breaking news
Other Sports
-
భారత్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: మహిళల ప్రపంచకప్ హాకీ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు శుభారంభం చేసింది. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్లో సలీమా టెటె బృందం 4–0 గోల్స్ తేడాతో ఉరుగ్వేను ఓడించింది. భారత్ తరఫున సునెలితా టొప్పో (21వ నిమిషంలో), ఇషిక (40వ నిమిషంలో), లాల్రెమ్సియామి (49వ నిమిషంలో), రుతుజా ఫాల్కే (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. భారత జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్లు రాగా... ఒక్క దానిని సద్వినియోగం చేసుకుంది. మిగతా ఐదింటిని వృథా చేసింది. ఉరుగ్వే తమకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను వృథా చేసుకుంది. అంతకుముందు జరిగిన ఇతర మూడు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ 5–2 గోల్స్ తేడాతో ఇటలీ జట్టుపై, దక్షిణ కొరియా 1–0తో ఆ్రస్టియాపై, స్కాట్లాండ్ 1–0తో వేల్స్ జట్టుపై విజయం సాధించాయి. భారత్, ఉరుగ్వే మ్యాచ్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెండు జట్ల క్రీడాకారిణులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ శివసేనా రెడ్డి, ‘శాట్స్’ ఎండీ సోనీబాలా దేవి, హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కి, కార్యదర్శి భోళానాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నేడు జరిగే మ్యాచ్ల్లో ఇటలీతో ఆస్ట్రియా (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), కొరియాతో ఇంగ్లండ్ (మధ్యాహ్నం గం. 3 నుంచి), ఉరుగ్వేతో వేల్స్ (సాయంత్రం గం. 5:15 నుంచి), స్కాట్లాండ్తో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. -
లక్ష్య సేన్ రెండో‘సారీ’
బర్మింగ్హామ్: బ్రిటిష్ గడ్డపై విజయగర్జన చేయాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్కు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత నంబర్వన్ లక్ష్య సేన్ రెండోసారి రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడ్డాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 15–21, 20–22తో ప్రపంచ 11వ ర్యాంకర్ లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 57 నిమిషాలపాటు సాగిన ఈ తుది సమరంలో చైనీస్ తైపీ ప్లేయర్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. తద్వారా 127 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి చైనీస్ తైపీ క్రీడాకారుడిగా లిన్ చున్ యి ఘనత వహించాడు. విజేతగా నిలిచిన లిన్ చున్ యికి 1,01,500 డాలర్ల (రూ. 93 లక్షల 32 వేలు) ప్రైజ్మనీతోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ లక్ష్య సేన్కు 49,300 డాలర్ల (రూ. 45 లక్షల 32 వేలు) ప్రైజ్మనీతోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. లక్ష్య సేన్ ఓటమితో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో భారత సింగిల్స్ టైటిల్ నిరీక్షణ కొనసాగనుంది. 2022లో తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్ చేరిన లక్ష్య సేన్ డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచాడు. భారత్ తరఫున ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ గెలవగా... ప్రకాశ్ నాథ్ (1947లో), ప్రకాశ్ పదుకొనే (1981లో), సైనా నెహ్వల్ (2015లో) రన్నరప్గా నిలిచారు. -
ప్రపంచకప్ బెర్త్ లక్ష్యంగా...
సాక్షి, హైదరాబాద్: భారత మహిళల హాకీ జట్టు ప్రపంచకప్ బెర్తే లక్ష్యంగా క్వాలిఫయర్స్ బరిలోకి దిగుతోంది. నేడు తొలి పోరులో భారత జట్టు ఉరుగ్వేతో తలపడుతుంది. గచ్చిబౌలి హాకీ టర్ఫ్ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో మూడు బెర్త్ల కోసం మొత్తం 8 జట్లు పోటీపడుతున్నాయి. ఆతిథ్య భారత్తో పాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆ్రస్టియాలు క్వాలిఫయర్స్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. 8 జట్లను రెండు పూల్స్గా విభజించారు. పూల్ ‘ఎ’లో ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా... పూల్ ‘బి’లో భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక రెండు పూల్స్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ మార్చి 13న... మూడో స్థానం కోసం మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ మార్చి 14న జరుగుతాయి. ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో టాప్–3లో నిలిచిన జట్లు ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్లలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. తొలి రోజు ఆదివారం ఇంగ్లండ్తో ఇటలీ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి); కొరియాతో ఆస్ట్రియా(మధ్యాహ్నం గం. 3 నుంచి); స్కాట్లాండ్స్తో వేల్స్ (సాయంత్రం గం. 5:15 నుంచి) కూడా తలపడతాయి. -
లక్ష్య సేన్ అదరహో
బర్మింగ్హామ్: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో ఫైనల్కు చేరాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–16, 18–21, 21–15తో కెనడాకు చెందిన విక్టర్ లాయ్పై తుదికంటా పోరాడి గెలిచాడు. తాజా ప్రపంచ చాంపియన్íÙప్ (పారిస్–2025) కాంస్య పతక విజేత అయిన విక్టర్ను ఓడించేందుకు లక్ష్యసేన్ ఏకంగా 97 నిమిషాల పాటు శ్రమించాడు. కాలి పాదాలు మంటపెడుతున్నా... కోర్టులో తన కదలికలతో నొప్పి మరింత పెరిగినా అన్నీ భరించి ప్రత్యర్థిని మట్టికరిపించాడు. నేడు జరిగే టైటిల్ పోరులో చైనీస్ తైపీ షట్లర్ లిన్ చున్ యితో లక్ష్యసేన్ తలపడతాడు. కాలి పాదం గాయాన్ని పంటిబిగువన భరించి సెమీస్లో చెమటోడ్చిన భారత షట్లర్ 25 ఏళ్ల తర్వాత చరిత్రలో నిలిచేందుకు ఇప్పుడు అడుగు దూరంలో నిలిచాడు. సుప్రసిద్ధ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్ ఖాతాలో రెండే టైటిల్స్ ఉన్నాయి. ప్రకాశ్ పదుకొనె (1980), పుల్లెల గోపీచంద్ (2001) మాత్రమే గెలిచారు. కానీ 24 ఏళ్ల లక్ష్యసేన్ పుట్టాక మరో టైటిల్ రానేలేదు. తనే నాలుగేళ్ల క్రితం 2022లో గెలిచే ప్రయత్నం చేసినా... ఫైనల్ తడబాటు వల్ల చివరకు రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. అయితే అప్పటికీ ఇప్పటికీ లక్ష్యసేన్ ఎంతో మారాడు. అనుభవం సంపాదించాడు. నైపుణ్యం పెంచుకున్నాడు. ఇక చరిత్రకెక్కడమే తరువాయి! -
సెమీస్లో లక్ష్య సేన్
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ లక్ష్య సేన్ విజయపరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–13, 21–16తో ప్రపంచ 6వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 60 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఆద్యంతం లక్ష్య సేన్ ఆధిపత్యం చలాయించాడు. ఈ గెలుపుతో గత ఏడాది ఇదే టోర్నీ క్వార్టర్ ఫైనల్లో లీ షి ఫెంగ్ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. ఓవరాల్గా లీ షి ఫెంగ్తో 15 సార్లు తలపడ్డ లక్ష్య సేన్ 8 సార్లు గెలిచి, 7 సార్లు ఓడిపోయాడు. కొకి వతనాబె (జపాన్), విక్టర్ లాయ్ (కెనడా) మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ తలపడతాడు. -
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత నంబర్వన్ లక్ష్య సేన్ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ షి యుకీ (చైనా)ను బోల్తా కొట్టించిన లక్ష్య సేన్... ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 81 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–19, 21–23, 21–10తో గెలుపొందాడు. గతంలో లాంగ్ అంగుస్తో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన లక్ష్య సేన్ నాలుగో ప్రయత్నంలో విజయం అందుకోవడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో ఆడతాడు. టాంగ్ చున్ మన్–సె యింగ్ సుయెట్ (హాంకాంగ్)లతో జరిగిన మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో తొలి గేమ్ను 19–21తో కోల్పోయారు. రెండో గేమ్లో 8–9తో వెనుకబడిన దశలో భారత జోడీ గాయంతో వైదొలిగింది. -
మళ్లీ ఓడిన గుకేశ్
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ప్రాగ్ చెస్ ఫెస్టివల్ మాస్టర్స్ కేటగిరీలో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్కు మూడో పరాజయం ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్, భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ అరవింద్ చిదంబరంతో జరిగిన ఆరో రౌండ్లో గుకేశ్ 48 ఎత్తుల్లో ఓడిపోయాడు. పది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత గుకేశ్ 1.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో ఉండటం గమనార్హం. అరవింద్ 2.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. నెదర్లాండ్స్ గ్రాండ్మాస్టర్ జోర్డెన్ వాన్ ఫోరీస్ట్ 4.5 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇదే టోర్నీ చాలెంజర్స్ విభాగంలో పోటీపడుతున్న ప్రపంచకప్ చాంపియన్, భారత మహిళా గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్ ఖాతాలో నాలుగో ‘డ్రా’ చేరింది. థామస్ బీర్డ్సన్ (నెదర్లాండ్స్)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్ను దివ్య 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ప్రస్తుతం దివ్య మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. -
సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లోరెండో రోజు భారత షట్లర్లకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్గా బరిలోకి దిగిన నాలుగో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 33వ స్థానంలో ఉన్న కాంగ్ ఖాయ్ జింగ్–ఆరోన్ తాయ్ (మలేసియా) జంట 23–21, 21–12తో ప్రపంచ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉన్న సాత్విక్–చిరాగ్ జోడీని బోల్తా కొట్టించింది. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో భారత జంట తొలి గేమ్లో గట్టిపోటీనిచి్చనా... రెండో గేమ్లో తేలిపోయింది. ఏడోసారి ఈ టోర్నీలో పోటీపడ్డ సాత్విక్–చిరాగ్ తొలి రౌండ్లోనే వెనుదిరగడం ఇదే తొలిసారి. 2022లో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత జంట 2018, 2021, 2023, 2024, 2025లలో ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 42 నిమిషాల్లో 12–21, 15–21తో ఐదో సీడ్ థోమ్ గికెల్–డెల్పైన్ డెల్ర్యూ (ఫ్రాన్స్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 22వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి (భారత్) 75 నిమిషాల్లో 21–19, 9–21, 17–21తో ప్రపంచ 14వ ర్యాంకర్ అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. -
లక్ష్యసేన్ సంచలనం
బర్మింగ్హామ్: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను పెను సంచలనంతో మొదలుపెట్టాడు. ప్రపంచంలోనే కొరకరాని ప్రత్యర్థి, చైనా గోడను తొలి రౌండ్లోనే బద్దలు కొట్టాడు. చైనాకు చెందిన టాప్ స్టార్, ప్రపంచ నంబర్వన్ షి యూకిపై భారత షట్లర్ చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్షిప్, ప్రపంచ చాంపియన్షిప్, సుదిర్మన్ కప్, థామస్ కప్లాంటి ఎన్నో టోర్నీల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన షి యూకిని ఆల్ ఇంగ్లండ్ టోర్నీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్ మ్యాచ్లో లక్ష్యసేన్ 23–21, 19–21, 21–17తో టాప్ సీడ్, తాజా ప్రపంచ చాంపియన్ షి యూకిని కంగుతినిపించాడు. మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. ఆమె 11–21, 6–21తో వరుస గేముల్లో మూడో సీడ్ చెన్ యూ ఫె (చైనా) చేతిలో ఓడింది. మరో మ్యాచ్లో ఎనిమిదో సీడ్ పొర్న్పవీ చోచువాంగ్ (థాయిలాండ్) 21–12, 21–18తో ఉన్నతి హుడా (భారత్)ను ఓడించి ముందంజ వేసింది. డబుల్స్ జోడీలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో జోడీ 21–17, 21–19తో హూ పాంగ్ రాన్–చెంగ్ సు యిన్ (మలేసియా) జంటపై గెలుపొందగా... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 15–21, 21–15, 18–21తో జపాన్కు చెందిన సయాక హిరోత–అయాకొ సకురమొతొ జంట చేతిలో పరాజయం చవిచూసింది. సింధు స్వదేశానికి... భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్వదేశానికి చేరుకుంది. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ కోసం బయల్దేరిన సింధు తాజా యుద్ధ పరిణామాల కారణంగా ఫ్లయిట్లు ఆగిపోవడంతో దుబాయ్లో చిక్కుకుంది. ఇంగ్లండ్ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆమె తిరుగుముఖం పట్టింది. అయితే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ నిబంధనల ప్రకారం ఆఖరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకుంటే 5 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. అయితే సింధు ఇచి్చన వివరణ, ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆల్ ఇంగ్లండ్ ఆర్గనైజర్లు జరిమానాను రద్దు చేశారు. -
భారత్ X వియత్నాం
పెర్త్: మైదానం లోపలా బయటా సమస్యలతో సతమతమవుతున్న భారత మహిళల ఫుట్బాల్ జట్టు... ఆసియాకప్ టోర్నమెంట్లో తొలిపోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం మొదటి మ్యాచ్లో మనకంటే మెరుగైన ర్యాంక్ గల వియత్నాంతో టీమిండియా తలపడనుంది. చైనీస్ తైపీ, జపాన్, వియత్నాంతో కలిసి గ్రూప్ ‘సి’నుంచి భారత్ పోటీ పడుతోంది. గతేడాది అక్టోబర్ తర్వాత భారత మహిళల జట్టు ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. చివరగా ఇరాన్, నేపాల్తో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ మన అమ్మాయిలు పరాజయం పాలయ్యారు. మరి ఆ వైఫల్యాలను అధిగమించి బుధవారం మనవాళ్లు మైదానంలో ఆకట్టుకుంటారా చూడాలి. ఈ టోర్నమెంట్ కోసం గత నెల 11నే పెర్త్ చేరుకున్న భారత జట్టు... అక్కడ స్థానిక క్లబ్లతో మ్యాచ్లు ఆడి అనుభవాన్ని గడించింది. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్లో వియత్నాం 36వ ర్యాంక్లో ఉండగా... భారత్ 67వ స్థానంలో కొనసాగుతోంది. ఫామ్ పరంగా చూసుకున్నా... వియత్నాం ఇటీవలే బలమైన ప్రత్యర్థులపై విజయాలతో సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉంది. మరి అలాంటి జట్టుపై ఆధిక్యం కనబర్చాలంటే టీమిండియా శక్తికి మించి పోరాడక తప్పదు. 2003లో చివరిసారిగా ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ వియత్నాం విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ మూడు గ్రూప్ల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండేసి జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచిన రెండు మేటి జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరనున్నాయి. అందులో విజయం సాధించిన జట్లకు 2027లో బ్రెజిల్ వేదికగా జరగనున్న మహిళల ఫిఫా వరల్డ్కప్ బెర్త్ దక్కనుంది. ‘2023 ఆసియాకప్లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయాం. కానీ ఈ సారి మంచి సన్నద్ధతతో బరిలోకి దిగుతున్నాం. మా అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తాం. ఈ టోర్నీకి ముందు టర్కీలో ప్లేయర్ల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఆసియాకప్లో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం’ అని భారత మహిళల ఫుట్బాల్ జట్టు హెడ్ కోచ్ అమేలియా వాల్వెర్డ్ పేర్కొంది. సరైన్ కిట్లు లేక... ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం చాలా ముందుగానే ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టుకు అనూహ్య ఇబ్బంది వచ్చి పడింది. జట్టు స్పాన్సర్ సరైన సమయానికి సరైన్ కిట్లు అందించకపోవడంతో ప్లేయర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీనిపై ఆగ్రహించిన ప్లేయర్లు తమ సమస్యను అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) దృష్టికి తీసుకొచ్చారు. ‘అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ప్రొఫెషనల్ ప్రమాణాలు అవసరం. కనీసం కిట్లను కూడా సరిగ్గా సమకూర్చలేకపోతే కష్టం. ప్రాక్టీస్ సమయంలోనే సరైన దుస్తులు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి కీలక టోర్నమెంట్ ఆడుతున్న సమయంలో కిట్లు సరిగ్గా లేకపోవడం అనేది ఎంతో బాధిస్తోంది. మ్యాచ్కు ముందు ఇలాంటి సమస్యలు మా ఏకాగ్రతను దెబ్బతీశాయి’ అని ప్లేయర్లు ఏఐఎఫ్ఎఫ్కు లేఖ రాశారు. కెపె్టన్ స్వీటి దేవి నాంగ్బమ్తో పాటు ఎనిమిది మంది ప్రధాన ప్లేయర్లు ఈ లేఖపై సంతకాలు చేశారు. అయితే దీనిపై స్పందించిన సమాఖ్య మంగళవారం ప్లేయర్లకు కొత్త కిట్లు అందించినట్లు తెలిపింది. -
WC 2026: యుద్ధం ఎఫెక్ట్.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్
యుద్ధం వేళ ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్య సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి ఇరాన్ వైదొలిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో మ్యాచ్లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో టోర్నీనే బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ ఏడాది జూన్–జూలైలలో అమెరికా, మెక్సికో, కెనడాలలో ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా టోర్నీలో ఇరాన్ జట్టు బరిలోకి దిగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు మెహదీ తాజ్ స్పష్టం చేశాడు.వైమానిక దాడులుకాగా మిత్రదేశం ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనిని మట్టుబెట్టింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేస్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచకప్ కోసం ఎదురుచూసేందుకు ఏమాత్రం వీల్లేదని మెహదీ తాజ్ అన్నాడు.ఫలితంగా యుద్ధవాతావరణం నేపథ్యంలో జూన్–జూలైలలో జరిగే ప్రపంచకప్లో ఇరాన్ పాల్గొనడం సందేహస్పదంగా మారింది. గ్రూప్ ‘జి’లో బెల్జియం, న్యూజిలాండ్, ఈజిప్ట్లతో కలసి ఉంది ఇరాన్.గత ఆరు పర్యాయాల్లోనూషెడ్యూల్ ప్రకారం జూన్ 15న న్యూజిలాండ్తో (కాలిఫోర్నియాలో), జూన్ 21న బెల్జియంతో (కాలిఫోర్నియాలో), జూన్ 26న ఈజిప్ట్తో (సియాటెల్లో) ఆడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇరాన్ అభిమానుల ప్రవేశంపై ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది జూలైలో నిషేధం విధించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 20వ స్థానంలో ఉన్న ఇరాన్ జట్టు ఏడోసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. అయితే ఆ జట్టు గత ఆరు పర్యాయాల్లోనూ (1978, 1998, 2006, 2014, 2018, 2022) గ్రూప్ దశను దాటి ముందుకెళ్లలేకపోయింది.ఇరాన్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?ఒకవేళ ఇరాన్ ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకొంటే.. ఆ జట్టు స్థానంలో ఆసియా నుంచే మరో జట్టు టోర్నీలో అడుగుపెడుతుంది. ఆసియా ఫుట్బాల్ సమాఖ్య ఇందుకు సంబంధించి ఫిఫాకు వివరాలు ఇవ్వనుంది. కాగా ఆసియా నుంచి టాప్లో ఉన్న ఇరాన్.. టోర్నీకి అర్హత సాధించగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్, యూఏఈ ఉన్నాయి. భారీ జరిమానాఅయితే, టోర్నీ ఆరంభానికి ముందే ఇరాన్ తమ తుది నిర్ణయం చెపాల్సి ఉంటుంది. ఒకవేళ టోర్నీ ఆరంభానికి నెల రోజుల ముందు కంటే నిర్ణయం చెప్పనట్లయితే $324,000 (దాదాపు రూ. 3 కోట్లు).. ఒకవేళ 30 రోజులు దాటిన తర్వాత నిర్ణయం చెబితే వైదొలిగిన జట్టు $648,000 మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రపంచకప్ సన్నాహకాల కోసం FIFA ఇచ్చిన నిధులను కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.చదవండి: FIFA World Cup 2026: అర్హత సాధించిన దేశాలు ఇవే -
సురక్షితంగా భారత్కు చేరుకున్న పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్కు చేరుకుంది. మధ్యప్రాచ్యంలో యుద్దం కారణంగా దుబాయ్లో ఇరుక్కుపోయిన ఆమె.. ఇవాళ ఉదయం సురక్షితంగా బెంగళూరులో ల్యాండయ్యింది. వాస్తవానికి సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్స్లో పాల్గొనేందుకు బర్మింగ్హామ్కు వెళ్లాల్సి ఉండింది. అయితే అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్దం కారణంగా గమ్యానికి చేరకుండానే స్వదేశానికి తిరుగుముఖం పట్టింది.భయానక అనుభవం సింధు బర్మింగ్హామ్కు ప్రయాణం చేస్తూ దుబాయ్లో ట్రాన్సిట్లో ఉండగా, గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించాయి. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే ఇరుక్కుపోయారు. ఆ సమయంలో సింధు ఉన్న ప్రాంతం దగ్గరలో పేలుడు సంభవించడంతో పరిస్థితి భయానకంగా మారింది. ఆమె కోచ్ పేలుడు ధాటికి గురయ్యాడు.ఇంటికి చేరాను మార్చి 3న సింధు “సురక్షితంగా ఇంటికి చేరాను” అని Xలో పోస్ట్ చేసింది. “ఈ క్లిష్ట సమయంలో సహకరించిన గ్రౌండ్ టీమ్స్, దుబాయ్ అధికారులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని, తదుపరి అడుగులు ఆలోచిస్తానని పేర్కొంది. కాగా, సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్స్ కోసం కఠోరంగా శ్రమించింది. ఈ సారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలన్న కసితో ఉండిన ఆమెకు అనుకోని అవరోధాలు ఎదురయ్యాయి. దుబాయ్లో చిక్కుకున్నప్పుడు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల కోసం అన్వేశించినా, భద్రతా కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈ టోర్నీ నుంచి సింధులాగే మరికొందరు క్రీడాకారులు కూడా వైదొలిగినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఇవాల్టి నుంచి మార్చి 8 వరకు జరగాల్సి ఉండింది. -
గుకేశ్కు రెండో పరాజయం... దివ్య ఖాతాలో తొలి విజయం
ప్రాగ్ చెస్ ఫెస్టివల్లో భారత గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ రెండో ఓటమి చవిచూశాడు. మాస్టర్స్ కేటగిరీలో భాగంగా నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్లో నల్లపావులతో ఆడిన గుకేశ్ 69 ఎత్తుల్లో ఓడిపోయాడు. పది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఐదో రౌండ్ తర్వాత గుకేశ్ 1.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ అరవింద్ చిదంబరం ఖాతాలో మూడో ఓటమి చేరింది. డేవిడ్ ఆంటోన్ (స్పెయిన్)తో జరిగిన ఐదో రౌండ్లో అరవింద్ 40 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఇదే టోరీ్నలో చాలెంజర్స్ విభాగంలో పోటీపడుతున్న భారత మహిళా గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్ తొలి విజయం నమోదు చేసింది. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ సూర్యశేఖర గంగూలీతో జరిగిన ఐదో రౌండ్లో దివ్య 35 ఎత్తుల్లో గెలిచింది. -
మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ టికెట్ల అమ్మకాలు షురూ
సాక్షి, హైదరాబాద్: మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ టికెట్ల అమ్మకాలు సోమవారం మొదలయ్యాయి. టికెట్ల ధరలను రూ. 25 (సౌత్ స్టాండ్), రూ. 50 (నార్త్ స్టాండ్), రూ. 100 (ఈస్ట్ స్టాండ్)గా నిర్ణయించారు. ఈనెల 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ టోరీ్నలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆ్రస్టియా) పోటీపడుతున్నాయి. టికెట్లను https://ticketgenie.in/ticket/FIH-Hockey-World-Cup-2026-Qualifiers వెబ్సైట్లో లాగిన్ అయి కొనుగోలు చేయాలి. ఈ టోర్నీ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ ఖేల్ చానెల్లో, జియో హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. తొలి రోజు 8న ఇంగ్లండ్తో ఇటలీ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), కొరియాతో ఆ్రస్టియా (మధ్యాహ్నం గం. 3 నుంచి), స్కాట్లాండ్తో వేల్స్ (సాయంత్రం గం. 5:15 నుంచి), ఉరుగ్వేతో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. -
కొరియా చేతిలో ఇరాన్ మహిళల జట్టు ఓటమి
గోల్డ్కోస్ట్: ఇరాన్ లక్ష్యంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో బాంబుల మోత మోగుతోంది. ఇరాన్ కూడా గల్ఫ్ వ్యాప్తంగా ఉన్న అమెరికా స్థావరాల్ని లక్ష్యం చేసుకుంది. ఇలా అక్కడి వాతావరణం భీతావహంగా ఉంది. ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లోనూ ఇరాన్ మహిళల జట్టు ఆసియా కప్ ఫుట్బాల్ టోరీ్నలో బరిలోకి దిగింది. ఆ్రస్టేలియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో ఇరాన్ 0–3 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. 2022 చాంపియన్ అయిన కొరియా జట్టు ఆట మొదలైనప్పటి నుంచి ప్రత్యర్థి గోల్ పోస్ట్పై అదేపనిగా దాడులు చేసింది. తొలి అర్ధభాగంలోనే ఏకంగా 20 సార్లు లక్ష్యంపై గురిపెట్టిన కొరియన్లు కేవలం ఒక గోల్ చేయగలిగారు. 37వ నిమిషంలో చో యు రి గోల్ సాధించింది. రెండో అర్ధభాగంలో కిమ్ హే రి (59వ నిమిషంలో) గోల్ చేయగా... కొ యూ జిన్ (75వ నిమిషంలో) హెడర్తో కొరియాకు 3–0తో తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఇరాన్కు ఒక్క గోల్ అవకాశాన్ని ఇవ్వకుండా కొరియా డిఫెండర్లు చక్కని సమన్వయం చూపారు. మ్యాచ్ ముందుగానీ, తర్వాత గానీ ఇరాన్ కోచ్ మర్జియె జఫారి తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులపై మాట్లాడేందుకు తిరస్కరించారు. -
నిరీక్షణ ముగిసేనా?
బర్మింగ్హామ్: శతాబ్దంకంటే ఎక్కువ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నీ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్కు నేడు తెర లేవనుంది. ఆరు రోజులపాటు జరిగే ఈ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలోని ఐదు విభాగాల్లోనూ (పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి... డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ... మహిళల సింగిల్స్లో పీవీ సింధు, మాళవిక బన్సోద్, ఉన్నతి హుడా... డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్; ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో బరిలో ఉన్నారు. అయితే స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ ఎయిర్ స్పేస్, ఎయిర్పోర్టు మూసివేయడంతో సింధు అక్కడే చిక్కుకుపోయింది. దుబాయ్ విమానాశ్రయం నుంచి సోమవారం సాయంత్రం నుంచి పాక్షికంగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. సింధు తన తొలి రౌండ్ మ్యాచ్ను బుధవారం థాయ్లాండ్ ప్లేయర్ సుపనిద కటెథోంగ్తో ఆడాల్సి ఉంది. సింధు మినహా భారత ఇతర ప్లేయర్లు సింగపూర్, ఆఫ్రికా దేశాల మీదుగా బర్మింగ్హామ్కు చేరుకున్నారు. క్లిష్టమైన ‘డ్రా’ 127 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ నుంచి పురుషుల సింగిల్స్లో ప్రకాశ్ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్ (2001లో) మాత్రమే టైటిల్స్ సాధించారు. 2022లో లక్ష్య సేన్ ఫైనల్ చేరినా తుదకు రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. 2015లో మహిళల సింగిల్స్లో సైనా నెహా్వల్ కూడా రన్నరప్గానే నిలిచింది. ఈ ఏడాదైనా భారత ప్లేయర్లు టైటిల్ నిరీక్షణకు తెరదించుతారో లేదో వేచి చూడాలి. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టిలకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ షి యుకి (చైనా)తో లక్ష్య సేన్, అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో ఆయుశ్ శెట్టి ఆడతారు. 2022, 2023లలో సెమీఫైనల్ చేరిన గాయత్రి–ట్రెసా ద్వయం తొలి రౌండ్లో సయాకా హిరోటా–అయాకో సకురామోటో (జపాన్) జోడీతో తలపడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కాంగ్ ఖాయ్ జింగ్–ఆరోన్ టాయ్ (మలేసియా)లతో సాతి్వక్–చిరాగ్ పోటీపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ చెన్ యుఫె (చైనా)తో మాళవిక; ఆరో సీడ్ చోచువోంగ్ (థాయ్లాండ్)తో ఉన్నతి ఆడతారు. -
సలీమా టెటె సారథ్యంలో...
సాక్షి, హైదరాబాద్: స్వదేశంలో జరిగే మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ఆదివారం హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు మిడ్ఫీల్డర్ సలీమా టెటె సారథ్యం వహిస్తుంది. సీనియర్ స్టార్ గోల్కీపర్, మాజీ కెప్టెన్ సవితా పూనియా కుటుంబ కారణాలరీత్యా ఈ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఆతిథ్య భారత్తోపాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రియా జట్లు ఈ టోర్నీలో పోటీపడతాయి. పూల్ ‘ఎ’లో ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా... పూల్ ‘బి’లో భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు తొలి లీగ్ మ్యాచ్ను 8న ఉరుగ్వేతో, తర్వాత 9న స్కాట్లాండ్తో, 11న వేల్స్తో తలపడుతుంది. ఈ టోర్నీ ద్వారా మూడు జట్లు ఈ ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్లలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. భారత మహిళల హాకీ జట్టు: బన్సారి, బిచ్చూ దేవి (గోల్కీపర్లు), సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, మనీషా, ఉదిత, ఇషిక చౌధరీ (డిఫెండర్లు), నేహా, సలీమా టెటె, సునెలితా టొప్పో, సాక్షి రాణా, వైష్ణవి, రుతుజా, దీపిక (మిడ్ఫీల్డర్లు), నవ్నీత్ కౌర్, ఇషిక, లాల్రెమ్సియామి, బ్యూటీ డుంగ్డుంగ్, బల్జీత్ కౌర్, అన్ను (ఫార్వర్డ్స్). -
ఇరాన్ దాడులు.. దుబాయ్లో చిక్కుకున్న పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రస్తుతం దుబాయ్లో చిక్కుకుపోయింది. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ దాడులు కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆమె ప్రయాణానికి అంతరాయం కలిగింది. సింధు బర్మింగ్హామ్లో జరగనున్న ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్స్ కోసం దుబాయ్ మీదుగా లండన్కు బయల్దేరింది.దుబాయ్ ట్రాన్సిట్లో ఉన్న సమయంలో గల్ఫ్ ఎయిర్స్పేస్లో మిసైల్ దాడుల కారణంగా అన్ని విమాన సర్వీసులు నిలిపి వేయబడ్డాయి. దీంతో సింధు విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులపై సింధు తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. తాము ఉన్న ప్రాంతానికి అతి సమీపంలో ఓ భారీ పేలుడు సంభవించింది. ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశాము. ఇక్కడి పరిస్థితులు క్రమేపీ భయానకంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి తామంతా క్షేమంగా ఉన్నాము. ఎయిర్పోర్ట్ సిబ్బంది తమను సురక్షిత ప్రాంతానికి తరలించారు అని ఎక్స్లో పేర్కొంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేస్తూ.. ప్రయాణికులు అనిశ్చితిలో వేచి ఉన్న దృశ్యాలను చూపించింది.కాగా, అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భారీ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అల్ ఖమేనీ మృతి చెందగా, పలువురు భద్రతా అధికారులు ప్రాణాలు కోల్పోయారు.ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ మరియు మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై మిసైల్ మరియు డ్రోన్ దాడులు చేస్తుంది. ఈ క్రమంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు పామ్ జుమైరా ప్రాంతాలు ఇరాన్ మిసైల్ దాడులకు గురయ్యాయి. బుర్జ్ ఖలీఫా సమీపంలో కూడా పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల కారణంగా గల్ఫ్ ఎయిర్స్పేస్ మూసివేయబడింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
పురుష సామర్థ్యమున్న స్త్రీలకు చెక్!
న్యూఢిల్లీ: పురుష సామర్థ్యమున్న స్త్రీలు మహిళల విభాగంలో పోటీపడకుండా ఎస్ఆర్వై జన్యు పరీక్షతో అడ్డుకట్ట వేయాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నిర్ణయించింది. ఇందులో జీవసంబంధమైన లింగనిర్ధారణలో అమ్మాయి అని తేలితేనే పోటీకి అనుమతిస్తారు. ఇందులో పురుషులకు వుండే వై క్రొమోజోముల ప్రభావం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళల విభాగంలో అనుమతించరు.ఇటీవల ఏఎఫ్ఐ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ (EC) సమావేశంలో ఎస్ఆర్వై జన్యు పరీక్ష తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జాతీయ స్థాయిలో జరిగే అన్ని పోటీల్లో ఈ పరీక్ష చేయాలని ఏఎఫ్ఐ నిర్ణయించింది. ముందుగా ఈ జూలై 24 నుంచి 28 వరకు జరిగే జాతీయ ఇంటర్–స్టేట్ సీనియర్ చాంపియన్షిప్లో ఎస్ఆర్వై జన్యుపరీక్షను అమలు చేయనున్నట్లు ఏఎఫ్ఐ తెలిపింది. ఎందుకీ పరీక్ష... ఏమిటీ ‘ఎస్ఆర్వై’ ?జన్మతః అమ్మాయిగా పుట్టినప్పటికీ చాలా అరుదుగా కొందరు స్త్రీలలో పురుష సామర్థ్యం అసహజంగా ఉంటుంది. హార్మోన్ల అసమతౌల్యం కారణంగా ఇలా జరుగుతుంది. దీనివల్ల సదరు స్త్రీ సాటి స్త్రీలకంటే పురుషుడి సామర్థ్యం కలిగి ఉంటుంది. దీంతో పోటీల్లో పైచేయి సాధిస్తుంది. ఎస్ఆర్వై అంటే పురుషుల్లో ఉండే వై క్రొమోజోముల్ని బట్టి నిర్ధారించే లింగ పరీక్ష (SRY gene test). ఈ టెస్టు మహిళలకు చేస్తే జన్మతః కాకుండా జీవసంబంధమైన లింగ నిర్ధారణ బయటపడుతుంది. -
లక్నో జట్టు కొత్త జెర్సీతో...
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కొత్త హంగులతో సిద్ధమవుతోంది. ఇటీవలే టీమ్ కొత్త లోగోను ప్రకటించిన యాజమాన్యం ఇప్పుడు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఎరుపు ప్రధాన రంగుగా ఉంటూ దానిపై నీలి రంగు నిలువు గీతలు హైలైట్ చేస్తూ జెర్సీని ముస్తాబు చేశారు. ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ బార్సిలోనా ఎఫ్సీ పోలికలు ఇందులో కనిపిస్తున్నాయి. ఐపీఎల్ తాజా సీజన్తో తమ టీమ్కు ‘జేకే సూపర్ సిమెంట్’ ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తున్నట్లు కూడా ఫ్రాంచైజీ ప్రకటించింది. గత మంగళవారం టీమ్ కొత్త లోగోను కూడా ప్రదర్శించారు. మరింత బలంగా, మరింత ఎత్తుకు అంటూ తమ టీమ్ ఆలోచనను వివరిస్తూ ఏనుగు, గరుడ చిత్రాలతో ఈ లోగోను సిద్ధం చేశారు. -
మానవ్–మనుశ్ జోడీకి కాంస్య పతకం
సింగపూర్: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ గ్రాండ్ స్మాష్ లెవెల్ టోర్నీలో మానవ్ ఠక్కర్–మనుశ్ షా (భారత్) జోడీ కాంస్య పతకం సాధించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆరో సీడ్ మానవ్–మనుశ్ ద్వయం 6–11, 11–7, 10–12, 11–9, 8–11తో నాలుగో సీడ్ ఫెలిక్స్ లెబ్రున్–అలెక్సిస్ లెబ్రున్ (ఫ్రాన్స్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జంట సొంత సర్వీస్లో 22 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్లో 24 పాయింట్లు గెలిచింది. మూడో గేమ్లో 10–9తో ఆధిక్యంలో నిలిచిన భారత జోడీ వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి గేమ్ను చేజార్చుకుంది. సెమీస్లో ఓడిన మానవ్–మనుశ్లకు 3,600 డాలర్ల (రూ. 3 లక్షల 27 వేలు) ప్రైజ్మనీతోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జంట రెండో రౌండ్లో 11–7, 11–5, 11–9తో గిలెర్మి టియోడోరో–లియోనార్డో ఇజుక (బ్రెజిల్)లపై, క్వార్టర్ ఫైనల్లో 11–8, 11–9, 11–9తో మారి్టన్ అలెగ్రో–ఆడ్రియన్ రసెన్ఫోస్ (బెల్జియం)లపై గెలుపొందింది. -
శ్రీకాంత్ పరాజయం
ముల్హీమ్ అన్ డెర్ రుర్: జర్మన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబిశ్రీకాంత్ 14–21, 9–21తో లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ తొలి గేమ్లో 9–2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండో గేమ్లో మాత్రం ఆరంభం నుంచే చైనీస్ తైపీ ప్లేయర్ ఆధిపత్యం చలాయించాడు. తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–12, 21–11తో జిమానవ్స్కీ (పోలాండ్)పై గెలిచాడు. మహిళల సింగిల్స్లో భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక, తస్నిమ్ మీర్, రక్షిత శ్రీ, తన్వీ శర్మ, ఇషారాణి బారువా తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. -
77 సెకన్లలోనే...
టిరానా (అల్బేనియా): ముహమెత్ మాలో స్మారక వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ సుజీత్ కల్కాల్ పసిడి పతకం సాధించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో సుజీత్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సుజీత్ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అజర్బైజాన్ రెజ్లర్ రషీద్ బాబాజాదెను చిత్తుగా ఓడించాడు. బౌట్ మొదలైన 77 సెకన్లకే సుజీత్ 10–0తో ఆధిక్యంలోకి వెళ్లి బంగారు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం ప్రత్యర్థి పై 10 అంతకన్నా పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే రిఫరీ బౌట్ను నిలిపివేసి ఆ రెజ్లర్ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. ఫైనల్ చేరే క్రమంలో సుజీత్ మూడు బౌట్లలోనూ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలోనే గెలుపొందడం విశేషం. సెమీఫైనల్లో సుజీత్ 11–0తో (5 నిమిషాల 17 సెకన్లు) జోసెఫ్ క్రిస్టోఫర్ (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో (4 నిమిషాల 6 సెకన్లు) నికా జకాష్విలి (జార్జియా)పై, తొలి రౌండ్లో 16–4తో (3 నిమిషాల 33 సెకన్లు) ఎండ్రియో అవిదిలి (అల్బేనియా)పై విజయం సాధించాడు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నీల్లో సుజీత్కిది నాలుగో స్వర్ణం కావడం విశేషం. 2022లో జుహైర్ ఎస్గెయిర్ టోర్నీలో, 2025లో పొల్యాక్ ఇమ్రె–వర్గా యోనస్ స్మారక టోర్నీలో, 2026 జాగ్రెబ్ ఓపెన్ టోర్నీలో సుజీత్ పసిడి పతకాలు గెలిచాడు. -
‘షూటౌట్’లో గెలిచాం
స్వదేశంలో గెలుపు ఖాతా తెరవడంలో విఫలమైన భారత పురుషుల హాకీ జట్టు విదేశీ గడ్డపై ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. రెండో అంచె చివరి లీగ్ మ్యాచ్లో నిర్ణీత సమయంలో నేరుగా కాకపోయినా ‘షూటౌట్’లో విజయాన్ని అందుకుంది. ప్రపంచ, ఒలింపిక్ మాజీ చాంపియన్ ఆ్రస్టేలియాను వారి గడ్డపైనే ‘షూటౌట్’లో ఓడించిన భారత జట్టు మూడో అంచె మ్యాచ్లను జూన్లో నెదర్లాండ్స్లో ఆడనుంది. హోబర్ట్: మొదటి ఐదు మ్యాచ్ల్లో నిర్ణీత సమయంలో పరాజయం... ఆ తర్వాతి రెండు మ్యాచ్ల్లో ‘షూటౌట్’లో ఓటమి... ఎలాగైతేనేం వరుసగా ఏడు పరాజయాలు... కానీ ఎనిమిదో ప్రయత్నంలో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు రుచి చూడటంలో సఫలమైంది. ఆ్రస్టేలియాలాంటి పటిష్ట జట్టును వారి గడ్డపైనే ‘షూటౌట్’లో ఓడించి రెండో అంచె లీగ్ను భారత జట్టు ముగించింది. బుధవారం జరిగిన ప్రొ లీగ్ ఎనిమిదో మ్యాచ్లో హార్దిక్ సింగ్ బృందం ‘షూటౌట్’లో 3–1 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియాపై జట్టుపై గెలిచింది. భారత్కు రెండు పాయింట్లు, ఆ్రస్టేలియాకు ఒక పాయింట్ లభించాయి. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించగా... భారత్ తరఫున గోల్కీపర్ శశికుమార్ మోహిత్ హొన్నేణహళ్లి హీరోగా అవతరించాడు. ముగ్గురు ఆ్రస్టేలియా ఆటగాళ్ల షాట్లను మోహిత్ అడ్డుకొని భారత్ను గెలిపించాడు. భారత్ తరఫున ‘షూటౌట్’లో శిలానంద్ లాక్రా, మణీందర్ సింగ్, విష్ణుకాంత్ సింగ్ సఫలంకాగా... అభిషేక్ విఫలమయ్యాడు. ఆ్రస్టేలియా తరఫున మొదటి మూడు షాట్లు తీసుకున్న టిమ్ బ్రాండ్, లియామ్ హెండర్సన్, కూపర్ బర్న్స్ విఫలమవ్వగా... నాలుగో షాట్లో జెరెమీ హేవార్డ్ సఫలమయ్యాడు. అంతకుముందు రెగ్యులర్ సమయంలోని మూడు క్వార్టర్స్లో రెండు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. చివరి క్వార్టర్లోని 49వ నిమిషంలో జెరెమీ హేవార్డ్ పెనాల్టీ కార్నర్ను లక్ష్యానికి చేర్చాడు. దాంతో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం రెండు నిమిషాల్లో ఆవిరైంది. 51వ నిమిషంలో భారత ఫార్వర్డ్ శిలానంద్ లాక్రా గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. చివరి తొమ్మిది నిమిషాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు మరో గోల్ చేయడానికి ప్రయత్నించి సఫలం కాలేకపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టు తమకు లభించిన ఐదు పెనాల్టీ కార్నర్లను వృథా చేసింది. ఆ్రస్టేలియా తమకు దక్కిన ఏడు పెనాల్టీ కార్నర్లలో ఒక దానిని సద్వినియోగం చేసుంది. జూన్ 14 నుంచి 21 వరకు రోటర్డామ్లో మూడో అంచె మ్యాచ్లు జరుగుతాయి. భారత జట్టు జూన్ 14న నెదర్లాండ్స్తో... 17న జర్మనీతో... 18న మళ్లీ జర్మనీతో... 21న మళ్లీ నెదర్లాండ్స్తో ఆడుతుంది. అనంతరం 23 నుంచి 28 వరకు లండన్లో నాలుగో అంచె మ్యాచ్లు జరుగుతాయి. భారత జట్టు జూన్ 23న పాకిస్తాన్తో... 25న ఇంగ్లండ్తో... 26న మళ్లీ పాకిస్తాన్తో... 28న మళ్లీ ఇంగ్లండ్తో తలపడుతుంది. -
మరోసారి ‘షూటౌట్’లో...
