breaking news
Adilabad
-
‘ఈ–ఆఫీస్’తో ఫైళ్ల పరిష్కారం వేగవంతం
ఉట్నూర్రూరల్: ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ–ఆఫీస్ వినియోగించడం ద్వారా ఫైళ్ల పరిష్కారం వేగవంతం అవుతుందని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఈ–ఆఫీస్ ద్వారా కార్యాలయ ఫైళ్లను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యాలయ పనితీరు మెరుగుపడుతుందన్నారు. అన్ని శాఖలు, విభాగాల అధికారులు, సిబ్బంది ఈ–ఆఫీస్ వ్యవస్థను వినియోగించుకోవాలని సూచించారు. -
ట్రిపుల్ఐటీలో గందరగోళం
భైంసా: బాసర ట్రిపుల్ఐటీలో విద్యార్థిని తేజస్విని మృతితో మంగళవారం ప్రారంభమైన విద్యార్థుల నిరసన బుధవారం వరకు కొనసాగింది. ట్రిపుల్ఐటీలో వైద్య సేవలు మెరుగుపరిచి మౌలిక వసతులు కల్పించాలన్న డిమాండ్తో విద్యార్థులు నిరసనకు దిగారు. మంగళవారం సాయంత్రం నుంచి వీసీ కార్యాలయం వద్ద బైటాయించిన విద్యార్థులంతా రాత్రి వీసీ ఇంటి ముందుకు చేరుకున్నారు. గేటు వద్దే నిద్రించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ట్రిపుల్ఐటీకి చేరుకుని భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. వినతిపత్రం ఇచ్చిన విద్యార్థులు బాసర ట్రిపుల్ఐటీలో నెలకొన్న సమస్యలపై తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ ఆధ్వర్యంలో వీసీకి వినతిపత్రం ఇచ్చారు. యాజమాన్యం స్పందించి ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. ఇందుకు యాజమాన్యం సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చినట్లు తెలిపారు. దీంతో విద్యార్థి సంఘం నిరసనను విరమించింది. వీసీకి మద్దతుగా.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బాసర ట్రిపుల్ఐటీలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల జేఏసీ వీసీకి మద్దతుగా నిలిచారు. జేఏసీ బుధవారం సమావేశమై వీసీ గోవర్ధన్పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. క్యాంపస్ అభివృద్ధి కోసం పని చేస్తున్న వీసీ, ఓఎస్డీలకు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాత్రంతా నిరసనలు పోలీసులు భారీగా మోహరించినా విద్యార్థులు అక్కడే నిరసన కొనసాగించారు. మరోవైపు మంగళవారం రాత్రి ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ బయటకు వచ్చి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించినట్లు తెలిసింది. నిరసనకు కూర్చున్న విద్యార్థులు రాజీనామా కోరడంలేదని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మరోవైపు విద్యార్థులపై ఒత్తిడి పెంచారన్న ఆరోపణలు వచ్చాయి. జిల్లా ఎస్పీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వీడియో తాము పోస్టు చేయలేదని విద్యార్థి సంఘం ప్రకటించింది. -
రైతులకు ఆశాజనకం
ఈ సంవత్సరం నవనాయకులలో ఏడు శుభ గ్రహాలే ఉన్నాయి. ఇది దేశానికి, ప్రజలకు ఎంతో శుభసూచకం. రాజా, నీరసాధిపతి గురుడు కావడం వల్ల ప్రభుత్వ పాలన ప్రజా రంజకంగా ఉంటుంది. అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా అమలవుతాయి. మంత్రి కుజుడు కావడం వల్ల రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, ఐటీ రంగా లు అద్భుతమైన వృద్ధిని సాధిస్తాయి. భూముల ధరలు పెరుగుతాయి. నాలుగు కుంచాల వర్షం వల్ల జలాశయాలు నిండుతాయి. వరి, పత్తి, మిర్చి, వాణిజ్య పంటలకు అనుకూలంగా ఉంది. రైతులకు మంచి లాభాలు వస్తా యి. శత్రువుల పన్నాగాలను మన సైన్యం తిప్పికొడుతుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ విజయం మనదే అవుతుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పిడుగులు పడే అవకాశం ఉంది. వేసవిలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. – శివశ్రీ సాయికుమార్, వేద పండితులు, ఆదిలాబాద్ -
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
ఆదిలాబాద్టౌన్: బాధిత కుటుంబాలకు జిల్లా పోలీసుశాఖ అండగా ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు లక్ష్మి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుధవారం రాంనగర్లోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయార్థం రూ.10వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. హోంగార్డు ఇన్చార్జి చంద్రశేఖర్, వార్డు కౌన్సిలర్ చరణ్గౌడ్, హోంగార్డులు పాల్గొన్నారు. విద్యుత్ తీగ తగిలి రైతుకు గాయాలుదహెగాం: వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి రైతుకు గాయాలైనట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. మండలంలోని లగ్గాం గ్రామానికి చెందిన మొరె సాయిప్రభు పంబాపూర్ శివారులోని పొలానికి మంగళవారం సాయంత్రం వెళ్లాడు. పంబాపూర్ గ్రామానికి చెందిన కొడిపె శ్రీను అడవి జంతువులను వేటాడడానికి అమర్చిన విద్యుత్ తీగలకు తగలడంతో గాయాలయ్యాయి. బుధవారం సాయిప్రభును చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తమ్ముడు సాయిదేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. స్కూల్ బస్సు, లారీ ఢీ భైంసారూరల్: మండల పరిధిలోని నిర్మల్–భైంసా జాతీయ రహదారిపై మాటేగాం వద్ద బుధవారం స్కూల్ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి... ఎగ్గాం నుంచి సుమారు 15 మంది విద్యార్థులతో భైంసా వైపు వెళ్తున్న బ్రిలియన్స్ స్కూల్ బస్సు మాటేగాం వద్దకు రాగానే డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఘటనలో బస్సులో ఉన్న నలుగురు విద్యార్థులు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి గాయపడిన వారిని భైంసా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎంఈవో సుభాష్, ఎస్సై సుప్రియ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రైతులకు కూరగాయల విత్తనాలు పంపిణీ -
రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. బుధవారం పార్లమెంటు సమావేశంలో ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక రైల్వే సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్–గడ్చందుర్ మధ్య కొత్త రైల్వేలైన్ సర్వే ఇప్పటికే పూర్తయిందని, డీపీఆర్ను వెంటనే ఆమోదించి పనులు ప్రారంభించాలని, ముద్ఖేడ్–పిప్పల్కోటి (ఎల్సీ33), కాజీపేట–బల్హార్షా (ఎల్సీ71) వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు 36 కిలోమీటర్ల మేర డీపీఆర్ సిద్ధంగా ఉందని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. బాసర సరస్వతీదేవి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అక్కడ మరిన్ని రైళ్లకు స్టాపేజీలు కల్పించాలని, కాజీపేట నుంచి కాగజ్నగర్ మీదుగా హౌరా వరకు కొత్త రైలును ప్రారంభించాలని విన్నవించారు. ప్రాంతీయ అభివృద్ధికి ఈ రైల్వే ప్రాజెక్టులు ఎంతో కీలమని, కేంద్ర ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. -
మచ్చలుంటే వైద్యులను సంప్రదించాలి
ఆదిలాబాద్టౌన్: శరీరంపై మచ్చలు ఉంటే వైద్యులను సంప్రదించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని చిల్కూరిలక్ష్మినగర్ పట్టణ ఆరోగ్యకేంద్రంలో బుధవారం కుష్ఠు గుర్తింపు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 18 నుంచి 31వరకు కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఆశ కార్యకర్తలతో ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. శరీరంపై పాలిపోయిన, రాగి రంగు గల మొద్దుబారిన మచ్చలు, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ఉంటే కుష్ఠుగా అనుమానించి ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎండీటీతో వ్యాధి పూర్తిగా నయం అవుతుందన్నారు. కుష్ఠు రహిత సమాజం కోసం ప్రతి ఒక్క రూ కృషి చేయాలన్నారు. ఇందులో కుష్ఠు నివారణ అధికారి ఈశ్వర్రాజ్, వైద్యాధికారి దీపిక, డిప్యూటీ పారామెడికల్ అధికారులు వామన్రావు, రమేశ్, విష్ణు, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు వేగవంతంగా వైద్య సేవలు ప్రజలకు వేగవంతంగా వైద్యసేవలు అందించినందుకు కృషి చేస్తున్నట్లు డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. డీఎంహెచ్ఓ సమావేశ మందిరంలో అంబులెన్స్ సేవలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని కొన్ని మండలాల్లో అంబులెన్స్ వాహన సేవలను విస్తరించినందుకు కృషి చేస్తున్నామన్నారు. సిబ్బంది పనితీరును అభినందించారు. సమావేశంలో 108 జిల్లా మేనేజర్ శేఖర్, 102 జిల్లా మేనేజర్ మనోహర్, పీఎం సామ్రాట్ పాల్గొన్నారు. -
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
ఆదిలాబాద్టౌన్: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ గార్డెన్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన, రహదారి భద్రత, సీసీ కెమెరాల ప్రాముఖ్య తపై సర్పంచులు, కౌన్సిలర్లు, విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలు, వార్డులను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతీ గురువారం ఆరోగ్య పాఠశాలలో భాగంగా యాంటీ డ్రగ్స్డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. గంజాయి సాగు చేస్తే పదేళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉంటుందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్టు ధరించాలని, మద్యం సేవించి నడపొద్దని సూచించారు. మహిళల భద్రత కోసం, బాల్య వివాహాలు అరికట్టేందుకు పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. గడిచిన మూడు నెలల్లో 25 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ప్రతి జ్ఞ చేశారు. కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ ఎస్పీ పి.సీతారాం, అదనపు ఎస్పీ పి.కృష్ణమూర్తి, సీఐ పి.ప్రకాశ్రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీలు బి.సురేందర్ రావు, పి.మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, విజేందర్, పొగాకు నియంత్రణ అధికారి శ్రీకాంత్, మున్సిపల్ వైస్చైర్మన్ మహమ్మద్ రోహిత్, డౌవ్ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, యువత, ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
యువకుడిపై అడవిపంది దాడి
ఉట్నూర్రూరల్: ఇంటి ముందు నిలబడి ఉన్న యువకుడిపై అడవిపంది దాడి చేసిన ఘటన బుధవారం మండలంలోని హస్నాపూర్లో చోటు చేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం మండలంలోని హస్నాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ ప్రవీణ్ తన ఇంటి ముందు నిలబడి ఉండగా పంట పొలాల నుంచి వచ్చిన అడవిపంది దాడి చేసింది. యువకుడు కేకలు వేయడంతో కు టుంబ సభ్యులు వచ్చే సరికి అక్కడి నుంచి పరుగులు తీసింది. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ను వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. జనావాసాల్లో అడవిపంది వచ్చి దాడులు చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జ నావాసాల్లోకి రాకుండా అటవీశాఖ అధికారుల త గు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అధ్యక్షా.. నిధులు మంజూరు చేయండి
● అసెంబ్లీలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇచ్చోడ :బోథ్ నియోజకవర్గ అభి వృద్ధికి ప్రభుత్వం సహకరించి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పీకర్ ద్వారా అసెంబ్లీలో కోరారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా పలు సమస్యలను బుధవారం సభ దృష్టికి తీసుకెళ్లారు. దేగామ ప్రాజెక్టులో భాగంగా పెండింగ్లో ఉన్న 200 కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు. బోథ్లో ఫైర్స్టేషన్ లేకపోవడంతో తలెత్తుతున్న ఇబ్బందులను వివరించి వెంటనే మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గ కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చాలని, ఆసుపత్రి భవన నిర్మాణ బిల్లులందక పనులు నిలిచిపోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. వెంటనే బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బోథ్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు, ఇచ్చోడలో షాదీఖానా నిర్మాణానికి రూ.3 కోట్ల ఫైనాన్స్ అనుమతి ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో పత్తి, సోయా పంటలు పండిస్తున్న రైతులకు బోనస్ అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
శ్రీపరాభవ.. ఆగమనం
షడ్రుచుల పండుగ వచ్చేసింది. నేటి నుంచి శ్రీపరాభవ నామ సంవత్సరం షురూ కానుంది. ఉగాదిని సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేందుకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు. రైతులు తమ పొలాలకు వేకువజా మున వెళ్లి ప్రత్యేక పూజలతో పాటు ఆరుకోవడం ఆనవా యితీ. ప్రతీ ఇంటా షడ్రుచుల పచ్చడితో పాటు భక్షాలను స్వీకరిస్తారు. సనాతన హిందూ ఉత్సవ సమితితో పాటు రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉదయం ఉగాది పచ్చడితో పాటు గుడాలు పంపిణీ చేపట్టనున్నారు. సాయంత్రం గోపాలకృష్ణ మఠంతో పాటు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నా రు. ఈమేరకు ఆయా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. – ఆదిలాబాద్ -
హరితం అంతం.. పార్కింగ్కు సొంతం
చెట్లను నరికేసిన అనంతరం పార్కింగ్ కోసం ఏర్పాటు చేస్తున్న కంచెఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల ఎన్టీఆర్ చౌక్ నుంచి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వరకు గత ప్రభుత్వం హరితహారంలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రీన్బెల్టును అభివృద్ధి చేసింది. కొంతమంది స్వార్థపరులు తమ స్వలాభం కోసం మొక్కలను కొట్టేసి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వద్ద గల ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు పార్కింగ్ స్థలం కోసం పచ్చని చెట్లను కొట్టేసి ప్రత్యేక కంచెను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై చర్యలు చేపట్టాల్సిన బల్దియా అధికారులు మామూలుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
కల్లు తాగిన డబ్బులు ఇవ్వలేదని కట్టేశాడు..
జైపూర్: కల్లు తాగిన డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తిని గీత కార్మికుడు స్తంభానికి కట్టేశాడు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ అనాగరిక ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుందారం గ్రామానికి చెందిన ఎర్ర చంద్రయ్య అనాథ. ఇదే గ్రామానికి చెందిన గీత కార్మికుడు వొల్లాల మల్లాగౌడ్ వద్ద తాటికల్లు తాగేవాడు. ప్రతిఫలంగా ఆయన చెప్పిన పనులు, అవసరమైన పనుల్లో సహాయం చేసేవాడు. ఈ క్రమంలో రోజువారీగా ఆయన వద్ద పని చేస్తూ ఇచ్చిన ఆహారం తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల మల్లాగౌడ్ చెప్పిన పనులు చేయకపోవడంతో ఇంతకాలం తన వద్ద తాగిన కల్లుకు డబ్బులు ఇవ్వాలని చంద్రయ్యను స్తంభానికి కట్టేసి దాడి చేశాడు. ఇష్టారీతిగా దుర్భాషాలాడాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చివరికి స్థానికుల జోక్యంతో విడిచిపెట్టాడు. కాగా, చంద్రయ్య అనాథ కావడం, ఎవరూ లేకపోవడం వల్ల మల్లాగౌడ్ దాడి చేశాడంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జాతీయ స్థాయికి ఎదగడం అభినందనీయం
బజార్హత్నూర్: గిరిజన క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగడం అభినందనీయమని ఏజెన్సీ డీఈవో గోడం చందన్ అన్నారు. ఇటీవల హన్మకొండలో నిర్వహించిన 60 మీటర్ల పరుగుపందెం రాష్ట్రస్థాయి పోటీల్లో జాతర్ల ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థి కోట్నాక్ జాకేష్ ఉత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్మెడల్ సాధించాడు. ఈ నెల 28న హర్యానలో జరుగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏజెన్సీ డీఈవో గోడం చందన్ సదరు విద్యార్థిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్, జిల్లా గిరిజన క్రీడాల అధికారి పార్థసారథి, ఏసీఎంవో అర్క జగన్, ఏటీడీవో సుచంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభ కనబర్చిన నిర్మల్ జిల్లా విద్యార్థులు
తానూరు: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవగా మండలకేంద్రంలోని వాసవి పాఠశాల విద్యార్థి అవదుత్వార్ గణేశ్ ప్రతిభ కనబర్చి కాగజ్నగర్లోని జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికై నట్లు పాఠశాల డైరెక్టర్ నర్సయ్య, ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. కుభీర్: మండలకేంద్రంలోని ప్రగతి విద్యానికేతన్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు శ్రీబిందు, సొప్పరి పూజ నవోదయ విద్యాలయంలో చదివేందుకు ఎంపికయ్యారు. వీరిని పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆనంద్, కరస్పాండెంట్ గంగాధర్, ఉపాధ్యాయులు గంగాకిశోర్ తదితరులు ఉన్నారు. -
విద్యుత్ వైరు దొంగలపాలు
కోటపల్లి: మిషన్ భగీరథ నీటిని అందించేందుకు గత ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి విద్యుత్లైను ఏర్పాటు చేయగా అధికారుల నిర్లక్ష్యంతో తీగలు చోరీకి గురవుతున్నాయి. వేమనపల్లి మండలం ముల్కల్లపేట నుంచి జనగామ వరకు మిషన్ భగీరథ ట్యాంక్ నుంచి నీటిని అందించేందుకు గత ప్రభుత్వం జనగామ వద్ద ట్యాంక్లను ఏర్పాటు చేసి మోటార్ల సహాయంతో సమీప గ్రామాలకు నీటిని అందించేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జనగామ నుంచి ముల్కల్లపేట వరకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. అధికారుల పట్టింపులేమితో దుండగులు విద్యుత్ వైరును కట్ చేసుకుని వెళ్తుండడంతో ముల్కల్లపేట నుంచి సుపాక వరకు ఖాళీ స్తంభాలు దర్శనమిస్తున్నాయి. విషయాన్ని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతోనే రెచ్చిపోయిన దుండగలు దాదాపు 5 కిలోమీటర్ల మేర విద్యుత్ వైరును కత్తిరించుకు వెళ్లారు. ఈ విషయమై ఏఈ వెంకటేశ్వర్లును వివరణ కోరగా విద్యుత్ వైరు చోరీకి గురైంది నిజమేనని, మరుసటి రోజే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారని ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దుండగులను వెంటనే పట్టుకుని విద్యుత్ లైన్ పునరుద్ధరణ జరిగేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
ట్రిపుల్ఐటీలో వైద్య సదుపాయాలపై నిరసన
భైంసా/బాసర: బాసర ఆర్జీయూకేటీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రా మచంద్రపురానికి చెందిన పీయూసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని (17) సోమవారం మృతి చెందిన ఘటనతో క్యాంపస్లో తీవ్ర కలకలం రేగింది. తేజస్విని మార్చి 13న జ్వరం, నోటి పుండ్లతో క్యాంపస్ ఆస్పత్రిలో చికిత్స పొందింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆమెకు లుకేమియా (రక్త క్యాన్సర్)గా నిర్ధారించారు. చికిత్స పొందుతూ చివరికి ఆమె కన్నుమూశారు. వీసీ కార్యాలయం ముట్టడించిన విద్యార్థులు తేజస్విని మృతి వార్తతో క్యాంపస్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ఏకమై వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీసీ రావాలి.. మాకు న్యాయం చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాత్రి వరకు ఈ నిరసన కొనసాగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రాణాల మీదకు తెస్తున్న సదుపాయాల లేమి! క్యాంపస్లోని ఆరోగ్య కేంద్రం కేవలం నామమాత్రంగానే ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయంలో ఆధునిక డయాగ్నస్టిక్ సదుపాయాల కొరత ఉందన్నారు. నిపుణులైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో లేరన్నారు. ప్రాథమిక దశలో వ్యాధులను గుర్తించడంలో వైఫల్యం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నా రు. చిన్న ఆరోగ్య సమస్యతో వెళ్తే మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారని, పరిస్థితి విషమించిన తరువాతే పెద్ద ఆసుపత్రులకు తరలిస్తున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. డాక్టర్లు క్యాంపస్ ఆసుపత్రిలో రక్త సంబంధిత తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించేపరికరాల కొరత ఉందని చెప్పినట్లు సమాచారం. నిర్లక్ష్యమే కారణమా? క్యాంపస్ ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందకపోవడం, నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని తేజస్విని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులు పలు డిమాండ్లు ముందుకు తెచ్చారు మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, క్యాంపస్ ఆసుపత్రిని అత్యాధునిక పరికరాలతో వెంటనే అభివృద్ధి చేయాలని కోరారు. విద్యార్థుల భద్రత కోసం సమగ్ర ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
విద్యార్థుల ప్రభంజనం
కుంటాల: కుంటాలలోని సృజన విద్యాలయం నుంచి 37 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చి నవోదయలో చదివేందుకు ఎంపికయ్యారు. ఇందులో కాగజ్నగర్లోని జవహర్ నవోదయ పాఠశాలకు 23 మంది, నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ జవహర్ నవోదయ పాఠశాలకు 13 మంది, వరంగల్, జగిత్యాల జిల్లాల జవహర్ నవోదయ పాఠశాలలకు ఒక్కొక్కరు చొప్పున ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ కొత్తకాపు గంగన్న తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా టాపర్గా ఒడ్నం సహర్ష్, నిజామాబాద్ జిల్లా టాపర్గా రాజారాం లేక్షన నిలిచారు. కల్లూరులోని ఎస్ఎంఎస్ పాఠశాల నుంచి 17 మంది, కుంటాలలోని శాంతినికేతన్ పాఠశాల నుంచి 11 మంది విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాళ్లు గజానన్, సంతోష్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను పలువురు అభినందించారు. రాజారాం లేక్షన, నిజామాబాద్ జిల్లా టాపర్ఒడ్నం సహర్ష్, ఆదిలాబాద్ జిల్లా టాపర్ -
ముగిసిన గోవింద్నాయక్ అంత్యక్రియలు
దండేపల్లి/ఆదిలాబాద్టౌన్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్నాయక్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లోని స్వగృహంలో అనా రోగ్యంతో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని మంగళవారం మాజీ మంత్రులు జీవన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, రేఖానాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు రవీందర్రావు, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్చార్జి జాన్సన్ నాయక్, వివిధ పార్టీల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ప్రజల సందర్శనాంతరం సాయంత్రం గ్రామ సమీపంలో ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన పెద్దకుమారుడు అరవింద్ తండ్రి చితికి నిప్పు పెట్టి అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
లోకేశ్వరం: మండలంలోని వట్టోలిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గ్రామానికి చెందిన శివరాత్రి భోజన్న(35) ఏపనీ చేయకుండా ఖాళీగా తిరుగుతుండేవాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై శనివారం అతని భార్య రుచిత మందలించి పిల్లలతో కలిసి తీర్థయాత్రకు వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన భోజన్న సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంగళవారం భోజన్న సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘నవోదయ’ ఫలితాలు విడుదల
కాగజ్నగర్టౌన్:పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యాలయంలో ఖాళీగా ఉన్న 80 సీట్లను భర్తీ చేసేందుకు డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహించగా మంగళవారం ఫలితాలు వెల్లడించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి 6,196 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 4,478 మంది హాజరయ్యారు. రిజర్వేషన్, మార్కుల ఆధారంగా ఆదిలాబాద్ నుంచి 17 మంది, నిర్మల్ నుంచి 37 మంది, మంచిర్యాల నుంచి 19 మంది, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఏడుగురు మొత్తంగా 80 మంది ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు. -
దేశానికి వన్నె తెచ్చిన శ్రావణి
మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాల విద్యార్థిని ఇండోనేషియాలో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి గోల్డ్మెడల్ సాధించింది. కళాశాలలో డిగ్రీ బీజెడ్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న దేవల్ల శ్రావణి ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఏషియా ఆధ్వర్యంలో ఇండోనేషియాలో నిర్వహించిన పోటీల్లో ఇండియా తరుపున పాల్గొని ప్రతిభ కనబర్చి దేశానికి వన్నె తెచ్చింది. సదరు విద్యార్థినిని మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పల్లె భూమేష్ సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మనోహర్రెడ్డి, తనుగుల శ్రావణ్, కళాశాల ప్రిన్సిపాల్ అనిత, తదితరులు పాల్గొన్నారు. -
చిట్ ఫండ్స్ నిర్వాహకుడి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: చిట్ఫండ్స్ పేరుతో వందలాది మందిని నమ్మించి రూ.కోట్లలో మోసం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. హన్మకొండ జిల్లా వడ్డేపల్లికి చెందిన అక్షర చిట్ఫండ్స్ ఎండీ పేరాల శ్రీనివాస్ తన సంస్థ ద్వారా అధిక లాభాలు వస్తాయని ప్రజలను నమ్మబలికి రాష్ట్రవ్యాప్తంగా చిట్ స్కీముల ద్వారా డిపాజిట్లు సేకరించాడని పేర్కొన్నారు. గడువు ముగిసిన తర్వాత కూడా డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడని తెలిపారు. ఆదిలాబాద్ టూటౌన్లో నిందితుడిపై 12 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. జిల్లాకు చెందిన బాధితులు రూ.99 లక్షలు చెల్లించారని, వీరికి వడ్డీతో కలిపి సుమారుగా రూ.1.11 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు. నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 96 చీటింగ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘరానా మోసగాడు ఆరు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతుండగా, సోమవారం ప్రత్యేకబృందం సాంకేతిక ఆధారాలతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 5 మొబైల్ ఫోన్లు, ఒక ఐపాడ్, డొంగల్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ప్రజలు అధిక లాభాల ఆశతో ప్రభుత్వ అనుమతులు లేని ప్రైవేట్ చిట్ఫండ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని సూచించారు. అనుమానాస్పద పథకాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, టూటౌన్ సీఐ కె. నాగరాజు, ఎస్సై అఖిల్, ఆర్ఎస్సై గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హోటళ్లు, రెస్టారెంట్లకు జరిమానా
బెల్లంపల్లి: పరిశుభ్రత ప్రమాణాలు పాటించని హో టళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లకు బెల్లంపల్లి ము న్సిపల్ కమిషనర్ జె.సంపత్ మంగళవారం జరి మానా విధించారు. కాల్టెక్స్ ఏరియాలోని అరేబి యన్ క్లాసిక్ నైట్ మండి హౌజ్, అబ్దుల్ రహెమాన్ మండి హౌజ్, పాతబస్టాండ్ ఏరియాలో ఉన్న వినా యక టిఫిన్ సెంటర్, బిర్యానీ హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేశారు. పరిశుభ్రత పాటించకుండా ఆ హార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించా రు. ఈమేరకు సదరు హోటల్ యాజమానులకు రూ. 20 వేలు జరిమానా విధించారు. పునరావృతమైతే దుకాణాలను స్వాధీనం చేసుకు ని మున్సిపల్ చట్టం 2019 ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు. -
పన్ను చెల్లించలేదని దుకాణం సీజ్
బెల్లంపల్లి: పన్ను చెల్లించలేదని ఓ వ్యక్తి షాపును మంగళవారం మున్సిపల్ ఽఅధికారులు సీజ్ చేశారు. మున్సిపాలిటీలోని రణగంబాల బస్తీకి చెందిన కె.వెంకటరమణ సకాలంలో పన్ను చెల్లించకపోవడంతో మున్సిపల్ చట్టం 2009 ప్రకారం దుకాణాన్ని మున్సిపల్ కమిషనర్ జే.సంపత్ సీజ్ చేయించారు. పుర ప్రజలు సకాలంలో ఇంటి పన్ను చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని సూచించారు. ‘ఆకార్’ నేషనల్ ఫెస్ట్లో ప్రతిభబాసర: ఈ నెల 15న బాంబే ఐఐటీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘ఆకార్’ ఫెస్ట్లో బాసర ఆర్జీయూకేటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు ‘ఓపెన్ రోడ్స్ డిజైన్’ పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి సాధించారు. ఐఐటీ బాంబే, బెంట్లీ సిస్టమ్స్ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో సూపర్ లేటివ్ బృందంలో రిత్విక్ గోషికే, మనీషా బండారి, శివ సా యి, గణేశ్, ట్రాన్సిషన్ బృందంలో తేజస్విని మల్లోజు, అక్షిత్ రసపల్లి, సిరి, ట్రేల్ బ్రేజర్స్ బృందంలో మహేష్ గురుస్వామి, వైష్ణవి కర్నాటి, శ్రీకర్ పాల్గొన్నారు. సదరు విద్యార్థులను మంగళవారం వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, స్పెషల్ డ్యూటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ ఇ.మురళీ దర్శన్ అభినందించారు. -
మట్టి బతుకులు
రంజన్ల తయారీలో మహిళ రంజన్ తయారీలో మహిళలే కీలకం. మట్టి తీసుకువచ్చింది మొదలు పొడిగా మార్చడంతో పాటు వాటికి తుది రూపునిచ్చేది అతివలే. కుండ ఆకారాన్ని, తమకు వారసత్వంగా వస్తున్న కళతో ఒడుపుగా తీర్చిదిద్దుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తయారీలో నిమగ్నమవుతారు. రోజుకు 10 నుంచి 12 వరకు తయారు చేస్తామని తయారీదారులు చెబుతున్నారు. మార్కెటింగ్ సౌకర్యం కరువు.. వీటికి వేసవిలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మంచి డి మాండ్ ఉంది. అయితే సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారులకు వీరు త యారు చేసిన రంజన్లను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. దశాబ్దాలుగా కులవృత్తిని న మ్ముకున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ప్రోత్సాహం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంజన్ల తయారీపై ఆధారపడి ఉన్న కుటుంబాలనుఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తయారీ ఎంతో ప్రత్యేకం.. రంజన్ల తయారీ వెనుక కుమ్మరుల హస్తకళా నైపుణ్యంతో పాటు ఎంతో శ్రమదాగి ఉంటుంది.వేసవికి ముందే అనుకూలమైన నల్ల మట్టినిదిగుమతి చేసుకుంటారు. మట్టి గడ్డలను కర్రలతో కొట్టి మెత్తని పొడిగా చేసి, ఎండబెడతారు. దానికి గుర్రపు లద్దిని కలిపి, మట్టిలో తగుపాళ్లలో మిశ్రమంలా మారుస్తారు. దానిని నీటితో తడిపి రంజన్ తయారీకి అనుగుణమైన ఆకృతిలో తీర్చిదిద్దుతారు. మహిళలు సలపతో కొడుతూ తుది రూపునిస్తారు. వాటిని పచ్చిదనం పోయేంతవరకు ఎండబెడతారు. తర్వాత వాటికి జాజును అద్దుతారు. అనంతరం భట్టీలో కాలుస్తారు. అందులోని లద్దిలోని చిన్న చిన్న గడ్డి ముక్కలు కాలిపోయి, కంటికి కనిపించని చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. ఇవే రంజన్ చల్లగా ఉండడానికి ప్రధాన కారణం. వేసవి వచ్చిందంటే జనం తాపంతో అల్లాడి పోతారు. చల్లదనం అందించే ఫ్రిజ్లు, కూలర్ల వైపు మొగ్గు చూపుతుంటారు. మరికొందరు మట్టి పాత్రలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో అందరికి గుర్తుకు వచ్చేది ఆదిలాబాద్ రంజన్. ఇప్పటికీ పేదవాడి ఫ్రిజ్కు ఆదరణ తగ్గలేదు. మరోవైపు ఈ మట్టి వస్తువుతో జిల్లాకు గుర్తింపు వచ్చినా.. వాటి తయారీలో కీలకమైన కుమ్మరుల బతుకులు మాత్రం మారకపోవడం గమనార్హం. – ఆదిలాబాద్ -
‘ఆశా’ల దీక్ష విరమణ
కై లాస్నగర్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన 48 గంటల దీక్షను మంగళవారం విరమించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశాలు సమస్యలతో కూడిన వినతిపత్రంను డీఎంహెచ్వోకు అందజేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో సీఐటీయూ, ఆఽశా వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుట్కా విక్రయాలు అరికట్టాలిఆదిలాబాద్: విద్యాసంస్థల పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న గుట్కా, సిగరెట్ షాపులు వెంటనే తొలగించాలని ఏబీవీపీ ఆదిలాబాద్ శాఖ నాయకులు కోరారు. ఈమేరకు వన్టౌన్, టూటౌన్ సీఐలకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల సమీపంలో గుట్కా, సిగరెట్ షాపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా విద్యార్థులు చిన్న వయసులోనే చెడు అలవాట్ల బారిన పడుతున్నారని అన్నారు. ఈమేరకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆదిత్య, సాయి, అభిచరణ్, హరి, రేవంత్, క్రాంతి, వంశీ తదితరులున్నారు. -
క్యాలెండర్ ఆవిష్కరణ
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం (పీఎస్హెచ్ఎంఏ) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను డీఈవో రాజేశ్వర్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, విద్యార్థుల బంగా రు భవితకు బాటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కొమ్ము జ్యోతి, జిల్లా అధ్యక్షుడు సు భాష్పాటిల్, గౌరవాధ్యక్షుడు రంజిత్, ప్రధా న కార్యదర్శి జాదవ్ గోవింద్, మల్లేశ్, మునేశ్వర్, మదన్మోహన్, సాహెబ్ రావు పవార్, దినేష్రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
కూలీలందరికీ పని కల్పించాలి
కైలాస్నగర్: గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన కూలీ లందరికీ వందరోజుల పాటు తప్పనిసరిగా పని క ల్పించాలని డీఆర్డీవో రాథోడ్ రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఉపాధి హామీ ఏపీవో లు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లతో మంగళవారం జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. మండలాల వా రీగా ఉపాధి హామీ పనులు, హాజరవుతున్న కూలీల ప్రగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను పెంచాల్సిన అవసరముందన్నారు. దరఖా స్తు చేసుకున్న ప్రతి కూలీకి పని కల్పించేలా శ్రద్ధ వ హించాలన్నారు. 2026–27 వార్షిక సంవత్సరానికి సంబంధించి పనుల ప్రణాళికను యుక్తధార పోర్టల్లో పక్కాగా నమోదు చేయాలన్నారు. రానున్న వర్షాకాలానికి సంబంధించి పూర్తిస్థాయిలో మొక్కలు అందించేలా నర్సరీలను సిద్ధం చేయాలన్నారు. ఎండల తీవ్రతకు మొక్కలు వాడిపోకుండా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి కూలీల సంఖ్య పెంపుతోపాటు పనులు వేగంగా జరిగేలా శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో అదనపు డీఆర్డీవో కుటుంబరావు, ఏపీడి గజానన్రావు, కృష్ణారావు, ఏవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు -
ఉగాది ఘనంగా నిర్వహించుకోవాలి
ఆదిలాబాద్: ఉగాది పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామిజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని మఠంలో మంగళవారం సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి తెలుగు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. గోపాలకృష్ణ మఠంలో ఈనెల 19న ఉదయం 9 గంటలకు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి, గుడాల పంపిణీ చేపట్టనున్నట్లు వివరించారు. సాయంత్రం 5 గంటలకు ప్రముఖ పంచాంగకర్త చికిలి వెంకటేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్య లో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఇందులో ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, రవీందర్, నర్సిములు, రవీందర్, దశరత్, రాజు, సుభాష్, మహిపాల్, రాజు, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాటు వైద్యం నమ్మొద్దు
సిరికొండ: నాటు వైద్యం నమ్మొద్దని, ఎలాంటి అనా రోగ్య సమస్యలైనా వైద్యులను సంప్రదించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని కుంటగూడ పంచాయతీ పరిధి పాలవాగు గ్రామంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మూఢ నమ్మకాలు వీడాలన్నారు. యువత చదువుపై దృష్టి సారించి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. అనంతరం ఆదిలాబాద్ నుంచి విచ్చేసిన ప్రైవేట్ వైద్యులు సుమారు 100 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఇందులో ఉట్నుర్ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఇచ్చోడ సీఐ రమేశ్, స్థానిక ఎస్సై పూజ, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ క్రమశిక్షణకు ప్రతీక ఆదిలాబాద్టౌన్: రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ముస్లిం పోలీస్ సిబ్బంది కోసం మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో మతసామరస్యాన్ని పెంపొందించేలా పండుగలను నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు బి.సురేందర్రావు, పి. మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్కాంత్, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ట్రాన్స్‘ఫార్మర్’పై ఓవర్లోడ్!
బోథ్: జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ సరఫ రాపై రోజురోజుకు భారం పెరుగుతోంది. ముఖ్యంగా అనధికారిక కనెక్షన్లు అధికమవడం, అనుమతించిన సామర్థ్యాన్ని మించి మోటార్లు వినియోగించడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్లు) తరచూ కాలిపోతున్న పరిస్థితి. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో కొంతమంది రైతులు నిబంధనలు పాటించకుండా అక్రమంగా కనెక్షన్లు తీసుకుంటున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో సుమారు ఐదు వేల వరకు ఇలాంటి కనెక్షన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. 7 హెచ్పీ మోటార్ల వినియోగం.. అనుమతులు 5 హెచ్పీ మోటార్లకు తీసుకుని, వాటి స్థానంలో 7 హెచ్పీ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల వాటిని నడపడం విస్తృతంగా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 25కేవీ ట్రాన్స్ఫార్మర్పై ఆరు వరకు మాత్రమే వినియోగించాల్సి ఉండగా మరో ఐదారు వరకు అదనంగా నడుస్తున్నట్లుగా విద్యుత్ అఽధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాల వల్ల అనూహ్యంగా లోడ్ పెరిగి ట్రాన్స్ఫార్మర్లు తరచూ దెబ్బతింటున్నాయి. ఇబ్బందులు పడుతున్న రైతులు.. ట్రాన్స్ఫార్మర్లు చెడిపోవడంతో అధికారికంగా కనెక్షన్లు ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అనధికారికంగా వినియోగిస్తున్న వారు రైతులే కావడతో వారిని ఏమి అనలేకపోతున్నామని పలువురు పేర్కొటున్నారు. విద్యుత్ అధికారులే సర్వే చేసి అనధికార కనెక్షన్లు తొలగించాలని వారు కోరుతున్నారు. జిల్లాలో మొత్తం విద్యుత్ కనెక్షన్లు : 2.87 లక్షలు అధికారికంగా కనెక్షన్ తీసుకోవాలి రైతులు అనధికారికంగా విద్యుత్ వాడకూడదు. దీంతో ట్రాన్స్ఫార్మర్లపై లోడు పెరిగి పాడయ్యే అవకాశం ఉంటుంది. సంబంధిత డీడీ చెల్లించి అధికారికంగా వినియోగించుకోవాలి. అవసరమైతే కెపాసిటీ పెంచి సరిపడా అందించే చర్యలు చేపడతాం. – లక్ష్మణ్, ఏడీఈ, విద్యుత్శాఖ బోథ్ మండలంలోని ఓ గ్రామ శివారులో 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఉంది. దీని పరిధిలో గరిష్టంగా 10 వరకు 5హెచ్పీ మోటార్లు పనిచేసే వీలుంది. అయితే అక్రమంగా మరో ఐదారు కనెక్షన్లు ఉన్నాయి. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్పై లోడు పెరిగి ఇటీవల చెడిపోయింది. విద్యుత్శాఖ అధికారులు దానిని బాగు చేసేందుకు వారం పట్టింది. ఈ సమయంలో రైతులు పంటలకు నీరందించేందుకు ఇబ్బందులు పడ్డారు. ఇదొక్క చోటే కాదు.. జిల్లాలో చాలా ప్రాంతాల్లో అనధికార కనెక్షన్లతో రైతులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. -
ఎకరాకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలి
సాత్నాల: కొరటా–చనాఖా సబ్ కెనాల్లో భాగంగా భూములు కోల్పోతున్న తమకు ఎకరానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. భోరజ్ మండలం గిమ్మ పంచాయతీ కార్యాలయంలో ప్రాజెక్టు డి–14 సబ్కెనాల్లో భూములు కోల్పోతున్న రైతులతో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 2016 లో నిర్వహించిన సర్వే ప్రకారం ఎకరానికి రూ.10 లక్షల 40వేలు నెల క్రితం అకౌంట్లో జమ చేశారని, అయితే ఇప్పుడున్న ధరల ప్రకారం ఎకరానికి రూ.25 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మొదటి సర్వే ప్రకారమే పనులు కొనసాగించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పరిహారం పెంపు విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి, మనోహర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
తాంసి/తలమడుగు: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తాంసి, తలమడుగు మండలకేంద్రాల్లోని పీహెచ్సీల్లో ఎస్బీఐ, మిత్ర ఎన్జీవో సహకారంతో ఏర్పాటు చేసిన నూతన పరికరాలను మంగళవారం ప్రారంభించారు. తాంసి పీహెచ్సీలో మరుగుదొడ్డి అస్తవ్యస్తంగా ఉండటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ఎస్బీఐ ఆర్ఎం రాంచంద్రరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్ కుమార్, మైత్రి హలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మిరెడ్డి, తహసీల్దార్లు లక్ష్మి, రాజ్ మోహన్, ఎంపీడీవో మోహన్రెడ్డి, వైద్యాధికారులు శ్రావ్య, నర్మద, హరీష్, శ్రీధర్, ఏఈ నజీర్, సర్పంచ్ సంతోష్రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. అనంతరం తలమడుగులోని పశువైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయంతో పాటు పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రామారావు, వైద్యులు లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఖోడద్ గ్రామంలో ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, గ్రామ ఉద్యోగుల సంఘం సభ్యులు వెంకట్, నర్సింలు, చంద్రారెడ్డి, అనిల్రెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
● ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో.. ● రోడ్లు, కల్వర్టులు నిర్మించాలంటున్న ప్రజాప్రతినిధులు ● ప్రభుత్వానికి నివేదిస్తున్న అధికారులు
సాక్షి, ఆదిలాబాద్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. 99 రోజుల పాటు జూన్ 12 వరకు 10 ప్రధాన అంశాలతో నిర్వహించనున్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారంతో పాటు ఇతర అంశాలను ఇందులో పొందుపరిచారు. తక్కువ అంచనా వ్యయంతో పూర్తయ్యే పనులకు ప్రాధాన్యత ఇస్తూ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ, పట్టణంలోని వార్డులకు సంబంధించి రూ.10వేలు, మండలం, మున్సిపాలిటీలో రూ.రెండు లక్షలు, నియోజకవర్గ స్థాయిలో రూ.10 లక్షలు, జిల్లాస్థాయిలో రూ.50 లక్షలు బడ్జెట్ను ప్రతిపాదించారు. ఖర్చు చేసిన తర్వాత డీటెయిల్ ఓచర్ బిల్లు పెట్టుకున్న పక్షంలో ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. వ్యయంతో కూడుకున్న ప్రతిపాదనలు.. పారిశుద్ధ్యం, ఆరోగ్యం సంబంధిత కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మున్సిపల్ వార్డుల్లో, గ్రామ పంచాయతీల్లో అనేక సమస్యలు తీష్ట వేసి కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులు రోడ్లు, మురుగు కాలువలు, కల్వర్టులు నిర్మించాలని మున్సిపాలిటీతో పాటు జీపీల్లో ప్రతిపాదనలు అందజేస్తున్నారు. ఇటీవలే కొత్తగా ఎన్నికై న స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరుతున్నారు. ఇవి పెద్ద మొత్తం వ్యయంతో కూడుకున్నవి కావడంతో అధికారులు వాటిని ప్రభుత్వానికి పంపుతున్నారు. ఇలాంటివి కూడా.. తమ ఇళ్ల ముందు అసౌకర్యంగా ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలు తొలగించాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వీధి దీపాలు అమర్చాలని కోరుతున్నారు. సాధారణ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకు వెళుతున్నారు. వాటి పరిష్కారంలో జాప్యం అవుతుండడంతో ప్రజా ప్రతినిధులు ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులకు ఈ సమస్యలను పరిష్కరించాలని జాబితాలు అందజేస్తుండడం గమనార్హం. అదిలాబాద్ పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద ప్రైవేట్ బస్సుల పార్కింగ్ను తొలగించాలని స్థానిక ప్రజా ప్రతినిధి అధికారులకు విన్నవించారు. ఇలా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని చిన్న చిన్న సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నారు. మరి ఇవి పరిష్కారం అవుతాయే లేదో వేచి చూడాల్సిందే. ‘బీటీ రోడ్లు, సీసీరోడ్లు, డ్రైయిన్లు, కల్వర్టులు, సర్వీస్ రోడ్లు నిర్మించాలి.. సీసీ కెమెరాలు బిగించాలి.. వీధి పేరుకు సంబంధించి సైన్ బోర్డులు పెట్టాలి.. ఓపెన్ జిమ్లను రిపేర్ చేయించాలి.. కొత్తవి ఏర్పాటు చేయాలి..’ ఆదిలాబాద్ పట్టణంలోని 43వ వార్డు కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ మంగళవారం మున్సిపల్ కమిషనర్ జి.రాజుకు అందజేసిన ప్రతిపాదనల జాబితా ఇది. ఈ ఒక్క వార్డు నుంచే కాదు.. మరికొన్ని వార్డుల నుంచి ఇలాంటి ప్రతిపాదనలే అందుతున్నాయని బల్ధియా అధికారులు పేర్కొంటున్నారు. -
మార్కెటింగ్ సౌకర్యం లేక తిప్పలు
రంజన్లకు గిరాకీ బానే ఉంటుంది. అయితే మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో ఎంత శ్రమించినా తక్కువ లాభానికి అమ్ముకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఆదిలాబాద్ రంజన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే మాలాంటి వారికి మేలు చేకూరుతుంది. – రాధారపు సంగీత, కుమ్మరివాడ, ఆదిలాబాద్ పింఛన్ సౌకర్యం కల్పించాలి చిన్నప్పటి నుంచి ఇదే వృత్తిలో ఉన్నా. తయా రు నుంచి మొదలుకొని, అమ్మే వరకు ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి. ఆర్థికంగా సమస్యలు అనేకం. వీటన్నింటినీ దాటి వృత్తిని కాపాడుకుంటూ, రంజన్ల తయారీ, అమ్మకాలు కొనసాగిస్తున్నాం. మాలాంటి వృద్ధులకు ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పించాలి. – ఎన్. గంగారాం, బంగారిగూడ, ఆదిలాబాద్ -
నివేదనలు.. వేడుకోలు
కై లాస్నగర్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సో మవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీలు వెల్లువెత్తాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ బాధితులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వారి నుంచి అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రతా పింఛన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి తదితర సమస్యలపై ఈ వారం మొత్తం 85 దరఖాస్తులు అందాయి. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఏవో వర్ణ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.. సమస్యలు త్వరగా పరిష్కరించాలి ఆదిలాబాద్టౌన్: బాధితుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించి పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. వాటిపై సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిణి జైస్వాల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఆశా’ల 48 గంటల దీక్ష
కై లాస్నగర్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా కార్యకర్తల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం 48గంటల నిరసన దీక్ష చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, ఆశాల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశాలకు రూ.18 వేల కనీస వేతనం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఆఽశా వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో పలువురి చేరిక
కై లాస్నగర్: బోథ్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో సోమవారం నిర్వహంచిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ వారికి కండువా కప్పి స్వాగతించారు. పార్టీలో చేరిన వారిలో చిలుకూరి భూమయ్య, ఆత్రం నాగో రావు, చాకటి మహేశ్, గడ్డం కాశీనాథ్, విజేందర్, వెంకటరమణ, రమేశ్, గణేశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, నాయకులు తుల అరుణ్కుమార్ తదితరులున్నారు. -
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
ఆదిలాబాద్రూరల్: ఇఫ్తార్ మత సామరస్యానికి ప్ర తీక అని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక టీఎన్జీవో గార్డెన్లో ఏర్పాటు చేసిన ‘దావత్–ఏ–ఇఫ్తార్ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్లు అందిస్తున్నామని తెలిపారు. ఇందులో భా గంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1500 ప్యాక్లు, బోథ్ నియోజకవర్గంలో 750 ప్యాక్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అనంతరం పలువురికి గిఫ్ట్ ప్యాక్లు అందజేశారు. కార్యక్రమంలో మున్సి పల్ వైస్చైర్మన్ రోహిత్, మైనారిటీ సంక్షేమ అధి కా రి కలీమ్, ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలు, జిల్లా అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. -
‘హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలం’
నేరడిగొండ: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎక్కడ..? కాంగ్రెస్ సర్కారుకు ప్రజల పట్ల నిబద్ధత లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ సర్కారు ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందని విమర్శించారు. -
రూ.1,500 కోట్ల అంచనాతో..
రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో ఆదిలాబాద్లో విమానా శ్రయ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. భూసేకరణ, ఇతర వాటి కోసం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. గవర్నర్ ప్రసంగంలో ఈ అంశం ప్రస్తావించడం ద్వారా మనకు పూర్తి రైట్ వచ్చినట్టే. ఆదిలాబాద్ అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్తున్నాం. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు రూ.2వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ దశ మారనుంది. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే -
‘సాక్షి’ చొరవ..
