ముగిసిన సింధు పోరాటం.. సెమీస్‌లో ఓట‌మి | PV Sindhus brilliant run ends after semi-final loss to Wang | Sakshi
Sakshi News home page

Malaysia Open: ముగిసిన సింధు పోరాటం.. సెమీస్‌లో ఓట‌మి

Jan 10 2026 5:25 PM | Updated on Jan 10 2026 6:14 PM

PV Sindhus brilliant run ends after semi-final loss to Wang

మలేషియా ఓపెన్-2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు ఓట‌మి పాలైంది. గాయం తర్వాత పునరాగమనం చేసిన సింధు సెమీఫైనల్ వరకు అద్భుతంగా ఆడింది. కానీ సెమీస్‌లో మాత్రం చైనాకు చెందిన వరల్డ్ నంబర్ 2 క్రీడాకారిణి వాంగ్ జియి నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది.

ఆమె చేతిలో 16-21, 15-21 తేడాతో సింధు ఓట‌మి చ‌విచూసింది. రెండో గేమ్‌లో సింధు 11-6తో ఆధిక్యంలో ఉన్న‌ప్ప‌టికి, వ‌రుస త‌ప్పిదాల వ‌ల్ల విజయాన్ని చేజార్చుకుంది. అంత‌కుముందు  సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఓట‌మిపాలైంది. ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్ - ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ జోడీ చేతిలో 10-21, 21-23తో ఈ భార‌త అగ్రశ్రేణి ద్వయం ఓట‌మి పాలైంది.
చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement