడా తడబడుతోంది. మిడిలార్డర్లో క్లాసెన్, అనికేత్ వర్మ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్లో ఇషాన్, నితీశ్ కూడా గాడిన పడాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. అటు బౌలింగ్లోనూ రైజర్స్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. కెప్టెన్ కమిన్స్తో పాటు టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుండగా... ఇషాన్ మలింగ, జీషన్ అన్సారీపై అధిక భారం పడుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. అయితే అది వాంఖడేలోని కాస్త టరి్నంగ్ పిచ్కాగా... ఉప్పల్ ఫ్లాట్ పిచ్పై ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తికరం. ‘హ్యాట్రిక్’తో జోరుమీదున్న ముంబై ఎప్పట్లాగే ఈసారి కూడా పరాజయాలతోనే సీజన్ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత పుంజుకుంది. గత మూడు మ్యాచ్లను పరిశీలిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై విజయాలు సాధించింది. చెన్నైతో పోరు ద్వారా రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం ఆ జట్టుకు అదనపు బలాన్నిస్తోంది. రోహిత్, సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్కే నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు 15.4 ఓవర్లలోనే అధిగమించింది. హైదరాబాదీ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్ ధీర్తో మిడిలార్డర్ కూడా బలంగా ఉంది. బౌలింగ్లోనూ ముంబైకి పెద్దగా ఇబ్బందులు లేవు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన స్టార్ పేసర్ బుమ్రా మునుపటి వేగం అందిపుచ్చుకోగా... బౌల్ట్, దీపక్ చహర్ అతడికి సహకరిస్తున్నారు. సాంట్నర్, అశ్వని కుమార్ మరోసారి కీలకం కానున్నారు. అయితే సొంతగడ్డపై ఎంతటి బౌలింగ్ బృందాన్ని అయినా చిత్తు చేయగల ఆరెంజ్ ఆర్మీ హిట్టర్లను ముంబై బౌలర్లు ఏమేరకు అడ్డుకుంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. తుదిజట్లు (అంచనా) సన్రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, షమీ, జీషాన్ అన్సారీ, ఇషాన్ మలింగ, రాహుల్ చహర్. ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చహర్, కరణ్ శర్మ, బౌల్ట్, బుమ్రా.10 సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్లు జరగగా... అందులో హైదరాబాద్ జట్టు 10 విజయాలు సాధించింది. మరో 14 మ్యాచ్ల్లో ముంబై గెలుపొందింది. -
ఢిల్లీ మళ్లీ...
దాదాపు నెల రోజుల క్రితం... వైజాగ్లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది... ఇప్పుడు ప్రత్యర్థి వేదికపై సాగిన మ్యాచ్లో ఢిల్లీ మళ్లీ ఆధిక్యం ప్రదర్శిస్తూ లక్నోపై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. క్యాపిటల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్కు సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరుకే పరిమితం కాగా, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా క్యాపిటల్స్ అలవోకగా మరో 13 బంతుల ముందే విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో ఆడని రాహుల్... ఈసారి హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్కు ఇరుసుగా నిలిచాడు. తనను గత ఏడాది అవమానించిన పాత జట్టు లక్నో వేదికపై సిక్స్తో మ్యాచ్ను ముగించి సంతృప్తిగా నిలబడ్డాడు. లక్నో: తొలి ఐపీఎల్ టైటిల్ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో కీలక విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మార్క్రమ్ (33 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... మిచెల్ మార్ష్(36 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆయుష్ బదోని (21 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముకేశ్ కుమార్ (4/33) లక్నోను పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు), అభిషేక్ పొరేల్ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... కెప్టెన్ అక్షర్ పటేల్ (20 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ల శుభారంభం... తొలి వికెట్కు 59 బంతుల్లో 87 పరుగులు భాగస్వామ్యం... ఈ సమయంలో లక్నో స్థితి చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. అయితే ఓపెనర్లు మార్క్రమ్, మార్ష్ఇచ్చిన ఈ ఘనారంభాన్ని ఆ తర్వాత జట్టు వృథా చేసుకుంది. పవర్ప్లేలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఓపెనర్లు 6 ఓవర్లు ముగిసేసరికి 3 ఫోర్లు, 3 సిక్స్లతో స్కోరును 51 పరుగులకు చేర్చారు. ఆ తర్వాత చమీరా ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, స్టార్క్ చక్కటి బంతితో పూరన్ (9)ను బౌల్డ్ చేశాడు. అనంతరం ముకేశ్ ఒకే ఓవర్లో సమద్ (2), మార్ష్ లను అవుట్ చేయడంతో లక్నో కష్టాలు పెరిగాయి. 