ఆదిలాబాద్లో విమానాశ్రయ ఏర్పాటులో మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఆదిలాబాద్ అభివృద్ధిపై గవర్నర్ ప్రస్తావించారని, ఇది శుభసూచకమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభిప్రాయపడ్డారు. జూన్ 2న శంకుస్థాపనకు అవకాశం ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జూన్ 2న ప్రధాని చేతుల మీ దుగా ప్రత్యక్షంగా శంకుస్థాపన నిర్వహించేలా ప్రయత్నిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ‘సాక్షి’కి తెలిపారు. ఆదిలాబాద్లో రక్షణ శాఖకు సంబంధించి ఇప్పటికీ 369 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. తొలుత విమానాశ్రయం ఏర్పాటుతో పాటు రానున్న రోజుల్లో వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ విషయంలో నిధుల మంజూరు జరగాల్సి ఉంది. దీనికి బడ్జెట్ కేటాయిస్తే ముందడుగు పడుతుంది. ఆదిలాబాద్ విమానాశ్రయ మైదానం ‘తెలంగాణ ప్రాంతంలో విమాన అనుసంధానతను మెరుగుపర్చడానికి కేంద్రం చొరవ చూపుతుంది.. ఇందులో భాగంగా వరంగల్, ఆదిలాబాద్లలో ఎయిర్పోర్ట్ల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించింది.. పనుల వేగవంతానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది..’ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సోమవారం ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్న మాటలివి. – సాక్షి,ఆదిలాబాద్ ఆదిలాబాద్లో విమానాశ్రయ ఏర్పాటు విషయంలో గతంలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో పట్టణంలోని మేధావులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి చర్చా వేదిక నిర్వహించిన విషయం విదితమే. ఈ క్రమంలో స్థానిక ఎంపీ గోడం నగేశ్ పలుమార్లు అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడం, అలాగే స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా అసెంబ్లీలో ప్రస్తావనకు తీసుకురావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటు తన బాధ్యతగా పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రాష్ట్ర ప్రభుత్వం సైతం తదనుగుణంగా చర్యలు చేపట్టడంతో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. -
‘భగీరథ’ పైపులైన్ మార్పు
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలో చేపట్టిన రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జిల వద్ద గల మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ మార్చేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. కొత్త నిర్మాణాలు పూర్తయితే అడుగుభాగంలో ఉన్న పైపులైన్లో తలెత్తే లీకేజీలకు మరమ్మతులు చేయడం కష్టతరంగా మారనుంది. దీనిని గుర్తించిన వాటర్గ్రిడ్, మున్సిపల్ అధికారులు పైపులైన్లను పక్కకు మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయా శాఖలు రూ.కోటి 2లక్షల వ్యయంతో వేర్వేరుగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యేలోగా అనుమతి తీసుకువచ్చి పనులు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. సమస్య ఉత్పన్నం కాకుండా.. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం మాటేగాం వద్ద గల పంప్హౌస్ నుంచి ఆదిలాబాద్ ఫిల్టర్బెడ్కు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతుంది. ఇటీవల రైల్వే ఓవర్ బ్రిడ్జి పిల్లర్ కోసం తవ్వకాలు చేపట్టగా స్థానిక సంజయ్నగర్ కాలనీ వద్ద గల ప్రధాన పైపులైన్ ఽస్వల్పంగా దెబ్బతింది. దీంతో అధికారులు మూడు రోజులు శ్రమించి మరమ్మతులు చేపట్టారు. చిన్నపాటి సమస్యకే ఇంత ఇబ్బంది ఏర్పడగా బ్రిడ్జిల నిర్మాణంలో భాగంగా వాటి కింద వెళ్లే పైపులైన్ల పరిస్థితి ఏంటనే దానిపై మున్సిపల్ ఇంజినీరింగ్, మిషన్ భగీరథ (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు పరిశీలన చేపట్టారు. నిర్మాణాలు పూర్తయితే పైపులైన్ పూర్తిగా అడుగుభాగంలో ఉంటుంది. బ్రిడ్జి నుంచి వెళ్లే వాహనాల వేగానికి పైపులు కదలి లింకుల్లో గ్యాప్ తలెత్తే అవకాశముంటుందని భావించారు. అదే జరిగితే ఫిల్లర్ల వద్ద మరమ్మతులు చేయడానికి ఆస్కారముండకపోవచ్చని నిర్ధారించారు. ఈమేరకు పైపులైన్లను పూర్తిగా బ్రిడ్జిల పక్కకు మార్చాలని నిర్ణయించారు. రూ.1.02 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు .. -
సమన్వయంతో పనిచేయాలి
కైలాస్నగర్: జిల్లాను గంజాయి రహితంగా మా ర్చేందుకు సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గంజా యి సాగు, మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ అఖి ల్ మహాజన్తో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా దక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్శాఖతో పాటు విద్య, రెవెన్యూ, ఆరోగ్యశాఖలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. యాంటీ డ్రగ్ కమిటీల ద్వారా గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించిన రైతులపై చట్టపరమైన చర్యలతో పాటు ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు పోలీస్శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, ఆర్టీవో శ్రీనివాస్, డీపీవో రమే శ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీఏవో శ్రీధర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య పాల్గొన్నారు. ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై ఎస్పీ అఖి ల్ మహాజన్తో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రహదారి ప్రమాదాల నివారణకురవాణా, పోలీస్శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల పై కఠిన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ఎస్పీమాట్లాడుతూ, పోలీస్ శాఖ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృ త అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముందుగా మండలాల వారీగా రహదారి ప్రమాదా లు జరిగే హాట్ స్పాట్లను, నివారణ చర్యలపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఇందులో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వైద్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి సాత్నాల: వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని సైద్పూర్ పీహెచ్సీలో ఏర్పాటు చేసిన వైద్య శిబి రంతో పాటు మేడిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రిమ్స్సహకారంతో ఏర్పాటు చేసిన ఉచి త వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. అనంతరం మేడిగూడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు నూత న గృహ ప్రవేశానికి కలెక్టర్ హాజరయ్యారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, తహసీల్దార్ రామారావు, ఇన్చార్జి ఎంపీడీవో వెంకట్రాజు,చాంబర్ ఆఫ్కామర్స్ అండ్ ట్రేడ్స్ అసోసియేషన్ ప్రతినిధులు శివ ప్రసా ద్, సర్పంచ్ లక్ష్మి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఒకే చితిలో తల్లీకుమారుడు… కన్నీటి మడుగైన మందమర్రి
మందమర్రి(మంచిర్యాల జిల్లా): తల్లీకుమారుడి అంత్యక్రియలు ఒకే రోజు ఘటన మందమర్రిలో అందరినీ కంటతడి పెట్టించింది. వివరాలు ఇలా ఉ న్నాయి.. పట్టణంలోని రెండోజోన్కు చెందిన వీరవేణి–సత్యనారాయణ దంపతులకు ప్రసాద్, నాగసత్యవేణి సంతానం. నాగసత్యవేణికి హైదరాబాద్ (బోరబండ)కు చెందిన మురళీవేణుతో 13 మార్చి 2019లో వివాహమైంది. రుద్రాన్ష్ (5), ధన్విక (2) సంతానం. కొంతకాలం వీరి దాంపత్యం సాఫీగా సాగింది. పెళ్లయిన ఏడాది తర్వాత మురళీవేణుకు జెన్కోలో ఇంజినీర్గా ఉద్యోగం వ చ్చింది. అప్పటినుంచి భార్యను వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కట్నం వచ్చేది. నిన్ను చేసుకున్నందుకు కట్నం ఇవ్వలేదనే, భార్యను పుట్టింటివారితో మాట్లాడనిచ్చేవాడు కాదు. అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు. తల్లిగారింటికి వెళ్తే త్వరగా తిరిగి రావాలని ఆంక్షలు విధించేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి తన అన్న ప్రసాద్కు ఫోన్చేసి అమ్మను, తన కుమారుడు (మేనల్లుడు)ని బాగా చూసుకోవాలని చెప్పింది. మళ్లీ రాత్రి 9:30 గంటలకు మురళీవేణు మందమర్రిలోని ప్రసాద్ ఫోన్చేసి మీ చెల్లి ఆత్మహత్య చేసుకుందని చెప్పగా హైదరాబాద్ వెళ్లాడు. గాంధీ ఆసుపత్రిలో నాగసత్యవేణి, రుద్రాన్ష్ మృతదేహాలు, ధన్విక నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు చెప్పారు. శనివారం సాయంత్రం పోసుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగించారు. ఆదివారం స్వగ్రామానికి తీసుకువచ్చి శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు. తల్లికుమారుడి మృతి కారకులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. -
ఆదివాసీల సంస్కృతి గొప్పది
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివాసీ పర్ధాన్ సమాజ్ గోండి ధర్మ గురు హీరా సుకా జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఆది వారం నిర్వహించారు. రాంలీలా మైదానంలో అధి కారికంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. ముందుగా బస్టాండ్ ఎదుట గల హీరా సుకా దేవస్థానం ఆవరణలో కలెక్టర్ పాల్గొని సంప్రదాయ పూజలు చేపట్టారు. ఆది వాసీలతో కలిసి థింసా నృత్యం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆదివాసీ యువత విద్యపై దృష్టి సారించాలన్నారు. జల్, జంగల్, జమీన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ, ఆదివాసీ పర్ధాన్ కులస్తుల సమస్యల పరిష్కరం కోసం కృషి చేస్తానని అన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పర్ధాన్ కులస్తుల సంక్షేమం, అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, పర్ధాన్ కులస్తుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. అనంతరం పర్ధాన్ కులస్తుల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వేడుకల కమిటీ అధ్యక్షుడు మెస్రం శంకర్, ప్రధాన కార్యదర్శి గేడం మాధవ్, సమాజ్ నాయకులు డాక్టర్ మెస్రం మనోహార్, గేడం తులసీరాం, మడావి శంకర్, మెస్రం శంకర్, కుర్సేంగే తానాజీ, గేడం నిరంజన్, పూసం ఆనంద్రావ్, ఉయిక సుదర్శన్, మెస్రం కేశవ్, మెస్రం నాగేశ్వర్రావ్, దుర్వ నగేశ్, సిడాం రాంకిషన్, సిడాం భీంరావ్, ఉయిక విఠల్, మెస్రం మారుతి, గేడం ప్రకాశ్, కుమ్ర సంగీత, మెస్రం సంగీత, గేడం వనిత, గోవింద్ రావ్, కుమ్ర రాజు, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి కృషి
తలమడుగు: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని నందిగామ గ్రామంలో రూ.1.01కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారి పనులకు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, దేశంలోని అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజన పథకం చేపట్టిందన్నారు. రోడ్డు సౌకర్యం ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, సర్పంచ్లు భీంరావు, సంతోష్, నాయకులు గంగాధర్రావు, చంద్రకాంత్, డీఈ రాజేశ్వర్, కాశీరాం తదితరులు పాల్గొన్నారు. -
సమ్మర్ యాక్షన్ ప్లాన్
కై లాస్నగర్: ఈ వేసవిలో జిల్లాకేంద్రంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈమేరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. గత అనుభవాల దృష్ట్యా కసరత్తు చేసిన ఇంజినీరింగ్ అధికారుల ప్రతిపాదనల మేరకు ప్రత్యేకంగా రూ.76లక్షలు కేటాయించారు. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానిస్తూ ఆమోదించారు. ఈమేరకు టెండర్ల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 17న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. వారం పాటు ఆన్లైన్లో టెండర్లు స్వీకరించనున్నారు. పనుల వారీగా కేటాయింపులు ఇలా.. తాగునీటికి ఇబ్బంది రానివ్వం ఈ వేసవిలో పట్టణ పరిధిలో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్ల ద్వారా ఆయా పనులు చేయిస్తాం. మావల చెరువుతో పాటు లాంగసాంగ్వి నుంచి పూర్తిస్థాయిలో నీరు సరఫరా అవుతుంది. గ్రిడ్ నుంచి కూడా 16 ఎంఎల్డీలు అందుతుంది. – అరుణ్కుమార్, మున్సిపల్ ఇంజినీర్ -
వినియోగదారుల చట్టాలపై అవగాహన అవసరం
ఆదిలాబాద్రూరల్: వినియోగదారుల చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు, జడ్జి జబేజ్ శామ్యూల్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మండలంలోని చాందా (టి) పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గడిచిన ఎనిమిదేళ్లలో జిల్లాలో 1,600 కేసులు పరిష్కరించామన్నారు. వినియోగదారులు తమ సమస్యలపై సరైన ఆధారాలతో కమిషన్ కార్యాలయాన్ని సంప్రదిస్తే అక్కడ ఉన్న సిబ్బంది సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. కార్యక్రమంలో వినియోగదారులు పాల్గొన్నారు. -
బాధితుల వద్దకే పోలీస్
ఆదిలాబాద్టౌన్: పోలీస్ శాఖ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు సంస్కరణలు చేపడుతోంది. ఫిర్యాదుదారులకు సులభంగా, నాణ్యమైన సేవలు అందేలా రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై పలు కేసుల్లో స్టేషన్కు వెళ్లకుండానే సంఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ పక్కాగా అమలు చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే.. ఆన్సైట్ ఎఫ్ఐఆర్ విధానం ద్వారా బాధితుల వద్ద కే పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తారు. ఫిర్యాదుదారులు సమాచారం ఇచ్చినా, డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేసినా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో కేసు నమోదు చేస్తారు. రోడ్డు ప్రమాదాలు, గొడవలకు సంబంధించి గాయాలైతే బాధితులను ఆస్పత్రికి తరలిస్తారు. ఈ విధానం ద్వారా రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దొంగతనాలు, భార్యభర్తల పంచాయతీలు, వేధింపులు, అనుమానాస్పద మృతి వంటి వాటిపై అప్పటికప్పుడే కేసులు నమోదు చేస్తారు. జిల్లాలో గత 15 రోజులుగా కార్యక్రమం అమలు కాగా, ఇప్పటివరకు 15 కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. వాట్సాప్లో ఎఫ్ఐఆర్.. నేరం జరిగిన తర్వాత బాధితులు శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఉంటారు. ఈ క్రమంలో వారిని తిరిగి పీఎస్కు పిలిచి సమయం వృథా చేయకుండా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఘటన జరిగిన వెంటనే స్పాట్ వద్దకు చేరుకునే పో లీసులు పీఎస్లో ఉండే సిబ్బందికి దీనిపై సమాచారం అందిస్తారు. ఘటనా స్థలంలో సేకరించిన వివరాలను ఎస్హెచ్వో ద్రువీకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి, ఆ తర్వాత బాధితులకు వాట్సాప్ లో పంపిస్తారు. దర్యాప్తులో పురోగతి ఆఽ దారంగా ఫిర్యాదుదారులకు సమాచారం అంది స్తారు. బాధితులు ఎక్కడ ఫిర్యాదు చేయాలనుకుంటే అక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా చర్యలు చేపడుతారు. ముఖ్యంగా మహిళలకు ఈ విధానం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే బాలికలు, యువతులు, మహిళలు అదృశ్యమైనప్పుడు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే కొంత ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ కార్యక్రమం ద్వారా ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటున్నారు.ఆన్సైట్ ఎఫ్ఐఆర్ కేసుల వివరాలు.. స్టేషన్ నమోదైన ఎఫ్ఐఆర్లు ఆదిలాబాద్ వన్టౌన్ 03 ఆదిలాబాద్ టూటౌన్ 01ఆదిలాబాద్రూరల్ 02 తలమడుగు 03 మావల 01 బేల 01 భీంపూర్ 01 బోథ్ 02 బజార్హత్నూర్ 01 మొత్తం 15ఘటనా స్థలానికే పోలీసులు బాధితులకు తక్షణ న్యాయం అందించడంలో భాగంగా డీజీపీ ఆన్సైట్ ఎఫ్ఐఆర్ను అమలులోకి తీసుకొచ్చారు. బాధితులు డయల్ 100, స్టేషన్కు సమాచారం ఇచ్చినా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. వాంగ్మూలం రికార్డు చేయడం జరుగుతుంది. దీంతో బాధితులకు సమయం ఆదా అవుతుంది. జిల్లాలో ఇప్పటివరకు 15 కేసులు నమోదు చేశాం. – ఎల్.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
ఏడుగురికి ఏవోలుగా పదోన్నతి
ఆదిలాబాద్టౌన్: వైద్యారోగ్య శాఖలో ఏడుగు రు కార్యాలయ సూపరింటెండెంట్లకు అడ్మిని స్ట్రేటీవ్ ఆఫీసర్ (ఏవో)గా పదోన్నతి లభించింది. ఈమేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామి లీ వెల్ఫేర్ శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో డీఎంహెచ్వో కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న గుజరాతి గోపికి రిమ్స్ ఆస్పత్రిలో ఏవో గా పదోన్నతి కల్పించారు. అలాగే రిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఎ.మహేందర్కు రిమ్స్ మెడికల్ కళాశాలలో, రిమ్స్ ఆస్పత్రిలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న టి.గోపికి రిమ్స్ న ర్సింగ్ కళాశాలలో ఏవోగా పదోన్నతి లభించింది. నిర్మల్లోని మెడికల్ కళాశాలలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న కె.రవీందర్కు ఆదిలా బాద్ రిమ్స్ మెడికల్ కళాశాలలో ఏవోగా, ఆది లాబాద్ నర్సింగ్ కళాశాలలో సూ పరింటెండెంట్గా పనిచేస్తున్న సందీప్కు నిర్మల్ జీజీహెచ్ ఏవోగా, డీఎంహెచ్వో కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సి. మధుసూదన్ ను నిర్మల్కు కేటాయించారు. వీరి కి పదోన్నతి లభించడంపై కార్యాలయ ఉద్యోగులు, అధికా రులు అభినందనలు తెలిపారు. -
కాన్షీరాం ఆశయ సాధనకు కృషి
ఆదిలాబాద్రూరల్: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాన్షీరామ్ ఆశయ సాధనకు అంద రూ కృషి చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ జి ల్లా కోఆర్డినేటర్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అ ధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్ మహరాజ్ అన్నారు. కాన్షీరామ్ జయంతిని జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఆదివారం ఘ నంగా నిర్వహించారు. కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బహుజ నుల కోసం కాన్షీరామ్ అందించిన సేవలను కొనియాడారు. ఇందులో నాయకులు అన్నెల ఆడేల్లు, శ్రీనివాస్, వెంకటేశ్, దర్శనాల సుష్మ, నవీన్, రవి, సాయికుమార్, శ్రీనివాస్, అఖిల్, పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు
కై లాస్నగర్: జిల్లాలో గృహావసరాలకు సంబంధించి గ్యాస్ కొరత లేదు.. ఇండెంట్ ప్రకారం ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి.. సోషల్ మీడియాలో వదంతులు నమ్మవద్దు.. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసుకుంటే డోర్ డెలివరీ కొనసాగుతుంది.. సిలిండర్లను నిల్వ చేసినా, బ్లాక్ మార్కెటింగ్కు తరలించినా వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.. గ్యాస్ సరఫరాలో ఎలాంటి సమస్యలున్నా టోల్ఫ్రీ నంబర్ 18004251939లో సంప్రదించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నందిని సూచించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు వివరాలు వెల్లడించారు. సాక్షి: జిల్లాలో గ్యాస్ కొరత ఉందనే ప్రచారం సాగుతుంది.. ఇది వాస్తవమేనా..? డీఎస్వో: కమర్షియల్ సిలిండర్ల కొరత ఉన్నమాట వాస్తవమే. కేంద్ర ప్రభుత్వమే ఆ సరఫరాపై ఆంక్షలు విధించింది. అయితే గృహావసరాలకు వినియోగించే గ్యాస్కు సంబంధించి ఎలాంటి కొరత లేదు. జిల్లా నుంచి పంపిన ఇండెంట్ ప్రకారం ఆయిల్ కంపెనీలు యథావిధిగా సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. దీనిపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాక్షి: కొరత లేకుంటే ఏజెన్సీల వద్ద నియోగదారులు ఎందుకు బారులు తీరాల్సి వస్తోంది.. దీనిపై ఎలాంటి దృష్టి సారించారు? డీఎస్వో: వంటగ్యాస్కు ఎలాంటి కొరత లేదు. అయితే కొందరు గ్యాస్ దొరకదేమోననే ఉద్దేశంతో ముందస్తుగా ఏజెన్సీల వద్దకు వస్తుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాం. బారులు తీరకుండా సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాం. సాక్షి: గ్యాస్ బుకింగ్ కావడం లేదని వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. కారణమేంటి..? డీఎస్వో: గ్యాస్ బుకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఇది వరకు సిలిండర్ తీసుకున్న 21 రోజులకే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండేది. తాజా పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లోని వారికి 25 రోజుల గడువు పొడిగిస్తూ కేంద్రం నిర్ణ యం తీసుకుంది. ఈ ప్రకారమే వినియోగదారులు బుక్ చేసుకోవాలి. అందరూ ఒకేసారి బుకింగ్ చేసుకోవడంతో సర్వర్లో సమస్య తలెత్తింది. ఆందోళన చెందకుండా నిదానంగా బుక్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. సాక్షి: కమర్షియల్ గ్యాస్ సరఫరా లేకపోవడంతో హోటళ్ల నిర్వాహకులు గృహావసర సిలిండర్లను వినియోగిస్తున్నారు. దీన్ని ఎలా కట్టడి చేస్తారు? డీఎస్వో: వంటగ్యాస్ సిలిండర్లను వ్యాపారాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్సెంటర్లలో డొమెస్టిక్ సిలిండర్ల వాడకాన్ని నియంత్రించేలా రెవెన్యూ, పోలీస్ అధికారులకు కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. వారు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా వంటగ్యాస్ వినియోగించే వారిపై తగు చర్యలు తీసుకుంటారు. సాక్షి: జిల్లాలో వంటగ్యాస్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి.. వినియోగం, సరఫరా పరిస్థితి ఎలా ఉంది? డీఎస్వో: జిల్లా వ్యాప్తంగా 2,45,438 కనెక్షన్లు ఉ న్నాయి. వాటికి 17 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుంది. సగటున రోజుకు 2500 చొప్పున నెలకు సుమారు 70 వేల సిలిండర్ల విని యోగం అవుతుంది. తదనుగుణంగానే ప్రస్తుతం జిల్లాకు సి లిండర్లు సరఫరా అవుతున్నాయి. బుకింగ్ చేసుకు న్న వినియోగదారులకు రూ.992లకే డోర్ డెలివరీ చేయబడుతుంది. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. సాక్షి: కొంతమంది కృత్రిమకొరత సృష్టిస్తూ ప క్కదారి పట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది.. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు.? డీఎస్వో: ఈ పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఒక్కో ఏజెన్సీకి ఒక డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐల ను కలెక్టర్ నియమించారు. వారు బుకింగ్, సిలిండర్ల సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఏజెన్సీల గోడౌన్లను తనిఖీ చేస్తున్నారు. అక్రమంగా నిల్వ ఉంచినట్లు తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశముంటుంది. -
ఎమ్మెల్యేకు లైసెన్స్డ్ సర్వేయర్ల వినతి
నిర్మల్చైన్గేట్: ఆరు నెలలుగా సరైన విధి విధానాలు లేక లైసెన్స్డ్ సర్వేయర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, తమ సమస్యలను అసెంబ్లీలో చర్చించి, పనికి తగిన వేతనం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జిల్లా లైసెన్స్డ్ సర్వేయర్ల కమిటీ తరఫున ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డికి శనివారం వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో మొత్తం 6,500 మంది సర్వేయర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యామని, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా లైసెన్స్లను పొంది దాదాపు 3,500 మంది అభ్యర్థులకు, మండలాలు కేటాయించారని తెలిపారు. సొంత డబ్బులు పెట్టుకుని విధులకు హాజరవుతున్నామన్నారు. మండల కార్యాలయాల్లో ఎటువంటి పని కల్పించడం లేదన్నారు. ఉన్న ఉద్యోగాలు వదులుకుని, లైసెన్స్ సర్వేయర్లుగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం నుండి సరైన విధి విధానాలు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలలోపు ప్రభుత్వం సర్వేయర్లపై తన వైఖరిని ప్రకటించాలని లేనిపక్షంలో లైసెన్సుడ్ సర్వేయర్ల తరఫున అసెంబ్లీలో పోరాడుతామన్నారు. చెక్బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలు మంచిర్యాలక్రైం: చెక్బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలుశిక్షతో పాటు తీసుకున్న మొత్తం చెల్లించాలని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నిరోష శనివారం తీర్పు వెలువరించారు. మాజీమంత్రి బోడ జనార్దన్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా బాలయ్యపల్లెకు చెందిన రమేశ్ చౌదరి అనే వ్యక్తికి వ్యాపార నిమిత్తం రూ.7లక్షలు అప్పుగా ఇచ్చారు. తిరిగి చెల్లించక పోవడంతో అతను ఇచ్చిన చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేశారు. చెక్కు బౌన్స్ కావడంతో జనార్దన్ న్యాయం కోసం 2025లో కోర్టును ఆశ్రయించారు. అతని తరపు న్యాయవాది చిరంజీవి న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితునికి ఏడాది జైలుశిక్షతో పాటు తీసుకున్న అప్పు మొత్తాన్ని చెల్లించాలని తీర్పునిచ్చారు. -
జెండాగూడకు కరెంటొచ్చిందోచ్..
