breaking news
Adilabad
-
బాసర ఆలయానికి భద్రత కావాలి
భైంసా/బాసర: దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు, విద్యార్థులు దర్శించుకునే పుణ్యక్షేత్రం బాసర. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న చోరీ ఘటన భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మహాకాళి అమ్మవారి గర్భగుడిలో వెండి కిరీటం, హుండీ చోరీ కావడం భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టింది. భవి ష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ అధికారులు, ప్రభుత్వం సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. నిర్లక్ష్యం వద్దు.. బాసర ఆలయానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రతీరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా అక్షరాభ్యాసాల కోసం చిన్నారులతో వచ్చే కుటుంబాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇలాంటి ప్రముఖ క్షేత్రంలో భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా... భద్రత పేరుతో భక్తులను ఇబ్బంది పెట్టే విధానాలు కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భద్రత పెంచాలని భక్తులు సూచిస్తున్నారు. దర్శనాలు, అక్షరాభ్యాసాలు, పూజా కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా భద్రతా తనిఖీలు నిర్వహించాలి. ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద స్కానింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలు సులభంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. భద్రతకూ ప్రాధాన్యం... ప్రస్తుతం బాసర ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా వ్యవస్థను కూడా ఆధునికీకరించడం అత్యవసరమైంది. చదువుల తల్లి కొలువై ఉన్న ఈ మహాక్షేత్ర ప్రతిష్ఠకు భంగం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత భద్రతా ప్రణాళిక అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తుల్లో భద్రతపై నమ్మకం పెంచే చర్యలే భవిష్యత్లో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయగలవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాసర ఆలయంచేపట్టాల్సిన చర్యలు -
కవలలను పెళ్లాడిన కవలలు
పెర్కిట్(ఆర్మూర్): ఇద్దరు కవల సోదరులు మరో ఇద్దరు కవల సోదరీమణులను పెళ్లాడారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన బాలాజీ ఇండస్ట్రీస్ యజమాని రామిడి శోభ, వెంకట్రెడ్డి దంపతులకు తరుణ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి కవల కుమారులు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం టెంబుర్ని గ్రామానికి చెందిన నిమ్మల సునీత, మహేందర్రెడ్డి దంపతులకు స్పందన, స్ఫూర్తి కవల కూతుళ్లు. ఈ రెండు జంటల వివాహ వేడుక గురువారం నిర్మల్ జిల్లా సోఫీనగర్లోని ఎంకే కన్వెన్షన్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
టెండర్లలో పేర్కొన్న సరుకులే సరఫరా చేయాలి
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాలు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, గురుకులాలకు అవసరమయ్యే నిత్యావసర, ఆహార, క్లీనింగ్ వస్తువులు, పెరిషబుల్స్ సరఫరా కొరకు గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో టెండర్లు నిర్వహించారు. ఐటీడీఏ పీవో మంద మకరందు ఆదేశాల మేరకు ఐటీడీఏ డీడీ ప్రేమ కళారెడ్డి , జీసీసీ డీఎం సందీప్కుమార్ టెండర్లు నిర్వహించారు. టెండర్ నిబంధనలలో చూయించిన నిత్యావసర వస్తువులను మాత్రమే వసతి గృహాలకు సరఫరా చేయాలని డీఎం టెండర్దారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. -
ఆర్టీసీ బస్సులో పొగలు..
గుడిహత్నూర్: ఆర్టీసీ బస్సు ఇంజిన్లో సాంకేతిక లోపం ఏర్పడి ఒక్కసారిగా పొగలు కమ్ముకున్న సంఘటన జాతీయ రహదారి 44 డోంగర్గావ్ గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఆదిలాబాద్ బస్టాండ్లో 30 మంది ప్రయాణికులను ఎక్కించుకుని నిర్మల్ బయలుదేరిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు కేవలం కిలోమీటరు దూరం వెళ్లగానే ఇంజిన్, సైలెన్సర్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ బస్సును హైవే పక్కన నిలిపి ప్రయాణికులను కిందికి దింపాడు. బస్సు బీఎస్–6 వాహనం కావడంతో సైలెన్సర్ జామ్ కావడంతో పొగలు చిమ్మినట్లు డ్రైవర్ గుర్తించాడు. వెంటనే సైలెన్సర్ను క్లీన్ చేయడంతో సమస్య పరిష్కారమైంది. కాగా డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
పురుగుల మందుతాగి ఒకరు ఆత్మహత్య
లక్సెట్టిపేట: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మున్సిపాలిటీ పరిధి లో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల మేరకు మోదెల గ్రామానికి చెందిన బాకం రాజన్న (57)కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 24న అతిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు మందలించా రు. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. ముందుగా స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
రిమ్స్లో 41 మంది స్టాఫ్నర్సుల నియామకం
ఆదిలాబాద్టౌన్: రిమ్స్ ఆస్పత్రిలో 41 మంది స్టాఫ్ నర్సులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లో ఆన్లైన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి ఈ ప్రక్రియను చేపట్టారు. 19 మంది స్టాఫ్ నర్సులు గురువారం రిపోర్టు చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. 2024లో నోటిఫికేషన్ వెలువడగా కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ రావడంతో నిరుద్యోగులకు ప్రభుత్వ కొలువులు దక్కాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో రిమ్స్ నుంచి ఇతర జిల్లాలకు చాలా మంది స్టాఫ్ నర్సులు బదిలీపై వెళ్లారు. దీంతో రిమ్స్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోగులకు వైద్య సేవల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎట్టకేలకు రిమ్స్కు పోస్టులు కేటాయించడంతో నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి. -
● జిల్లాలో సత్ఫలితాలనిచ్చిన ప్రోగ్రాం ● విస్తృతంగా అవగాహన సదస్సులు ● ఫలిస్తున్న పోలీస్శాఖ రక్షణ చర్యలు ● 30శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు
ఆదిలాబాద్టౌన్: పోలీస్శాఖ చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. దీంతో ఆర్నెళ్లలో 30శాతం వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఆర్నెళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతోనే ఇది సాధ్యమైంది. పోలీస్శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో హాట్స్పాట్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారులు, పట్టణ ప్రాంతాల్లోని ప్రమాదకర కూడళ్లు, మలుపులు, గ్రామాల సమీప ప్రాంతాల్లో రాత్రి వేళ వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ మార్కింగ్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెరిగింది. అతివేగాన్ని తగ్గిస్తే ప్రమాదాల సంఖ్య మరింత తగ్గుతుందని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు గతంలో పనిచేసిన డీజీపీ జనవరిలో అరైవ్.. అలైవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలో 500 రోడ్డు సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేశారు. ఆటో, లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించారు. అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. 13 హాట్స్పాట్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు, రంబుల్స్టిక్లు ఏర్పాటు చేశారు. రెండు చోట్ల ప్రమాదాలకు గురైన కార్లను రోడ్డు పక్కన ప్రదర్శనకు పెట్టారు. పోలీస్ కటౌట్లను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతా ల్లోని యువతకు డ్రైవ్ మేళా నిర్వహించారు. అభయ మై ట్యాక్సీ సేఫ్, యూనిక్ నంబర్లు, మైనర్ డ్రైవింగ్లను అరికట్టేందుకు తల్లి దండ్రులకు కౌన్సెలింగ్, మోడిఫై సైలెన్సర్ల తొలగింపు, జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, పాఠశాలల్లో ఖాకీ కిడ్స్, ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఇ లాఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అతివేగం తగ్గిస్తే.. ప్రమాదాలకు చెక్ రోడ్డు ప్రమాదాల్లో ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా ఉండటమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. ప్రమాదాల నివారణకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అత్యంత ముఖ్యమని ఆ శాఖ భావిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రతిఒక్కరూ తమ ప్రాణా లతో పాటు ఇతరుల ప్రాణాలనూ కాపాడవచ్చని సూచిస్తోంది. పోలీస్శాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలూ సహకరిస్తుండటంతో జిల్లాలో రోడ్డు భద్రతపై సానుకూల వాతావరణం నెలకొంది. మొత్తంగా పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారిస్తూ సురక్షిత ప్రయాణం వైపు జిల్లాను నడిపిస్తున్నారు. నిరంతరం డ్రంకెన్డ్రైవ్లు జిల్లావ్యాప్తంగా పోలీసులు నిరంతరం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇదివరకే కొంతమందిని జైలుకు పంపించారు. దీంతో నిబంధనలు పాటించని వాహనదారుల్లో గుబులు మొదలైంది. అలాగే, అతివేగంగా వెళ్లే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. దీంతో వాహనదారుల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్పై అవగాహన పెరుగుతోంది. -
అటవీ అధికారుల అడ్డగింత
ఇచ్చోడ: మండలంలోని బాబ్జిపేట్ గ్రామస్తులు గురువారం అటవీశాఖ అధికారులను అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన నలవల రాజు చే నును అదే గ్రామానికి చెందిన గేడం భీంరావు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పంట పొలంలో పనిచేస్తున్న భీంరావును అటవీ శాఖ అధికారులు జీపులో ఎక్కించి తీసుకెళ్తున్నారు. గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికా రుల వాహనాలను అడ్డుకున్నారు. భీంరావును వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అ ధికారులు భీంరావును విడిచి పెట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామానికి త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం ఇవ్వడానికి అట వీశాఖ అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. గ్రామపెద్దలు ఇంద్రు, మణిరాం, బాపురావు, బిక్కు, శేఖర్, రమేశ్ తదితరులున్నారు. -
కార్పొరేట్ స్థాయిలో సేవలందించాలి
ఆదిలాబాద్టౌన్: రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే దిశగా అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. రిమ్స్లో వైద్యసేవలు, మౌలిక వసతులు, మందుల లభ్యతపై ఉ న్నతాధికారులు, వైద్యులతో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఆస్ప త్రిలోని ఈఎన్టీ, యూరాలజీ విభాగాల పనితీరు, రోగుల సంఖ్య, అందిస్తున్న చికిత్సలు, నిర్వహిస్తు న్న శస్త్రచికిత్సల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆధునిక వైద్య పరికరాలు, నిపుణు ల సేవలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో వచ్చేవారికి నాణ్యమైన వైద్యం అందించి రిమ్స్పై ప్రజల్లో వి శ్వాసం పెంచాలని చెప్పారు. ఆస్పత్రిలో అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. అవసరమైన మందుల నిల్వలు ముందుగానే సమకూర్చుకోవాలని, రోగులు బయటి నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు. మందుల పంపిణీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని రిమ్స్ డైరెక్టర్, ఫార్మసీ అధికారులకు సూచించారు. ఆస్పత్రిలో పా రిశుద్ధ్యం, రోగుల సహాయకులకు కల్పిస్తున్న వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సూపర్ స్పెషాలి టీ ఆస్పత్రికి వచ్చే ప్రతీ రోగికి సత్వర, నాణ్యమైన వైద్య సేవలందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో సాధన పాల్గొన్నారు. -
రెండు ప్రాణాలను బలిగొన్న అతివేగం
ఆదిలాబాద్రూరల్: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ముందుగా వెళ్తున్న లారీని మ రో లారీ ఓవర్టేక్ చేసే క్రమంలో ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మ రో ఇద్దరికి గాయాలయ్యాయి. మావల సీఐ ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల మే రకు తలమడుగు మండలం పల్లీ గ్రామానికి చెంది న ఆనంద్, నారాయణ, భీంరావ్ కూరగాయల వ్యా పారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం గ్రామానికి చెందిన నగేష్ ఆటోలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఆదిలాబాద్కు బయలుదేరారు. మార్గమధ్యలో మావల పోలీస్స్టేషన్ పరిఽ దిలోని జాతీయ రహదారి 44పై ఓ లారీ ముందుగా వెళ్తున్న మరో లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో జా తీయ రహదారికి ఆనుకుని ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆనంద్ (65)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. గమనించిన స్థానికులు 108కు సమాచారం అ ందించడంతో క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి నారాయణ (48) మృతి చెందాడు. భీంరావ్, నగేష్లు స్వల్పగాయాలో బయటపడ్డారు. మృతులు నారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారు డు, ఆనంద్కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నా రు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలి
బజార్హత్నూర్: వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు త్వరగా పూర్తి చే యా లని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ సూచించా రు. గురువారం మండలంలోని గిర్నూర్, పిప్రి గ్రా మాల్లో ఆయన పర్యటించారు. పారిశుద్ధ్య పనులు, సెగ్రిగేషన్ షెడ్లు, డంప్యార్డులు పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు తని ఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు తొలగించాలని సూచించారు. ఎంపీడీవో మహేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలను నిర్మూలించాలి
ఆదిలాబాద్టౌన్: మాదకద్రవ్యాలను నిర్మూలించా లని డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని వినా యక్ చౌక్ వద్ద డ్రగ్స్కు వ్యతిరేకంగా చావర అకాడమీ పాఠశాల విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించా రు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరి ణామాల గురించి నృత్య ప్రదర్శన ద్వారా కళాకారులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి మాదకద్రవ్యాల కు వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయం గురించి తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. మావల సీఐ ప్రేమ్కుమార్, ట్రాఫిక్ ఎస్సై మనీశ్కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. 5కే రన్ పోస్టర్ ఆవిష్కరణ ‘రన్ ఫర్ ఫిట్నెస్–రన్ ఫర్ యాంటీ డ్రగ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి నిర్వహించను న్న 5కే రన్ పోస్టర్ను డీఎస్పీ జీవన్రెడ్డి ఆవిష్కరించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో నిర్వహించనున్న 5కే రన్లో యువకులు, విద్యార్థులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చే యాలని కోరారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు దశరథ్, స్వామి, బాలు ఛాపర్వాల్, మారుతి, సునీల్ అగర్వాల్, రాజు, విజయ్స్వామి తదితరులున్నారు. -
ముగిసిన ఎప్సెట్ కౌన్సెలింగ్
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగురోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎప్సెట్ తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గు రువారం ఈ ప్రక్రియను కళాశాల ప్రిన్సిపాల్, కో ఆర్డినేటర్ డి.నరేశ్ పరిశీలించి అభ్యర్థుల సందేహా లను నివృత్తి చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్లైన్ కేంద్రంలో సౌకర్యాలు కల్పించారు. మొదటిరోజు 202 మంది, రెండోరోజు 110, మూడోరోజు 106 మంది పరిశీలన పూ ర్తి కాగా, చివరిరోజు 117మంది అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోగా 106 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషనకు హాజరయ్యారు. నాలుగురోజుల ప్రక్రియలో 524మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినట్లు కోఆర్డినేటర్ నరేశ్ తెలిపారు. అన్ని సౌకర్యాలు కల్పించి ప్రశాంత వాతావరణంలో ధ్రు వపత్రాల పరిశీలన పూర్తి చేసినట్లు వివరించారు. స ర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్న విద్యార్థులు ఈ నెల 25 నుంచి జూలై 1వరకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. జూలై 10న తొలివిడత సీట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
కై లాస్నగర్: ఉపాధ్యాయుల సమస్యలు వెంట నే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే డీఏ చెల్లించాలని కోరారు. పీఆర్సీ రిపోర్టును మూడు రోజుల్లో తెప్పించి అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చినా దాని ఊసెత్తకపో వడం శోచనీయమని పేర్కొన్నారు. జూలై 1నుంచి పీఆర్సీ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే ఎన్ఈ పీ 2020 ను వెంటనే రద్దు చేయాలని, పేద విద్యార్థుల కు నష్టం కలిగించే పీఎఫ్ఆర్డీ బిల్లును డిస్మిస్ చేయాలని, ఓపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడులను మూసివేసే చర్యలను తిప్పి కొడతామని హెచ్చరించారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కి ష్టన్న, అశోక్, సూర్యకుమార్, శ్రీనివాస్, లక్ష్మ ణ్రావు, విలాస్, గౌస్ మొయినొద్దీన్, శివన్న, శ్యామ్సుందర్, శంకర్ తదితరులున్నారు. -
గత ఘటన మరువకముందే..
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఉప ఆలయంలో మహాకాళి అమ్మవారి కిరీటం చోరీకి గురికావడం బాధాకరం. 2024 ఆగస్టులో దత్తాత్రేయ స్వామి ఆలయ సమీపంలోని ఉపాలయంలో హుండీ చోరీ ఘటన భక్తులు మర్చిపోలేదు. మళ్లీ చోరీ జరగడంతో భక్తుల్లో ఆందోళన పెరిగింది. ఆలయ భద్రతను మరింత పటిష్టం చేసి, దొంగలను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. – స్నేహారెడ్డి, భక్తురాలు, ఆదిలాబాద్ బాధాకరం అమ్మవారి ఆలయం అంటే భక్తులకు ఎంతో పవిత్రమైన స్థలం. గతంలో హుండీ చోరీ, ఇప్పుడు మహాకాళి అమ్మవారి కిరీటం దొంగిలించడం బాధాకరం. ఆలయ ప్రాంగణంలో 24 గంటల నిఘా, ఆధునిక భద్రతా వ్యవస్థలు, అదనపు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలి. భక్తుల విశ్వాసానికి భంగం కలగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. – లక్ష్మీప్రియ, భక్తురాలు, హైదరాబాద్ -
రోగుల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టవా?
ఆదిలాబాద్టౌన్: రిమ్స్కు వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. గురువా రం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని తనిఖీ చేశా రు. రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. వసతులు సరిగా లేకపోవడంతో వైద్యాధి కారులు, పారిశుద్ధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చే శారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పక్షం రో జులుగా సీటీ స్కాన్ యంత్రం పనిచేయకపోవడంతో రోగులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్తున్నార ని తెలిపారు. అయితే, నిర్వహణకు నిధులు రావడంలేదని సిబ్బంది ఎమ్మెల్యేకు చెప్పారు. వెనుకబ డిన జిల్లాను అన్ని విధాలా ఆదుకోవాలని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ రిమ్స్ ఆస్పత్రిని పరిశీలించాలని సూచించారు. సాధారణ బదిలీల్లో రిమ్స్ నుంచి వెళ్లిన వైద్యుల స్థానంలో ఎవరినీ కేటా యించలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ దీపక్ పుష్కర్, రేడియాలజిస్ట్ కళ్యాణ్రెడ్డి, బీజేపీ నాయకులు జోగు రవి, గంట జీవన్, ఆదిత్య, సతీశ్, గంగాధర్ తదితరులున్నారు. -
ఆబ్కారీశాఖకు అంతా కొత్తవారే..
సాక్షి, ఆదిలాబాద్: ఎకై ్సజ్ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. డిప్యూటీ కమిషనర్ నుంచి డీపీఈవో (ఎకై ్సజ్ సూపరింటెండెంట్) వరకు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ శాఖలో రెండున్నర నెలల కిందటే ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. సీఐలు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఈఎస్లు, ఏసీలతోపాటు డిప్యూటీ కమిషనర్ (డీసీ) వరకు ప్రమోషన్ లభించింది. అప్పుడు వారు ఎక్కడైతే పోస్టింగ్లో ఉన్నారో వారిని అదే స్థానంలో కొనసాగించారు. తాజాగా బదిలీలు చేపట్టి ప్రమోషన్ పొందిన పోస్టింగ్ కల్పించారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ కె.హరికిరణ్ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రెగ్యులర్ డిప్యూటీ కమిషనర్గా జి.జనార్దన్రెడ్డి నియమితులయ్యారు. ఖమ్మంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ ప్రమోషన్ పొందిన ఆయన తాజాగా ఆదిలాబాద్ డీసీగా రానున్నారు. హైదరాబాద్ డీసీ కార్యాలయం రెగ్యులర్ అధికారిగా ఉండి ఆదిలాబాద్ ఇన్చార్జి డీసీగా వ్యవహరించిన రఘురాం స్థానంలో జనార్దన్రెడ్డిని నియమించారు. ఇదే కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ క మిషనర్ పోస్టును తాజాగా భర్తీ చేశారు. హన్మకొండ–1 టీజీబీసీఎల్లో ఏసీగా వ్యవహరిస్తున్న కె. రాజ్యలక్ష్మి ఆదిలాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా ని యమితులయ్యారు. గతంలో ఆమె ఆదిలాబాద్, కు మురంభీం ఆసిఫాబాద్ డీపీఈవోగా పని చేశారు. పర్యవేక్షణ పటిష్టమయ్యేనా? ఎకై ్సజ్ శాఖలో తాజాగా డిప్యూటీ కమిషనర్ను రెగ్యులర్ అధికారిని నియమించారు. కొంత కాలంగా ఇన్చార్జీలతో నెట్టుకొచ్చారు. ఇక ఎన్ఫోర్స్మెంట్ ఏసీ పోస్టు ఖాళీగానే ఉండగా, తాజాగా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్లోని ఏఈఎస్ పోస్టులు కూడా ఖాళీగా ఉండగా, త్వరలో భర్తీ చేసే అవకాశాలున్నాయి. సరైన పర్యవేక్షణ లేక జిల్లాలో గంజాయి, గుడుంబా కేసులు పెరిగాయి. క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకపోయిందన్న విమర్శలున్నాయి. తాజాగా ప్రభుత్వం పోస్టుల భర్తీపై దృష్టి పెట్టడం, ఇప్పటికే కొన్ని నియమించడంతో ఎక్సైజ్ శాఖలో పర్యవేక్షణ పటిష్టం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కొత్త డీపీఈవోలు వీరే.. ఉమ్మడి జిల్లాలోని నాలుగు డీపీఈవో పోస్టులకు కొత్త అధికారులు నియమితులయ్యారు. నల్గొండలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ.కిషన్ను ఆదిలాబాద్కు, బి.చాణక్యను మంచిర్యాలకు, భూపాలపల్లి నుంచి వి.శ్రీనివాస్ను నిర్మల్కు, సూర్యపేట నుంచి కుమురంభీం ఆసిఫాబాద్కు జిల్లాకు లక్ష్మనాయక్కు బదిలీలతోపాటు పోస్టింగ్ కల్పిస్తూ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదివరకు డీపీఈవోలుగా వ్యవహరించిన హిమశ్రీ ఆదిలాబాద్ నుంచి సిరిసిల్లకు, ఎంఏ రజాక్ నిర్మల్ నుంచి ఎల్బీనగర్కు, కేజీ నందగోపాల్ మంచిర్యాల నుంచి నిజామాబాద్కు, జ్యోతికిరణ్ కుమురంభీం ఆసిఫాబాద్ నుంచి ప్రమోషన్ కల్పిస్తూ రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్కు ఏసీగా నియమించారు. -
సీఎండీని కలిసిన గుర్తింపు సంఘం నేతలు
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల డిమాండ్లపై గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నేతలు గురువారం సింగరేణి సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతిని కలిశారు. హైదరాబాదులోని సింగరేణి భవన్లో సీపీఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ వినతిపత్రం అందజేశారు. కార్మికుల 31 డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో సీఎండీతో చర్చించారు. చాలా కాలంగా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, పరిష్కరించని యెడల సమ్మె తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు గౌతం పొట్రు(పా), ఎల్వీ సూర్యనారాయణ(ఆపరేషన్స్), కే.వెంకటేశ్వర్లు(పీపీ), గుర్తింపు సంఘం నాయకులు మిర్యాల రంగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని ఒకరు..
నిర్మల్టౌన్: బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై సుమాంజలి తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్ కాలనీ చెందిన రమేశ్ (45) పాల కేంద్రంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి తన స్నేహితుడు ప్రవీణ్తో కలిసి ద్విచక్ర వాహనంపై కొండాపూర్ నుండి నిర్మల్ వైపు వెళ్తుండగా శాంతినగర్ ఎక్స్రోడ్ వద్ద అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. బైక్ వెనకాల కూర్చున్న రమేశ్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రవీణ్కు తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా నాలుగు నెలల క్రితం రమేశ్ చిన్న కుమారుడైన బబ్లు (25) సోఫీనగర్లో జరి గిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎస్ఐఆర్ షురూ..
కై లాస్నగర్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ గురువారం జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా బీఎల్వోలు తమ పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎ న్యూమరేషన్ ఫారాలు అందజేశారు. కలెక్టర్ రాజర్షి షా తొలిరోజే రీప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్ ద్వారా తన ఓటు వివరాలు క్షుణ్ణంగా సరిచూసుకున్నారు. 2002 ఓటరు జాబితా ప్రకారం ఉన్న తన వివరాలు నమోదు చేసి, ఒక ఫొటోను జతపర్చి బీ ఎల్వోకు అందజేశారు. దీంతో బీఎల్వో వివరాలను యాప్లో వెరిఫై చేసి సబ్మిట్ చేశారు. అలాగే, ఆర్ ఐ శశికళ, బీఎల్వో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ ప ర్సన్ బండారి అనూష ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రా మీణ ప్రాంతాల్లోని ప్రతీ బీఎల్వో తన పరిధిలోని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. వాటిని పూరించి తిరిగి ఇవ్వాలని సూచించారు. అలా, ఇచ్చిన వారి పేర్లు మాత్రమే జూలై 31న ప్రకటించే ముసాయిదా జాబితాలో ఉంటాయని ఓటర్లకు అవగాహన కల్పించారు. మేజర్ గ్రామపంచాయతీలు, మండల కేంద్రాల్లో పలువురు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, బీఎల్వోలతో కలిసి ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని పిట్టలవాడ, తాటిగూడ కాలనీల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తీరును కలెక్టర్ రాజర్షి షా స్వ యంగా పరిశీలించారు. బీఎల్వో పనితీరుపై ఆరా తీశారు. ఓటర్లకు స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి అవగాహన కల్పించారు. నిజమైన ఓటర్ల పేర్లు తొలగించం ఓటర్ల జాబితాలోని లోపాలను సవరించి, పారదర్శకమైన జాబితాను రూపొందించేందుకు చేపట్టిన ‘సర్’ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైనట్లు కలెక్టర్ రా జర్షి షా తెలిపారు. బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్లకు వస్తారని పేర్కొన్నారు. తమ తల్లి దండ్రుల ఓట్లు వేరే రాష్ట్రాలు, ఇతర జిల్లాల్లో ఉన్నాయని చెబితే ఇక్కడున్న తమ ఓటు పోతుందని కొందరు భయపడుతున్నారని.. అలాంటి అపోహలు వ ద్దని చెప్పారు. అర్హులైన, నిజమైన ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని స్పష్టం చేశారు. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందించిన ఓటర్ల పేర్లు మాత్రమే 31న ప్రకటించే ‘డ్రాఫ్ట్ రోల్’లో ప్రచురించనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఓట్ల తొ లగింపుపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని సూచించారు. నిజమైన ఓటర్లంతా తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్ నింపి, అందులో తమ వివరాలతోపాటు తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మ లేదా గార్డియన్ల ఓట్ల వివరాలు నమోదు చేయాలని సూచించారు. నింపిన ఫామ్లలో ఒక కాపీ ఓటరు వద్ద భద్రంగా ఉంటుందని, మరొకటి బీఎల్వోకు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఈ అవకాశా న్ని వినియోగించుకోవాలని సూచించారు. -
అక్రమాస్తులు రూ.50 కోట్లపైనే..
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ తహసీల్దార్గా పనిచేసి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న తుమ్మకొమ్మ సుచరిత అక్రమార్జనపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. గురువారం ఏక కాలంలో ఆమె నివాసంతోపాటు బంధువులు, బినామీలు, ఇతర అనుచరులకు చెందిన మరో మూడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో స్థిరాస్తులు, బంగారం, వజ్రాలు, నగదు కలిపి మొత్తం రూ.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ సెంట్రల్ జోన్ జాయింట్ డైరెక్టర్ సింధుశర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు అందిన సమాచారం మేరకు సుచరితపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే సోదాల్లో పట్టుబడిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నగదు, నగలు, స్థిరాస్తులు ఇలా...ఏసీబీ అధికారులు గురువారం నాటి సోదాల్లో సుచరితకు చెందిన పలు ఆస్తులను గుర్తించారు. వాటిలో సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం దామరకుంటలో 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి, హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో 3 ఫ్లాట్లు, కీసర, ఖానామెట్ ప్రాంతాల్లో రెండు నివాస స్థలాలు, రూ.12 లక్షల నగదు, వోక్స్వ్యాగన్ కారు, హ్యుందాయ్ క్రెటాకారు, రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, బ్యాంకు ఖాతాల్లో రూ.38 లక్షల నిల్వలు గుర్తించినట్టు ఏసీబీ అధికారులు పేర్కొ న్నారు. సోదాల్లో ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ.5,05, 52,465గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే లంచం కేసులో అరెస్టుశామీర్పేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని వివిధ సర్వే నంబర్లలోని 30 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూ మిగా మార్చాలంటూ కొందరు రైతులు దరఖాస్తు చేసుకు న్నారు. శామీర్పేట్ తహసీల్దార్ పనిచేసిన సమయంలో సుచరిత ఇందుకోసం ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.30 లక్షలు లంచంగా డిమాండ్ చేశారు.రైతులు రిక్వెస్ట్ చేయడంతో వాయిదాల్లో డబ్బు ఇవ్వాలని దాని ప్రకారమే వ్యవసా యేతర భూమిగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత బాధిత రైతులు ఏసీబీని ఆశ్రయించారు. మధ్యవర్తి ద్వారా మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా మే 26న సుచరితను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసింది. ఈ కేసులో సుచరిత ప్రస్తుతం చంచల్గూడ మహిళా జైలులో జ్యుడీషి యల్ రిమాండ్లో ఉన్నారు. అక్రమార్జనపై సమాచారంతో ఏసీబీ అధికారులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. -
రాలే.. సార్!