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయాక పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. అయితే ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన బదోని కాస్త ప్రభావం చూపించాడు. ముకేశ్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. వరుసగా వికెట్లు పడుతున్నా... సమద్, మిల్లర్ (14 నాటౌట్), బదోని తర్వాత ఇన్నింగ్స్లో మరో రెండు బంతులు ఉండగా ఏడో స్థానంలో రిషభ్ పంత్ (0) బ్యాటింగ్కు రావడం ఆశ్చర్యం కలిగించింది. టాస్ సమయంలో కుడి చేతికి కట్టుతో కనిపించిన పంత్ సమస్యేమీ లేదని చెప్పాడు. కీలక భాగస్వామ్యం... శార్దుల్ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లతో 15 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ ఛేదన మొదలైంది. కరుణ్ నాయర్ (15) తొందరగానే అవుటైనా... పొరేల్, రాహుల్ కలిసి చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్ను నడిపించడంతో పవర్ప్లేలో జట్టు 54 పరుగులు సాధించింది. రవి బిష్ణోయ్ ఓవర్లో 2 సిక్స్లతో 16 పరుగులు రాబట్టి ఢిల్లీ ధాటిని పెంచింది.33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పొరేల్ వెనుదిరిగాడు. పొరేల్, రాహుల్ రెండో వికెట్కు 49 బంతుల్లో 69 పరుగులు జత చేశారు. అయితే ఆ తర్వాత రాహుల్, అక్షర్ కలిసి సునాయాసంగా జట్టును గెలుపు దిశగా నడిపించారు. రాహుల్, అక్షర్ మూడో వికెట్కు 36 బంతుల్లో అభేద్యంగా 56 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) స్టబ్స్ (బి) చమీరా 52; మార్ష్(బి) ముకేశ్ 45; పూరన్ (బి) స్టార్క్ 9; సమద్ (సి) అండ్ (బి) ముకేశ్ 2; మిల్లర్ (నాటౌట్) 14; బదోని (బి) ముకేశ్ 36; పంత్ (బి) ముకేశ్ 0; ఎక్స్ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–87, 2–99, 3–107, 4–110, 5–159, 6–159. బౌలింగ్: అక్షర్ 4–0–29–0, స్టార్క్ 4–0–25–1, ముకేశ్ 4–0–33–4, చమీరా 3–0–25–1, విప్రాజ్ 1–0–14–0, కుల్దీప్ 4–0–33–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) మిల్లర్ (బి) మార్క్రమ్ 51; కరుణ్ నాయర్ (బి) మార్క్రమ్ 15; రాహుల్ (నాటౌట్) 57; అక్షర్ (నాటౌట్) 34; ఎక్స్ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–36, 2–105. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 2–0–28–0, దిగ్వేశ్ రాఠీ 4–0–24–0, ప్రిన్స్ 2.5–0–23–0, మార్క్రమ్ 3–0–30–2, అవేశ్ ఖాన్ 3–0–19–0, రవి బిష్ణోయ్ 3–0–36–0. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ xముంబై వేదిక: హైదరాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 5000 పరుగుల మైలు రాయిని అందుకున్న క్రికెటర్గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. కేవలం 130 ఇన్నింగ్స్లలోనే కేఎల్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్(135) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో వార్నర్ రికార్డును రాహుల్ బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ఐదు వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఐదో క్రికెటర్గా రాహుల్ నిలిచాడు. రాహుల్కు ముందు విరాట్ కోహ్లి (8326), రోహిత్ శర్మ (6786), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ధోని (5377), ఏబీ డివిలియర్స్ (5162) ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నోపై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. -
