breaking news
Adilabad
-
గోహత్య నివారణకు కఠిన చట్టం తేవాలి
ఆదిలాబాద్: గోహత్య మహాపాపమని, దీనిని అరికట్టేందుకు పార్లమెంట్లో కఠిన చట్టాన్ని తీసుకురావాలని ప్రముఖ సాద్వి కపిల గోపా ల సరస్వతి అన్నారు. సనాతన హిందూ ధర్మ వేదిక ఆధ్వర్యంలో స్థానిక రాణి సతిజీ మందిరంలో ఆదివారం నిర్వహించిన గోహత్య నివారణ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. సనాతన ధర్మంలో గోమాతకు అత్యంత విశిష్ట స్థానం ఉందన్నారు., హిందువులు ఆరాధ్యంగా పూజించే ఆవును కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. గోహత్య నివా రణ చట్టం కోసం గోఅభియాన్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలన్నారు. అలాగే రాజకీయ పార్టీలన్నీ విభేదాలు పక్కన పెట్టి, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వేదిక జిల్లా అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రనాథ్ యాదవ్, సభ్యులు సూర్యకాంత్, సంతోష్, వెంకన్న, రామకృష్ణ, విఠల్ తదితరులున్నారు. -
కూటమికా.. బీజేపీకా
కై లాస్నగర్: ఆదిలాబాద్ బల్దియా పీఠంపై ఏ పార్టీ జెండా ఎగరనుందనేది ఉత్కంఠగా మారింది. మెజార్టీ వార్డులు కై వసం చేసుకున్న బీజేపీ అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకుంటుందా లేక కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంతో కూడిన కూటమి హస్తగతం చేసుకుంటుందా అనేది నేడు తేలనుంది. మున్సి పల్ చైర్పర్సన్, వైస్చైర్మన్ల ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సమావేశం సోమవారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. పీఠం తమదేనని అటు బీజేపీ, ఇటు కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సంఖ్యాబలం వారిలో ఎవరికుంది, పదవి వరించేదెవరిని అనేది కాసేపట్లో తేలనుంది. కాషాయ జెండా ఎగురనుందా.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఆదిలాబాద్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓట్ల లెక్కింపునకు ముందే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ పార్టీలకు చెందిన గెలిచే అభ్యర్థులను ప్రత్యేక క్యాంపులకు తరలించాయి. విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేయడంతో పాటు చైర్పర్సన్ పీఠాన్ని సొంతం చేసుకుంటామని ప్రకటించాయి. అయితే ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. ఏ పార్టీకి స్పష్టమైన అధిక్యత రాలేదు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్కు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి మూడు ఓట్ల దూరంలో నిలిచింది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు పలు వార్డుల్లో విజయం సాధించినప్పటికీ సొంతంగా అధికారంలోకి వచ్చేంత ఆధిక్యత లభించలేదు. మరో ఐదు చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. దీంతో మెజార్టీ వార్డులను కై వసం చేసుకున్న బీజేపీయే మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తుందని అంతా భావించారు. ఆ పార్టీ నాయకులు సైతం ఆ దిశగానే అడుగులు వేశారు. అయితే రాజకీయంగా చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో చైర్పర్సన్ పీఠం ఆ పార్టీకి దక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. స్వతంత్రుల బలం తమకే ఉందని చెప్పుకుంటున్న ఆ పార్టీ ఆ దిశగా విజయం సాధిస్తుందా అనేది చూడాల్సిందే. ఆ పార్టీ నుంచే చైర్పర్సన్గా ఎన్నికై తే ఆ పదవి ఎవరికిస్తారనేది కూడా చర్చకు తావిస్తోంది. ప్రస్తుతం పార్టీల వారీగా బలాబలాలు బీజేపీ గెలిచిన కౌన్సిలర్లు : 21ఎక్స్ అఫిషియో సభ్యులు : 02(ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్) కూటమి సభ్యుల వివరాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఇండిపెండెంట్లు 11 06 06 05 -
నేడే ప్రమాణస్వీకారం
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక సమావేశం ఉంటుంది. నూతన కౌన్సిలర్లకు పార్టీల వారీగా, అలాగే ఎక్స్ అఫిషియో సభ్యులకు ప్రత్యేకంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. బల్దియా ప్రత్యేకాధికారి, అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంతు నాయక్ ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా ఆదివారం సాయంత్రం పరిశీలించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జి.రాజుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ప్రొటోకాల్ సమస్య తలెత్తకుండా ప్రక్రియ పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ సీవీఎన్.రాజు, మున్సిపల్ డీఈ కార్తీక్ తదితరులున్నారు. ప్రక్రియ సాగుతుందిలా.. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆదిలాబాద్టౌన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు కొనసాగనున్నాయి.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది.. విద్యార్థులు కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి.. మాస్కాపీయింగ్పై ఆధారపడవద్దు.. ఏవైనా ఇబ్బందులు ఉంటే డీఐఈవో కార్యాలయంలో సంప్రదించాలి.. హాల్టికెట్లను ఆన్లైన్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావచ్చని డీఐఈవో జాదవ్ గణేష్కుమార్ తెలిపారు. ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. సాక్షి: జిల్లాలో ఎన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు?డీఐఈవో: జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలను ఏర్పాటు చేశాం. వీటిలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, రెండు సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఐదు ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు, అలాగే మహాత్మాజ్యోతి బాపూలే గురుకులం, మోడల్ స్కూల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశాం. తొమ్మిది ప్రైవేట్ కళాశాలల్లో పరీక్షలు జరగనున్నాయి. సాక్షి: ఎంత మంది విద్యార్థులు హాజరు కానున్నారు?డీఐఈవో: ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 7,700 మంది, ఒకేషనల్ విద్యార్థులు 935 మంది పరీక్షలు రాయనున్నారు. ద్వితీ య సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 7,971 మంది, ఒకేషనల్ విద్యార్థులు 958, మొత్తం 8,929 మంది హాజరుకానున్నారు. సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపట్టారు..?డీఐఈవో: పరీక్షల నిర్వహణ కోసం 31 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 31 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 9 మంది అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు అవసరమైన ఇన్విజిలెటర్లను నియమించాం. ప్రశ్నపత్రాల స్టోరేజ్కు సంబంధించి 13 కేంద్రాలను ఏర్పాటు చేశాం. గుడిహత్నూర్, నేరడిగొండ, బోథ్, బజార్హత్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, తలమడుగు, తాంసి, బేల, జైనథ్ పోలీసుస్టేషన్లలో ఉంచడం జరుగుతుంది. సాక్షి: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు..?డీఐఈవో: విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గదుల్లో చీకటి లేకుండా లైట్ల ఏర్పాటుతో పాటు ఫ్యాన్లు, తాగునీరు, వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రతి కేంద్రంలో ఏఎన్ఎంను అందుబాటులో ఉంచుతున్నాం.సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు ఏమిటి?డీఐఈవో: విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. ఒత్తిడికి లోను కావొద్దు. మాస్కాపీయింగ్పై ఆధార పడకూడదు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం. ఏవైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ డెస్క్ 08732– 297115కు సమాచారం అందించాలి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షలు పూర్తయ్యేంత వరకు టీవీ, సోషల్ మీడియా, పెళ్లిలు, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను పరీక్షల కోసం సంసిద్ధులను చేయాలి.సాక్షి: మాస్ కాపీయింగ్ జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?డీఐఈవో: పరీక్షల్లో కాపీయింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే జిల్లా పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో డీఐఈవో కన్వీనర్గా, లెక్చరర్లు సభ్యులుగా ఉన్నారు. అలాగే రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశాం. ఈ బృందంలో జూనియర్ లెక్చరర్, డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్సై ఉంటారు. రెండు సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయగా, ఇందులో ఇద్దరు జూనియర్ లెక్చరర్లు ఉంటారు. ఐ పవర్ కమిటీలో కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరా లు ఇదివరకే ఏర్పాటు చేయడం జరిగింది. నిఘా నీడలో పరీక్షలు జరుగుతాయి. -
స.హ. చట్టంతో నిలదీసే అధికారం
ఆదిలాబాద్టౌన్: సమాచార హక్కు చట్టం ద్వా రా ప్రభుత్వ నిధుల వినియోగంపై పౌరులు నిలదీసే అధికారం ఉంటుందని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్, మాజీ జడ్జి ఎంఏ సలీమ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్క్లబ్లో ఆదివా రం విలేకరులతో మాట్లాడారు. తెల్లరేషన్ కార్డు కలిగిన వారు కేవలం రూ.10 స్టాంప్తో సమాచారం కోరవచ్చని అన్నారు. ఈ క్రమంలో జిరాక్స్ కాపీల కోసం రూ.2 నామినల్ ఫీజు ఉంటుందని తెలిపారు. సమాచారాన్ని జాప్యంపై రాష్ట్ర సమాచార కమిషన్ కఠినంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. స మాచారం ఇవ్వని అధికారులపై రోజుకు రూ. 250 చొప్పున గరిష్టంగా రూ.25వేల వరకు జరిమానా విధించే అధికారం కమిషన్కు ఉంటుందని తెలిపా రు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్ర కటించారు. గౌరవ అధ్యక్షుడిగా రాథోడ్ సుభా ష్ నాయక్, అధ్యక్షురాలుగా ఆర్.లక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్గా షేక్ ఫారుఖ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎం.మధుకర్, ఎన్.లక్ష్మి ఎన్నికై నట్లు తెలి పారు. ఆయన వెంట సయ్యద్ హైదర్ తదితరులున్నారు. -
షెడ్యూల్డు ప్రాంత హక్కులు కాపాడాలి
ఆదిలాబాద్టౌన్: ఆదివాసీలపై అటవీశాఖ జులుం పెరిగిందని, ఇళ్ల నిర్మాణం, వ్యవసాయం చేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్లో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కమిటీ సమావేశాలు కొనసాగుతున్నా యి. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి ఆ యన ఆదివారం పాల్గొని మాట్లాడారు. షెడ్యూ ల్డు ప్రాంత హక్కులను కాపాడాలని, అటవీ హ క్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఏజెన్సీ డీఎస్సీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు. ఆది వాసీలపై అటవీ శాఖ అధికారులు అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలి పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీడీఏలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
ఆలయ అభివృద్ధిపై పట్టింపేది ?
● ధూపదీప నైవేద్యాలకు అందని డబ్బులు ● ఇబ్బందుల్లో అర్చకులుచెన్నూర్రూరల్: చెన్నూర్ మండలంలోని సుద్దాల గ్రామంలోని ఎంతో చరిత్ర ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధిపై పట్టింపు లేకుండా పోతోంది. ఇక్కడ ధూప, దీప నైవేద్యాలకు డబ్బులు అందని పరిస్థితి. దీంతో అర్చకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయం లోపల వర్షపునీరు ఊరుస్తుంది. చర్యలు చేపట్టాల్సిన ఉన్న సంబంధిత శాఖల అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దాతలు ముందుకు రావాలని, దేవాదాయ, ధర్మాధాయశాఖ అధికారులు పట్టించుకుని ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. చరిత్ర ఇలా.. గ్రామానికి వచ్చిన ఒక ముని వాగుఒడ్డున చింతచెట్టు కింద సీతారాములు, లక్ష్మణుడు, అంజనేయస్వామి రాతి విగ్రహాలను బయటకు తీసినట్లు చరిత్ర చెబుతోంది. అక్కడ వాగు ఒడ్డున ఒక పందరి వేసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. పట్టణానికి చెందిన రామగుడు కిష్టయ్య అనే భక్తుడి కలలో శ్రీరాముడు కనిపించి తనకు ఆలయం నిర్మించాలని చెప్పగా, గ్రామస్తుల సహాయంతో డంగు సున్నంతో 1910లో మందిరం నిర్మింపజేశారు. సీతా, రామ, లక్ష్మణుడు, ఆంజనేయుల పంచలోహ విగ్రహాలు తెప్పించి ప్రతిష్ఠించారు. అప్పుడు ఆయన వెలిగించిన అఖండ దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. -
కొత్తవారికే పట్టం
చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు వి భిన్న తీర్పునిచ్చారు. మున్సిపాలిటీలో 19,903 ఓ టర్లకుగాను 15,095 ఓట్లు పోలు కాగా, 75.85 శా తం నమోదైంది. 90 శాతం పైగా ఓటర్లు కొత్తవారికే పట్టం కట్టారు. సమస్యలపై ప్రశ్నించే గొంతుకలు, సమర్థవంతుడు, వార్డు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వానికి ఓటర్లు మద్దతు పలికారు. అభ్యర్థుల ఎంపిక కీలకం..అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీల రెబల్స్ బెడద లేకుండా పార్టీని నమ్ముకున్న వారికే టికెట్లు ఇవ్వడంతో అధికార పార్టీకి మేలు జరిగింది. 18 వార్డులకు కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి 11 స్థానాలు ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ గెలిచిన 11 సీట్లలో కొత్తతరం గెలువడం గమనార్హం. ఇకపోతే బీఆర్ఎస్ 18, బీజేపీ 18 స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీ 2 చోట్ల గెలుపొందగా ఒకటి మాజీ కాగా, మరోచోట కొత్తగా పోటీ చేసిన వ్యక్తి విజయం సాధించారు. బీఆర్ఎస్ 4 స్థానాలు గెలుచుకోగా ఒక సీటు మాజీ కై వసం చేసుకోగా మూడు చోట్ల కొత్త వారికి చోటు దక్కింది. 1 వార్డు నుంచి మాజీ కౌన్సిలర్ భార్య మొదటి సారి పోటీ చేసి విజయం సాధించగా, 16 స్థానాలను కొత్తవారికే దక్కింది. రెండు సీట్లలో పాతవారికి అవకాశం దక్కింది. 18 వార్డుల్లో గెలిచిన 13 మంది కౌన్సిలర్లు 45 ఏళ్లలోపు కావడం విశేషం. ఈనెల 16న గెలిచినవారు మున్సిపాలిటీలో అడుగుపెట్టనున్నారు. -
రోడ్డు నిర్మాణం చేపట్టాలని ధర్నా
కాసిపేట: రోడ్డు నిర్మాణం చేపట్టాలని కాసిపేట గ్రామస్తులు శనివారం ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు అధ్వానంగా మారిందంటూ భారీ వాహనాలను అడ్డుకున్నారు. మందమర్రి వద్ద ఉన్న టోల్ప్లాజాను తప్పించుకునే క్రమంలో భారీ లోడ్తో ఓరియంట్ సిమెంట్ కంపెనీ, సింగరేణి వాహనాలు కాసిపేట నుంచి బైపాస్ గుండా వెళ్లడంతో ఆర్అండ్బీ రోడ్డు అధ్వానంగా మారిందన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో ఓపెన్కాస్ట్ మట్టిని రోడ్డుపై పోయడంతో దుమ్ముధూళి ఇళ్లలోకి వస్తోందన్నారు. ఆర్అండ్బీ, సింగరేణి అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అక్రమంగా చెట్లు నరికిన ఇద్దరు రిమాండ్ ఇంద్రవెల్లి: అక్రమంగా చెట్లు నరికిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎఫ్ఆర్వో సంతోష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇంద్రవెల్లి అటవీశాఖ దనోరా(బి) సెక్షన్ పరిధి కొయల్పాండ్రి సమీపంలో శుక్రవారం సాయంత్రం డొంగర్గాం గ్రామానికి చెందిన రాథోడ్ ప్రవీణ్, చవాన్ మున్నలు అక్రమంగా చెట్లను నరికివేస్తూ పట్టుబడ్డారు. కొయల్పాండ్రి బీట్లో కంపార్ట్మెంట్ నెంబర్ 387లో మొత్తం 117 చెట్లను అక్రమంగా నరికినట్లు నిర్ధారించి అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. శనివారం ఉట్నూర్ జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ మౌనిక ఎదుట హాజరపర్చగా రిమాండ్ చేసినట్లు తెలిపారు. డిప్యూటీ ఆర్వో నరేష్,ఎఫ్బివో జంగు పాల్గొన్నారు. -
ముగ్గురు దొంగలు పట్టివేత
ఖానాపూర్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లోని పెంబి స్టాఫ్ వద్ద ముగ్గురు మహిళ దొంగలను కండక్టర్, ప్రయాణికులు శనివారం పట్టుకున్నారు. బస్లో ఉన్న పెంబి గ్రామానికి చెందిన పర్వతాల నీల వద్ద రూ.3700, ఎడ్ల నర్సవ్వ వద్ద రూ.2650, మరో మహిళ వద్ద రూ. వెయ్యి, బ్యాగులు, కవర్ కట్చేసి చోరీకి పాల్పడ్డారు. తమ బ్యాగుల్లో డబ్బులు లేవని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, చోరీకి పాల్పడిన ముగ్గురు మహిళలను కండక్టర్, ఇతర ప్రయాణికులు పట్టుకున్నారు. మరో మహిళ పరారీ అయ్యారు. చోరీ చేసిన మహారాష్ట్రకు చెందిన శ్రీవాణి, విజేత, రాణికి దేహశుద్ధి చేసి ఆర్టీసీ కంట్రోల్ రూంలో ఉంచి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని దొంగలను వాహనంలో పోలీస్స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. కాగా, బస్టాండ్లో కొన్నినెలలుగా వరుసచోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈనెల 11న బస్టాండ్లో ఆదిలాబాద్కు చెందిన స్వామి విలువైన సెల్ఫోన్ చోరీకి గురైంది. చెరువులో పడి ఒకరి మృతి ఆదిలాబాద్రూరల్: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతిచెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని తంతోలి గ్రామానికి చెందిన చింతల్వార్ శ్రీరాం (25) శుక్రవారం బహిర్భూమికని చెరువు వైపు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆచూకీ కోసం గాలించారు. చెరువు వద్ద బైక్ ఉండడంతో గమనించి చెరువులో చూడగా మృతదేహం లభ్యమైంది. తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాపర్ వైర్ చోరీ బాసర: మండలంలోని టాక్లి, కిర్గుల్(బి) గ్రామ పరిధిలోని పంట చేల నుంచి గుర్తుతెలియని దుండగులు శనివారం ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీ చేశారు. బాసర ఏఈ సి నాయక్, రైతులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు టైర్లో పొగలు లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బస్సు టైర్లో పొగలు వచ్చాయి. శనివారం మధ్యాహ్నం మంచిర్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. టైర్ లైనర్లు పట్టుకోవడంతో పొగలు వచ్చాయని, వెంటనే ప్రయాణికులకు దింపి వేరే బస్సులో పంపించినట్లు డ్రైవర్ తెలిపారు. బస్టాండ్ వద్ద బస్సును నిలిపివేశారు. -
ఉత్తరవాహినిలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు
ఖానాపూర్: మహాశివరాత్రి సందర్భంగా పట్టణ సమీపంలో ఉత్తరవాహినిగా ప్రవహించే గోదావరి నది వద్ద పవిత్ర స్నానాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో షవర్లు ఏర్పాటు చేశారు. పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఇందుకోసం ముందు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ ఎస్కెప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 500 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున పరిసరప్రాంత ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భక్తులకు తప్పని ఇక్కట్లు ఖానాపూర్లోని ఉత్తరవాహిని గౌతమి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆదివారం శివరాత్రి పర్వదినం సందర్బంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తారు. మున్సిపల్ అధికారులు కనీసం కాలినడకన వెళ్లే మార్గంలో మరమ్మతు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు, పలుమార్లు బండరాళ్ల మధ్యలో పడి గాయాలైన సందర్భాలు ఉన్నాయి. -
0,1,2,3,4,5,6,7,8,9,10
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో పోటీచేసిన పలువురు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇవి. పట్టణంలోని 49 వార్డుల పరిధిలో స్వతంత్రులు ఏఐఎఫ్బీ తరపున పోటీ చేసిన పలువురు అభ్యర్థులకు పది లోపు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఐదుగురు స్వతంత్రులుగా విజయం సాధించినప్పటికి మెజార్టీ వార్డులో వారి ప్రభావం నామమాత్రమే. కనీస ఓట్లను రాబట్టుకోవడంలో విఫలమయ్యారు. సున్నా, ఒకటి, రెండు, 3 ఇలా పదిలోపు ఓట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. 38వ వార్డు నుంచి పోటీ చేసిన నస్రీన్ సుల్తానకు ఒక్క ఓటు రాలేదు. ఆమె తన ఓటు వేసుకోనట్లుగా తెలుస్తోంది. 9వ వార్డు నుంచి పోటీ చేసిన శీల చౌహాన్కు ఒకే ఒక్క ఓటు పోలైంది. అది కూడా తన ఓటు వేసుకుంది. 1వ వార్డులో వాగ్మారే శాంభవికి, 9వ వార్డులో సురేఖ రహతేకు 2 ఓట్ల చొప్పున మాత్రమే వచ్చాయి. 4వ వార్డులో ఏఐఎఫ్బీ అభ్యర్థి సయ్యద్ ఖుర్షీద్కు 16వ వార్డులో రుఖియా బేగం, 26వ వార్డులో అమ్రీన్ బేగంకు 3 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 8వ వార్డులో దులే ఉజ్వల, 21వ వార్డులో జబీనా షేక్కు 4 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2వ వార్డులో షేక్ మహమూద్కు, 5వ వార్డులో దార్శ రుక్మాకు 5 ఓట్ల చొప్పున రాగా 17వ వార్డులో భవిత పవల్కర్కు 6, 40వ వార్డులో నవనందుల నర్సయ్యకు ఆరు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 22వ వార్డులో అబ్దుల్ ఇమ్రాన్కు 7, 23వ వార్డులో ఏఐఎఫ్బీ అభ్యర్థి అబ్దుల్ ఖయ్యూం రజాకు ఏడు ఓట్లు పోలయ్యాయి. 18వ వార్డులో జీవ్నే రవీందర్, 42వ వార్డులో తుర్పటి పద్మకు 8 ఓట్లు మాత్రమే వచ్చాయి. 24వ వార్డులో అశోక్ దీకుండ్వార్, 29వ వార్డులో సఫియా బేగంకు 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. 25వ వార్డులో పనకంటి వర్షాజోషి, 42వ వార్డులో ముత్యాల రాధకు పది ఓట్ల చొప్పున పోలయ్యాయి. 39వ వార్డులో లాంటిలే వర్షకు 11 ఓట్లు వచ్చాయి. -
సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కాసిపేట: జిల్లాకేంద్రంలో రసవత్తరంగా సాగుతున్న సీఎం కప్–2026 జిల్లా స్థాయి పోటీల్లో కాసిపేట మండలం నుంచి ముగ్గురు క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు మండల ఇన్చార్జి పీడీ భుక్య రాజన్న తెలిపారు. శనివారం నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో మండల జట్టు తరఫున సోమగూడంకు చెందిన భుక్య సాయితేజ, బుగ్గగూడంకు చెందిన రాజేష్, పల్లె రఘువరన్ ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 20 నుంచి 23 వరకు నిర్వహించే రాష్టస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఎంఈవో వెంకటేశ్వరస్వామి, కాసిపేట కాంప్లెక్స్ హెచ్ఎం మామిడిపల్లి సాంబమూర్తి, పలువురు సర్పంచులు, నాయకులు వారిని అభినందించారు. -
ఆలయంలో చోరీ
సారంగపూర్: మండలంలోని వంజర్ గ్రామంలోని మహాలక్ష్మీ దేవాలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగులగొట్టి చొరబడి అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆలయం తెరిచి ఉండడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా, బంగారం పుస్తెలు, ముక్కుపుడుక, వెండి హారం, వడ్డాణం, భక్తులు అమ్మవారికి సమర్పించిన వెండి కళ్లు, తదితర వాటిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. గర్భగుడిలో ఉన్న బీరువా పగులగొట్టి అందులో వెండి వస్తువులతో కలిపి సుమారు రూ.2 లక్షల విలువ గల ఆభరణాలను చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీకాంత్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్టీమ్ను రప్పించి వివరాలు సేకరించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరా సరిగా పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించడం పోలీసులకు సవాలుగానే మారింది. ఘటన స్థలంలో లభించిన దుండగుల వేలిముద్రలు, వారు వదిలివెళ్లిన వస్తువులను సేకరించి వాటి ఆధారంతో కేసు దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు. -
ఎక్స్అఫీషియోనే కింగ్మేకర్!
నిర్మల్ఖిల్లా: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈనెల 16న చైర్మన్, మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో ఓటు కీలకంగా మారనుంది. పార్టీల సభ్యుల సంఖ్య సమానంగా ఉన్న సందర్భాల్లో వీరి ఓట్లు ఫలితాన్ని తేలుస్తాయి. ఈనేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓటు అంటే, ఎవరు వేయగలరు? దాని ప్రాధాన్యంపై తెలుసుకుందాం.ఓటు హక్కు–కౌన్సిలర్లతో సమానంమున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లేదా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎక్స్అఫీషియో సభ్యులకు వార్డు కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లతో సమాన ఓటు హక్కు ఉంటుంది. ఎన్నిక నిర్వహణకు అవసరమైన కోరం లెక్కింపులో వీరిని పరిగణనలోకి తీసుకుంటారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పష్టమైన మెజార్టీ రాని సందర్భంలో వీరు కీలకంగా మారుతారు. స్థానిక ఎమ్మెల్యే లేదా ఎంపీ వేసే ఓటు ఏ పార్టీకి అనుకూలిస్తే, ఆ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఓటు హక్కుపై రాతపూర్వకంగా తెలపాలిఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మంచిర్యాల కార్పొరేషన్తోపాటు మొత్తం 11 బల్దియాలకు ఎ న్నికలు జరగగా, కొన్నిచోట్ల స్పష్టమైన మెజార్టీ మార్కును చేరువ కాగా, మరికొన్నిచోట్ల స్వతంత్రుల పాత్ర కీలకంగా మారింది. ఇలాంటి చోట్ల ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుంది. తమ పరిధిలో ఒకటికంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఉంటే ఎక్కడ తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారో ముందుగా ఎన్నికల సంఘానికి రా తపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. భైంసా, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులపాత్రపై ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఏం జరుగుతుందో సోమవారం నాటికి తేటతెల్లమవుతుంది. సభ్యులు ఎవరంటే.. తెలంగాణ మున్సిపల్ చట్టం–2019 ప్రకారం, మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో ఓటరుగా నమోదైన ప్రజాప్రతినిధులను ఎక్స్అఫీషియో సభ్యులుగా పరిగణిస్తారు. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే తాజాగా ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుంది. పోటీ హక్కు లేదు..ప్రభావం మాత్రం ఎక్స్అఫీషియో సభ్యులు స్వయంగా చైర్మన్ లేదా మేయర్ పదవికి పోటీ చేయలేరు. అయితే ఎన్నికల్లో ఓటేయడం ద్వారా పరోక్షంగా పాలన దిశను నిర్ణయించే శక్తి వారికి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం వచ్చినా వారి ఓటు కీలకంగా మారుతుంది. జిలాల్లో మున్సిపల్ రాజకీయాల్లో చైర్మన్ ఎన్నిక సమీపిస్తున్న కొద్ది పార్టీల మధ్య సమీకరణాలపై చర్చలు వేగం పుంజుకుంటున్నాయి. కౌన్సిలర్ల సంఖ్యతోపాటు వీరి మద్దతు ఎటు ఉంటుందన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. స్పష్టమైన మెజార్టీ లేని పరిస్థితుల్లో వీరి ఓటు ‘కింగ్మేకర్’పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అరణ్యంలో కై లాసగిరి
బోథ్ మండలంలోని నిగిని అటవీ ప్రాంతం శివభక్తులకు పుణ్యక్షేత్రంగా మారింది. దండకారణ్యంలో ప్రకృతి ఒడిన సాక్షాత్తు కై లాసాన్ని తలపించేలా ఆ పరమశివుడు కొలువుదీరిన క్షేత్రమే శ్రీశిఖర్ కై లాస్ టేకిడి నర్మదేశ్వర ఆలయం. నేడు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తరలిరానున్నారు. ప్రత్యేక పూజలతో ముక్కంటిని కొలిచి మొక్కులు తీర్చుకోనున్నారు. – బోథ్వందల మీటర్ల ఎత్తులో వెలసిన ఈ ఆలయం కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు.. ఇది ఒక భక్తుడి అచంచల విశ్వాసానికి, త్యాగానికి ప్రతీక. శివుని సాక్షాత్కారంతో నిర్మించబడిన అద్భుతమైన దివ్య శక్తి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. మహారాష్ట్ర సరిహద్దులోని దయాల్ ధన్నూర్కి చెందిన లింబాజీ మహరాజ్కు త్రినేత్రుడు కలలోకి వచ్చి, శివలింగం ఆకారంలో ఉన్న ఈ గుట్టపై తనకు ఆలయం నిర్మించి నిత్య పూజలు చేయమని ఆజ్ఞాపించాడట. ఈశ్వరుని పిలుపుతో లింబాజీ పులకించినా రాతి గుడి కట్టేంత స్థోమత ఆయనకు లేదు. తన కలను అందరితో పంచుకున్నా లోకం పట్టించుకోలేదు. ఈ క్రమంలో శివుడి ఆజ్ఞను శిరసావహించిన ఆయన 2002లో సొంతూరును వదిలాడు. కొంతమందితో కలిసి మండలంలోని నిగిని ప్రాంతంలో గల దండకారణ్యంలో గుట్టపైకి దాదాపు 20 కిలోమీటర్ల మేర నడుస్తూ వెళ్లాడు. కలలో వచ్చినట్లుగా కొండపై లింగాకారంలో ఉన్న ఓ సహజ రాతిని చేతబూనాడు. వెంటనే దానికి పూజలు చేయడం ప్రారంభించాడు. అక్కడే ఓ గుడిసె వేసుకుని శివస్మరణలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో స్థానిక గిరిజనులు, భక్తులు గుట్టపైకి పోటెత్తారు. ఆ విశ్వాసమే లింబాజీకి మరింత బలాన్ని ఇచ్చింది. వారి సాయంతో 2009లో రాతి గుడి నిర్మాణానికి శ్రీకా రం చుట్టారు. పదేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. గర్భగుడిలో సాక్షాత్తు నర్మదా నది నుంచి తెచ్చిన పవిత్ర శివలింగంను 2016లో ప్రతిష్టించారు. కోరికతో స్వామిని దర్శించుకుంటే తప్పక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడికి చేరుకోవాలంటే నిగిని గ్రామం వరకు వాహనాల్లో ప్రయాణించవచ్చు. అక్కడి నుంచి మాత్రం సుమారు ఆరు కిలోమీటర్లు కాలినడకన గుట్టపైకి వెళ్లాల్సి ఉంటుంది.శివరాత్రికి తరలిరానున్న భక్తులు.. శివరాత్రికి ఒకరోజు ముందు నుంచే ఇక్కడికి భక్తులు తరలివస్తుంటారు. ఇప్పటికే ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కలలోకి వచ్చి.. కై లాస శిఖరంపై చేరిన శివుడు -
నిందితులు కోర్టుకు హాజరయ్యేలా పర్యవేక్షించాలి
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో నమోదైన ప్రతీ కేసులో నిందితులు కోర్టుకు హాజరయ్యేలా సమన్లు జారీ చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో జి ల్లాలోని ఆయా పోలీస్స్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులు, డీఎస్పీలు, సీఐలతో శనివారం సమీక్ష నిర్వహించారు. రౌడీషీటర్స్, అనుమానస్పద రౌడిషీటర్స్పై నమోదైన కేసుల స్థితిగతులపై సమీక్షించారు. కోర్టుకు హాజరు కాని వారి పై ఎన్బిడబ్ల్యూలను తీసుకొని తగు చర్యలు చేపట్టాలన్నారు. కోర్టుల్లో నేరస్తులకు శిక్షలు ప డుతున్న సందర్భంలో సమాజంసన్మార్గం వైపు పయనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో అదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, శిక్షణ ఐపీఎస్ రాహుల్కాంత్, సీఐలు, ఎస్సైలు, కోర్టు డ్యూటీ అధికారులు, లైజన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బలాబలాలు..
