breaking news
Adilabad
-
బీజేపీ, బీఆర్ఎస్ అభివృద్ధి నిరోధక పార్టీలు
కై లాస్నగర్: బీజేపీ, బీఆర్ఎస్ అభివృద్ధి నిరోధక పార్టీలని, మున్సిపల్ ఎన్నికల్లో వాటికి తగిన బుద్ధి చెప్పాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆదిలాబాద్ వాసులను కోరారు. మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా జిల్లాకు వచ్చిన ఆయన పట్టణంలోని ఓ హోటల్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 12 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులం, మతం పేరిట రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందుతుందే తప్ప దేశంలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన బీఆర్ఎస్ పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలోని సుభాష్నగర్, రిక్షాకాలనీలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. -
పీఠంపై గురి
పులి కదలికలపై నిఘా భీంపూర్ మండల సరిహద్దు గ్రామాలైన తాంసి(కే), గొల్లఘాట్, గుంజాల, పిప్పల్కోటి శివారులో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అటవీశాఖ అధికారులు అప్రమత్తమై నిఘా పెంచారు.వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. రాత్రి వేళలో చలితీవ్రత తగ్గనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. సాక్షి, ఆదిలాబాద్: ఈ సారి మున్సిపల్ ఎన్నికలపై కాషాయ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాగైనా పీఠాన్ని కై వసం చేసుకోవాలని భావిస్తోంది. మెజార్టీ మార్క్ దాటుతామన్న ఆశాభావం ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గత మున్సిపల్ ఎన్నికల్లో కమలం పార్టీ 47 వార్డుల్లో పోటీ చేయగా, 11 చోట్ల గెలుపొందింది. ఈసారి అన్ని వార్డుల్లో బరిలో నిలవడంతో పాటు మెజార్టీ స్థానాలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పోలింగ్ బూత్ నుంచి.. పట్టణంలోని ఒక్కో వార్డులో మూడు నుంచి ఐదు వరకు పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక్కో బూత్కు కన్వీనర్ను కలుపుకొని, 15 మంది కార్యకర్తలతో ఆ పార్టీ కమిటీ రూపొందించింది. ఒక్కొక్కరు ఆ బూత్ పరిధిలోని ఐదు కుటుంబాలను ప్రతీ రోజు విజిట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, కాషాయం పార్టీని ఆదరిస్తే జరిగే లబ్ధిని వారికి తెలియజేయాలని పార్టీ సూచించింది. దానికి అనుగుణంగా కార్యకర్తలు తమకు కేటాయించిన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ.. పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని సీనియర్ నాయకులతో కలిపి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని 20 మందితో నియమించారు. ఈ కమిటీ రాష్ట్ర, జాతీయ పార్టీ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికను అమలు చేయాలి. మండలాల్లోని నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించుకుంటున్నారు. గ్రామ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ పదవుల్లో ఉన్న మండల సీనియర్ నాయకులకు పట్టణంలోని 49 వార్డులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. వారు పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు చేపట్టే కార్యాచరణ పరిశీలిస్తుండాలి. కార్పొరేటర్ల రాక.. మహారాష్ట్రలోని ముంబై, రాజస్థాన్లోని మున్సిపల్ కార్పొరేటర్లు ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని ఆయా వార్డులకు సూపర్వైజర్లుగా పరిశీలన చేస్తున్నారు. 8 మంది కార్పొరేటర్లకు వార్డులను విభజించి బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితిపై జాతీయ నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లా నాయకులతో సమీక్షించారు. జిల్లా నుంచి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఈ వీసీలో పాల్గొన్నారు. నిర్మల్లో అమిత్ షా పర్యటన ఉండగా, ఆదిలాబాద్ పట్టణానికి జాతీయ, రాష్ట్ర ముఖ్య నాయకులను ప్రచారానికి తీసుకువచ్చే విషయంలో ఈ వీడియో కాన్ఫరెన్స్లో చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకై తే జిల్లాకు రానున్న నాయకుల పర్యటనకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ ఖరారు కాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బలం పుంజుకునేలా కార్యాచరణ ఇప్పటివరకు చేపట్టిన కార్యాచరణతో పార్టీ 20కి పై గా వార్డుల్లో బలంగా ఉందని కాషాయ నేతలు అభిప్రాయ పడుతున్నారు. మరిన్ని వార్డుల్లోనూ పార్టీ పుంజుకునేలా కార్యాచరణను సిద్ధం చేసి అమలు చే సేలా ముందుకు సాగుతున్నామని చెబుతున్నారు. -
పట్టణంలో పల్లె నేతల సందడి
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో పల్లె నేతలు సందడి చేస్తున్నారు. ప్రచార పర్వం మొదలైనప్పటి నుంచి ఇక్కడే మకాం వేసిన సదరు నాయకులు ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించాయి. ఆయా పార్టీల తరఫున అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఆదిలాబాద్, బోఽథ్ నియోజకవర్గాల్లోని పల్లె నేతలకు ఇక్కడి ప్రచార బాధ్యతలు అప్పగించారు. జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్, మావల, తాంసి, తలమడుగు మండలాలకు చెందిన సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, పార్టీ పరమైన పదవుల్లో ఉన్న వారితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులను వార్డుల వారీగా ఇన్చార్జీలుగా నియమించారు. రంగంలోకి దిగిన సదరు నాయకులు తమకు కేటాయించిన వార్డులోని అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ వార్డులో చూసినా పల్లె ప్రాంత నాయకులే కనిపిస్తుండడం గమనార్హం. -
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
ఇచ్చోడ: గిరిజన విద్యార్థులు సాంకేతిక పరి జ్ఞానం పెంపొందించుకోవాలని మైండ్ స్పా ర్క్ కోఆర్టినేటర్ కిశోర్ అన్నారు. మండలంలోని రాయిగూడ ఆశ్రమ పాఠశాలలో సంస్థ ఆధ్వర్యంలో నలుగురు విద్యార్థులకు శుక్రవారం ఉచితంగా ల్యాప్టాప్లు అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన విద్యార్థుల్లో సాంకేతిక విద్య అభివృద్ధి కోసం సంస్థ పనిచేస్తుందన్నారు. ల్యాప్టాప్ లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఆత్రం భాస్కర్, పాఠశాల సిబ్బంది గజనంద్నాయ క్, శంభు తదితరులు పాల్గొన్నారు. -
ఆ పార్టీలన్నీ కుమ్మక్కయ్యాయి
● ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. మున్సిపల్ పరిధిలోని 5, 6, 7, 8 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన శుక్రవారం ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీలు కలిసి ఎంఐఎం అభ్యర్థిని చైర్పర్సన్ చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి పనులకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. తాను కృషి చేసిన ఫలితంగానే ఇటీవల కలెక్టర్ ఖాతాలో రూ. 109 కోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. విషయాన్ని పట్టణ ప్రజలు గమనించి, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి ప్రగతికి బాటలు వేయాలని కోరారు. ఆయన వెంట నాయకులు సాయి కృష్ణ, ధోని జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
వందశాతం పోలింగ్ నమోదు లక్ష్యం
క్రీడల్లో గెలుపోటములు సహజం ఆదిలాబాద్: క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు ఓటమిని చూసి కుంగిపోకుండా, గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎస్సీ బాల, బాలికల క్రీడా పోటీల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి సునీత కుమారి, అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కైలాస్నగర్: ఈ నెల 11న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా ప్రతి ఓటరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పట్ట ణంలోని భాగ్యనగర్లో శుక్రవారం నిర్వహించిన స్వీప్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రాంతినగర్ నుంచి హమాలీవాడ వరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆటపాటలతో అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రజలకు కర దీపికలు అందజేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు శక్తివంతమైన ఆయుధమన్నారు. సమస్యల పరి ష్కారం కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నా రు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురికాకుండా బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు. ఓటరు స్లిప్పుతో పాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారితో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్ అసెంబ్లీ స్థాయి సీఎం కప్ పోటీలు శుక్రవారం మండలంలోని చాందా (టి) ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఉత్సాహంగా సాగాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలతో దేహ దారుఢ్యం పెంపొంతుందన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో పోటీలు రసవత్తరంగా సాగాయి. కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, డీవైఎస్వో శ్రీనివాస్, ఎంపీడీవో వంశీకృష్ణ, సర్పంచ్ మంజుషా, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు
కైలాస్నగర్(బేల): జిల్లాలో మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బేల పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, వాహనాలను పరిశీలించారు. కేసు ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా సిబ్బంది కోసం నిర్మించిన విశ్రాంతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, మండలంలో అసాంఘిక కార్యకలా పాలు పూర్తిగా రూపుమాపాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ శ్రావణ్, బేల ఎస్సై ప్రవీణ్కుమార్, తదితరులున్నారు. -
‘సాక్షి’ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ
ఉట్నూర్రూరల్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు గురువారం మైనార్టీ గురుకులం, ఆశ్రమ క్రీడా పాఠశాల, జెడ్పీఎస్ఎస్ ఉట్నూర్, లక్కారం, బాలుర ఆశ్రమ పాఠశాల ఉట్నూర్, ఉర్దూ మీడియం పాఠశాలల్లో పదో తరగతి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. సర్క్యూలేషన్ డివిజన్ ఇన్చార్జి ఖాజామొయినొద్దీన్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్ను సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. మండల విద్యాధికారి ఆశన్న మాట్లాడుతూ.. ‘సాక్షి’ మీడియా గ్రూప్ పత్రికా రంగంలో రాణిస్తూ మరో వైపు విద్యార్థుల సౌకర్యార్థం పదో తరగతిలో మంచి మార్కులు సాధించేలా తోడ్పాటునందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సౌమ్యకు ఎకై ్సజ్ శాఖ నివాళి
ఆదిలాబాద్టౌన్: నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ సౌమ్యకు ఆ శాఖ అధికారులు గురువారం జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో నివాళులర్పించారు. ఆమె చి త్రపటానికి పూలమాలలు వేశారు. కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఎకై ్సజ్ అధికారి హిమశ్రీ, సీఐలు విజేందర్, గంగా రె డ్డి, అక్బర్ హుస్సేన్, మురళీకృష్ణ, టీఎన్జీవో నా యకుడు అరుణ్కుమార్, కానిస్టేబుళ్లున్నారు. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారులుఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ ప్రాంతంలో ప్రారంభించిన రైల్వే అండర్బ్రిడ్జి నిర్మాణ పనులపై పట్టణానికి చెందిన 25మంది వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ తరఫున న్యాయవాది వాదనలు వినిపించినట్లు పేర్కొన్నారు. భూసేకరణ చట్టం ప్రకా రం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా పనులు ప్రారంభించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నా పిటిషనర్లను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని కోర్టు సూచించినట్లు పేర్కొన్నారు. -
నిర్భయంగా ఓటు వేయాలి
ఆదిలాబాద్టౌన్: నిర్భయంగా ఓటుహక్కు విని యోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రంలో వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అక్రమంగా మద్యం, డబ్బు, బహుమతులు తరలించకుండా చర్యలు చేపట్టినట్లు పే ర్కొన్నారు. ఎలాంటి సమాచారమున్నా ‘డయల్ 100’కు తెలుపాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, అనుమ తి లేకుండా ర్యాలీ, సభలు నిర్వహించవద్దని తెలి పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, సీఐలు సునీల్కుమార్, నాగరాజు, ప్రణయ్కుమార్, ఎస్సైలు స్వామి, అశోక్, నాగనాథ్, రమ్య, విష్ణువర్ధన్, మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజార్షి షా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులకు శిక్షణ ఇవ్వగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో మైక్రో అ బ్జర్వర్లు, జోనల్ అధికారుల పాత్ర కీలకమని, ఎన్ని కల ప్రవర్తనా నియమావళిపై ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల పరిశీలకుడు హనుమంతు నాయక్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ నివేదికలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలి మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించనున్న అధి కారులు, సిబ్బంది ఈ నెల 6నుంచి 8వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవా లని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మున్సిపల్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన పట్టణంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఏర్పాట్ల గురించి అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఆయన వెంట సాధారణ పరిశీలకుడు హనుమంతు నాయక్, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారి ఫణిందర్రావు, మెప్మా పీడీ రాజు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్వేత తదితరులున్నారు. కాగా, బీఎల్వోలు కలెక్టర్ను క్యాంపు కార్యాలయంలో కలిసి పోల్ చీటీ అందజేశారు. వందశాతం ఓటింగ్ నమోదు కావాలి ఈ నెల 11న నిర్వహించన్నున మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు కావాలని కలెక్టర్ రాజార్షి షా సూచించారు. పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లా కేంద్రంలో స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీని ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ ఎస్టీయూ భవ న్కు చేరుకుంది. అక్కడ ఓటు ప్రాముఖ్యతను తెలి పేలా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందాలు ఆలపించిన చైతన్య గీతాలు ఆకట్టుకున్నా యి. స్వయంగా కలెక్టర్ ర్యాలీలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రజలంతా ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా, నిర్భయంగా ఓటేయాలని కోరా రు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు, స్వ చ్ఛంద సంస్థలు కృషి చేయాలని సూచించారు. అ నంతరం స్వీప్ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. ఓటుహక్కు వినియోగంపై ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీపీఆర్వో విష్ణువర్ధన్, మైనారిటీ సంక్షేమాధికారి ఖలీమ్, మెప్మా పీడీ సీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల నిరసన
ఆదిలాబాద్టౌన్: ఆస్తి తగాదాల విషయంలో తన అన్న నుంచి ప్రాణహానీ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని కారణంగా న్యాయవాది స్వప్న హత్యకు గురైందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ ఆరోపించారు. గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించి జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ ఎదుట నిరసన తెలిపారు. కోర్టు ఎదుట రహదారిపై రాస్తారోకో చేశారు. నిందితుడిని కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నగేశ్ మా ట్లాడుతూ.. న్యాయాన్ని రక్షించేవారికే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంజేశారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఆదిలాబాద్టౌన్: నిబంధనలు అతిక్రమించే డయాగ్నోస్టిక్ సెంటర్లపై కఠినచర్యలు తీసుకుంటామని జి ల్లా వైద్యారోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ హె చ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జగదాంబ, ఎస్వీ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కానింగ్ పరీక్షల కు వచ్చే గర్భిణుల పూర్తి వివరాలను రిజిస్టర్లలో న మోదు చేయాలని ఆదేశించారు. పీసీ పీఎన్డీటీ పో ర్టల్లో వివరాలు పొందుపర్చాలని సూచించారు. లింగ నిర్ధారణ చట్టరీత్యానేరమని హెచ్చరించారు. అడిషనల్ డీఎంహెచ్వో సాధన, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్, మాస్ మీడియా అధి కారి వెంకట్రెడ్డి, పోతన్న, రాంప్రసాద్ ఉన్నారు. -
కలప వినియోగిస్తే కఠినచర్యలు
నేరడిగొండ: అక్రమ కలప వినియోగిస్తే కఠినచర్యలు తప్పవని అటవీరేంజ్ అధికారి బెజ్జరం గణేశ్ హెచ్చరించారు. జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి చిన్న విశ్వనాథ్ బుసరెడ్డి ఆదేశాల మే రకు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పీచరా గ్రామంలో అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గృహ నిర్మాణాల్లో అనుమతి లేని అటవీ కలప వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా స్థానిక వడ్రంగుల వద్దకు వెళ్లి ప్రభుత్వ అనుమతి లేకుండా అటవీ కలపను వినియోగించకూడదని సూచించారు. అనంతరం పలువురు వడ్రంగులకు నోటీసులు జారీ చేశారు. ఆయన వెంట నేరడిగొండ అట వీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి లఖన్సింగ్, బీట్ అధికారి సచిన్, సిబ్బంది ఉన్నారు. -
● ప్రతీ వార్డుపై నిశితంగా ఫోకస్ ● సర్పంచులకు వార్డుల బాధ్యత ● విజయమే లక్ష్యంగా ముందుకు.. ● పీసీసీ ఆదేశాలకు అనుగుణంగా గాంధీ భవన్కు రోజువారీ నివేదిక
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని టీపీసీసీ క్షేత్రస్థాయిలో ప్రత్యేక టాస్క్ రూపొందించింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో నిశితంగా దృష్టి సారించేందుకు పార్టీ పెద్దలు వ్యూహరచన చేశారు. ప్రతీ వార్డులో జరిగే రోజువారీ పరిణామాలను పర్యవేక్షిస్తున్నారు. లోపాలున్నచోట దిద్దుబాటు చర్యలు తీసుకునేలా వడివడిగా కదులుతున్నారు. ఒక్కోవార్డు నుంచి మొత్తం మున్సిపాలిటీలోని పరిస్థితులను ఎ ప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రతీ అంశాన్ని పరిశీలిస్తూ పార్టీ అభ్యర్థులు, నాయకుల పనితీరుపై నిత్యం గాంధీభవన్కు నివేదిక తెప్పించుకునేలా మానిటరింగ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీ ఆదిలాబాద్లో ఎలా గైనా గెలిచేలా టీపీసీసీ అమలు చేస్తున్న టాస్క్ క్షేత్రస్థాయిలో పకడ్బందీగా కొనసాగుతోంది. స్కూల్లో విద్యార్థికిచ్చే హోంవర్క్లా ఈ టాస్క్ అమలవుతున్నట్లు కాంగ్రెస్ నాయకుడొకరు అభిప్రాయపడడం ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో గెలవాలని చెప్పడం కాకుండా పైనుంచే ప్రక్రియ ఇలా ఉండాలని, దాని కి అనుగుణంగా ప్రతీ స్థాయిలో నాయకులు కష్టపడాల్సిందేనని అధిష్టానం స్పష్టం చేసింది. ఈ విధంగా ఏ వార్డులోనైనా లోపాలుంటే.. ఏ విధంగా సరి దిద్దాలో కూడా అప్పటికప్పుడు పైనుంచి ఆదేశాలి స్తోంది. ఇందుకు అనుగుణంగా స్థానిక బాధ్యులు క్షే త్రస్థాయిలో ముందుకెళ్తున్నారు. ఇలా బల్దియా ఎ న్నికల్లో గెలుపే లక్ష్యంగా హస్తంబ్యాచ్ పనిచేస్తోంది. ప్రతీ వార్డుపై ప్రత్యేక దృష్టి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులుండగా, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచిన వారిలో కొంతమంది నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి ఒక్కొక్క వార్డుకు ఇన్చార్జిగా నియమించారు. వీరు ఆ వార్డులో జరిగే పరిణామాలను కింది స్థాయి వరకు గమనిస్తున్నారు. ప్రచారం నుంచి మొదలుకుంటే ఓటర్ల నాడీ గుర్తించేవరకు ఇలా అన్ని అంశాల్లో వీరు సూక్ష్మంగా దృష్టి సారిస్తున్నారు. సర్పంచులపై పర్యవేక్షణ కోసం ప్రతీ నాలు గైదు వార్డులకు కలిపి జిల్లా నాయకులను కో కోఆరి నేటర్లుగా నియమించారు. వీరిలో గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, అల్లూరి సంజీవ్రెడ్డి, మల్లెపూల నర్సయ్య, అడ్డి భోజా రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, గోక గణేశ్రెడ్డి, ముడుపు దా మోదర్రెడ్డి, బాలూరి గో వర్ధన్రెడ్డి, ఏలేటి అశ్విన్రెడ్డి, కుమ్రం కోటేశ్, బొ డ్డు గంగారెడ్డి, అశోక్రెడ్డి, బాబన్న, కొండ గంగాధర్, భూపెల్లి శ్రీధర్ ఉన్నా రు. వీరికి సబ్ కోఆర్డినేటర్లుగా మరి కొంతమందిని నియమించారు. వీ రందరిపై పర్యవేక్షణకు టీపీసీసీ నుంచి ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ను కోఆర్డినేటర్గా గురువారం నియమించారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా ఆయన ఆదిలాబాద్లోనే ఉండనున్నట్లు పార్టీ జిల్లా నాయకులు తెలిపారు. ఇక వీరందరి నుంచి వార్డుల వారీగా వచ్చే రిపోర్టులను డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ పరిశీలించి రోజువా రీగా గాంధీభవన్కు పంపిస్తారు. నేడు ఏఐసీసీ నేత రాకకాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉండగా, ఆమెకు సహాయకులుగా ప్రస్తుతం ఏఐసీసీ సెక్రటరీలుగా ఇద్దరు పని చేస్తున్నారు. వీరికి రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల పరిధిలోని మున్సిపాలిటీల బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు తమ పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితులపై పరిశీలన కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ రానున్నారు. 28 వార్డుల్లో బలంగా.. ప్రతీ స్థాయిలో సూక్ష్మంగా ఫోకస్ పెట్టి ఇప్పటివరకు 28వార్డుల్లో బలంగా ఉన్నట్లు డీసీసీ గాంధీ భవన్కు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. మిగతా వార్డుల్లోనూ లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్తే ఫలితం సాధిస్తామని అధిష్టానానికి తెలియజేసినట్లు కొంతమంది నాయకులు తెలిపారు. అధికార కాంగ్రెస్ ప్రతీ మున్సిపాలిటీలో గెలుపును సవాల్గా తీసుకుని ముందుకు కదులుతుండటం, అందులో భాగంగా టీపీసీసీ టాస్క్ ప్రకారం వెళ్తుండడంతో ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేది కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
బీసీలకు 70శాతం సీట్లు
కైలాస్నగర్: సామాజిక న్యాయమే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 70శాతం సీట్లు కేటాయించినట్లు డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాద వ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులకు గాను మహిళలకు 30 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. బీసీల్లోని అన్ని కులాలకు ప్రా తినిధ్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎ స్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సమన్యాయం న్యా యం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపా రు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి మున్సిపల్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ను ఆదరించాలని కోరారు. -
ఆమెనే నిర్ణేత..!
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నిర్ణయాధికారం అతివలదే. ఎన్నికల బరిలో నిలిచిన కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించడంలో వారే కీలకపాత్ర పోషించనున్నారు. పట్టణ పరిధిలో పురుష ఓ టర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉ న్నారు. అలాగే ము న్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూడా వారే అధిష్టించనున్నారు. ఇలా ఓట్లు.. సీట్లలోనూ మహిళల అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థుల తలరాతలను మార్చే శక్తిగల మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించారు. వారి అనుగ్రహం పొందేందుకు అవసరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. వారికి ప్రత్యేక తాయిలాలను ప్రకటిస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చైర్పర్సన్ పీఠమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచిన పలువురు మహిళా అభ్యర్థులు జనరల్ స్థానాల్లోనూ పోటీ చేస్తుండటం నారీ శక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. సీట్లలోనూ వారిదే అధిపత్యం ఓట్లలోనే కాదు.. సీట్లలోనూ మహిళల అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరి ధిలోని 49వార్డులకు గాను 23వార్డులను వారికే రిజ ర్వ్ చేశారు. ఆయా వార్డుల్లో మహిళలే పోటీ చేస్తున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల పరిధిలో మొ త్తం 314మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఇందులో అత్యధికంగా మహిళా అభ్యర్థులే ఉండటం ఆసక్తిని రేపుతోంది. సమాజంలో వస్తున్న మహిళా చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. మహిళలు 182.. పురుషులు 132 మహిళా అభ్యర్థులు అత్యధికంగా 182 మంది పోటీ చేస్తుండగా, పురుషులు 132 మంది మాత్రమే బరి లో ఉన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్థానం మహిళలకు రిజర్వ్ కావడంతో వారికి కేటాయించిన వార్డులతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలే పోటీ చేస్తున్నారు. చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న ప్రధాన పార్టీల ముఖ్య నేతలు జనరల్ స్థానాల్లో వారు పోటీ చేయకుండా తమ సతీమణులను బరిలో నిలిపారు. 27, 34, 48 వార్డులు జనరల్కు కేటాయించగా బీజేపీ తరఫున మహిళలు పోటీలో నిలిచారు. 2, 4, 18, 19, 49, 30 వార్డులు జనరల్కు రిజర్వ్ కాగా, కాంగ్రెస్ నేతలు తమ సతీమణులు, కుటుంబీకులను బరిలో నిలిపారు. 26, 27 వార్డుల్లో బీఆర్ఎస్ నేతలు తమ కుటుంబీకులను పోటీలో ఉంచారు. ఇలా రిజర్వ్డ్ స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కౌన్సిలర్గా విజయం సాఽధిస్తే చైర్మన్ పీఠాన్ని అఽధిరోహించవచ్చనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. నిర్ణయాధికారం ఆమెదే..ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మొత్తం 1,43,655 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 69,813 మంది ఉండగా, మహిళా ఓటర్లు 73,836 మంది ఉన్నారు. ఇతరులు మరో ఆరుగురున్నారు. అయితే, పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 4,023 మంది అధికంగా ఉన్నారు. ప్రతీ వార్డులోనూ మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ. ఆయా వార్డుల్లో పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించగల శక్తి వారికే ఉంది. మహిళా ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థి వైపు నిలబడుతారో వారే ఆ వార్డులో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశముంది. అభ్యర్థుల గెలుపోటములను శాసించే అఽధికారం మహిళా ఓటర్లకే ఉంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వారి ఓట్లు రాబట్టేందుకు పరితపిస్తున్నాయి. ఇందుకోసం అవసరమైన తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ప్రత్యేక బహుమతులను అందజేయడంతో పాటు తాము గెలిస్తే మహిళల కోసం కాలనీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని అభ్యర్థులు హామీలిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. -
విధుల నుంచి సీఆర్పీ తొలగింపు
ఆదిలాబాద్టౌన్: విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడాన్ని ప్రస్తావిస్తూ ‘ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సీఆర్పీ’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి డీఈవో ఎస్.రాజేశ్వర్ స్పందించారు. భీంపూర్ మండలం పిప్పల్కోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా పనిచేస్తున్న పి.రవీందర్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈవో సమర్పించిన నివేదిక ప్రకారం సదరు ఉద్యోగి ఓ రాజకీయ పార్టీలో చేరడమే కాకుండా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లుగా వివరించారు. -
ఆటల్లో గెలుపోటములు సహజం
ఆదిలాబాద్: ఆటల్లో గెలుపోటములు సహజమని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్, ఆర్చరీ ఫైనల్ పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడినవారు కృంగిపోకుండా క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకొని, విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతీ క్రీడాకారుడు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని సాధించే దిశగా పాటుపడడమే కాకుండా సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాలన్నారు. -
వేర్వేరు చోట్ల కలప పట్టివేత
ఇచ్చోడ: పోలీసు శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్ అక్రమంగా తరలిస్తున్న ఫర్నీచర్ను బుధవారం పట్టుకున్నట్లు సిరిచెల్మ టైగర్ జోన్ అటవీశాఖ అధికారి నాగవత్ స్వామి తెలిపారు. ఉట్నూర్ మండలంలోని వడోని గ్రామానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ దయానంద్ కలపతో తయారు చేసిన ఫర్నీచర్ను ఐచర్ వ్యాన్లో తరలిస్తుండగా నిర్మల్ జిల్లాలోని మొండిగుట్ట చెక్ పోస్టు వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. విచారణలో దయానంద్ అనే పోలీసు కానిస్టేబుల్ వాడోని గ్రామంలో అక్రమంగా టేకు చెట్లు నరికి ఫర్నీచర్ తయారుచేసి విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. దీంతో కానిస్టేబుల్ స్వగ్రామంలో తనిఖీలు నిర్వహించగా మరింత కలప లభ్యమైందన్నారు. తనిఖీల్లో దాదాపుగా రూ.2.5 లక్షల కలపను స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బోథ్: మండలంలోని నిగిని గ్రామ పరిధిలో బుధవారం రూ.22,268 విలువైన కలపను పట్టుకున్న ట్లు ఎఫ్ఆర్వో ప్రణయ్కుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన బొజ్జ సురేష్, మడావి బాపురావు ఇళ్లల్లో సోదాలు చేయగా కలప లభ్యమైనట్లు పేర్కొన్నారు. అక్రమంగా అటవీ ఉత్పత్తులను రవాణా చేస్తున్న షేక్ మొయిన్ వద్ద నుంచి రూ.2,479 విలు వైన కలపను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో అటవీ శాఖ సిబ్బంది అనిల్, గోవింద్, ఎఫ్ఎస్వో ముమ్తాజ్, నాగోరావు పాల్గొన్నారు. తలమడుగు: మండలంలోని కుచులాపూర్లో బుధవారం కలప పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన రమేశ్ ఇంట్లో తనిఖీ చేయగా రూ.50 వేల విలువైన కలప లభ్యమైందన్నారు. కలపను స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ గులాబ్సింగ్, ఆర్ఓ ప్రమోద్ కుమార్, బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్, శరత్రెడ్డి, పాల్గొన్నారు. గుడిహత్నూర్: మండలంలోని ముత్నూర్లో బుధవారం అక్రమంగా నిల్వఉంచిన రూ.20 వేల విలుౖ వెన కలపను స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఎఫ్ఎస్వో ఇమ్రాన్, ఎఫ్బీవోలు ప్రశాంత్, విశ్వజిత్ ముత్నూర్ గ్రామానికి చెందిన గాటాడే దశరథ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కలప దుంగలు లభ్యం కావడంతో స్వాధీనం చేసుకొని ఇచ్చోడ టింబర్ డిపోకు తరలించి దశరథ్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
పొర్లు దండాలతో పోడు రైతు నిరసన
ఖానాపూర్: అటవీశాఖ అధికారులు తన ఎడ్ల జతను నిర్భందించడాన్ని నిరసిస్తూ మండలంలోని తర్లపాడుకు చెందిన పోడు రైతు భూమన్న బుధవారం పట్టణంలోని పాత బస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి అటవీ శాఖ కార్యాలయం వరకు పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపాడు. కొన్ని దశాబ్దాలుగా సాగులో ఉన్న తన భూమిలో అట వీశాఖ అధికారులు జేసీబీతో గుంతలు తవ్వి మొక్కలు నాటడంతో పాటు అక్రమంగా పోడుభూమి సా గు చేసుకుంటున్నానని తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. గత నెల 21న తీసుకువచ్చిన ఎడ్లను ఇప్పటికీ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. -
గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యం
నెన్నెల: మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన పాటి, బోగంపల్లిలకు రోడ్డు నిర్మాణంతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి కిషన్ అన్నారు. ఎంపీడీవో అబ్దుల్హైతో కలిసి బుధవారం గ్రామాలను సందర్శించారు. అక్కడి ప్రజలు ఈ నెల 2న కలెక్టర్ కుమార్దీపక్ను కలిసి రోడ్డు నిర్మించాలని, గిరివికాస్ బోర్లకు కరెంట్ కనెక్షన్లు, సాగులో ఉన్న వారికి పోడు పట్టాలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గ్రామాలను సందర్శించిన అధికారులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిర్మాణం, గిరివికాస్ బోర్లకు కరెంట్ కనెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉపాధిహామీ పనుల్లో హాజరుశాతం పెంచాలని సూచించారు. వారి వెంట మన్నెగూడం సర్పంచ్ బానోతు మధుకర్, ఏపీఓ నరేష్, గిరిజన నాయకులు కొడిపె శంకర్ తదితరులు ఉన్నారు. -
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
సాత్నాల: యువత మాదక ద్రవ్యాలకు దూరం ఉండాలని జైనథ్ సీఐ శ్రావణ్ అన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా బుధవారం బేల మండలంలోని సైద్పూర్లో కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 30 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని 12 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. సీఐ మా ట్లాడుతూ ప్రజలు, యువత గుడుంబా, గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల ని సూచించారు. మహిళలను గౌరవించాలని, గృహహింస చర్యలకు పాల్పడవద్దన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, బేల ఎస్సై ఎల్.ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మో.. బూచోళ్లు..!