తాంసి: దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు ఆ ఊరికి కరెంటొచ్చింది. గ్రామ సమస్యను రెండేళ్ల క్రితం ‘సాక్షి’ ‘ఈ అంధకారం నుంచి స్వాతంత్య్రం ఎప్పుడు?’ శీర్షికన ఏప్రిల్ 4, 2024న వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు స్పందించిన అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించారు. అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. రెండేళ్ల పాటు కృషి చేసి ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గిరి గ్రామానికి వెలుగులు రావడంతో ఆ ఊరంతా సంబురపడుతోంది. ‘సాక్షి’కి ప్రత్యేక అభినందనలు తెలిపింది. డీఏజేజీయూఏ పథకం కింద.. భీంపూర్ మండలంలోని కమట్వాడ పంచాయతీ పరిధిలో గల జెండాగూడ గ్రామానికి శనివారం తొలిసారిగా విద్యుత్ సరఫరా చేశారు. ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏజేజీయూఏ) పథకం కింద విద్యుదీకరణ పనులు విజయవంతంగా పూర్తి చేసి సరఫరా చేసినట్లు చీఫ్ ఇంజినీర్ (కన్స్ట్రక్షన్) సీఈ చౌహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో మొత్తం 13 సర్వీస్ మీటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1.5 కిలోమీటర్ల మేర 6.3 కేవీలైన్ నిర్మాణం, 0.4 కిలోమీటర్ల ఎల్టీ లైన్, 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా, గ్రామానికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల నిరీక్షణ ఫలించిందని పేర్కొన్నారు. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ రాథోడ్ శేషారావు, డీఈ ప్రభాకర్, ఏఈ తిరుపతి రెడ్డి, విద్యుత్ సిబ్బంది ఉన్నారు. -
వంటగ్యాస్ కొరత లేదు
కై లాస్నగర్: జిల్లాలో గృహ అవసరాలతో పాటు వి ద్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్తో కలిసి గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్త వం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవస రం లేదన్నారు. ప్రతిరోజూ బుకింగ్, సరఫరా వివరాలపై నివేదిక సమర్పించాలని డీలర్లను ఆదేశించారు. గృహ అవసరాలకు కేటాయించిన సిలిండర్ల ను వాణిజ్య అవసరాలకు మళ్లించినా లేదా అక్రమంగా నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టేందుకు పౌర సరఫరాల అధికారులు, డీటీలు, ఎస్సైలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే నిత్యావస ర వస్తువుల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు సకాలంలో సరఫరా చేయాలని, డెలివరీ బాయ్స్ సిలిండర్లను దారి మళ్లించకుండా డీలర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే సిలిండర్లలో గ్యాస్ తూకం కచ్చితంగా ఉండాలని, తూని కల కొలతల శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ సురేందర్రావు, అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటి ల్, ఆర్డీవో స్రవంతి, జిల్లా పౌర సరఫరాల అధికారి నందిని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి కృషి
బజార్హత్నూర్: జిల్లాలో గ్రామాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శ్రీకారం చుట్టారు. జాతర్ల నుంచి కొత్తగూడ వరకు రూ.2కోట్ల ఆర్అండ్బీ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, అందుగూడలో రూ.10లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి, ప్రభుత్వ పాఠశాలలో రూ.20 లక్షల ఐటీడీఏ నిధులతో చేపడుతున్న అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అందుగూడ, గిరిజాయి గ్రామాల్లో పూర్తయిన పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఉమార్డ, భూతాయి (కే) గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడారు. గ్రామపంచాయతీల ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం జీపీలకు పెండింగ్ ని ధులను విడతల వారీగా విడుదల చేస్తుందన్నారు. వాటిని గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలని కోరా రు. కార్యక్రమంలో సర్పంచులు ప్రవీణ్, అరవింద్, పెందూర్ సంగీత, మడవి సింధూజ, జైతు, దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు జీవీ రమణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వెంకన్న, అల్కే గణేశ్, కొత్త శంకర్, రమణ, శ్రీనివాస్, నందినర్సయ్య, భోజారెడ్డి, ఈశ్వర్, సుఖ్దేవ్, రాజేశ్వర్ పాల్గొన్నారు. పట్నాపూర్లో విద్యుత్ సబ్స్టేషన్కు భూమిపూజ బోథ్: మండలంలోని పట్నాపూర్లో నూతనంగా మంజూరైన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి శనివారం భూమిపూజ చేశారు. రూ.2.10 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ శేషారావు, సర్పంచ్ సుగుణ, నాయకులు నాయకులు జీవీ రమణ, కిషన్, రాజేశ్వర్, అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలి
కై లాస్నగర్: గ్రామీణ ప్రాంతాల్లోని నూతన ఆవి ష్కరణలను వెలికితీసి వాటిని వ్యాపార మార్గాలుగా మలిచేందుకు యువత ముందుకు రావాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 40 మందికి పైగా యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు, పర్యావరణహి త ఇంధన వనరులు, ఆరోగ్య రంగానికి సంబంధించిన వినూత్న నమూనాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉన్న ప్రతిభను వెలికితీయాల్సిన అవసరముందన్నారు. స్థానికంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లకు ప్రో త్సాహం అందించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఆవిష్కర్తలతో ప్రత్యక్షంగా చర్చించి వారి ఆలోచనలను మరింత మెరుగుపరుచుకునేలా మార్గనిర్దేశం చేసింది. ఐడియా వ్యాలిడేషన్, ప్రోటోటైపింగ్, గోటు మార్కెట్ స్ట్రాటజీ, నిధుల సమీకరణ, మార్కెటింగ్, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీపీవో రమేశ్, డీపీఆర్వో విష్ణువర్ధన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఈడీఎం రవి, రెడ్కో డీఎం శ్రీనివాస్, వివేకానంద కళాశాల ప్రిన్సిపాల్ నికినీ వర్మ, టీజీఐసీ ప్రతినిధులు ప్రణయ్, రమేశ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
వదంతులు నమ్మొద్దు
ఆదిలాబాద్టౌన్: వంట గ్యాస్ విషయంలో సోషల్ మీడియాలో వచ్చే వదంతులు ప్రజలు నమ్మవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీని శనివారం పరిశీలించారు. నిర్వాహకులతో మాట్లాడి స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ బుకింగ్, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. వంట గ్యాస్ను అక్రమంగా, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే టోల్ఫ్రీ నం.18004251939పై సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, వన్టౌన్ ఎస్సై సునిల్ కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు. రంజాన్ క్రమశిక్షణ, దాతృత్వానికి ప్రతీకఆదిలాబాద్: రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిజార మసీద్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో ఆయన పాల్గొన్నారు. పవిత్ర మాసంలో నిరుపేదలకు అండగా నిలబడటం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు, పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. -
● కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఆర్జేడీ
‘పది’ పరీక్షలు షురూఆదిలాబాద్టౌన్: పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 52 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 10,887 మందికి గాను తొలిరోజు 10,864 మంది హాజరయ్యారు. కలెక్టర్ రాజర్షిషా జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్, ప్రభుత్వ నంబర్–2 పాఠశాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ నాలుగు కేంద్రాలను, వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఆరు పరీక్ష కేంద్రాలను, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి ఐదు పరీక్ష కేంద్రాలను, స్క్వాడ్లు 16 కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. అలాగే ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. బందోబస్తును పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్ రెడ్డి, వన్టౌన్ సీఐ సునిల్కుమార్ ఉన్నారు. -
అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం
బాసర: గత నెల 28న అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యమైంది. తానూరు మండలం బమ్మిని గ్రామానికి దుర్గావార్ నీలాబాయి (58) బాబు దంపతులు కొంతకాలంగా బాసరలోని గణేశ్నగర్లో నివాసం ఉంటున్నారు. బాబు ట్రిపుల్ఐటీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తుండగా వారి కుమారుడు విష్ణుమూర్తి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నీలాబాయి ఫిబ్రవరి 28న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మార్చి 1న బాసర పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. శనివారం గణేశ్నగర్ గుట్ట ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్థానికులు అటుగా వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని కనిపించింది. విష్ణుమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ కిరణ్ తెలిపారు. వివాహిత అదృశ్యం ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన 25 ఏళ్ల వివాహిత అదృశ్యమైంది. శనివారం ఇంట్లో భర్తతో గొడవజరగడంతో సదరు మహిళ బయటకు వెళ్ళిపోయింది. రాత్రి వరకూ రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. -
తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీ
తానూరు: మండలంలోని భోసి గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. గ్రామానికి చెందిన అర్ధాపూర్ గంగాధర్ కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లగా, సాయినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి మరో ఇంట్లో పడుకున్నారు. గుర్తు తెలి యని దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. గంగాధర్ ఇంట్లో బీరువాలో ఉన్న రూ.79 వేలు, సాయినాథ్ గౌడ్ ఇంట్లో రూ.వెయ్యి నగదు అపహరించారు. శనివారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ముధోల్ సీఐ రవీందర్నాయక్, ఎస్సై షేక్ జుబేర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
గుండు గీయించారని నిలదీత
ఖానాపూర్: పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీలో గల మైనార్టీ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్న విద్యార్థికి తల్లిదండ్రుల అనుమతి లేకుండా పాఠశాల సిబ్బంది గుండు గీయించారు. విషయం తెలుసుకున్న సదరు విద్యార్థి తండ్రి రవి శనివారం పాఠశాలకు చేరుకుని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంప్రదాయం ప్రకారం తల్లి దండ్రులు చనిపోయినప్పుడు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మాత్రమే గుండు చేయించుకుంటారని, ఇలాంటి చర్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ హైమద్ను వివరణ కోరగా గుండు తీసిన విషయం తన దృష్టికి రాలేదని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. -
ఆర్జీయూకేటీని సందర్శించిన ‘బక్కి’
బాసర: బాసర ఆర్జీయూకేటీని శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష స మావేశం నిర్వహించారు. విద్యార్థుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. అడ్మిషన్ల ప్రక్రి య గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ని యామకంలో తప్పనిసరిగా రిజర్వేషన్ పద్ధతిని పా టించాలని ఆదేశించారు. వివిధ అంశాలపై అధికా రులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులతో మా ట్లాడి వారికి అందిస్తున్న వసతులు, సౌకర్యాలు అడి గి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్, సభ్యులను యూనివర్సిటీ అధికారులు సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ స భ్యురాలు కుస్త్రం నీలాదేవి, వైస్ చాన్స్లర్ గోవర్ధన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. -
కట్నం ఇడే కాద్ తోద్.. అంటున్న ‘కొలాం’
● సమాజ మార్పునకు ఆదివాసీల శ్రీకారం ● ఉమ్మడి జిల్లాలో గోండు, కొలాం, పర్ధాన్ పెద్దల తీర్మానం ● ఇప్పటికే పలు గ్రామాల్లో అమలులోకివరకట్నం.. వివాహ సమయంలో వధువు కుటుంబం నుంచి వరుడి కుటుంబా నికి నగదు, బంగారం, ఆస్తుల రూపేణ బదిలీ చేసే ఒక సామాజిక దురాచారం. ఆడపడుచు కుటుంబా నికి ఇబ్బందిగా మారిన దీనిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు చట్టాలెన్ని చేసినా క్షేత్రస్థాయిలో అమలుకు మాత్రం నోచుకోని దుస్థితి. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా గుర్తించిన ఆదివాసీ తెగలు వరకట్నం నిషేధం వైపు మొగ్గు చూపుతున్నాయి. కట్నం ఇవ్వొ ద్దు.. తీసుకోవద్దు అని గ్రామాల్లో తీర్మానాలతో పాటు అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ‘హైరి కీవల్ సిల్లే’ ‘కట్నం ఇదే కాద్ తోద్’ వంటి తీర్మానాలతో ముందడుగు వేస్తున్న ఆయా తెగలపై ఈ వారం సండే స్పెషల్. సిరికొండ: ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లంటే ఆ కుటుంబంపై ఆర్థిక భా రం చెప్పనవసరం లేదు. కట్నా లు, కానుకలు, ఆర్భాటాలు వంటివి చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే అవుతోంది. అలాంటిది తమ గూడెంలో అమ్మాయి పెళ్లిని ఆర్భాటం లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఊరి పెద్దలు భావించారు. ఈనెల 9న సమావేశమయ్యారు.‘హైరి కీవల్ సిల్లే’ వరకట్నం నిషేధించడంతో పాటు పెళ్లి కూతురు కుటుంబానికి తలా కొంత ఆర్థికంగా చేదోడుగా నిలవాలని నిర్ణయించారు. వెంటనే అమలులోకి తెచ్చారు సిరికొండ మండలంలోని కోసుపటేల్ గూడవాసులు. సాత్నాల: వరకట్న సమస్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని కొలాం తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెళ్లి అనేది పవిత్ర బంధమని.. దానిని డబ్బు, ఆస్తులతో కొలవకూడదని భావించింది. ఇకపై వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాత్నాల మండలంలోని టెంబ్రీగూడలో పటేళ్లు, కులస్తులు ఇటీవల సమావేశమయ్యారు. సాత్నాల, బేల, జైనథ్, ఇంద్రవెల్లి మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 150 పాల్గొన్నారు. వరకట్నం అనేది తమ సంస్కతిలో భాగం కాదని నిషేధించాలని తీర్మానం చేశారు. ఆడంబరాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. పెళ్లిళ్లు సాంప్రదాయబద్ధంగా ఉండాలని, రూ.లక్షలు ఖర్చయ్యే రెడీమేడ్ మండపాలకు దూరంగా ఉండడంతో పాటు మద్యపానం నిషేధించాలన్నారు. డీజేలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పిప్రి వాయిద్యాలతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పెళ్లిలో చదివింపుల్లో భాగంగా వస్తువులు కాకుండా నగదు రూపంలో అందిస్తే కుటుంబాలనికి ఆసరాగా ఉంటుందని తీర్మానించారు.ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా సాయం -
ట్రిపుల్ఐటీలో రెండో రోజు అంతఃప్రజ్ఞ
బాసర: బాసర ఆర్జీయూకేటీలో శనివారం రెండోరోజు అంతఃప్రజ్ఞ 2కే–26 నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ తన జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, విజయానికి దారితీసిన పట్టుదల గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా కార్లు, బైక్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్చాన్స్లర్ గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఈ.మురళీదర్శన్, ఫ్యాకల్టీ కన్వీనర్ స్వప్నిల్ జంగలే విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులను పరిశీలించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో నినా ఏఐ ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్, పిల్లల కోసం రూపొందించిన ఏఐ ఆధారిత లెర్నింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో స్మార్ట్ వాటర్ ఫ్లో అండ్ పైప్లైన్ లీకేజ్ డిటెక్షన్ సిస్టమ్, స్మార్ట్ డ్రగ్ డిస్పెన్సర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో హెలియో ఆక్వా రిఫైనర్ , ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వంటి ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయి. పోస్టర్ ప్రజెంటేషన్ విభాగంలో క్వాంటం కమ్యూనికేషన్ ప్రాజెక్ట్ విజేతగా నిలిచింది. బహుమతులు అందజేతఅంత ప్రజ్ఞలో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బహుమతులు అందజేశారు. -
పోస్టల్ శాఖ ద్వారా రాములోరి తలంబ్రాలు
భైంసా: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలు, ప్రసాదాలు భక్తులకు సులభంగా అందించేలా పోస్టల్ శాఖ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భద్రాచలం దేవస్థానం నుంచి పంపించే తలంబ్రాలు, ప్రసాదాలను పోస్టల్ శాఖ భక్తుల ఇళ్లకు చేరవేసే ఏర్పాట్లు చేశారు. ఇందులోభాగంగా భైంసాలో శనివారం ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి పోస్టల్ అధికారులు ప్రసాదాలు బుక్ చేశారు. ఈ సందర్భంగా పోస్టల్ సబ్ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ మాట్లాడుతూ భక్తులు పోస్టాఫీసుల ద్వారా తలంబ్రాలు, ప్రసాదాలను బుక్ చేసుకుని ఇంటి వద్దే పొందవచ్చని తెలిపారు. భక్తులు భద్రాచలం వెళ్లలేని పరిస్థితుల్లో ఈ సేవల ద్వారా సులభంగా తలంబ్రాలు అందుకుంటారని చెప్పారు. ఇప్పటి వరకు భైంసా సబ్ డివిజన్ పరిధిలో 540కిపైగా ప్రసాదాలు బుక్ అయ్యాయని పేర్కొన్నారు. ఈనెల 20 వరకు అన్ని పోస్టాఫీసుల్లో ఈ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భైంసా సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ బుకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భక్తులు ముందుగా బుక్ చేసుకుంటే తలంబ్రాలు ప్రసాదాలు పోస్టల్ శాఖ భద్రంగా వారి చిరునామాలకు చేరవేస్తుంది చెప్పారు. కార్యక్రమంలో పోస్టల్ అసిస్టెంట్ సీహెచ్.వినోద్కుమార్, పోస్టల్ ఎంవో డి.నరేష్కుమార్, బీపీఎంలు, ఏబీపీఎంలు పాల్గొన్నారు. -
పశుగ్రాసం సాగు ఎంతో మేలు
చెన్నూర్రూరల్: వరి కోసేందుకు రైతులు ఎక్కువగా యంత్రాలను వినియోగిస్తున్నారు. దీంతో వరిగడ్డి ముక్కలు, ముక్కలుగా కావడంతో ఎక్కువగా పశువుల మేతకు పనికిరాకుండా పోతోంది. దీంతో వేసవిలో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు రైతులు గడ్డిజొన్నను సాగుచేస్తే పశుగ్రాసానికి కొరత ఏర్పడకుండా ఉంటుంది. జిల్లా కేంద్రంలోని వెటర్నటీ ఆసుపత్రి స్టోర్లో గడ్డిజొన్న ఎస్హెచ్జీ రకం విత్తనాలు 8.9 టన్నులు అందుబాటులో ఉన్నాయని, రైతులకు 75 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి యాకూబ్రెడ్డి తెలిపారు. జిల్లాలో 12,09,436 మూగజీవాలుజిల్లాలో 1,38,536 ఆవులు, 1,04,080 గేదెలు, 2,42,616 ఎద్దులు, 5,36,913 గొర్రెలు, 1,87,291 మేకలు ఉన్నాయి. మండలాల వారీగా పశువుల సంఖ్యను బట్టి గడ్డిజొన్న విత్తనాలు పంపిణీ చేయనున్నారు. రైతులు సూపర్ నేవియర్ అనే గడ్డిజాతి రకాన్ని పెంచుకుంటే ఏళ్ల తరబడి పశువులకు గ్రాసం లభిస్తుంది. డెయిరీ ఫాంలు ఉన్న రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గడ్డి రకం కట్ చేసిన కొద్దీ పెరుగుతుంది. చిన్నచిన్నగా కట్ చేసిన ముక్కలను రెండున్నర ఫీట్లకు ఒకటి చొప్పున భూమిలో నాటుకుంటే ఇవి మొలకెత్తుతాయి. అలాగే హెడ్జ్ లూసర్న్ రకం మొక్కలలో మాంసకృత్తులు అధికంగా ఉండి ఆవులు, గేదెలు పాలను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. విత్తనాలు విత్తిన 45 రోజులకు ఈ గడ్డిజొన్న కోతకు వస్తుంది. కోత కోసి పశువులకు మేతగా వేసిన తర్వాత మళ్లీ పిలకలు వచ్చి మొక్కలు ఎదుగుతాయి. ఏళ్లతరబడి పశుగ్రాసం లభిస్తుంది. బహు వార్షికాలను కూడా పెంచవచ్చు. ఇవి విత్తనాలు కాకుండా మొక్కలను లేదా కాండపు పిలకలను నాటగానే కలుపు పెరగకుండా ఉండేందుకు 30 నుంచి 60 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి నీటితడులు ఇవ్వాలి. యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పశుగ్రాసం సాగు చేసుకుంటే వేసవిలో కూడా పశువులకు గ్రాసం కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఎస్హెచ్జీ ఏక వార్షిక గడ్డిజొన్న సాగు చేస్తే ఏడాది పాటు పశువులకు గ్రాసం లభిస్తుంది.రైతులు దృష్టి సారించాలి వేసవిలో పశువులకు మేత సరిగా దొరకదు. కాబట్టి రైతులు పశుగ్రాసం సాగుపై దృష్టి సారించాలి. ఎస్హెచ్జీ రకం గడ్డి జొన్న విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డెయిరీఫాంలు నడిపించే రైతులు పశుగ్రాసాలను తప్పకుండా సాగు చేయాలి. అలాగే వేసవిలో పశువులు, జీవాల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి. – యాకూబ్రెడ్డి, జిల్లా పశువైద్యాధికారి, మంచిర్యాల -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేల మండలానికి చెందిన పలు గ్రా మాల సర్పంచ్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బీజేపీలో చేరగా వారికి ఆయన కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే గ్రామాల రూపురేఖలను మారుస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో అభివృద్ధికి ఆకర్షితులై అనేకమంది పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో చంపెల్లి సర్పంచ్ సోనే రావు, సదల్పూ ర్ సర్పంచ్ మంగేష్, కొబ్బాయి సర్పంచ్ సత్యపాల్, పిట్ గావ్ సర్పంచ్ భీమ్ రావు ఉన్నారు. -
ప్లాంటు పనులు వేగవంతం చేయాలి
చెన్నూర్: సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన 800 మెగావాట్ల ప్లాంట్ పనులు వేగవంతం చేయాలని సింగరేణి జీఎం (సివిల్) వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జీఎం నరసింహారావుతో కలిసి శుక్రవారం జైపూర్లోని ఎస్టీపీపీని సందర్శించారు. ప్లాంట్లో భాగంగా నిర్మించబోయే కూలింగ్ టవర్స్ పనులను పర్యవేక్షించారు. ప నుల వివరాలను బీహెచ్ఈఎల్ డైరెక్టర్ మధుకిరణ్, పీఎంపీఎల్, కేపీసీ అధికారులు వివరించారు. ప్లాంటు ప్రస్తుత స్థితిగతులను ఎస్ఈ సివిల్ బానోతు రాము డయాగ్రామ్ ద్వారా ఆయనకు తెలియజేశారు. ప్లాంట్ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కిరణ్బాబు, రాము ఉన్నారు. యువకుడి అదృశ్యం మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన చిట్టిమల్ల అనిల్(26) అదృశ్యమయ్యారు. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. రాపల్లికి చెందిన అనిల్ వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 10వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. అతని ఆచూకీపై బంధువులు, స్నేహితులతో ఆరా తీసిన దొరకలేదు. అనిల్ సోదరుడు దిలీప్ ఫిర్యాదు మేరకు శుక్రవారం మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒకరి బైండోవర్ దహెగాం: మండలంలోని కర్జి గ్రామానికి చెందిన కాటెల కమలాకర్ను శుక్రవారం తహసీల్దార్ మునవార్ షరీఫ్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. గ్రామంలో మద్యం తాగి గొడవలకు పాల్పడుతున్నందున సత్ప్రవర్తన కోసం బైండోవర్ చేశామని పేర్కొన్నారు. మరోసారి గొడవలకు పాల్పడితే రూ.లక్ష జరిమానాతోపాటు జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. -
నిధులన్నీ ట్రాక్టర్ కిస్తీలకే..
నేను ఇటీవలే సర్పంచ్గా ఎన్నికయ్యా. నిధులు వస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నిధులను బ్యాంకు అధికారులు ట్రాక్టర్ కిస్తీల కింద జమ కట్టుకున్నారు. ఏం మిగలకపోవడంతో ప్రస్తుతం జీపీలో అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే మరిన్ని నిధులు విడుదల చేయాలి. – రూప్చంద్, సర్పంచ్, బాబెరతండా, బోథ్ మండలం త్వరలోనే మరిన్ని నిధులు..ఇటీవల పంచాయతీ లకు కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. రెండేళ్లుగా ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఆ నిధుల నుంచి చెల్లించాల్సి వచ్చింది. చిన్న పంచాయతీలకు కొంత ఇబ్బంది ఉన్న పరిస్థితి వాస్తవమే. జీపీలకు త్వరలోనే మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. – రమేశ్, డీపీవో -
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు
నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలభైంసా: బాసర ట్రిపుల్ఐటీలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను శుక్రవారం వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పూర్తిచేసిన అర్హులైన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్ని కల్పించేందుకు ఈ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని తెలిపారు. పదిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రతీ సబ్జెక్ట్ మార్కులకు అదనంగా డిప్రైవేషన్ స్కోర్ను జోడించి పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను టీజీ ఆన్లైన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు లేదా https:// www. rgukt. ac.in/ÌZలో ఆన్లైన్లో సమర్పించవచ్చని అధికా రులు తెలిపారు. ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శ న్, అడ్మిషన్ కన్వీనర్ శీలం శేఖర్, కోకన్వీనర్ బండి హరికృష్ణ, అసోసియేట్ డీన్స్ డా. మహేశ్, డా. విఠ ల్, డా. దేవరాజ్, సునీత తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దుచేయాలి
రెబ్బెన: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టీయూ ఏరియా అధ్యక్షుడు గోలేటి శ్రీనివాస్, కార్యదర్శి అరికెళ్ల పోచం అన్నారు. ఐఎప్టీయూ ఆధ్వర్యంలో ఈనెల 16న కలెక్టరేట్ల ముట్టడి, 23న హైదరాబాద్ రీజినల్ లేబర్ కమిషనర్ కార్యాల యం ఎదుట నిర్వహించే ధర్నా పోస్టర్లను శుక్రవా రం గోలేటిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను సింగరేణిలో అమలు చేయొద్దన్నా రు. లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని గెజిట్ విడుదల చేసిందన్నారు. వీటిని రద్దు చేసేవరకు దేశవ్యాప్తంగా కార్మికవర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు భీమేశ్, చందు, వెంకటేశ్, చంద్రయ్య, కుమార్, పోసుబాయి, తార, నాగలక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు. -
వంటగ్యాస్ పక్కదారి పట్టిస్తే చర్యలు
కై లాస్నగర్: జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని, ఎక్కడైనా పక్కదారి పట్టిస్తే కఠిన చ ర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ఎల్పీజీ సరఫరా నిలిచిన వైనాన్ని వివరిస్తూ ‘నో స్టాక్’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీనీ శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశా రు. స్టాక్, ఆన్లైన్ బుకింగ్ వివరాలను స్వయంగా పరిశీలించారు. సిలిండర్ల సరఫరా, డెలివరీ వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విని యోగదారులతో మాట్లాడి బుకింగ్, సరఫరా వంటి అంశాలపై ఆరా తీఽశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సిలిండర్ల కొరతపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు. జిల్లాలో వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వెంటనే వినియోగదారులకు సిలిండర్లు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి సిలిండర్లను డోర్ డెలివరీ చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. పౌరసరఫరా, రెవెన్యూ పోలీస్ శాఖలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా 1800–425–1939 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఆ యన వెంట అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఎస్వో నందిని, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు. -
‘డ్రగ్స్ మహమ్మారిని అరికడుదాం’
మంచిర్యాలఅర్బన్: సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల డీఈవో యాదయ్య అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా సైన్స్ కేంద్రంలో 18 మండలాల నుంచి ఎంపిక చేసిన 20 పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులకు డ్రగ్స్ అరికట్టడం, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ప్రహరీ క్లబ్లకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైకియాట్రిస్ట్ వైద్యుడు రామ్నాయక్, పోలీస్ విభాగం నుంచి ఇన్స్పెక్టర్ మధుసూదన్, రిసోర్స్పర్సన్లు కృష్ణారెడ్డి, ముజీర్, సత్యనారాయణమూర్తి, సెక్టోరల్ అధికారి చౌదరి, సైన్స్ అధికారి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సులభ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నస్పూర్: సింగరేణిలో పనిచేస్తున్న సులభ్ కార్మికు ల సమస్యలు వెంటనే పరష్కరించాలని సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మానందం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన సులభ్ కార్మికులతో కలిసి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రతీనెల 10 లోపు వేతనాలు చెల్లించ డం లేదన్నారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్, గత సంవత్సర కాలంగా పెండింగ్ ఉన్న డీఏ విడుదల చేయాలన్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని కోరారు. సులభ్ కాంప్లెక్స్లు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటికి మరమ్మతులు చేపట్టాలన్నారు.జిల్లా నాయకులు శంకరి, మంతెన లక్ష్మయ్య, నేదురి, నర్సయ్య, లక్ష్మయ్య, రాజేందర్, పరుశరాములు, విజయ, రౌతు లక్ష్మి, జ్యోతి, సుగుణ, తదితరులు పాల్గొన్నారు. -
బాసరలో అంతఃప్రజ్ఞ 2కే–26
బాసర: దేశంలోనే అతిపెద్ద గ్రామీణ సాంకేతిక ఉత్సవంగా గుర్తింపు పొందిన అంతఃప్రజ్ఞ 2కే–26 బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టె క్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ను గేమింగ్ అరేనాగా మార్చి, ఏఆర్/వీఆర్ సిమ్యులేషన్లు, డ్రోన్ ఆధారిత గేమ్లు, వీడియో గేమింగ్ సెటప్లు ఏర్పాటు చేశారు. ఇవి అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సృజనాత్మక స్టాళ్లు క్యాంపస్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినూత్న ఆవిష్కరణలు, టెక్నాలజీ ప్రదర్శనలు, వినోదాత్మక కార్యక్రమాలతో ప్రాంగణం సందడిగా మారింది. వీసీ, ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ మురళీదర్శన్, ఫ్యాకల్టీ కన్వీనర్ జె.స్వప్నిల్, కాకతీయ శాండ్ బాక్స్ ప్రతినిధి సత్యం కె.చౌబే, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
చెన్నూర్: రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన ధారావత్ ధనుష్ ప్రతిభ కనబర్చాడు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఎన్9 బ్యాడ్మింటన్ అకాడమీలో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్–2025 బ్యాడ్మింటన్ పోటీల్లో రెండు పతకాలు సాధించాడు. ధనుష్..సింగరేణి ఎస్టీపీపీలో డీజీఎం (ఈఅండ్ఎం) ధారావత్ దంపతుల కుమారు డు. ఏప్రిల్ 16 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నాడు. అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా డిప్యూటీ స్పోర్ట్స్ ఆఫీసర్ యాకుబ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సుధాకర్లు అతన్ని అభినందించారు. -
ఆదివాసీలు ఐక్యత చాటాలి
ఆదిలాబాద్రూరల్: ఈనెల 15న జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న హీరా సుకా జయంతి వేడుకలకు ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు భారీగా తరలి రావాలని మాజీ ఎంపీ, రాజ్గోండ్ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావ్ కోరారు. ఆదివాసీ పర్ధాన్ కులస్తులు శుక్రవారం ఆయనకు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీలంతా ఐక్యంగా ఉంటూ సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మెస్రం శంకర్, గేడం మాధవ్, కుర్సేంగే తానా జీ, సిడాం రాంకిషన్, యాదవ్రావ్, మనోహర్, శివ, శేషారావ్, పురుషోత్తం, దత్తు, భాస్కర్, నిరంజన్, దిలీప్, ఉత్తం, తదితరులున్నారు. -
ఆల్ ది బెస్ట్
ఆదిలాబాద్టౌన్: నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు షురూ కానున్నాయి. ఏప్రిల్ 13 వరకు కొ నసాగనున్నాయి. విద్యా శాఖాధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నా రు. ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ మాత్రం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఉంటాయి. అయితే ఈసారి పరీక్షలు దాదాపు నెల పాటు కొనసాగనున్నాయి. ఒక్కో పరీక్షకు మూడు నుంచి నాలుగు రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ సమయంలో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే అవకాశం ఉంది. మరో వైపు మాస్ కాపీయింగ్ జరగకుండా నిఘా కట్టుదిట్టం చేశారు. ఆయా కేంద్రాల్లోని చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి సమక్షంలో పేపర్ తెరడం, సీల్ వేయ డం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలు.. పరీక్షలకు మొత్తం 10,888 మంది విద్యార్థులు హా జరుకానున్నారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డి పార్ట్మెంటల్ అధికారులు, 13 కస్టోడియన్లు, ము గ్గురు అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు, 545 మంది ఇన్విజిలెటర్లను నియమించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఎంఈవో, సీనియర్ హెచ్ఎం, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. కేంద్రాల్లో సౌకర్యాలు.. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, తాగునీరు, వైద్య సేవలతో పాటు పూర్తిస్థాయిలో బెంచీలను ఏర్పా టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంటున్నారు. ఆయా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు. విద్యార్థులకు ఏ వైనా ఇబ్బందులు తలెత్తితే జిల్లా కేంద్రంలోని డీఈ వో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 90329 74127 నంబర్పై కూడా సంప్రదించవచ్చు. -
విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టాలి
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్నారపు రాజేశ్వర్ డి మాండ్ చేశారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఏటా పదుల సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారని, దీనికి కారణగాలను యూనివర్సిటీ అధికారులు వెల్లడించాలన్నారు. యూనివర్సిటీలో అడ్మిషన్స్ జరిగిన విధానంపై రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి విడుదలైన నిధుల ఖర్చులు, అన్ని టెండర్ ప్రక్రియ చెల్లించిన బిల్లులపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు. నాయకులు మనోజ్,అక్షయ్, రాకేశ్, గౌతం, ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
గాడితప్పిన సమయ ‘పాలన’
కై లాస్నగర్(బేల): బేల మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన పూర్తిగా గాడితప్పింది. సంబంఽధిత అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తమ ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఎంపీడీవో, తహసీల్దార్, వ్యవసాయాధికారి కార్యాలయాలను సంప్రదించగా ఉద్యోగులెవరూ లేక ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రతినిత్యం ఇదే పరిస్థితి. వివిధ పనుల నిమిత్తం ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుండటం ఉద్యోగులు, సిబ్బంది నిర్వాకానికి నిదర్శనంగా నిలుస్తోంది. మధ్యాహ్నం 12.30 తర్వాత తీరిగ్గా హాజరయ్యే ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకల్లా తిరిగి ఇంటిముఖం పడుతారని అక్కడి సిబ్బంది చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. ఎంపీడీవో కార్యాలయంలో ఖాళీగా పర్యవేక్షకుడి కుర్చీ ఖాళీగా ఉన్న నాయబ్ తహసీల్దార్ సీటు -
చెక్బౌన్స్ కేసులో ఇద్దరికి జైలు
మంచిర్యాలక్రైం: చెక్బౌన్స్ కేసులో ఇద్దరికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ మంచిర్యాల జిల్లా జ్యూడిషీయల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్, జూనియర్ సివిల్ జడ్జి కె.నిరోషా శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మందమర్రి మండలం క్యాతన్పల్లికి చెందిన అశోక్కుమార్ లడ్డా వద్ద ఆర్థిక అవసరాల నిమిత్తం మంచిర్యాల సీసీసీ కార్నర్కు చెందిన నేరెళ్ల రమేశ్ 2018లో రూ.5.77 లక్షలు, సీసీసీకి చెందిన నేరెళ్ల సాయికృష్ణ రూ.4.83 లక్షలను అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు వేర్వేరుగా 2018లో కోర్టును ఆశ్రయించాడు. జడ్జి.. ఈ కేసును విచారిస్తున్న సమయంలో అప్పు తిరిగి చెల్లించడంతోపాటు నేరెళ్ల రమేశ్కు సంవత్సర కాలం పాటు జైలుశిక్ష, నేరెళ్ల సాయికృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. క్యాతనపల్లి అల్లర్ల కేసులో ఐదుగురికి బెయిల్ రామకష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఐదుగురికి శుక్రవారం మంచిర్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామిడికుమార్, మేడిపెల్లి సంపత్, బండారి సూరిబాబు, కుర్మ దినేష్, ముస్తఫాలను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా జైలుకు రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంతో రాత్రి విడుదలయ్యారు. ‘అక్రమ కేసులతో వేధిస్తున్నారు’ మంచిర్యాలటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనపై అక్రమ కేసులను పెట్టి వేధిస్తున్నారని మంచిర్యాలకు చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోగుల రవీందర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గజ్వేల్లోని ఎర్రవల్లి ఫాంహౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. మంచిర్యాలలో తనపై ఇప్పటికే 30కి పైగా పోలీసులు కేసులను నమోదు చేశారని, ఇంకా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బీ ఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భయాందోళన చెందా ల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని కేసీఆర్ పేర్కొన్నారని రవీందర్రెడ్డి తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన నలుగురి అరెస్ట్ ఆదిలాబాద్టౌన్: బెదిరింపులకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పోలీసుస్టేషన్లో శుక్రవారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రాంనగర్కు చెందిన సలాం వరుణ్, దుర్గానగర్కు చెందిన వెట్టి మనోజ్, ఇంద్రవెల్లి మండలానికి చెందిన కుమ్రం ప్రభాత్రావు, బజార్హత్నూర్కు చెందిన దుర్వ సుభాష్ ఆర్కే కోఆపరేటీవ్ సొసైటీ ద్వారా డబ్బులు తీసుకున్నారు. తిరిగి చెల్లించాలని సొసైటీ చైర్మన్ కొండూర్ రాకేందర్ అడిగితే తుడుందెబ్బ పేరుతో బెదిరింపులకు దిగారు. సొసైటీ ద్వారా డబ్బులు తీసుకున్న ప్రభాత్రావు, దుర్వ సుభాష్లు తిరిగి ఇవ్వకుండా వెట్టి మనోజ్, సలాం వరుణ్లు ఆదివాసీ నాయకులమని చెబుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. రాకేందర్ నుంచి రెండు, మూడు విడతల్లో ఒక్కోసారి రూ.20వేల చొప్పున డబ్బులు వసూళ్లు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. సెక్యూరిటీగార్డుపై దాడిచేసిన ఇద్దరిపై కేసు ఆదిలాబాద్టౌన్: వసుంధర షాపింగ్ మాల్ సెక్యూరిటీ గా ర్డుపై దాడిచేసిన ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సు నీల్కుమార్ తెలిపా రు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన నిందితులు షేక్ సమీర్, సాబిల్లు గురువారం పార్కింగ్ విషయంలో గొడవపడి సెక్యూరిటీ గార్డు రాథోడ్ రవిపై దాడికి దిగారు. బాధితుడు ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. వారి బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
● జిల్లాలో మూడు ఎంపిక ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి షురూ ● ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక ● జేఈఈ, నీట్ తదితర పరీక్షలకు ప్రత్యేక శిక్షణ
‘ఎక్స్లెన్స్’ కేజీబీవీలుఆదిలాబాద్టౌన్: కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో ఇక ఎక్స్లెన్స్ చదువు అందనుంది. కార్పొరేట్, ప్రైవేట్కు ధీటుగా నాణ్యమైన బోధన అందించాలని నిర్ణయించింది. యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్కు సంబంధించి విద్యార్థులకు జేఈఈ, నీట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రాత పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది. చాలామంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా దూర ప్రాంతాల్లో శిక్షణకు వెళ్లకుండా ఇంజినీరింగ్, వైద్య, లా కోర్సుల్లో చేరలేకపోతున్నారు. ఇంటి వద్దనే సిద్ధమవుతూ అవగాహన లేక వాటిలో రాణించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం జిల్లాలో మూడు కేజీబీవీలను ఎంపిక చేసింది. ఇందులో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఆయా ప్రవేశ పరీక్షలకు నిపుణులతో శిక్షణ అందించనున్నారు. మూడు కేజీబీవీల్లో.. జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. 6 నుంచి ఇంటర్ వరకు ఇక్కడ విద్యాబోధన ఉంటుంది. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో మొత్తం 4,620 మంది విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరంతా పేద విద్యార్థులే. ప్రభుత్వం ఈ ఏడాది యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్ కింద మూడు సీవోఈలను ఎంపిక చేసింది. ఆదిలాబాద్అర్బన్ కేజీబీవీలో ఐఐటీ, జేఈఈకి సంబంధించి శిక్షణ కల్పించనున్నారు. జైనథ్ కేజీబీవీలో నీట్తో పాటు ఎప్సెట్, అగ్రికల్చర్ తదితర కోర్సులకు సంబంధించి శిక్షణ ఉంటుంది. తలమడుగు కేజీబీవీలో కామన్ లా ఎంట్రెన్స్ టెస్ట్కు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఈ పాఠశాలల్లో గ్రంథాలయంతో పాటు ఎన్సీసీ, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. వీటికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. అవసరమైన విషయ నిపుణులను సైతం నియమించింది. జూన్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందించనున్నారు. ఏప్రిల్ 15 వరకు గడువు.. ఈ మూడు కేజీబీవీల్లో వచ్చే ఏడాది ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఈనెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు గడు వు ఉంది. మే 5న పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సె స్సీ పూర్తి చేసిన వారు అర్హులు. ఎంపికై న విద్యార్థులు జేఈఈ, నీట్, ఎప్సెట్, లాసెట్ తదితర ఎంట్రెన్స్ కోచింగ్లతో పాటు సీఏకు సంబంధించి కూడా శిక్షణ కల్పించనున్నారు. -
టెర్మినల్ బెన్ఫిట్స్ వెంటనే అందించాలి
నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలో పదవీ విరమణ పొందిన ప్రతీ ఉద్యోగికి టెర్మినల్ బెన్ఫిట్స్ వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన జీఎం కార్యాలయంలో శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్కాస్టుల మేనేజర్లు, సంక్షేమ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గనుల వారీగా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు వివరాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రాట్యూటీ, సీఎంపీఎఫ్, పెన్షన్ పెండింగ్ వివరాలు సేకరించారు. ఒక్కో గనిలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఏ ఏ కారణాలతో పెండింగ్లో ఉన్నాయో తెలుసుకుని త్వరగతిన పూర్తిచేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అర్హత లేనివారు, ఉద్యోగం అవసరం లేని వారికి ఎల్ఎస్పీ, ఎంఎంసీ పొందే వెసులుబాటు కల్పించాలన్నారు. అదేవిధంగా ఉద్యోగి అతని కుటుంబ సభ్యుల వివరాలు ఆన్లైన్లో నమోదు ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీజీఎం పర్సనల్ ఎస్.అనిల్కుమార్, డీవైపీఎంలు రాజేశ్, కిరణ్, సీనియర్ పీఓలు సురేందర్, మురళీ, ప్రశాంత్, వివిధ గనుల మేనేజర్లు, గనుల సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రామకృష్ణాపూర్ ఓసీపీ–2 విస్తరణపై సమీక్ష
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ ఓపెన్కాస్ట్ ఫేజ్–2 గని అంశంపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణతో సమీక్షించారు. గద్దెరాగిడిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి అనంతరం ఓసీ ఫేజ్–2పై జీఎంతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓసీ విస్తరణలో భాగంగా ఫేజ్–2 మైన్కు అనుమతులు లభించాయని, అయితే గనికి అవసరమైన భూమికి ఇంకా ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. గనికి కేటాయించాల్సిన భూమి నాన్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నప్పటికీ కొందరు అధికారులు దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా పేర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికే క్లియరెన్స్ కోసం డీఎఫ్ఓ సహా సంబంధిత అధికారులతో మాట్లాడి అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కొత్త గని అందుబాటులోకి వస్తే సుమారు 18 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తి కొనసాగడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గనుల కోసం నిర్వహించిన వేలంలో పాల్గొనకుండా అడ్డుకుందని విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి, పల్లెరాజు, గాండ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
ఆదిలాబాద్టౌన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇవి గత నెల 25న ప్రారంభమైన విషయం తెలిసిందే. శుక్రవారం ద్వితీయ సంవత్సరం పరీక్షతో ముగిశాయి. ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పడ్డ విద్యార్థులు ఆటాపాటలతో గడపనున్నారు. చివరి రోజు స్నేహితుల ఫోన్ నంబర్లు తీసుకుంటూ టచ్లో ఉండాలంటూ పరీక్ష కేంద్రం నుంచి వెనుదిరిగారు. జిల్లా కేంద్రంలో వసతిగృహాలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్లో ఉంటూ చదివిన విద్యార్థులను తీసుకోవడానికి వారి తల్లిదండ్రులు, కుటుంబీకులు చేరుకున్నారు. విద్యార్థులు సొంత గ్రామాలకు చేరుకోవడానికి బస్టాండ్కు తరలివెళ్లడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. ఈనెల 15 నుంచి ఇంటర్మీడియెట్ మూల్యాంకనం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఆర్ఐవో జాదవ్ గణేశ్కుమార్ తెలి పారు. మొదటగా తెలుగు, హిందీ, సివిక్స్, గణితం, ఇంగ్లీష్ జవాబు పత్రాల మూల్యాంకనం ఉంటుందని వివరించారు. జిల్లావ్యాప్తంగా ఈ సారి ఒక్క విద్యార్థి కూడా డిబార్ కా లేదని పేర్కొన్నారు. పరీక్ష చివరి రోజు కావడంతో ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల లెక్చరర్లు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద కరపత్రాలు పంచుతూ ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరాలని, దోస్త్ యాప్లో డిగ్రీ కళా శాలలను ఎంచుకోవాలని సూచించారు. మౌలిక వసతులతోపాటు అనుభవజ్ఞులైన లెక్చరర్లు ఉన్నారని వివరించా రు. ఈ ప్రచార కార్యక్రమంలో లెక్చరర్లు సంతోష్ కుమార్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఏపీ రైతుల మోయలేని రుణభారానికి చంద్రబాబే కారణం’
కాకినాడ: ఏపీలోని రైతులు రుణభారాన్ని మోయలేని స్థితిలోకి రావడానికి చంద్రబాబు సర్కారే కారణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఏపీలో రైతులపై అత్యధిక రుణభారం ఉందనే విషయాన్ని ఇటీవల కేంద్ర మంత్రి పార్లమెంట్ వేదికగా వెల్లడించారని కురసాల ఈ సందర్భంగా గుర్తుచేశారు. మీ నిర్లక్ష్యం కారణంగా... రుణాభారంలో ఏపీ రైతులు రెండవ స్ధానంలో ఉన్నారు. 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సగటున నలుగురు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ... వైఎస్ జగన్ అమలు చేసిన రైతు భరోసకు కాపీ.మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు మంగళం పాడేశారు. రెండవ ఏడాది రూ.10 వేలు ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయంలో 53 లక్షల 58 వేల మందికి ఏటా పెట్టుబడి సాయం అందించారు. మీ హయంలో ఏడు లక్షల మంది రైతులు తగ్గిపోయారు. పథకమే పూర్తిగా అమలు చేయ్యకుండా ఏడు లక్షలమందికి కోత విధించారు. గడిచిన రెండేళ్ళల్లో కౌలు రైతుకు ఒక్క సహయం అందించలేదు. కౌలు రైతుల పట్ల ఎందుకు అంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కూటమి పాలన లో ఇప్పటి వరకు 16 సార్ల ప్రకృతి విపత్తు వచ్చాయి. ఏ రైతుకు సాయం అందించారో చెప్పండి. వందల కోట్లు ప్రీయమం కట్టడానికి డబ్బులు లేకపోతే ...రెండేళ్ళ కాలంలో చేసిన రూ.3 లక్షల కోట్ల అప్పులు ఏమైయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులకు సహయం చేయడ్యానికి బడ్జెట్ లో ఇది పెట్టామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు.*కోవిడ్లో కూడా పంటలకు మార్కెట్ స్ధిరికరణ చేసి..చివరకు మేము బూడిద గుమ్మడి కాయాలు కూడా కొనుగోలు చేశాం. ఏ సీజన్ లో పంట నష్టపోతే ... ఆ సీజన్ లోనే వైఎస్ జగన్ నష్టపరిహారం అందించారు.ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులను కొనే పరిస్ధితిలో ప్రభుత్వం లేదు. అరటిని ఇప్పుడు టన్ను రూ.ఐదు వేలకు అమ్ముకునే దుస్ధితికి రైతు వచ్చాడు. టమాటకు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పాడేసుకుంటున్నాడు. ఇది రైతుల పట్ల మీ నిర్లక్ష్యం కాదా? చంద్రబాబు’ అని ప్రశ్నించారు కురసాల కన్నబాబు. -
నంబర్ ప్లేట్కే లక్షలు ఖర్చు.. ‘0009’ కోసం 10.5 లక్షలు!
సాక్షి, హైదరాబాద్ జిల్లా: ఆర్టీఏ ప్రత్యేక నంబర్లపై వాహనదారులు క్రేజ్ చాటుకున్నారు. గురువా రం ఖైరతాబాద్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్లో ప్రత్యేక నంబర్లపైన రూ.31,14,730 లభించినట్లు జేటీసీ రమేష్ తెలిపారు. ‘టీజీ 09 ఎల్ 0009’ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.10,50,000 చెల్లించింది. ‘టీజీ 09 ఎల్ 0007’కు పెద్దింటి తిరుపతిరావు అనే వ్యక్తి రూ.3,19,999 చెల్లించారు. రూ.2,00,005తో ‘టీజీ 09 ఎల్ 0005’ను అనిరుధ్ ఆగ్రో ఫారమ్స్, రూ.1.5 లక్షలతో ‘టీజీ 09 కె 9999’ను ముప్పా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, రూ.1.24 లక్షలతో ‘టీజీ 09ఎల్ 0024’ను తిక్కవరపు మంజులారెడ్డి, రూ.లక్ష ‘టీజీ 09 ఎల్ 0001ను అర్జున్ పటేల్ అనే వాహనదారు దక్కించుకున్నారు. -
● జీపీలకు విడుదలైన నిధులు ● పాత పనులకు చెల్లింపులపై పలుచోట్ల వివాదాలు ● మొత్తం చెల్లిస్తే పనులు చేయడమెలా? అంటున్న కొత్త సర్పంచులు
బోథ్: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో బిల్లుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 473 గ్రామ పంచాయతీలు ఉండగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.20.31 కోట్ల నిధులు మంజూ రు చేసింది. అయితే గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుంటుందని భావించారు. అయితే ని ధులు విడుదలైన వెంటనే పాత పనులకు సంబంధించిన బిల్లుల అంశం తెరపైకి వచ్చింది. దీంతో అ నేక గ్రామ పంచాయతీల్లో వివాదం నెలకొంటోంది. పాత బిల్లులు చెల్లించాలి పాత సర్పంచుల పదవీకాలం 2024, ఫిబ్రవరి 1న ముగిసింది. అప్పటికే సర్పంచులు గ్రామాల్లో పలు పనులను సొంత ఖర్చులతో పూర్తి చేశారు. సర్పంచుల పదవీకాలం ముగిసిన అనంతరం ప్రభుత్వం ప్రత్యేకాఽధికారులతో ప్రత్యేక పాలన అమలు చేసింది. ఆయా గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు పంచాయతీలను అంతగా పట్టించుకోలేదు. దీంతో జీపీల్లో పనుల బాధ్యత కార్యదర్శులపై పడింది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కార్యదర్శులు తమ సొంత డబ్బులను వెచ్చించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీలు, శానిటేషన్, తాగునీటి వంటి పనులు చేపట్టారు. కేంద్రం నుంచి నిధులు రావడంతో తా ము ఖర్చు చేసిన బిల్లులు ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తం బిల్లులు ఇవ్వలేం.. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే విడుదలైన నిధులను పూర్తిగా పాత బిల్లులకే చెల్లిస్తే గ్రామాల్లో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేపట్టాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం వచ్చిన నిధుల్లో కొంత బిల్లులు చెల్లిస్తామని, రాబోయే నిధుల్లో మరికొంత చెల్లిస్తామని కొత్త సర్పంచులు పేర్కొంటున్నారు. మరికొన్ని పంచాయతీల్లో ముగ్గురి మధ్య సయోధ్య కుదరుతోంది. ఇక్కడ బిల్లుల విషయంలో ఇబ్బందులు తలెత్తడం లేదు. కాగా కొన్ని గ్రామాల్లో ఈ విషయంపై పాత, కొత్త సర్పంచుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. పాత పనుల బిల్లులు చెల్లించాల్సిందేనని ఒక వర్గం పట్టుబడుతుండగా, ముందు ప్రస్తుత అవసరాలపై ఖర్చు చేయాలని మరో వర్గం వాదిస్తోంది. దీంతో గ్రామపంచాయతీల్లో బిల్లుల వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. రికార్డు ఉంటేనే చెల్లింపు.. గ్రామ పంచాయతీల్లో గతంలో పనిచేసినట్లు ఎంబీ రికార్డు ఉంటే బిల్లుల చెల్లింపులు సులభంగా జరుతున్నాయి. పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాల్లోని ఇంజినీర్లు పనిచేసినట్లు ఎంబీలు రికార్డు చేశారు. వీటికి బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే గ్రామాల్లో రికార్డు లేకుండా, వ్యాపారుల వద్ద నుంచి తెచ్చిన బిల్లుల విషయంలో కొత్త సర్పంచులు పేచీ పెడుతున్నారు. జిల్లాలో అనేక చోట్ల ఇలాంటి బిల్లుల పంచాయతీ నడుస్తోంది. -
మౌలిక వసతుల కల్పనపై దృష్టి
సాత్నాల: విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. భోరజ్ మండలం బాలాపూర్లో ఈజీఎస్ నిధులు రూ.8 లక్షలతో నిర్మించనున్న కిచెన్ షెడ్ పనులకు గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైనథ్ మండలం బెల్గాం గ్రామ సమీపంలో దాదాపు రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పాఠశాల ద్వారా సుమారు 3,500 మంది పేద విద్యార్థులకు ఉచితం విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావత్ అచ్యుత్, జక్కుల వేణు, భగవాన్లు, రాజశేఖర్, శంకర్, విట్టల్, రాజు, తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా ఉంటా
నేరడిగొండ: అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని బొరిగామలో ప్రమాదవశాత్తుగా జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ఘటనలో నాలుగు ఇళ్లు, మూడు పశువుల పాకలు కాలిపోవడం బాధాకరమన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. ఇల్లు పూర్తిగా దగ్ధమైన జాదవ్ ప్రేమ్సింగ్కు వ్యక్తిగతంగా రూ.30వేలు తక్షణ సహాయంగా అందజేశారు. బాధితులకు నిత్యావసర సరుకులను అందించారు. -
సర్పంచులు, కౌన్సిలర్ల చేతుల్లోనే జిల్లా అభివృద్ధి
కై లాస్నగర్: గ్రామం, వార్డుల అభివృద్ధితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని, ఆదిశగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపైనే ఉందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం స్థానిక రెవెన్యూ గార్డెన్లో జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌ న్సిలర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 99 రోజుల పాటు అమలు చేయనున్న కార్యక్రమాల కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజంటేష న్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక కార్యాచరణతో గ్రామాలు, వార్డుల రూపురేఖలను మార్చేలా విజయవంతం చేయాలని కోరారు. ఏప్రిల్ 2న అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, ప్రతీ వార్డులో వార్డు సభ నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ పనులపై సమీక్షించాలని సూ చించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అధికారులతో ఘర్షణ వాతావరణానికి వెళ్లకుండా సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం రైతులకు ఉచితంగా అందించేందుకు రూ.500 విలువగల ఐదు రకాల కూ రగాయల విత్తనాల కిట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, జెడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, అదనపు ఎస్పీలు సురేందర్ రావు, మౌనిక, మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, తదితరులు పాల్గొన్నారు. జనగణన పారదర్శకంగా నిర్వహించాలికై లాస్నగర్: హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ ప్రక్రి య పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జనగణన–2027 లో భాగంగా గురువారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, కలెక్టరేట్ పర్యవేక్షకురా లు రాథోడ్ పంచపూల, తదితరులు పాల్గొన్నారు. ‘బడికి సెలవులొచ్చాయి’ ఆవిష్కరణ సాత్నాల: భోరజ్ మండలంలోని మండగడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు జైకర్ రచించి గానం చేసిన ‘బడికి సెలవులొచ్చాయి’ సీడీని కలెక్టర్ రాజర్షి షా గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. విద్యార్థుల కోసం పాటను రచించి, గాత్రం చేసిన జైకార్ను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశికళ, అభవ్ కుమార్, నారాయణ, స్వాతి, అనిత, మాళవిక, అశోక్, నాందేవ్, గణేశ్, చింతామణి, శైలేందర్, తదితరులు పాల్గొన్నారు.యువ ఆవిష్కర్తలకు ప్రోత్సాహంకై లాస్నగర్: జిల్లాలోని యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 14న కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలా బాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన యువ త, విద్యార్థులు, ఆవిష్కర్తలు తమ వినూత్న ఆలోచనలను నిపుణుల ముందుంచి మార్గదర్శకత్వం పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వివరాలకు 91006 78543 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఆదిలాబాద్టౌన్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు గురువా రం బీఆర్డీయూ అనుబంధ తెలంగాణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ పద్మ మాట్లాడుతూ రెండు నెలలుగా వేతనాలు చె ల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎ దుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.18వేల వేతనాలు చెల్లించాలని, లెప్రసీ, టీ బీ కేసులకు సంబంధించిన బకాయిలు కూడా విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల ఆశ వర్కర్లు పద్మ, జ్యోతి, ఈశ్వరి, ఇందిర, ప్ర త్యూష, గోదావరి, రేఖ పాల్గొన్నారు. -
జీవనశైలిలో మార్పుతోనే కిడ్నీలకు రక్షణ
ఆదిలాబాద్టౌన్: ప్రస్తుత తరుణంలో జీవనశైలిలో మార్పుతోనే కిడ్నీలను రక్షించుకోవచ్చని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రిమ్స్ డయాలసిస్ కేంద్రంలో గురువారం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడంలో మూత్రపిండాల పాత్ర ఎంతో కీలకమన్నారు. వ్యర్థాలు నిండిపోయి శరీరంలో ఉంటే అవి ప్రాణాపాయానికి దారి తీస్తాయన్నారు. శరీరంలో గుండె, మెదడు, కాలేయంతో పాటు కిడ్నీ కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రస్తుతం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ముఖ్యంగా మధుమేహం, బీపీతో బాధపడుతున్న వారిలో కిడ్నీలు చెడిపోతున్నాయన్నారు. కలుషిత నీరు తాగడం ద్వారా, పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు తానాజీ జాడే, డాక్టర్ చందు, నెఫ్రాలజిస్ట్ కొండలరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ విఠల్, డయాలసిస్ ఇన్చార్జి ప్రేమ్దాస్, తదితరులు పాల్గొన్నారు. -
టైరు పేలి పెళ్లి వాహనం పల్టీ
నిర్మల్ రూరల్/సిరికొండ: పెళ్లికి వెళుతున్న వాహనం పల్టీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోన్పల్లి గ్రామానికి చెందిన బోయిన్వాడ్ గణపతి చెల్లి కుమారుడి వివాహం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గురువారం జరిగింది. ఈ పెళ్లికి సోన్పల్లి నుంచి ఐచర్ వాహనంలో 24 మంది బయల్దేరారు. వీరివెంట ఫర్నిచర్ కూడా తీసుకెళ్లారు. నిర్మల్ రూరల్ మండలం కొండపూర్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలడంతో అదుపు తప్పి రోడ్డుపైనే పల్టీ కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న వారంత ఎగిరి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. తీవ్రంగా గాయపడిన బోయిన్వాడ తులసీదాస్(38), బోరడే లక్ష్మణ్(60) అక్కడికక్కడే మృతిచెందారు. మరో 22 మంది గాయపడ్డారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదిలాబాద్ రిమ్స్కు తీసుకెళ్లారు. మిగతా వారు నిర్మల్లోనే చికిత్స పొందుతున్నారు. వాహనంలో ఉన్న ఫర్నిచర్ ప్రయాణికులపై పడడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు తెలిపారు. » మృతుడు బోయిన్వాడ్ తులసీదాస్కు భార్య, డిగ్రీ చదువుతున్న కూతురు, ఏడో తరగతి చదువుతున్న కొడుకు ఉన్నారు. తులసీదాస్ మరణంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది » మృతుడు బోరడే లక్ష్మణ్ బోయిన్వాడ్ గణపతి ఇంటి పక్కన ఉంటాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, వారి పెళ్లిళ్లు అయ్యాయి. -
దేశాభివృద్ధికి జనగణన దిక్సూచి
కై లాస్నగర్: దేశాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు జనగణనే దిక్సూచిగా నిలుస్తుందని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. భారత జనగణన–2027 నిర్వహణపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జనగణన నుంచి జనకల్యాణం’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించే సమాచారం భవిష్యత్లో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆధారమవుతుందన్నారు. ఎక్కడా పొరపాట్లు లేకుండా గణన చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ, ఈ ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని, మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మే 11, 2026 నుంచి జూన్ 9, 2026 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో ఇంటి నిర్మాణం, వసతులు, కుటుంబ యజమాని వివరాలు తదితర 33 అంశాలపై సమాచార సేకరణ ఉంటుందని పేర్కొన్నారు. రెండో దశ ఫిబ్రవరి 2027లో నిర్వహించి మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణించనున్నట్లు వివరించారు. మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్ ద్వారా గణన చేపట్టడంతో పాటు, ప్రజలు తమ వివరాలు స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గణన ప్రారంభానికి 15 రోజుల ముందే ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి రానుందన్నారు. హైదరాబాద్ జనాభా గణన విభాగం గణాంక అధికారులు ఆదెపు వినయ్, వై. జంగయ్య హాజరై అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో రవీందర్ రాథోడ్, డీపీవో రమేశ్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బోగస్ కార్డులకు చెక్
కై లాస్నగర్: ఓ వైపు అర్హులైన నిరుపేదలకు కొత్తగా రేషన్కార్డులు జారీ చేస్తున్న ప్రభుత్వం మరోవైపు అనర్హులను ఏరివేసే దిశగానూ చర్యలు చేపడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఈ ప్రక్రియ నిర్వహిస్తోంది. అనుమానితంగా గుర్తించిన 4,182 కార్డులతో కూడిన జాబితాను జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి పంపించింది. వాటిపై క్షేత్రస్థాయిలో విచారించి అనర్హులని నిర్ధారణ అయితే ఆ కార్డులు రద్దు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మండలాల వారీగా రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నారు. ఈ నిర్ణయంతో అక్రమకార్డుదారుల్లో వణుకు మొదలైంది. 360 డిగ్రీస్ సాఫ్ట్వేర్ ఆధారంగా .. రేషన్కార్డు కలిగిన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటికీ రేషన్కార్డునే ప్రమాణికంగా తీసుకుంటుంది. దీంతో ఈ కార్డుకు డిమాండ్ ఏర్పడింది. అయితే అర్హతలేని వారు అక్రమంగా కార్డులు పొందినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రవాణా, ఆదాయ పన్ను శాఖల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా 360 డిగ్రీస్ సాఫ్ట్వేర్ సాయంతో అనర్హులను గుర్తించింది. వీరితో పాటు గడిచిన మూడు నెలలుగా బియ్యం పొందనటువంటి కార్డుదారుల వివరాలను సేకరిస్తోంది. ఇందులో ప్రభుత్వ కొలువులు సాధించిన వారు, చనిపోయిన వారు, రాష్ట్రంతో పాటు పొరుగురాష్ట్రంలోనూ కొందరికి కార్డులున్నట్లుగా గుర్తించింది. ఆయా కార్డుల్లోని సభ్యులను అనుమానితులుగా భావించి విచారణకు ఆదేశించింది. జిల్లాకు అందిన కార్డుదారుల జాబితా ఆధారంగా రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. దీంతో సిబ్బందికి అక్రమంగా డబ్బులిచ్చి కార్డులు పొందిన వారిలో ఆందోళన మొదలైంది. కార్డు పోకుండా ఉండేందుకు మళ్లీ ముడుపులు ముట్టజెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నుంచి అందిన అనుమానిత అనర్హుల కార్డుల వివరాలు (మండలాల వారీగా) మండలం అనుమానిత కార్డులు ఆదిలాబాద్ అర్బన్ 1,351 ఆదిలాబాద్ రూరల్ 268 మావల 186 బజార్హత్నూర్ 79 బోథ్ 125 ఇచ్చోడ 210 నేరడిగొండ 106 సొనాల 55 బేల 77 భోరజ్ 94 జైనథ్ 140 సాత్నాల 58 గుడిహత్నూర్ 111 ఇంద్రవెల్లి 266 సిరికొండ 199 ఉట్నూర్ 440 భీంపూర్ 47 తలమడుగు 116 తాంసి 80 గాదిగూడ 52 నార్నూర్ 122విచారణ కొనసాగుతుంది.. ప్రభుత్వం నుంచి అందిన అనుమానిత కార్డుదారుల వివరాలను మండలాల వారీగా సంబంధిత తహసీల్దార్లకు పంపించాం. క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ జరుగుతుంది. అనర్హులని తేలిన వారి పేర్లను కార్డుల్లో నుంచి తొలగిస్తాం. రేషన్ పంపిణీని నిలిపివేస్తాం. – నందిని, ఇన్చార్జి డీఎస్వో -
సమాజంలో మహిళల పాత్ర కీలకం
ఆదిలాబాద్టౌన్: సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. రిమ్స్ నర్సింగ్ కళాశాలలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గెజిటెడ్ అధి కారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుకోవాలన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న పలువురు మహిళా ఉద్యోగులను సత్కరించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా క్షయ నివారణ అధికారి సుమలత, సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, కార్యదర్శి రమణాచారి, టీజీవో ఉపాధ్యక్షుడు వామన్రావు, కృష్ణ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సంఘం నాయకులు శ్రీదేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలేవి?