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం బీజేపీకి దక్కవద్దు.. ఏమైనా చేయండి ఇది కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఆ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలు.. దీంతో రంగంలోకి దిగిన ‘హస్తం’ నేతలు ముందుగా స్వతంత్ర కౌన్సిలర్లతో చర్చలు జరిపా రు.ఆ తర్వాత బీఆర్ఎస్ను సంప్రదించారు. 45వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికై న, స్వతంత్ర అభ్యర్థిని బండారి అనూషను చైర్పర్సన్గా ఎన్నుకుందా మనే ప్రతిపాద న ఆయా పార్టీల మధ్య కొనసాగింది. దీనిపై అంగీకా రం కుదిరినట్లు ఆ ము ఖ్యనేతలు స్పష్టం చేస్తున్నారు. పార్టీ టికెట్ను ఆశించి భంగపడ్డ బండారి సతీశ్ తన సతీమణి అనూషను మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలోకి దించారని, ఒక విధంగా వారు కాంగ్రెస్ పార్టీకే చెందిన వారంటూ, ఈ లెక్కన పీఠం కాంగ్రెస్కే దక్కినట్లుగా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నా రు. ఇక క్షేత్రస్థాయిలో శుక్రవారం రాత్రి నుంచి శని వారం ఉదయం వరకు కార్యాచరణ కొనసాగింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు వేర్వేరుగా క్యాంపులో ఉండగా,తాజాగా ఎంఐఎం నలు గురు స్వతంత్ర అభ్యర్థులను కూడా శిబి రానికి తరలించారు. బీజేపీకి పీఠం దక్కకుండా చేయగలుగుతున్నామనే ధీమా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత రాజకీయంగా ఆసక్తికరమైన పరిణమాలు చోటు చేసుకుంటున్నారు. 49 వార్డులు ఉన్న ఆదిలాబాద్లో అత్యధికంగా 21 వార్డులను కై వసం చేసుకున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్కు స్వల్ప దూరమైనప్పటికీ ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో ఓట్లు, స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో పాలకవర్గం ఏర్పాటు చేస్తామని బీజేపీ గట్టి నమ్మకంతో ఉంది. బీజేపీ తర్వాత అత్యధిక వార్డులు సాధించిన కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్లను కలుపుకున్న మ్యాజిక్ ఫిగర్కు అందనంత దూరంలో ఉన్నప్పటికీ శుక్రవారం రాత్రి ‘హస్తం’ పార్టీ ముఖ్యనేతలు పీఠం తమ చేతి నుంచి చేజారలేదని, స్వతంత్ర అభ్యర్థులు తమ వద్ద ఉన్నారని చెప్పిన విషయం విదితమే. దీంతో స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతు లేకుండా బీజేపీ ఎలా పాలకవర్గం ఏర్పాటు చేస్తుంది.. ఇంకా ఏమైనా ఎక్స్ అఫీషియో ఓట్లు కలుపుకోవడం ద్వారా ముందుకు వెలుతుందా.. ఇలా రకరకాల చర్చలు సాగుతూ వచ్చాయి. ఎన్నికల కమిషన్ నుంచి ఓ నిర్ణయం వెలువడటం, ఎంపీ, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని ఏదైనా మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియోలుగా ఓటు వేయవచ్చని, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అదే జిల్లాలోని మున్సిపల్ పరిధిలో ఓటరై ఉండాలని, అలాంటప్పుడే ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో మరో రెండు ఎమ్మెల్సీ ఓట్లు ఏమైనా బీజేపీకి కలిసి రావచ్చని అనుకున్నప్పటికీ అ అవకాశం లేకుండా పోయింది. కూటమి ఏర్పాటు ..బీజేపీ ఎక్స్ అఫీషియో ఓట్ల విషయంలో ధీమాగా ముందుకు వెళ్తుండగా, మరో పక్క కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కూటమిగా ఏర్పడి స్వతంత్ర కౌన్సిలర్లతో చర్చించారు. బండారి అనూషను చైర్పర్సన్గా చేస్తామనే ప్రతిపాదనను స్వతంత్ర కౌన్సిలర్లతో సంప్రదింపులు జరిపినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనికి వారు ఆమోదం తెలిపినప్పటికీ ఓ స్వతంత్ర కౌన్సిలర్ తనకు వైస్ చైర్మన్ పదవీ ఇవ్వాలని కోరినట్లుగా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ విషయంలో కూటమి ఒప్పుకోకపోవడంతో ఆ స్వతంత్ర కౌన్సిలర్ ఎలాంటి నిర్ణయం చెప్పకుండా వెళ్లిపోయినట్లుగా ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉండగానే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్ స్వతంత్ర కౌన్సిలర్ను ఆయన ఇంట్లో కలిసి అతడితో పాటు ఆయన అనుచరగణంతో శనివారం చర్చలు చేశారు. ఆ స్వతంత్ర కౌన్సిలర్కు వైస్ చైర్మన్ పదవి ఇస్తామని, పార్టీ కండువా కూడా కప్పుకోనవసరం లేదని ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒకే చెప్పారని ఇటువైపుగా ప్రచారం సాగుతుంది.వైస్చైర్మన్ ఎవరికో..?కూటమి పీఠం కై వసం చేసుకుంటే చైర్పర్సన్గా అనూషను వారు ప్రతిపాదిస్తుండగా, వైస్ చైర్మన్ విషయంలో ఇంకా తకరారు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు బండారి సతీష్ తమ పార్టీకే చెందిన వారు కావడంతో ఇక చైర్పర్సన్ పదవీ కాంగ్రెస్కే దక్కినట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. వైస్ చైర్మన్ కోసం బీఆర్ఎస్, ఎంఐఎంలు డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదని చెప్పుకుంటున్నారు. చైర్పర్సన్ ఎన్నికతో పాటు వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.బీజేపీకి ఎక్స్ అఫీషియో ఓట్లతో కలుపుకుని 23 బలం ఉండగా, ఒక వేళ ఓ స్వతంత్ర కౌన్సిలర్ మద్దతునిచ్చిన పక్షంలో 24కు చేరుకుంటుంది. ఇది మ్యాజిక్ ఫిగర్కు ఇంకా 2 ఓట్ల దూరంలో నిలుస్తుంది. అయితే పీఠం ఎలాగైనా దక్కించుకుంటామని బీజేపీ స్పష్టం చేస్తోంది. మరో పక్క కాంగ్రెస్కు 11, బీఆర్ఎస్కు 6, ఎంఐఎంకు 6 కలుపుకుంటే 23కు చేరుకుంటుంది. ఇప్పటికే నలుగురు స్వతంత్ర అభ్యర్థులను కూడా శిబిరానికి తరలించామని చెబుతుండటంతో వారి సంఖ్య 27కు చేరుతుంది. ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే ఒకటి ఎక్కువే. -
నిరంతర సాధనతోనే విజయం
ఆదిలాబాద్: నిరంతర ప్రయత్నంతోనే విజ యం సాధ్యమవుతుందని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి (డీఎల్ఎస్ఏ) రాజ్యలక్ష్మి అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన సీఎం కప్ జిల్లాస్థాయి ముగింపు వేడుకలకు ఆ మె హాజరై మాట్లాడారు. జిల్లా స్థాయిలో ప్ర తిభ కనబరిచిన వారు రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. చివరి రోజు వాలీ బాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, యోగా, స్వి మ్మింగ్, ఆత్యా పాత్యా, వెయిట్ లిఫ్టింగ్, టేబు ల్ టెన్నిస్, హాకీ, ఆర్చరీ, వుషూ, తైక్వాండో, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, అన్ని రకాల పారా స్పోర్ట్స్ నిర్వహించినట్లు డీవైఎస్వో శ్రీనివాస్ వివరించారు. కార్యక్రమంలో డీటీఎస్వో పార్థసారథి, పీడీ హరిచరణ్, స్విమ్మింగ్ కోచ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నోట్లు పడ్డయ్.. ఎక్కడ తగ్గినయ్!
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. విజేతలు సంబరాల్లో మునిగితేలుతుండగా ఓటమి చవిచూసిన వారు అంతర్మథనంలో పడ్డారు. పరాజయానికి కారణాలపై తమ అనుచరులతో విశ్లేషిస్తున్నారు. ఓట్లు ఎక్కడ తగ్గినయ్.. ఎక్కడ పడ్డయ్ అంటూ లెక్కలేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ప్రచారం నిర్వహించి ఓటర్లను మచ్చిక చేసుకున్నప్పటికీ తమను ఆదరించకపోవడానికి కారణమేంటనే ఆలోచనలో పడ్డారు. మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా ప్రధాన పార్టీలేవీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకలేదు. మరోవైపు ఓటమి పాలైన అభ్యర్థులు అసలు ఎలా ఓడాం..ఎక్కడ వెనుకబడ్డామనే దానిపై ఎవరికి వారు బేరీజు వేసుకుంటున్నారు. ఏమాత్రం వెనకాడకున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీలతో పాటు ఏఐఎఫ్బీ, బీఎస్పీ, డీఎస్పీ, జనసేన వంటి పార్టీలు, స్వతంత్రులు సైతం పెద్ద ఎత్తున పోటీ చేశారు. నామినేషన్కు ముందు నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మందు, విందులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గల్లీల్లో యువకులను ఆకర్షించేలా ప్రత్యేక తాయిలాలు అందజేశారు. అలాగే వారం పాటు సాగిన ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ తమను ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. వారి అనుగ్రహం కోసం ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. మందుతో పాటు డబ్బులు సైతం భారీగా పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రతీ ఓటును కీలకంగా భావించిన అభ్యర్థులు పలు వార్డుల్లో ఓటుకు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశంతో లక్షలు గుమ్మరించారు. పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు సైతం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనుసరించే పద్దతుల్లో రాజీ పడలేదు. కొన్ని వార్డుల్లో గెలుపును సవాలుగా తీసుకుని బరిలోకి దిగిన అభ్యర్థులు సుమారు రూ.40లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు చేసినట్లుగా చర్చ సాగుతోంది. ఇంత చేసినా పలువురు అభ్యర్థులు ఒడిపోవడంతో ఓటమికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. సంబరాల్లో విజేతలు ..పరాజితులు నైరాశ్యంతో ఓటమికి గల కారణాలను విశ్లేస్తుండగా , గెలిచిన వారు సంబరాల్లో మునిగి తెలుతున్నారు. కోడ్ కారణంగా అట్టహాసంగా ర్యాలీలు చేపట్టేందుకు అవకాశం లేదు. దీంతో ఆయా కాలనీల్లో కాలినడకన తిరుగుతూ ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నారు. మిఠాయిలు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.వచ్చిన ఓట్లెన్ని...వార్డులోని మొత్తం ఓటర్లను పరిగణలోకి తీసుకుని బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగారు. మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమాతో ప్రచారాన్ని హోరెత్తించారు. తీరా ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. పోలైన ఓట్లపై లెక్కలు వేస్తున్నారు. ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు, తమకు వచ్చినవి పరిశీలిస్తూ విజయానికి అవసరమైన ఓట్లను పొందడంలో ఎక్కడా విఫలమయ్యామని క్యాడర్, సన్నిహితులతో చర్చిస్తున్నారు.ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశాం.. ప్రతీ ఓటరును కలిసి మద్దుతు కోరాం.. వారడిగినంత ముట్టజెప్పాం.. కోరిన హామీలన్నీ నెరవేరుస్తామని కూడా చెప్పినమ్.. అయినా ఎందుకు ఓడిపోయామంటూ వీధుల వారీగా ఉన్న ఓట్ల లెక్కలు తీస్తున్నారు. ఏ వీధిలో పడలేదు.. అనుకూలంగా ఎవరు ఓట్లు వేశారు.. వ్యతిరేకంగా ఎవరు పనిచేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని ఏ వార్డులో చూసినా ఇదే చర్చ సాగుతోంది. -
అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత
ఆదిలాబాద్టౌన్: అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఆదిలాబాద్ ఎఫ్ఆర్వో గులాబ్సింగ్ తెలిపారు. రెండు రోజుల క్రితం కలపను తరలిస్తున్న ఇచ్చోడకు చెందిన నిందితుడు అబ్బు, ఘోట్కురికి చెందిన వామన్ను పట్టుకుని విచారించగా, ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లికి కలప తరలించినట్లు పేర్కొన్నారు. దీంతో శుక్రవారం తిర్పెల్లిలో అధికారులు, ఉద్యోగులతో సోదాలు నిర్వహించగా, అల్లాబక్ష్ ఇంట్లో 23 టేకు సైజులు లభించినట్లు తెలిపారు. వీటి విలువ రూ.38వేలు ఉంటుందని పేర్కొన్నారు. దాడుల్లో ఎఫ్ఎస్వో రాథోడ్ గులాబ్, సిబ్బంది కృష్ణనాయక్, శరత్, అర్జున్ ఉన్నారు. -
ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ బాల, బాలికల వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలు శుక్రవారం మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు హాజరు కాగా విశేష ప్రతిభ కనబరిచిన వారిని జట్లకు ఎంపిక చేశారు. ఎంపికై న జట్లు ఈ నెల 16నుంచి 19వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యూత్ బాల, బాలికల వాలీబాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. జట్ల ఎంపికలో డీవైఎస్వో హన్మంతరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బైరగోని సిద్ధయ్యగౌడ్, కోశాధికారి గాజుల శ్రీనివాస్, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి యాకూబ్, పీడీలు రామ్మెహన్రావు, గోపాల్, సుదర్శన్, రాజయ్య, పీఈటీలు రాజా, విఠల్, సత్యనారాయణ వరలక్ష్మి, రెఫరీలు ప్రేమ్కుమార్, రమేశ్, మనోహర్ పాల్గొన్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న రైల్వే అధికారులు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని శుక్రవారం రైల్వే భద్రత కమిషనర్ మాధవి, రణధీర్రెడ్డి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దర్శించుకున్నారు. వీరిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట సిబ్బంది ఉన్నారు. బాసర సరస్వతీ అమ్మవారికి రూ.68.35లక్షల ఆదాయంబాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారికి 51రో జులు ఆలయ హుండీల ద్వారా రూ.68లక్షల 35వే ల 880 నగదు, 71 గ్రాముల మిశ్రమ బంగారం, కి లోన్నర మిశ్రమ వెండి, 30 విదేశీ కరెన్సీ నోట్లు వ చ్చినట్లు ఆలయ ఈవో అంజనీదేవి, శ్రీనివాస్, శివరాజ్, సిబ్బంది తెలిపారు. టీజీబీ, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు, వాగ్దేవి సొసైటీ సభ్యులు, లలిత సే వా ట్రస్టు సభ్యులు, కోరుట్ల భక్తులు పాల్గొన్నారు. -
జూనియర్–సీనియర్
జిల్లాకేంద్రానికి చెందిన చిన్నపిల్లల వైద్యులు గేయన్మయి నాగరంజని, కావేటి శ్రీకాంత్లది ప్రేమవివాహం. వీరిద్దరూ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ విభాగంలో పీజీ చదువుతుండగా కలిశారు. శ్రీకాంత్ సీనియర్ కాగా, నాగరంజని ఆయనకు జూనియర్. అప్పట్లో వీరిద్దరికీ ఒకే వార్డులో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడే ఒకరి వివరాలు ఒకరికి తెలిశాయి. వారి విభాగం వారంతా ఒకసారి కోల్కతా కాన్ఫరెన్స్కి వెళ్లారు. అక్కడే ఒకరిపై మరొకరికి ఉన్న ఇష్టం బయటపడింది. చదువులు కూడా పూర్తికాగానే ఇద్దరూ ధైర్యం చేసి ఇంట్లోవాళ్లకి చెప్పారు. మొదట్లో నాగరంజని వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. చాలారోజులు వేచిచూసి పెద్దలను ఒప్పించేదాకా ఓపికతో ఉండి చివరకు విజయం సాధించారు. అలా 2014 డిసెంబర్ 7న మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపాలుగా ఒక పాప, బాబు ఉన్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోవాలని, ప్రేమను పొందాలంటే ఓర్పు ఉండాలని వీరు సూచిస్తున్నారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురిపై కేసు
ఇంద్రవెల్లి: గంజాయి తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఉట్నూర్ సీఐ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మర్కగూడ గ్రామపంచాయతీ పరిధిలోని నవగూడ గ్రామానికి చెందిన కొడప రమేశ్ అలియాస్ కొడప గంగు, కుంర గంగారాం, మర్కగూడ కొలాంగూడకు చెందిన కుంర కృష్ణ కలిసి నవగూడ నుంచి ద్విచక్ర వాహనంతో గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు స్థానిక ఎస్సై సాయన్న సిబ్బందితో ఇంద్రవెల్లి గ్రామ పోలిమేరలో తనిఖీ చేశారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కానిస్టేబుల్ జాదవ్ రాహుల్, సిబ్బంది ఉన్నారు. -
● ఒక్కరోజుకు కాదు పరిమితం ● అర్థం చేసుకుంటేనే అర్థవంతం ● పెళ్లితో ఒక్కటవుతున్న జంటలు ● నేడు ప్రేమికుల దినోత్సవం
నిర్మల్: ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14 ప్రేమికుల పండుగగా భావిస్తుంటారు. కానీ, ప్రేమ అనేది ఈ ఒక్కరోజుకే పరిమితం కావొద్దు. జీవితాంతం కొనసాగాలని చాలామంది సీనియర్ ప్రేమికులు చెబుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే జీవితం అర్థవంతంగా సాగుతుందని, లేదంటే అర్ధంతరంగా ముగుస్తుందని సూచిస్తున్నారు. పరస్పర గౌరవం, నమ్మకం, సహనం ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ నిలుస్తుందని, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్ట సమయంలో తోడుగా నిలవడమే అవసరమని చాలామంది చాటుతున్నారు. అలాంటి ప్రేమజంటలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. -
భార్య వెంటే భర్త
● అనారోగ్యంతో వివాహిత మృతి ● ఆమె లేని లోకంలో ఉండలేక భర్త.. దహెగాం: వేద మంత్రాల సాక్షిగా నీ వెంట నేనుంటానని బాస చేసి భార్య మెడలో తాళి కట్టాడు. అనారోగ్యంతో ఆమె చనిపోగా తట్టుకోలేని అతడూ తనువు చాలించాడు. ఈ ఘటన మండలంలోని కమ్మర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కమ్మర్పల్లి గ్రామానికి చెందిన దుర్గం వినోద్కు మంచిర్యాల జిల్లా గురిజాల గ్రామానికి చెందిన సువర్ణతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరి దాంపత్య జీవనం అన్యోన్యంగా సాగుతున్న క్రమంలో సువర్ణ అనారోగ్యానికి గురైంది. ఆమెకు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయంకాలేదు. ఈక్రమంలో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఆమె దహన సంస్కారాలు శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి. కాగా, భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన వినోద్ (30) ఒక్కసారిగా సొమ్మిసిల్లి పడిపోయాడు. వెంటనే కుటుంబీకులు బెల్లంపల్లి ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో కమ్మర్పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో వారి కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. -
సర్వీస్ నిబంధనలు పాటించాలి
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ డివిజన్ పరిధి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పరిధిలోని ఉద్యోగులంతా ప్రభుత్వ సర్వీస్ రూల్స్ పాటించాలని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్కుమార్ సూచించారు. శుక్రవారం కేబీ ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో జీసీసీ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన రెండురోజుల శిక్షణ ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడారు. రెండోరోజు ఉద్యోగ నియమావళి, సర్వీస్ రూల్స్, సీసీఏ రూల్స్, ప్రాథమిక నియమాలు, బాధ్యతలు, లీవ్ రూల్స్, క్రమశిక్షణ చర్యలు లాంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. రిసోర్స్ పర్సన్స్ రవికుమార్, వేణు తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. ఉద్యోగులు అంకితభావం కలిగి ఉండాలని, గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన జీసీసీని బలోపేతం చేస్తూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఎవరైనా సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సీనియర్ మేనేజర్లు సంతోష్కుమార్, తార చంద్, సూపరింటెండెంట్ గులాబ్సింగ్, మేనేజర్లు శ్రీనివాస్, ఇస్తారి, లక్ష్మణ్, మనోహర్ అకౌంటెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డివిజనల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంట్లో ఒప్పించి ఒక్కటయ్యారు
జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యజంట అనిత, రా మకృష్ణలదీ ప్రేమవివాహమే. వీరిద్ద రు 1995లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. అప్పట్లో ప్రేమ అంటేనే ఓ భయం. ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలంటే ఇంకా భయం. కానీ, వీరిద్దరూ అప్పట్లోనే ఇంట్లో పెద్దలను ఒప్పించిన తర్వాతే పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య ప్రేమకు చిహ్నాలుగా పాప పద్మిని, బాబు ప్రద్యుమ్న ఉన్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం ఉంటేనే ప్రేమ కలకాలం నిలుస్తుందని, అలాంటి ప్రేమకూ అందరి మద్దతు ఉంటుందని వీరు చెబుతున్నారు. -
కాషాయదళంలో జోష్..
● బల్దియాలో మెజార్టీ స్థానాలు కై వసం ● రెండో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ ● సత్తా చాటిన స్వతంత్రులు ● ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ‘కమలం’ వికసించింది. కాషాయ పార్టీ మెజార్టీ సీట్లను కై వసం చేసుకుంది. పీఠంపై దస్తీ వేసి ఖాయం చేసుకుంది. పట్టణంలోని 49వార్డులకు గాను ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పట్టణంలోని టీటీడీసీలో శుక్రవారం చేపట్టారు. నాలుగు హాళ్లలో ఒక్కో వార్డుకు ఒక టే బుల్ ఏర్పాటు చేసి ఓట్లను లెక్కించారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా కౌంట్ చేశారు. పలు వార్డుల ఓట్ల లెక్కింపు రెండు రౌండ్లలోనే పూర్తయ్యాయి. రెండు, మూడు వార్డులు మాత్రమే మూడు, నాలుగు రౌండ్లలో చేపట్టారు. మధ్యాహ్నం 12గంటలకు తొలి ఫలితాన్ని అధికారికంగా ప్రకటించారు. 37వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుష్మా తొలి విజేతగా నిలిచారు. చివరగా 4వ వార్డు ఫలితాన్ని ప్రకటించా రు. ఇందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించడం గమనార్హం. అభ్యర్థులు, వారి ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు ఫలితాలను వీక్షించేలా ప్రత్యేక స్క్రీన్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వార్డులు, రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ లెక్కింపు కేంద్రంలోనే ఉండి ఆధ్యంతం ప్రక్రియను పరిశీలించారు. ఫలితాలు త్వరితగతిన వెలువడేలా ఆర్వోలకు సూచించారు. కౌంటింగ్ అనంంతరం విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు ఆయా వార్డుల రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. 11 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్.. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటి మెజార్టీ సర్పంచ్ పదవులను కై వసం చేసుకున్న అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో దాన్ని కొనసాగించలేకపోయింది. 49వార్డుల్లో పోటీ చేయగా కేవలం 11స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ ఆరు వార్డుల్లో గెలుపొంది ఉనికిని చాటుకుంది. 19 వార్డుల్లో పోటీ చేసిన ఎంఐఎం ఆరు చోట్ల మాత్రమే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో స్వతంత్రులు మాత్రం సత్తా చా టారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ముగ్గురు ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. 43వ వార్డు నుంచి కలాల్ శ్రీనివాస్ విజయం సాధించగా, 45వ వార్డు నుంచి మాజీ కౌన్సిలర్ బండారి సతీశ్ తన సతీమణి అనూషను పోటీలో నిలిపి గెలిపించుకున్నారు. 39వ వార్డు నుంచి యోగేష్ తన సతీమణి శాలిని బరిలో నిలిపి విజయాన్ని సొంతం చేసుకున్నారు. వీరితో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి తమ సత్తా చాటుకున్నారు. పార్టీల వారీగా గెలుపొందిన కౌన్సిలర్ల వివరాలు బీజేపీ మొత్తం : 49కాంగ్రెస్ ఏఐఎంఐఎంబీఆర్ఎస్ ఇండిపెండెంట్లుపోస్టల్ బ్యాలెట్లలోనూ ఆధిపత్యం.. 2020లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో 11 స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఈ ఎన్నికల్లో సత్తా చాటింది. అత్యధికంగా 21 వార్డులను కై వసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. చైర్పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకోబోతోంది. రెండు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాయి. ఏదేమైనా మెజార్టీ స్థానాలు దక్కడం కమలదళంలో నూతన ఉత్సాహాన్ని నింపింది. తొలిసారిగా మున్సిపల్ పీఠంపై బీజేపీ జెండా ఎగరనుంది. అయితే ఫలితాలు వెలువడిన వెంటనే ఇండిపెండెంట్లుగా గెలుపొందిన పలువురు అభ్యర్థులను ఆ పార్టీ నేతలు క్యాంపులకు తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ఘన విజయం సాధించడంపై శ్రేణులు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు. తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లలోనూ బీజేపీ అభ్యర్థులు ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 425 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా అందులో బీజేపీ అభ్యర్థులకు 167, కాంగ్రెస్ అభ్యర్థులకు 113, బీఆర్ఎస్ 79, ఇతరులకు 55 ఓట్లు వచ్చాయి. మరో ఏడు ఓట్లు చెల్లకుండా పోగా నాలుగు ఓట్లు నోటాకు వచ్చాయి. -
మెడికల్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ కార్యవర్గం
ఆదిలాబాద్టౌన్: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని పట్టణంలో శుక్రవారం ఎ న్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్.బ్రహ్మానందం, కార్యదర్శిగా ఇ.రమణాచారి, అసోసియేట్ అ ధ్యక్షుడిగా వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు గా శ్రీదేవి, నిర్వహణ కార్యదర్శిగా దేవి దాస్, సంయుక్త కార్యదర్శిగా లక్ష్మి, కోశాధికారిగా ర మేశ్, సంయుక్త కార్యదర్శిగా గంగాధర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా జావిద్ అహ్మద్, కార్యవర్గసభ్యులుగా వామన్రావు,అనిల్,అంజయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. -
పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టగా పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఐలవ్యూ ఆదిలాబాద్ నుంచి కేఆర్కే వైపు వెళ్లే రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మూడంచెల భద్రత చేపట్టారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే అనుమతించారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆంక్షలు కొనసాగాయి. గెలుపొందిన అభ్యర్థులు ఆయా కాలనీల్లో టపాసులు పేల్చకుండా, సంబరా లు, ర్యాలీలు నిర్వహించకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చో టుచేసుకోకుండా ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రక్రియను ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ సురేందర్ రావు, మౌనిక, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీఐలు నాగరాజు, సునిల్ కుమార్, మావల సీఐ కర్రె స్వామితో పాటు ఎస్సైలు, పోలీసులు పర్యవేక్షించారు. -
బలం కుదిరేనా..?
బల్దియా పాలకవర్గ ఏర్పాటుపై.. సాక్షి,ఆదిలాబాద్: ‘మున్సిపల్లో మేము అత్యధిక వార్డుల్లో గెలుపొందాం.. మ్యాజిక్ ఫిగర్కు కూడా సమీపంలో ఉన్నాం.. గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఇద్దరు మా వద్దే ఉన్నారు.. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేగా ఇప్పటికే ఎక్స్అఫీషియో రెండు ఓట్లు ఉన్నా యి.. పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీలు కూడా ఇక్క డే ఎక్స్అఫీషియోగా ఓటు వేస్తారు.. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పీఠాన్ని సులువుగా అధిరోహిస్తాం..’ అని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఎన్నికల కమిషన్ రూల్ పొజీషన్ ప్రకారం ఎమ్మెల్సీలుగా ఎన్నికై న నెలరోజుల్లోపు ఎక్కడైన ఒకదగ్గర ఎక్స్అఫీషియోగా నమోదు చేసుకొని ఉండాలి. అయితే ఇప్పటి వరకు ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియోగా నమోదై లేరని చెబుతున్నారు కమిషనర్. ఇప్పటికై తే ఇదే రూల్ పొజీషన్ అని ఒకవేళ ఎన్నికల కమిషన్ మార్పులు చేస్తే చెప్పలేం అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులంతా తమ వద్ద ఫిజికల్గా ఉన్నారనే బాంబును శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పేల్చింది. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత బల్దియాపై కాషాయం జెండా ఎగరబోతుందని బీజేపీ ధీమాగా చెబుతుండగా, వారికి సంఖ్యాబలం ఎలా కుదురుతుందో చూస్తామంటోంది ‘హస్తం’ పార్టీ. అసాధ్యంగా కనిపిస్తున్నప్పటికీ పాలకవర్గం ఏర్పాటులో మేము ప్రయత్నం వీడలేదని కాంగ్రెస్ చెబుతుండటం సంచలనం కలిగిస్తోంది. బల్దియా రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది. సంఖ్యాబలం ప్రకారం.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నా యి. బల్దియాలో పాలకవర్గం ఏర్పాటుకు వార్డుల సంఖ్యా బలం ప్రకారం చూస్తే.. 25 మంది కౌన్సి లర్లు గెలిచిన పార్టీ మెజార్టీ సాధించినట్టే. పాలకవర్గం ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బీజేపీ 21 వార్డుల్లో గెలిచింది. మెజార్టీకి స్వల్ప దూరంలో నిలిచింది. వార్డుల సంఖ్యా బలం ప్రకారం మరో నలుగురు కౌన్సిలర్ల మద్దతుతో పాలకవర్గం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మినహా యిస్తే ఇక మిగిలింది ఐదుగురు స్వతంత్రులు. అందులో ఇద్దరు తమ వద్ద ఉన్నారని బీజేపీ చెబుతుంది. ఐదుగురు ఫిజికల్గా తమ దగ్గర ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంటుంది. దీంతో బల్దియా పీఠాన్ని బీజేపీ సులువుగా కై వసం చేసుకునేందుకు వీలవుతుందా.. అందుకు అనువుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆ పార్టీ మలుచుకుందా.. లేదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్సీల ఎక్స్అఫీషియో నమోదు అంశంలోనూ రూల్ పొజీషన్లో మార్పులు చేస్తేనే సాధ్యమని మున్సి పాలిటీ చెబుతున్న నేపథ్యంలో పాలకవర్గం ఏర్పాటులో తకరారు కనిపిస్తుంది. ప్రత్యేక సమావేశంలోపు..మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఈనెల 16న ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో జరగనుంది. ఆరోజు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ఉదయం సెషన్లో కౌన్సిలర్లందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక చేపట్టాలి. అప్పటివరకు బీజేపీ పాలకవర్గం ఏర్పాటుకు అడ్డంకులను తొలగించుకుంటుందా.. రాజ్య సభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఎక్స్అఫీషియోగా ఓటు వేసేందుకు మా పార్టీ నుంచి కూడా ఇక్కడ అవకాశం ఇస్తే మా ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయని కాంగ్రెస్ చెబు తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ఈ మిగిలిన సమయంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయి.. బల్దియా పీఠంపై ఎవరు కూర్చుంటారు.. చైర్ పర్సన్గా ఎవరు ఎన్నికవుతారు.. ఇవన్నీ అంశాలు ప్రస్తుతం పట్టణ ప్రజలతో పాటు రాజకీయ పార్టీల్లో ఆసక్తి రేపుతుంది. -
అత్యధికం 968.. అత్యల్పం 12
కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ 40వ వార్డులో నమోదు కాగా, అత్యల్ప మెజార్టీ 34వ వార్డులో వచ్చింది. 40వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అమరబోయిన సాయిచరణ్ గౌడ్కు 1,352 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ఉష్కం రఘుపతికి 384 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి కడ్తారపు అశోక్కు 174 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిపై 968 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. అలాగే 34వ వార్డులో బీజేపీ అభ్యర్థి నిఖిలకు 626 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి, మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్కు 507 ఓట్లు పోలయ్యాయి. ఎంఐఎం అభ్యర్థి, ఆ పార్టీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్కు 638 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థిపై ఎంఐఎం అభ్యర్థి 10 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
బాల్య వివాహాలను అరికట్టాలి
తాంసి: బాల్య వివాహాలను అరికట్టాలని జిల్లా సఖీ కేంద్రం అధికారి నాగమణి సూచించారు. గురువా రం ‘బాల్య వివాహాల రహిత భారతదేశం 100 రో జుల కార్యక్రమం’లో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మండలంలోని కప్పర్ల, బండల్నాగాపూర్, పిప్పల్కోటి పాఠశాలల్లో విద్యార్థినులకు బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహ నిషేధ చట్టం 2006, గృహహింస, పోక్సో చట్టం, సైబర్క్రైంతో పాటు సఖీ కేంద్రం ద్వారా అందించే సేవలను వివరించారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా సాధికారత సిబ్బంది కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు -
జోరుగా ‘క్యాంపు’ రాజకీయాలు
కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్ర క్రియ ముగిసినా రాజకీయ వేడి ఇంకా చల్లారడం లేదు. ఓట్ల లెక్కింపు శుక్రవారం చేపట్టనున్నారు. అయితే, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అవసరమైన అధిక్యం ఏ పార్టీకి రావడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేలా అధికార కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక దృష్టి సారించాయి. ఆయా పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. ఆ పార్టీ ముఖ్యనేతలు దగ్గరుండి మరీ ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లారు. ఓడిన అభ్యర్థులను తిరిగి పంపించనుండగా గెలిచిన వారిని ఈ నెల 16న నిర్వహించే మున్సిపల్ ప్రత్యేక సమావేశానికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓ పార్టీ కొంతమంది అభ్యర్థులను తీసుకెళ్లకపోవడంతో వారిలో ఓటమి ఆందోళన వ్యక్తమవుతోంది. అయోధ్యకు బీజేపీ అభ్యర్థులు! చైర్మన్ పీఠాన్ని తామే కై వసం చేసుకుంటామని బీజేపీ, కాంగ్రెస్ బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం ఫలితాలపై కాస్తా ఆందోళనే కని పిస్తోంది. ఈ నేపథ్యంలో గెలిచిన కౌన్సిలర్లు ఇత ర పార్టీల వైపు వెళ్లకుండా ఉండేలా నాయకులు జాగ్రత్తపడుతున్నారు. బీజేపీ తరఫున 49మంది అభ్యర్థులు పోటీ చేయగా 38మందినే ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. కౌన్సిలర్ అభ్యర్థులు, వారి కుటుంబీకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలు, అనంతరం అనుసారించాల్సిన కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం వారిని మూడు ప్రత్యేక బస్సుల్లో క్యాంపునకు తరలించారు. వీరిని అయోధ్య తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. గెలిచే అవకాశమున్న వారినే క్యాంపులకు తీసుకెళ్లారనే చర్చ సాగుతోంది. హైదరాబాద్కు కాంగ్రెస్ అభ్యర్థులు! అధికార కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన 49 మంది కౌన్సిలర్ అభ్యర్థులతో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్జాదవ్ పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో సమావేశమయ్యారు. ఆ పార్టీ ముఖ్యనేతలతో కలిసి వార్డులవారీగా నమోదైన పోలింగ్ సరళి, అభ్యర్థుల విజయావకాశాలపై చర్చించా రు. ఫలితాల అనంతరం అనుసరించాల్సిన కా ర్యాచరణపై వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అనంతరం రెండు ప్రత్యేక బస్సుల్లో రాష్ట్ర రాజధానికి తరలించారు. అక్కడి ఓ రిసార్టులో ఉంచి ఫలితాలు వెలువడిన అనంతరం విజేతలను మ రోచోటకు తరలిస్తారని తెలిసింది. అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్యులంతా వెళ్లడం గమనార్హం. ఆచీతూచి వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా తమ కౌన్సిలర్ అభ్యర్థులను శిబి రానికి తరలించాలని తొలుత భావించింది. గురువారమే అభ్యర్థులను తరలిస్తారనే ప్రచారం కూ డా జరిగింది. అయితే, ఈ విషయంలో ఆ పార్టీ ముఖ్యనేతలు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. ఎ న్నికల ఫలితాలు వెలువడ్డాక ఆయా పార్టీలకు వ చ్చే సీట్ల ఆధారంగా క్యాంపునకు వెళ్లాలా? లేదా? అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ గెలుపు అవకాశాల ఆధారంగా అభ్యర్థులను శిబిరానికి తరలిస్తారనే చర్చ సాగుతోంది. -
పీహెచ్సీ వైద్యులకు పీజీ సీట్లు
ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేస్తున్న 18మంది వైద్యులకు పీజీ సీట్లు వచ్చాయి. జిల్లాలో 22 పీహెచ్సీలు, ఐదు పట్టణ ఆరోగ్యకేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులున్నాయి. పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో రెగ్యులర్ వైద్యులు లేక కాంట్రాక్ట్ వైద్యులతో సేవలదింస్తున్నారు. జిల్లాలో 50 వైద్యాధికారుల పోస్టులు మంజూరు ఉండగా, 42మందే పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం మరో 18 వైద్యాధికారుల పోస్టులు నెలరోజుల్లో ఖాళీ కానుండగా రోగులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఖాళీలు ఏర్పడే పీహెచ్సీలు బజార్హత్నూర్ పీహెచ్సీలో నలుగురు వైద్యులకు, భీంపూర్, ఝరి, గుడిహత్నూర్లో ఇద్దరు చొప్పున, గాదిగూడ, సైద్పూర్, దంతన్పల్లి, నర్సాపూర్(టీ), పిట్టబొంగరం, ఇచ్చోడ, తలమడుగు, నేరడిగొండ పీహెచ్సీలో ఒక్కొక్కరికి పీజీ సీట్లు వచ్చాయి. ఇప్పటికే కొందరు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వగా, మరికొంత మంది ఈనెల లోపు చేరనున్నారు. దీంతో బజార్హత్నూర్, నేరడిగొండ, పిట్టబొంగరం, గుడిహత్నూర్, గాదిగూడ, ఝరి, దంతన్పల్లి పీహెచ్సీల్లో ఒక్క వైద్యుడు కూడా లేని పరిస్థితి ఏర్పడనుంది. ఇబ్బందులు లేకుండా చూస్తాం జిల్లాలో 50 వైద్యుల పోస్టులకు 42మందే ఉన్నారు. ప్రస్తుతం 18మంది వైద్యాధికారులకు పీజీ సీట్లు వచ్చాయి. దీంతో రోగులకు ఇబ్బందులేర్పడనున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కాంట్రాక్ట్ పద్ధతిన పోస్టులను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటాం. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో -
హంగ్ తప్పదా?
సాక్షి, ఆదిలాబాద్: మరికొద్ది గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుందో తేలిపోనుంది. కాంగ్రెస్, బీజేపీ అధిక వార్డుల్లో గెలుపొందుతాయని, మెజా ర్టీ మాత్రం అందుకోలేకపోతాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీల్లో ఏదైనా అత్యధిక వార్డుల్లో గెలుపొంది పాలకవర్గం ఏర్పాటుకు ముందుకు వస్తే అందుకు అనుకూలంగా కలిసి వచ్చే పార్టీలకు సీట్లు దక్కుతాయా..? బీ ఆర్ఎస్, ఎంఐఎం ఎన్ని వార్డుల్లో గెలుపొందుతా యి..? ఏఐఎఫ్బీ, స్వతంత్రులు ఎంతమంది గెలు స్తారు..? పాలకవర్గం ఏర్పాటులో వారి నిర్ణయం ఎలా ఉంటుంది..? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానంరావాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. ‘క్యాంప్’ రాజకీయాలు షురూ.. ఒకవైపు సంపూర్ణ మెజార్టీ సాధించి పాలకవర్గం ఏకపక్షంగా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్, బీజేపీ చెబు తున్నాయి. మరోవైపు వేర్వేరుఏజెన్సీ సర్వే రిపోర్ట్లు ఈ పార్టీల లెక్కలకు భిన్నంగా ఉన్నాయి. దీంతో ఈ పార్టీలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటి కే ఆ పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులను క్యాంపులకు త రలించారు. మెజార్టీ వస్తుందని చెబుతున్నా ఆ రెండు పార్టీలు ఇంత జాగ్రత్తగా వ్యవహరించడం వెను క మతలబు లేకపోలేదన్న ప్రచారం సాగుతోంది. సర్వేలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో అలాంటి ఫలితా లే వస్తాయా..? లేదా..? పాలకవర్గం ఏర్పాటుకు స రిపడా కౌన్సిలర్లు గెలవని పక్షంలో ఏ పార్టీ మద్దతు తీసుకోవాలి..? మరి ఆ పార్టీలు ఎంతమంది అభ్యర్థులను గెలుస్తుంది..? అన్నీ అనువైన పరిస్థితులు ఏర్పాడతాయా..? ఈనెల 16న నిర్వహించ నున్న మున్సిపల్ ప్రత్యేక సమావేశం వరకు అన్ని స ర్దుకుంటాయా..? ఇలా అనేక అంశాల్లో వ్యవహారా లు సాగాల్సి ఉండగా, తమ పార్టీ నుంచి గెలిచిన అ భ్యర్థులు చేజారకుండా క్యాంపునకు తరలించారు. ఎవరి ధీమా వారిదే.. మున్సిపల్ ఫలితాలపై వివిధ ఏజెన్సీల సర్వే రిపోర్ట్లు ఎలా ఉన్నా.. ఆయా పా ర్టీలు మాత్రం దేనికవే ధీమా వ్య క్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఐదు నుంచి ఎనిమిది వార్డుల వరకు గెలువవచ్చని ఏజెన్సీల సర్వే రి పోర్టులు చెబుతుండగా, ఆ పార్టీ మాత్రం తాము 15వార్డుల్లో గెలు స్తామని, పాలకవర్గం ఏర్పాటులో తామే కింగ్ మేకర్లమని ధీమాగా ఉన్నాయి. ఎంఐఎం మూడు వార్డుల్లో గెలువవచ్చని సర్వే రిపోర్టులు చెబుతుండగా ఏడు నుంచి 11వార్డులు గెలుస్తామని ఆ పార్టీ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. బీజేపీ మినహా యిస్తే ఏ పార్టీ అయినా పాలకవర్గం ఏర్పాటు చేస్తే తాము మద్దతిస్తామని ఎంఐఎం స్పష్టం చేస్తోంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఎవరైనా గెలుస్తారా..? స్వతంత్ర అభ్యర్థులు గెలిస్తే వారి పాత్ర ఎంత మేరకు కీలకమవుతుంది? అనేదానిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. మరి కొన్ని గంటల్లో ఈ ఉత్కంఠ వీడనుంది. మున్సిపల్ పీఠం ఎవరిదో? ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 49వార్డులున్నాయి. పాలకవర్గం ఏర్పాటు చేయాలంటే 25మ్యాజిక్ ఫిగర్ కావాలి. అయితే, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆదిలాబాద్లోనే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ 26గా మారింది. జనరల్ మహిళకు చైర్పర్సన్ పదవి రిజర్వ్ చేశారు. ఈ నెల 16న మున్సిపల్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు గెలిచిన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించి చైర్పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు. అప్పటివరకు రాజకీయంగా హైడ్రామా కొనసాగనుంది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థి చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
కలెక్టరేట్ ఎదుట కార్మికసంఘాల ధర్నా
కై లాస్నగర్: కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల ను రద్దు చేయాలనే డిమాండ్తో చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం కలెక్టరేట్ ఎదుట ధ ర్నా చేశారు. ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ని రసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేలా వ్యవహరిస్తోందని కార్మిక సంఘా ల నాయకులు ఆరోపించారు. రైతులకు ఉపాధి, వ్యవసాయ, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసి వీబీ జీ–రామ్ జీ స్కీమ్ తెచ్చి రాష్ట్రాలపై ఆర్థికభారం మోపుతోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికై నా కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల నాయకులు, కార్మికులున్నారు. -
కౌంటింగ్కు సర్వం సిద్ధం
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో నేడు ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ షురూ కానుంది. ఇందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. అనంతరం వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బ్యాలెట్ బాక్స్ల్లో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో వెల్లడి కానుంది. మధ్యాహ్నం 12గంటల వరకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కేఆర్కే కాలనీకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. వాహనాలను దారి మళ్లించనున్నారు. కౌంటింగ్ సిబ్బందికి అవగాహన కోసం ఇప్పటికే మాక్ కౌంటింగ్ నిర్వహించారు. ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. 49వార్డులు.. 49టేబుళ్లు ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మొత్తం 49 వార్డులున్నాయి. ఇందులో ప్రతీ వార్డుకు ఒక టేబుల్ చొప్పున 49 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి వాటి ఫలితాలను వెల్లడించాక బ్యాలెట్ బాక్స్ల్లోని ఓట్లను లెక్కిస్తారు. వార్డు పరిధిలోని పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్స్లను తెరుస్తారు. 25 ఓట్లకు ఒక బండిల్ చొప్పున కడతారు. ఆ తరువాత బండిళ్లన్నింటినీ డ్రమ్ములో వేసి బాగా కలుపుతారు. అనంతరం వెయ్యి ఓట్లకు ఒక రౌండ్ చొప్పున లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఫలితాలు వీక్షించేలా కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఫలితాల వెల్లడిలో జాప్యం జరగకుండా 49మంది ఆర్వోలు రౌండ్ వారీ ఫలితాలను ఎప్పటికప్పుడు డీపీఆర్వోకు పంపించే ఏర్పాట్లు చేశారు. అన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక అధికారికంగా వార్డు ఫలితాన్ని ప్రకటించనున్నారు. పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. 1నుంచి 12వార్డులకు డీపీవో రమేశ్, 13నుంచి 27వార్డులకు డీఆర్డీవో రాథోడ్ రవీందర్, 28నుంచి 33వార్డులకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్రావు, 39నుంచి 49వార్డులకు డీఎల్పీవో ఫణీందర్రావు నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూం నుంచి కౌంటింగ్ హాల్కు తీసుకువచ్చేందుకు మున్సిపల్ కార్మికులను, వారిని పర్యవేక్షించేందుకు ఐదుగురు మున్సిపల్ అధికారులను రో ఇన్చార్జీలుగా నియమించారు. వీరిందరికి ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేయనున్నారు. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ టీటీడీసీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా గురువారం ఎన్నికల సాధారణ పరిశీలకుడు హనుమంత్ నాయక్తో పరిశీలించారు. నాలుగు హాళ్లలో కౌంటింగ్ ఉంటుందని, సుమారు 180మంది శిక్షణ పొందిన సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. ఒక్కో టేబుల్ వద్ద మూడు రౌండ్ల లెక్కింపు ఉండగా, ప్రతీ రౌండ్కు సుమారు 90నిమిషాలు పట్టనుందని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, డీఎల్పీవో ఫణిందర్రావు తదితరులున్నారు. తొలి ఫలితం 37వ వార్డుదే.. మెజార్టీ వార్డుల ఫలితాలు మూడు రౌండ్లలో వెల్లడికానున్నాయి. 37వ వార్డు ఫలితం మాత్రం ముందుగా వచ్చే అవకాశముంది. ఈ వార్డులో 2,374 మంది ఓటర్లుండగా 1,467 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పురుషులు 726, మహిళలు 741 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లో 10మంది పురుషులు, ఒక మహిళ చొప్పున మొత్తం 1,478 మంది ఓటు వేశారు. అత్యంత తక్కువ ఓట్లు ఈ వార్డులోనే ఉన్నందున ఈ ఫలితం రెండు రౌండ్లలోనే వెల్లడికానుంది. ఇక నాలుగో వార్డు ఫలితం చివరగా వచ్చే అవకాశముంది. ఈ వార్డులో మొత్తం 3,832 ఓటర్లుండగా 1,458 మంది పురుషులు, 1,509 మహిళలు కలిపి 2,967 మంది ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్లో పురుషులు ముగ్గురు ఓటు హక్కు వినియోగించుకోగా మొత్తం 2,970 ఓట్లు పోలయ్యాయి. నాలుగు రౌండ్లలో ఈ వార్డు ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపునకు బందోబస్తు ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం నిర్వహించనుండగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ ఓ ప్రకటనలో తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించవద్దని, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేదాకా సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ‘ఐలవ్ ఆదిలాబాద్’ నుంచి మావల పోలీస్స్టేషన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని తెలిపారు. -
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్! -
ఓవర్ టు స్ట్రాంగ్ రూం
బ్యాలెట్ బాక్సులు, సామగ్రితో రిసెప్షన్ కేంద్రానికి చేరుకుంటున్న ఎన్నికల సిబ్బందిపోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్స్లకు ఏజెంట్ల సమక్షంలో సీల్ వేశారు. వాటితో పాటు సామగ్రిని వెంట తీసుకుని ప్రత్యేక వాహనాల్లో బందోబస్తు నడుమ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్కు చేరుకున్నారు. అధికారులకు రిపోర్ట్ చేసి వాటిని అప్పగించారు. అధికారులు బ్యాలెట్ బాక్స్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్రూంలో భద్రపరిచారు. ఓటర్ల భవితవ్యం బ్యాలెట్ బాక్స్ల్లో నిక్షిప్తం కాగా ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్టౌన్: మున్సిపల్ ఎన్నికలకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వెయ్యి మంది సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. 35 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించగా, వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈకేంద్రాల్లో స్టాటిక్ ఫోర్సుతో పాటు ప్రత్యేక బలగాలను మోహరించారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 మంది ఎస్సైలతో పాటు మహిళా పోలీసు సిబ్బంది, హోంగార్డులు, రిజర్వు పోలీసులు, ప్రత్యేక బలగాలతో బందోబస్తు చేపట్టారు. బుధవారం నిర్వహంచిన ఈ ప్రక్రియను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. చిన్నపాటి ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో యంత్రా ంగం ఊపిరి పీల్చుకుంది. పోలింగ్ కేంద్రాల్లోనికి ఓటర్లను తప్పా ఎవరిని అనుమతించలేదు. సెల్ఫో న్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాటర్, ఇంక్ బాటిళ్లు, పెన్నులు తీసుకెళ్లకుండా చర్యలు చేపట్టారు. దీంతో పాటు 14 రూట్లలో మొబైల్ పార్టీ, స్ట్రైకై ంగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పర్యవేక్షణ జరిపారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ముగిసేంత వరకు పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘనులపై కేసులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా నగదు పంచుతున్న ఇద్దరిపై వన్టౌన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ సునిల్ కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. భోరజ్ మండలం పిప్పర్వాడకు చెందిన కాటిపెల్లి రాజారెడ్డి నుంచి రూ.3,440, ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్కు చెందిన మేకల కృష్ణకుమార్ నుంచి రూ.2,700 స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాట్సాప్లో మతం పేరిట ప్రచారం చేసిన పట్టణానికి చెందిన చంద్రశేఖర్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. హుండీలో విరాళం వేయడంతో మతం రక్షించబడదని.. బ్యాలెట్ బాక్సులో హిందువులకు ఓటు వేయాలని వాట్సాప్లో పోస్టు పెట్టినట్లు వివరించారు. ఇదిలా ఉండగా టూటౌన్ పరిధిలో ఓట ర్లకు అరటిపండ్లు పంచుతున్న ఆటోడ్రైవర్ మహ్మద్ అర్షద్పై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. -
మెజార్టీ మార్క్ దక్కేనా..
సాక్షి,ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ము గిసింది. బ్యాలెట్ బాక్సుల్లో ఓటు భద్రమైంది. శుక్రవారం రిజల్ట్డే.. గెలుపుపై ప్రధాన పార్టీల ధీమా.. ఏ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందనే విషయంలో స్పష్టతకు రాని ఏజెన్సీలు.. పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యే అనేది స్పష్టం.. పూర్తిస్థాయి బలం రాకపోతే.. అవసరమైతే ఇతర పార్టీలతో పొ త్తంటున్న హస్తం.. ఏదైన పార్టీ సహకరిస్తామంటే కాదనమంటున్న కమలం, ఎక్స్ అఫీషియో ఓట్లు మాకు కీలకం అంటుండటం కూడా ఆసక్తి కలిగి స్తుంది. ఇక బీఆర్ఎస్, ఎంఐఎంలు ఎన్ని స్థానాల్లో గెలుస్తాయి.. ఏఐఎఫ్బీ, స్వతంత్ర అభ్యర్థులు ఎంత మంది విజయం సాధిస్తారు.. ప్రధాన పార్టీలకు పాలకవర్గం ఏర్పాటులో వీరి పాత్ర ఏమైనా కీలకమవుతుందా.. ఇలాంటి పరిస్థితుల్లో అందరి దృష్టి ఇప్పుడు ఫలితాలపైకి మళ్లింది. మరోవైపు ఆయా పార్టీలు తమ అంచనాల ప్రకారం ముందుకెళ్తుండటం, క్యాంపు రాజకీయాలకు తెర లేపడం ప్రాధాన్యత సంతరించుకుంది. మెజార్టీపై ధీమా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి జరిగిన ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధిస్తామని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ 28 నుంచి 32 స్థానాలు సాధిస్తామని చెబుతుండగా, బీజేపీ 27కు పైగా గెలుస్తామని పేర్కొంటోంది. సర్వేఏజెన్సీలు మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజా ర్టీ వస్తుందనే విషయంలో అంచనాకు రాకపోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిస్థితుల్లో ఎంఐఎం, బీఆర్ఎస్లు ఎన్ని వార్డుల్లో గెలుపొందుతాయి, ఆయా పార్టీలు ఎక్కువ స్థానాల్లో గెలుపొందితే పాలకవర్గం ఏర్పాటులో వారి పాత్ర కీలకం కానుంది. ఒకవేళ ఈ పార్టీల మద్దతు తీసుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్కు దూరంగా నిలిస్తే ఏఐఎఫ్బీ, స్వతంత్ర అభ్యర్థుల నుంచి గెలిచే వారి పాత్ర కీలకం కానుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. క్యాంప్ రాజకీయాలు షురూ.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 5గంటలకు ముగిసే ముందే ఆయా వార్డుల వారీగా ప్రధాన పార్టీలు ఏయే వార్డుల్లో గెలుస్తున్నామనే అంచనాలు వేసుకోవడం జరిగింది. కొన్ని వా ర్డుల్లో తీవ్ర పోటీ నెలకొనడం, అక్కడ ఫలితం ఎలా వస్తుంది.. ఇప్పుడు తప్పనిసరిగా గెలుస్తామని అనుకుంటున్న స్థానాలకు అక్కడ వచ్చే ఫలితాలు మరింత అదనంగా తోడవడం ద్వారా పీఠం కై వసంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదురుకావా అనే సందేహాలు కూడా పార్టీలో లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో క్యాంప్ రాజకీయాలపై బుధవారం రాత్రే ఏదైన నిర్ణయం తీసుకునే అవకాశం ఆయా పార్టీల్లో ప్రచారం సాగుతుంది. గురువారం ఉదయం నుంచే వీటికి తెరలేచే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. మొత్తంగా ఈ పరిణామాలు మున్సిపల్ ఫలితాల కంటే ముందు ఆసక్తిగా మారాయి. -
ఆకట్టుకున్న మోడల్
ఖుర్షీద్నగర్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు బారులుతీరిన ఓటర్లుచంటిబిడ్డతో వచ్చి ఓటేసిన తల్లిఎన్నికలు జరిగిన వార్డులు : 49 సిరా చుక్క చూపుతున్న యువతిపోలింగ్ కేంద్రాలు : 216 పోలైన ఓట్లు : 99,183 మొత్తం ఓటర్లు : 1,43,655 మహిళలు : 49,926 పురుషులు : 49,256 పోలింగ్ శాతం : 69.04ఇతరులు: 01ఓటు వేసేందుకు కేంద్రానికి వచ్చిన వృద్ధుడికి సాయం చేస్తున్న పోలీసులు కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పోలింగ్ ప్ర శాంతంగా ముగిసింది. 49 వార్డులకు గాను బుధవారం ఎన్నికలు నిర్వహించారు. చెదురుముదురు ఘటనలు మినహా ప్రక్రియ సాఫీగా సాగింది. ఉద యం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం వరకు ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఆ తర్వాత ఓటర్లు తరలిరావడంతో పుంజుకుంది. సాయంత్రం ఐదు గంటల్లోపు కేంద్రాలకు చేరుకున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 69.04 శాతం పోలింగ్ న మోదైంది. 2020 సంవత్సరం ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. పోలింగ్ శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం స్వీప్ ద్వారా చేపట్టిన ప్రచారం ఎలాంటి ప్రభావం చూపలేక పోయింది. దివ్యాంగులు, వృద్ధులు, అనారో గ్యంతో బాధపడుతున్న ఓటర్లను కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక సిబ్బందితో పాటు వాహన సౌకర్యం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు తలెత్తకుండా ఆయా కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 163 బీఎన్ఎస్ (144)అమలు చేశారు. పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. పోలింగ్ నిర్వహణపై ఆరా తీఽశారు. అలాగే వెబ్ కాస్టింగ్ ద్వారానూ పోలింగ్ సరళిని టీటీడీసీ నుంచి కలెక్టర్ పర్యవేక్షించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో టీటీడీసీలోని రిసెప్షన్ సెంటర్కు చేరుకున్నారు. ప్రత్యేక వసతులు ఓటు వేసేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు వసరమైన వసతులను కల్పించారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో షామియానాలు, తాగునీటి ఏర్పాటుతో పాటు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, అనారోగ్యం బారిన పడిన వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేలా ప్రతీ వార్డు పరిధిలో ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేశారు. వాటికి ప్రత్యేక స్టిక్కర్లు అంటించారు. వారి కోసం వీల్ చైర్లతో పాటు ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మధ్యాహ్నం వరకు మందకొడిగానే.. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 11 గంటల వరకు మందకొడిగానే సాగింది. మధ్యాహ్నం 12 తర్వాత ఓటర్లు క్రమంగా కేంద్రాలకు చేరుకోవడంతో పోలింగ్ శాతం పెరిగింది. ప్రతీ రెండు గంటలకోసారి అధికారికంగా పోలింగ్ సరళి ప్రకటించారు. ప్రభావం చూపని ‘స్వీప్’.. పోలింగ్శాతం పెంచేందుకు అధికారులు స్వీప్ ఆధ్వర్యంలో పట్టణంలో విస్తృత ప్రచారం కల్పించా రు. పలుకాలనీల్లో చైతన్య ర్యాలీలతోపాటు ఇంటిం టి అవగాహన చేపట్టారు. ప్రత్యేకంగా ప్రచార రథా లు ఏర్పాటు చేసి కాలనీల్లో తిప్పించారు. అయినప్పటికీ ఓటర్లపై ఆ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. ఓటర్ల సంఖ్య గతంతో పోల్చితే పెరిగినప్పటి కీ పోలింగ్ శాతం మాత్రం స్వల్పంగా తగ్గడం గమనార్హం. గత 2020 ఎన్నికల్లో 69.95 శాతం పోలింగ్ కాగా, ఈసారి 69.04 శాతానికే పరిమితమైంది. పోలింగ్ శాతం నమోదు వివరాలుపోలింగ్పై ఏఎస్డీ ప్రభావంకై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు సిద్ధం చేసిన ఆబ్సెంట్, డెత్, షిఫ్టెడ్ (ఏఎస్డీ) జాబితా ప్రభావం పలు వార్డుల్లో స్పష్టంగా కనిపించింది. అనర్హులు ఓటు వేసే అవకాశం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇది ఆయా వార్డుల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ఓటర్ల వివరాలు మున్సిపల్ ఓటర్ల జాబితాలోనూ ఉన్నాయి. వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాలకు వచ్చారు. అయితే అప్పటికే గ్రామాలతో పాటు పట్టణాల్లో రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారి జాబితాలను సిద్ధం చేశారు. దీంతో పోలింగ్ ఏజెంట్లతోపాటు అభ్యర్థులు వారిని గుర్తించి ఓటు వేయకుండా నిలువరించారు. పట్టణంలోని రవీంద్రనగర్తో పాటు రాంనగర్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈ పరిస్థితి కనిపించింది.ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పెంపుఆదిలాబాద్రూరల్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులు ఉచిత రెసిడెన్షియ ల్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్కులాల అభివృద్ధి అధికారి భగత్ సు నీత కుమారి ప్రకటనలో తెలిపారు. ఐదు నెల ల ఉచిత శిక్షణకు సంబంధించి ఆన్లైన్ దరఖా స్తుల గడువు ఈనెల 22 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 1న ఉదయం 11 గంటలకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో కేంద్ర, రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు సంబంధించి శిక్షణ ఉంటుందని, వివరాల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ స్టడీ డైరెక్టర్ కె.రమేశ్ను సెల్: 9494149416 నంబర్పై సంప్రదించాలని కోరారు.పోలింగ్ కేంద్రాల్లో కనిపించని రద్దీ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. 750 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని కేటాయించారు. ఒక్కో వార్డు పరిధిలో 3నుంచి 4 బూత్లను ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్లు వచ్చిన వారు వచ్చినట్లుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ఒకటి రెండు కేంద్రాల్లో మాత్రమే బారులు తీరగా మెజార్టీ కేంద్రాల్లో రద్దీ కనిపించలేదు. -
ఓటేసిన ప్రముఖులు