చెలరేగిన కేఎల్ రాహుల్.. లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి కమ్బ్యాక్ ఇచ్చింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది.ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. మిగితా లక్నో బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.మార్క్రమ్ హాఫ్ సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. లక్నో ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం అందించినప్పటికి, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమకావడంతో నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది.లక్నో బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్(52) టాప్ స్కోరర్గా నిలవగా..మిచెల్ మార్ష్(45), ఆయూష్ బదోని(36) రాణించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, చమీరా తలా వికెట్ సాధించారు. -
అతడొక అద్బుతం.. చాలా క్లాస్గా ఆడుతున్నాడు: రాయుడు
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్ దుమ్ములేపుతున్నాడు. ప్రతీ మ్యాచ్లోనూ పరుగులు సాధించి గుజరాత్ జైత్ర యాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సోమవారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లోనూ సుదర్శన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన సుదర్శన్.. 50 కంటే ఎక్కువ సగటుతో 417 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సుదర్శన్పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల వర్షం కురిపించాడు. టీ 20 క్రికెట్ను ట్రేడిషనల్గా ఎలా ఆడాలో సుదర్శన్ చూపిస్తున్నాడని అతడు కొనియాడాడు."సాయిసుదర్శన్ అద్బుతంగా ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్ చూసేందుకు రెండు కళ్లు సరిపోవడం లేదు. చాలా సంతోషంగా ఉంది. అతడు క్లాసికల్ బ్యాటర్గా ఆడుతున్నాడు. క్రికెట్ను సాంప్రదాయ పద్ధతిలో ఎలా ఆడవచ్చో తన బ్యాటింగ్తో చూపిస్తున్నాడు. సుదర్శన్ బంతి వేగాన్ని సరిగ్గా ఉపయోగించుకుని స్మార్ట్ క్రికెట్ ఆడుతున్నాడు.ప్రతీ మ్యాచ్లో పరుగులు సాధించడం అతడి ఆత్మవిశ్వాస్వాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. సుదర్శన్ అద్భుత ఫామ్ జట్టు మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. అందరు ఆటగాళ్లు ఒకే లయలో ఆడతారు. ప్రస్తుతం గుజరాత్ టీమ్లో అదే మనం చూస్తున్నాము" అని జియో స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: టీమిండియా క్రికెటర్ మంచి మనసు.. రూ.7 లక్షల ఆర్ధిక సాయం -
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేసిన పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది. మే రెండో వారంలో భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.అయితే ఇంగ్లండ్ టూర్కు తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్ను ఎంపిక చేసే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సుదర్శన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ దుమ్ములేపుతున్నాడు. సుదర్శన్ ఇప్పటికే టీ20, వన్డేల్లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు టెస్టుల్లో డెబ్యూ చసే సూచనలు కన్పిస్తున్నాయి. అతడికి ఇంగ్లండ్ రెడ్-బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. సుదర్శన్ కౌంటీ క్రికెట్లో సర్రే తరపున ఆడాడు. అదేవిధంగా మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రజిత్ పాటిదార్లకు తిరిగి పిలుపునివ్వాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయ్యర్, పాటిదార్ ఇద్దరూ గతేడాది భారత టెస్టు జట్టుకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉండడంతో ఎంపిక చేయనున్నట్లు వినికిడి. మిడిలార్డర్లో అప్షన్స్ కోసం సెలక్టర్లు వెతుకుతున్నారు. సుదర్శన్, పాటిదార్, అయ్యర్లను ముందే ఇంగ్లండ్కు పంపించే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరు ముగ్గురు భారత-ఎ జట్టు తరపున ఇంగ్లండ్ లయన్స్తో అధికారిక టెస్టు సిరీస్ ఆడనున్నారు. -
IPL 2025 LSG vs DC: లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