హోబర్ట్: ప్రొ హాకీ లీగ్లో భారత పురుషుల హాకీ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. మొదటి ఐదు మ్యాచ్ల్లో నిర్ణీత సమయంలో ఓటమి పాలైన టీమిండియా... తర్వాతి రెండు మ్యాచ్ల్లో ‘షూటౌట్’లో ఓడిపోయింది. రెండో అంచె పోటీల్లో భాగంగా మంగళవారం స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ సింగ్ బృందం ‘షూటౌట్’లో 3–4 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. స్పెయిన్కు రెండు పాయింట్లు, భారత్కు ఒక పాయింట్ లభించింది. నిర్ణీత సమయంలో 59 నిమిషాల వరకు 1–0తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు... 59వ నిమిషంలో గోల్ సమర్పించుకుంది. దాంతో స్పెయిన్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆట 19వ నిమిషంలో మణీందర్ సింగ్ గోల్తో భారత్ ఖాతా తెరిచింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి విజయం దిశగా సాగింది. మరో రెండు నిమిషాలు పూర్తయితే భారత్కు తొలి గెలుపు ఖాయమయ్యే స్థితిలో స్పెయిన్ ప్లేయర్ బ్రూనో ఫాంట్ గోల్ చేశాడు. చివరి 13 సెకన్లలో స్పెయిన్కు ఏకంగా మూడు పెనాల్టీ కార్నర్లను సమర్పించుకున్న భారత్ వాటిని నిలువరించింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో స్పెయిన్ ఆటగాళ్లు తొలి నాలుగు అవకాశాలను సద్వినియోగం చేసుకోగా... భారత్ తరఫున అభిషేక్, కెప్టెన్ హార్దిక్ సింగ్ గురి తప్పడంతో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్లో స్పెయిన్కు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు, భారత్కు నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే రెండు జట్లు అన్నింటిని వృథా చేశాయి. నేడు జరిగే రెండో అంచె చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న భారత జట్టు రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. -
ఈసారి ‘షూటౌట్’లో...
హోబర్ట్: వేదిక మారినా... ప్రత్యర్థులు మారినా... కెప్టెన్సీ మారినా... తాజా సీజన్లో భారత పురుషుల హాకీ జట్టు ఆటతీరు మాత్రం మారడంలేదు. ప్రొ లీగ్ రెండో అంచె పోటీల్లో భాగంగా ఆస్ట్రేలియాకు వచ్చిన భారత హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. భారత్ వేదికగా జరిగిన తొలి అంచె పోటీల్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయిన టీమిండియా... ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన సీజన్ ఆరో మ్యాచ్లో హార్దిక్ సింగ్ సారథ్యంలోని టీమిండియా ‘షూటౌట్’లో 4–5 గోల్స్ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో ఆ్రస్టేలియా తరఫున టిమ్ బ్రాండ్, లియామ్ హెండర్సన్, టిమ్ హోవర్డ్, జాక్ వెల్్చ, టామ్ క్రెయిగ్ గోల్స్ చేశారు. భారత్ తరఫున శిలానంద్ లాక్రా, మణీందర్ సింగ్, రాజ్కుమార్ పాల్, జుగ్రాజ్ సింగ్ గోల్స్ సాధించగా... ఆదిత్య అర్జున్ తీసుకున్న చివరిదైన ఐదో షాట్ను ఆస్ట్రేలియా గోల్కీపర్ జేడ్ స్నోడెన్ అడ్డుకోవడంతో భారత్కు ఓటమి తప్పలేదు. అంతకుముందు నిర్ణీత సమయంలో భారత్ తరఫున అమిత్ రోహిదాస్ (15వ నిమిషంలో), జుగ్రాజ్ సింగ్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఆ్రస్టేలియా జట్టుకు జోయెల్ రింటాలా (47వ, 56వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు. స్పెయిన్తో శనివారం జరిగిన మ్యాచ్లో 0–2తో ఓడిన భారత్ ఈ మ్యాచ్లో మెరుగైన ఆటతీరు కనబరిచింది. ఒకదశలో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లి తొలి విజయం దిశగా సాగిపోయింది. అయితే చివర్లో తప్పిదాలు చేసి తొమ్మిది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సమర్పించుకుంది. మ్యాచ్లో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను భారత్ సది్వనియోగం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఏకంగా 14 పెనాల్టీ కార్నర్లు సంపాదించినా... రెండింటిని మాత్రమే లక్ష్యానికి చేర్చింది. ‘షూటౌట్’లో ఓడినందుకు భారత జట్టుకు ఒక్క పాయింట్... ఆ్రస్టేలియాకు రెండు పాయింట్లు లభించాయి. నిర్ణీత సమయంలో విజయం సాధిస్తే మూడు పాయింట్లు దక్కుతాయి. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్లో స్పెయిన్ జట్టుతో భారత్ ఆడుతుంది. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో భారత జట్టు ఆరు మ్యాచ్లు ఆడి ఒక్క పాయింట్తో ఎనిమిదో స్థానంలో ఉంది. -
సింగిల్స్ రన్నరప్ వైష్ణవి
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ–100 బెంగళూరు ఓపెన్లో భారత క్రీడాకారిణి వైష్ణవి అడ్కర్ రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన వైష్ణవి 0–6, 1–6తో ప్రపంచ 124వ ర్యాంకర్ హనీ వాండెవింకెల్ (బెల్జియం) చేతిలో ఓడిపోయింది. 56 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో వైష్ణవి ఒక్క గేమ్ మాత్రమే గెలిచింది. తన సర్వీస్ను ఆరుసార్లు కోల్పోయింది. విజేత వాండెవింకెల్కు 15,239 డాలర్ల (రూ. 13 లక్షల 82 వేలు) ప్రైజ్మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ వైష్ణవికి 8,147 డాలర్ల (రూ. 7 లక్షల 39 వేలు) ప్రైజ్మనీతోపాటు 65 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ ర్యాంకింగ్స్లో 690వ ర్యాంక్లో ఉన్న వైష్ణవి ఈ టోర్నీలో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగింది. ఫైనల్ చేరే క్రమంలో ఈ పుణే అమ్మాయి తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ముగ్గురు క్రీడాకారిణులను ఓడించింది. వైష్ణవి ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 220వ ర్యాంకర్ మాయ్ హొంటామా (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 148వ ర్యాంకర్ టేలా ప్రెస్టన్ (ఆ్రస్టేలియా)పై, సెమీఫైనల్లో ప్రపంచ 126వ ర్యాంకర్ లాన్లానా (థాయ్లాండ్)లపై సంచలన విజయాలు సాధించింది. తద్వారా 2009లో పట్టాయా ఓపెన్లో సానియా మీర్జా ఫైనల్ చేరిన తర్వాత... డబ్ల్యూ–100 లెవెల్ టోర్నీలో సింగిల్స్ టైటిల్ పోరుకు చేరిన రెండో భారతీయ క్రీడాకారిణిగా వైష్ణవి గుర్తింపు పొందింది. -
మెయిన్ ‘డ్రా’కు రామ్–జీవన్ జోడీ
న్యూఢిల్లీ: దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ చాంపియన్షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో రామ్కుమార్ రామనాథన్–జీవన్ నెడుంజెళియన్ (భారత్) జోడీ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ఆదివారం దుబాయ్లో జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్లో రామ్కుమార్–జీవన్ ద్వయం 6–4, 7–6 (7/4)తో కారోల్ ద్రెజెవ్స్కీ–పీటర్ మతుజెవ్స్కీ (పోలాండ్) జంటను ఓడించింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జోడీ ఏడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సర్వీస్లో 42 పాయింట్లు, రెండో సర్వీస్లో ఎనిమిది పాయింట్లు సాధించింది. తమ సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్లో రామ్–జీవన్ 6–5, 7–6 (7/4) స్కోరుతోనే భారత్కే చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విజయ్ సుందర్ ప్రశాంత్లపై గెలుపొందడం విశేషం. డబుల్స్ మెయిన్ ‘డ్రా’లో యూకీ బాంబ్రీ (భారత్)–గొరాన్సన్ (స్వీడన్); శ్రీరామ్ బాలాజీ (భారత్)–ఒబెర్లీట్నెర్ (ఆ్రస్టియా) జోడీలు కూడా ఉన్నాయి. -
భారత జట్టులో తెలంగాణ అమ్మాయి
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఆసియా కప్ మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది.గ్రూప్ ‘సి’లో ఉన్న భారత్ మార్చి 4న పెర్త్లో వియత్నాంతో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత మార్చి 7న జపాన్తో, మార్చి 10న చైనీస్ తైపీతో టీమిండియా పోటీపడుతుంది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకునే నాలుగు జట్లు 2027 ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. ‘స్వర్ణ’ సరిత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు క్రీడల్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన బానోత్ సరిత మూడు స్వర్ణ పతకాలతో మెరిపించింది. సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఈ పోటీల్లో సరిత పవర్లిఫ్టింగ్, బాక్సింగ్, ఆర్మ్ రెజ్లింగ్ క్రీడాంశాల్లో బరిలోకి దిగి విజేతగా నిలిచింది.పవర్లిఫ్టింగ్లో 63 కేజీల విభాగంలో పోటీపడ్డ సరిత డెడ్లిఫ్ట్లో 105 కేజీలు, బెంచ్ప్రెస్లో 40 కేజీలు, స్క్వాట్లో 55 కేజీలు బరువెత్తి అగ్రస్థానాన్ని సంపాదించింది. ప్రస్తుతం హైదరాబాద్ సీఐడీలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న సరిత... గత ఏడాది కరీంనగర్లో జరిగిన రాష్ట్ర పోలీసు క్రీడల్లోనూ రాణించి రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది. -
షకీల్పై నిషేధం ఎత్తివేత
లాహోర్: పాకిస్తాన్ హాకీలో సంక్షోభం ముదురుతున్న వేళ ఆ దేశ సర్కారు జోక్యం చేసుకుంది. పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ అమద్ షకీల్ భట్పై ఆ దేశ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) విధించిన రెండేళ్ల నిషేధాన్ని పాక్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిషేధం నియమావళికి విరుద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. ఆ్రస్టేలియా పర్యటనలో పీహెచ్ఎఫ్ నిర్వహణ లోపంతో పాకిస్తాన్ హాకీ ఆటగాళ్లు వీధిన పడ్డారు. బసచేస్తున్న హోటల్కు నిధులు విడుదల చేయకపోవడంతో ఆటగాళ్లంతా రోడ్లపై పడిగాపులు కాశారు. దీంతో పీహెచ్ఎఫ్ నిర్వాకంపై కెప్టెన్ షకీల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీన్ని సహించలేకపోయిన పీహెచ్ఎఫ్ అధ్యక్షుడు తారిఖ్ బగ్తీ క్రమశిక్షణ చర్యల కింద కెప్టెన్పై నిషేధం విధించారు. తర్వాత తన ఆధ్యక్ష పదవికి బగ్తీ రాజీనామా చేశారు. ఆసీస్లో పాక్ అప్రతిష్టపాలుపై గుర్రుగా ఉన్న పీహెచ్ఎఫ్ ప్యాట్రన్ ఇన్ చీఫ్, దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్... బగ్తీ రాజీనామాను వెంటనే ఆమోదిస్తూ అహ్మద్ అధ్యక్షతన అడ్హక్ కమిటీని నియమించారు. అలాగే కెపె్టన్ షకీల్పై నిషేధం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని బగ్తీ విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. -
తొలి గెలుపు కోసం...
హోబర్ట్: సొంతగడ్డపై జరిగిన పురుషుల ప్రొ లీగ్ తొలి అంచెలో భారత హాకీ జట్టుకు నిరాశ ఎదురైంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది. అర్జెంటీనా, బెల్జియం జట్లతో రెండుసార్లు చొప్పున ఆడిన భారత జట్టు ఒక్క మ్యాచ్లోనూ గెలుపు రుచి చూడలేదు. ఇప్పుడు రెండో అంచె మ్యాచ్లకు భారత బృందం సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్లో స్పెయిన్తో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత ఆదివారం జరిగే రెండో మ్యాచ్లో ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. ఒక రోజు విశ్రాంతి తర్వాత 24న స్పెయిన్తో, 25న ఆ్రస్టేలియాతో టీమిండియా ఆడుతుంది. భారత అంచె పోటీల్లో సారథ్యం వహించిన హర్మన్ప్రీత్ సింగ్ వ్యక్తిగత కారణాలరీత్యా రెండో అంచె మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో హర్మన్ప్రీత్ స్థానంలో హార్దిక్ సింగ్ భారత జట్టుకు నేతృత్వం వహిస్తాడు. టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు నెగ్గిన భారత జట్టులో హార్దిక్ సింగ్ కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. ‘స్వదేశంలో జరిగిన తొలి అంచె మ్యాచ్ల్లో పొరపాట్లు ఎక్కడ జరిగాయో సమీక్షించాం. గెలుపు బోణీ కొట్టాలనే లక్ష్యంతోనే ఆ్రస్టేలియాకు వచ్చాం’ అని మిడ్ఫీల్డ్లో ఆడే హార్దిక్ సింగ్ వ్యాఖ్యానించాడు. -
ఢిల్లీ మారథాన్ దిగ్గజాలతో షురూ
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ప్రతిష్టాత్మక ‘ఢిల్లీ మారథాన్’కు రంగం సిద్ధమైంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఉదయం జరిగే ఈ సుదీర్ఘ పరుగును భారత బాక్సింగ్ దిగ్గజం విజేందర్ సింగ్, టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. సుమారు 30 వేల పైచిలుకు మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ), అంతర్జాతీయ మారథాన్, డిస్టెన్స్ రేస్ (ఏఐఎంఎస్), ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) గుర్తింపు పొందిన ఈ సుదీర్ఘ పరుగులో కేవలం భారతీయులే కాదు విదేశీ మారథాన్ రన్నర్లు, పలువురు క్రీడాకారులు కూడా పాల్గొనేందుకు నగరానికి విచ్చేసినట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ మారథాన్ నాలుగు విభాగాల్లో జరుగుతోంది. ఇందులో మొదటిది పూర్తి మారథాన్. 42.195 కిలోమీటర్ల దూరం పరుగెత్తడం. దీంతో పాటు హాఫ్ మారథాన్ (21.09 కి.మీ.), 10కే (10 కిలో మీటర్లు), 5కే (5 కిలో మీటర్లు) పరుగు పందెంలు కూడా నిర్వహిస్తారు. అంటే సుదీర్ఘ పరుగు (42.21 కి.మీ) చేయలేని వారుసైతం నిరాశచెందకుండా 10కే, 5కే ఈవెంట్లో పరుగు పూర్తిచేయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లోని 490 నగరాలకు చెందిన ఔత్సాహికులు ఇందులో పాల్గొంటున్నారు. భారత్లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మారథాన్ ప్రియులు పరుగు పెట్టేందుకు తహతహలాడుతున్నారు. దేశీ క్రీడాకారులు అనిశ్ థాపా, బెలియప్ప, మన్ సింగ్, అక్షయ్ సైని, గోపీ, భాగిరథి బిస్త్, నిర్మాబెన్ ఠాకూర్, అశ్విని మదన్ జాదవ్, దిస్కెట్ డోల్మా, స్టాన్జిన్ డోల్కర్ తదితరులు కూడా పోటీపడుతున్నారు. ఆసియా క్రీడల క్వాలిఫయింగ్ టైమింగ్ను నమోదు చేసిన రన్నర్లకు ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో పోటీపడేందుకు అర్హత కూడా లభిస్తుంది. ఈ మారథాన్ పరుగు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తుంది. సమగ్ర వ్యర్థాల విభజన, ఒకసారి వాడి పారేసి ప్లాస్టిక్ను నిషేధించి... రీ సైక్లింగ్కు ఉపయోగపడే ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్రోత్సహించడం... ఇందుకోసం పర్యావరణ సంస్థలు, కలిసి వచ్చే స్థానికులు, అధికారులతో మారథాన్ ఆర్గనైజర్లు చేతులు కలుపుతారు. -
సీఎం కప్ ఫైనల్స్ ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: చీఫ్ మినిస్టర్ కప్ 2025 (తెలంగాణ) రెండో ఎడిషన్ రాష్ట్ర స్థాయి ఫైనల్స్ పోటీలు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిన్న (ఫిబ్రవరి 19) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డా. ఏ. సోనిబాలా దేవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ.. ఈ పోటీలను తెలంగాణ క్రీడా చరిత్రలో సరికొత్త మైలురాయిగా అభివర్ణించారు.రికార్డు స్థాయిలో దరఖాస్తులు - ఈ టోర్నీలో రాష్ట్రవ్యాప్తంగా 5,15,936 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు. - మండల, జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన 21,500 మంది అథ్లెట్లు రాష్ట్ర ఫైనల్స్కు అర్హత సాధించారు. - ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు జరిగే ఈ పోటీల్లో 44 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. చీఫ్ మినిస్టర్ కప్ ప్రధాన ఉద్దేశం.. - గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం. - రాష్ట్ర క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం. - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించడం. - క్రీడాకారుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడం.- భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలకు ప్రతిభను సిద్ధం చేయడం. -
పాక్ కెప్టెన్పై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మాద్ బట్పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతడి పట్ల పాకిస్తాన్ హాకీ సమాఖ్య (PHF) మాజీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరు అక్రమమని.. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఒకప్పుడు తోపుకాగా పాక్ హాకీ పురుషుల జట్టుకు ఘనమైన చరిత్ర ఉంది. నాలుగుసార్లు ప్రపంచ కప్ విజేత, మూడు ఒలింపిక్ స్వర్ణాలు సహా ఎన్నో ప్రతిష్టాత్మక విజయాలు సాధించింది ఆ జట్టు. అయితే, గత కొన్నేళ్లుగా రోజురోజుకీ దిగజారి పోతోంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్లో భాగంగా పాక్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వరుస ఓటములతో చతికిలపడింది. దీంతో తాజా ఎడిషన్లో ఆడిన మ్యాచ్లన్నీ ఓడి పాయింట్ల పట్టికన అట్టడుగున నిలిచింది.ప్లేట్లు కడిగి మ్యాచ్కు వెళ్లాంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో తమకు ఎదురైన చేదు అనుభవాల ఫలితమే వరుస ఓటములకు కారణమంటూ కెప్టెన్ అమ్మాద్ బట్ సంచలన ఆరోపణలు చేశాడు. హోటల్లో తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని తెలిపాడు. కిచెన్ను తామే శుభ్రపర్చుకున్న తర్వాతే మ్యాచ్ ఆడేందుకు వెళ్లాల్సి వచ్చిందని వాపోయాడు.స్వదేశానికి తిరిగి రాగానే పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్)పై అమ్మాద్ తీవ్ర విమర్శలు చేశాడు. ‘ప్రస్తుత పీహెచ్ఎఫ్ మేనేజ్మెంట్ ఇంకా కొనసాగితే మేం ఆడటం కష్టం. ప్లేట్లు కడిగి కిచెన్ను శుభ్రం చేసుకున్న తర్వాతే మ్యాచ్ ఆడేందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఇంకా మా వైపు నుంచి ఎలాంటి ఫలితాలు ఆశిస్తారు.బహిరంగంగా చెప్పాల్సి వస్తోందిదాదాపు 13–14 గంటల పాటు రోడ్డుపై వేచి చూసిన తర్వాత మాకు హోటల్లో బస ఏర్పాటు చేశారు. మేం టోర్నీ కోసం అక్కడ 13 రోజులు ఉండాల్సి ఉంటే 10 రోజుల కోసమే హోటల్ను బుక్ చేశారు. దాంతో తర్వాతి మూడు రోజుల కోసం చవకైన మరో హోటల్కు మారాల్సి వచింది. ఎంతో ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం కాబట్టే ఇప్పుడు బహిరంగంగా చెప్పాల్సి వస్తోంది’ అని షకీబ్ బట్ ఆవేదన వ్యక్తం చేశాడు.రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయంఈ పరిణామాలపై దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్కు పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డు ప్రత్యేక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో PHF అధ్యక్షుడు తారిఖ్ బుగ్టీ గురువారం తన పదవికి రాజీనామా చేశాడు. అయితే, అంతకంటే ముందు అమ్మాద్పై రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మరోసారి పాక్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వంఈ క్రమంలో పాక్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. PHF తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్ బ్యూరోక్రాట్ ముహుయుదీన్ వనీని నియమించింది. ఈ నేపథ్యంలో పగ్గాలు చేపట్టగానే ముహుయుదీన్ తొలుత అమ్మాద్ గురించే ప్రకటన చేశారు. అమ్మాద్పై నిషేధం విధిస్తూ బుగ్టీ తీసుకున్న నిర్ణయం అక్రమం, రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. వెంటనే అతడిపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ హాకీకి జరిగిన నష్టాన్ని పూడ్చి.. త్వరలోనే పరిస్థితులు చక్కదిద్దుతామని తెలిపారు.చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’ -
రుతుజా జోడీ ఓటమి
దుబాయ్: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్వన్ రుతుజా భోస్లే దుబాయ్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. బుధవారం జరిగిన డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రుతుజా (భారత్)–పీంగ్టార్న్ ప్లిపుయెచ్ (థాయ్లాండ్) ద్వయం 3–6, 6–7 (4/7)తో నాలుగో సీడ్ అనా డానిలినా (కజకిస్తాన్)–అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి రౌండ్లో రుతుజా–ప్లిపుయెచ్ 7–5, 6–2తో ఇరి హొజుమి (జపాన్)–ఫాంగ్ సియెన్ వు (చైనీస్ తైపీ)లపై గెలిచారు. ఈ విజయంతో సానియా మీర్జా (2022లో సిన్సినాటి ఓపెన్) తర్వాత డబ్ల్యూటీఏ–1000 లెవెల్ టోర్నీలో మ్యాచ్ గెలిచిన రెండో భారత ప్లేయర్గా రుతుజా గుర్తింపు పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన రుతుజా–ప్లిపుయెచ్లకు 17,200 డాలర్ల (రూ. 15 లక్షల 60 వేలు) ప్రైజ్మనీతోపాటు 120 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
అంట్లు తోముకోవాల్సి వచ్చింది: మండిపడ్డ పాక్ కెప్టెన్
పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) తీరుపై ఆ దేశ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మద్ బట్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. PHF ప్రస్తుత యాజమాన్యంతో కలిసి తాము పనిచేయలేమని తేల్చిచెప్పాడు. దేశం కాని దేశంలో తమను రోడ్ల వెంట పరిగెత్తించి.. ఆఖరికి అంట్లు తోముకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.అసలేం జరిగిందంటే.. FIH Pro Leagueలో భాగంగా తమ మ్యాచ్లు ఆడేందుకు పాక్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే, వారి వసతికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయడంలో PHF విఫలమైంది. కాన్బెర్రా వెళ్లేందుకు పాక్ జట్టు సిడ్నీ విమానాశ్రయంలో దాదాపు 13-14 గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.అనంతరం హోటల్కు వెళ్లిన తర్వాత పాక్ హాకీ జట్టుకు మరో ఘోర అవమానం ఎదురైంది. వారి పేరిట అడ్వాన్స్ బుకింగ్ లేకపోవడంతో హోటల్ మేనేజ్మెంట్ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో గంటల పాటు పాక్ హాకీ ఆటగాళ్లు రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నమే మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. ఆసీస్ చేతిలో పాక్ ఓడిపోయింది. అనంతరం జర్మనీ చేతిలోనూ ఓటమిపాలైంది.మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చిందిఈ నేపథ్యంలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అహ్మద్ బట్ స్వదేశానికి వచ్చిన తర్వాత లాహోర్ ఎయిర్పోర్టులో మీడియాకు వెల్లడించాడు. ‘‘ప్రస్తుత హాకీ ఫెడరేషన్ యాజమాన్యంతో కలిసి మేము పనిచేయలేము.మ్యాచ్ ఆడేందుకు వెళ్లే ముందు మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చింది. అలాంటపుడు మ్యాచ్ ఫలితం గురించి ఆలోచించే సమయం మాకు ఎక్కడ ఉంటుంది?.. అసలు మ్యాచ్ ఆడతామో లేదో తెలియని పరిస్థితి. ఇక ఫలితం గురించి అడగటం ఎందుకు?మాకు విదేశీ కోచ్ కావాలిమేము పది రోజుల పాటు చీప్ ఏరియాలో ఉండాల్సి వచ్చింది. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఈ విషయాల గురించి మీడియాతో మాట్లాడవద్దని మా ఫెడరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆస్ట్రేలియాలో మాకు ఏం జరిగిందో అందరికీ తెలియాలి కాబట్టే నేను మాట్లాడుతున్నాను.మాకు విదేశీ కోచ్ కావాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలము. యాజమాన్యం కూడా మంచిగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది’’ అని షకీల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా పాక్ హాకీ ఫెడరేషన్కు ప్రాటన్-ఇన్-చీఫ్గా ప్రధాని షెబాజ్ షరీఫ్ ఉంటారు.ప్రధాని దృష్టికి తీసుకువెళ్తాముఈ నేపథ్యంలో పీఎస్బీ డైరెక్టర్- జరనల్ నూర్ సభా స్పందిస్తూ.. ఆటగాళ్ల ఆరోపణలపై విచారణ చేస్తున్నామని.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని చెప్పుకొచ్చాడు. కాగా FIH Pro Leagueలో పాకిస్తాన్ ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఎనిమిది ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానం (తొమ్మిది)లో ఉంది. మరోవైపు.. బెల్జియం ఎనిమిదింట ఏడు గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. భారత్ నాలుగింటికి నాలుగు ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్ -
హర్మన్ప్రీత్ దూరం
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన పురుషుల ప్రొ లీగ్ తొలి అంచెలో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. తదుపరి ఈనెల 20 నుంచి 25 వరకు ఆ్రస్టేలియాలోని హోబర్ట్ నగరంలో భారత్ రెండో అంచె మ్యాచ్లు ఆడనుంది. అయితే ఈ అంచె మ్యాచ్లకు భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాలరీత్యా తాను హోబర్ట్ అంచె మ్యాచ్ల్లో పోటీపడే భారత జట్టుకు అందుబాటులో ఉండటం లేదని హర్మన్ప్రీత్ తెలిపాడు. హర్మన్ప్రీత్ భార్య అమన్దీప్ కౌర్ ప్రసవ తేదీ దగ్గర్లో ఉండటంతో హర్మన్ప్రీత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా హోబర్ట్ అంచె మ్యాచ్లకు భారత జట్టు సారథ్య బాధ్యతలు మిడ్ఫీల్డర్ హార్దిక్ సింగ్కు అప్పగించారు. టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు గెలిచిన భారత జట్టులో హార్దిక్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో భారత జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా తదుపరి మ్యాచ్ల కోసం భారత జట్టు ఆ్రస్టేలియాకు వెళుతుంది. హోబర్ట్ వేదికగా ఈనెల 21న స్పెయిన్తో, 22న ఆ్రస్టేలియాతో... 24న స్పెయిన్తో, 25న ఆ్రస్టేలియాతో భారత్ మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడుతుంది. భారత పురుషుల హాకీ జట్టు: సూరజ్ కర్కేరా, మోహిత్ హొనెన్నహళ్లి శశికుమార్ (గోల్కీపర్లు), అమిత్ రోహిదాస్, జర్మన్ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, అమన్దీప్ లాక్రా, యశ్దీప్ సివాచ్, పూవణ్ణ చందురబాబీ(డిఫెండర్లు), రాజిందర్ సింగ్, మన్మీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, హార్దిక్ సింగ్, మొయిరంగ్తెమ్ రబీచంద్ర సింగ్, విష్ణుకాంత్ సింగ్, రాజ్కుమార్ పాల్ (మిడ్ఫీల్డర్లు), అభిషేక్, శిలానంద్ లాక్రా, మన్దీప్ సింగ్, అరిజిత్ సింగ్ హుండల్, ఆదిత్య అర్జున్ లలాగే, అంగద్బీర్ సింగ్, మణీందర్ సింగ్ (ఫార్వర్డ్స్). -
పోరాడి ఓడిన కరణ్ సింగ్
ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నమెంట్లో తొలి రోజు భారత క్రీడాకారుడు కరణ్ సింగ్కు నిరాశ ఎదురైంది. ‘వైల్డ్ కార్డు’తో నేరుగా సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగిన కరణ్ ఈ అడ్డంకిని దాటలేకపోయాడు. ఢిల్లీ లాన్ టెన్నిస్ సంఘం (డీఎల్టీఏ) కాంప్లెక్స్లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 436వ ర్యాంకర్ కరణ్ సింగ్ 6–4, 6–7 (5/7), 3–6తో ప్రపంచ 260వ ర్యాంకర్ డేనియల్ మైకెల్స్కీ (పోలాండ్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కరణ్ ఏడు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సరీ్వస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రామ్కుమార్ రామనాథన్ 2–6, 2–6తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోగా... మనీశ్ సురేశ్ కుమార్ 6–3, 7–5తో యుసుంగ్ పార్క్ (దక్షిణ కొరియా)పై గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి సుమిత్ నగాల్, దిగ్విజయ్ ప్రతాప్ సింగ్, మానస్ ధామ్నె బరిలో ఉన్నారు. -
హాకీలో మళ్లీ ఓడిన భారత్
రూర్కెలా: సొంతగడ్డపై భారత పురుషుల హాకీ జట్టు తమ నిరాశాజనక ప్రదర్శన కొనసాగించి వరుసగా నాలుగో పరాజయం చవిచూసింది. భారత అంచె పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్లో టీమిండియా 2–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున ఆదిత్య లలాగే (50వ నిమిషంలో), సంజయ్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. అర్జెంటీనా జట్టుకు టడియో మారుకి (28వ, 49వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించగా... టొమాస్ డొమెనె (18వ నిమిషంలో), లూసియో మెండెజ్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో భారత జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా తదుపరి మ్యాచ్ల కోసం భారత జట్టు ఆ్రస్టేలియాకు వెళుతుంది. హోబర్ట్ వేదికగా ఈనెల 21న స్పెయిన్తో, 22న ఆ్రస్టేలియాతో... 24న స్పెయిన్తో, 25న ఆ్రస్టేలియాతో భారత్ మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడుతుంది. -
బెల్జియం చేతిలో భారత్ ఓటమి
రూర్కెలా: ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భారత జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పోరులో బెల్జియం 4–2 గోల్స్ తేడాతో భారత్ను ఓడించింది. బెల్జియం తరఫున హ్యూగో లబుషేర్ (11వ నిమిషం), అలెగ్జాండర్ హెన్డ్రిక్ (14వ ని., 17వ ని.), ఆర్థర్ స్లూవర్ (15వ ని.) గోల్స్ నమోదు చేశారు. భారత ఆటగాళ్లలో ఆదిత్య అర్జున్ (24వ ని.), హర్మన్ప్రీత్ సింగ్ (37వ ని.) గోల్స్ సాధించారు. తొలి క్వార్టర్లో 3 గోల్స్ సాధించి బెల్జియం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో క్వార్టర్లో ఇరు జట్లు చెరో గోల్ చేయగా, మూడో క్వార్టర్లో భారత్ ఖాతాలో మరో గోల్ చేరింది. అయితే చివరి క్వార్టర్లో రాణించి ఓటమినుంచి తప్పించుకోవాలని భారత్ చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. శనివారం జరిగిన మరో మ్యాచ్లో జర్మనీ 6–1 గోల్స్ తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. నేడు జరిగే పోరులో అర్జెంటీనాతో భారత్ తలపడుతుంది. -
భారత పోలో జట్టు పైచేయి
సాక్షి, హైదరాబాద్: రాధా టీఎంటీ అంతర్జాతీయ ఎరీనా పోలో చాంపియన్షిప్లో భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. లక్సెంబర్గ్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు 15–5 గోల్స్ తేడాతో నెగ్గింది. తొలి చక్కర్ ముగిశాక భారత్ 6–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్ తరఫున యూసుఫ్ అజ్మీ 2 గోల్స్, కున్వల్ విశాల్ సింగ్ 3 గోల్స్, మొహమ్మద్ నయీముద్దీన్ ఒక గోల్ చేశారు. రెండో చక్కర్లో భారత్ ఐదు గోల్స్ చేసి, రెండు గోల్స్ సమరి్పంచుకుంది. ఈ చక్కర్లో భారత్కు చెతానియా 2 గోల్స్, యూసుఫ్ అజ్మీ 2 గోల్స్ చేయగా, పెనాల్టీ ద్వారా మరో గోల్ వచి్చంది. చివరిదైన మూడో చక్కర్లో భారత్ నాలుగు గోల్స్ సాధించింది. చెతానియా, యూసుఫ్ అజ్మీ రెండు గోల్స్ చొప్పున చేశారు. -
సూపర్ స్నేహిత్...
చెన్నై: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చెన్నై స్టార్ కంటెండర్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ సంచలన ప్రదర్శనతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 100వ ర్యాంకర్ స్నేహిత్ 9–11, 15–17, 11–4, 11–6, 18–16తో ప్రపంచ 61వ ర్యాంకర్ మిజుకి ఒయ్కావా (జపాన్)ను బోల్తా కొట్టించాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో తొలి రెండు గేమ్లు కోల్పోయినప్పటికీ స్నేహిత్ పట్టువదలకుండా పోరాడాడు. వరుసగా మూడు గేమ్లు నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. నిర్ణాయక ఐదో గేమ్లో స్నేహిత్ 8–10తో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నాడు. వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన స్నేహిత్ 10–10తో స్కోరును సమం చేశాక 11–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఆరుసార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 16–16 వద్ద స్నేహిత్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. -
మన ముకేశ్ గురి బంగారం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ జూనియర్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన పిస్టల్ షూటర్ ముకేశ్ నేలవల్లి చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. చివరిరోజు శుక్రవారం గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్ రెండు పతకాలు సాధించాడు. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం నెగ్గిన ముకేశ్... టీమ్ విభాగంలో సూరజ్ శర్మ (మధ్యప్రదేశ్), అభినవ్ దేశ్వాల్ (ఉత్తరాఖండ్)లతో కలిసి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్లో ముకేశ్ ఎనిమిది పతకాలు సాధించిన ముకేశ్ జాతీయ రికార్డు నెలకొల్పడం విశేషం. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత్ క్లీన్స్వీప్ చేసింది. సూరజ్ శర్మ 585 పాయింట్లతో స్వర్ణం, ముకేశ్ 582 పాయింట్లతో రజతం, అభినవ్ దేశ్వాల్ 573 పాయింట్లతో కాంస్యం నెగ్గారు. సూరజ్, ముకేశ్, అభినవ్లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో 1740 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ధవళిక ఖాతాలో 2 పతకాలు ఇదే టోర్నీ జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో తెలంగాణ అమ్మాయి ధవళిక దేవి రెండు పతకాలు సాధించింది. వ్యక్తిగత విభాగంలో ధవళిక 614.1 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలిచింది. టీమ్ విభాగంలో ధవళిక, ప్రాచి, అనుష్కలతో కూడిన భారత జట్టు 1835.6 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించింది. గచి్చ»ౌలిలోని గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో గత మూడేళ్లుగా కోచ్ వినోద్ కనోజియా వద్ద ధవళిక శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో సీనియర్, జూనియర్ విభాగాల్లో కలిపి భారత షూటర్లు 39 స్వర్ణాలు, 18 రజతాలు, 19 కాంస్యాలతో 76 పతకాలు నెగ్గి ‘టాప్’లో నిలిచారు. -
నేటి నుంచి ఐఎస్ఎల్
కోల్కతా: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నెలలపాటు కొనసాగిన సందిగ్ధత వీడింది. నేటి నుంచి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 12వ సీజన్ ఫుట్బాల్ టోర్నీ మొదలుకానుంది. మొత్తం 14 (బెంగళూరు, చెన్నైయిన్, ఈస్ట్ బెంగాల్, గోవా, ఇంటర్ కాశీ, జంషెడ్పూర్, కేరళ బ్లాస్టర్స్, మొహమ్మదాన్ స్పోరి్టంగ్, మోహన్ బగాన్ సూపర్ జెయింట్, ముంబై సిటీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్, ఒడిశా, పంజాబ్, స్పోరి్టంగ్ క్లబ్ ఢిల్లీ) జట్లు టైటిల్ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ఒక్కో జట్టు 13 మ్యాచ్లు ఆడుతుంది. నాకౌట్ దశ లేకుండా మూడు నెలలపాటు సాగే ఈ లీగ్లో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు విజేతగా అవతరిస్తుంది. సాల్ట్లేక్ స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ మోహన్బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. రెండో మ్యాచ్లో ఇంటర్ కాశీ జట్టుతో ఎఫ్సీ గోవా జట్టు పోటీపడుతుంది. -
ఫైనల్లో రష్మిక జోడీ
పుణే: భారత మహిళల టెన్నిస్ రెండో ర్యాంకర్, హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక తన కెరీర్లో ఏడో డబుల్స్ టైటిల్కు విజయం దూరంలో నిలిచింది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో శ్రీవల్లి రష్మిక ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–అంకిత రైనా (భారత్) ద్వయం 7–5, 6–3తో పొలీనా (బెల్జియం)–మరియా గొలోవినా (రష్యా) జంటపై విజయం సాధించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక–అంకిత తమ తొలి సర్వీస్లో 27 పాయింట్లు, రెండో సర్వీస్లో 9 పాయింట్లు సంపాదించారు. తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశారు. నేడు జరిగే ఫైనల్లో మిసాకి మత్సుదా–ఇరి షిమిజు (జపాన్)లతో రష్మిక–అంకిత తలపడతారు. -
మూడు పతకాలూ మనవే
న్యూఢిల్లీ: స్వదేశంలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్లో గురువారం సీనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ క్లీన్స్వీప్ చేసింది. వ్యక్తిగతవిభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు టీమ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు స్కోరును సాధించాడు. స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. భారత్కే చెందిన నీరజ్ కుమార్ 361.8 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... అఖిల్ షెరాన్ 343.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఐశ్వర్య ప్రతాప్, నీరజ్, అఖిల్లతో కూడిన భారత బృందం 1769 పాయింట్లతో టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్లు అడ్రియన్ కర్మాకర్ 353.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... మానవేంద్ర సింగ్ షెఖావత్ 338.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని నెగ్గారు. అడ్రియన్ కర్మాకర్, మానవేంద్ర సింగ్, ప్రిన్స్లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1741 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించింది. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు భారత షూటర్లు 38 స్వర్ణాలు, 16 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి 70 పతకాలు సాధించారు. -
సెమీస్లో రష్మిక జోడీ
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక–అంకిత రైనా (భారత్) ద్వయం 7–6 (9/7), 6–3తో భారత్కే చెందిన వైష్ణవి–వైదేహి జంటపై గెలుపొందింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక–అంకిత రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేశారు. హైదరాబాద్కే చెందిన సహజ యామలపల్లికి మాత్రం నిరాశ ఎదురైంది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ (భారత్)–జుజానా పావ్లీకౌస్కా (పోలాండ్) జంట 6–4, 3–6, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో పొలీనా బఖ్ముత్కినా (బెల్జియం)–మరియా గొలోవినా (రష్యా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. -
స్నేహిత్ శుభారంభం
చెన్నై: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చెన్నై స్టార్ కంటెండర్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 100వ ర్యాంకర్ స్నేహిత్ 9–11, 11–8, 8–11, 11–7, 11–6తో భారత్కే చెందిన దివ్యాంశ్ శ్రీవాస్తవపై నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. భారత్కే చెందిన ఆకాశ్ పాల్, అంకుర్, హర్మీత్ కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. -
సహజ, రష్మిక ఓటమి
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. భారత నంబర్వన్ సహజ యామలపల్లి, రెండో ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్లో తెలంగాణ అమ్మాయి సహజ 3–6, 2–6తో టాప్ సీడ్ లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్) చేతిలో, హైదరాబాద్ ప్లేయర్ రష్మిక 2–6, 1–6తో మనన్చాయ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. డబుల్స్ విభాగం తొలి రౌండ్లో రష్మిక–అంకిత రైనా (భారత్) ద్వయం 6–1, 6–4తో జీల్ దేశాయ్–మాయా రాజేశ్వరన్ (భారత్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరింది. -
ముకేశ్కు స్వర్ణం, కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నేలవల్లి రెండు పతకాలతో మెరిశాడు. బుధవారం జరిగిన జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ముకేశ్ కాంస్య పతకం సాధించాడు. ఏడుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ముకేశ్ 19 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన సూరజ్ శర్మ 23 పాయింట్లతో రజతం నెగ్గగా... ఇండోనేసియా షూటర్ ఫవాజ్ 29 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో ముకేశ్, సూరజ్, సాహిల్లతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ముకేశ్ బృందం 1729 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సీనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ అనీశ్ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. అనీశ్ 23 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో అనీశ్, ఆదర్శ్ సింగ్, నీరజ్ కుమార్లతో కూడిన భారత బృందం 1708 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ టోరీ్నలో భారత షూటర్లు 35 స్వర్ణాలు, 15 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 64 పతకాలు గెలిచారు. -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
చెన్నై: భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని... చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో సాకేత్–సిద్ధాంత్ (భారత్) ద్వయం 2–6, 6–1, 10–2తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎరిక్ వాన్షెల్బోయిమ్ (ఉక్రెయిన్)–డెనిస్ యెవ్సెయెవ్ (కజకిస్తాన్) జంటను ఓడించింది. మరో మ్యాచ్లో గంటా సాయికార్తీక్ రెడ్డి–దిగ్విజయ్ సింగ్ (భారత్) జోడీ 4–6, 2–6తో నిక్కీ పునాచా (భారత్)–ప్రుచాయో ఇసారో (థాయ్లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. -
బెల్జియం చేతిలో భారత్ పరాజయం
రూర్కెలా: ప్రొ హాకీ లీగ్ కొత్త సీజన్ను భారత పురుషుల హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం జట్టుతో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 1–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టును బెల్జియం జట్టు కట్టడి చేసింది. కేవలం రెండు పెనాల్టీ కార్నర్లు పొందిన భారత జట్టు అందులో ఒకదానిని సది్వనియోగం చేసుకుంది. ఆట 29వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను శిలానంద్ లాక్రా గోల్గా మలిచాడు. బెల్జియం తరఫున నెల్సన్ ఒనానా (23వ నిమిషంలో), థామస్ క్రాల్స్ (53వ నిమిషంలో), అర్నో వాన్ డెసెల్ (57వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. తమకు లభించిన ఏడు పెనాల్టీ కార్నర్లను బెల్జియం వృథా చేసుకోవడం గమనార్హం. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో అర్జెంటీనాతో భారత్ ఆడుతుంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో తాజా గెలుపుతో బెల్జియం 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. -
ఆకృతికి రజతం... అంజుమ్కు కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్లు తమ జోరు ప్రదర్శిస్తున్నారు. పోటీల ఏడో రోజు సీనియర్ విభాగంలో భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. సీనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో ఆకృతి దహియా రజత పతకం నెగ్గగా... అంజుమ్ మౌద్గిల్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆకృతి 354.2 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. అంజుమ్ 340.4 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. కజకిస్తాన్ షూటర్ సోఫియా షుల్జెంకో 358.2 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొంది స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. టీమ్ విభాగంలో ఆకృతి, అంజుమ్, అషిలతో కూడిన భారత జట్టు 1756 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెల్చుకుంది. జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లోనూ భారత్కు రెండు పతకాలు లభించాయి. ప్రాచి గైక్వాడ్ (353.3 పాయింట్లు) బంగారు పతకాన్ని సాధించగా... అనుష్క ఠాకూర్ (341.1 పాయింట్లు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. టీమ్ విభాగంలో ప్రాచి, అను‡్ష్క, హేజెల్లతో కూడిన భారత జట్టు 1748 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. -
నయా రాకెట్
సాక్షి క్రీడా విభాగం : దక్షిణేశ్వర్ సురేశ్... గతేడాదే డేవిస్కప్లో అరంగేట్రం చేశాడు. తొలి ప్రయత్నంలోనే బోణీ కూడా కొట్టాడు. అయినా మనకెవరికీ తెలియదు. తాజాగా తెలిసింది. తెలియని వారు సైతం తెలుసుకుంటున్నారు. గూగుల్లో ఎవరీ దక్షిణేశ్వర్ అని సెర్చ్ చేస్తున్నారు. ఇంతలా నెటిజన్ల కంటపడుతున్న అతను ఏం చేశాడో చెప్పాల్సిన పనైతే లేదు. ఎందుకంటే అతనొక సంచలనం. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్–1లో నెదర్లాండ్స్ జట్టుతో భారత్ ఆడితే... తలపడింది... ఎదురుపడింది... ఎదుర్కొని గెలిపించింది మాత్రం దక్షిణేశ్వరే! ఇందులో ఏ మాత్రం అతిశయోక్తే లేదు. పోటీ... నైపుణ్యం నిండిన ప్రస్తుత కాలంలో దక్షిణేశ్వర్ ముమ్మాటికి ఓ నిశ్శబ్ద చాంపియన్. జూనియర్ సర్క్యూట్, ఏటీపీ చాలెంజర్... ఐటీఎఫ్ ... ఇలా ఎన్నో పేర్లతో టోర్నీలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అన్నింటా ఆడుతూనే ఉన్నా... ఏ టోర్నీలోనూ కంటబడని తమిళనాడు యువతార ఏకంగా చాంపియన్గా బయటపడటమే పెద్ద విశేషం. ఒకప్పుడు ఆట కోసం కిట్ బ్యాగులు మోసిన భుజాలే ఇప్పుడు డేవిస్ కప్లో భారత బాధ్యతల్ని మోస్తున్నాయి. ఎంతో క్రమశిక్షణతో కూడిన అతని శిక్షణ, పోటీలు, విజయాలు ఇవన్నీ కూడా గమనించిన వారికి ముచ్చటేయకుండా ఉండదు. పొద్దెక్కముందే ట్రెయినింగ్... మధ్యలో పోటీలు... పిడికిలి బిగిస్తే విజయాలు అన్నీ కూడా ఓ క్రమపద్దతిలో కష్టపడితేనే వచ్చాయి. ఓపికగా, ఒద్దికగా అన్నింటిని భరించిన దక్షిణేశ్వర్ ఈ క్రమంలో క్రీడా జర్నలిస్టుల ప్రాధాన్యంలోనూ లేడు. కానీ ఒక్కసారిగా సంచలన విజయాలతోనే అందరి కళ్లముందుకు వచ్చాడు. ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్ ప్రకారమైతే డేవిస్కప్లో భారత జట్టు తరఫున నంబర్వన్ సుమిత్ నగాల్ తర్వాత ఆర్యన్ షా, కరణ్ సింగ్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలి. అయితే భారత నాలుగో ర్యాంకర్గా ఉన్న దక్షిణేశ్వర్ ఆటతీరుపై నమ్మకంతో భారత జట్టు నాన్ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్పాల్ ఈ తమిళనాడు పొడగరికి ఏకంగా మూడు మ్యాచ్లు (సింగిల్స్, డబుల్స్, రివర్స్ సింగిల్స్) ఆడే అవకాశం ఇచ్చాడు. రోహిత్ రాజ్పాల్తోపాటు భారత టీమ్ మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా అంచనాలకు మించి రాణించిన దక్షిణేశ్వర్కు భారత్కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. తొలినాళ్ల ప్రయాణమిది తమిళనాడులోని దిండిగుల్ పట్టణానికి చెందిన దక్షిణేశ్వర్ తండ్రి సురేశ్ ఎక్కా కూడా టెన్నిస్ ప్లేయరే! రాష్ట్రానికి, దేశానికి ఆడలేదు కానీ క్లబ్ లెవెల్ ఆటగాడు సురేశ్. బహుశా ఈ మూలాలే దక్షిణేశ్వర్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చాయేమో! చెన్నైలోని కోచ్ లక్ష్మణ్ చక్రవర్తి శిక్షణలో ఓనమాలు, తర్వాత మెలకువలు నేర్చుకొని రాటుదేలాడు. 2010 నుంచి 2016 వరకు తన ఉండే ఊరి నుంచి 16 కిలోమీటర్లు కిట్ బ్యాగులు మోసుకొని చెన్నై వెళ్లి చక్రవర్తి ఇచ్చే రోజువారీ శిక్షణ ముగించుకొని తిరిగి బస్సులో ఇంటికి చేరేవాడు. నిండా పదేళ్లు (9) లేకపోయినా సురపేట్ నుంచి మొగప్పాయిర్, అక్కడి నుంచి అన్నా నగర్, అటుపై లయోలా కాలేజ్ అతని టెన్నిస్ శిక్షణ సాగేదని కోచ్ చక్రవర్తి వివరించారు. ‘అదేంటో ఏమో దక్షిణేశ్వర్ బాల్యం నుంచే ఎవరితోనైనా సరే ఆడేందుకు ఇష్టపడేవాడు. కష్టపడేందుకు, నేర్చుకునే క్రమంలో ఆడిగేందుకు సిగ్గుపడడు. కానీ తన పనిమాత్రం నింపాదిగా, నిశ్శబ్దంగానే చేసుకునేవాడు. అతనిది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పెప్సీ, కోక్లాంటి కూల్డ్రింక్స్ తాగేవాడే కాదు. కఠినమైన క్రమశిక్షణతోనే మెలిగేవాడు. అవకాశాలేమో పరిమితంగా వస్తే, ఆర్థిక సమస్యలు అపరిమితంగా చుట్టిముట్టినా కూడా క్రమశిక్షణతోనే అధిగమించాడు. 2016లో ఫ్రాన్స్లో శిక్షణకు వెళ్లాడు. ఆ తర్వాతే అండర్–16 జాతీయ టోర్నీలో విజేతగా నిలిచాడు’ అని 65 ఏళ్ల కోచ్ లక్ష్మణ్ చక్రవర్తి తన శిష్యుడి ప్రయాణం చెబుతూ మురిసిపోయారు. ప్రస్తుతం అమెరికాలో... దక్షిణేశ్వర్ ఆటలో క్రమంగా రాటుదేలుతున్నా... చదువెందుకని ఏనాడు అనుకోలేదు. ఆటలో కష్టపడ్డట్లే ఉన్నత విద్య కోసం కూడా అంతే క్రమశిక్షణతో కష్టపడుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని ‘వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ’లో కమ్యూనికేషన్స్ విద్యను అభ్యసిస్తున్న అతని చదువు ఈ ఏడాది మే నెలలో పూర్తవనుంది. ఆ తర్వాత పూర్తిగా టెన్నిస్పైనే దృష్టి సారించనున్నాడు. దీంతో మరిన్ని విజయాలతో 470వ ర్యాంకులో ఉన్న ఈ తమిళనాడు ప్లేయర్ నిలకడైన విజయాలు సాధిస్తే మరో ఏడాది తిరిగేసరికి టాప్–100 ర్యాంకింగ్స్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏడాది గడిచే సరికి...గతేడాది డేవిస్ కప్లో భారత్... స్విట్జర్లాండ్తో ఆడింది. 3–1తో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ ఆడిన భారత డేవిస్ బృందంలో దక్షిణేశ్వర్ ఉన్నాడు. బరిలోకి దిగి సింగిల్స్లో గెలిచాడు. అలా భారత్ విజయంలో దక్షిణేశ్వర్ పాత్ర ఉంది. ఏడాది తిరిగేసరికి 22 ఏళ్ల క్రితం లియాండర్ పేస్ రికార్డునే సమం చేసిన ఘనత దక్షిణేశ్వర్ది! 2004లో జపాన్పై పేస్ 3 మ్యాచ్లాడి పేస్ గెలిపించాడు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత దక్షిణేశ్వర్ నెదర్లాండ్స్తో తొలి సింగిల్స్ ఆడి గెలిచాడు. రెండో రోజు డబుల్స్, రివర్స్ సింగిల్స్ వరుసగా ఆడి కూడా గెలిపించాడు. పేస్ తర్వాత... దక్షిణేశ్వర్ కంటే ముందు... సోమ్దేవ్, విష్ణువర్ధన్, సాకేత్ మైనేని, సుమిత్ నగాల్, యూకీ బాంబ్రీ, గుణేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెడుంజెళియన్ ఇలా ఎంతోమంది వచ్చారు. మెరుగైన ర్యాంకింగ్స్లో నిలిచారు. డేవిస్ కప్ ఆడారు. కానీ దక్షిణేశ్వర్ ర్యాంకింగ్స్లో వెనుకబడినా... భారత్ను ముందుండి గెలిపించే ప్రదర్శనైతే చేయలేదు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సహజ, రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్లో భారత నంబర్వన్ సహజ యామలపల్లి, రెండో ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేశారు. పుణేలో ఈ టోర్నీ జరుగుతోంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలంగాణ అమ్మాయి సహజ 6–4, 7–6 (8/6)తో ఎకతెరీనా మక్లాకోవా (రష్యా)పై, హైదరాబాద్ ప్లేయర్ రష్మిక 6–3, 6–2తో విక్టోరియా మిలోవనోవా (రష్యా)పై విజయం సాధించారు. మక్లాకోవాతో 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సహజ నాలుగు ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన తొలి సర్వీస్లో 31 పాయింట్లు, రెండో సర్వీస్లో 14 పాయింట్లు స్కోరు చేసింది. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మిలోవనోవాతో 86 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో రష్మిక తొమ్మిది ఏస్లు సంధించింది. తొలి సర్వీస్లో 32 పాయింట్లు, రెండో సర్వీస్లో తొమ్మిది పాయింట్లు సాధించింది. తన సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోని రష్మిక ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. టాప్ సీడ్ జోడీని ఓడించి... డబుల్స్ విభాగంలో సహజ (భారత్)–జుజానా పావ్లీకౌస్కా (పోలాండ్) జోడీ సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో సహజ–జుజానా ద్వయం 4–6, 7–6 (7/4), 11–9తో టాప్ సీడ్ ప్రార్థన తొంబారే (భారత్)–నికోల్ ఫోసా హ్యుర్గో (అర్జెంటీనా) జంటను బోల్తా కొట్టించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్లో హైదరాబాద్ అమ్మాయి చిలకలపూడి శ్రావ్య శివాని–ఆకాంక్ష (భారత్) జోడీ 4–6, 3–6తో డేయోన్ బ్యాక్–సోహున్ పార్క్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. -
శుభారంభం లక్ష్యంగా...