సాక్షి,ఆదిలాబాద్: యాసంగిలో సాగు చేసిన శనగ పంట దిగుబడి చేతికందుతుంది. రైతులు పంటను కోసి ఆరబెట్టడంతో పాటు ఇళ్లలో నిల్వ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైతే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు సెంటర్ల ప్రారంభానికి సంబంధించి ఊసే లేదు. మరోపక్క ఈనెల 15 నుంచి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందనే సూచనతో వారిలో గుబులు మొదలైంది. అంతకుముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. ఆరబెట్టకుండా ఇంట్లో నిల్వ ఉంచడమే ఉత్తమమని రైతులు భావిస్తున్నారు. ఇదీ పరిస్థితి.. ప్రభుత్వరంగ సంస్థ మార్క్ఫెడ్ ద్వారా శనగలు కొనుగోలు చేస్తారు. గతేడాది శనగకు మద్దతు ధర రూ.5,650 ఉండగా, ప్రైవేట్లో అధిక ధర లభించడం ద్వారా రైతులు ఎక్కువగా అటే మొగ్గుచూపారు. గతేడాది జిల్లాలో తొమ్మిది కేంద్రాలు ఆదిలాబాద్, జైనథ్, తాంసి, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్లో ఏర్పాటు చేశారు. ఈసారి కూడా అవే కొనుగోలు కేంద్రాలు ఉండనున్నాయి. మార్క్ఫెడ్లో కేవలం 60వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ సారి కూడా జిల్లాలో పెద్ద ఎత్తున శనగ సాగైంది. ప్రస్తుతం దిగుబడులు చేతికందుతున్నాయి. ఇప్పటికే రైతులు సగం పంటను కోసి ఆరబెట్టారు. ఇంట్లో దిగుబడులను పెద్ద ఎత్తున నిల్వ చేశారు. కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం.. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. అక్కడి నుంచి అంగీకారం రాగానే ప్రారంభించడం జరుగుతుంది. – ప్రవీణ్రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం, ఆదిలాబాద్ ఇక్కడ కనిపిస్తు న్న రైతు గడ్డం సురేందర్రెడ్డి. తాంసి మండలకేంద్రం. నాలుగెకరాల్లో శనగ సా గు చేశాడు. ఇటీవల రెండున్నర ఎకరాల్లో కోత చేపట్టాడు. 28 క్వింటాళ్ల వరకు చేతి కొచ్చిన దిగుబడిని ఇంటి సమీపంలో ఆరబెట్టి నిల్వ చేశాడు. అయితే మార్కెట్లో ఇప్పటివరకు కొనుగో లు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఆందో ళన చెందుతున్నాడు. ఇతనొక్కడే కాదు.. జిల్లాలో అనేక మంది శనగ రైతులది ఇదే పరిస్థితి. సాగు, దిగుబడి వివరాలు.. సాగు విస్తీర్ణం: 42వేల ఎకరాలు దిగుబడి అంచనా: 3లక్షల 28వేల క్వింటాళ్లు మద్దతు ధర: రూ.5,875 -
‘పైసా వసూల్’పై విచారణ
ఆదిలాబాద్టౌన్: ఇచ్చోడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు పదో తరగతి పరీక్షల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారనే కథనంపై జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజేశ్వర్ స్పందించారు. ‘పైసా వసూల్..’ శీర్షికన సాక్షిలో బుధవారం కథనం ప్రచురితమైంది. అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో స్పందించి ఎంఈవోను విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఇచ్చోడ ఎంఈవో బిక్కు నాయక్ పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థులు ఎవరైనా డబ్బులు ఇచ్చారనే దానిపై ఆరా తీశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు కాపీయింగ్పై ఆధారపడవద్దని సూచించారు. ఉపాధ్యాయులేవరైనా కాపీయింగ్కు ప్రోత్సహిస్తే శాఖాపరంగా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. -
● అక్రమదందాపై పోలీసుల నజర్ ● జిల్లాలో అంతరపంటగా సాగు ● విక్రయ, వినియోగదారులపై కేసులు
ఆదిలాబాద్టౌన్: గంజాయిపై జిల్లా పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇది సాగు చేయవద్దని రైతులకు అవగాహన కల్పించినా కొంత మందిలో మార్పు రావడం లేదు. స్వల్ప వ్యవధిలో ఎక్కువ డబ్బులు సంపాదించా లనే ఆశతో కొందరు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దళారులు సై తం మభ్యపెడుతూ అంతరపంటగా సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. అయితే పట్టుబడిన సమయంలో రైతులు కేసులపాలవుతున్నారు. పోలీసుల సిఫారసులతో ప్రభుత్వ పథకాలకు దూరం కావాల్సి వస్తోంది. గతంలో కలెక్టర్ ఐదారుగురు రైతుల రైతుబీమా, రైతు భరోసా, ఇతర పథకాలను సైతం నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా గంజాయి సాగు చేస్తున్న రైతుల వివరాలను సైతం అధికారులకు నివేదించారు. అక్రమ మార్గంలో.. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులు చర్యలు చేపడుతుండగా అక్రమార్కులు మా త్రం అమాయక రైతులను ప్రలోభాలకు గురిచేస్తూ దందా సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లోని వారిని లక్ష్యంగా చేసుకుని అంతర పంటగా సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఉట్నూర్, గాదిగూడ, భీంపూర్, బజార్హత్నూర్, బోథ్, తాంసి, తలమడుగు, అటవీ ప్రాంతాల్లో ఈ సాగు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మత్తులో తూగుతూ.. గంజాయికి అలవాటుపడ్డ యువత మత్తులో తూగుతున్నారు. అక్రమార్కులు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో వారికి అంటగడుతున్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్, ఖుర్షీద్నగర్, తిర్పెల్లి, ఖానాపూర్, బస్టాండ్, ఏరోడ్రమ్ తదితర ప్రాంతాల్లో ఈ విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. ఇటీవల వన్టౌన్, టూటౌన్, సీసీఎస్ పోలీసులు విక్రయదారులను పట్టుకుని అరెస్టు చేస్తున్నప్పటికీ ఇంకా చాలా మంది తీరులో మార్పు రావడం లేదు. గ్రాము, రెండు గ్రాముల ప్యాకెట్లను తయారు చేసి రూ.100 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. జిల్లాలో గంజాయి కేసులు, పట్టుబడిన సరుకు సంవత్సరం కేసులు ఎండిన గంజాయి విలువ 2025 190 48.327 కేజీలు (2,264 మొక్కలు) రూ.2కోట్ల 16లక్షలు 2026 32 14.910 కేజీలు (520 మొక్కలు) రూ.55లక్షలువిభిన్న రీతిలో విక్రయాలు.. గంజాయి విక్రయించేందుకు గాను మహారాష్ట్రకు చెందిన వారు జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల వారిని ఏజెంట్లుగా నియమించుకున్నారు. రహస్య ప్రదేశాల్లో ప్యాకెట్లను ఉంచుతున్నారు. సరుకు కావాలంటే ముందుగానే వారికి ఓ కోడ్ కేటాయిస్తున్నారు. సదరు వ్యక్తి ఆ కోడ్ చెబితేనే ప్యాకెట్ అందించి డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం. హోటళ్లు, పాన్షాపులు, మైదాన ప్రాంతాల్లో కొంత మంది కూర్చొని వీటిని కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం మేరకు అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేస్తున్నారు. గంజాయి రహిత జిల్లా లక్ష్యం.. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి. ఎవరైనా గంజాయి విక్రయించినా, సాగు చేసినా, సేవించినా పోలీసులకు సమాచారం అందించాలి. వాట్సాప్ నంబర్ 8712659973కు సమాచారం అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. గంజాయి సాగు చేసిన 40 మంది రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తించకుండా సిఫార్సు చేశాం. ఇప్పటివరకు 30 మందిపై పరీక్షలు చేసి నిర్ధారణ అనంతరం కేసులు నమోదు చేశాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ ఇద్దరి అరెస్ట్ గంజాయి సేవిస్తున్న ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలి పారు. పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన తోట సాగర్, విద్యానగర్కు చెందిన వికేష్ గెజి టెడ్ నం.1 పాఠశాల వెనకాల గంజాయి సే వి స్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద 22 గ్రాముల గంజాయి లభించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి
కై లాస్నగర్(బేల): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై అభివృద్ధికి బాటలు వేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ అన్నారు. బేల మండలంలోని కాప్సి గ్రామంలో బుధవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జ్యోతిభాపూలే గురుకులాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
ఆదిలాబాద్టౌన్: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్ స్పోర్ట్స్ ప్రాంగణాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శారీరక వ్యాయామం, క్రీడలు, వినోదాత్మక కార్యక్రమాలు సిబ్బందికి మానసిక ప్రశాంతతతో పాటు పనితీరును మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హెడ్క్వార్టర్స్లో స్నూకర్, టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ క్రీడలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ స్వయంగా సిబ్బందితో కలిసి స్నూకర్, టేబుల్ టెన్నిస్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్ రావు, ఏఎస్పీ పి.మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నీటిని వృథా చేయొద్దు
కై లాస్నగర్: వేసవి దృష్ట్యా ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నా రు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆమె లాండసాంగ్వి పంప్హౌస్ను బుధవారం సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న 500 కేవీ ట్రాన్స్పార్మర్ మరమ్మతు పనులను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణానికి అన్ని వనరుల నుంచి 30 ఎంఎల్డీ నీరు అందాల్సి ఉండగా కేవలం 50 శాతం మాత్రమే అందుతుందన్నారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా కుళాయిలకు ఆనాఫ్ బటన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంజయ్నగర్లో రైల్వేఫ్లైఓవర్ పనుల కారణంగా పైప్లైన్ను తొలగించడం జరిగిందని, యుద్ధప్రతిపాదికన ఆ మరమ్మతు పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా ఇన్చార్జి మంత్రిని కోరినట్లుగా తెలిపారు. ఆమె వెంట కౌన్సిలర్లు సాయి చరణ్గౌడ్, సంజయ్, సతీశ్ తదితరులున్నారు. -
వారసత్వ బదిలీ చేయడం లేదని నిరసన
ఖానాపూర్: మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలో తన భర్త పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తన పేరుపై చేయాలని కోరుతూ ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన తెలిపింది. పాత ఎల్లాపూర్ గ్రామంలో తన భర్త వెంకటి పేరుమీద 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని పేర్కొంది. తన భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోవడంతో ఆ భూమిని తనపేరిట మార్చాలని అధికారులకు విన్నవించినా పట్టింకోవడం లేదని అల్లెపు చిన్నక్క ఆవేదన వ్యక్తం చేసింది. 20 గుంటల భూమిని ఇతరుల పేరు మీద చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా తాను అర్హురాలినని, ఎందుకు బదిలీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేసింది. భూ రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని కోరింది. అనంతరం తహసీల్దార్ సుజాతకు వినతిప్రతం అందించారు. -
జీవితానికి ‘పొగ’ పెట్టొద్దు!
కాలిపోతున్న సంసారాలు.. అనాథలవుతున్న పిల్లలు ధూమపానం కేవలం వ్యక్తిగత సమస్య కాదు.. అది ఒక సామాజిక విపత్తుగా మారుతోంది. ఇంటి యజమాని క్యాన్సర్ బారినపడితే ఆ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోతోంది. వైద్యం కోసం ఉన్న ఆస్తిపాస్తులు అమ్ముకుని, చివరకు దిక్కులేని వారవుతున్న కుటుంబాలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. పొగతాగడం ద్వారా కేవలం ఆరోగ్యాన్నే కాదు, పిల్లల భవిష్యత్తును కూడా కాల్చేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధృడ సంకల్పమే మందు.. ధూమపానం మానేయడం అసాధ్యమేమీ కాదని, అది మనసు తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మీ ద ఆధారపడి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. సిగరేట్ మానేసిన 20 నిమిషాల్లోనే రక్తపోటు సాధారణ స్థితికి వస్తుందని, ఏడాది తిరిగేసరికి గుండెజబ్బుల ముప్పు సగానికి తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఆ ఒక్క దమ్ములో అంతులేని ఆనందం ఉందని భ్రమిస్తారు. అది కేవలం పొగ కాదు..జీవితాన్ని బుగ్గి చేసే మంట. అది కేవలం అలవాటు కాదు.. మనిషిని నిలువునా దహించే వ్యసనం. అందులో మృత్యువు దాగి ఉందన్న నిజాన్ని మర్చిపోతున్నారు. ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’అని సిగరేట్ పెట్టెలపై బొమ్మలు వేసి మరీ హెచ్చరిస్తున్నా.. ధూమపాన ప్రియుల్లో మార్పు రావడం లేదు. ఏటా మార్చి రెండో బుధవారం నిర్వహించే ‘జాతీయ ధూమపాన నిరోధక దినోత్సవం’సందర్భంగా కథనం. – బోథ్ధూమపానం వల్ల కలిగే అనర్థాలు అన్నీఇన్నీ కావు. ఒక్క సిగరేట్ ముక్కలో సుమారు 4 వేలకు పైచిలుకు రసాయనాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను కుళ్లింపజేయడమే కాకుండా, గుండెపోటు, పక్షవాతం, నోటి క్యాన్సర్కు ప్రధాన కారకాలుగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో శ్వాసకోస వ్యాధులతో చేరుతున్న వారిలో సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ధూమపానానికి దూరంగా ఉండాలి ధూమపానం నేరుగా ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులకు దారితీస్తుంది. పొగాకులో నికోటిన్ రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేసి రక్తపోటు పెంచుతుంది. దీనివల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఆస్తమా, దీర్ఘకాలిక దగ్గు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యకరమైన జీవితం కోసం ధూమపానానికి దూరంగా ఉండటం అత్యంత అవసరం. నిరంతరం ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. – నవీన్రెడ్డి, వైద్యుడు, బోథ్ -
బిడ్డను చూడకుండానే బాలింత మృతి
నార్నూర్: అప్పుడే జన్మించిన శిశువును చూడకుండానే బాలింత మృతి చెందింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఈ ఘట న చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వి వరాలు.. ఉట్నూర్ మండలకేంద్రానికి చెందిన ముంజం మల్లేశ్, రాధ దంపతుల కూతురు హి మబిందు (26)ను నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన బుల్లె భారత్, విజయ్మాల దంపతుల కుమారుడు ధమ్మపాల్తో గతేడాది పెళ్లి చేశారు. ధమ్మపాల్.. ఉట్నూర్ మండలం దంతన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. హిమబిందు..నార్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి పరిధి గుంజాల సబ్సెంటర్లో ఎన్హెచ్ఎం ఎంఎల్హెచ్పీగా విధులు నిర్వహిస్తోంది. ఆమె ఏడు నెల ల గర్భిణి. గతనెల 3న పురిటి నొప్పులు రావడంతో ఆదిలాబాద్ రిమ్స్కు తీసుకెళ్లారు. పరీ క్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి రిఫర్ చేశారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గతనెల 14న సాధారణ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె కోమాలోకి వెళ్లగా చికిత్స అందిస్తున్నారు. గతనెల 24న ఫిట్స్ రావడం, అదే రోజు రాత్రి గుండెనొప్పి వచ్చింది. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. బిడ్డను చూడకుండానే మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె మృతిపట్ల వైద్యులు, యూని యన్ సంఘాలు సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలుముధోల్: మండల కేంద్రంలోని నయాబాది రోడ్డు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విఠోలితండా నుంచి అవినాష్, అంజలి ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్పై మహారాష్ట్రలోని కడికి గ్రామానికి వెళ్తున్నారు. బాసర నుంచి భైంసాకు వస్తున్న ఆటో ఢీకొంది. బైక్పై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు భైంసా ఏరియాసుపత్రికి తరలించారు. నాలుగు నెలల పాప, రెండో కుమార్తెను నిజామాబాద్ ఆసుపత్రికి పంపించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. -
ఆదివాసీ యువకుడి పెళ్లికి చందాలు వేసి..