IPL 2025 LSG vs DC Live Updates: ఐపీఎల్-2025లో ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి.లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయంఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. మిగితా లక్నో బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..అభిషేక్ పోరెల్(51) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. మార్క్రమ్ బౌలింగ్లో పోరెల్ ఔటయ్యాడు. ఢిల్లీ 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(40), అక్షర్ పటేల్(17) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ160 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(50), రాహుల్(28) ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..కరుణ్ నాయర్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన నాయర్.. మార్క్రమ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 3.4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 36/1నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నోఎక్నా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్(52) టాప్ స్కోరర్గా నిలవగా..మిచెల్ మార్ష్(45), ఆయూష్ బదోని(36) రాణించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, చమీరా తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు లక్నో స్కోర్: 130/414వ ఓవర్లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్లో తొలి బంతికి అబ్దుల్ సమద్ ఔట్ కాగా.. ఆఖరి బంతికి మిచెల్ మార్ష్(45) క్లీన్ బౌల్డయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో మిల్లర్(11), బదోని(10) పరుగులతో ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్నికోలస్ పూరన్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన పూరన్.. స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.లక్నో తొలి వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన దుష్మాంత చమీరా బౌలింగ్లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు లక్నో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది.మార్క్రమ్ ఫిప్టీ..లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మార్క్రమ్, మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(32), మార్క్రమ్(50) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న లక్నో.. మూడు ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో మర్క్రమ్(13), మిచెల్ మార్ష్(6) ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. సెకెండ్ రౌండ్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓ మార్పుతో బరిలోకి దిగింది. మోహిత్ శర్మ స్దానంలో దుష్మాంత చమీరా తుది జట్టులో వచ్చాడు. లక్నో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ -
టీమిండియా క్రికెటర్ మంచి మనసు.. రూ.7 లక్షల ఆర్ధిక సాయం
టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే తన మంచి మనసును చాటుకున్నాడు. తమిళనాడుకు చెందిన పది మంది యువ, ప్రతిభావంతులైన క్రీడాకారులకు రూ.7 లక్షల ఆర్ధిక సాయాన్ని దూబే చేశాడు. మంగళవారం జరిగిన తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TNSJA) అవార్డ్స్ అండ్ స్కాలర్షిప్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో యంగ్ అథ్లెట్స్కు దూబే చెక్లను అందజేశాడు.ఈ కార్యక్రమానికి దూబే ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అదేవిధంగా యువ అథ్లెట్లకు వారి విజయాలకు గుర్తింపుగా తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కూడా రూ. 30,000 స్కాలర్షిప్లను అందజేసింది. ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ.. "ఈ కార్యక్రమం యువ అథ్లెట్లందరికీ చాలా ప్రోత్సాహకరంగా ఉందని నేను భావిస్తున్నాను.ఈ చిన్న విజయాలను గుర్తించి వారిలో కొత్త ఉత్సహాన్ని తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నింపుతోంది. వారు మరింత కష్టపడి పనిచేసి దేశానికి గర్వకారణంగా నిలుస్తారు ఆశిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రామానికి నన్ను ఆహ్వానించిందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముంబైలో కూడా ఇటువంటి కార్యాక్రమాలు నేను చూశాను. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా యువ క్రీడాకారులకు మద్దతునిచ్చే పోగ్రామ్స్ నిర్వహిస్తుండడం చాలా సంతోషంగా ఉందని" అన్నాడు.నగదు సాయం అందుకున్న తమిళనాడు అథ్లెట్లు వీరే..పిబి అభినంద్ (టేబుల్ టెన్నిస్)కెఎస్ వెనిస శ్రీ (ఆర్చరీ)ముత్తుమీనా వెల్లసామి (పారా అథ్లెటిక్స్)షమీనా రియాజ్ (స్క్వాష్)ఎస్ నంధన (క్రికెట్)కమలి పి (సర్ఫింగ్)ఆర్ అభినయ (అథ్లెటిక్స్)ఆర్సి జితిన్ అర్జునన్ (అథ్లెటిక్స్)తక్షంత్ (చెస్)జయంత్ ఆర్కే (క్రికెట్) -
పాకిస్తాన్ హెడ్ కోచ్గా ఆర్సీబీ మాజీ డైరెక్టర్..?