రూర్కెలా: గత ప్రొ లీగ్ సీజన్లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్న భారత పురుషుల హాకీ జట్టు ఈసారి మెరుగైన ప్రదర్శన కనబర్చాలని పట్టుదలతో ఉంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భాగంగా నేటి నుంచి భారత అంచె మ్యాచ్లు జరుగుతాయి. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత జట్టుతో రెండు మ్యాచ్ల చొప్పున ఆడేందుకు ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం, నాలుగో ర్యాంకర్ అర్జెంటీనా జట్లు సిద్ధమయ్యాయి.బుధవారం జరిగే తొలి మ్యాచ్లో బెల్జియంతో ఆడనున్న టీమిండియా... గురువారం ఒలింపిక్ మాజీ చాంపియన్ అర్జెంటీనాతో తలపడుతుంది. శుక్రవారం విశ్రాంతి దినం తర్వాత శనివారం బెల్జియం జట్టుతో, ఆదివారం అర్జెంటీనాతో భారత్ మళ్లీ ఆడుతుంది. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్ తాజా సీజన్లో భారత్ మాత్రమే చివరి జట్టుగా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. నెదర్లాండ్స్, ఇంగ్లండ్ ఎనిమిదేసి మ్యాచ్లు... అర్జెంటీనా, బెల్జియం, జర్మనీ నాలుగేసి మ్యాచ్లు... పాకిస్తాన్ ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. గత సీజన్లో మాదిరిగా ఈసారి కూడా హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోనే భారత్ బరిలోకి దిగనుంది. సీనియర్ స్టార్ మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్పై వేటు వేయడంతో అతని లేని లోటు తెలియకుండా తమ సత్తా చాటుకోవాలని అమన్దీప్ లాక్రా, మన్మీత్ సింగ్, రోషన్ కుజుర్ సిద్ధంగా ఉన్నారు. ముఖాముఖి పోరులో భారత్పై బెల్జియందే పైచేయిగా ఉంది. గత 13 ఏళ్లలో రెండు జట్లు 35 సార్లు తలపడ్డాయి. 22 మ్యాచ్ల్లో బెల్జియం గెలుపొందగా... 11 మ్యాచ్ల్లో భారత్ నెగ్గింది. మరో రెండు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. -
పావురాల రెట్టలతో పరువు పోయినా.. ఓ శుభవార్త
అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో టోర్నీల నిర్వహణకు సంబంధించి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం పలు టోర్నమెంట్లో స్థాయిని తగ్గించడంతో పాటు మరికొన్ని టోర్నీలను అదనంగా చేర్చారు.వరల్డ్ టూర్ టోర్నమెంట్ల నిర్వహణ కోసం గత ఏడాది 32 దేశాలు దరఖాస్తు చేయగా, ఈసారి డిమాండ్ మరింతగా పెరిగి 56 దేశాలు మ్యాచ్ల నిర్వహణకు ఆసక్తి చూపించాయి. అస్తవ్యస్త నిర్వహణ పట్ల విమర్శలు.. అయినా ఓ శుభవార్తదాంతో భిన్న దేశాల్లో ఆటకు గుర్తింపు తీసుకురావడంలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. దీని ప్రకారం భారత్ ఎప్పటిలాగే కచ్చితంగా నిర్వహించే ఏడాదికి నాలుగు టోర్నీల సంఖ్య తగ్గి రెండుకు పరిమితం అయింది.ఇక 2023లో సూపర్–750 టోర్నీగా గుర్తింపు తెచ్చుకున్న ఇండియా ఓపెన్ (India Open Retains)అదే స్థాయిలో కొనసాగుతుంది. ఇటీవల ఈ టోర్నీ అస్తవ్యస్త నిర్వహణ పట్ల పలు విమర్శలు వచ్చిన... అదృష్టవశాత్తూ బీడబ్ల్యూఎఫ్ నుంచి ఎలాంటి చర్యలూ ఎదురు కాలేదు. సయ్యద్ మోడీనే స్థాయి తగ్గించిఅయితే మరో టోర్నీ సయ్యద్ మోడీ సూపర్–300 స్థాయి మాత్రం మారింది. లక్నోలో ప్రతీ ఏటా భారత మాజీ షట్లర్ సయ్యద్ మోడీ సంస్మరణార్ధం నిర్వహించే ఈ టోర్నీని ఇప్పుడు సూపర్–100కు పరిమితం చేశారు.ఇండియా ఓపెన్ కాకుండా తమకు సూపర్–100 మాత్రమే దక్కే అవకాశం ఉండటంతో దేశంలో చాలా ఏళ్లుగా జరుగుతున్న టోర్నీ కాబట్టి పేరు మార్చకుండా సయ్యద్ మోడీనే స్థాయి తగ్గించి కొనసాగించాలని నిర్ణయించుకున్న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) స్పష్టం చేసింది. ఇప్పటి వరకు భారత్లో కొనసాగుతున్న మరో రెండు సూపర్–100 టోర్నీలు (గువహటి, ఒడిషా)లను సర్క్యూట్నుంచి బీడబ్ల్యూఎఫ్ పూర్తిగా తొలగించింది. మొత్తం 36 టోర్నీలు... బీడబ్లూఎఫ్ కొత్త క్యాలెండర్ ప్రకారం ఒక ఏడాదిలో టోర్నీలను ఆరు స్థాయిల్లో విభజించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ అన్నింటికంటే అగ్రభాగాన ఉంటుంది. ఆ తర్వాత 5 సూపర్–1000, 5 సూపర్–750, 9 సూపర్–500, 8 సూపర్–300 టోర్నీలు జరుగుతాయి. తొలి సారి సూపర్–100 టోర్నీలను కూడా ప్రధాన టూర్ సర్క్యూట్లో చేర్చారు. ఏడాదికి 8 సూపర్–100 టోర్నమెంట్లు నిర్వహిస్తారు.గతంలో సూపర్–1000 టోర్నీలు నాలుగు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటిని ఐదుకు పెంచారు. అన్ని టోర్నీలు కలిపి మొత్తం ప్రైజ్మనీని 26.9 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 245 కోట్లు) పెంచుతున్నట్లు కూడా బీడబ్ల్యూఎఫ్ ప్రటించింది. ఫార్మాట్లో కూడా స్వల్ప మార్పు చోటు చేసుకుంది.లీగ్ కం నాకౌట్ పద్ధతిలోఇప్పటి వరకు తొలి మ్యాచ్నుంచి ‘నాకౌట్’ కాగా...ఇప్పుడు దీనిని మార్చి లీగ్ కం నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహిస్తారు. ఒక్కో ప్లేయర్ ఒక టోర్నీలో కనీసం రెండు మ్యాచ్లైనా ఆడే అవకాశం కల్పించాలనేదే అందుకు కారణం. టీమ్ ఈవెంట్లు సుదిర్మన్ కప్, థామస్ కప్, ఉబెర్ కప్లలో కూడా జట్ల సంఖ్యను పెంచనున్నారు. మరింత ఎక్కువ మందికి బ్యాడ్మింటన్కు చేరువ చేసే క్రమంలో భాగంగా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్లను టీవీల్లో ప్రసారం చేయాలని ఫెడరేషన్ నిర్ణయించింది. దీని ప్రకారం ఏడాదికి కనీసం 3 వేల మ్యాచ్లు ప్రసారం అయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. పావురాల రెట్టలున్యూఢిల్లీలో ఇండియా ఓపెన్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వసతులు అధమంగా ఉన్నాయని.. ప్రాక్టీస్ కోర్టులన్నీ దుమ్ముధూళీతోనే నిండిపోయాయని డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫీల్డ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.బ్లిచ్ఫీల్డ్ విమర్శలకు మరింత బలం చేకూర్చేలా మ్యాచ్లు జరిగే సమయంలో పలుమార్లు కోర్టులో పావురాలు రెట్ట వేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగి.. మరోమారు ఇలాంటి పొరపాట్లు, నిర్వహణ వైఫల్యాలు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని నిర్ణయించింది. -
ఇలవేనిల్–అర్జున్ జోడీకి స్వర్ణ పతకం
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇలవేనిల్ వలారివన్–అర్జున్ బబూతా ద్వయం భారత్కు పసిడి పతకాన్ని అందించింది. నాలుగు జోడీల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇలవేనిల్–అర్జున్ జోడీ 505 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 10 మీటర్ల జూనియర్ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో హిమాన్షు–శాంభవి ద్వయం 502.4 పాయింట్లు స్కోరు చేసి భారత్ ఖాతాలో పసిడి పతకాన్ని చేర్చింది. ముకేశ్కు రజతం, తనిష్క్ కు కాంస్యం 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ సీనియర్ పురుషుల ఈవెంట్లో భారత షూటర్లు గుర్ప్రీత్ (575 పాయింట్లు), హర్‡్ష (571), అమన్ ప్రీత్ (569) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ జూనియర్ పురుషుల ఈవెంట్లోనూ భారత షూటర్లు క్లీన్స్వీప్తో అదరగొట్టారు. సూరజ్ శర్మ (576 పాయింట్లు)స్వర్ణం నెగ్గగా... ఆంధ్రప్రదేశ్కు చెందిన ముకేశ్ నేలవల్లి (559) రజతం... తెలంగాణకు చెందిన కొడవలి తనిష్క్ మురళీధర్ నాయుడు (557) కాంస్య పతకం సాధించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో కలిపి ఇప్పటి వరకు భారత షూటర్లు 30 స్వర్ణాలు, 12 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 50 పతకాలు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. -
దక్షిణేశ్వర్ ధమాకా
బెంగళూరు: దేశం కోసం ఆడే సమయంలో భారత టెన్నిస్ ఆటగాళ్ల ర్యాంక్లను పట్టించుకోవద్దని మరోసారి నిరూపితమైంది. దక్షిణేశ్వర్ సురేశ్... ప్రపంచ సింగిల్స్లో 465వ ర్యాంక్... భారత్లో నాలుగో ర్యాంక్... ప్రపంచ డబుల్స్లో 457వ ర్యాంక్... అయినా సొంతగడ్డపై ఈ ఆజానుబాహుడు అద్భుత ఆటతీరు ప్రదర్శించాడు.నెదర్లాండ్స్ లాంటి పటిష్ట జట్టుతో జరిగిన వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్లో అన్నీతానై ఈ తమిళనాడు ప్లేయర్ భారత్కు 3–2తో సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. ఫలితంగా డేవిస్కప్ పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో టీమిండియా వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్ రెండో రౌండ్కు అర్హత సాధించింది. 2004లో జపాన్ జట్టుపై లియాండర్ పేస్ తర్వాత భారత్ నుంచి ఒక ప్లేయర్ రెండు సింగిల్స్లో, ఒక డబుల్స్లో ఆడి గెలవడం ఇదే ప్రథమం. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 78 కేజీల బరువున్న దక్షిణేశ్వర్ ఆదివారం ముందుగా డబుల్స్ మ్యాచ్లో భారత డబుల్స్ నంబర్వన్, ప్రపంచ 20వ ర్యాంకర్ యూకీ బాంబ్రీతో జతకట్టి బరిలోకి దిగాడు. 3 గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో దక్షిణేశ్వర్–యూకీ ద్వయం 7–6 (7/0), 3–6, 7–6 (7/1)తో సాండెర్ అరెండ్స్–డేవిడ్ పెల్ జోడీని ఓడించింది. దాంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం రివర్స్ సింగిల్స్ తొలి మ్యాచ్లో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ 7–5, 1–6, 4–6తో ప్రపంచ 73వ ర్యాంకర్ జెస్పెర్ డి జాంగ్ చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్గా జరిగిన రివర్స్ సింగిల్స్ రెండో మ్యాచ్లో దక్షిణేశ్వర్ బరిలోకి దిగాడు. సాధికారిక ఆటతీరును ప్రదర్శించి 99 నిమిషాల్లో 6–4, 7–6 (7/4)తో ప్రపంచ 160వ ర్యాంకర్ గయ్ డెన్ ఉడెన్ను ఓడించి భారత్కు 3–2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. -
సర్వీసెస్ సూపర్...
గువాహటి: జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీలో సర్వీసెస్ జట్టు చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సర్వీసెస్ 1–0 గోల్స్ తేడాతో కేరళపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. సంతోష్ ట్రోఫీలో సర్వీసెస్ జట్టు విజేతగా నిలవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. సర్వీసెస్ స్ట్రయికర్ అభిõÙక్ పవార్ (109వ నిమిషంలో) మ్యాచ్లో నమోదైన ఏకైక గోల్ చేశాడు. నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లగా... అందులో సర్వీసెస్ సత్తా చాటింది. 2012–13లోనూ ఈ రెండు జట్ల మధ్యే సంతోష్ ట్రోఫీ ఫైనల్ జరగగా... అప్పుడు కూడా సర్వీసెస్నే విజయం వరించింది. ఆ మ్యాచ్లోనూ నిర్ణీత సమయంలో గోల్స్ నమోదు కాకపోగా... పెనాల్టీ షూటౌట్లో ఫలితం తేలింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో అలాంటి ప్రదర్శనే పునరావృతం అయింది. అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణి అవలంభించాయి. కేరళ జట్టు కొన్ని ప్రయత్నాలు చేసినా... సర్వీసెస్ గోల్కీపర్ గగన్దీప్ సింగ్ వాటిని చక్కగా అడ్డుకున్నాడు. అదనపు సమయంలో అభిõÙక్ గోల్తో సర్వీసెస్ ఖాతా తెరవగా... ఆఖర్లో స్కోరు సమం చేసేందుకు కేరళ ఎంత ప్రయతి్నంచినా ఫలితం లేకపోయింది. గ్రూప్ దశలోనూ ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అభిõÙక్ ఏకైక గోల్ చేసి సర్వీసెస్ను గెలిపించగా... ఇప్పుడూ అదే సీన్ రిపీట్ చేశాడు. -
భారత్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్ క్రీడల్లో చోటు సంపాదించిన లాక్రోస్ క్రీడలో భారత్ తమ సత్తా చాటుకుంది. ఆసియా చాంపియన్షిప్లో అటు పురుషుల విభాగంలో, ఇటు మహిళల విభాగంలో విజేతగా నిలిచి ‘డబుల్ ధమాకా’ సృష్టించింది. సౌదీ అరేబియాలోని రియాద్ ఆసియా లాక్రోస్ టోర్నమెంట్కు ఆతిథ్యమిచ్చింది. తెలంగాణకు చెందిన అనుదీప్ రెడ్డి నాయకత్వంలో భారత పురుషుల జట్టు 9–2 స్కోరుతో ఇరాక్ జట్టును ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. అనుదీప్ రెడ్డి నాయకత్వ పటిమతో భారత జట్టు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. మరోవైపు భారత మహిళల జట్టు ఫైనల్లో 22–5తో పాకిస్తాన్పై గెలిచి బంగారు పతకాన్ని దక్కించుకుంది. -
ఇలవేనిల్కు రెండు స్వర్ణాలు
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో ఒలింపియన్ ఇలవేనిల్ వలారివన్ రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఇలవేనిల్ వ్యక్తిగత విభాగంలో, టీమ్ విభాగంలో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇలవేనిల్ 252 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. భారత్కే చెందిన మేఘన సజ్జనార్ 229.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని సంపాదించింది. ఇలవేనిల్, మేఘన, ఆర్యా బోర్సెలతో కూడిన భారత బృందం 1892.6 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. -
ప్రపంచ 88వ ర్యాంకర్పై దక్షిణేశ్వర్ విజయం
బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న డేవిస్ కప్ పురుషుల టీమ్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్లో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నెదర్లాండ్స్ జట్టుతో జరుగుతున్న ఈ పోరులో మొదటి రోజు భారత నంబర్వన్ సుమిత్ నగాల్ ఓటమి చవిచూడగా... భారత నాలుగో ర్యాంకర్ దక్షిణేశ్వర్ సురేశ్ సంచలన విజయం సాధించాడు. దాంతో తొలి రోజు ముగిశాక భారత్, నెదర్లాండ్స్ 1–1తో సమంగా నిలిచాయి. నేడు మూడు మ్యాచ్లు (డబుల్స్, రెండు సింగిల్స్) జరుగుతాయి. ప్రపంచ 162వ ర్యాంకర్ గయ్ డెన్ ఉడెన్తో జరిగిన తొలి మ్యాచ్లో ప్రపంచ 281వ ర్యాంకర్ సుమిత్ నగాల్ 0–6, 6–4, 3–6తో ఓడిపోయాడు. 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. ప్రపంచ 88వ ర్యాంకర్ జెస్పెర్ డి జాంగ్తో జరిగిన రెండో సింగిల్స్లో ప్రపంచ 465వ ర్యాంకర్ దక్షిణేశ్వర్ అద్భుత ఆటతీరుతో మెరిపించాడు. 88 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో దక్షిణేశ్వర్ 6–4, 7–5తో జెస్పెర్ను బోల్తా కొట్టించాడు. దక్షిణేశ్వర్ తొమ్మిది ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే డబుల్స్ మ్యాచ్లో సాండెర్ అరెండ్స్–డేవిడ్ పెల్ జోడీతో యూకీ బాంబ్రీ–శ్రీరామ్ బాలాజీ ద్వయం ఆడుతుంది. అనంతరం రెండు సింగిల్స్ మ్యాచ్ల్లో జెస్పెర్తో సుమిత్, ఉడెన్తో దక్షిణేశ్వర్ తలపడతారు. -
హుసాముద్దీన్కు కాంస్యం
లా నూసియా (స్పెయిన్): బాక్సమ్ ఎలైట్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్కు కాంస్య పతకం దక్కింది. పురుషుల 60 కేజీల వెయిట్ కేటగిరీలో అతను సెమీఫైనల్లో ఓడిపోయాడు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్, ప్రపంచకప్ చాంపియన్ సచిన్ సివాచ్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. వీరితో కలుపుకొని మొత్తం 12 మంది బాక్సర్లు స్వర్ణం వేటలో పడ్డారు. ఇందులో 8 మంది మహిళా బాక్సర్లున్నారు. దీంతో భారత్కు కనీసం 12 రజతాలు ఖాయమైనట్లే! దీనికి అదనంగా మరో స్వర్ణం కూడా కచి్చతంగా భారత్ ఖాతాలో పడనుంది. ఎందుకంటే మహిళల 54 కేజీల కేటగిరీలో ఆసియా క్రీడల కాంస్య విజేత ప్రీతి పవార్, పూనమ్ ఇద్దరు భారత బాక్సర్లే తుదిపోరుకు అర్హత సాధించారు. సెమీస్లో పూనమ్ 4–1తో ఇవి జేన్ స్మిత్ (ఇంగ్లండ్)పై, ప్రీతి 5–0తో అయ హమ్ది (ఫ్రాన్స్)పై గెలుపొందారు. మహిళల 75 కేజీల కేటగిరీ సెమీస్లో లవ్లీనా 5–0తో వేల్స్కు చెందిన రోజీ ఎక్లెస్పై ఏకపక్షమైన విజయాన్ని సాధించింది. మంజు రాణి (48 కేజీలు), నీతూ (51 కేజీలు), ప్రియా (60 కేజీలు) అరుంధతి (70 కేజీలు), నైనా (80 కేజీలు) కూడా సెమీఫైనల్లో గెలిచి పసిడి పతక రేసులో నిలిచారు. పురుషుల 60 కేజీల సెమీఫైనల్లో సచిన్ సివాచ్ 5–0తో జాక్ డ్రైడెన్ (ఇంగ్లండ్)పై గెలుపొందారు. సచిన్తో పాటు దీపక్ (70 కేజీలు), ఆకాశ్ (75 కేజీలు), అంకుశ్ (80 కేజీలు)లు కూడా స్వర్ణ పతక బౌట్కు అర్హత సంపాదించారు. -
రుద్రాంక్ష్ గురి బంగారం అర్జున్కు రజతం
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, రజతం... టీమ్ విభాగంలో బంగారు పతకం లభించాయి. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్ 251.9 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. భారత్కే చెందిన అర్జున్ బబూతా 250.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలిచాడు. రుద్రాంక్ష్ , అర్జున్, విశాల్ సింగ్లతో కూడిన భారత బృందం 1884.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్లు క్లీన్స్వీప్ చేశారు. హిమాన్షు (250 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... అన్‡్ష దబాస్ (247.9 పాయింట్లు) రజతం... సురేశ్ ప్రణవ్ (226.8 పాయింట్లు) కాంస్యం గెలిచారు. హిమాన్షు, అన్‡్ష, సురేశ్ ప్రణవ్లతో కూడిన భారత జట్టు 1887.8 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. -
క్వార్టర్ ఫైనల్లో కథ ముగిసె!
కింగ్డావ్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ నుంచి భారత పురుషుల, మహిళల జట్లు రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. కనీసం కాంస్య పతకం ఖరారు కావాలంటే దాటాల్సిన క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో భారత జట్లు విఫలమయ్యాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు 0–3తో చైనా జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 1–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయాయి. 2024లో తొలిసారి ఆసియా చాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు ఈసారి మాత్రం పీవీ సింధు గైర్హాజరీలో నిరాశాజనక ప్రదర్శన చేసింది. చైనాతో జరిగిన పోరులో తొలి మ్యాచ్లో ప్రపంచ 42వ ర్యాంకర్ తన్వీ శర్మ 9–21, 9–21తో ప్రపంచ పదో ర్యాంకర్ గావో ఫాంగ్ జియె చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 22–24, 18–21తో జియా యి ఫాన్–జాంగ్ షు జియాన్ జంట చేతిలో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్లో రక్షిత శ్రీ 14–21, 21–15, 17–21తో జు వెన్ జింగ్ చేతిలో పరాజయం చవిచూసింది. లక్ష్య సేన్, సాత్విక్ లేకుండా... దక్షిణ కొరియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్స్ లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్– బరిలోకి దిగలేదు. లక్ష్య సేన్ వెన్నునొప్పితో బాధపడుతుండగా... తన తండ్రి సంవత్సరీకం కారణంగా సాత్విక్ స్వదేశానికి వెళ్లిపోయాడు. తొలి మ్యాచ్లో ఆయుశ్ శెట్టి 21–18, 14–21, 24–26తో యూ టే బిన్ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్లో హరిహరన్–చిరాగ్ శెట్టి ద్వయం 11–21, 13–21తో సాంగ్ హున్ చో–కిమ్ వన్ హో జంట చేతిలో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 21–16తో చోయ్ జిహూన్పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్లో పృథ్వీ–సాయిప్రతీక్ జోడీ 11–21, 16–21తో జిన్ యోంగ్–కి డాంగ్ జు ద్వయం చేతిలో పరాజయం పాలైంది. ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్ను నిర్వహించలేదు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో చైనా 3–1తో చైనీస్ తైపీపై; జపాన్ 3–0తో మలేసియాపై, ఇండోనేసియా 3–2తో థాయ్లాండ్ జట్టుపై గెలిచి సెమీఫైనల్ చేరుకున్నాయి. -
రెజ్లర్ సుశీల్కు బెయిల్ తిరస్కృతి
న్యూఢిల్లీ: వివాదాస్పద రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. హత్యానేరంపై అతను ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మాజీ జాతీయ జూనియర్ చాంపియన్ సాగర్ ధన్కర్ను హత్య చేసిన కేసులో సుశీల్ ప్రధాన నిందితుడు. తన అనుచరులు, సన్నిహితులతో కలిసి ఛత్రశాల్ స్టేడియంలో 2021లో యువ రెజ్లర్ సాగర్ ధన్కర్ను హాకీ స్టిక్స్, బేస్బాల్ బ్యాట్లతో తీవ్రంగా కొట్టి చంపాడు. అడ్డువచ్చిన సాగర్ స్నేహితులను సైతం సుశీల్ బృందం విచక్షణ రహితంగా కొట్టడంతో కొందరు గాయపడ్డారు. ఈ కేసులో సుశీల్ ఏ1గా తేలడంతో ఢిల్లీ పోలీసులు 2021 మేలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మోకాలు శస్త్ర చికిత్స కోసమని 2023, జూలైలో సెషన్స్ కోర్టు వారం రోజుల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అనంతరం మళ్లీ ఒలింపియన్ రెజ్లర్ను జైలుకు తరలించారు. తాజాగా మరోసారి బెయిల్కు ప్రయత్నించగా ఢిల్లీ కోర్టు నిర్ద్వందంగా సుశీల్ పిటీషన్ను తిరస్కరించింది. -
‘కోలుకుంటున్నాను’
బెంగళూరు: తుంటి గాయం నుంచి కోలుకుంటున్నానని... భారత టెన్నిస్ నంబర్వన్ ప్లేయర్ సుమిత్ నగాల్ తెలిపాడు. రెండు రోజుల్లో మొదలయ్యే డేవిస్కప్ టీమ్ టెన్నిస్ క్వాలిఫయర్స్ మ్యాచ్కు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఈనెల 7, 8 తేదీల్లో బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్ మ్యాచ్ ఆడనుంది. ముఖాముఖి రికార్డులో రెండు జట్లు 2–2తో సమంగా ఉన్నాయి. గత ఏడాది తనకు అంతగా కలిసి రాలేదని, కొత్త ఏడాదిలో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ప్రపంచ 281వ ర్యాంకర్ సుమిత్ తెలిపాడు. గత సంవత్సరం సుమిత్ రెండు ఏటీపీ టూర్ టోర్నీలలో ఆడగా... ఏడు చాలెంజర్ సిరీస్ టోర్నీల్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. పృథ్వీకి రజతం మోదీ నగర్ (ఉత్తరప్రదేశ్): జాతీయ యూత్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు రజత పతకం లభించింది. గురువారం జరిగిన పురుషుల యూత్ 56 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అప్పినేని పృథ్వీ రెండో స్థానంలో నిలిచాడు. పృథ్వీ మొత్తం 215 కేజీలు బరువెత్తి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్ఎస్సీబీ) వెయిట్లిఫ్టర్ ధర్మజ్యోతి దేవ్ఘరియా 230 కేజీలు బరువెత్తి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. అర్ష్లాన్ (ఉత్తరాఖండ్; 212 కేజీలు) కాంస్య పతకాన్ని సాధించాడు. -
హర్మన్ప్రీత్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: స్వదేశంలో జరగనున్న పురుషుల ప్రొ హాకీ లీగ్ తొలి అంచెలో పాల్గొనే భారత హాకీ జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. ఫిబ్రవరి 10 నుంచి 15వ తేదీ వరకు రౌర్కెలాలోని బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. అర్జెంటీనా, బెల్జియం జట్లతో భారత్ రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. ఫిబ్రవరి 11న బెల్జియంతో... 12న అర్జెంటీనాతో పోటీపడే భారత్... ఫిబ్రవరి 14న అర్జెంటీనాతో... 15న బెల్జియంతో మళ్లీ ఆడుతుంది. తొలి అంచె తర్వాత భారత జట్టు ఆ్రస్టేలియాకు వెళుతుంది. ఫిబ్రవరి 21న, 24న స్పెయిన్తో ఆడే భారత్... ఫిబ్రవరి 22, 25న ఆ్రస్టేలియాను ‘ఢీ’ కొంటుంది. గత సీజన్లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది భారత హాకీ జట్టు: సూరజ్ కర్కేరా, పవన్ (గోల్కీపర్లు), హర్మన్ప్రీత్ సింగ్ (కెపె్టన్), అమిత్ రోహిదాస్, జర్మన్ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, సుమిత్, సంజయ్, నీలం సంజీప్ జెస్, అమన్దీప్ లాక్రా (డిఫెండర్లు), రాజిందర్ సింగ్, మన్మీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, హార్దిక్ సింగ్, మొయిరాంగ్తెమ్ రబిచంద్ర సింగ్, నీలకంఠ శర్మ, రోషన్ కుజుర్ (మిడ్ ఫీల్డర్లు), అభిషేక్, సుఖ్జీత్, శిలానంద్ లాక్రా, సెల్వం కార్తీ, మన్దీప్ సింగ్, అరిజిత్ సింగ్ హుండల్, ఆదిత్య అర్జున్ లలాగే (ఫార్వర్డ్స్). -
రష్మిక జోడీ ఓటమి
ముంబై: స్వదేశంలో జరుగుతున్న ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ఆరుగురు ప్లేయర్లు తొలి రౌండ్లోనే వెనుదిరగ్గా... డబుల్స్ విభాగంలోనూ నిరాశే మిగిలింది. తొలి రౌండ్లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–అంకిత రైనా... ప్రార్థన తొంబారే (భారత్)–అలెవిత్నా ఇబ్రాగిమోవా (రష్యా)... రుతుజా భోస్లే (భారత్)–పీంగ్టార్న్ ప్లిపుయెచ్ (థాయ్లాండ్) జోడీలు ఓటమి పాలయ్యాయి. రష్మిక–అంకిత 4–6, 2–6తో లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్)–నయీమా కరామోకో (స్విట్జర్లాండ్) చేతిలో... ప్రార్థన–అలెవిత్నా 1–6, 1–6తో పొలీనా ఇటాసెంకో–ఎలీనా ప్రిడాంకినా (రష్యా) చేతిలో... రుతుజా–పీంగ్టార్న్ 6–4, 1–6, 9–11తో నికోల్ హ్యుర్గో (అర్జెంటీనా)–మనన్చాయ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. తొలి రౌండ్లో ఓడిపోయిన జోడీలకు 2,000 డాలర్ల () చొప్పున ప్రైజ్మనీ లభించింది. సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి అంకిత, సహజ యామలపల్లి, శ్రీవల్లి రష్మిక, మాయ రాజేశ్వరన్, వైదేహి, వైష్ణవి బరిలోకి దిగినా ఒక్కరు కూడా రెండో రౌండ్కు చేరుకోలేకపోయారు. -
సుజీత్ పసిడి పట్టు
జాగ్రెబ్ (క్రొయేషియా): యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత స్టార్ రెజ్లర్ సుజీత్ కల్కాల్ పసిడి పతకంతో మెరిశాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో సుజీత్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సుజీత్ 3–0 పాయింట్ల తేడాతో పేమన్ నెమాటి (ఇరాన్)పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో సుజీత్ 11–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో జోసెఫ్ మెకన్నా (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో ఖామ్జాట్ అర్సెమర్జుయెవ్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. స్వర్ణ పతకం గెలిచే క్రమంలో సుజీత్ తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా ఇవ్వకపోవడం విశేషం. మరోవైపు పురుషుల ఫ్రీస్టయిల్ 61 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్లో 57 కేజీల విభాగంలో కాంస్యం పతకం నెగ్గిన అమన్... ఈ టోర్నీలో 61 కేజీల విభాగంలో పోటీపడ్డాడు. ఈ కేటగిరీలో ఐదుగురు రెజ్లర్లు బరిలోకి దిగారు. అమన్ మూడు బౌట్లలో గెలిచి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. 70 కేజీల విభాగంలో భారత్కే చెందిన అభిమన్యు...97 కేజీల విభాగంలో విక్కీ కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక బౌట్లలో అభిమన్యు 6–3తో మాక్స్వెల్ పార్కర్ (అమెరికా)పై, విక్కీ 8–2తో అద్లాన్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. -
సురుచి–సామాట్ర్ జోడీకి రజతం
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్–సామ్రాట్ రాణా (భారత్) ద్వయం భారత్కు రజత పతకాన్ని అందించింది. 48 షాట్లతో కూడిన ఫైనల్లో సురుచి–సామ్రాట్ జోడీ 479.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. నగీనా సైద్కులోవా–ముఖమ్మద్ కమలోవ్ (ఉజ్బెకిస్తాన్) జంట 481.3 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. అంతకుముందు 10 జోడీల మధ్య 60 షాట్లతో నిర్వహించిన క్వాలిఫయింగ్లో సురుచి–సామ్రాట్ 583 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు రషి్మక సహగల్ (237.9 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... వన్షిక చౌధరీ (236.7 పాయింట్లు) రజత పతకాన్ని హస్తగతం చేసుకుంది. యూత్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు ప్రియాన్షి పూర్వ (234.8 పాయింట్లు) స్వర్ణం... చహెక్ కోహ్లా (233 పాయింట్లు) రజతం దక్కించుకున్నారు. టీమ్ విభాగాల్లో రష్మిక, వన్షిక, అగం గ్రెవాల్ జట్టు... ప్రియాన్షి, చహెక్, శిక్షా శరణ్ జట్టు పసిడి పతకాలు సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం భారత్ ఖాతాలో పది స్వర్ణాలున్నాయి. -
లవ్లీనా శుభారంభం
అలికాంటె (స్పెయిన్): బాక్సమ్ ఎలైట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ లవ్లీనా బొర్గోహైన్ శుభారంభం చేసింది. 75 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఈ అస్సాం బాక్సర్ తొలి రౌండ్లో 5:0తో ఒల్హా పిల్పిచుక్ (ఉక్రెయిన్)పై ఘనవిజయం సాధించింది. పురుషుల 70 కేజీల విభాగంలో హితేశ్ ముందంజ వేశాడు. హితేశ్ 5:0తో విన్సెంట్ సాంటోరీలో (కెనడా)పై గెలిచాడు. భారత్కే చెందిన మహిళా బాక్సర్లు మంజు రాణి (48 కేజీలు), నీతూ (51 కేజీలు) కూడా తమ ప్రత్యర్థులపై నెగ్గారు. మంజు రాణి 5:0తో గ్లోరియా (ఫ్రాన్స్)పై గెలుపొందగా... నీతూ పంచ్ల ధాటికి ఆమె ప్రత్యర్థి లౌరా కాల్డెరాన్ (స్పెయిన్) తొలి రౌండ్లోనే చేతులెత్తేసింది. కుసుమ్ (51 కేజీలు), అరుంధతి చౌధరీ (70 కేజీలు) కూడా గెలుపు రుచి చూశారు. కుసుమ్ 4:1తో క్లౌడియా అల్కానిజ్ (స్పెయిన్)పై, అరుంధతి 5:0తో అజీజా ఇసీనా (కజకిస్తాన)పై విజయం సాధించారు. విక్టోరియా పెన్నీ (కెనడా)తో జరిగిన 75 కేజీల విభాగం బౌట్లో సనమచ చాను (భారత్) 4:1తో నెగ్గింది. పురుషుల 55 కేజీల విభాగం బౌట్లో పవన్ బర్త్వాల్ పంచ్లకు తాళలేక అతని ప్రత్యర్థి థనారత్ (థాయ్లాండ్) రెండో రౌండ్లోనే ఓటమిని అంగీకరించాడు. జాదుమణి సింగ్ (51 కేజీలు) 4:1తో సియోవుష్ (ఉక్రెయిన్)పై, దీపక్ (70 కేజీలు) 5:0తో డేవిడ్ రొసాలెన్ (స్పెయిన్)పై, అంకుశ్ (80 కేజీలు) 3:2తో జఖ్పెకోవ్ (కజకిస్తాన్)పై నెగ్గారు. హర్‡్ష (90 కేజీలు) 5:0తో బ్రయాన్ కాల్వెల్ (కెనడా)ను ఓడించి ముందంజ వేశాడు. -
భారత్ను గెలిపించిన శ్రీకాంత్
కింగ్డావో (చైనా): ఆసియా సీనియర్ బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. గ్రూప్ ‘సి’లో భాగంగా సింగపూర్తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత పురుషుల జట్టు 3–2తో గెలిచింది. ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్లు నెగ్గి స్కోరు 2–2తో సమమైన దశలో... నిర్ణాయక ఐదో మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ 21–15, 21–16తో జియా వె జోయల్ కో (సింగపూర్)పై నెగ్గి భారత్కు 3–2తో విజయాన్ని అందించాడు. అంతకుముందు తొలి మ్యాచ్లో లక్ష్య సేన్ 16–21, 21–19, 16–21తో ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యెవ్ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–10, 21–8తో ఇంగ్ కీట్ వెస్లీ కో–జున్సుకె కుబో జంటపై గెలిచింది.మూడో మ్యాచ్లో ఆయుశ్ శెట్టి 21–17, 21–15తో జియా హెంగ్ జేసన్ టెను ఓడించి భారత్ను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో మ్యాచ్లో పృథ్వీ కృష్ణమూర్తి–సాయి ప్రతీక్ ద్వయం 21–8, 21–23, 20–22తో ఎన్జీ జూ జె–డొనోవాన్ విలార్డ్ వీ జంట చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో జపాన్తో భారత్ తలపడుతుంది. మరోవైపు గ్రూప్ ‘వై’లో భారత మహిళల జట్టు 5–0తో మయన్మార్ జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున సింగిల్స్లో తన్వీ శర్మ, మాళవిక, రక్షిత శ్రీ, డబుల్స్లో ప్రియ–శ్రుతి మిశ్రా; ట్రెసా జాలీ–గాయత్రి జోడీలు గెలుపొందాయి. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో థాయ్లాండ్తో భారత్ ఆడుతుంది. -
పెర్ల్ ఫెర్నాండెజ్ ‘హ్యాట్రిక్’
పొఖారా (నేపాల్): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–19 మహిళల చాంపియన్షిప్లో భారత అండర్–17 జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రౌండ్ రాబిన్ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 8–0 గోల్స్ తేడాతో భూటాన్ను చిత్తు చేసింది. ఈ ఏడాది చైనా వేదికగా ఏఎఫ్సీ అండర్–17 ఆసియా కప్ జరగనున్న నేపథ్యంలో... ఈ టోర్నీలో భారత్ అండర్–17 బాలికల జట్టును బరిలోకి దింపింది. భారత జట్టు తరఫున పెర్ల్ ఫెర్నాండెజ్ (16వ, 39వ, 41వనిమిషాల్లో) ‘హ్యాట్రిక్’ గోల్స్తో విజృంభించింది. ప్రీతిక బర్మన్ (25వ, 90 నిమిషాల్లో) రెండు గోల్స్తో సత్తా చాటగా... అలీషా లింగ్డో (6వ నిమిషంలో), అభిష్ట బాస్నెట్ (10వ నిమిషంలో),దివ్యాణి లిండా (17వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బుధవారమే జరిగిన మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ జట్టు 4–0 గోల్స్ తేడాతో ఆతిథ్య నేపాల్పై నెగ్గింది. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన బంగ్లాదేశ్ 9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్ మూడు మ్యాచ్ల్లో 2 విజయాలు, ఒక పరాజయంతో 6 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఆట ఆరంభమైనప్పటి నుంచే మన అమ్మాయిలు వరుస దాడులు చేస్తూ విజృంభించారు. ఆరో నిమిషంలో అలీషా గోల్ కొట్టడంతో భారత్ ఖాతా తెరిచింది. పెర్ల్ ఫెర్నాండెజ్ ప్రథమార్థంలోనే మూడు గోల్స్ కొట్టడంతో మన అమ్మాయిలు పూర్తి ఆధిపత్యం కనబర్చారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 7–0తో నిలిచింది. రెండో అర్ధభాగంలో భారత్ తరఫున ఒక గోల్ నమోదు కాగా... భూటాన్ మ్యాచ్ మొత్తంలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. -
ఇషా సింగ్కు రెండు స్వర్ణ పతకాలు
ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్ప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. న్యూఢిల్లీలో బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో 21 ఏళ్ల ఇషా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, టీమ్ విభాగంలో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన వ్యక్తిగత ఫైనల్లో ఇషా సింగ్ 239.8 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. భారత్కే చెందిన సురుచి సింగ్ 197.7 పాయింట్లతో నాలుగో స్థానంలో, మను భాకర్ 135.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. టీమ్ విభాగంలో ఇషా, సురుచి, మను భాకర్లతో కూడిన భారత బృందం 1726 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్కు కాంస్యం, రజతం లభించాయి. వ్యక్తిగత విభాగంలో సామ్రాట్ రాణా 220.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలిచాడు.టీమ్ విభాగంలో సామ్రాట్ రాణా, శ్రవణ్ కుమార్, వరుణ్ తోమర్లతో కూడిన భారత బృందం 1732 పాయింట్లతో రజతం దక్కించుకుంది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో గావిన్ ఆంటోనీ స్వర్ణం నెగ్గాడు. టీమ్ విభాగంలో గావిన్ ఆంటోనీ, చిరాగ్ శర్మ, ముకేశ్ నేలవల్లి (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత బృందం 1735 పాయింట్లతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. -
పతకాల వేటలో ఆర్టీసీ కండక్టర్ స్వరాజ్యలక్ష్మి
లక్ష్యాలు ఎన్ని నిర్దేశించుకున్నా.. వాటిని సాధించడంలో చాలా మంది విఫలమవుతుంటారు. కృషి, పట్టుదల లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇంకొందరు లక్ష్యాలను ఎంచుకున్నా.. సమయం లేదని సాకులు చెబుతుంటారు.. వీటన్నింటినీ ఐదు పదుల వయసులో అధిగమించారు ఆర్టీసీ కండక్టర్ స్వరాజ్యలక్ష్మి. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ అనేక పతకాలు గెలుచుకుని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అల్వాల్ మచ్చ»ొల్లారంలో నివసించే బైరి స్వరాజ్యలక్ష్మికి చిన్న తనం నుంచి పరుగు పందెం అంటే అమితమైన ఇష్టం. అయితే మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆ మక్కువకు ప్రాథమిక స్థాయిలోనే ముగింపు పడింది. చదువు, వివాహం, అనంతరం సంతానం.. ఇలా అందరిలానే బాధ్యతల మధ్య చిక్కుకుపోయారు. అయితే భర్త ధనరాజ్తో తన ఆసక్తిని పంచుకున్నారు. దీంతో ఆమె అభిరుచిని గుర్తించి ప్రోత్సహించారు. ఇంతలోనే ఆరీ్టసీలో కండక్టర్గా ఉద్యోగం వచి్చంది. ఓవైపు ఇంటిపని, వంటపనితో పాటు మరోవైపు ఉద్యోగం చేస్తూ తన ఆసక్తిని నెరవేర్చుకోవడం కోసం పరుగు మొదలుపెట్టారు. ఆసరా అందిస్తే మరిన్ని పతకాలు.. క్రీడాకారులకు ప్రభుత్వరంగ సంస్థల్లో అధికంగా ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగ నియామకాల్లో సైతం స్పోర్ట్స్ కోటా ఉండటమే ఇందుకు నిదర్శనం. రోజూ ఉద్యోగం చేసి ఇంటికి వచి్చన అనంతరం తరీ్ఫదు పొందడం పరిపాటి. ఇతర పోటీల్లో పాల్గొనాలంటే సెలవు పెట్టుకోవాల్సిన పరిస్థితి. దీంతో సరైన శిక్షణ లేకుండానే పాల్గొనాల్సి వస్తుందని స్వరాజ్యలక్ష్మి చెబుతున్నారు. అధికారులు, సిబ్బంది ప్రోత్సాహం అందిస్తున్నప్పటికీ ఉన్నత స్థాయి లక్ష్యాలను చేరుకోడానికి ఇది సరిపోవడం లేదంటున్నారు.12 ఏళ్లలో 70కి పైగా పతకాలు.. 12 సంవత్సరాల నుండి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ పతకాల వేట సాగించారు. 70కి పైగా జాతీయ పతకాలు, నాలుగు అంతర్జాతీయ పతకాలు సాధించారు. ఇటీవల రాజస్థాన్లోని అజ్మీర్ లో జరిగిన ఏడో జాతీయ మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్íÙప్ పోటీల్లో పాల్గొని 400 మీటర్ల విభాగంలో రజత పతకం, 800 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించారు. -
చాంపియన్ హరియాణా థండర్స్
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో హరియాణా థండర్స్ జట్టు వరుసగా రెండోసారి చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో హరియాణా 5–4 పాయింట్ల తేడాతో ఢిల్లీ దంగల్ వారియర్స్పై గెలిచింది. ఇప్పటి వరకు ఈ లీగ్ ఐదుసార్లు నిర్వహించగా... అందులో హరియాణా జట్టు రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది. చివరగా 2019లో జరిగిన లీగ్లో హరియాణా జట్టు టైటిల్ నెగ్గింది. తాజా లీగ్లో హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఎనిమిది బౌట్లు ముగిసేసరికి ఇరు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. చివరగా జరిగిన మహిళల 62 కేజీల పోరులో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత ఇరినా కొలియాడెన్కో ఒత్తిడిని అధిగమిస్తూ... అంజలిని చిత్తుచేసింది. దీంతో హరియాణా థండర్స్ విజేతగా నిలిచింది. అంతకుముందు పురుషుల 74 కేజీల విభాగంలో జరిగిన తొలి బౌట్లో బైరమోవ్ (ఢిల్లీ) 8–2తో ప్రవిందర్ (హరియాణా)పై... రెండో బౌట్గా జరిగిన మహిళల 76 కేజీల పోరులో కాజల్ (హరియాణా) 3–1తో అనస్తసియా అల్పియోవా (ఢిల్లీ)పై... మూడో బౌట్ పురుషుల 65 కేజీల ఈవెంట్లో సుజీత్ కల్కల్ (ఢిల్లీ) 8–6తో తుముర్ ఒచిర్ తుల్గా (హరియాణా)పై... నాలుగో బౌట్ మహిళల 53 కేజీల పోరులో యీ సుసకీ (హరియాణా) 5–0తో సారిక (ఢిల్లీ)పై... ఐదో బౌట్ పురుషుల 86 కేజీల విభాగంలో హాది భక్తియార్ 11–0తో అశిరోవ్ అష్రఫ్ (హరియాణా)పై... ఆరో బౌట్ పురుషుల 57 కేజీల పోరులో అక్షయ్ ఢేరె (హరియాణా) 16–0తో అమిత్ (ఢిల్లీ)పై... ఏడో బౌట్గా జరిగిన పురుషుల 125 కేజీల పోరులో రోనక్ 12–1తో అనిరుధ్ (హరియాణా)పై గెలిచారు.ఎనిమిదో బౌట్ మహళల 57 కేజీల విభాగంలో నేహ (హరియాణా) 8–2తో అంజలి (ఢిల్లీ)పై గెలిచారు. ఢిల్లీ దంగల్ వారియర్స్కు చెందిన యువ రెజ్లర్ తురాన్ బైరమోవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కించుకున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో పోటీపడిన అతడు... ఆడిన ఏడు బౌట్లలోనూ విజయాలు సాధించడం విశేషం. హరియాణా థండర్స్ రెజ్లర్ నేహా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ... ఢిల్లీ దంగల్ వారియర్స్కు చెందిన రోనక్ (125 కేజీలు) ‘ఫైటర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నారు. పంజాబ్ రాయల్స్కు చెందిన చంద్రమోహన్ లీగ్లో అత్యధిక పాయింట్లు సాధించిన రెజ్లర్గా నిలిచాడు. హరియాణా థండర్స్కు చెందిన అక్షయ్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. -
మెట్టు దిగిన ఆటగాళ్లు.. ఫీజుల కోతకు అంగీకారం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ నిర్వహణ కోసం ఆటగాళ్లు ఓ మెట్టు దిగారు. సునీల్ ఛెత్రి నేతృత్వంలోని బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (FC) ఆటగాళ్లు తమ మ్యాచ్ ఫీజుల తగ్గింపునకు సమ్మతించారు. పలు సమస్యలతో ఐఎస్ఎల్ గతేడాది జరగలేదు. ఏడాది విరామం తర్వాత మొత్తానికి సమస్యలు పరిష్కరించుకొని ఇటు లీగ్ నిర్వాహకులు, ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఈ ఏడాది నుంచి తిరిగి ఎప్పటిలాగే టోర్నీని నిర్వహించాలనే ఒప్పందానికి వచ్చారు.ఈ నెల 14 నుంచే ఫుట్బాల్ లీగ్ జరుగుతుంది. సజావుగా టోర్నీ నిర్వహణకు ఫుట్బాలర్లు సైతం తమ మ్యాచ్ ఫీజుల కోతకు అంగీకరించారు. దీనిపై బెంగళూరు యజమాని పార్థ్ జిందాల్ సంతోషం వ్యక్తం చేశారు. లీగ్ ఒడిదొడుకులను అర్థం చేసుకొని టోర్నీ నిర్వహణ కోసం తమ ఫీజుల్ని తగ్గించుకున్న ఆటగాళ్లను ఆయన అభినందించారు. రూ.కోట్లు పోయి లక్షలు ఐఎస్ఎల్ ప్రసార హక్కుల్ని చాలా తక్కువ మొత్తానికే ‘ఫ్యాన్కోడ్’ యాప్ చేజిక్కించుకుంది. మొత్తం 91 మ్యాచ్లున్న ఫుట్బాల్ ఈవెంట్ ప్రపంచవ్యాప్త ప్రసార హక్కుల్ని రూ. 8.62 కోట్లకే దక్కించుకుంది. అంటే ఒక్కో మ్యాచ్కు సగటున రూ.9.5 లక్షలకే గ్లోబల్ మీడియా రైట్స్ పొందింది. 2024–25 సీజన్లో రూ.275 కోట్లు రాగా అప్పుడు 163 మ్యాచ్లు జరిగాయి. అంటే మ్యాచ్కు రూ. 1.68 కోట్లు వచ్చాయి. కానీ ప్రస్తుత సీజన్కు వచ్చేసరికి రూ.కోట్లు పోయి రూ.9.5 లక్షలకు పడిపోయింది. ఇదీ చదవండి: భారత జట్టు ఓటమి నేపాల్ వేదికగా దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–19 మహిళల చాంపియన్షిప్లో పోటీపడుతున్న భారత యువ జట్టుకు బంగ్లాదేశ్ చేతిలో చుక్కెదురైంది. ఏఎఫ్సీ అండర్–17 మహిళల ఆసియా కప్కు సన్నద్ధమయ్యేందుకు ఈ అండర్–19 టోరీ్నలో భారత్ అండర్–17 జట్టును బరిలోకి దింపింది.టీనేజ్ జట్టు తొలి మ్యాచ్లో 1–0తో ఆతిథ్య నేపాల్పై గెలిచింది. కానీ సోమవారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 0–2 స్కోరుతో బంగ్లాదేశ్ చేతిలో కంగుతింది. ఈ మ్యాచ్లో భారత్ అసలు ఖాతానే తెరువలేదు. బంగ్లా జట్టులో అర్పిత బిస్వాస్ (29వ నిమిషంలో), అల్పి అక్తర్ (40వ ని.) చెరో గోల్ చేశారు. -
భారత్లో మళ్లీ ఫార్ములావన్?
సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఢిల్లీలోని బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ‘రయ్... రయ్’ మోత మోగింది. రేస్ ప్రియుల ఫేవరెట్ ‘ఫార్ములావన్ గ్రాండ్ప్రి’ జరిగింది. 2011లో మొదలైన ఈ ఎఫ్1 రేసు మూడేళ్ల పాటు జరిగింది. 2013 రేసు అనంతరం మనకు ఈ ‘ఫార్ములా’ దూరమైంది! కారణాలు ఏవైనా మళ్లీ ప్రతిష్టాత్మక ఫార్ములావన్ ఆతిథ్య భాగ్యం భారత్కు దక్కలేదు. ఇప్పుడు పుష్కరకాలం తర్వాత ‘రయ్ రయ్’ మోత మోగించాలని కేంద్ర క్రీడాశాఖ చొరవ చూపిస్తోంది.గ్రేటర్ నోయిడాలోని బుద్ధ సర్క్యూట్ను ఇటీవలే క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సందర్శించారు. అంతేకాదు, సంబంధిత వర్గాలతోనూ చర్చించినట్లు క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. బుద్ధ సర్క్యూట్ యజమాని జేపీ గ్రూప్. ఈ కార్పొరేట్ సంస్థ దివాళా తీసింది. ఇప్పుడు సర్క్యూట్ బాధ్యతల్ని ‘యమునా ఎక్స్ప్రెస్వే ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ అథారిటీ’ చూస్తోంది.ఈ అథారిటీ వర్గాలతోనే క్రీడల మంత్రి భేటీ అయినట్లు తెలిసింది. అప్పుల్లో కూరుకుపోయిన జేపీ గ్రూప్ నుంచి బుద్ధ సర్క్యూట్ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ప్రాథమిక దశలో చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ యాజమాన్య బదిలీ ప్రక్రియ పూర్తయితే తిరిగి భారత్లో ‘ఫార్ములావన్’ రేసుకు చేపట్టాల్సిన కార్యాచరణ మొత్తం చకచకా జరిగిపోతుందని భావిస్తున్నారు.అయితే యాజమాన్య బదిలీ జరగకపోయినా... కనీసం రెండు, మూడేళ్లు ఈ ట్రాక్ బాధ్యతల్ని క్రీడా సమాఖ్యకు అప్పగించాలని మంత్రి మాండవీయ సంబంధిత వర్గాలను కోరినట్లు తెలిసింది. పన్ను, అధికారిక సమస్యల్ని పరిష్కరించి సాధ్యమైనంత తొందరగా ఫార్ములావన్ను తిరిగి భారత్ ట్రాక్లో నిర్వహించే ప్రణాళికతో క్రీడాశాఖ ఉంది. భారత మోటార్స్పోర్ట్స్ సమాఖ్య (ఎఫ్ఎంఎస్సీఐ) మాజీ అధ్యక్షుడు విక్కీ చందోక్ తాజా ప్రభుత్వ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. తిరిగి ఎఫ్1 భారత్కు తిరిగొస్తే అంతకుమించిన ఆనందం మరొటి ఉండదని అన్నారు. ఆయన కృషివల్లే 2011లో ఫార్ములావన్ జరిగింది. -
‘క్షమించండి.. నా మాజీ భర్త గురించే అలా మాట్లాడాను’
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ క్షమాపణలు చెప్పారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకి లేదని స్పష్టం చేశారు. దయచేసి తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని.. పురుషులందరినీ తక్కువ చేసేలా తాను మాట్లాడానంటూ వదంతులు ప్రచారం చేయవద్దని కోరారు. అసలేం జరిగిందంటే...విడాకులు.. వివాదాలుగత కొన్ని రోజులుగా మేరీ కోమ్ (Mary Kom) వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మేరీ కోమ్- కరుంగ్ ఓన్కోలర్ కోమ్ అనూహ్య రీతిలో విడిపోవడం.. అనంతరం పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇందుకు కారణం.గల్లీల్లో చాలా మంది ఉన్నారువిడాకుల గురించి అధికారిక ప్రకటన చేసిన తర్వాత చాన్నాళ్లు మౌనంగా ఉన్న మేరీ కోమ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాజీ భర్తను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన కోసం కెరీర్ త్యాగం చేశానని కరుంగ్ అంటున్నాడని.. దేశంలో గల్లీల్లో చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారని ఎద్దేవా చేశారు.సంపాదన లేని భర్తఅంతేకాదు.. కరుంగ్ చిల్లగవ్వ కూడా సంపాదించలేదని.. తనపై ఆధారపడి బతికాడని మేరీ కోమ్ తన మాజీ భర్తను నిందించారు. ఈ నేపథ్యంలో కరుంగ్ సైతం ఘాటుగా స్పందించాడు. తన భార్య బాక్సింగ్ ప్రయాణం సజావుగా సాగేందుకు తాను ఎన్నో త్యాగాలు చేశానని.. ప్రొఫెషనల్ ఫుట్బాలర్గా కెరీర్ను వదిలేశానని చెప్పాడు.సంచనల ఆరోపణలునలుగురు పిల్లల ఆలనాపాలనా కూడా తానే చూసుకొన్నానని.. ఇంటి బాధ్యతలన్నీ తానొక్కడినే నెరవేర్చానని కరుంగ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. గతంలో ఓ జూనియర్ బాక్సర్తో వివాహేతర సంబంధం కొనసాగించిన మేరీ కోమ్.. ఆ తర్వాత తమ అకాడమీలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. వారిద్దరి వాట్సాప్ చాట్లు కూడా తన దగ్గర ఉన్నాయని తెలిపాడుఅయితే, మేరీ కోమ్ ఫుట్బాల్ ప్లేయర్లు, భార్య కెరీర్లో ఎదిగేందుకు వీలుగా ఇంటి పట్టున ఉండి కుటుంబాన్ని చక్కదిద్దే భర్తలను తక్కువ చేసి మాట్లాడిందంటూ భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ తన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.హుందాగానే ప్రవర్తించాను‘‘నా పెళ్లి పూర్తిగా చేదు అనుభవాన్ని మిగిల్చిందని నేను చెప్పను. చాలా ఏళ్ల పాటు అంతా సజావుగా సాగిపోయింది. అయితే, ఒక్కసారి నమ్మకం కోల్పోయిన తర్వాత అంతా మారిపోయింది 2025 ఏప్రిల్లో నా విడాకుల గురించి ప్రకటించినపుడు కూడా నాకై నేను నేరుగా మీడియాతో మాట్లాడలేదుఎల్లప్పుడూ నేను హుందాగానే ప్రవర్తించాను. నా మాటలు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం అయ్యాయి. ఇది దురదృష్టకరం. యూత్ ఫుట్బాల్కు నేను ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. ఫుట్బాల్ సంస్కృతిని నేను కించపరచలేదు.నేనొక బాక్సర్ని. అయినప్పటికీ నాకు ఫుట్బాల్ ఆడటం అంటే ఎంతో ఇష్టం. నా వ్యాఖ్యలతో క్రీడలను, క్రీడాకారులను కించపరచాలని అనుకోలేదు. ప్రతి ఒక్కరి ప్రయాణం గల్లీ నుంచే మొదలవుతుంది. కఠిన శ్రమ, అంకితభావంతో పనిచేస్తే సునిల్ ఛెత్రి, భాయ్చుంగ్ భుటియా లాంటి వాళ్లు పుట్టుకొస్తారు.పురుష సమాజానికి క్షమాపణలునా కోసం తన కెరీర్ త్యాగం చేశానని నా మాజీ భర్త అన్నాడు. అతడు షిల్లాంగ్లో ఫుట్బాల్ ఆడేవాడు. ఆ తర్వాత ఆటను వదిలేసి ఢిల్లీకి వచ్చిన తర్వాతే నన్ను కలిశాడు అదే విధంగా.. నా భర్తకు సంపాదన లేదని నేను అన్న మాటలను.. పురుష సమాజాన్ని కించపరచాలని మాట్లాడినట్లు అన్వయించుకుంటున్నారు.నా ఈ మాటలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని చేతులు జోడించి అర్థిస్తున్నా. ఇది కేవలం మా మధ్య జరిగిన విషయానికి సంబంధించినది మాత్రమే. చాలా ఏళ్ల పాటు అనుభవించిన బాధ, డిప్రెషన్.. ద్రోహం కారణంగా నాలో పెల్లుబుకిన అసహనం అది. అంతేకానీ మగవాళ్లను తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు’’ అని మేరీ కోమ్ స్పష్టతనిచ్చారు.చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి! View this post on Instagram A post shared by Dr Mangte Mary Kom (@mcmary.kom) -
‘క్రీడా’ బడ్జెట్ 2026: కీలక అంశాలు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఈసారి క్రీడలకు కాస్త ప్రాధాన్యం పెరిగింది. గతంతో పోలిస్తే సుమారు రూ.1133 కోట్లకు పైగా నిధుల్ని పెంచారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో క్రీడలు, యువజన సర్వీసులకు రూ. 4479.88 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 3346.54 కోట్లు నిధులివ్వగా తాజా బడ్జెట్లో రూ.1133.34 కోట్ల మేర హెచ్చింపు చేశారు.దేశ వ్యాప్తంగా క్రీడా కేంద్రాల నిర్వహణ, శిబిరాలు ఏర్పాటు చేసే భారత స్పోర్ట్స్ అథారిటీకి రూ. 917.38 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.880 కోట్లు ఇవ్వగా కాస్త పెంచారు. అయితే డోప్ పరీక్షల ల్యాబోరేటరీతో పాటు జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (NADA) నిధుల్లో కోత పెట్టారు. డోపింగ్ టెస్టులకు క్రితం ఏడాది రూ.28.55 కోట్లు ఇస్తే... ప్రస్తుతం రూ.23 కోట్లకు కుదించారు. జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీకి గతంలో రూ. 78.64 కోట్లు విదిల్చిన ఆర్థిక మంత్రి తాజాగా రూ.46.98 కోట్లే కేటాయించారు.ఇక 1998లో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడాభివృద్ధి నిధిని రూ. 3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచారు. అలాగే క్రీడాకారుల ప్రోత్సాహకాలను రూ. 28 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు పెంచారు. జాతీయ క్రీడా సమాఖ్యలకు ఇచ్చే నిధుల్ని రూ. 400 కోట్ల నుంచి 425 కోట్లకు హెచ్చింపు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఖేలో ఇండియా’కు రూ.924.35 కోట్లు కేటాయించారు. గతేడాది రూ. 1000 కోట్లు నిధులివ్వగా... కేవలం రూ.700 కోట్లే వెచ్చించడంతో ఇప్పుడు దానిని తగ్గించారు. -
అర్జున్కు 13వ స్థానం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు నిరాశపరిచారు. ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ నుంచి నలుగురు గ్రాండ్మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, అరవింద్ చిదంబరం పోటీపడ్డారు. 14 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. భారత నంబర్వన్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ 4.5 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు.చివరిదైన 13వ రౌండ్ గేమ్లో అర్జున్ 55 ఎత్తుల్లో నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ గుకేశ్ 6.5 పాయింట్లతో 9వ స్థానంలో, ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో 11వ స్థానంలో, అరవింద్ 4.5 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచారు. 9 పాయింట్లతో నొదిర్బెక్ విజేతగా అవతరించాడు. -
దేవిక ధమాకా
బ్యాంకాక్: అంచనాలకు మించి రాణించిన భారత రైజింగ్ స్టార్ షట్లర్ దేవిక సిహాగ్ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. ఆదివారం ముగిసిన థాయ్లాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో దేవిక చాంపియన్గా అవతరించింది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల దేవిక కెరీర్లో ఇదే తొలి సూపర్–300 టైటిల్ కావడం విశేషం. ప్రపంచ 68వ ర్యాంకర్, రెండుసార్లు జూనియర్ వరల్డ్ చాంపియన్ గో జిన్ వె (మలేసియా)తో జరిగిన ఫైనల్లో దేవిక తొలి గేమ్ను 21–8తో సొంతం చేసుకుంది. రెండో గేమ్లో 6–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో గాయం కారణంగా గో జిన్ వె మ్యాచ్ నుంచి వైదొలిగింది. దాంతో దేవికకు టైటిల్ ఖరారైంది. విజేత దేవికకు 18,750 డాలర్ల (రూ. 17 లక్షల 19 వేలు) ప్రైజ్మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాత థాయ్లాండ్ సూపర్–300 టైటిల్ నెగ్గిన మూడో భారతీయ క్రీడాకారిణిగా దేవిక గుర్తింపు పొందింది. టైటిల్ గెలిచే క్రమంలో దేవిక తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ టైటిల్తో ప్రపంచ 63వ ర్యాంకర్ దేవిక మంగళవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–40లో చోటు సంపాదిస్తుంది. ‘చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఇదే తొలి సూపర్–300 లెవెల్ టైటిల్. ఈ సీజన్లో మరిన్ని టోర్నీలు ఆడతాను. థాయ్లాండ్ ఓపెన్లో అన్ని మ్యాచ్లు బాగా ఆడాను. కొత్త పాఠాలు నేర్చుకున్నాను. ఫైనల్లో గెలుపోటములు గురించి ఆలోచించలేదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను’ అని దేవిక వ్యాఖ్యానించింది. బెంగళూరులోని పదుకొనే–ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెక్స్లో ఉమేంద్ర రాణా వద్ద దేవిక శిక్షణ తీసుకుంటోంది. -
విష్ణువర్ధన్ ఖాతాలో 48వ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, లండన్ ఒలింపిక్స్లో పోటీపడ్డ హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ తన కెరీర్లో 48వ డబుల్స్ టైటిల్ను సాధించాడు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఎం15 టోర్నీలో తెలంగాణకే చెందిన గంటా సాయికార్తీక్ రెడ్డితో కలిసి విష్ణువర్ధన్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. 25 ఏళ్ల సాయికార్తీక్ రెడ్డికిది 11వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్–సాయికార్తీక్ ద్వయం 6–1, 6–4తో ఇషాక్ ఇక్బాల్–దేవ్ జావియా (భారత్) జంటపై గెలిచింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో విష్ణు–సాయికార్తీక్ ఐదు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేశారు. తొలి సర్వీస్లో 23 పాయింట్లు, రెండో సర్వీస్లో 9 పాయింట్లు స్కోరు చేశారు. తమ సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా, ప్రత్యర్థుల సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. తొలి రౌండ్లో విష్ణు–సాయికార్తీక్ 6–3, 6–4తో నైషిక్ రెడ్డి గణగామ–మాచెర్ల తీర్థ శశాంక్ (భారత్)లపై, క్వార్టర్ ఫైనల్లో 6–3, 7–5తో అర్జున్–కహీర్ (భారత్)లపై, సెమీఫైనల్లో 5–7, 7–6 (7/4), 10–8తో ఆదిత్య–అథర్వ (భారత్)లపై విజయం సాధించారు. 38 ఏళ్ల విష్ణు వేర్వేరు భాగస్వాములతో కలిసి 2008లో 1... 2009లో 6... 2010లో 3 ... 2011లో 5... 2012లో 1... 2013లో 1... 2014లో 3... 2015లో 4... 2016లో 5... 2017లో 10... 2018లో 2... 2021లో 1... 2023లో 3... 2024లో 2... 2026లో 1 డబుల్స్ టైటిల్ గెలిచాడు. -
అల్కరాజ్ కొత్త చరిత్ర
మెల్బోర్న్: పురుషుల టెన్నిస్ చరిత్రలో స్పెయిన్ స్టార్, ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. టెన్నిస్లోని నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల టైటిల్స్ను సాధించిన అతిపిన్న వస్కుడిగా (22 ఏళ్ల 272 రోజులు) అల్కరాజ్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం ముగిసిన ఆ్రస్టేలియన్ ఓపెన్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ తొలిసారి విజేతగా అవతరించాడు. 10 సార్లు చాంపియన్, 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ 2–6, 6–2, 6–3, 7–5తో గెలుపొందాడు. విజేత అల్కరాజ్కు 41,50,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 26 కోట్ల 55 లక్షలు), రన్నరప్ జొకోవిచ్కు 21,50,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 13 కోట్ల 75 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. అల్కరాజ్ కెరీర్లో ఇది ఏడో గ్రాండ్స్లామ్ టైటిల్. ఇప్పటికే అతను ఫ్రెంచ్ (2024, 2025), వింబుల్డన్ (2023, 2024), యూఎస్ ఓపెన్ (2022, 2025)లను రెండుసార్లు చొప్పున గెలిచాడు. తాజా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్తో అల్కరాజ్ ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేసుకున్న అతిపిన్న వయసు్కడిగా గుర్తింపు పొందాడు. వరాల్గా డాన్ బడ్జ్ (అమెరికా; 22 ఏళ్ల 363 రోజులు; 1938లో) పేరిట ఉన్న రికార్డును.... ఓపెన్ శకం (1968) మొదలయ్యాక నాదల్ (స్పెయిన్; 24 ఏళ్ల 88 రోజులు; 2010లో) పేరిట ఉన్న రికార్డులను ఈ స్పెయిన్ స్టార్ సవరించాడు. తాజా ఓటమితో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ (25) నెగ్గిన ఏకైక ప్లేయర్గా రికార్డు నెలకొల్పాలని ఆశించిన జొకోవిచ్కు నిరాశ ఎదురైంది. తొలి సెట్ కోల్పోయినా... ఆ్రస్టేలియన్ ఓపెన్లో ఫైనల్ చేరిన 10 సార్లూ విజేతగా నిలిచిన జొకోవిచ్కు తుది పోరులో తొలి సారి ఓటమి ఎదురైంది. సెమీస్లో డిఫెండింగ్ చాంపియన్ సినెర్ (ఇటలీ)పై ఐదు సెట్ల పోరులో గెలిచిన జొకోవిచ్ తొలి సెట్ను గెలిచి ఫైనల్లో శుభారంభం చేశాడు. అయితే 38 ఏళ్ల జొకోవిచ్తో పోలిస్తే ఎక్కువ ఫిట్గా ఉన్న అల్కరాజ్ రెండో సెట్ నుంచి తన అసలు ఆటతీరును ప్రదర్శించాడు. రెండో సెట్లో రెండుసార్లు... మూడో సెట్లో రెండుసార్లు జొకోవిచ్ సర్వీస్ను బ్రేక్ చేసి అతను ఈ రెండు సెట్లు గెలిచాడు. నాలుగో సెట్లోని 12వ గేమ్లో జొకోవిచ్ సర్వీస్ను బ్రేక్ చేసిన అల్కరాజ్ సెట్తోపాటు విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. 9 పురుషుల టెన్నిస్లో ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేసుకున్న 9వ ప్లేయర్ అల్కరాజ్. ఈ జాబితాలో ఫ్రెడ్ పెర్రీ (బ్రిటన్; 1935లో), డాన్ బడ్జ్ (అమెరికా; 1938లో), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా; 1962లో), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా; 1964లో), అగస్సీ (అమెరికా; 1999లో), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 2009లో), నాదల్ (స్పెయిన్; 2010లో), జొకోవిచ్ (సెర్బియా; 2016లో) ఉన్నారు. -
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే
ఆస్ట్రేలియా ఓపెన్-2026లో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం మెల్బోర్న్లోని రాడ్ లేవర్ ఎరీనాలో జరగనున్న మెన్స్ సింగిల్స్ ఫైనల్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, టాప్సీడ్ కార్లోస్ అల్కరాజ్ అమీతుమీ తెల్చుకోనున్నారు. ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. ఈ తుది పోరులో జొకోవిచ్ గెలిస్తే తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ను సాధిస్తాడు.తద్వారా జోకోవిచ్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన ప్లేయర్గా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్)ను అధిగమిస్తాడు. అదేవిధంగా అతడికి ఇది 11వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ అవుతుంది. మరోవైపు 22 ఏళ్ల అల్కరాజ్ ఈ టైటిల్ను కైవసం చేసుకుంటే, టెన్నిస్ చరిత్రలో నాలుగు వేర్వేరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టిస్తాడు.ఇప్పటివరకు వీరిద్దరూ 9 సార్లు తలపడగా, జొకోవిచ్ 5-4తో స్వల్ప ఆధిక్యంలో ఉన్నాడు. అయితే గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లో అల్కరాజ్ 2-0తో (రెండు సార్లు వింబుల్డన్లో) జొకోవిచ్పై పైచేయి సాధించాడు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతుంది. -
ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల విజేతగా రిబకినా
ఆస్ట్రేలియా ఓపెన్-2026 మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్తాన్ స్టార్ ఎలెనా రిబకినా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్ 1 ఆర్యనా సబలెంకాపై 6-4, 4-6, 6-4 తేడాతో విజయం సాధించిన రిబకినా.. తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్ ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగింది.తొలి సెట్లో నిలకడైన ఆటతో 6-4 తేడాతో రిబకినా గెలచుకుంది. అనంతరం సబలెంకా తన మార్కు పవర్ హిట్టింగ్తో పుంజుకుంది. ఈ సెట్లో రిబకినాను 6-4 తేడాతో ఓడించిన సబలెంక.. మ్యాచ్ను నిర్ణయాత్మక మూడో సెట్కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక సెట్లో కూడా సబలెంకా సత్తా చాటింది. వరుస గేమ్లు గెలుస్తూ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి టైటిల్ దిశగా సాగింది. అయితే ఆదే సమయంలో ఎలెనా రిబకినా అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. సబలెంకా సర్వీస్ను వరుసగా రెండుసార్లు బ్రేక్ చేసిన రిబకినా, 6-4 తేడాతో సెట్ను సొంతం చేసుకుంది. తద్వారా తొలి ఆసీస్ ఓపెన్ టైటిల్ ఆమె ఖాతాలో చేరింది. -
పీటీ ఉష ఇంట్లో విషాదం
కోజికోడ్: దిగ్గజ అథ్లెట్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త వి.శ్రీనివాసన్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. తమ నివాసంలో అనూహ్యంగా కుప్పకూలిన శ్రీనివాసన్ను సన్నిహితులు ఆస్పత్రికి తీసుకెళ్లినా... అప్పటికే ఆయన మరణించారు. స్వతహాగా కబడ్డీ క్రీడాకారుడు అయిన శ్రీనివాసన్ సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో డిప్యూటీ ఎస్పీగా పని చేసి రిటైరయ్యారు. ఉష కెరీర్లో అన్ని విధాలా సహకారం అందిస్తూ ప్రోత్సహించడంతో పాటు ఆమె పురోగతిలో భర్త కీలక పాత్ర పోషించారు. 90వ దశకంలో ఉష రిటైర్మెంట్ ప్రకటించి ఆటకు దూరమైన తర్వాత మళ్లీ 1998 ఆసియా చాంపియన్షిప్ ద్వారా ఆమె ట్రాక్పైకి పునరాగమనం చేసేందుకు శ్రీనివాసన్ అండగా నిలిచారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ నిర్వహణా వ్యవహారాలు చూస్తున్నారు. వీరిద్దరికి ‘ఉజ్వల్’ అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఉషతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఆమె భర్త మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
క్రమశిక్షణ తప్పినందుకే...
న్యూఢిల్లీ: ప్రొ లీగ్ టోర్నీ కోసం గురువారం 33 మంది ప్రాబబుల్స్తో ప్రకటించిన భారత హాకీ జట్టులో స్టార్ ప్లేయర్ మన్ప్రీత్ సింగ్కు చోటు దక్కకపోవడం చర్చకు దారి తీసింది. మన్ప్రీత్తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు దిల్ప్రీత్ సింగ్, కృషన్ బహదూర్ పాఠక్లను టీమ్ నుంచి తప్పించారు. అయితే వీరంతా తీవ్ర క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు ఈ చర్య తీసుకున్నట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) వర్గాలు వెల్లడించాయి. ఇటీవల డిసెంబరులో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు వారు నిబంధనలు ఉల్లంఘించారని హెచ్ఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ టూర్లో 3 మ్యాచ్లు ఆడిన భారత్ 2 ఓడి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. ‘జట్టు సమావేశానికి ఒక ఆటగాడు గైర్హాజరు కావడంతో వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచాం. అప్పుడు మరింత తీవ్రమైన అంశాలు బయటకు వచ్చాయి. మన్ప్రీత్, దిల్ప్రీత్, కృషన్ కలిసి ఆ ఆటగాడికి నిషేధిత ఉత్ప్రేరకం కలిపిన చూయింగ్ గమ్ను ఇచ్చారు. దానిని వాడిన అతను స్పృహ కోల్పోయి టీమ్ మీటింగ్కు దూరమయ్యాడు. దాని ప్రభావం రాత్రంతా ఉండటంతో పాటు తర్వాతి ఉదయం కూడా సాధారణ స్థితికి రాలేకపోయాడు. విచారణ చేస్తే ఆ ముగ్గురి పాత్ర ఉన్నట్లు తేలింది. వీరంతా ఆ తర్వాత క్షమాపణలు చెప్పినా... వచ్చే టోర్నీ కోసం జరిగే శిబిరానికి వీరిని ఎంపిక చేయరాదనే నిర్ణయం అప్పుడే జరిగిపోయింది’ అని ఆయన వివరించారు. అయితే దీనిపై కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ హాకీ ఇండియాకు ఎలాంటి రాత పూర్వక ఫిర్యాదు మాత్రం చేయలేదు. పైగా మన్ప్రీత్కు మద్దతు పలుకుతూ జట్టు నుంచి తప్పించరాదని కూడా ఫుల్టన్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఎన్నో కీలక టోర్నీలు ఉన్న నేపథ్యంలో ఎంతో అనుభవం ఉన్న మన్ప్రీత్ అవసరం జట్టుకు ఉందని... అతడిని తొలగిస్తే తానూ రాజీనామా చేస్తానని కూడా కోచ్ హెచ్చరించినట్లు తెలిసింది. అయితే హాకీ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ తిర్కీ, భోలానాథ్ సింగ్, చీఫ్ సెలక్టర్ ఆర్పీ సింగ్ చివరకు కోచ్ను ఒప్పించడంలో సఫలమయ్యారు. -
చరిత్ర పుటల్లో చోటు కోసం...