ఆదిలాబాద్టౌన్: బడులు పునఃప్రారంభమై పది రోజులు గడుస్తున్నా విద్యార్థులు ఇంకా పూర్తి స్థాయిలో పాఠశాలకు హాజరు కావడం లేదు. దీంతో సర్కారు బడులు వెలవెలబోతున్నాయి. గడిచిన పది రోజుల్లో జిల్లాలో హాజరుశాతం కేవలం 35.85 నమోదు కావడం గమనార్హం. అయితే పల్లెల్లో పిల్లలు తల్లిదండ్రుల వెంట పంట చేను పనులకు వెళ్లడం, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, వసతిగృహా ల్లో ఉంటూ చదివే విద్యార్థులు ఇంకా ఇంటి వద్దనే ఉంటున్నారు. మొహర్రం ఉండడంతో హాజరు శాతం కొంత తగ్గిందని అధికారులు చెబుతున్నారు. పెరగని హాజరు శాతం.. జిల్లాలో 679 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, 18 కేజీబీవీలు, 6 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 56,605 మంది విద్యార్థులున్నారు. ఈనెల 15న పాఠశాలలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సరాసరి 20,291 మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. బడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఒక్కరోజు కూడా 50 శాతం హాజరు నమోదు కాకపోవడం గమనార్హం. విద్యార్థులకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్లు పంపిణీ చేశారు. మరికొంత మందికి అందించాల్సి ఉంది. సర్కారు బడిలో ఉన్నారా.. ప్రైవేట్ బాట పట్టారా జిల్లాలో సర్కారు బడుల్లో 56,605 మంది విద్యార్థులు ఉండగా, కనీసం 20వేల మంది విద్యార్థులు బడికి రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కొంత మంది వివిధ కారణాలతో బడికి రాకపోగా, మిగతా విద్యార్థులు ప్రైవేట్ వైపు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. పాఠశాలలు తెరువక ముందే ప్రైవేట్ యజమాన్యాలు విద్యార్థుల ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారి పాఠశాలల్లో చేర్పించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అసలు ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారా.. లేక ప్రైవేట్ బడిబాట పట్టారా అనే సందేహం నెలకొంది. ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేసేందుకు మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించినప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో గతేడాదితో పోల్చితే 30 శాతం పెంచాలని కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే కనీసం పది శాతం కూడా పెరగకపోవడం ఉపాధ్యాయుల పనితీరుకు అద్దం పడుతోంది. నామ్కే వాస్తేగా బడిబాట.. సర్కారు బడుల బలోపేతం కోసం ప్రభుత్వం ఏటా బడిబాట కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ ఏడాది సైతం నెల పాటు కార్యక్రమాన్ని నిర్వహించినా ఆశించిన ఫలితాలు కానరాలేదు. ఈనెల 19 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే సెన్సెస్ ఉండడంతో ఉపాధ్యాయులు ఆ విధుల్లో బిజీగా ఉండటం, డ్యూటీలు లేనివారు బడిబాటపై దృష్టి సారించకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది పరిస్థితి ఇదీ.. అధికారుల లెక్కల ప్రకారం.. 1వ తరగతి ఈ ఏడాది 2,968 మంది సర్కారు బడుల్లో చేరారు. ఇదిలా ఉండగా 2వ తరగతిలో 5,767, 3వ తరగతిలో 5,262, 4వ తరగతిలో 5,454, 5వ తరగతిలో 5,164, 6వ తరగతిలో 3,603, 7వ తరగతిలో 4,984, 8వ తరగతిలో 5,336, 9వ తరగతిలో 5,566, పదో తరగతిలో 5,859 మంది విద్యార్థులు ఉన్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నారు. అయితే బడికి మాత్రం 20వేల మంది కూడా హాజరు కాకపోవడంతో మిగతా వారు ఏం చేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. తేదీ హాజరైన విద్యార్థులు 15 8,906 16 15,473 17 20,236 18 20,189 19 23,546 20 23,735 22 25,402 23 22,840 ఈ నెల 15 నుంచి విద్యార్థుల హాజరు వివరాలుజిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 739 మొత్తం విద్యార్థులు 56,605 -
డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: డ్రగ్స్, గంజాయి వంటి మా దకద్రవ్యాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం నిర్వహించి న డ్రగ్స్ వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ‘వాల్ ఆఫ్ ప్రామిస్’పై సంతకం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై సమాజమంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం ‘యాంటీ డ్రగ్స్ సోల్జర్’గా పోరాడుతామని ఏర్పా టు చేసిన ప్రత్యేక సెల్ఫీ పాయింట్ వద్ద విద్యార్థులు, యువత సెల్ఫీ దిగారు. కార్యక్రమంలో ఆది లాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు బి.సునీల్ కుమార్, కె.ఫణీదర్, ప్రణయ్ కుమార్, ఎస్సైలు అశోక్, సంజయ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సత్వర న్యాయం అందించేందుకు చర్యలు బాధితులకు సత్వర న్యాయం, వైద్య, న్యాయ, మా నసిక సహాయ సేవలు అందించేందుకు ప్రత్యేక చ ర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అన్నారు. భరోసా కేంద్రం ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో పోలీస్ హెడ్క్వార్టర్స్లో సమావేశం నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్య త ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ మౌనిక, భరోసా సెంటర్ ఇన్చార్జి పద్మ, భరోసా సెంటర్ కోఆర్డినేటర్లు ప్రనూష, డీసీపీవో రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మత్తు నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం మత్తు వ్యసనాల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యమని ఎస్పీ అన్నారు. రిమ్స్లోని డీఅడిక్షన్ సెంటర్ ను పరిశీలించారు. చికిత్స విధానం, సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు అలువాటు పడిన వ్యక్తుల కు వైద్య సలహాలు, కౌన్సెలింగ్ ద్వారా చికిత్స అందిస్తూ వారిని ఆరోగ్యవంతమైన జీవనంలోకి తీసుకురావడానికి దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆయ న వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, మా వల సీఐ ప్రేమ్కుమార్ తదితరులు ఉన్నారు. ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టం చేయాలిజిల్లాలో రోడ్డుప్రమాదాల నివారణకు ట్రాఫిక్ ని బంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. బుధవారం రాత్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. సిబ్బంది పనితీరు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, పెండింగ్ కే సులు,ఈ–చలాన్ల అమలు తదితర అంశాలను స మీక్షించారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల నియంత్రణపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.హెల్మె ట్, సీట్బెల్ట్ వినియోగం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇందులో డీఎస్పీ జీవన్రెడ్డి, ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్, ఆర్ఎస్సైలు దేవేందర్, మనీ ష్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
● మొలకెత్తాయా.. లేదా.. రైతుల పరిశీలన ● నష్టపోయిన వారు మరోసారి విత్తేందుకు సిద్ధం ● తాజా వానలతో జోరందుకున్న సాగు పనులు● ఊపందుకున్న పత్తి విత్తనాల విక్రయం
విస్తారంగా సాగు.. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల తర్వాత విస్తారంగా సాగు పనులు నడుస్తున్నాయి. పత్తి, సోయా, కంది, ఇతరత్రా పంటల విత్తన పనులు జోరందుకున్నాయి. పత్తి విత్తనాల ప్యాకెట్లు మార్కెట్లో సరిపడా అందుబాటులో ఉన్నాయి. – రవీందర్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారివర్షపాతం వివరాలు.. (జూన్ 1 నుంచి 24 వరకు)సాధారణ వర్షపాతం: 150.5 మి.మీ.లు కురిసింది : 90.7 మి.మీ.లు వ్యత్యాసం : 40 శాతం స్థితి : లోటు వర్షపాతం -
‘సర్’కు వేళాయె
కై లాస్నగర్: అనర్హులను తొలగించి పారదర్శకతతో కూడిన ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యంగా చేపట్టిన సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియ జిల్లాలో గురువా రం నుంచి షురూ కానుంది. జూలై 24వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇంటింటి సర్వే చేపట్టనున్న బీఎల్వోలకు ప్రత్యేక కిట్లతో పాటు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. దీంతో వారు ఇక క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించనున్నారు. సందేహాల నివృత్తి కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్డెస్కులను ఏర్పాటు చేశారు. ఈ ఫారాలు అందించిన ఓటర్ల పేర్లనే ముసాయిదా జాబితాలో ప్రకటించనున్నట్లుగా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రక్రియ నిర్వహణ వివరాలు వెల్లడించారు. దీంతో ప్రతీ ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని విధిగా తీసుకుని వివరాలు నమోదు చేసి తిరిగి అందజేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రు, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి మూడుసార్లు.. వర్షాకాలం కావడంతో ప్రత్యేక సవరణలో పాల్గొనే బీఎల్వోలకు ప్రత్యేకంగా రెయిన్కోట్, చేతి గొడుగులు అందజేశారు. వాటితో పాటు ప్యాడ్, రిజిస్టర్, డిక్లరేషన్ ఫారాలు, స్టాప్లర్, పిన్స్, పెన్నులు, పెన్సి ల్లు, బ్యాగులు, ఫారం 6,7తో కూడిన ప్రత్యేక కిట్లను ఇప్పటికే అందజేశారు. వీటితో పాటు తమ పరిధిలోని ఓటర్ల సంఖ్యకనుగుణంగా ఎన్యూమరేషన్ ఫారాలను అందించారు. ఈ మేరకు గురువా రం ఉదయం 8గంటల నుంచే బీఎల్వోలు తమ పరిధిలోని ఇంటింటికి వెళ్లనున్నారు. ఓటర్లకు ఫారా లను అందజేయనున్నారు. ఏడు నుంచి ఎనిమిది రోజుల పాటు అందజేసి వారి నుంచి ఎకనాలెడ్జ్మెంట్ తీసుకుంటారు. తిరిగి తొమ్మిదో రోజు నుంచి పూరించిన ఫారాలను స్వీకరిస్తారు. నిరాక్షరాస్యులైన ఓటర్లు తమ సమాచారాన్ని పూర్తి చేయడంలో అవసరమైన సాయం అందజేస్తారు. 2002 ఓటర్ల జాబితాలో పేర్లు కలిగిన ప్రతీ ఓటరు తమ వివరాలను ఽధ్రువీకరించుకుని బీఎల్వోలకు అందజేయాల్సి ఉంటుంది. 2002లో ఓటు హక్కు లేకుంటే ... ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికి 2002 ఓటర్ల జాబి తాలో పేరు లేనటువంటి ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి వారు తమ తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల ఓటరు వివరాల ఆధారంగా సంబంధిత ఫారాలను పూర్తి చేసి సంతకం చేయడం లేదంటే బొటినవేలుముద్ర వేసి బీఎల్వోలకు ఎన్యూమరేషన్ ఫారాలను అందించే వెసులుబాటు ఉంది. ఇలాంటి వారు తమ కుటుంబీకుల వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా స్వయంగా పరిశీలించుకోవచ్చు. ప్రధా న రాజకీయ పార్టీలు సైతం బూత్ల వారీగా ప్రత్యేక ఏజెంట్లను నియమించింది. వారి సహకారం కూడా తీసుకోవచ్చు. అపోహలు వీడి సహకరించాలి ఎస్ఐఆర్ ప్రక్రియతో ఓట్లు తొలగిపోతాయనే అపోహలను ప్రజలు నమ్మవద్దు. తమ ఇంటి వద్దకు వచ్చే బీఎల్వోలకు స్వచ్ఛందంగా వివరాలు అందజేయాలి. ప్రక్రియ పారదర్శకంగా నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా సహకరించాలి. ఓటర్ల జాబితాలోని లోపాలు సరిదిద్దడంతో పాటు మరణించిన, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలగించడం జరుగుతుంది. అలాగే 1అక్టోబర్ 2026 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి పేరును తుది జాబితాలో చేర్చేలా చూస్తాం. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోవడంతో పాటు వాటిని పూర్తి చేసి సకాలంలో బీఎల్వోలకు అందజేసి సహకరించాలి. – రాజర్షి షా, కలెక్టర్ అందుబాటులో హెల్ప్డెస్క్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజల్లో ఉన్న సందేహాల నివృత్తి కోసం జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్డెస్కులను ఏర్పాటు చేశారు. ఓటరు జాబితాలతో పాటు ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. ఇవే కాకుండా సందేహాల నివృత్తి లేదా ఇతర సమాచారం కోసం కేంద్ర ఎన్నికల సంఘం టోల్ఫ్రీ నంబర్ 1950ని సైతం సంప్రదించవచ్చు. -
ఒంటికి.. రెంటికి కష్టాలే
ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో టాయ్లెట్స్ కొరతతో విద్యార్థినులకు తిప్పలు తప్పడం లేదు. గురువారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2026ఈ రైతు పేరు పెండే లక్ష్మణ్. తాంసి మండలం వడ్డాడి గ్రామం. మూడున్నర ఎకరాల్లో ఏడు పత్తి బ్యాగుల విత్తనాలను జూన్ 10న పొడిదుక్కుల్లోనే వేశాడు. రెండు మామూలు వర్షాలతో మొలకలు వచ్చినట్టే వచ్చాయి. తర్వాత వరుణుడి జాడ లేకపోవడంతో విత్తనం ఉబ్బిపోయి నష్టపోవాల్సి వచ్చింది. రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాల తర్వాత మంగళవారం మళ్లీ ఏడు బ్యాగుల విత్తనాలు విత్తాడు. ఈ రైతు పేరు కాటిపెల్లి చంద్రశేఖర్ రెడ్డి. ఇచ్చోడ. పదెకరాల్లో 20 బ్యాగుల పత్తి విత్తనాలు వారం క్రితం వేశాడు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక 30 శాతం మొలకెత్తలేదు. దీంతో నష్టపోయిన చోట మళ్లీ విత్తనాలు వేస్తున్నాడు.ఈ రైతు పేరు ఉప్పు శంకర్. నేరడిగొండ మండలం వడూర్. మూడు రోజుల క్రితం పొడిదుక్కుల్లోనే పదెకరాల్లో పది బ్యాగుల పత్తి విత్తనాలు వేశాడు. ప్రస్తుతం వర్షాలు పడడంతో ఇప్పుడు అవి మొలకెత్తుతాయని ఎదురుచూస్తున్నాడు. -
‘కేంద్ర ప్రభుత్వ వైఫల్యం .. విద్యార్థులకు శాపం’
కై లాస్నగర్: నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడానికి కేంద్రప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఇది విద్యార్థులకు శాపంగా మారిందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్ష నిర్వహణ లోపాలతో నష్టపోతున్న విద్యార్థులకు భరోసా ఇచ్చేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ చాత్రోంకి గూంజ్ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ పోరాటాన్ని ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రుల వద్దకు బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందులో మార్కెట్, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు శ్రీకాంత్రెడ్డి, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. -
‘ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ఆదిలాబాద్టౌన్: ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్, సీసీఐ పరిశ్రమ అంశాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఈ అంశాలపై వెంటనే జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వాటిపై స్పష్టమైన ప్రణాళికలు లేకపోయినా అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీ కేంద్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ఏర్పాటుౖ పె స్పష్టత ఇవ్వలేకపోతున్నా స్థానిక ఎమ్మెల్యే డీపీఆర్ పూర్తయిందంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, ప్రస్తుతం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం జిల్లా ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ను ఏరోస్పేస్ జోన్గా గుర్తించి, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రూ.8 కోట్లతో సర్వేపూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే రేణుక సి మెంట్ పరిశ్రమ ఏర్పాటుకురూ.4కోట్లతో సర్వే లు నిర్వహించగా, వాటిని అడ్డుకున్నది ప్రస్తుత నాయకులేనని ఆరోపించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, నారాయణ, ప్రహ్లా ద్, వసంత్, గణేష్, దమ్మపాల్, దివిటి రాజు, ఆసిఫ్, మహేష్, సాయి పాల్గొన్నారు. -
‘ప్రగతి’ నిరంతర ప్రక్రియ కావాలి
కై లాస్నగర్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని రిజిస్ట్రేషన్లశాఖ రాష్ట్ర ఐజీ, ప్రజాపాలన జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు తీరుపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 99 రోజుల కార్యక్రమం ముగిసినప్పటికీ దాన్ని ఆపకుండా భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో కొనసాగించాలనారు. గ్రామ, మండల సభల్లో ప్రజల నుంచి సేకరించిన వ్యక్తిగత, కమ్యూనిటీ సంస్థాగత వినతులను అన్ని శాఖల అధికారులు క్రోడీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా పర్యటన సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇచ్చిన హామీలపై నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికకు సంబంధించిన బుక్లెట్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, రాజేశ్వర్, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం నేరడిగొండ: ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని, ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చాలని జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్ హనుమంతు అన్నారు. నేరడిగొండ పీహెచ్సీని బుధవారం సందర్శించారు.హెచ్పీవీ వ్యాక్సినేషన్ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ ఎంఏ కలీం, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సద్దాం, హెచ్ఈవో పవార్ రవీందర్, హెల్త్ సూపర్వైజర్ సంతోష్, స్వర్ణలత, సిబ్బంది ఉన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన ఐజీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర ఐజీ, ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ఆరా తీఽశారు. ట్రెయినీ సబ్ రిజిస్ట్రార్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భవనంలో కొనసాగుతున్న కార్యాలయానికి కొత్త భవనం కేటాయించాలని సబ్ రిజిస్ట్రార్ శ్రీలత ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన .. పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న అస్మా బేగం, రెహనా బేగం ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆయన పరిశీలించారు. ఇళ్ల పురోగతి, బిల్లుల చెల్లింపులు, ఇతర వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, హౌసింగ్ పీడీ శంకర్, డీఈ షాకీర్, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు. -
ధ్వజస్తంభంపై సుదర్శన చక్రం తొలగింపు
అన్నవరం: ఇటీవల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి సత్యదేవుని ఆలయ ధ్వజస్తంభంపై సుదర్శన చక్రం ఒకవైపు ఒరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గత ఆదివారం గుర్తించారు. దీనిని కిందికి దించి, సంప్రోక్షణ అనంతరం తిరిగి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒరిగిన ఆ చక్రాన్ని అర్చకుడు సుధీర్, పరిచారకుడు పవన్లు పండితుల మంత్రోచ్చారణల నడుమ బుధవారం తొలగించి, కిందకు దించారు. అనంతరం దర్బారు మండపంలో ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన పూజలు చేసి ఒంగిన సుదర్శన చక్రాన్ని సరి చేశారు. దీనికి గురువారం ఉదయం ప్రత్యేక పూజలు చేయనున్నారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతో అభిషేకం చేసిన అనంతరం, 9 గంటలకు పండితుల మంత్రోచ్చారణల నడుమ దానిని తిరిగి ధ్వజస్తంభంపై అమర్చుతారు. అక్కడ కూడా అభిషేకం చేసి, సుదర్శన చక్రానికి బూర్లు నివేదిస్తారని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. జన్మ నక్షత్రం అభిషేకం టికెట్టు రూ.5 వేలకు పెంపు సత్యదేవుని జన్మనక్షత్రం మఖ నాడు స్వామి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరులకు నిర్వహించే మహన్యాస పూర్వక అభిషేకం టికెట్టును భారీగా పెంచేశారు. ఇప్పటి వరకూ రూ.3 వేలు ఉన్న ఈ టికెట్టును ఏకంగా రూ.5 వేలకు పెంచారు. దీనికి దేవదాయ శాఖ కమిషనర్ ఆమోదం తెలిపినట్లు బుధవారం నిర్వహించిన దేవస్థానం పాలక మండలి సమావేశంలో వెల్లడించారు. ఈ టికెట్టుతో ఒక జంట ఈ అభిషేకంలో పాల్గొనవచ్చు. యంత్రాలయంలో ప్రదక్షిణ దర్శనం టికెట్టును కూడా రూ.50 నుంచి రూ.100కు పెంచారు. ఈ పెంపుదల జూలై 1 నుంచి అమలులోకి రానుంది. నేడు సంప్రోక్షణ, పునఃప్రతిష్ఠ -
నూరుశాతం హాజరు ఉండేలా చర్యలు
గంగవరం: పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నూరుశాతం ఉండేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖాఽధికారి (ఏజన్సీ) వై.మల్లేశ్వరరావు అన్నారు. మండలంలోని నెల్లిపూడి, గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మండల విద్యాశాఖాధికారి – 2 టి.మల్లేశ్వరరావుతో కలిసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమీక్షించారు. నెల్లిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 176 మంది విద్యార్థులకు గాను 117 మంది మాత్రమే హాజరైనట్లు గుర్తించారు. నూరుశాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. అనంతరం గంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ పాఠశాలలో 73 మందికి 56 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయులంతా ప్రతిరోజూ సమయానికి పాఠశాలకు వచ్చి లీప్ యాప్లో హాజరు నమోదు చేయాలని సూచించారు. 3, 4 తేదీల్లో అల్లూరి జయంత్యుత్సవంఅడ్డతీగల: పైడిపుట్టలోని రచ్చబండ వద్ద అల్లూరి శ్రీరామరాజు జయంత్యుత్సవాన్ని జూలై 3వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు అల్లూరి శ్రీరామరాజు యువజన సంఘం సభ్యులు బుధవారం ప్రకటనలో తెలిపారు. జూలై 3వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు జ్యోతి వెలిగించిన ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, అతిథులకు సత్కారాలు, అల్లూరి జీవిత చరిత్ర బుర్రకథ ఉంటుందన్నారు. 4న అల్లూరి జయంతి రోజు గంగాలమ్మకు విశేష పూజలు, హోమం, ఆయుర్వేద వనమూలికల ప్రదర్శన ఉంటుందన్నారు. డాక్టర్ రవివర్మచే ఆరోగ్య చిట్కాలు – అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అనంతరం సభ నిర్వహించి గౌరవ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. అల్లూరి స్ఫూర్తిని నలుదిశలా వ్యాపింప చేయడానికి చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థనిర్మూలనకు చర్యలు రంపచోడవరం: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు వారి రక్షణ, పునరావాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కె.దినేష్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. దానిలో భాగంగా జూన్ 23 నుంచి 30 వరకు చైల్డ్ లేబర్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, గంగవరం, వీఆర్ పురం, కూనవరం, వై.రామవరం, గూర్తేడు, చింతూరు, ఎటపాక తదితర మండలాల్లో తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. తనిఖీల్లో గుర్తించిన బాల కార్మికులను వెంటనే రక్షించి, చట్టపరమైన చర్యలతో పాటు పునరావాస కార్యక్రమాలు చేపడతామన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గమనిస్తే 1098 టోల్ ఫ్రీ నంబర్కు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. రత్నగిరి కిటకిట అన్నవరం: రత్నగిరికి బుధవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర భక్తులు కూడా సత్యదేవుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో, రత్నగిరిపై తీవ్ర రద్దీ నెలకొంది. ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత మండపాలు కిటకిటలాడాయి. భక్తుల వాహనాలతో పార్కింగ్ స్థలాలు సైతం నిండిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని సన్నిధికి వచ్చారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు 2,200 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. జ్యేష్ట ఏకాదశిని పురస్కరించుకుని గురువారం ఉదయం 7 గంటలకు సత్యదేవుడు, అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన, 9 గంటలకు కుంకుమార్చన నిర్వహిస్తారు. -
వదిలేశారు..