పాకిస్తాన్ పురుషల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి ఆకిబ్ జావేద్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాక్ ఘోర ప్రదర్శన అనంతరం జావేద్ తన పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో హెడ్ కోచ్ లేకుండానే పాక్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది.అక్కడ కూడా అదే తీరును మెన్ ఇన్ గ్రీన్ కనబరిచింది. పాక్ జట్టు ఈ ఏడాది జూలై ఆఖరిలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ వ్యవధిలో తమ జట్టు కొత్త హెడ్ కోచ్ను ఎంపిక చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. పాకిస్తాన్ హెడ్ కోచ్ రేసులో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్రికెట్ మాజీ డైరెక్టర్ మైక్ హెస్సన్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే అతడితో పీసీబీ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.హెస్సన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రధాన కోచ్గా ఉన్నాడు. అతడి నేతృత్వంలోనే ఇస్లామాబాద్ యునైటెడ్ గతేడాది పీఎస్ఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్లో కోచ్గా అతడికి అపారమైన అనుభవం ఉంది. గతంలో న్యూజిలాండ్ కోచ్గా, ఆర్సీబీ క్రికెట్ డైరక్టర్గా హెస్సన్ పనిచేశాడు. ఈ క్రమంలోనే అతడిని తమ హెడ్ కోచ్గా నియమించాలని పీసీబీ భావిస్తోందంట. అయితే హెడ్ కోచ్ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సైమన్ కాటిచ్, న్యూజిలాండ్ ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ ల్యూక్ రోంచిలతో కూడా పీసీబీ సంప్రదింపులు జరిపినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.చదవండి: IPL 2025: రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్.. ఇక కష్టమే మరి? -
ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏప్రిల్ 19న జైపూర్ వేదికగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయినట్లు రాజస్తాన్ క్రికెట్ సంఘం అడ్హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. సునాయసంగా గెలిచే మ్యాచ్లో రాజస్తాన్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోయిందంటూ బిహానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం స్పందించింది. తమపై చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తమని రాయల్స్ ఫ్రాంచైజీ సీనియర్ అధికారి దీప్ రాయ్ ఖండించారు."అడ్ హాక్ కమిటీ కన్వీనర్ చేసిన అన్ని ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బహిరంగంగా చేసే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు తప్పుదారి పట్టించడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్, రాయల్ మల్టీ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (RMPL), రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, బీసీసీఐ ఖ్యాతి, విశ్వసనీయతకు తీవ్ర నష్టం కలిగించాయి. అవి క్రికెట్ సమగ్రతను కూడా దెబ్బతీశాయి" అని రాయల్స్ ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రాయల్స్ యాజమాన్యం.. బిహానీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి, క్రీడా కార్యదర్శికి లేఖ రాశారు.అసలేమి జరిగిందంటే?లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ అనుహ్యంగా రెండు పరుగులతో తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 180 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగల్గింది. ఆఖరి ఓవర్లో తమ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా రాజస్తాన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.చదవండి: ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్పై ఆరోపణలు -