దారి తప్పుతున్న బాల్యం మైనర్లు లైంగికదాడులు, నేరాలకు పాల్పడడం ఆందోళన కలిగించే అంశం. నేరాలు పెరగడానికి కుటుంబ విలువలు పడిపోవడం, మానవత్వం విలువలు తెలియకపోవడం కారణాలుగా మారుతున్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లోని తాత, నానమ్మ, అమ్మమ్మ ఎదుగుతున్న పిల్లలకు విలువలు తెలియజేసేవారు. మారుతున్న జీవనశైలీలో పాశ్చాత్య, యాంత్రీక జీవన విధానంతో పిల్లలకు మంచీ చెడు చెప్పేవారు కరువయ్యారు. ఆలోచనలు పరిమితమై అవగాహన కోసం ఆస్పత్రులు, పాఠశాలలపై ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎదుగుతున్న మగపిల్లలకు మంచీ చెడు వివరించే వారు లేక మైనర్లుగా ఉన్నప్పటి నుంచే నేరాలకు పాల్పడుతున్నారని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల చింతలమానెపల్లి మండలంలో అఘాయిత్యానికి పాల్పడిన బాలుడు(16) దారి తప్పి జులాయిగా తిరుగుతున్నట్లు తెలిసింది. ఎదిగే పిల్లల ఆలనాపాలన చూడాల్సిన తల్లిదండ్రులు వృత్తి, ఉద్యోగాల నిర్వహణలో వారిని పట్టించుకోకుండా ప్రోగ్రెస్ రిపోర్టు పరిశీలించి సరిపెట్టడంతో ఇతర విషయాలకు ప్రభావితం అవుతున్నారు. 14 నుంచి 16ఏళ్లలోనే మద్యం, మత్తు పదార్థాల వ్యసనాలకు లోనై నేరాలకు పాల్పడుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై అవగాహన అవసరం పిల్లల భద్రత అత్యంత కీలకమైన అంశంగా మారింది. లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండేందుకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్పై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 202420232022చిన్నారులపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై అవగాహన లేకపోవడం, ప్రలోభాల ఆశచూపి లైంగికదాడులకు పాల్పడడం అవగాహన లేమిని సూచిస్తున్నాయి. మరోవైపు మైనర్ బాలురు అఘాయిత్యాలకు పాల్పడడం భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇటీవల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలో ఓ మైనర్ బాలుడు బయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు రూ.10 ఆశచూపి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత ఏడాది ఏప్రిల్లో దహెగాం మండలంలోని ఓ గ్రామంలో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. తల్లిదండ్రులు, సమాజం చిన్నారుల భద్రతపై సరైన చర్యలు తీసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. – చింతలమానెపల్లికుమురంభీం జిల్లాలో పోక్సో కేసుల వివరాలు మైనర్లు అయినా చట్టాలు కఠినమే.. చట్టం ప్రకారం 18ఏళ్లలోపు వారిని మైనర్లుగా పరిగణిస్తారు. కానీ తీవ్రమైన నేరాలకు పాల్పడిన సందర్భంలో చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవు. గతంలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో పోక్సో వంటి కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరాలకు పాల్పడితే బాలుడికి 16 సంవత్సరాలు ఉన్నప్పటికీ అడల్ట్గానే గుర్తిస్తారు. దీని ప్రకారమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. -
బాలురకు సైతం అవగాహన కల్పించాలి
బాలికలు, అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పిస్తున్నాం. దీంతోపాటు తప్పుగా ప్రవర్తిస్తే జరిగే పరిణామాలను బాలురు, అబ్బాయిలకు సైతం వివరిస్తున్నాం. అదుపు తప్పి ప్రవర్తిస్తే చట్ట ప్రకారం తీసుకునే చర్యలు, శిక్షలను బాలురకు తగిన వయసులో వివరించాలి. మైనర్లు అయినా నేరాలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయి. – బూర్ల మహేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి పిల్లలపై పర్యవేక్షణ ఉండాలి నేటి పరిస్థితుల్లో చిన్నారులకు అన్ని విషయాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో బాలికలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో మానసిక నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాని లైంగిక దాడుల బారిన పడకుండా తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎవరితో ఉన్నారు అనే విషయంలోనూ స్పష్టత ఉండాలి. ఇంటి చుట్టుపక్కల వివాదాస్పద, మత్తు వ్యసనాలకు లోనైన వ్యక్తులు ఉంటే వారి వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి. డబ్బులు, బహుమతులు వంటి వాటికి ప్రలో భాలకు గురికాకుండా పిల్లలు, టీనేజీ అమ్మాయిలకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ కుటుంబాల్లో చాలామంది పిల్లలను ఇంటి వద్దే ఉంచి తల్లిదండ్రులు పనులకు వెళ్తుంటారు. ఇలాంటి సందర్భాలలో అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తగిన బాధ్యత కలిగిన వారి పర్యవేక్షణలో చిన్నారులు ఉంటే ఇలాంటి అనర్థాలు జరగకుండా చూడవచ్చు. – కవిత అజయ్, మానసిక వైద్య నిపుణులు -
బదిలీపై వెళ్తున్న అధికారికి సన్మానం
జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో ఏజీఎం ఫైనాన్స్గా విధులు నిర్వర్తిస్తున్న మురళీధర్ కార్పొరేట్ ఏరియాకు బదిలీ అయ్యారు. బుధవారం అడ్మిన్ భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్టీపీపీ జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్ ఆయనను శాలువాలతో సత్కరించారు. మురళీధర్ ఎస్టీపీపీకి అందించిన సేవలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీఎంవోఐ ప్రెసిడెంట్ పంతుల, డీజీఎంలు అజాజుల్ల ఖాన్, శివ ప్రసాద్, వేణు గోపాల్, పర్సనల్ డీజీఎం కిరణ్ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
దండేపల్లి: ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మంచిర్యాలలో నిర్వహించిన సబ్ జూనియర్ వాలీబాల్ ఎంపిక పో టీల్లో దండేపల్లి మండలం రెబ్బనపల్లి జెడ్పీ ఉ న్నత పాఠశాల విద్యార్థులు వినయ్, అక్షిత, ప్ర సన్న అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఎంఈవో, పాఠశాల హెచ్ఎం మంత్రి రాజు తెలిపారు. ఈ నెల 5 నుంచి ని జామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. సదరు వి ద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. కోలిండియా హాకీ పోటీలకు ఎంపిక శ్రీరాంపూర్: కోలిండియా హాకీ పోటీలకు ఎంపికై న సింగరేణి జట్టులో శ్రీరాంపూర్ క్రీడాకారులకు చోటు దక్కింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బి లాస్పూర్లో ఈ నెల 4, 5 తేదీల్లో జరుగనున్న కోలిండియా హాకీ పోటీలకు ఎస్సార్పీ ఓసీపీకి చెందిన ఈపీ ఆపరేటర్ తోట సురేశ్, సెక్యూరిటీగార్డులు ఈర్ల సదయ్య, అగ్గి నాగరాజు, జీ నరేందర్ (కోల్ కట్టర్, ఆర్కే 7), బెల్లం తిరుపతి (జనరల్ అసిస్టెంట్, ఎస్సార్పీ ఓసీపీ), జీ. శ్రీకాంత్(ఎంవీ డ్రైవర్, ఐకే ఓసీపీ), ఎల్.రాజేశ్(కోల్ కట్టర్, ఆర్కే 7) ఎంపికయ్యారు. రైల్వేస్టేషన్లో మైనర్ బాలిక గుర్తింపుఆదిలాబాద్: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పదిహేనేళ్ల మైనర్ బాలికను జీఆర్పీ పోలీసులు బుధవారం గుర్తించారు. మధ్యాహ్నం సమయంలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో తిరుగుతున్న బాలికను పోలీసులు గుర్తించి వివరాలు అడగగా హైదరాబాద్లోని సురారం, గండిమైసమ్మ ప్రాంతానికి చెందినట్లుగా గుర్తించారు. అనంతరం పునరావాసం కోసం జిల్లా చైల్డ్ హెల్ప్లైన్ అధికారులకు అప్పగించినట్లు తెలి పారు. బాలికను గుర్తించిన జీఆర్పీ పోలీసులు టి.ప్రభాకర్, భగవాండ్లు, కె.ప్రవీణ్ కుమార్ను పలువురు రైల్వే సిబ్బంది అభినందించారు. కోతుల దాడిలో మహిళకు గాయాలుబాసర: బాసర ఆలయంలో ఎన్ఎంఆర్గా విధులు నిర్వహిస్తున్న గోదావరిపై బుధవారం కోతులు దాడి చేశాయి. ఆలయ పరిసరాలు శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా కోతులు దాడి చేయడంతో సదరు మహిళకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాసర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సదరు మహిళపై కోతులు దాడి చేయడం ఇది రెండోసారి. ఆలయ పరిసరాల్లోంచి కోతులను తరలించాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
ఇంద్రవెల్లి: విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై సాయన్న తెలిపిన వివరాల మేరకు మండలంలోని దనోరా(బి) గ్రామానికి చెందిన మదురే అక్షయ్ (30), అదే గ్రామానికి చెందిన పసరే ఆకాష్ గౌరపూర్ శివారులోని ఓ రైతు వ్యవసాయ చేనులో బెల్టుషాపు ఏర్పాటు చేస్తున్నారు. దుకాణానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు 11 కేవీ వైర్లకు కొండీల ద్వారా విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకాష్ సమాచారంతో గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బాసర గోదావరిలో మృతదేహం లభ్యంబాసర: బాసర గోదావరిలో యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. తానూర్ మండలంలోని దాగా గ్రామానికి చెందిన పీకలకర్ బాలాజీ (34) మద్యానికి బానిసై మానసిక స్థితి కోల్పోయాడు. ఈనెల 1న ఇంటినుంచి బయటకు వెళ్ళి తిరిగిరాలేదు. బుధవారం గోదావరినదిలో మృతదేహం గుర్తించిన స్థానికులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని సోదరుడు భోజన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
బుల్డోజర్ పాలనను తిరస్కరించాలి
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను ఆదరించి బుల్డోజర్ పాలనను తిరస్కరించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జిలకు బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు భూమిపూజ పేరిట నాటకాలు ఆడుతున్నారే తప్పా వారికి దానిపై చిత్తశుద్ధి లేదన్నారు. దీనిపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానని తెలిపారు. ఆదిలాబాద్కు మనమే అసలైన ఆదిల్గా ఉండాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ టికెట్ చివరి నిమిషంలో చేజారిన తౌఫిక్ అహ్మద్తో పాటు పలువురు వివిధ పార్టీల నుంచి ఎంపీ సమక్షంలో ఎంఐఎంలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 11 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు విశ్వ గురువుగా చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడికి ఎందుకు భయపడుతున్నారని ఒవైసీ ప్రశ్నించారు. రష్యా నుంచి ఆయిల్ కొనవద్దని ట్రంప్ చెప్పడంతో మోదీ అంగీకరించి కొనుగోళ్లను ఆపారన్నారు. బీసీ బిడ్డగా చెప్పుకునే మోదీ బీసీలకు అన్యాయం చేసేలా యూజీసీ చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో దేశానికి నష్టమే తప్పా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. 11 ఏళ్ల మోదీ పాలనలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ మెహరాజ్ హుస్సేన్, హైదరాబాద్ కార్పొరేటర్ సలీమ్ బేగ్, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, సయ్యద్ అత్తు తదితరులు పాల్గొన్నారు. నేడు పట్టణంలో రోడ్షోఎంఐఎం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా గురువారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జిల్లా కేంద్రంలో రోడ్షో నిర్వహించనున్నారు. -
వామ్మో పులి!
తాంసి: జిల్లాను మళ్లీ పులి భయం పట్టుకుంది. ఏ టా తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పెన్గంగ దా టి ఇక్కడికి బెబ్బులి రావడం ఆనవాయితీగా మా రింది. రెండు నెలల క్రితమే వచ్చి వెళ్లిన టైగర్ తా జాగా మళ్లీ ఇక్కడ పంజా విసరుతోంది. రెండు రో జుల క్రితం భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి స మీపంలో ఓ పశువుపై దాడి చేసి హతమార్చిన ఘ టన తెలిసిందే. దీంతో నది పరీవాహక, అటవీ స మీప గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు చేలకు వెళ్లాలంటే వణికిపోతున్నా రు. పులి ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని పశువులకాపరులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షం కిత్రమే వచ్చినట్లుగా అనుమానం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి పెన్గంగ దాటి జిల్లాలోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. పక్షం రోజుల క్రితమే వచ్చినట్లుగా అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా భీంపూర్ మండలంలోని పెన్గంగ నదికి అనుకుని ఉన్న తాంసి(కె), గొల్లఘాట్, గుంజాల, పిప్పల్కోటి శివారులో సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. గొల్లఘాట్ శివారులో పంటచేలో మేత కోసం వెళ్లిన ఎద్దుపై దాడి చేసి హతమార్చిన క్రమంలో విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. పులి దాడిలోనే ఆ పశువు మృతి చెందినట్లుగా అటవీ అధికారులు సైతం నిర్ధారించారు. ఆనవాళ్లు గుర్తించే పనిలో సిబ్బంది రెండు రోజుల క్రితం పులి దాడిలో హతమైన ఎద్దు కళేబరాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు, సిబ్బంది బెబ్బులి ఆనవాళ్లు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం పలు ప్రాంతాలను పరిశీలించారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పులి కదలికలపై నిఘా పెంచారు. పలుచోట్ల కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం భీంపూర్ మండలంలోని గుంజాల, గొల్లఘాట్, తాంసి(కె) గ్రామాల శివారులో పులి సంచరిస్తున్నందున ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. డీఎఫ్వో ఆదేశాల మేరకు రెండు బృందాలతో పాటు పులి కదలికలను గుర్తించేందు కోసం 10 కెమెరాలు సైతం ఏర్పాటు చేశాం. బాధిత రైతుకు త్వరలోనే పరిహారం అందించేలా చర్యలు చేపడుతున్నాం. – గులాబ్సింగ్, ఎఫ్ఆర్వో, ఆదిలాబాద్ -
పాతికేళ్లు నిండని వారు..
ఏడు పదులు దాటిన వారుకై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో యువతరంతో పాటు వయో వృద్ధులు సైతం నిలవడం ఆసక్తి కలిగిస్తోంది. పాతికేళ్లు సైతం నిండని వారి నుంచి ఏడు పదులు దాటిన వారు కూడా కౌన్సిలర్గా పోటీ పడుతున్నారు. వీరిలో అత్యధికులు 40 ఏళ్లలోపు వారే ఉండటం రాజకీయాలపై యువతలో వస్తున్న చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రధానంగా బీజేపీ యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి టికెట్లను కేటాయించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తరఫున ఒకటి, రెండు వార్డుల్లో యువత పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి పలువురు యువకులు టికెట్లు ఆశించి నామినేషన్లు వేశారు. అయితే ఆయా పార్టీల తరఫున అభ్యర్థిత్వం దక్కకపోవడంతో ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వృద్ధ అభ్యర్థులు సైతం యువతతో పోటీ పడుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా పాత, కొత్తతరం అభ్యర్థుల ప్రచారంతో పుర రాజకీయ వేడెక్కింది. 65 ఏళ్లు దాటిన వారు కూడా ఎన్నికల బరిలో నిలువడం రాజకీయాలపై వారికున్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. అభ్యర్థులు 61–7051–60 31–40 41–50 23–2570–75 -
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
కై లాస్నగర్/ఆదిలాబాద్రూరల్: ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మాజన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జిల్లా కేంద్రంతో పాటు మావల పోలీస్స్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో బుధవారం ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదన్నారు. అక్రమ మద్యం, నగదు, బహుమతుల తరలింపు, పంపిణీ వంటి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు తెలుపాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాగేలా అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమాల్లో ట్రెయినీ ఐపీఎస్ రాహుల్ కాంత్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీఐలు స్వామి, బి.సునీల్ కుమార్, కె.నాగరాజు, ప్రేమ్ కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, మధు కృష్ణ, రాజశేఖర్, రిజర్వ్ సిబ్బంది రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ్లాగ్మార్చ్లో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్ -
వార్కవాయిని జీపీగా ఏర్పాటు చేయాలి
నార్నూర్: గాదిగూడ మండలంలోని వార్కవాయి గ్రామ కేంద్రంగా నూతన పంచాయతీ ఏర్పాటు చేయాలని నాలుగు గ్రామాల ప్రజలు బుధవారం ప్రత్యేక సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల పటేళ్లు మాట్లాడుతూ వార్కవాయి, కౌటాల, లింగుగూడ, బొజ్జుగూడ గ్రామాలు కలిసి మొత్తం 665 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలకు గ్రామాలు దూరంగా ఉండడంతో సరైన పాలన అందడం లేదని అన్నారు. అలాగే మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. చిన్న చిన్న పనులకు కోసం దూరంగా ఉన్న పంచాయతీలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం ఎంపీ నగేశ్తో పాటు స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ రాజర్షిషాను కలిసి వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో గ్రామ పటేళ్లు ఆత్రం నాగోరావు, కుడ్మెత అమృత్రావు, చంపత్రావు, పంద్ర మారోతితో పాటు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. బహుముఖ పోటీకై లాస్నగర్: మున్సి పల్ ఎన్నికల్లో భా గంగా పలు వార్డులో బహుముఖ పో టీ నెలకొంది. పట్ట ణంలోని 49 వార్డులకు గాను 314 మంది బరిలో నిలి చారు. ప్రధాన పార్టీ లైన బీజేపీ, కాంగ్రెస్ అన్ని వార్డుల్లో పోటీలో నిలువగా.. బీఆర్ఎస్ మాత్రం 12వ వార్డు మినహా అన్నిచోట్ల అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రతీ వార్డులో ఒకరిద్దరూ ఇండిపెండెంట్లు సైతం పోటీలో నిలిచారు. అత్యధికంగా 7వ వార్డు కేఆర్కే కాలనీలో 14 మంది బరిలో ఉన్నారు. పదో వార్డులో సరిగ్గా పది మంది పోటీ చేస్తున్నారు. 12వ వార్డు న్యూహౌసింగ్బోర్డు, 20వ వార్డు తాటిగూడలో త్రిముఖ పోటీ నెలకొంది. అన్ని వార్డుల్లోనూ ప్రచారపర్వం ఊపందుకుంది. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలింగ్ అధికారుల రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం నిర్వహించారు. కలెక్టరేట్లో కలెక్టర్ రాజర్షి షా, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. మున్సిపల్ పరిధిలోని 216 పోలింగ్ కేంద్రాలకు ర్యాండమైజేషన్ ద్వారా టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి పీవో, ఏపీవో, ముగ్గురు పోలింగ్ అధికారులతో కూడిన బృందాన్ని నియమించారు. మరో 15 శాతం అధికారుల ను రిజర్వ్లో ఉంచినట్లుగా కలెక్టర్ తెలిపారు. తుది విడత ర్యాండమైజేషన్ను ఈనెల 9న నిర్వహించనున్నారు.కార్యక్రమంలోమున్సిపల్ కమిషనర్ జి.రా జు, నోడల్ అధికారులుఫణిందర్రావుపాల్గొన్నారు. ఎన్నికల నియమావళిపై అవగాహన అవసరం ఎన్నికల నియమావళిపై అభ్యర్థులకు అవగాహన అవసరమని సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఎ న్నికల ప్రవర్తన నియమావళి, వ్యయ నియంత్రణ పై కౌన్సిలర్ అభ్యర్థులు, ఏజెంట్లకు బుధవారం అ వగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌన్సిలర్ అభ్యర్థుల ఎన్నిక ల వ్యయం రూ.లక్షకు మించొద్దన్నారు. ఖర్చుల వి వరాలునిర్ణీతప్రొఫార్మాలో పొందుపరచాలన్నారు. -
తొమ్మిది సార్లు ఎన్నికలు.. ఒక్కరే మహిళా చైర్పర్సన్
కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలి టీ 1952లో ఆవిర్భవించింది. 46 ఏళ్ల పాటు గ్రేడ్–2గా ప్రజలకు సేవలందించింది. 1998లో గ్రేడ్–1 అప్ గ్రేడ్ అయింది. ఇప్పటి వరకు మొత్తం తొ మ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి. 14 మంది చైర్మన్లుగా సేవలందించారు. అయితే కేవలం ఒకే ఒక్క మహిళ చైర్పర్సన్గా పనిచేశారు. 2014లో నిర్వహించిన ఎన్నికల్లో మున్సిపల్ పీఠం మహిళలకు కేటాయించారు. దీంతో పట్టణంలోని 48వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేసిన రంగినేని మనీషా విజయం సాధించి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 3.7.2014 నుంచి 2.7.2019వరకు బాధ్యతల్లో కొనసాగారు. మరుసటి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున టికెట్ దక్కకపోవడంతో పోటీకి దూరమయ్యారు. తాజాగా నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్బ్లాక్ పార్టీ తరఫున ప్రత్యేక ప్యానెల్తో ఆమె బరిలోకి దిగుతున్నారు. మరోసారి అదే వార్డు నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రజల ముందుకు వెళుతున్నారు. -
రహదారి నిబంధనలు పాటించాలి
ఆదిలాబాద్టౌన్: వాహనదారులు తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అరైవ్– అలైవ్ కార్యక్రమంలో భాగంగా 84 మంది డ్రైవర్లకు మంగళవారం ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడుపొవద్దన్నారు. అలాగే ఓవర్లోడింగ్, రాంగ్రూట్ డ్రైవ్, ర్యాష్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ చేయవద్దని సూచించారు. అతివేగంతోనే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే సీజ్ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
అటవీశాఖ విస్తృత తనిఖీలు
ఆదిలాబాద్టౌన్: అటవీశాఖ అధికారులు మంగళవారం జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కలప అక్రమ దందా సాగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ ‘రక్షకులే.. భక్షకులా’ శీర్షికనన మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈమేరకు జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ స్పందించారు. జిల్లాలోని తొమ్మిది రేంజ్ల పరిధిలో తనిఖీలకు ఆదేశించారు. తదనుగుణంగా రంగంలోకి దిగిన ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందిరమ్మ గృహాలు, ఆయా గ్రామాల్లోని కార్పేంటర్ల నివాసాలు, కొత్తగా నిర్మిస్తున్న ప్రైవేట్ ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇచ్చోడ రేంజ్ పరిధిలోని నవేగాం, బజార్హత్నూర్ మండలంలోని మంజరాం తండా, మావల మండలంలోని వాగాపూర్ తదితర గ్రామాల్లో తనిఖీలు చేశారు. నవేగాంవ్లో ఐదుగురిపై, వాగాపూర్లో ముగ్గురిపై, బజార్హత్నూర్లో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. రూ.2లక్షల విలువ గల కలపను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇంద్రవెల్లి రేంజ్ పరిధిలో వడ్గాంవ్, గుడిహత్నూర్ మండలంలోని మాన్కాపూర్ గ్రామాల్లో తనిఖీలు చేశారు. ఆదిలాబాద్ రేంజ్ పరిధిలో కుచులాపూర్లో తనిఖీలు నిర్వహించి రూ.50వేల విలువ గల కలపను పట్టుకుని పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో ఇచ్చోడ, ఆదిలాబాద్, ఇంద్రవెల్లి రేంజ్ల ఎఫ్ఆర్వోలు పుండలిక్, రాథోడ్ గులాబ్సింగ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. రెబల్ ఎవరూ లేరని, కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందంతో ఉన్నాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్లో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి తర్వాత నిర్మల్లో జరిగిన బహిరంగ సభలో బాసరలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆయన పూటకోమాట మాట్లాడున్నారని విమర్శించారు. అలాగే జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరైనప్పటికీ దాని ఊ సే లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి హిందుత్వం గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఇజ్జగిరి నారాయణ, పండ్ల శ్రీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీల వారీగా ప్రచార రథాలు..
అభ్యర్థులు తమ వార్డుల్లో ప్రచార ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఆయా వార్డుల్లో పర్యటించి ఓట ర్లను కలిసేందుకు అనువుగా ప్రచార రథాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. బీజేపీ నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి, సీనియర్ నేతలు గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిలు వార్డుల్లో పర్యటించి తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్నా.. మీవోడినే
సాక్షి,ఆదిలాబాద్: ‘అన్నా.. నమస్తే, అవ్వా.. బాగున్నావా, అక్కా.. మీ తమ్మున్ని మరువద్దు.. ఆపద సంపదకు వచ్చేటోన్ని.. మన గుర్తు తెలుసు కదా..’ ప్రస్తుతం ఏ గల్లీలో చూసినా మున్సిపల్ అభ్యర్థుల నుంచి వినిపిస్తున్న మాటలివి. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడమే ఆలస్యం.. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అనుచరగణంతో ప్రచారంలోకి దిగిపోయారు. సమయం ఆరు రోజులే ఉండడంతో వార్డును కనీసం ఒకటి రెండు సార్లయినా చుట్టేయాలని భావిస్తున్నారు. ప్రధాన పార్టీల ప్రచార రథాలు రోడ్డెక్కాశాయి. ప్రచార పర్వంలోకి.. అభ్యర్థులను పార్టీలు ఖరారు చేయడం, మిగతా వారిలో కొంత మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడం, అనేక మంది బరిలో ఉండటం, స్వతంత్రులకు గుర్తులు కేటాయించడం వంటివి మంగళవారం వరకు జరిగాయి. సమయం తక్కువగా ఉండడంతో కొందరు అభ్యర్థులు తమ గుర్తు ఆధారంగా ఫ్లెక్సీలు, ప్రచార వాహనాలను సిద్ధం చేసుకుని రంగంలోకి దిగేశారు. మరికొందరు నేటి నుంచి షురూ చేయనున్నారు. దీంతో ఒక్కసారిగా పుర పోరు వేడెక్కింది. రాష్ట్ర నేతలు కూడా.. ఎంఐఎం పార్టీ ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డులలో పోటీ చేస్తుండగా, ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రచారానికి వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలో రోడ్షో, సభ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు ప్రచారం కోసం రాష్ట్ర నేతలు వచ్చేది ఖరారు కాకపోయినప్పటికీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్చార్జి సుదర్శన్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి తాహెర్బిన్ హందాన్ ప్రచారంలో పాల్గొననున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బీజేపీకి సంబంధించి ముఖ్యనేతల ఆదిలాబాద్ పర్యటన ఇప్పటివరకు ఖరారు కాలేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ పడ్నవీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఆదిలాబాద్కు తీసుకొచ్చే ప్రయత్నంలో పార్టీ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జోగు రామన్న పూర్తిస్థాయిలో వార్డుల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. -
బరిలో 314 మంది
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. 155 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో కలిపి 314 మంది బరిలో మిగిలారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఉదయం 11గంటల నుంచి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున టికెట్లను ఆశిస్తూ పలువురు నామినేషన్లు వేశారు. అయితే టికెట్ దక్కకపోవడంతో కొందరు ఉపసంహరించుకున్నారు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు వారితో బుజ్జగింపులు, మంతనాలు జరిపారు. దీంతో కొంతమంది అభ్యర్థులతో కలిసి వచ్చి విత్ డ్రా చేసుకున్నారు. 24వ వార్డుకు చెందిన వర్షాజోషి అనే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకునేందుకు తన భర్త విజయ్కుమార్తో కలిసి వచ్చారు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో చేసేదిలేక నిరాశతో వెనుదిరిగారు. అనంతరం అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ చేపట్టారు. జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలతో పాటు ఇతర గుర్తింపు పొందిన పార్టీలను ఒక కేటగిరీలో చేర్చారు. వార్డుల వారీగా అభ్యర్థులను లోపలకు పిలుస్తూ అక్షరక్రమం ప్రకారం గుర్తులను కేటాయించారు. ఇండిపెండెంట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన 76 రకాల గుర్తుల్లో నామినేషన్లో వారు ఎంపిక చేసుకున్న గుర్తులను కేటాయించారు. ఈ ప్రక్రియ రాత్రి 10గంటల వరకు కొనసాగింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు మినహా ఇతరులెవరనీ లోపలికి అనుమతించలేదు. ఆర్వోలతో కలెక్టర్ సమీక్ష నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా ఉదయం నుంచి రాత్రి వరకు టీటీడీసీలోనే ఉన్నారు. ఉపసంహరణ ప్రక్రియ తీరును పరిశీలించారు. 17 మంది రిటర్నింగ్ అధి కారులతో సమావేశమై గుర్తుల కేటాయింపు ప్రక్రియపై పలు సూచనలు చేశారు. రాత్రి వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, మున్సిపల్ కమిషనర్ జి.రాజు, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎక్స్ అఫిషియో’కు ఆప్షన్లు స్వీకరించాలి
కై లాస్నగర్: మున్సిపల్ ఎక్స్ అఫిషియో సభ్యుల ఎంపిక కోసం తక్షణమే నోటీసులు జారీ చేసి, ఆప్ష న్లు స్వీకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చై ర్మన్ ఎన్నికల ప్రక్రియపై సోమవారం ఆయా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పరోక్ష విధానంలో జరుగుతుందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్ అఫిషియో హోదాలో ఏదో ఒక మున్సిపాలిటీని ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 11నుంచి 14 మధ్య ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేసి వారి ప్రాతినిధ్యాన్ని ఖరారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, సాధారణ ఎన్నికల పరిశీలకులు డి.హనుమంత్ నాయక్, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, ఎస్. రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ జి.రాజు, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, అధికారులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ బీ–ఫాంలు అందజేత
సాక్షి,ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. కౌన్సిలర్ స్థానాల కో సం ప్రధాన, ఇతర పార్టీలతో పాటు స్వతంత్రులు గా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నేటితో ఉపసంహరణ గడువు ముగియనుండడంతో ఇక అభ్యర్థులెవరో తేలనుంది. ప్రధాన పార్టీలకు రెబ ల్స్ బెడద తప్పదా.. ఇతర పార్టీలు ఎన్ని వార్డుల్లో పోటీ చేస్తాయి.. ఇండిపెండెంట్లు ఎంత మంది బరి లో ఉంటారు.. ఇలా అన్ని అంశాలపై నేడు స్పష్టత రానుంది. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మంగళవారం నిర్వహించే ఈ ఘట్టంపై రాజకీయ పార్టీలతో పాటు పట్టణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. జిల్లాలో ఏకై క మున్సిపాలిటీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జనవరి 27న రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో ఏకై క మున్సిపాలిటీ ఆదిలాబాద్లోని 49 వార్డుల కౌన్సిలర్ల ఎన్నిక కోసం 28న నోటిఫికేషన్ జారీ కావడం, అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. 30న ఈ ఘట్టం ముగిసింది. ఆ తర్వాత వాటి పరిశీలన, అర్హులైన అభ్యర్థుల ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం సో మవారం వరకు కొనసాగాయి. 776 నామినేషన్లు రాగా, 4 తిరస్కరణకు గురయ్యాయి. బీఆర్ఎస్ నుంచి 1, ఎంఐఎం నుంచి ఇప్పటివరకు రెండు నామినేషన్లు ఉపసంహరించుకోవడం జరిగింది. అభ్యర్థుల విషయంలో కొలిక్కి.. ఆయా వార్డుల నుంచి అధికార కాంగ్రెస్ తరఫున ఏ కంగా 266నామినేషన్లు వచ్చాయి. ఒక్కోవార్డు నుంచి సగటున ఐదు మందికి పైగా పోటీకి దిగారు. దీంతో పార్టీ అభ్యర్థిగా ఎవరిని బలపర్చడం, అసంతృప్తుల్ని బుజ్జగించడం, రానున్న రోజుల్లో లబ్ధి చేకూర్చుతామనే విషయాలు చెబుతూ ఈరెండు మూడు రోజుల్లో ముఖ్యనేతలు ప్రక్రియ చేపట్టారు. అయితే సోమవారం వరకు హస్తం పార్టీ నుంచి ఒక్క నామి నేషన్ కూడా ఉపసంహరణకు గురికాలేదు. పార్టీ పరంగా పోటీ చేసే అభ్యర్థుల బి–ఫామ్లను జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, పార్టీ పరిశీలకులు తాహెర్ బిన్ హందాన్లు సోమవారం ఎన్నికల అధికారికి అందజేశారు. అభ్యర్థుల పేర్లను మాత్రం విడుదల చేయలేదు. ఇక మంగళవారం ఈ పార్టీ నుంచి నామినేషన్లు వేసిన వారిలో ఎంత మంది ఉపసంహరించుకుంటారు.. అభ్యర్థి ఎవరనేది స్పష్టం కానుంది. బీఆర్ఎస్ నుంచి 135, బీజేపీ నుంచి 128 నామినేషన్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు మంగళవారమే అభ్యర్థులకు బి–ఫామ్లు అందించనున్నాయి. దీంతో ఈ మూడు పార్టీల నుంచి అభ్యర్థులెవరనేది నేడు స్పష్టం కానుంది. ఇక ఏఐఎఫ్బీ, జనసేన, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం నుంచి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారనేది కూడా తేలనుంది. రెబల్స్ బెడద తప్పదా.. అన్ని పార్టీలకు రెబల్స్ బెడద తప్పేటట్టు కనబడటం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ తలనొప్పి అధికంగా ఉండనుంది. ఆయా వార్డుల్లో ఈ పార్టీ నుంచి పలువురు బరిలో నిలవడంతో ముఖ్య నేతలు వారిని తప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఇప్పటివరకు ఫలితం కనిపించ లేదు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా ఒక్కొక్క వార్డు నుంచి కనీసంగా ఇద్దరు ముగ్గురు బరిలో నిలవడంతో ఆ పార్టీలు కూడా అసంతృప్తుల్ని బు జ్జగించే పనుల్లో నిమగ్నమయ్యాయి. అ యితే ఇప్పటివరకు ఎలాంటి ఫలితం రా లేదు. మంగళవారం ఎలాంటి పరిణా మాలు చోటుచేసుకుంటాయో చూడాల్సిందే. మొత్తంగా ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల హీట్ మరింత పెరిగింది.కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులెవరనే దానిపై ఉత్కంఠ దాదాపు వీడింది. పట్టణంలోని 49 వార్డులకు ఆ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది. టికెట్ ఖరారైన వారికి ఆ పార్టీ నాయకులు స్వయంగా ఫోన్ చేసి సమాచారం అందించి ప్రచారం ప్రారంభించాలని సూచించారు. వారి పేర్లను అధికారికంగా ప్రకటించనప్పటికీ బీ–ఫాంలను మాత్రం అధికారులకు అందజేశారు. ఉర్దూ అకాడమీ చైర్మన్, జిల్లా పరిశీలకులు తాహెర్బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జీ కంది శ్రీనివాసరెడ్డిలు సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ నుంచి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. నేరుగా టీటీడీసీకి వచ్చిన సదరు నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కలిసి వార్డుల వారీగా బీ–ఫాం వివరాలు సమర్పించారు. అయితే ఆ వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు. టికెట్ దక్కని వారు ఆందోళనకు దిగే అవకాశముందని భావించి వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నామినేషన్లు వేసిన అభ్యర్థులను బుజ్జగించే పని ముమ్మరం చేశారు. వీలైనంత మందిని బరి నుంచి తప్పించాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన మంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. కోఆప్షన్, డీసీసీబీ డైరెక్టర్, నామినేటెడ్, పార్టీ జిల్లా కార్యవర్గ పోస్టులను కేటాయిస్తామంటూ వారికి నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. నామినేషన్లు ఉపసహరించుకుంటే పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బాధ్యతలను నియోజకవర్గ ముఖ్యనేతలకు అప్పగించారు. అయితే ఇందులో ఎంతమంది వెనక్కి తగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ లైన్కు కట్టుబడి పనిచేయాలని, అందుకు వ్యతిరేకంగా వెళ్లేవారిని ఏమాత్రం ఉపేక్షించకుండా తగు చర్యలు తీసుకుంటామని తాహెర్బిన్ హందాన్ స్పష్టం చేశారు. టికెట్లు ఆశించడం తప్పేమి కాదని అయితే సర్వేలు, గెలుపు అవకాశాలు, సామాజికవర్గాలు ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి కేటాయించామన్నారు. దక్కని అభ్యర్థులు నిరాశ చెందకుండా పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలని కోరారు. వారికి కూడా న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు. మంగళవారం మీడియా సమావేశంలో అధికారికంగా వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మాజీ కౌన్సిలర్లకు నిరాశ..? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ కౌన్సిలర్లు కలాల్ శ్రీనివాస్, బండారి సతీశ్కు పార్టీ టికెట్ దక్కనట్లుగా తెలుస్తోంది. అలాగే పిట్టలవాడ, టీచర్స్కాలనీలో దాదాపు అభ్యర్థిత్వం ఖరైనట్లుగా ప్రచారాన్ని సైతం ప్రారంభించిన ఆశావహులకు సైతం టికెట్లను నిరాకరించినట్లు సమాచారం. పలు వార్డుల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన అభ్యర్థులకు పార్టీ టికెట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. కాగా అభ్యర్థిత్వం దక్కని వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వారు పోటీ నుంచి తప్పుకుంటారా లేక ఇండిపెండెట్లుగా బరిలో నిలుస్తారా అనేదానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశముంది. పార్టీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు టికెట్లు ఖరారైన నేపథ్యంలో అవి దక్కని అభ్యర్థులు ఆందోళనకు దిగే అవకాశమున్న నేపథ్యంలో పోలీ సులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ జిల్లా కార్యాలయం, నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం, నివాసం వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. -
రక్షకులే.. భక్షకులా!