మెల్బోర్న్: ఒక్క విజయం సాధిస్తే... సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్... ప్రపంచ నంబర్వన్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ చరిత్ర పుటల్లో తమ పేరును లిఖించుకుంటారు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్లో జొకోవిచ్ 11వసారి... అల్కరాజ్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్తో అల్కరాజ్ తలపడతాడు. తుది పోరులో జొకోవిచ్ గెలిస్తే టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 25 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఏకైక ప్లేయర్గా అవతరిస్తాడు. అల్కరాజ్ నెగ్గితే ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టిస్తాడు. శుక్రవారం జరిగిన రెండు అసాధారణ సెమీఫైనల్స్లో అద్భుత ఫలితాలు వచ్చాయి. 5 గంటల 27 నిమిషాలపాటు జరిగిన మొదటి సెమీఫైనల్లో అల్కరాజ్ 6–4, 7–6 (7/5), 6–7 (3/7), 6–7 (4/7), 7–5తో మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. నిర్ణాయక ఐదో సెట్లో 5–4తో ఆధిక్యంలో నిలిచిన జ్వెరెవ్ పదో గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకొని ఉంటే గెలిచేవాడు. కానీ పదో గేమ్లో జ్వెరెవ్ సర్వీస్ను బ్రేక్ చేసిన అల్కరాజ్ స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్ను కాపాడుకొని 12వ గేమ్లో జ్వెరెవ్ సర్వీస్ను మరోసారి బ్రేక్ చేసి 7–5తో గెలుపు సొంతం చేసుకున్నాడు. అతిపెద్ద వయస్కుడిగా... డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన రెండో సెమీఫైనల్లో 10సార్లు విజేత జొకోవిచ్ 3–6, 6–3, 4–6, 6–4, 6–4తో విజయం సాధించాడు. 12 ఏస్లు సంధించిన జొకోవిచ్ 46 విన్నర్స్ కొట్టాడు. 16 సార్లు తన సర్వీస్లో బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లో ఫైనల్ చేరిన 10 సార్లూ టైటిల్ గెలిచిన జొకోవిచ్ ఈ టోర్నీ చరిత్రలో తుది పోరుకు అర్హత పొందిన అతిపెద్ద వయస్కుడిగా (38 ఏళ్ల 241 రోజులు) రికార్డు సృష్టించాడు. కెన్ రోజ్వాల్ (37 ఏళ్ల 54 రోజులు –1972లో) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్సబలెంకా x రిబాకినామధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంచలనం.. 37 ఏళ్ల రికార్డు బద్దలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026లో సంచలనం నమోదైంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో స్థానిక జోడీ ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ టైటిల్ గెలిచింది. ఇదే జోడీ గతేడాది కూడా టైటిల్ ఎగరేసుకుపోయింది. తద్వారా వరుసగా రెండు ఎడిషన్లలో టైటిల్ గెలిచిన జోడీగా 37 ఏళ్ల కిందటి రికార్డును బద్దలు కొట్టింది. 1988-89లో యానా నవోత్న-జిమ్ పగ్ జోడీ వరుసగా రెండు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు గెలిచింది.తాజా టైటిల్తో ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ మరో రికార్డు కూడా సొంతం చేసుకుంది. మార్గరెట్ కోర్ట్-కెన్ ఫ్లెచర్ జోడీ (1963-64) తర్వాత స్వదేశంలో వరుసగా రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్ టైటిళ్లు సాధించిన జోడీగా చరిత్ర సృష్టించింది.రాడ్ లేవర్ ఎరీనాలో ఇవాళ జరిగిన ఫైనల్లో ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ జోడీ ఫ్రెంచ్ జంట క్రిస్టినా మ్లాడెనోవిక్-మాన్యుయెల్ గినార్డ్పై 4-6, 6-3, 10-8 తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో గడెకీ-పియర్స్ జోడీ టైబ్రేక్లో 5-7 వెనుకబడినప్పటికీ, చివరి ఆరు పాయింట్లలో ఐదు గెలిచి టైటిల్ను సొంతం చేసుకుంది. -
ఆసీస్ దిగ్గజం కన్నుమూత
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ హాకీ ప్లేయర్ మైకేల్ నాబ్స్ కన్నుమూశారు. ఆయన గతంలో భారత పురుషుల హాకీ జట్టుకు కోచ్గా పనిచేశారు. నాబ్స్ శిక్షణలోనే భారత జట్టు లండన్లో జరిగిన 2012 ఒలింపిక్స్కు అర్హత సంపాదించింది. కాగా 72 ఏళ్ల నాబ్స్ కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన భార్య లీ కేప్స్ కూడా మాజీ హాకీ ప్లేయర్. ఆస్ట్రేలియా మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కుమార్తె కైట్లిన్ కూడా హాకీరూస్ స్టార్గా ఎదిగింది.ఇక ఆటగాడిగా నాబ్స్ భారత్ ఆతిథ్యమిచ్చిన 1981 హాకీ ప్రపంచకప్, 1984లో జరిగిన లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పోటీపడ్డారు. తదనంతరం కోచ్గా మారారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్కు భారత్ అర్హత సాధించడంలో విఫలమైంది. దీంతో 2011లో భారత కోచ్గా నాబ్స్ నియమితులయ్యారు. లండన్ మెగా ఈవెంట్కు అర్హత సాధించినప్పటికీ ఆ విశ్వక్రీడల్లో భారత్ అట్టడుగున నిలవడంతో ఆయనపై వేటు పడింది. నాబ్స్ భారత్తో పాటు జపాన్ జట్టుకు కోచ్గా పనిచేశారు. కాగా నాబ్స్ మృతి పట్ల హాకీ ఆస్ట్రేలియా సంతాపం వ్యక్తం చేసింది. అత్యంత ప్రభావంతమైన ఒలింపియన్ను కోల్పోయామంటూ నివాళులు అర్పించింది. -
బ్రిజ్భూషణ్కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కింది కోర్టు ప్రొసిడింగ్స్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదని పిటిషనర్ తరఫు లాయర్కు స్పష్టం చేసింది. భారతీయ జనతా పార్టీ (BJP) మాజీ ఎంపీ కూడా అయిన బ్రిజ్భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు రెజ్లర్లు రోడ్డెక్కారు. రోజుల తరబడి నిరసన దీక్ష చేపట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ‘సుప్రీం’ కల్పించుకోవడంతో ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు 2023, మే నెలలో అప్పటి అధికారపార్టీ ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏడాది తర్వాత 2024, మే 21న ట్రయల్ కోర్టు ఆయనపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, మహిళల అణచివేత అభియోగాలు మోపి విచారణ చేపట్టింది. దీనిపై అదే ఏడాది బ్రిజ్భూషణ్ హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ కేసులో తనకు అనుకూలంగా స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కింది కోర్టులో ఎప్పుడో విచారణ మొదలైందని, ఈ కేసు ప్రొసిడింగ్స్లో తక్షణ జోక్యం చేసుకోవాల్సిన అవసరంగానీ, స్టే ఇవ్వాల్సిన అవసరం గానీ లేవని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ స్పష్టం చేస్తూ తీర్పునిచ్చారు. దీంతో ట్రయల్ కోర్టులో ఏప్రిల్ 21న తదుపరి విచారణ జరగనుంది. -
నార్వే చెస్ టోర్నీకి దివ్య
స్టావెంజర్ (నార్వే): ప్రపంచకప్ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్ నార్వే చెస్ టోర్నీలో అరంగేట్రం చేయనుంది. మహిళల ఈవెంట్లో 19 ఏళ్ల భారత ప్లేయర్ తలపడనుంది. రెండేళ్ల క్రితం 2024లో మొదలైన ఈ టోర్నీలో పోటీపడనున్న యువ క్రీడాకారిణిగా ఆమె నిలువనుంది. మే 25 నుంచి జూన్ 5 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ప్రపంచకప్తో పాటు గ్రాండ్మాస్టర్ టైటిల్, మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హతతో గతేడాదిని చిరస్మరణీయం చేసుకున్న ఆమె అదే ఉత్సాహాన్ని ఈ ఏడాది కొనసాగించాలని ఆశిస్తోంది. దివ్యతో పాటు ప్రపంచ మేటి చెస్ ప్లేయర్లంతా నార్వే చెస్ ఈవెంట్లో పాల్గొననున్నారు. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్ బిబిసారా అసబయేవా (కజకిస్తాన్), డిఫెండింగ్ నార్వే చెస్ మహిళల చాంపియన్ అన ముజిచుక్ (ఉక్రెయిన్) తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ‘నార్వే ఈవెంట్లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అక్కడికి వెళ్లనుండటం కూడా ఇదే మొదటిసారి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని దివ్య పేర్కొంది. గతేడాది జరిగిన ఈవెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి పాల్గొన్నారు. ఈ ఏడాది ఓపెన్ కేటగిరీలో ప్రజ్ఞానంద పోటీపడనున్నాడు. -
మన్ప్రీత్ సింగ్పై వేటు
భారత హాకీ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు... నాలుగుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న అనుభవం... ఒకసారి కెప్టెన్గా జట్టుకు పతకం అందించిన రికార్డు సహా రెండు ఒలింపిక్ కాంస్యాలు గెలుచుకున్న జట్లలో సభ్యుడు... అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలవడంతో పాటు అర్జున, ఖేల్రత్న పురస్కారాల విజేత... ఈ ఘనతలన్నీ సాధించిన మన్ప్రీత్ సింగ్పై వేటు పడింది. వచ్చేనెలలో జరిగే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ సీజన్ కోసం 33 మంది ప్రాబబుల్స్తో ప్రకటించిన భారత హాకీ జట్టులో మన్ప్రీత్కు చోటు దక్కలేదు. ‘విశ్రాంతి’ అని కోచ్ చెబుతున్నా... సుమారు 34 ఏళ్ల వయసు ఉన్న మన్ప్రీత్ను పక్కన పెట్టడం అంటే అతని అంతర్జాతీయ కెరీర్ ముగింపునకు చేరువైనట్లే. న్యూఢిల్లీ: మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున 411 మ్యాచ్లు ఆడాడు. మరో మ్యాచ్ ఆడి ఉంటే మన దేశం తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడిన దిలీప్ తిర్కీ (412) రికార్డును అతను సమం చేసేవాడు. అయితే అనూహ్యంగా మన్ప్రీత్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు రూర్కెలాలో జరిగే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ సీజన్ కోసం ఎంపిక చేసిన 33 ప్రాబబుల్స్లో అతనికి చోటు దక్కలేదు. గత ఐదేళ్లలో అతను టీమ్కు దూరం కావడం ఇదే మొదటిసారి. మన్ప్రీత్తో పాటు సీనియర్ గోల్ కీపర్ కృషన్ బహదూర్ పాఠక్పై కూడా వేటు పడింది. ఇటీవల జరిగిన హాకీ ఇండియా లీగ్లో ప్రదర్శనను బట్టి అనేక మంది కొత్త, యువ ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేశారు. పూవన్న చందూరా బాబీ, యశ్దీప్ సివాచ్, అమన్దీప్ లక్డాలకు అవకాశం దక్కగా, జూనియర్ ఆసియా కప్లో ఆకట్టుకున్న ప్రిన్స్దీప్ సింగ్, రోషన్ కుజూర్ కూడా తొలిసారి సీనియర్ టీమ్లోకి వచ్చాడు. భారత్లో తొలి అంచె ప్రొ లీగ్ పోటీలతో జట్టు కొత్త సీజన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మన బృందం హోబర్ట్కు వెళ్లి స్పెయిన్, ఆ్రస్టేలియాలతో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. అనంతరం ప్రొ లీగ్ రెండో అంచె టోర్నీ జూన్లో యూరప్లో జరుగుతుంది. సరైన సమయం: కోచ్ ఫుల్టన్ 2026లో హాకీ వరల్డ్ కప్తో పాటు ఆసియా క్రీడల వంటి ప్రధాన ఈవెంట్లు ఉన్న నేపథ్యంలో జట్టులో ‘రొటేషన్’ విధానాన్ని అనుసరించనున్నామని, కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే సరైన సమయంగా భావించినట్లు భారత జట్టు హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ అన్నారు. ‘పని భారం తగ్గించేందుకు మేం కొంత మంది సీనియర్లకు విశ్రాంతినిచ్చాం. మరికొందరు యువ ఆటగాళ్ల చక్కటి ప్రదర్శనకు గుర్తింపు కూడా దక్కింది. ప్రొ లీగ్తో పాటు ఆ్రస్టేలియాలో ప్రదర్శనను బట్టి ప్రపంచ కప్, ఆసియా కప్లలో పాల్గొనే జట్లను ఎంపిక చేస్తాం’ అని ఆయన వెల్లడించారు. హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టుకు ప్రొ లీగ్కు ముందు ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11న జరిగే తొలి మ్యాచ్లో బెల్జియంతో భారత్ తలపడుతుంది. భారత హాకీ ప్రాబబుల్స్: పవన్, సూరజ్ కర్కెరా, మోహిత్, ప్రిన్స్దీప్ సింగ్ (గోల్కీపర్లు), అమిత్ రోహిదాస్, జర్మన్ప్రీత్ సింగ్, సంజయ్, హర్మన్ప్రీత్ సింగ్ (కెపె్టన్), జుగ్రాజ్ సింగ్, సుమీత్, పూవన్న చందూరా బాబీ, యశ్దీప్ సివాచ్, నీలమ్ సంజీప్, అమన్దీప్ లక్డా (డిఫెండర్లు), రాజీందర్ సింగ్, మన్మీత్ సింగ్, హార్దిక్ సింగ్, రవిచంద్ర సింగ్, వివేక్ సాగర్, విష్ణుకాంత్ సింగ్, రాజ్ కుమార్ పాల్, నీలకాంత శర్మ, రోషన్ కుజూర్ (మిడ్ ఫీల్డర్లు), అభిషేక్, సుఖ్జీత్ సింగ్, శిలానంద్ లక్డా, మన్దీప్ సింగ్, అరిజీత్ సింగ్ హుండల్, అంగద్ వీర్ సింగ్, ఉత్తమ్ సింగ్, సెల్వమ్ కార్తీ, ఆదిత్య అర్జున్, మణీందర్ సింగ్ (ఫార్వర్డ్స్).మన్ప్రీత్ సింగ్ కెరీర్ అంతర్జాతీయ అరంగేట్రం: 2011 మొత్తం మ్యాచ్లు: 411 చేసిన గోల్స్: 45 ఒలింపిక్స్లో రెండు కాంస్యాలు (2020 టోక్యో, 2024 పారిస్), కామన్వెల్త్ గేమ్స్లో 2 రజతాలు, ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 కాంస్యం, చాంపియన్స్ ట్రోఫీలో 2 రజతాలు, ఆసియా కప్లో 2 స్వర్ణాలు, 1 రజతం, ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో 4 స్వర్ణాలు, 1 కాంస్యం, వరల్డ్ లీగ్లో 2 కాంస్యాలు గెలుచుకున్న జట్లలో సభ్యుడు. భారత్ తరఫున అతను నాలుగు ప్రపంచ కప్లు కూడా ఆడాడు. -
సబలెంకా X రిబాకినా
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్) వరుసగా నాలుగో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2023, 2024లలో టైటిల్ సాధించిన ఆమె గత ఏడాది మాడిసన్ కీస్ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో సబలెంకా 6–2, 6–3తో 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకా 29 విన్నర్స్ కొట్టి, తన ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. శనివారం జరిగే ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)తో సబలెంకా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో రిబాకినా 6–3, 7–6 (9/7)తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై విజయం సాధించింది. 1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రిబాకినా ఆరు ఏస్లు సంధించింది. 31 విన్నర్స్ కొట్టిన ఆమె తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ఆ్రస్టేలియన్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా తలపడనుండటం ఇది రెండోసారి. 2023 ఫైనల్లో రిబాకినాపైనే గెలిచి సబలెంకా తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్గా అవతరించింది. 3 ఆ్రస్టేలియన్ ఓపెన్ చరిత్రలో వరుసగా నాలుగేళ్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఫైనల్ చేరిన మూడో క్రీడాకారిణి సబలెంకా. గతంలో ఇవోన్ గూలాగాంగ్ (ఆ్రస్టేలియా; 1971 నుంచి 1976 వరకు), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్; 1997 నుంచి 2002 వరకు) వరుసగా ఆరుసార్లు ఫైనల్ చేరారు.నేడు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ అల్కరాజ్ x జ్వెరెవ్ (ఉదయం 9 నుంచి)జొకోవిచ్x సినెర్ (మధ్యాహ్నం 2 నుంచి)సోనీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణ ఓటమి
జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ చాంపియన్షిప్లో ఇండియన్ రైల్వేస్, హరియాణా జట్లు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా.. ఆతిథ్య తెలంగాణ జట్టు పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. హైదరాబాద్లోని గచి్చ»ౌలి ఇండోర్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణ జట్టు 25–42తో పంజాబ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో రైల్వేస్ 46–27 పాయింట్ల తేడాతో కర్ణాటక జట్టుపై, హరియాణా 50–19 విదర్భ జట్టుపై, మహారాష్ట్ర 42–36తో గోవా జట్టుపై, మధ్యప్రదేశ్ 41–36తో ఢిల్లీ జట్టుపై, చండీగఢ్ 45–39తో ఉత్తరప్రదేశ్ జట్టుపై, తమిళనాడు 34–30తో రాజస్తాన్ జట్టుపై, హిమాచల్ ప్రదేశ్ 67–22తో గుజరాత్ జట్టుపై విజయం సాధించాయి. క్వార్టర్ ఫైనల్స్లో మహారాష్ట్రతో ఇండియన్ రైల్వేస్, హరియాణాతో మధ్యప్రదేశ్, తమిళనాడుతో చండీగఢ్, హిమాచల్ప్రదేశ్తో పంజాబ్ తలపడతాయి. -
నన్ను అవమానిస్తున్నారా?: టెన్నిస్ దిగ్గజం ఫైర్
సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్కు కోపమొచ్చింది. విలేఖరి అడిగిన ప్రశ్న తనను అవమానించేలా ఉందంటూ అతడు తీవ్ర అసహనానికి లోనయ్యాడు. జొకోవిచ్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్-2026తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అదృష్టవశాత్తూ..ఈ క్రమంలో పురుషుల సింగిల్స్ విభాగంలో అతడు సెమీ ఫైనల్కు చేరాడు. ఇప్పటికే ఈ టోర్నీలో పదిసార్లు చాంపియన్గా నిలిచిన జొకోవిచ్ (Novak Djokovic) బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో ఇటలీ స్టార్ లొరెంజో ముసెట్టితో తలపడ్డాడు.ముసెట్టితో జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ తొలి రెండు సెట్లను 4–6, 3–6తో కోల్పోయాడు. మూడో సెట్లో మాత్రం 3–1తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో ముసెట్టి కాలికి గాయం కావడంతో అతడు వైదొలిగాడు. దాంతో ఓడిపోయే అవకాశాలున్న చోట జొకోవిచ్ అదృష్టవశాత్తూ విజయతీరానికి చేరాడు.సెమీస్లో సినెర్తో జొకోవిచ్మరోవైపు... డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో 6–3, 6–4, 6–4తో ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)పై సినెర్ విజయం సాధించాడు. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో జ్వెరెవ్ (జర్మనీ)తో అల్కరాజ్; సినెర్తో జొకోవిచ్ తలపడతారు. టెన్నిస్ దిగ్గజం ఫైర్అయితే, సెమీస్ చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన జొకోవిచ్కు.. ఇప్పుడు సెనెర్, కార్లెస్ అల్కరాజ్లను మీరు ఛేజ్ చేస్తున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు చిర్రెత్తిపోయిన జొకోవిచ్.. ‘‘నేను సెనెర్, కార్లోస్ను ఛేజ్ చేస్తున్నానా? ఏ ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగారు?.. నేనెప్పుడూ ఛేజర్గానే ఉంటానా?నన్నెవరూ ఛేజ్ చేయరా? 24 గ్రాండ్స్లామ్లు గెలిచిన నాకు అంత సత్తా లేదంటారా? ఇలా అడిగి నన్ను అవమానిస్తున్నారా? మీ మాటలు నన్ను కించపరిచేవిగా ఉన్నాయి. ఒకప్పుడు రఫా (రఫెల్ నాదల్), రోజర్ ఫెడరర్ను ఛేజ్ చేస్తున్నా అన్నారు. ఇప్పుడు సినెర్, కార్లోస్లను చేస్తున్నా అంటున్నారు.ఆ కోణంలో చూడటం లేదా?పదిహేనేళ్ల కెరీర్లో గ్రాండ్స్లామ్లలో మేటి విన్నర్గా ఉన్నా.. మీరు ఆ కోణంలో చూడటం లేదా?’’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెన్లో పదిసార్లు చాంపియన్గా నిలిచిన ఘనత జొకోవిచ్ సొంతం. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 24 గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచాడు 38 ఏళ్ల ఈ టెన్నిస్ స్టార్. అయితే, ఆస్ట్రేలియా ఓపెన్లో గత రెండు పర్యాయాలుగా జొకోవిచ్కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. సెనెర్ చాంపియన్గా అవతరించగా.. జొకోవిచ్ ఫైనల్ కూడా చేరలేకపోయాడు.చదవండి: అల్కరాజ్ తొలిసారి... -
స్వియాటెక్ అవుట్
మెల్బోర్న్: అందని ద్రాక్షగా ఉన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను సాధించి ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ ఘనత సాధించాలని ఆశించిన పోలాండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్కు మరోసారి నిరాశ ఎదురైంది. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీగా జరిగే ఆ్రస్టేలియన్ ఓపెన్లో ఎనిమిదోసారి బరిలోకి దిగిన స్వియాటెక్ ఈసారి క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. కజకిస్తాన్ స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్ ఎలెనా రిబాకినా 7–5, 6–1తో ప్రపంచ రెండో ర్యాంకర్ స్వియాటెక్ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆ్రస్టేలియన్ ఓపెన్లో రిబాకినా చేతిలో స్వియాటెక్ ఓడిపోవడం ఇది రెండోసారి. 2023లో ప్రిక్వార్టర్ ఫైనల్లో రిబాకినా 6–4, 6–4తో స్వియాటెక్ను ఓడించింది. గ్రాండ్స్లామ్ టోర్నీల్లో స్వియాటెక్పై రెండుసార్లు నెగ్గిన ఏకైక ప్లేయర్గా రిబాకినా నిలిచింది. స్వియాటెక్తో 95 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో రిబాకినా 11 ఏస్లు సంధించింది. మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సర్వీస్లో 29 పాయింట్లకు 23 పాయింట్లు... రెండో సర్వీస్లో 30 పాయింట్లకు 17 పాయింట్లు సంపాదించింది. 26 విన్నర్స్ కొట్టిన 2023 రన్నరప్... 19 అనవసర తప్పిదాలు చేసింది. నెట్ వద్దకు ఏడుసార్లు దూసుకొచ్చి ఆరుసార్లు పాయింట్లు గెలిచిన రిబాకినా తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, స్వియాటెక్ సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు స్వియాటెక్ 10 విన్నర్స్ కొట్టి, 25 అనవసర తప్పిదాలు చేసింది. 24 ఏళ్ల స్వియాటెక్ నాలుగుసార్లు (2020, 2022, 2023, 2024) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను... ఒకసారి (2025) వింబుల్డన్ టైటిల్ను...ఒకసారి (2022) యూఎస్ ఓపెన్ టైటిల్ను సాధించింది. వచ్చే ఏడాది స్వియాటెక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను సాధిస్తే... మరియా షరపోవా (2012లో) తర్వాత ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేసుకున్న రెండో క్రీడాకారిణిగా... ఓవరాల్గా 11వ క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. అనిసిమోవా నిష్క్రమణ గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో రన్నరప్గా నిలిచిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ అనిసిమోవా (అమెరికా) ఆస్ట్రేలియన్ ఓపెన్లో మాత్రం అద్భుతం చేయలేకపోయింది. అమెరికాకే చెందిన ఆరో సీడ్ జెస్సికా పెగూలాతో జరిగిన మ్యాచ్లో అనిసిమోవా 2–6, 6–7 (1/7)తో ఓడిపోయింది. అనిసిమోవాపై గెలుపుతో పెగూలా తన కెరీర్లో తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్లో సెమీఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో పెగూలా ఆరు ఏస్లు సంధించింది. మరోవైపు అనిసిమోవా ఏడు డబుల్ ఫాల్ట్లు చేసింది. అనిసిమోవా 18 విన్నర్స్తో పోలిస్తే 20 విన్నర్స్ కొట్టిన పెగూలా 21 అనవసర తప్పిదాలు చేసింది. అనిసిమోవా 44 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. నాలుగుసార్లు అనిసిమోవా సర్వీస్ను బ్రేక్ చేసిన పెగూలా తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయింది.నేటి మహిళల సెమీఫైనల్స్సబలెంకా x స్వితోలినా పెగూలా x రిబాకినా మధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారంజొకోవిచ్ను గట్టెక్కించిన ముసెట్టి గాయంపురుషుల సింగిల్స్ విభాగంలో 10 సార్లు చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో జొకోవిచ్కు ప్రత్యర్థి లొరెంజో ముసెట్టి (ఇటలీ) గాయం గట్టెక్కించగా... సినెర్ 6–3, 6–4, 6–4తో ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)పై విజయం సాధించాడు. ముసెట్టితో జరిగిన మ్యాచ్లో జొకోవిచ్ తొలి రెండు సెట్లను 4–6, 3–6తో కోల్పోయాడు. మూడో సెట్లో మాత్రం 3–1తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో ముసెట్టి కాలికి గాయం కావడంతో అతను వైదొలిగాడు. దాంతో ఓడిపోయే అవకాశాలున్న చోట జొకోవిచ్ అదృష్టవశాత్తూ విజయతీరానికి చేరాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో జ్వెరెవ్ (జర్మనీ)తో అల్కరాజ్; సినెర్తో జొకోవిచ్ తలపడతారు. 1 ఓ గ్రాండ్స్లామ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో తొలి రెండు సెట్లు గెలిచి, ఆ తర్వాత గాయం కారణంగా వైదొలిగిన తొలి ప్లేయర్గా లొరెంజో ముసెట్టి నిలిచాడు.5 ఓపెన్ శకంలో (1968 నుంచి) వరుసగా ఆరు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్కు చేరిన ఐదో ప్లేయర్గా సినెర్ గుర్తింపు పొందాడు. గతంలో ఇవాన్ లెండిల్, ఫెడరర్, జొకోవిచ్, నాదల్ ఈ ఘనత సాధించారు.6 ఓపెన్ శకంలో (1968 నుంచి) ఆస్ట్రేలియన్ ఓపెన్లో వరుసగా నాలుగుసార్లు సెమీఫైనల్కు చేరిన ఆరో ప్లేయర్గా జొకోవిచ్ నిలిచాడు. గతంలో గిలెర్మో విలాస్, ఇవాన్ లెండిల్, స్టీఫెన్ ఎడ్బర్గ్, ఫెడరర్, ఆండీ ముర్రే ఈ ఘనత సాధించారు.103 ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. 102విజయాలతో ఫెడరర్ పేరిట ఉన్న రికార్డునుజొకోవిచ్ బద్దలు కొట్టాడు.2 ఆ్రస్టేలియన్ ఓపెన్లో సెమీఫైనల్ చేరిన రెండో అతిపెద్ద వయసు్కడిగా జొకోవిచ్ (38 ఏళ్ల 241 రోజులు) గుర్తింపు పొందాడు. కెన్ రోజ్వాల్ (1977లో; 42 ఏళ్ల 60 రోజులు) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. -
విజేత కళింగ లాన్సర్స్
భువనేశ్వర్: పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో కళింగ లాన్సర్స్ రెండోసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో కళింగ లాన్సర్స్ జట్టు 3–2 గోల్స్ తేడాతో రాంచీ రాయల్స్పై గెలుపొంది 2017 తర్వాత మళ్లీ టైటిల్ సాధించింది. కళింగ లాన్సర్స్ తరఫున అలెగ్జాండ్రా హెండ్రిక్స్ (4వ, 27వ నిమిషాల్లో) రెండు గోల్స్తో సత్తా చాటగా... దిల్ప్రీత్ సింగ్ (25వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. రాంచీ రాయల్స్ తరఫున అరిజీత్ సింగ్ హండల్ (9వ నిమిషంలో), టామ్ బూన్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ కొట్టారు. ఫైనల్ కంటే ముందు నిర్వహించిన వర్గీకరణ మ్యాచ్లో హైదరాబాద్ తూఫాన్స్ 4–3 గోల్స్ తేడాతో హెచ్ఐఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జట్టుపై విజయం సాధించి మూడో స్థానం దక్కించుకుంది. హైదరాబాద్ తూఫాన్స్ తరఫున అమన్దీప్ లక్రా (30వ, 53వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... నీలకంఠ శర్మ (24వ నిమిషంలో), జాకబ్ అండర్సన్ (33వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు. హెచ్ఐఎల్ గవర్నింగ్ కౌన్సిల్ టీమ్ తరఫున సామ్ వర్డ్ (14వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్... కేర్ రసెల్ (55వ నిమిషంలో) ఓ గోల్ సాధించాడు. విజేతగా నిలిచిన కళింగ లాన్సర్స్కు రూ. 3 కోట్ల ప్రైజ్మనీ లభించింది. రన్నరప్గా నిలిచిన రాంచీ రాయల్స్కు రూ. 2 కోట్లు దక్కాయి. మూడో స్థానం దక్కించుకున్న హైదరాబాద్ తూఫాన్స్కు కోటి రూపాయల నగదు బహుమతి లభించింది. హెచ్ఐఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జట్టుకు ‘ఫెయిర్ ప్లే’ అవార్డు దక్కింది. తమిళనాడు డ్రాగన్స్ గోల్కీపర్ ప్రిన్స్ దీప్ సింగ్కు ‘బెస్ట్ గోల్ కీపర్’ అవార్డు లభించింది. హెచ్ఐఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జట్టు సభ్యుడైన టాలెమ్ ప్రియోబర్టా ‘అప్కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కించుకున్నాడు. వీరిద్దరికీ రూ. 10 లక్షల చొప్పున నగదు పురస్కారం లభించింది. రాంచీ రాయల్స్ కెపె్టన్ టామ్ బూన్ ఈ టోర్నీలో అత్యధిక (19) గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచి ‘టాప్ స్కోరర్’ ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల బహుమతి అందుకున్నాడు. హైదరాబాద్ తూఫాన్స్ ప్లేయర్ అమన్దీప్ లక్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డుతో పాటు రూ. 20 లక్షల నగదు బహుమతి లభించింది. -
అల్కరాజ్ తొలిసారి...
మెల్బోర్న్: తనకు అచ్చిరాని గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్లో ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్ తొలిసారి క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించాడు. గత రెండేళ్లు క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగిన ఈ స్పెయిన్ స్టార్ ఈసారి మాత్రం సాధికారిక ఆటతీరుతో తొలిసారి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 7–5, 6–2, 6–1తో ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్ ఐదు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తొలి సర్వీస్లో 48 పాయింట్లకు 37... రెండో సర్వీస్లో 35 పాయింట్లకు 19 పాయింట్లు సంపాదించాడు. 26 విన్నర్స్ కొట్టిన ఈ స్పెయిన్ స్టార్ 32 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 22 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు సాధించాడు. సెమీఫైనల్ చేరే క్రమంలో అల్కరాజ్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఫైనల్లో చోటు కోసం సెమీఫైనల్లో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో అల్కరాజ్ ఆడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 6–3, 6–7 (5/7), 6–1, 7–6 (7/3)తో లెర్నర్ టియెన్ (అమెరికా)పై విజయం సాధించాడు. 3 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జ్వెరెవ్ ఏకంగా 24 ఏస్లు సంధించడం విశేషం. ఒక్క డబుల్ ఫాల్ట్ మాత్రమే చేసిన జ్వెరెవ్ 56 విన్నర్స్ కొట్టాడు. 22 అనవసర తప్పిదాలు చేశాడు. తనసర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోని జ్వెరెవ్ ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 31 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. మరోవైపు లెర్నర్ 53 విన్నర్స్ కొట్టి, 43 అనవసర తప్పిదాలు చేశాడు. 11 ఏస్లు కొట్టిన లెర్నర్ 9 డబుల్ ఫాల్ట్లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కోకో గాఫ్కు షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్), 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–3, 6–0తో ఇవా జోవిచ్ (అమెరికా)ను అలవోకగా ఓడించగా ... స్వితోలినా 6–1, 6–2తో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా)ను బోల్తా కొట్టించడం విశేషం. కోకో గాఫ్తో 59 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్లో స్వితోలినా ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. వరుసగా నాలుగో ఏడాది సెమీఫైనల్ చేరిన సబలెంకా క్వార్టర్ ఫైనల్లో కేవలం మూడు గేమ్లు కోల్పోయింది. 2 మిర్యానా లూసిచ్ (2017లో; 34 ఏళ్ల 313 రోజులు) తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన రెండో అతి పెద్ద వయసు్కరాలిగా స్వితోలినా (31 ఏళ్ల 218 రోజులు) నిలిచింది.13 ఆ్రస్టేలియన్ ఓపెన్లో 13వ ప్రయత్నంలో స్వితోలినా తొలిసారి సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకుంది. ఎలీనా దెమెంతియెవా (రష్యా; 2009లో 11వ ప్రయత్నంలో) పేరిట ఉన్న రికార్డును స్వితోలినా అధిగమించింది.10 గ్రాండ్స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్కు చేరడం అల్కరాజ్కిది పదోసారి. ఓపెన్ శకంలో (1968 నుంచి) పది గ్రాండ్స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్కు చేరిన రెండో అతి పిన్న వయసు్కడిగా అల్కరాజ్ (22 ఏళ్ల 258 రోజులు) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో రాఫెల్ నాదల్ (2009లో; 22 ఏళ్ల 7 నెలల 25 రోజులు) అగ్రస్థానంలో ఉన్నాడు.3 టెన్నిస్లోని నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల్లోనూ సెమీఫైనల్ చేరిన మూడో అతి పిన్న వయసు్కడిగా అల్కరాజ్ నిలిచాడు. ఈ జాబితాలో నొవాక్ జొకోవిచ్ (20 ఏళ్ల 237 రోజులు), రాఫెల్ నాదల్ (22 ఏళ్ల 83 రోజులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ చాంపియన్షిప్ ప్రారంభం
30 జట్లు... 464 మంది క్రీడాకారిణులు...పలువురు అంతర్జాతీయ స్టార్స్... తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హైదరాబాద్ విచ్చేశారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ చాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు ఈ ప్రతిష్టాత్మక చాంపియన్షిప్ జరగనుంది. తొలి రోజు జరిగిన లీగ్ మ్యాచ్ల్లో రాజస్తాన్ 44–21తో తెలంగాణపై, ఢిల్లీ 61–14తో జమ్మూ కశ్మీర్పై, హిమాచల్ప్రదేశ్ 49–24తో అస్సాంపై, హరియాణా 62–16తో జార్ఖండ్పై నెగ్గాయి. తెలంగాణ జట్టుకు మహేశ్వరి కెప్టెన్గా, గట్టయ్య, బండారి మాధవి కోచ్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభోత్సవంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేశ్ ముదిరాజ్, కాసాని జ్ఞానేశ్వర్, జగదీశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నీలో రాణించిన క్రీడాకారిణులను ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో, కబడ్డీ ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ప్రాబబుల్స్గా ఎంపిక చేస్తారు. -
డిఫెండింగ్ చాంపియన్కు భారీ షాక్!