వందన్నారు.. చింతూరు: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రధాన సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వంద పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప దానికి తదనుగుణంగా నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దానికి తోడు వైద్య నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తున్నా అసలు పట్టించుకోవడం లేదు. ఈ ఆస్పత్రికి డివిజన్లోని చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాలతో పాటు పొరుగునే వున్న ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి రోగులు వస్తారు. ప్రతి రోజూ 200 నుంచి 300 వరకు ఓపీ ఉండగా, సుమారు 60 నుంచి 80 వరకు ఇన్ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. ఇవి కాకుండా డయాలసిస్, పిల్లల విభాగం, కాన్పు విభాగాలు అదనంగా ఉన్నాయి. రోగుల అవస్థలు కీలక వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా జనరల్ మెడిసిన్ వైద్యుడు లేకపోవడంతో ఆస్తమా, ఉబ్బసం, గుండె సంబంధిత, మూర్చ వంటి రోగులకు సరైన వైద్యం అందడం లేదు. మరోవైపు అన్ని శస్ర చికిత్సలకు గుండెకాయ లాంటి మత్తు వైద్యుడు లేకపోవడంతో మిగతా వైద్యులు కూడా వైద్యం చేసేందుకు వెనుకాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా గర్భిణులకు కాన్పు సమయంలో మత్తు వైద్యుడి అవసరం ఎంతో ఉంటుంది. గత నెలాఖరు వరకు మత్తు వైద్య నిపుణుడితో పాటు సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ కోటిరెడ్డి ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి మత్తు వైద్యుడిని నియమించక పోవడంతో శస్త్ర చికిత్సలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భద్రాచలం ఆస్పత్రికి రిఫర్ ప్రస్తుత గైనకాలజిస్టులు సాధారణ కాన్పులు చేస్తున్నా మత్తు వైద్యుడు లేకపోవడంతో శస్త్ర చికిత్సలు అవసరమున్న వారిని తెలంగాణలోని భద్రాచలానికి రిఫర్ చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు చింతూరు ప్రభుత్వాస్పత్రిలో 48 కాన్పులు జరుగగా వాటిలో 35 సాధారణ కాన్పులు జరిగాయి. మరో 13 మందిని శస్త్ర చికిత్సల కోసం భద్రాచలం రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. అలాగే బ్లడ్ బ్యాంకు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గర్భిణులకు అత్యవసర సమయంలో రక్తం ఎక్కించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.వైద్య నిపుణుల పోస్టుల ఖాళీఏజన్సీ ప్రాంతంలో గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బిడ్డింగ్ ప్రాతిపదికన కాంట్రాక్టు విధానంలో ఈ ఆస్పత్రికి వైద్య నిపుణులను నియమించారు. వారు కోరుకున్న వేతనానికి జనరల్ ఫిజీషియన్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పిడియాట్రీషియన్, ఈఎన్టీ, అనస్తిషిస్ట్, గైనకాలజిస్టులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తొమ్మిది మంది వైద్య నిపుణులు ఉండాల్సిన ఆస్పత్రిలో నలుగురు మాత్రమే సేవలు అందిస్తున్నారు. ఆర్థోపెడిక్, నేత్ర వైద్యుడు, ఇద్దరు గైనకాలజిస్టులు విధులు నిర్వహిస్తుండగా, కీలకమైన జనరల్ ఫిజీషియన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రీషియన్, మత్తు వైద్యుడు, డెంటిస్ట్ లేరు.ఐదు నెలల క్రితం అప్గ్రేడ్ 50 పడకలతో ఉన్న చింతూరు ప్రభుత్వాస్ప త్రిని వంద పడకలకు అప్గ్రేడ్ చేస్తూ ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆస్పత్రిలో మౌలిక సౌకర్యాలకు రూ.30.50 కోట్లు, వైద్యులు, సిబ్బందితో సహా 52 మంది భర్తీ కోసం మరో రూ 3.44 కోట్లు మంజూరు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. కాగా జారీ చేసి ఐదు నెలలు గడుస్తున్నా నేటికీ వంద పడకల అప్గ్రేడ్ ఊసే ఎత్తడం లేదు. దీంతో 50 పడకల ఆస్పత్రిగానే కొనసాగుతోంది. చింతూరు ఆస్పత్రిని వంద పడకలకుఅప్గ్రేడ్ చేస్తూ జీవో జారీ చేసి ఐదు నెలలైనా పట్టించుకోని వైనం ఇప్పటికే వేధిస్తున్న వైద్యుల కొరత మత్తు వైద్యుడు లేక అవస్థలు ఆపరేషన్ కేసులు భద్రాచలం ఆస్పత్రికి రిఫర్మాటలకే పరిమితం కూటమి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందనడానికి చింతూరు ప్రభుత్వాసుపత్రే ఉదాహరణ. వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ఐదు నెలల క్రితం జీవో ఇచ్చినా దానిని అమలు చేయడంలో మాత్రం చిత్తశుద్ధి కరవైంది. – కుంజా శ్రీను, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైద్యుల భర్తీకి నివేదిక వైద్య నిపుణుల భర్తీ కోసం కలెక్టర్తో పాటు డీసీహెచ్ఎస్కు నివేదిక అందించాం. మత్తు వైద్యుడు లేకపోవడంతో శస్త్ర చికిత్సల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అలాంటి వారికి బయటకు రిఫర్ చేస్తున్నాం. – డాక్టర్ వాడపల్లి దివ్య, సూపరింటెండెంట్, చింతూరు ప్రభుత్వాసుపత్రి మత్తు వైద్యుడిని నియమించాలి చింతూరు ప్రభుత్వాసుపత్రిలో మత్తు వైద్యుడిని వెంటనే నియమించాలి. మత్తు వైద్యుడు లేకపోవడంతో గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. శస్త్ర చికిత్సల కోసం భద్రాచలం రిఫర్ చేస్తుండడంతో ఆర్థికంగా భారమవుతోంది. – సీసం సురేష్, గిరిజన సంఘం జిల్లా నాయకుడు -
పారదర్శకంగా ఇంటింటి సర్వే
గంగవరం: గ్రామాల్లో భూమి రీసర్వే, ఓటర్ల నమోదు ఇంటింటి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ అన్నారు. ఆయన బుధవారం వేములోవ గ్రామంలో ఆ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం భూములను రీ సర్వే చేసే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. భూములకు హద్దులు వేసే సమయంలో ఎటువంటి భూతగాదాలు లేకుండా చూడాలన్నారు. సర్వే బృందాలు గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో భూయజమానులు సంబంధిత పత్రాలను, ఆధారాలను సిద్ధంగా ఉంచుకుని, అధికారులకు సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని జేసీ అన్నారు. 18 ఏళ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆశ్రమ పాఠశాల తనిఖీ వేములోవ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను జేసీ పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకం మెనూను పక్కాగా అమలు చేయాలని, విద్యార్థుల చదువుతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో దోమలు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే గంగవరంలో రేషన్ డిపో, గ్రామ సచివాలయాన్ని జేసీ తనిఖీ చేశారు. అక్కడ రికార్డులను పరిశీలించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సచివాలయం సిబ్బందికి సూచించారు. ఆయన వెంట జిల్లా సివిల్ సప్లయ్ అధికారి విజయ భాస్కర్, తహసీల్దార్ చిన్నం శ్రీనివాసరావు, ఎంపీడీవో వై.లక్ష్మణరావు ఉన్నారు. -
నిమ్మరాజు కుటుంబాన్ని పరామర్శించిన కమిషన్ చైర్మన్
ఒంగోలు టౌన్: ఒంగోలులో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు మంగళవారం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. ఇటీవల సంస్థ కార్యదర్శి నిమ్మరాజు రామమోహన్ సతీమణి ప్రమీల గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ్మోహన్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. చైర్మన్ సూర్యనారయణ రాజు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాలల అక్రమ రవాణా నిరోధం, బాలల సంక్షేమం కోసం రామ్మోహన్ చేస్తున్న కృషిని కొనియాడారు. చైర్మన్ వెంట కమిషన్ సభ్యులు వి.గాంధీ, హెల్ప్ టీఐ ప్రాజెక్టు డైరెక్టర్ బీవీ సాగర్, జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు నీలిమ, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్ కుమార్ పాల్గొన్నారు. -
అనుమతులు లేని హోటళ్లపై చర్యలు
● దుకాణాల ముందు గాడులు తీయించిన హైవే అధికారులు మద్దిపాడు: జాతీయ రహదారి వెంట ఎటువంటి పార్కింగ్ స్థలాలు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న పలు హోటళ్లు, టీ దుకాణాలు, వ్యాపార సముదాయాల ముందు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బంది మంగళవారం గాడులు తవ్వించారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జాతీయ రహదారి వెంట అనుమతులు తీసుకోకుండా, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోకుండా దుకాణాలు నడుపుతున్న పలుచోట్ల గాడులు తవ్వించి.. పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జాతీయ రహదారి సిబ్బంది తెలిపారు. -
రక్త పరీక్షలు తప్పనిసరి
మేదరమెట్ల: సమాజంలో ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఎప్పటికప్పుడు వ్యక్తిగత రక్త పరీక్షలు చేయించుకోవడం అవసరమని లెప్రసీ క్షయ, ఎయిడ్స్ అధికారి డాక్టర్ బాలాజీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మేదరమెట్లలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మేదరమెట్లలోని ఎస్టీ కాలనీ నేషనల్ హైవే ప్రాంతంలో ప్రజలకు స్వచ్ఛంద రక్త పరీక్షలు చేశారు. హెచ్ఐవీ ఎయిడ్స్ ఉందని తెలుసుకొన్న కొంతమంది మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని, అటువంటి వారికి మానసిక ధైర్యాన్ని కలిగిస్తూ వ్యాధిపై సమగ్ర అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ ఎస్కే అమీన్ పేర్కొన్నారు. హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీవీ సాగర్, కౌన్సిలర్ టి.విజయకుమార్, ల్యాబ్ టెక్నీషియన్ దుర్గాబాయి, సంచార హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ బి.దుర్గా సురేంద్ర, ఏఎన్ఎం విజయలక్ష్మి, మేదరమెట్ల అవుట్ రిచ్ వర్కర్ ఆర్.కృష్ణవేణి, పీఈలు పాల్గొన్నారు. -
యాప్ ద్వారా ఎరువుల సరఫరా
మద్దిపాడు: ఏపీఏఐ ఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సులభంగా సురక్షితంగా పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం మద్దిపాడులో జరుగుతున్న రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడారు. ఇ. మంజుల మాట్లాడుతూ ఎల్నినో కారణంగా సముద్ర ఉపరిత ఉష్టోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరగడం వలన వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అందువలన రైతులు తక్కువ నీటితో పండే పంటలను పండించుకోవాలని సూక్ష్మనీటి సాగు పద్ధతులను పాటించాలని తెలిపారు. అంతే కాకుండా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఫాం పాండ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒంగోలు సబ్డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు వెంకట్రావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేసుకోవడం వలన నేల తేమను నిల్వ ఉంచుతుందన్నారు. జిల్లా వ్యవసాయ వనరుల శాఖ అధికారి ఏ. శైలజరాణి మాట్లాడుతూ భూసారం ప్రాముఖ్యతను వివరించి పచ్చిరొట్ట పంటలు, ఎరువుల గురించి రైతులకు వివరించారు. అనంతరం మద్దిపాడులో రైతుకు పీఎండీ కిట్ అందించారు. ఇందులో 32 రకాల విత్తనాలు పంట సాగుకు కానీ పచ్చిరొట్ట ఎరువుగా అయినా వినియోగించుకోవడానికి వీలుగా కిట్లు తక్కువ ధరకే అందిస్తున్నట్లు మండల వ్యవసాయశాఖ అధికారి తెలిపారు. ఆత్మ బీటీఎం శేషారావు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది పలువురు రైతులు పాల్గొన్నారు. -
అలరించిన ఆధ్యాత్మిక ప్రసంగం
ఒంగోలు మెట్రో: ఒంగోలు కొండపై శ్రీగిరి వెంకటేశ్వర స్వామి త్రయాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీగిరి దేవస్థానం అర్చకులు వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో ధ్వజారోహణంతో పాటు శ్రీవారి ఉత్సవ మూర్తులకు విశేష స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీవారికి హనుమంత వాహన సేవను నేత్ర పర్వంగా నిర్వహించారు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రసంగించారు. -
క్రాంతి మాదిగ కేసులో సీఐని అరెస్టు చేయాలి
ఒంగోలు వన్టౌన్: విజయవాడలో పోలీసుల వేధింపులు భరించలేక బలవన్మరణం పొందిన క్రాంతి మాదిగ కేసులో నిందితుడైన సీఐ నాగరాజును వెంటనే అరెస్టు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. మంగళవారం అంబేడ్కర్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపు కులానికి చెందిన సాయి కృష్ణను విజయవాడ కృష్ణ లంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు టార్చర్ చేసి.. హత్య చేయడంతో పాటు కనీసం శవం కూడా లేకుండా చేశారన్నారు. శ్మశానంలో కూడా సాయి కృష్ణ వయస్సు 25 సంవత్సరాలు అయితే 45 సంవత్సరాలుగా నమోదు చేసి గుర్తు తెలియని శవంగా దహనం చేశారన్నారు. ప్రతి పక్షాల పరామర్శలు, ఆందోళనలతో ప్రభుత్వం ఎట్టకేలకు సీఐపై కేసు నమోదు చేసి, తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టు చేసిందన్నారు. కానీ అదే పోలీస్ స్టేషన్లో అదే సీఐ నాగరాజు వేధింపులకు గురై బలన్మరణం పొందిన క్రాంతి మాదిగ కేసులో ఎటువంటి చర్యలు లేవన్నారు. క్రాంతి మాదిగ బలవన్మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో సీఐ తనతో బూట్లు పాలిష్ చేయించారని, అనేక చిత్రహింసలకు గురి చేశారని మనోవేదన చెందారన్నారు. తన మరణానికి సీఐ కారణమని విడియో సాక్ష్యం ఉన్నా ఇంత వరకూ కేసు నమోదు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం మాదిగ కుల మృతుని పట్ల వివక్షత చూపించిందన్నారు. సీఐ నాగరాజు, ఇతర పోలీస్ అధికారులపై చట్ట ప్రకారం బీఎన్ఎస్ సెక్షన్ 108, ఎస్సీ ఎస్టీ యాక్ట్గా మార్చాలన్నారు. పెద్ద మాదిగను అన్న చంద్రబాబుకు మాదిగల ప్రాణాల పట్ల ఉన్న ప్రేమకు ఈ సంఘటన నిదర్శనం అన్నారు. ఖాకీ క్రౌర్యానికి బలైన కాపు సాయి కృష్ణ కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకొని ఓదార్చిన ముఖ్యమంత్రి, టీడీపీకి చెందిన వెంకటేశ్వరరావు మాదిగ కుటుంబాన్ని పరామర్శించాలన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధారా అంజయ్య, కాకుమాను రవి, మాదిగ పరిరక్షణ సమితి కన్వీనర్ పట్రా బంగారం, మాల సభత కన్వీనర్ మేడికొండ మురళి తదితరులు పాల్గొన్నారు. -
పల్స్ పోలియోతో వైకల్యం దూరం
కొత్తపట్నం: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేసేందుకు మెడికల్ సిబ్బంది, ప్రజా పతినిధులు, చిన్నారుల తల్లిదండ్రులు సహకరించాలని కొత్తపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ శ్రావ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, సీహెచ్వోలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బందిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పిల్లలను పోలియో వ్యాధి నుంచి సంపూర్ణంగా రక్షించేందుకు సున్నా నుంచి 5 సంవత్సరాల్లోపు ఉన్న ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. గతంలో ఎన్నిసార్లు పోలియో చుక్కలు తీసుకున్నప్పటికీ, ఈ విడతలో కూడా పిల్లలకు చుక్కలు వేయించడం అవసరమని తెలిపారు. కొత్తపట్నం పీహెచ్ పరిధిలో సున్నా నుంచి 5 సంవత్సరాలు వయస్సు గల చిన్నారులు 2,906 లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అదేవిధంగా 11 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి అక్కడ నివసిస్తున్న 10 మంది చిన్నారులకు ప్రత్యేక దృష్టి సారించి పోలియో చుక్కలు అందించనున్నట్లు తెలిపారు. బూత్ నిర్వహణ, ఇంటింటి సర్వే, మైక్రోప్లాన్ అమలు, పిల్లల గుర్తింపు మార్కింగ్ విధానం హైరిస్క్ ప్రాంతాల పర్యవేక్షణ, వలన కుటుంబాల పిల్లల గుర్తింపు, బూత్ అనంతరం ఇంటింటి సందర్శనలు వంటి అంశాలపై సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. ఒక్క చిన్నారికీ తప్పకుండా వేయాలని అవగాహన కల్పించాలని సూచించారు. జలుబు, దగ్గు లేదా స్వల్ప అనారోగ్యం ఉన్నప్పటీకీ పోలియో చుక్కలు వేయించవచ్చుని శ్రావ్య తెలిపారు. -
సర్ కార్యక్రమంపై సమీక్ష
సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్): పేర్ణమిట్ట లోని లింగారెడ్డి కాలనీలో మంగళవారం మండల బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర విచారణ (సర్ ) ఫై బీజేపీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సెల్ కో కన్వీనర్ డాక్టర్ నిడమానూరి నాగేశ్వరరావు, సెగ్గం శ్రీనివాసరావులు, బాలినేని కళ్యాణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్):మండలంలోని మద్దులూరు సమీపంలో గల మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో జిల్లా అధికారులు ఆదేశాల మేరకు వేములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. 149 మందికి మెడికల్ ఆఫీసర్ జగదీష్ వైద్య సేవలు అందించారు. సార్డ్స్ సంస్థ ప్రతినిధులు పి.సంధ్య, జి. మధు, వేములపాడు వైద్యారోగ్య శాఖ సిబ్బంది హాజరయ్యారు. నాగులుప్పలపాడు: మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు మండల పరిషత్ అధ్యక్షులు నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సురేష్ బాబు తెలిపారు. ఎంపీటీసీలు, సర్పంచ్లు శాశ్వత ఆహ్వానితులతో పాటు అన్ని శాఖల అధికారులు తగు సమాచారంతో హాజరు కావాలని కోరారు.కొత్తపట్నం: మండలంలోని కె.పల్లెపాలెం బీచ్లో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ కోసం అవసరమైన స్థలాన్ని కలెక్టర్ రాజాబాబుతో పాటు ప్రజాప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. అనంతరం కె.పల్లెపాలెం నుంచి మడనూరు వరకు సముద్ర తీరంలో ప్రత్యేక వాహనాల్లో పర్యటించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావు, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ డి.రామానాయుడు పాల్గొన్నారు. ● బాల కార్మికుల కేసులపై సమీక్ష ● రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజు ఒంగోలు సబర్బన్: బాలల హక్కుల పరిరక్షణలో అధికారులంతా పూర్తి భాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీవీయస్ సూర్య నారాయణ రాజు అన్నారు. జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం కమీషన్ సభ్యుడు ఉండవల్లి గాంధీ బాబుతో కలిసి జిల్లాలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లా జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగాలు,కార్మిక శాఖ, విద్యా శాఖ, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు, బాలలతో కలసి పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.నాగమణి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో ఇటీవల కాలంలో నమోదైన బాలకార్మిక కేసులు ఎన్ని, వీరికి ప్రభుత్వం అందిస్తున్న గ్రాంట్పై ఎటువంటి చర్యలు చేపట్టారు, లబ్ధి పొందిన వారి పూర్తి వివరాలపై కార్మిక శాఖాధికారులు నుంచి ఆరా తీశారు. అలాగే జిల్లాలో గత రెండేళ్లుగా జరిగిన బాల్య వివాహాల కేసులు ఎన్ని నమోదు జరిగాయి, పోలీసులు ఎన్ని ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు, బాండెడ్ లేబర్లో ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంత మంది బాలికలను తిరిగి బడి లో చేర్పించారని వివరాలు రాబట్టారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో బాలల హక్కుల ఉల్లంఘనలు ఏ రూపంలో జరుగుతున్నాయి, విద్యా శాఖ, చైల్డ్ లైన్ విభాగం, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ఎలా వీటిని ఎలా అధిగమిస్తున్నారో కూలంకషంగా చర్చించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎన్ని స్కూల్స్ బస్సులు కండిషన్లో ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
7న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన
నాగులుప్పలపాడు: మాదిగల చరిత్ర, సంస్కృతి, ఆగ్మగౌరవానికి శాశ్వత ప్రతీకగా నిలవనున్న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమం జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ కోరారు. జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్పవం సందర్భంగా ఉద్యమం పుట్టిన ఊరు ఈదుమూడి గ్రామంలో జరుగుతున్న ఈ చారిత్రాత్మక శంకుస్థాపన కార్యక్రమంకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగ జాతి యువత, మహిళలు, నాయకులతో పాటు నాలుగు రాష్ట్రాల మంత్రులు కూడా హజరుకానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఉప్పుగుండూరు గ్రామంలో కరపత్రం ఆవిష్కరణ చేశారు. వ్యవస్థాపక సభ్యులు కొమ్మూరి గరటయ్య, కొమ్మూరి సుధాకర్, ముంగర నాగార్జున, మల్లెల ప్రసాద్, అత్తంటి డేవిడ్, కొలకలూరి సుబ్బారావు, పాలపర్తి రత్నాకర్ బాబు, పాలపర్తి ప్రవీణ్, గంగవరపు అశోక్, మురికిపూడి ప్రకాశం తదితరులు ఉన్నారు. -
అర్హులకే సంక్షేమ పథకాలు
కై లాస్నగర్: ప్రభుత్వం ఏదైనా, పాలకులు ఎ వరైనా అర్హులైన పేదలకే సంక్షేమ పథకాలు అందాలని, ఆ దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైనథ్ మండల కేంద్రానికి చెందిన 111 మంది డబు ల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు పీఏసీఎస్ చైర్మ న్ గోవర్దన్రెడ్డితో కలిసి ఇంటి పట్టాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఇళ్లు దక్కనివారు అధైర్యపడవద్దని, డబుల్ ఇళ్లకు పక్కనే ఉన్న రెండెకరాల స్థలంలో ఇంటిస్థలాలతో పాటు ఇందిర మ్మ ఇళ్లను మంజూరు చేయిస్తానని భరోసాఇచ్చారు. ఇందులో జైనథ్ సర్పంచ్ మమత, ఉప సర్పంచ్ సంతోష్, ఆత్మ డివిజన్ చైర్మన్ సంతోష్, జైనథ్ తహసీల్దార్ నారాయణ, ఆర్ఐలు ఉల్లాస్, హన్మంత్రావు పాల్గొన్నారు. -
త్వరలోనే విమానాశ్రయానికి శంకుస్థాపన
ఆదిలాబాద్: త్వరలోనే ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి సోమవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చించినట్లు వెల్లడించారు. జిల్లా ప్రగతికి విమానాశ్రయం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. నిర్మాణానికి ఇప్పటికే గుర్తించిన 1,880 ఎకరాలకు అదనంగా మరో 400 ఎకరాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తక్షణమే భూమిని అప్పగించడంతో పాటు, టెర్మినల్ భవనం, విమాన రాకపోకలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఒప్పందం కుదిరిందని వివరించారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి కోసం రూ.300 కోట్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.600 కోట్ల కేటాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వెల్లడించారు. విమానా శ్రయం ద్వారా ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు అందుబాటులోకి వస్తాయని తెలి పారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రఽ దానమంత్రి, కేంద్ర మంత్రుల సమక్షంలో నిర్మాణా నికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అలాగే ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇందులో నాయకులు జోగు రవి, పోషన్న,ధోని జ్యోతి, దయాకర్, నరేష్, విలాస్, రాకేవ్, భీమ్ సేన్ రెడ్డి, శివ, గోపి తదితరులు పాల్గొన్నారు. -
నో ఆన్
అంతా ఆఫ్సాక్షి,ఆదిలాబాద్: ఆన్లైన్లో నిర్వహించాల్సిన టెండర్ ప్రక్రియను ఆదిలాబాద్ మున్సిపల్లో ఆఫ్లైన్లో చేపట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ టెండర్లను అస్మదీ యులకు అప్పజెప్పేందుకు పకడ్బందీగా ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైకి ఆన్లైన్ టెండర్ అని చెబుతున్నప్పటికీ.. ఆ వివరాలు పూర్తిస్థాయిలో వెల్లడించకపోవడం అనుమానాలకు తావి స్తోంది. ఆఫ్లైన్లో టెండర్ ము గించి తామనుకు న్న వారికి ప నులు అప్పజెప్పేందుకు అక్రమంగా వ్యూహ రచన చేశారని తెలుస్తోంది. ఈ వ్య వహారంలో ము న్సి పల్కు చెందిన ఓ కీలక ఇంజినీరింగ్ అధికారి చక్రం తిప్పారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తి.. ఈ పనులు నిర్వహించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఎన్ని వచ్చాయనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఆ వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయని చెబుతున్నారే తప్పితే.. నోటిఫికేషన్కు సంబంధించి ఆన్లైన్ వివరాలు వెల్లడించడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా టెండర్ ప్రక్రియ నిర్వహించినప్పుడు దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేయడం నిబంధన. ఈ విషయంలో మున్సిపల్ అధికారి వివరణ కోరినప్పుడు మొదట ఐఅండ్పీఆర్కు టెండర్ నోటిఫికేషన్ వివరాలు పంపడం జరిగిందని, ఆ నోటిఫికేషన్ ఏ పత్రికలో వచ్చిందో స్ప ష్టత లేదని.. అక్కడి నుంచి బిల్లుల కోసం వారు పంపినప్పుడు తెలుస్తుందని అన్నారు. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ విషయంలో మరోసారి ఆ అధికారిని వివరాలు కోరినప్పుడు ఓ ప్రధాన పత్రికలో 12వ తేదిన, 15వ తేదిన వచ్చిందని, తన దగ్గర ఆ వివరాలు లేవని, సెక్షన్ అధికారి వద్ద ఉన్నాయని, సమయం దాటిపోవడంతో ఈ రోజు ఆ వివరాలు ఇవ్వలేనని ఆ అధికారి పేర్కొన్నారు. నిబంధనలు ఇలా.. సాధారణంగా రూ.2లక్షలు పైబడిన వర్క్ను తప్పనిసరి ఆన్లైన్లో చేపట్టాలి. దానికి సంబంధించి ముందుగా పేపర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. త ద్వారా కాంట్రాక్టర్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆ పేపర్ నోటిఫికేషన్ ప్ర స్తుతం తన వద్ద లేదని అధికారి చెప్పడం వెనుక పె ద్ద మతలబే ఉందనే విమర్శలున్నాయి. తాము అనుకున్న కాంట్రాక్టర్కు పనులు అప్పగించేందుకు ఈ వ్యవహారాన్ని మున్సిపల్లో ఓ కీలక ఇంజినీర్ చక్రం తిప్పారనే ప్రచారం సాగుతుంది.గూడుపుఠాణి.. రూ.50లక్షల పనిలో రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు మున్సిపల్ అధికారి స్పష్టం చేశారు. ఈ రెండు దరఖాస్తుల్లో ఓ కాంట్రాక్టర్ బిడ్ కెపాసిటీ కలిగి లేకపోవడంతో అర్హత సాధించలేకపోయాడని వివరించారు. మరో కాంట్రాక్టర్కు పూర్తి అర్హతలు ఉన్నట్లుగా తెలిపారు. ఈ వర్క్ ఎవరికి దక్కిందనేది బుధవారం స్పష్టం చేయనున్నట్లు చెప్పారు. ఈ వర్క్ను తమ అస్మదీయుడికి అప్పగించేందుకే ఇలా ఆఫ్లైన్లో టెండర్ నిర్వహించారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. మరో దరఖాస్తు బిడ్ కెపాసిటీ లేని కాంట్రాక్టర్ ద్వారా వేయించడం వెనుక గూడుపుఠాణి దాగి ఉందని తెలుస్తోంది. ఇక రెండో పని రూ.15లక్షల వర్క్లో ఒకరే టెండర్ దాఖలు చేశారని, ఆయనకు కూడా బిడ్ కెపాసిటీ లేకపోవడంతో రెండోసారి టెండర్ రీకాల్ చేయనున్నట్లు మున్సిపల్ అధికారి స్పష్టం చేస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని మావల, కేఆర్కే కాలనీల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసేందుకు టెండర్లు నిర్వహిస్తున్నారు. తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) రూ.50లక్షలు, రూ.15లక్షలతో రెండు వేర్వేరు పనులు చేపట్టేందుకు ఈ టెండర్లు పిలిచారు. వీధి దీపాలతో పాటు జంక్షన్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం టెండర్లను ఆన్లైన్లో నిర్వహించాలి. అయితే నిబంధనలు ఉల్లంఘించి ఆఫ్లైన్లో చేపట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
మహిళా సాధికారతకు ప్రాధాన్యత
ఆదిలాబాద్రూరల్: ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని మామిడిగూడ గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. విలేజ్ ఆర్గనైజేషన్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా సంఘాల బలోపేతానికి, ఆర్థికస్వావలంబనకు వీవో భవనాలు దోహ దపడతాయన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అలాగే పిప్పల్ధరి గ్రామంలో బోనగిరి నారాయణ ఇంటిని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కలెక్టర్ ప్రభుత్వ పథకాల అమలుతీరు, గ్రామంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గో వింద్, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ధ్రువీకరణ విత్తనాలనే కొనుగోలు చేయాలి ధ్రువీకరణ విత్తనాలనే రైతులు కొనుగోలు చేయాలని కలెక్టర్ అన్నారు. మండలంలోని అంకోలిలో ఏ ర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని 86 రైతు వేదికల ద్వారా వికేంద్రీకృత పద్ధతిలో విత్తనాల పంపిణీ చేపడుతున్నామన్నారు. విత్తన మేళా ద్వారా సోయా 1,273.015 క్వింటాళ్లు, కంది 147.73 క్వింటాళ్లు, పెసర 30.44 క్వింటాళ్లు, మినుము 22.17క్వింటాళ్లు, నానో యూ రియా 3,053 సీసాలు, నానో డీఏపీ 1,965 సీసాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపా రు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. విత్తన మేళాలు జూన్ 23 నుంచి వారం పాటు కొనసాగుతాయన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తాయని, నకిలీ విత్తనాల విక్రయదారులపై సీడ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలి కైలాస్నగర్: జిల్లాలో ఓటర్ల జాబితా రూపకల్ప న, సవరణ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీఎల్వోలు, ఎన్నికల విభాగం అధికారులతో స మీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్ర జాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్వోల మ్యాపింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలని సూచించారు. మ్యాపింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యాన్ని సహించబో మ న్నారు. ఇందులో అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు, ఆర్డీవో పి.జగదీశ్వర్రావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నలంద ప్రియ, తహసీల్దార్లు, మాస్టర్ ట్రైనర్లు, బూత్ లెవెల్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. -
వన మహోత్సవ లక్ష్యం 38.94లక్షలు
కై లాస్నగర్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనం పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ (2026–27) సంవత్సరానికి గాను జిల్లాకు 38.94లక్షల మొక్కలను లక్ష్యంగా కేటాయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. మరోవైపు అవసరమైన మొక్కలను సరఫరా చేసేందుకు డీఆర్డీఏ, అటవీశాఖ నర్సరీలను సిద్ధం చేసింది. నాటేందుకు వీలుగా మొక్కలను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే అటవీశాఖ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించగా మిగతాశాఖలు సైతం ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఇతర శాఖల్లో ... సాగునీటి పారుదలశాఖకు 22వేలు, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖకు 20వేలు, ఎకై ్సజ్ శాఖకు 6వేలు, పరిశ్రమలు, విద్యాశాఖకు 5వేలు, రెవెన్యూ, ఆర్టీసీ, సోషల్ వెల్ఫేర్, ఉన్నత విద్య, యువజన, సర్వీస్ల, పశు సంవర్ధకశాఖ, విద్యుత్ శాఖలకు వెయ్యి చొప్పున, దేవాదాయశాఖకు 2వేలు, ఇతర శాఖలకు మరో వెయ్యి చొప్పున మొక్కలు నాటేలా లక్ష్యంగా కేటాయించారు. బీసీ వెల్ఫేర్, సివిల్ సప్లై, మత్స్యశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ఇంటర్మీడియెట్ విద్య, మార్కెటింగ్, మైనార్టీ సంక్షేమం, ఆర్డబ్ల్యూఎస్ వంటి ప్రభుత్వ శాఖలను వన మహోత్సవం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ శాఖలకు ఒక్క మొక్కను కూడా కేటాయించలేదు. నర్సరీల్లో సిద్ధంగా మొక్కలు జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు సరఫరా చేసేందుకు గాను గ్రామాల్లో డీఆర్డీఏ ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నర్సరీలను ఏర్పాటు చేశారు. అలాగే అటవీశాఖ ఆధ్వర్యంలోనూ శాఖా పరమైన ఎనిమిది నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. అవెన్యూ ప్లాంటేషన్తో పాటు ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో నాటేందుకు వీలుగా ఉండే వేప, మర్రి, రావి, చింత, కానుగ, గుల్మోర్, సుబాబుల్తో పాటు రోడ్లు, ఇళ్లలో నాటేందుకు అవసరమైన గులాబీ, మల్లె, మందార, చామంతి వంటి పూల మొక్కలు, జామ, సీతాఫలం, అల్లనేరేడు వంటి పండ్ల మొక్కలను నర్సరీల్లో పెంచారు. ప్రస్తుతం అన్ని నర్సరీల్లోనూ అందుబాటులో ఉంచారు. వర్షాలు కురిసే కొద్ది శాఖల వారీగా మొక్కలను తీసుకెళ్లి నాటనున్నారు. మున్సిపాలిటీల్లోని వార్డులు, గ్రామాల్లో ప్రజలకు ఒక్కో ఇంటికి ఆరు చొప్పున అందించనున్నారు. డీఆర్డీఏ, అటవీ శాఖలదే కీలక బాధ్యత ప్రభుత్వం ఈ ఏడాదికి గాను జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో అత్యధికంగా డీఆర్డీఏకు నిర్దేశించింది. ఆ తర్వాత ఆదిలాబాద్ మున్సిపల్తో పాటు జిల్లా అటవీ, వ్యవసాయ శాఖలకు కేటాయింపులు చేసింది. మిగతా శాఖలకు సంబంధించి ఖాళీగా ఉన్న ప్రదేశాలు, మొక్కలు నాటేందుకు వీలుగా ఉన్న అవకాశాలకనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ వంటి విద్యాసంస్థల్లోనూ మొక్కలు నాటాలని యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా ఇటీవల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా అటవీశాఖ ఇప్పటికే 23వేల మొక్కలను నాటింది. ప్రధాన శాఖల వారీగా మొక్కలు నాటాల్సిన లక్ష్యం శాఖలు నాటాల్సిన మొక్కలు డీఆర్డీఏ 24.87లక్షలు అటవీశాఖ 4.25లక్షలు వ్యవసాయ 2.25లక్షలు ఆదిలాబాద్ మున్సిపల్ 5.10లక్షలు పోలీస్ 80వేలు ఆర్అండ్బీ 50వేలు ఐటీడీఏ ఉట్నూర్ 50వేలు వంద శాతం మొక్కలు నాటుతాం జిల్లాకు కేటాయించిన వనమహోత్సవ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన శాఖలన్నింటికీ లక్ష్యాలను నిర్దేశించాం. ఆదిశగా మొక్కలు నాటేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. లక్ష్యం మేరకు వందశాతం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. – ఎస్.రాజేశ్వర్, అదనపు కలెక్టర్ -