ఆదిలాబాద్టౌన్: కంచే చేను మేసిన చందంగా మారింది అటవీశాఖ తీరు. ప్రభుత్వం అడవుల సంరక్షణ కోసం ఏటా అనేక కార్యక్రమాలు చేపడుతోంది.. లక్షల్లో మొక్కలు నాటుతోంది.. నిధులు సైతం భారీగా వెచ్చిస్తోంది. అయితే ఆ శాఖాధికారులు, ఉద్యోగుల ఉదాసీన వైఖరితో భారీ వృక్షాలు, చెట్లు స్మగ్లర్ల దాటికి నేలకొరుగుతున్నాయి. కలప అక్రమంగా తరలిపోతున్నా ‘మామూలు’గా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనలే నిదర్శనం. చిన్న చిన్న కారణాలకే సిబ్బందికి మెమోలు జారీ చేయడం, సస్పెండ్ చేసే అధికారులు లక్షల విలువైన కలప పట్టుబడ్డా అందుకు బాధ్యులైన వారిపై చర్యలకు వెనుకాడడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. గతనెల చివరి వారంలో గుడిహత్నూర్ మండలంలోని చింతగూడ, బజార్హత్నూర్ మండలంలోని భూతాయిలో అక్రమంగా నరికివేసిన లక్షల విలువైన కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. చింతగూడలో పంట చేలతో పాటు అడవిలో ఉన్న చెట్లను నరికి కొంత మంది ఇళ్లలో నిల్వ ఉంచారు. అయితే సిబ్బందికి ఇంట్లో కలప ఉందనే సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఒకరిద్దరిని పట్టుకొని ఇందుకు సంబంధించి రూ.2లక్షల వరకు జరిమానా చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో కలపను దాచిపెట్టుకున్న వారు కొందరు తాము ఒక్కరే కాదని, గ్రామంలో చాలామంది ఉన్నారని తెలిపారు. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో అక్కడ జరిగిన తంతును వారు ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో జిల్లా అధికారి వెంటనే స్పందించి ఎఫ్డీవోతో పాటు ఎఫ్ఆర్వోలు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు అంతా పదుల సంఖ్యలో అక్కడికి వెళ్లారు. ఆ రోజు రాత్రి 7 నుంచి 12 గంటల వరకు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. రెండు ట్రాక్టర్ల లోడ్ను పట్టుకున్నారు. మరుసటి రోజు ఓ ఎఫ్ఆర్తో పాటు మరికొంత మంది సిబ్బంది తనిఖీలు చేయగా, మరో ట్రాక్టర్ కలప లభించింది. తనిఖీలు నిర్వహిస్తే మరింత లభ్యమవుతుందని పలువురు చెబుతున్నారు. అయితే విషయాన్ని అటవీ శాఖాధికారులు బయట పెట్టకుండా దాచి ఉంచినట్లు సమాచారం. తర్వాత బజార్హత్నూర్ మండలంలోని భూతాయిలో సైతం ఓ కార్పెంటర్ వద్ద లక్షల విలువైన కలప పట్టుకున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి తొమ్మిది మందిపై కేసులు నమోదు చేయగా, నలుగురిని రిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎఫ్బీవోలతో పాటు ఆ రేంజ్కు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది పాత్రపై అనుమానాలు.. ఈ అక్రమ కలప దందా వెనుక సిబ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్షల జీతాలు తీసుకుంటున్న అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లకుండా రోడ్డుపైనే తిరిగి అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడవిని కాపాడేందుకే ఎఫ్బీవోలు, సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, ఎఫ్ఆర్వోలు ఉన్నారు. అయితే వీరు కార్యాలయానికే పరిమితం కాగా, మరికొంత మంది ఎక్కడుంటున్నారనే విషయం కూడా తెలియడం లేదు. హెడ్క్వార్టర్లోనే ఉండాల్సిన సిబ్బంది అక్కడ ఉండకపోవడంతో కలప స్మగ్లింగ్ జరుగుతుందనే ఆరోపణలున్నాయి. వీరి ఫోన్కాల్స్ డిటేల్స్, బ్యాంక్ అకౌంట్స్ పరిశీలిస్తే ఈ తతంగం బయట పడుతుందని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. కొంత మంది కార్పెంటర్లతో పాటు కలప స్మగ్లర్లతో సత్సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. వీరికి ముట్టజెబితే విడిచిపెడుతున్నారని, చిన్నపాటి కలప పట్టుబడితే అమాయకులపై కేసులు పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల నిర్వహణలో పీవోల పాత్ర కీలకం
కైలాస్నగర్: ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. ఎన్నికల నిర్వహణపై సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో పీవో, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్ని కలు నిర్వహించాలన్నారు. ఈసీ మార్గదర్శకాలను విధిగా పాటించాలని సూచించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫాం–12 అందజేయాలన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తామని తెలిపారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితాను తప్పనిసరిగా పోలింగ్ కేంద్రం వద్ద ప్రదర్శించాలన్నారు. ఏజెంట్ల సంతకాలు సేకరించాలని సూచించారు. మధ్యాహ్నం 2 తర్వాత ఎవరినీ విధుల నుంచి రిలీ వ్ చేయవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్ని కల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారులు మనోహర్, ఫణిందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంతో లాభాలు ఆదిలాబాద్టౌన్: రైతులు రసాయన ఎరువులకు స్వస్తి పలికి, లాభదాయకమైన ప్రకృతి సాగు వైపు మళ్లాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాల యం, వ్యవసాయ, ఉద్యానశాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ప్రకృతి వ్యవసాయం’పై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఎంపిక చేసిన 20 క్లస్టర్లలోని 2,500 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంతో భూసారం పెరగడమే కాకుండా, పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని వివరించారు. ఈ సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ఎకరాకు ఏడాదికి రూ.4వేల చొప్పు న ప్రోత్సాహకం అందుతుందని, మహిళా సంఘాల ద్వారా బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటుకు రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్న ట్లు చెప్పారు. అనంతరం శిక్షణ బ్రోచర్ను ఆవి ష్కరించారు. అంతకుముందు కళాశాల ప్రాంగణంలో ఉద్యాన పంటల సాగును పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, జిల్లా పశు వైద్యశాల అధికారి రామారావు, ఆత్మ పీడీ రామ్కిషన్, ఏవో శివకుమార్, వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీధర్, రఘువీర్, మల్లేశ్, వైస్ప్రిన్సిపాల్ ప్రభావతి, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
శేషజీవితం ఆనందంగా గడపాలి
ఆదిలాబాద్టౌన్: శేషజీవితాన్ని కుటుంబ స భ్యులతో ఆనందంగా గడపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులకు స్థానిక పోలీసు కార్యాలయంలో సోమవారం సన్మాన కార్యక్రమం ని ర్వహించారు. ఉద్యోగ విరమణ పొందిన న లుగురు అధికారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో వారు అందించిన సేవలను కొని యాడారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో ఇచ్చోడ ఏఎస్సై జె.భూమన్న, తలమడుగు హె డ్కానిస్టేబుల్ ప్రభాకర్, సిరికొండ హెడ్కానిస్టేబుల్ నందులాల్, మావల కానిస్టేబుల్ అసదు ల్లా ఖాన్ ఉన్నారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, వెంకటేశ్వర్లు, కవిత పాల్గొన్నారు. -
ఇంటర్ ప్రాక్టికల్స్ షురూ
ఆదిలాబాద్టౌన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 16 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు డీఐఈ వో జాదవ్ గణేశ్కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మ ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వర కు రెండు సెషన్లలో నిర్వహించారు. ఉదయం జనరల్ విభాగంలో 941 మందికి గాను 856 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 605 మందికిగాను 578 మంది హాజరైనట్లు పే ర్కొన్నారు. మధ్యాహ్నం న్విహించిన పరీక్షకు జనరల్ విద్యార్థులు 947 మందికి గాను 889 మంది హాజరు కాగా, 58 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పలు పరీక్ష కేంద్రాలను డీఐఈవోతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేశారు. -
దత్తపుత్రుడి తల్లిదండ్రుల కోసం డెన్మార్క్ దంపతుల అన్వేషణ
ఆదిలాబాద్ జిల్లా: డెన్మార్క్కు చెందిన దంపతులు తమ దత్తపుత్రుడి తల్లిదండ్రుల కోసం ఆదిలాబాద్ జిల్లాలో అన్వేషిస్తున్నారు. ఇంద్రవెల్లి మండలం దొడందా పంచాయతీ పరిధిలోని చిలటిగూడ, గట్టెపల్లి పంచాయతీ పరిధిలోని టెకిడిగూడ గ్రామాలను ఆదివారం సందర్శించారు. ఆడాప్టి రైట్స్ కౌన్సిల్ (ఏఆర్సీ) సంస్థ ప్రతినిధి, ముంబయికి చెందిన హైకోర్టు అడ్వొకేట్ అంజలి దత్తత తల్లిదండ్రులు చెప్పిన మాటలను హిందీలో అనువాదం చేసి ఆదివాసీలకు అర్థమయ్యేలా తెలిపారు.2016లో రెండు నెలల బాలుడిని గుర్తు తెలియని దంపతులు ఆదిలాబాద్ రిమ్స్లో వదిలేసి వెళ్లారని, ఆ బాలుడిని గుర్తించిన శిశు సంక్షేమ శాఖ అధికారులు శిశుగృహలో సంరక్షించినట్లు పేర్కొన్నారు. 2018లో డెన్మార్క్కు చెందిన లూయిస్–రాస్ముస్ దంపతులు చట్టబద్ధంగా ఆ చిన్నారిని దత్తత తీసుకుని అర్జున్గా నామకరణం చేసి సంరక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం బాలుడి వయస్సు పదేళ్లు. అయితే బాలుడి సొంత తల్లిదండ్రుల జాడ కోసం వారిని ప్రశ్నించడంతో ఆచూకీ కోసం ఆదిలాబాద్కు వచ్చినట్లు దత్తత తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో పలు గ్రామాల్లో పర్యటిస్తున్నామని వారు పేర్కొన్నారు. బాలుడికి పుట్టుకతో చేతివేళ్లు లేవని తెలిపారు. కన్నవారు గుర్తించి వస్తే వారి పరిస్థితి బట్టి ఆర్థికసాయం కూడా చేస్తామని పేర్కొన్నారు. అలాగే వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని సంస్థ నిర్వాహకురాలు అంజలి తెలిపారు. వారి వెంట సర్పంచ్ పవార్ చాంగోనా, సీడబ్ల్యూసీ సభ్యులు మీర్జా యాకుబ్బేగ్ తదితరులున్నారు. పెంచిన ప్రేమ డెన్మార్క్ది.. పేగు బంధం ఆదిలాబాద్ది! -
● నిరాశపరిచిన నిర్మలమ్మ పద్దు ● జిల్లాకు నిధుల కేటాయింపులో అస్పష్టత ● ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో నైరాశ్యం ● టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుపై చిగురించిన ఆశలు
ఆదిలాబాద్టౌన్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లావాసులను ఊరించి.. ఉసూరుమనిపించినట్లు అయింది. జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. వేతన జీవులకు ఆదాయ పన్ను యథాతథంగా అమలు చేస్తామని ప్రకటించడం వారిలో నిరాశ నింపింది. బాలిక వసతిగృహాల మంజూరు ప్రకటన, క్యాన్సర్, మధుమేహ బాధితులు వాడే మందుల ధరలు తగ్గిస్తామని పేర్కొనడం కొంత ఊరటనిచ్చే అంశం. ఎరువులకు సంబంధించి రాయితీ ప్రకటించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రస్తావన రావడం కొంత ఊరట కలిగించే విషయమే. జిల్లాలో అధిక శాతం పత్తి సాగు చేస్తుండడంతో ఇక్కడ టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు చే కూరనుంది. విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రభుత్వపరంగా విద్యా ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది. కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నా రు. డాటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రత్యేకించి ప్రస్తావన లేకపోవడం.. జిల్లాకు సంబంధించిన నిధుల విషయంలో ప్రత్యేకించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో జిల్లా వాసుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి 700 ఎకరాల భూసేకరణ చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో సైతం జారీ అయింది. అయితే దీనికి నిధులు విడుదలవుతాయని జిల్లా వాసులు భావించినప్పటికీ నిరాశే మిగిలింది. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్కు మరోసారి మొండి చెయ్యి తప్పలేదు. వైద్య ఆరోగ్యానికి ప్రాధాన్యం.. ఆరోగ్య రంగానికి మాత్రం పెద్దపీట వేశారు. 17 రకాల ఔషధాలపై పన్నులు తగ్గించడం దీర్ఘకాల వ్యాధులతో బాధపడే రోగులకు భారీ ఉపశమనంగా చెప్పవచ్చు. దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు దివ్యాంజల్ కౌశల్ యోజన పథకానికి నిధులు కేటాయించారు. అలాగే ఆయుర్వేద ఆస్పత్రులను ప్రోత్సహించడంతో జిల్లా వాసులకు మేలు చేకూరనుంది. రాష్ట్ర హక్కులను హరించేలా ఉంది.. కేంద్ర బడ్జెట్ రాష్ట్ర హక్కులను హరించేలా ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేశారు. రాష్ట్రం నుంచి వాటాగా పన్నులు తీసుకుంటున్న కేంద్రం బడ్జెట్లో ఏ రంగానికి సరైన నిధులు కేటాయించకపోవడం కేంద్ర వివక్షతకు అద్దం పడుతుంది. – డాక్టర్ నరేశ్ జాదవ్, డీసీసీ అధ్యక్షుడు తెలంగాణకు గుండుసున్నా తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే కేంద్రం మరోసారి రాష్ట్రానికి కేటాయింపుల్లో గుండుసన్నానే మిగిల్చింది. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకి అనేందుకు ఈ బడ్జెట్ నిదర్శనం. పక్షపాత వైఖరిని అవలంభిస్తున్న ఆ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలు ఇప్పటికై నా గ్రహించాలి. – జోగు రామన్న, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు -
నేటి నుంచి ప్రాక్టికల్స్
ఆదిలాబాద్టౌన్: ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలు సోమవారం నుంచి షురూ కానున్నాయి. ఈ మేరకు ఆ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ సారి ఈ ప్రాక్టికల్స్ నిఘా నీడలో జరగనున్నాయి. 11వ తేదీ వరకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 8,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లాలో.. జిల్లాలో 40 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సీసీ నిఘాలో నిర్వహించాలని ఇంటర్బోర్డు నిర్ణయించింది. దీంతో అధికారులు ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాలుగు ల్యాబ్లతో పాటు వరండా, పరీక్షకు సంబంధించిన మార్కులు ఆన్లైన్లో పొందుపరిచే గదిలో వాటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 13 ప్రభుత్వ, 18 ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు రెండు ట్రైబల్ వెల్ఫేర్, మూడు కేజీబీవీలను జనరల్ విద్యార్థుల కోసం కేంద్రాలను కేటాయించారు. ఇందులో నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాల్లో ఒకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీల్లో ఒకేషనల్ విద్యార్థులకు మాత్రమే పరీక్షలు జరగనున్నాయి. సాంఘిక సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ, బీసీ, మోడల్ స్కూల్, కేజీబీవీలకు సంబంధించిన విద్యార్థులు వారి కేంద్రాల్లో కాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. జనరల్ విద్యార్థుల కోసం 29 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో బైపీసీ విద్యార్థులు 3,475 మంది, ఎంపీసీ విద్యార్థులు 2,673 కలిపి 6,148 మంది హాజరు కానున్నారు. ఒకేషనల్ విద్యార్థులు 1,893 మంది 11 కేంద్రాల్లో హాజరు కానున్నారు. మొత్తం 8,041 మంది పరీక్షలు రాయనున్నారు. రెండు విడతల్లో ఈ ప్రాక్టికల్స్ పరీక్షలు రెండు విడతల్లో కొనసాగనున్నాయి. ఈనెల 2 నుంచి 6 వరకు మొదటి విడత, 7 నుంచి 11వరకు రెండో విడత నిర్వహించనున్నారు. రెసిడెన్షియల్, కేజీబీవీల్లో చదివే విద్యార్థుల కోసం బాలికల జూనియర్ కళాశాలల్లో,బాలుర కో సం ప్రభుత్వ బాలుర జూనియర్కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాపీయింగ్ జరగకుండా ఈ పరీక్షల్లో కాపీయింగ్ జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. అలాగే డీఈసీ మెంబర్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయనున్నారు. అబ్జర్వర్లుగా ఇతర కళాశాలలకు చెందిన లెక్చరర్లు వ్యవహరించనున్నారు. సీసీ కెమెరాలను ఇంటర్మీడియెట్ బోర్డుతో పాటు డీఐఈవో కార్యాలయానికి అనుసంధానం చేసినట్లు అధికారులు వివరించారు.పకడ్బందీగా నిర్వహిస్తాం ప్రాక్టికల్స్ను పకడ్బందీగా నిర్వహిస్తాం. నిర్ణీత సమయానికి పరీక్షలు ప్రారంభించాలి. లెక్చరర్లు వాల్యూయేషన్ను నిస్పక్షపాతంగా చేపట్టాలి. ఈనెల 11 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఆయా కేంద్రాల నిర్వాహకులు ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకొని పరీక్షలు నిర్వహించాలి. ఎగ్జామినర్లకు వచ్చిన ఓటీపీని ఇతరులకు పంపవద్దు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే 08732–297115 నంబర్లో సంప్రదించాలి. విద్యార్థులు ఆయా కేంద్రాలకు సమయానికి చేరుకోవాలి. పరీక్షలు సజావుగా జరిగేలా సహకరించాలి. – జాదవ్ గణేశ్కుమార్, డీఐఈవో -
ఏఐఎఫ్బీలో పలువురి చేరిక
ఆదిలాబాద్టౌన్: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)లో పలువురు చేరారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలోని కేఆర్కే కాలనీలో పార్టీ ఆధ్వర్యంలో ఆది వారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. టైగర్ గ్రూప్నకు సంబంధించిన సభ్యులతో పాటు పలువురు కాలనీవాసులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎఫ్బీ అభ్యర్థులను సింహం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తమ పార్టీ ప్రజల ప్రయోజనాలు, మార్పు కోసం అడుగులు వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారంజక బడ్జెట్..
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉంది. అన్నివర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు చేశారు. ప్రధానంగా విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రయోజనం చేకూర్చేందుకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గించడం ఊరటనిస్తుంది. – గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ అంకెల గారెడీ.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారెడీ తప్పా ఎలాంటి ప్రయోజనం లేదు. పేద, సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్లో ఎలాంటి మేలు చేకూరలేదు. జిల్లాకు సంబంధించిన అభివృద్ధి, ప్రాజెక్టులకు నిధులు వస్తాయని భావించినప్పటికీ ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ప్రతీ బడ్జెట్లోనూ విస్మరించడంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. – అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా.. కేంద్రం ప్రకటించిన వార్షిక బడ్జెట్ అన్నివర్గాల ప్రజల ఆమోదయోగ్యంగా ఉంది. రూరల్ డెవలప్మెంట్, మౌలిక వసతులు, సంక్షేమ రంగాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం హర్షణీయం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. రైతులు, దళిత, ఆదివాసీ సమూహాలకు సంక్షేమ ఫలాలు అందనున్నాయి. ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం కేంద్రం కృషి చేస్తుందనడానికి ఈ బడ్జెట్ నిదర్శనం. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే -
భీమన్న దేవుడికి పూజలు
నేరడిగొండ: మండలంలోని బుగ్గారం గ్రామంలో నిర్వహించిన భీమన్న జాతరకు బోథ్ ఎ మ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్ కృష్ణ నాయక్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు. నాగమల్యాల్లో ఊరేగింపు.. మండలంలోని నాగమల్యాల్ గ్రామంలో నా యకపోడ్ భీమన్న దేవుడి ఊరేగింపును గ్రా మస్తులు ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. వీధులన్నీ భీమన్న నామస్మరణతో మార్మోగాయి. సర్పంచ్ గోడం నందిని అమృత్, ఉప సర్పంచ్ గంగారెడ్డి, గంగారాం, హనుమంతు, హనుమడ్లు, గంగన్న తదితరులు పాల్గొన్నారు. -
ఖరారైన కాంగ్రెస్ అభ్యర్థులు
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా ఖరారైంది. వార్డుల వారీగా ఎంపిక చేసిన వారి పేర్లను సోమవారం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రా ష్ట్రంలో హస్తం పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సీపీఐతో ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనుంది. పట్టణంలోని రెండు వార్డులను కేటాయించాలని సీపీఐ కోరుతోంది. ఇప్పటికే ఆ పార్టీ తరఫున అభ్యర్థులు నామినేష న్ కూడా దాఖలు చేశారు. అయితే స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, గెలుపు అవకాశాలు ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీకి ఒక సీటును కాంగ్రెస్ కేటాయించన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వానికి సైతం ఈ విషయాన్ని హస్తం నేతలు స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో ఇటీవల పలుమార్లు సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పార్టీ టికెట్లను ఆశిస్తూ పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో పార్టీ అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థిత్వం దక్కనటువంటి వారితో నామినేషన్లను ఉపసంహరించుకునే దిశగా పార్టీ ముఖ్యనేతలు చర్చలు ప్రారంభించారు. పార్టీకి ఇబ్బంది కలుగకుండా ఉండేలా బుజ్జగింపులతో పోటీ నుంచి తప్పించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో వార్డు నుంచి ఐదుగురికి మించి నామినేషన్లు వేయడంతో టికెట్ రాని వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశముందని భావిస్తున్నారు. అలాంటి వారితో పార్టీకి ఏమాత్రం నష్టం కలుగకుండా వారిని తమ దారిలోకి తీసుకొచ్చే ఆలోచనలు చేస్తున్నారు. దీనిపై జిల్లా పార్టీ ముఖ్యనేతలందరితో చర్చించి వారి అభిప్రాయలను స్వీకరించారు. వా టన్నింటిని పరిగణలోకి తీసుకుని పాత, కొత్త కలయికతో అభ్యర్థులను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. టికెట్ దక్కనటువంటి వారితో నామినేషన్లను ఉపసంహరించుకునేలా చూడాల్సిన బాధ్యతలను సైతం పార్టీ నేతలకే అప్పగించినట్లుగా సమాచారం. నామినేషన్ల ఉపసంహరణకు ఒక రోజు గడువే ఉండటం, ప్రచార పర్వం షురూ కానున్న నేపథ్యంలో అభ్యర్థుల వివరాలను సోమవారం అధికారికంగా ప్రకటిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ తెలిపారు. -
ప్రచారంలో ‘సోషల్’ ట్రెండ్
కై లాస్నగర్: ఎన్నికల ప్రచారపంథా మారుతోంది. గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి తాము ఏమి చేయాలనుకుంటున్నారో తెలిపి వారి మద్దతు కోరేవారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో సోషల్ మీడియాను ప్రధాన ప్రచారస్త్రాంగా మార్చుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం, వాట్సాప్ వంటి ప్లాట్ఫాంలలో తమ రోజువారీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని నియమించుకుంటున్నారు. మరికొంత మంది ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక పాటలు రూపొందించుకొని ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రీల్స్ ద్వారా ఓటర్ల ఫోన్లకు వీడియో, ఆడియో రూపంలో సందేశం పంపిస్తున్నారు. నోటిఫికేషన్ ముందు నుంచే మొదలైన సోషల్ మీడియా ప్రచారం ఉపసంహరణ అనంతరం మరింత ముమ్మరం కానుంది. అప్డేట్గా ఉండేలా.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ప్రచార ఆయుధంగా సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. నోటిఫికేషన్కు ముందు నుంచే తమ రోజువారీ కార్యక్రమాలను అందులో పోస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫొటో, వీడియో గ్రాఫర్లను ప్రత్యేకంగా నియమించుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా కాలనీ పెద్దలు, అధికారులను కలవడం, సామాజిక సేవ కార్యక్రమాలు వంటి వాటిని చిత్రీకరించేలా ఉదయం నుంచి రాత్రి వరకు తమ వెంటే ఉంచుకుంటున్నారు. ఆయా ఫొటోలు, వీడియాలతో ప్రత్యేక రీల్స్ రూపొందిస్తున్నారు. వాటికి ఆడియో, వీడియోల రూపంలో సిద్ధం చేసి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాంలలో పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఇందుకోసం కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన యువతను ఏర్పాటుచేసుకున్నారు. సోషల్ మీడియాలో తమ ప్రచారాన్ని హోరెత్తించే బాధ్యతలు వారికి అప్పగించారు. ఒక్కొక్కరికి రూ.20వేల నుంచి రూ.25వేల వేతనం చెల్లిస్తున్నారు.వాట్సాప్ గ్రూప్లు క్రియేట్.. కౌన్సిలర్ ఆశావహులు ఎన్నికల ప్రచారం కోసమే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్లను క్రియేట్ చేస్తున్నారు. అందులో కాలనీ పెద్దలు, వివిధ కుల, ప్రజా సంఘాల బాధ్యులు, విద్యావంతులు, పలుకుబడి కలిగిన వ్యక్తుల నంబర్లను సేకరించి అందులో యాడ్ చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతల ఫొటోలతో కూడిన రీల్స్ను సిద్ధం చేస్తూ వాటిని ఆయా గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. కౌన్సిలర్గా తమను ఆదరించి గెలపించాలని, ఎన్నుకుంటే తాము చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను అందులో వివరిస్తూ వీడియోలు పెడుతున్నారు. ప్రస్తుతం పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇలాంటి గ్రూపులే దర్శనమిస్తున్నాయి. -
పెంచిన ప్రేమ డెన్మార్క్ది.. పేగు బంధం ఆదిలాబాద్ది!
ఆదిలాబాద్ టౌన్: తమ బిడ్డ ప్రాణం పోసుకున్న నేల కోసం, ఆ ప్రాణం పోసిన కన్నవారి కోసం డెన్మార్క్ నుంచి ఆదిలాబాద్కు వచ్చారు లూయిస్ – రాస్ముస్ దంపతులు. 2016లో రెండు నెలల పసికందుగా ఉన్న అర్జున్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రిమ్స్ ఆసుపత్రి సమీపంలో వదిలేశారు. ఆ చిన్నారి జిల్లా కేంద్రంలోని శిశుగృహకు చేరగా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఈ విదేశీ దంపతులు అర్జున్కు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలుడు డెన్మార్క్లో వారితోనే పెరుగుతున్నాడు.అయితే, ‘అడాప్టి రైట్ కౌన్సిల్’అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అర్జున్ అసలు తల్లిదండ్రులను గుర్తించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సంస్థ ఇప్పటికే వంద మంది చిన్నారుల మూలాలను వెతికి పట్టుకుని, వారిని కన్నవారికి పరిచయం చేసింది. ఏడాదికోసారైనా అర్జున్ను కన్నవారికి కలిపించాలనేది వీరి సంకల్పం. బాలుడు పెద్దయ్యాక తన మూలాలు తెలియక మానసిక ఆవేదనకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ఈ అన్వేషణ సాగిస్తున్నట్లు ఎన్జీవో డైరెక్టర్ అంజలి పవార్ వెల్లడించారు.బాలుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడని, దత్తత తీసుకున్న వారి దగ్గరే ఉంటాడని ఆమె స్పష్టం చేశారు. రెండు చేతుల వేళ్లకు వైకల్యం ఉండటం వల్లే ఆనాడు తల్లిదండ్రులు చిన్నారిని వదిలేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ బాలుడిని గుర్తించిన వారు 9822206485, 8329403661 నంబర్లలో సంప్రదించవచ్చు. వారం రోజుల పాటు వారు ఆదిలాబాద్లోనే ఉంటారు. వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, కన్నవారు తమ కుమారుడిని చూసే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తనను కన్నవారిని ఒక్కసారైనా చూడాలని ఆ బాలుడు సైతం ఆశపడుతున్నాడు. -
కౌన్సిలర్ నుంచే ‘గోనె’ ప్రస్థానం
కాంగ్రెస్ నుంచి గోనె హన్మంతరావు రెండు పర్యాయాలు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 1961 ఎన్నికల్లో పాతమంచిర్యాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1967లో మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. 1987లో కాసిపేట మండలం ముత్యంపల్లి నుంచి సింగిల్ విండో చైర్మన్గా గెలిచారు. ఆ తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని అలంకరించారు. 1989లో లక్సెటిపేట(ప్రస్తుతం మంచిర్యాల) నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి టికెట్ కోసం విఫలయత్నం చేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టికెట్ లభించగా విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. 1999, 2010లో పోటీ చేసినా ఓటమి చవిచూశారు. రాజకీయాల నుంచి వైదొలిగిన ఆయన అనారోగ్యంతో మృతిచెందారు. -
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ‘నడిపెల్లి’
నడిపెల్లి దివాకర్రావు రైతు కుటుంబంలో జన్మించారు. కిరాణ దుకాణ వ్యాపారిగా, ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేశారు. 1981లో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో అప్పటి 7వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారు. 1987లో మంచిర్యాల సింగిల్ విండో చైర్మన్గా పోటీ చేసి విజ యం సాధించారు. బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలోనే 1999లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో టికెట్ లభించింది. విజయం సాధించిన ఆయన మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2004లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందా రు. ఇక 2009లో టీఆర్ఎస్ ప్రభంజనంలో ఓటమి చెందారు. తిరిగి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మూడోసారి, 2018లో ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫున రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. -
తెలంగాణ సాయుధ పోరు నుంచి.. రంగనాథ్రావు
వారంతా ఒకప్పుడు గల్లీ నుంచి ఎన్నికై న వారే.. కౌన్సిలర్లు, చైర్మన్లుగా పట్టణవాసులకు సేవలందించి శాసనసభలోనూ అడుగు పెట్టారు. అంచెలంచెలుగా అసెంబ్లీ స్థాయికి ఎదిగి తమదైన మార్కు చూపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురిపై ప్రత్యేక కథనం. – కై లాస్నగర్/మంచిర్యాలరూరల్ (హాజీపూర్)తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ రంగనాథ్ రావు బొల్లాన్వార్ ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఆవిర్భావంతోనే ఎన్నికల బరిలో నిలిచారు. నాడు నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సీపీఐపై అప్పట్లో నిషేధం విధించారు. దీంతో ఆ పార్టీకి చెందిన నాయకుడైనప్పటికీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున మున్సిపల్ బరిలో నిలిచారు. అధ్యక్షుడిగా విజయం సాధించి 1952 నుంచి 1961 వరకు దాదాపు దశాబ్దకాలం పాటు పట్టణ ప్రజలకు సేవలందించారు. ఈ క్రమంలో అదే పార్టీ తరఫున 1957లో ఎమ్మెల్యేగా పోటీచేసి ప్రజల మద్దతుతో అసెంబ్లీలో అడుగు పెట్టారు. చైర్మన్, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మరోసారి మున్సిపల్ బరిలో నిలిచి గెలుపొందారు. రెండోసారి 1967 నుంచి 1972 వరకు చైర్మన్గా సేవలందించారు. పదవులు చేపట్టినప్పటికీ అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడివలే కాలినడకన తిరిగేవారని ఆయన వ్యక్తిత్వాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు ఆయన సమకాలీకులు. -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్ రాజర్షి షాకై లాస్నగర్: ‘మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం.. మద్యం, నగదు పంపిణీని పూర్తిస్థాయిలో కట్టడి చేసేలా ఇప్పటికే చెక్పోస్టులు ఏర్పాటు చేశాం.. అలాగే పోలింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం..’ అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎన్నికల నిర్వహణపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. సాక్షి: ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?కలెక్టర్: బ్యాలెట్ విధానంలో నిర్వహించే ఈ ఎన్నికల కోసం 17 మంది చొప్పున ఆర్వోలు, ఏఆర్వోలు, 13 మంది నోడల్ అధికారులు, 15 మంది జోనల్ అధికారులను నియమించాం. వారికి దశలవారీగా మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ అందిస్తున్నాం. పట్టణ పరిధిలో 216 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: మద్యం, నగదు కట్టడికి ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేశారు?కలెక్టర్: మహారాష్ట్ర, హైదరాబాద్ మార్గంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతీ ఒక్కరిని తనిఖీ చేసేలా పట్టణ నలువైపులా ఏర్పాట్లు చేశాం. మావల, చాంద, రాంపూర్, బట్టిసావర్గాం, బంగారుగూడతో పాటు పాటు రెండు ఎకై ్సజ్ చెక్పోస్టులను ఈ సారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. వీటితో పాటు డిప్యూటీ తహసీల్దార్, పోలీస్ కానిస్టేబుల్, వీడియో గ్రాపర్తో కూడిన ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాం. షిఫ్టుల వారీగా 24గంటల పాటు పనిచేసేలా మూడు టీంలను అందుబాటులో ఉంచాం. వీటితో పాటు పోలీస్శాఖకు సంబంధించి స్పెషల్ పార్టీ, ఇంటర్ సెప్టార్ వాహన సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రజలు రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లవద్దు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే వాటిని సీజ్ చేస్తాం. సాక్షి: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్ని గుర్తించారు. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?కలెక్టర్: మొత్తం 216 పోలింగ్ కేంద్రాలుండగా అందులో 35 ప్రాంతాల్లోని 128 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో పోలింగ్కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మైక్రో అబ్జర్వర్లను నియమించాం. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. పోలింగ్ తీరును కలెక్టరేట్ నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సాక్షి: పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. ఈ సారి దాన్ని పెంచేందుకు ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేశారు?కలెక్టర్: గత ఎన్నికల్లో 77శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి దాన్ని మరింత పెంచేలా దృష్టి సారిస్తున్నాం. ఓటు హక్కు ప్రాధాన్యత తెలియజేసేలా రోజు వారీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రతీ వార్డులో ఓటరు అవగాన కార్యక్రమాలను చేపడుతాం. పోలింగ్ రోజున పరిఽశ్రమల్లో పనిచేసే కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు, సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇచ్చేలా ఆదేశాలు జారీచేస్తాం. సాక్షి: ప్రలోభాల నియంత్రణకు ఏ విధంగా దృష్టి సారిస్తున్నారు.?కలెక్టర్: ఎన్నికల్లో ప్రలోభాలకు తావులేకుండా ఉండేలా డయల్ 100తో పాటు కలెక్టరేట్లో 24గంటల పాటు పనిచేసేలా 18004251939 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిస్తే వెంటనే ఈ నంబర్లలో సమాచారమివ్వాలి. తక్షణమే ఎఫ్ఎస్టీలు అక్కడకు చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సాక్షి: పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులు ఉండటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.. దీనిపై మీరేమంటారు?కలెక్టర్: ఓటర్లు, పోలింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఐదు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని కేంద్రాల్లో తాగునీరు, షామియానాల ఏర్పాటుతో వీల్ చైర్లను అందుబాటులో ఉంచుతాం. ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఓటర్లు స్పేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. పోల్ స్లిప్తో పాటు ఈసీ నిర్దేశించిన 18 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని వెంట తెచ్చుకోవాలి. -
క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్
ఆదిలాబాద్: ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్వో జక్కుల శ్రీని వాస్ తెలిపారు. ఇందులో భాగంగా మున్సిప ల్ స్థాయి పోటీలను జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఈ పోటీలు ఎంతగానో దోహదం చే స్తాయన్నారు. ఆయా క్రీడాంశాల్లో అన్ని వయస్సుల విభాగాల వారికి అవకాశాలు ఉన్నాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ మెంబర్ రాఘవేంద్ర, డాక్టర్ క్రాంతి కుమార్, స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణ, పీడీ హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడాలి
నేరడిగొండ: విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని జిల్లా తనిఖీ బృందం అధికారులు జె.తానాజీ, ఆర్.మనోజ్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. వడూర్ ఎంపీపీఎస్తో పాటు ఉర్దూ మీడియం ప్రాథమిక ఉన్నత పాఠశాలలను శనివారం తనిఖీ చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా.. లేదా అనే విషయాన్ని విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాలు, వసతులపై ఆరా తీశారు. అలాగే రికార్డులను పరిశీలించారు. ఫిబ్రవరిలో మూడవ తరగతి విద్యార్థులకు జాతీయ స్థాయిలో నిర్వహించే ఎస్ఎల్ఎస్ పరీక్షలకు సంసిద్ధం చేయాలని, ప్రతిరోజూ లాంగ్వేజ్, గణితంకు సంబంధించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. తనిఖీ చేసిన పాఠశాలలకు సంబంధించిన సమగ్ర నివేదికను జిల్లా విద్యాధికారి నివేదిస్తామని వారు వివరించారు. -
అధ్యక్షుడి నుంచి ‘అధ్యక్షా’ దాకా.. ఖుర్షిద్
● అంచెలంచెలుగా ఎదిగి.. ● ఎమ్మెల్యేలుగా ఎన్నికై న కౌన్సిలర్లు, చైర్మన్లుఆదిలాబాద్ మున్సిపాలిటీకి నిర్వహించిన రెండో ఎన్నికల్లో మసూద్ హైమద్ ఖుర్షిద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1965 వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు. స్నేహశీలిగా, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. మున్సిపల్ పరిధిలో అందించిన సేవలతో ప్రజల ఆదరణ చూరగొన్నారు. ఈ క్రమంలో 1972లో కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేశారు. ప్రజలు ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేసిన ఆయనను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. -
రహదారి భద్రత అందరి బాధ్యత
ఆదిలాబాద్: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పట్టణంలో 2కే రన్ నిర్వహించా రు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. విధిగా హెల్మెట్ ధరించడంతో పాటు అతివేగాన్ని నియంత్రిస్తే ప్రాణనష్టాన్ని సైతం నివారించవచ్చన్నారు. నెల రోజులపాటు రవాణా శాఖ చేపట్టిన అవగా హన కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడా రు. అనంతరం టూ కే రన్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీటీసీ రవీందర్ కుమార్, డీవైఎస్వో శ్రీనివాస్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్కుమార్ కత్రి తదితరులు పాల్గొన్నారు. -
ఏడు కచిడీలు @ రూ.2 లక్షలు
సఖినేటిపల్లి: పల్లిపాలెం కేంద్రంగా సముద్రంపై శుక్రవారం వేటకు వెళ్లిన మత్య్సకారుల పంట పండింది. శనివారం వలకు చిక్కిన ఇతర మత్స్య సంపదతో పాటు 7 కచిడీ చేపలు, మరి కొన్ని టేకు చేపలను ఫిష్ మార్కెట్కు తీసుకువచ్చారు. వీటిల్లో కచిడీ రకం చేపలకు మంచి ధర పలికింది. రూ.2లక్షలకు పైబడి వెచ్చించి ఆ చేపలను ఓ కొనుగోలుదారుడు దక్కించుకున్నాడు. అలాగే సుమారు 200 కేజీల బరువున్న టేకు చేపను కొనుగోలుదారుడు రూ.20 వేలకు వేలంలో పాడుకున్నాడు. ఔషధాల తయారీలో ఈ చేపను వినియోగిస్తారని మత్య్సకారులు చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆరిలోవ (విశాఖ) : ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణాపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుబ్బల మహేష్ (37) మృతి చెందాడు. అమలాపురానికి చెందిన మహేష్ తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బీఆర్టీఎస్ రోడ్డులో వెళ్తుండగా, డివైడర్పై ఉన్న పూల మొక్కల కొమ్మలు తలకు తగలడంతో బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై మహేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వెనుక కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆరిలోవ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పులి సంచరిస్తోంది.. అప్రమత్తం!
● చినకొండేపూడి–పెదకొండేపూడి మధ్య పాదముద్రల గుర్తింపు ● అవి పులివేనని ధ్రువీకరించిన రేంజ్ ఆఫీసర్ దావీద్ రాజు సీతానగరం: మండలంలోని చినకొండేపూడి – పెదకొండేపూడి పంట పొలాల్లో పులి పాద ముద్రలను గుర్తించిన స్థానికులు శనివారం అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వాటిని పులి పాద ముద్రలేనని ధ్రువీకరించారు. స్థానిక గెడ్డం రామకృష్ణ పంట పొలంలో గుర్తించిన ఆ పాద ముద్రలపై స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల ఏటూరు జిల్లాలో తిరుగుతున్న పులి ఇక్కడికి వచ్చి ఉండవచ్చని భావించిన రాజమహేంద్రవరం అటవీశాఖ రేంజ్ అధికారి ఎన్.దావీద్ రాజు, అల్లూరి సీతారామరాజు జిల్లా రేంజ్ అధికారి కొండలరావు తమ సిబ్బందితో క్షేత్రస్థాయికి వెళ్లి పాద ముద్రలను పరిశీలించి ధ్రువీకరించారు. స్థానిక తహసీల్దార్ ఎ శ్రీనివాస్, ఎస్సై డి.రామ్ కుమార్ అక్కడికి చేరుకుని అటవీశాఖాధికారులో చర్చించారు. అనంతరం రేంజ్ అధికారి దావీదురాజు విలేకరులతో మాట్లాడుతూ ఏలూరు జిల్లా పోలవరం దగ్గరలో ఇటుక కోటలో శుక్రవారం రాత్రి పులి రెండు దూడలపై దాడి చేసి హతమార్చిందని, అక్కడ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం వైపు వచ్చిందని, కాలువ వద్ద రాళ్లు ఉండటంతో పాద ముద్రలు పడలేదన్నారు. గోదావరి దాటి చినకొండేపూడి వైపు వచ్చిందన్నారు. ఆ పులి పాదముద్రలు, ఇక్కడ పాదముద్రలు ప్లగ్ మార్క్ ఒకటేనని గుర్తించామన్నారు. పులి పెదకొండేపూడి మీదుగా పురుషోత్తపట్నం అడవి వైపు వెళ్తున్నట్టుగా పాద ముద్రలు ఉన్నాయని తెలిపారు. పంట పొలాల్లోను, పెదకొండేపూడి గోశాల వద్ద, అనుమానిత ప్రాంతాల్లో సెన్సార్ ట్రాప్ కెమెరాలు అమర్చామని తెలిపారు. రైతులు ఎక్కడైనా పులి పాదముద్రలు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఉదయం 8 గంటల తరువాత రైతులు పొలాలకు వెళ్లాలని, సాయంత్రం 4 గంటల తరువాత పంట పొలాల్లో ఉండవద్దని తెలిపారు. పశువులను సాధ్యమైనంత వరకు గ్రామాల్లో కట్టుకోవాలని, లైట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాల్సి ఉంటే గుంపులుగా వెళ్లాలన్నారు. అప్రమత్తంగా ఉండాలి చినకొండేపూడి, పెదకొండేపూడి, చీపురుపల్లి, అచ్చియ్యపాలెం, నాగంపల్లి, పురుషోత్తపట్నం, మండలంలోని గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సై రామ్ కుమార్ హెచ్చరించారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
విద్యార్థి ఆత్మహత్యాయత్నం
తాళ్లపూడి: గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని పట్టణ పోలీసులు రక్షించిన ఘటన కొవ్వూరులో చేటుచేసుకుంది. పట్టణ పోలీసులు రక్షించిన సంఘటనలో కొవ్వూరులో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం వెంకటేశ్వరనగర్, మోరంపూడికి చెందిన 20 ఏళ్ల నరవ విశ్వతేజ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కొవ్వూరు వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నం చేసినట్టు సీఐ విశ్వం తెలిపారు. బీ టెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్టు వివరించారు. 112కు సమాచారం రావడంతో వెంటనే స్పందించి స్విమ్మర్లను రప్పించి విశ్వతేజను రక్షించి కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఆయన తెలిపారు. -
మోగింది కల్యాణ వీణ..
● మాఘం నుంచి మోగనున్న మంగళ వాయిద్యాలు ● జూన్ వరకు మంచి ముహూర్తాలు ● వివాహ, అనుంబంధ రంగాల వ్యాపారాలకు అనువైన కాలం తాళ్లపూడి: మాఘమాసం ఎప్పడోస్తుందో.. మౌన రాగాలెన్ని నాళ్లో.. అని కూనిరాగాలు తీసే కన్నెపిల్లలు కలిసొచ్చే కాలం వచ్చేసింది. శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అని కల్యాణ శుభలేఖలు అచ్చు వేయించే మంచి ముహూర్తాలు ముంచుకొచ్చేస్తున్నాయి. సనాతన ధర్మంలో వివాహవ్యవస్థకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. పెళ్లంటే మరి నూరేళ్ల పంటే కదా. ఎన్ని పనులు చేసినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. కాలానికి అనుగుణంగా ట్రెండ్ అందుకోకపోతే ఏదో మనం వెనకపడ్డామా అన్న ఫీలింగ్ వధూ వరులిద్దరిలోనూ. అన్ని రంగాల్లోను సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వచ్చినట్టుగానే వివాహ వేడుకల్లోను దూసుకొచ్చేశాయి. ప్రీ వెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్ షూట్లు, డ్రోన్ ఫొటోగ్రఫీ, ఏసీ ఫంక్షన్ హాళ్లు, విద్యుత్ సెట్టింగ్లు, భారీ డెకరేషన్లు, రిసెప్షన్లు అన్నింటా పెద్ద మార్పులే చొటుచేసుకున్నాయి. ఇలాంటివి ఎన్నున్నా మామిడి తోరణాలు, తాటాకు పందిళ్లది మాత్రం ప్రత్యేక ఆకర్షణ. ఈ ఏడాది మాఘమాసంలో పెళ్లి బాజాలు మోగనున్నానయి. జూన్ వరకు మంచి మూర్తాలున్నాయి. జూలై 22 తరువాత నుంచి నవంబర్ 20 వరకు మళ్లీ ఖాళీ. దింతో నియోజకవర్గంలో పెళ్లి సందళ్లు మొదలయ్యాయి. 19 వరకు ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. కొవ్వూరులో 7, తాళ్లపూడిలో 8, చాగల్లులో 4 వరకు కల్యాణ మండపాలున్నాయి. జోరుగా వ్యాపారాలు... ఈ సీజన్లో వ్యాపారాలు జోరందుకోనున్నాయి. దుస్తులు, బంగారం, ఇతర వస్తువులు కొనుగోళ్లు భారీగా సాగుతాయి. ఏసీ ఫంక్షన్ హాళ్లు, బ్యాండ్ పార్టీలు, పురోహితులు, క్యాటరింగ్, ఫొటోగ్రాఫర్లు, టెంట్, లైటింగ్, డేకరేషన్, ఈవెంట్ ఆర్గనేజర్లు, ఇలా అందరికీ చేతి నిండా పని దొరుకుతుంది. ఒక్కో పెళ్లి, ఫంక్షన్కు రూ.10 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చుకానుంది. ఏసీ కల్యాణ మండపాలపై ఆసక్తి.. ఇటీవల వివాహంలో ఏసీ కళ్యాణ మండపాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మిరిమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలు, వేదికల సెట్టింగులు ఆకర్షణీయంగా ఉంటున్నాయి. మారుమూల గ్రామాల్లో సైతం ఏసీ కల్యాణ మండపాలు ఉన్నాయి. పెళ్లికి వారం రోజుల ముందు నుంచే వివిధ రకాల స్వాగత తోరణాలు, కల్యాణ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏసీ కళ్యాణ మంపడం అయితే అన్ని ఖర్చులన్నిటితో కలిపి రూ.80 వేల నుంచి సుమారు రూ.రెండు లక్షలు వసూలు చేస్తున్నారు. పచ్చి పూల మండపాలకు గిరాకీ.. నిశ్చయ తాంబూలాల నుంచి చిన్నచిన్న ఫంక్షన్లకు సైతం పచ్చిపూల మండపాలు ఏర్పాటు చేయడం తప్పనిసరైంది. ఒక్క వివాహానికి లైటింగ్, క్లాత్ సెట్టింగ్కు రూ.25 వేలు నుంచి రూ.లక్షకు పైగా ఖర్చవుతుంది. పచ్చిపూల మండపానికి అయితే రూ.25 వేల నుండి రూ. 1.7 లక్షలకుపైగా వెచ్చిస్తున్నారు. అదే విధంగా ఫ్లెక్సీలు, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు, పత్రికా ప్రకటనలకు, మ్యుజికల్ నైట్, స్కిట్లు, ఈవెంట్లకు అదనపు వ్యయం తప్పదు. ప్రీ, పోస్టు వెడ్డింగ్ షూట్లు పెళ్లి జ్ఞాపకాలు పది కాలాల పాటు పదిలం చేసుకోవడానికి ఫొటోలు తీయించుకోవడం అనవాతీ. పందిరి రాట మొదలు, అత్తవారింటికి వెళ్లే వరకు ఆ మధుర క్షణాలను కొదవుండదు. అందుకు డిజిటల్ ఫొటో అల్బమ్ దగ్గర నుంచి వీడియోల వరకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఇందుకు డ్రోన్ టెక్నాలజీ, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు, టీజర్లు, ప్రీ, పోస్టు వెడ్డింగ్ షూట్లు, మెహందీ వంటివి నిర్వహిస్తున్నారు. క్యాటరింగ్ కల్చర్.... బంధుజనాలు పది కాలాలు చెప్పుకొనేలా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు క్యాటరింగ్కు అప్పగిస్తూ భారీ మెనూతో భోజనాలు పెడుతున్నారు. అంతే కాకుండా అతిథులకు స్వాగత సత్కారాలు చేయడానికి కనుముక్కుతీరు బాగున్న యువతులను సింహ ద్వారాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. 23 మంచి ముహూర్తాలు ఈ మాఘమాసం మొదలు జూలై 11 వరకు పెద్ద ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. పెళ్లిళ్లతోపాటు గృహప్రవేశాలు, శంకుస్థాపనలు కూడా ఊపందుకున్నాయి. ఐదు నెలల పాటు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో మాఘ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో పెళ్లి బాజాలు మోగుతూనే ఉంటాయి. ఫిబ్రవరి: 5, 6, 8, 10, 12, 14, 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో, మార్చిలో 3, 4, 7, 8, 9, 11, 12, ఏప్రిల్లో 15, 20, 21, 25, 26 తేదీల్లో, మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీల్లో, జూన్లో 21, 22, 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో, జూలైలో 1, 6, 7, 11 తేదీల వరకు ఉన్న ముహూర్తాలలో పెళ్లిళ్లు జరగనున్నాయి. -
పెళ్లిళ్ల పేరుతో ఒంటరి మహిళలకు వల
● వివాహ సంబంధ సైట్ల ద్వారా పరిచయం ● ప్రతిపాదనలు పంపి ఆనక అడ్డంగా దోపిడీ ● ఘరానా మోసగాడిని అరెస్టు చేసిన పోలీసులు ● రూ.75 లక్షల విలువైన బంగారం, రెండు కార్లు స్వాధీనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఒంటరి మహిళలను, భర్త లేని ఆడవారి వివరాలను తెలుగు మ్యాట్రిమొనీ, షాదీ డాట్ కామ్ల ద్వారా సేకరించి పెళ్లి నాటకమాడి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారి నుంచి రూ.లక్షలు దోచుకున్న ఘరానా మోసగాడు పోలీసుల చేతికి చిక్కాడు. అతని బాగోతం బయట పెట్టి, అతని నుంచి రూ.75 లక్షల విలువైన బంగారం, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీఎస్పీ వై.శ్రీకాంత్, సీఐ వి.అప్పారావు విలేరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వడ్డురు గ్రామానికి చెందిన చల్లా నారాయణకృష్ణ తెలుగు మ్యాట్రిమొనీల ద్వారా భర్తలు చనిపోయి, ఒంటరిగా ఉన్న మహిళల ప్రొఫైల్ ఎంచుకునే వాడు. తాను బంగారం వ్యాపారం చేస్తుంటానని వారిని పరిచయం చేసుకునేవాడు. వివాహ ప్రతిపాదన పంపిస్తూ ‘మీ వివరాలను తన తల్లిదండ్రులకు చూపానని, మీరు వారికి నచ్చారని, జాతకాలు చూపించానని, గోదావరి స్నానాలు చేసి పూజ చేస్తే పరిహారం అవుతుంద’ని నమ్మబలికే వాడు. ‘రాజమహేంద్రవరం గోదావరి నదిలో స్నానాలకు వస్తే, మా అమ్మానాన్నలను తీసుకువచ్చి పరిచయం చేస్తాన’ వారికి చెప్పేవాడు. మీ దగ్గరు ఉన్న బంగారు వస్తువులను ధరించి చక్కగా చీర కట్టులో రావాలని, అప్పుడే మా అమ్మ నాన్నకు మీరు నచ్చుతారని చెప్పేవాడు. ఇలా హైదరాబాద్, విశాఖపట్నం, కడప, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు చెందిన మహిళలను రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్, బస్టాండ్లకు రమ్మని చెప్పి అక్కడ నుండి రాజమహేంద్రవరం పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ల వద్దకు వారిని తీసుకువెళ్లేవాడు. వారిని అతడు కారులో తీసుకువచ్చి పుష్కర ఘాట్లలో స్నానాలు చేయించే ముందు వారు ధరించిన బంగారు వస్తువులను తీసి బ్యాగులో పెట్టుకోమని చెప్పేవాడు. వారు స్నానం చేసి వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకునే గదిలోకి పంపిస్తూ, తాను వెళ్లి పూజ సామానులు తీసుకువస్తానని చెప్పి నమ్మించి ఆ ఆభరణాలతో పారిపోయేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దోచుకువెళ్లిన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఈ నేరాలకు ఉపయోగించిన రెండు కార్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందుతుడిపై గతంలో చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, కర్ణాటక ప్రాంతాల్లో 8 కేసులు ఉన్నాయి. నిందుతుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యహరించిన సీఐ వి.అప్పారావు, ఎస్సై వై.యేసుబాబు, బి.సురేష్, హెడ్ కానిస్టేబుల్స్ వి.కృష్ణ, ఎన్.వెంకటరామయ్య, ఎస్.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు బి.విజయ్ కుమార్, కె.పవన్ కుమార్, యస్.రామకృష్ణలను ఎస్పీ డి.నరసింహ కిశోర్ అభినందించి రివార్డులు ప్రకటించారు. -
ఆదిదేవునికి వేదాశీర్వచనం
● రాజాధిరాజ, అశ్వ వాహనాలపై గ్రామోత్సవాలు ● అలరించిన పండిత సదస్యం సఖినేటిపల్లి: అంతర్వేది తీర్థ మహోత్సవాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు రాజాధిరాజ వాహనంపై, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపైన స్వామివారి గ్రామోత్సవాలు సాగాయి. రాత్రి 8 గంటలకు 16 స్తంభాల మండపం వద్ద నిర్వహించిన చోరసంవాదం భక్తులను అలరించింది. రాజాధిరాజ, అశ్వ వాహనాలపై గ్రామోత్సవాలు శనివారం రాజాధిరాజ వాహనంపైన, అశ్వవాహనంపైన శ్రీస్వామివారి గ్రామోత్సవాలు నిర్వహించారు. అంతకుముందు ఆలయం నుంచి స్వామి, అమ్మవార్లను పల్లకిలో తీసుకువచ్చారు. వాహనాలు వద్ద ప్రముఖులు, అర్చకులు కొబ్బరికాయలు కొట్టి గ్రామోత్సవాలకు శ్రీకారం చుట్టారు. మాడ వీధుల్లో భక్తులు స్వామివారిని దర్శించి అరటిపళ్లు, కొబ్బరికాయలు నైవేద్యాలుగా సమర్పించారు. ఆదిదేవునికి వేదాశీర్వచనం కల్యాణ శోభతో మెరిసిపోతున్న ఆదిదేవునికి శనివారం లోకసంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. సృష్టిలో మొదటిగా ఉద్భవించిన రూపం సృష్టి ఆదిలో మొదలైన కృతయుగంలో నర, మృగ అవతారంలో మొట్టమొదట ఉద్భవించిన రూపం లక్ష్మీనరసింహ స్వామి. శివుడు, విష్ణుమూర్తిల భగవత్ స్వరూపం ఒక్కటే. అందుకే పరమ శివునితో పాటు లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా ఆదిదేవునిగా ఈ క్షేత్రంలో కొలుస్తారు. ఏకశిలా మండపంలో.. ఆలయంలోని ఏకశిలా మండపంలో ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, అర్చకులు, దేవస్థానం వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, పేరూరు వేదపండితులు నిర్వహించిన పండిత సదస్యం ఆద్యంతం భక్తులను అలరించింది. మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి, ప్రధాన అర్చకుడు కిరణ్ ఆధ్వర్యంలో అర్చకులు, పేరూరు వేదపండితులు విష్వక్సేన పూజ, మంటపారాధన, సప్తరుషి పూజలు చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్, ఆలయ వంశపారంపర్య వ్యవస్థాపక సభ్యుడు రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహద్దూర్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబు రాజు పాల్గొన్నారు.అంతర్వేదిలో నేడు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి చక్రవారి అవభృధోత్సవం, సముద్రస్నానం నిర్వహిస్తున్నట్టు ప్రధాన అర్చకుడు కిరణ్ తెలిపారు. ఉదయం 3 నుంచి 6 గంటల వరకూ సుప్రభాతసేవ, శ్రీస్వామివారి తిరువారాధన, బాలభోగం, వార్షిక అభిషేకాలు, అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనాలు ఉంటాయన్నారు. ఉదయం 8 గంటలకు గరుడ పుష్పక వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రి ధ్వజారోహణ నిర్వహిస్తామన్నారు. అలరించిన చోరసంవాదం ఘట్టం దారి దోపిడీ దొంగగా మారిన పరకాలుడిని, లక్ష్మీనృసింహ స్వామి తిరుమంగయాళ్వార్గా మార్చి, మంచి జీవితాన్ని ప్రసాదించిన ఘట్టాన్ని ఇతి వృత్తంగా చేసుకుని ఈ ఘట్టాన్ని నిర్వహించారు. ప్రేమించిన యువతిని పెళ్లాడేందుకు తిరుమంగయాళ్వార్ (పరకాలుడు)దారి దోపిడీ దొంగగా మారాడు. స్వామి అతడికి సాక్షాత్కరించి పరివర్తన తేవడాన్ని చూపే ఘట్టమే ఇది. -
మున్సిపల్ చైర్మన్లుగా తండ్రీకొడుకులు
కైలాస్నగర్: రాజకీయాల్లో వార్డు సభ్యుడిగా గెలవాలంటేనే ఎంతో కష్టపడాలి. అలా కష్టపడినా పదవి వరిస్తుందనే గ్యారంటీ ఉండదు. అలాంటిది తండ్రీకొడుకులు ఒకే పదవిని చేపట్టి సమర్థవంతంగా పనిచేయడం ప్రజల్లో వారికున్న బలం, ఆదరణకు అద్దం పడుతోంది. ఆదిలాబాద్ మున్సిపల్ బరిలో నిలిచిన మసూద్ హైమద్ ఖుర్షీద్ ప్రజల మద్దతుతో అధ్యక్షుడిగా గెలుపొందారు. 1962నుంచి 1965 వరకు ఆయన మున్సిపల్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన ఆయన 1972లో ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్ట్, జిల్లా కేంద్రంలోని సీసీఐ పరిశ్రమ, స్పిన్నింగ్ మిల్లులకు ఆయన హయాంలోనే బీజం పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి అడుగిడిన జావిద్ హైమద్ ఖుర్షీద్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. తండ్రి మసూద్ హైమద్ ఖుర్షీద్ చేసిన సేవలను గుర్తించిన ప్రజలు జావీద్ను ఆశీర్వదించి మున్సిపల్ చైర్మన్గా గెలిపించారు. ఆయన 29.03.1995 నుంచి 31.01.2000 వరకు బల్దియా చైర్మన్గా బాధ్యతలు నిర్వహించి పట్టణాభివృద్ధికి ఎంతో కృషిచేశారు. ఇలా మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన తండ్రీకొడుకులు ప్రజల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ వారి సేవలను ప్రజలు గుర్తుంచుకోవడం వారి సేవానిరతికి అద్దం పడుతోంది. -
‘బీజేపీకి అవకాశమిస్తే నిజాయితీ పాలన’
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశమిస్తే విలువలతో కూడిన నిజాయితీ గల పాలన అందిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. శుక్రవారం బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ఎంపీ గోడం నగేశ్తో కలిసి హాజరయ్యారు. పార్టీ తరఫున ఎన్నికల అధికారులకు ఏ–ఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలా బాద్లో ఆర్యూబీ, ఆర్వోబీ, ఎయిర్ పోర్టు మంజూరు చేయించడంతో పాటు రూ.300 కోట్లతో అమృత్ పథకం కింద తాగునీటి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులతో స్వల్ప వాగ్వాదం ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పా టు కౌన్సిలర్ అభ్యర్థులు పార్టీ కండువాలు ధరించి నామినేషన్ వేయడానికి కేంద్రంలోకి వెళ్లేందుకు ప్ర యత్నించారు. గేటు వద్దనున్న పోలీసులు వీరిని ఆ పి కండువాలు తీసి వెళ్లాలని సూచించారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు వారు పార్టీ కండువాలు తీసివే సి కేంద్రంలోకి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. పార్టీ పరంగా నిర్వహించే ఎన్నికల నా మినేషన్ సమయంలో కండువాలు తీసి వేయడమెందుకని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్ని కల సంఘం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థులతో వస్తున్న ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే శంకర్ -
కుష్ఠు నిర్మూలనకు ‘స్పర్శ’
ఆదిలాబాద్టౌన్: కుష్ఠు నిర్మూలనకు ప్రభుత్వం చ ర్యలు చేపట్టింది. 2027 నాటికి దేశంలో మహమ్మారిని అంతమొందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా అధికారులు గత నెలలో జిల్లా వ్యాప్తంగా 15రోజుల పాటు ఇంటింటి స ర్వే నిర్వహించారు. అనుమానితులను గుర్తించారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. వ్యాధిపై మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గాంధీజీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కుష్ఠు నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ‘స్పర్శ’ పేరిట లెప్రసీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లో వ్యాధి గురించి అవగాహన కల్పించనున్నారు. సర్వేలో 11 కేసులు గుర్తింపు దేశ వ్యాప్తంగా 2027 నాటికి వ్యాధిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో స్పర్శ ఒకటి. గత నెల 17నుంచి 30వ తేదీ వర కు ఇంటింటి సర్వే నిర్వహించగా బజార్హత్నూర్లో రెండు, ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్లో రెండు, ఇచ్చోడలో ఒకటి, సొనాలలో ఒకటి, తాంసిలో ఒకటి, భీంపూర్లో ఒకటి, హస్నాపూర్లో ఒకటి, పిట్టబొంగరంలో ఒకటి, ఝరి పీహెచ్సీ పరిధిలో ఒకటి.. మొత్తం 11కేసులు నమోదయ్యా యి. జిల్లాలో ప్రస్తుతం 52మంది వ్యాధిగ్రస్తులున్న ట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలివే.. కుష్ఠు లక్షణాలున్నవారు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని వై ద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. చర్మంపై స్ప ర్శ లేని మచ్చలు, మందమైన మెరిసే జిడ్డుగల చర్మం, చెవులు, వీపు, ఛాతిపై నొప్పిలేని బొడిపెలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పలు మూతపడక పోవడం, ముక్కుదిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, కాళ్లు, చేతులకు తిమ్మిర్లు రా వడం, అరచేతులు, అరికాళ్లకు స్పర్శ లేకపోవడం, కాళ్లకు చెప్పులు జారిపోవడం, తెలియకుండానే చే తులు, కాళ్లలో బొబ్బలు రావడం, చేతివేళ్లు, కాలివే ళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం లాంటి ల క్షణాలుంటే వెంటనే సమీప పీహెచ్సీలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
లెక్క చెప్పారు
కైలాస్నగర్: ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయ తీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార వ్యయ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేశారు. ఇందుకు సంబంధించిన గ డువు శుక్రవారం ముగిసింది. దీంతో ఈసీ నిబంధనలకు అనుగుణంగా సర్పంచ్ అభ్యర్థులంతా తమ వివరాలను సంబంధిత ఎంపీడీవోలకు అందజేశా రు. వారు ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ పోర్టల్ టీ ఫోల్లో ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థుల వ్యయ వివరాలకు ఈసీ మినహాయింపునివ్వడం వారికి ఊరటనిచ్చింది. అనర్హత వేటు తప్పించుకునేలా.. జిల్లాలో 473 గ్రామపంచాయతీలకు గాను గతేడాది డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 53 గ్రామపంచాయతీల సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 420 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్ పదవుల కోసం 1.466 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వారు ఎన్నికల ప్రచారం కోసం చేసిన ఖర్చుల వివరాలను ఎన్నికలు జరిగిన 45రోజుల్లోపు ఈసీకి విధిగా లెక్క చెప్పాల్సి ఉంటుంది. దీంతో నామినేషన్ సమయంలో తెరిచిన బ్యాంక్ ఖాతా ఆధారంగా సదరు అభ్యర్థుల ప్రచార వ్యయ వివరాలను అందజేయాలని ఈసీ నిబంధన విధించింది. ఒకవేళ ఈ వివరాలను అందించని పక్షంలో పదవిలో ఉన్నవారు అనర్హతకు గురయ్యే అవకాశముంది. ఓటమి పాలైన అభ్యర్థులు భవిష్యత్లో మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదని ఈసీ స్పష్టం చేసింది. తొలి విడత గడువు ఈ నెల 24, రెండో విడత 27, మూడో విడత గడువు 30వ తేదీతో ముగిసింది. దీంతో మూడు విడతలకు సంబంధించి శుక్రవారం తుది గడువు కావడంతో పోటీ చేసిన అభ్యర్థులంతా తమ ప్రచార వ్యయం వివరాలను అధికారులకు అందజేశారు. సంబంధిత అధికారులు ఆ వివరాలను జిల్లా ఉన్నతాఽధికారులకు అందజేయడంతో పాటు టీ పోల్లో నమోదు చేస్తున్నారు. మండలం పంచాయతీలు అభ్యర్థులు ఇచ్చోడ 33 85 గాదిగూడ 25 75 ఇంద్రవెల్లి 28 106 నార్నూర్ 23 78 సిరికొండ 19 46 ఉట్నూర్ 38 135 ఆదిలాబాద్ రూరల్ 31 98 బేల 31 103 భీంపూర్ 26 74 భోరజ్ 17 60 జైనథ్ 17 60 మావల 03 11 సాత్నాల 17 54 తాంసి 14 60 బోథ్ 21 74 సోనాల 12 38 బజార్హత్నూర్ 31 85 నేరడిగొండ 32 80 గుడిహత్నూర్ 26 71 తలమడుగు 29 73 -
ముగిసిన నామినేషన్ల గడువు
కైలాస్నగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీ కరణ గడువు శుక్రవారం ముగిసింది. చివరిరోజు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దీంతో జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రం సందడిగా మారింది. నిర్ణీత గడువులోపు వచ్చిన వారందరినీ కేంద్రంలోకి అనుమతించారు. దీంతో రాత్రి 10గంటల వరకు ప్రక్రియ కొనసాగింది. చివరి నిమి షంలో పలువురు అభ్యర్థులు ఉరుకులు పరుగుల నడుమ కేంద్రానికి చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పా యల్ శంకర్ హాజరయ్యారు. కాగా ఈ ప్రక్రియ కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ప కడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేసి అభ్యర్థులతో ప్రతిపాదకులను మాత్రమే అనుమతించారు. శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులంతా విధిగా హాజ రు కావాలని ఎన్నికల అధికారులు సూచించారు. బరిలో ఏఐఎఫ్బీ ప్యానల్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా పవన్రావు తన ప్యానల్తో మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆమె మరో 24మంది అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నిలిపారు. వారంతా పార్టీ తరఫున నామి నేషన్లు వేశారు. వారికి మద్దతుగా ఆమె హాజరయ్యారు. శుక్రవారం పవన్రావు ఎన్నికల అధికా రులను కలిసి పార్టీ ఏ–ఫామ్లు అందించారు. కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్మున్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షిషా సాధారణ ఎన్నికల పరిశీలకుడు హన్మంత్ నాయక్తో కలిసి పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తదితరులున్నారు. నామినేషన్ల వివరాలు మొదటిరోజు 08 రెండోరోజు 141 చివరిరోజు 572 మొత్తం721 -
బీ–ఫామ్లు ఎవరికో..