మెల్బోర్న్: అమెరికా స్టార్, డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రిక్వార్టర్స్లోనే నిష్క్రమించింది. మహిళల సింగిల్స్లో అమెకు సహచర క్రీడాకారిణి జెస్సికా పెగులా షాక్ ఇచ్చింది. ఈ విభాగంలో టాప్ సీడ్, పోలాండ్ స్టార్ స్వియాటెక్, నాలుగో సీడ్ అనిసిమోవ, ఐదో సీడ్ రిబాకినా క్వార్టర్స్లోకి అడుగుపెట్టారు.పురుషుల సింగిల్స్లో రెండో సీడ్ డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అతనితో పాటు ఐదో సీడ్ ముసెట్టి, ఎనిమిదో సీడ్ షెల్టన్లు కూడా క్వార్టర్స్ చేరాడు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఆరో సీడ్ పెగులా (అమెరికా) 6–3, 6–4తో తన దేశానికే చెందిన డిఫెండింగ్ చాంపియన్, తొమ్మిదో సీడ్ మాడిసన్ కీస్ను కంగుతినిపించింది.స్వియాటెక్ గెలుపుగత సెమీఫైనలిస్ట్ ఇగా స్వియాటెక్ 6–0, 6–3తో స్థానిక క్వాలిఫయర్ మాడిసన్ ఇన్గ్లిస్ (ఆసీస్)పై అలవోక విజయం సాధించగా, 2023 రన్నరప్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) 6–1, 6–3తో ఎలీస్ మెర్టన్స్ (బెల్జియం)ను ఓడించింది. అమెరికాకు చెందిన నాలుగో సీడ్ అమెండా అనిసిమోవ 7–6 (7/4), 6–4,తో జిన్యూ వాంగ్ (చైనా)పై గెలిచి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరింది. అమెండా గతంలో మూడుసార్లు (2019, 2022, 2024) ప్రిక్వార్టర్స్తోనే సరిపెట్టుకుంది. సినెర్ జోరు పురుషుల సింగిల్స్లో యానిక్ సినెర్ ఆరంభ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ లక్ష్యంగా దూసుకెళుతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో గత రెండేళ్లు టైటిల్ సాధించిన ఈ డిఫెండింగ్ చాంపియన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్స్లో రెండో సీడ్ ఇటాలియన్ స్టార్ 6–1, 6–3, 7–6 (7/2)తో తన దేశానికే చెందిన 22వ సీడ్ ల్యూసియానో డర్డెరిపై గెలుపొందాడు.గతేడాది సెమీఫైనలిస్ట్, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) 3–6, 6–4, 6–3, 6–4తో నార్వేకు చెందిన 12వ సీడ్ కాస్పర్ రూడ్పై చెమటోడ్చి నెగ్గాడు. ఐదో సీడ్ లారెంజో ముసెట్టి (ఇటలీ) 6–2, 7–5, 6–4తో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)ను ఓడించి తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు.పురుషుల డబుల్స్లో భారత డబుల్స్ ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. స్వీడెన్కు చెందిన ఆండ్రీ గొరాన్సన్తో కలిసి పదో సీడ్గా బరిలోకి దిగిన యూకీ బాంబ్రీ మూడో రౌండ్లో 6–7 (7/9), 3–6తో బ్రెజిల్ ద్వయం ఒర్లాండో లుజ్–రాఫెల్ మాటొస్ చేతిలో ఓడారు. -
అల్కరాజ్ అదరహో
మెల్బోర్న్: ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో ఆ్రస్టేలియన్ ఓపెన్ టోర్నీలో బరిలోకి దిగిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ అల్కరాజ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. వరుసగా నాలుగో మ్యాచ్లో మూడు సెట్లలో విజయాన్ని అందుకొని వరుసగా మూడో ఏడాది క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. 19వ సీడ్ టామీ పాల్ (అమెరికా)తో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 7–6 (8/6), 6–4, 7–5తో గెలుపొందాడు. 2 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో స్పెయిన్ స్టార్ రెండు ఏస్లు సంధించి, 35 విన్నర్స్ కొట్టాడు. తన సర్వీ స్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)తో అల్కరాజ్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో డిమినార్ 6–4, 6–1, 6–1తో పదో సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)ను ఓడించాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 6–4, 6–4తో సెరున్డోలో (అర్జెంటీనా)పై గెలుపొందగా... లెర్నర్ టియెన్ (అమెరికా) 6–4, 6–0, 6–3తో 11వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా)ను బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో అమెరికా తరఫున ఆండీ రాడిక్ (2001లో యూఎస్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన పిన్న వయసు్కడిగా లెర్నర్ టియెన్ (20 ఏళ్లు) గుర్తింపు పొందాడు. సబలెంకా జోరు మహిళల సింగిల్స్ విభాగంలో రెండుసార్లు చాంపియన్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా క్వార్టర్ ఫైనల్కు చేరింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ బెలారస్ స్టార్ 6–1, 7–6 (7/1)తో విక్టోరియా ఎంబాకో (కెనడా)పై గెలిచింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకా ఆరు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. 31 విన్నర్స్ కొట్టిన ఆమె, 24 అనవసర తప్పిదాలు చేసింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–4తో ఎనిమిదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా)ను బోల్తా కొట్టించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 3–6, 6–3తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై, ఇవా జోవిచ్ (అమెరికా) 6–0, 6–1తో పుతింత్సెవా (కజకిస్తాన్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. జొకోవిచ్ 16వసారి.... రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ వేటలో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కోర్టులో అడుగు పెట్టకుండానే క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జాకుబ్ మెన్సిఖ్ (చెక్ రిపబ్లిక్)తో నేడు జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్ జరగాల్సింది. అయితే గాయం కారణంగా మెన్సిఖ్ ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో జొకోవిచ్ ‘వాకోవర్’ లభించింది. ఫలితంగా ఆ్రస్టేలియన్ ఓపెన్లో 16వసారి ఈ సెర్బియా స్టార్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా ఆ్రస్టేలియన్ ఓపెన్లో అత్యధికసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన ప్లేయర్గా రోజర్ ఫెడరర్ (15) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ బద్దలు కొట్టాడు. -
‘పద్మభూషణ్’ విజయ్ అమృత్రాజ్
న్యూఢిల్లీ: తన ఆటతీరుతో అంతర్జాతీయస్థాయిలో భారత టెన్నిస్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన విజయ్ అమృత్రాజ్ను కేంద్ర ప్రభుత్వం సముచితరీతిలో గౌరవించింది. 2026 సంవత్సరానికి ప్రకటించిన కేంద్ర పౌర పురస్కారాల్లో విజయ్ అమృత్రాజ్కు మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ భూషణ్’ లభించింది. ఈసారి క్రీడా విభాగంలో మొత్తం తొమ్మిది మంది ‘పద్మ’ అవార్డులకు ఎంపికయ్యారు. క్రికెటర్లు రోహిత్ శర్మ (మహారాష్ట్ర), హర్మన్ప్రీత్ కౌర్ భుల్లర్ (పంజాబ్)... పారాథ్లెట్ ప్రవీణ్ కుమార్ (ఉత్తరప్రదేశ్), భారత మహిళల హాకీ జట్టు గోల్కీపర్ సవితా పూనియా (హరియాణా), హాకీ కోచ్ బల్దేవ్ సింగ్ (పంజాబ్), యుద్ధకళల్లో వెటరన్ కోచ్లు భగవాన్దాస్ రైక్వార్ (మధ్యప్రదేశ్), పజానివెల్ (పుదుచ్చేరి), జార్జియాకు చెందిన రెజ్లింగ్ కోచ్, దివంగత వ్లాదిమిర్ మెస్త్విరిష్విలిలకు ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. ఒలింపిక్స్లో కాంస్య పతకాలు గెలిచిన భారత రెజ్లర్లు యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియాలకు వ్లాదిమిర్ శిక్షణ ఇచ్చారు. 35 ఏళ్ల సవితా పూనియా భారత హాకీ జట్టుకు 308 మ్యాచ్ల్లో గోల్కీపర్గా వ్యవహరించింది. టోక్యో, రియో ఒలింపిక్స్లో పోటీపడింది. మూడుసార్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఉత్తమ గోల్కీపర్గా ఎంపికైంది. పారాథ్లెటిక్స్లో హైజంప్ ఈవెంట్లో ఆడే 22 ఏళ్ల ప్రవీణ్ రెండు ఒలింపిక్ పతకాలు సాధించాడు. టి64 కేటగిరీలో పోటీపడే ప్రవీణ్ 2024 పారిస్ పారాలింపిక్స్లో స్వర్ణ పతకం, 2020 టోక్యో పారాలింపిక్స్లో రజత పతకం సాధించాడు. గత ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో కాంస్యం గెల్చుకున్నాడు. 2022 ఆసియా పారా క్రీడల్లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన 72 ఏళ్ల విజయ్ అమృత్రాజ్ అమెరికాలోని కాలిఫోరి్నయాలో స్థిరపడ్డారు. 1970 నుంచి 1993 వరకు ఆయన ప్రొఫెషనల్ కెరీర్ సాగింది. విజయ్ 15 సింగిల్స్ టైటిల్స్, 13 డబుల్స్ టైటిల్స్ సాధించారు. ఓవరాల్గా 405 మ్యాచ్ల్లో గెలిచారు. 312 మ్యాచ్ల్లో ఓడిపోయారు. 1980లో కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్ను అందుకున్నారు. 13,30,503 డాలర్లు ప్రైజ్మనీ సంపాదించారు. టెన్నిస్లోని నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆయన బరిలోకి దిగారు. 32 సార్లు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆడిన విజయ్ వింబుల్డన్లో రెండుసార్లు (1973, 1981), యూఎస్ ఓపెన్లో రెండుసార్లు (1973, 1974) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 2024లో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు సంపాదించిన విజయ్... ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ టోర్నీ డేవిస్కప్లోనూ ఆకట్టుకున్నారు. డేవిస్కప్లో రెండుసార్లు (1974, 1987) భారత జట్టు రన్నరప్గా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. 1983లో ‘పద్మశ్రీ’ పొందిన విజయ్కు 1974లో ‘అర్జున అవార్డు’ కూడా లభించింది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర టెన్నిస్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విజయ్ హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. తన నాయకత్వ పటిమతో రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. రోహిత్ కెప్టెన్సీలోనే టీమిండియా 2024లో టి20 ప్రపంచకప్ టైటిల్... 2025లో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించింది. ఐపీఎల్లో రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. 2024లో అంతర్జాతీయ టి20ల నుంచి, 2025లో టెస్టు క్రికెట్ నుంచి రిటైరైన రోహిత్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 38 ఏళ్ల రోహిత్ భారత్ తరఫున 67 టెస్టులు ఆడి 4301 పరుగులు... 282 వన్డేలు ఆడి 11,577 పరుగులు... 159 టి20లు ఆడి 4231 పరుగులు సాధించాడు.గత 17 ఏళ్లుగా భారత మహిళల క్రికెట్ జట్టులో సభ్యురాలిగా ఉన్న హర్మన్ప్రీత్ కెప్టెన్సీలో గత ఏడాది టీమిండియా వన్డే వరల్డ్కప్ టైటిల్ గెలిచింది. స్వదేశంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించిన భారత్ తొలిసారి ఈ ఘనత సాధించింది. 36 ఏళ్ల హర్మన్ ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడి 200 పరుగులు... 161 వన్డేలు ఆడి 4409 పరుగులు, 187 టి20లు ఆడి 3784 పరుగులు చేసింది. మూడు ఫార్మాట్లలో కలిపి 8 సెంచరీలు, 38 అర్ధ సెంచరీలు సాధించిన హర్మన్ 75 వికెట్లు కూడా పడగొట్టింది. -
గుకేశ్కు వరుసగా రెండో ఓటమి
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శుక్రవారం ఆరో రౌండ్లో నొదిర్బాక్ అబ్దుస్సత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిన గుకేశ్... శనివారం ఏడో రౌండ్లో అనీశ్ గిరి (నెదర్లాండ్స్) చేతిలో కూడా పరాజయం పాలయ్యాడు. ఏడు రౌండ్ల తర్వాత గుకేశ్ ఒకే ఒక రౌండ్లో గెలిచి రెండు పరాజయాలు, నాలుగు డ్రాలు నమోదు చేశాడు. మరో భారత ఆటగాడు ప్రజ్ఞానంద, బ్లూబమ్ మథియాస్ (జర్మనీ) మధ్య జరిగిన ఏడో రౌండ్ గేమ్ డ్రాగా ముగియగా, వాన్ ఫారెస్ట్ జోర్డాన్ (నెదర్లాండ్స్) చేతిలో అరవింద్ చిదంబరం ఓడిపోయాడు. ఆరో రౌండ్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి... బ్లూబమ్ మథియాస్ (జర్మనీ)తో జరిగిన గేమ్ను డ్రాగా ముగించాడు. ఏడు రౌండ్లు ముగిసే సరికి నాలుగు విజయాలు సాధించిన అబ్దుస్సత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టోర్నమెంట్లో 14 మంది గ్రాండ్మాస్టర్లు పాల్గొంటుండగా... ప్రతీ ప్రత్యరి్థతో ఒక్కో సారి ఆడుతూ ఆటగాళ్లు 13 రౌండ్లలో తలపడాల్సి ఉంటుంది. -
జొకోవిచ్ @ 400
మెల్బోర్న్: స్టార్ ఆటగాడు, వరల్డ్ మాజీ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ తన 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో ఈ సెర్బియా దిగ్గజం ప్రిక్వార్టర్స్లోకి అడుగు పెట్టాడు. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో జొకోవిచ్ 6–3, 6–4, 7–6 (7/4)తో బాటిల్ వాన్ డి జాండ్షల్ప్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును అతను తన ఖాతాలో వేసుకున్నాడు. గ్రాండ్స్లామ్ కెరీర్లో జొకోవిచ్కు ఇది 400వ విజయం కావడం విశేషం. దీంతో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్లో అత్యధిక మ్యాచ్లు నెగ్గిన రోజర్ ఫెడరర్ (102 మ్యాచ్లు) రికార్డును కూడా అతను సమం చేశాడు. వరల్డ్ నంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) కూడా ముందంజ వేశాడు. తీవ్ర వేడి కారణంగా అలసటకు గురై ఇబ్బంది పడిన సినెర్ చివరకు విజయాన్ని దక్కించుకున్నాడు. మూడో రౌండ్లో అతను 4–6, 6–3, 6–4, 6–4తో ఇలియట్ స్పిజారి (అమెరికా)పై గెలుపొందాడు. తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిజ్ (అమెరికా) మూడో రౌండ్లో 7–6 (7/5), 2–6, 6–4, 6–4తో వావ్రింకా (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. మహిళల విభాగంలో రెండు సార్లు విజేత నవోమీ ఒసాకా (జపాన్) గాయంతో మూడో రౌండ్కు ముందు టోర్నీనుంచి తప్పుకుంది. ఇతర మ్యాచ్లలో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) 6–1, 1–6, 6–1తో కలిన్సకయా (రష్యా)పై, మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–3తో ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై, పెగులా 6–3, 6–2తో సలెక్మెన్టొవా (రష్యా)పై గెలిచి ప్రిక్వార్టర్స్కు చేరారు. యూకీ బాంబ్రీ ముందంజ... పురుషుల డబుల్స్ భారత ఆటగాడు యూకీ బాంబ్రీ మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. బాంబ్రీ – ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) తమ రెండో రౌండ్ పోరులో 4–6, 7–6 (7/5), 6–3తో సాంటియాగో గొనాలెజ్ – డేవిడ్ పెల్ జంటపై విజయం సాధించారు. అయితే మరో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ పరాజయంతో ని్రష్కమించాడు. రెండో రౌండ్లో బాలాజీ – నీల్ ఒబర్లీనర్ (ఆ్రస్టేలియా) 5–7, 1–6తో నాలుగో సీడ్ మార్సెల్ అరెవాలో – మేట్ పావిక్ చేతిలో ఓటమి పాలయ్యారు. -
ఫైనల్లో కళింగ లాన్సర్స్
భువనేశ్వర్: పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో వేదాంత కళింగ లాన్సర్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన తొలి క్వాలిఫయర్లో కళింగ లాన్సర్స్ జట్టు 2–1 గోల్స్తో రాంచీ రాయల్స్పై గెలుపొందడంతో నేరుగా టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. కళింగ తరఫున అలెగ్జాండర్ హెండ్రిక్స్ (12వ, 32వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా, రాంచీ రాయల్స్ జట్టులో మన్దీప్ సింగ్ 40వ నిమిషంలో గోల్ చేశాడు. రాంచీకి ఫైనల్ చేరే అర్హత రెండో క్వాలిఫయర్ రూపంలో ఇంకా సజీవంగానే ఉంది. ఆదివారం ఫైనల్ బెర్త్ లక్ష్యంగా రాంచీతో హైదరాబాద్ తుఫాన్స్ తలపడుతుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో కళింగ లాన్సర్స్ అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు గత ఏడాది రన్నరప్ హైదరాబాద్ తుఫాన్స్ జట్టు రెండో క్వాలిఫయర్స్కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో హైదరాబాద్ జట్టు 2–0తో హెచ్ఐఎల్ జీసీ జట్టుపై విజయం సాధించింది. తుఫాన్స్ స్ట్రయికర్ శిలానంద్ లాక్రా అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. అతను 16వ, 39వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించాడు. హైదరాబాద్ గోల్కీపర్ జీన్ పాల్ డానెబర్గ్ ప్రత్యర్థి గోల్స్ చేయకుండా అడ్డుగోడ కట్టేశాడు. -
శ్రమించిన సబలెంకా
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో బెలారస్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా తొలిసారి కఠిన పరీక్ష ఎదుర్కొంది. తొలి రెండు రౌండ్లలో అలవోకగా నెగ్గిన ఈ మాజీ చాంపియన్కు మూడో రౌండ్లో మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రపంచ 55వ ర్యాంకర్ అనస్తాసియా పొటపోవా (ఆ్రస్టియా)తో జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్లో టాప్ సీడ్ సబలెంకా 7–6 (7/4), 7–6 (9/7)తో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకా రెండు సెట్లను టైబ్రేక్లో సొంతం చేసుకోవడం గమనార్హం. మూడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసిన గత ఏడాది రన్నరప్... 34 విన్నర్స్ కొట్టి 44 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను కూడా నాలుగుసార్లు బ్రేక్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం 17వ సీడ్ విక్టోరియా ఎంబోకో (కెనడా)తో సబలెంకా తలపడుతుంది. మూడో రౌండ్లో ఎంబోకో 7–6 (7/5), 5–7, 6–3తో 14వ సీడ్ క్లారా టౌసన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. 2023, 2024లలో ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సబలెంకా గత ఏడాది ఫైనల్లో మాడిసన్ కీస్ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. మరోవైపు మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఎనిమిదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా), 12వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. మూడో రౌండ్ మ్యాచ్ల్లో కోకో గాఫ్ 3–6, 6–0, 6–3తో హైలీ బాప్టిస్ట్ (అమెరికా)పై, ఆంద్రీవా 6–3, 6–4తో ఎలీనా రూస్ (రొమేనియా)పై, స్వితోలినా 7–6 (7/4), 6–3తో డయానా ష్నయిడర్ (రష్యా)పై గెలుపొందారు. ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ) మాత్రం మూడో రౌండ్ అడ్డంకిని దాటలేకపోయింది. మూడో రౌండ్లో పావోలిని 2–6, 6–7 (3/7)తో ఇవా జోవిచ్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్లో ఆడిన పావోలిని నాలుగుసార్లు తొలి రౌండ్లో, రెండుసార్లు మూడో రౌండ్లో, ఒకసారి నాలుగో రౌండ్లో నిష్క్రమించింది. అల్కరాజ్ జోరు... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ అల్కరాజ్ మరో అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో అల్కరాజ్ 6–2, 6–4, 6–1తో కొరెన్టిన్ ముటెట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో స్పెయిన్ స్టార్ 30 విన్నర్స్ కొట్టి, తన ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ను రెండుసార్లు చొప్పున సాధించిన 22 ఏళ్ల అల్కరాజ్కు ఆ్రస్టేలియన్ ఓపెన్ మాత్రం కలిసిరావడం లేదు. ఐదోసారి ఈ టోర్నీలో ఆడుతున్న ఈ స్పెయిన్ స్టార్ గత రెండేళ్లలో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో అల్కరాజ్ విజేతగా నిలిస్తే... ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ ఘనత సాధించిన అతిపిన్న వయసు్కడిగా చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా), 10వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్), 11వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్ మ్యాచ్ల్లో జ్వెరెవ్ 7–5, 4–6, 6–3, 6–1తో కామెరాన్ నోరి (బ్రిటన్)పై, డిమినార్ 6–3, 6–4, 7–5తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై, బుబ్లిక్ 7–6 (7/4), 7–6 (7/5), 6–4తో టొమాస్ ఎచ్వెరీ (అర్జెంటీనా)పై, మెద్వెదెవ్ 6–7 (5/7), 4–6, 7–5, 6–0, 6–3తో ఫాబియన్ మరోజ్సన్ (హంగేరి)పై గెలిచారు. 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 3–6, 6–7 (4/7), 3–6తో ఫ్రాన్సిస్కో సెరున్డోలో (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, లక్ష్య సేన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 13–21, 17–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యు ఫె (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 18–21, 20–22తో ప్రపంచ 44వ ర్యాంకర్ పానిత్చపోన్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, లక్ష్య సేన్లకు మూడు వేల డాలర్ల (రూ. 2 లక్షల 75 వేలు) చొప్పున ప్రైజ్మనీ, 5,040 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
గుకేశ్కు తొలి గెలుపు
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తొలి విజయం అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఐదో రౌండ్ గేమ్లో గుకేశ్ 51 ఎత్తుల్లో థాయ్ డాయ్ వాన్ నుగుయెన్ (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందాడు. తొలి నాలుగు రౌండ్ గేమ్లను గుకేశ్ ‘డ్రా’గా ముగించడం గమనార్హం. 14 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఐదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్మాస్టర్లు గుకేశ్ 3 పాయింట్లతో ఐదో స్థానంలో... ఇరిగేశి అర్జున్ 2.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో... అరవింద్ చిదంబరం 1.5 పాయింట్లతో 11వ స్థానంలో, ప్రజ్ఞానంద 1.5 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నారు. గురువారం విశ్రాంతి దినం తర్వాత నేడు ఆరో రౌండ్ గేమ్లు జరుగుతాయి. -
శ్రీకాంత్ అవుట్
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్వన్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–10, 21–11తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్)పై గెలుపొందగా... శ్రీకాంత్ 11–21, 10–21తో నాలుగో సీడ్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ 21–16, 14–21, 11–21తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ (భారత్) ద్వయం 17–21, 21–9, 16–21తో మాన్ వె చోంగ్–కాయ్ వున్ టీ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో పానిత్చపోన్ (థాయ్లాండ్)తో లక్ష్య సేన్; చెన్ యు ఫె (చైనా)తో పీవీ సింధు తలపడతారు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్ 1–0తో పానిత్చపోన్పై ఆధిక్యంలో ఉండగా... సింధు 6–7తో చెన్ యు ఫె చేతిలో వెనుకబడి ఉంది. -
‘వావ్’రింకా...
మెల్బోర్న్: నాలుగు పదుల వయసు దాటినా తనలో సత్తా తగ్గలేదని స్విట్జర్లాండ్ వెటరన్ టెన్నిస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా నిరూపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన మాజీ చాంపియన్ మరో అద్భుత విజయంతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో వావ్రింకా 4–6, 6–3, 3–6, 7–5, 7–6 (10/3)తో క్వాలిఫయర్ ఆర్థర్ గియా (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. తద్వారా కెన్ రోజ్వాల్ (ఆ్రస్టేలియా–1978లో 44 ఏళ్లు) తర్వాత ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో మూడో రౌండ్కు చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా వావ్రింకా (40 ఏళ్ల 296 రోజులు) గుర్తింపు పొందాడు. అంతేకాకుండా 1987లో నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో 128 మందితో ‘డ్రా’ రూపొందించడం మొదలయ్యాక ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో రెండు మ్యాచ్ల్లో గెలిచిన అతిపెద్ద వయసు్కడిగానూ వావ్రింకా ఘనత వహించాడు. దాంతోపాటు గ్రాండ్స్లామ్ టోర్నీల చరిత్రలో అత్యధిక ఐదు సెట్ల మ్యాచ్లు ఆడిన ప్లేయర్గానూ వావ్రింకా రికార్డు నెలకొల్పాడు. ‘గ్రాండ్’ టోర్నీల్లో వావ్రింకా ఐదు సెట్ల మ్యాచ్లు ఆడటం ఇది 49వసారి కాగా... స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (48 సార్లు) పేరిట ఉన్న రికార్డును వావ్రింకా బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో నొవాక్ జొకోవిచ్ (47 సార్లు), లీటన్ హెవిట్ (45 సార్లు), ఫెర్నాండో వెర్డాస్కో (45 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా వావ్రింకా కెరీర్లో ఐదు సెట్ల మ్యాచ్లు ఆడటం ఇది 58వసారి. ఇది కూడా రికార్డే. ఇందులో అతను 31 సార్లు గెలిచి, 27 సార్లు ఓడిపోయాడు. ఈ ఏడాది తర్వాత టెన్నిస్కు వీడ్కోలు పలుకుతున్న వావ్రింకాకు ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా తన శక్తినంతా ధారపోసి ఆడుతున్న వావ్రింకాకు మూడో రౌండ్లో కఠినపరీక్ష ఎదురుకానుంది. మూడో రౌండ్లో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో వావ్రింకా తలపడతాడు. ఆర్థర్ గియాతో జరిగిన మ్యాచ్లో వావ్రింకా 11 ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. 63 విన్నర్స్ కొట్టడంతోపాటు 69 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. నిర్ణాయక ఐదో సెట్ ‘సూపర్ టైబ్రేక్’లో వావ్రింకా పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. జొకోవిచ్ 399వ విజయం పురుషుల సింగిల్స్లోనే డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్లో సినెర్ 6–1, 6–4, 6–2తో జేమ్స్ డక్వర్త్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. 10సార్లు చాంపియన్, మాజీ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–2, 6–2తో ఫ్రాన్సిస్కో మెస్ట్రెలి (ఇటలీ)పై నెగ్గాడు. గ్రాండ్స్లామ్ టోర్నీల్లో జొకోవిచ్కిది 399వ విజయం. మరో మ్యాచ్లో గెలిస్తే గ్రాండ్స్లామ్ టోర్నీల్లో పురుషుల సింగిల్స్లో 400 విజయాలు నమోదు చేసుకున్న తొలి ప్లేయర్గా జొకోవిచ్ రికార్డు సృష్టిస్తాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో ఐదో సీడ్ ముసెట్టి (ఇటలీ) 6–3, 6–3, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) 6–3, 6–2, 6–2తో స్వీనీ (ఆ్రస్టేలియా)పై, టేలర్ ఫ్రిట్జ్ 6–1, 6–4, 7–6 (7/4)తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)పై, 12వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 7–5, 6–4తో మునార్ (స్పెయిన్)పై గెలిచారు. నిశేష్ నిష్క్రమణ వరుసగా రెండో ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్లో ఆడిన తెలుగు సంతతికి చెందిన అమెరికన్ ప్లేయర్ నిశేష్ బసవారెడ్డి పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో నిశేష్ 1–6, 4–6, 3–6తో 15వ సీడ్ ఖచనోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో రెండో రౌండ్కు చేరిన నిశేష్ 1 గంట 57 నిమిషాల్లో ఖచనోవ్ చేతిలో ఓటమి చవిచూశాడు. 10 ఏస్లు సంధించిన నిశేష్, మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. 31 విన్నర్స్ కొట్టి, 37 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు గెలిచిన నిశేష్ తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయాడు. రెండో రౌండ్లో ఓడిన నిశేష్ కు 2,25,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 1 కోటీ 40 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. ‘మిక్స్డ్’లో యూకీ జోడీ ఓటమి భారత డబుల్స్ నంబర్వన్ యూకీ బాంబ్రీకి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో యూకీ (భారత్)–నికోల్ మెలిచార్ మారి్టనెజ్ (అమెరికా) ద్వయం 6–3, 1–6, 6–10తో ఆరో సీడ్ టిమ్ పుట్జ్ (జర్మనీ)–జాంగ్ షుయె (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.పదో సీడ్ బెన్చిచ్ అవుట్ మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్) రెండో రౌండ్లో నిష్క్రమించగా... డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా), రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), మాజీ విజేత నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. బెన్చిచ్ 3–6, 6–0, 4–6తో క్వాలిఫయర్ నికోలా బర్తున్కోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయింది. కీస్ 6–1, 7–5తో ఆష్లిన్ క్రుగెర్ (అమెరికా)పై, స్వియాటెక్ 6–2, 6–3తో బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై, ఒసాకా 6–3, 4–6, 6–2తో సొరానా కిర్స్టియా (రొమేనియా)పై నెగ్గారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో నాలుగో సీడ్ అనిసిమోవా (అమెరికా) 6–1, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 7–5, 6–2తో వర్వరా గ్రాచెవా (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 6–0, 6–2తో మెకార్ట్నీ కెస్లెర్ (అమెరికా)పై గెలిచారు. -
చరిత్ర సృష్టించిన పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు ఇండోనేషియా మాస్టర్స్-2026 టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ షట్లర్ ఫో లినే హోజ్మార్క్ జేర్ఫీల్డ్ను 21-19, 21-18 తేడాతో ఓడించింది. నలభై మూడు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధు పైచేయి సాధించి.. క్వార్టర్ ఫైనల్కు దూసుకువెళ్లింది.500వ విజయంఈ క్రమంలోనే పీవీ సింధు అరుదైన మైలురాయికి చేరుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా తన కెరీర్లో 500వ విజయాన్ని ఆమె నమోదు చేసింది. తద్వారా మహిళల సింగిల్స్లో ఈ ఘనత సాధించిన భారత తొలి షట్లర్గా చరిత్ర సృష్టించిన సింధు.. ఓవరాల్గా ఆరో బ్యాడ్మింటన్ ప్లేయర్గా నిలిచింది.ఇక ఇండోనేషియా మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్లో 13వ ర్యాంకర్ అయిన సింధు.. వరల్డ్ నంబర్ 4, చైనాకు చెందిన చెన్ యూ ఫీ రూపంలో గట్టి పోటీ ఎదుర్కోనుంది. వీరిద్దరు ఇప్పటి వరకు పదమూడు సార్లు ముఖాముఖి తలపడగా 7-6తో చెన్ ఆధిక్యంలో ఉంది. చివరగా 2019లో చెన్ను సింధు ఓడించింది.లక్ష్య సేన్ సైతంమరోవైపు.. లక్ష్య సేన్ సైతం ఇండోనేషియా మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్కు చేరాడు. అరగంటకు పైగా సాగిన పోరులో హాంకాంగ్ షట్లర్ జేసన్ గునావన్పై 21-20, 21-11 తేడాతో గెలిచి లక్ష్య సేన్ ముందుడుగు వేశాడు. -
శ్రమించి గెలిచిన శ్రీకాంత్
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన కిడాంబి శ్రీకాంత్, ప్రస్తుత భారత నంబర్వన్ లక్ష్య సేన్ తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించగా... హెచ్ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. ప్రపంచ 24వ ర్యాంకర్ కోకి వతనాబె (జపాన్)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 33వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–15, 21–23, 24–22తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నిర్ణాయక మూడో గేమ్లో 20–21 స్కోరు వద్ద శ్రీకాంత్ ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే సంయమనం కోల్పోకుండా ఆడిన శ్రీకాంత్ స్కోరును 21–21తో సమం చేశాడు. ఆ తర్వాత మళ్లీ స్కోరు 22–22తో సమమైంది. ఈ దశలో శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 24–22తో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిచిన తర్వాత శ్రీకాంత్ మరో అంతర్జాతీయ టైటిల్ను సాధించలేకపోయాడు. మరో మ్యాచ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 68 నిమిషాల్లో 21–13, 16–21, 21–14తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రణయ్ 19–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో, కిరణ్ జార్జి 17–21, 14–21తో మో జకి ఉబైదుల్లా (ఇండోనేసియా) చేతిలో, ఆయుశ్ శెట్టి 8–21, 13–21తో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. సింధు శుభారంభం మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకోగా... తన్వీ శర్మ, మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. తొలి రౌండ్లో సింధు 53 నిమిషాల్లో 22–20, 21–18తో మనామి సిజు (జపాన్)పై, అన్మోల్ 21–16, 21–17తో పాయ్ యి పో (చైనీస్ తైపీ)పై గెలుపొందారు. తన్వీ శర్మ 21–18, 18–21, 16–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో, మాళవిక 21–23, 12–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో, ఆకర్షి 21–8, 20–22, 17–21తో జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యారు. రుత్విక జోడీ ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్)... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే ఓడిపోయాయి. రుత్విక–రోహన్ ద్వయం 9–21, 20–22తో థోమ్ గికెల్–డెల్ఫిన్ డెల్ర్యూ (ఫ్రాన్స్) జంట చేతిలో... తనీషా–ధ్రువ్ జంట 23–21, 20–22, 6–21తో జూలియన్ మాయో–లీ పలెర్మో (ఫ్రాన్స్) ద్వయం చేతిలో ఓటమి చవిచూశాయి. -
అల్కరాజ్ ముందంజ...
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో టాప్ సీడ్ అల్కరాజ్ 7–6 (7/4), 6–3, 6–2తో యానిక్ హాంఫ్మన్ (జర్మనీ)పై గెలిచాడు. 2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో స్పెయిన్ స్టార్ 12 ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తొలి సర్వీస్లో 71 పాయింట్లకు 49... రెండో సర్వీస్లో 40 పాయింట్లకు 24 సాధించాడు. 41 విన్నర్స్ కొట్టిన అతను 30 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇప్పటికే ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన అల్కరాజ్... ఆ్రస్టేలియన్ ఓపెన్ కూడా సాధిస్తే ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేసుకుంటాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా), పదో సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్), 11వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా), 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్లో జ్వెరెవ్ 6–3, 4–6, 6–3, 6–4తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై, డిమినార్ 6–7 (5/7), 6–2, 6–2, 6–1తో హమాద్ మెజెదోవిచ్ (సెర్బియా)పై, బుబ్లిక్ 7–5, 6–4, 7–5తో ఫుచువోచిస్ (హంగేరి)పై, మెద్వెదెవ్ 6–7 (9/11), 6–3, 6–4, 6–2తో క్వెంటిన్ హేలిస్ (ఫ్రాన్స్)పై, రుబ్లెవ్ 6–4, 6–3, 4–6, 7–5తో క్వాలిఫయర్ జేమీ ఫారియా (పోర్చుగల్)పై విజయం సాధించారు.ఇతర మ్యాచ్ల్లో 14వ సీడ్ డేవిడోవిచ్ ఫోకినా (స్పెయిన్) 6–3, 7–6 (7/3), 5–7, 4–6, 6–4తో రీలీ ఒపెల్కా (అమెరికా)పై, 19వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–3, 6–4, 6–2తో టిరాన్టి (అర్జెంటీనా)పై నెగ్గారు. సబలెంకా సాఫీగా... మహిళల సింగిల్స్ విభాగంలో రెండుసార్లు చాంపియన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్లో బెర్త్ను ఖరారు చేసుకుంది. 72 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో సబలెంకా 6–3, 6–1తో జావోజువాన్ బాయ్ (చైనా)పై గెలిచింది. మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ), ఎనిమిదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా), 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో కోకో గాఫ్ 6–2, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై, పావోలిని 6–2, 6–3తో మగ్ధలీనా ఫ్రీచ్ (పోలాండ్)పై, మిరా ఆంద్రీవా 6–0, 6–4తో మరియా సాకరి (గ్రీస్)పై, స్వితోలినా 7–5, 6–1తో లిండా క్లిమోవికోవా (పోలాండ్)పై గెలుపొందారు. -
యూకీ జోడీ శుభారంభం
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత నంబర్వన్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మెల్బోర్న్లో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో పదో సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) ద్వయం 6–3, 6–4తో జేమ్స్ డక్వర్త్–క్రూజ్ హెవిట్ (ఆస్ట్రేలియా) జంటపై నెగ్గింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–స్వీడిష్ జోడీ ఆరు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తమసర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. 26 విన్నర్స్ కొట్టిన యూకీ–గొరాన్సన్ మూడు అనవసర తప్పిదాలు చేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విభాగంలో యూకీ ఆడటం ఇది ఐదోసారి. తొలిసారి మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జతగా 2014లో ఆడిన యూకీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. తొమ్మిదేళ్ల తర్వాత 2023లో సాకేత్ మైనేని (భారత్)తో కలిసి మళ్లీ ఈ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆడిన యూకీ తొలి రౌండ్ దాటలేదు. 2024లో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)తో, 2025లో అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్)తో కలిసి బరిలోకి దిగిన యూకీ తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. డబ్ల్యూపీఎల్లో నేడు యూపీ వారియర్స్ x గుజరాత్ జెయింట్స్ రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
పావురాల రెట్టలు.. పరువు పోయాక చర్యలు
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ నిర్వహణ లోపాలపై కేంద్ర క్రీడాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. మరోమారు ఇలాంటి పొరపాట్లు, నిర్వహణ వైఫల్యాలు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని క్రీడాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఇలాంటి నిర్వాకం చేటుఇండియా ఓపెన్ వేదిక ఇందిరాగాంధీ స్టేడియం అధికారులను పిలిచిన క్రీడాశాఖ... నిర్వహణ తీరు, తలెత్తిన గందరగోళానికి సంబంధించిన సమగ్ర నివేదిక కోరింది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం బిడ్డింగ్ రేసులో నిలవాలనుకుంటున్న భారత్కు ఇలాంటి నిర్వాకం చేటు చేస్తుందని క్రీడాశాఖ భావించింది. కఠిన చర్యలు తీసుకోండిఅందుకే సత్వర చర్యలు తీసుకునేందుకు, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు, ఆతిథ్య వైఫల్యం పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి మాండవీయ ‘సాయ్’ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది.నిజానికి ఇండియా ఓపెన్ భారత బ్యాడ్మింటన్ సంఘం నిర్వహించినప్పటికీ దేశంలోని ప్రముఖ క్రీడా స్టేడియాలు, ఎక్సలెన్సీ సెంటర్లన్నీ ‘సాయ్’ పరిధిలోనివి. వీటి నిర్వహణ కోసం కేంద్రం ప్రతీ ఏటా క్రీడా బడ్జెట్లో నిధులు కూడా ఇస్తోంది.అసలేం జరిగింది? దేశ రాజధానిలో ఇండియా ఓపెన్ జరిగింది. త్వరలోనే ఇక్కడ ప్రపంచ చాంపియన్షిప్ కూడా జరగనుంది. అయితే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వసతులు అధమంగా ఉన్నాయని, ఆడే పరిస్థితులు లేవని, ప్రాక్టీస్ కోర్టులన్నీ దుమ్ముధూళీతోనే నిండిపోయాయని డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫీల్డ్ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఆమె విమర్శలకు మరింత బలం చేకూర్చేలా మ్యాచ్లు జరిగే సమయంలో పలుమార్లు కోర్టులో పావురాలు రెట్ట వేశాయి. దీంతో నిర్వహణ తీరు, ఏర్పాట్లపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.చదవండి: భారత్లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్ ఓవరాక్షన్ -
సినెర్ గెలుపు బోణీ.. కీస్, ఒసాకా ముందంజ
మెల్బోర్న్: ‘హ్యాట్రిక్’ టైటిల్పై గురి పెట్టిన ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేశాడు. 2024, 2025లలో విజేతగా నిలిచిన ఈ ఇటలీ స్టార్ ఈసారీ గెలిస్తే జొకోవిచ్ (సెర్బియా), జాక్ క్రాఫోర్డ్ (ఆస్ట్రేలియా), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా) తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన నాలుగో ప్లేయర్గా ఘనత వహిస్తాడు. హుగో గాస్టన్ (ఫ్రాన్స్)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సినెర్ తొలి రెండు సెట్లను 6–2, 6–1తో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్ మొదలుకావాల్సిన దశలో హుగో గాస్టన్ గాయం కారణంగా మ్యాచ్ను కొనసాగించలేనని చైర్ అంపైర్కు తెలిపాడు. అనవసర తప్పిదాలుదాంతో మూడో సెట్ జరగకుండానే సినెర్కు విజయం ఖరారైంది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సినెర్ కేవలం మూడు గేమ్లు మాత్రమే కోల్పోయాడు. ఆరు ఏస్లు సంధించిన ఈ మాజీ నంబర్వన్ 19 విన్నర్స్ కొట్టి, 15 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్లో జేమ్స్ డక్వర్త్ (ఆస్ట్రేలియా)తో సినెర్ తలపడతాడు. మరోవైపు ఐదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ), ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా), తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. రాఫెల్ కాలిగ్నన్ (బెల్జియం)తో జరిగిన మ్యాచ్లో ముసెట్టి తొలి సెట్ను 4–6తో చేజార్చుకున్నాడు. అనంతరం 7–6 (7/5), 7–5తో వరుసగా రెండో సెట్లు గెలిచి నాలుగో సెట్లో 3–2తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో కాలిగ్నన్ గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. బెన్ షెల్టన్ 6–3, 7–6 (7/2), 7–6 (7/5)తో యుగో హుంబెర్ట్ (ఫ్రాన్స్)పై, ఫ్రిట్జ్ 7–6 (7/5), 5–7, 6–1, 6–3తో వాలెంటిన్ రోయెర్ (ఫ్రాన్స్)లపై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో 15వ సీడ్ ఖచనోవ్ (రష్యా) 4–6, 6–4, 6–3, 5–7, 6–3తో మిచెల్సన్ (అమెరికా)పై, 16వ సీడ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) 7–5, 4–6, 2–6, 7–6 (7/1), 6–3తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, 31వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 4–6, 6–3, 6–2, 6–2తో షింటారో మొచిజుకీ (జపాన్)పై, 22వ సీడ్ లుసియానో దర్దెరి (ఇటలీ) 7–6 (7/5), 7–5, 7–6 (7/3)తో క్రిస్టియన్ గారిన్ (చిలీ)పై విజయం సాధించారు. మోన్ఫిల్స్ ఓటమి ఈ ఏడాది తర్వాత టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్ సీనియర్ స్టార్ గేల్ మోన్ఫిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో తొలి రౌండ్ను దాటలేకపోయాడు. 20వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో దిగిన 39 ఏళ్ల మోన్ఫిల్స్ 7–6 (7/3), 5–7, 4–6, 5–7తో డేన్ స్వీనీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. 3 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో మోన్ఫిల్స్ 14 ఏస్లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్లు చేశాడు. 56 విన్నర్స్ కొట్టిన ఈ ఫ్రాన్స్ స్టార్ ఏకంగా 77 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కీస్, ఒసాకా ముందంజమహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా), మాజీ విజేత నయోమి ఒసాకా (జపాన్) తొలి రౌండ్ అధిగమించేందుకు శ్రమించారు. తొలి రౌండ్లో కీస్ 1 గంట 40 నిమిషాల్లో 7–6 (8/6), 6–1తో ఒలినికోవా (ఉక్రెయిన్)పై, ఒసాకా 2 గంటల 22 నిమిషాల్లో 6–3, 3–6, 6–4తో అంటోనియా రుజిక్ (క్రొయేషియా)పై విజయం సాధించారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఐదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–4, 6–3తో కాయా యువాన్ (స్లొవేనియా)పై, పదో సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 6–0, 7–5తో కేటీ బూల్టర్ (బ్రిటన్)పై గెలుపొందారు. -