అందుకే రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్లో ఉన్నారు..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిన్న (ఏప్రిల్ 21) తమ సెంట్రల్ కాంట్రాక్ట్ (2024-25) ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ ప్లస్ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఓ ఆటగాడికి బీసీసీఐ ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించాలంటే అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయ్యుండాలి. అయితే రోహిత్, విరాట్, జడేజా గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత పొట్టి క్రికెట్కు గుడ్బై చెప్పి కేవలం వన్డేలు, టెస్ట్ల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయినా వారికి ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించింది. దీనిపై నిన్నటి నుంచి క్రికెట్ అభిమానుల్లో సందేహాలు ఉన్నాయి. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా వారిని ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో కొనసాగిస్తున్నారని సోషల్మీడియా వేదికగా డిస్కషన్స్ నడిచాయి. ఈ అంశంపై బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి తాజాగా స్పందించాడు.రోహిత్, విరాట్, జడేజా ఆల్ ఫార్మాట్ ప్లేయర్లు కానప్పటికీ ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారన్న విషయంపై వివరణ ఇచ్చాడు. 2024-25 సంవత్సరాని గానూ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధి అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉంటుంది. అయితే దీని అసెస్మెంట్ సంవత్సరం మాత్రం అక్టోబర్ 1, 2023 నుండి సెప్టెంబర్ 30, 2024 మధ్యలో ఉంటుంది. ఆ వ్యవధిలో కోహ్లీ, రోహిత్ , జడేజా అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యులుగా ఉన్నారు. జూన్ 2024లో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ ముగ్గురు టీ20ల నుంచి తప్పుకున్నారు. ఈ సాంకేతికత ప్రకారం.. రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు.ఇదిలా ఉంటే, నిన్న ప్రకటించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో మొత్తం 34 మంది చోటు దక్కించుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.ఈ ఏడాది కొత్తగా ఏడుగురు (ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా) సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించకున్నారు. శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ తమ కాంట్రాక్ట్ను కోల్పోయారు. రిషబ్ పంత్కు బి నుంచి ఏ కేటగిరీకి ప్రమోషన్ లభించింది. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు.ఏ ప్లస్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది. -
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్పై ఆరోపణలు
ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం కలకలం రేపుతుంది. ఏప్రిల్ 19న రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) తాత్కాలిక కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించాడు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్లో రాయల్స్ అనూహ్యంగా ఓటమిపాలైందని ఆయన అన్నాడు.ఈ మ్యాచ్పై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు నుంచి రాయల్స్ కదలికలపై అనుమానాలు ఉన్నాయని తెలిపాడు. అంతకుముందు రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్పై కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్లో కూడా రాయల్స్ గెలిచి ఉండాల్సిందని అన్నాడు. రాయల్స్ యాజమాన్యం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ను పూర్తి పక్కకు పెట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని తెలిపాడు.2013 సీజన్లో రాయల్స్ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు. సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్కు పాల్పడటంతో 2016, 2017 సీజన్లలో రాయల్స్పై నిషేధం విధించారన్న విషయాన్ని గుర్తు చేశాడు. అప్పట్లో రాయల్స్తో పాటు చెన్నై సూపర్ కింగ్స్పై రెండు సీజన్ల నిషేధం విధించారు.జైదీప్ ఆరోపణలు ఎలా ఉన్నా, ఏప్రిల్ 19న జరిగిన రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్పై సగటు క్రికెట్ అభిమానికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సులువగా గెలవాల్సిన ఆ మ్యాచ్లో రాయల్స్ ఓడిపోవడాన్ని చాలా మంది ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. ఆ మ్యాచ్లో రాయల్స్ గెలుపుకు చివరి ఓవర్లో కేవలం 9 పరుగులే అవసరమయ్యాయి. చేతిలో వికెట్లు కూడా ఉన్నాయి. క్రీజ్లో విధ్వంసకర ఆటగాళ్లు ధృవ్ జురెల్, హెట్మైర్ ఉన్నారు. అయినా రాయల్స్ చివరి ఓవర్లో 6 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. తీవ్ర ఉత్కంఠ నడుమ చివరి ఓవర్ను ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడో బంతికి డేంజరెస్ హెట్మైర్ను ఔట్ చేసి లక్నోకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఇక్కడ ఆవేశ్ ప్రతిభను ముమ్మాటికి ప్రశంసించాల్సిందే. 18వ ఓవర్లోనూ అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అప్పటికే క్రీజ్లో పాతుకుపోయిన యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ను ఔట్ చేశాడు. జనాలు ఆవేశ్ టాలెంట్ను ప్రశంశిస్తూనే, ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అనుకుంటున్నారు. -