సాక్షి, ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలా బాద్ పట్టణంలోని పలు వార్డుల నుంచి పోటీ చేయాలని ఆయా పార్టీల ఆశావహులు పదుల సంఖ్యలో నామినేషన్లు వేశారు. నామినేషన్ల పర్వం శుక్రవారం ముగియగా పార్టీ బీ–ఫామ్ ఎవరికివ్వాలనే విషయంలో నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఒక్కరిని అభ్యర్థిగా ఖరారు చేసేందుకు మిగతావారిని బుజ్జగిస్తున్నారు. పదో వార్డులో గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఆ తర్వాత ఆ కౌన్సిలర్ పార్టీ మారారు. ఈసారి ఈ వార్డు నుంచి పదుల సంఖ్యలో ఆశావహులు బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 39వ వార్డులో కిందటి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో ఆ వార్డు నుంచి పదుల సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా అనేక వార్డుల్లో ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు అధికసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆయా వార్డుల్లో తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. శుక్రవారం నామినేషన్ల పర్వవ పూర్తికావడం, ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడం, బీ–ఫామ్ ఇవ్వకపోవడంతో ఆశావహులు ఎవరికి వారే నామినేషన్లు వేశారు. ఇక పార్టీ నుంచి బీ–ఫామ్ ఒకరికివ్వాలంటే మిగతా వారిని సముదాయించాలి. వారిని బుజ్జగించి నామినేషన్ ఉపసంహరించుకునేలా చూడాలి. ఇప్పుడు ముఖ్యనేతలు ఆ ప్రయత్నాలే మొదలుపెట్టారు. కొందరు అధిష్టానాన్ని ఎదురించైనా బరిలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. ఇది ఓటింగ్పై తీవ్ర ప్రభావం చూపి నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయం ఆయా పార్టీల్లో వ్యక్తమవుతోంది. మెజార్టీ వార్డుల్లో గెలుపొంది మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకోవాలన్న పార్టీలను ఇప్పుడు రెబల్ బెడద బెంబేలెత్తిస్తోంది. ఏ–ఫామ్ల అందజేత అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేసి బీ–ఫామ్ ఇవ్వాలనుకుంటుందో సదరు ఆశావహులకు ఇచ్చేదే ఏ–ఫామ్. ఏ–ఫామ్ అందుకున్న అభ్యర్థి దాన్ని ఆయా ఎన్నికల అధికారులకు అందజేస్తారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఏఐఎఫ్బీ, జనసేన ఏ–ఫామ్లు అందజేశాయి. కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్కు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జోగు రామన్నకు, ఏఐఎఫ్బీ పార్టీ నుంచి రంగినేని పవన్రావుకు, జనసేన నుంచి ఆ పార్టీ నాయకుడికి ఆథరైజేషన్ బీ–ఫాం ఇచ్చే అధికారాన్ని ఆయా పార్టీలు కల్పించాయి. బీజేపీకి సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచే ఆథరైజేషన్ ఇచ్చారు. ఆయా పార్టీలు ఏ–ఫామ్లను ఎన్నికల అధికారులకు అందజేశారు.పార్టీల నుంచి పలువురు ఆశావహులు నామినేషన్లు వేయడంతో ఇప్పుడు అభ్యర్థిగా బీ–ఫామ్ ఎవరికిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అంతగా పోటీలేని వార్డుల్లో ఈ సమస్య పెద్దగా లేకపోయినా ప్రధాన పార్టీల నేతలు అనేక వార్డుల్లో ఇప్పుడు బీ–ఫామ్ విషయంలో ఆచీతూచి ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు అనేక సర్వేలు చేసి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఓ కొలిక్కి వచ్చారు. ఆ అభ్యర్థికే బీ–ఫామ్ అందజేయనుండగా, ఇక మిగతా వారిని బుజ్జగించి వారి నామినేషన్లు ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారు. -
బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
కై లాస్నగర్: మెజార్టీ వార్డులను కై వసం చేసుకుని ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ నామి నేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో శుక్రవా రం పార్టీ నేతలతో కలిసి ఎన్నికల అధికారుల కు కాంగ్రెస్ తరఫున ఏ–ఫామ్లు అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని 49వార్డులకు అభ్యర్థులను ఎంపి క చేసి నామినేషన్లు వేయాల్సిందిగా వారికి స మాచారం అందించామని చెప్పారు. పార్టీ బీ– ఫామ్ ఎవరికి దక్కిన మిగతా వారంతా వారి గెలుపుకోసం పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్ఖాన్, ఆత్మ చైర్మన్ సంతోష్, ఏఎంసీ మాజీ చైర్మన్ సంజీవ్రెడ్డి తదితరులున్నారు. -
సీఎం దిష్టిబొమ్మ దహనం
ఆదిలాబాద్టౌన్: మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆ ధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొ మ్మ దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రే వంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్య క్తం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా హోంశాఖ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని, కావాలనే బీఆర్ఎ స్ నేతలకు సిట్ నోటీసులిచ్చారని ఆరోపించా రు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. నాయకులు ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, సా జిదొద్దీన్, యాసం నర్సింగ్రావు పాల్గొన్నారు. -
విద్యార్థులకు అవగాహన కల్పించాలి
నార్నూర్: ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం గాదిగూడ మండలంలోని అర్జుని గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించగా కలెక్టర్ హాజరై విద్యార్థులు తయారు చేసిన వంటలను పరిశీలించి రుచి చూశారు. గాదిగూడ మండలంలోని రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, కలెక్టర్కు వివిధ సమస్యలు వివరిస్తూ ఆదివాసీ గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందూరు సంతోష్, నాయకులు కుమ్రం సతీశ్, పర్చకి హరిదాస్ వినతిపత్రం అందజేశారు. పరిష్కరించా లని కోరారు. కలెక్టర్ వెంట సర్పంచ్ కమలాబాయి, గ్రామ పటేల్ రావుజీ పటేల్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో గంగాధర్, ఎంఈవో రమేశ్, హెచ్ఎం శేఖర్బాబు, ఉపాధ్యాయురాలు జ్యోతి తదితరులున్నారు. -
విదేశీ వద్దు.. స్వదేశీ ముద్దు
లక్ష్మణచాంద: విదేశీ వద్దు–స్వదేశీ ముద్దు అనే నినాదంతో ముందుకు సాగాలని నిర్మల్ జిల్లా సహ సంయోజక్ శివ పిలుపునిచ్చారు. ఈమేరకు సోన్ మండలం న్యూవెల్మల్ బొ ప్పారం గ్రామంలో, లక్ష్మణచాంద మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి స్వదేశీ జాగరణ మంచ్, స్వదేశీ పరుగు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్పై అమెరికా, చైనా, టర్కీ చేస్తున్న ఆర్థిక యుద్ధంపై విద్యార్థులకు, గ్రా మస్తులకు అవగాహన కల్పించారు. స్వదేశీ నినాదాన్ని ఒక జీవన విధానంగా అలవర్చుకుంటామని ఇప్పటి నుంచి స్వదేశీ వస్తువులనే వాడతామని, మన సంస్కృతి, సంప్రదాయాలు, మన వస్త్రాధారణ అన్నింటిలో స్వదేశీగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు లక్ష్మీనర్సయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
దుబాయ్ నుంచి స్వదేశానికి తీసుకెళ్లండి
లక్ష్మణచాంద: మండల కేంద్రానికి చెందిన సంగెం రాజు(32) బతుకుదెరువు కోసం గతేడాది దుబాయ్ వెళ్లాడు. అక్కడ అజ్మన్ ప్రాంతంలోని ఓ కంపెనీలో పని కుదిరాడు. గత రెండునెలల క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. తనను ఇంటికి పంపించాలని కొన్ని రోజులుగా కంపెనీ వాళ్లకు మొరపెట్టుకున్నా కనికరించలేదు. ఈ విషయంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి చొరవ చూ పాలని సోషల్ మీడియా వేదికగా విన్నవించాడు. తనను స్వదేశానికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. కుటుంబ సభ్యులు.. రాజును స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, రాజుకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. -
గొడవలో ఇద్దరికి గాయాలు
లక్ష్మణచాంద: వైన్స్ షాపు వద్ద జరిగిన గొడవలో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి..మండలంలోని రాచాపూర్కు చెందిన జడ రజినీకాంత్ (27) గురువారం మధ్యాహ్నం పని ని మిత్తం కనకాపూర్కు వెళ్లి ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో కనకాపూర్ వైన్స్ షాపు వద్ద ఆగాడు. అదే సమయంలో రాచాపూర్కు చెందిన తక్కల సాయికుమార్..రజినీకాంత్ వద్దకు వెళ్లి తనకు మద్యం తాగించాలని కోరాడు. తన వద్ద డబ్బులు లేవని బదులిచ్చాడు. రజినీకాంత్ పేరున స్టఫ్ను సాయికుమార్ తీసుకోవడంతో ఎందుకు తీసుకున్నావని అడిగాడు. ఆగ్రహించి అక్కడ ఉన్న ఖాళీసీసాతో రజినీకాంత్పై దాడి చేశాడు. ఈక్రమంలో ఒకరికొకరు దాడి చేసుకున్నారు. రజినీ కాంత్కు తీవ్రగాయాలయ్యా యి. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేశారు. ఆ ఇద్దరిని నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రజినీకాంత్ భార్య రాజశ్రీ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తెలిపారు. -
రోడ్డుప్రమాదంలో వ్యాన్ క్లీనర్..
రెబ్బెన: మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజాము జరిగిన రోడ్డుప్రమాద ంలో వ్యాన్క్లీనర్ మృతి చెందినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఆరెపల్లికి చెందిన కొత్తపల్లి నరేందర్ (42) గత కొంతకాలంగా వ్యాన్ క్లీనర్గా పనిచేస్తున్నాడు. మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి వ్యాన్ లోడ్తో కరీంనగర్కు బయల్దేరింది. మహారాష్ట్ర నుంచి వస్తున్న లారీ..రెబ్బెన జాతీయరహదారి ఫ్లైఓవర్పై లారీడ్రైవర్ మొహినుద్దీన్ అజాగ్రత్తగా నడుపుతూ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. వెనుక వస్తున్న వ్యాన్ డ్రైవర్ అంకడాల క్రిష్ణ అప్రమత్తమయ్యే లోపే లారీని ఢీకొట్టా డు. ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జుయింది. తీవ్రగాయాలైన వ్యాన్క్లీనర్ నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్పగాయాలైన వ్యాన్ డ్రైవర్ క్రిష్ణను ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య రోజా ఫిర్యాదుతో లారీడ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అరైవ్–అలైవ్.. ప్రమాదాలకు చెక్!
మంచిర్యాలక్రైం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రోజురోజుకు ప్రమాదాల సంఖ్య పెరిగి రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్రూట్లో వెళ్లడం, ర్యాష్ డ్రైవింగ్తో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు శాశ్వత అంగవైకల్యం బారిన పడుతున్నారు. ఈ ప్రమాదాలకు చెక్పెట్టేందుకు తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, స్వీయ రక్షణతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రమాదాల నివారణకు పోలీస్, ఆర్టీవో, ఎకై ్సజ్, రెవెన్యూ, ఎన్హెచ్, ఎస్హెచ్, ఇంజినీరింగ్ శాఖల సమన్వయంతో విలేజ్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగితే అక్కడ కారణాలను విశ్లేషించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో..రోడ్డు ప్రమాదాల్లో ప్రమాదాల్లో మొదటి స్థానం నిర్మల్, రెండో స్థానంలో మంచిర్యాల ఉంది. గతేడాది 1373 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 353 మంది మృత్యువాత పడ్డారు. మృతిచెందిన వారిలో 80 శాతం యువతే కావడం గమనార్హం. విలేజ్ కమిటీలు ఇలా..పోలీస్శాఖ, ఎకై ్సజ్, ఆర్టీవో, ఎన్హెచ్, ఎస్హెచ్, ఆర్ఆండ్బీ అధికారులు, విలేజ్ నుంచి ఇద్దరు, పది మందితో కూడిన విలేజ్ కమిటీ ఉంటుంది. జిల్లా పోలీస్ శాఖ అధికారి సమన్వయంతో పనిచేస్తారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను సందర్శిస్తారు. దీనికి కారకులెవరు అనేదానిపై విశ్లేషిస్తారు. సాంకేతిక లోపాలు, సైన్బోర్టులు, వేగనిరోధక నియంత్రణ, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటుకు కృషి చేస్తారు. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, మద్యం మత్తు, మితిమీరిన వేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, యూటర్న్ చేసుకునే ముందు ఇండికేట్ చేయకపోవడం, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే అధిక శాతం మృత్యువాత పడుతున్నారని విలేజ్ కమిటీ సర్వేలో తేలింది.గతేడాది ఉమ్మడి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు -
వైద్యం వికటించి యువతి మృతి
తాండూర్: మండల కేంద్రానికి చెందిన అక్కెపల్లి భాగ్యలక్ష్మి(24) వైద్యం వికటించి మృతిచెందింది. ప్రియుడే కారణమని ఆరోపిస్తూ మృతురాలి సోదరుడు అక్కెపల్లి కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. భాగ్యలక్ష్మి హైదరాబాద్ హయత్నగర్లోని బీసీ బాలికల గురుకులంలో నాలుగు నెలలుగా ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. తాండూర్కే చెందిన గట్టు జగదీష్ కొంతకాలంగా తన సోదరిని ప్రేమించానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తమకు తెలియకుండా హైదరాబాద్లో గర్భస్రావం చేయించేందుకు పలు రకాలుగా ప్రయత్నించాడని, సఫ లం కాకపోవడంతో కర్నూల్లోని ఓ ఆస్పత్రిలో బుధవారం గర్భస్రావానికి ప్రయత్నించగా తీవ్ర రక్తస్రావమై గురువారం చనిపోయిందని తెలిపారు. ఈ విషయం జగదీష్ తనకు ఫోన్ చేసి మీ సోదరి ఆరోగ్యం బాగా లేదని తన స్నేహితులతో కలిసి ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందిందని చెప్పాడని కుమారస్వామి తెలిపారు. తన సోదరి మృతికి జగదీష్ కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూర్ ఇన్చార్జి ఎస్సై సౌజన్య తెలిపారు. -
పంట చేల నుంచి ఇళ్లలోకి చొరబడి..
● అడవి పందిని హతమార్చిన గ్రామస్తులుతాంసి: మండల కేంద్రంలోని పంట చేల నుంచి అడవి పంది గురువారం ఇళ్లలోకి చొరబడింది. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. పలువురిపై దాడికి యత్నించింది. అప్రమత్తమైన గ్రామస్తులు కర్రలతో కొట్టి హతమార్చారు. రెండునెలల క్రితం గ్రామంలోకి వచ్చిన అడవిపంది ఒకరిని హతమార్చగా, మళ్లీ వరుసగా సంచరిస్తున్నాయి. అటవీ అధికారులు వెంటనే స్పందించి గ్రామంలోకి అడవి పందులు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తనిఖీల్లో నగదు పట్టివేత ఖానాపూర్: పట్టణంలోని ఇంద్రనగర్ శివారులో గురువారం ఎన్నికల లైన్ ప్రారంభ సర్వే బృందం (సర్వేలైన్ స్టార్ట్ టిక్ టీమ్) తనిఖీల్లో భాగంగా ద్విచక్రవాహనదారుడి నుంచి రూ.2,35,100 నగదు లభించాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఒగులాపూర్తండాకు చెందిన భుక్య రాజేందర్ చిట్టీ డబ్బులతో బైక్పై ఖానాపూర్ వస్తున్నాడు. టీం ఇన్చార్జి, ఇరిగేషన్ ఏఈఈ రాథోడ్ విఠల్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఆయన వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని విచారించారు. ఐదు టిప్పర్లు పట్టివేత బోథ్: మండలంలో ఎలాంటి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మొరం తరలి స్తున్న ఐదు టిప్పర్ల లారీలను పోలీసులు బుధవారం రాత్రి మాటు వేసి పట్టుకున్నారు. మండలంలోని డేరా గ్రామ శివారులో పెద్దఎత్తున మొరం తవ్వకాలు చేసి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఎస్సై పురుషోత్తం సిబ్బంది సాయికృష్ణ, శ్రీకాంత్, సుధాకర్తో కలిసి దాడులు నిర్వహించారు. మొరం లోడుతో వెళ్తున్న ఐదు టిప్పర్లను గుర్తించి సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. సదరు వాహన యాజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మిస్సింగ్ కేసు ఆసిఫాబాద్రూరల్: మండలంలోని చిలాటిగూడ గ్రామానికి చెందిన బోయిరే మహేశ్ (19) కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. సీఐ బాలాజీ వరప్రసాద్ కథనం ప్రకారం.. ఈనెల 23న మహేశ్ ఇంటి నుంచి ఆదిలాబాద్కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. కుటుంబీకులు సాయంత్రం ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. బంధువుల ఇళ్లలో, చుట్టూపక్కల వెతికిన ఆచూకీ దొరకలేదు. తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు గురువారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
బుగ్గగూడం శివారులో యువకుడు..
కాసిపేట: కాసిపేట పోలీస్స్టేషన్ పరిధి బుగ్గగూడం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాయిని రా జేష్(25) మృతిచెందినట్లు ఎస్సై ఆంజనేయులు తె లిపారు. ఆయన కథనం ప్రకారం.. కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం నాయకపుగూడ చింతపల్లికి చెందిన నాయిడి రాజేష్ అదేగ్రామానికి చెందిన చెదం నాగేశ్లు బైక్పై బుగ్గ దేవాలయం సమీపంలోని సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లి తిరిగివస్తున్నారు. నాగేశ్ బైక్ అతి వేగంగా, అజాగ్రత్తగా నడపడంతో గురువారం తెల్లవారుజాము బుగ్గగూడం శివారు డంపింగ్యార్డు వద్ద అదుపు తప్పి కిందపడ్డారు. వెనుక కూర్చున్న రాజేష్కు తీవ్ర గాయాలై ఘటన స్థలంలో మృతి చెందాడు. మృతుడి మేనమామ చేనేని రాజమల్లు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సమగ్ర సర్వే పారితోషికమేది?