‘పోల్ వాల్ట్’ అథ్లెట్లకు అవమానం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు... పోల్వాల్ట్లో జాతీయ రికార్డు నెలకొలి్పన అథ్లెట్కు రైల్వే స్టేషన్లో అవమానం జరిగింది. టోర్నమెంట్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో క్రీడా సామగ్రితో కలిసి రైలులో ప్రయణించినందుకు గానూ జరిమానా కట్టాల్సి వచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పన్వేల్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకోగా... సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ స్పందించింది. అసలేం జరిగిందంటే... మంగళూరు వేదికగా జరిగిన ఆలిండియా యూనివర్సిటీ చాంపియన్షిప్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రికార్డు హోల్డర్ దేవ్ కుమార్ మీనాతో పాటు అతడి కోచ్ ఘన్శ్యామ్కు రైల్వే స్టేషన్లో వింత సమస్య ఎదురైంది. మంగళూరు నుంచి వస్తున్న సమయంలో ప్లేయర్లంతా తమ ‘పోల్’లను ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రైలులోని ఫ్యాన్ల పైభాగంలో ఉంచారు. అయితే ఇది గమనించిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)... ‘పోల్’లను ఇలా తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని వారిని రైలు నుంచి దింపాడు. రూ. 8 వేల జరిమానా కట్టాల్సిందేనని... లేకుంటే పోల్స్ తిరిగి ఇవ్వడం జరగదని హెచ్చరించాడు. అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొన్నట్లు వెల్లడించినా... రైల్వే అధికారులు వినలేదు. సుమారు ఐదు గంటల పాటు అథ్లెట్లను మానసిక వేదనకు గురిచేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘మేము మంగళూరు నుంచి వస్తున్నాం. పన్వేల్ నుంచి భోపాల్ వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో రైల్వే సిబ్బంది మా క్రీడా సామగ్రిని తొలగించాలని చెప్పారు. అవి పోల్ వాల్ట్స్ అని... మేము టోర్నమెంట్లో పాల్గొని వస్తున్నామని వారికి చెప్పాం. అయితే క్రీడా సామాగ్రిని లగేజీ కంపార్ట్మెంట్లో వేయాలని... ఇలా ప్రయాణికులతో పాటు వాటిని ఉంచకూడదని చెప్పారు. పోల్వాల్ట్ కోసం వినియోగించే పోల్స్ ఫైబర్తో తయారవుతాయి. వాటి ధర కూడా ఎక్కువే. లగేజీలో వేస్తే విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే గతంలోనూ వాటిని మాతో పాటే తీసుకొని ప్రయాణించాం. ఎంత చెప్పినా అధికారులు అర్థం చేసుకోలేదు. పెద్ద ఎత్తున జరిమానా కట్టాలని ఒత్తిడి చేశారు. చివరకు దాదాపు 2 వేల రూపాయల జరిమానా అనంతరం మమ్మల్ని వదిలేశారు. ఇది మమ్మల్ని ఎంతగానో బాధించింది’ అని కోచ్ ఘన్శ్యామ్ వెల్లడించారు. దేవ్ కుమార్ మీనా గతేడాది జర్మనీ వేదికగా జరిగిన ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్లో 5.40 మీటర్ల ఎత్తు దూకి తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలుకొట్టాడు. కాగా రైల్వే శాఖ దీనిపై స్పందిస్తూ... ‘ప్లేయర్ల మనోభావాలు దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. మేము అథ్లెట్లను గౌరవిస్తాం. ఒక్కో పోల్ 5 మీటర్ల కంటే పొడవు ఉంది. దాని వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పాం’ అని వివరణ ఇచి్చంది. ఇది ఈ ఒక్కసారి ఎదురైన సమస్య కాదని... ప్రయాణ సమయంలో ప్రతీసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అథ్లెట్లు వాపోతున్నారు. క్రీడా పరికరాలను తీసుకెళ్లే విషయంలో కచి్చతమైన నియమాలను రూపొందించాలని కోరుతున్నారు. -
అంతా అమ్మే చేసింది.. నా కాపురం కూల్చేసే కుట్ర
ఇంగ్లండ్ ఫుట్బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హామ్ దంపతులపై వారి కుమారుడు బ్రూక్లిన్ బెక్హామ్ సంచలన ఆరోపణలు చేశాడు. ముఖ్యంగా తల్లి విక్టోరియా బెక్హామ్ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులను షాక్కు గురి చేస్తున్నాయి. బ్రూక్లిన్ పెళ్లి సమయంలో అతడికి తల్లిదండ్రులతో తలెత్తిన విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి.కుటుంబంతో కలిసే ప్రసక్తే లేదుఈ క్రమంలోనే భార్య, అమెరికన్ నటి నికోలా పెల్జ్ట్తో కలిసి అమెరికాకు వెళ్లిపోయిన బ్రూక్లిన్ అక్కడే నివసిస్తున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెంచుకునేందుకు సిద్ధమైనట్లు తాజాగా అతడు పునరుద్ఘాటించాడు. ఇందుకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్టులు పెడుతూ సంచలన ఆరోపణలకు దిగాడు.‘‘చాలా ఏళ్లుగా నేను నిశ్శబ్దంగానే ఉన్నాను. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. దురదృష్టవశాత్తూ నా తల్లిదండ్రులు, వారి టీమ్ పదే పదే నన్ను విసిగిస్తూ పబ్లిక్గా మాట్లాడేలా చేశారు. నా గురించి వస్తున్న అబద్ధాలకు సమాధానంగా.. ఇప్పటికైనా నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను.ఇకపై నా కుటుంబంతో తిరిగి కలిసేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేను. ఇతరుల నియంత్రణ, ఆధీనంలో బతకడం నాకు ఇష్టం లేదు. జీవితంలో తొలిసారి నాకోసం నేను నిలబడ్డాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని నా తల్లిదండ్రులే కంట్రోల్ చేశారు. మీడియాలో నా గురించి ఏదేదో రాసేలా చేశారు.మరీ హద్దులు దాటి..ఇటీవలి కాలంలో వాళ్లు సోషల్ మీడియాలో మరీ హద్దులు దాటి.. నాపై ప్రేమ ఉన్నట్లుగా.. తమను తాము అమాయకులుగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేశారు. సమాజంలో వారి ప్రతిష్ట కోసమే ఇదంతా చేశారు. అయినా నిజం ఎన్నటికీ దాగదు.పెళ్లికి ముందు నుంచే నికోలాతో నా బంధాన్ని తెంచాలని నా తల్లిదండ్రులు గట్టిగా ప్రయత్నించారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. పెళ్లికి కొన్ని గంటల ముందు మా అమ్మ కావాలనే నికోలా వెడ్డింగ్ గౌను రెడీ కాకుండా చేసింది. అత్తగారు డిజైన్ చేసిన డ్రెస్ వేసుకోవాలని నికోలా ఎంతగానో ఆశపడింది. ‘లంచం’ ఇచ్చికానీ మా అమ్మ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. అప్పటికప్పుడు తను ఏదో ఒక డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. పెళ్లికి కొన్ని వారాల ముందు నాకు ‘లంచం’ ఇచ్చి నా హక్కులను రాయించుకోవాలని నా తల్లిదండ్రులు ప్లాన్ చేశారు. తద్వారా నా భార్య, భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలను కంట్రోల్ చేయవచ్చనేది వారి ఆలోచన.కానీ నేను వినలేదు. అప్పటి నుంచి నా పట్ల వారి వైఖరి మారిపోయింది. నా పెళ్లికి ప్రణాళికలు రచిస్తున్న సమయంలో మా అమ్మ నన్ను .. ‘ఈవిల్’ అన్నది. నికోలా, నేను మా నానమ్మలను మాతో పాటు కూర్చోబెట్టుకుంటామని చెప్పడమే ఇందుకు కారణం.వివాహానికి కొన్ని గంటల ముందు నా కుటుంబం నా దగ్గరికి వచ్చి.. ‘నికోలా మన రక్తం కాదు. మన కుటుంబం కాదు. ఆమె కోసం ఎందుకిదంతా?’ అని ప్రశ్నించారు. అప్పటి నుంచి నా మీద, నా భార్య మీద ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉన్నారు. నా తమ్ముళ్లు కూడా నాపై సోషల్ మీడియాలో దాడికి దిగారు.మా అమ్మ అంతా చెడగొట్టిందిఇక పెళ్లి సమయంలో మా అమ్మ నా భార్యను, నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొదటిసారి నా భార్యతో రొమాంటిక్ సాంగ్కు డాన్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. కానీ మా అమ్మ అంతా చెడగొట్టింది. దాదాపుగా 500 మంది అతిథుల ముందు మా అమ్మ నాతో అభ్యంతరకర రీతిలో, అసలు సంబంధమే లేనివిధంగా డాన్స్ చేసింది.నాకు అదెంతో ఇబ్బందిగా అనిపించింది. అప్పటి వరకు జీవితంలో నేను అంత చెడు అనుభవాన్ని, అవమానాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. అందుకే మేము న్యూయార్క్లో మరోసారి పెళ్లి చేసుకున్నాము. ఈసారి నా తల్లిదండ్రుల బాధ లేదు. ప్రశాంతంగా సంతోషంగా వేడుక జరుపుకొన్నాము. నా పాత గర్ల్ఫ్రెండ్ను పిలిచినా భార్యను వాళ్లు ఎప్పటికప్పుడు అవమానిస్తూనే ఉన్నారు. నా పాత గర్ల్ఫ్రెండ్ను మా అమ్మ పదే పదే ఇంటికి ఆహ్వానిస్తూ మా ఇద్దరికి ఇబ్బంది కలిగేలా చేసింది. అయినా సరే మా నాన్న యాభైవ పుట్టినరోజు కోసం మేము లండన్కి వెళ్లాము. కానీ వారం రోజుల పాటు మమ్మల్ని అక్కడికి రానివ్వలేదు. దీంతో మేము హోటల్లోనే ఉండిపోయాము.మా నాన్నతో కాస్త ఎక్కువ సమయం గడపాలని భావించాను. కానీ ఆయన ఇందుకు తిరస్కరించారు. ఆఖరికి నికోలా లేకుండా వస్తేనే నన్ను అక్కడికి అనుమతినిస్తానని చెప్పాడు. ఆ మాట నా చెంప మీద కొట్టినట్లు అనిపించింది. ఆ తర్వాత వాళ్లు లాస్ ఏంజెలిస్కు వచ్చినపుడు కూడా నన్ను కలవడానికి ఇష్టపడలేదు.బెక్హామ్ బ్రాండ్తో వచ్చే పేరు నాకు, నా భార్యకు అవసరం లేదు. నాకు, నా భార్యకు ప్రశాంతత, గోప్యత, సంతోషం మాత్రమే కావాలి. మా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచాలి’’ అని బ్రూక్లిన్ బెక్హామ్ చెప్పుకొచ్చాడు.సంబంధిత వార్త: David Beckham: భార్యే సర్వస్వం.. తండ్రిని కాదని.. మామగారికి విషెస్.. -
చరిత్ర సృష్టించిన జొకోవిచ్
మెల్బోర్న్: కెరీర్లో 25వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో పెడ్రో మారి్టనెజ్ (స్పెయిన్)పై గెలిచి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. ఓవరాల్గా ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్కిది 100 విజయం కావడం విశేషం. ఫెడరర్ (స్విట్జర్లాండ్–102) తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ ‘సెంచరీ’ విజయాలు సాధించిన రెండో ప్లేయర్గా ఈ సెర్బియా స్టార్ గుర్తింపు పొందాడు. అంతేకాకుండా మూడు వేర్వేరు గ్రాండ్స్లామ్ టోర్నీలలో 100 అంతకంటే ఎక్కువ మ్యాచ్ల్లో గెలిచిన ఏకైక ప్లేయర్గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్లో 101 మ్యాచ్ల్లో... వింబుల్డన్లో 102 మ్యాచ్ల్లో విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో అత్యధికసార్లు ఆడిన ప్లేయర్గా ఫెడరర్ (21 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేసిన జొకోవిచ్... అత్యధిక గ్రాండ్స్లామ్ టోర్నీల్లో (81 సార్లు) ఆడిన ప్లేయర్లుగా ఫెడరర్, ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్) పేరిట ఉన్న రికార్డునూ అందుకున్నాడు. పెడ్రో మార్టినెజ్తో 2 గంటల్లో ముగిసిన మ్యాచ్లో జొకోవిచ్ 14 ఏస్లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. 49 విన్నర్స్ కొట్టిన అతను 21 అనవసర తప్పిదాలు చేశాడు. తన సరీ్వస్ను ఒక్కసారి కూడా కోల్పోని ఈ సెర్బియా యోధుడు ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. వావ్రింకా బోణీ... ఈ ఏడాది తర్వాత టెన్నిస్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన 2014 చాంపియన్, స్విట్జర్లాండ్ స్టార్ వావ్రింకా రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో వావ్రింకా 5–7, 6–3, 6–4, 7–6 (7/4)తో లాస్లో జెరె (సెర్బియా)పై గెలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ ఓపెన్లో విజయం సాధించిన రెండో అతిపెద్ద వయసు్కడిగా వావ్రింకా (40 ఏళ్ల 296 రోజులు) గుర్తింపు పొందాడు. ఈ రికార్డు ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా–40 ఏళ్ల 326 రోజులు) పేరిట ఉంది. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్లో మూడుసార్లు రన్నరప్గా నిలిచిన మెద్వెదెవ్ (రష్యా) కూడా గెలుపు బోణీ కొట్టాడు. తొలి రౌండ్లో 11వ సీడ్ మెద్వెదెవ్ 7–5, 6–2, 7–6 (7/2)తో జెస్పెర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా) 6–2, 6–2, 6–3తో మెక్డొనాల్డ్ (అమెరికా)పై, 12వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–1, 6–2, 6–4తో మటియా బెలూచి (ఇటలీ)పై, 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–2, 6–3తో మటియో అర్నాల్డి (ఇటలీ)పై, 14వ సీడ్ డేవిడోవిచ్ ఫొకీనా (స్పెయిన్) 6–2, 6–3, 6–3తో ఫిలిప్ మిసోలిచ్ (ఆస్ట్రియా)పై గెలిచారు. -
ప్రైజ్మనీ రూ. 90 కోట్ల 86 లక్షలు
రబాట్ (మొరాకో): నాటకీయ పరిణామాల మధ్య ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సెనెగల్ జట్టు పైచేయి సాధించింది. రెండోసారి ఆఫ్రికా కప్ ఫుట్బాల్ టైటిల్ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో సెనెగల్ 1–0 గోల్ తేడాతో ఆతిథ్య మొరాకో జట్టును ఓడించింది. 2021లో తొలిసారి సెనెగల్ ఆఫ్రికా కప్ టైటిల్ను సాధించింది. ఈ ఓటమితో 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఆఫ్రికా చాంపియన్గా నిలవాలని ఆశించిన మొరాకో జట్టుకు నిరాశే ఎదురైంది. డియాజ్ను తోసేసిన డియాఫ్మ్యాచ్ రెండో అర్ధభాగం స్టాపేజ్ సమయంలో మొరాకో జట్టుకు రిఫరీ పెనాల్టీ ఇవ్వడంపై దుమారం చెలరేగింది. ‘డి’ ఏరియా లోపల మొరాకో ప్లేయర్ బ్రహిమ్ డియాజ్ను సెనెగల్ ప్లేయర్ ఎల్ హాద్జి మలిక్ డియాఫ్ తోసేశాడు. దాంతో రిఫరీ జీన్ జాక్వెస్ మొరాకో జట్టుకు పెనాల్టీ కిక్ను ప్రదానం చేశాడు. నిరసనఈ నిర్ణయంతో సెనెగల్ ఆటగాళ్లతోపాటు మైదానంలోని ఆ జట్టు అభిమానులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య కొంచెంసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. రిఫరీ నిర్ణయాన్ని నిరసిస్తూ సెనెగల్ ఆటగాళ్లు మైదానాన్ని కూడా వీడారు. టీవీ రిప్లేలు చూశాక మొరాకో జట్టుకు రిఫరీ పెనాల్టీ ఇవ్వడం సరైనదేనని తేలింది. దాంతో 14 నిమిషాల తర్వాత మళ్లీ సెనెగల్ ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. పెనాల్టిని గోల్గా మలిచి, కొన్ని నిమిషాలు సెనెగల్ను నిలువరిస్తే మొరాకో ఖాతాలో 50 ఏళ్ల తర్వాత ఆఫ్రికా కప్ చేరేది. కానీ అలా జరగలేదు. సువర్ణావకాశం చేజారిందిఈ టోర్నీలో 5 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలిచిన మొరాకో స్టార్ బ్రహిమ్ డియాజ్ పెనాల్టిని తీసుకోవడానికి వచ్చాడు. తీవ్రమైన ఒత్తిడిలో డియాజ్ బంతిని నేరుగా కొట్టడం... సెనెగల్ గోల్కీపర్ ఎడువార్డో మెండీ దానిని నిలువరించడం జరిగిపోయింది. దాంతో మొరాకో సువర్ణావకాశం చేజారింది. స్టాపేజ్ సమయం ముగియడంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. అదనపు సమయంలోని నాలుగో నిమిషంలో కెపె్టన్ ఇద్రిసా గుయె అందించిన పాస్ను ‘డి’ ఏరియా లోపల అందుకున్న పాపె గుయె లక్ష్యానికి చేర్చడంతో సెనెగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు మొరాకో ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలను సెనెగల్ సమర్థంగా అడ్డుకొని టైటిల్ను ఖాయం చేసుకుంది. రూ. 90 కోట్ల 86 లక్షలు ఆఫ్రికా కప్ టైటిల్ సాధించిన సెనెగల్ జట్టుకు 1 కోటి డాలర్ల (రూ. 90 కోట్ల 86 లక్షలు) ప్రైజ్మనీ లభించింది. రన్నరప్గా నిలిచిన మొరాకో జట్టు ఖాతాలో 40 లక్షల డాలర్లు (రూ. 36 కోట్ల 34 లక్షలు) చేరాయి. మూడో స్థానం పొందిన నైజీరియా జట్టుకు 25 లక్షల డాలర్లు (రూ. 22 కోట్ల 71 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన ఈజిప్ట్ జట్టుకు 13 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 81 లక్షలు) లభించాయి. క్వార్టర్ ఫైనల్లో ఓడిన మాలి, ఐవరీకోస్ట్, అల్జీరియా, కామెరూన్ జట్లకు 8 లక్షల డాలర్ల (రూ. 7 కోట్ల 26 లక్షలు) చొప్పున అందజేశారు. 121 మొత్తం 24 జట్ల మధ్య గత డిసెంబర్ 21 నుంచి జనవరి 18 వరకు జరిగిన ఆఫ్రికా కప్ టోర్నీలో మొత్తం 52 మ్యాచ్లు జరిగాయి. 121 గోల్స్ నమోదయ్యాయి. మొరాకో ప్లేయర్ బ్రహిమ్ డియాజ్ 5 గోల్స్తో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. టోర్నీ ‘ఉత్తమ ప్లేయర్’ అవార్డును సెనెగల్కు చెందిన సాదియోమానె గెల్చుకోగా... ‘ఉత్తమ గోల్కీపర్’గా మొరాకోకు చెందిన యాసిన్ బునుయ్ నిలిచాడు. 2027లో ఎక్కడంటే.... తదుపరి ఆఫ్రికా కప్ టోర్నీకి తొలిసారి మూడు దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027లో జరిగే ఈ టోర్నీ కెన్యా, టాంజానియా, ఉగాండా దేశాల్లో జరుగుతుంది. 69 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో రెండుసార్లు మాత్రమే రెండు దేశాలు సంయుక్తంగా (2000లో ఘనా–నైజీరియా; 2012లో ఈక్వెటోరియల్ గినీ–గాబోన్) ఆతిథ్యమిచ్చాయి. చదవండి: ఆమె మనిషి కాదు! -
వీనస్ విలియమ్స్కు షాక్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పెను సంచలనాలు లేకుండానే ప్రారంభమైంది. ఫేవరెట్స్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచి శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్), ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ), 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు.ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడుతున్న సబలెంకా తొలి రౌండ్లో 6–4, 6–1తో టియాంట్సోవా రకోటొమాంగా (ఫ్రాన్స్)పై గెలుపొందింది. ఈ మ్యాచ్ను టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా) ప్రత్యక్షంగా తిలకించారు. 76 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సబలెంకా ఆరంభంలో తడబడింది.వెంటనే తేరుకునితొలి మూడు పాయింట్లు కోల్పోవడంతోపాటు తన తొలి సర్వీస్ గేమ్ను చేజార్చుకుంది. అయితే వెంటనే తేరుకున్న రెండుసార్లు (2023, 2024) చాంపియన్, గత ఏడాది రన్నరప్ పదో గేమ్లో టియాంట్సోవా సర్వీస్ను బ్రేక్ చేసి తొలి సెట్ను సొంతం చేసుకుంది.రెండో సెట్లో మాత్రం సబలెంకా జోరు పెంచగా... ‘వైల్డ్ కార్డు’తో ఈ టోర్నీలో బరిలోకి దిగిన టియాంట్సోవా తేలిపోయింది. 23 విన్నర్స్ కొట్టిన సబలెంకా 20 అనవసర తప్పిదాలు కూడా చేసింది. మ్యాచ్ మొత్తంలో ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో పావోలిని 6–1, 6–2తో క్వాలిఫయర్ సస్నోవిచ్ (రష్యా)పై, స్వితోలినా 6–4, 6–1తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్)పై, 28వ సీడ్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) 6–4, 6–1తో మనన్చాయ సావంగ్కె (థాయ్లాండ్)పై నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. వీనస్ తొలి రౌండ్లోనే అవుట్ మరోవైపు అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్తోపాటు 11వ సీడ్ అలెగ్జాండ్రోవా (రష్యా), 20వ సీడ్ మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్), 26వ సీడ్ డయానా యాస్ట్రెమ్స్కా (ఉక్రెయిన్) తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ఆడిన అతి పెద్ద వయస్కురాలిగా రికార్డు నెలకొల్పిన 45 ఏళ్ల వీనస్ తీవ్రంగా పోరాడినా తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించలేకపోయింది.రెండు గంటల 17 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో వీనస్ 7–6 (7/5), 3–6, 4–6తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా) చేతిలో ఓడింది. ఇతర మ్యాచ్ల్లో క్వాలిఫయర్ జెనెప్ సోన్మెజ్ (టర్కీ) 2 గంటల 37 నిమిషాల్లో 7–5, 4–6, 6–4తో అలెగ్జాండ్రోవాపై, 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ఎల్సా జాక్వెమోట్ (ఫ్రాన్స్) 6–7 (4/7), 7–6 (7/4), 7–6 (10/7)తో మార్టా కొస్టుక్పై, ఎలీనా గాబ్రియేలా రుస్ (రొమేనియా) 6–4, 7–5తో యాస్ట్రెమ్స్కాపై సంచలన విజయాలు నమోదు చేశారు. అల్కరాజ్ శుభారంభం పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), పదో సీడ్ బుబ్లిక్ (కజకిస్తాన్) తొలి రౌండ్లో నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను తొలిసారి గెలిచి ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేసుకోవాలని భావిస్తున్న అల్కరాజ్ 6–3, 7–6 (7/2), 6–2తో ఆడమ్ వాల్టన్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. చదవండి: ఆమె మనిషి కాదు! -
ఆమె మనిషి కాదు!
వేదిక ఏదైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... ప్రత్యర్థులు ఎవరైనా... తగ్గేదేలా అంటోంది దక్షిణ కొరియా సూపర్స్టార్ షట్లర్ ఆన్ సె యంగ్. బ్యాడ్మింటన్ సీజన్లోని రెండో టోర్నమెంట్ ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆన్ సె యంగ్ టైటిల్ నిలబెట్టుకుంది.మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో విజేతగా నిలిచి ఈ ఏడాది ఘనంగా ప్రారంభించిన ఈ ప్రపంచ నంబర్వన్ అదే జోరును న్యూఢిల్లీలోనూ కొనసాగించింది. తుది పోరులో ఆన్ సె యంగ్కు గట్టిపోటీ ఇస్తుందనుకున్న ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి కొరియా స్టార్ ధాటికి తేలిపోయింది.కెరీర్లో 22వసారి వాంగ్ జి యితో ఆడిన ఆన్ సె యంగ్ 18వసారి చైనా ప్లేయర్ను ఓడించి తన కెరీర్లో 36వ సింగిల్స్ టైటిల్ను జమ చేసుకుంది. గత ఏడాది చివరి నాలుగు టోర్నీలో విజేతగా నిలిచిన ఆన్ సె యంగ్ ఈ ఏడాది ఆడిన రెండు టోర్నీలలోనూ టైటిల్ సొంతం చేసుకొని ‘సిక్సర్’ నమోదు చేసింది. న్యూఢిల్లీ: ‘ఆమె మనిషి కాదు... రోబో’ అని ఆన్ సె యంగ్ గురించి ఆమె ప్రత్యర్థులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు నిజమే అనుకోవాలి. కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో అత్యంత నిలకడగా విజయాలు నమోదు చేస్తున్న ఆన్ సె యంగ్ కొత్త ఏడాదిలోనూ చెలరేగిపోతోంది. ఆదివారం ముగిసిన ఇండియా ఓపెన్ టోర్నీలో ఈ టాప్ సీడ్ ప్లేయర్ చాంపియన్గా నిలిచింది. గత ఏడాది టైటిల్ సాధించిన ఈ కొరియా సూపర్స్టార్ ... ఈ సంవత్సరం కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.43 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆన్ సె యంగ్ 21–13, 21–11తో వాంగ్ జి యిపై గెలిచింది. ఆన్ సె యంగ్కు 66,500 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్మనీతోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 12వ ర్యాంకర్ లిన్ చున్ యి (చైనీస్ తైపీ) టైటిల్ గెలిచాడు. ఫైనల్లో లిన్ చున్ యి 21–10, 21–18తో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు.ప్రైజ్మనీ ఎంతంటే?లిన్ చున్ యికి 66,500 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్మనీతోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. మహిళల డబుల్స్లో లియు షెంగ్షు –టాన్ నింగ్ (చైనా) జోడీ టైటిల్ దక్కించుకుంది. ఫైనల్లో లియు–టాన్ నింగ్ 21–11, 21–18తో యుకీ ఫుకుషిమా–సయాకా మత్సుమోతో (జపాన్)లపై గెలిచారు.పురుషుల డబుల్స్ ఫైనల్లో లియాంగ్ వెకెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం 17–21, 25–23, 21–16తో హిరోకి మిదోరికావా–క్యోహె యామషిటా (జపాన్) జోడీపై నెగ్గి టైటిల్ అందుకుంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో డెచాపోల్–సుపిసారా (థాయ్లాండ్) జంట 19–21, 25–23, 21–18తో మథియాస్ క్రిస్టియాన్సెన్–అలెగ్జాండ్రా బోయె (డెన్మార్క్) జోడీపై విజయం సాధించి టైటిల్ హస్తగతం చేసుకుంది. -
‘గ్రాండ్’ సమరానికి సిద్ధం
సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ‘ఆస్ట్రేలియన్ ఓపెన్’కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ టెన్నిస్ టోర్నీ కోసం సూపర్ స్టార్లు అల్కరాజ్, సినెర్లతో పాటు 25వ గ్రాండ్స్లామ్పై కన్నేసిన టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్ బరిలోకి దిగుతున్నాడు. మహిళల సింగిల్స్లో రెండుసార్లు తుది మెట్టుపై టైటిల్ చేజార్చుకున్న స్వియాటెక్ ఫేవరెట్గా సమరానికి సై అంటోంది.మెల్బోర్న్: స్పానిష్ సంచలనం కార్లొస్ అల్కరాజ్ ఆస్ట్రేలియా గడ్డపై బోణీ కోసం సిద్ధమవుతుంటే సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తనకు అచ్చొచి్చన ఓపెన్లోనే 25వ గ్రాండ్స్లామ్ సాకారం చేసుకోవాలని చూస్తున్నాడు. వీళ్లిద్దరిని దాటేసి వరుసగా మూడో ఏడాది కూడా టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఇటలీ స్టార్, వరల్డ్ నంబర్వన్ యానిక్ సినెర్ పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో నేడు మొదలయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ టెన్నిస్ టోరీ్నలో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరం. ‘హ్యాట్రిక్’ వేటలో సినెర్... తొలి రౌండ్లో గ్యాస్టన్ (ఫ్రాన్స్)ను ఎదుర్కొంటాడు. 22 ఏళ్ల స్పెయిన్ స్టార్ అల్కరాజ్ ఇక్కడ తప్ప మిగతా మూడు గ్రాండ్స్లామ్లు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లను రెండేసి సార్లు చేజిక్కించుకున్నాడు. ఆరు గ్రాండ్స్లామ్లను సాధించినప్పటికీ ఈ స్పెయిన్ టాప్సీడ్కు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇంకా వెలితిగానే ఉంది. గత రెండేళ్లుగా (2024, 2025) క్వార్టర్ ఫైనల్ అంచెను దాటని అతను ఈసారైనా ట్రోఫీని అందుకోవాలని ఆశిస్తున్నాడు. కెరీర్ చరమాంకంలో ఉన్న జొకోవిచ్ చిరస్మరణీయమైన 25వ టైటిల్ కోసం రాకెట్కు పదును పెడుతున్నాడు. ఇక్కడ పది టైటిల్స్ సాధించిన జొకో 11వ టైటిల్ సాధిస్తే తన కెరీర్కు గ్రాండ్గా వీడ్కోలు పలికే అవకాశముంది. మూడేళ్ల క్రితం 2023లో చివరిసారిగా ఆ్రస్టేలియా ఓపెన్లో విజేతగా నిలిచాడు. అదే ఏడాది ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్లను గెలిచిన ఈ సెర్బియన్ ఆల్టైమ్ గ్రేట్... రెండేళ్లుగా ‘25వ గ్రాండ్స్లామ్’ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఈ హేమాహేమీలతో పాటు రెండు సార్లు (2020, 2024) రన్నరప్తోనే సరిపెట్టుకున్న జర్మనీ ప్లేయర్, మూడో సీడ్ జ్వెరెవ్, ఐదో సీడ్ లోరెంజొ మ్యూసెటి (ఇటలీ), రష్యన్ స్టార్లు రుబ్లెవ్, మెద్వెదెవ్, 2014 చాంపియన్, స్విట్జర్లాండ్ వెటరన్ స్టార్ వావ్రింకా సైతం ఆసీస్ బరిలోకి దిగుతున్నారు. వావ్రింకాకు వీనస్ విలియమ్స్కు ఇచి్చనట్లే నిర్వాహకులు వైల్డ్కార్ట్ ఎంట్రీ ఇచ్చారు. స్వియాటెక్ ఈసారైనా! పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ను ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆఖరి దాకా ఊరించి చివరకు నిరాశపరుస్తోంది. 2022తో పాటు గతేడాది కూడా రన్నరప్తోనే సరిపెట్టుకున్న స్వియాటెక్ ఈ సారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉంది. అమెరికన్ టెన్నిస్ స్టార్ మాడిసన్ కీస్ డిఫెండింగ్ చాంపియన్ హోదాతో టైటల్ వేటకు సిద్ధమవగా, జెస్సికా పెగూలా (అమెరికా), ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్), 2021 రన్నరప్ కరొలినా మ్యుచొవా (చెక్ రిపబ్లిక్), 2024 రన్నరప్ కోకో గాఫ్ (అమెరికా), రెండుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ (2023, 2024) సాధించిన బెలారస్ స్టార్, టాప్ సీడ్ సబలెంక టోర్నీ ఫేవరేట్లుగా ఉన్నారు. -
క్వార్టర్స్లో ఓడిన లక్ష్యసేన్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ఒకే ఒక్కడు లక్ష్యసేన్ మాత్రమే క్వార్టర్ ఫైనల్ చేరగా... అతనూ అంతకుమించి ముందంజ వేయలేకపోయాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 21–17, 13–21, 18–21తో చైనీస్ తైపీ ప్లేయర్ లిన్ చున్ యి చేతిలో పరాజయం చవిచూశాడు. 2021 ప్రపంచ చాంపియíÙప్ కాంస్య పతక విజేత అయిన లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్లో 21–19, 21–10తో జపాన్ ఆటగాడు కెంట నిషిమొతోపై అలవోక విజయం సాధించాడు. సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్, మాళవిక బన్సోద్ గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లలో పరాజయంపాలయ్యారు. పురుషుల సింగిల్స్లో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్)తో జరిగిన పోరులో శ్రీకాంత్ 14–21, 21–17, 17–21తో ఐదో సీడ్ ఫ్రాన్స్ ప్లేయర్ ధాటికి పరాజయం చవిచూశాడు. ప్రణయ్ కూడా 21–18, 19–21, 14–21తో ఎనిమిదో సీడ్ లోహ్ కియన్ యూ (సింగపూర్) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో మాళవిక బన్సోద్ 18–21, 15–21తో చైనాకు చెందిన ఐదో సీడ్ హన్ యూవ్ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట 22–20, 22–24, 21–23తో ఏడో సీడ్ లి యిజింగ్–లూయో జుమిన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. వివాదాస్పద నిర్ణయంతో.... పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 27–25, 21–23, 19–21తో ప్రపంచ 22వ ర్యాంకు జోడీ హిరోకి మిదొరికవ–క్యోహే యామషిత (జపాన్) చేతిలో ఓడింది. భారత, జపాన్ జోడీలు అప్పటికే చెరో గేమ్ గెలిచాయి. నిర్ణాయక గేమ్లో హోరీహోరీగా తలపడుతున్నాయి. ఇలాంటి దశలో స్కోరు 15–15 వద్ద దురదృష్టవశాత్తు నెట్కు సాత్విక్ తగిలాడు. దీంతో చైర్ అంపైర్ ప్రత్యర్థి జోడీకి పాయింట్ ఇచ్చాడు. వెంటనే దీనిపై అంపైర్కు సాత్విక్ వివరణ ఇచ్చాడు. చిరాగ్ వీడియో రిఫరల్ను పరిశీలించాలని కోరాడు. కానీ చైర్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడి ఉండటంతో ఇది భారత జోడీ తిరిగి పుంజుకోకుండా చేసింది. ప్రతీ గేమ్లోనూ అసాధారణ పోరాటపటిమ కనబరిచిన అగ్రశ్రేణి భారత ద్వయం ఇంత జరిగినా కూడా తమ పరాజయానికి సాకుగా ఈ ప్రతికూలతను చెప్పనేలేదు. కీలకమైన సమయంలో ప్రత్యర్థి జోడీనే తమకన్నా మిన్నగా పాయింట్లు సాధించడం వల్లే ఓడిపోయామని సాత్విక్ జంట మ్యాచ్ ముగిసిన అనంతరం వెల్లడించింది. -
ఇదేం టోర్నీ.. ఇదేం నిర్వాకం!
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహణ పట్ల డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫీల్డ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ‘ఇలాంటి అనారోగ్యకర వాతావరణంలో, ప్రొఫెషనల్ ప్లేయర్లు పోటీపడే టోర్నీని నిర్వహిస్తారా? ఇండియా ఓపెన్ సూపర్–750 స్థాయి టోర్నీని నిర్వహించే వేదిక ఇంత చెత్తగా ఉంటుందా?’ అని బ్లిచ్ఫీల్డ్ నిలదీసింది. ఈ నిర్వాకంపై వెంటనే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) జోక్యం చేసుకొని ప్రపంచ చాంపియన్షిప్కు ముందే పరిస్థితుల్ని చక్కదిద్దాలని కోరింది. ఢిల్లీలోని కేడీ జాదవ్ స్టేడియంలో ఈ ఆగస్టులో ప్రపంచ చాంపియన్షిప్ జరగనుంది. 17 ఏళ్ల తర్వాత మనకు దక్కిన ఈ ఆతిథ్య భాగ్యం కోసం కేడీ జాదవ్ స్టేడియాన్ని నవీకరిస్తున్నారు. దీంతో పక్కనే ఉన్న ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రస్తుత ఇండియా ఓపెన్ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందిరా గాంధీ స్టేడియం దుమ్ము ధూళితో కూరుకుపోయిందని, అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే వాతావరణం అక్కడ ఏమాత్రం లేనేలేదని, షట్లర్లు సరిగ్గా వార్మప్ చేసుకునే పరిస్థితి కూడా లేదని డెన్మార్క్ అమ్మాయి తీవ్రస్థాయిలో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)పై విరుచుకుపడింది. గతేడాది ఆమె ఇండియా ఓపెన్ను కేడీ జాదవ్ స్టేడియంలో ఆడింది. ఇప్పుడు వేరే వేదికకు మార్చడం పట్ల మెరుగైన స్టేడియం అయి ఉంటుందని ఆశించానని, కానీ దానికంటే మరింత ఘోరంగా ఇందిరాగాంధీ స్టేడియం ఉందని విమర్శించింది. గతేడాది కూడా ఆమె సౌకర్యాలు, వేదికపై ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికీ ఇప్పటికీ ఏమైనా మెరుగైందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఏమాత్రం మారలేదు. మెరుగు అనే మాటే లేదు. అప్పుడు ఎలా ఉందో... ఇప్పుడూ అలాగే ఉంది’ అని బ్లిచ్ఫీల్డ్ ‘బాయ్’ అధికారుల తీరుపై మండిపడింది. -
‘ఆ ఇద్దరితో ఎఫైర్.. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి’
భారత బాక్సింగ్ దిగ్గజం, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్పై ఆమె మాజీ భర్త కరుంగ్ ఓన్కోలర్ సంచలన ఆరోపణలు చేశాడు. మేరీ కోమ్కు పలువురితో వివాహేతర సంబంధాలు ఉండేవని ఆరోపించాడు. అదే విధంగా.. ఆస్తిని కాజేశానంటూ తనపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదన్నాడు.మణిపూర్కు చెందిన మేరీకోమ్ ఆరుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచారు. వ్యక్తిగత విషయానికొస్తే.. కరుంగ్ ఓన్కోలర్ను 2005లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు మగ పిల్లలుకాగా... 2018లో కరుంగ్ ఓన్కోలర్ ఒక పాపను దత్తత తీసుకున్నాడు.అయితే, 2023లో తమకు సంప్రదాయం (కోమ్ చట్టాలు) ప్రకారం విడాకులు మంజూరు అయ్యాయని గతేడాది మేలో మేరీ కోమ్ ప్రకటించింది. అయితే, వీరిద్దరికి కోర్టు ద్వారా మాత్రం ఇంకా విడాకులు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా IANSతో మాట్లాడిన కరుంగ్ ఓన్కోలర్ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చాడు.జూనియర్ బాక్సర్తో‘‘లోక్ అదాలత్లో నేను తనను మోసం చేశానని.. ఆస్తి కొట్టేశానని ఆమె చెబుతోందేమో!. మొదట 2013లో ఓ జూనియర్ బాక్సర్తో ఆమెకు వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయం తెలిసి మా కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పెద్దలు చెప్పిన తర్వాత రాజీకి వచ్చాము.వాట్సాప్ మెసేజులు ఉన్నాయి2017 నుంచి మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీలో పని చేస్తున్న ఓ వ్యక్తితో ఆమె సంబంధం కొనసాగిస్తోంది. సాక్ష్యంగా వాళ్లిద్దరి వాట్సాప్ మెసేజులు నా దగ్గర ఉన్నాయి. ఆమెకు ఎవరితో సంబంధం ఉందో నాకు కచ్చితంగా తెలుసు. అయినా సరే నేను నిశ్శబ్దంగానే ఉన్నాను. ఆమె ఒంటరిగా బతుకుతూ.. అతడితో రిలేషన్షిప్లో ఉండాలనుకుంది.అందుకే విడాకులు తీసుకున్నాం. ఒకవేళ తను వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నన్ను నిందిస్తే మాత్రం ఊరుకోను. ఆధారాలు ఉంటేనే నాపై ఆరోపణలు చేయాలి. పద్దెనెమిదేళ్ల వైవాహిక జీవితంలో నేను తన నుంచి ఏమీ తీసుకోలేదు.కోర్టు నుంచి విడాకులు మంజూరు కాలేదుఆమె ఓ సెలబ్రిటీ. అయినా సరే నేను ఇప్పటికీ ఢిల్లీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాను. తను చెప్పింది అందరూ వింటారు కాబట్టి నచ్చినట్లు మాట్లాడుతోంది. మేము సంప్రదాయం ప్రకారమే విడాకులు తీసుకున్నాం. కోర్టు నుంచి విడాకులు మంజూరు కాలేదు.అయినా నేను కోర్టుకు వెళ్లను. నా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను తన డబ్బులు దొంగిలించానని.. రూ. 5 కోట్లు కొట్టేశానని అంటోంది. ఒక్కసారి నా అకౌంట్ చూడండి. నా దగ్గర ఎంత ఉందో తెలుస్తుంది.నన్ను వాడుకొని వదిలేసిందినన్ను వాడుకొని వదిలేసింది. ఆమె అకాడమీకి బీజం వేసింది నేను. కానీ ఇప్పుడు చైర్మన్గా ఎవరు ఉన్నారో చూడండి. ఆమె ప్రవర్తన నన్ను బాధపెట్టింది. నా పిల్లలు బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నారు. ఆమె సంపాదిస్తోంది కాబట్టి.. వారి ఫీజులను చెల్లిస్తోంది. కానీ వాళ్లను పెంచింది నేను.హాస్టల్లో ఉన్న నా పిల్లల్ని చూడనివ్వడం లేదు. వాళ్లు తన పిల్లలు అని వాదిస్తోంది. నిజానికి వాళ్లు నా రక్తం కూడా. భార్యాభర్తల బంధంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. నేను ఆల్కహాల్ తీసుకుంటానని తను చెబుతోంది. ఆమె కూడా వోడ్కా, రమ్ తాగుతుంది.గుట్కా తింటుంది. అయినా సరే మీడియా ముందు నేను ఈ విషయాలు ఏమీ చెప్పలేదు. నేను పార్టీల్లో తాగినందుకు నా గురించి ప్రచారం చేసింది’’ అంటూ మేరీ కోమ్పై కరుంగ్ ఓన్కోలర్ సంచలన ఆరోపణలు చేశాడు. కాగా ఓ వ్యాపారవేత్తతో మేరీకి సంబంధం ఉందని వార్తలు రాగా.. ఆమె తరఫు లాయర్ ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇకపై ఎవరూ వీటిని ప్రస్తావించకూడదని విజ్ఞప్తి చేశారు.చదవండి: ‘నిశ్చితార్థం చేసుకున్నాం’ -
ఇక సెలవు.. గెలిచిన ప్రైజ్మనీ రూ. 187 కోట్లు
మాంట్రియల్: కెనడా టెన్నిస్ ప్లేయర్ మిలోస్ రావ్నిచ్ ఆటకు వీడ్కోలు పలికాడు. 35 ఏళ్ల రావ్నిచ్ 2016లో కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్ను అందుకున్నాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో చివరిసారి టెన్నిస్ మ్యాచ్ ఆడిన రావ్నిచ్ ఆ తర్వాత బరిలోకి దిగలేదు. 2008లో ప్రొఫెషనల్గా మారిన రావ్నిచ్ తన కెరీర్లో మొత్తం 8 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ను సాధించాడు. ‘సమయం వచ్చేసింది. నేను టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నాను. ఏ క్రీడాకారుడైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటాడు. నా జీవితంలో చాలా ఏళ్లు టెన్నిస్ అంతర్భాంగా ఉంది. ఈ ఆట నాకెంతో ఇచ్చింది’ అని రావ్నిచ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫెడరర్ను ఓడించి2016లో రావ్నిచ్ కెరీర్ అత్యుత్తమ దశలో నిలిచాడు. ఆ ఏడాది వింబుల్డన్ సెమీఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ను ఓడించి రావ్నిచ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయితే ఫైనల్లో ఆండీ ముర్రే (బ్రిటన్) చేతిలో ఓడిపోయి ఈ కెనడా స్టార్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. అదే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో, సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్లో సెమీఫైనల్ చేరిన అతను ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. కెరీర్లో సాధించిన మొత్తం ప్రైజ్మనీ - 2,07,64,512డాలర్లు (రూ. 187 కోట్లు).రావ్నిచ్ సాధించిన కెరీర్ బెస్ట్ ర్యాంక్-3.ప్రొఫెషనల్ కెరీర్లో రావ్నిచ్ గెలిచిన మ్యాచ్లు- 383కెరీర్లో సాధించిన ఏటీపీ సింగిల్స్ టైటిల్స్- 8 -
సవాళ్లకు సిద్ధం
భారత చాంపియన్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ గురువారం మొదలయ్యే ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) సవాళ్లకు సిద్ధమని ప్రకటించింది. కొరకరాని విదేశీ రెజ్లర్లపై ఎప్పటి నుంచో దృష్టి సారించినట్లు చెప్పింది. మన రెజ్లర్లకు జాతీయ శిబిరాలు మెలకువలు నేర్పిస్తే... విదేశాల్లో శిక్షణ విదేశీ రెజ్లర్లను దీటుగా ఎదుర్కొనే స్థయిర్యాన్నిస్తుందని చెప్పుకొచ్చింది. న్యూఢిల్లీ: రోజుల వ్యవధిలోనే మొదలయ్యే పీడబ్ల్యూఎల్ కోసం పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యానని భారత స్టార్ మహిళా రెజ్లర్ అంతిమ్ పంఘాల్ తెలిపింది. 53 కేజీల కేటగిరీలో జూనియర్, సీనియర్ అంతర్జాతీయ స్థాయిల్లో ఇదివరకే నిరూపించుకున్న అంతిమ్ ఇప్పుడు కొత్త తరహా లీగ్ ‘పట్టు’కు సై అంటోంది. 17 ఏళ్ల వయసులోనే 2022లో అండర్–20 ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఆమె ఆ మరుసటి ఏడాది టైటిల్ నిలబెట్టుకుంది. ప్రపంచ ఛాంపియన్షిప్ లో రెండు కాంస్యాలు నెగ్గిన ఆమె.. 2022 ఆసియా క్రీడల్లోనూ కాంస్య పతకంతో మెరిసింది. 21 ఏళ్ల ఈ స్టార్ రెజ్లర్ తనకు ఎదురయ్యే మింగుడు పడని విదేశీ రెజ్లర్లపై ఓ కన్నేసినట్లు చెప్పింది. జపాన్ దిగ్గజ రెజ్లర్ యుయ్ సుసాకి పోటీల వీడియోలను ఫోన్లో తరచూ చూస్తానని చెప్పుకొచ్చింది. తన కెరీర్లోనే ఓటమి ఎరుగని సుసాకిపై పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇలా మేటి రెజ్లర్లను ఓడించే సత్తా మనకుందని 2023లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ అందుకున్న అంతిమ్ చెప్పుకొచ్చింది. బౌట్కు ముందు ఎన్నో ఆలోచనలు చుట్టూ తిరుగుతూనే ఉంటాయని, అయితే బౌట్ కోసం మ్యాట్ మీదిగి దిగగానే మైండ్ ఒక్కసారిగా ‘పోరాటం’పైనే పడుతుందని, దీంతో... గెలుపోటముల ఆలోచనేది గుర్తుకురాదని, వంద శాతం కుస్తీపట్టడం గురించే ఆలోచిస్తానని అంతిమ్ వివరించింది. ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) ఈ నెల 15 నుంచి నోయిడా ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మనోభావాలను ఇలా పంచుకుంది. అర కోటి... అస్సలు ఊహించలేదు! ‘పీడబ్ల్యూఎల్ వేలంలో ఈ స్థాయి మొత్తం లభిస్తుందని అస్సలు ఊహించనేలేదు. నేనే కాదు... మా కుటుంబసభ్యులెవరూ ఇంత మొత్తం వస్తుందని అనుకోలేదు. నిజానికి నాకు సుమారు రూ. 30 లక్షలకు అటు ఇటుగా వస్తుందనే ఆశించాను. పెరిగినా దీనికి కాస్తే ఎక్కువ రావొచ్చని అనుకున్నా! కానీ ఏకంగా రూ. 50 లక్షలు దక్కుతాయని ఏమాత్రం ఊహించలేదు. వేలం జరుగుతుండగా నేను ఆలయానికి వెళ్లాను. యూపీ డామినేటర్స్ నన్ను అంత మొత్తానికి కొనుగోలు చేసిందని తెలియగానే దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాను. హరియాణాకు చెందిన నేను కెరీర్ అసాంతం ఈ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఎందుకనో ఈ లీగ్లో మాత్రం యూపీ తరఫునే ఆడాలని గట్టిగా అనుకున్నా’. మరింత పట్టుదలతో... ‘సీనియర్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మరింత పట్టుదలతో, రెట్టించిన ఉత్సాహంతో పునరాగమనం చేస్తుంది. ఆమె రిటైర్మెంట్ను పక్కనబెట్టడం శుభపరిణామం. నాకంటే ఆమె ఎంతో అనుభవజ్ఞురాలైన రెజ్లర్. ఆమె వస్తుందంటేనే చెమటోడ్చేందుకు సిద్ధమైందని అర్థం. ఏ ప్లేయర్ అయినా సరే పోరాడేతత్వం, మనోధైర్యం బలంగా ఉంటేనే పునరాగమనం చేస్తారు. మన వినేశ్ కూడా అంతే! ఇక నేను పోటీపడే 53 కేజీల కేటగిరీ నాకు మాత్రమే సొంతం కాదు. ఎవరైనా పోటీపడొచ్చు. ఏ కేటగిరీ సరైందో పోటీ పడే అథ్లెట్కే బాగా తెలుస్తుంది. అందులో ఎంతగా కష్టపడగలదో, ఏ రకంగా గెలుస్తుందో, దేనివల్ల ఓడిపోతోందో ఆ విభాగానికి చెందిన అథ్లెట్కే బాగా తెలుస్తుంది’. సీనియర్ స్థాయికి ఎదగగానే... ‘జూనియర్ నుంచి సీనియర్ స్థాయి పోటీల్లో బరిలోకి దిగుతుంటే మన పరిణతి కూడా పెరుగుతుంది. జూనియర్స్లో ఒకట్రెండు పాయింట్లు ఓడితే నిరాశ ఆవహించేది. కానీ ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నా. ఒకట్రెండు పాయింట్లు కాదు... ఆడాల్సింది ఆరు నిమిషాలు. ఒకటి అర కోల్పోయినా ప్రత్యర్థి పట్టుపట్టేందుకు, పైచేయి సాధించేందుకు మన చేతిలో సమయమైతే ఉంటుంది. ఇప్పుడు నా ట్రెయినింగ్ కూడా మారింది. అంతేకాదు... మళ్లీ నేను కోచ్ సియరామ్ దహియాతో శిక్షణ తీసుకోవడం నన్ను మరింత మెరుగుపరిచింది. దహియా మార్గదర్శకంలో అనవసర ఒత్తిడి తగ్గించుకొని త్వరితగతిన పుంజుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించాను. అదేపనిగా లేదంటే మితిమీరిన శిక్షణ కూడా తగదని కోచ్లు వారిస్తారు. మ్యాట్పై ఎప్పుడు కుస్తీ పట్టాలో... వద్దో మేము, కోచ్, ఫిజియో కలిసి నిర్ణయించుకుంటాం. అనుకూల వాతావరణాన్ని సృష్టించుకుంటాం’. విదేశీ శిక్షణ కీలకం ‘జాతీయ శిబిరాలు రెజ్లర్లను దీటుగా సన్నద్ధపరుస్తున్నాయి. అలాగని విదేశాల్లో శిక్షణ అనవసరం అనుకుంటే పొరపాటు. అది కూడా రెజ్లర్లకు కీలకమైన వేదిక. మేమంతా కూడా సహచరులతో కుస్తీ పట్టడం ద్వారానే నేర్చుకున్నాం. అంటే మా మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో, ఎవరి సత్తా ఎంటో మాకు బాగా తెలుసు. జాతీయ శిబిరాల్లో ఇదే జరుగుతుంది. కానీ విదేశీ రెజ్లర్లు మాలానే ఉంటారని అనుకోలేం. వారిలో వేగం ఎక్కువ. అలాంటి వారితో అడపాదడపా విదేశాల్లో శిక్షణ ఏర్పాటు చేస్తే ఈ అనుభవం అంతర్జాతీయ పోటీలకు బాగా ఉపయోగపడుతుంది’. -
యూకీ బాంబ్రీ జోడీ శుభారంభం
ఆక్లాండ్: కొత్త ఏడాదిలో భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ తొలి విజయాన్ని అందుకున్నాడు. న్యూజిలాండ్లో సోమవారం మొదలైన ఏఎస్బీ క్లాసిక్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) జోడీ శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ యూకీ–గొరాన్సన్ ద్వయం 6–3, 6–2తో అజీత్ రాయ్ (న్యూజిలాండ్)–జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–స్వీడిష్ జోడీ మూడు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తొలి సరీ్వస్లో 32 పాయింట్లకుగాను 27 పాయింట్లు... రెండో సరీ్వస్లో 16 పాయింట్లకుగాను 8 పాయింట్లు స్కోరు చేసింది. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. యూకీ–గొరాన్సన్ ద్వయం బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నతో కొత్త సీజన్ను ప్రారంభించింది. ఆ టోరీ్నలో తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన ఈ జంట 5–7, 4–6తో ఒర్లాండో లుజ్–మటోస్ (బ్రెజిల్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
ఆయుశ్ బదోనికి తొలి పిలుపు
న్యూఢిల్లీ: భారత్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్తో జరిగే తర్వాతి రెండు వన్డేలకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతుండటంతో సుందర్ తప్పుకోవాల్సి వచ్చింది. ‘తొలి వన్డేలో బౌలింగ్ చేసే సమయంలో సుందర్ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. అతడికి పరీక్షలు నిర్వహించి గాయం తీవ్రతను బోర్డు వైద్యులు పర్యవేక్షిస్తారు’ అని బీసీసీఐ ప్రకటించింది. కివీస్ ఇన్నింగ్స్లో 5 ఓవర్లలో 27 పరుగులిచి్చన అనంతరం మైదానం నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సుందర్ మళ్లీ ఫీల్డింగ్ కోసం రాలేదు. అయితే ఛేదనలో భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత బ్యాటింగ్కు వచ్చి రాహుల్కు చివరి వరకు అండగా నిలిచాడు. సుందర్ స్థానంలో ఢిల్లీ ఆటగాడు ఆయుశ్ బదోనిని భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు సెలక్టర్లు ప్రకటించారు. బదోనికి టీమిండియాలో చోటు దక్కడం ఇదే మొదటి సారి. బుధవారం జరిగే రెండో వన్డే వేదిక రాజ్కోట్లో అతను భారత బృందంతో చేరతాడు. టీమిండియాకు ఆయుశ్ ఎంపిక కావడం విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ టీమ్ను బలహీనంగా మార్చింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో విదర్భతో ఢిల్లీ ఆడనుండగా ...ఈ మ్యాచ్కు బదోని దూరమయ్యాడు. ఐపీఎల్తో గుర్తింపు... 26 ఏళ్ల బదోని ప్రధానంగా మిడిలార్డర్ బ్యాటర్. అయితే ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున అతనికి మంచి గుర్తింపు లభించింది. దేశవాళీ క్రికెట్లో అతను ఢిల్లీకి కెపె్టన్గా కూడా వ్యవహరించాడు. గత 12 ఏళ్లుగా బదోని బౌలింగ్లో ఎంతో మెరుగయ్యాడని ఢిల్లీ కోచ్ శరణ్దీప్ సింగ్ వెల్లడించాడు. కెరీర్లో 27 లిస్ట్–ఎ మ్యాచ్లలో అతను 36.47 సగటుతో 693 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 29.72 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో లక్నో తరఫున ఆడిన 4 సీజన్లలో కలిపి 56 మ్యాచ్లలో 138.56 స్ట్రయిక్ రేట్తో 963 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీశాడు. -
హైదరాబాద్ వేదికగా...