ఓటు హక్కు వినియోగించుకుంటున్న కలెక్టర్ రాజర్షి షా కై లాస్నగర్/ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ రాజర్షి షా పట్టణంలోని సాత్నాల క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ 36వ వార్డులోని సీబీఆర్ మోడల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కు విని యోగించుకున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్ 34వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకోగా, మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా 48వ వార్డులో ఓటు వేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్పీ ఓటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉండగా, అదనపు కలెక్టర్ ఓటు మంచిర్యాలలో ఉంది. వారు పోస్టల్ ద్వారా తమ ఓటును ఆయా జిల్లాలకు పంపించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే శంకర్.. సిరా చుక్క చూపుతున్న ఎస్పీ -
సేవ చేసే వారికే ఓటు
కైలాస్నగర్: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. నిజాయతీ పరులు, సమర్థులు, సేవా భావం కలిగిన వారిని ఎన్నుకునే హక్కు రా జ్యాంగం కల్పించింది. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగలో తాము భాగస్వాములవడం సంతో షంగా ఉంద ంటున్నారు నూతనంగా ఓటు హక్కు వినియోగించుకున్న యువత.ఓటు ఎంతో విలువైంది.. ఓటు ఎంతో విలువైంది. తొలిసారిగా ఓటువేయడం సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవడమే లక్ష్యంగా నేను ఓటు వేశాను. – మామిడాల యువనశ్రీ, భుక్తాపూర్ సద్వినియోగం చేసుకున్నా.. ఈసారి కొత్తగా ఓటు హక్కు వచ్చింది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వెళ్లి సద్వినియోగం చేసుకున్నాను. సేవ చేసే అభ్యర్థికే ఓటు వేశాను. చదువుకున్న వారు చదువు రాని వారికి ఓటు విలువ తెలియజేసి వినియోగించేలా చూడాలి. – మంద అంకిత, భుక్తాపూర్ -
బోథ్ రేంజ్లో పులుల సంచారం
బోథ్: బోథ్ అటవీ పరిధిలోని గ్రామాల్లో పెద్దపులి, చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఇచ్చోడ ఎఫ్డీవో చిన్న విశ్వనాథ్ భూసిరెడ్డి సూచించారు. రెండు రోజుల క్రితం పుణ్యనాయక్ తండా గ్రామానికి చెందిన పవార్ సక్రు అనే వ్యక్తికి చెందిన ఆవుపై చిరుత దాడి చేసి చంపడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై ఆదిలాబాద్ డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఇచ్చోడ ఎఫ్డీవో చిన్న విశ్వనాథ్ భూసిరెడ్డి మంగళవారం అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు. పులి, చిరుతల సంచారం నిర్ధారణ అయినందున ప్రజలు అడవుల్లోకి వెళ్లడం మానుకోవాలని, ముఖ్యంగా పంట పొలాలకు వెళ్లే రైతులు సమూహాలుగా మాత్రమే వెళ్లాలని అధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా అటవీ శివారు ప్రాంతాలకు వెళ్లకూడదని తెలిపారు. అలాగే, వన్యప్రాణుల రక్షణ దృష్ట్యా పొలాల చుట్టూ విద్యుత్ కంచెలు లేదా వలలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పులి, చిరుతల దాడిలో పశువులను కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తరఫున సకాలంలో పరిహారం అందేలా చూస్తామని ఈ సందర్భంగా అధికారులు భరోసా ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు
గుడిహత్నూర్:మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి–44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగా యాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బజార్హత్నూర్ మండలంలోని భు తాయికి చెందిన పడ్వాల్ పూర్ణబాయి జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన మోటార్ సైకిల్ ఢీకొట్టింది. దీంతో ఆమె ఎడమకాలు విరిగి తీవ్రగాయాలయ్యాయి. ఆమెతోపాటు మహారాష్ట్రకు చెందిన ద్విచక్రవాహనదారుడు సోహిల్ గాయాలపాలయ్యాడు. వీరి ని చికిత్స కోసం హైవే అంబులెన్స్లో రిమ్స్కు తరలించారు. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
తల్లి ఒడికి చేరిన చిన్నారి
ఆదిలాబాద్టౌన్: రిమ్స్ ఆస్పత్రిలో ఒంటరిగా కనిపించిన రెండేళ్ల చిన్నారిని గుర్తించి మంగళవారం పోలీస్స్టేషన్లో తల్లికి అప్పగించినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 4న రిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో రెండేళ్ల చిన్నారి ఏడుస్తూ కనిపించింది. సెక్యూరిటీ గార్డు అమీర్ అవుట్పోస్ట్ పోలీసులు రవీందర్రెడ్డి, అబీదుల్లా హుస్సేన్, ఐటీడీఏ హెల్ప్డెస్క్ ఉద్యోగి బలిరామ్కు సమాచారం అందించా డు. విషయం తెలుసుకున్న డీసీపీవో రాజేంద్రప్రసా ద్, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది రిమ్స్కు చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆ చిన్నారిని శిశుగృహకు తరలించారు. ఇదే సమయంలో మహారాష్ట్రలోని మాండ్వి ప్రాంతానికి చెందిన భారతి తన కుమార్తె అకీరాను వెతుకుతూ ఆదిలాబాద్కు చేరుకుంది. విషయం తెలుసుకున్న డీసీపీవో సిబ్బంది టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి శిశుగృహలో ఉన్న పాపను తల్లి వెతుకుతున్నట్లు నిర్ధారించారు. అనంతరం శిశుగృహ మేనేజర్ విజయలక్ష్మి సమక్షంలో చిన్నారిని తల్లికి అప్పగించినట్లు సీఐ వివరించారు. -
రూ.34వేల నగదు స్వాధీనం
దేశీదారు విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నేరడిగొండ: అక్రమంగా దేశీదారు విక్రయిస్తు న్న వ్యక్తిని అరెస్ట్ చేసి 115 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ జు ల్ఫీకర్ అహ్మద్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం మండలంలోని రాజులతండా గ్రామంలో సోదాలు నిర్వహించి నట్లు పేర్కొన్నారు. సాబ్లే విజ్ఞాన్సింగ్ అనే వ్య క్తి మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన దేశీదారు అక్రమంగా విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తె లిపారు. ఆయనపై కేసు నమోదు చేసి మద్యం బాటిళ్లు సీజ్ చేసినట్లు వివరించారు. గంజా యి, బెల్లం, పటిక, దేశీదారు, గుడుంబా విక్రయించినా, రవాణా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో శిక్షణ పొందుతున్న ఉప పరిశీలకుడు వీ శ్రీనివాస్, సిబ్బంది కార్తిక్, మహ్మద్, అరుణ, మంజుల పాల్గొన్నారు. రామకృష్ణాపూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రాత్రి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ఓ కారులో దొరికిన రూ.34వేల నగదు స్వాధీనం చేసుకోవటం ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానిక బీజోన్ సెంటర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బీఆర్ఎస్కు చెందిన ఓ నాయకు డి కారును ఆపి పరిశీలించారు. ఈ క్రమంలో కారులోని పర్సులో రూ.34వేల నగదు కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం రూ.50వేల కంటే ఎక్కువ నగదు ఉంటేనే స్వాధీనం చేసుకోవాలని ఉండగా రూ.34వేలు ఎలా స్వాధీనం చేసుకుంటారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. పార్టీ సీనియర్ నేత డాక్టర్ రాజరమేశ్తోపాటు ఇతర నాయకులు పట్టణ ఎస్ఐ శ్రీధర్తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నాయకులకు వ త్తాసు పలుకుతూ వారి వాహనాలను తనిఖీ చేయకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చే స్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనతో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మందమర్రి తహసీల్దార్ సతీశ్ స్పందిస్తూ ఎన్నికల కోడ్ అమలు లో ఉన్న నేపథ్యంలో అనుమానాస్పదంగా కనిపించిన సందర్భాల్లో ఎంత నగదు అయినా స్వాధీనం చేసుకుని విచారణ చేస్తామని పేర్కొన్నారు. -
ఓటు.. ఇలా చెల్లుబాటు
ఇలా రెండు గుర్తులపై స్టాంప్ పడితే చెల్లదుఇలా అడ్డంగా మడత పెట్టవద్దుఅభ్యర్థి గుర్తుపై ఇలా స్టాంప్ వేయాలిఇలా నిలువుగా మడతపెట్టాలినేడు బ్యాలెట్ పద్ధతిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నందున ఓటర్లు జాగ్రత్తగా ఓటేయాలి. లేకుంటే ఓటు చెల్లకుండా పోయే ప్రమాదముంది. పోలింగ్ సిబ్బంది నిలువుగా మడిచి ఇచ్చిన బ్యాలెట్ పేపర్పై నచ్చిన అభ్యర్థి గుర్తుపై స్వస్తిక్ స్టాంపు వేయాలి. ఆ తరువాత బ్యాలెట్ను యథావిధిగా మడిచి బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ఇలా కాకుండా బ్యాలెట్ను అడ్డంగా మడతపెడితే ఒక గుర్తుపై వేసిన స్టాంపు ఇంకు మరో గుర్తుపై అంటుకుని ఓటు చెల్లకుండా పోతుంది. అందుకే పోలింగ్ సిబ్బంది నిలువుగా మడిచి ఇచ్చిన బ్యాలెట్ను ఓటేసిన తర్వాత యథావిధిగా మడిచి బ్యాలెట్ బాక్స్లో వేస్తే చెల్లుబాటవుతుంది. – భైంసాటౌన్ -
గాయపడిన అరుదైన గుడ్లగూబ
కౌటాల: మండల కేంద్రానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం అరుదైన గుడ్లగూబను అటవీశాఖ అధికారులు రక్షించి చికిత్స అందించారు. ఉదయం వాకింగ్కు వెళ్లిన సమయంలో స్థానికుడు పందిర్ల శ్రీనివాస్ గాయపడిన పక్షిని గమనించి అటవీ సెక్షన్ అధికారి తులసీదాస్, బీట్ అధికారి శ్రీదేవికి సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన అటవీ అధికారులు ఎఫ్ఆర్వో ప్రవీణ్కుమార్ ఆదేశాల మేరకు వెంటనే గుడ్లగూబను పశువైద్యశాలకు తరలించిన చిక్సిత అందించారు. కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏడు రకాల గుడ్లగూబ జాతులున్నాయని, గాయపడిన గుడ్లగూబను బార్ ఓల్ (చంద్రముఖ గుడ్లగూబ)గా పిలుస్తారని ఎఫ్ఆర్వో ప్రవీణ్కుమార్ తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. గాయపడిన పక్షిని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చిన శ్రీనివాస్ ఆయన అభినందించారు. -
మెగా జాబ్మేళాకు స్పందన
ఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్లోగల వైటీసీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు స్పందన లభించింది. మేళాకు 312 మంది హాజరుకాగా 133 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ తెలిపారు. అంతకుముందు ఇటీవల జిల్లా స్థాయిలో ప్రేరణ బాలికల క్రీడా పో టీల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్తోపాటుగా ఇతర క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను తన చాంబర్లో అభినందించారు. కార్యక్రమాల్లో ఐటీడీఏ డీడీ అంబాజీ, ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ పార్థసారథి, వైటీసీ జేడీఎం నాగభూషణం, హార్టికల్చర్ ఆఫీసర్ సందీప్కుమార్, ఏసీఎంవో జగన్ తదితరులున్నారు. -
మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య
ఇంద్రవెల్లి: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని హర్కపూర్తండాలో చోటు చేసుకుంది. ఎస్సై సాయన్న, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్కపూర్తండా గ్రామానికి చెందిన జాదవ్ వెంకటేశ్ (30) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా అతడు మద్యానికి బానిసయ్యాడు. భార్య సంగీత, కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా మారలేదు. ఈ నెల 5న మద్యం తాగి ఇంటికి వచ్చిన వెంకటేశ్ను కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై మద్యం మత్తులో పురుగుల మందు తాగి సమీప బంధువైన జాదవ్ గోవింద్కు ఫోన్ ద్వారా విషయం తెలిపాడు. గోవింద్ ఇచ్చిన సమాచారం మేరకు పంటచేనుకు వెళ్లి చూడగా వెంకటేశ్ స్పృహ కోల్పోయి ఉన్నాడు. వెంటనే అతడిని ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కొడుకు సాయికుమార్, కూతురు కృష్ణవేణి ఉన్నారు. -
‘వేలాల’.. చిన్న చూపెలా?
జైపూర్: ఉత్తర తెలంగాణలో మరో కొమురవెల్లి మల్లన్నగా వెలుగొందుతున్నాడు వేలాల మల్లన్న స్వామి. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తులకు కొంగుబంగారం నిలుస్తూ దినదిన ప్రవర్తమానం చెందుతున్నాడు. ఏటా ఇక్కడ శివరాత్రికి మహాజాతర నిర్వహిస్తారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన భక్తులు కూడా వేలాదిగా తరలివస్తారు. జాతర సమయంలో వేలాల ప్రాంతం భక్తజన సంద్రంగా మారుతుంది. కానీ, దశాబ్దాలు గడుస్తున్నా మల్లన్న ఆలయం అభివృద్ధి చెందడం లేదు. జాతర ప్రాముఖ్యతను గుర్తించని ప్రభుత్వాలు ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంలేదు. ఇక్కడి పాలకులు ఇంతటి విశిష్టత కలిగిన శైవక్షేత్రంపై దృష్టి సారించకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తంజేస్తున్నారు. ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడురోజులపాటు వేలాలలో మహాజాతర నిర్వహించనున్నారు. మహాజాతర సందర్భంగా రూ.50లక్షలకు పైనే ఆలయానికి ఆదాయం సమకూరుతుంది. అయినా.. ఆలయాభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఇదీ.. ఆలయ నేపథ్యం జైపూర్ మండలం వేలాల గ్రామంలో గుట్ట (గట్టు)పై స్వయంభువుగా శ్రీమల్లన్నస్వామి వెలిశా డు. గుట్టపైన దొణలో 200 ఏళ్ల కిందట గట్టు మల్ల న్న స్వామి వెలియగా గ్రామంలో శ్రీమల్లికార్జునస్వామి ఆలయం నిర్మించారు. ఏటా మహాశివరాత్రి పర్వదినాన నిర్వహించే మహాజాతరకు మూడు రాష్ట్రాల భక్తులు అధికసంఖ్యలో వస్తారు. ఇష్టదైవమైన మల్లన్నస్వామికి మొక్కులు తీర్చుకుంటారు. తాత్కాలిక వసతులతోనే సరి జాతర సమయంలోనే ఇక్కడ భక్తులకు తాత్కాలిక సౌకర్యాలు మాత్రమే కల్పిస్తారు. తొలిరోజు గుట్టపై అటవీ ప్రాంతంలో జాతర సాగుతుంది. అక్కడ దొణలోని మల్లన్నస్వామి ఆలయం, కింద గ్రామంలో నిర్మించిన శ్రీమల్లికార్జునస్వామి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రధానంగా గుట్టపైన భక్తులకు తాగునీటి వసతి, గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, మూత్రశాలలు, లైటింగ్ తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. వీటితో పాటు ఘాటు రోడ్డు నిర్మాణం, దొణలో వెలిసిన మల్లన్నస్వామిని సులభంగా భక్తులు దర్శనం చేసుకునేలా అవకాశం కల్పించాలి. జాతరలో రెండోరోజున గుట్ట కింద మల్లికార్జునస్వామి ఆలయం వద్ద జాతర సాగుతుంది, కానీ, ఇక్కడా భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆలయ సమీపంలో భక్తులకు విశ్రాంతి భవనాలు నిర్మించి సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా తాత్కాలిక వసతులతోనే సరి పెడుతున్నారు. గుట్టపైకి మట్టి రోడ్డే దిక్కు వేలాల గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులంతా గుట్టపైకి కాలి నడకన చేరుకుంటారు. గుట్టపైకి వెళ్లే రోడ్డు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే రోడ్డులో వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా దుమ్ము లేచి నడకమార్గంలో వెళ్లే భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు. నేటికీ ఇక్కడ సీసీ రోడ్డు నిర్మించలేదు. దీంతో మట్టి రోడ్డు మార్గంలోనే భక్తులు వెళ్తుంటారు. ప్రతీ నెలలో ఆరుద్ర నక్షత్రం రోజున గట్టు మల్లన్న గుట్టపై భక్తులు గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. జాతర సమయంలోనే కాకుండా మిగతా స మయాల్లోనూ భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పటికై నా చెన్నూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతీసుకుని ప్రభుత్వం నుంచి ని ధులు మంజూరు చేయించి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. -
ఓపీఎస్ను పునరుద్ధరించాలి
ఆదిలాబాద్టౌన్: సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బడ్నాల రాజశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్, ఐటీడీఏ, సమగ్ర శిక్ష నాయకులు రాష్ట్ర అధ్యక్షునికి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుమ్ర యాదవ్రావ్, మహిళా అధ్యక్షురాలు జీజాబాయి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్చవాన్, గోపీకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమ్ర యాదవ్రావ్, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎనుకుని అ నంతరం వారితో ప్రమాణాస్వీకారం చేయించారు. ఆర్థిక కార్యదర్శిగా ఉదార్ కేశవ్, ఉపాధ్యక్షులుగా గోమంత్రెడ్డి, గంగాధర్, నవనీత, విలాస్, సత్యనారాయణ, సురేశ్, కార్యదర్శులుగా జ్యోతిరాం, రాజేశ్, శ్రీనివాస్, అనిల్, సుమన్, స్వామి, రాష్ట్ర కా ర్యవర్గ సభ్యులుగా బచ్చునారాయణ, అంబాజీ, సంగీత, ప్రకాశ్, గోపాలకృష్ణ, రాజ్కుమార్, ప్రచా ర కార్యదర్శిగా జయసారథి, మహిళా విభాగం కన్వీనర్గా జీజాబాయి, కోకన్వీనర్గా గౌతమి, సేవా విభాగం కన్వీనర్గా వీరయ్య, కోకన్వీనర్గా అర్జున్ పవార్, సాంస్కృతిక, క్రీడల విభాగం కన్వీనర్గా రాజ్కుమార్, మోడల్స్కూల్ కన్వీనర్ రాజశేఖర్, ఐటీడీఏ విభాగం కన్వీనర్గా వసంత్రావు, పర్యావరణ విభాగం కన్వీనర్ వాసుదేవ్ ముండే, ఆర్చీవ్ విభాగం కన్వీనర్గా సురేందర్ రాథోడ్, హమారా విద్యాలయ్ హమారే తీర్థ్ వింగ్ కన్వీనర్లుగా నాగేశ్, రాకేశ్ను ఎన్నుకున్నారు. -
రెండు గంటల్లోనే చోరీ కేసు ఛేదన
ఆదిలాబాద్టౌన్: జైనథ్ మండలంలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తన కార్యాలయంలో మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సాత్నాల మండలం కెనాల్ మేడిగూడ గ్రామానికి చెందిన గుమ్మడి రవీందర్ కూలీ పనులు చేస్తూ జీ వనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు డబ్బులు అవసరమై అదే గ్రామానికి చెందిన బరపటి వెంకటి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడ్డాడు. బీరువాలోని మూడున్నర తులాల బంగా రం, 50 తులాల వెండి ఆభరణాలు, ఎనిమిది తు లాల రాగి వస్తువులు దొంగలించి తన ఇంటి సమీ పంలో మట్టిలో దాచిపెట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జైనథ్ పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. గ్రామంలో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న రవీందర్ను అదుపులోకి తీసుకుని విచారించగా, దొంగతనం చేసినట్లు ఒప్పుకొన్నాడు. అనంతరం అతని ఇంటి సమీపంలో మట్టిలో దాచిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5లక్షల వరకు ఉంటుంది. అత్యంత వేగంగా కేసు ఛేదనలోకీలకపాత్ర పోషించిన జైనథ్ సీఐ శ్రావణ్, సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. -
జింక అడ్డురావడంతో రోడ్డు ప్రమాదం
ఖానాపూర్: మండలంలోని ఇక్బాల్పూర్ గ్రామం మీదుగా నిర్మల్ వైపు వెళ్తున్న కారు గ్రామంలోని రోడ్డుపై మంగళవారం ప్రమాదానికి గురైంది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన చంద్రకాంత్, అతడి భార్య సూర్యలీల, కుటుంబీకులతో కలిసి కోరుట్ల నుంచి నిర్మల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న జింక కారుకు అడ్డుగా వచ్చి ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. చంద్రకాంత్, సూర్యలీల గాయపడ్డారు. ఖానాపూర్ ఎఫ్ఢీవో శివకుమార్, మామడ మండలం దిమ్మదూర్తి ఎఫ్ఆర్వో శ్రీనివాస్రావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులు చంద్రకాంత్, సూర్యలీలను 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై విచారణ చేపట్టినట్లు తెలిపారు. -
చిక్సిత పొందుతూ ఇద్దరు మృతి
కౌటాల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందారు. వివరాలు.. మండలంలోని గురుడుపేట గ్రామానికి చెందిన నాగోశే మొండి (17), బోదంపల్లి గ్రామానికి చెందిన ఆదే అభిరాం (6), వడాయి మోహన్ ఈ నెల 7న బెజ్జూర్ మండలం హేటిగూడలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో బైక్పై వెళ్లారు. ఈ క్రమంలో హేటిగూడ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్ నిలో ఫర్ ఆస్పత్రికి తరలించగా చిక్సిత పొందుతూ అభిరాం సోమవారం మృతి చెందగా.. నగేశ్ మొండి మంగళవారం మృతి చెందినట్లు కు టుంబీకులు తెలిపారు. వడాయి మోహన్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సర్తార్ పాషా తెలిపారు. బైక్ అతివేగం, అజాగ్రత్తతో నడపం, నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి కిందపడి ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. బావిలో పడి ఇంటర్ విద్యార్థిని మృతి ఉట్నూర్రూరల్: నీటి కోసం వెళ్లిన ఇంటర్ విద్యార్థిని ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మండలంలోని హస్నాపూర్లో చోటు చేసుకుంది. ఏఎస్సై రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హస్నాపూర్ గ్రామానికి చెందిన మోహన్ కుమార్తె సోనీ (17) నార్నూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. సోనీ ఆరు నెలలుగా తలనొప్పితో బాధ పడుతోంది. ఆస్పత్రుల్లో చి కిత్స చేయించినా నయం కాలేదు. దీంతో ఇంటి వద్దే ఉంటోంది. మంగళవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని బావి వద్దకు నీటి కోసమని వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందింది. సోనీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బావి వద్దకు వెళ్లి చూడగా కనిపించలేదు. అనుమానంతో బావిలో వెతకగా సోనీ మృతదేహం లభించింది. సోనీ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఆమె తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. -
సేవాలాల్ జయంతి ఘనంగా నిర్వహించాలి
కై లాస్నగర్: బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో వే డుకల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 18న జిల్లాకేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించాలన్నారు. తండాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పా ట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేడుకల ప్రాంగణాల్లో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి వసతులు కల్పించాలన్నారు.భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పో లీస్శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ రద్దీ నివారణకు అవసరమైన మళ్లింపులు చేపట్టాలని సూచించారు. పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అత్యవసర పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్య శిబిరా లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే అంబులె న్స్లను సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. సేవాలాల్ బోధనలు, ఆయన స మాజ సేవను యువతకు తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూ చించారు. అనంతరం వేడుకల ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, గిరిజన సంక్షేమ శా ఖ, పోలీస్ శాఖల అధికారులు, బంజారా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
నిఘా నీడలో ఎన్నికలు
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎ న్నికలు నిఘా నీడలో జరగనున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్టాటిస్టిక్ ఫోర్స్, ప్రత్యేక బలగాలతో పాటు పోలీస్, అటవీశాఖ, టీజీఎస్పీ, ఏసీబీ, జైళ్ల శాఖ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహించిన వారిపై కఠిన చర్యలు చేపట్టారు. 80 మద్యం కేసులు నమోదు కాగా, దాదాపు రూ.3లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 49 వార్డుల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. మంగళవారం టీటీడీసీ వద్ద పోలీస్ సిబ్బందికి ఎస్పీ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ సురేందర్ రావ్, ఏఎస్పీ మౌనిక, ట్రెయినీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు ఎల్.జీవన్రెడ్డి, పోతారం శ్రీనివాస్, ఇంద్రవర్ధన్ తదితరులున్నారు. 200 మంది బైండోవర్ పట్టణాన్ని మొత్తం 14 రూట్లుగా విభజించారు. ఇందులో 62 పోలింగ్ లొకేషన్లు, 216 పోలింగ్ బూత్లు ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ పరిధిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 163 బీఎన్ఎస్ సెక్షన్ అమలు చేస్తున్నారు. గొడవలు సృష్టించే వారిని గుర్తించి ముందస్తుగా 200 మందిని బైండోవర్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 20 మంది వద్ద ఉన్న ఆయుధాలను సేఫ్ డిపాజిట్ చేశారు. భారీ బందోబస్తు ఎస్పీ పర్యవేక్షణలో వెయ్యి మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 మంది ఎస్సైలు, మహిళ సిబ్బంది, హోంగార్డులు, రిజర్వు పోలీసులు, సాయుధ పోలీసులు, స్పెషల్ పార్టీ బలగాలతో పాటు 53 మంది ఫారెస్ట్, ఇతర శాఖల సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. పది వార్డులకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ స్థాయి అధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు. మద్యం, నగదు స్వాధీనం.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పో లీసు శాఖ చర్యలు చేపట్టింది. అక్రమంగా మ ద్యం, నగదు తరలిస్తున్న వారిపై కేసులు నమో దు చేసింది. 80 మద్యం కేసుల్లో 378 లీటర్ల మ ద్యం స్వాఽ దీనం చేసుకోగా, వీటి విలువ రూ.6,19,647 ఉంది. అలాగే రూ.29లక్షల 90వే ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఐదు స్టాటిస్టిక్ చెక్పోస్టులను ఏర్పా టు చేశారు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 86 కేసులు నమోదయ్యాయి.ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హ క్కు వినియోగించుకోవాలి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నిబంధనలు అమలులో ఉంటాయి. లోనికి సెల్ఫోన్లు, వాట ర్, ఇంక్ బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వాటిని తీసుకెళ్లొద్దు. ఓటర్లను ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుంది. ఎవరైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు. ఎన్నికలు పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దు. అధికారుల అనుమతి తీసుకొని నిర్ధారించిన తేదిలో జరుపుకోవాలి. టపాసులు కూడా పేల్చవద్దు. ఎలాంటి సమాచారం ఉన్నా డయల్ 100కు తెలియజేయాలి. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
టీటీడీసీలో సందడి..
ఎన్నికల విధులు నిర్వహించనున్న సిబ్బంది మంగళవారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నా రు. టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకుని ప్రత్యేక వాహనాల్లో బందోబస్తు నడుమ తరలివెళ్లారు. అంతకు ముందు ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన విధానాలపై మాస్టర్ ట్రైనర్లు వారికి ప్రత్యేక అవగాహన కల్పించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి పరిశీలించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంతు నాయక్, ఎస్పీ అఖిల్ మహా జన్, అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తదితరులున్నారు. -
నేడే ‘పుర’ పోరు
ఎన్నికల సామగ్రితో సిబ్బందికై లాస్నగర్: జిల్లాలోని ఏకై క ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పట్టణంలోని 49 వార్డులకు గాను 314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారి భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ ద్వారా బాక్స్ల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 216 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రానికి ఒక పీవో, ఏపీవో, ముగ్గురు సహాయకుల చొప్పున 1,080 మందిని నియమించారు. మరో 218 మందిని రిజర్వ్లో ఉంచారు. వీరికి మూడు విడతల్లో శిక్షణ అందించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఆయా కేంద్రాల్లో వారికి విధులు కేటాయించారు. మొత్తం వార్డులను 14 రూట్లుగా విభజించి 14 మంది రూట్, 14 మంది జోనల్ అధికారులను నియమించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని కేంద్రాల పరిధిలో 163 బీఎన్ఎస్ చట్టం అమలు చేయనున్నారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. ఓటర్లందరికీ ఇప్పటికే బీఎల్వోల ద్వారా పోల్ చీటీలను పంపిణీ చేశారు. ప్రతీ రెండు గంటలకోసారి పోలింగ్ సరళిని ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లకు వైట్ కలర్ బ్యాలెట్ పత్రం ఇవ్వనున్నారు. ప్రతీ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్ చొప్పున 216 ఏర్పాటు చేశారు. అదనంగా మరో 44 రిజర్వ్లో ఉంచారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ప్రథమ చికిత్స వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసేందుకు వీలుగా వీల్ చైర్లతో కూడిన ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా ఐదు పోలింగ్ కేంద్రాలను మోడల్గా తీర్చిదిద్దారు. అక్కడ షామియానాలు, కుర్చీలు, తాగునీరు వంటి అన్ని వసతులు కల్పిస్తున్నారు. 128 కేంద్రాలపై ప్రత్యేక నిఘా పట్టణ పరిధిలోని 62 ప్రాంతాల్లో గల 128 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇందులో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేలా తగు చర్యలు చేపట్టారు. అలాగే 35 లోకేషన్స్లోని 37 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అన్ని కేంద్రాల్లో ప్రక్రియను పర్యవేక్షించేందుకు వీలుగా వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. టీటీడీసీలోని ప్రత్యేక కేంద్రం నుంచి అధికారులు పోలింగ్ సరళిని పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఓటర్లు 1,43,655బ్యాలెట్ బాక్స్లు 260 ఎన్నికలు జరిగే వార్డులు 49మున్సిపల్ ఎన్నికల నిర్వహణ వివరాలు పోలింగ్ సిబ్బంది 1,298బరిలో నిలిచిన అభ్యర్థులు 314పోలింగ్ కేంద్రాలు 216 -
అంతుచిక్కని ఓటరు నాడి
ఎవరికి వారే ధీమా..సాక్షి,ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల పండుగ రానే వచ్చింది.. ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోన మాత్రం వారికే సందేహాలు.. ప్రలోభాల పర్వంలో ఎక్కడా వెనుకబడకుండా ఓటరును ప్రసన్నం చేసుకున్నారు.. అలా గని నిశ్చింతగా ఉండని పరిస్థితి.. ఆ ఓటు తనకే పడుతుందా.. లేదా.. అనే సందేహం ప్రతీ అభ్యర్థిని వెంటాడుతోంది. ఓటరు నాడీపై అంచనాకు రాలేకపోతున్నారు. మాది అధికార పార్టీ.. మీ ఓటు ఇతర పార్టీలకు వేసి వృథా చేసుకోవద్దని కాంగ్రెస్ అంటుండగా, మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి అనేక నిధులు రావడం జరుగుతాయని, అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ చెబుతోంది. తమ హయాంలోనే పట్టణ రూపురేఖలు మారాయని, మళ్లీ పట్టం కడితే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని బీఆర్ఎస్ ఓటర్లకు భరోసానిస్తోంది. మున్సిపాలిటీలో పార్టీ ప్రాతినిధ్యం ఉంటేనే మన వార్డుల్లో అభివృద్ధి పనులు చేసుకోగలుగుతామని ఎంఐఎం చెబుతోంది. గతంలో చైర్ పర్సన్గా బల్దియా అభివృద్ధికి తో డ్పాటునందించామని, ప్రత్యేక ప్యానల్తో బరిలో దిగిన తమను ఆదరిస్తే ఆ అనుభవంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయనున్నట్లుగా ఏఐఎఫ్బీ పార్టీ స్పష్టం చేస్తుంది. ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన తమను గెలిపిస్తే వార్డుల్లో క్రమ పద్ధతిగా అభివృద్ధి పనులు చేపడతామని స్వతంత్ర అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఓటరు ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతాడో అర్థం కాని పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను జనవరి 27న రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లాలో ఏకై క మున్సిపాలిటీ ఆదిలాబాద్లోని 49 వార్డుల ఎన్నిక కోసం 28న నోటిఫికేషన్ జారీ కావడం, అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఆ తర్వా త ప్రచారం మొదలుపెట్టారు. 9తో ఈ ప్రక్రియ ముగిసింది. నేడు పోలింగ్ జరగనుండగా, ఈనెల 13న ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితాల వెల్లడి, 16న మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. నేడు నిర్వహించనున్న కీలక ఘట్టంపైనే అందరి దృష్టి నెలకొంది. స్వతంత్రుల ప్రభావమెంత.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల నుంచి స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో ప్రధాన పార్టీల నుంచి టికెట్ను ఆశించి భంగపడ్డ వారు కొందరు ఉన్నారు. వారు ఆయా ప్రధాన పార్టీలకు రెబల్గా బరిలో నిలిచారు. ఓట్లను చీల్చ డం ద్వారా తమ పార్టీ అభ్యర్థి గెలుపుపై వారు ప్రభావం చూపుతారా అనే సందేహం ఆయా పార్టీ ల్లో వ్యక్తమవుతుంది. పార్టీ ఆదేశాలు ధిక్కరించి బరిలో నిలిచిన వారు ఒకవేళ గెలిస్తే తమ నిర్ణయంపై వేలెత్తి చూపేందుకు ఆస్కారం ఉంటుందని ముఖ్య నేతల్లో ఆందోళన కూడా కనిపిస్తోంది. ఒకవేళ మెజార్టీకి కొంత అటూ ఇటుగా ఉండి, స్వతంత్ర అభ్యర్థులుగా రెబల్స్ గెలిచిన పక్షంలో వారు తమ పార్టీకి అనువుగా ఉంటారా.. లేదా అనే సందేహాలు కూడా లేకపోలేదు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆసక్తికరంగా మారింది.ఈ ఎన్నికల్లో చైర్పర్సన్ పీఠం కై వసం చేసుకోవడం ఖాయమని ప్రధాన పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు మెజార్టీ సాధించడం ఖాయమంటున్నాయి. తాము పూర్తిస్థాయిలో సత్తా చూపుతామని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ ఎన్నికల్లోనూ తమ పార్టీ మంచి ఫలితాలు సాధించి పాలకవర్గం ఏర్పాటులో కీలకమవుతుందని ఎంఐఎం పేర్కొంటోంది. అధికార ప్రతిపక్ష పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, తమ ప్యానల్ను జనాల్లో ఆదరిస్తున్నారని ఏఐఎఫ్బీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. మొత్తంగా ఫలితాలు ఎలా ఉంటాయనేది అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. -
ఓటర్లు కదిలేనా.. పోలింగ్ శాతం పెరిగేనా?