నైపుణ్యాలకు డ్యూటీ మీట్ దోహదం
ఆదిలాబాద్టౌన్: అధికారులు, సిబ్బందిలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు డ్యూటీ మీట్లు దోహదపడతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్లో జిల్లాస్థాయి డ్యూటీ మీట్ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని జోనల్, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. డ్యూటీ మీట్లో భాగంగా ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ లా, మెడికో లీగల్ టెస్ట్, ఫింగర్ ప్రింట్ సైన్స్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్, క్రైమ్ సీన్ ఫొటోగ్రఫీ, పోలీస్ పోర్ర్టెయిట్, అబ్జర్వేషన్ టెస్ట్, యాంటీ సబటేజ్ చెక్, డాగ్ స్క్వాడ్, కంప్యూటర్ అవేర్నెస్ తదితర 11 విభాగాల్లో పోటీలు, రాత, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేరస్తులు అనుసరిస్తున్న కొత్త పద్ధతులను అర్థం చేసుకుని, నూతన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా పోలీసులు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలరన్నారు. ఎస్పీ స్వయంగా ఫింగర్ ప్రింట్లు తీసే విధానం ప్రదర్శించి సిబ్బందికి శిక్షణ అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి.మౌనిక, బి.సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్.జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఫింగర్ప్రింట్, ఎన్ఐబీ, డీసీఆర్బీ, బీడీ టీం, డాగ్ స్క్వాడ్, రిజర్వ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీని కలిసిన డీవైఎస్వో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన దయానంద్ రెడ్డి మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట రమేశ్ తదితరులున్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం తలమడుగు: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని సుంకిడి గ్రామంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.కార్యక్రమంలో డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ రహీం పాషా, ఎస్సైలు రాధిక, జీవన్రెడ్డి, సర్పంచ్ నర్సమ్మ, ఉపసర్పంచ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల బంద్ విజయవంతం
ఆదిలాబాద్టౌన్: ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా సంస్థల బంద్ మంగళవారం విజయవంతమైంది. ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా పాల్గొనగా పట్టణంలో తెరిచి ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పరిషత్ నాయకులు బంద్ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా యూనిఫాం, పుస్తకాలు, నోట్బుక్లు, షూ, ఇతర వస్తువులు విక్రయిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. కార్యక్రమంలో పరిషత్ నాయకులు పాల్గొన్నారు. -
ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్పై దృష్టి సారించాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ గోడం నగేశ్ రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్కుమార్కు విన్నవించారు. ఢిల్లీలో సోమవారం రాత్రి ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన ఈ రైల్వేలైన్ ఏర్పాటైతే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు ఈ లైన్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ప్రా జెక్టుకు సంబంధించి అప్రూవల్ ప్రక్రియ చివరి దశలో ఉందని, త్వరతగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
తల్లీబిడ్డల మృతిపై అధికారుల విచారణ
రంపచోడవరం: స్థానిక ఏరియా ఆసుపత్రిలో గర్భిణి కోసు బాపనమ్మ, ఆమెకు పుట్టిన నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై మంగళవారం రంపచోడవరంలో ఉన్నత స్థాయి అధికారుల విచారణ జరిగింది. జాతీయ షెడ్యుల్ తెగల కమిషన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీ, ఏలూరు జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ బేబీ కమల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విచారణాధికారి బాధితుల నుంచి వేర్వేరుగా సాక్షాలను, రికార్డులను సేకరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను, మృతురాలి భర్త కోటం రాజన్నదొర.. విచారణ అధికారులను వ్యక్తిగతంగా కలసి ఫొటోలు, సాక్షాలను అందజేశారు. తల్లీబిడ్డల మృతికి కారణమైన ఆసుపత్రి సూపరింటెండెంట్, గైనకాలజిస్ట్లపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేశారు. వేగవంతంగా ఎస్ఐఆర్ ప్రక్రియ రంపచోడవరం: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం రంపచోడవరం నియోజకవర్గంలోని 399 పోలింగ్ కేంద్రాల్లో వేగవంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దినేష్కుమార్ తెలిపారు. ఈనెల 15 నుంచి బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. 2026 జూలై ఒకటి నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువతీ యువకుల ఓటు నమోదు, ఓటర్ల వివరాల్లో తప్పుల సవరణ, ఫొటోల నాణ్యత మెరుగుదల చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ 84 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు అందించామన్నారు. -
కూలికి వెళ్లి కనుమరుగు
రంగంపేట/సామర్లకోట: వారందరూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే పేదలు. బతుకుతెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు పనికి వెళ్లారు. దాన్ని పూర్తి చేసి సంతోషంగా స్వగ్రామాలకు బయలుదేరారు. ఇంకో 20 కిలోమీటర్లు అంటే అరగంటలో గమ్యానికి చేసుకుంటారనగా మృత్యువు కబళించింది. వ్యాన్ బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పనుల కోసం గుంటూరు జిల్లాకు.. కాకినాడ జిల్లా సామర్లకోట, పిఠాపురం మండలం జల్లూరు తదితర గ్రామాలకు చెందిన 11 మంది కూలీలు ఈ నెల 16వ తేదీన గుంటూరు జిల్లా కొల్లూరు ప్రాంతంలో సిమెంట్ పలకలతో గోడల ఫెన్సింగ్ పనులకు వెళ్లారు. వాటిని పూర్తి చేసుకుని సోమవారం రాత్రి వ్యాన్లో స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. వారి వాహనం రంగంపేట మండలం వడిశలేరు గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఏడీబీ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కూలీలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా, వాహనంలోని సిమెంట్ పలకలు పడడంతో ముగ్గురు మృతి చెందారు. వారిని సామర్లకోటకు చెందిన మసకపల్లి బాలు (21), మురముళ్ల రాజ్ కుమార్ (25), తాతపూడి రాజేష్ (22)గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని 108 అంబులెన్స్లో పెద్దాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ సుమంత్ తెలిపారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనపర్తి సీఐ సుమంత్ ఆధ్వర్యంలో రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబాల్లో విషాదం మృతుల్లో మసకపల్లి బాలు (20)కు ఐదేళ్ల క్రితమే చైతన్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పూజ అనే కుమార్తె ఉంది. నాన్న వస్తాడు, మనకు బట్టలు తెస్తాడు అని ఆ పసిపాపకు తల్లి చెబుతున్న సమయంలోనే, తండ్రి ఇక లేడన్న వార్త వచ్చింది. ఇప్పుడు మాకు దిక్కెవరు అంటూ చైతన్య, కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇక రాజేష్, రాజ్ కుమార్ల మరణాలు ఆయా కుటుంబాల్లో చీకట్లను నింపాయి. వరుస మరణాలు సామర్లకోటలోని కుమ్మరి వీధిని మరణాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన ఘోర బాణసంచా ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన జరిగి నెలలు గడవక ముందే రోడ్డు ప్రమాదంలో ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. తరచూ మా వీధినే ఎందుకు ప్రమాదాలు వెంటాడుతున్నాయి అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాద స్థలం వద్ద యువకుడి మృతదేహంక్షతగాత్రులను 108లోకి ఎక్కిస్తున్న సిబ్బంది ఫ వడిశలేరు సమీపంలో రోడ్డు ప్రమాదం ఫ కూలీలతో వెళుతున్న మినీ వ్యాన్ ఫ ముగ్గురి మృతి, ఎనిమిది మందికి గాయాలు ఫ గుంటూరు జిల్లాలో పనికి వెళ్లి వస్తుండగా ఘటన -
బైక్ అదుపు తప్పి యువకుడి మృతి
శంఖవరం: మండలంలోని కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. శంఖవరం గ్రామానికి చెందిన రోకల కార్తీక్ (19), మెరుగుల స్వరూప్ కుమార్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ, కత్తిపూడి నుంచి అన్నవరం వైపు వెళ్లే మార్గంలో పెట్రోల్ బంకు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కార్తిక్ తలకు, శరీరంలోని పలుచోట్ల తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని, తీవ్రంగా గాయపడిన స్వరూప్ కుమార్ను 108లో ప్రత్తిపాడు కమ్యునిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అన్నవరం ఎస్సై ప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చసి దర్యాప్తు చేపడుతున్నారు. గాయపడిన స్వరూప్ మృతుడు కార్తిక్మరొకరికి తీవ్ర గాయాలు -
వ్యసనాలకు బానిసై చోరీలు
అమలాపురం రూరల్: ఉభయగోదావరి జిల్లాల్లో మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్ జిల్లాల దొంగల ముఠాను పోలీసులుఅరెస్టు చేసి, వారి నుంచి రూ. 38 లక్షల విలులైన 38 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఈ వివరాలను అమలాపురం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. గత నెల 22న రాత్రి రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో ఓ ఇంటి బయట పార్క్ చేసిన మోటారు సైకిల్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై రావులపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు పెదపూడి మండలం రాజుపాలేనికి చెందిన లక్కోజు రాజేష్ కుమార్, జి.మామిడాడ చెందిన కళ్యాణం నరేష్ (బజి), గుండుపల్లి సూర్యతేజ, గండేపల్లి మండలం యర్రంపాలేనికి చెందిన రొట్టె నాగచైతన్య సంతోష్కుమార్, ఓ బాలుడు కలసి ఈ చోరీలు చేస్తున్నారు. -
పారిశుధ్యం బాధ్యత అధికారులదే
రంపచోడవరం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలల వద్ద దోమలు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిబంధనల ప్రకారం మెనూ అందించాలని, బడి బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. జిల్లాలోని జీపీఎస్, ఆశ్రమ, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల వివరాలు తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో బి గ్రేడ్లో ఉన్న బాలలను ఏ గ్రేడ్కు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని, ప్రతి గర్భిణికి రక్తహీనత లేకుండా నిబంధనల ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. సకాలంలో రేషన్ పంపిణీ చేయాలి నిబంధనల ప్రకారం తెల్లరేషన్ కార్డు దారులకు రేషన్ పంపిణీ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రఽశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ చాంబర్లో పౌరసరఫరా అధికారులు, జీసీసీ డీఎం, జీసీసీ మేనేజర్లు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్డుదారులకు బియ్యం సరఫరాలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రానున్న వరదలను దృష్టిలో ఉంచుకుని రెండు నెలలకు సరిపడా రేషన్ సరుకులు జీసీసీ డిపోల్లోని స్టాక్ పాయింట్ల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
దేవీపట్నం: ఇందుకూరు పంచాయతీ పరిధి ఫజుల్లాబాద్ గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ఎస్సై షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగవరం మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన చుండం తమ్మన్నదొర (26) ఇందుకూరు గ్రామంలోని తన అక్క ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. ఫజుల్లాబాద్ అయిలవారి చెరువు గట్టుపై గోకవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయే క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయమైన తమ్మన్నదొరను గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి అడ్డతీగల: జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ కోర్టు న్యాయమూర్తి ఎం.మురళీ గంగాధరరావు అన్నారు. స్థానిక కోర్టు హాలులో మంగళవారం న్యాయవాదులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జులై 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రాణం తీసిన స్నానం సరదా గోదావరిలో మునిగి అన్నదమ్ముల మృతి ధవళేశ్వరం: సెలవులకు ఇంటికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు గోదావరిలో స్నానానికి దిగి మృతి చెందారు. సరదాగా స్నానం చేయడానికి వచ్చి మృత్యువాత పడ్డారు. ప్రభువా.. నువ్విచ్చిన పిల్లలను నువ్వే తీసుకుపోయావా అంటూ వారి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే.. ధవళేశ్వరం రాఘవేంద్రస్వామి గుడి సమీపంలో నివసిస్తున్న పెద్దిపాటి శేషుకుమార్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఐటీఐలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హేమంత్ కుమార్ (21) తాడేపల్లిగూడెంలో హోమియోపతి కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు జశ్వంత్ కుమార్ (18) రామచంద్రపురంలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఇటీవల సెలవులకు ధవళేశ్వరం వచ్చిన వీరు మంగళవారం సాయంత్రం స్నానం చేసేందుకు కాటన్ బ్యారేజీ దిగువన ఉన్న ఇసుక తిన్నెలకు వెళ్లారు. వారితో పాటు సావిత్రీ నగర్కు చెందిన స్నేహితుడు మహ్మద్ హసన్ రాజాకు వెళ్లాడు. ఇసుక తిన్నెల వద్ద స్నానానికి దిగిన వీరు టెన్నిస్ బాల్తో నీటిలో క్యాచ్లు ఆడుతుండగా హేమంత్ కుమార్ నీటిలో మునిగిపోతుండడంతో, అతడిని కాపాడబోయిన జశ్వంత్ కుమార్ కూడా గల్లంతయ్యాడు. దీంతో అక్కడే ఉన్న స్నేహితుడు మహ్మద్ హసన్ రాజా నీటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని వారికి విషయాన్ని చెప్పాడు. హేమంత్, జశ్వంత్ కోసం నీటిలో మత్స్యకారులతో గాలింపు చేపట్టగా వారి మృతదేహాలు లభించాయి. విచారణ చేయాలి చాగల్లు: తన కుమారుడు రవిచంద్ర ఆత్మహత్యపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చిట్టూరి ప్రవీణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 21వ తేదీన కొవ్వూరు మండలం కాపవరం గ్రామ శివారులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ భవనం పైనుంచి దూకి 7వ తరగతి విద్యార్థి రవిచంద్ర ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై మృతుడి తండ్రి ప్రవీణ్ మంగళవారం రాత్రి కొవ్వూరు రూరల్ సీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగని పక్షంలో ఈ నెల 25న కొవ్వూరు సీఐ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. -
నేడు అన్నవరం ట్రస్ట్ బోర్డు సమావేశం
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో బుధవారం జరగనున్న ట్రస్ట్బోర్డు సమావేశంలో రూ.నాలుగు కోట్లతో చేపట్టే వివిధ నిర్మాణాలపై చర్చ జరుగనుంది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 2027లో జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా సత్యదేవుని ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు వివిధ పనులు ప్రతిపాదించారు. అయితే అన్నవరం దేవస్థానం 2026–27 వార్షిక బడ్జెట్లో వివిధ నిర్మాణాలకు రూ. ఏడు కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే దేవస్థానంలో రూ.15 కోట్లతో 105 గదుల సీతారామ సత్రం మొదటి దశ నిర్మాణం జరుగుతోంది. గోదావరి పుష్కరాల కల్లా ఈ సత్రం నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ సత్రం నిర్మాణానికే బడ్జెట్లో పూర్తిగా నిధులు కేటాయించని పరిస్థితిలో అదనంగా రూ.నాలుగు కోట్లతో ఎలా నిర్మాణాలు చేపడతారనే దానిపై కొంతమంది ట్రస్ట్బోర్డు సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుఽధవారం జరగనున్న ట్రస్ట్బోర్డు సమావేశం అజెండా కాపీలు అందుకున్న ట్రస్ట్బోర్డు సభ్యుల్లో కొందరు మంగళవారం దేవస్థానంలో సమావేశమై ఈ నిర్మాణ పనులపై చర్చించినట్టు సమాచారం. -
అన్ని శాఖల సమన్వయంతో జాతర ఉత్సవాలు
సామర్లకోట: పెద్దాపురంలో వేంచేసిన మరిడమ్మ అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు సహకరించాలని పెద్దాపురం ఆర్డీఓ పి.కృష్ణమూర్తి అన్నారు. వచ్చే నెల 14 నుంచి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర పురస్కరించుకొని సోమవారం సాయంత్రం ఆలయ మండపంలో నిర్వహించిన ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆలయ ఈఓ, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. గతంలో జరిగిన ఏర్పాట్లు, భక్తుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్దీని పురస్కరించుకొని ఆయా శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త చింతపల్లి శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి భక్తులు సహకరించాలన్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మరిడమ్మ జాతర ఉత్సవాలు వచ్చే నెల 14 నుంచి ఆగస్టు 19 వరకు జరుగుతాయని దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్(ఈఓ) కె.విజయలక్ష్మి తెలిపారు. జాతరలో భాగంగా ఈనెల 29న ఉయాల తాళ్లోత్సవం, వచ్చే నెల 13న జాగరణ జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ మాట్లాడుతూ ఉత్సవాలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. సీఐలు వైఆర్కే శ్రీనివాసు, ఎ.కృష్ణభగవాన్, అగ్నిమాపక శాఖ అధికారులు, ఆర్అండ్బీ, మున్సిపల్, ఎలక్ట్రికల్, మెడికల్ అండ్ హెల్త్, పాల్గొన్నారు.ఫ పెద్దాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి ఫ జూలై 14 నుంచి మరిడమ్మ జాతర ఫ 37 రోజుల పాటు నిర్వహణ -
మెగా జాబ్మేళాకు సన్నాహాలు
రంపచోడవరం/ గంగవరం: జిల్లాలో నిరుద్యోగుల కోసం ఈ నెల 30న మెగా జాబ్మేళా నిర్వహిస్తామని కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశ భవనంలో మెగా జాబ్మేళా పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి ఆపై చదువుకున్న యువతీ యువకులకు స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో ఆ రోజు ఉదయం 10 గంటలకు నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా 16 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు 63046 34447 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జేసీ ప్రశాంత్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి పి.అంబేద్కర్, రంపచోడవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.స్వాతి, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి నిరుపమ తదితరులు పాల్గొన్నారు. -
సత్యదేవునికి భారీగా హుండీ ఆదాయం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 33 రోజులకు గాను రికార్డు స్థాయిలో రూ.1,96,59,883 ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఈనెల 12 వరకు విద్యాసంస్ధలకు వేసవి సెలవులు వలన విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయం భక్తులతో కళకళలాడింది. భక్తులంతా సమర్పించిన కానుకలతో భారీగా హుండీ ఆదాయం సమకూరింది. ఈ కానుకల్లో నగదు రూ.1,84,99,620 కాగా, చిల్లర నాణేలు రూ.11,60,263 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వీటితో పాటు బంగారం 22.500 గ్రాములు, వెండి 567 గ్రాములు వచ్చినట్లు వారు తెలిపారు. సరాసరిన రోజుకి రూ.5,95,754 హుండీ ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. హుండీల ద్వారా విదేశీ కరెన్సీ సత్యదేవుని హుండీల ద్వారా విదేశీ కరెన్సీ కూడా భారీగా లభించింది. 230 అమెరికా డాలర్లు, పది యూఏఈ దీనార్లు, పది కెనడా డాలర్లు, 119 సింగపూర్ డాలర్లు, ఒక మలేషియా రింగిట్, 55 యూరోలు, పది ఇంగ్లాండ్ పౌండ్లు, వంద డెన్మార్క్ క్రోనార్లు, వంద శ్రీలంక రూపాయలు, 200 సౌతాఫ్రికా ర్యాండ్స్ లభించాయని తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్, ఈఓలతో పాటు దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యులు పర్వత సురేష్, కామర్స్ చిరంజీవి, దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఫ 33 రోజుల ఆదాయం రూ.1.96 కోట్లు ఫ సరాసరిన రోజుకు రూ.5.96 లక్షల ఆదాయం -
సమస్యలకు పరిష్కారం చూపండి
రంపచోడవరం: ప్రజా సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ కె.దినేష్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ను నిర్వహించారు. కలెక్టర్తో జేసీ ఎస్.ప్రశాంత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేద్కర్, రంపచోడవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.స్వాతి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 218 అర్జీలు వచ్చాయి. మారేడుమిల్లి మండలం చావడికోట పంచాయతీ పరిధి తేనెల మామిడి గ్రామంలో 60 కుటుంబాలకు తాగునీరు అందించాలని వినతి ఇచ్చారు. చావడికోట సెంటర్ నుంచి తేనెల మామిడి గ్రామం వరకు 450 మీటర్ల సీసీ రోడ్డు నిర్మించాలని, జిల్లాలో డిగ్రీ పాసైన యువతీ యువకులకు గ్రూప్ వన్, గ్రూప్ టు ఉద్యోగాలు పొందేందుకు శిక్షణ ఇవ్వాలని, 1/70 చట్టం పక్కాగా అమలు చేయాలని, వేములకొండ నుంచి కాకవాడ గ్రామం వరకూ బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని పలువురు అర్జీలు ఇచ్చారు. రాజవొమ్మంగి మండలం కిమ్మలగడ్డలో కొండపోడు వ్యవసాయం చేసుకుంటున్న 15 మంది గిరిజన రైతులకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని అర్జీ సమర్పించారు. ఏపీఓలు జనరల్ డీఎన్వీ రమణ, రామతులసి, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ షేక్ షరీఫ్, డీఎంహెచ్ఓ (ఇన్చార్జ్) నీలిమ, సబ్ డీఎఫ్ఓ అనుష, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ దాసరి రత్నాకరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దేవదానం, జిల్లా విద్యాశాఖ అధికారి జి.శ్రీరామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పశువులతో గూడ్స్ వ్యాన్ల సీజ్
రాజవొమ్మంగి: స్థానిక సర్కిల్ జడ్డంగి పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం వాహన తనిఖీలు చేస్తుండగా, 8 వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 32 ఆవులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ గౌరీశంకర్, ఎస్సై చినబాబు తెలిపారు. ఈ వాహనాలను స్వాధీనం చేసుకుని, 19 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఇవి రాజవొమ్మంగి నుంచి మైదాన ప్రాంతం వైపు వెళ్తున్నాయని అన్నారు. పశువులను గోశాలలకు తరలించామన్నారు. పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ, ఎస్సై హెచ్చరించారు. ఊపిరితిత్తుల విభాగం తరలింపుపై స్పష్టతనివ్వాలి కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో భాగంగా స్థానిక వార్ఫ్ రోడ్లో ఉన్న ఊపిరితిత్తుల విభాగాన్ని ఎక్కడికి తరలిస్తున్నారో స్పష్టతనివ్వాలని సంబంఽధిత స్పెషాలిటీ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇటీవల కాకినాడకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి నివేదించామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్లో నూతన ఓపీ భవంతి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారని, వార్ఫ్ రోడ్లో ఉన్న పల్మనాలజీ భవంతి విభాగాన్ని కూడా తొలగించాలని నిర్ణయించారని తెలిపారు. అయితే ఊపిరితిత్తుల విభాగం సాధారణ వైద్య సేవలకు దూరంగా ఉండాలని నూతనంగా నిర్మిస్తున్న ఓపీ భవంతిలోనే ఈ సేవలను కూడా కొనసాగించనున్నారన్న ప్రచారం సాగుతోందని తెలిపారు. ఇదే నిజమైతే సాధారణ రోగులు, వారి సహాయకులకు మరిన్ని అనారోగ్య పరిస్థితులు తప్పవని అన్నారు. నూతన ఓపీ భవంతిలో నిర్మాణం చేపట్టకపోతే, ఎక్కడ నిర్మిస్తున్నారో సంబంధిత అధికారులు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. చినవెంకన్న హుండీ ఆదాయం రూ.1.70 కోట్లు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ప్రమోద కల్యాణ మండపంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ఆర్వీ చందన, పోలీసుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. గడచిన 14 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 1,70,53,076 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 147 గ్రాముల బంగారం, 2.510 కిలోల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని పాత రూ. 2 వేలు, రూ. 500 నోట్ల ద్వారా రూ.7,500 వచ్చిందన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. -
అబ్బురపరుస్తున్న ఆరుద్ర పురుగులు
రాజవొమ్మంగి: మండలంలోని పంట పొలాల్లో ఆరుద్ర పురుగులు ఆకట్టుకుంటున్నాయి. ఎర్రగా సింధూర బొట్టులా కనిపించే ఈ పురుగులను(కీటకాలను) రైతులు తమ నేస్తాలుగా భావిస్తారు. పొలం దున్నే సమయంలో ఆరుద్ర పురుగులు కనిపిస్తే శుభ సూచకం అంటారు. ఈ పురుగులు వచ్చాయంటే ఇక సంమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, చెరువులు నిండుతాయని, కుంటల్లోకి నీరు చేరుతుందని రైతుల నమ్మకం. దుక్కులు దున్నే సమయంలో మట్టిలోంచి ఇవి బయటకు వస్తాయి. పంటలకు హాని కలిగించే పురుగుల లార్వాను (గుడ్లను) ఈ ఆరుద్ర పురుగులు తింటాయని, తద్వారా పంటలపై చీడపీడల బెడద తగ్గుతుందని శాస్త్రజ్ఞులు చెబుతారు. -
పరిహారం.. పరాయి చెంతకు..
చింతూరు: పోలవరం ప్రాజెక్టు ముంపులో భాగంగా చింతూరు బీసీ కాలనీకి చెందిన తమ్మినీడి వెంకటరామయ్య గృహానికి పరిహారం రావాల్సి ఉంది. సదరు ఇంటికి రూ.4.09 లక్షల విలువ నిర్ధారిస్తూ పోలవరం అధికారులు 2024లో అవార్డు నోటీసు జారీ చేశారు. కాగా ఈ ఏడాది చింతూరుకు చెందిన నిర్వాసితులకు ఆరు నెలల క్రితం గృహాల పరిహారం జమకాగా, వెంకట రామయ్యకు మాత్రం నేటికీ పడలేదు. దీనిపై అప్పటి నుంచి అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, న్యాయం జరగడం లేదని అతను వాపోయాడు. తనకు పరిహారం జమ కాకపోవడంపై ఆరా తీయగా, తన బ్యాంకు ఖాతాలో జమ కావాల్సిన రూ.4.09 లక్షల పరిహారం తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో జమ అయినట్లు పోలవరం అధికారులు చెప్పారని అతను వాపోయాడు. సదరు సొమ్మును రికవరీ చేసేలోగానే ఆ వ్యక్తి తన ఖాతా నుంచి సొమ్ము విత్డ్రా చేసుకున్నాడని అన్నారు. సదరు సొమ్ము విత్డ్రా చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి, అతని నుంచి సొమ్ము రికవరీ చేసి ఇస్తామని జిల్లా, ఐటీడీఏ, పోలవరం కార్యాలయం ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా ప్రయోజనం లేదని బాధితుడు వాపోయాడు. పోలవరం కార్యాలయ సిబ్బంది చేసిన పొరపాటుకు తనకు రావాల్సిన పరిహారం సొమ్ము వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి వెళ్లిపోయాయని, దీనిపై అధికారులు లోతుగా విచారణ జరిపి తనకు రావాల్సిన పరిహారాన్ని వెంటనే వచ్చేలా చూడాలని కోరాడు. -
మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2026
మన్యం మంచం పట్టింది.. జ్వర పీడితులతో అల్లాడుతోంది.. ఏ ఇల్లు చూసినా బాధితులతో కనిపిస్తోంది.. ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన మలేరియా మళ్లీ క్రమంగా పెరుగుతోంది.. కొత్త ఏర్పడిన పోలవరం జిల్లాలో పారిశుధ్య సమస్య కారణంగా దోమల ఉధృతి అధికమైంది. వీటి నివారణ చర్యలు కానరాక మలేరియా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లాలో పరిస్థితిని పరిశీలిస్తే.. ఏరియా ఆసుపత్రిలో జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగులు రంపచోడవరం: మన్యంలో మలేరియా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుంది. జిల్లాలో ఈ జ్వరాల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గిరిజనులు జ్వరాలతో మంచం పట్టడం కనిపిస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మలేరియా మళ్లీ క్రమంగా కోరలు చాచింది. గ్రామాల్లో జ్వర పీడితులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తుంటే, ఒక రోజు చికిత్స అనంతరం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. దీంతో ఏరియా ఆసుపత్రిలో జ్వరాలతో వచ్చిన రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉన్నాయి. ఇందులో గతం నుంచి మలేరియా తీవ్రతగా ఎక్కువగా ఉన్న మారేడుమిల్లి, వై.రామవరం ఎగువ ప్రాంతంలో ప్రస్తుతం మలేరియా జ్వరాలు విభృంజిస్తున్నాయి. ఈ రెండు మండలాల్లోని 20 గ్రామాల్లో ఈ కేసులు అధికమవుతున్నాయి. కలెక్టర్ కె.దినేష్ కుమార్ ఆదేశాలతో జిల్లా మలేరియా అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో ఆర్డీ కిట్లతో పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకూ 15 వేల మంది జ్వర పీడితులను పరీక్షలు చేయగా, 620 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య అధికారులకే చెమట పుట్టించింది. ఏజెన్సీలో మలేరియా తీవ్రతకు ఇది నిదర్శనం. ఇదిలా ఉంటే మలేరియా కేసులు తక్కువగా చూపేందుకు కొంత మంది సిబ్బంది నెగెటివ్ వచ్చినట్లుగా నమోదు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 57 మంది జ్వర పీడితులు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఇందులో 49 మంది మలేరియా జ్వర పీడితులే. ఎనిమిది మంది టైఫాయిడ్ బాధితులు ఉన్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఒక్క రోజే 17 మంది జ్వర పీడితులు చికిత్స కోసం చేరారు. నివారణ ఎక్కడ! జిల్లాలో మలేరియా నివారణ మందు స్ప్రేయింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. ప్రణాళిక ప్రకారం స్ప్రేయింగ్ జరగాల్సి ఉండగా, ఆలస్యం చేశారు. మే నెలాఖరు నాటికి మొదటి విడత స్ప్రేయింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా, ఈ నెల 25 నాటికి మొదటి విడత ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రెండో విడత జూన్ ఆఖరి నాటికి ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 15న మలేరియా నివారణ మందు స్ప్రేయింగ్ ప్రారంభించాలి. కాని ఆలస్యం అయ్యింది. ఈ మందు స్ప్రేయింగ్ చేసేందుకు మనుషులు దొరకకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. స్ప్రేయింగ్ చేసేందుకు యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో రెండో రౌండ్ స్ప్రేయింగ్ కూడా ఆలస్యం అవుతుంది. దీనివల్ల దోమల లార్వా మరింత పెరిగే అవకాశం ఉంది. ఆయా పంచాయతీల పరిధిలో ఫాగింగ్ చేయాల్సి ఉండగా, చాలాచోట్ల ఫాగింగ్ మెషీన్లు మూలనపడ్డాయి. మలేరియా శాఖ ఫాగింగ్ మెషీన్లలో వేసి స్ప్రేయింగ్ చేసేందుకు మందు ఇచ్చినా, ఆ మెషీన్లో ఆయిల్ పోసేందుకు సొమ్ములు లేక పనులు పక్కన బెట్టేశారు. గత రెండేళ్ల నుంచి గ్రామాల్లో ఫాగింగ్ చేసిన పరిస్థితులు కనిపించడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జిల్లా మలేరియా కార్యాలయం నుంచి మూడు సైజుల దోమ తెరలు 5,37,271 కోసం ప్రతిపాదనలు పెట్టారు. ఇందులో పోలవరం జిల్లాకు 1,85,811 దోమతెరలు ప్రతిపాదించారు. అయితే పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు. దీంతో దోమల నుంచి జనానికి రక్షణ లేకుండా పోయింది. మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఈ దోమ తెరలు సరఫరా చేశారు. జిల్లాలో మలేరియా ప్రభావిత గ్రామాలు 646 ఉన్నాయి. ఫ విజృంభిస్తున్న మలేరియా మహమ్మారి ఫ ఐదు నెలల్లో 620 కేసులు నమోదు ఫ ప్రస్తుతం రంపచోడవరంలోనే 49 మందికి చికిత్స -
కేసులు ఎక్కువగా వస్తున్నాయి
రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి మలేరియా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. పీహెచ్సీల్లో ఒకటి, రెండు రోజులు మలేరియా కోసం చికిత్స పొందిన తరువాత ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ మలేరియాతో వచ్చిన రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం. కొన్ని కేసులకు చికిత్స అందించిన తరువాత డిచార్జ్ చేస్తున్నాం. –సూర్యప్రకాష్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, రంపచోడవరం సేవలపై ఎందుకో నిర్లక్ష్యం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మలేరియా నియంత్రణకు కట్టదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆ ఐదేళ్లలో మలేరియా తీవ్రత చాలా తగ్గింది. ప్రస్తుతం ఏజెన్సీలో వైద్య సేవలపై నిర్లక్ష్యం ఆవరించింది. మలేరియా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. ఏజెన్సీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు రాకుండా మలేరియాను కట్టడి చేయాలి. – గొర్లె బాలాజీబాబు, జెడ్పీటీసీ, మారేడుమిల్లి -
మా స్టార్ మీరే సారూ..
