ఈ ఆనందం నుంచి తేరుకునేందుకు మరికొంత సమయం పడుతుంది. 2024 వరల్డ్ కప్ తర్వాత మా ప్రయాణం మొదలైంది. జై షా, రోహిత్ నాపై నమ్మకం ఉంచి కెప్టెన్గా నాకు అవకాశం కల్పించారు. అక్కడి నుంచి ఇప్పుడు వరల్డ్ కప్ గెలవడం వరకు చాలా గొప్పగా సాగింది. గత రెండేళ్లుగా మేం చాలా బాగా ఆడాం. వరల్డ్ కప్లోనూ అదే కొనసాగించాలని భావించాం. ఆటగాళ్లను అర్థం చేసుకుంటూ వారికి సరైన సమయంలో సరైన అవకాశాలు ఇచ్చాం. సామ్సన్, అభిషేక్ ప్రత్యేక ఆటగాళ్లు. వారు ఏదైనా అద్భుతం చేయగలరని అనుకున్నాం. దానిని వారు ఫైనల్లో చూపించారు. తరానికొక్కడు వంటి అరుదైన రత్నం బుమ్రా. గెలిపించేందుకు ఏం చేయాలనేది అతనికి బాగా తెలుసు.
–సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్