బోథ్: జిల్లావ్యాప్తంగా గతేడాది సమగ్ర ఇంటింటి కటుంబ సర్వే నిర్వహించిన సిబ్బందికి ఇప్పటివరకు పారితోషికం అందలేదు. సర్వేలో భాగంగా సా మాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణ న చేపట్టారు. ఈ సర్వే చేసిన గణకులు (ఎన్యుమరేటర్లు), సూపర్వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇ ప్పటికీ నయా పైసా చేతికి రాలేదు. వారు పారితో షికం కోసం 13నెలలుగా ఎదురుచూస్తున్నారు. స మగ్ర సర్వే పూర్తి చేయడానికి ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, జూని యర్ అసిస్టెంట్లు ఎన్యుమరేటర్లుగా పనిచేశారు. సూపర్వైజర్లుగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇత ర శాఖలకు చెందిన అధికారులను నియమించారు. వీరిలో ఎన్యుమరేటర్లకు రూ.10వేలు, సూపర్వైజర కు రూ.12వేల చొప్పున పారితోషికం అందజేస్తామ ని చెప్పారు. సర్వే పూర్తయిన తర్వాత డాటా నమో దు ఆపరేటర్లను తీసుకున్నారు. ఒక్కో సర్వే ఫారం వివరాలు కంప్యూటర్లో నమోదు చేసినందుకు రూ.25 చొప్పున చెల్లిస్తామని పేర్కొన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా కంప్యూటర్పై అవగాహన ఉన్న చాలామందిని తీసుకున్నారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువకులు సర్వేకు సంబంధించిన డాటాను ఎంట్రీ చేశారు. వివరాలు తీసుకున్నా జమ కాలే.. గతేడాది నిర్వహించిన సమగ్ర ఇంటింటి కటుంబ సర్వేలో జిల్లాలో 174 మంది సూపర్వైజర్లుగా, 2,186 మంది ఎన్యుమరేటర్లుగా, 412మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేశారు. సర్వేలో పాల్గొన్న సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు పారితోషికం జమ చేయడానికి ఆయా మండలాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీడీవోలకు తమ బ్యాంక్ ఖాతా వివరాలు అందించా రు. అయితే ఇప్పటివరకు ఆ ఖాతాల్లో డబ్బులు జ మ కాలేదు. డబ్బులు ఎప్పుడు వస్తాయని పలువు రు గణకులు, డేటా ఆపరేటర్లు అడుగుతున్నారు. జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి తమ పా రితోషికం ఎప్పుడు వస్తుందని ఆరా తీస్తున్నారు. త్వరలో డబ్బులు జమయ్యే అవకాశముందిసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల పారితోషికం డబ్బులు ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. ఇప్పటికే వారి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలోనే పారితోషికం డబ్బులు ఖాతాల్లో జమయ్యే అవకాశముంది. – రమేశ్, ఎంపీడీవో, బోథ్ -
ఆదివాసీ మహిళకు ప్రశంసాపత్రం అందజేత
కైలాస్నగర్: నార్నూర్ మండలం ఖైర్డాట్వా గ్రామానికి చెందిన పెందూర్ శాంతాబాయి గిరిజన మోహవ లడ్డూ యూనిట్ను స్థాపించి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రపతి భవన్ నుంచి అందిన ఆహ్వానం మేరకు ఇటీవల ఢిల్లీలో జరి గిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని ప్రశంసాపత్రాన్ని అందుకుంది. గురువారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో ఆమెను కలెక్టర్ రాజర్షి షా, ఎన్నికల సాధారణ పరిశీలకుడు హన్మంత్నాయక్ శాలువాతో సన్మానించారు. ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు. వ్యాపార రంగంలో మరింత ఉన్నతంగా రాణించాలని ఈ సందర్భంగా వారు సూచించారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఆదిలాబాద్టౌన్: ల్యాబ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే కఠి నచర్యలు తప్పవని డీఎంహెచ్వో నరేందర్ రా థోడ్ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని త్రినేత్ర డయాగ్నోస్టిక్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులు పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. స్కానింగ్ సెంటర్కు వచ్చిన గర్భిణుల పూర్తి వివరాలు రికార్డుల్లో నమోదు చేసి వారానికోసారి తెలుపాలని సూచించారు. లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అడిషనల్ డీఎంహెచ్వో సాధన, డీఐవో డాక్టర్ వైసీ శ్రీనివాస్ ఉన్నారు. వైద్యసిబ్బంది ఆరోగ్యంపై దృష్టి వైద్యసిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపా రు. వైద్యసిబ్బంది హెపటైటిస్–బీ బారిన పడకుండా పట్టణంలోని హమాలీవాడ పీహెచ్సీలో వ్యాక్సినేషన్ చేపట్టారు. జిల్లాలోని 22 పీహెచ్సీలు, ఐదు పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో పనిచేసే హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మొదటి డోస్ వేసిన నెల తర్వాత రెండో డోస్, ఆరు నెలల తర్వాత మూడో డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అంతకుముందు డీఎంహెచ్వో వ్యాక్సిన్ తీసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్వో సాధన, రిమ్స్ వైద్యుడు గజానంద్, డీఐవో డాక్టర్ వైసీ శ్రీనివాస్, నోడల్ అధికారి శ్రీకాంత్, క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత తదితరులు పాల్గొన్నారు. -
ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని హైదరాబాద్ యాఖత్పుర నియోజకవర్గ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెహరాజ్ తెలిపారు. 24వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరులకు అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. మైనార్టీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మరో నాలుగు వార్డులకు శుక్రవారం పేర్లు ఖరారు చేయనున్నట్లు వివరించారు. ముస్లిం మైనార్టీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీల సమస్యల పరిష్కారం, వారి అభివృద్ధి కోసం ఎంఐఎం కృషి చేస్తుందని తెలిపారు. పార్టీ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని కోరా రు. ఎన్నికల ప్రచారానికి పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరొద్దీన్ ఓవైసీ రానున్న ట్లు తెలిపారు. త్వరలోనే ప్రచార తేదీలు ఖరారు చే స్తామని స్పష్టం చేశారు. ఎంఐఎం పట్టణాధ్యక్షుడు నజీర్ అహ్మద్, అత్తు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల వివరాలు రెండో వార్డు అభ్యర్థిగా షేక్ నైమతుల్లా, నాలుగో వార్డుకు షేక్ అఖ్తర్, ఆరుకు సమ్రిన్ సుల్తానా, ఏడుకు ఫాతిమా, ఎనిమిదికి ఎం.నాగ్సేన్, 10వ వార్డుకు జమీలా బేగం, 11కు పీ అనిత, 15కు షేక్ జహీర, 16కు ఆస్మా పర్వీన్, 17కు కిశోర్జాదవ్, 18కి వీ కాంబ్లే, 19కి రఫియా బేగం, 21కి జావిద్ఖాన్, 22కు సమీనా బేగం, 23కు సయ్యద్ సలీమ్, 25కు సల్మా పర్వీన్, 26కు అబుజర్, 28కి బాబుషా, 29కి షహనాజ్, 30కి జమీర్ ఉద్దీన్, 32కు సయ్యద్ రఫీక్, 35కు ఇనాయత్, 38కి ఇర్ఫాద్ అలీ, 44వ వార్డుకు మహ్మద్ రోహిత్ను ప్రకటించారు. -
నామినేషన్ల కేంద్రం వద్ద మూడంచెల భద్రత
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు భారీసంఖ్యలో వచ్చే అవకాశముండటంతో ఆదిశగా పలు మార్పులు చేశారు. తొలిరోజు అంతగా పట్టించుకోని అధికారులు రెండోరోజు నిబంధనలు కఠినతరం చేశారు. ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూడంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. నామినేషన్లు దాఖలు చేసే జిల్లా కేంద్రంలోని టీటీడీసీకి వెళ్లే దారిలో గల కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద, కేంద్రానికి వంద మీటర్ల దూరంలో, కేంద్రం ప్రధాన గేట్ వద్ద ప్రత్యేకంగా బారికేడ్లు ఉంచారు. ట్రాఫిక్, ఏఆర్ పోలీసులను భారీగా మోహరించారు. ఎస్సై స్థాయి అధికారులను నియమించారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులు, వారి వెంట వెళ్లే ప్రతిపాదకుల సెల్ఫోన్లను కేంద్రంలోనికి అనుమతించడంలేదు. వాటిని డిపాజిట్ చేసుకునేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఇద్దరు బల్దియా సిబ్బందిని నియమించారు. టీటీడీసీ కేంద్రంలోని మీడియా పాయింట్ను వంద మీటర్ల దూరంలో, హెల్ప్ డెస్క్ను కేంద్రం ప్రధాన గేట్కు కుడి వైపు ఏర్పాటు చేశారు. నామినేషన్లు వేసే అభ్యర్థులను మినహా ఇతరులెవరిని ఆ మార్గం గుండా అనుమతించకుండా దారి మళ్లించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేలా, వారు పాటించాల్సిన జాగ్రత్తలు సూచించేలా ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు. డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి పోలీస్ భద్రతను పర్యవేక్షించారు. -
తాగునీటి సమస్య పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్
కై లాస్నగర్: రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఫిబ్రవరి 1నుంచి 20వరకు ప్రత్యే క డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ రాజార్షిషా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం తాగునీటి సరఫరా, మనబడి–మన నీరు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా మ హిళాశక్తి కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనబడి–మన నీరు కింద పాఠశాలల్లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని తె లిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి, లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందించాలని హౌసింగ్ అధికారులను సూచించారు. ఇందిరా వ హిళాశక్తి కార్యక్రమాల్లో బ్యాంక్ లింకేజీ, ఇన్నోవేటి వ్ యూనిట్లు, ఎన్పీఏ రికవరీపై దృష్టి సారించాలని ఆదేశించారు. డీఆర్డీవో రవీందర్, డీపీవో రమేశ్, హౌసింగ్ పీడీ షాకీర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ చంద్రమోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిరంతరం నిఘా ఉంచాలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, బహుమతుల పంపిణీపై నిరంతరం నిఘా పెంచాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, (ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వైలెన్స్ (ఎస్ఎస్ టీ) బృందాల అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దే శం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. ప్రతీ తనిఖీని వీడియో రికార్డు చేయాలని, నిబంధనల ప్రకారం రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. శిక్షణ అనంతరం ఆయా బృందాలకు కేటాయించిన వాహనాలను కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకుడు హనుమంతునాయక్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడీ సీవీఎన్ రాజు, డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్రావు తదితరులున్నారు. నిబంధనలు పాటించాలి ఎన్నికల ప్రచార పత్రాలను ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఎన్నికల కమిషన్ నిబంధనలు విధిగా పాటించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు డీ.హనుమంత్ నాయక్తో కలిసి ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ కరపత్రం, బ్యానర్పై ముద్రణదారు, ప్రచురణకర్త పేరు, చిరునామా స్పష్టంగా ఉండాలని సూచించారు. లేకుంటే వాటిని చట్టవిరుద్ధంగా పరిగణించి, సంబంధిత ప్రింటింగ్ ప్రెస్ యజమానులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్ని కాపీలు ముద్రించారు, దానికై న ఖర్చు ఎంత.. అనే సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు నివేధించాలని సూచించారు. ప్రచురణకర్త నుంచి ముందస్తుగా నిర్ణీత నమూనాలో డిక్లరేషన్ తీసుకున్న తర్వాతే ఆర్డర్లు స్వీకరించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, శ్యామలాదేవి, మున్సిపల్ కమిషనర్, జీ రాజు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక
నేరడిగొండ: మండల కేంద్రంలోని కేజీబీవీలో ఎంపీసీ ఫస్టియర్ విద్యార్థిని కల్లూరి హరిత జాతీయస్థాయి అండర్–19 సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై ంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మోడల్ స్కూల్లో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో గతనెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చింది. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా తరఫున హరిత పాల్గొననున్నట్లు ప్రత్యేక అధికారి రజిత తెలిపారు. ఉమ్మడి జిల్లా క్రీడల సమాఖ్య కార్యదర్శి బి.బాబురావు, పీఈటీ స్నేహ, ఉపాధ్యాయులు గురువారం ఆమెను అభినందించారు. -
‘కమీషన్ల కోసం అభివృద్ధిని విస్మరించారు’
ఆదిలాబాద్: గత పాలకులు కమీషన్లకు కక్కుర్తి పడి ఆదిలాబాద్ అభివృద్ధిని విస్మరించారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మాజీ కౌన్సిలర్ అందె శ్రీదేవి బీజేపీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప ట్టణాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. విలీన గ్రామాల్లో అంతర్గత రహదారులు అ ధ్వానంగా మారి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నా రు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి పట్టణా న్ని ఆదర్శ పట్టణంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉ న్న పశువధశాలను తొలగించినట్లు చెప్పారు. రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. 47వ వార్డుకు చెంది న సాయి సృజన్, పలువురు స్థానికులున్నారు. -
రెండోరోజు 141నామినేషన్లు
● కేంద్రం వద్ద కోలాహలం కైలాస్నగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీ కరణ ప్రక్రియ నిర్వహించే ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీ గురువారం కోలాహలంగా మారింది. సమయం ఎక్కువగా లేకపోవడంతో రెండోరో జు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. మొదటిరోజు ఎనిమిది నామినేషన్లు మా త్రమే అందగా రెండోరోజు భారీగా దాఖలయ్యా యి. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున టికెట్లు ఆ శిస్తూ అధికసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వే శారు. ఆదిలాబాద్ పట్టణంలోని 49వార్డులకు గాను 134మంది అభ్యర్థులు 141నామినేషన్లు దా ఖలు చేశారు. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ త రఫున 65రాగా, బీఆర్ఎస్ తరఫున 35, బీజేపీ త రఫున 26, ఏఐఎంఐఎం తరఫున రెండు, ఇతర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరఫున 13 నామినేషన్లు అందాయి. మరో ఎనిమిది మంది ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా రెండ్రోజుల్లో 149నామినేషన్లు అందిన ట్లు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. నామి నేషన్లు వేసే అభ్యర్థులతో పాటు వారి వెంట వచ్చి న మద్దతుదారులు, నామినేషన్ పత్రాలు పొందేందుకు వచ్చిన వారితో కేంద్రం వద్ద కోలాహల వాతావరణం ఏర్పడింది. కాగా, నామినేషన్ల స్వీకరణకు శుక్రవారంతో తెరపడనుంది. చివరిరోజు కావడంతో మరింతమంది అభ్యర్థులు నామినేష న్లు వేసే అవకాశముంది. ఈ ప్రక్రియ అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్ పర్యవేక్షించారు. -
రూపాయి ఖర్చు లేకుండానే కౌన్సిలర్గా..
కైలాస్నగర్: నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు చేసిన చిన్న పొరపాటు వారిని ఎన్నికలకు దూరం చేసింది. నిబంధనల ప్రకారం నామినేషన్ వేసిన అభ్యర్థిని రూపాయి ఖర్చు లేకుండా అనూహ్యంగా కౌన్సిలర్ పదవి వరించింది. 2014 మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఈ సంఘటన ప్రతీ మున్సిపల్ ఎన్నికల సమయంలో తీవ్ర చర్చనీ యాంశం కావడమే కాకుండా పోటీ చేసే అభ్యర్థులకు ఓ హెచ్చరికలా నిలుస్తోంది. నాడు 34వ వా ర్డు, ప్రస్తుతం 20వ వార్డుగా ఉన్న భాగ్యనగర్ కౌ న్సిలర్ స్థానం ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున మేస్రం కృష్ణ, టీఆర్ఎస్ తరఫున గే డం సంజయ్, కాంగ్రెస్ తరఫున మేస్రం కిశోర్, టీడీపీ తరఫున గేడం సుభాష్ కౌ న్సిలర్ పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ష్యూరిటీ సంతకాలు చేయించకుండానే నామినేషన్లు వేశారు. వారి మూడు నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు ష్యూరిటీ సంతకాలు లేవనే కారణంతో మూడింటినీ తిరస్కరించారు. దీంతో నిబంధనల మేరకు నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి మేస్రం కృష్ణ రూపాయి ప్రచార ఖర్చు లేకుండా కౌన్సిలర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందుకే నామినేషన్ పత్రాలు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తుంటారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే కందులు విక్రయించాలి
ఆదిలాబాద్టౌన్: కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు విక్రయించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. గురువారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొదట కాంటాకు పూజలు చేసి రైతును సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు క ల్పించినట్లు తెలిపారు. క్వింటాల్కు రూ.8వేల మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 44,448 ఎకరాల్లో కంది సాగైందని, 22వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన ట్లు తెలిపారు. ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల చొ ప్పున కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్కెటింగ్ ఏడీ గజానంద్, డీఏవో శ్రీధర్స్వామి, మార్క్ఫెడ్ డీఎం ప్రవీణ్ పాల్గొన్నారు. -
నామినేషన్ల సందడి
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. పట్టణంలోని టీటీడీసీలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 49 వార్డులుండగా మూడు వార్డులకు ఒకటి చొప్పున రెండు గదుల్లో మొత్తం 17 కౌంటర్లను అందుబాటులో ఉంచారు. ఒక్కో కౌంటర్లో ఆర్వో, ఏఆర్వోను నియమించారు. నామినేషన్ పత్రాలు అందించడం, అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఒక్కో అభ్యర్థికి రెండు సెట్ల చొప్పున ఫారా లను అందజేశారు. తొలి రోజున వివిధ రాజకీయ పార్టీల తరఫున మొత్తం ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ తరఫున 4, కాంగ్రెస్ తరఫున 3, బీజేపీ తరఫున ఒకటి దాఖలైంది. కాగా మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్ 32వ వార్డు నుంచి తొలి రోజునే తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి , ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కమిషనర్ జి.రాజును ఆదేశించారు. గడువు ఎక్కువగా లేకపోవడంతో గురు, శుక్రవారాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది. -
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
నార్నూర్: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో అక్రమాలకు పాల్పడితే సహించే ది లేదని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అ న్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఏసీబీకి చిక్కిన హౌ సింగ్ ఏఈ శ్రీకాంత్ ఘటనపై బుధవారం ఆ యన విచారణ జరిపారు. అధికారులతో మా ట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. సమన్వయంతో వ్యవహరిస్తూ నిబద్ధతతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారి స్తామన్నారు. నాసిరకంగా నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ జాడి రాజలింగు, ఎంపీడీవో పుల్లారావు, ఎంపీవో రమేష్, స్థానిక సర్పంచ్ కావేరి తదితరులున్నారు. -
నాడు ప్రెసిడెంట్.. నేడు చైర్పర్సన్
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ 1952లో ఆవిర్భవించింది. సుమారు 46 ఏళ్ల పాటు గ్రేడ్–2గా ప్రజలకు సేవలందించగా 5.11.1998లో గ్రేడ్–1గా అప్గ్రేడ్ అయింది. తొలినాళ్లలో మున్సిపల్ అధ్యక్షుడి పదవీకి ఎన్నికలు నిర్వహించేవారు. 1952 నుంచి 1967 వరకు అధ్యక్షుడి పాలన కొనసాగగా ముగ్గురు పనిచేశారు. 1981 లో ఆ పదవీని చైర్పర్సన్గా మార్చారు. తొలి చైర్పర్సన్గా రంగనాథ్ బొల్లన్వార్ ఎన్నికయ్యా రు. ఈయన అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఇప్పటి వరకు మొత్తం 14 మంది (ఇందులో ఇద్దరు రెండు పర్యాయాలు) పనిచేశారు. రంగినేని లక్ష్మణ్రావు రెండు సార్లు చైర్మన్గా కొనసాగారు. సాధారణ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో కమిషనర్లు, ఆర్డీవోలు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు నిర్వహించారు. గ్రేడ్–1స్థాయికి అప్గ్రేడ్ అయ్యాక కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా పనిచేశారు. కాగా, ఆదిలాబాద్ బల్దియాలో చైర్మన్ల కంటే ప్రత్యేకాధికారుల పాలనే ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తంగా 23 మంది (ఇందులో ముగ్గురు రెండు పర్యాయాలు) స్పెషలాఫీసర్లుగా కొనసాగారు. అధ్యక్షుడు, చైర్మన్గా పనిచేసిన ఘనతను రంగనాథ్రావు దక్కించుకున్నారు. ప్రెసిడెంట్లుగా.. చైర్పర్సన్లుగా ప్రత్యేక అధికారులుగా -
సమయం లేదు మిత్రమా..
కైలాస్నగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం మొదలైంది. దీంతో ఎన్ని కల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఆస్తి పన్ను బకాయిలేమి లేవని ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుంది. వారిని ప్రతి పాదించే వారు కూడా బకాయిలేమి ఉండకూడదు. ఈ నేపథ్యంలో ఆస్తి, నల్లా బిల్లు బకాయిలు చెల్లించేందుకు అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయానికి పరుగులు తీశారు. దీంతో బల్దియా కార్యాలయం కిటకిటలాడింది. సమయం ఎక్కువగా లేకపోవడంతో అభ్యర్థుల సంఖ్యకనుగుణంగా బల్దియా అధికా రులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. సిబ్బందిని నియమించి బకాయిల వసూలు చేస్తున్నారు. ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలు సైతం వసూలు కానుండటంతో బల్దియా ఖజనాకు భారీ గా ఆదాయం చేకూరనుంది. నోడ్యూసర్టిఫికెట్ల జారీ కి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకో వాల ని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. -
అట్టహాసంగా క్రీడా సంబురం
బోథ్: జిల్లా స్థాయి బాలికల క్రీడా–సాంస్కృతిక సంబురం బుధవారం మొదలైంది. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రాంగణంలో వేడుకలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ము ఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక వికాసానికి, క్రమశిక్షణకు దోహదపడతాయన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ లక్ష్య సాధన దిశగా సాగాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ, మైదానంలో కనబరిచే పట్టుదల జీవితంలో ఎదురయ్యే సవా ళ్లను ఎదుర్కోవడానికి తోడ్పడుతుందని అన్నా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చది వే విద్యార్థినులే క్రీడల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ బిడ్డ నందిని అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఈ ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడాకారుల కు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ముందుగా విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నా యి. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మ ర్మాట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్స య్య, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు.. క్రీడా, సాంస్కృతిక పోటీలు ఈనెల 30 వరకు మూ డు రోజుల పాటు కొనసాగనున్నాయి. జిల్లాలోని సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమ, ఆదర్శ పాఠశాలల వి ద్యార్థినులు 642 మంది పాల్గొంటున్నారు. క్రీడా వి భాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్ని కాయి ట్, చదరంగం, క్యారమ్తోపాటు 100, 200, 400, 800 మీటర్ల పరుగు పందెం, షాట్పుట్, డిస్కస్ త్రో, లాంగ్జంప్, హైజంప్ పోటీలు నిర్వహిస్తున్నా రు. అలాగే బాలికల్లో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాలు వెలికితీసేందుకు సాంస్కతిక పోటీలు కూ డా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నృత్యం, పాటలు, ఫ్యాన్సీ డ్రెస్, స్కిట్ వంటి ప్రదర్శనలు ప్రే క్షకులను అలరిస్తున్నాయి. క్రీడాకారులు ఏర్పా టు చేసిన స్టాళ్లు, వివిధ చిత్ర రూపాలు ఆకట్టుకున్నా యి. బుధవారం నిర్వహించిన పోటీల్లో గెలు పొందిన క్రీడాకారులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల విద్యార్థినలు పాల్గొన్నారు. ఆదివాసీ వేషధారణలో కలెక్టర్ సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. గుస్సాడీ బృందంతో కలిసి స్టెప్పేయడం ఆకట్టుకుంది. -
జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల కోసం ఎస్ఈ సీ పరిశీలకులను నియమించింది. సాధారణ పరిశీలకులుగా డి.హన్మంతునాయక్, వ్యయ పరిశీలకులుగా ఎల్.విజయ బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. వారికి అధికారులు పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లోని సమాచార శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడి యా సెంటర్ను కలెక్టర్ రాజర్షిషా పరిశీలకులతో కలిసి ప్రారంభించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీపీఆర్వో విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సదరు అధికారులు టీటీడీసీలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. -
పెన్గంగ తీరంలో అధికారుల తనిఖీలు
కై లాస్నగర్: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో గ ల పెన్గంగ నదిలో ఇసుక అక్రమ తవ్వకాల తీరు ను వివరిస్తూ ‘ఇసుకాసురులు’ శీర్షికన ‘సాక్షి’లో బు ధవారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు స్పందిస్తూ చర్యలకు ఆదేశించా రు. దీంతో బేల తహసీల్దార్ కోట్నాక్ రఘునాథ్రా వు పోలీసులతో కలిసి మండలంలోని కాంగార్పూర్ శివారులోని ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతా న్ని పరిశీలించారు. విషయం ముందే తెలుసుకున్న అక్రమార్కులు జేసీబీ, టిప్పర్లను అక్కడి నుంచి తరలించి తప్పించుకున్నారు. నదిలో ఇసుక నింపుతున్న ఆరు ట్రాక్టర్లను పరిశీలించగా వాటికి అధికా రిక టోకెన్లు ఉన్నట్లుగా తహసీల్దార్ తెలిపారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా జైనథ్ మండలం బహదుర్పురా (ఆనంద్పూర్)లోని ఇసుక త వ్వకాల ప్రాంతాన్ని జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్, ఎస్సై గౌతమ్ పవార్ సందర్శించారు. ఇసుక తవ్వకాలకు ఉపయోగిస్తున్న బోటుతో పాటు జేసీబీని సీ జ్ చేసి స్టేషన్కు తరలించారు. బాధ్యులపై కేసు న మోదు చేసినట్లుగా తెలిపారు. నదితీరంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లోనూ అధికారులు తనిఖీ లు నిర్వహించారు. సిరికొండ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న పలు ట్రాక్టర్లను స్వాఽ దీనం చేసుకున్నారు. అనుమతికి సంబంధించి వివరా లపై ఆరా తీసిన అధికారులు ట్రాక్టర్ డ్రైవర్ ఇచ్చిన పత్రాలు చూసి విస్తుపోయారు. అందులో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ అక్రమదందాకు పాల్పడినట్లు గుర్తించారు. బాధ్యులైన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లుగా స్థానిక పోలీసులు తెలిపారు. -
కోడ్ కూసింది.. ఫ్లెక్సీ తొలగింది
మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో మోడల్ కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు బల్దియా సిబ్బంది రంగంలోకి దిగారు. పట్టణంలోని ప్రధానచౌక్లతో పాటు పలు కాలనీల్లో ఆయా రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలు, హోర్డింగ్లను తొలగించి వేశారు. కూడళ్లలో గల దివంగత రాజకీయ నాయకుల విగ్రహాలను ముసుగుతో కప్పివేశారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన హీలియం బెలూన్పై సీఎం, డిప్యూటీ సీఎం చిత్రాలు ఉండడంతో ఆ బెలూన్ను సైతం తొలగించేశారు. – కై లాస్నగర్/సాక్షి ఫొటోగ్రాఫర్,ఆదిలాబాద్ -
రంజాన్ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్నగర్: రంజాన్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి వివిధ శాఖల అధికారులు, మత పెద్దలతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. మసీదుల వద్ద వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, ఈద్గాల పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరాచాలన్నారు. తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని ఆదేశించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కలీమ్, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మసీదుల కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ఆదిలాబాద్టౌన్: వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం సమ్మె చేప ట్టారు.యూనైటెడ్ ఫోరం ఆఫ్బ్యాంకింగ్ యూ నియన్ పిలుపు మేరకు శివాజీ చౌక్లోని ఎస్బీ ఐ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రీజినల్ కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ, 2023లో సమ్మె చేపట్టిన సమయంలో ప్రభుత్వం ఐదు రోజుల పని దినాలను అంగీకరించిందని అన్నారు. ప్రస్తుతం ఆ ఫైల్ కేంద్రం వద్ద ఉందని, మూడేళ్లుగా అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒకరోజు సమ్మె చేపట్టినట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కా కపోతే పూర్తిగా విధులు బహిష్కరిస్తామని స్ప ష్టం చేశారు. కార్యక్రమంలో బ్యాంకు యూని యన్ నాయకులు వినయ్కుమార్, రమేశ్, ప్రవీణ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, అడెల్లు, సుదర్శన్, అంకిత్ జాదవ్, పరమేశ్వర్, నాగరాజు, హరికిషన్, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఆదిలాబాద్టౌన్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో సమావేశ మందిరంలో వైద్య సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. వారు మందులు వాడుతున్నారా.. లేదా అనే విషయాన్ని పరిశీలించాలని అన్నారు. ఎవరైనా లక్ష్యాలను సాధించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, ఎన్హెచ్ఎం డీపీవో దేవిదాస్, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నికల షెడ్యూల్
సాక్షి,ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల నగారా మో గింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చే సింది. గతంలో మాదిరే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో వీటన్నింటిని పూర్తి చేయనున్నారు. వార్డుల్లో కౌన్సిలర్లను ఎన్నుకున్న తర్వాత వారి ద్వారా ఫిబ్రవరి 16న చైర్ ప ర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు. మొత్తం 20 రోజుల్లో ప్రక్రియ ముగియనుంది. బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ఘట్టం మొదలు కానుంది. దీంతో ఒక్కసారిగా మున్సిపల్లో రాజకీయం వేడెక్కింది. టీటీడీసీలో నామినేషన్ల స్వీకరణ.. జిల్లా కేంద్రంలోని సాంకేతిక శిక్షణ, అభివృద్ధి కేంద్రం (టీటీడీసీ)లో ఆయా వార్డుల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం అఽ దికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతీ మూ డు వార్డులకు ఒక ఆర్వో చొప్పున 17 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలులో ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి కోసం హెల్ప్ డె స్క్ అందుబాటులో ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కూడా టీ టీడీసీలోనే నిర్వహించనున్నా రు. మరోవైపు సిబ్బందికి ఇ ప్పటికే శిక్షణ నిర్వహించారు. ‘కోడ్’ అమల్లోకి.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతోనే మోడల్ కోడ్ అమలులోకి వచ్చినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇది పట్టణ పరిధికి వర్తిస్తుంది. మున్సిపల్ యాక్ట్ 2019, బీఎన్ఎస్ ప్రకారం ఎన్నికల నిబంధనలు అమలు చేస్తున్నారు. ఎవరైనా రూ.50వేల నగదు వరకు తీసుకెళ్లవచ్చని, అంతకుమించి ఉంటే దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కోడ్ రాకతో పట్టణ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు బ్రేక్ పడనుంది. అలాగే సంక్షేమ పథకాల అమలు సైతం నిలిచిపోనుంది.నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ షురూ జనవరి 28 (బుధవారం) నామినేషన్ల స్వీకరణకు తుది గడువు జనవరి 30 (శుక్రవారం) పరిశీలన జనవరి 31 (శనివారం) స్క్రూటినీ తర్వాత అర్హులైన అభ్యర్థుల ప్రకటన జనవరి 31 (శనివారం) అభ్యంతరాల స్వీకరణ ఫిబ్రవరి 1 సాయంత్రం 5 వరకు పరిష్కారం ఫిబ్రవరి 2 సాయంత్రం 5 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 వరకు బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 తర్వాత పోలింగ్ ఫిబ్రవరి 11 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ (ఎక్కడైనా అవసరం పడితే) ఫిబ్రవరి 12 ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటల నుంచి..రిజర్వేషన్ వివరాలు..మొత్తం వార్డులు : 49 ఎస్టీ : 03 ఎస్సీ : 06 బీసీ : 15 మహిళ (జనరల్) : 13 అన్ రిజర్వుడ్ : 12 పోలింగ్ సంబంధిత వివరాలు.. బ్యాలెట్ బాక్సులు : 312 (అదనంగా 20 శాతం కలుపుకొని) రిటర్నింగ్ ఆఫీసర్లు : 20 (అదనంగా 20 శాతం కలుపుకొని) అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు : 96 (అదనంగా 20 శాతం కలుపుకొని) జోనల్ ఆఫీసర్లు : 15 ఫ్లయింగ్ స్క్వాడ్ : 12 ఎస్ఎస్టీఎస్ : 12 ప్రిసైడింగ్ ఆఫీసర్లు : 220 (అదనంగా 20 శాతం కలుపుకొని) ఓపీవోలు : 792 (అదనంగా 20 శాతం కలుపుకొని) పోలీస్ సిబ్బంది : 250 (అధికారులు కలుపుకొని) ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో.. మొత్తం ఓటర్లు 1,43,655 పురుషులు 69,813 మహిళలు 73,816 ఇతరులు 06 -
సైబర్ బాధితులకు అండగా పోలీసులు
ఆదిలాబాద్టౌన్: సైబర్ బాధితులకు జిల్లా పోలీసులు అండగా నిలుస్తున్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 2024 మార్చిలో సైబర్క్రైం బారినపడి రూ.2.45 లక్షల డబ్బులు పోగొట్టుకోగా, నిందితుడి ఖాతా ఫ్రీజ్ చేసి రూ.20వేలను కోర్టు అనుమతితో చెక్కు రూపంలో మంగళవారం బాధితుడికి తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సైబర్ క్రైమ్కు గురైన వారు సకాలంలో ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. పట్టణానికి చెందిన మహబూబ్ ఖాన్ సియాసత్ 2024 మార్చిలో తన మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నారని, ఆ మొబైల్ ఆధారంగా సైబర్ నిందితులు ఆయన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా గత నవంబర్ 2025 వరకు మొత్తం రూ.2.45 లక్షలు దుర్వినియోగం చేశారని తెలిపారు. సొంత అవసరాల నిమిత్తం బ్యాంకుకు వెళ్లినప్పుడు ఖాతా నుంచి డబ్బులు మాయమైన విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. బ్యాంకు అధికారుల సూచన మేరకు ఇది సైబర్ నేరమని గుర్తించి వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేశారని, దీంతో చివరగా మోసపోయిన మొత్తంలో రూ.20వేలను నిందితుడి ఖాతాలో ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సైబర్క్రైమ్ ఆర్ఎస్సై గోపీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
సమష్టిగా సాగుదాం..