సీతానగరం: ఆయన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఏజెన్సీలోని ఓ గ్రామంలో దాదాపు 17 ఏళ్ల క్రితం పనిచేశారు. ఆ సమయంలో అక్కడి పిల్లలకు చదువు చెప్పడంతో పాటు గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం మైదాన ప్రాంతానికి బదిలీపై వచ్చేశారు. ఆయన దగ్గర చదువుకున్న పిల్లలు నేడు వివిధ రంగాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడిని గుర్తించుకుని ఆయనను తమ గ్రామానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. వివరాల్లోకి వెళితే.. సీతానగరం మండలం వెదుళ్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూలో శతపతి శ్రీనివాస్, రమాదేవి దంపతులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారిలో శ్రీనివాస్ 1998 నుంచి 2009 వరకు అడ్డతీగల మండలం పులిగోగులపాడు పంచాయతీ పరిధిలోని మాలయపాకలు గ్రామంలో ఉపాధ్యాయుడి విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో గ్రామానికి రోడ్డు లేకపోతే గ్రామస్తులు అందరిని ఏకతాటిపై నడిపించి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించారు. చదువు మానేసిన పిల్లలను గుర్తించి, వారిని తిరిగి పాఠశాలలో చేర్పించారు. వారికి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. అనంతరం అక్కడి నుంచి బదిలీపై వేరే ప్రాంతానికి వచ్చేశారు. ఆనాడు శ్రీనివాస్ దగ్గర చదువుకున్న పిల్లల్లో కొందరు డాక్టర్, పోలీస్ ఉద్యోగాల్లో, వైద్య, ఆరోగ్యశాఖల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో వారందరూ శ్రీనివాస్ దంపతులను ఆదివారం తమ గ్రామానికి ఆహ్వానించారు. కోలాటంతో ఆహ్వానం పలికి, తమ ఉపాధ్యాయుడిని భుజాలపై మోసుకుంటూ సన్మాన సభ వద్దకు తీసుకువెళ్లారు. సర్పంచ్ ప్రసాద్, గ్రామ పెద్దలు మంగరాజు, నూకాలమ్మ, చంద్రావతి లక్ష్మి తదితరులు ఆయన సేవలను కొనియాడారు. అనంతరం శ్రీనివాస్, రమాదేవి దంపతులను ఘనంగా సత్కరించారు. కాగా.. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి శ్రీనివాసరూ.5 వేల విరాళం అందజేశారు. ఫ పూర్వ విద్యార్థుల అభిమానం ఫ దాదాపు 17ఏళ్ల క్రితం తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడికి సన్మానం ఫ అడ్డతీగల మండలంలో ఘటన -
వన మహోత్సవ లక్ష్యాలు సాధించాలి
కై లాస్నగర్: పర్యావరణం పరిరక్షించేలా ఆయా శాఖలకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను వందశాతం సాధించాలని ఎఫ్డీవో చిన్నవిశ్వనాథ్ బూసిరెడ్డి అన్నారు. వనమహోత్సవ కార్యక్రమ నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాకు 39లక్షల 500 మొక్కలను ప్రభుత్వం లక్ష్యంగా ఖరారు చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వనమహోత్సవంలో పాఠశాల, కళాశాల విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు. వారి తో మొక్కలు నాటించడంతో పాటు సంరక్షించే బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాళీ స్థలాలను పరిరక్షించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ మాట్లాడుతూ, మొక్కలు నాటే ఫొటోలను జిల్లా అధికా రుల గ్రూప్లో తప్పనిసరిగా పోస్టు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో స్రవంతి, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఓటు హక్కు
ఆదిలాబాద్: అర్హులందరికీ ఓటు హక్కు ఉంటుందని, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో సరిచూసుకోవాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సోమవారం ‘సర్’ కార్యక్రమం, నషా ముక్త్ భారత్పై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా చేపట్టిన 2కే రన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ ఓటరు తమ వివరాలను ఎన్యుమరేటర్లకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం 20 ఏళ్లకు ఒకసారి చేపట్టే ఈ ప్రక్రియ ద్వారా 2002 నాటి గణన ఆధారంగా ఓటర్ల మ్యాపింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఓట్ల తొలగింపుపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఎన్యుమరేషన్ ఫారం నింపి తమ ఓటును సుస్థిరం చేసుకోవాలని సూచించారు. అలాగే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నషా ముక్త్ భారత్ సాధనలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం రన్లో విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికెట్లు అందించారు. ఇందులో డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావు, డీఎంహెచ్వో సాధన, డీవైఎస్వో దయానంద రెడ్డి, డీడబ్ల్యూవో మిల్కా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘అంతా డొల్లా..’పై ఫోకస్
సాక్షి,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో భాగంగా ఆ సమూహంలో విద్యుత్ లైన్ల ఎత్తు పెంచేందుకు పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇందులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఈనెల 18న ‘అంతా డొల్లా..!’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈమేరకు ఆ శాఖ అధికారులు స్పందించారు. వరంగల్లో ఎస్ఈ కార్యాలయం ఉండగా, వారి ఆదేశాల మేరకు క్వాలిటీ కంట్రోల్ ఏడీ తిరుపతి, స్థానిక విద్యుత్ శాఖ ఇన్చార్జి ఏడీ జనార్దన్ రెడ్డి, ఏఈ సదానందం సోమవారం ఆ పనులను పరిశీలించారు. విద్యుత్ టవర్లు, స్తంభాలు, కండక్టర్ వైర్లు, సైడ్ ఆర్మ్లు ఇలా అన్ని అంశాల్లో పరిశీలన చేశారు. నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ఈ విషయంలో ఆదిలాబాద్ విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావును వివరణ కోరగా, క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారని తెలిపారు. సాధారణంగా ఇది జరిగేదేనని వివరించారు. లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలని అందులో సూచిస్తారని పేర్కొన్నారు. -
పంట డబ్బులొచ్చినయ్
ఆదిలాబాద్టౌన్: ఆరుగాలం కష్టించి పండించిన పంట దిగుబడులను విక్రయించి నెలరోజులు గడిచినా డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఓ వైపు వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడం.. పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ప్రభుత్వం సోమవారం జొన్న, మొక్కజొన్న పంటలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసింది. మార్క్ఫెడ్ అధికారులు సంబంధిత రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే మొదట విక్రయించిన వారికి మాత్రమే ప్రస్తుతం జమ కాగా.. మిగతా వారికి రెండుమూడు రోజుల్లో జమ కానున్నట్లుగా మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. రైతుల్లో హర్షం..గత వానాకాలం సీజన్లో అధిక వర్షాలతో పత్తి, సోయా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిగుబడి తగ్గింది. పంటకు గిట్టుబాటు ధర కూడా లభించలేదు. రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. యాసంగిలో రైతులు జొన్న, మొక్కజొన్న సాగు చేశారు. అయితే ఆశించిన దానికంటే అధిక దిగుబడి వచ్చింది. ఎకరానికి 15 నుంచి 25 క్వింటాళ్ల వరకు జొన్న పంట పండిందని రైతులు చెబుతున్నారు. ఈ పంటను ప్రభుత్వరంగ సంస్థ మార్క్ఫెడ్ క్వింటాలుకు రూ.3,699 మద్దతు ధరతో కొనుగోలు చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ చేయడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ విషయమై మార్క్ఫెడ్ డీఎం మహేశ్కుమార్ను వివరణ కోరగా, ప్రభుత్వం జొన్న, మొక్కజొన్న పంటలకు సంబంధించి డబ్బులను సోమవారం విడుదల చేసిందని, వాటిని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని తెలిపారు. మిగతావి రెండు మూడు రోజుల్లో జమ అవుతాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. -
అంగన్వాడీల ధర్నా
కై లాస్నగర్: బీఎల్వో విధుల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు సోమవారం ఆందోళన చేపట్టారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ, ఐసీడీఎస్ పనులతో ఇప్పటికే అంగన్వా డీలపై పనిభారం పెరిగిందన్నారు. మౌలిక వ సతులు లేకున్నా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఈ క్రమంలో బీఎల్వో విధులు అప్పగించడం సరికాదన్నారు. కార్యకమంలో సంఘ నాయకులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
అటవీ అధికారులపై దాడికి యత్నం
జన్నారం: పెట్రోలింగ్కు వెళ్లిన అటవీశాఖ అధికారులపై గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటన జన్నారం రేంజ్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు జీపు డ్రైవర్ సాజిద్, అటవీ అధికారుల కథనం ప్రకారం.. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మండలంలోని బాదంపల్లి, పుట్టిగూడ గ్రామాల సమీపంలో పైడిపల్లి బీట్ ఆఫీసర్ శ్రీకాంత్, రాయికుంట బీట్ ఆఫీసర్ మక్బూల్, తాళ్లపేట బీట్ ఆఫీసర్ ఎండీ రహీమొద్దీన్, బేస్ క్యాంపు సిబ్బంది ఆదివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. అధికారుల రాక ను గమనించిన దుండగులు అసభ్య పదజాలంతో ధూషిస్తూ వారిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బేస్ క్యాంపు మంచెను పాక్షికంగా ధ్వంసం చేశారు. అప్రమత్తమైన అటవీ సిబ్బంది, జీపు డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. ఈ విషయమై జన్నారం ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్ జి.వికాస్ను సంప్రదించగా దాడికి యత్నించిన మాట నిజమేనని, ఈ విషయంపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ను సంప్రదించగా అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు. -
కాగితపు రశీదులకు ఇక చెల్లు
నిర్మల్చైన్గేట్/కాగజ్నగర్టౌన్: మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇచ్చే కాగితపు రశీదులకు కాలం చెల్లింది. పేపర్ లెస్ పాలనలో భాగంగా నిర్మల్, కుమురంభీం జిల్లాల్లోని 126 మీసేవ కేంద్రాల్లో ఈ నెల 19 నుంచి డిజిటల్ రశీదుల విధానం అమల్లోకి వచ్చింది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (మీసేవ) కమిషనర్ ఆదేశాల మేరకు.. ఇకపై కాగితపు ప్రింట్లకు బదులుగా దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా అక్నాలెడ్జ్మెంట్ హైపర్ లింక్ వస్తుంది. పాత పద్ధతిలో ప్రింట్ ఇస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎస్ఎంఎస్ డిలిటైనా తిరిగి పంపించే సౌకర్యం ..మొబైల్కు వచ్చిన ఎస్ఎంఎస్ పొరపాటున డిలిట్ అయినా లేదా పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీసేవ అప్లికేషన్లో సదరు ఎస్ఎంఎస్ను తిరిగి పంపించే సౌకర్యాన్ని కల్పించారు. దరఖాస్తుదారులు కోరితే ఆపరేటర్లు మళ్లీ మెసేజ్ పంపేలా సహాయం అందిస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..కొత్త నిబంధనల ప్రకారం.. జిల్లాలోని మీసేవ నిర్వాహకులు, ఆపరేటర్లు దరఖాస్తు దారుల నుంచి కచ్చితమైన, యాక్టివ్ ఉన్న మొబైల్ నంబర్లను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. జూన్ 19 నుంచి ఎలాంటి ఫిజికల్ (కాగితపు) రశీదులను ప్రింట్ తీసి ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి పాత పద్ధతిలోనే కాగితపు రశీదులు జారీ చేస్తే జిల్లాలోని సదరు కేంద్రాలపై కఠిన చర్యలు ఉంటాయని ఐటీ, ఈఎస్వో కమిషనర్ ఉత్తర్వులుల్లో హెచ్చరించారు. అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెక్ట్ మొబైల్ నంబర్ను మాత్రమే ఇవ్వాలని, లేదంటే భవిష్యత్లో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కష్టమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. మరింత మెరుగు మీ సేవ కేంద్రాల్లో రెవెన్యూ లాగిన్లో ప్రజలు ఆదాయ, నివాస, కుల, సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఫిజికల్ దరఖాస్తు ఫారాలు కార్యాలయాలకు పంపిస్తే అక్కడ అధికారులకు దొరక్క నెలల తరబడి పెండింగ్లోనే ఉంటున్నాయి. మళ్లీ జిరాక్స్ ప్రతులను తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పేపర్లెస్ సేవలతో ఆ పరిస్థితి ఉండదు. – సిరాజ్, మీసేవ కేంద్రం నిర్వాహకుడు, కాగజ్నగర్ పక్కాగా అమలు జిల్లాలో పేపర్లెస్ సేవలు ఈ నెల 19 నుంచి పక్కాగా అమలు చేస్తున్నాం. ప్రజలు దరఖాస్తు చేసుకున్న అనంతరం వారికి మొబైల్లో మెసేజ్ వస్తుంది. సంబంధిత కార్యాలయ అధికారి లాగిన్లోకి దరఖాస్తు చేరుకుంటుంది. ప్రజల దరఖాస్తు స్థితిని మొబైల్లోనే చూసుకోవచ్చు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. – గౌతం, మీసేవ కేంద్రాల జిల్లా అధికారిరశీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి కాగిత రహిత పాలనే ధ్యేయంగా నూతన విధానం అమలు చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు అందజేశాం. మీ సేవ కేంద్రాల్లో పేపర్ రశీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతున్నాం. – నదీమ్, ఈ మేనేజర్, నిర్మల్మొబైల్, రశీదు లింక్..కొత్త విధానం ప్రకారం.. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే, దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో అప్లికేషన్ నంబర్, సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలతో పాటు ఒక హైపర్ లింక్ ఉంటుంది. పౌరులు ఆ లింక్పై క్లిక్ చేసి తమ అక్నాలెడ్జ్మెంట్ రశీదును ఎప్పుడైనా వీక్షించవచ్చు.. డౌన్లోడ్ చేసు కోవచ్చు.. లేదా ప్రింట్ తీసుకోవచ్చు. సర్టిఫికెట్ చేతికి వచ్చే వరకు ఈ ఎస్ఎంఎస్ను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల కాగితాలు పోగొట్టుకునే భయం ఉండదు. -
దుబాయ్లో చిక్కుకున్న తల్వేద వాసి
నిర్మల్ ఖిల్లా: నిర్మల్ రూరల్ మండలం తల్వేదకు చెందిన గడ్చంద సాయన్న ఉపాధి నిమిత్తం ఏడాదిన్నర క్రితం యూఏఈలోని దుబాయ్కి వెళ్లి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సోనాపూర్ కార్మికుల శిబిరంలో నివాసముంటున్న సాయన్నకు ఇటీవల పక్షవాతం వచ్చింది. తోటి కార్మికులు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో సాయన్నను స్వదేశానికి పంపించాలని అతని భార్య కమల, కుమారుడు అజయ్ పలుమార్లు కంపెనీ యాజమాన్యాన్ని, సంబంధిత ఏజెన్సీని కోరినా స్పందన లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసి సమస్య విన్నవించారు. ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ రాష్ట్ర సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా స్వదేశ్ పరికిపండ్ల మాట్లాడుతూ ఢిల్లీలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ కార్యాలయానికి, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖకు ఈ మెయిల్ ద్వారా విషయాన్ని తెలియజేశామని, వీలైనంత త్వరగా భారత్కు తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని భరోసానిచ్చారు. -
బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి
నేరడిగొండ: బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని బోథ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ జాదవ్ అన్నారు. భీంపూర్ మండలంలోని కామట్వాడ సర్పంచ్ మడావి మాధవ్రావ్, ఉప సర్పంచ్ గోవింద్ తమ అనుచరులు 75 మందితో కలిసి సోమవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన తర్వాత చాలా మంది బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నా రు. రాబోయేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుధాకర్, సీనియర్ నాయకులు కేమ శ్రీకాంత్, మాజీ ఎంపీపీ సంతోష్, మాజీ సర్పంచ్ లింబాజీ, రమణరెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
ఆదిలాబాద్టౌన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎప్సెట్ అర్హత సాధించిన విద్యార్థుల సర్టి ఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సోమవారం ప్రా రంభమైంది. పట్టణంలోని సంజయ్గాంధీ పాలిటెక్నికల్ కళాశాలలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పరిశీలనలో తొలి రోజు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ముందుగా నమోదు చేసుకున్న ప్రకారం సర్టి ఫికెట్లను పరిశీలించారు.తొలి రోజు 210 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా 202 మంది హాజరైనట్లుగా ప్రిన్సిపాల్ డి.నరేష్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
బట్టల దుకాణంలో పుస్తకాల అమ్మకం
మంచిర్యాలఅర్బన్: ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు పాతరేశాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నాయి. ఈ నెల 6న ‘పుస్తకాలు, ధరల మోత’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అనుమతి, ఎమ్మార్పీ లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారని సోమవారం మంచిర్యాలలో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్థానిక గౌతమినగర్లో ట్రినిటీ హైస్కూల్ ఎదురుగా ఉన్న దుకాణాల్లో ఎమ్మార్పీ లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారని పీడీఎస్యూ, ఏఐఎస్బీ, యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మంచిర్యాల ఎంఈవో మాళవీదేవికి వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు విద్యాశాఖ సహాయ సంచాలకులు(ఏడీ) లలిత, ఎంఈవో మాళవీదేవి దుకాణాన్ని సందర్శించి సీజ్ చేశారు. మార్కెట్ రోడ్డులోని బట్టల దుకాణంలో పుస్తకాలు విక్రయిస్తున్నారని ఓ పేరెంట్ ఫిర్యాదు చేయగా.. విద్యాశాఖ అధికారులు తనిఖీ చేశారు. గ్రీన్వుడ్ పాఠశాలకు చెందిన పాఠ్యపుస్తకాలు లభ్యం కావడంపై ఏడీ లలిత, ఎంఈవో మాళవీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలు ఎందుకు ఉన్నాయని యజమానిని ప్రశ్నించగా.. ఓ వ్యక్తికి అద్దెకు ఇచ్చామంటూ సమాధానం ఇచ్చారు. దుకాణాన్ని సీజ్ చేయడంపై మల్లగుల్లాలు పడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భద్రత కల్పించారు. సోమవారం రాత్రి వరకు పుస్తక దుకాణం సీజ్పై ఎటూ తేల్చలేదు. ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటామని ఎంఈవో మాళవీదేవి తెలిపారు. తనిఖీల విషయం తెలుసుకుని పాత కలెక్టరేట్ సమీపంలో కార్పొరేట్ పాఠశాల పుస్తకాలు విక్రయిస్తున్న మరో బట్టల దుకాణం నిర్వాహకుడు, ఇతర అనుబంధ పుస్తక దుకాణాల యజమానులు దుకాణాలు మూసివేయడం గమనార్హం. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
దస్తురాబాద్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మున్యాల తండాకు చెందిన బానవత్ రాజు(48)కు భార్య వనిత, ఇద్దరు కుమారులు శంకర్, సాయి, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. ఇద్దరు కుమారులు విదేశాలలో ఉద్యోగాలు కోల్పోయి ప్రస్తుతం ఇంటివద్ద ఖాళీగా ఉంటున్నారు. దీనికి తోడు కుమార్తె న్యూమోనియా వ్యాధి బారిన పడటంతో చికిత్స నిమిత్తం అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని తండ్రి సక్లనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై యువకుడు.. సాత్నాల: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు బోరజ్ మండలం పెండల్వాడకు చెందిన గేడం జ్ఞానేశ్వర్ (23) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సావాపూర్లో ఒక ఇంట్లో వంట చేయడానికి వెళ్లిన అతని తల్లి వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి విగత జీవుడై కనిపించాడు. మృతుని తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి, చెల్లితో ఉంటున్నాడు. పాముకాటుకు ఒకరు మృతి కాగజ్నగర్టౌన్: మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన బొమ్మెళ్ల సత్తయ్య (63) పాముకాటుతో మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఇంటి ఆవరణలో నేలపై నిద్రిస్తున్న సత్తయ్యను పాము కాటువేయగా కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం మంచిర్యాలకు రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం సిర్పూర్(టి): మండలంలోని టోంకిని గ్రామ సమీ పంలోని పెన్గంగ నది ఒడ్డున సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గమనించిన పంచా యతీ కార్యదర్శి సందీప్ పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై సాగర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతునికి 30 నుంచి 40 సంవత్సరాల వరకు వయస్సు ఉంటుందని, నీలం రంగు షర్టు, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. ఎడమచేతికి, ఎడమ కాలికి నల్లని దారం కలిగి ఉన్నాడని, గుర్తుపట్టిన వారు పోలీసులను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. బాసర గోదావరిలో యువకుడి మృతదేహం బాసర:బాసర గోదావరిలో మునిగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. భైంసాలోని కొర్బగల్లి గ్రామానికి చెందిన బొండ్ల అక్షయ్ కుమార్ (23) ఈ నెల 18న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. 21న అతని మోటార్ సైకిల్ గోదావరి వంతెన సమీపంలో లభ్యమైంది. సోమవారం ఉదయం బాసర గోదావరి ప్రధాన ఘాట్ ఎదురుగా నదిలో మృతదేహం లభ్యమైంది. మృతుని తండ్రి బొండ్ల నాగనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ముధోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు. ఆటో బోల్తాపడి ముగ్గురికి గాయాలు కోటపల్లి: మండలంలోని పార్పల్లి సమీపంలోని 63వ జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలైన ఘటన చోటు చేసుకుంది. పిన్నారంకు చెందిన ఆటో డ్రైవర్ కుదురుపాక సతీశ్ చెన్నూర్ నుంచి పార్పల్లి వైపు వెళ్తుండగా ఫారెస్టు చెక్పోస్టు సమీపంలోకి రాగానే ఎదురుగా సిరోంచ నుంచి వస్తున్న సర్వేంద్ర అనే కారు డ్రైవర్ ఫారెస్టు చెక్పోస్టు టోల్ ఛార్జీలు పడకుండా ఉండేందుకు ఎదురుగా వస్తున్న ఆటో రూట్ నుంచి వెళ్లే క్రమంలో ఆ టోను ఢీకొట్టాడు. దీంతో ఆటో రోడ్డు పక్కన అటవీ ప్రాంతంలో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న కొప్పుల బాపు, ఇరుగురాల్ల సాత్వికకు స్వల్పంగా డ్రైవర్ సతీష్కు తీవ్రగాయాలుకాగా 108లో చెన్నూర్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. -
భవిష్యత్తు బీఆర్ఎస్దే
నేరడిగొండ: తెలంగాణ భవిష్యత్తు బీఆర్ఎస్ దేన ని, బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్ర జలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఎమ్మె ల్యే డాక్టర్ అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని గుత్పాల గ్రామానికి చెందిన దాదాపు 60 మంది ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు మళ్లీ గు లాబీ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారిలో ఉడుగుల సురేష్, బట్టు నర్సయ్య, ఒడ్డెపల్లి సురేష్, దావుల ఆడేళ్లు, ఉడుగు ల పెద్ద గంగయ్య, కొండ గంగయ్య, బోగి మల్ల య్య, దశకంటి రాములు, దావుల శివయ్య, సుధీర్, శ్రీకాంత్, సతీష్, నవీన్, ప్రవీణ్, నగేష్, సంజు, లక్ష్మణ్, భీంరావ్, భాస్కర్, సాగర్, కృష్ణ, సంతోష్, రాజు తదితరులున్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, సోమేశ్, రాథోడ్ సురేందర్, సుజీల్, సాబ్లే సంతోష్, బాబులాల్, కై లాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నీట్
కై లాస్నగర్: వైద్యవిద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ జిల్లాలో ప్ర శాంతంగా ముగిసింది. 1,763 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఏడు కేంద్రాలను ఏర్పాటు చే శారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష సాగింది. బయోమెట్రిక్ హాజరు నేపథ్యంలో విద్యార్థులను ఉదయం 11 నుంచి మ ధ్యాహ్నం 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. నిర్ణీత సమయం ముగిసిన వెంటనే గేట్ల ను మూసివేశారు. పరీక్షకు 1583 మంది హాజరుకాగా 180మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఆయా కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 144 సెక్షన్ అమలు చేశారు. పలు కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహా జన్ పరిశీలించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ పరి శీలించి పరీక్ష నిర్వహణపై ఆరా తీశారు. పకడ్బందీ గా ప్రశాంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూ చించారు. వారి వెంట అదనపు ఎస్పీ సురేందర్రావు, ఆర్డీవో జగదీశ్వర్ రావు తదితరులున్నారు. -
ఆసనాలు అదుర్స్
యోగా ఆసనాలు వేస్తున్న కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే ఆదిలాబాద్టౌన్:/కై లాస్నగర్: యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంను జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి కలెక్టర్ రాజర్షి షా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శిక్షకుల సూచనలకు అనుగుణంగా ఆసనా లు ఆచరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, యోగాతో మానసిక ఒత్తిడిని దూరం కావచ్చన్నారు. బ్రహ్మ కుమారీస్కు సంబంధించిన యోగా పోస్టర్ ఆవిష్కరించి, శిక్షకులను సన్మానించారు. ఇందులో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఎంహెచ్వో సాధన, డీపీఆర్వో విష్ణువర్ధన్, డీవైఎస్వో దయానంద్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఈవో మాధవి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆయుష్ వైద్యులు చంద్ర శేఖర్, ప్రీతి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ పరేడ్ మైదానంలో ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై యోగా ఆసనాలు చేశారు. అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కోర్టులో.. జిల్లా కోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రభాకర రావు మాట్లాడుతూ యోగా నిత్య సా ధనతో రోగాలు దరిచేరవని పేర్కొన్నారు.ఇందులో డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, జడ్జిలు హుస్సేన్, డ్యానిరుత్, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా జైలులో.. జిల్లా జైలులోనిర్వహించిన కార్యక్రమంలో సిబ్బంది, ఖైదీలు యోగా ఆసనాలు చేశారు. జైలు సూపరింటెండెంట్ గోపి రెడ్డి, జైలర్ చంద్రశేఖర్, సుధలక్ష్మి, సాయికిరణ్, నాగరాజు, అంజయ్య, సాంబయ్య, రమేశ్, మోసిన్, దామోదర్, సునిత, అశో క్, మహేందర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ కార్యాలయంలో.. ఉట్నూర్రూరల్: స్థానిక కుమురంభీం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి పీవో మకరందు ప్రారంభించారు. అధికారులు, ఉద్యోగులు, ఆశ్రమ గిరిజన విద్యార్థినులతో కలిసి యోగాసనాలు ఆచరించారు. ఇందులో ఏపీవో వసంతరావు, ఏపీవో (పీవీటీజీ) ఆత్రం భాస్కర్, డీడీ ప్రేమకళ, డిప్యూటీ డీఈ చందన్పాల్గొన్నారు. -
భూసర్వే సాధ్యమేనా?
కై లాస్నగర్: భూ వివాదాలు, సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టాలని నిర్ణయించింది. దశలవారీగా ఈ ప్రక్రి య నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం జి ల్లాలోని 70 గ్రామాలను ఎంపిక చేసింది. అయితే ఈ సర్వే సాఫీగా సాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రెగ్యులర్ సర్వేయర్ల కొరత, లైసెన్స్డ్ సర్వేయర్లు విధుల నిర్వహణకు విముఖత వ్యక్తం చేయడమే కారణంగా తెలుస్తోంది. 21 మండలాలు.. 10 మందే సర్వేయర్లు జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖను సర్వేయర్ల కొరత వేధిస్తుంది. జిల్లావ్యాప్తంగా 21 మండలాలకు గాను కేవలం పది మంది మాత్రమే రెగ్యులర్ సర్వేయర్లు ఉన్నారు. దీంతో ఒక్కో సర్వేయర్కు రెండేసి మండలాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే దరఖాస్తులు అధికంగా వస్తుండటంతో వారు ఏ మండలంలో సర్వే నిర్వహించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పనిభారం పెరగడంతో సకా లంలో సర్వే చేపట్టలేని పరిస్థితి. దీంతో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. భూ సర్వే కోసం చలానా చెల్లించిన రైతులు సర్వేయర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టు కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో గ్రామాల్లో భూ సమస్యలు, వివాదాలు అధికమవుతున్నాయి. లైసెన్స్డ్ సర్వేయర్ల విముఖత జిల్లాలో ఇప్పటికీ నిజాం కాలంనాటి సర్వే రికార్డులే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతున్నందున భూముల విభజనలు, బైనంబర్ల సంఖ్య రోజురోజుకు పెరుగతున్నాయి. సరిహద్దులు మారడంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో భూ వివాదాలు అధికమవుతున్నాయి. ఇలాంటి వాటిని పరిష్కరించి బాధిత రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సమగ్ర రీసర్వేకు నిర్ణయించింది. తొలి విడతలో 70 గ్రామాలను ఎంపిక చేసింది. స్పష్టమైన హ ద్దులు నిర్ణయించి, ప్రతీ సర్వేనంబర్కు భూదార్ కే టాయించాలనే ఉద్దేశంతో ఈప్రక్రియ చేపడుతుంది. సర్వేయర్లు తగినంత లేకపోవడంతో ఇటీవల ని యమించిన లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా చేయించా లని భావిస్తోంది. ఇందుకోసం ఎకరం సర్వేకు రూ. 50 చొప్పున వారికి చెల్లించాలని నిర్ణయించింది. అ యితే ఇదితమకు గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో స ర్వే విధులపై వారు విముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం వారితో అదనపు కలెక్టర్ సమావేశమయ్యారు.ప్రభుత్వం ప్రకటించిన ఎకరానికి రూ. 50 గిట్టుబాటు కాదంటూ అదనపు కలెక్టర్ ఆర్ఎస్. చిత్రుకు వినతిపత్రం అందజేసి తమనిరసన వ్యక్తం చేశారు. స్కీల్డ్ వర్కర్లకు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కనీస వేతనం రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే నిర్వహణ ముందుకు సాగుతుందా లేదా అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారానే సర్వే భూ వివాదాలు పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేకు ఆదేశించింది. తదనుగుణంగా జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేశాం. త్వరలోనే గెజిట్ జారీ చేసి లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా ప్రక్రియ నిర్వహించాలని భావిస్తున్నాం. వారు ముందుకు రాని పక్షంలో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. – ప్రభాకర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరులోపు పీఆర్సీ ప్రకటించా లని, పెండింగ్లో ఉన్న డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకొని ఫిట్మెంట్ ప్రకటించా లని పేర్కొన్నారు. పాఠశాలల కుదింపు చర్యలు నిలిపివేయాలన్నారు. ఇన్సర్వీస్ టీచర్లకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక టెట్ నిర్వహించాలని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో బదిలీలు, పదో న్నతులు చేపట్టాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, బాధ్యులు శ్రీనివాస్, స్వామి, శివన్న, శ్యామ్సుందర్, సురేష్, అశోక్, మహేందర్ పాల్గొన్నారు. -
‘అన్న అక్క’తో ఏఐ బోధన
ఆదిలాబాద్టౌన్: ప్రస్తుత కాలంలో సాంకేతికత ప్రతీ రంగాన్ని ప్రభావితం చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలోనూ మా ర్పులు చోటు చేసుకుంటున్నాయి. సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థులకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను పరిచయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం డిగ్రీ విద్యార్థులను సంసిద్ధం చేసింది. ఒకప్పుడు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిందే విద్యార్థులకు జ్ఞాన వనరుగా ఉండేది. ప్రస్తుతం ఏఐ సాయంతో విద్య మరింత సులభంగా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అన్న అక్క మెంటర్షిప్ టీచింగ్ ఇంటర్షిప్’ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. జూలై 1 నుంచి డిగ్రీ విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. వారికి ఎంపిక చేసిన పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏఐ కంప్యూటర్ విద్యను బోధించనున్నారు. లెక్చరర్లు, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ.. ఈ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థులతో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్ విద్యాబోధన చేయనుంది. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులతో పాటు లెక్చరర్లకు ఇటీవల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏఐ బోధనలో విద్యార్థులకు స్నేహపూర్వకంగా మార్గనిర్దేశం చేసే డిజిట ల్ పాత్రలను రూపొందించారు. పాఠ్యాంశాలను కేవలం చదవడం కాకుండా చిత్రాలు, యానిమేషన్లు, వీడియోలు, కథలు, ప్రశ్నోత్తరాల రూపంలో అందించడం ద్వారా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటున్నారు. పాఠాలు వినడం, చూడడం, ఆచరణలో పెట్టడం ద్వారా అభ్యసన మరింత ప్రభావవంతంగా మారుతోంది. విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి.. జిల్లాలో నాలుగు ప్రభుత్వం డిగ్రీ కళాశాలలతో పాటు ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉంది. పట్టణంలో ప్రభుత్వ సైన్స్, ఆర్ట్స్ అండ్ కామర్స్, ఇచ్చోడ, ఉట్నూర్లలో ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. వీటిలో చదివే ఫైనలియర్ విద్యార్థులు 30 గంటల తరగతులు బోధించాల్సి ఉంటుంది. నెల నుంచి రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకు గాను డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్ పాయింట్లు కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా ప్రతీవిద్యార్థి నేర్చుకునే సామర్థ్యం ఒకేలా ఉండదు. కొందరు వేగంగా అర్థం చేసుకుంటే, మరికొందరికి అదనపు సమయం అవసరం అవుతుంది. ఏఐ ఆధారిత బోధన ద్వారా ప్రతీ విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి, వారికి తగిన విధంగా పాఠ్యాంశాలు అందించే అవకాశం కలుగుతోంది. దీంతో వెనుకబడిన విద్యార్థులు కూడా ఇతరులతో సమానంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. నైపుణ్యాలు పెంపొందించేందుకు.. విద్యార్థులు కంప్యూటర్, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేందుకు ఏఐ ఎంతగానో దోహద పడనుంది. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండడంతో ఇప్పటి నుంచే విద్యార్థులకు పరిచ యం చేస్తున్నారు. దీంతో వారిలో సృజనాత్మకత, స మస్య పరిష్కార సామర్థ్యం, డిజిటల్ అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలు పెంపొందుతాయి. ఏఐ ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ వారి పనిని మరింత సులభతరం చేసే సాధనంగా మారుతుందని లెక్చరర్లు చె బుతున్నారు. పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేయడం, విద్యార్థుల ప్రగతిని విశ్లేషించడం, అదనపు అభ్యాస సామగ్రిని అందించడం వంటి అంశాల్లో ఏఐ సహా యపడుతోందని పేర్కొంటున్నారు. పాఠశాలల్లో ఇంటర్నెట్, డిజిటల్ పరికరాలు, విద్యుత్ సదుపాయాలు వంటివి అధిగమిస్తే ఈ కార్యక్రమం విద్యారంగంలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.పాఠాలతో పాటు ఏఐపై అవగాహన..అన్న అక్క మెంటర్షిప్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూలై 1 నుంచి ప్రారంభించనుంది. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు సమీపంలోని పాఠశాలలకు వెళ్లి ఏఐ విద్యాబోధన చేస్తారు. విద్యార్థులకు ఏఐపై అవగాహన, డిజిటల్ లిట్రసీ, కంప్యూటేషనల్ థింకింగ్, కోడింగ్ ప్రాథమిక అంశాలను నేర్పిస్తారు. ఇటీవల డిగ్రీ విద్యార్థులతో పాటు లెక్చరర్లకు ఈ అంశాలపై శిక్షణ కల్పించాం. జిల్లాలో నాలుగు ప్రభుత్వ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. – అరుణ్, నోడల్ అధికారి -
ఆ క్షణం కళ్లల్లో ఆనందం చూశాను..
నాన్న.. జీవితాన్ని సరైన దారిలో నడిపించే మార్గదర్శి. అపజయాలు ఎదురైనా ధైర్యం చెప్పి విజయాన్ని అందించే దిక్సూచి. ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల విజయాలే తనవిగా భావించి సంతోషిస్తాడు. బిడ్డల ఎదుగుదలలో తన కష్టాలను మెట్లుగా మలిచి ఉన్నత స్థానాలకు చేర్చి ఆనందిస్తాడు. తన భుజాలపై ఎక్కించుకుని లోకాన్ని చూపించే నాన్నకు వందనం. నేడు ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నతస్థానాలకు చేరిన వారిపై ప్రత్యేక కథనం.బెల్లంపల్లి: ‘నాన్న ప్రేమ ఎల్లలు లేనిది.. దేనితోనూ వెలకట్టలేనిది. చిన్నతనం నుంచి మొదలుకుని ఐఏఎస్ పాసయ్యే వరకు నాన్నతో నా జర్నీ ఫ్రెండ్స్లా సాగింది. నా చిన్నతనంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ నాన్న నా బెడ్ పక్కనే ఉండి సపర్యలు చేయడం నేనెప్పటికీ మర్చిపోలేను..’ అంటూ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఐఈఎస్ఎస్డీ. మనోజ్ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన తండ్రి ఇనుకొండ వెంకటేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. మా స్వస్థలం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అనంతారం గ్రామం. నాన్న ఇనుకొండ వెంకటేశ్వరరావు(రిటైర్డు పోలీసు అధికారి), అమ్మ గంగభవానీ, అక్క లక్ష్మీమౌనిక. -
నాన్న మాటే.. విజయానికి బాట..
నిర్మల్ ఖిల్లా: జీవితంలో తండ్రి ఇచ్చే మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అమూల్యమని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గోమస జసింత్ జోయల్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి డేనియల్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన విజయ ప్రయాణాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నిర్మల్కు చెందిన ‘జసింత్ జోయల్‘ బీటెక్ 2020లో పూర్తిచేశారు. అనంతరం గ్రూప్–1 లక్ష్యంగా సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నిర్మల్లోని సోఫీనగర్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న తన తండ్రి డేనియల్ ఉద్యోగరీత్యా హైదరాబాద్కు బదిలీ కావడంతో ఆరేళ్లపాటు కొడుకుతోపాటు అక్కడే ఉన్నారు. గ్రూప్–1 పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ప్రతీ అంశాన్ని తండ్రితో చర్చించేవాడినని జసింత్ తెలిపారు. ఉపాధ్యాయుడైన తన తండ్రి చదువుకు సంబంధించిన అంశాలతోపాటు ఆర్థిక స్వేచ్ఛ, పొదుపు, కుటుంబ బంధాలు, జీవన విధానం వంటి విషయాలపై విలువైన సూచనలు, సలహాలు అందించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహమే గ్రూప్–1లో విజయానికి బాటలు వేశాయని తెలిపారు. ప్రస్తుతం తాను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘నాన్న... మీ ప్రేమ, ప్రోత్సాహం, మార్గదర్శకత్వమే మా జీవితాలకు బలమైన పునాది. థాంక్యూ డాడీ... హ్యాపీ ఫాదర్స్ డే’ అని జసింత్ జోయల్ భావోద్వేగ సందేశాన్ని ‘సాక్షి’ తో పంచుకున్నారు.. -
లోక్ అదాలత్తో కేసులు సత్వర పరిష్కారం
కై లాస్నగర్: కోర్టుల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. ప్రభాకరరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పలు సివిల్, క్రిమినల్ కేసులను ఇరుపక్షాల రాజీ మార్గం ద్వారా విజయవంతంగా పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులు పరిష్కారమైతే కక్షిదారులకు కోర్టు ఫీజు తిరిగి అందించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా కాకుండా చూసుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని అన్నారు. అనంతరం సైబర్ క్రైమ్ బాధితుడికి లక్ష ప్రొసీడింగ్ కాపీని, భూసేకరణ లబ్ధిదారులకు రూ.65,33,437విలువ గల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, బార్ అసో సియేషన్ అధ్యక్షుడు నగేష్, జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్కు ఘన స్వాగతం..
నేరడిగొండ: జిల్లాకు విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు స్థానిక బీఆర్ఎస్ నాయకులు టోల్ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు.వైఎస్సార్ హయాంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధిఆదిలాబాద్: వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్రెడ్డి అన్నారు. జిల్లాలో చనాఖా –కోరటా బ్యారేజీకి మాజీ మంత్రి దివంగత సీఆర్ఆర్ (సి.రామచంద్రారెడ్డి) పేరును నామకరణం చే స్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా మండలకేంద్రంలో శనివారం సంబరాలు నిర్వహించారు. సీఎం, డిప్యూటీ సీఎంల చిత్రపటాలకు క్షీరా భిషే కం చేశారు. జిల్లాలో రిమ్స్ ఆస్పత్రి, మత్తడివాగు వంటి ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులకు దివంగత నేత వైఎస్సార్ కారణమని, వీటి నిర్మాణంలో సీఆర్ఆర్ చొరవ ఉందని కొనియాడారు. పార్టీ మండల అధ్యక్షుడు రూప్రావు, రాందాస్, వామన్ వంకడే, గాన్ శ్యామ్, సంజీవ్ తదితరులు ఉన్నారు. -
క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి
కై లాస్నగర్: పోలీసులు విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక ఏఆర్ హెడ్క్వార్టర్స్లో పోలీసులు శనివారం పరేడ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూ చించారు. చట్టం ముందు అందరూ సమానమేవన ని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పి ఎల్.జీవన్రెడ్డి, సీఐలు బి.సునీల్కుమార్, చంద్రశేఖర్, బిడి.ప్రేమ్ కుమార్, కె.ఫణిదర్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటి, ఎన్.చంద్రశేఖర్, సబ్ ఇన్స్పెక్ట ర్లు, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు. నేరాల నియంత్రణపై దృష్టి సారించాలిఆదిలాబాద్టౌన్: ఆర్థికనేరాలు నియంత్రించేలా రా త్రి వేళల్లో గస్తీ పటిష్టం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. కార్యాలయ ఆవరణ, వివిధ విభాగాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐలు బి.సునీల్కుమార్, కె.నాగరాజు, జి.శ్రావణ్, జె.ఫణిధర్, డి.గురుస్వామి, బి.డి.ప్రేమ్కుమార్, ప్రణయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
లక్సెట్టిపేట: ప్రేమ విఫలమైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలో తిమ్మాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ కథనం ప్రకారం..తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బైరి రాజ్కుమార్ (26) మార్బుల్ పని చేసేవాడు. సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. మనస్పర్థల కారణంగా ఏడాది క్రితం విడిపోయారు. అప్పటినుంచి మనస్తాపం చెందాడు. శుక్రవారం రాత్రి ఇంటి డాబాపై పురుగుల మందు తాగాడు. శనివారం ఉదయం కుటుంబసభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. తండ్రి కాంతయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
నేడు నీట్
కై లాస్నగర్: వైద్య విద్య కోర్సులో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ఆదివారం మరోసారి నీట్ నిర్వహించనున్నారు. గత నెల 3న పరీక్ష నిర్వహించినా ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా రద్దయిన విషయం తెలి సిందే. దీంతో పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన భద్ర త ఏర్పాట్ల నడుమ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లావ్యాప్తంగా 1700 మంది హాజరుకానుండగా వీరి కో సం పట్టణంలో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష ఉంటుంది. బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనున్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు కేంద్రంలోకి అనుమతించనున్నారు. తర్వాత గేటును మూసివేస్తారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎండలతీవ్రత నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆయా కేంద్రాల్లో ఏ ఎన్ఎంలను నియమించడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడిసిన్ అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నారు. విద్యార్థులు నీట్ అడ్మిట్ కార్డు, ఒరిజినల్ గుర్తింపు కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, వాటర్బాటిల్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తీసుకురావద్దని పేర్కొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఆదిలాబాద్రూరల్: మండలంలోని బంగారుగూడలో గల నీట్ కేంద్రాలను అదనపు కలెక్టర్ రాయిసిడాం చిత్రు శనివారం పరిశీలించారు. అధికారులను అడిగి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. -
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి
ఉట్నూర్రూరల్: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఐటీడీఏ పీవో మంద మకరందు పేర్కొన్నారు. కుమురం భీం ప్రాంగణ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల సర్మేడి నాయకులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, గిరిజన హక్కులు, వెదురు ఆధారిత పరిశ్రమలు, పల్లిపట్టీ, మహువా లడ్డూల తయారీ, చేపల పెంపకం, గోండి భాష అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోండి భాషను కంప్యూటర్లో సులభంగా అర్థమయ్యేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను తెలిసేలా పర్యాటక రంగ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తమ ప్రాంతాల్లోని సమస్యలను సర్మేడి నాయకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులకు దీపావళికి ప్రత్యేక సెలవులు ఇవ్వాలని కోరారు. కొందరు చదువుకోకుండా క్రికెట్ ఆడుతున్నారని దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే స్పందిస్తూ పోలీసు యంత్రాంగం, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం మండల కేంద్రంలో సుమారు రూ.కోటి వ్యయంతో గ్రంథాలయాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సర్మేడి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ● యోగాపై పెరుగుతున్న ఆసక్తి ● నిత్యజీవితంలో భాగం ● వ్యాయామాలకు మేలు
చిన్ననాటి నుంచే రాణిస్తూ చిన్ననాటి నుంచి యోగాలో రాణిస్తున్నా. స్కూల్ ఫెడరేషన్ గేమ్స్లో రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించా. ఈ ఏడాది జనవరిలో కామారెడ్డి యోగా భవన్లో రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్–18 విభాగంలో బంగారు పతకాలు సాధించి సౌజ్ జోన్ పోటీలకు ఎంపికయ్యా. అక్కడ రాణించకపోయినా, యోగాలో శిక్షణ పొందుతున్నా. – చైత్ర, రామకృష్ణాపూర్‘యోగా’గురువు.. మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన మండ శ్రీనివాస్ యోగా గురువుగా పిలుస్తుంటారు. గుడిపేట్ 13వ బెటాలియన్లో శిక్షణ పొందుతున్న పోలీసులకు యోగా నేర్పిస్తున్నారు. జిల్లా యోగా అసోసియేషన్ సెక్రటరీగా ఉంటూనే, వెయ్యికి పైగా విద్యార్థులను జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయికి వెళ్లేలా వారికి శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దారు. యోగా శిక్షణ ఇస్తూ ఉపాధి పొందుతూ, శిక్షకులు, జడ్జిలను తయారు చేస్తున్నారు. పతకాలు రాణించేలా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుస్తున్నారు. మండ శ్రీనివాస్, జిల్లా యోగా అసోసియేషన్ సెక్రటరీపీడీ ప్రోత్సాహంతో.. దండేపల్లి: నేను దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నా. పీడీ రవి ప్రోత్సాహంతో రెండేళ్లుగా యోగాలో రాణిస్తున్నా. పలు పోటీల్లో బహుమతులు గెలుచుకున్నా. సీఎంకప్, మండల, జిల్లా, జోనల్ పోటీల్లో పాల్గొన్నా. హెచ్ఎం రాజేశ్వర్రావు, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతి సాధించడమే తన లక్ష్యం. – యోగా ఆసనం వేస్తున్న విజయ్ ఆసక్తితో శిక్షణ మా తల్లిదండ్రులు అనురాధ, మోహన్ ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. తనకు యోగాపై ఉన్న ఆసక్తితో శిక్షణ ఇప్పించారు. ఈ ఏడాది జనవరిలో కామారెడ్డి యోగా భవన్లో రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి సౌత్జోన్కు ఎంపికయ్యా. అక్కడా బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నా. ప్రస్తుతం హైదరాబాద్లో యోగా శిక్షణ ఇస్తున్నా. – సి. వైష్ణవి, మంచిర్యాలశిక్షకుడిగా పనిచేస్తున్నా నిర్మల్ఖిల్లా: 2018లో ఎంటెక్ పూర్తి చేశాక.. యోగాపై ఆసక్తి పెరిగింది. గురువు అన్నపూర్ణ వద్ద యోగాసనాల సాధన చేశా. యోగా తో ఆరోగ్య ప్రయోజనాలు నలుగురికి చెప్పాలన్న తపనతో అన్ని మెలకువలు నేర్చుకుని శిక్షకుడి అయ్యాను. యోగాలో లెవెల్–3 శిక్షణ పూర్తిచేసి కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖలో కాంట్రాక్ట్ శిక్షకుడిగా పనిచేస్తున్నా. – ఎం.ప్రదీప్, యోగా శిక్షకుడు, ఆయుష్శాఖ, నిర్మల్ పట్టుదలతో సాధన చేస్తూ.. ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని సంజయ్నగర్కు చెందిన చౌహాన్ ప్రజ్యోత్సింగ్ యోగాలో పట్టుదలతో సాధన చేస్తూ జాతీయ స్థాయి సత్తాచాటుతున్నాడు. యోగాలో ఎం.ఏ చదువుతున్న ఈయన చిన్నప్పటి నుంచే యోగాపై ఆసక్తి ఉండేది. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. హర్యానాలో బంగారు పతకం సాధించాడు. రాష్ట్ర స్థాయిలో 11 మీట్లలో పాల్గొని 16 స్వర్ణం, 8 రజతం, 4 కాంస్య పతకాలు కై వసం చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఉదయ్ సింగ్, శారద ప్రోత్సాహం, గురువులు చేతన్, తిరుపతి రెడ్డిల శిక్షణే తన విజయాలకు కారణమని తెలిపాడు. భవిష్యత్తులో యోగా ప్రొఫెసర్గా స్థిరపడి, సొంతంగా యోగా స్టూడియోను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమంటున్నాడు. ‘యోగాతో సంపూర్ణ ఆరోగ్యం’ మంచిర్యాలటౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కిడ్జీ స్కూల్ చైర్మన్ దామెర సిద్దయ్య అన్నారు. జిల్లా కేంద్రం లక్ష్మీనగర్ స్కూల్లో శనివారం విద్యార్థులు, తల్లిదండ్రులతో కలసి ఫాదర్స్ డే, యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు తండ్రి గొప్పతనాన్ని తెలిసేలా నృత్యాలు పాటలతో అలరించారు. అనంతరం యోగా మాస్టర్ ఎం.శంకర్ అభ్యాసకులతో ఆసనాలు వేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉమారాణి, టీచర్లు ,సిబ్బంది పాల్గొన్నారు. పతకాలు తన ఖాతాలోకి.. ఆదిలాబాద్: తలమడుగు మండలం అర్లి(కె) గ్రామానికి చెందిన బొండ్ల భార్గవ్ యోగాలో సత్తాచాటుతున్నాడు. ప్రస్తుతం ఫిజియోథెరపీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈయన పదేళ్లుగా యోగాలో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 8 జాతీయ, 10 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకున్నాడు. 7 స్వర్ణ, 3 రజత, 4 కాంస్యంతో కలిపి 14 పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తండ్రి ఆర్ఎస్ఎస్లో యోగా చేయడం చూసి స్ఫూర్తి పొందిన భార్గవ్, కోచ్ సంతోష్ శిక్షణ, తల్లిదండ్రులు, అన్న మద్దతు తన విజయాలకు కారణమని చెబుతాడు. భవిష్యత్తులో వరల్డ్ ఛాంపియన్ అథ్లెట్గా ఎదగాలని, అదే సమయంలో ఒక మంచి ఫిజియోథెరపిస్ట్గా సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రపంచానికిచ్చిన గొప్ప కానుక భారతదేశం ప్రపంచానికిచ్చిన గొప్ప కానుక యోగా. ప్రపంచ దేశాలు ఆమోదించాయి. నేటి కాలంలో అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గొప్ప విరుగుడు. రోజూ ఒక గంట చేస్తే, ప్రతీ ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. – ముల్కల శంకర్, యోగా గురువు, మంచిర్యాల మెలకువలు నేర్చుకుని కుంటాల: కుంటాలకు చెందిన చిన్నారులు మోక్ష, షర్ణిక.. యోగాలో సత్తాచా టుతున్నారు. గత రెండేళ్లుగా యోగా శిక్షణలో మెలకువలు నేర్చుకుని జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. వారిని పలువురు అభినందిస్తున్నారు. షర్ణికమోక్షఒత్తిడి దూరం రోజువారీ యోగాతో ఒత్తిడి దూరమవుతోంది. మానసిక ప్రశాంత చేకూరి, ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చక్కని ఔషధం. – పి.హన్మంతరావు, డీఏవో, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసుసులువుగా ఆసనాలు వేస్తున్నా నాకు మైగ్రేన్, వెన్నునొప్పి ఉండేది. యోగా మొదలుపెట్టా. క్రమంగా తగ్గిపోయి, ఉత్సాహంగా మొదట ఆసనాలు కష్టమనిపించినా ఇప్పుడు సులువుగా వేస్తున్నా. – కె.నీరజ, లక్ష్మీనగర్, మంచిర్యాల సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఒత్తిడిని దూరం చేసి, మనస్సును ఏకం చేసి శరీరాన్ని అదుపులో పెట్టేందుకు పలువురు యోగా బాట పడుతున్నారు. ఒంటికి యోగా మంచిదేనని పేర్కొంటున్నారు. ముందే ప్రారంభించాలి ప్రతీ ఒక్కరూ యోగా చేయాలి. వ్యాధులు వచ్చాక చేయడం కన్నా, ముందు నుంచే ప్రారంభిస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయి. – వొడ్నాల శ్రీనివాస్, వ్యాపారి, మంచిర్యాలఇంట్లో అందరం చేస్తాం మా ఇంట్లో అందరం యోగా చేస్తాం. మెరుగైన జీవనం ప్రతిఒక్క రూ అలవాటు చేసుకో వాలి.– కుమార స్వామి, ల్యాబ్ టెక్నీషియన్, మంచిర్యాల ప్రతీ రోజూ చేస్తా ప్రతీ రోజూ యోగా చేస్తాను. వయస్సురీత్యా వచ్చే రుగ్మతలతోపాటు, మానసిక ప్ర శా ంతతను కూడా అందిస్తోంది. – గజ్జెల్లి వెంకటయ్య, విశ్రాంత సింగరేణి కార్మికుడు, మంచిర్యాల పోటీ ప్రపంచంలో జీవనం ఉరుకులు, పరుగులమయమైంది. మానసిక, వ్యక్తిగత ఒత్తిళ్లతో అనారోగ్యం బారినపడుతున్నారు. ఇందుకు ఉపశమనం పొందేలా యోగాసనాలు చేస్తున్నారు. అన్నివర్గాల్లో ఆసక్తి పెరగడం, నిత్యజీవితంలో మానసిక ప్రశాంతత, వ్యాయామ సాధనకు యోగాసనాలు ఓ భాగమైంది. నేడు అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా కథనం. -
బావిలో జారిపడి బాలిక మృతి
నార్నూర్: ప్రమాదవశాత్తు బావిలో జారిపడి బాలిక మృతిచెందిన ఘటన జామ్డా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జామ్డా గ్రామానికి చెందిన పూసం కళాబాయి, షేకు దంపతుల కుమార్తె రత్తుబాయి (15) స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. శనివారం అదే గ్రామానికి చెందిన రైతు వ్యవసాయ క్షేత్రంలో పత్తి విత్తనాలు విత్తేందుకు వెళ్లింది. ఎండ తీవ్రంగా ఉండటంతో దాహార్తి తీర్చుకోవడానికి మధ్యాహ్నం అక్కడే ఉన్న బావి వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయింది. ఈత రాకపోవడంతో నీటిలో కొట్టుమిట్టాడుతుండగా చిన్నారులు గమనించి పొలంలో ఆమె అక్క శ్రీదేవికి చెప్పారు. అక్కడికి చేరుకున్న ఆమె చెల్లిని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహాయంతో రత్తుబాయిని బయటకు తీసి ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదువులో చురుగ్గా ఉండే రత్తుబాయి అకాల మరణం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. తండ్రి షేకు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీ సాయి తెలిపారు. -
వర్షాలు తక్కువగా కురిసే అవకాశం
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశముంది. జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవాల్సి ఉన్నప్పటికీ ఎల్నినీనో ప్రభావంతో ఇప్పటికి రుతుపవనాల జాడలేదు. ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉండనుంది. సెప్టెంబర్ తర్వాత ఎల్నినో ముప్పు తగ్గే అవకాశముంటుంది. కానీ, అప్పటికే పంటల సాగు కాలం ముగిసి వర్షాల అవసరం అంతగా ఉండదు. రైతులు, ప్రజలు సాగునీటి విషయంలో వర్షాలపై ఆధారపడకుండా తక్కువనీటితో సాగయ్యే పంటలు వేయడం ఉత్తమం. – డాక్టర్ శ్రీధర్చౌహాన్, వ్యవసాయ శాస్త్రవేత్త -
రేపు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ రాక
కైలాస్నగర్: వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చై ర్మన్ ముత్తినేని వీరయ్య ఈనెల 21న జిల్లా కేంద్రానికి రానున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బౌనే నగేశ్, ఉగ్గె నానయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్క్లబ్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జె డ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ది వ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలి పారు. జిల్లాలోని దివ్యాంగులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
‘రైతులను వంచిస్తున్న ప్రభుత్వం’
ఆదిలాబాద్టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిస్తోందని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయబోమని ప్రభుత్వం చెప్పడం రైతుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. యాప్లో యూరియా బుకింగ్ విధానాన్ని ఎత్తివేయాలని, రైతువేదికల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని విమర్శించారు. వానాకాలం రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని, జొన్న రైతులకు వెంటనే చెల్లింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు జిల్లా పర్యటనకు రానున్నట్లు తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్ యాసం నర్సింగ్రావు, నాయకులు గండ్రత్ రమేశ్, సేవ్వా జగదీశ్, పరమేశ్వర్, కుమ్రా రాజు, బటు సతీశ్, సూర్యకాంత్, అనిల్, అశోక్, దయానంద్ తదితరులున్నారు. -
‘యూరియా యాప్ వద్దు’
ఇచ్చోడ: రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యాప్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ముఖరా(కె) రైతులు డిమాండ్ చేశా రు. శుక్రవారం మండలంలోని ముఖరా(కె) లోని పంట పొలాల్లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాప్ ద్వారా రైతులకు యూరియా దొరడంలేదని తెలిపారు. మెజార్టీ రైతులకు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవ డం కష్టంగా మారిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో యూరియా రైతులకు ఎ ల్లప్పుడు అందుబాటులో ఉండేదని గుర్తు చేశా రు. వెంటనే యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామస్తులున్నారు. -
వీరనారుల త్యాగాలు చిరస్మరణీయం
ఆదిలాబాద్: వీరనారుల త్యాగాలు చిరస్మరణీయమని రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకులు, బ్రిగేడియర్ (రిటైర్డ్) ఎన్ఆర్.బాబు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీ యూ భవనంలో నిర్వహించిన మాజీ సైనికుల సంక్షేమ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథి గా హాజరయ్యారు. వీర జవాన్ల సతీమణులు, తల్లులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సైనికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చే స్తున్నాయని తెలిపారు. ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా సైనిక సంక్షేమ శాఖను సంప్రదించాలని సూచించారు. ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి రాజేశ్వరరావు, సిబ్బంది షేక్ పైముద్దీన్, కిశోర్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శంకర్దాస్, భాస్కర్రెడ్డి, శివప్రసాద్, భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘బాలికల విద్యాభివృద్ధికి కృషి’
ఇచ్చోడ: బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే అ నిల్జాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.88లక్షలతో చేపట్టిన అదనపు తరగతిగదుల నిర్మాణానికి భూ మిపూజ చేశారు. అనంతరం వారు మాట్లాడు తూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ వారికి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, డీఈవో మాధవి, తహసీ ల్దార్ ఇమ్రాన్, ఎంఈవో బిక్కు, కేజీబీవీ ఎస్వో మల్లిక, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆదర్శ పాఠశాల సందర్శన బోథ్: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను ఎమ్మెల్యే అనిల్జాదవ్ విద్యాశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను పరిశీలించి శుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. వసతిగృహంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి మోటారు కొనుగోలు చేసి, బోరు పంపును బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే, అధికారులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ అనురాధ, పాఠశాల చైర్మన్ శోభ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తరగతిగదుల నిర్మాణానికి శంకుస్థాపన బోథ్ మండల కేంద్రంలోని కేజీబీవీలో సుమారు రూ.38.15 లక్షలతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ గోడం నగేశ్తో కలిసి శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
కనీస వేతనం చెల్లించాలని ధర్నా
కైలాస్నగర్: మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని సీఐటీయూ గౌరవా ధ్యక్షుడు దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు. శుక్రవా రం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ చైర్పర్సన్ బండారు అనూష సతీశ్, కమిషనర్ జగదీశ్గౌడ్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. అనేక ఏళ్లుగా విధులు ని ర్వహిస్తున్న కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయడం లేదని తెలిపారు. కార్మికుల పీఎ ఫ్, ఈఎస్ఐ బకాయిల చెల్లింపుల్లోనూ జాప్యం జ రుగుతోందని విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికుల ను వెంటనే రెగ్యులర్ చేయాలని, సూపర్వైజర్లు, డ్రైవర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్, యూని యన్ అధ్యక్షుడు స్వామి, కార్యదర్శి నగేశ్, సీఐటీ యూ జిల్లా సహాయ కార్యదర్శి సురేందర్, డ్రైవర్ల విభాగం అధ్యక్షుడు జనార్దన్, కార్యదర్శి భిక్షపతి, నీటి విభాగం నాయకులు చిన్నయ్య, పెంటన్న, అజీమ్, శ్యామ్, మల్లేశ్ తదితరులున్నారు. -
ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలి
నీటి వృథాను అరికట్టాలంటే ఇంటింటా ఇంకుడుగుంత నిర్మించుకోవాలి. వానాకాలంలో వరదనీరు వృథా పోకుండా పారే నీటికి నడకనేర్పి, నడిచే నీటిని నిలకడగా ఉంచి, నిలకడగా ఉన్న నీటిని భూమిలోకి ఇంకించేలా చూడాలి. ఇలా నీటి సంరక్షణ చర్యలు చేపడితే భూమిలోకి నీరు ఇంకి భూగర్భజలాలు పెరుగుతాయి. దీంతో నీటి కష్టాలనూ అధిగమించవచ్చు. రైతులు తమ పంట పొలాల్లో బోర్ల చుట్టూ బోర్వెల్ రీచార్జి స్ట్రక్చర్స్, ఫాంపౌండ్స్ను నిర్మించుకుని వర్షపునీటిని సంరక్షించుకోవాలి. – సతీశ్యాదవ్, జిల్లా భూగర్భ జలవనరులశాఖ డిప్యూటీ డైరెక్టర్ -
పొగాకు రహిత విద్యాసంస్థల ఏర్పాటుకు సహకరించాలి
ఆదిలాబాద్టౌన్: పొగాకు రహిత విద్యాసంస్థ ల ఏర్పాటుకు సహకరించాలని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీ కాంత్ పిలుపునిచ్చారు. జిల్లా వైద్యాధికారి సాధన ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించి మాట్లాడారు. విద్యాసంస్థల పరిధి లో పొగాకు ఉత్పత్తుల వినియోగం, విద్యాసంస్థలకు 100గజాల పరిధిలో విక్రయాన్ని నిషేధి ంచినట్లు చెప్పారు. మైనర్లతో పొగాకు ఉత్పత్తులు విక్రయించడం, మైనర్లకు విక్రయించడం నిషేధమని పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తుల వినియోగంతో క్యాన్సర్, అనేక ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. హెచ్ఎం కిషన్, పీఈటీ చరణ్, సోషల్ వర్కర్ చిరంజీవి తదితరులున్నారు. -
‘అంగన్వాడీ’ నియామకాల్లో తిరకాసు!