సాత్నాల: నిరుపేద ఆదివాసీ యువకుడి పెళ్లికి చందాలు వేసి జామిని గ్రామస్తులు అండగా నిలిచారు. సాత్నాల మండలంలో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా.. సాత్నాల మండలం జామిని గ్రామానికి చెందిన కుమ్ర భీమ్రావు–జంగుబాయి దంపతుల కుమారుడు గోద్రూ వివాహం బేల మండలం బోర్గావ్ వధువుతో పెళ్లి నిశ్చయమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయ ప్రకారం వరకట్న నిషేధం ఉంది. వరుడి కుటుంబం నిరుపేద కావడం, పెళ్లి ఏర్పాట్లలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విషయం తెలుసుకున్న జామిని గ్రామస్తులు చందాలు వేసుకున్నారు. మంగళవారం పెళ్లి సందర్భంగా రూ.31 వేల నగదు అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెందూరు ఇస్తారి మాట్లాడుతూ మా సంప్రదాయంలో వరకట్న నిషేధం ఉండడంతో పెళ్లి ఖర్చులన్నీ వరుడు భరించాల్సి ఉంటుందన్నారు. వరుడి ఆర్థిక స్థితి అంతంత మాత్రమే ఉందని గ్రహించి గ్రామస్తులు ఒక్కటై కుటుంబంగా ఉండి మాకు తోచిన సాయం అందించామన్నారు. గ్రామపెద్ద మహాజన్ కృష్ణ, దేవారి, సర్మోడి తదితరులు పాల్గొన్నారు. -
420 గంజాయి మొక్కలు స్వాధీనం
ఆదిలాబాద్టౌన్: శనగ పంట మధ్యలో అక్రమంగా పండిస్తున్న 420 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో మంగళవారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఇచ్చోడ మండలం హీరాపూర్లో ప్రధాన నిందితుడైన సిరికొండ మండలం సోంపల్లికి చెందిన పవర్ మాధవ్ 9 ఎకరాల వ్యవసాయ భూమిలో శనగ సాగు చేస్తున్నాడు. పంట మధ్యలో గంజాయి పండిస్తున్నాడనే సమాచారంతో ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో దాడి చేశారు. నలుగురి వద్ద గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి. ప్రధాన నిందితుడు వద్ద 390 గంజాయి మొక్కలు, మిగిలిన ముగ్గురి వద్ద తలా పది గంజాయి మొక్కలు దొరికాయి. మొత్తం 420 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.42 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ వివరించారు. ప్రధాన నిందితుడు పవర్ మాధవ్ ఇచ్చోడకు చెందిన ఆత్రం దత్తాత్రి, షేక్ ముజాయిద్, షేక్ ఆరీఫ్లకు గంజాయి తాగడానికి ఇస్తూ, వారితోనే గంజాయిని విక్రయింపజేసి వ్యాపారం నిర్వహిస్తున్నాడని చెప్పారు. జాతీయ రహదారి వద్ద ప్రయాణించే లారీలకు గంజాయిని అమ్మించి, ఆ డబ్బులో నుంచి రూ.500 చొప్పున వారికి ఇస్తూ వారి జల్సాలకు గంజాయి అందించేవాడన్నారు. ఈ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఇప్పటివరకు పంట పొలాల్లో గంజాయి పండించిన 40 మందికి రైతుబంధు సహా ప్రభుత్వ పథకాలు వర్తించకుండా సిఫారసు చేసినట్లు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులపై గంజాయి టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 30 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి సంబంధిత సమాచారం ఉంటే 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ బండారి రాజు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యవర్గం
నస్పూర్: నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆర్ముల్ల రాజు, ప్రధాన కార్యదర్శిగా కొట్టె దేవేందర్, కోశాధికారిగా ఎం.గణరాజ్, ఉపాధ్యక్షులుగా ఇ.వెంకటేశ్, ఎన్.సురేందర్, జి.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాస్గౌడ్, రాజేందర్, కమలాకర్, కార్యవర్గ సభ్యులుగా ఈశ్వర్ ప్రసాద్, శ్రీకాంత్, వినయ్యాదవ్, డానియల్ ఎన్నికై నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అడ్వొకేట్ చుంచు వెంకటేశ్ తెలిపారు. నూతన కార్యవర్గం కాలపరిమితి నాలుగేళ్లు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంత ప్రతాపరెడ్డి, ట్రెజరర్ కె.కృష్ణ, ఒలింపిక్ జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ కనపర్తి రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్చైన్గేట్: గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లను చేయాలని బైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ అన్నారు. జిల్లాలో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో వారి ఆధ్వర్యంలో చేపట్టబోయే పనులపై దిశా నిర్దేశం చేశారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్వో రాజేందర్, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్జీయూకేటీలో సోలార్ శిక్షణ
బాసర: బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో సోలార్ పీవీ టెక్నాలజీపై నాలుగు వారాల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. పునరుత్పాదక ఇంధన రంగంలో విద్యార్థులకు అవగాహన, ఆచరణాత్మక నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో ఈ శిక్షణ జరుగుతుంది. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం కాగా, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమ ముఖ్యాంశాలు సోలార్ ప్యానెళ్ల ఇన్స్టాలేషన్, సిస్టమ్ ఆపరేషన్, మెయింటెనెన్స్ వంటి అంశాలపై హ్యాండ్స్–ఆన్ శిక్షణ అందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. భారత్ 2030 నాటికి 450 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంలో 300 జీడబ్ల్యూ వాటా సోలార్ రంగానికే ఉంది. ఈ భారీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి నైపుణ్యవంతమైన మానవ వనరుల అవసరం తీవ్రంగా ఉంది. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వి.చంద్రశేఖరరావు శిక్షణ లక్ష్యాలు, నాలుగు వారాల కార్యక్రమ వివరాలు పేర్కొన్నారు. మెకానికల్ విభాగం హెడ్ ఎ.చరణ్రెడ్డి సోలార్ రంగంలోని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వైస్చాన్సలర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ. మురళీదర్శన్ ఈ కార్యక్రమాన్ని కొనియాడుతూ, అకడమిక్తో పరిశ్రమ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ అమిత్కుమార్ దేశ్పాండే, షేక్ ఆరిఫ్, సుబ్రహ్మణ్యం సిందే, దర్శన్లతో కూడిన సోలార్ పీవీ టెక్నాలజీస్ బృందం శిక్షణను పర్యవేక్షిస్తోంది. అసోసియేట్ డీన్లు డాక్టర్ కె.మహేశ్, శీలం శేఖర్, అనుపమ శ్రీదేవి, అన్పత్ రాహుల్తోపాటు విద్యార్థులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. -
రిమ్స్లో బాలింత మృతి
ఆదిలాబాద్టౌన్: తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఇన్నిరోజుల పాటు ఆలనపాలన చూసిన తల్లి కన్నుమూయడంతో మూడేళ్ల బాలుడు ఆమె మృతదేహంపై పడి ఏడ్చిన తీరు కలచివేసింది. రిమ్స్లో మంగళవారం తెల్లవారుజామున బాలింత మృతిచెందింది. ఆమె భర్త ఆత్రం విఠల్ ఆరు నెలల క్రితం చనిపోగా, భార్య సైతం మృతితో చిన్నారులు అనాథలుగా మారారు. ప్రసవమైన వారం తర్వాత మృతిచెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్య కారణంగానే బాలింత మృతిచెందినట్లు ఆరోపించారు. తీవ్ర ఆందోళనకు దిగారు. ఐటీడీఏ, వైద్యారోగ్య శాఖ అధికారులు రిమ్స్కు చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఇద్దరు పిల్లలను ఆదుకోవాలని కుటుంబీకులు, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే.. ఉట్నూర్ మండలం లక్కారం పరిధిలోని రాంజీగోండ్ గూడకు చెందిన ఆత్రం గంగుబాయి (25) ఫిబ్రవరి 28న ప్రసవం కోసం రిమ్స్ మెటర్నిటీ వార్డులో చేరింది. అదేరోజు రాత్రి సిజేరియన్ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. అయితే రెండో సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబీకులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 7న శరీరం అంతటా దద్దుర్లు వచ్చాయి. కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో శరీరంపై దద్దుర్లు వచ్చాయి. డెర్మటాలజీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 8న ఆమెకు జ్వరం వచ్చింది. ఆమెకు పోస్టు ఆపరేటీవ్ వార్డుకు మార్చారు. తీవ్ర అస్వస్థత ఉండడంతో హెచ్బీయూ వార్డుకు సోమవారం తరలించారు. ఫిజీషియన్ వైద్యులు చికిత్స అందించారు. అక్కడి నుంచి ఎంఐసీయూ వార్డుకు షిఫ్ట్ చేశారు. ఆక్సిజన్ శాతం 70 నుంచి 80 ఉందని, బీపీ 80/60గా నమోదైనట్లు తెలిపారు. శ్వాససరిగా ఆడకపోవడం, గుండె ఆగిపోవడంతో వైద్యులు ఆమెకు సీపీఆర్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె మృతిచెందినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు రిమ్స్కు చేరుకుని ఆందోళనకు దిగారు. కాగా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
కంటైనర్ బడి
కుమురంభీం కాలనీలో కంటైనర్ పిల్లలకు చదువు చెబుతున్న టీచర్ జిల్లాలో మార్చి ఆరంభంలోనే ఎండలు భగ్గుమంటున్నాయి. కొన్నిరోజులుగా 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు పెద్దలే కాకుండా విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. పట్టణంలోని కుమురంభీం కాలనీలో ఏర్పాటు చేసిన కంటైనర్లో ఇటీవల తరగతులు ప్రారంభమయ్యాయి. మండుతున్న ఎండలతో వారికి అవస్థలు తప్పడం లేదు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
వ్యక్తి బలవన్మరణం
ఖానాపూర్: ఆర్థిక ఇబ్బందులు, అప్పులు బాధ, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై రాహుల్ గైక్వాడ్ కథనం ప్రకారం.. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన పెంచాల గంగాధర్ (45), కవిత దంపతులు. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి పెళ్లయి 20 ఏళ్లు గడుస్తున్నా సంతానం లేకపోవడం, కుటుంబ సమస్యలు, అనారోగ్యంతో బాధపడేవాడు. వీటన్నింటికి తోడు చేసిన అప్పులు పెరిగిపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో సోమవారం అర్ధరాత్రి వేళ హన్మాన్ దీక్ష తీసుకునేందుకు గోదావరిలో స్నానం చేస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. గోదావరి తీరంలో గల షెడ్డులో ఉరేసుకున్నాడు. భార్య కవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలి
కై లాస్నగర్: ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి రాథోడ్ రవీందర్ సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేసే ఉద్యోగుల సౌకర్యార్థం మంగళవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో వైద్యశిబిరం నిర్వహించారు. నిజామాబా ద్ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు హాజరై ఉపాధిహామీ లో పనిచేసే ఏపీవోలు, ఈసీలు, టీఏలు, కార్యాల య ఉద్యోగులు, వారి కుటుంబీకులకు ఆరోగ్య పరీ క్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. అడిషనల్ డీఆర్డీవో కుటుంబరావు, ఏవో గంగాధర్, హెచ్ఆర్ మేనేజర్ రషీద్ ఉన్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యుడు -
ప్రజారోగ్యంపై దృష్టి
ఇంద్రవెల్లి: గ్రామాలాభివృద్ధితో పాటు ప్రజా రోగ్యంపై ప్రజాప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరానికి హాజరై ఎస్బీఐ అందించిన వైద్యపరికరాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మూఢనమ్మకాలకు దూ రంగా ఉండి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చి నా వెంటనే ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందా లని సూచించారు. అనంతరం మండలంలోని దుబ్బగూడలో వీవో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మ ర్మాట్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీఆర్డీ వో రవీందర్రాథోడ్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో జీవన్రెడ్డి, సర్పంచ్ రాథోడ్ మోహన్సింగ్, వైద్యులు పూజతి, వసంత్రావ్, కాంగ్రెస్ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కౌన్సిల్లో రచ్చ
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశమే రచ్చకు దారి తీసింది. బీజేపీ, కూటమి (కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం) కౌన్సిలర్లు పరస్పరం దూషించుకుంటూ గల్లాలు పట్టుకుని బాహాబాహీకి దిగడం తీవ్ర కలకలం రేపింది. ఆయా పార్టీల నాయకులూ అక్కడికి చేరుకోగా అరుపులు, కేకలు, బొబ్బలతో కార్యాలయం దద్దరిల్లింది. చైర్పర్సన్కు వ్యతిరేకంగా బీజేపీ కౌన్సిలర్లు మూడున్నర గంటల పాటు ఆమె ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించిన పోలీసులతో బీజేపీ కౌన్సిలర్లు తీవ్ర వాగ్వాదానికి దిగారు. పరస్పరం నెట్టుకున్నారు. దీంతో ఆందోళన తీవ్రతరమైంది. డీఎస్పీ జీవన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ రక్షణ వలయంలో చైర్పర్సన్ను బయటకు తరలించడంతో వివాదం సద్దుమణిగింది. అసలేం జరిగిందంటే.. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అధ్యక్షతన ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యా రు. తొలుత 49వ వార్డు కౌన్సిలర్ వెనుగంటి ప్రకాశ్తో కమిషనర్ రాజు ప్రమాణాస్వీకారం చేయించారు. అనంతరం కౌన్సిలర్లంతా స భకు పరిచయం చేసుకున్నారు. ఎమ్మెల్యే, చైర్పర్సన్ సభనుద్దేశించి మాట్లాడిన తర్వాత ఆరు అంశాలతో కూడిన ఎ జెండాను మున్సిపల్ సిబ్బంది వి నిపించారు. ఐదు అంశాలు పూ ర్తయిన తర్వాత వైస్ చైర్మన్ రోహిత్ ప్రార్థనలకు సమయమవుతుందని చెప్పగా కూటమి కౌన్సిలర్లు ఎజెండా పాస్ అనడంతో చైర్పర్సన్, కూటమి కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు. చైర్పర్సన్ ఛాంబర్ ఎదుట ఆందోళన సమావేశ మందిరం నుంచి బయటకు వస్తూ చైర్పర్సన్ ఛాంబర్లోకి వెళ్లే క్రమంలో చైర్పర్సన్ భర్త సతీశ్తోపాటు కూటమి కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్లు పరస్పరం వాగ్వాదానికి దిగారు. పరుష పదజాలంతో దూషించుకుంటూ బాహాబాహీకి దిగారు. పలువురు కౌన్సిలర్లు తమతమ కౌన్సిలర్లను వారించడంతో కూటమి కౌన్సిలర్లు చైర్పర్సన్ ఛాంబర్లోకి వెళ్లిపోయారు. చైర్పర్సన్ వైఖరిని నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్లు ఆమె ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తనయుడు పాయల్ శరత్, బీజేపీ మహిళా కౌన్సిలర్ల భర్తలు అక్కడకు చేరుకున్నారు. చైర్పర్సన్ బయటకు రావాలంటూ అరుపులు, కేకలు, బొబ్బలతో హోరెత్తించారు. ఛాంబర్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ అధికారులు, వా రికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, నీటి సమస్య తీర్చాలంటూ బీజేపీ కౌన్సిలర్లు ఖాళీ బిందెలు, బకెట్లతో రెండు గంటల పాటు బైఠాయించి నిరసన కొనసాగించారు. చైర్పర్సన్కు వ్యతిరేకంగా నినదించారు. డీఎస్పీ జీవన్రెడ్డి అక్కడకు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. దీంతో ప్రత్యేక పోలీస్ బలగాలను రప్పించి ప్రత్యేక రక్షణ వలయం మధ్య చైర్పర్సన్తో పాటు కూటమి కౌన్సిలర్లను బయటకు పంపించారు. అనంతరం బీజేపీ కౌన్సిలర్లు కూడా ఆందోళన విరమించి బయటకు వెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. కౌన్సిలర్లు రాజకీయాలతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. మరో 300 మంది పారిశుద్ధ్య కార్మికులను నియామకానికి తీర్మానం చేసి ఇస్తే ప్రభుత్వం నుంచి మంజూరయ్యేలా చూస్తానని చెప్పారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి త్వరలోనే ప్రధాని, సీఎం చేతుల మీదుగా భూమిపూజ ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటువుతుందని పేర్కొన్నారు. సభ్యులంతా భేషజాలకు పోకుండా ఐదేళ్లు ప్రజల్లో మంచిపేరు తెచ్చుకునేలా పనిచేయాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ.. పట్టణంలోని 49 వార్డులను తన సొంత వార్డులుగా అభివృద్ధికి చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన మొదట బీజేపీ కౌన్సిలర్ వార్డునే సందర్శించి అక్కడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించానని చెప్పారు. 99రోజుల కార్యాచరణ ప్రణాళికనూ బీజేపీ కౌన్సిలర్ వార్డు నుంచే మొదలు పెట్టామని, కానీ, ఆ పార్టీ కౌన్సిలర్లు ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తూ ఆందోళనకు దిగడం సరికాదని పేర్కొన్నారు. -
వంట గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తిపై కేసు
కైలాస్నగర్: గృహవసర వంట గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తూ ఓ మెకానిక్ గ్యారేజీలో ఆటోలు, కార్లకు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వైనాన్ని వివరిస్తూ ఈ నెల 1న ‘రీఫిల్లింగ్ దందా’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీన్ని సీరియస్గా పరిగణించిన కలెక్టర్ రాజర్షి షా విచారణకు ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మహేశ్ జిల్లా కేంద్రంలోని రాంనగర్లోగల మెకానిక్షాపును సందర్శించి విచారణ చేపట్టారు. వంటగ్యాస్ను అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు బాధ్యులైన మెకానిక్ షాప్ యజమాని పట్టణంలోని శాంతినగర్కు చెందిన షేక్ జాబీర్, ఆయనకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న జైనథ్ మండలంలోని రుద్ర గ్యాస్ ఎజెన్సీ యజమానిపై మంగళవారం 6ఏ కేసు నమోదు చేశారు. వంటగ్యాస్ సిలిండర్లను అక్రమంగా తరలించినా, ఇతర కార్యకలాపాలకు వినియోగించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. -
ఏఎంసీ పీఠం ఎవరికో?
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ ఏఎంసీ పాలకవర్గాలను వారంలోపు ప్రకటించనున్నట్లు అధికార పార్టీలో చర్చ మొదలైంది. దీంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలను కలుస్తూ పైరవీ చేస్తున్నారు. ఆదిలాబాద్ విషయంలో ఊగిసలాట కొనసాగుతోంది. ప్రతీసారి చైర్మన్ పదవిని భర్తీ చేస్తారని చెప్పడం, ఆ తర్వాత ప్రక్రియ నిలిచిపోవడం జరుగుతూ వస్తోంది. ఈసారి మాత్రం తప్పనిసరిగా ఉమ్మడి జిల్లాలోనే అధిక ఆదాయమున్న ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి భర్తీ విషయంలో రాజకీయ ఎత్తుగడలు కొనసాగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. జోరుగా ఆశావహుల పైరవీలు ఆదిలాబాద్ ఏఎంసీ చైర్మన్ పదవి కోసం కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనరల్ స్థానం కావడంతో పార్టీలో ముందునుంచి ఉన్న తన పేరు పరిశీలించాలని ముఖ్య నేతలను కోరుతూ వస్తున్నారు. పార్టీ నియోజకవర్గ ముఖ్యనేత కంది శ్రీనివాసరెడ్డికి, బోరంచు శ్రీకాంత్రెడ్డికి పొసగకపోవడంతో నాన్చుతున్నారనే ప్రచారం సాగుతోంది. బీసీ నాయకుడు మునిగెల విఠల్కు పదవి ఇప్పించేందుకు కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారనే ప్రచారమూ ఉంది. బోథ్ బీసీ జనరల్ స్థానం కావడంతో బోథ్కు చెందిన మల్లెపూల సత్యనారాయణ, చట్ల ఉమేశ్ ప్రయత్నిస్తున్నారు. ఇదివరకు చైర్మన్గా వ్యవహరించిన బొడ్డు గంగారెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఇక్కడ రిజర్వేషన్ మార్పు కోసం పార్టీకి చెందిన ప్రపుల్చందర్రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలోనూ ఈ పదవి కోసం ప్రయత్నించినా రిజర్వేషన్ అనుకూలించలేదని, ఈసారీ అదే పరిస్థితి ఉందని, ఈ దృష్ట్యా రిజర్వేషన్ మార్పు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పార్టీలో చెప్పుకొంటున్నారు. మొత్తంగా ఈ రెండు ఏఎంసీల చైర్మన్ పదవుల విషయంలో త్వరలో ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. -
మెగా జాబ్మేళాకు స్పందన
ఆదిలాబాద్టౌన్: పోలీస్శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మంగళవా రం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు స్పందన లభించింది. 67 కంపెనీల్లో ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్, నాన్ ఐటీ, ఆటోమొబైల్, నర్సింగ్, మార్కెటింగ్, డ్రైవింగ్, సెక్యూరిటీ, టెక్నికల్, ఫార్మ, హెచ్ఆర్, ఎయిర్ పోర్ట్ తదితర రంగాల్లో 4వేల ఉద్యోగాల కల్పనకు మేళా నిర్వహించగా 7,500 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 67 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 2,100 మంది అర్హులను ఆయా కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీరికి జిల్లా జడ్జి ప్రభాకరరావు, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఆదిలాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్ నియామకపత్రాలు అందజేశారు. రూ.13వేల నుంచి రూ.40వేల వరకు వేతనం అందనుండగా ఉద్యోగాలకు ఎంపికై నవారు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, జాబ్ మేళాతో పోలీస్ పరేడ్ మైదానం కిక్కిరిసిపోయింది. అదనపు ఎస్పీ సురేందర్రావు, ఏఎస్పీలు మౌనిక, రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీలు జీవన్రెడ్డి, ఇంద్రవర్ధన్, శ్రీనివాస్, శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్ కాంత్, వన్టౌన్, టూ టౌన్ సీఐలు సునీల్కుమార్, నాగరాజు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆయా మండలాల ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కోర్టు తీర్పు అమలు చేయాలి
బోథ్: హైకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అ ధ్యక్షుడు గుంజాల భాస్కర్రెడ్డి కోరారు. బోథ్లో మంగళవారం ఉద్యమకారులతో కలిసి ఆయన మా ట్లాడారు. హైకోర్టు తీర్పు ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఎనిమిది వారాల్లో నెలనెలా రూ.25 వే ల పెన్షన్, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరా రు. ఈ కేసును ముందుకు తీసుకెళ్లిన అడ్వకేట్ కరుణాకర్రెడ్డి, తీర్పు వెల్లడించిన జడ్జి విజయసేనారె డ్డి, సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్రా వు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే ఉద్యమకారుల కమి షన్ ఏర్పాటు చేసి డిమాండ్లు పరిశీలించాలని భా స్కర్రెడ్డి కోరారు. ఉద్యమకారులు, ఉద్యమంలో కీ లక పాత్ర పోషించిన విలేకరులకు నెలనెలా రూ.25 వేల పెన్షన్, ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, ఐదెకరాల భూమి, పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, బీమా కల్పించాలని కోరారు. తెలంగా ణ ఉద్యమకారులు కుంట వెంకటరమణగౌడ్, దీటీ దేవిదాస్, వెంకటరమణ, ప్రకాశ్సింగ్, మల్లెపూల సుభాష్, అమర్సింగ్ భీమ్రావ్ తదితరులున్నారు. -
సీ్త్రనిధి ఏజెంట్ చేతివాటం
● రూ.7 లక్షలు సొంతానికి వాడుకున్న వైనం సాత్నాల: భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో వీవోఏ (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్)గా విధులు నిర్వహిస్తున్న రాయిడి స్వప్న సీ్త్రనిధి సంఘం సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులు సొంతానికి వాడుకోవడం కలకలం రేపింది. ఎస్సై పవర్ గౌతమ్ కథనం మేరకు గ్రామానికి చెందిన వీవోఏ రాయుడి స్వప్న సీ్త్రనిధి స్వయం సహాయక సంఘాలకు ఏజెంట్గా పనిచేస్తుంది. 2022 నుంచి 10 సంఘాలు, 54 మంది సభ్యులు శ్రీనిధి రుణాలు తీసుకున్నారు. సదరు మహిళల వద్ద నుంచి ప్రతీనెల డబ్బులు వసూలు చేసి బ్యాంకులో కట్టినట్లుగా రసీదులు చూపించింది. గడువు ముగిసిన తర్వాత దుమ్మ సంగీత, దుమ్మ బూమక్క, కోర చిన్నమ్మ, నలిమెల కాంత మళ్లీ రుణంకోసం అడుగగా బ్యాంకులో తీసుకున్న పాత లోన్ డబ్బులు పూర్తిగా కట్టలేదని అన్నారు. దీంతో సదరు మహిళలు స్వప్నను సంప్రదించగా రూ.7 లక్షలు వాడుకున్నట్లు ఒప్పుకుంది. నెలరోజులకు చెల్లిస్తానని బాండు రాసి ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత సీ్త్రనిధి సంస్థకు చెందిన అధికారులు డబ్బుల విషయం అడుగగా నేను ఇవ్వలేనని చెప్పింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. చిన్నారికి నారీ పురస్కార్ఆదిలాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన కల్చరల్, ఫ్యాషన్ అవార్డ్స్ కార్యక్రమంలో జిల్లాకు చెందిన కొంకటి ఇతిక్ష విశేష ప్రతిభ కనబర్చింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గౌరవ సభ్యురాలు సరిత గోగుల, నేషనల్ బంజారా భారత్ మహిళా కన్వీనర్ అద్దంకి నాగమణి, ప్రముఖ నటి సంధ్యారాణి చేతుల మీదుగా నారీ పురస్కారాన్ని అందుకుంది. చిన్నారి తల్లిదండ్రులు కొంకటి సృజన, శ్రావణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
ఆగని దాడులు.. తొలగని దిగులు..
నిర్మల్ఖిల్లా: దుబాయ్లోని పలుప్రాంతాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నిర్మల్ జిల్లాకు చెందిన వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దుబాయ్, అబుదాబి విమానాశ్రయాలపై డ్రోన్ దాడులు జరిగినట్లు సమాచారం రావడంతో అక్కడి పరిస్థితులపై ఇక్కడి ప్రవాసీల కుటుంబాలు టెన్షన్ పడుతున్నాయి. ఇదే సమయంలో తాముంటున్న సమీపప్రాంతాల్లోని కొన్ని బహుళ అంతస్తుల భవనాలపై కూడా డ్రోన్ దాడుల ప్రయత్నాలు జరిగాయని వలస కార్మికులు చెబుతున్నారు. గల్ఫ్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే విధులకు వెళ్లకుండా గదుల్లోనే ఉండాల్సి వస్తోందని నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామానికి చెందిన కాపుకుమ్మరి రవి... ‘సాక్షి’కి వెల్లడించారు. గల్ఫ్ దేశాలపై దాడుల వార్తలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎయిర్ పోర్టులపై దాడులు.. -
బాలింతను ఆస్పత్రికి తరలించిన వైద్యసిబ్బంది
గుడిహత్నూర్: మండలంలోని చెరువాయికి చెందిన ఆదివాసీ మహిళ మారుబాయి గత నెల 22న రిమ్స్ ఆస్పత్రిలో ప్రసవించింది. రక్తహీనతతో బాధపడుతున్న ఆమె పూర్తి చికిత్స తీసుకోకుండానే ఈ నెల 2న ఇంటికి చేరింది. ఈ క్రమంలో గ్రామ సందర్శనకు వెళ్లిన వైద్యబృందం కదలలేని స్థితిలో ఉన్న మారుబాయిని రిమ్స్కు తరలించేందుకు ప్రయత్నించగా నిరాకరించింది. మండల వైద్యాధికారి శ్యాంసుందర్ ఆమెకు నచ్చజెప్పి రిమ్స్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు.మారుబాయిని తీసుకెళ్తున్న వైద్య సిబ్బంది -
సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
నిర్మల్: పెన్షనర్లను ఇబ్బందికి గురిచేసేలా రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (టీఎస్జీఆర్ఈఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంసీ లింగన్న డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని, వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని కోరా రు. కేంద్రం ప్రభుత్వం పెన్షనర్లకు ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏలకు వ్యతిరేకంగా చేసిన బిల్లుపై పునరాలోచించాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 25న బ్లా క్డే నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొజ్జ జనార్దన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతారెడ్డి, ఆర్థిక కార్యదర్శి లోలం గంగన్న, యూనిట్ అధ్యక్షుడు కాండ్లీకర్ రమేశ్, కార్యదర్శి పూదరి జనార్దన్, యూనిట్ ఆర్థిక కార్యదర్శి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఊరంతా ఒక్కటై.. శుభ్రం చేసి..