కై లాస్నగర్: ఓటు హక్కు వినియోగంలో పల్లె ఓట ర్లతో పోల్చితే పట్టణ ఓటర్లు ఎప్పుడూ కొంత వెనుకబడే ఉంటారు. ఓటు వేయడం మనకేందుకనో.. క్యూలో నిలబడడం అవసరమా అని భావించడ మో తెలియదు కానీ పట్టణ ఓటరు ఓటింగ్పై అంతగా ఆసక్తి చూపరు. ఇందుకు ఇటీవల జరిగిన పల్లె పోరు, గతంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతమే నిదర్శనం. గతేడాది డిసెంబర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 86శాతం పోలింగ్ నమోదు కావడం పల్లె ఓటర్లలో వెల్లివిరిసిన ఓటు చైతన్యానికి అద్దం పడుతోంది. ఇదే స్ఫూర్తితో పట్టణంలోనూ వందశాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా అధికార యంత్రాంగం స్వీప్ ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించింది. అయితే ఇది ఏ మేరకు ఫలిస్తుందనేది నేడు స్పష్టం కానుంది. ప్రచారం ఫలించేనా? ఓటు ప్రాధాన్యతను వివరించేలా జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించింది. పట్టణంలోని భా గ్యనగర్, కేఆర్కే కాలనీల్లో పలు కార్యక్రమాలు ని ర్వహించారు. ఎన్సీసీ కెడెట్లు, విద్యార్థులు, యువతతో పలు చోట్ల ర్యాలీలు చేపట్టారు. అన్ని వార్డుల్లోనూ బీఎల్వోలు, ఆశా, అంగన్వాడీలు, మున్సిపల్ సిబ్బంది ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవా లని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటు ప్రాఽ దాన్యత తెలియజేసేలా స్వీప్ ప్రత్యేక రథాల ద్వారా పట్టణంలో ప్రచారం చేశారు. అలాగే పట్టణంలోని ఐదు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇవి ఎంత వరకు ఫలిస్తాయి, వీటి ద్వారా ఓటర్లు కేంద్రాలకు కదులుతారా, పోలింగ్ శాతం ఏ మేరకు పెరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఇలా.. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 49 వార్డుల పరిధిలో మొత్తం 1,27,922 మంది ఓటర్లు ఉన్నా రు. వీరిలో 89,482 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 38,440 మంది పోలింగ్కు దూరంగా ఉన్నారు. పాలకులను ఎన్నుకోవడంలో ఓటు ఎంతో కీలకం. అయితే 69.95 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటు వేయడం గమనార్హం. ఈ సారి పెరిగేనా.. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి పట్టణ పరిధిలో ఓటర్లు పెరిగారు. దీంతోనైనా పోలింగ్ శాతం పెరుగుతుందా లేక పాత పరిస్థితే ఉంటుందా అనే దాని పై చర్చ సాగుతోంది. బుధవారం నిర్వహించే ఎన్ని కల్లో పోలింగ్ శాతం గతంతో పోల్చితే అధికంగా న మోదయ్యే అవకాశముటుందని అధికారులు చెబు తున్నారు. ప్రస్తుతం1,43,655మంది ఓటర్లున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు విస్తృ త ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థించడంతో పాటు నగదు, మద్యం భారీగా పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఓటర్లు కదలివచ్చి తమ చైతన్యాన్ని ప్రదర్శిస్తారా లేక మరోసారి వెనుకబడి ఉంటారా అనేది నేడు వెల్లడికానుంది. -
భరోసానిచ్చేలా.. ఫ్లాగ్మార్చ్
పట్టణంలోని బొక్కలగూడ, అబ్దుల్లా చౌక్, ఖానాపూర్, అంబేడ్కర్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడారు. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా జిల్లా పోలీస్శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. డబ్బు, మద్యం, బహుమతులు వంటి ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు బి.సునీల్ కుమార్, ఎం.ప్రసాద్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. –ఆదిలాబాద్టౌన్ -
‘ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు’
ఆదిలాబాద్రూరల్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను భయబ్రాంతుల కు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మావలలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ పట్టణాన్ని రూ.కోట్లాది ని ధులు వెచ్చించి అభివృద్ధి చేశామని, రాష్ట్రంలో అధి కారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న కాంగ్రెస్ ఆదిలా బాద్ మున్సిపాలిటీకి నయాపైసా ఇవ్వలేదని ఆరో పించారు. పట్టణంలోని ఓ వార్డులో డబ్బులు పంపిణీ చేస్తున్నారని తమ పార్టీకి చెందిన కార్యకర్తలు 100కు డయల్ చేస్తే సకాలంలో స్పందించకుండా పంపిణీ పూర్తి అయిన తర్వాత వచ్చారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానులేనని, అయితే పోలీసులు, అధికారులు దానిని విస్మరిస్తున్నారని ఆరోపించారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కోర్టులో స్టే ఉందని, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్ని కలు దృష్టిలో ఉంచుకోని నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురి రౌడిషిట్ కేసులు ఉన్నప్పటికీ అలాంటి వారిని బైండోవర్ చేయకుండా తమ పార్టీకి చెందిన నాయకులను బైండోవర్ చేస్తున్నారని విమర్శించా రు. ఆయా పార్టీలు ఏం చేసినా ఆదిలాబాద్ మున్సి పాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు నారాయణ, శ్రీకాంత్, ఉమాకాంత్రెడ్డి, సుధీర్, కిరణ్, సృజన్, ఆజీం, ప్రసాద్, ఆసీఫ్ ఉన్నారు. -
న్యాయవాది ఇంట్లో పోలీసుల సోదాలు
చెన్నూర్: బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు, న్యా యవాది పొన్నం మల్లేశం గౌడ్ ఇంట్లో సీఐ బన్సీలాల్, పోలీసులు, ఎన్నికల అధికారులు తహసీల్దార్ మల్లికార్జున్, ఏవో యామిని సోమవారం సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మల్లేశంగౌడ్ ఇంట్లోనే ఉన్నారు. మద్యం, నగదు, ఓటర్లను ప్రభావితం చేసే సామగ్రి లభించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మంత్రికి తొత్తులుగా మారిన అధికారులు ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చర్యలు చేపట్టాల్సిన అధికారులు మంత్రికి తొత్తులుగా మారారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. క్యాతన్పల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగించుకొని పొన్నం మల్లేశంగౌడ్ ఇంటికి టీ తాగేందుకు వచ్చానన్నారు. మంత్రి ఆదేశాల మేరకు మల్లేశంగౌడ్ ఇంట్లో సోదాలు చేపట్టారన్నారు. కేవలం బీఆర్ఎస్ నాయకులనే పోలీసులు టార్గెట్ చేశారని మండిపడ్డారు. -
తీవ్రమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ వివాదం
ఖానాపూర్: ఖానాపూర్లో ఏర్పాటు చేయాల్సి న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉట్నూర్కు తరలించా రంటూ ఇంటిగ్రేటెడ్ సాధన సమితి ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ వివాదానికి దారితీసింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలించామని జేఏసీ, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, స్థలం లేకే స్కూల్ ఏర్పాటు కాలేదని, దీనిపై ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో జేఏసీ నాయకులు తాము సైతం ప్రమాణం చేస్తామంటూ సోమవారం స్థానిక ముత్యాల పోచమ్మ ఆలయానికి తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఎమ్మెల్యే రాకపోవడంతో జేఏసీ నాయకులు వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి తనస్థాయికి తగ్గ వ్యక్తులు కానప్పటికీ వారు వస్తే సవాల్ స్వీకరిస్తానని అనంతరం జరిగిన కాంగ్రెస్ సభలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రకటించారు. గృహహింస కేసులో ఒకరికి జైలు ఖానాపూర్: గృహహింస కేసులో నిందితుడికి ఏడునెలల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ నిర్మల్ ప్రిన్సిపల్ అండ్ డిస్టిక్ర్ట్ సెషన్స్ జడ్జి ఎస్.శ్రీవాణి సోమవారం తీర్పు వెలువరించారు. మండలంలోని పాత ఎల్లాపూర్కు చెందిన ఆడెపు పుష్పలత ఫిర్యాదు మేరకు ఆమె భర్త వేణుగోపాల్పై 2012లో ఖానాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా 498(ఏ) ఐపీసీ, డౌరీ నిరోధక చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. విచారణ అనంతరం కోర్టులో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు. హత్య కేసులో జీవితఖైదు ఆదిలాబాద్టౌన్: హత్య కేసులో నిందితుడు మడావి అయ్యుకు జీవితఖైదుతో పాటు రూ.15వేల జరిమానా విధిస్తూ ఫ్యామిలీ కోర్టు, 3వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి పి.లక్ష్మికుమారి సోమవారం తీర్పునిచ్చినట్లు లైజన్ అధికారి గంగాసింగ్ తెలిపారు. 2018లో తలమడుగు పోలీస్స్టేషన్లో హత్య కేసు నమోదైంది. అప్పటి సీఐ ప్రదీప్ విచారణ చేపట్టి చార్జిషీటు దాఖలు చేశారు. సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువుకావడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చినట్లు వివరించారు. ఆదిలాబాద్టౌన్: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి ప్రభాకర రావు సోమవారం తీర్పునిచ్చినట్లు లైజన్ అధికారి గంగాసింగ్ తెలిపారు. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన బగనూరే జ్ఞానేశ్వర్ అదృశ్యమైనట్లు 2020 నవంబర్ 8న ఇచ్చోడ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. జాదవ్ శ్రీనివాస్, సిందే అచ్చత్, సిందే గోవింద్రావు, సిందే రాంకిషన్ కలిసి జ్ఞానేశ్వర్ను ఇచ్చోడలో హత్య చేసి మహారాష్ట్రలోని పిప్పల్గావ్ ఘాట్లో పడేసినట్లు విచారణలో తేలింది. అప్పటి సీఐ నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నేరం రుజువుకావడంతో జాదవ్ శ్రీనివాస్కు జీవితఖైదు విధిస్తూ జడ్జి తీర్పునిచ్చినట్లు వివరించారు. గంజాయి పట్టివేత -
ఇరుకు.. ఇక్కట్లు
పట్టణంలోని పురాతన కాలనీ అయిన అశోక్ రోడ్లో వెళ్లాలంటే జనం జంకుతున్న పరిస్థితి. వినాయక్ నుంచి తిర్పెల్లి వరకు గల ఈ రోడ్డు గతంలో ప్రధాన రోడ్డుగా ఉండేది. కాల క్రమేణ ఇరుకుగా మారింది. ఈ రహదారిని విస్తరించాలని ఏళ్లుగా డిమాండ్ వినిపిస్తున్నా అ మలులోకి రావడం లేదు. 10 ఫీట్లతో కూడిన ఈ రోడ్డుపై ఒక వాహనం వెళ్లాలంటే మరో వాహనం ఆగాల్సిన దుస్థితి. బంగారు దుకా ణాలు ఉండడంతో నిత్యం రద్దీ అధికం. భారీ వాహనాలు వస్తే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోతోంది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సైతం ఈ మార్గం గుండా వెళ్లలేని పరిస్థితి. -
ఖానాపూర్ చెరువు.. కబ్జా
గతంలో పట్టణంలోని పలు కాలనీల దాహార్తితో పాటు సాగునీటిని అందించిన ఖానాపూర్ చెరువు క్రమంగా కాలుష్యకాసారంగా మారింది. మురుగునీరంతా అందులోకి చేరడం, గుర్రపు డెక్కతో నిండడంతో ఉనికి సైతం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పెరుగుతున్న ఆక్రమణలతో చెరువు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. గుర్రపు డెక్క కారణంగా మత్స్యకారుల ఉపాధికి విఘాతం ఏర్పడుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చాలని సంకల్పించింది. ఇందుకోసం రూ.2.50 కోట్ల నిధులు కేటాయించింది. రూ.కోటిన్నర వరకు ఖర్చు చేసినా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడం గమనార్హం. -
బాధితులకు అండగా ఉండాలి
ఆదిలాబాద్టౌన్: బాధితులకు ఎల్లవేళలా అండగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో సో మవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి ద్వారా 13 ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. బాధితులు తమ సమస్యలను వివరించగా, వాటిపై స్పందించిన ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, త్వరితగతిన పరి ష్కరించి న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ఆదిలాబాద్టౌన్: కార్మిక చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో సోమవారం జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరారు. అనంతరం సమ్మెకు సంబంధించిన బుక్లెట్లను ఆవిష్కరించారు. సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న, ఉపాధ్యక్షులు డి.వెంకటమ్మ, ఎస్.నవీన్ కుమార్, ఎం.గంగన్న, సహాయ కార్యదర్శులు ఆర్.సురేందర్, నగేష్, పోచన్న, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని ఒకరు..
ఇంద్రవెల్లి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఇ.సాయ న్న, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు దొడందా గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చౌమాన్ హీరాలాల్ (28)కు రెండేళ్ల క్రితం కడెం మండలంలోని అల్లంపల్లి బాబానాయక్తాండకు చెందిన రాథోడ్ సరస్వతితో వివాహమైంది. కొంతకాలంగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య, తల్లితో గొడవపడేవాడు. వారం రోజుల క్రితం భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లాడు. ఆమెను అక్కడే ఉంచి ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం అతని తల్లి సుందబాయి పింఛన్ డబ్బుల కోసం నర్సాపూర్కు వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై మరొకరు..కాసిపేట: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారాం తెలిపిన వివరాల మేరకు దేవాపూర్ రాంపూర్కు చెందిన తోటపల్లి శంకర్ (50) కూలీపని చేసుకుని జీవనం సాగించేవాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. సోమవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి అరగంట తర్వాత ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని పడుకున్నాడు. 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఎంతపిలిచినా తలుపులు తీయకపోవడంతో గడ్డపార సాయంతో తొలగించి చూడగా దూలానికి చీరతో ఉరేసుకుని కనిపించాడు. మద్యం మానలేక, పనిచేయలేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని భార్య దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
దేశీదారు పట్టివేత
సాత్నాల: భోరజ్ మండలంలోని గిమ్మ శివారులో సోమవారం దేశీదారు పట్టుకున్నట్లు ఎస్సై పవర్ గౌతమ్ తెలిపారు. జైనథ్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా రాంపూర్కు చెందిన సినారె వినోద్, ఉట్ల ప్రవీణ్ ఎక్సెల్ వాహనంపై సంచితో అనుమానాస్పదంగా కనిపించారు. సంచిని తనిఖీ చేయగా 240 లీటర్ల 90 ఎంఎల్ దేశీదారు బాటిళ్లు లభించాయి. వాటి విలువ రూ.12 వేలు ఉంటుందన్నారు. మహారాష్ట్రలోని చేనాక నుంచి తెచ్చినట్లు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పట్టా మంజూరు చేయాలని ఉట్నూర్ మండలం శ్యాంపూర్కు చెందిన దుర్గం ధర్మయ్య, బోర్వెల్ మంజూరు చేయాలని ఇంద్రవెల్లి మండలం మార్కగూడకు చెందిన దేవరావు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నార్నూర్కు చెందిన సరిత, దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని ఉట్నూర్ మండలం రామగూడకు చెందిన మారుతీరావు అర్జీలు సమర్పించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మం జూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. -
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ గడువు
కై లాస్నగర్: ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ గడువు సోమవారంతో ముగిసింది. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్లో ఈ నెల 6నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. నాలుగు రోజుల్లో 435 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో 52 మంది సర్వీస్ ఓటర్లతో పాటు ఇతర మరో ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ను వారి చిరునామాకు పంపించారు. ఈ బ్యాలెట్ పత్రాలు కౌంటింగ్కు ముందు రోజు వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి చేరేలా చూడాల్సి ఉంటుంది. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్లను ప్రత్యేక గదిలో భద్రపరిచి సీల్ వేశారు. వాటిని ఓట్ల లెక్కంపు రోజున కౌంటింగ్ కేంద్రానికి తరలించనున్నట్లు ఎన్నికల నోడల్ అధికారి ఫణిందర్ రావు తెలిపారు. -
మద్యం షాపులు బంద్
ఆదిలాబాద్టౌన్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణ పరిధిలో మద్యం షాపులు మూ సివేస్తున్నట్లుగా ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్ తెలిపారు.ఈ మేరకు సోమవారం సాయంత్రం పట్టణంలోని బార్లు, వైన్స్ షాపులను ఎక్సై జ్ అధికారులు మూసివేయించారు. మున్సి పల్ పరిధిలో మంగళ, బుధవారాల్లో షాపులు బంద్ ఉంచాలని పేర్కొన్నారు. అలాగే ఈనెల 13న కౌంటింగ్ రోజు కూడా పట్టణంలోని 11 బార్లు, 10 వైన్స్లు, తెల్లకల్లు దుకాణాలు బంద్ పాటించాలని సూచించారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు షాపులు తెరువవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
కైలాస్నగర్: ఆదిలాబాద్ పట్టణాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ఈనెల 11న నిర్వహించే మున్సి పల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మత్ హుస్సేన్ కోరారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పేదల సంక్షేమం కో సం పనిచేసే పార్టీ అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని తెలిపారు. గడిచిన పదేళ్లలో అధి కారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఆదిలాబాద్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లోనూ తెలంగాణకు మొండిచేయి చూపిందన్నారు.అభివృద్ధిలో విఫలమైన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు.ఇందులో డీసీ సీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బరిలో బంధువులు
లక్సెట్టిపేట: మున్సిపల్ ఎన్నికల్లో ఎనిమిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల్లో తీవ్ర పోటీ నెలకొంది. బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పోటీ చేస్తున్నారు. ముగ్గురిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాందేని చంద్రకళ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాందేని జమున వరుసకు పిన్ని, కూతురు అవుతారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న గడికొప్పుల శీలారాణి జమునకు అత్తమ్మ, చంద్రకళకు వదిన అవుతారు. ముగ్గురు ఒకే గ్రామానికి చెందినవారు. దీంతో ఎవరికి ఓటు వేయాలనే సంకోచంలో ఓటర్లు ఉన్నారు. -
ఎన్నికల నియమాలు పాటించాలి
ఆదిలాబాద్టౌన్: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ ఎన్నికల నియమాలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. స్థానిక టీటీడీసీ కేంద్రంలో సోమవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలి పారు. ప్రజలు అనవసరంగా గుమిగూడరాదని, గుంపులుగా తిరగరాదని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోనికి సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇంకు బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, గొడవలకు దారితీసేలా పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. సోమవారం సాయంత్రం 5 నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమవుతుందని, ఎలాంటి ప్రచారం చేయరాదని, బయట వ్యక్తులు పట్టణంలో ఉండరాదని పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని తెఇపారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకుని ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, ట్రెయినీ ఐపీఎస్ రాహుల్ కాంత్, మావల సీఐ కర్రె స్వామి, మున్సిపల్ కమిషనర్ రాజు, పోలీసు సిబ్బంది ఉన్నారు. బహుమతులు ఇచ్చినా, తీసుకున్నా నేరమే ఎన్నికల్లో ఓటుకు మద్యం, నగదు, బహుమతులు ఇచ్చినా, తీసుకున్నా నేరమేనని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని రాంనగర్, బొక్కల్గూడ, అబ్దుల్లాచౌక్ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిస్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యమని అన్నారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు సునిల్ కుమార్, నాగరాజు తదితరులున్నారు. -
పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ
కై లాస్నగర్: మున్సిపల్ ఓట్ల లెక్కంపు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట ర్ రాజర్షి షా అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు సోమవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, పోలింగ్తో పాటు కౌంటింగ్ ప్రక్రియ అత్యంత కీలకమని తెలిపారు. ప్రతీ అంశంపై పూర్తి అవగాహన అవసరమన్నారు. కౌంటింగ్ రోజున అభ్యర్థుల సమక్షంలో ప్రతీ దశను వీడియోగ్రఫీ చేస్తూ నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించా రు. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చిన పక్షంలో ఈసీ నిబంధనల ప్రకారం లక్కీ డ్రా ద్వారా విజేతను ప్రకటిస్తామన్నారు. 49 వార్డుల కౌంటింగ్ కోసం 49 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో వార్డులో సుమారు 3వేలకు పైగా ఓట్లు ఉండే అవకాశమున్నందున మూడు నుంచి నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది ఈ నెల 12న నిర్వహించే రెండో విడత శిక్షణకు, అలాగే 13న జరిగే కౌంటింగ్ రోజున నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, నోడల్ అధికారులు మనోహర్, ఫణిందర్రావు, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అర్హులంతా ఓటేయాలి అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకుని వందశాతం పోలింగ్ నమోదులో భాగస్వాములు కావా లని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, మాజీ సైనికుల సంఘాల ప్రతినిధులు, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో సోమవారం స్వీప్ ఓటరు చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరు బాధ్యతగా విని యోగించాలని కోరారు. సాధారణ పరిశీలకులు హ నుమంత్ నాయక్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తెలంగా ణ సాంస్కృతిక సారధి బృందం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మున్సిపల్ కమిషనర్ జి.రాజు, కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
తీర్థయాత్రలకు ‘స్పెషల్’ రైళ్లు..!