సాక్షి, హైదరాబాద్: పలు ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లకు వేదికగా నిలిచిన హైదరాబాద్ మరో పెద్ద టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. మహిళల హాకీ వరల్డ్కప్లో భాగంగా జరిగే క్వాలిఫయింగ్ టోర్నీని ఇక్కడి గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహిస్తారు. మార్చి 8 నుంచి 14 వరకు ఈ పోటీలు జరుగుతాయి. మొత్తం ఎనిమిది జట్లు ఇందులో పాల్గొంటాయి. టాప్–3లో నిలిచిన టీమ్లు నేరుగా వరల్డ్ కప్కు అర్హత సాధిస్తాయి. భారత్తోపాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రియా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హత టోర్నీ నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఒప్పందం చేసుకుంది. ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రామ్ ఇందులో పాల్గొని టోర్నీ నిర్వహణపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని పునరుద్ఘాటించారు. హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ నిర్వహించడం తమకు గర్వకారణమని... మున్ముందు నగరాన్ని అత్యుత్తమ స్థాయి క్రీడా కేంద్రంగా మార్చే క్రమంలో ఇది మరో ముందడుగు అని ఆయన అన్నారు. టోర్నమెంట్కు సంబంధించిన పోస్టర్ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత హాకీ సమాఖ్య (హెచ్ఐ) అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ తిర్కీ, భోలానాథ్ సింగ్తో పాటు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సలహాదారు జితేందర్ రెడ్డి, క్రీడా కార్యదర్శి జయేశ్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
‘ఈ క్షణం ఎల్లకాలం గుర్తుండిపోతుంది’
టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు ఆడిన ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినా టైటిల్ నిరీక్షణకు తెర దించింది. మూడేళ్ల తర్వాత తన కెరీర్లో మరో టైటిల్ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఏఎస్బీ క్లాసిక్ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ 13వ ర్యాంకర్ స్వితోలినా చాంపియన్గా అవతరించింది.న్యూజిలాండ్ వేదికగా ఫైనల్లో స్వితోలినా 6–3, 7–6 (10/8)తో ఏడో సీడ్ వాంగ్ జిన్యు (చైనా)పై గెలిచింది. ఓవరాల్గా స్వితోలినా కెరీర్లో ఇది 19వ సింగిల్స్ టైటిల్. ఈ ఉక్రెయిన్ ప్లేయర్ చివరిసారి 2023లో స్ట్రాస్బర్గ్ ఓపెన్లో విజేతగా నిలిచింది. 2024లో ఏఎస్బీ క్లాసిక్ టోర్నీలో స్వితోలినా ఫైనల్ చేరినా తుది పోరులో కోకో గాఫ్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది.గత ఏడాది సెప్టెంబరులో మానసిక సమస్యలతో ఇబ్బందిపడిన స్వితోలినా ఆటకు విరామం ఇచ్చింది. మూడు నెలల తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన ఆమె ట్రోఫీని కూడా ముద్దాడింది. టైటిల్ నెగ్గిన స్వితోలినాకు 37,390 డాలర్ల (రూ. 33 లక్షల 74 వేలు) ప్రైజ్మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ నేపథ్యంలో తన జీవితంలో ఈ క్షణం ఎల్లకాలం గుర్తుండిపోతుందంటూ సోషల్ మీడియా వేదికగా స్వితోలినా ఉద్వేగానికి లోనైంది. View this post on Instagram A post shared by ASB Classic (@asbclassic)మెద్వెదెవ్ టైటిల్ నంబర్ 22 గత ఏడాది ఒక్క టైటిల్తో సరిపెట్టుకున్న రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఈ సీజన్లో మాత్రం ఆరంభంలోనే టైటిల్ను గెల్చుకున్నాడు. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో ప్రపంచ 13వ ర్యాంకర్ మెద్వెదెవ్ విజేతగా నిలిచాడు. బ్రాండన్ నకషిమా (అమెరికా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ మెద్వెదెవ్ 6–2, 7–6 (7/1)తో విజయం సాధించాడు.95 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో మెద్వెదెవ్ 10 ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. మెద్వెదెవ్ కెరీర్లో ఇది 22వ సింగిల్స్ టైటిల్కాగా... 22 టైటిల్స్ వేర్వేరు కావడం విశేషం. ఒకసారి గెలిచిన టైటిల్ను అతను రెండోసారి సాధించలేదు. బ్రిస్బేన్ ఓపెన్ విజేత హోదాలో మెద్వెదెవ్కు 1,14,060 డాలర్ల (రూ. 1 కోటీ 3 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. భళా బుబ్లిక్... హాంకాంగ్: గత ఏడాది నాలుగు టైటిల్స్తో అదరగొట్టిన కజకిస్తాన్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ బుబ్లిక్ ఈ ఏడాదిలో కూడా శుభారంభం చేశాడు. ఆదివారం ముగిసిన హాంకాంగ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో బుబ్లిక్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో బుబ్లిక్ 7–6 (7/2), 6–3తో టాప్ సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలుపొందాడు. బుబ్లిక్ కెరీర్లో ఇది తొమ్మిదో ఏటీపీ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. -
ఐ డోంట్ కేర్: సబలెంకా రియాక్షన్ వైరల్
బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంకా కొత్త ఏడాదిని, కొత్త సీజన్ను టైటిల్తో ప్రారంభించింది. బ్రిస్బేన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో టాప్ సీడ్ సబలెంకా.. మార్టా కొస్టుక్పై ఏకపక్ష విజయం సాధించింది. అయితే, మ్యాచ్ అనంతరం సబలెంకాతో కరచాలనం చేసేందుకు ఉక్రెయిన్కు చెందిన మార్టా నిరాకరించింది.ఉక్రెయిన్లో పరిస్థితుల నేపథ్యంలో రష్యా, బెలారస్ ప్లేయర్లతో షేక్హ్యాండ్కు దూరంగా ఉండాలని తాను పెట్టుకున్న నియమాన్ని ఇక్కడ కూడా 23 ఏళ్ల మార్టా పాటించింది. ఈ విషయంపై సబలెంకా తాజాగా స్పందించింది.నేను అసలు పట్టించుకోను‘‘అది ఆమె నిర్ణయం. అందుకు నేనేం చేయగలను?.. ఆమె షేక్హ్యాండ్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా నాకేమీ తేడా ఉండదు. నేనసలు ఆ విషయాన్నే పట్టించుకోను. ఒక్కసారి కోర్టులో దిగిన తర్వాత నా ధ్యాసంతా ఆట మీదే ఉంటుంది.కోర్టులో అడుగుపెట్టిన తర్వాత గెలవాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతాను. మర్టా లేదంటే జెస్సికా పెగులా.. నా ప్రత్యర్థిగా వీరిలో ఎవరు ఉన్నారన్నది ముఖ్యం కాదు. నా అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలవడం.. ట్రోఫీని అందుకోవడంపై మాత్రమే దృష్టి సారిస్తా.నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అథ్లెట్గా నా పనిని నేను సక్రమంగా పూర్తి చేస్తాను’’ అని సబలెంకా.. మార్టాకు పరోక్షంగా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కాగా 2022 నుంచి రష్యా, బెలారస్ ప్లేయర్లతో షేక్హ్యాండ్కు మార్టా దూరంగా ఉంటోంది. రూ. 1 కోటీ 93 లక్షలుఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా 6–4, 6–3తో మార్టా కొస్టుక్ను ఓడించింది.78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకా ఒక ఏస్ సంధించింది. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. తొలి సర్వీస్లో 32 పాయింట్లకుగాను 26... రెండో సర్వీస్లో 20 పాయింట్లకుగాను 12 పాయింట్లు సంపాదించింది. ఇక సబలెంకా కెరీర్లో ఇది 22వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. విజేతగా నిలిచిన బెలారస్ స్టార్కు 2,14,530 డాలర్ల (రూ. 1 కోటీ 93 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.చదవండి: U19 WC 2026 IND vs ENG: వైభవ్ సూర్యవంశీ ఫెయిల్ -
భారత లాయర్స్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా సునీల్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: భారత లాయర్స్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా తెలంగాణ హైకోర్టుకు చెందిన సునీల్ గౌడ్ ఎంపికయ్యారు. శనివారం న్యూఢిల్లీ వేదికగా జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఢిల్లీ హైకోర్టుకు చెందిన కుల్దీప్ పరిహార్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కాగా... సునీల్ గౌడ్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వేలు మురుగన్ (తమిళనాడు హై కోర్టు), ఆదిత్య చౌదరి (సుప్రీంకోర్టు) ఉపాధ్యక్షులుగా ఎన్నిక కాగా... కేరళ హైకోర్టుకు చెందిన నవీన్ సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. కర్ణాటక లాయర్ సునీల్ కోశాధికారిగా ఎన్నిక కాగా... అజయ్ (పంజాబ్, హరియాణా హై కోర్టు), రాహుల్ (అలహాబాద్ హై కోర్టు) ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నికయ్యారు. -
కోచ్కు గుడ్బై చెప్పిన నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్లో రెండు పతకాలు నెగ్గిన నీరజ్ చోప్రా... దిగ్గజ కోచ్ జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్) నుంచి వేరయ్యాడు. ఏడాది కాలంగా జెలెన్జీ వద్ద శిక్షణ పొందిన నీరజ్ సానుకూల వాతావరణంలోనే దారులు మార్చుకున్నట్లు శనివారం వెల్లడించాడు. జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు సాధించిన ఈ చెక్ రిపబ్లిక్ అథ్లెట్... కెరీర్కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్గా మారాడు. అతడి శిక్షణలో మరింత రాటుదేలిన నీరజ్ చోప్రా గతేడాది కెరీర్లో తొలిసారి 90 మీటర్ల మార్క్ అందుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఆరాధించిన జెలెన్జీ వద్ద శిక్షణ పొందడం ఎంతో గొప్ప విషయమని నీరజ్ పేర్కొన్నాడు. ‘జెలెన్జీ వద్ద శిక్షణతో ఎన్నో విషయాల్లో నా ఆలోచన సరళి మారింది. టెక్నిక్, రిథమ్ వంటి వాటిలో అతడి ప్రోత్సాహం మరవలేనిది. ఒక్క సీజన్లోనే జెలెన్జీ నుంచి ఎంతో నేర్చుకున్నా. జీవితం మొత్తం ఆరాధించిన వ్యక్తి ఒక స్నేహితుడిగా మారి మార్గనిర్దేశం చేయడం ఎప్పటికీ మరవలేను. అతడు కేవలం అత్యుత్తమ జావెలిన్ త్రోయర్ మాత్రమే కాదు. అంతకుమించి మంచి మనిషి అని నీరజ్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్షిప్తో పాటు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా సాధన కొనసాగిస్తున్నట్లు నీరజ్ వెల్లడించాడు. మరోవైపు దీనిపై జెలెన్జీ స్పందిస్తూ... ‘నీరజ్ వంటి అథ్లెట్తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి. అతడిని కలవడం సంతోషంగా ఉంది. నా శిక్షణ కాలంలో అతడు 90 మీటర్ల మార్క్ దాటడం సంతృప్తినిచి్చంది. భవిష్యత్తులోనూ అతడితో బంధం కొనసాగుతుంది’ అని 59 ఏళ్ల జెలెన్జీ పేర్కొన్నాడు. -
ముగిసిన సింధు పోరాటం.. సెమీస్లో ఓటమి
మలేషియా ఓపెన్-2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు ఓటమి పాలైంది. గాయం తర్వాత పునరాగమనం చేసిన సింధు సెమీఫైనల్ వరకు అద్భుతంగా ఆడింది. కానీ సెమీస్లో మాత్రం చైనాకు చెందిన వరల్డ్ నంబర్ 2 క్రీడాకారిణి వాంగ్ జియి నుంచి గట్టి పోటీ ఎదురైంది.ఆమె చేతిలో 16-21, 15-21 తేడాతో సింధు ఓటమి చవిచూసింది. రెండో గేమ్లో సింధు 11-6తో ఆధిక్యంలో ఉన్నప్పటికి, వరుస తప్పిదాల వల్ల విజయాన్ని చేజార్చుకుంది. అంతకుముందు సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్ - ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ జోడీ చేతిలో 10-21, 21-23తో ఈ భారత అగ్రశ్రేణి ద్వయం ఓటమి పాలైంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్లతో -
ఇక నుంచి రూ. 20 లక్షలు
అహ్మదాబాద్: జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు ఏటా ఇచ్చే వార్షిక నిధుల మొత్తాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పెంచింది. గతేడాది వరకు ఐఓఏ గుర్తింపు పొందిన సమాఖ్యకు రూ. 10 లక్షలు గ్రాంటుగా ఇచ్చేది. అయితే ఈ ఏడాది నుంచి రూ. 20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో గ్రాంటు మొత్తాన్ని రెట్టింపు చేసే నిర్ణయం తీసుకున్నారు.రూ. 7 లక్షల స్థానంలో ఇకపైఅలాగే ఐఓఏ అనుబంధ రాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు ఇచ్చే గ్రాంటులను సైతం ఐఓఏ పెంచింది. రూ. 7 లక్షల స్థానంలో ఇకపై రూ. 10 లక్షలను రాష్ట్ర సంఘాలకు ఇచ్చేందుకు ఏజీఎంలో తీర్మానించినట్లు ఐఓఏ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. శుక్రవారం జరిగిన ఏజీఎంలో భారత్లో గత కొన్నేళ్ల క్రీడా ప్రగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ఐఓఏ ఆఫీస్ బేరర్లతో పాటు అందుబాటులో ఉన్న పలువురు క్రీడాకారులు, ఎన్ఎస్ఎఫ్లకు చెందిన ప్రతినిధులు సైతం ఈ సమీక్షలో పాల్గొన్నారు.అథ్లెట్ల గళం వినిపించేందుకు ఆయా క్రీడా సంఘాలు, సమాఖ్యల్లో అథ్లెట్లు తప్పనిసరని, అథ్లెట్స్ కమిషన్ను కూడా మరింత బలోపేతం చేస్తామని నిర్ణయాధికారాల్లో క్రీడాకారులు భాగస్వాములవుతారని ఐఓఏ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏజీఎం జరిగింది. చివరిసారిగా 2023, మార్చిలో ఐఓఏ సర్వసభ్య సమావేశం జరిగింది.తాజా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం క్రీడాపాలసీని పారదర్శకంగా అమలు చేయాలని, జవాబుదారితనాన్ని పెంచాలని కూడా తీర్మానించారు. అంతకుముందు 1996 నుంచి 2011 వరకు ఐఓఏ అధ్యక్షుడిగా పనిచేసిన సురేశ్ కల్మాడీ మృతికి సంతాపంగా ఐఏఓ సభ్యులంతా కొన్ని నిమిషాలు మౌనం పాటించారు.నిర్ణయాత్మక చర్యలుఈ సందర్భంగా పలువురు ఐఓఏ చీఫ్గా కల్మాడీ చేసిన సేవల్ని కొనియాడారు. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ ‘క్రీడాభివృద్ధికి సంస్కరణల్ని అమలు చేయాలి. తద్వారా మన అథ్లెట్ల అభ్యున్నతికి మనం నిబద్ధతతో కృషి చేయాలి. ప్రతీ క్రీడాకారుడి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఐఓఏ నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నాం. భారతదేశ క్రీడా ప్రగతి కోసమే మేమంతా పాటుపడతాం’ అని అన్నారు. -
సెపక్టక్రా బంగారు పతకాలు వీరికే
ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026లో ఘోగ్లా బీచ్లో సెపక్టక్రా ఫైనల్స్లో హర్యానా మహిళల జట్టు, ఢిల్లీ పురుషుల జట్టు విజయం సాధించాయి. దీంతో బిహార్ బంగారు పతకం గెలిచే ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జాతీయ క్రీడా సమాఖ్యల సాంకేతిక పర్యవేక్షణలో.. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా & నగర్ హవేలీ, దమన్ & డయూ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 జరుగుతున్నాయి. ఈ పోటీల్లో వాలీబాల్, సాకర్, సెపక్టక్రా, కబడ్డీ, పెంచక్ సిలాట్, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్, మల్లఖంబ్ మరియు టగ్ ఆఫ్ వార్ అనే ఎనిమిది క్రీడల్లో 1100కు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొదటి ఆరు క్రీడలు పతకాల కోసం నిర్వహించబడుతుండగా, మొత్తం 32 బంగారు పతకాలు అందుబాటులో ఉన్నాయి.మహిళల సెపక్టక్రా ఫైనల్లో తొలి రెగును కోల్పోయిన తర్వాత హర్యానా జట్టు గట్టిగా తిరిగి వచ్చి బిహార్పై 2-1తో విజయం సాధించింది. ఈ మ్యాచ్ గంట 15 నిమిషాల పాటు సాగింది. పురుషుల విభాగంలో ఢిల్లీ జట్టు బిహార్పై 2-0తో నేరుగా విజయం సాధించింది.బీచ్ సాకర్లో డిఫెండింగ్ చాంపియన్స్ ఒడిశా, డెబ్యూ జట్టు హిమాచల్ ప్రదేశ్పై 7-0తో ఆధిపత్య విజయాన్ని నమోదు చేసి మహిళల ఫైనల్కు చేరుకుంది. స్రిజనా తమాంగ్, సత్యబతి ఖడియా, ఖుండోంగ్బామ్ అంబాలికా తలా రెండు గోల్స్ చొప్పున సాధించారు.రెండో మహిళల సెమీఫైనల్లో తొలి క్వార్టర్లోనే నాలుగు గోల్స్ చేసిన గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్పై 6-3తో విజయం సాధించింది. ఓడిన జట్టుకు కెప్టెన్ జియానీ రామ్చింగ్ మారా మూడు క్వార్టర్లలో ఒక్కో గోల్ సాధించినప్పటికీ ఇతరుల నుంచి సరైన మద్దతు లభించలేదు.బీచ్ వాలీబాల్లో తమిళనాడు పురుషులు మరియు మహిళలు రెండు విభాగాల్లోనూ బంగారు పతకాలు గెలుచుకునే అవకాశం పొందారు. మహిళల సెమీఫైనల్లో దీపికా, పవిత్ర జంట తొలి సెట్ కోల్పోయిన తర్వాత స్వాతి, ధర్షిణిపై 19-21, 21-12, 15-6తో విజయం సాధించి ఫైనల్లో పుదుచ్చేరి జంట రేవతి, శ్వేతతో తలపడనుంది. పురుషుల ఫైనల్లో తమిళనాడు జంట భారత్, రాజేష్ గోవా జంట సావన్, గౌన్స్తో తలపడనుంది.ఫలితాలుబీచ్ సాకర్ (సెమీఫైనల్స్)మహిళలు: గుజరాత్ 6-3 అరుణాచల్ ప్రదేశ్ను ఓడించింది; ఒడిశా 7-0 హిమాచల్ ప్రదేశ్ను ఓడించిందిబీచ్ సెపక్టక్రామహిళలు: బంగారం – హర్యానా; రజతం – బిహార్; కాంస్యం – ఉత్తర ప్రదేశ్, మణిపూర్పురుషులు: బంగారం – ఢిల్లీ; రజతం – బిహార్; కాంస్యం – మణిపూర్, దాద్రా & నగర్ హవేలీ మరియు దమన్ & దియుబీచ్ వాలీబాల్ (సెమీఫైనల్స్)మహిళలు: దీపికా/పవిత్ర (టీఎన్) 19-21, 21-12, 15-6తో స్వాతి/ధర్షిణి (టీఎన్)పై విజయం; రేవతి/శ్వేత (పుదుచ్చేరి) 21-10, 21-18తో మనసా/మౌనిక (ఆంధ్రప్రదేశ్)పై విజయంపురుషులు: సావన్/గౌన్స్ (గోవా) 21-18, 16-21, 15-12తో పూన్తమిళన్/అభిథన్ (టీఎన్)పై విజయం; భారత్/రాజేష్ (టీఎన్) 21-13, 19-21, 15-8తో రామకృష్ణ దవాస్కర్/నితిన్ సావంత్ (గోవా)పై విజయం -
ఆటుపోట్లను దాటుకుంటూ... అడ్డంకులు ఎదురైనా..
గ్రేటర్ నోయిడా: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో సత్తా చాటుతున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో చాంపియన్గా నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2024 పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి నిరాశ పరిచిన నిఖత్... ఈసారి ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పకడ్బందీగా సిద్ధమవుతోంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత కాస్త విరామం తీసుకున్న ఈ బాక్సర్... గాయం నుంచి కోలుకొని రింగ్లో మళ్లీ మెరిపిస్తోంది. తాజాగా జరుగుతున్న జాతీయ చాంపియన్షిప్లో నిఖత్ తన పంచ్ పవర్తో ఫైనల్కు చేరింది. ఈ ఏడాదిని టైటిల్తో ప్రారంభించేందుకు సిద్ధమైన ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్... సీజన్ మొత్తం ఇదే జోరు కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. అడ్డంకులు ఎదురైనా..‘క్రీడల్లో ఎత్తుపల్లాలు సహజం. ఒక అథ్లెట్ అన్నివేళలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోవచ్చు. కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు. కొన్నికొన్ని సార్లు అడ్డంకులు ఎదురవుతాయి. అప్పుడే మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది తెలుసుకునేందుకు అవకాశం చిక్కుతుంది. దాన్ని గుర్తించి అధిగమించగలిగితే ఎదురుండదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రయత్నించడం ముఖ్యం’ అని నిఖత్ వెల్లడించింది. ఆటుపోట్లను దాటుకుంటూ... 2024 పారిస్ ఒలింపిక్స్కు ముందు రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలవడంతో పాటు కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలతో నిఖత్ దుమ్మురేపింది. దీంతో విశ్వక్రీడల్లో ఆమెపై భారీ అంచనాలు ఏర్పడగా... పారిస్ ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్లో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి చేరింది. నిరాశ చెందానుఆ తర్వాత నిఖత్కు మోకాలి గాయం అయింది. దాని నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె గతేడాది జూలైలో ప్రపంచ చాంపియన్షిప్లో బరిలోకి దిగి ఒలింపిక్ పతక విజేత చేతిలో ఓడింది. ‘ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన బాక్సర్ చేతిలో ఓడాను. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉత్తచేతులతో వచ్చినందుకు నిరాశ చెందాను’ అని ఆమె వెల్లడించింది. తనకు ఎదురుదెబ్బలు సహజమే అని... జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనే ఈ స్థాయికి చేరినట్లు 29 ఏళ్ల నిఖత్ చెప్పింది. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న సమయంలో ఇదే బరువు కేటగిరీలో ఉన్న నిఖత్... ఎన్నో ఏళ్ల పాటు ఓపికగా ఎదురుచూసింది. ఆ తర్వాత నిలకడైన ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఒలింపిక్ చాంపియన్ కావాలని‘నా జీవితం అంత సులువైందేమీ కాదు. చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డాను. అన్నీ సజావుగా సాగితే అది జీవితం ఎలా అవుతుంది. ప్రపంచ చాంపియన్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. దాని కోసం నా యావత్ శక్తిని ధారపోశాను. దాని వల్లే వరల్డ్ చాంపియన్గా ఎదగగలిగాను. ఇప్పుడు ఒలింపిక్ చాంపియన్ కావాలని అంతే తపనతో కోరుకుంటున్నా. ముందు మనపై మనకు నమ్మకం లేకుంటే... అది వాస్తవ రూపం దాల్చదు. దాని కోసం కోచ్ సన్నీ గెహ్లావత్తో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నా’ అని నిఖత్ వివరించింది. తప్పులను సరిదిద్దుకుంటూ... లాస్ ఏంజెలిస్ క్రీడల్లో నిఖత్ను చాంపియన్గా నిలబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నామని సన్నీ పేర్కొన్నాడు. ‘ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నాం. చిన్న చిన్న తప్పులను గుర్తించి వాటిని అధిగమించేందకు ప్రయత్నిస్తున్నాం. కౌంటర్ అటాక్ విషయంలో మరింత మెరుగయ్యే ప్రయత్నాలు సాగుతున్నాయి. రింగ్లో నిఖత్ ఎక్కువగా బ్యాక్ఫుట్ను వినియోగిస్తుంది. దాంట్లో కొన్ని మెళకువలు నేర్చుకుంటోంది. టెక్నిక్తో పాటు వ్యూహాలపై దృష్టి పెట్టాం’ అని సన్నీ గెహ్లావత్ చెప్పాడు. 2028 ఒలింపిక్స్ సమయానికి నిఖత్ వయసు 32 ఉండనుంది కాబట్టి అందకు తగ్గట్లు శిక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. 2026 తనకెంతో ముఖ్యమని... ఆరంభంలోనే జాతీయ చాంపియన్గా నిలిస్తే... ఏడాదంతా అదే జోరు కొనసాగించవచ్చని నిఖత్ వెల్లడించింది. అదంత సులువు కాకపోయినా... దేశానికి పతకాలు సాధించి పెట్టాలనే తపనే తనను ముందుకు తీసుకెళ్తుందని తెలంగాణ బాక్సర్ పేర్కొంది. చదవండి: WPL 2026: డిక్లెర్క్ ధమాకా -
సెమీస్లో సింధు
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అకానె యామగుచి (జపాన్)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు తొలి గేమ్ను 13 నిమిషాల్లో 21–11తో సొంతం చేసుకుంది. అనంతరం ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. దాంతో సింధును విజేతగా ప్రకటించారు. ఈ గెలుపుతో ముఖాముఖి రికార్డులో యామగుచిపై సింధు ఆధిక్యం 15–12కు పెరిగింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 3–2తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 10–21, 21–23తో ఫజర్ అల్ఫియాన్–షోహిబుల్ ఫిక్రీ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సాతి్వక్–చిరాగ్లకు 9,062 డాలర్ల (రూ. 8 లక్షల 17 వేలు) ప్రైజ్మనీతోపాటు 6600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
కన్నతల్లి ‘లైక్’ చేసిందని... ఫుట్బాల్ దిగ్గజానికి షాకిచ్చిన కొడుకు!
ఇంగ్లండ్ ఫుట్బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హామ్ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. కన్న కొడుకే వారికి లీగల్ నోటీసులు పంపించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇంకోసారి తనను ట్యాగ్ చేస్తే చట్టపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సందేశం పంపినట్లు తెలుస్తోంది.కాగా మాజీ పాప్ స్టార్ విక్టోరియా ఆడమ్స్ను ప్రేమించి డేవిడ్ బెక్హామ్ (David Beckham) 1999లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ముగ్గురు కుమారులు బ్రూక్లిన్ బెక్హామ్ (Brooklyn Beckham), రోమియో బెక్హామ్, క్రూజ్ బెక్హామ్.. కూతురు హార్పర్ సెవెన్ బెక్హామ్ సంతానం. వీరిలో పెద్దవాడైన బ్రూక్లిన్ మోడల్, చెఫ్, ఫొటోగ్రాఫర్గా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.పెళ్లైన నాటి నుంచి విభేదాలుబ్రూక్లిన్... అమెరికాకు చెందిన బిలియనీర్ కుమార్తె, నటి నికోలా పెల్ట్జ్ను 2022లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి బ్రూక్లిన్కు తల్లిదండ్రులు డేవిడ్- విక్టోరియాలతో విభేదాలు తలెత్తాయి. ఇందుకు నికోలా వెడ్డింగ్ గౌనులో మార్పే కారణం అని సమాచారం.ఈ క్రమంలో భార్య వైపు మొగ్గు చూపిన బ్రూక్లిన్.. తల్లిదండ్రులను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. భార్యతో కలిసి అతడు అమెరికాలో నివసిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డేవిడ్ బెక్హామ్ 50వ పుట్టినరోజు వేడుకలకు కూడా అతడు హాజరుకాలేదు. అంతేకాదు తండ్రి ‘సర్’ బిరుదును అందుకున్న వేళా అతడు అక్కడ లేడు.నిన్ను మిస్ అవుతున్నాంఅయితే, డేవిడ్- విక్టోరియా దంపతులు మాత్రం సోషల్ మీడియా పోస్టులలో బ్రూక్లిన్ను ట్యాగ్ చేస్తూ.. ‘నిన్ను మిస్ అవుతున్నాం’ అంటూ క్యాప్షన్లు పెట్టారు. బ్రూక్లిన్కు ఇది ఎంతమాత్రం నచ్చలేదని తెలుస్తోంది. తనతో ఇకపై లాయర్ల ద్వారానే మాట్లాడాల్సి ఉంటుందని ఇప్పటికే తల్లిదండ్రులకు అతడు ఓ లేఖ రాసినట్లు సమాచారం.ఈ క్రమంలో ఇటీవల బ్రూక్లిన్కు సంబంధించిన చికెన్ రోస్ట్ వీడియోను తల్లి విక్టోరియా లైక్ చేయడంతో.. అతడికి కోపం వచ్చిందట. దీంతో తల్లిదండ్రులతో పాటు తోబుట్టువులందరినీ బ్రూక్లిన్ బ్లాక్ చేశాడు. తాజాగా ఇకపై సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేయవద్దంటూ లాయర్ల ద్వారా నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.తనతో మాట్లాడవద్దంటూబెక్హామ్ కుటుంబ సన్నిహిత వర్గాలు.. ‘ది సన్ యూఎస్’తో మాట్లాడుతూ.. ‘‘ఈ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి గల అసలు కారణమేంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. బ్రూక్లిన్ తన తల్లిదండ్రులను బ్లాక్ చేశాడు. తనతో మాట్లాడవద్దంటూ ఇటీవల ఓ లేఖ పంపాడు.అయినా సరే సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేస్తున్నారనే కోపంతో తాజాగా నోటీసులు పంపాడు. పబ్లిక్గా కాకుండా ప్రైవేటుగానే తల్లిదండ్రులతో తేల్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. అయితే, డేవిడ్- విక్టోరియా తన మాటను ఖాతరు చేయలేదని భావించి చట్టపరంగా ముందుకు వెళ్తున్నాడు.డేవిడ్- విక్టోరియా మాత్రం తమ పెద్ద కుమారుడి కోసం ఇంకా తలుపులు తెరిచే ఉంచారు. అయితే, ఈ పరిణామాలు వారిని తీవ్రంగా కలచివేశాయి. మున్ముందు ఏం జరుగుతుందోనని కుమారుడి విషయంలో వారు ఆందోళన చెందుతున్నారు’’ అని పేర్కొన్నాయి.చదవండి: IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు! -
సహజ ముందంజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 టోరీ్నలో భారత మహిళల టెన్నిస్ నంబర్వన్, తెలంగాణ ప్లేయర్ సహజ యామలపల్లి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్లాండ్లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 378వ ర్యాంకర్ సహజ 6–3, 7–5తో థాయ్లాండ్కు చెందిన అన్చిసా చాంటాపై గెలుపొందింది. 1 గంట 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సహజ మూడు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తన సరీ్వస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. తొలి సరీ్వస్లో 23 పాయింట్లు గెలిచిన భారత యువతార, రెండో సర్వీస్లో 18 పాయింట్లు సొంతం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో లీసా పిగాటో (ఇటలీ)తో సహజ తలపడుతుంది. ఇదే టోర్నీ డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో రుతుజా భోస్లే (భారత్)–వుషువాంగ్ జెంగ్ (చైనా) జోడీ 6–3, 6–3తో క్యోకా ఒకమురా (జపాన్)–పీంగ్టార్న్ ప్లిపుయెచ్ (థాయ్లాండ్) జంటపై గెలిచింది. -
క్వార్టర్స్లో సింధు
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–8, 21–13తో ప్రపంచ 9వ ర్యాంకర్ టొమోకా మియజకి (జపాన్)పై గెలిచింది. కేవలం 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధు ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 14–12తో ఆధిక్యంలో ఉంది. లక్ష్య సేన్, ఆయుశ్ అవుట్ పురుషుల సింగిల్స్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్య సేన్ 20–22, 15–21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో... ప్రపంచ 32వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 18–21, 21–18, 12–21తో ప్రపంచ నంబర్వన్ షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాతి్వక్–చిరాగ్ ద్వయం 21–18, 21–11తో జునైది ఆరిఫ్–రాయ్ కింగ్ యాప్ (మలేసియా) జంటను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఫజర్ అల్ఫియాన్–షోహిబుల్ ఫిక్రీ (ఇండోనేసియా)లతో సాతి్వక్–చిరాగ్ తలపడతారు. -
షూటర్పై దారుణానికి తెగబడిన కోచ్!.. సస్పెన్షన్ వేటు
జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్పై వేటు పడింది. తనపై అతడు లైంగిక దాడికి పాల్పడినట్లు భారత షూటర్, పదిహేడేళ్ల అమ్మాయి హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫరీదాబాద్ హోటల్లో అంకుశ్ భరద్వాజ్ తనపై అత్యాచారం చేసినట్లు ఆమె ఆరోపించింది.రూమ్కు రావాల్సిందిగా ఒత్తిడిన్యూఢిల్లీలో డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్న వేళ.. ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు తెలిపింది. పోటీలో తన ప్రదర్శను విశ్లేషిస్తున్నట్లుగా నటిస్తూ అత్యాచారానికి ఒడిగట్టినట్లు పేర్కొంది. తొలుత హోటల్ లాబీలో తనను కలవాలని ఆదేశించిన కోచ్ అంకుశ్.. ఆ తర్వాత రూమ్కు రావాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు తెలిపింది.అతడు చెప్పినట్లు వినకపోయినా.. ఈ విషయం గురించి బయటకు చెప్పినా తన కెరీర్ నాశనం చేస్తానని.. కుటుంబాన్ని కూడా వదిలిపెట్టనని అతడు బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు సదరు మైనర్ షూటర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మహిళా పోలీస్ స్టేషన్లో మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అంకుశ్ భరద్వాజ్పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.విచారణ చేపట్టాముఈ విషయం గురించి ఫరీదాబాద్ పోలీసులు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటనపై విచారణ చేస్తున్నాము. ఘటన జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజీ, ఇతర వివరాలు ఇవ్వాల్సిందిగా హోటల్ అధికారులను అడిగాము’’ అని తెలిపారు. కాగా నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) నియమించిన 13 మంది జాతీయ కోచ్లలో అంకుశ్ ఒకడు.ఈ ఘటన నేపథ్యంలో NRAI సెక్రటరీ జనరల్ పవన్ కుమార్ సింగ్ స్పందిస్తూ.. ‘‘మీడియా ద్వారా మాకు ఈ విషయం తెలిసింది. విచారణ పూర్తయ్యేంతవరకు అంకుశ్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నాం. అతడికి ఇకపై ఎలాంటి పనులు అప్పగించబోము’’ అని తెలిపారు.కాగా ఘటన తర్వాత బాధితురాలు భయంతో హోటల్ వీడగా.. ఇంట్లో వాళ్లు ఆరా తీయడంతో విషయం మొత్తం వారికి చెప్పినట్లు సమాచారం. తనతో పాటు మరో మహిళా షూటర్ను కూడా అంకుశ్ ఇబ్బందిపెట్టాడని కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు అతడిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.చదవండి: భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం! -
సింధు శ్రమించి...
కౌలాలంపూర్: గాయం నుంచి కోలుకొని కొత్త సీజన్లో తొలి టోర్నీ ఆడుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గెలుపు బోణీ చేసింది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–14, 22–20తో సుంగ్ షువో యున్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ షట్లర్ ఆ తర్వాత తేరుకోవడం గమనార్హం. తొలి గేమ్లో 6–9తో వెనుకబడ్డ దశలో సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా 10 పాయింట్లు గెలిచి 16–9తో ఆధిక్యంలోకి దూసుకొచి్చంది. అదే జోరులో తొలి గేమ్ను దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో 3–5తో వెనుకబడ్డ సింధు ఆ తర్వాత కోలుకొని 15–11తో ఆధిక్యంలోకి వచి్చంది. ఈ తరుణంలో సుంగ్ షువో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి స్కోరును 15–15తో సమం చేసింది. ఆ తర్వాత స్కోరు 20–20 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 9వ ర్యాంకర్ టొమోకా మియజాకి (జపాన్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో ఇద్దరు 1–1తో సమంగా ఉన్నారు. సాత్విక్–చిరాగ్ జంట శుభారంభం పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ శుభారంభం చేయగా... హరిహరన్–అర్జున్ (భారత్) ద్వయం తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. సాత్విక్–చిరాగ్ జంట 21–13, 21–15తో లీ జె హుయ్–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. హరిహరన్–అర్జున్ జంట 10–21, 20–22తో హిరోకి మిదోరికావా–క్యొహీ యామíÙటా (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్లో భారత జోడీల కథ ముగిసింది. పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... కవిప్రియ సెల్వం–సిమ్రన్... రుతుపర్ణ–శ్వేతాపర్ణ పాండా జోడీలు తొలి రౌండ్లోనే ని్రష్కమించాయి. గాయత్రి–ట్రెసా 9–21, 23–21, 19–21తో ఫెబ్రియానా కుసుమ–మెలీసా (ఇండోనేసియా) చేతిలో... కవిప్రియ–సిమ్రన్ 12–21, 11–21తో యుకీ ఫకుషిమా–మయు మత్సుమోతో (జపాన్) చేతిలో... రుతుపర్ణ–శ్వేతాపర్ణ 11–21, 9–21తో టాన్ పియర్లీ–థినా మురళీధరన్ (మలేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. రుత్విక–రోహన్ జోడీ అవుట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలోనూ భారత జోడీల పోరాటం ముగిసింది. తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్)... అమృత–అశిత్ సూర్య... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జంటలు తొలి రౌండ్లోనే వెనుదిరిగాయి. రుత్విక–రోహన్ 10–21, 17–21తో జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా) చేతిలో... అమృత–అశిత్ 11–21, 9–21తో ఫువానత్–బెన్యాప (థాయ్లాండ్) చేతిలో... తనీషా–ధ్రువ్ 15–21, 21–18, 15–21తో ప్రెస్లీ–జెనీ గాయ్ (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్మనీ రూ. 675 కోట్లు
మెల్బోర్న్: ఈ సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో పోటీపడే టెన్నిస్ ప్లేయర్ల ప్రైజ్మనీ చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. టోర్నీ మొత్తం ప్రైజ్మనీ 111.5 మిలియన్ ఆసీస్ డాలర్లు. అంటే మన కరెన్సీలో అక్షరాల రూ. 675 కోట్లు. గత ఏడాది ప్రైజ్మనీ 96.5 మిలియన్ ఆసీస్ డాలర్ల (రూ.584 కోట్లు)తో పోల్చితే 16 శాతం పెరిగిందని టెన్నిస్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ క్రెయిగ్ టిలే వెల్లడించారు. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 4.15 మిలియన్ ఆసీస్ డాలర్లు (రూ.25.15 కోట్లు) చొప్పున అందజేస్తారు. సింగిల్స్ విజేతల ప్రైజ్మనీ ఏకంగా 19 శాతం పెంచారు. అలాగే మెయిన్ డ్రా ఆడే సింగిల్స్, డబుల్స్ ఆటగాళ్ల ప్రైజ్మనీ కూడా 10 శాతం మేర పెంచినట్లు నిర్వాహకులు ఆయన తెలిపారు. 2023 నుంచి టెన్నిస్ ప్లేయర్లకు ప్రోత్సాహకాలను భారీ పెంచుతున్నామని ఆయన చెప్పారు. ఈ నెల 18 నుంచి మెల్బోర్న్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ జరుగుతుంది. క్వార్టర్స్లో సాకేత్ జోడీ బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకెత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మంగళవారం సాకేత్ మైనేని–ఆదిల్ కల్యాణ్పూర్ జోడీ 7–6 (7/3), 4–6, 13–11తో సుమిత్ నగాల్ (భారత్)–లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా) ద్వయంపై పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్లో సాకేత్ జంట 3 ఏస్లు బాదగా... సుమిత్ నగాల్ ద్వయం 8 ఏస్లు సంధించింది. 3 డబుల్ ఫాల్ట్లు చేసిన సాకేత్–ఆదిల్ జోడీ... ఒక బ్రేక్ పాయింట్ సాధించింది. సాకేత్ జంట మొత్తం 78 పాయింట్లు గెలుచుకోగా... నగాల్ ద్వయం 69 పాయింట్లకు పరిమితమైంది. గురువారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో ఆర్థర్ రేమాండ్–లుకా సాంచెజ్ (ఫ్రాన్స్) ద్వయంతో... సాకేత్–ఆదిల్ జంట అమీతుమీ తేల్చుకోనుంది.