సాక్షి, ఆదిలాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చే స్తోంది. ఎంపిక ప్రక్రియ కోసం గైడ్లైన్స్ జారీ చేసింది. అభ్యర్థులకు కేటాయించే మార్కుల పారామీటర్స్ను ప్రకటించింది. ఇందులో సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా పది మార్కులు కేటాయించేందుకు అవకాశం కల్పించింది. ఈ తాజా తిరకాసుతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 800 ఖాళీలు గతంలో విద్యార్హతల ఆధారంగా 80, వితంతువులకు ఐదు, అనాథలకు 10, శారీరక, మానసిక సమస్యలున్నవారికి ఐదు మార్కులు కేటాయించేవారు. ఇలా వంద మార్కులకు ఈ అంశాల ఆధారంగా అభ్యర్థులకు కేటాయించి ఎంపిక చేసేవారు. జిల్లాలో 800 ఖాళీలుండగా నిరుద్యోగుల నుంచి తీవ్ర పోటీ ఉండనుంది. సెలక్షన్ కమిటీ సభ్యులు అభ్యర్థులకు వంద మార్కులు కేటాయించేందుకు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందులో ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా 70, వితంతువులకు ఐదు, అనాఽథలకు 10, శారీరక, మానసిక ఇబ్బందులున్నవారికి 10 మార్కులు కేటాయించనున్నారు. మరో 10 మార్కులను ఇంటర్వ్యూ ఆధారంగా కేటాయించేలా పారామీటర్లో పొందుపర్చారు. మెరిట్లో మార్కులు కలిసొచ్చినా ఈ ఇంటర్వ్యూ ద్వారా కలిపే మార్కులు ప్రభావితం చేసే అవకాశముందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇందులో పైరవీలు చోటుచేసుకుంటే అర్హులైన అభ్యర్థులు నష్టపోయే అవకాశముందని ఆందోళనకు గురవుతున్నారు. సెలక్షన్ కమిటీలో సభ్యులు వీరే.. మిషన్ సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0లో భాగంగానే ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్ పోస్టులు భర్తీ చే యాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందుకోసం రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నుంచి ఈనెల 15న సర్క్యులర్ జారీ చేసింది. దశలవారీగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని అందులో పేర్కొంది. మొదటిదశలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లు, గిరిజన ప్రాంతాల్లోని హెల్పర్లనూ భర్తీ చేయాలని సూచించింది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ (ఐటీడీఏ ప్రాంతాలను మినహాయించి)ల పరిధిలో సెలక్షన్ కమిటీ చైర్మన్గా కలెక్టర్, కన్వీనర్గా జిల్లా సంక్షేమాధికారి, సభ్యులుగా ఆర్డీవో, డీఎంహెచ్వో లేనిపక్షంలో అడిషనల్ డీఎంహెచ్లను నియమించింది. ఇక ఐటీడీఏ ప్రాంతాల్లో కలెక్టర్ చైర్మన్గా, జిల్లా సంక్షేమాధికారి మెంబర్ కన్వీనర్గా, ఐటీడీఏ పీవో, సంబంధిత ఆర్డీవో, డీఎంహెచ్వో లేనిపక్షంలో అడిషనల్ డీఎంహెచ్వో సభ్యులుగా ఉండనున్నారు. కాగా, ఇంటర్మీడియెట్ విద్యార్హత ఆధారంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తెలిపారు. ప్రభుత్వం గైడ్లైన్స్ జారీ చేసిందని, నోటిఫికేషన్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. -
విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి
ఉట్నూర్రూరల్: విద్యుత్ సమస్యలు లేకుండా చూ డాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వి ద్యుత్శాఖ అధికారులతో సమావేశమై వానాకాలంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించారు. అనంత రం మండలంలోని నవోదయనగర్లో రెండు అంగన్వాడీ కేంద్రాల్లో ఉచిత విద్యుత్ సరఫరాను ప్రా రంభించారు. విద్యుత్ సౌకర్యం లేని చోట సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరాకు కృషి చేస్తామని చెప్పారు. గురువారం పులి మడుగుకు చెందిన రిటైర్డ్ పోస్ట్మేన్ రాథోడ్ రాంజీ, ఆడే ప్రకాశ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. -
అసాంఘిక చర్యలకు దూరంగా ఉండాలి
ఆదిలాబాద్రూరల్: అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూ చించారు. శుక్రవారం మావల పోలీస్స్టేషన్ పరిధి లోని కేఆర్కే కాలనీలో కార్డన్సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 127 ద్విచక్రవాహనాలు, 26 ఆటోలు, ఒక కారు, అక్రమంగా నిల్వ చేసిన 68 క్వార్టర్ బాటిళ్ల మద్యం, ఆరు బీర్బాటిళ్లు, మూడు లూస్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మారణా యుధాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడు తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారి పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రో డ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ ఆవశ్యకత, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ ప్రయాణం, డ్రంకెన్డ్రైవ్తో కలిగే అనర్ధాల గురించి వివరించారు. సైబర్ మోసాల బారిన పడకుండా అ ప్రతమత్తంగా ఉండాలని సూచించారు. డీఎస్పీలు జీవన్రెడ్డి, ఇంద్రవర్ధన్, సీఐలు ప్రేమ్కుమార్, ఫణిధర్, చంద్రశేఖర్, ఎస్సైలు శ్రీకాంత్, రాధిక, మనీశ్, పోలీస్ జాగిలం రోమా, సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు ఆదిలాబాద్టౌన్: జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రయాణికులు, అనుమానాస్పద వ్యక్తులు, వారి సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలు సే కరించి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశీలించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తనిఖీల్లో నార్కోటిక్స్ గుర్తింపు జాగిలం ‘రోమా’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాగిలం సహాయంతో స్టేషన్ పరిసర ప్రాంతాలు, అనుమానాస్పద సామగ్రి, ప్రయాణికుల లగేజీని పరిశీలించారు. రైల్వే మార్గాల ద్వారా గంజాయి, ఇతర మా దకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పో లీస్శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తోందని తెలి పారు. గంజాయి, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే జిల్లా పోలీసులకు 8712659973 నంబర్లో వాట్సాప్ ద్వారా తెలుపా లని కోరారు. సమాచారం అందించిన వారి వివరా లు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. యు వత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్ కుమార్, నాగరాజు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, రైల్వే భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. -
● అడుగంటిపోతున్న భూగర్భజలాలు ● మూడు మండలాల్లో మరీ తీవ్రంగా.. ● ఎల్నినోతోనే వర్షాభావ పరిస్థితులు ● నీటిపొదుపు పాటించకుంటే ముప్పే
కై లాస్నగర్: జిల్లాకు ఎల్నినో ముప్పుపొంచి ఉంది. దీని ప్రభావంతో ఈ వానా కాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబు తున్నారు. జూన్ నెలాఖరుకు చేరుకుంటున్నా ఇప్పటివరకు ఒక్క భారీ వ ర్షం కురవకపోవడం ఎల్నినో తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పటికే భూ గర్భజలాలు అడుగంటాయి. పాతాళగంగ 9.78 మీటర్ల లోతుకు పడిపోయింది. దీంతో పలు మండలాల్లో ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవడం ఉత్తమమని, వృథా చేస్తే మనుగడ కష్టమేనని భూగర్భజల శా ఖ అధికా రులు హె చ్చరిస్తున్నా రు. జలసంరక్షణ చర్యలు చేపడుతూ నీటి ని ఆదా చేస్తేనే రాబో యే రోజుల్లో నీటి కష్టాల ను అధిగమించే అవకాశము ంటుందని అభిప్రాయపడుతున్నారు. పలు మండలాల్లో ప్రమాద ఘంటికలు జిల్లాలో భూగర్భజలాలు క్రమంగా తగ్గుతూ అడుగంటుతున్నాయి. గతేడాదితో పోల్చితే నీటి దిగువ మట్టం కొంత పరవాలేదనిపించినా పలు మండలాల్లో నీటిమట్టం తగ్గి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గతేడాది జిల్లాలో మే నెలలో భూ గర్భజల మట్టం 11.83 మీటర్ల దిగువకు చేరగా, ఈసారి 9.78 మీటర్ల దిగువనే ఉంది. గతేడాది కంటే 2.06 మీటర్ల ఎత్తున నీటిమట్టం ఉన్నప్పటికీ ఎండల తీవ్రత కారణంగా జిల్లాలో చెరువులు, వాగులు, ప్రాజెక్ట్లు అడుగంటి ఎడారులను తలపిస్తున్నాయి. బోరుబావుల్లోనూ నీటిమట్టం తగ్గి పలుచోట్ల వాటిలోంచి నీరు రాని పరిస్థితి నెలకొంది. కాగా, జిల్లాలోని కొన్ని మండలాల్లో నీటిమట్టం పూర్తిగా తగ్గింది. జిల్లాలోని బోఽథ్, నేరడిగొండ, భీంపూర్ మండలాల్లో నీటిమట్టం పరిస్థితి తీవ్రంగా తగ్గి డ్రై ఏరియాకు చేరుకుంటోంది. దీంతో ఆయా మండలాల్లో బోర్లు, చేదబావుల్లో నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. తగ్గుతున్న నీటి మట్టాన్ని కాపాడుకోవాలంటే వర్షపునీటిని ఒడిసిపట్టేలా సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టి వర్షపునీటిని భూమిలోకి ఇంకించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే వివిధ అవసరాలకు వాడే నీటిని వృథాగా పోనీయకుండా పొదుపుగా వినియోగించాల్సి ఉంటుంది. వర్షాభావ పరిస్థితులతో ఉన్న వనరులను వృథా చేసుకుంటే భవిష్యత్లో నీటి కష్టాలు తలెత్తి మనుగడ కష్టమయ్యే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎల్నినో కారణంగా వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుండటంతో ఎక్కువగా నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు సాగు చేయడం ఉత్తమమని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. -
జాబితా సవరణ పకడ్బందీగా చేపట్టాలి
కై లాస్నగర్: ఎస్ఐఆర్–2026 ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ రాజర్షిషా పాల్గొని జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియకు సంబంధించి బీఎల్వోలు, బీఎల్ఏలకు శిక్షణతో పాటు కిట్ల పంపిణీ ఇప్పటికే పూర్తయింద ని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చే శామని, ఈనెల 23నాటికి అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఓటర్లలో అవగాహన పెంచేందుకు జిల్లా, మండల కేంద్రాల్లో హోర్డింగుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనకు ఏఈఆర్వోలు, ఈఆర్వోలు, డిప్యూటీ డీఈవోలతో నిరంతర తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. మ్యాపింగ్ కాని ఓటర్లను గుర్తించి, అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని బీఎల్వోలను ఆదేశించినట్లు వివరించారు. ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఈ కార్యక్రమంలో సహకారం కోసం ఎలాంటి రాజకీయ అనుబంధం లేని స్థానిక వలంటీర్లనే ఎంపిక చేశామని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రూ, ఆర్డీవో జగదీశ్వర్రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నీట్ (యూజీ) పునఃపరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ పునఃపరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, ఒరిజినల్ గుర్తింపు కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం బజార్హత్నూర్: మండలంలోని గులాబ్తండాలో బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించారు. బాల వికాస ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి, సింగారెడ్డి, శ్రీలక్ష్మీరెడ్డి, ఎంపీడీవో మహేందర్రెడ్డి, సర్పంచ్ రాథోడ్ లక్ష్మీబాయి, శివకుమార్, అరుణ్కుమార్, గోవింద్రావ్ తదితరులున్నారు. -
తెగని పోడు.. ఆగని పోరు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అటవీ భూముల సాగుదారులు, అధికారుల మధ్య పోడు రగడ రగులుతూనే ఉంది. ఏళ్లుగా ఏటా వానాకాలంలో విత్తనాలు వేసే వేళ అటవీ సిబ్బంది, ఆక్రమణదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల పరిస్థితులు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఇక వర్షాలు మొదలైతే గొడవలు మరింతగా జరిగే ఆస్కారం ఉంది. అటవీ ఆక్రమణలపై ఏళ్లుగా శాశ్వత పరిష్కారం లేక సమస్య జఠిలంగా మారుతోంది. ఆక్రమణ భూములు స్వాధీనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక లక్ష ఎకరాలకు పైనే అటవీ భూములు సాగులో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో మూడేళ్లుగా పోడు పట్టాలు ఇవ్వని చోట్ల తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తుండగా ఘర్షణలు జరుగుతున్నాయి. మొదట గిరిజనేతరులకు ఐదు ఎకరాల కంటే అధికంగా సాగులో ఉన్నవారి భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం, సాగుదారులను భూమి వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలోనే 50వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. పులుల రాకపోకల కోసం తడోబా నుంచి కవ్వాల్ వచ్చేలా 1492 చ.కి.మీ. కారిడార్గా గుర్తిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. అయితే అటవీ సమీప ప్రాంత వాసులపై మరింత ఆంక్షలు అమలు కావడంపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పత్తి సాగు ఆరంభంతో చెట్లు నరికి సాగు చేయడం పెరిగిపోయినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. పోడు రైతులు వెదురు, పండ్ల తోటలు, ఇతర ఆహార ధాన్యాల సాగే చేయాల్సి ఉంది. పూర్తి వాణిజ్య పంట పత్తిపైనే అధికంగా ఆధారపడుతున్నారు. పట్టాలిచ్చినా.. ఆగని పోరు గత సర్కారు జీవో 140 ప్రకారం పోడు చేస్తు న్న గ్రామాలను గుర్తించింది. ఆ గ్రామాల్లో నే పోడు కమిటీలను ఏర్పాటు చేసి, దరఖాస్తులు స్వీకరించి, గ్రామ, మండల, డివిజన్, జి ల్లా, రాష్ట్ర స్థాయిలో పరిశీలన తర్వాత పట్టాలు జారీ చేసింది. ఇక గిరిజనుల్లోనూ అర్హులైన వారిని ఎంపిక చేసి 2023 జూన్లో పోడు పట్టాలు మంజూరు చేశారు. ఆ సమయంలో చాలామంది తమకు పట్టాలు రాలేదని మళ్లీ అర్జీలు ఇచ్చారు. ప్రధాన నిబంధనల్లో గిరిజ నులను 2005 వరకు, గిరిజనేతరులను 1930 కంటే ముందు సాగులో ఉన్నట్లుగా లేదా మూడు తరాల వారు ఆ భూమిని అనుభవిస్తున్నట్లుగా రుజువులు చూపించాల్సి రావడంతో అర్జీలు తిరస్కరణకు గురయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 33వేల మంది గిరిజనుల చేతిలో 1.24 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు 32వేల మంది గిరిజనేతరుల చేతిలో 1.02లక్షల ఎకరాలు సాగులో ఉన్నట్లు అర్జీలు వచ్చాయి. అయితే గిరిజనేతరులు చట్టం ప్రకారం అనర్హలు కావడంతో వాటిని తిరస్కరించారు. అయినప్పటికీ తమకు పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల పట్టాలపై రాజకీయ కారణాలతో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. నిత్యం ఘర్షణలే.. ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, కాగజ్నగర్, పెంచికల్పేట, చింతలమానేపల్లి, బెజ్జూరు, ఆదిలాబాద్, మావల, నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్, సోనాల, కడెం, ఉట్నూరు, జన్నారం, దండేపల్లి, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో అటవీ అక్రమాలపై నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఫారెస్టు సిబ్బంది, సాగుదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పరస్పరం దూషణలు, ఎదురుదాడులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సార్లు పోలీసు బందోబస్తుతో అటవీ అధికారులు సాగు ఆక్రమణలను తొలగిస్తున్నారు. దండేపల్లి మండలం కోయపోచగూడ, ఇటీవల చింతలమానేపల్లి మండలం దిందా, కడెం మండలం గొండుగూడ, కెరమెరి మండలం సుర్దాపూర్, ఆదిలాబాద్ రూరల్ మండలం అల్లికోరి పరిధిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అటవీ అధికారులు సాగుదారులపై కేసులు సైతం నమోదు చేశారు. అయితే అర్హులైన వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. -
యోగాతో దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం
ఆదిలాబాద్టౌన్: యోగాతో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని, ప్రతిఒక్కరూ యోగా సాధనను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష పిలుపునిచ్చారు. గురువారం రిమ్స్లో యోగా అవగాహన వాక్ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు యోగా సాధన సమర్థవంతమైన పరిష్కార మార్గమన్నారు. నిత్యం యోగా, వాకింగ్ అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, వైద్యుల సూచనలు పాటిస్తూ ప్రతిరోజూ యోగాసనాలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ సాధన, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, యోగా డే నోడల్ అధికారి డాక్టర్ కస్తాల చంద్రశేఖర్, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ప్రీతల్ రాథోడ్, డిప్యూటీ నోడల్ అధికారులు డాక్టర్ శ్రీకాంత్, అయూష్ వైద్యురాళ్లు మౌనిక, సబోహి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, ఆయూష్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఒకటో తేదీనే వేతనాలు
సాక్షి,ఆదిలాబాద్: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, తదిత ర ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో కలిపి వారికి కూడా సకాలంలో చెల్లించాలని సూచించింది. ఈ నెల 9న ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అన్ని ప్రభు త్వ శాఖలు, సంస్థలకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. జూలై నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నారు. జిల్లాలో రెగ్యులర్ ఉద్యోగులు 9వేల వరకు ఉండగా, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 2500 వరకు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతినెలా 1న గతనెలకు సంబంధించిన జీతాలను అన్నివర్గాల ఉద్యోగులకు చెల్లించాలి. ప్రస్తుతం అదేవిధంగా విడుదల అవుతున్నప్పటికీ వివిధ కారణాలతో ఆలస్యం జరుగుతుందనే అభిప్రాయం ఉంది. పేబిల్లుల ఆలస్యం, హాజరు నమోదు, తనిఖీలు, ఆడిట్, బిల్లుల ఆమోదంలో జాప్యం వంటి కారణాలతో ఉద్యోగులకు సకాలంలో జీతాలు, వేతనాలు అందని పరిస్థితి ఉంది. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలస్యమైతే బాధ్యులపై చర్యలు.. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, గౌరవ వేతనంపై పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి జీతాలు, వేతనాలు ఆలస్యం కాకుండా చెల్లించా లని, జాప్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతినెలా గతనెల 21వ తేదీ నుంచి ప్రస్తుత నెల 20వ తేదీ వరకు హాజరును పరిగణించాలని పేర్కొంది. 25న ట్రెజరీ విభాగానికి సంబంధిత శాఖలు బిల్లులు సమర్పించాలని ఆదేశించింది. నెల చివరి పనిదినం లోపు బిల్లుల పరిశీలన, ఆడిట్, ఆమోద ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో సకాలంలో జమయ్యేలా ట్రెజరీ అధికారులు బాధ్యత వహించాలని పేర్కొంది. సంబంధిత శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డీడీవో)లకు తగిన బడ్జెట్ కేటాయింపు, అవసరమైన పరిపాలన, ఆర్థిక అనుమతులు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించింది. శాఖాధిపతులు ఈ విషయంలో పర్యవేక్షణ చేయాలనిస్పష్టం చేసింది. ఆలస్యమైతే సంబంధి త అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. -
5 లక్షల ఎకరాల్లో..
ఆదిలాబాద్టౌన్: కాసులకు కక్కుర్తిపడి అక్రమార్కులు రైతులను నట్టేట ముంచేందుకు నకిలీ దందా కొనసాగిస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠా జిల్లాలో ఈ దందాను జోరుగా సాగిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మకాం వేసి కొంతమంది డీలర్లతో సత్సంబంధాలు ఏర్పర్చుకొని వారితో మిలాఖత్ అయ్యారు. తక్కువ ధరకే విత్తనాలు ఉన్నాయని, అధిక దిగుబడి వస్తుందని ఆశచూసి రైతులకు అంటగడుతున్నారు. ఆ విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకెత్తినా కాత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా పోలీసులు ఇలాంటి కేటుగాళ్ల ఆటపట్టిస్తున్నారు. ఈ ఏడాది 5 కేసులు నమోదు చేసి పలువురిని రిమాండ్కు తరలించినప్పటికీ ఇంకా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. మేలు రకం అంటూ.. తమ కంపెనీ విత్తనాలు మేలు రకమైనవని, అధిక దిగుబడులు వస్తాయని అన్నదాతలను నమ్మిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలను టార్గెట్ చేశారు. బ్రాండెడ్ గల బీటీ విత్తనాల పేర్లలోని ఒక్కో అక్షరాన్ని అటుఇటూ చేస్తూ, అలాంటి కవర్ ప్రింట్తో అదే మాదిరి పలికే పేర్లతో బ్రాండ్లు తయారు చేస్తున్నారు. నకిలీలను పసిగట్టని రైతులు వాటిని కొనుగోలు చేసి మోసపోతున్న ఘటనలు అనేకంగా చోటు చేసుకుంటున్నాయి. బీటీ డిమాండ్ పెరగడంతో.. కొన్నేళ్లుగా బీటీ రకం విత్తనాల డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. దీంతోపాటు బీటీ–3, లూజ్ విత్తనాలు అమ్ముతున్నారు. చీడపీడల ఉధృతి తగ్గడంతో రైతులు వీటిపైనే ఆధారపడటం, కొన్ని కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించడంతో ఈ నకిలీలకు అనుకూలంగా మారుతోంది. గతంలో పంట ఏపుగా పెరిగినా దిగుబడి రాక చాలా మంది రైతులు నష్టపోయిన ఘటనలు లేకపోలేదు. ఈ ఏడాది బేలలో మొదటిసారి 150 ప్యాకెట్లు, రెండోసారి 81, ఇచ్చోడలో 58 ప్యాకెట్లు, ఆదిలాబాద్లో 742, మొత్తం 1031 ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 5 లక్షల 91వేల సాధారణ సాగు విస్తీర్ణం ఉంది. అత్యధికంగా రైతులు పత్తి పంటను సాగు చేస్తారు. 4 లక్షల 30వేల ఎకరాల్లో పత్తి, 90 వేల ఎకరాల్లో సోయా, 50వేల ఎకరాల్లో కందులు, 25వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగవుతున్నాయి. అయితే రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా పత్తి సాగవుతుండడంతో కేటుగాళ్లు జిల్లాపై దృష్టి పెట్టారు. ఏటా ఖరీఫ్ సాగుకు ముందు పల్లెల్లో తిరగడం, కంపెనీల ప్రచారం చేపట్టడం, గ్రామాల్లోని పేరున్న రైతులకు విత్తనాలను ఉచితంగా అందించడం వంటివి చేస్తున్నారు. గిఫ్టులు, ఆఫర్లతో మభ్య పెడుతూ విత్తనాలు కొనుగోలు చేసేలా ఆకర్షిస్తున్నారు. -
తప్పని తాగునీటి కష్టాలు..!