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో సమష్టిగా ముందుకు సాగి ఆదిలాబాద్ బల్దియా పీఠాన్ని కై వసం చేసుకుందామని కాంగ్రెస్ ముఖ్య నేతలు అభిప్రాయ పడ్డారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వారు మంగళవారం గండ్రత్ సుజాత నివాసంలో సమావేశం అయ్యారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడే వారికి, ప్రజల్లో బలమున్న వారికే టికెట్లు కేటాయించాలని అభిప్రాయ పడ్డారు. కాగా, ముఖ్య నేతలంతా విభేదాలు వీడి సమావేశం కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, నాయకులు సాజిద్ఖాన్, భోజారెడ్డి, సంజీవ్రెడ్డి పాల్గొన్నారు. -
సైగలతో నృత్యం చేసి..పియానో వాయించి
పియానో వాయిస్తున్న జంగుబాయిసైగలతో నృత్యం చేస్తున్న విద్యార్థులుఉట్నూర్రూరల్: వైకల్యం దేనికీ అడ్డుకాదని..పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని వికాసం దివ్యాంగుల ప్రత్యేక బాలబడి విద్యార్థులు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కేబీ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో డ్యాన్స్ ఉపాధ్యాయురాలు చేతులతో చేస్తున్న సైగలను చూసి నృత్య ప్రదర్శన చేశారు. మూడోతరగతి విద్యార్థిని జంగుబాయి వందేమాతరం గేయానికి పియానో వాయించి అందరినీ ఆకట్టుకుంది. సదరు విద్యార్థులను ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అభినందించారు. -
గిరిజనుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి
ఉట్నూర్రూరల్: గిరిజనుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీవో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అర్హులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ ఆశ్రమాలు, గురుకులాల విద్యార్థులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. ఎకో టూరిజం శాఖ పరిధిలో కుంటాల, ఉట్నూర్ కోట, అడ ప్రాజెక్టు వద్ద అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం కేబీ కాంప్లెక్స్ క్రీడా మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు పలు సినీ, దేశభక్తి గీతాలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఐటీడీఏ పరిధి లో ఉద్యోగులకు బెస్ట్ అప్రిషియేషన్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఢిల్లీ వేడుకల్లో ఆదివాసీ నృత్య ప్రదర్శన
ఇచ్చోడ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆదివాసీ కళాకారుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివాసీ కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ ఆధ్వర్యంలో కళాకారులు రవ్వ చిట్టిబాబు, హరీష్, వినోద్, రమేశ్, సాయి, జయరాజు, ముత్తయ్య, నాగబాబు, కుమారి బేబీ, భద్రమ్మ, జ్యోతి, స్వప్న, శైలజ, అనిత, నాగమణి, ఇందు, సుస్మిత పాల్గొని ఆదివాసీ నృత్యం ప్రదర్శించారు. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ సుందర భాస్కర్ రవీంద్ర కుమార్ ఆహ్వానం మేరకు ఢిల్లీలో నృత్య ప్రదర్శన ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆర్జీయూకేటీలో గణతంత్ర వేడుకలు
బాసర: బాసరలోని ఆర్జీయుకేటీలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు ఇచ్చిందన్నారు. యువత రాజ్యాంగ విలువలను ఆచరించడమే నిజమైన దేశసేవ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతికత, సామాజిక బాధ్యతలు అలవర్చుకోవాలని సూచించారు. పీయూసీ స్టడీ అవర్స్.. విద్యార్థుల ’పీయూసీ స్టడీ అవర్స్’ కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించి ప్రపంచ రికార్డు నెలకొల్పిందన్నారు. రాత్రిపూట 3,238 మంది పీయూసీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ విజయాన్ని సాధించారన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ, విద్యార్థులు దేశభక్తి, సామాజిక స్పృహతో దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. -
ఏడుగురు దొంగల అరెస్ట్
బోథ్: మండలంలోని కౌఠ (బి) గ్రామ శివారులో వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు దొంగలను అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ డి.గురుస్వామి తెలిపారు. పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో పత్తి చేనుల్లో చోరీలకు పాల్పడుతున్న సుంకరి చిలకయ్య, ఎస్కే నాసిర్, మామిడి శ్రీనివాస్, అశోక్, రాజారాప దత్తు, ఎస్కే షాపితో పాటు దొంగ సరుకు కొనుగోలు చేసిన అల్లం చెందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 30 కిలోల పత్తి, సోలార్ ప్యానెల్, బ్యాటరీలతో పాటు చోరీకి ఉపయోగించిన బొలెరో మ్యాక్స్ వాహనం, రూ.9,600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రైతుల ఫిర్యాదు మేరకు ఐదు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. -
బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ
బెల్లంపల్లి: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ సీఈఆర్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో బెల్లంపల్లి స్కైజిమ్కు చెందిన పలువురు బాడీ బిల్డర్లు పతకాలు సాధించారు. ఆదిలాబాద్ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో బెల్లంపల్లి స్కైజిమ్కు చెందిన జి.లక్ష్మణ్ (75 కిలోలు), జె.మొగిలి (80 కిలోలు), డి.ప్రశాంత్ (85 కిలోలు) ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. మాస్టర్స్ విభాగంలో పి.కృష్ణస్వామి (55 కిలోలు), తృతీయ బహుమతి, ఎం.రోహిత్ (60 కిలోలు) తృతీయ బహుమతి, జూనియర్స్ విభాగంలో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. జూనియర్స్ విభాగంలో మీర్జా హుమాయున్, ఎం.మహేష్, కె.నగేష్ ఐదోస్థానంలో నిలిచిట్లు స్కైజిమ్ నిర్వాహకులు పి.సదానందం, బాలకృష్ణ, చంద్రశేఖర్ తెలిపారు. -
నలుగురికి ఎకై ్సజ్ ఎస్సైలుగా పదోన్నతి
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నలుగురికి ఎకై ్సజ్ ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎం.రాజేశ్వర్, ఆదిలాబాద్ డీపీఈఓ కా ర్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అరుణ్ కుమార్, నిర్మల్ జిల్లా ఎకై ్సజ్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న బి.ముత్యం, కుమురంభీం ఆసిఫాబాద్ డీపీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న డి.రా జశేఖర్కు ఎకై ్సజ్ ఎస్సైలుగా పదోన్నతులు లభించాయి. పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య ఆసిఫాబాద్రూరల్: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ వరప్రసాద్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని సింగరావుపేట్ గ్రామానికి చెందిన పోచయ్య (55) ఈ నెల 23న మధ్యాహ్నం ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో ముందుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. పత్తి దిగుబడి తగ్గిందనే దిగులుతోనే పురుగుల మందు తాగినట్లు భార్య కనకలక్ష్మి ఇచ్చిన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం ప్రతిజ్ఞ దిలావర్పూర్: మండలంలోని గుండంపల్లిని గ్రామస్తులు సోమవారం ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సంధర్భంగా సర్పంచ్ తక్కల రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధానికి ప్రతిజ్ఞ చేశారు. గతంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసి ప్లాస్టిక్, పేపర్ రహితానికి నాంది పలికామని సర్పంచ్ తెలిపారు. ఇదే బాటలో పేపర్ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాస్లు, క్యారీ బ్యాగులను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రపతి పతకానికి ఎంపిక మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్ పి.వెంకటరాములు రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 2026 సంవత్సరానికిగానూ భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాబితాలో వెంకటరాములు చోటు దక్కించుకున్నారు. అసాధారణ సేవలకు గుర్తింపుగా లభించిన ఈ అత్యున్నత పురస్కారంపై బెటాలియన్ అధికారులు, సిబ్బంది వెంకటరాములును ప్రత్యేకంగా అభినందించారు. -
28 నుంచి క్రీడా సంబరాలు
కై లాస్నగర్: బోథ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఈనెల 28 నుంచి 30 వరకు ప్రేరణ పేరిట నిర్వహించనున్న జిల్లా స్థాయి క్రీడా సాంస్కృతిక సంబరాల పోస్టర్, లోగోను జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు, కలెక్టర్ రాజర్షిషా సోమవారం ఆవిష్కరించారు. పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా, సృజనాత్మక శక్తి వెలికితీసేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏడుగురు పోలీసులకు ‘అతిఉత్కృష్ట’ పతకాలుఆదిలాబాద్టౌన్: జిల్లా పో లీ సు శాఖలో పనిచేస్తున్న ఏ డుగురు పోలీసులకు రాష్ట్ర పోలీ సు శాఖ అతిఉత్కృష్ట సేవా ప తకాలు ప్రకటించింది. 2025 సంవత్సరంలో వారు అందించిన సేవలకు గాను ఈ పురస్కారాలు వరించాయి. జిల్లా కేంద్రంలోని పరేడ్ మై దానంలో సోమవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సదరు పోలీసులకు జిల్లా జడ్జి ప్ర భాకరరావు, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ చే తుల మీదుగా పతకాలు అందజేశారు. సేవా ప తకం అందుకున్న వారిలో ఆర్.ధారాసింగ్, గంగాసింగ్, సంజీవ్ కుమార్, సుధాకర్ రెడ్డి, జె. అర్జున్,శివాజీ, బి.శివన్న ఉన్నారు. సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలికై లాస్నగర్: సేంద్రియ విధానంలో సాగయ్యే ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలని కలెక్టర్ రా జర్షిషా అన్నారు. పట్టణంలోని కలెక్టర్చౌక్లో గల నేచరల్స్ కేంద్రంలో ఏర్పాటు చేసిన చెరు కు రసం మిషన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి, నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీల ధర్నాకు మద్దతుఆదిలాబాద్టౌన్: హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మంగళవారం చేపట్టనున్న ఎమ్మెల్సీల ధర్నాకు మద్దతు తెలుపుతున్నట్లు టీపీయూఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునిల్ కుమార్, వలభోజు గోపీకృష్ణ ప్రకటనలో తెలిపారు.విశ్రాంత ఉపాధ్యాయుల, ఉద్యో గుల పెండింగ్ బిల్లులు, పీఆర్సీ అమలు కోసం ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్కా కొముర య్య, అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. -
లీకేజీలే.. సమస్య
మున్సి ‘పల్స్’కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలో ప్రస్తుతం తాగునీటి ఇబ్బంది అంతగా లేనప్పటికీ లీకేజీలే ప్రధాన సమస్య. పైపులైన్లు, వాల్వ్ల వద్ద నిత్యం ఎక్కడో ఓ చోట లీకేజీలు ఏర్పడుతున్నాయి. సకాలంలో గుర్తించి మరమ్మతులు చేపట్టకపోవడంతో వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతుంది. అలాగే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక ఇళ్లలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నల్లాలకు ఆనాఫ్ బిరడాలు లేకపోవడంతోనూ నీరు వృథా అవుతుంది. పట్టణంలోని గాంధీనగర్, ఇందిరమ్మ కాలనీలోని కొంత భాగాలకు ఇప్పటికీ మిషన్ భగీరథ పైపులైన్లు పూర్తిస్థాయిలో చేరలేదు. విలీనమైన ఎంప్లాయీస్కాలనీ, తిరుమలనగర్, కృష్ణానగర్, అటెండెర్స్ కాలనీల్లో అసలు పైపులైన్లే వేయలేదు. దీంతో ఆయా వార్డుల్లోని ప్రజలు బోర్వెల్స్, చేతిపంపులపైనే ఆధారపడాల్సిన దుస్థితి. పట్టణంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అమృత్–2.0లో భాగంగా రూ.200 కోట్లు మంజూరు చేసినా ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వచ్చే వేసవిలోనూ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. మౌలిక వసతుల్లో కీలకమైన తాగునీటి సరఫరాలో తలెత్తే ఇబ్బందులు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతను మార్చనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.పట్టణంలో తాగునీటి సరఫరా వివరాలు మొత్తం పైపులైన్ : 424 (కిలోమీటర్లు) రిజర్వాయర్లు : 11 నిల్వ సంపు : 01 ప్రతిరోజు నీటి సరఫరా జరిగే వార్డులు : 25 రోజు విడిచిరోజు నీటి సరఫరా జరిగే వార్డులు : 24ఏడాదిగా నత్తనడకన సాగుతున్న అమృత్ రిజర్వాయర్ నిర్మాణ పనులు -
వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి
రాజవొమ్మంగి: వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేష్రాజుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సోమవారం రాత్రి కిండ్ర జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. రంపచోడవరంలో జరిగిన గణతంత్ర వేడుకలకు ఎంపీపీ గోము వెంకటలక్ష్మితో పాటు హాజరైన వెంకటేష్రాజు తిరిగి స్వగ్రామమైన రాజవొమ్మంగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి సమీపంలో కిండ్ర జంక్షన్ వద్ద వారి కారును దుండగులు ఆపారు. ఎందుకు ఆపారని అడిగేలోపే వెంకటేష్రాజును కారు నుంచి బయటకు లాగి పిడిగుద్దులు గుద్దారు. కుడిచేయి వంచేసి, దాడి చేశారు. ఈ ఘటనలో వెంకటేష్రాజు కుడి కంటిపై తీవ్ర గాయమైంది. ఈ హఠాత్తు పరిణామం నుంచి తెరుకున్న ఎంపీపీ వెంకటలక్ష్మి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను కూడా పక్కకు నెట్టేశారు. ఆమె చేతికి స్వల్ప గాయాలయ్యాయి. దుండగులు ఆయుధం తీసి హత్యా ప్రయత్నం చేయబోతుండగా, వెంకటేష్రాజుతో పాటు వెంకటలక్ష్మి తప్పించుకుని కారు ఎక్కి అతికష్టం మీద స్వగ్రామం చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జడ్డంగి ఎస్సై చినబాబు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రామకృష్ణ, సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు మురళీకృష్ణ వచ్చి వెంకటేష్రాజును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతుండగా, మెరుగైన వైద్యం కోసం ఆయన్ని రాజమహేంద్రవరం తరలించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండే బాధితుని వద్ద ఉన్న డబ్బులు, బంగారాన్ని దండుగులు లాక్కున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు జడ్డంగి ఎస్సై చినబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్లక్ష్యపు నీడలో...
అన్నవరం: సత్యదేవుడు వెలసిన రత్నగిరిపై ఏర్పాటు చేసిన పలభా యంత్రం (సూర్య గడియారం) నిర్లక్ష్యపు నీడలో వెలవెలబోతోంది. ఖగోళ, జ్యోతిష శాస్త్రాల ఆధారంగా సుమారు 80 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గడియారం ద్వారా సూర్యుని నీడ ఆధారంగా కచ్చితమైన సమయం తెలుసుకోవచ్చు. సత్యదేవుని ఆలయానికి ఈశాన్య భాగాన, స్వామివారి నిత్య కల్యాణ మండపం వద్ద ఈ సన్ డయల్ ఉంది. ఇలా ఏర్పాటైంది సూర్యుడి గమనం ఆధారంగా సమయం తెలుసుకునేలా ఈ సూర్య గడియారాన్ని 1943లో అప్పటి ఆలయ ధర్మకర్త ఇనుగంటి వేంకట రాజగోపాల రామసూర్యప్రకాశరావు కోరిక మేరకు ఖగోళ, జ్యోతిష శాస్త్రాల్లో నిష్ణాతుడైన రాజమహేంద్రవరానికి చెందిన పిడమర్తి కృష్ణమూర్తిశాస్త్రి రూపొందించారు. 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు కలిగిన గ్రానైట్ పలక మీద త్రికోణాకారంలో తూర్పు దిక్కుకు అభిముఖంగా మరో చిన్న పలకను నిలువుగా అమర్చారు. సూర్యకాంతి పడి దీని నీడ పెద్ద పలక మీద పడుతుంది. అలా నీడ పడే చోట అర్ధచంద్రాకారంగా గడియారంలో మాదిరిగా అంకెలుంటాయి. ఆ నీడ పడిన అంకెలకు ఆయా నెలలు, తేదీలను అనుసరించి కొంత సమయం కలపడం లేదా తీసివేయడం చేయాలి. తద్వారా కచ్చితమైన సమయం తెలుస్తుంది. ఉదాహరణకు జనవరి 25 మధ్యాహ్నం సూర్య గడియారంపై నీడ 12.25 గంటల మీద పడిందని అనుకుంటే అక్కడి సూచనల ప్రకారం ఆ తేదీకి 10 నిమిషాలు కలపాలి. అంటే అప్పుడు సమయం మధ్యాహ్నం 12.35 గంటలు అయినట్టు. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్టీ) కూడా కచ్చితంగా అదే సమయాన్ని చూపిస్తుంది. అంత కచ్చితంగా దీనిని రూపొందించారు. ఎప్పుడు ఎంత సమయం కలపాలి, ఎప్పుడు తీసివేయాలనే విషయాలను అక్కడి సూచనల పట్టికలో తెలిపారు. ప్రాభవం కోల్పోతూ.. సత్యదేవుని దర్శనం పూర్తయ్యాక భక్తులు చూసేందుకు రత్నగిరిపై ఉన్న ఏకై క ఆకర్షణ ఈ సూర్య గడియారం. ఎంతో విశిష్టత కలిగిన ఈ సూర్య గడియారం ఆలనా పాలనా చూసేవారే కరువయ్యారు. ఈ గడియారంలో సమయం చూసుకునేందుకు అక్కడి పలకపై వేసిన అంకెలు, సూచనలు, ప్లస్, మైనస్ గుర్తులు అరిగిపోయి స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో, ఇది ఓ పట్టాన అర్థం కాక భక్తులు అయోమయానికి గురవుతున్నారు. వీటిని దేవస్థానం అధికారులు మళ్లీ స్పష్టంగా రాయించేందుకు చర్యలు తీసుకోవాలి. అలాగే, గతంలో ఇక్కడ ‘సూర్య గడియారం’ అని రాసి ఉన్న పెద్ద ఫ్లెక్సీ ఉండేది. ప్రస్తుతం చిన్న బోర్డు మాత్రమే మిగిలింది. అక్కడ శాశ్వతంగా రథంపై సూర్య భగవానుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సూర్యగడియారానికి మరింత ఆకర్షణ చేకూరుతుంది. ఖగోళ, జ్యోతిష శాస్త్రాల ఆధారంగా రత్నగిరిపై సూర్య గడియారం నీడ ఆధారంగా కచ్చితమైన సమయం తెలుసుకునే వీలు అస్పష్టంగా మారిన సమయ పట్టిక -
గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి
చింతూరు: ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొఖ్వాల్ అన్నారు. స్థానిక ఐటీడీఏలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతిపాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం వంటి విలువలను ప్రతి పౌరుడు జీవితంలో ఆచరించాలన్నారు. పోలవరం నిర్వాసితులకు వీలైనంత త్వరగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణం, భూ నష్ట పరిహారం, భూమికి భూమి వంటి ప్రయోజనాలు అందేలా చర్యలు చేపడతామని చెప్పారు. అదేవిధంగా గిరిజనులకు విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక వసుతుల కల్పనకు ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా చింతూరు పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏఎస్పీ బొడ్డు హేమంత్ జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఏపీఓ తులసి, ఈఈ మురళి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పుల్లయ్య, జీసీసీ అధికారి సుబ్రహ్మణ్యం, సీఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
గోకవరం: తంటికొండ గ్రామంలో వెంకటగిరి కొండపై వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్నదొర, ఈఓ ఉదయబాబు నాయుడు ఆధ్వర్యాన స్వామి వారిని పల్లకిలో ఉంచి, తూర్పు మెట్ల మీదుగా కిందకు గ్రామంలోకి తీసుకువచ్చి, వెంకటగిరి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం, ఆలయ ప్రాంగణంలో స్వామి వారి నిజ పాదముద్ర వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి విశేష పూజలు, శ్రీలక్ష్మీ నారసింహ సహిత మహా సుదర్శన హోమం, అభిషేకాలు నిర్వహించారు. -
సగర్వంగా.. ఎగిరింది తిరంగా..
● అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు ● ఆకట్టుకున్న పోలీసుల కవాతు, శకటాల ప్రదర్శన ● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు రంపచోడవరం: మువ్వన్నెల జెండా ఎగిరింది.. ప్రతి మదీ మురిసింది.. జిల్లా స్థాయి గణతంత్ర సంబరాలకు రంపచోడవరం వేదికై ంది. ఒకవైపు పోలీసుల కవాతు.. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇంకోవైపు అభివృద్ధి నమూనాల ప్రభుత్వ శకటాల ప్రదర్శనలతో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కొత్త జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కలసికట్టుగా పనిచేద్దామని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్రాజ్ పిలుపునిచ్చారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా సోమవారం రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు), ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి, ఎస్టీ కమిషన్ మెంబర్ గొర్లె సునీత, సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్, ఓఎస్డీ పంకాజ్ కుమార్మీనా, ఏఎస్పీ బి.హేమంత్, డీఎఫ్ఓ శివకుమార్ గంగల్, డీఎస్పీ సాయిప్రశాంత్, సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పూర్తి స్థాయిలో 1950వ సంవత్సరం జనవరి 26న అమల్లోకి వచ్చిందన్నారు. దీనిని పురస్కరించుకుని గణతంత్ర దినోత్సవాన్ని ఏటా జరుపుకొంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 17,323 మంది రైతులకు 11.385.10 క్వింటాళ్ల వరి విత్తనాలను అందించామని జేసీ తెలిపారు. అదేవిధంగా 2,909 మంది రైతులకు 288.6 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు, 7,175 మందికి 818.46 క్వింటాళ్ల అపరాల విత్తనాలు పంపిణీ చేశామన్నారు. ఉద్యాన పంటల అభివృద్ధికి 1,255 ఎకరాల్లో జీడిమామిడి, 155 ఎకరాల్లో సీతాఫలం తోటలు కొత్తగా వేయించామన్నారు. అదేవిధంగా 1,188 ఎకరాల్లోని ముదురు జీడిమామిడి తోటల్లో తోటల పునరుద్ధరణ పథకం అమలు చేశామని అన్నారు. మాతా శిశు మరణాల నివారణకు వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా తగిన చర్యలు తీసుకుంటున్నామని జేసీ తెలిపారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ, జీపీఎస్, సంక్షేమ, గురుకుల తదితర పాఠశాలలు, వసతి గృహాల్లో 44,093 విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయిలో తాగునీటి కోసం.. గ్రామీణ నీటిపారుదల శాఖ ద్వారా రూ.133.65 కోట్లు మంజూరు కాగా, 529 గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందిస్తున్నామని జేసీ స్మరణ్రాజ్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ద్వారా పీఎం జన్మన్ ఫేజ్ 1, 2 ద్వారా 31 మల్టీపర్పస్ సెంటర్లకు నిధులు మంజూరు కాగా 19 పనులు పూర్తి చేశారని వివరించారు. పేదలకు పక్కా గృహాల నిర్మాణంలో భాగంగా పీఎం గ్రామీణ పథకం ద్వారా 2,998 గృహాలకు నిధులు మంజూరు కాగా 789 ఇళ్లు పూర్తి చేశారన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ ద్వారా పీఎం జన్మన్ పథకం కింద రూ.1,576 లక్షల అంచనాతో 4,269 విద్యుత్ లేని పీవీ టీజీల గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. నాబార్డ్ నిధులతో జడ్డంగి గ్రామం నుంచి గొంటువానిపాలెం గ్రామాల మధ్యలో 9.20 కిలోమీటర్ల రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. అటవీ హక్కుల చట్టం ద్వారా వ్యవసాయం చేసుకుంటున్న 24,587 గిరిజన రైతులకు 82,646 ఎకరాల భూమికి ఆర్వోఎఫ్ఆర్ చట్టం ద్వారా పట్టాలు అందించామన్నారు. జిల్లాలోని 8 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో 669 అంగన్వాడీ కేంద్రాల ద్వారా రోజూ బాలబాలికలకు ప్రభుత్వం నిబంధన ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పోలవరం నిర్వాసితులకు భూమికి భూమి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పర్యాటక అభివృద్ధి దిశగా.. ఎకో టూరిజం ద్వారా గుడిస, మారేడుమిల్లి, వాలమూరు, రంప పర్యాటక ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జేసీ తెలిపారు. అదేవిధంగా గుడిస, పిడమర్రి గ్రామస్తులకు జీవనోపాధి నిమిత్తం టెంటు సామగ్రి అందించామన్నారు. తొలుత జేసీ పోలీస్ కవాతు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన శకటాలను ముఖ్య అతిథులు తిలకించారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధులు చంద్రయ్య ముదిమనువలు సత్యనారాయణ, శివ, వెంకటరమణ, గంటందొర మనుమలు పండా ఆదినారాయణదొర, మల్లుదొర మనమడు కుంజం వెంకటేశ్వర్లుదొర, అల్లూరి మనమడు శ్యామల వెంకటరామయ్యలను జేసీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎమ్మెల్యేలు సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో 9 పాఠశాలలు పాల్గొనగా ఇర్లపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల, రంపచోడవరం డీఎడ్ కళాశాల, బాలుర ఆశ్రమ పాఠశాలకు వరుసగా మొదటి మూడు స్థానాలు దక్కాయి. వివిధ శాఖల శకటాల ప్రదర్శనలో డీఆర్డీఏ వెలుగు ప్రథమ, వైద్య ఆరోగ్య శాఖ ద్వితీయ, ఏపీ ఈపీసీడీసీఎల్ మూడో స్థానాల్లో నిలిచారు. విధుల్లో ఉత్తమ సేవలు అందించిన 200 మందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను జేసీతో కలసి ఎమ్మెల్సీ అనంతబాబు సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీలు బందం శ్రీదేవి, కె ఆనంద్, జెడ్పీటీసీలు పండా వెంకటలక్ష్మి, గొర్లె బాలాజీబాబు, బేబిరాణి, వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, సర్పంచ్ మంగా బొజ్జయ్య, ఎంపీటీసీ ఉలవల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అడ్డతీగల: వైద్య ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీఏ రత్నరాజు అన్నారు. సోమవారం అడ్డతీగలలో యూనియన్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు పి.సత్యవతి, బి.దుర్గారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతులు కల్పించాలన్నారు. మహిళా ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని అన్నారు. గత 14 మాసాలుగా సీతపల్లి ఆసుపత్రి స్టాఫ్ నర్స్ జీతాలు ఇవ్వడం లేకపోవడాన్ని తప్పుపట్టి, ఆమె జీతాల బిల్లులు ప్రొసీడింగ్ ఆర్డర్లు యూనియన్ పోరాటం వల్ల రప్పించామన్నారు. నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బకాయి ఉన్న జీతభత్యాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎస్టీ బ్యాక్ లాగ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని జిల్లా అధ్యక్షురాలు పి.సత్యవతి అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎఫ్టీఏ, డీఏ, యూనిఫామ్, అలవెన్స్ వంటివి మంజూరు చేయాలని యూనియన్ ఉపాధ్యక్షుడు బి.దుర్గారావు కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బి.యోహాన్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఆమోదించడం దుర్మార్గం రాయవరం: కార్మికులకు నష్టాన్ని కలిగించే కేంద్ర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకుండా అసెంబ్లీలో ఆమోదించడం దుర్మార్గ చర్యగా తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ కార్మిక సంఘ నాయకుడు రాగుల రాఘువులు, ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని చెల్లూరు పంచాయతీలో సోమవారం కార్మిక సమస్యలపై మాట్లాడేందుకు వచ్చిన సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికులకు రక్షణగా ఉన్న 26 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూలంగా లేబర్ కోడ్లను మార్చి పోరాడి సాధించుకున్న 8గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటల భారాన్ని కార్మికుల మీద రుద్దుతున్నారన్నారు. లేబర్ కోడ్ల రద్దు కోరుతూ ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు వేతనాలు మొదటి వారంలో ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న అరియర్స్ చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు జొన్నకూటి రవికుమార్, లంక రాంబాబు పాల్గొన్నారు. భీష్మ ఏకాదశి ఏర్పాట్లపై నేడు సమీక్ష అన్నవరం: ఈ నెల 29న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి ఒకటో తేదీన మాఘ పౌర్ణమి, మాఘ మాసంలో ఇతర పర్వదినాల సందర్భంగా సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నారు. -
బీఆర్ఎస్కు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రాజీనామా
● ఏఐఎఫ్బీలో చేరిన రంగినేని మనిషాఆదిలాబాద్టౌన్: బీఆర్ఎస్కు రాజీనామా చేసినట్లు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనిషా పవన్రావ్ తెలిపారు. పట్టణంలోని ప్రింట్ మీడియా ప్రెస్క్లబ్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్లో గౌరవం లేని కారణంగా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)లో చేరినట్లు తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తనతో పాటు తన కుటుంబ సభ్యులు స్వార్థ రాజకీయాలకు బలైనట్లు పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆఖరి నిమిషం వరకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని నమ్మించి అవమానపర్చినప్పటికీ పార్టీలో కొనసాగినట్లు పేర్కొన్నారు. తా ను 2014 నుంచి 2019 వరకు మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశానని, పదవీ కాలంలో పార్టీ పెద్దలు కూడా అనేక ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ త రఫున మళ్లీ పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
‘బీజేపీతోనే పట్టణాభివృద్ధి’
ఆదిలాబాద్: బీజేపీతోనే పట్టణ అభివృద్ధి సా ధ్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, వివేకానంద కాలనీ, అగ్రజా టౌన్షిప్లలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలు సుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడు తూ, రాజకీయాలకతీతంగా ఆదిలాబాద్ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అన్నివిధాలుగా కృషి చేస్తున్నామన్నారు. పట్టణ పరిధి లో ఇప్పటికే కోట్ల నిధులతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయ ని తెలిపారు. మున్సిపాలిటీలో బీజేపీ విజ యం సాధిస్తే మరిన్ని ప్రగతి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు స్వామిరెడ్డి, తిరుమలేష్, అడెల్లు, కాళి దాస్, సాయి, గోపి తదితరులున్నారు. -
‘ప్రత్యేక’ పాలనకు ఏడాది
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రత్యేకాధికారి పాలన అమల్లోకి వచ్చి నేటితో సరిగ్గా ఏడాది. పాలకవర్గ గడువు గతేడాది జనవరి 26న ముగిసింది. ఎన్నికల ప్రక్రియ జరగకపోవడంతో ప్రత్యేకాధికారి పాలన అనివార్యమైంది. దీంతో గ్రేడ్–1 స్థాయి కలిగిన జిల్లాలోని ఏకై క మున్సిపాలిటీకి అప్పటి ఐటీడీఏ పీవో, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తాను ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా నియమించింది. అదే నెల 27న బాధ్యతలు స్వీకరించిన ఆమె సెప్టెంబర్ 18 వరకు స్పెషలాఫీసర్గా కొనసాగారు. ఏడు నెలల 21 రోజుల పాటు బల్దియా ప్రత్యేకాధికారిగా విధులు నిర్వహించినప్పటికీ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించకపోవడం గమనార్హం. బాధ్యతలు సైతం ఉట్నూర్లోనే స్వీకరించారు. అధికారులతో ఎలాంటి సమీక్షలు కూడా నిర్వహించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే సదరు అధికారి సెలవుపై వెళ్లడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న ఎస్.రాజేశ్వర్ను ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా నియమించింది. గతేడాది సెప్టెంబర్ 19న ఆయన స్పెషలాఫీసర్గా బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మున్సిపల్ కార్యాలయాన్ని రెగ్యులర్గా సందర్శిస్తున్నారు. అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ బల్దియాపై ఇంకా పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగానే బల్దియా వీధి దీపాల నిర్వహణ టెండర్లలో అక్రమాలు చోటు చేసుకుని రీటెండర్ నిర్వహణ వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై పర్యవేక్షణ కొరవడి గాడి తప్పినట్లుగా పట్టణవాసులు చర్చించుకుంటున్నారు. త్వరలోనే ఎన్నికల నగారా మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికకు త్వరలోనే నగారా మోగనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అవసరమైన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఎంపిక, బ్యాలెట్ బాక్స్లు వంటి వాటి ప్రక్రియ పూర్తి చేశారు. అలాగే స్థానికుడైన కమిషనర్ సీవీఎన్.రాజుకు స్థానచలనం కల్పించిన ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్త కమిషనర్ను నియమించింది. ఇదిలా ఉంటే త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలోపు ప్రక్రియను సైతం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చర్చ సాగుతోంది. ఇదే జరిగితే త్వరలోనే మున్సిపల్ నూతన పాలకవర్గం కొలువుదీరే అవకాశముంది. -
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
కై లాస్నగర్: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని, దానిని తప్పనిసరిగా వినియోగించుకో వాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్సీసీ కేడెట్స్, విద్యార్థులతో స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి జెడ్పీ సమావేశ మందిరం వరకు ఓటరు చైతన్య ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జెడ్పీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రలోభాలకు గురై ఓటు వేస్తే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే నైతిక హక్కును కోల్పోతారన్నారు. అనంతరం సీనియర్, నూతన ఓటర్లను శాలువాలతో సత్కరించారు. ఫొటోలతో కూడిన ఎపిక్ కార్డులు అందజేశారు. అలాగే పలువురు అధికారులకు ప్ర శంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, డీఎస్పీ జీవన్రెడ్డి, డీఐఈవో జాదవ్ గణేశ్ పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలి ఉట్నూర్రూరల్: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విని యోగించుకోవాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలోని కుమురంభీం కాంప్లెక్స్ నుంచి పాత బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్ర జాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. ఇందులో తహసీల్దార్ ప్రవీణ్, సీఐ ప్రసాద్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. -
వేతన వెతలు తీరేలా..