మంచిర్యాలఅర్బన్: భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తీర్థయాత్రలు చేయాలనుకునే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. మార్చి 21, ఏప్రిల్ 14 తేదీలలో రెండు ప్రత్యేక ప్యాకేజీలతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. దివ్య దక్షిణయాత్ర జ్యోతిర్లింగం మార్చి 21న ప్రారంభమై 28న ముగియనుంది. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర ఏప్రిల్ 14న ప్రారంభమై 24న ముగియనుంది. సోమవారం మంచిర్యాలలో యాత్రకు సంబంధించిన వివరాలను టూరిజం మానిటర్లు కొక్కుల ప్రశాంత్, శ్రీకాంత్లతో కలిసి ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేశ్ వెల్లడించారు. ప్రయాణం ఇలా.. సీసీ కెమెరాలతో భద్రత.. తీర్థయాత్రకు వెళ్లే భక్తుల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. కోచ్, సెక్యూరిటీ గార్డు, రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్రతను కల్పించనున్నారు. రైలు, బస్సు, హోటల్ అన్ని (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం) తాగునీటి బాటిల్, టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు ఉండనున్నాయి. ప్రయాణ బీమా, రైల్వేస్టేషన్ నుంచి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితంగా ప్రకటించారు. ప్రతీ రైలులో 639 మంది ప్రయాణికులు ఉండనున్నారు. ప్రతీ 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు సమకూర్చుతారు. తీర్థయాత్రకు వెళ్లే భక్తులు ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు 9701360701, 9281030727, 9281030759 నంబర్లలో సంప్రదించవచ్చు. -
బాసర ఆలయానికి రూ.1.55కోట్ల ఆదాయం
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పరిసరాల్లో వివిధ దుకాణాలకు సోమవారం అధికారులు బహిరంగ, సీల్డ్ టెండర్లు నిర్వహించారు. ఘాట్ వద్ద పూజా సామగ్రి విక్రయానికి రూ.35.11 లక్షలు, ఆలయ ఆవరణలోని దుకాణానికి రూ.38.88 లక్షలు, వెయ్యి రూపాయల అక్షరాభ్యాస మండపంలో భక్తుల ఫొటోలు తీసేందుకు రూ.40.16 లక్షలు, 150 రూపాయల మండపంలో ఫొటోలు తీసేందుకు రూ.41.70 లక్షలకు వ్యాపారులు టెండర్లు దక్కించుకున్నారు. 4 విభాగాల్లో జరిగిన వేలంలో ఆలయానికి రూ.1,55,85,888 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. హుండీ లెక్కింపు వాయిదా బాసర ఆలయంలో నేడు నిర్వహించనున్న హుండీ లెక్కింపును కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా చేసినట్లు ఈవో అంజనాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రెండుసార్లు వాయిదా పడినట్లు ఆమె పేర్కొన్నారు. -
పార్కింగ్.. పరేషాన్
పట్టణంలోని పురాతన కాలనీ అయిన అశోక్ రోడ్లో వెళ్లాలంటే జనం జంకుతున్న పరిస్థితి. వినాయక్ నుంచి తిర్పెల్లి వరకు గల ఈ రోడ్డు గతంలో ప్రధాన రోడ్డుగా ఉండేది. కాల క్రమేణ ఇరుకుగా మారింది. ఈ రహదారిని విస్తరించాలని ఏళ్లుగా డిమాండ్ వినిపిస్తున్నా అమలులోకి రావడం లేదు. 10 ఫీట్లతో కూడిన ఈ రోడ్డుపై ఒక వాహనం వెళ్లాలంటే మరో వాహనం ఆగాల్సిన దుస్థితి. బంగారు దుకాణాలు ఉండడంతో నిత్యం రద్దీ అధికం. భారీ వాహనాలు వస్తే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోతోంది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సైతం ఈ మార్గం గుండా వెళ్లలేని పరిస్థితి. -
భజన గీతం.. వినూత్న ప్రచారం
నిర్మల్ఖిల్లా: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భా గంగా జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ 18వ వా ర్డు పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. భజన మండలి కళాకారులతో భజన గీతాలు పాడిస్తూ కాలనీవాసులను ఓటు అభ్యర్థించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదిలా బాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కే) గ్రామానికి చెందిన భజన బృందం తబలా, తప్పెట్లు, తా ళాలతో ఆలపించిన భజన పాటలు కాలనీల్లో మా రుమోగడంతో స్థానికులు ప్రచారాన్ని ఆసక్తిగా వీ క్షించారు. బీడీ కార్మికులు, దిగువ, మధ్యతరగతి ప్రజల జీవన పరిస్థితులకు అనుగుణంగా భావోద్వేగాలను తా కే భజన గీతాలను ఎంపిక చేసి ప్రచారం నిర్వహించడం గమనార్హం. -
యువకుడి మృతిపై ఆందోళన
లక్సెట్టిపేట: ప్రైవేటు బ్యాంకులో గ్రూపు డబ్బుల విషయంలో జరిగిన గొడవలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల మేరకు వెంకట్రావుపేటకు చెందిన నాతరి ప్రశాంత్ (30) తల్లి నాతరి భాగ్య ఓ ప్రైవేటు బ్యాంకులో గ్రూపులోన్ తీసుకుంది. గతేడాది డిసెంబర్లో సభ్యురాలు సువర్ణకు కిస్తీ డబ్బులు చెల్లించింది. విషయం తెలియని ప్రశాంత్కూడా రూ.980 ఫోన్పే చేశాడు. డిసెంబర్ 2న ప్రశాంత్ వెళ్లి అడుగగా అక్కడే ఉన్న మరో సభ్యురాలు సంధ్యతో వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న సంధ్య బంధువులు బైరం దినకర్, బైరం కృపాకర్ దాడికి దిగారు. అదేరోజు సాయంత్రం దాసరి సురేష్, బై రం దినకర్, బైరం కృపాకర్ మళ్లీ దాడి చేయడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈనెల 8న ప్రశాంత్ కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు ముందుగా స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి మంచిర్యాలకు, అటు తర్వాత కరీంనగర్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. న్యాయం చేయాలని రాస్తారోకో దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచింది. సీఐ రమణామూర్తి, ఎస్సై గోపతి సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుని తల్లి భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
టైగర్జోన్ అడ్డంకులు తొలగించాలి
ఉట్నూర్రూరల్: టైగర్జోన్ అడ్డంకులు తొలగించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సమస్యలు పరిష్కరించకుంటే ఆమరణ దీక్ష చేయాల్సి వస్తుందని ఆదివాసీ కోలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావు హెచ్చరించారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అటవీ అడ్డంకులు తొలగించడంతో పాటు ఆదివాసీ గిరిజనుల ఆలయాలను రక్షించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ గిరిజనులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విషయాలను పీవో దృష్టికి తీసుకువెళ్లగా ఈ నెల 20న సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని సోనేరావు వివరించారు. ఆయన వెంట ఆత్రం భీంరావ్, రాజు, జంగు తదితరులున్నారు. -
షామియానా తొలగించారు
కోటి తులసి పూజ సందర్భంగా వేసిన షామియాను ఆదివారం ఆలయ అధికారులు తొలగించారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కోటి తులసి పూజకు శ్రీకారం’ వార్తలో భక్తుల ఇబ్బందిని ప్రస్తావించిన విషయం తెలిసిందే. 2022లో నిర్వహించిన కోటి తులసి పూజలో కల్యాణ వేదిక ముందు తులసి వనంలో ‘సత్యదేవుడు, అమ్మవారి విగ్రహాలను’ ఉంచడం వల్ల భక్తులు అక్కడ ఫొటోలు దిగేవారు. ఇప్పుడు అటువంటి ఏర్పాటు లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేసున్నారు. అలాగే కల్యాణ వేదిక నుంచి విశ్రాంతి మండపం వరకు షామియానా వేయడంతో వేదిక గోపురం కనిపించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈఓ ఆదేశం మేరకు షామియానాను ఆలయ సిబ్బంది తొలగించారు.కల్యాణ వేదిక ముందు గల విశ్రాంతి మండపంలో తులసి వనం మధ్య సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను సైతం ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడ ఫొటోలు దిగారు. -
కనకదుర్గమ్మకు చీర, సారె
ఉరేగింపుగా తరలి మొక్కులు చెల్లించుకున్న భక్తులుఅమలాపురం రూరల్: గాంధీనగర్లో కొలువైన కనకదుర్గమ్మ తల్లి ఆలయ 30వ వార్షికోత్సవం సందర్భంగా మాఘమాసం ఆదివారం భక్తులు అమ్మవారికి చీర, సారె సమర్పించారు. వేలాదిగా మహిళలు సారెను నెత్తిన మోస్తూ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభించిన ఊరేగింపు అమ్మవారి ఆలయం వరకు సాగింది. ఆలయ అర్చకుడు రామేశ్వరవరపు రామప్రసాద్ అధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన సారె, ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ తిక్కిరెడ్డి ఆదినారాయణ అధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ప్రసాదాలు, గాజులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన అన్నసమారాధనలో వేలాది భక్తులు పాల్గొన్నారు. -
● జంక్షన్.. యమ టెన్షన్
అడ్డతీగల మీదుగా సాగుతున్న 516–ఇ జాతీయ రహదారికి చేరే జంక్షన్లు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో నిత్యం అనేక ట్రాక్టర్లపై ఇసుక రవాణా చేస్తున్నారు. పరిమితికి మించి ట్రాక్టర్ ట్రాలీపై ఇసుక లోడ్ చేసి, తరలిస్తున్నారు. అలా, అధికంగా లోడ్ చేసిన ఇసుక ఆ వాహనాల వేగానికి ఎగిరి ప్రధాన రహదారిపై పడుతోంది. అలా పోగు పడిన ఇసుక అడ్డతీగల నుంచి జాతీయ రహదారికి చేరడానికి ఉన్న మలుపుల్లో రోడ్డు పైనే పోగు పడుతోంది. ఆయా ప్రాంతాల్లో వాహనాలు ఆ ఇసుక వల్ల అదుపు తప్పి, జారి బోల్తా పడుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు గాయపడుతున్నారు. దీనికి తోడు కాంక్రీటు పనులకు క్వారీ క్రషర్ల నుంచి లారీలపై రవాణా చేస్తున్న బేబీ చిప్స్ వంటివి కూడా రహదారిపై పడి వాహనాలు అదుపు తప్పుతున్నాయి. ఇకనైనా ఇసుక, చిప్స్ తరలించే వాహనాల యజమానులకు పోలీసు శాఖ అధికారులు సరైన ఆదేశాలివ్వాలని, ఆయా మెటీరియల్ రోడ్డుపై పడకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. – అడ్డతీగల -
ఫలిస్తున్న పోరుబాట
అడ్డతీగల: నడుములు విరిగేంత అధ్వానంగా ఉన్న ఆ రోడ్డుపై నెలల తరబడి అవస్థలు పడలేక గిరిజనం ఒక్కటయ్యారు.. పిడికిలి బిగించారు.. రోడ్డును దిగ్బంధించారు.. వారి పోరాట పటిమకు ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది.. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. వివరాలివీ.. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుంచి అడ్డతీగల మండలంలోని పలు గ్రామాల మీదుగా జెడ్డంగి అన్నవరం వరకూ 11 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి గతంలోనే రూ.22 కోట్లు మంజూరయ్యాయి. అప్పట్లో అధికారులు కొద్ది మేర పనులు చేసి వదిలేశారు. దీంతో, ఆ రోడ్డు గోతులమయమై అధ్వాన స్థితికి చేరుకుంది. ఆ రహదారిపై ప్రయాణించే వారు ప్రమాదాల బారిన పడి, గాయపడిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పదేపదే మొర పెట్టుకున్నా బాధిత గిరిజనుల గోడును ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడిన గిరిజనులు, ప్రజలు ఈ రోడ్డును వెంటనే పునర్నిర్మించాలనే డిమాండుతో గత ఏడాది సెప్టెంబర్ 12న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతల ఆధ్వర్యాన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రహదారిని బాగు చేయిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నెరవేరకపోవడంతో గత జనవరి 22న మరోసారి తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహించారు. రోడ్డును దిగ్బంధించి, రాకపోకలు నిలిపివేశారు. దీంతో దిగి వచ్చిన అధికారులు లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. అనంతరం, ఈ రోడ్డు పునర్నిర్మాణ పనులను ఆదివారం ఆరంభించారు. ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణలో సంబంధిత కాంట్రాక్టర్ ఏలేశ్వరం మండలం రమణయ్యపేట వైపు నుంచి పనులు ప్రారంభించారు. ట్విస్ట్ ఏమిటంటే ఈ ప్రజా సమస్యపై రెండు దఫాలు ఆందోళన చేసిన నేతలపై అడ్డతీగల, ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదు చేశారు. డీఆర్ఓగా తిప్పేనాయక్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్ఓ)గా డి.తిప్పేనాయక్ కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2024 ఎన్నికల సమయంలో డీఆర్ఓగా ఇక్కడ బాధ్యతలు నిర్వహించి, బదిలీపై అనంతపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్గా వెళ్లారు. అక్కడ సుమారు 14 నెలల పాటు పని చేసి, తిరిగి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా తిప్పేనాయక్ను కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. -
కనికుట్టు
ప్రత్తిపాడు: మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇస్తాం.. సర్టిఫికెట్లతో పాటు కుట్టు మెషీన్లు ఉచితంగా అందిస్తాం.. స్వయం ఉపాధి కల్పిస్తాం.. లక్షాధికారుల్ని చేస్తాం.. అంటూ గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పెద్ద హడావుడే చేసింది. తీరా చూస్తే శిక్షణ పూర్తయి నెలలు గడుస్తున్నా ఉచితంగా ఇస్తామన్న కుట్టు మెషీన్ల ఊసే తేవడం లేదు. వాటి కోసం ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మహిళలు.. ఇది చంద్రబాబు మార్కు కనికట్టులా ఉందని విమర్శిస్తున్నారు. కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్న తాము ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి.. చేస్తున్న పనులు మానుకుని ఉచిత కుట్టు శిక్షణ పొందితే మెషీన్లు ఎందుకివ్వడం లేదంటూ శాపనార్థాలు పెడుతున్నారు. శిక్షణ ఇచ్చారిలా.. మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చేందుకు జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాలు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. చివరకు వాటిని 50కి పరిమితం చేశారు. సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (సీయూఆర్డీ), సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ (ఎస్ఏపీఈ) సంస్థల ఆధ్వర్యాన ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. శిక్షణ ఇచ్చేందుకు ప్రతి కేంద్రంలోనూ ఒక ట్రైనర్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ను నియమించారు. శిక్షణ, కేంద్రం అద్దె, కుట్టు మెషీన్, ఇతర పరికరాలు కలిపి ఒక్కో మహిళకు సుమారు రూ.22 వేల చొప్పున కేటాయించారు. ఈ శిక్షణకు జిల్లావ్యాప్తంగా 27,722 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో వివిధ కార్పొరేషన్ల ద్వారా 6,568 మందిని ఎంపిక చేయగా చివరకు 4,920 మంది మాత్రమే శిక్షణకు హాజరయ్యారు. వీరికి గత ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 90 రోజుల పాటు ఆయా కేంద్రాల్లో రెండు బ్యాచ్లుగా శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ పూర్తయిన వెంటనే 75 శాతం హాజరు నమోదైన మహిళలకు సర్టిఫికెట్తో పాటు ఉచితంగా కుట్టు మెషీన్ అందజేయనున్నట్లు ప్రభుత్వం నమ్మబలికింది. అయితే, శిక్షణ పూర్తయి మూడు నెలలు గడిచినా, ఇప్పటి వరకూ సర్టిఫికెట్లు, కుట్టు మెషీన్లు మాత్రం ఇవ్వలేదు. దీంతో, శిక్షణ పొందిన మహిళలు ఆయా ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కుట్టు శిక్షణ తీసుకుంటే ఉపాధి లభిస్తుందనే ఆశతో ఇతర కూలి పనులు మానుకుని మరీ ఆయా కేంద్రాలకు రోజూ క్రమం తప్పకుండా వెళ్లి శిక్షణ పొందామని చెబుతున్నారు. ఇప్పటికై నా చెప్పిన విధంగా సర్టిఫికెట్లు, కుట్టు మెషీన్లు ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మెషీన్లు అందించాలని మాపై ఒత్తిడి వస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరికీ త్వరలోనే కుట్టు మెషీన్లు అందుతాయి. దీనిపై ఆందోళన అవసరం లేదు. – ఎ.శ్రీనివాసరావు, ఈడీ, బీసీ కార్పొరేషన్, కాకినాడ ఫ ఉచిత కుట్టు శిక్షణ పేరిట సర్కార్ ఆర్భాటం ఫ సర్టిఫికెట్, కుట్టు మెషీన్ ఇస్తామని హడావుడి ఫ జిల్లాలో 27,722 మంది దరఖాస్తు ఫ 4,920 మందికే ట్రైనింగ్ ఫ శిక్షణ పూర్తయి మూడు నెలలు ఫ ఇప్పటికీ అందని కుట్టు మెషీన్లు ఫ ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ మహిళల ప్రదక్షిణలు వివిధ కార్పొరేషన్ల ద్వారా జిల్లాలో ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారిలా.. కార్పొరేషన్ మొత్తం నమోదైన ఎంపికై న శిక్షణకు యూనిట్లు మహిళలు వారు హాజరైన వారు బీసీ 1,984 15,131 3,506 2,496 ఈబీసీ 124 175 45 39 కమ్మ 239 177 55 34 రెడ్డి 227 157 72 46 ఆర్యవైశ్య 133 273 89 65 క్షత్రియ 105 65 12 6 బ్రాహ్మణ 174 85 31 23 కాపు 803 11,659 2,758 2,211 మొత్తం 3,789 27,722 6,568 4,920 -
పూటుగా తాగి.. తన్నులాట
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సెక్యూరిటీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికీ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. రత్నగిరి దిగువన తొలి పావంచా వద్ద స్వామివారి ప్రసాదం కొనుగోలుకు వచ్చిన భక్తులు ఆదివారం క్యూలో ఘర్షణ పడి, దాదాపు పావుగంట పాటు కొట్టుకున్నారు. దీంతో, ప్రసాదం కొనుగోలుకు అక్కడకు వచ్చిన ఇతర భక్తులు భయభ్రాంతులకు గురై, ఏం జరుగుతుందోననే భయంతో పరుగులు తీశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కానీ అక్కడ లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క రోజే కాదు.. ప్రతి ఆదివారం లోవ దేవస్థానానికి వెళ్తున్న భక్తుల్లో కొంత మంది మద్యం తాగి, తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ప్రసాదాల కొనుగోలుకు ఆగుతున్నారు. ఈ క్రమంలో వారిలో వారు తరచుగా ఘర్షణకు దిగుతున్నా ఆపేవారే ఉండటం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అందుబాటులో ఉండని సిబ్బంది మరోవైపు తొలి పావంచా వద్ద ప్రసాదం కౌంటర్లలోని దేవస్థానం సిబ్బంది మధ్య సమన్వయం కొరవడుతోంది. ఈ నెల 2న తొలి పావంచా వద్ద ప్రసాదాల కొనుగోలుకు వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రసాదం ప్యాకెట్లు ఇచ్చే ఉద్యోగి బయటకు వెళ్లాడని, పావుగంట ఆగాలని అక్కడ ప్రసాదం టికెట్లు విక్రయించే మరో ఉద్యోగి చెప్పాడు. తాము చాలా దూరం వెళ్లాలని, ఇలా ఆలస్యం చేస్తే ఎలాగని ఆ భక్తులు పక్కనే గెస్ట్ హౌస్లో ఉన్న దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఆ కౌంటర్ వద్దకు వచ్చి, అక్కడి ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసి, దగ్గరుండి మరీ ప్రసాదాలు అమ్మించారు. ఆ సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా లేడు. ఫ సత్యదేవుని తొలి పావంచా ప్రసాదం స్టాల్ వద్ద భక్తుల ఘర్షణ ఫ పావుగంట పాటు కొట్టుకున్న వైనం ఫ భయభ్రాంతులకు గురైన ఇతరులు పోలీసులను నియమించే అవకాశం లేదు తలుపులమ్మ లోవకు వెళ్లి వచ్చిన కొంత మంది భక్తులు మద్యం తాగి వచ్చి, అన్నవరం వచ్చి ఆ మత్తులో ప్రసాదాల కౌంటర్ల వద్ద ఘర్షణ పడుతున్నారు. వారిని నియంత్రించేలా అక్కడ నియమించడానికి తగినంత మంది పోలీసులు మాకు లేరు. దేవస్థానమే అక్కడ సెక్యూరిటీ గార్డులను నియమించాలని చాలాసార్లు చెప్పాం. అయినప్పటికీ వారు నియమించడం లేదు. ఇప్పటికై నా దేవస్థానం అదివారం నాడు అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను నియమించాలి. ప్రసాదాల కౌంటర్ వద్ద ఘర్షణ పడిన వారు మాకు ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు. – శ్రీహరిబాబు, ఎస్సై, అన్నవరం అంత సెక్యూరిటీ ఉన్నా ప్రయోజనమేదీ! అన్నవరం దేవస్థానంలో వంద మందికి పైగా సెక్యూరిటీ గార్డులు, 38 మంది పోలీసు శాఖకు చెందిన హోం గార్డులు పని చేస్తున్నారు. తొలి పావంచా వద్ద ఒక్క భద్రతా సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. కనీసం ఇద్దరు హోంగార్డులు లేదా ఇద్దరు సెక్యూరిటీ గార్డులున్నా ఇలాంటి ఘర్షణలను నివారించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమయంలో ఆ ఒక్కరు కూడా ఉండటం లేదనే విమర్శ ఉంది. -
12న దేశవ్యాప్త సమ్మె
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలనే డిమాండుతో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 12న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో తామూ పాల్గొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (ఏపీఎంఎస్ఆర్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.వెంకట్రావు తెలిపారు. సమ్మె పోస్టర్ను కలెక్టరేట్ వద్ద ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాత కార్మిక చట్టాలే అంతంత మాత్రంగా అమలవుతున్న పరిస్థితుల్లో కొత్త లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు మరింతగా అన్యాయం జరుగుతుందని అన్నారు. తమకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ను కూడా కొత్త లేబర్ కోడ్ ద్వారా రద్దు చేశారని చెప్పారు. రూ.18 వేల జీతం దాటిన వారు కార్మికులే కాదని, వారికి ఎటువంటి చట్టాలూ వర్తించవని పేర్కొన్నారని తెలిపారు. మెడికల్ రిప్స్కు నిర్దిష్ట పని పద్ధతులుండాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధానాలు అరికట్టాలని కోరుతున్నామన్నారు. యూనియన్ కాకినాడ బ్రాంచి కార్యదర్శి సీహెచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, మెడికల్ రిప్స్ నిరంతరం యాజమాన్యాల వేధింపులకు గురవుతూంటారని చెప్పారు. లేబర్ కోడ్ల వల్ల వీరిపై ఒత్తిడి మరింత పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పని గంటలు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, బ్రాంచి అధ్యక్షుడు ఎంఏ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
అసలు రోగం
సర్కారు నిర్లక్ష్యమే..రంపచోడవరం: బాగా చదువుకుని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారాలనే ఆశతో వస్తున్న గిరి బాలలకు.. సర్కారు నిర్లక్ష్యమే శాపంగా మారుతోంది. మన్యసీమలో ప్రభుత్వం చాలా కాలంగా గిరిజన సంక్షేమ అధికారులను పూర్తి స్థాయిలో నియమించడం లేదు. ఫలితంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆశ్రమ పాఠశాలలపై సరైన పర్యవేక్షణ కొరవడుతోంది. వీటన్నింటి నేపథ్యంలోనే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అభం శుభం తెలియని విద్యార్థులు తరచుగా అనారోగ్యాల పాలవుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 89 మంది విద్యార్థులు అస్వస్థత పాలవడానికి ఈ నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు ఆదివాసీల నుంచి వస్తున్నాయి. అరకొరగా ఏటీడబ్ల్యూఓలు జిల్లావ్యాప్తంగా 78 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, 288 గిరిజన ప్రాథమిక పాఠశాలలు, 11 గిరిజన సంక్షేమ వసతి గృహాలు, 9 గురుకుల పాఠశాలలు, 6 కళాశాలలు, 6 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో 4,093 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఆహారం అందించేందుకు నిబంధనల ప్రకారం ప్రతి రోజూ నిర్ణీత మెనూ అమలు చేయాలి. అయితే, ఆవిధంగా మెనూ అమలవుతోందో లేదో పర్యవేక్షించేందుకు తగినంత మంది అధికారులు జిల్లాలో లేరు. ప్రతి మండలానికి ఒక సహాయ గిరిజన సంక్షేమ అధికారి (ఏటీడబ్ల్యూఓ) ఉండాలి. కానీ, మూడు నాలుగు మండలాలకు కలిపి ఒకరికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. చింతూరు పరిధిలోని నాలుగు మండలాలకు ఒకరు.. అడ్డతీగల, రాజవొమ్మంగి, గంగవరం, వై.రామవరం మండలాలకు ఒకరు.. రంపచోడవరం, మారేడుమిల్లి, దేవీపట్నం మండలాలకు ఒకరు చొప్పున మాత్రమే ఏటీడబ్ల్యూఓలున్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే రెగ్యులర్ ఏటీడబ్ల్యూఓ కాగా, మరో ఇద్దరు వార్డెన్లను ఇన్చార్జి ఏటీడబ్ల్యూఓలుగా పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్ఏసీ) నియమించారు. మరోవైపు ఏటీడబ్ల్యూఓల నియామకంలో పైరవీలకు పెద్దపీట వేస్తున్నారు. ఇదే విషయంపై గిరిజన సంక్షేమ శాఖ డీడీకి ప్రస్తుత ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి షోకాజ్ నోటీసు కూడా జారీ చేయడం గమనార్హం. మరోవైపు ఆశ్రమ పాఠశాలల్లో డిప్యూటీ వార్డెన్ల నియామకానికి సైతం తీవ్రమైన పోటీ ఉంటోంది. పర్యవేక్షణ గాలికి.. తమ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ సక్రమంగా అమలవుతోందా, బోధన ఎలా జరుగుతోంది, విద్యార్థుల సామర్థ్యం వంటి అంశాలను ఏటీడబ్ల్యూఓలు పరిశీలించాలి. అవసరమైన విషయాలపై గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్కు నివేదికలివ్వాలి. అయితే, పూర్తి స్థాయిలో ఏటీడబ్ల్యూఓలు లేకపోవడంతో ఆశ్రమ పాఠశాలల్లో పర్యవేక్షణను గాలికొదిలేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలకు వెళ్లి వార్డెన్తో మాట్లాడి వెళ్లిపోవడం మినహా మిగిలిన అంశాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు డిప్యూటీ వార్డెన్లు సైతం నిబంధనల ప్రకారం మెనూ అమలు చేయడం లేదు. కొద్ది రోజుల క్రితం రాజవొమ్మంగి మండలంలోని ఓ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదనే ఫిర్యాదు వచ్చింది. అనేక పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే, ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లను సకాలంలో శుభ్రం చేయించడం లేదు. దోమ తెరలు కూడా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు ఇతర మౌలిక వసతులు సైతం లేకుండానే విద్యార్థులు రోజులు గడపాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.మరో 14 మంది ఆస్పత్రిపాలు మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉడకని ఇడ్లీ, నిల్వ శనగ పిండితో చేసిన బొంబాయి చెట్నీ తిని శనివారం 89 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరందరికీ రంపచోడవరం, మారేడుమిల్లి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆదివారం మరో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారు కూడా రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 62 మందిని ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేశారు. మిగిలి 41 మందికి చికిత్స అందిస్తున్నారు. బాధిత విద్యార్థులను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, సభ్యులు గొర్లె సునీత ఆస్పత్రిలో పరామర్శించారు.విద్యార్థులు మరణిస్తున్నా.. గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, పరోక్షంగా వారి మరణాలకు కారకులవుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. కొద్ది నెలల కిందట రంపచోడవరం మండలం వాడపల్లిలో ఓ విద్యార్థిని మధ్యాహ్న భోజన సమయంలో తరగతి గదిలో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరగలేదు. రంపచోడవరం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కొన్నాళ్ల కిందట కాలువలో స్నానం చేస్తూ మృతి చెందారు. మారేడుమిల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. దీనిపై ఇప్పటికీ ఎటువంటి విచారణ నివేదికనూ అధికారులు వెల్లడించలేదు. ఆశ్రమ పాఠశాలల్లో అనేక తప్పులకు పాల్పడిన వారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తున్నారు. తిరిగి కొద్ది రోజుల్లోనే విచారణ పెండింగ్ పేరిట వారు ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. గిరిజన సంక్షేమ కార్యాలయం(విద్య)లో పైరవీలతో పనులు జరగడమే ఇందుకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆశ్రమ విద్యపై పర్యవేక్షణ కరవు మూడు నాలుగు మండలాలకు ఒక్కరే ఏటీడబ్ల్యూఓ మొక్కుబడి పర్యటనలకే పరిమితమవుతున్న అధికారులు పట్టించుకోని ప్రభుత్వం వార్డెన్ సస్పెన్షన్ దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పుడ్ పాయిజనింగ్ జరిగి మొత్తం 103 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై అధికారులు స్పందించారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులుగా పేర్కొంటూ వార్డెన్ గణపతిని, వంట మనిషి లక్ష్మిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
కృష్ణా రివర్క్రాసింగ్ స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: జిల్లాకు చెందిన స్విమ్మర్లు విజయవాడలోని దుర్గా ఘాట్లో ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 26వ కృష్ణా రివర్ క్రాసింగ్ స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చారు. 10 నుంచి 15 ఏళ్ల వయస్సు విభాగంలో చరణ్తేజ 15వ స్థానంలో నిలవగా, 31 నుంచి 40 వయస్సుల విభాగంలో కొమ్ము కృష్ణ 12వ స్థానం సాధించాడు. వీరిద్దరు తండ్రి కొడుకులు కావడం విశేషం. అదేవిధంగా 41 నుంచి 50 ఏళ్ల విభాగంలో మేడిపల్లి అశోక్ 25వ స్థానం సాధించి మెరిట్ సాధించాడు. ప్రతిష్టాత్మక రివర్ క్రాసింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం పట్ల డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి, పెటా సంఘం అధ్యక్షుడు పార్థసారధి, హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి హరిచరణ్ తదితరులు అభినందించారు. -
ఆదిలాబాద్టౌన్/కై లాస్నగర్/ఆదిలా బాద్: వార్డు సమస్యలపై అవగాహన ఉండి పరిష్కరించగలిగే సమర్థులకే పట్టం కట్టాలి.. అందుబాటులో ఉండి సేవాభా వంతో పనిచేసే వారినే పాలకులుగా ఎన్నుకోవాలి.. మద్యం, డబ్బు వంటి ప్రలోభా లకు తలొగ్గకుండా నిస్వార్థపరులను ఎన్నుకుంటే కాలనీల
● ప్రలోభాలకు గురైతే ప్రశ్నించే హక్కు కోల్పోతాంస్థానికంగా మార్కెట్లు ఏర్పాటు చేయాలి ఆదిలాబాద్ పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. జనాభా కూడా పెరుగుతోంది. అయితే జిల్లా కేంద్రంలో ఒకే ఒక రైతుబజార్ ఉండడంతో సుమారు రెండు, మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. కాలనీల సమీపంలో ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. – కుర్సెంగ యాదవ్రావు, టీచర్స్కాలనీసమస్యలపై అవగాహన అవసరంకౌన్సిలర్గా ఎన్నికయ్యే వారికి వార్డు సమస్యలపై అవగాహన అవసరం. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలికసౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించే చొరవ చూపేవారినే ఎన్నుకోవాలి. – సింగరి అశోక్, రిటైర్డు ఉపాధ్యాయుడు పట్టణాభివృద్ధికి బాటలు వేయాలి..ఆదిలాబాద్లో అభివృద్ధికి అవసరమైన వనరులున్నా ఇంకా వెనుకబడే ఉంది. ఇప్పటికీ ఇరుకై న రోడ్లే ఉన్నాయి. ప్రస్తుతం మున్సిపల్ బరిలో విద్యావంతులు ఉండటం శుభపరిణామం. ఎన్నికై న వారు పట్టణాభివృద్ధికి బాటలు వేసేలా పనిచేయాలి. – మద్ది లస్మన్న, రిక్షాకాలనీ -
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ గడువు
కైలాస్నగర్: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ గడువు ఆదివారంతో ముగిసింది. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్లో వారికి ఈ నెల 6నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. మూడు రోజుల్లో 348 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో 52 మంది సర్వీస్ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పంపించారు. వీరు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలను పంపించనున్నారు. కాగా, పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా ఆదివారం సందర్శించారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించా రు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, బ్యాలెట్ పేపర్ల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఓటింగ్ పూర్తయిన తర్వాత వాటిని నిబంధనల మేరకు భద్రపరచాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.రాజు, ఎన్నికల నోడల్ అధికారి ఫణిందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆకర్షిస్తూ.. ఆలోచింపజేస్తూ
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ప్రత్యేక రథాలను ఏర్పాటు చేసుకుని హోరాహోరీ గా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అధికారికంగానూ పట్టణంలో పలు ప్రచార రథాలు సందడి చేస్తున్నాయి. పార్టీలు తమకు ఓటు వేయమని అభ్యర్థిస్తుంటే... అధికారిక ‘స్వీప్’ రథం ఓటు హక్కును వినియోగించుకోమని సూచిస్తోంది. పోలింగ్ తేదీ, సమయం, ఓటు వేసేందుకు వెంట తీసుకువెళ్లాల్సిన పత్రాలు, బ్యాలెట్ పేపరు నమూనా, ఓటరు ప్రతిజ్ఞ వంటి అంశాలతో రూపొందించిన ఈ రథం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నెల 11న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా కలెక్టర్ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తిరుగుతున్న ఈ స్వీప్ రథాలు ఓటర్లను ఆకర్షిస్తూ, ఆలోచింపజేస్తున్నాయి. -
హలో అన్నా.. ఎప్పుడొస్తున్నరు
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. ఒక్క ఓటుతో ఐదేళ్ల పదవిని కోల్పోయన వారు ఎందరో. ఈ మేరకు బరిలో నిలిచిన అభ్యర్థులు అప్రమత్తమవుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక్కో ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి మరీ తమకు మద్దతునివ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఓటు ఉండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి అక్కడి నుంచే ఫోన్ చేస్తున్నారు. తప్పకుండా పోలింగ్కు రావాలని కోరుతున్నారు. ప్రయాణ, ఇతర ఖర్చులు చూసుకుంటామని పేర్కొంటున్నారు. అప్పటికప్పుడే ఫోన్పే, గుగుల్ పేలో కొంత అమౌంట్ పంపుతున్నారు. వచ్చాక మరి కొంత ఇస్తామని చెబుతున్నారు. తమకు అనుకూలంగా పడే పక్కా ఓట్లు ఎన్ని అనేదానిపై ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. కొంత కష్టపడితే వచ్చే ఓట్లేన్ని, తటస్తంగా ఉన్న ఓట్లను ఏ విధంగా రాబట్టుకోవాలనే దానిపై పార్టీ నేతలు, తమ ప్రధాన అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వలస ఓటర్లపై దృష్టి సారించారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార ఇతరత్రా పనుల నిమిత్తం హైదరాబాద్, వరంగల్, బెంగుళూర్ వంటి నగరాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారిని రప్పించేలా చర్యలు చేపడుతున్నారు. వారి వివరాలు సేకరిస్తూ ఆ ఓట్లను రాబట్టుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రత్యేక ఆహ్వానం .. వలస వెళ్లిన కాలనీవాసుల ఓట్లను సొంతం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 11న పోలింగ్ ఉండగా ఆ రోజు తప్పకుండా రావాలని ఫోన్లు చేస్తూ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నారు. వారిని ఒప్పించి, రప్పించేలా చూడాల్సిన బాధ్యతను ప్రత్యేకంగా కొందరికి అప్పగించారు. దీంతో వారు వలస ఓటర్లకు ఫోన్ చేసి రావాలని కోరుతున్నారు. ప్రయాణ చార్జీలు, ఇతర ఖర్చుల కింద కొంత మొత్తంను ఆన్లైన్ ద్వారా వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. కొంతమంది స్వయంగా ప్రయాణ టికెట్లను సైతం బుక్ చేస్తున్నారు. నలుగురు, ఐదుగురు ఓటర్లు ఒకే చోట ఉన్నట్లైతే వారి కోసం ప్రత్యేకంగా వాహనాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో సుమారు 5వేల నుంచి 7వేల వరకు వలస ఓటర్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
మద్యం పట్టివేత
ఆదిలాబాద్టౌన్: ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. శనివారం రాత్రి వన్టౌన్ ఎస్సై రమ్య ఆధ్వర్యంలో పట్టణంలో చేపట్టిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తున్న పట్టణంలోని మోచిగల్లికి చెందిన భూపతి వెంకటేశ్, గంటికళ్ళ ముఖేశ్ను గుర్తించినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రూ.9,120 విలువ గల 8.64 లీటర్ల 48 క్వార్టర్ల మద్యం బాటిళ్లతోపాటు ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆదివారం అక్రమంగా మద్యం తరలిస్తున్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన అలిపెల్లి గంగమ్మ రూ.3620 విలువ గల 5 లీటర్ల మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్రూరల్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన గోపతి శ్రీనివాస్ రూ.4080 విలువ గల 5.76 లీటర్ల మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురిపై కేసు..ఆదిలాబాద్రూరల్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బార్ యజమాని కళ్లెం శ్రీనివాస్తోపాటు మద్యం తీసుకెళ్తున్న అబ్దుల్ ఫహీం, అభ్యర్థి అనిల్పై ఆదివారం కేసు నమోదు చేసిన్నట్లు మావల సీఐ కర్రె స్వామి తెలిపారు. మావల పోలీస్స్టేషన్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన అభ్యర్థి ఓటర్లను ప్రభావితం చేసేందుకు పట్టణంలోని దుర్గబార్ నుంచి అబ్దుల్ ఫహీం 48 క్వార్టర్లను మద్యాన్ని తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. రూ. 9,120 విలువ గల మద్యం 8.6 లీటర్లు పట్టుకున్నట్లు తెలిపారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దని తల్లి చెప్పినందుకు బాలుడు పురుగుల మందు తాగాడు. అప్పులు తీర్చే మార్గం లేక వ్యక్తి, చెల్లె కుమార్తె చూడడానికి భర్త తర్వాత తీసుకెళ్తానని చెప్పినందుకు భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్షణికావేశంలో బాలుడు..పురుగుల మందు తాగి వివాహిత..చింతలమానెపల్లి: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇస్లావత్ నరేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని రవీంద్రనగర్ గ్రామానికి చెందిన సుచిత్ర రాయ్(27), పరేష్ రాయ్ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. భర్త పరేష్ రాయ్.. కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఈనెల 2న సుచిత్ర రాయ్ తన చెల్లె కుమార్తెను చూడటానికి తీసుకెళ్లమని భర్తను కోరింది. ఈనెల 3న గ్రామంలో క్రికెట్ పోటీల ముగింపు ఉన్నందున బుధవారం వెళ్దామని భర్త చెప్పాడు. మనస్తాపం చెందిన సుచిత్ర రాయ్ ఈనెల 3న రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు కాగజ్నగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి రాజేందర్ మండల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పురుగుల మందు తాగి ఒకరు.. తాంసి: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జీవన్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పాలోది గ్రామానికి చెందిన సిరికొండ చందర్(42) ఐకేపీలో వీవోఏగా పని చేస్తున్నాడు. ఆయనకు ఉన్న సొంతభూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. గత రెండేళ్ల క్రితం భార్యకు అనారోగ్యం గురికాగా, వైద్యం, ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పు చేశాడు. వ్యవసాయంలో పంట దిగుబడి రాక రెండేళ్లుగా అప్పులు పెరిగాయి. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెందాడు. శుక్రవారం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. మృతదేహన్ని ఎస్సై పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి కుమార్తె అఖిల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఓటు హక్కు వినియోగించుకోవాలి
కై లాస్నగర్: ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్వీప్ ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని కేఆర్కే కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఆర్డీవో స్రవంతి జెండా ఊపి ప్రారంభించారు. ఉద్యోగులు, ఆశాలు, అంగన్వాడీలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపేలా వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీనివాస్, డీపీఆర్ఓ విష్ణువర్ధన్, మెప్మా పీడీ రాజు, తహసీల్దార్లు శ్రీనివాస్, గోవింద్, వేణుగోపాల్తో ఇతర అధికారులు, యువత, స్థానికులు పాల్గొన్నారు. -
దావత్ మస్తు..
మంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు ముగియనుండడంతో, ఆదివారం పెద్దఎత్తున ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి, దావతులను ఏర్పాట్లు చేశారు. చికెన్, మటన్ బిర్యానీ, మద్యం, మాంసం కూరలతో పెద్ద ఎత్తున దావతులను నిర్వహించారు. సభలు, సమావేశాలు, ర్యాలీల విజయవంతానికి ఒక్కొక్కరికి రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లించి, ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి మందు, భోజనం పెట్టారు. నామినేషన్ వేసిన నాటినుంచే డివిజన్/వార్డుల్లో వారి బలగాన్ని ఎక్కువగా చూపించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. అధికార కాంగ్రెస్తోపాటు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆదివారం సెలవు కావడంతో ఓటర్లు ఇళ్ల వద్దనే ఉండడంతో పెద్దఎత్తున ర్యాలీగా అభ్యర్థులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వారి బలగాన్ని చూపించేందుకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనేలా చూస్తున్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, పార్టీల కార్యకర్తలకు మాంసహారంతో కూడిన భోజనాన్ని అందించారు. గెలుపు కోసం పార్టీల కసరత్తుమున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలవడంతోపాటు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్ స్థానాన్ని చేజిక్కుంచుకోవాలని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ బాధ్యతలను భుజస్కాందాలపై వేసుకున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రచారాన్ని చేస్తున్నారు. అక్కడికి వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనే వారికి మాత్రం విందు, మందుకు కొదువ ఉండడం లేదు. ర్యాలీలో స్వచ్చందంగా పాల్గొనే వారు కొందరే ఉండగా, మిగతా వారికి రోజుకు ఇంతా అని లెక్కగట్టి తీసుకువస్తున్నారు. -
ఘనంగా జిల్లా స్థాయి ‘ప్రేరణ ఉత్సవ్’
● కలెక్టర్ రాజర్షి షా ● అధికారులతో సమీక్షపారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతాంకై లాస్నగర్: ఆదిలాబాద్ను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం ఓ హోటల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటరాక్టివ్ సెషన్ ఆన్ ఇండస్ట్రియల్ పొటెన్షియల్ ఆఫ్ ఆదిలాబాద్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రై మాట్లాడారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. జిల్లాలో సుమారు 10వేల ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్ పా ర్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. కుంటాల, పొచ్చెర జలపాతాలు, నా గోబా ఆలయాన్ని కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. స్థానిక స్వయం సహాయక సంఘాలు తయారు చేసే డోక్రా ఆర్ట్ లాంటి ఉత్పత్తులకు అంతర్జాతీయ మా ర్కెట్ సౌకర్యం కల్పించేందుకు డిజిటల్ మార్కెటింగ్ వినియోగించాలని సూచించారు. ఐటీ టవర్ పూర్తయితే సాఫ్ట్వేర్ రంగంలో జిల్లా ముందడుగు వేస్తుందని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఐఐ ప్రతినిధులు శివప్రసాద్రెడ్డి, సంజీవ్ దేశ్పాండే, సురేందర్రావు, సమీఉద్దీన్, గౌతమ్రెడ్డి, స్థానిక పరిశ్రమల సంఘాల సభ్యులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారులతో సమావేశమై మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లో 216 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 62 ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, శానిటరీ జవాన్లతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. పోలింగ్ సజావుగా సాగేందుకు 2,154 మంది సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. ప్రతీ కేంద్రం వద్ద ముగ్గురు పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉంటారని తెలిపా రు. దివ్యాంగుల సౌకర్యార్థం ప్రతీ కేంద్రంలో ర్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు, వృద్ధులు, ది వ్యాంగుల కోసం 145 వీల్ చైర్లు, 125 ఆటోలు సి ద్ధం చేసినట్లు వెల్లడించారు. ఏర్పాట్లను మున్సిపల్ ఇంజినీర్లు, శానిటేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, నోడల్ అధికారి మనోహర్, మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులున్నారు. ఈవీఎం గోదాం తనిఖీ జిల్లా కేంద్రంలోని శాంతినగర్లోగల ఈవీఎంల గోదాంను కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. గోదాం పరిసరాల్లో నిరంతరం నిఘా ఉండాలని, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు పంచపూల, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఆదిలాబాద్టౌన్: స్థానిక కేంద్రీయ విద్యాలయం ఆవరణలో జిల్లా స్థాయి ‘ప్రేరణ ఉత్సవ్’ నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీ య గీతాన్ని ఆలపించారు. కలెక్టర్ రాజర్షి షా మా ట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 పాఠశాలల నుంచి ఎంపికై న విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. వివిధ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన ఒక బాలుడు, ఒక బాలిక ను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి గుజరాత్లోని వాద్నగర్ పంపనున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ అశోక్, జిల్లా సైన్స్ అధికారి భాస్కర్, క్వాలిటీ కోఆర్డినేటర్ అజయ్, ఉపాధ్యాయులున్నారు. -
అద్దె రేట్లు పెంచాలి
ఆదిలాబాద్: అద్దె రేట్లు పెంచాలని ఫోర్ వీల ర్స్ డ్రైవర్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధి రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్కబ్లో శనివారం నిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు. డీజిల్ ధరలు పెరుగుతున్నా 2017 లో నిర్ణయించిన రూ.33వేల అద్దెనే నేటికీ చె ల్లించడం సరికాదన్నారు. అద్దెను రూ.50వేలకు పెంచి, బిల్లులు సకాలంలో చెల్లించాలని, కేవలం ఎల్లో ప్లేట్ వాహనాలకే అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చేదాకా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్, ఇమ్రాన్ఖాన్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
స్వీప్ అవగాహన ర్యాలీ ప్రారంభం
కై లాస్నగర్: రవాణశాఖ ఆధ్వర్యంలో 120 ఆటోలతో చేపట్టిన భారీ ఓటరు అవగాహన ర్యాలీని కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ రాజర్షి షా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, ఎస్.రాజేశ్వర్తో కలిసి జిల్లా కేంద్ర గ్రంథాలయం వరకు ఆటోలో ప్రయాణించారు. కలెక్టరేట్ నుంచి మొదలైన ర్యాలీ కలెక్టర్చౌక్, వినాయక్ చౌక్, దేవిచంద్ చౌక్, అంబేడ్కర్ చౌక్, నెహ్రూ చౌక్ మీదుగా జిల్లా గ్రంథాలయం వరకు కొనసాగింది. అంతకుముందు ఆటోలకు స్వీప్ అవగాహన స్టిక్కర్లు అతికించారు. గ్రంథాలయ ప్రాంగణంలో ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, యువకులు, ప్ర జలు, అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో స్రవంతి, డీవైఎస్వో శ్రీనివాస్, నోడల్ అ ధి కారులు మనోహర్, రాజలింగు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ హరీంద్ర కుమార్, అసిస్టెంట్ మో టార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్వేత, తహసీల్దార్ శ్రీని వాస్, గ్రంథాలయ అధికారి శ్రీనివాస్ తదితరులున్నారు. -
బల్దియా పోరు.. ఎంపీ జోరు
ప్రచారంలో ముందుంటున్న ‘కంది’ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డికి ఈ ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకమే. అనేక వార్డుల్లో తన అనుచరులే పోటీ చేస్తుండగా, మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన నివాసముంటున్న 38వ వార్డు కై లాస్నగర్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. హస్తం పార్టీ నుంచి యెల్మలవార్ అర్చన పోటీ చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో ముందుకుసాగుతున్నారు. ఎంపీ గోడం నగేశ్ జిల్లా కేంద్రంలోని 37వార్డు పరిధి ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపించి బల్దియా పీఠాలు కై వసం చేసుకోవాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన నివాసముండే వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ కాగా పార్టీ అభ్యర్థిగా మానస పోటీ చేస్తున్నారు. ఈ వార్డులో మానస గెలుపు ఎంపీకి కీలకంగా మారింది. గర్జిస్తున్న ‘రంగినేని’ జెండా ఎగరాలంటున్న ‘జాదవ్’డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ కూడా 37వ వార్డు పరి ధిలోని రవీంద్రనగర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటారు. ఈ వార్డు జనరల్ మహిళకు రిజ ర్వ్ కాగా, తాజా మాజీ కౌన్సిలర్ అంబకంటి అశోక్ సతీమణి సుష్మ పోటీ చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుపొందింది. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని జాదవ్ సొంత వార్డులో పార్టీ అభ్యర్థి గెలుపును సవాల్గా తీసుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా తన ప్యానల్తో ఏఐఎఫ్బీ పార్టీ సింహం గుర్తుపై మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. తాను 48వ వార్డు హమీద్ పురా నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో మొదటి మహిళా మున్సిపల్ చైర్పర్సన్గా వ్యవహరించిన ఆమె అప్పుడు కూడా ఇదే వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిచారు. ఈసారి తన సొంత ప్యానల్తో బరిలోకి దిగి ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. -
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం
పాటలు పాడుతూ నృత్యం చేస్తున్న మహిళలు మహాయజ్ఞంలో పాల్గొన్న భక్తులు తలమడుగు మండల కేంద్రంలోని అతి పురాతన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొసాగుతున్నాయి. శనివారం ఆలయంలో వేద పండితులు రాంగోపాల్చారి, రంగయ్యచారి, శ్రీనివాసచారి, కళ్యాణ్కుమార్, ఆశిష్కుమార్ ఆధ్వర్యంలో సుదర్శన మహాయజ్ఞం నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తి పాటలు పాడుతూ నృత్యం చేశారు. సర్పంచ్ చంటి, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. – తలమడుగు -
‘కాంగ్రెస్కు పట్టం కట్టాలి’
కైలాస్నగర్: పట్టణాభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు దివంగత సీఎం రాజశేఖరరెడ్డి హయాంలోనే ఇచ్చామని, మళ్లీ రేవంత్రెడ్డి ప్రభుత్వమే ఇస్తోందని పేర్కొన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మాతుల్లా హుస్సేన్, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రివర్ క్రాసింగ్ పోటీలకు ఎంపిక
ఆదిలాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దుర్గా ఘాట్ వద్ద ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో ఈ నెల 8న నిర్వహించనున్న 26వ కృష్ణా రివర్ క్రాస్ స్విమ్మింగ్ పోటీలకు జిల్లా కేంద్రానికి చెందిన స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణ, కొమ్ము చరణ్ తేజ్ ఎంపికయ్యారు. పోటీల్లో భాగంగా కృష్ణా నదిని ఈదుతూ దాటాల్సి ఉంటుందని కోచ్ కృష్ణ తెలిపారు. ప్రతిష్టాత్మక రివర్ క్రాసింగ్ పోటీలకు వీరి ఎంపికపై డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి, పీఈటీల సంఘం అధ్యక్షుడు పార్థసారధి హర్షం వ్యక్తంజేశారు. -
‘మార్పు’ కలిసొచ్చేనా?
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పోరు ఆసక్తి రేపుతోంది. ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లు పలు వార్డుల్లో తారుమారయ్యాయి. దీంతో గత కౌన్సిల్లో ప్రాతినిధ్యం వహించిన పలువురు తాజా మాజీ కౌన్సిలర్లకు మరోసారి ఆ వార్డుల నుంచి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే, ఎలాగైనా కౌన్సిల్లో తిరిగి అడుగుపెట్టాలని భావిస్తున్న సదరు ఆశావహులు ఇతర వార్డుల నుంచి బరిలోకి దిగారు. మరికొందరు రిజర్వేషన్ అనుకూలించినా రాజకీయపరమైన కారణాలతో తమకు అనుకూలంగా ఉన్న ఇతర వార్డుల నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేసి ప్రచారం ముమ్మరం చేశారు. ఆ వార్డుల్లోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. స్థానికేతరులు అనే భావన అక్కడి ఓటర్లలో రానీయకుండా వారి విశ్వాసాన్ని చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నానా తంటాలు పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఖర్చుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తూ తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి ప్రచార గడువు ముగిసే దాకా అదే వార్డుల్లో మకాం వేసి ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వార్డుల మార్పు సదరు అభ్యర్థులకు ఏ మేరకు కలిసి వస్తోందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. కొత్త వార్డుల్లో పోటీకి దిగిన అభ్యర్థులను అక్కడి ఓటర్లు ఏ మేరకు ఆశీర్వదిస్తారనేదానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఇంట గెలిచి ప్రజలకు సేవలందించిన వీరు.. రచ్చ గెలుస్తారా? అనేది ఈ నెల 13న వెల్లడి కానుంది. తాజా మాజీల ‘పక్కచూపులు’ -
‘బీజేపీతోనే పట్టణాభివృద్ధి’
ఆదిలాబాద్: బీజేపీతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 22, 24, 21, 23, 1, 2 వార్డుల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్ట ణంలోని గాంధీచౌక్, శివాజీచౌక్ లాంటి రద్దీ ప్రాంతాల్లోని తోపుడు బళ్ల తొలగింపు ద్వారా ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని తెలిపా రు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో ప్రతీ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అర్హులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పక్కా ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం తెరవెనుక ఒక్కటయ్యాయని ఆరోపించారు. మహిళల భద్రత, యువతకు ఉపాధి అవకాశాల కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గంట జీవన్, పద్మాగౌడ్, నవత, దశరథ్, గోవర్ధన్. పెంటాజీ, మల్లేశ్, సురేశ్, గణేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ, బీఆర్ఎస్ అభివృద్ధి నిరోధక పార్టీలు
కై లాస్నగర్: బీజేపీ, బీఆర్ఎస్ అభివృద్ధి నిరోధక పార్టీలని, మున్సిపల్ ఎన్నికల్లో వాటికి తగిన బుద్ధి చెప్పాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆదిలాబాద్ వాసులను కోరారు. మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా జిల్లాకు వచ్చిన ఆయన పట్టణంలోని ఓ హోటల్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 12 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులం, మతం పేరిట రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందుతుందే తప్ప దేశంలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన బీఆర్ఎస్ పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలోని సుభాష్నగర్, రిక్షాకాలనీలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. -
పీఠంపై గురి
పులి కదలికలపై నిఘా భీంపూర్ మండల సరిహద్దు గ్రామాలైన తాంసి(కే), గొల్లఘాట్, గుంజాల, పిప్పల్కోటి శివారులో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అటవీశాఖ అధికారులు అప్రమత్తమై నిఘా పెంచారు.వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. రాత్రి వేళలో చలితీవ్రత తగ్గనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. సాక్షి, ఆదిలాబాద్: ఈ సారి మున్సిపల్ ఎన్నికలపై కాషాయ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాగైనా పీఠాన్ని కై వసం చేసుకోవాలని భావిస్తోంది. మెజార్టీ మార్క్ దాటుతామన్న ఆశాభావం ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గత మున్సిపల్ ఎన్నికల్లో కమలం పార్టీ 47 వార్డుల్లో పోటీ చేయగా, 11 చోట్ల గెలుపొందింది. ఈసారి అన్ని వార్డుల్లో బరిలో నిలవడంతో పాటు మెజార్టీ స్థానాలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పోలింగ్ బూత్ నుంచి.. పట్టణంలోని ఒక్కో వార్డులో మూడు నుంచి ఐదు వరకు పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఒక్కో బూత్కు కన్వీనర్ను కలుపుకొని, 15 మంది కార్యకర్తలతో ఆ పార్టీ కమిటీ రూపొందించింది. ఒక్కొక్కరు ఆ బూత్ పరిధిలోని ఐదు కుటుంబాలను ప్రతీ రోజు విజిట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, కాషాయం పార్టీని ఆదరిస్తే జరిగే లబ్ధిని వారికి తెలియజేయాలని పార్టీ సూచించింది. దానికి అనుగుణంగా కార్యకర్తలు తమకు కేటాయించిన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ.. పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని సీనియర్ నాయకులతో కలిపి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని 20 మందితో నియమించారు. ఈ కమిటీ రాష్ట్ర, జాతీయ పార్టీ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికను అమలు చేయాలి. మండలాల్లోని నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించుకుంటున్నారు. గ్రామ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ పదవుల్లో ఉన్న మండల సీనియర్ నాయకులకు పట్టణంలోని 49 వార్డులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. వారు పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు చేపట్టే కార్యాచరణ పరిశీలిస్తుండాలి. కార్పొరేటర్ల రాక.. మహారాష్ట్రలోని ముంబై, రాజస్థాన్లోని మున్సిపల్ కార్పొరేటర్లు ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని ఆయా వార్డులకు సూపర్వైజర్లుగా పరిశీలన చేస్తున్నారు. 8 మంది కార్పొరేటర్లకు వార్డులను విభజించి బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితిపై జాతీయ నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లా నాయకులతో సమీక్షించారు. జిల్లా నుంచి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఈ వీసీలో పాల్గొన్నారు. నిర్మల్లో అమిత్ షా పర్యటన ఉండగా, ఆదిలాబాద్ పట్టణానికి జాతీయ, రాష్ట్ర ముఖ్య నాయకులను ప్రచారానికి తీసుకువచ్చే విషయంలో ఈ వీడియో కాన్ఫరెన్స్లో చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకై తే జిల్లాకు రానున్న నాయకుల పర్యటనకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ ఖరారు కాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బలం పుంజుకునేలా కార్యాచరణ ఇప్పటివరకు చేపట్టిన కార్యాచరణతో పార్టీ 20కి పై గా వార్డుల్లో బలంగా ఉందని కాషాయ నేతలు అభిప్రాయ పడుతున్నారు. మరిన్ని వార్డుల్లోనూ పార్టీ పుంజుకునేలా కార్యాచరణను సిద్ధం చేసి అమలు చే సేలా ముందుకు సాగుతున్నామని చెబుతున్నారు. -
పట్టణంలో పల్లె నేతల సందడి
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో పల్లె నేతలు సందడి చేస్తున్నారు. ప్రచార పర్వం మొదలైనప్పటి నుంచి ఇక్కడే మకాం వేసిన సదరు నాయకులు ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించాయి. ఆయా పార్టీల తరఫున అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఆదిలాబాద్, బోఽథ్ నియోజకవర్గాల్లోని పల్లె నేతలకు ఇక్కడి ప్రచార బాధ్యతలు అప్పగించారు. జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్, మావల, తాంసి, తలమడుగు మండలాలకు చెందిన సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, పార్టీ పరమైన పదవుల్లో ఉన్న వారితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులను వార్డుల వారీగా ఇన్చార్జీలుగా నియమించారు. రంగంలోకి దిగిన సదరు నాయకులు తమకు కేటాయించిన వార్డులోని అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ వార్డులో చూసినా పల్లె ప్రాంత నాయకులే కనిపిస్తుండడం గమనార్హం. -
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
ఇచ్చోడ: గిరిజన విద్యార్థులు సాంకేతిక పరి జ్ఞానం పెంపొందించుకోవాలని మైండ్ స్పా ర్క్ కోఆర్టినేటర్ కిశోర్ అన్నారు. మండలంలోని రాయిగూడ ఆశ్రమ పాఠశాలలో సంస్థ ఆధ్వర్యంలో నలుగురు విద్యార్థులకు శుక్రవారం ఉచితంగా ల్యాప్టాప్లు అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన విద్యార్థుల్లో సాంకేతిక విద్య అభివృద్ధి కోసం సంస్థ పనిచేస్తుందన్నారు. ల్యాప్టాప్ లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఆత్రం భాస్కర్, పాఠశాల సిబ్బంది గజనంద్నాయ క్, శంభు తదితరులు పాల్గొన్నారు. -
ఆ పార్టీలన్నీ కుమ్మక్కయ్యాయి
● ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. మున్సిపల్ పరిధిలోని 5, 6, 7, 8 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన శుక్రవారం ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీలు కలిసి ఎంఐఎం అభ్యర్థిని చైర్పర్సన్ చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి పనులకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. తాను కృషి చేసిన ఫలితంగానే ఇటీవల కలెక్టర్ ఖాతాలో రూ. 109 కోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. విషయాన్ని పట్టణ ప్రజలు గమనించి, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి ప్రగతికి బాటలు వేయాలని కోరారు. ఆయన వెంట నాయకులు సాయి కృష్ణ, ధోని జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
వందశాతం పోలింగ్ నమోదు లక్ష్యం
క్రీడల్లో గెలుపోటములు సహజం ఆదిలాబాద్: క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు ఓటమిని చూసి కుంగిపోకుండా, గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎస్సీ బాల, బాలికల క్రీడా పోటీల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి సునీత కుమారి, అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కైలాస్నగర్: ఈ నెల 11న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా ప్రతి ఓటరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పట్ట ణంలోని భాగ్యనగర్లో శుక్రవారం నిర్వహించిన స్వీప్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రాంతినగర్ నుంచి హమాలీవాడ వరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆటపాటలతో అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రజలకు కర దీపికలు అందజేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు శక్తివంతమైన ఆయుధమన్నారు. సమస్యల పరి ష్కారం కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నా రు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురికాకుండా బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు. ఓటరు స్లిప్పుతో పాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారితో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్ అసెంబ్లీ స్థాయి సీఎం కప్ పోటీలు శుక్రవారం మండలంలోని చాందా (టి) ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఉత్సాహంగా సాగాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలతో దేహ దారుఢ్యం పెంపొంతుందన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో పోటీలు రసవత్తరంగా సాగాయి. కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, డీవైఎస్వో శ్రీనివాస్, ఎంపీడీవో వంశీకృష్ణ, సర్పంచ్ మంజుషా, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు
కైలాస్నగర్(బేల): జిల్లాలో మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బేల పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, వాహనాలను పరిశీలించారు. కేసు ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా సిబ్బంది కోసం నిర్మించిన విశ్రాంతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, మండలంలో అసాంఘిక కార్యకలా పాలు పూర్తిగా రూపుమాపాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ శ్రావణ్, బేల ఎస్సై ప్రవీణ్కుమార్, తదితరులున్నారు. -
‘సాక్షి’ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ
ఉట్నూర్రూరల్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు గురువారం మైనార్టీ గురుకులం, ఆశ్రమ క్రీడా పాఠశాల, జెడ్పీఎస్ఎస్ ఉట్నూర్, లక్కారం, బాలుర ఆశ్రమ పాఠశాల ఉట్నూర్, ఉర్దూ మీడియం పాఠశాలల్లో పదో తరగతి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. సర్క్యూలేషన్ డివిజన్ ఇన్చార్జి ఖాజామొయినొద్దీన్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్ను సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. మండల విద్యాధికారి ఆశన్న మాట్లాడుతూ.. ‘సాక్షి’ మీడియా గ్రూప్ పత్రికా రంగంలో రాణిస్తూ మరో వైపు విద్యార్థుల సౌకర్యార్థం పదో తరగతిలో మంచి మార్కులు సాధించేలా తోడ్పాటునందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సౌమ్యకు ఎకై ్సజ్ శాఖ నివాళి
ఆదిలాబాద్టౌన్: నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ సౌమ్యకు ఆ శాఖ అధికారులు గురువారం జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో నివాళులర్పించారు. ఆమె చి త్రపటానికి పూలమాలలు వేశారు. కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఎకై ్సజ్ అధికారి హిమశ్రీ, సీఐలు విజేందర్, గంగా రె డ్డి, అక్బర్ హుస్సేన్, మురళీకృష్ణ, టీఎన్జీవో నా యకుడు అరుణ్కుమార్, కానిస్టేబుళ్లున్నారు. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారులుఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ ప్రాంతంలో ప్రారంభించిన రైల్వే అండర్బ్రిడ్జి నిర్మాణ పనులపై పట్టణానికి చెందిన 25మంది వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ తరఫున న్యాయవాది వాదనలు వినిపించినట్లు పేర్కొన్నారు. భూసేకరణ చట్టం ప్రకా రం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా పనులు ప్రారంభించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నా పిటిషనర్లను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని కోర్టు సూచించినట్లు పేర్కొన్నారు. -
నిర్భయంగా ఓటు వేయాలి
ఆదిలాబాద్టౌన్: నిర్భయంగా ఓటుహక్కు విని యోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రంలో వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అక్రమంగా మద్యం, డబ్బు, బహుమతులు తరలించకుండా చర్యలు చేపట్టినట్లు పే ర్కొన్నారు. ఎలాంటి సమాచారమున్నా ‘డయల్ 100’కు తెలుపాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, అనుమ తి లేకుండా ర్యాలీ, సభలు నిర్వహించవద్దని తెలి పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, సీఐలు సునీల్కుమార్, నాగరాజు, ప్రణయ్కుమార్, ఎస్సైలు స్వామి, అశోక్, నాగనాథ్, రమ్య, విష్ణువర్ధన్, మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజార్షి షా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులకు శిక్షణ ఇవ్వగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో మైక్రో అ బ్జర్వర్లు, జోనల్ అధికారుల పాత్ర కీలకమని, ఎన్ని కల ప్రవర్తనా నియమావళిపై ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల పరిశీలకుడు హనుమంతు నాయక్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ నివేదికలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలి మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించనున్న అధి కారులు, సిబ్బంది ఈ నెల 6నుంచి 8వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవా లని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మున్సిపల్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన పట్టణంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఏర్పాట్ల గురించి అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఆయన వెంట సాధారణ పరిశీలకుడు హనుమంతు నాయక్, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారి ఫణిందర్రావు, మెప్మా పీడీ రాజు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్వేత తదితరులున్నారు. కాగా, బీఎల్వోలు కలెక్టర్ను క్యాంపు కార్యాలయంలో కలిసి పోల్ చీటీ అందజేశారు. వందశాతం ఓటింగ్ నమోదు కావాలి ఈ నెల 11న నిర్వహించన్నున మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు కావాలని కలెక్టర్ రాజార్షి షా సూచించారు. పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లా కేంద్రంలో స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీని ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ ఎస్టీయూ భవ న్కు చేరుకుంది. అక్కడ ఓటు ప్రాముఖ్యతను తెలి పేలా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందాలు ఆలపించిన చైతన్య గీతాలు ఆకట్టుకున్నా యి. స్వయంగా కలెక్టర్ ర్యాలీలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రజలంతా ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా, నిర్భయంగా ఓటేయాలని కోరా రు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు, స్వ చ్ఛంద సంస్థలు కృషి చేయాలని సూచించారు. అ నంతరం స్వీప్ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. ఓటుహక్కు వినియోగంపై ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీపీఆర్వో విష్ణువర్ధన్, మైనారిటీ సంక్షేమాధికారి ఖలీమ్, మెప్మా పీడీ సీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల నిరసన
ఆదిలాబాద్టౌన్: ఆస్తి తగాదాల విషయంలో తన అన్న నుంచి ప్రాణహానీ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని కారణంగా న్యాయవాది స్వప్న హత్యకు గురైందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ ఆరోపించారు. గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించి జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ ఎదుట నిరసన తెలిపారు. కోర్టు ఎదుట రహదారిపై రాస్తారోకో చేశారు. నిందితుడిని కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నగేశ్ మా ట్లాడుతూ.. న్యాయాన్ని రక్షించేవారికే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంజేశారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఆదిలాబాద్టౌన్: నిబంధనలు అతిక్రమించే డయాగ్నోస్టిక్ సెంటర్లపై కఠినచర్యలు తీసుకుంటామని జి ల్లా వైద్యారోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ హె చ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జగదాంబ, ఎస్వీ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కానింగ్ పరీక్షల కు వచ్చే గర్భిణుల పూర్తి వివరాలను రిజిస్టర్లలో న మోదు చేయాలని ఆదేశించారు. పీసీ పీఎన్డీటీ పో ర్టల్లో వివరాలు పొందుపర్చాలని సూచించారు. లింగ నిర్ధారణ చట్టరీత్యానేరమని హెచ్చరించారు. అడిషనల్ డీఎంహెచ్వో సాధన, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్, మాస్ మీడియా అధి కారి వెంకట్రెడ్డి, పోతన్న, రాంప్రసాద్ ఉన్నారు. -
కలప వినియోగిస్తే కఠినచర్యలు
నేరడిగొండ: అక్రమ కలప వినియోగిస్తే కఠినచర్యలు తప్పవని అటవీరేంజ్ అధికారి బెజ్జరం గణేశ్ హెచ్చరించారు. జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి చిన్న విశ్వనాథ్ బుసరెడ్డి ఆదేశాల మే రకు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పీచరా గ్రామంలో అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గృహ నిర్మాణాల్లో అనుమతి లేని అటవీ కలప వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా స్థానిక వడ్రంగుల వద్దకు వెళ్లి ప్రభుత్వ అనుమతి లేకుండా అటవీ కలపను వినియోగించకూడదని సూచించారు. అనంతరం పలువురు వడ్రంగులకు నోటీసులు జారీ చేశారు. ఆయన వెంట నేరడిగొండ అట వీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి లఖన్సింగ్, బీట్ అధికారి సచిన్, సిబ్బంది ఉన్నారు. -
● ప్రతీ వార్డుపై నిశితంగా ఫోకస్ ● సర్పంచులకు వార్డుల బాధ్యత ● విజయమే లక్ష్యంగా ముందుకు.. ● పీసీసీ ఆదేశాలకు అనుగుణంగా గాంధీ భవన్కు రోజువారీ నివేదిక
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని టీపీసీసీ క్షేత్రస్థాయిలో ప్రత్యేక టాస్క్ రూపొందించింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో నిశితంగా దృష్టి సారించేందుకు పార్టీ పెద్దలు వ్యూహరచన చేశారు. ప్రతీ వార్డులో జరిగే రోజువారీ పరిణామాలను పర్యవేక్షిస్తున్నారు. లోపాలున్నచోట దిద్దుబాటు చర్యలు తీసుకునేలా వడివడిగా కదులుతున్నారు. ఒక్కోవార్డు నుంచి మొత్తం మున్సిపాలిటీలోని పరిస్థితులను ఎ ప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రతీ అంశాన్ని పరిశీలిస్తూ పార్టీ అభ్యర్థులు, నాయకుల పనితీరుపై నిత్యం గాంధీభవన్కు నివేదిక తెప్పించుకునేలా మానిటరింగ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీ ఆదిలాబాద్లో ఎలా గైనా గెలిచేలా టీపీసీసీ అమలు చేస్తున్న టాస్క్ క్షేత్రస్థాయిలో పకడ్బందీగా కొనసాగుతోంది. స్కూల్లో విద్యార్థికిచ్చే హోంవర్క్లా ఈ టాస్క్ అమలవుతున్నట్లు కాంగ్రెస్ నాయకుడొకరు అభిప్రాయపడడం ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో గెలవాలని చెప్పడం కాకుండా పైనుంచే ప్రక్రియ ఇలా ఉండాలని, దాని కి అనుగుణంగా ప్రతీ స్థాయిలో నాయకులు కష్టపడాల్సిందేనని అధిష్టానం స్పష్టం చేసింది. ఈ విధంగా ఏ వార్డులోనైనా లోపాలుంటే.. ఏ విధంగా సరి దిద్దాలో కూడా అప్పటికప్పుడు పైనుంచి ఆదేశాలి స్తోంది. ఇందుకు అనుగుణంగా స్థానిక బాధ్యులు క్షే త్రస్థాయిలో ముందుకెళ్తున్నారు. ఇలా బల్దియా ఎ న్నికల్లో గెలుపే లక్ష్యంగా హస్తంబ్యాచ్ పనిచేస్తోంది. ప్రతీ వార్డుపై ప్రత్యేక దృష్టి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులుండగా, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచిన వారిలో కొంతమంది నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి ఒక్కొక్క వార్డుకు ఇన్చార్జిగా నియమించారు. వీరు ఆ వార్డులో జరిగే పరిణామాలను కింది స్థాయి వరకు గమనిస్తున్నారు. ప్రచారం నుంచి మొదలుకుంటే ఓటర్ల నాడీ గుర్తించేవరకు ఇలా అన్ని అంశాల్లో వీరు సూక్ష్మంగా దృష్టి సారిస్తున్నారు. సర్పంచులపై పర్యవేక్షణ కోసం ప్రతీ నాలు గైదు వార్డులకు కలిపి జిల్లా నాయకులను కో కోఆరి నేటర్లుగా నియమించారు. వీరిలో గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, అల్లూరి సంజీవ్రెడ్డి, మల్లెపూల నర్సయ్య, అడ్డి భోజా రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, గోక గణేశ్రెడ్డి, ముడుపు దా మోదర్రెడ్డి, బాలూరి గో వర్ధన్రెడ్డి, ఏలేటి అశ్విన్రెడ్డి, కుమ్రం కోటేశ్, బొ డ్డు గంగారెడ్డి, అశోక్రెడ్డి, బాబన్న, కొండ గంగాధర్, భూపెల్లి శ్రీధర్ ఉన్నా రు. వీరికి సబ్ కోఆర్డినేటర్లుగా మరి కొంతమందిని నియమించారు. వీ రందరిపై పర్యవేక్షణకు టీపీసీసీ నుంచి ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ను కోఆర్డినేటర్గా గురువారం నియమించారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా ఆయన ఆదిలాబాద్లోనే ఉండనున్నట్లు పార్టీ జిల్లా నాయకులు తెలిపారు. ఇక వీరందరి నుంచి వార్డుల వారీగా వచ్చే రిపోర్టులను డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ పరిశీలించి రోజువా రీగా గాంధీభవన్కు పంపిస్తారు. నేడు ఏఐసీసీ నేత రాకకాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉండగా, ఆమెకు సహాయకులుగా ప్రస్తుతం ఏఐసీసీ సెక్రటరీలుగా ఇద్దరు పని చేస్తున్నారు. వీరికి రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల పరిధిలోని మున్సిపాలిటీల బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు తమ పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితులపై పరిశీలన కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ రానున్నారు. 28 వార్డుల్లో బలంగా.. ప్రతీ స్థాయిలో సూక్ష్మంగా ఫోకస్ పెట్టి ఇప్పటివరకు 28వార్డుల్లో బలంగా ఉన్నట్లు డీసీసీ గాంధీ భవన్కు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. మిగతా వార్డుల్లోనూ లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్తే ఫలితం సాధిస్తామని అధిష్టానానికి తెలియజేసినట్లు కొంతమంది నాయకులు తెలిపారు. అధికార కాంగ్రెస్ ప్రతీ మున్సిపాలిటీలో గెలుపును సవాల్గా తీసుకుని ముందుకు కదులుతుండటం, అందులో భాగంగా టీపీసీసీ టాస్క్ ప్రకారం వెళ్తుండడంతో ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేది కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
బీసీలకు 70శాతం సీట్లు
కైలాస్నగర్: సామాజిక న్యాయమే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 70శాతం సీట్లు కేటాయించినట్లు డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాద వ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులకు గాను మహిళలకు 30 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. బీసీల్లోని అన్ని కులాలకు ప్రా తినిధ్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎ స్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సమన్యాయం న్యా యం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపా రు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి మున్సిపల్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ను ఆదరించాలని కోరారు. -
ఆమెనే నిర్ణేత..!