లక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి(కే) గ్రామస్తులు ఒక్కటై గ్రామంలో నీటి ట్యాంకును బాగు చేసుకున్నారు. మిషన్ భగీరథ నుంచి నీటి ట్యాంక్లో నీళ్లు బయటకు వెళ్లేందుకు ఏర్పాటుచేసిన ఔట్ ఫ్లో పైపు పైకి ఉంది. ట్యాంకు శుభ్రపర్చిన ప్రతిసారి అందులో చెత్త, మురుగునీటిని తొలగించడం పంచాయతీ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని సర్పంచ్ ముఖేష్.. ఉపాధి అధికారులకు తెలిపారు. సోమవారం ఉపాధి కూలీలందరూ కలిసి కంకర, సిమెంట్ ట్యాంక్ పైకి తరలించారు. ట్యాంకులో ఔట్ ఫ్లో పైపు వరకు సిమెంట్ వేశారు.నీటిట్యాంకు పైకి మెటీరియల్ తరలిస్తున్న గ్రామస్తులు -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కడెంకు చెందిన జామ్లాబాయ్ తనకి వ్యవసాయ క్షేత్రానికి సాగునీరు అందించేందుకు పైపులు మంజూరు చేయాలని, సిర్పూర్ (యు)కు చెందిన గేడం గజానంద్ ఏకలవ్య పాఠశాలలో స్లీపర్ ఉద్యోగం ఇప్పించాలని, సిరికొండ మండలానికి చెందిన రామారావు సోలార్ పంపుసెట్ మంజూరు చేయించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో చదవాలి
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న ఈ సమయంలో విద్యార్థులు అనవసరంగా ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛ వాతావరణంలో చదవాలి. లక్ష్యాన్ని ఎంచుకుని క్రమపద్ధతిలో కృషి చేస్తే విజయం సాధించడం కష్టంకాదు. ‘ఒత్తిడిని భయంగా కాకుండా సవాల్గా తీసుకుంటే విజయం కచ్చితంగా సిద్ధిస్తుంది. – అల్లం సాయికృష్ణ, కెరీర్ గైడెన్స్ నిపుణులు, బోథ్, ఆదిలాబాద్ ఒత్తిడికి గురికావొద్దు పరీక్షల సమయంలో విద్యార్థులు అనవసరమైన ఒత్తిడికి గురికావొద్దు. ప్రతిరోజూ చదువు కోసం సమయపట్టిక రూపొందించుకుని మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా సరిపడా నిద్ర, సమతుల్య ఆహారం, తేలికపాటి వ్యాయామం మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. పరీక్షలను జీవితంలో ఒక దశగా మాత్రమే భావించాలి. ఫలితాలకంటే నేర్చుకున్న జ్ఞానమే ప్రధానం. – అడ్డిగ శ్రీనివాస్, సైకాలజిస్టు, మోటివేషన్ స్పెషలిస్టు -
ఉమ్మడి జిల్లాలో పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు
కుమురంభీంనిర్మల్మంచిర్యాల ఆదిలాబాద్నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శిరీష ఇటీవల తరచూ తలనొప్పి, ఆందోళనతో బాధపడుతోంది. పరీక్షలు గుర్తుకొస్తే చేతుల్లో చెమటలు పట్టడం, చదవడానికి కూర్చుంటే గజిబిజి ఆలోచనలు రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటోంది. ఇది ఒక్క గాయత్రి పరిస్థితి మాత్రమే కాదు.. జిల్లాలో అనేక మంది విద్యార్థులు ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక రెండురోజుల క్రితం మంచిర్యాల జిల్లా మందమర్రిలో పదోతరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంత చదివినా ఏ పరీక్షలోనైనా పాస్ మార్కులు మాత్రమే వస్తున్నాయని తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేవాడు. ఆదివారం ఉదయం తల్లి నిద్రలేపి చదువుకొమ్మని చెప్పింది. కాసేపటి తర్వాత వచ్చి చూసే సరికి ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. మార్కులు తక్కువ వస్తున్నాయనే ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పట్టణ అభివృద్ధికి సహకరించాలి
నిర్మల్ టౌన్: నిర్మల్ పట్టణ అభివృద్ధికి సహకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ కోరారు. సోమవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. పట్టణ అభివృద్ధి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం వారు పట్టణంలో ఈద్గా ఏర్పాటు చేయాలని, మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్లో సౌకర్యాలు మెరుగు పరచాలని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషిని కోరారు. -
అంగన్వాడీల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలని వినతి
ఆదిలాబాద్: అంగన్వాడీల సమస్యలను అ సెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ను తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిలారు రాధ, పుప్పాల సునంద కోరా రు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రీప్రైమరీ టీచర్లుగా గుర్తించి, కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని డిమాండ్ చే శారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్గా టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్షతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రధాన అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
‘ప్రగతి’ బాటలో కలెక్టర్
కై లాస్నగర్: ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్ర జ లకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కా ర్యాచరణలో భాగంగా సోమవారం కలెక్టరేట్ లో పారిశుధ్యం, ఫైళ్ల క్లియరెన్స్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి ప్రాంగణంలో చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. డీసీవో కార్యాలయంలో పరిసరాలు, సీపీవో కార్యాలయంలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రెజరీ కార్యాలయంలో ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోవడంపై ప్రశ్నించారు. అనంతరం మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఐదు రోజుల్లో పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. వారి వెంట ఆర్డీవో స్రవంతి, కమిషనర్ జి.రాజు, కౌన్సిలర్ స్వాతి, ప లు శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆరోగ్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి ఇచ్చోడ: జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న మెగా ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో సోమవా రం నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఇందులో డీఎంహెచ్వో నరేందర్రాథోడ్, ఇచ్చోడ వైద్యాధికారి మధురిమ, రిమ్స్ వైద్యులు ఉన్నారు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ మండల పరిషత్ కార్యాలయంలో చేపడుతున్న ప్ర జావాణిలో కలెక్టర్ పాల్గొని ప్రజలనుంచి దరఖాస్తు లు స్వీకరించారు. ఇందులో తహసీల్దార్ ఇమ్రాన్ఖా న్,ఎంపీడీవో రవీందర్, అధికారులు పాల్గొన్నారు. -
● అక్రమార్కుల పాలిట సింహస్వప్నంలా పోలీస్ బాస్ ● శాఖలోనూ సమూల మార్పులకు శ్రీకారం ● నూతన కార్యక్రమాలతో ప్రజలకు చేరువ ● మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు ● ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది
ఎస్పీ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు.. ఆపరేషన్ ఛబుత్రా, మెసేజ్ యువర్ ఎస్పీ, గ్రామాల్లో వీపీవో విధానం, పోలీస్ అక్క, రౌడీమేళా, మైనర్ డ్రైవింగ్పై కౌన్సెలింగ్, అభయ మై టాక్సీ ఇస్ సేఫ్, ఖాకి కిడ్స్ జిల్లా పోలీసు బాస్గా అఖిల్ మహాజన్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి కానుంది. 12 నెలల వ్యవధిలో తనకంటూ ప్రత్యేకత చాటుతున్నారు ఎస్పీ. అక్రమార్కుల భరతం పట్టడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. బ్లాక్ మెయిల్, అక్రమదందాలకు చెక్ పెడుతున్నారు. తప్పు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించకుండా ఊచలు లెక్కించేలా ముందుకు సాగుతున్నారు. అలాగే మహిళలు, యువతులు, విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతీ సోమవారం గ్రీవెన్స్కు వచ్చే బాధితులకు అండగా ఉంటూ సత్వర న్యాయం అందేలా చొరవ చూపుతున్నారు. – ఆదిలాబాద్టౌన్అఖిల్ మహాజన్, ఎస్పీ -
అందరి చూపు.. కొత్త కౌన్సిల్ వైపు
కై లాస్నగర్: ఇటీవల నూతనంగా ఎన్నికై న ఆదిలా బాద్ మున్సిపల్ కౌన్సిల్ తొలి సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించనున్నారు. చైర్పర్సన్ బండారి అనూష అధ్యక్షతన ఉదయం 11గంటలకు కౌన్సిల్ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభం కానుంది. దాదాపు 13 నెలల తర్వాత నిర్వహిస్తుండడంతో సమస్యల పరిష్కారంపై పట్టణవాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా వేసవి షురూ కావడంతో తాగునీటి సమస్యను కౌన్సిల్ ఏ విధంగా అధిగమిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నీటి ఎద్దడిని నియంత్రిస్తారా.. పట్టణంలో 49 వార్డులున్నాయి. ఇందులో విలీన కా లనీలకు ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా కా ని పరిస్థితి. పలు కాలనీల్లో నల్లాలకు ఆనాఫ్ బటన్ లేకపోవడంతో నీరు వృథాగా పోతుంది. లాండసాంగ్వీ పంప్హౌస్పైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ఈ సారి కూడా పలు కాలనీలకు ట్యాంకర్ల నీరే దిక్కయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనిపై ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగుతారో చూడాలి. ఆదాయం పెంచుకునే అవకాశమున్నా .. గ్రేడ్–1 స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్ మున్సిపల్లో కార్మికుల వేతనాల చెల్లింపునకు ప్రతిసారి ఇబ్బందులు తప్పడం లేదు. దీన్నిఅధిగమించేలా బల్దియా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలున్నా ఆ దిశగా దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. చాలా చోట్ల మడిగెలు ఖాళీగా ఉంటున్నా వాటిని అద్దెకు ఇచ్చే ఆలోచన చేయకపోవడం గమనార్హం. ఆ నిధుల వినియోగం ఎప్పుడో.. ఆదిలాబాద్ పట్టణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.18.50 కోట్ల ప్రత్యేక నిధులను విడుదల చేసింది. వాటితో వివిధ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు గతంలోనే సిద్ధం చేశారు. అయితే రాజకీయ కారణాల కారణంగా వాటిని నిలిపివేశారు. నూతన కౌన్సిల్ రావడంతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ప్రాధాన్యత క్రమంగా నిధులు కేటాయించి త్వరగా అభివృద్ధి పనులు చేపడుతారా లేక రాజకీయ జోక్యంతో వాయిదా వేస్తారా అనేదానిపై సర్వత్రా చర్చ సాగుతుంది. అసంపూర్తి నిర్మాణాల పరిస్థితేంటో.. పట్టణ ప్రజలకు కూరగాయలతో పాటు మాంసం, చేపలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మంజూరు చేసింది. రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భవన నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. నాలుగేళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగని పరిస్థితి. ఇండోర్ స్టేడియం పరిస్థితి అలాగే ఉంది. నిధులు విడుదల లేక ఫిల్లర్లదశలోనే ఆగిపోయింది. వీటిపై కౌన్సిల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారా లేక నిధుల లేమి సాకుతో వదిలేస్తారా వేచి చూడాలి. -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
కై లాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలను పెండింగ్లో ఉంచొద్దని, ప్రతీ దరఖాస్తును త్వరితగతిన పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ వారం 71 అర్జీలు అందగా ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూసమస్యలు ఉన్నాయి. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఏవో వర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే ..అధికారుల తీరుపై ఆగ్రహం పలువురు జిల్లా స్థాయి అధికారులు ప్రజావాణికి గైర్హాజరు కావడంపై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీవెన్స్కు ప్రతి అధికారి విధిగా హాజరుకావాలని పదేపదే చెబుతున్నా కొంతమందిలో మార్పు రావడం లేదని సీరియస్ అయ్యారు. తీరు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ప్రజారోగ్యంపై ఫోకస్
ఆదిలాబాద్టౌన్: ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నాలుగు దశల్లో వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. మొదటి దశలో గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నారు. రెండో దశలో అసంక్రమిత వ్యాధులు, మూడో దశలో సంక్రమణ వ్యాధులు, నాలుగో దశలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రత్యేక వైద్యులతో వైద్య సేవలు అందించనున్నారు. 99 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో 30 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. రిమ్స్తో పాటు పీహెచ్సీలు, సీహెచ్సీలు అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, సబ్ సెంటర్లలో ఈ సేవలు అందించనున్నారు. అలాగే ఆస్పత్రుల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు. నాలుగు దశల్లో సేవలు.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యారోగ్య శాఖ ద్వారా నాలుగు దశల్లో వైద్య పరీక్షలు చేపట్టనున్నారు. మొదటి విడత ఈనెల 6 నుంచి 12వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రసుతి, కౌమర, వృద్ధులకు రక్తహీనత పరీక్షలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆరోగ్యం, స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో విడత ఏప్రిల్ 1 నుంచి 15 వరకు బీపీ, షుగర్, క్యాన్సర్ తదితర వ్యాధులకు సంబంధించి సబ్సెంటర్లలో స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. మూడో విడత ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అంటువ్యాధులు, టీబీ, హెచ్ఐవీ తదితర వ్యాధులకు సంబంధించి పరీక్షలు చేయనున్నారు. నాలుగో విడత మే 16 నుంచి జూన్ 12 వరకు కంటి పరీక్షలు, దంత పరీక్షలు చేపట్టనున్నారు. దీంతోపాటు హెచ్ఐవీపై అవగాహన, మాతా శిశు, నవజాత శిశు మరణాలు తగ్గించడం, ఔషధ మొక్కలపై అవగాహన, మందులు అధికంగా వాడడంతో దుష్పరిణామాలను తెలియజేయనున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో చికిత్స అందించనున్నారు. అలాగే మహిళ సంఘాల సభ్యులకు వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్ చేపట్టనున్నారు. వేసవిలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వ్యాధుల గురించి అవగాహన కల్పించనున్నారు. పకడ్బందీగా నిర్వహిస్తాం.. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోనూ పకడ్బందీగా అమలు చేస్తాం. 99 రోజుల పాటు చేపట్టే కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేపడతాం. లక్ష 20వేల మంది సభ్యులు ఉండగా, ప్రతిఒక్కరికి వైద్య పరీక్షలు అందిస్తాం. రిమ్స్లోని స్పెషాలిటీ వైద్యులతో గ్రామాల్లో సేవలు అందించేలా చర్యలు చేపడతాం. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో -
రైతు చుట్టూ రాజకీయం
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో రైతు చుట్టూ రాజకీయం కొనసాగుతుంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ని ఎండగడుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు పోరుబాట పట్టాయి. రైతుభరోసా ఎప్పుడేస్తారంటూ గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తుండగా, ఫసల్ బీమా అమలు చేయాలంటూ కమలం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా సంతకాల సేకరణ చేపట్టి గ్రామాల్లో పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంతకాల సేకరణతో.. రైతుభరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామం నుంచి గత శనివారం రైతుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు పోరుబాట కార్యక్రమాన్ని షురూ చేశారు. అందులో భాగంగా సంతకాల సేకరణ చేపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు లక్ష్యంగా.. రానున్న అసెంబ్లీ సమావేశాలు లక్ష్యంగా ఈ రెండు పార్టీల ముఖ్య నేతలు రైతుల నుంచి సంతకాల సేకరణ చేపడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోగా, రైతుల నుంచి 10లక్షల దరఖాస్తులు సేకరించి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ అందజేస్తామని చెబుతున్నారు. అలాగే రైతు భరోసా ఇవ్వాలని, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్రూరల్ మండలం కచ్కంటి, బేల మండలం సాంగిడిలోనూ ఈ కార్యక్రమాలు సాగాయి. రైతు భరోసా త్వరగా విడుదల చేయాలని, అలాగే ప్రతీ పంటకు రూ.500 బోనస్ అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సంతకాల సేకరణతో రైతుల వద్దకు వెళ్తోంది. కార్యక్రమాన్ని ఆదిలాబాద్ రూరల్ మండలం అకోలి గ్రామంలో ఇటీవల ప్రారంభించారు. భోరజ్ మండలంలోని అకోలి, బేల మండలం సాంగిడిలో కొనసాగాయి. రైతులు అధైర్యపడొద్దు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదలలో తీవ్ర జాప్యం చేస్తుంది. రైతులు అధైర్య పడవద్దు. బీఆర్ఎస్ అండగా ఉంటుంది. – జోగు రామన్న, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రైతు సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఫసల్ బీమా యోజన అమలు చేయాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అందుకే సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టాం. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ -
అక్రమార్కులు ఎంతటివారైనా ఉపేక్షించం
ఆదిలాబాద్ ఎస్పీగా గతేడాది మార్చి 10న బాధ్యతలు చేపట్టిన అఖిల్ మహాజన తొ లుత పోలీసు శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఉద్యోగులంతా క్ర మశిక్షణతో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. విధులు విస్మరించే వారి పై శాఖాపరమైన చర్యలకు పూనుకున్నారు. మరోవైపు మహిళల భద్రతకు పెద్దపీటవేశారు. షీటీం, పోలీస్ అక్క వంటి కార్యక్రమాలతో బాలికలు, యువతులకు అండగా నిలుస్తున్నారు. ఇక రాత్రి వేళ లో ప్రజలు అనవసరంగా బయట తిరకుండా ఆపరేషన్ చబుత్రా కొనసాగిస్తున్నారు. అలాగే వాహనాలు నడిపిస్తున్న మైన ర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. రౌడీషీటర్లకు రౌడీమేళా నిర్వహించి హద్దు మీరితే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నా రు. సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ వాటిని ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తున్నారు. అక్రమాలకు చెక్.. జిల్లాలో బ్లాక్మెయిలింగ్, వడ్డీ వ్యాపారం, రియల్ ఎస్టేట్లో డబుల్ రిజిస్ట్రేషన్, సైబర్క్రైమ్, నిషేధిత వ్యాపారాలకు అడ్డుకట్ట వేశారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈ చర్యలతో అక్రమార్కులు తోకముడిచి స్థానికంగా కనిపించకుండా పోయారు. అలాగే ఇసుక, మొరం అక్రమ దందాకు సైతం చెక్ పెట్టారు. హైవే పక్కన ఉన్న దాబాల్లో మద్యం పూర్తిగా నిషేధించారు. రోడ్డు ప్రమాదాలను అడ్డుకట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతీ వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటూ న్యాయం జరిగేలా చొరవ చూపుతున్నారు. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే నేరుగా సమాచారం అందించాలనే ఉద్దేశంతో ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు ఎలాంటి సమస్యలు, సమాచారం ఉన్నా వాట్సాప్ నంబర్ 8712659973 ద్వారా తెలియజేసేందుకు వీలు కల్పించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. సత్వర పరిష్కారం అందేలా చొరవ చూపుతుండడంతో కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది.జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపుతాం. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటివారైనా ఉపేక్షించబోం. ఏదైన అక్రమ దందాలకు సంబంధించి సమాచారం ఉంటే వాట్సాప్ నంబర్ 8712659973కు తెలియజేయాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. రియల్ ఎస్టేట్ మోసాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. అలాగే గంజాయి, మట్కా, ఆన్లైన్ బెట్టింగ్, ఇసుక, మొరం అక్రమ దందాపై దృష్టి సారించాం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
బాలికల ఆరోగ్య రక్షణకు ‘హెచ్పీవీ’
ఆదిలాబాద్టౌన్: బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్పీవీ టీకా ఎంతో కీలకమని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. 14–15 ఏళ్ల బాలికలకు ఇవ్వనున్న హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీ గొడం నగేశ్తో కలిసి రిమ్స్లో ఆదివా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. బాలికలు ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వంటివి రాకుండా నిరోధించవచ్చన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1700 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీఎస్ఆర్ నిధులతో రిమ్స్లో మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం అధునాతన సదుపాయలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మదర్ ఫీడింగ్ గదులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా క్యాన్సర్ మరణాల రేటు ఎక్కువగా ఉందని, ముందస్తుగా వ్యాధి ని గుర్తించడం ద్వారా నివారించవచ్చని పేర్కొన్నా రు. జిల్లా ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ వ హిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, అదనపు డీఎంహెచ్వో సాధన, వార్డు కౌన్సిలర్ శ్వేత, డీఐవో డాక్టర్ వైసీ శ్రీనివాస్, డీటీసీవో సుమలత, ఎన్సీడీ పీవో శ్రీధర్, ఎన్హెచ్ఎం డీపీవో జాదవ్ దేవిదాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం అభినందనీయం మహిళలు రక్తదానం చేయడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ ఆధ్వర్యంలో రిమ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో 16 మంది నర్సులు రక్తదానం చేశారు. వారిని కలెక్టర్తో పాటు ఎంపీ నగేశ్ అభినందించారు. -
ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి
నేరడిగొండ: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవాలని శ్రీ శివానంద భారతి స్వామిజీ అన్నారు. మండలంలోని తేజాపూర్లో ఆదివా రం నిర్వహించిన సాధు సమ్మేళనం, వేదాంత విజ్ఞాన మహాసభల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆధ్యాత్మిక జీవనం మనిషికి శాంతితో పాటు ఆనందాన్ని ఇస్తుందన్నారు. దేవునిపై విశ్వాసం పెంపొందించుకోవడంతో పాటు పరస్పరం సహకారం, స్నేహభావం కలిగి ఉండాలన్నారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం కూడా ఒక విధమైన భక్తి అని వివరించారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి సాధువులు, ఆధ్యాత్మిక గు రువులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. -
ఉదయం చలి.. మధ్యాహ్నం ఎండ
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో భిన్న వాతావరణంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి వరకు చలి తీవ్రత ఉండగా, ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజామున మాత్రం చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఎండ ప్రభా వంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా చాలామంది జలు బు, దగ్గుతో పాటు జ్వరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అప్పుడే మండుతున్న భానుడు.. మార్చి మొదటి వారంలోనే జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 16.2 నమోదు కాగా, గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మధ్యాహ్నం 12 దాటిందంటే బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిత్యం కిటకిటలాడే బస్టాండ్, రైల్వేస్టేషన్, తెలంగాణచౌక్, అంబేద్కర్, గాంధీచౌక్ ప్రాంతాల్లో రద్దీ కనిపించని పరిస్థితి. చిరు వ్యాపారులు, ఇతర కూలీ పనులు చేసేవారు ఎండ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బతో జాగ్రత్త.. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ఎండలో ఎక్కువగా తిరిగే వారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తప్పనిసరిగా ఎండలో బయటకు వెళ్లే వారు గొడుగు, ఇతర రక్షణ కవచాలు ధరించాలని సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీ ఫారన్హీట్ దాటితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె ధడ, చెమట ఎక్కువగా రావడం, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అలాగే శరీరంలో ప్రొటీన్ స్థాయి తగ్గిపోయి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయని పేర్కొంటున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
ఐక్య పోరాటాలతో సమస్యలు పరిష్కారం
ఆదిలాబాద్టౌన్: ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు జ్యోతి అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. మార్చి నెలను వేడుకగా కాకుండా పోరాట మా సంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మ హిళలు అన్నిరంగాల్లో రాణించాలని సూచించా రు. కార్యక్రమంలో మావల ఎంఈవో సరోజ, జీసీడీవో ప్రత్యూష, కవైత్రి శైలజ, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోతె శ్రీనివాస్, బి.వృకోధర్, రామేశ్వర్, జ్ఞానేశ్వర్, సాయికాంత్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి
● డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి ఆదిలాబాద్టౌన్: మహిళలు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగాల ని సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్.రాజ్యలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా జైలులో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా జడ్జి ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. మహిళలు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించా రు. జిల్లా జైలు సూపరింటెండెంట్ పి.గోపిరెడ్డి మాట్లాడుతూ మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థికంగా స్థిరపడాలన్నారు. జైలులో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు మహిళా సిబ్బందిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఖైదీలు, సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ రాథోడ్ ప్రకాశ్, జవాన్లు జావీద్, వేణుగోపాల్, సాయికిరణ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సమాఖ్యలకు భవనాలు
కై లాస్నగర్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఇబ్బందులు దూరం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలోనూ పక్కా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఉపాధి నిధులతో వీటిని నిర్మించనున్నారు. ఈ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతగా జిల్లాకు 398 మంజూరు చేయగా ఇందులో ఇప్పటివరకు 70 నిర్మాణాలకు అధికారులు భూమి పూజ చేశారు. ఈ నెలాఖరులోగా మిగతా చోట్ల స్థలాలు గుర్తించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇబ్బందులను దూరం చేసేలా.. స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాల మంజూరు, పొదుపు డబ్బులు చెల్లించడం, రుణాల కిస్తీలు చెల్లింపు కోసం సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం జిల్లా, మండల స్థాయిలో సమాఖ్యలకు భవనాలు ఉన్నాయి. గ్రామస్థాయిలో మాత్రం పక్కా భవనాలు లేక ఇబ్బందులు తప్పని సరిస్థితి. కొన్ని చోట్ల చెట్ల కింద, అంగన్వాడీ, సంఘం అధ్యక్షురాలి ఇంటి ఆవరణలో అవస్థల నడుమ నిర్వహించాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం వారి ఇక్కట్లను దూరం చేసేలా గ్రామస్థాయిలోనూ భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్) కింద ఒక్కో భవనాన్ని రూ.10 లక్షల వ్యయంతో 200 గజాల స్థలంలో నిర్మించనున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలోనూ స్థలాన్ని ఎంపిక చేసి భవన నిర్మాణానికి భూమి పూజ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ సమాఖ్య సభ్యులు తమ పరిధిలో ప్రభుత్వ సూచన మేరకు అనువైన స్థలాన్ని గుర్తించి తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మానాన్ని గ్రామసభ ఆమోదం కోసం పంచాయతీకి పంపించాలి. జీపీ ఆమోదం అనంతరం ఎంపీడీవోకు పంపుతారు. ఎంపీడీవో తహసీల్దార్ సంయుక్తంగా స్థలాన్ని పరిశీలించి ఎంపిక చేస్తే జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అనంతరం పంచాయతీరాజ్ అధికారులు నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో.. గ్రామీణ మండలాలు : 20 స్వయం సహాయక సంఘాలు : 10,990 గ్రామ సమాఖ్య సంఘాలు : 554 స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు : 1,48,052 స్థలాల గుర్తింపు ప్రకారం పనులు జిల్లాకు తొలి విడతగా 398 గ్రామ మహిళా స మాఖ్య భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఇప్పటివరకు అధికారులు స్థ లాల ను గుర్తించిన 78 భవనాల నిర్మాణాలకు మా ర్కౌట్ ఇచ్చాం. పనులు సాగుతున్నాయి. మిగతా చోట్ల కూడా స్థలాలను గుర్తించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం. – రాథోడ్ శివరాం, పంచాయతీరాజ్ ఈఈ -
జాగ్రత్తలు పాటించాలి
ప్రస్తుతం జిల్లాలో భిన్న వాతావరణం ఉంది. ఉదయం చలి.. మధ్యాహ్నం ఎండ కారణంగా దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని తాగడం మంచిది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. బయటకు వెళ్లే వారు ఎక్కువగా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి. – ఆడె విఠల్, రిమ్స్ వైద్యులు -
గ్యాస్ ధర పెంపుపై సీపీఎం ఆందోళన
ఆదిలాబాద్టౌన్: గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టా రు. జిల్లాకేంద్రంలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలి పారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ వద్ద రహదారి పై బైఠాయించి నినా దాలు చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లే శ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే గ్యాస్ ధర పెరుగుతుందని ఆరోపించారు. గృహ వినియోగ గ్యాస్పై రూ.60, కమర్షియల్ గ్యాస్పై రూ.115 పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బండి దత్తాత్రి, పూసం సచిన్, ఆర్.సురేందర్, ఆర్. మంజుల, ఆరిఫా, రాధా, గంగారాం, రాములు పాల్గొన్నారు. -
మూటలు పంపడమే తప్ప రైతు సంక్షేమమేది?
జైనథ్: సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న ఆసక్తి రైతులకిచ్చిన హామీలు అమలు చేయడంపై లేదని బీజేపీ శాసనసభపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకోని రేవంత్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుభరోసా నిధులు జమచేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అందుకోసం ఉంచిన రూ.9వేల కోట్లను నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని ఢిల్లీ నుంచి పిలుపురాగానే జమ చేయలేదన్నారు. రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన డబ్బులను కాంట్రాక్టర్ల ఖాతాల్లో వేసి వారి నుంచి కమీషన్లు తీసుకుని రాహుల్గాంధీ ద్వారా వెయ్యి కోట్లు ఢిల్లీకి పంపించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కౌలు రైతులను ఆదుకుంటామని, రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతుభరోసా జమ చేయకుండా కమీషన్లు, భూముల విక్రయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి అనేక హామీలను విస్మరించారన్నారు. 99 రోజుల ప్రజాపాలన పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్ని డబ్బులు కేటాయించరని సీఎంను ప్రశ్నించారు. అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారని, ఈ కార్యక్రమంలో పాల్గొనే దమ్ము అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉందా అని నిలదీశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు రూ.2,500 నగదు, వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ల పెంపు, అలాగే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యానికి కూడా డబ్బులు లేవన్నారు. మాజీ సర్పంచ్లు చేసిన పనులకు బిల్లులివ్వని దద్దమ్మ సీఎం అని మండిపడ్డారు. అసమర్థ పాలనపై రైతుల నుంచి సేకరించిన సంతకాలను సీఎంకు పంపుతామని తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ముఖ్యమంత్రి అర్థం చేసుకుని వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు కార్యక్రమాన్ని కొనసాగించి పది లక్షల సంతకాలు సేకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ గోడం నగేశ్, బీజేపీ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు బ్రహ్మానంద్, రిథిష్ రాథోడ్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జనంలోకి వెళ్లే ధైర్యం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేదు -
రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఆదిలాబాద్: కొల్లాపూర్ నుంచి ధన్బాద్ వెళ్తున్న దీక్షభూమి ఎక్స్ప్రెస్లో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే పోలీస్ ఇన్చార్జి టి.ప్రభాకర్ తెలిపారు. శనివారం అర్ధరాత్రి 12.15 గంటలకు రైలు ఆదిలాబాద్ స్టేషన్కు చేరుకోగా, అపస్మారక స్థితిలో ఉన్న సదరు వ్యక్తిని రైల్వే డాక్టర్ పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి వయస్సు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎరుపు రంగు ఫుల్హాండ్స్ రౌండ్ నెక్ టీషర్ట్, నీలిరంగు నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడని వివరించారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రిలో భద్రపర్చినట్లు వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసినవారు 9963313395 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఉరేసుకుని మహిళ ఆత్మహత్య తాంసి: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భీంపూర్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పూదరి నాగమ్మ (57) గృహిణి. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. శనివారం ఉదయం గమనించిన కుటుంబీకులు అందించిన సమాచారంతో ఎస్సై అక్కడికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