LSG VS DC: భారీ రికార్డులపై కన్నేసిన రాహుల్, కుల్దీప్
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 22) ఓ రసవత్తర మ్యాచ్ జరుగనుంది. టేబుల్ సెకెండ్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఐదో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నో సొంత మైదానమైన అటల్ బిహారి వాజ్పేయ్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్కు ముందు ఢిల్లీ స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ రెండు భారీ రికార్డులపై కన్నేశారు. ఈ మ్యాచ్లో రాహుల్ 51 పరుగులు చేస్తే ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకిన ఎనిమిదో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రాహుల్ ఖాతాలో 4949 పరుగులు (138 మ్యాచ్లు) ఉన్నాయి. ఇందులో 4 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.రాహుల్కు ముందు విరాట్ కోహ్లి (8326), రోహిత్ శర్మ (6786), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ధోని (5377), ఏబీ డివిలియర్స్ (5162) ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకారు.కుల్దీప్ విషయానికొస్తే.. ఈ లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్ లక్నోతో నేడు జరుగబోయే మ్యాచ్లో ఓ వికెట్ తీస్తే.. ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయిని చేరకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 27వ బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ ఇప్పటివరకు 214 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో చహల్ మినహా మరే బౌలర్ 200 వికెట్ల మార్కును తాకలేదు. టాప్-5లో పియూశ్ చావ్లా (192), భువనేశ్వర్ కుమార్ (189), సునీల్ నరైన్(187), రవిచంద్రన్ అశ్విన్ (185) ఉన్నారు.ప్రస్తుత సీజన్లో రాహుల్, కుల్దీప్ల ఫామ్ను చూస్తే నేడు లక్నోతో జరుగబోయే మ్యాచ్లో ఈ రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో రాహుల్ 6 మ్యాచ్ల్లో 266 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో 11 స్థానంలో ఉండగా.. 7 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీసిన కుల్దీప్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.లక్నోపై సంచలన విజయం సాధించిన ఢిల్లీఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో లక్నోను ఢిల్లీ చివరి నిమిషంలో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో అశుతోష్ శర్మ (66 నాటౌట్), విప్రాజ్ నిగమ్ (39) వీరోచితమైన ప్రదర్శన కనబర్చి (లక్నో నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో) ఓడిపోవాల్సిన మ్యాచ్లో ఢిల్లీని గెలిపించాడు. చివరి 7 ఓవర్లలో 94 పరుగులు చేయాల్సిన తరుణంలో (6 వికెట్లు కోల్పోయాక) ఈ జోడీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. అశుతోష్ చివరి నిమిషం వరకు క్రీజ్లో ఉండి ఢిల్లీని గెలిపించాడు.ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగిన నేపథ్యంలో నేటి మ్యాచ్పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్లే ఆఫ్స్కు చేరే క్రమంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. నేటి మ్యాచ్తో లక్నో ఎక్స్ప్రెస్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్లో లక్నో రాజస్థాన్ రాయల్స్ను ఊహించని విధంగా చివరి ఓవర్లో మట్టికరిపించి మాంచి ఊపు మీద ఉంది. ఢిల్లీ గత మ్యాచ్లో గుజరాత్ చేతిలో భంగపడి కాస్త ఢీలాగా కనిపిస్తుంది.నేటి మ్యాచ్ను తుది జట్లు (అంచనా)లక్నో: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (c & wk), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ / మయాంక్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, అవేష్ ఖాన్, ఆయుష్ బడోనిఢిల్లీ: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్ (wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (c), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, డోనోవన్ ఫెరీరా