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నిర్ణయాధికారం అతివలదే. ఎన్నికల బరిలో నిలిచిన కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించడంలో వారే కీలకపాత్ర పోషించనున్నారు. పట్టణ పరిధిలో పురుష ఓ టర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉ న్నారు. అలాగే ము న్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూడా వారే అధిష్టించనున్నారు. ఇలా ఓట్లు.. సీట్లలోనూ మహిళల అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థుల తలరాతలను మార్చే శక్తిగల మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించారు. వారి అనుగ్రహం పొందేందుకు అవసరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. వారికి ప్రత్యేక తాయిలాలను ప్రకటిస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చైర్పర్సన్ పీఠమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచిన పలువురు మహిళా అభ్యర్థులు జనరల్ స్థానాల్లోనూ పోటీ చేస్తుండటం నారీ శక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. సీట్లలోనూ వారిదే అధిపత్యం ఓట్లలోనే కాదు.. సీట్లలోనూ మహిళల అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరి ధిలోని 49వార్డులకు గాను 23వార్డులను వారికే రిజ ర్వ్ చేశారు. ఆయా వార్డుల్లో మహిళలే పోటీ చేస్తున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల పరిధిలో మొ త్తం 314మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఇందులో అత్యధికంగా మహిళా అభ్యర్థులే ఉండటం ఆసక్తిని రేపుతోంది. సమాజంలో వస్తున్న మహిళా చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. మహిళలు 182.. పురుషులు 132 మహిళా అభ్యర్థులు అత్యధికంగా 182 మంది పోటీ చేస్తుండగా, పురుషులు 132 మంది మాత్రమే బరి లో ఉన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్థానం మహిళలకు రిజర్వ్ కావడంతో వారికి కేటాయించిన వార్డులతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలే పోటీ చేస్తున్నారు. చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న ప్రధాన పార్టీల ముఖ్య నేతలు జనరల్ స్థానాల్లో వారు పోటీ చేయకుండా తమ సతీమణులను బరిలో నిలిపారు. 27, 34, 48 వార్డులు జనరల్కు కేటాయించగా బీజేపీ తరఫున మహిళలు పోటీలో నిలిచారు. 2, 4, 18, 19, 49, 30 వార్డులు జనరల్కు రిజర్వ్ కాగా, కాంగ్రెస్ నేతలు తమ సతీమణులు, కుటుంబీకులను బరిలో నిలిపారు. 26, 27 వార్డుల్లో బీఆర్ఎస్ నేతలు తమ కుటుంబీకులను పోటీలో ఉంచారు. ఇలా రిజర్వ్డ్ స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కౌన్సిలర్గా విజయం సాఽధిస్తే చైర్మన్ పీఠాన్ని అఽధిరోహించవచ్చనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. నిర్ణయాధికారం ఆమెదే..ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మొత్తం 1,43,655 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 69,813 మంది ఉండగా, మహిళా ఓటర్లు 73,836 మంది ఉన్నారు. ఇతరులు మరో ఆరుగురున్నారు. అయితే, పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 4,023 మంది అధికంగా ఉన్నారు. ప్రతీ వార్డులోనూ మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ. ఆయా వార్డుల్లో పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించగల శక్తి వారికే ఉంది. మహిళా ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థి వైపు నిలబడుతారో వారే ఆ వార్డులో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశముంది. అభ్యర్థుల గెలుపోటములను శాసించే అఽధికారం మహిళా ఓటర్లకే ఉంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వారి ఓట్లు రాబట్టేందుకు పరితపిస్తున్నాయి. ఇందుకోసం అవసరమైన తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ప్రత్యేక బహుమతులను అందజేయడంతో పాటు తాము గెలిస్తే మహిళల కోసం కాలనీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని అభ్యర్థులు హామీలిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. -
విధుల నుంచి సీఆర్పీ తొలగింపు
ఆదిలాబాద్టౌన్: విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడాన్ని ప్రస్తావిస్తూ ‘ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సీఆర్పీ’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి డీఈవో ఎస్.రాజేశ్వర్ స్పందించారు. భీంపూర్ మండలం పిప్పల్కోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా పనిచేస్తున్న పి.రవీందర్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈవో సమర్పించిన నివేదిక ప్రకారం సదరు ఉద్యోగి ఓ రాజకీయ పార్టీలో చేరడమే కాకుండా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లుగా వివరించారు. -
ఆటల్లో గెలుపోటములు సహజం
ఆదిలాబాద్: ఆటల్లో గెలుపోటములు సహజమని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్, ఆర్చరీ ఫైనల్ పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడినవారు కృంగిపోకుండా క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకొని, విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతీ క్రీడాకారుడు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని సాధించే దిశగా పాటుపడడమే కాకుండా సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాలన్నారు. -
వేర్వేరు చోట్ల కలప పట్టివేత
ఇచ్చోడ: పోలీసు శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్ అక్రమంగా తరలిస్తున్న ఫర్నీచర్ను బుధవారం పట్టుకున్నట్లు సిరిచెల్మ టైగర్ జోన్ అటవీశాఖ అధికారి నాగవత్ స్వామి తెలిపారు. ఉట్నూర్ మండలంలోని వడోని గ్రామానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ దయానంద్ కలపతో తయారు చేసిన ఫర్నీచర్ను ఐచర్ వ్యాన్లో తరలిస్తుండగా నిర్మల్ జిల్లాలోని మొండిగుట్ట చెక్ పోస్టు వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. విచారణలో దయానంద్ అనే పోలీసు కానిస్టేబుల్ వాడోని గ్రామంలో అక్రమంగా టేకు చెట్లు నరికి ఫర్నీచర్ తయారుచేసి విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. దీంతో కానిస్టేబుల్ స్వగ్రామంలో తనిఖీలు నిర్వహించగా మరింత కలప లభ్యమైందన్నారు. తనిఖీల్లో దాదాపుగా రూ.2.5 లక్షల కలపను స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బోథ్: మండలంలోని నిగిని గ్రామ పరిధిలో బుధవారం రూ.22,268 విలువైన కలపను పట్టుకున్న ట్లు ఎఫ్ఆర్వో ప్రణయ్కుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన బొజ్జ సురేష్, మడావి బాపురావు ఇళ్లల్లో సోదాలు చేయగా కలప లభ్యమైనట్లు పేర్కొన్నారు. అక్రమంగా అటవీ ఉత్పత్తులను రవాణా చేస్తున్న షేక్ మొయిన్ వద్ద నుంచి రూ.2,479 విలు వైన కలపను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో అటవీ శాఖ సిబ్బంది అనిల్, గోవింద్, ఎఫ్ఎస్వో ముమ్తాజ్, నాగోరావు పాల్గొన్నారు. తలమడుగు: మండలంలోని కుచులాపూర్లో బుధవారం కలప పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన రమేశ్ ఇంట్లో తనిఖీ చేయగా రూ.50 వేల విలువైన కలప లభ్యమైందన్నారు. కలపను స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ గులాబ్సింగ్, ఆర్ఓ ప్రమోద్ కుమార్, బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్, శరత్రెడ్డి, పాల్గొన్నారు. గుడిహత్నూర్: మండలంలోని ముత్నూర్లో బుధవారం అక్రమంగా నిల్వఉంచిన రూ.20 వేల విలుౖ వెన కలపను స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఎఫ్ఎస్వో ఇమ్రాన్, ఎఫ్బీవోలు ప్రశాంత్, విశ్వజిత్ ముత్నూర్ గ్రామానికి చెందిన గాటాడే దశరథ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కలప దుంగలు లభ్యం కావడంతో స్వాధీనం చేసుకొని ఇచ్చోడ టింబర్ డిపోకు తరలించి దశరథ్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
పొర్లు దండాలతో పోడు రైతు నిరసన
ఖానాపూర్: అటవీశాఖ అధికారులు తన ఎడ్ల జతను నిర్భందించడాన్ని నిరసిస్తూ మండలంలోని తర్లపాడుకు చెందిన పోడు రైతు భూమన్న బుధవారం పట్టణంలోని పాత బస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి అటవీ శాఖ కార్యాలయం వరకు పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపాడు. కొన్ని దశాబ్దాలుగా సాగులో ఉన్న తన భూమిలో అట వీశాఖ అధికారులు జేసీబీతో గుంతలు తవ్వి మొక్కలు నాటడంతో పాటు అక్రమంగా పోడుభూమి సా గు చేసుకుంటున్నానని తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. గత నెల 21న తీసుకువచ్చిన ఎడ్లను ఇప్పటికీ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. -
గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యం
నెన్నెల: మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన పాటి, బోగంపల్లిలకు రోడ్డు నిర్మాణంతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి కిషన్ అన్నారు. ఎంపీడీవో అబ్దుల్హైతో కలిసి బుధవారం గ్రామాలను సందర్శించారు. అక్కడి ప్రజలు ఈ నెల 2న కలెక్టర్ కుమార్దీపక్ను కలిసి రోడ్డు నిర్మించాలని, గిరివికాస్ బోర్లకు కరెంట్ కనెక్షన్లు, సాగులో ఉన్న వారికి పోడు పట్టాలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గ్రామాలను సందర్శించిన అధికారులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిర్మాణం, గిరివికాస్ బోర్లకు కరెంట్ కనెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉపాధిహామీ పనుల్లో హాజరుశాతం పెంచాలని సూచించారు. వారి వెంట మన్నెగూడం సర్పంచ్ బానోతు మధుకర్, ఏపీఓ నరేష్, గిరిజన నాయకులు కొడిపె శంకర్ తదితరులు ఉన్నారు. -
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
సాత్నాల: యువత మాదక ద్రవ్యాలకు దూరం ఉండాలని జైనథ్ సీఐ శ్రావణ్ అన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా బుధవారం బేల మండలంలోని సైద్పూర్లో కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 30 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని 12 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. సీఐ మా ట్లాడుతూ ప్రజలు, యువత గుడుంబా, గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల ని సూచించారు. మహిళలను గౌరవించాలని, గృహహింస చర్యలకు పాల్పడవద్దన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, బేల ఎస్సై ఎల్.ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మో.. బూచోళ్లు..!
దారి తప్పుతున్న బాల్యం మైనర్లు లైంగికదాడులు, నేరాలకు పాల్పడడం ఆందోళన కలిగించే అంశం. నేరాలు పెరగడానికి కుటుంబ విలువలు పడిపోవడం, మానవత్వం విలువలు తెలియకపోవడం కారణాలుగా మారుతున్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లోని తాత, నానమ్మ, అమ్మమ్మ ఎదుగుతున్న పిల్లలకు విలువలు తెలియజేసేవారు. మారుతున్న జీవనశైలీలో పాశ్చాత్య, యాంత్రీక జీవన విధానంతో పిల్లలకు మంచీ చెడు చెప్పేవారు కరువయ్యారు. ఆలోచనలు పరిమితమై అవగాహన కోసం ఆస్పత్రులు, పాఠశాలలపై ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎదుగుతున్న మగపిల్లలకు మంచీ చెడు వివరించే వారు లేక మైనర్లుగా ఉన్నప్పటి నుంచే నేరాలకు పాల్పడుతున్నారని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల చింతలమానెపల్లి మండలంలో అఘాయిత్యానికి పాల్పడిన బాలుడు(16) దారి తప్పి జులాయిగా తిరుగుతున్నట్లు తెలిసింది. ఎదిగే పిల్లల ఆలనాపాలన చూడాల్సిన తల్లిదండ్రులు వృత్తి, ఉద్యోగాల నిర్వహణలో వారిని పట్టించుకోకుండా ప్రోగ్రెస్ రిపోర్టు పరిశీలించి సరిపెట్టడంతో ఇతర విషయాలకు ప్రభావితం అవుతున్నారు. 14 నుంచి 16ఏళ్లలోనే మద్యం, మత్తు పదార్థాల వ్యసనాలకు లోనై నేరాలకు పాల్పడుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై అవగాహన అవసరం పిల్లల భద్రత అత్యంత కీలకమైన అంశంగా మారింది. లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండేందుకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్పై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 202420232022చిన్నారులపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై అవగాహన లేకపోవడం, ప్రలోభాల ఆశచూపి లైంగికదాడులకు పాల్పడడం అవగాహన లేమిని సూచిస్తున్నాయి. మరోవైపు మైనర్ బాలురు అఘాయిత్యాలకు పాల్పడడం భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇటీవల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలో ఓ మైనర్ బాలుడు బయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు రూ.10 ఆశచూపి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత ఏడాది ఏప్రిల్లో దహెగాం మండలంలోని ఓ గ్రామంలో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. తల్లిదండ్రులు, సమాజం చిన్నారుల భద్రతపై సరైన చర్యలు తీసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. – చింతలమానెపల్లికుమురంభీం జిల్లాలో పోక్సో కేసుల వివరాలు మైనర్లు అయినా చట్టాలు కఠినమే.. చట్టం ప్రకారం 18ఏళ్లలోపు వారిని మైనర్లుగా పరిగణిస్తారు. కానీ తీవ్రమైన నేరాలకు పాల్పడిన సందర్భంలో చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవు. గతంలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో పోక్సో వంటి కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరాలకు పాల్పడితే బాలుడికి 16 సంవత్సరాలు ఉన్నప్పటికీ అడల్ట్గానే గుర్తిస్తారు. దీని ప్రకారమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. -
బాలురకు సైతం అవగాహన కల్పించాలి
బాలికలు, అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పిస్తున్నాం. దీంతోపాటు తప్పుగా ప్రవర్తిస్తే జరిగే పరిణామాలను బాలురు, అబ్బాయిలకు సైతం వివరిస్తున్నాం. అదుపు తప్పి ప్రవర్తిస్తే చట్ట ప్రకారం తీసుకునే చర్యలు, శిక్షలను బాలురకు తగిన వయసులో వివరించాలి. మైనర్లు అయినా నేరాలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయి. – బూర్ల మహేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి పిల్లలపై పర్యవేక్షణ ఉండాలి నేటి పరిస్థితుల్లో చిన్నారులకు అన్ని విషయాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో బాలికలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో మానసిక నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాని లైంగిక దాడుల బారిన పడకుండా తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎవరితో ఉన్నారు అనే విషయంలోనూ స్పష్టత ఉండాలి. ఇంటి చుట్టుపక్కల వివాదాస్పద, మత్తు వ్యసనాలకు లోనైన వ్యక్తులు ఉంటే వారి వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి. డబ్బులు, బహుమతులు వంటి వాటికి ప్రలో భాలకు గురికాకుండా పిల్లలు, టీనేజీ అమ్మాయిలకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ కుటుంబాల్లో చాలామంది పిల్లలను ఇంటి వద్దే ఉంచి తల్లిదండ్రులు పనులకు వెళ్తుంటారు. ఇలాంటి సందర్భాలలో అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తగిన బాధ్యత కలిగిన వారి పర్యవేక్షణలో చిన్నారులు ఉంటే ఇలాంటి అనర్థాలు జరగకుండా చూడవచ్చు. – కవిత అజయ్, మానసిక వైద్య నిపుణులు -
బదిలీపై వెళ్తున్న అధికారికి సన్మానం
జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో ఏజీఎం ఫైనాన్స్గా విధులు నిర్వర్తిస్తున్న మురళీధర్ కార్పొరేట్ ఏరియాకు బదిలీ అయ్యారు. బుధవారం అడ్మిన్ భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్టీపీపీ జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్ ఆయనను శాలువాలతో సత్కరించారు. మురళీధర్ ఎస్టీపీపీకి అందించిన సేవలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీఎంవోఐ ప్రెసిడెంట్ పంతుల, డీజీఎంలు అజాజుల్ల ఖాన్, శివ ప్రసాద్, వేణు గోపాల్, పర్సనల్ డీజీఎం కిరణ్ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
దండేపల్లి: ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మంచిర్యాలలో నిర్వహించిన సబ్ జూనియర్ వాలీబాల్ ఎంపిక పో టీల్లో దండేపల్లి మండలం రెబ్బనపల్లి జెడ్పీ ఉ న్నత పాఠశాల విద్యార్థులు వినయ్, అక్షిత, ప్ర సన్న అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఎంఈవో, పాఠశాల హెచ్ఎం మంత్రి రాజు తెలిపారు. ఈ నెల 5 నుంచి ని జామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. సదరు వి ద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. కోలిండియా హాకీ పోటీలకు ఎంపిక శ్రీరాంపూర్: కోలిండియా హాకీ పోటీలకు ఎంపికై న సింగరేణి జట్టులో శ్రీరాంపూర్ క్రీడాకారులకు చోటు దక్కింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బి లాస్పూర్లో ఈ నెల 4, 5 తేదీల్లో జరుగనున్న కోలిండియా హాకీ పోటీలకు ఎస్సార్పీ ఓసీపీకి చెందిన ఈపీ ఆపరేటర్ తోట సురేశ్, సెక్యూరిటీగార్డులు ఈర్ల సదయ్య, అగ్గి నాగరాజు, జీ నరేందర్ (కోల్ కట్టర్, ఆర్కే 7), బెల్లం తిరుపతి (జనరల్ అసిస్టెంట్, ఎస్సార్పీ ఓసీపీ), జీ. శ్రీకాంత్(ఎంవీ డ్రైవర్, ఐకే ఓసీపీ), ఎల్.రాజేశ్(కోల్ కట్టర్, ఆర్కే 7) ఎంపికయ్యారు. రైల్వేస్టేషన్లో మైనర్ బాలిక గుర్తింపుఆదిలాబాద్: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పదిహేనేళ్ల మైనర్ బాలికను జీఆర్పీ పోలీసులు బుధవారం గుర్తించారు. మధ్యాహ్నం సమయంలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో తిరుగుతున్న బాలికను పోలీసులు గుర్తించి వివరాలు అడగగా హైదరాబాద్లోని సురారం, గండిమైసమ్మ ప్రాంతానికి చెందినట్లుగా గుర్తించారు. అనంతరం పునరావాసం కోసం జిల్లా చైల్డ్ హెల్ప్లైన్ అధికారులకు అప్పగించినట్లు తెలి పారు. బాలికను గుర్తించిన జీఆర్పీ పోలీసులు టి.ప్రభాకర్, భగవాండ్లు, కె.ప్రవీణ్ కుమార్ను పలువురు రైల్వే సిబ్బంది అభినందించారు. కోతుల దాడిలో మహిళకు గాయాలుబాసర: బాసర ఆలయంలో ఎన్ఎంఆర్గా విధులు నిర్వహిస్తున్న గోదావరిపై బుధవారం కోతులు దాడి చేశాయి. ఆలయ పరిసరాలు శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా కోతులు దాడి చేయడంతో సదరు మహిళకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాసర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సదరు మహిళపై కోతులు దాడి చేయడం ఇది రెండోసారి. ఆలయ పరిసరాల్లోంచి కోతులను తరలించాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
ఇంద్రవెల్లి: విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై సాయన్న తెలిపిన వివరాల మేరకు మండలంలోని దనోరా(బి) గ్రామానికి చెందిన మదురే అక్షయ్ (30), అదే గ్రామానికి చెందిన పసరే ఆకాష్ గౌరపూర్ శివారులోని ఓ రైతు వ్యవసాయ చేనులో బెల్టుషాపు ఏర్పాటు చేస్తున్నారు. దుకాణానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు 11 కేవీ వైర్లకు కొండీల ద్వారా విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకాష్ సమాచారంతో గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బాసర గోదావరిలో మృతదేహం లభ్యంబాసర: బాసర గోదావరిలో యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. తానూర్ మండలంలోని దాగా గ్రామానికి చెందిన పీకలకర్ బాలాజీ (34) మద్యానికి బానిసై మానసిక స్థితి కోల్పోయాడు. ఈనెల 1న ఇంటినుంచి బయటకు వెళ్ళి తిరిగిరాలేదు. బుధవారం గోదావరినదిలో మృతదేహం గుర్తించిన స్థానికులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని సోదరుడు భోజన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
బుల్డోజర్ పాలనను తిరస్కరించాలి
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను ఆదరించి బుల్డోజర్ పాలనను తిరస్కరించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జిలకు బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు భూమిపూజ పేరిట నాటకాలు ఆడుతున్నారే తప్పా వారికి దానిపై చిత్తశుద్ధి లేదన్నారు. దీనిపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానని తెలిపారు. ఆదిలాబాద్కు మనమే అసలైన ఆదిల్గా ఉండాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ టికెట్ చివరి నిమిషంలో చేజారిన తౌఫిక్ అహ్మద్తో పాటు పలువురు వివిధ పార్టీల నుంచి ఎంపీ సమక్షంలో ఎంఐఎంలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 11 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు విశ్వ గురువుగా చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడికి ఎందుకు భయపడుతున్నారని ఒవైసీ ప్రశ్నించారు. రష్యా నుంచి ఆయిల్ కొనవద్దని ట్రంప్ చెప్పడంతో మోదీ అంగీకరించి కొనుగోళ్లను ఆపారన్నారు. బీసీ బిడ్డగా చెప్పుకునే మోదీ బీసీలకు అన్యాయం చేసేలా యూజీసీ చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో దేశానికి నష్టమే తప్పా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. 11 ఏళ్ల మోదీ పాలనలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ మెహరాజ్ హుస్సేన్, హైదరాబాద్ కార్పొరేటర్ సలీమ్ బేగ్, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, సయ్యద్ అత్తు తదితరులు పాల్గొన్నారు. నేడు పట్టణంలో రోడ్షోఎంఐఎం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా గురువారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జిల్లా కేంద్రంలో రోడ్షో నిర్వహించనున్నారు. -
వామ్మో పులి!
తాంసి: జిల్లాను మళ్లీ పులి భయం పట్టుకుంది. ఏ టా తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పెన్గంగ దా టి ఇక్కడికి బెబ్బులి రావడం ఆనవాయితీగా మా రింది. రెండు నెలల క్రితమే వచ్చి వెళ్లిన టైగర్ తా జాగా మళ్లీ ఇక్కడ పంజా విసరుతోంది. రెండు రో జుల క్రితం భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి స మీపంలో ఓ పశువుపై దాడి చేసి హతమార్చిన ఘ టన తెలిసిందే. దీంతో నది పరీవాహక, అటవీ స మీప గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు చేలకు వెళ్లాలంటే వణికిపోతున్నా రు. పులి ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని పశువులకాపరులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షం కిత్రమే వచ్చినట్లుగా అనుమానం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి పెన్గంగ దాటి జిల్లాలోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. పక్షం రోజుల క్రితమే వచ్చినట్లుగా అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా భీంపూర్ మండలంలోని పెన్గంగ నదికి అనుకుని ఉన్న తాంసి(కె), గొల్లఘాట్, గుంజాల, పిప్పల్కోటి శివారులో సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. గొల్లఘాట్ శివారులో పంటచేలో మేత కోసం వెళ్లిన ఎద్దుపై దాడి చేసి హతమార్చిన క్రమంలో విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. పులి దాడిలోనే ఆ పశువు మృతి చెందినట్లుగా అటవీ అధికారులు సైతం నిర్ధారించారు. ఆనవాళ్లు గుర్తించే పనిలో సిబ్బంది రెండు రోజుల క్రితం పులి దాడిలో హతమైన ఎద్దు కళేబరాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు, సిబ్బంది బెబ్బులి ఆనవాళ్లు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం పలు ప్రాంతాలను పరిశీలించారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పులి కదలికలపై నిఘా పెంచారు. పలుచోట్ల కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం భీంపూర్ మండలంలోని గుంజాల, గొల్లఘాట్, తాంసి(కె) గ్రామాల శివారులో పులి సంచరిస్తున్నందున ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. డీఎఫ్వో ఆదేశాల మేరకు రెండు బృందాలతో పాటు పులి కదలికలను గుర్తించేందు కోసం 10 కెమెరాలు సైతం ఏర్పాటు చేశాం. బాధిత రైతుకు త్వరలోనే పరిహారం అందించేలా చర్యలు చేపడుతున్నాం. – గులాబ్సింగ్, ఎఫ్ఆర్వో, ఆదిలాబాద్ -
పాతికేళ్లు నిండని వారు..
ఏడు పదులు దాటిన వారుకై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో యువతరంతో పాటు వయో వృద్ధులు సైతం నిలవడం ఆసక్తి కలిగిస్తోంది. పాతికేళ్లు సైతం నిండని వారి నుంచి ఏడు పదులు దాటిన వారు కూడా కౌన్సిలర్గా పోటీ పడుతున్నారు. వీరిలో అత్యధికులు 40 ఏళ్లలోపు వారే ఉండటం రాజకీయాలపై యువతలో వస్తున్న చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రధానంగా బీజేపీ యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి టికెట్లను కేటాయించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తరఫున ఒకటి, రెండు వార్డుల్లో యువత పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి పలువురు యువకులు టికెట్లు ఆశించి నామినేషన్లు వేశారు. అయితే ఆయా పార్టీల తరఫున అభ్యర్థిత్వం దక్కకపోవడంతో ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వృద్ధ అభ్యర్థులు సైతం యువతతో పోటీ పడుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా పాత, కొత్తతరం అభ్యర్థుల ప్రచారంతో పుర రాజకీయ వేడెక్కింది. 65 ఏళ్లు దాటిన వారు కూడా ఎన్నికల బరిలో నిలువడం రాజకీయాలపై వారికున్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. అభ్యర్థులు 61–7051–60 31–40 41–50 23–2570–75 -
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
కై లాస్నగర్/ఆదిలాబాద్రూరల్: ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మాజన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జిల్లా కేంద్రంతో పాటు మావల పోలీస్స్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో బుధవారం ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదన్నారు. అక్రమ మద్యం, నగదు, బహుమతుల తరలింపు, పంపిణీ వంటి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు తెలుపాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాగేలా అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమాల్లో ట్రెయినీ ఐపీఎస్ రాహుల్ కాంత్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీఐలు స్వామి, బి.సునీల్ కుమార్, కె.నాగరాజు, ప్రేమ్ కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, మధు కృష్ణ, రాజశేఖర్, రిజర్వ్ సిబ్బంది రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ్లాగ్మార్చ్లో పాల్గొన్న ఎస్పీ అఖిల్ మహాజన్ -
వార్కవాయిని జీపీగా ఏర్పాటు చేయాలి
నార్నూర్: గాదిగూడ మండలంలోని వార్కవాయి గ్రామ కేంద్రంగా నూతన పంచాయతీ ఏర్పాటు చేయాలని నాలుగు గ్రామాల ప్రజలు బుధవారం ప్రత్యేక సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల పటేళ్లు మాట్లాడుతూ వార్కవాయి, కౌటాల, లింగుగూడ, బొజ్జుగూడ గ్రామాలు కలిసి మొత్తం 665 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలకు గ్రామాలు దూరంగా ఉండడంతో సరైన పాలన అందడం లేదని అన్నారు. అలాగే మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. చిన్న చిన్న పనులకు కోసం దూరంగా ఉన్న పంచాయతీలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం ఎంపీ నగేశ్తో పాటు స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ రాజర్షిషాను కలిసి వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో గ్రామ పటేళ్లు ఆత్రం నాగోరావు, కుడ్మెత అమృత్రావు, చంపత్రావు, పంద్ర మారోతితో పాటు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. బహుముఖ పోటీకై లాస్నగర్: మున్సి పల్ ఎన్నికల్లో భా గంగా పలు వార్డులో బహుముఖ పో టీ నెలకొంది. పట్ట ణంలోని 49 వార్డులకు గాను 314 మంది బరిలో నిలి చారు. ప్రధాన పార్టీ లైన బీజేపీ, కాంగ్రెస్ అన్ని వార్డుల్లో పోటీలో నిలువగా.. బీఆర్ఎస్ మాత్రం 12వ వార్డు మినహా అన్నిచోట్ల అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రతీ వార్డులో ఒకరిద్దరూ ఇండిపెండెంట్లు సైతం పోటీలో నిలిచారు. అత్యధికంగా 7వ వార్డు కేఆర్కే కాలనీలో 14 మంది బరిలో ఉన్నారు. పదో వార్డులో సరిగ్గా పది మంది పోటీ చేస్తున్నారు. 12వ వార్డు న్యూహౌసింగ్బోర్డు, 20వ వార్డు తాటిగూడలో త్రిముఖ పోటీ నెలకొంది. అన్ని వార్డుల్లోనూ ప్రచారపర్వం ఊపందుకుంది.