సాక్షి,ఆదిలాబాద్: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఇక వేతన ఇక్కట్లు తొలగిపోనున్నట్ల తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి వారి బ్యాంకు ఖాతాలకే నేరుగా వేతనాలు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రెగ్యులర్ ఉద్యోగుల వివరాలు ఉండే ఇంటిగ్రేడేట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం(ఐఎంఎఫ్ఎస్) పోర్టల్లో వీరి వివరాల నమోదు ప్రక్రియ ఇటీవల చేపట్టింది. ఒకవేళ ఇది అమలైతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ శాఖల్లో హెచ్వోడీలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఆ ఏజెన్సీలు పాల్పడుతున్న అక్రమాలకు చెక్ పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆయా శా ఖల హెచ్వోడీలు, ఏజెన్సీలు అందించే వేతనాల్లో కోత విధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతే కా కుండా వేతనాలు సైతం మూడు నుంచి ఆరు నెలల వరకు పెండింగ్లో పెట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా ఉద్యోగులు ఏళ్లుగా పోరా టం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో వారు చేపట్టిన ఆందోళనలతో ప్రభుత్వం ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారి పూర్తి వివరాలను ఇటీవల ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేసింది. తద్వారా ఈ ఉద్యోగులకు డైరెక్ట్గా వారి అకౌంట్లో ప్రతి నెల జీతం జమ చేసేలా చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. వెలుగులోకి పలు అక్రమాలు.. ప్రధానంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఆయా ఏజెన్సీలు ప్రతినెలా వారికి చెల్లించాల్సిన వేతనాల్లో భారీగా కోత పెట్టి ఇస్తున్నారనే ఆరోపణ లు ముందు నుంచి ఉన్నాయి. అంతే కాకుండా వారి కి సంబంధించి పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకపోవడంతో భద్రత లేకుండా పోతుందని ఆ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ఏజెన్సీలు జీఎస్టీ కూ డా చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండీ కొడుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. ఇటీవల ఐఎఫ్ఎంఎస్లో వివరాలు నమోదు చేసినప్పుడు ఔట్సోర్సింగ్ ప్రక్రియలో ఒకే వ్యక్తి పలు పోస్టుల్లో ఉన్నట్టుగా రాష్ట్ర పరిధిలో తేలింది. జిల్లాలోనూ ఓ వ్యక్తి నాలుగు పోస్టుల్లో చెలామణి అయినట్లు వెల్ల డెంది. ఐఎఫ్ఎంఎస్లో ఆధార్, ఫోన్నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలను నమోదు చేయడంతో ఇ లాంటివి వెలుగులోకి వచ్చాయి. అసలు ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వారు ఎవరు, ప్ర స్తుతం పనిచేస్తున్నాడా.. లేదా.. తొలగించిన పక్షంలో ఆ వివరాలు ప్రభుత్వ శాఖలకు అందజేస్తున్నారా.. మళ్లీ ఆ పోస్టులో అనుమతి తీసుకొనే వేరొకరిని నియమిస్తున్నారా.. ఇలాంటి అనేక అక్రమాలు ఈ ప్రక్రియలో ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఒక ఉద్యోగి వెళ్లిపోతే ఆ స్థానంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమ పద్ధతుల్లో వేరొకరిని నియమించడం వంటివి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలలో నిత్యం జరిగే తంతు. దీంతోనే ప్రభుత్వం ఈ వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.జిల్లాలోని ఉద్యోగుల వివరాలు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 2,000 కాంట్రాక్ట్ ఉద్యోగులు సుమారు 1000 -
ఎండీఎం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్టౌన్: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐతో పాటు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. త్వరలో నిర్వహించే మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములు, అనిత, సునిత, రుకుంబాయి, రాంబాయి తదితరులు పాల్గొన్నారు. -
● మున్సిపల్లో నిర్వహణ అస్తవ్యస్తం ● పలుకాలనీల్లో కనిపించని డ్రెయినేజీలు ● పత్తాలేని ‘అండర్గ్రౌండ్’ నిర్మాణం ● మొక్కుబడిగా ఇంటింటి చెత్త సేకరణ
కై లాస్నగర్: ప్రజలు ఆరోగ్యంగా జీవించాలంటే పారిశుద్ధ్య నిర్వహణ ఎంతో కీలకం. గ్రేడ్–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇది గాడి తప్పుతోంది. విలీన కాలనీలతో పాటు పలు పాత వార్డుల్లోనూ డ్రెయినేజీల నిర్మాణం జరుగకపోవడంతో మురుగునీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో ఆయా కాలనీల్లో దుర్గంధం వెదజల్లుతోంది. ప్రధానంగా వర్షాకాలంలో దోమల బెడద అధికమై ప్రజలు రోగాల బారిన పడాల్సి వస్తోంది. పారిశుద్ధ్య కార్మికులుగా నియామకమైన పలువురిని శుభ్రత పనుల్లో కాకుండా ఇతర చోట్ల నియమించారు. దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఏర్పడి ఆయా పనులపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్రెయినేజీల్లోని పూడిక తొలగింపు సకాలంలో జరగకపోగా, ఇంటింటి చెత్త సేకరణ సైతం సక్రమంగా చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెగ్యులర్గా చెత్తబండ్లు రాకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపంతో పలు కాలనీల్లో అనధికార చెత్తడంపులు దర్శనమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద కోట్లాది రూపాయలను అండర్గ్రౌండ్ డ్రెయినేజీ కోసం మంజూరు చేయగా ఆ పనుల జాడ లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో పారిశుద్ధ్య నిర్వహణ అంశం సైతం ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. మున్సి ‘పల్స్’ -
వసతి.. అధోగతి
పాత పాఠశాల భవనం కూల్చి వేయడంతో చీకటి పడితే నిద్రపోవడానికి జాగా లేకపోయింది. దీంతో ఇక్కడ చదువుకుంటున్న 125 మంది విద్యార్థులు కటిక చలిలో గజగజ వణుకుతూ 500 మీటర్ల దూరంలోని ఎంపీపీ పాఠశాలకు రాత్రి 10 గంటల ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లి నిద్రిస్తున్నారు. తిరిగి తెల్లవారుజామున 5 గంటలు కాగానే మళ్లీ రగ్గులు కప్పుకుని ఆదరాబాదరాగా మాతృ పాఠశాలకు వస్తున్నారు. గత నెలన్నరగా ఈ దయనీయ పరిస్థితిని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల నిర్వహణ కోసం నిర్మించిన కొత్త భవనానికి అమర్చడానికి తీసుకొచ్చిన తలుపులు, కిటికీలు, ద్వార బంధాలన్నీ ఓ మూలన పడి ఉన్నాయి. కనీసం వాటిని కూడా అందుబాటులో ఉన్న ఐదు గదులకు అమర్చడం లేదు. ఈ భవనం నిర్మాణం కోసం ఎంతెంత నిధులు ఖర్చు చేశారనే దానిపై అప్పటి హెచ్ఎం నుంచి సమాధానం రాకుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల వెతలు తీర్చాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ఎంఈఓ పి.శ్రీనివాసరావును వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాల భవన నిర్మాణానికి వెచ్చించిన నిధులు, ఇతరత్రా అంశాలపై అప్పటి హెచ్ఎంను వివరాలు కోరామన్నారు. దానికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఇంకా ఏడిపింఛెన్
● పేద కుటుంబానికి పెద్ద కష్టం ● మంచానికే పరిమితమైన ఇద్దరు పిల్లలు ● కనీసం పింఛను అందని దయనీయ పరిస్థితులుప్రతి క్షణం దగ్గర ఉండాల్సిందే.. మా ఇద్దరి పిల్లలకు చిన్నతనం నుంచి వైకల్యం ఉంది. వారిని కంటి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాం. అనేక ఆసుపత్రులకు తిప్పాం. మా స్తోమతకు తగ్గ ఖర్చు చేశాం. నయం మాత్రం కాలేదు. వీరికి అన్నం పెట్టే దగ్గర నుంచి స్నానం చేయించే వరకూ అన్నీ దగ్గర ఉండి చూసుకోవాల్సిందే. మా కుటుంబ పోషణ ఇబ్బందిగా మరింది. రోజువారీ కూలీకి వెళ్తేనే పూట గడిచేది. ప్రభుత్వం స్పందించి మా ఇద్దరి పిల్లలకు పింఛను ఇప్పించి ఆదుకోవాలి. – లక్ష్మి, మహేష్, చిన్నారుల తల్లిదండ్రులు వీఆర్పురం: కుటుంబ పెద్ద కూలి పనులకు వెళ్తేనే రోజు గడిచేది.. అలాంటి ఇంట్లో ఇద్దరు చిన్నారులకు పెద్ద కష్టం వచ్చింది.. వారు చిన్నతనం నుంచి వినలేరు, కూర్చోలేరు, నడవలేరు.. అంగవైకల్యం మంచానికే పరిమితం చేసింది.. ఇంతటి కష్టంలోనూ ఆ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించడంలో నిర్లక్ష్యం వెంటాడుతోంది.. కనీసం పింఛను కూడా అందించకపోవడం శోచనీయం. ఆ దయనీయ గాథలోకి వెళ్తే.. వీఆర్ పురం మండలం రేఖపల్లి గ్రామంలో గొల్లగూడేనికి చెందిన మోడెం లక్ష్మి, మహేష్ భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆడపిల్ల స్పందనకు ఏడేళ్లు కాగా, అబ్బాయి సంతోష్కు ఐదేళ్లు. వైకల్యం రీత్యా వారు మాట్లాడలేరు. వినలేరు, కూర్చోలేరు. నడవలేరు. లేవలేని స్థితిలో ఉన్నారు. అనేక సార్లు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. మూడు నెలల కిందట బాలిక స్పందనకు సదరమ్ సర్టిఫికెట్ను పింఛనుకు అర్హతతో ఇచ్చారు. సంతోష్కు మాత్రం జీరో పర్సంటేజీతో అర్హత లేదని సర్టిఫికెట్ అందించారు. స్పందనకు అయినా పింఛను ఇస్తారని అధికారులు, నాయకుల చూట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని లక్ష్మి, మహేష్ దంపతులు వాపోతున్నారు. తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేని దీనస్థితిలో ఉన్నామని అంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పింఛను కోసం తిరిగి.. తిరిగి విసిగిపోయామని అంటున్నారు. మహేష్ కూలి పనులకు వెళ్తేనే పూట గడిచే పరిస్థితి. ఇద్దరి పిల్లల ఆలనా పాలనా కోసం తల్లి దగ్గర ఉండాల్సి వస్తోంది. సంతోష్కు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయని, ప్రభుత్వం సాయం చేసి తమ ఇద్దరి పిల్లల ప్రాణాలు కాపాడాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. దివ్యాంగులైన పిల్లలకు సరైన వైద్య సహాయం కోసం నెలవారీ పింఛనుతో పాటు, తనకు శాశ్వత ఉపాధి కల్పిస్తే ఆసరాగా ఉంటుందని మహేష్ అంటున్నారు. -
సూర్యప్రభ వాహనం.. శ్రీవారికి వైభవం
కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య స్వామివారు సూర్యప్రభ వాహనంపై విహరించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు నిత్య పూజల అనంతరం రథసప్తమి పర్వదినం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు జరిపారు. వేంకటేశ్వరస్వామికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. మాఢ వీధుల్లో శ్రీవారిని సూర్యప్రభ వాహనంపై విశేషంగా స్వర్ణాభరణాల అలంకార భూషితునిగా అలంకరించి ఊరేగించారు. ఆ సమయంలో భక్తకోటి అఖండ గోవింద నామస్మరణ, వేంకటేశ్వరస్వామి సంకీర్తనలతో వాడపల్లి క్షేత్రం ప్రతిధ్వనించింది. వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సూర్యప్రభ వాహనంపై స్వామివారిని కనులారా వీక్షించి తన్మయత్వం చెందారు. అనంతరం ఆలయంలో మూలవిరాట్ను దర్శించుకుని, తీర్థప్రసాదాలు, అన్న ప్రసాదం స్వీకరించారు. గోవిందమాల దీక్షధారణ మాఘ శుద్ధ సప్తమి సందర్భంగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తులు గోవిందమాల దీక్షధారణ (శ్రీనివాస శరణాగత దీక్ష) చేపట్టారు. వచ్చే నెల 16వ తేదీ మాఘ బహుళ చతుర్ధశి వరకూ భక్తులు గోవిందమాల ధరించి, 23 రోజుల పాటు అర్ధ మండల దీక్ష చేస్తారు. 16న పూర్ణాహుతితో ఈ దీక్ష పూర్తవుతుందని వారు తెలిపారు. దీక్ష చేపట్టిన భక్తులను డీసీ అండ్ ఈఓ చక్రధరరావు అభినందించారు. -
కె.పెదపూడిలో అగ్ని ప్రమాదం
అంబాజీపేట: విద్యుత్ షార్ట్ స ర్క్యూట్ కారణంగా ఆదివారం ఓ పెంకుటిల్లు కాలిపోయింది. దీనికి సంబంధించి స్థానికుల కథనం ప్రకారం.. కె.పెదపూడిలో రుక్మిణీ సత్యభామా సమేత కృష్ణారాయుడు దేవస్థానం అర్చకుడు, టీవీ మెకానిక్ పాణింగపల్లి గోపాలాచార్యులుకు చెందిన పెంకుటిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో 5 ఎల్ఈడీ టీవీలు, ఫ్రిజ్, ఏసీలు, వాషింగ్ మెషీన్, రూ.80 వేలు, నాలుగు తులాల బంగారం, 10 తులాల వెండితో పాటు గృహోపకరణాలు, విలువైన పత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. అమలాపురం అగ్నిమాపక సి బ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.25 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. గోపాలాచార్యులు ఎలక్ట్రికల్ మెకానిక్ కావడంతో కస్టమర్లు రిపేర్లకు ఇచ్చిన వస్తువులు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
జాతులు, భాషలు వేరైనా మనమంతా భరతమాత బిడ్డలమే అని చాటి చెప్పేలా గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకోనున్నారు. జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని ఆదివారం పలుచోట్ల సంబరాలు జరిగాయి. ఆ వివరాల సమాహారమే ఇది.
కడియం పల్ల వెంకన్న నర్సరీలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మొక్కల కూర్పు ఆకట్టుకుంది. దేశ భక్తిని, ప్రకృతి సౌందర్యాన్ని ఒకే వేదికపై ప్రతిబింబించే విధంగా అశోక చక్రం, రిపబ్లిక్ డే సందేశాన్ని ఆకర్షణీయంగా ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, జాతీయ పండుగల ప్రాధాన్యం ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్లు నర్సరీ అధినేతలు పల్ల సత్యనారాయణమూర్తి, వెంకటేష్, వినయ్ తెలిపారు. – కడియంకడియపులంకలోని పుల్లా ఆంజనేయులుకు చెందిన శ్రీసత్యదేవ నర్సరీలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మొక్కల అమరిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు రెండు లక్షల మొక్కలతో భారతదేశం ఆకృతిని ఏర్పాటు చేశారు. రైతుల భాగస్వామ్యంతో దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ దీనిని ఏర్పాటు చేసినట్లు నర్సరీ రైతులు తెలిపారు. – కడియంమామిడికుదురు దీప్తి పాఠశాల విద్యార్థులు పిరమిడ్ ఆకారంలో ఏర్పడి త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ సందడి చేశారు. దేశభక్తిని చాటేలా ఈ ప్రదర్శన సాగింది. విద్యార్థులను కరస్పాండెంట్ డీవీవీ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ యక్కలదేవర నాగన్నబాబు, ఉపాధ్యాయులు అభినందించారు. – మామిడికుదురు -
పడక మరోచోట
పాఠాలు ఒకచోట..ఆశ్రమ విద్యకు గ్రహణం పట్టింది.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు అసౌకర్యాల నడుమ చదువుకోవాల్సిన దుస్థితి వచ్చింది.. గత ప్రభుత్వంలో ‘నాడు– నేడు’ నిధులతో చేపట్టిన భవన నిర్మాణ పనులను నిలిపివేయడంతో లక్ష్యం నీరుగారుతోంది.. అటు ప్రభుత్వం వైఖరికి తోడు క్షేత్రస్థాయిలో అధికారుల బాధ్యతా రాహిత్యం విద్యార్థులకు శాపంలా మారింది. వారికి కష్టాలు తెచ్చిపెట్టింది. అడ్డతీగలలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అడ్డతీగల: వసతి, విద్య ఒకేచోటే కల్పించి గిరిజనుల్లో అక్షర జ్ఞానం నింపేందుకు ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. అలాంటి చదువుల కోవెలలో అసౌకర్యాలు విసిగిపోయేలా చేస్తున్నాయి.. అడ్డతీగలలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను 1980లో నిర్మించారు. ఈ భవనంలో 8 గదుల్లో ఉండేవి. అక్కడే విద్యార్థులకు చదువు, వసతి కల్పించేవారు. అక్కడి విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి రూ.1.30 కోట్లను ‘నాడు–నేడు’ పథకంలో మంజూరు చేసింది. దీనిని పాత పాఠశాల భవనానికి పక్కనే నిర్మించేందుకు పనులు చేపట్టారు. ఈ పనులు గత హెచ్ఎం పర్యవేక్షణలో జరిగాయి. కొత్త భవనంలో కింద అంతస్తులో ఐదు, పైఅంతస్తులో ఐదు గదులు ఉండేలా కార్యాచరణ చేశారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ భవనం అంపూర్తిగానే ఉంది. దీనిని పూర్తి చేయించడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఒకటో అంతస్తు నిర్మించి రెండో అంతస్తులో పిల్లర్లు వేశారు. కానీ గోడలు, శ్లాబ్ వేయకుండా వదిలేశారు. మొదటి అంతస్తులో గదుల నిర్మాణం చేపట్టారు. కానీ ఫ్ల్లోరింగ్, కిటికీలు, తలుపులు, విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. ఈ భవనం పూర్తి చేయించకుండా ప్రభుత్వం నిధులను ఆపేసింది. దీనివల్ల అసౌకర్యాల నడుమ ఆ అసంపూర్తి భవనంలోనే తప్పనిసరి పరిస్థితిలో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతోంది. ఇలా 125 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నది వదిలేసి.. కొత్తగా మొదలెట్టి పాఠశాల తరగతి గదుల నిర్మాణం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అసంపూర్తిగా వదిలేశారు. ఇదిలా ఉంటే పాఠశాల పాత భవనాన్ని గత డిసెంబర్లో కూలగొట్టారు. ఆ స్థానంలో రూ.2.75 కోట్ల అంచనాతో వసతి గృహం నిర్మాణానికి పనులు మొదలుపెట్టారు. వసతి గృహం కింద అంతస్తులో 7 గదులు, రెండో అంతస్తులో 7 గదులు నిర్మిస్తామని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో పాత పాఠశాల భవనంలో తరగతుల నిర్వహణ, వసతి సౌకర్యం ఉండేది. ఇప్పుడు విధి లేక అసంపూర్తి భవనంలోనే 5 నుంచి 10 తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ భవనం మొదటి అంతస్తులో ఐదు గదుల్లో ఒకటి స్టాఫ్రూమ్గా, మరొకటి స్టోర్ రూమ్గా పాత తలుపులు అమర్చుకుని ఉపయోగిస్తున్నారు. మిగతా మూడు గదులకు తలుపులు, కిటికీలు లేవు. అరకొర సౌకర్యాల నడుమ విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజులు గడుపుతున్నారు. అడ్డతీగల ఆశ్రమ పాఠశాలలో పరిస్థితి 125 మంది విద్యార్థుల దీనస్థితి రూ.1.30 కోట్లు ఖర్చు చేసినా పూర్తి కాని భవనం అరకొర సౌకర్యాల నడుమ విద్యాభ్యాసం -
భాస్కరం... ప్రణమామ్యహం
● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రథసప్తమి వేడుకలు ● కిక్కిరిసిన ప్రముఖ ఆలయాలుపెదపూడి: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలోని సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సూర్యభగవానుడి పుట్టిన రోజైన రథసప్తమి పర్వదినం సందర్భంగా రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ కొవ్వూరి శ్రీనివాసు బాలకృష్ణారెడ్డి తదితరులు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. తొలుత సూర్యభగవానుడి దేవేరులైన ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ ఉత్సవమూర్తులను ఆలయం బయట ఉంచిన రథంలో ఆశీనులు గావించారు. అనంతరం అర్చకుల మంత్రోచ్ఛరణల నడుమ రథోత్సవాన్ని ప్రారంభించారు. సూర్యనారాయణ నామస్మరణతో ఆలయ ఉత్సవ కమిటీ, గ్రామ యూత్, భక్తులు ఉత్సాహంగా రథాన్ని ముందుకు లాగారు. స్వామివారిని వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే, కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి దర్శించుకున్నారు. కొంత సేపు ప్రత్యేక పూజల్లో కూర్చున్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఉత్సవమూర్తుల పల్లకిని చంద్రశేఖర్రెడ్డి, జగ్గిరెడ్డి కొంతసేపు భుజంపై పెట్టుకుని మోశారు. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దేశంలో వైష్ణవ సంప్రదాయం గల ఆలయంగా ప్రసిద్ధి గాంచిందన్నారు. సుమారు 124 సంవత్సరాల చరిత్ర గల సూర్యదేవాలయంగా పేరొందిందన్నారు. ప్రతి ఏటా స్వామివారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం అభినందనీయమని ఉత్సవ కమిటీని అభినందించారు. వారికి ఆలయ కమిటీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు, స్థానిక యువనేత చింతా దొరబాబు ఆధ్వర్యంలో తీన్మార్ డప్పులు, భారీ బాణసంచాతో స్వాగతం పలికారు. ఆలయ ఈఓ పాటి సత్యనారాయణ భక్తులకు ఏర్పాట్లు చేశారు.ఆ దివాకరుడిని ఊరూవాడా కొలిచింది.. సూర్య భగవానుడి జన్మ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్య ఆలయాలకు భక్తజనం పోటెత్తింది.. రథ సప్తమి సందర్భంగా జి.మామిడాడలో రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. వాడపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
దూకుతూ.. దౌడు తీస్తూ..
● ఉత్కంఠ భరితంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ● సీనియర్, జూనియర్ విజేతగా గుమ్మిలేరుసామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో యార్లగడ్డ వెంకట సుబ్బారావు మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. భీమేశ్వర రైతు కమిటీ ఆధ్వర్యాన సీనియర్, జూనియర్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి సీనియర్ విభాగంలో 7 జతలు, జూనియర్ విభాగంలో 38 జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. స్వల్ప వ్యవధిలోనే విజేతలను నిర్ణయించడంతో ప్రేక్షకులు, రైతుల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జరిగిన ఈ పోటీలను చుర్రుమంటున్న ఎండలో సైతం జనం ఆసక్తిగా వీక్షించారు. ● సీనియర్ విభాగంలో నిర్ణీత దూరాన్ని కోరా తేజ చౌదరి (కోనసీమ జిల్లా గుమ్మిలేరు) ఎడ్లు 5 నిమిషాల 39 సెకెండ్ల 69 పాయింట్లలో అధిగమించి ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. అదే గ్రామానికి చెందిన కోరా సత్యవేణి ఎడ్లు 5 నిమిషాల 42 సెకెండ్ల 16 పాయింట్లతో ద్వితీయ, సామర్లకోటకు చెందిన వల్లూరి సత్యేంద్ర కుమార్ ఎడ్లు 5 నిమిషాల 46 సెకెండ్ల 22 పాయింట్లతో తృతీయ స్థానాల్లో నిలిచాయి. సీనియర్ విభాగంలో మొదట దౌడు తీయడానికి సిద్ధమైన మలిరెడ్డి అన్నపూర్ణ ఎడ్లు జనం కేకలతో బెదిరిపోయి పొలంలోకి పరుగు తీశాయి. అయినప్పటికీ తిరిగి రోడ్డు మీదకు వచ్చి, నిర్ణీత దూరాన్ని 6 నిమిషాల 27 సెకండ్లలో అధిగమించాయి. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.20 వేలు, తృతీయ బహుమతి రూ.15 వేల నగదుతో పాటు మెమెంటోలను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అందజేశారు. ● జూనియర్ విభాగంలో కోరా సత్యవతి (గుమ్మిలేరు) ఎడ్లు ప్రథమ, బవిరిశెట్టి మణి (వన్నెపూడి) ద్వితీయ, పండూరు శ్రీను (సామర్లకోట) తృతీయ, మలిరెడ్డి అన్నపూర్ణ (మేడపాడు) నాలుగు, వేగుళ్ల కృష్ణమాధవి (మండపేట) ఎడ్లు ఐదో స్థానాలను గెలుచుకున్నాయి. ప్రథమ విజేతకు రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు, నాలుగో స్థానానికి రూ.8 వేలు, ఐదో స్థానంలో నిలిచిన వారికి రూ.6 వేల నగదుతో పాటు మెమెంటోలను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ తుమ్మల బాబు అందజేశారు. అలాగే, దేశవాళీ ఎడ్ల అందాల పోటీల్లో కూడా మూడు బహుమతులు అందించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా చేకూరి రామకృష్ణ, కొండపల్లి శ్రీనివాస్, కంటే ఫణికుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, నిర్వాహకులు కంటే జగదీష్ మోహన్రావు, వల్లూరి దొరబాబు, బిక్కిన రంగనాయకులు, వుండవిల్లి వీర వెంకట రామరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు గోలి వెంకట అప్పారావు చౌదరి, యార్లగడ్డ చిన్ని, కౌన్సిలర్ బలుసు వాసు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ అడబాల కుమారస్వామి, నిమ్మకాయల రంగనాగ్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పురోహిత క్రికెట్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ డీఎస్ఏ గ్రౌండ్స్లో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ పోటీలు సోమవారం నుంచి జరుగుతాయని టోర్నమెంట్ నిర్వాహకులు భమ్మిడిపల్లి మూర్తి, చిన్నయ్య, వై.పద్మనాభ స్వామి తెలిపారు. ఆదివారం సాయంత్రం డీఎస్ఏలో టోర్నమెంట్ ప్రారంభోత్సవాన్ని లాంఛనంగా నిర్వహించారు. సోమవారం నుంచి 30 వరకూ జరిగే పోటీల్లో 10 జట్లు తలపడనున్నాయి. హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు మూర్తి తెలిపారు. కార్యక్రమంలో రాయవరపు ప్రభాకర్, సత్యనారాయణ మూర్తి, ఎల్లాజ్యోశ్యుల శ్రీరాము పాల్గొన్నారు. 30, 31 తేదీల్లో ‘కోకో సమ్మేళనం’రాజమహేంద్రవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ‘కోకో సమ్మేళనం – 2026’ను ఈ నెల 30, 31వ తేదీల్లో ఏలూరులోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి ఎన్.మల్లికార్జునరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మేళనంలో కోకో పంట నాణ్యత మెరుగుదల, పంట కోత అనంతర నిర్వహణ, ప్రాసెసింగ్ సాంకేతికత, విలువ జోడింపు, స్థిరమైన సాగు విధానాలు, అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు. దీనికి జాతీయ స్థాయి సంస్థలు, పరిశోధనా సంస్థలు, కోకో మరియు చాక్లెట్ ప్రాసెసింగ్ కంపెనీలు, యంత్రాలు – పరికరాల తయారీదారులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్టార్టప్లు, వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొననున్నారని వివరించారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. దీనికి ఆశావహ పారిశ్రామిక వేత్తలు, అభ్యుదయ కోకో రైతులు హాజరుకావాలని మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు. హెడ్ పోస్టాఫీస్లో అగ్ని ప్రమాదంకంబాలచెరువు: స్థానిక కోటిపల్లి బస్డాండ్ వద్ద ఉన్న హెడ్ పోస్టాఫీస్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు కథనం ప్రకారం.. ఆ పోస్టాఫీస్ వెనుక భాగంలో పాత సామగ్రిని నిల్వ చేశారు. నిల్వ చేసిన రూమ్లో షార్ట్ షర్క్యూట్ కారణంతో మంటలు వ్యాపించాయి. కార్యాలయం లోపల నుంచి పొగలు రావడం చూసిన స్థానికులు ఈ విషయాన్ని పక్కనే ఉన్న ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. పోస్టాఫీస్కు ఎదురుగానే ఫైర్ ఆఫీస్ ఉండడంతో సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని శ్రీనివాసరావు తెలిపారు. -
యువత ఓటు హక్కు పొందాలి
రంపచోడవరం: జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జేసీ, రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్రాజ్ సూచించారు. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. జేసీ స్మరణ్రాజ్, సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వల్లు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. యువత ఆన్లైన్లో గాని, తహసీల్దార్ కార్యాలయంలో గాని ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతి వ్యక్తి నిర్భయంగా నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో అన్ని పోలింగ్ బూత్లకు బీఎల్వోలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్లె సునీత, వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, తహసీల్దార్ బాలాజీ, డీటీ జిలానీ, ఆర్ఐ నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
అడ్డగోలుగా టేకుచెట్ల నరికివేత!
అడ్డతీగల: జాతీయ రహదారి 516 నిర్మాణంలో భాగంగా రక్షిత అటవీ ప్రాంతాల్లో టేకు చెట్ల నరికివేత వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. కలప సేకరణలో కొంత మేరకు పనులు చేసిన అటవీ శాఖ అధికారులు చాలాచోట్ల విలువైన టేకు చెట్లు వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం నుంచి జాతీయ రహదారి పనులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టానుసారంగా టేకు చెట్లు నరికివేసి తమ వాహనాల్లోనే తరలిస్తున్నారని పలువురు అంటున్నారు. అడ్డతీగల అటవీ క్షేత్రం కిందకు వచ్చే పైడిపుట్ట వద్ద తపస్వికొండ దక్షిణ రక్షిత అటవీ ప్రాంతంలోని 1.81 హెక్టార్ల విస్తీర్ణంలోని 600 మీటర్ల మేరకు, అలాగే పింజరికొండ రక్షిత అటవీ ప్రాంతంలోని 3.34 హెక్టార్ల విస్తీర్ణంలోని 1,049 మీటర్ల మేరకు జాతీయ రహదారి వెళ్తుంది. ఏడాదిన్నర క్రితం జాతీయ రహదారి ఇంజినీరింగ్ అధికారులు ఎంత మేరకు రహదారి నిర్మించనున్నదీ మార్కింగ్ వేసి సరిహద్దు సిమెంట్ స్తంభాలను వేశారు. దాని పరిధిలోని చెట్ల నరికివేత, ఇతరత్రా వాటికి నేషనల్ హైవే అథారిటీ నుంచి యూజర్ చార్జీలు చెల్లించారు. దీనికోసం అటవీశాఖ అధికారులు ఎస్టిమేట్లు వేశారు. ఈ రెండు చోట్ల విలువైన టేకుచెట్లు, మారుజాతి కలప ఉంది. అటవీ ఉన్నతాధికారుల అనేక పరిశీలనల అనంతరం పైడిపుట్ట వద్ద రక్షిత అటవీ ప్రాంతంలో మారుజాతి కలపతో పాటు అడ్డతీగల వద్ద పింజరికొండ రక్షిత అటవీ ప్రాంతంలో టేకు చెట్లు ఉన్నట్లు నిర్ధారించారు. చెట్లు నరికివేత, లోడింగ్, అన్లోడింగ్, రవాణా నిమిత్తం నిధులు అటవీశాఖ ఉన్నతాధికారులు విడుదల చేస్తారు. ఆయా పనుల నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుని వాహనాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కలప సేకరించిన తరువాత రాజమహేంద్రవరంలోని కలప డిపోనకు తరలించాలి. ఆయా పనుల నిర్వహణ కోసం నిధుల వ్యయంలో నిబంధనలను తుంగలోకి తొక్కి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో వినియోగించే వాహనాలు, యంత్రాలను వినియోగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేషనల్ హైవే అథారిటీ చెల్లించిన యూజర్ చార్జీలు ఎంత, ఎవరిని చెట్ల నరికివేతకు వినియోగించారు..! లోడింగ్, అన్లోడింగ్కి ఉపయోగించిన యంత్రాలు ఏంటి, సేకరించిన కలప రాజమహేంద్రవరం కలప డిపోనకు రవాణా చేసిన వాహనాల వివరాలను బహిర్గతం చేస్తే అసలు విషయాలు తెలుస్తాయని పలువురు అంటున్నారు. దీనిపై అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డిని వివరణ కోరగా ఒక్కోచోట 30 మీటర్లు, మరికొన్ని చోట్ల 22 మీటర్ల మేర రోడ్డు నిర్మిత ప్రాంతంలో చెట్ల తొలగింపు చేపట్టారన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామన్నారు. నిబంధనల ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పట్టించుకోని అటవీ శాఖ అధికారులు -
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు
రంపచోడవరం: ఐ.పోలవరం వద్ద ఉన్న తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం నిర్వహించారు. వేంకటేశ్వర స్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తూ తిరుమాడ వీధి సేవను జరిపారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రథసప్తమి నాడు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం విశేషమని, సూర్యప్రభ వాహన సేవకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆలయ అర్చకులు పార్ధు స్వామి, మణికంఠ స్వామి తెలిపారు. వాహన సేవ పూర్తయ్యాక సేవకులు, హాజరైన భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఏర్పాట్లను ఆలయ అధికారులు రూప్సాయి, ఢిల్లీ ప్రసాద్, విజిలెన్స్ అధికారులు పర్యవేక్షించారు. కొత్త యూనిట్ల అనుసంధానం పూర్తిమోతుగూడెం: లోయర్ సీలేరు పొల్లూరు జల విద్యుత్ కేంద్రం ఐదు, ఆరు యూనిట్ల అనుసంధాన పనులు పూర్తయినట్లు డీఈ బాలకృష్ణ తెలిపారు. ఆదివారం ట్రయల్ రేస్ సంపు వద్ద ఆరో యూనిట్కు సంబంధించి నాలుగో గేటును అమర్చామన్నారు. ఐదు, ఆరు యూనిట్లకు సంబంధించి మొత్తం నాలుగు గేట్లు ఏర్పాటు చేయడంతో అనుసంధాన పనులు పూర్తయ్యాయన్నారు. డొంకరాయి జలాశయం గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి కెనాల్ ద్వారా ఫోర్ బై జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఫోర్బై రిజర్వాయర్లో ఉన్న నీటిని పెన్స్టాక్ ద్వారా దిగువకు విడుదల చేసి ట్రయల్ రేస్ సంప్ను సగానికి నింపి నూతనంగా నిర్మించిన ఐదు, ఆరు యూనిట్లకు సంబంధించి గేట్ల పూర్తిగా మూసివేస్తామన్నారు. అప్పుడు ఈ యూనిట్లకు ఏమైనా గేట్ల ద్వారా బ్యాక్ వాటర్ వస్తుందేమో అని పరిక్షిస్తామని తెలిపారు. బ్యాక్ వాటర్ రాకపోతే సోమవారం నుంచే నాలుగు యూనిట్ల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు. శబరి నదిలో యువకుడి గల్లంతుచింతూరు: స్థానిక శబరినదిలో స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికంగా తాపీమేస్త్రిగా పనిచేస్తున్న చల్లా కృష్ణ కుమారుడు వెంకటరమణ (19) స్నేహితుడితో కలసి ఎయిర్టెల్ టవర్ సమీపంలో శబరినది వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో వెంకటరమణ స్నానం నిమిత్తం శబరినదిలోకి దిగి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం చీకటి పడే వరకూ గాలింపు చేపట్టినా ఫలితం లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిమోతుగూడెం: రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి శనివారం మృతి చెందాడు. మోతుగూడెం ఎస్సై అబ్దుల్ నాజర్ హుస్సేన్ కథనం ప్రకారం.. చింతూరు మండలం మల్లెతోట ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నైకం భరత్, ఆరో తరగతి చదువుతున్న కిల్లో రమేష్బాబు శనివారం రాత్రి పది గంటల సమయంలో చింతూరులో రాజు క్యాంపునకు చెందిన కిలో ప్రసాద్ ఆటో ఎక్కి వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీలోని రాజు క్యాంపునకు బయలు దేరారు. ఈ ముగ్గురూ మద్యం తాగారు. మోతుగూడెం పంచాయతీ, కొల్లూరు గ్రామం దాటిన తరువాత మూలమలుపు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వై.రామవరం మండలం బొడ్డగంటి పంచాయతీ రాజుక్యాంపునకు చెందిన భరత్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