భూగర్భజలాలు పూర్తిస్థాయిలో అడుగంటిపోవడంతో ఆదిలాబాద్రూరల్ మండలంలోని గుట్టలపై నివాసముండే గ్రామాల ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై చాలా వరకు ఎండగా ఉంటుంది. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. సాయంత్రం పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. బోథ్ మండల కేంద్రానికి చెందిన ఈ రైతు పేరు రాసం ప్రవీణ్ కుమార్. 2022లో తనకున్న ఆరెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశాడు. మూడేళ్ల తర్వాత గెలలు చేతికి రావడం ప్రారంభించాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 16 టన్నులు విక్రయించగా రూ.3,10,000 ఆదాయం వచ్చింది. ఏటా 15 సార్లు గెలలు అమ్మకానికి వస్తాయని, ఆయిల్ పామ్ సాగుకు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం ఉండదని, ఒకసారి పంటను కాపాడుకుంటే ఏటా ఆదాయం పొందవచ్చని రైతు పేర్కొంటున్నాడు. -
సిరులు కురిపిస్తున్న గెలలు!
బోథ్: ఆయిల్ పామ్ సాగుపై జిల్లా రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. సంప్రదాయ పంటల కంటే దీర్ఘకాలికంగా స్థిరమైన రాబడినిచ్చే ఈ వాణిజ్య పంట వైపు స్థానిక రైతులు క్రమంగా అడుగులు వేస్తున్నారు. దీనికి తోడు బహిరంగ మార్కెట్లో ఆయిల్ పామ్ గెలల ధరలు గణనీయంగా పెరగడం, తోటల విస్తీర్ణం, దిగుబడి రోజురోజుకూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుండడంతో పంటను సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరతో రైతుల్లో ఆనందం ఇటీవల కాలంలో మార్కెట్లో ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు ఏకంగా రూ.23,500 కు పెరిగింది. ఈ పెరుగుదల సాగుదారులకు పెద్ద ఊరటగా మా రింది. అంతకుముందు టన్నుకు రూ.21,546 ధర ఉండగా ఇటీవల అదనంగా రూ.1,954 పెరగడంతో రైతులకు ఆర్థికంగా భారీ లాభం చేకూరనుంది. జిల్లాలో సాగు ఇలా.. జిల్లా ఉద్యానవన శాఖ తాజా గణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో మొత్తం 1,009 మంది రైతులు 2,960 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. ప్రస్తుతం పంట దిగుబడి వస్తుండడంతో కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 135 మంది రైతుల వద్ద నుంచి తగిన మద్దతు ధర చెల్లించి 410 టన్నుల తాజా గెలలు సేకరించారు. ఈ ధరల పెరుగుదలతో పాటు మెరుగైన ఉత్పాదకత కారణంగా రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీటి వనరులు ఉన్న రైతులు ఇతర పంటల కంటే తక్కువ నష్టభయం ఉండి, ఏటా స్థిరమైన ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ తోటల వైపే మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ పామ్ ఆయిల్కు డిమాండ్ పెరగడం, ప్రభుత్వం ఉచితంగా మొక్కల సరఫరా, సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ వంటి ప్రోత్సాహకాలు అందించడం కూడా ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.ఆయిల్ పామ్ సాగు : 2,960 ఎకరాలు సాగు చేస్తున్న రైతుల సంఖ్య : 1009 ఇప్పటి వరకు సేకరించిన గెలలు : 410 టన్నులు విక్రయించిన రైతుల సంఖ్య : 135 ప్రస్తుతం గెలల ధర టన్నుకు : రూ.23,500 జిల్లా వివరాలు -
అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి
ఆదిలాబాద్(బేల): కాంట్రాక్టర్లు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం మండలంలోని ఎకోరి, జునోని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకోరిలో రూ.20 లక్షలతో పంచాయతీ భవనం ప్రారంభించామన్నారు. రూ.30 లక్షల వ్యయంతో వంతెన, జునోనిలో రూ.5 లక్షలతో సవారీ బంగ్లా నిర్మాణానికి భూమిపూజ చేశామన్నారు. భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నిర్మాణంలో నాణ్యత లోపించడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో చేపట్టే పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఇన్చార్జి ఎంపీడీవో మహేష్ కుమార్, సర్పంచులు వాడేయ్ రేష్మ, గేడాం కిషోర్, తదితరులు పాల్గొన్నారు. -
‘రైతుల ఆత్మబంధువు కేసీఆర్’
బజార్హత్నూర్: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టి, రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు, కుటుంబ పెద్ద మరణిస్తే రైతుబీమా పథకాలను అమలు చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన కేసీఆర్ రైతుల మనస్సులో ఆత్మబంధువుగా నిలిచిపోయారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గురువారం మండలంలోని కాండ్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అనితరామకిషన్, ఉపసర్పంచ్ గంగయ్య, గిర్నూర్ ఉప సర్పంచ్ గొల్లెన రాజేందర్ బీఆర్ఎస్లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచులు పరచ సాయన్న, రాథోడ్ ప్రవీణ్, సోము రాములు, మెండ్కే సాయినాథ్, అనిల్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
‘బడుల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’
ఆదిలాబాద్టౌన్: పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల మూసివేతకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు గురువారం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి పేద విద్యార్థులపై పడుతున్న ఆర్థికభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీశాంత్, శైలేంద్ర, అంకుశ్, హరి, శివ, అలోక్, ధృవ, హనీష్, మనీష్, రోహిత్, శివచరణ్, రామ్, అజయ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు కృషి చేయాలి
ఉట్నూర్రూరల్: రాత్రి సమయాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం ఉట్నూర్ పోలీస్స్టేషన్లో టీజీఎ స్పీ సిబ్బందికి ఏర్పాటు చేసిన వంటగదిని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. గంజాయి సేవించడం వల్ల కలిగే అనర్ధాలపై యువతకు అవగాహన కల్పించాలన్నా రు. ఆర్థిక నేరాలు, దొంగతనాలు జరగకుండా పటిష్టమైన గస్తీ నిర్వహించాలన్నారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన వెంట ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, సీఐ ఎం.ప్రసాద్, ఎస్సై జి.విజయ్ ఉన్నారు. -
జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి
ఆదిలాబాద్: జిల్లాలో క్రీడా అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీవైఎస్వో అల్లూరి దయానంద్రెడ్డి తెలిపారు. బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన అధునాతన వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని, క్రీడల్లో జిల్లాను అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. సాక్షి: స్టేడియంలో కోచ్లు లేకపోవడంతో క్రీడాకారులకు ఇబ్బందిగా ఉంది. నియామకాలపై ఎలా ముందుకు వెళతారు? డీవైఎస్వో: కోచ్ల నియామకాలపై ముందుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్తాం. సాక్షి: గ్రామీణ స్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయడానికి మీ ప్రణాళిక ఏమిటి? డీవైఎస్వో: మనం నిర్వహించే క్యాంపుల్లో వారిని చేర్చుకుని తగిన శిక్షణ ఇస్తాం. స్కూల్ హెడ్మాస్టర్లు, తహసీల్దార్, ఎంపీడీవోల సహకారంతో మోటివేషన్ ఇప్పిస్తాం. రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రయత్నిస్తాం. సాక్షి: పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మౌలిక సదుపాయాలు సరిగా లేవు.. ఎలాంటి చర్యలు చేపడుతారు? డీవైఎస్వో: ముందుగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. రెండో ప్రాధాన్యతగా లైటింగ్స్ ఏర్పాటు, తర్వాత మైదానం అభివృద్ధి చేస్తాం. వాకర్స్కు ఇబ్బంది కలగకుండా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే కొన్ని పనులు శాంక్షన్ అయ్యాయి. ట్రాక్, ఇతర సౌకర్యాలు వందశాతం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. సాక్షి: ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు నిలిచిపో యి చాలా కాలమైంది.. వాటి పరిస్థితి ఏంటి? డీవైఎస్వో: ఆ నిర్మాణ పనులు మున్సిపల్ నిధులతో మొదలయ్యాయి. అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రయత్నిస్తా. సాక్షి: ఒక సీనియర్ పీడీగా జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? డీవైఎస్వో: గ్రామీణ క్రీడాకారులు మరుగున పడిపోతున్నారు. ముందుగా ఆయా ప్రాంతాల నుంచి పీడీల ద్వారా వారిని వెలుగులోకి తీసుకువస్తాం. తొలుత జిల్లా తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్లేలా శిక్షణ ఇస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపుతాం. జిల్లాను క్రీడల్లో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా శ్రమిస్తా. సాక్షి: స్టేడియంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఫీజులు వసూలు చేసుకుంటూ ప్రభుత్వ మైదానాన్ని ఉపయోగిస్తున్నారు? ఈ అంశంపై ఎలా దృష్టి సారిస్తారు? డీవైఎస్వో: ముందుగా క్రీడా పాఠశాల విద్యార్థుల సాధనకు ఇబ్బందులు లేకుండా ట్రాక్ చుట్టూ ఫెన్సింగ్ వేయిస్తాం. మిగతా దాంట్లో నడక సాధకులు వెళ్లేలా పెద్ద ట్రాక్ అభివృద్ధి చేస్తాం. ఉద్యోగాల కోసం సాధన చేసే నిరుద్యోగులకు ప్రత్యేక స్థలం కేటాయిస్తాం. సాక్షి: స్పోర్ట్స్ స్కూల్ అప్గ్రేడేషన్ కోసం ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? ఇంటర్ వరకు ఉన్నతీకరించే అవకాశాలు ఉన్నాయా? డీవైఎస్వో: జూనియర్ కాలేజీ వరకూ ఉన్నతీకరించవచ్చు. కానీ, మనకు సదుపాయాలు అందుబాటులో లేవు. భవనం లేదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. అప్గ్రేడ్ అయితే బాగుంటుంది. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది. ఈ రైతు పేరు కాడిగిరి నాసర్యాదవ్. ఈయనది తాంసి. యాసంగిలో జొన్న సాగు చేయగా 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మండలకేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో మే 18న విక్రయించాడు. వీటికి సంబంధించి రూ.2,95,920 రావాల్సి ఉంది. నెల గడుస్తున్నా పైసలు చేతికందలేదు. వానాకాలం సీజన్ మొదలు కావడంతో పెట్టుబడి కోసం ప్రభుత్వ బ్యాంకు, ప్రైవేట్లో కలిపి రూ.లక్షకు పైగా అప్పు చేశాడు. ఇతనొక్కడే కాదు.. జొన్న దిగుబడులు విక్రయించిన వేలాది మంది రైతులది ఇదే పరిస్థితి. -
పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ అనూషతో కలిసి సుమారు రూ.18.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆదిలాబాద్ను అభివృద్ధి చెందిన పట్టణంగా మార్చడమే లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్ రానున్నాయని, తద్వారా పట్టణం పారిశ్రామికంగా, ఆర్థికంగా గొప్ప పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మా ట్లాడుతూ పట్టణంలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధే లక్ష్యమని పేర్కొన్నారు. గాంధీ పార్క్ ప్రహరీని రూ.26 లక్షలతో, పిట్టలవాడ కాలనీలో రూ.10 లక్షలు, రాంనగర్ కాలనీలో రూ.32 లక్షలు, డాల్డా కంపెనీ ఏరియాలో రూ.25 లక్షల వ్యయంతో కూడి న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, ఈఈ అరుణ్ కుమార్, డీఈలు, ఏఈలు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గడువులోపు పూర్తి చేయాలి
కై లాస్నగర్: జిల్లాలో గృహ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల అనుమతులు, నిర్మాణాల పురోగతి, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు, మౌలిక వసతుల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మావల, కేఆర్కే కాలనీలోని డబుల్ బెడ్రూం ఇళ్లకు అవసరమైన మౌలిక వసతులు, పెండింగ్ పనులు జూలై 15 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అనుమతుల విషయంలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి తొలి ప్రాధాన్యం కల్పించాలని, దీనికి సంబంధించిన నివేదికలు త్వరితగతిన సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రవి, హౌసింగ్ పీడీ శంకర్, ము న్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఆరోపణలు అవాస్తవం’
కై లాస్నగర్: సిరికొండలోని కొనుగోలు కేంద్రంలో జొన్నలు కొనుగోలు చేయలేదని, అదనపు ఖర్చులు అడిగారని జరుగుతున్న ప్రచారం, ఆరోపణలు అవాస్తవమని జిల్లా మార్క్ఫెడ్ మేనేజర్ మహేశ్కుమార్ అన్నారు. మంగళవా రం డీపీఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూగురే పాండురంగ్ (48) అనే రైతు తన జొన్న పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన విషయం వాస్తవమేనని, నిబంధనల ప్రకారం ఇతర రైతుల మాదిరిగానే ఆయన సరుకును కూడా తూకం వేసినట్లు తెలిపారు. ఈనెల 6న రైతుకు చెందిన 70 బస్తాల (35 క్వింటాళ్లు) జొన్నలను కొనుగోలు చేసి, రశీదు (తక్పట్టి) జారీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం బయోమెట్రిక్ ద్వారానే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే సరుకు లోడింగ్కు ముందు రైతు తన దస్తావేజులను కేంద్రంలో సమర్పించకుండా తిరిగి తీసుకెళ్లారని, వాటిపై ఉన్న లాట్ నంబర్ల ఆధారంగానే లోడింగ్ చేయడం సాధ్యమవుతుందని చెప్పా రు. డాక్యుమెంట్లు తీసుకువచ్చి లోడింగ్ పూర్తి చేయాలని పలుమార్లు కోరినా రైతు తిరిగి కేంద్రానికి రాకపోవడంతో లోడింగ్ ప్రక్రియ పెండింగ్లో ఉందన్నారు. కొనుగోలు కేంద్రంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన రైతులు, ప్రజలను కోరారు. -
జొన్నల పైసలు రాలే
సాక్షి, ఆదిలాబాద్: యాసంగిలో జొన్న దిగుబడులు విక్రయించిన రైతులు పంట అమ్మిన డబ్బులకోసం వారాల తరబడి ఎదురుచూస్తున్నారు. పంట విక్రయించిన ఏ ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు రూ పాయి చేతికందని పరిస్థితి. ఓవైపు వానాకాలం సీజ న్ మొదలైంది. సాగు పెట్టుబడికి చేతిలో చిల్లి గవ్వ లేక రైతులు బయట అప్పు చేయాల్సిన దుస్థితి. ఒకవేళ సమయానికి ఆ డబ్బులు అంది ఉంటే కొంతలో కొంత పెట్టుబడి భారం తగ్గి రైతుకు వెసులు బాటుగా ఉండేది. దిగుబడి బారెడు.. కొన్నది మూరెడు జిల్లాలో యాసంగిలో రైతులు లక్ష ఐదు వేల ఎకరా ల్లో జొన్న సాగు చేశారు. ఎకరానికి 15 నుంచి 25 క్వింటాళ్ల చొప్పున 16లక్షల నుంచి 21లక్షల క్వింటా ళ్ల వరకు దిగుబడి వచ్చింది. మే మొదటి వారంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్న కొనుగోళ్లను ప్రారంభించారు. జిల్లాలో 26 కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను విక్రయించారు. అయితే కొనుగోళ్లలో పరిమితి విధించడంతో రైతులు పూర్తిస్థాయిలో మద్దతు ధర కు పంటను అమ్ముకోలేని దుస్థితి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.3,699 అందినా మొత్తం దిగుబడికి వర్తించలే. గత్యంతరం లేక మిగతా పంటను రైతులు ప్రైవేట్లో విక్రయించుకుంటే రూ.2500 నుంచి రూ.3వేల లోపే పలకడం గమనార్హం. ఇది లా ఉంటే మార్క్ఫెడ్ కొనుగోళ్లు ముగిసే వరకు కొన్నది కేవలం స్వల్పమే. ఇంకా మార్కెట్లోనే నిల్వలు .. కొనుగోళ్లు ముగిసి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆదిలాబాద్, ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్యార్డుల్లో జొన్నల నిల్వలు లోడింగ్కాక భారీగా పేరుకుపోయాయి. సుమారు 2వేల టన్నుల వరకు నిల్వ లు ఇంకా గోదాంలకు తరలించాల్సి ఉంది. కూలీల కొరత, లోడింగ్ చేసేందుకు లారీలు రాకపోవడంతో ఈ సమస్య అఽధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లాలో జొన్న కొనుగోళ్ల వివరాలు విక్రయించిన రైతులు : 25,560 కొనుగోలు చేసిన జొన్నలు : 73 మెట్రిక్ టన్నులు రైతులకు రావాల్సిన డబ్బులు : రూ.270 కోట్లు ఒకట్రెండు రోజుల్లో డబ్బులు జొన్నలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒ కట్రెండు రోజుల్లో రైతులకు డబ్బులు రానున్నాయి. ఈ సీజన్లో 7లక్షల 50వేల క్వింటాళ్ల వరకు మార్క్ఫెడ్ లక్ష్యం కాగా స్వల్పదూరంలోనే నిలిచాం. ప్రభుత్వం నుంచి డబ్బులు వి డుదలైన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జ మచేస్తాం.– మహేశ్కుమార్, డీఎం మార్క్ఫెడ్ -
తొమ్మిది కాదు.. నాలుగే!
కై లాస్నగర్: ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)గ్యాస్ కనెక్షన్దారులకు కేంద్రం షాకిచ్చింది. లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల పరిమితిని కుదిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏడాదికి తొమ్మిది రాయితీపై అందిస్తుండగా తాజా గా ఐదు కోత విధించింది. నాలుగుకు పరిమితం చేసింది. జిల్లా వ్యాప్తంగా 36,960 కుటుంబాలపై అదనపు భారం పడే అవకాశముంది. వంటకు తంటాలు పడకూడదనే.. దారిద్య్రరేఖకు దిగవనున్న నిరుపేదలు కట్టెలపొయ్యిపై వంటకు తంటాలు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. తెల్లకార్డు కలిగిన వారికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందజేసింది. స్టౌ, రెగ్యులేటర్ పైపుతో పాటు సిలిండర్ సైతం ఉచితంగానే పంపిణీ చేసింది. సాధారణ, దీపం కనెక్షన్ దారులకు రూ.47సబ్సిడీని అందిస్తున్న కేంద్రం ఉజ్వల లబ్ధిదారుల ఖాతాలో మాత్రం రూ.300 జమచేస్తోంది. ఈ సబ్సిడీని మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది. కుదింపు ఇలా.. ఉజ్వల గ్యాస్ కనెక్షన్దారులకు 14.2 కేజీల గ్యాస్ సిలిండర్లను నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 సిలిండర్లను అందించింది. స్కీం ప్రారంభం నుంచి తొమ్మిదేళ్ల పాటు లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీని జమ చేసింది. ఒక్కో కుటుంబం ఏడాదికి సగటున 6నుంచి 7 సిలిండర్లు మాత్రమే వినియోగిస్తుందని గుర్తించిన కేంద్రం సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తొమ్మిదికి కుదించింది. లబ్ధిదారులకు రెగ్యులర్గా రాయితీ జమ చేస్తూ వస్తోంది. తాజాగా పశ్చిమాసియా యుద్ద ప్రభావం ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై తీవ్రంగా చూపింది. ఈ క్రమంలో ఆయా గ్యాస్ కనెక్షన్ల బుకింగ్ విధానంలో మార్పు చేసింది. అలాగే ఉజ్వల కనెక్షన్దారులకిచ్చే సబ్సిడీ సిలిండర్లలో ఐదు కోత విధించింది. ఇక ఏడాదికి నాలుగు సిలిండర్లకు మాత్రమే రూ.300 చొప్పున సబ్సిడీ అందనుంది. ఐదో సిలిండర్ తీసుకున్నటైతే సదరు లబ్ధిదారు ప్రస్తుతం ఉన్న ధర రూ.1,021 పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. కేంద్ర నిర్ణయంపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే బొజ్జు
ఉట్నూర్రూరల్: ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు మంగళవారం త న జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశా రు. పుష్పగుచ్చం అందించి సీఎం ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్యే బొజ్జుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురా రోగ్యాలు ప్రసాదించాలని, నిరంతరం ప్రజా సేవలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి మ రింత కృషి చేసి భవిష్యత్లో మరెన్నో విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. దాడి కేసులో ఆరుగురు యువకుల రిమాండ్కాసిపేట: మండలంలోని సోమగూడెం(కె)లో గత నెలలో జరిగిన దాడి కేసులో ఆరుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మంగళవారం పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించా రు. మండలంలోని ధర్మరావుపేటకు చెందిన ముచ్చర్ల సంపత్, అతని స్నేహితులు మందమర్రి టోల్గేట్ సమీపంలోని గోపాల్ దాబా వ ద్దకు వెళ్లగా అక్కడ కొంతమంది వ్యక్తులతో పా ర్సిల్ విషయమై వాగ్వివాదం జరిగింది. అక్కడి నుంచి వచ్చి సోమగూడెంలోని బంధువుల ఇంటివద్ద ఉండగా దాబా వద్ద ఉన్న వ్యక్తులు ఆయుధాలతో అక్కడికి వచ్చి వారిపై దాడికి పాల్పడడంతో సంపత్, అల్లంల ప్రశాంత్, బొ మ్మనవేణి వరప్రసాద్, ఆకుల రాణాప్రతాప్కు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు దనకుంట్ల మునియప్ప, మహమ్మద్ అబ్బు, మహమ్మద్ సమీరుద్దీన్, అఖిల్, మల్యాల చందు, షేక్ ఫేరోజ్ను అరెస్టు చేశారు. నిందితుల ను కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో ఆసిఫాబాద్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. గుప్తనిధుల కోసం తవ్వకాలుకాగజ్నగర్రూరల్: మండలంలోని ఈజ్గాం శివారులోని పంటచేలలో గుప్త నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం శివారులోని పంట చేనులో పొక్లెయిన్తో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెట్టు సమీపంలో తవ్వి పూడ్చిపెట్టారని ప్రచారం జరుగుతోంది. ముఠాను పట్టుకుని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్గా రమేశ్మంచిర్యాల క్రైం: మంచిర్యాల జిల్లా స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్గా పట్టణానికి చెందిన సమిట్ల రమేశ్ను నియమిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఏడాదిపాటు ఉంటుందని రమేశ్ తెలిపారు. కాగా రమేశ్ 20 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. స్థానిక న్యాయవాదులు, బార్కౌన్సిల్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
‘కడెం’కు రక్షణగా ట్రాష్రాక్
కడెం: నిర్మల్–మంచిర్యాల జిల్లాల ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ కడెం ద్వారా 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. కడెం ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా కడెం, దస్తురాబాద్, జన్నారం, దండెపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రధాన కాలువకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం ట్రాష్రాక్ నిర్మాణం చేపట్టింది. వర్షాకాలం సమీపిస్తున్నందువల్ల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యకు చెక్ కడెం ప్రాజెక్ట్ వరదల సమయంలో వచ్చే భారీ దుంగలు, చెత్తాచెదారం ప్రధాన(ఎడమ) కాలువ గేట్లలో ఇరుక్కుని, కాలువ గేట్లు ఎత్తేందుకు, దించేందుకు ఇబ్బందులు తలెత్తేవి. గతేడాది కాలువ గేటులో భారీ దుంగ ఇరుక్కుపోవడంతో గేటును కిందకు దించలేకపోయారు. ఇలాంటి సమయంలో సాగునీరు వృథాగా పోయో పరిస్థితి నెలకొంటుంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు రక్షణగా రూ.2.58 కోట్ల వ్యయంతో ట్రాష్రాక్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కాలువ సమీపంలో ఈ ట్రాష్రాక్ నిర్మాణం చేపట్టడంతో వరదల సమయంలో వచ్చే భారీ దుంగలు, కట్టెలు, చెత్తాచెదారం అడ్డుకుంటుంది. దీంతో ప్రధాన కాలువకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగునీటిని దిగువకు వదిలేందుకు ఆస్కారం ఉంటుంది. కాలువకు అడ్డుకట్టగా భారీ పిల్లర్లను నిర్మించి, మధ్యలో భారీ ఇనుప జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన కాలువకు ప్రస్తుతం ఉన్న గేట్లను తొలగించి వాటిస్థానంలోనూతన గేట్లను అమర్చనున్నారు. ప్రాజెక్ట్పై ప్రభుత్వం ఫోకస్ కడెం ప్రాజెక్ట్ మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022, 2023లో కడెం ప్రాజెక్ట్కు వచ్చిన భారీ వరదల కారణంగా ప్రాజెక్ట్ డేంజర్జోన్లోకి వెళ్లింది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.12 కోట్ల నిధులతో ప్రాజెక్ట్ వరద గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం రూ.2.58 కోట్లతో ప్రాజెక్టు ఎడమ కాలువకు రక్షణగా ట్రాష్రాక్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ నెలాఖరుకు పూర్తి కడెం ప్రధాన కాలువలోకి భారీ దుంగలు వెళ్లి కాలువ గేట్లు ఎత్తేందుకు, దించేందుకు ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ట్రాష్రాక్ నిర్మాణం చేపడుతున్నాం. వర్షాకాలం సమీపిస్తున్నందువల్ల పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల చివరినాటికి పనులు పూర్తి చేయిస్తాం. – వీరన్న, డీఈఈ, కడెం ప్రాజెక్ట్ -
సంకల్ప్ ప్రాజెక్ట్కు రిమ్స్ ఎంపిక
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో మాతాశిశు మరణాలను నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్ప్ ప్రాజెక్ట్ను అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని వసతులు, మెరుగైన వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై మంగళవారం హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర సెక్రెటరీ క్రిస్టినా జడ్ చోంగ్తు ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డీసీహెచ్ఎస్ డా.ఉపేందర్ జాదవ్, రిమ్స్ పిడియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.వంశీకృష్ణ, నర్సింగ్ సిబ్బంది అరుణ, సిమ్మి కుమారి, తదితరులు పాల్గొన్నారు. -
● 19 మండలాల్లో వర్షాభావం ● విత్తనాలు వేసిన రైతుల్లో గుబులు ● త్వరితగతిన వర్షాలు పడితేనే ఊరట ● లేనిపక్షంలో విత్తనం నష్టమే!
వ్యత్యాసం – 56 శాతం స్థితి వర్షాభావంసాధారణ 82.6 మి.మీ.లు సాక్షి,ఆదిలాబాద్: ఈ వానాకాలంలో చిరు జల్లులు మినహా భారీ వర్షాలు నమోదు కాలేదు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఇప్పటివరకు 82,870 ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించి రైతులు విత్తనాలు విత్తినట్లు చెబుతున్నారు. అనధికారికంగా సుమారు 2లక్షల ఎకరాల వరకు పొడిదుక్కుల్లోనే విత్తనాలు వేసినట్లు రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. జిల్లాలో వర్షాధారంగానే పంటల సాగు ఉండడంతో విత్తనాలు వేసిన రైతులు నింగి వైపు చూస్తున్నారు. రెండు రోజుల్లో వానలు లేకుంటే విత్తన దశలోనే రైతు తీవ్ర నష్టాన్ని చవిచూసే పరిస్థితి. భారీ వర్షాలు ఏవి.. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నైరుతి ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రుతుపవనాలకు ముందు కురిసే తేలికపాటి వర్షాలే ఇప్పటివరకు నమోదైన ట్లు చెబుతున్నారు. గతేడాది వానాకాలం సీజన్ కంటే ముందే మే చివరిలోనే జిల్లాలో భారీ వర్షాలు కు రిశాయి. దీంతో రైతులు మొదటి వారంలోనే పెద్ద ఎత్తున విత్తనాలు వేశారు. అప్పట్లో ఆ వర్షాలు రై తుకు కలిసి వచ్చినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నా రు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో 21 మండలాలు ఉండగా తలమడుగు, సొనాల మినహాయిస్తే మిగతా అన్ని మండలాల్లో వర్షాభావ పరి స్థితులే నెలకొన్నాయి. బజార్హత్నూర్ మండలంలో చుక్కవాన పడలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు సాగు విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. సమయ ఆందోళన.. జూన్ మొదటి రెండు వారాల్లోనే రైతులు పొడిదుక్కుల్లోనే విత్తనాలు వేస్తారు. వర్షాలు కురిస్తే అవి మొలకెత్తుతాయనే ఆశతో ముందుకెళ్తారు. జూన్ చివరి వరకు కూడా పత్తి విత్తనాలు వేయడాన్ని సాధారణ సాగుగానే పరిగణిస్తారు. జూలై మొదటి వారంలో కొంత ఆలస్యంగా, ఆ తర్వాత వారాన్ని పూర్తిగా ఆలస్యంగా పరిగణిస్తారు. సోయా విషయానికొస్తే జూలై లోపే విత్తుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే సరైన సమయంలో సాగుతోనే ఉత్పాదకత పెరుగుతుందని రైతుల్లో విశ్వాసం. ఆలస్యంగా సాగు చేయడం ద్వారా చీడపీడలు, ఎదుగుదల లోపం, కాత, పూత సరైన సమయంలో రాకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమై పంట నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగా జూన్లోనే విత్తనాలు వేసేందుకు రైతులు మొగ్గుచుపుతుంటారు. నింగి వైపు రైతు చూపుబజార్హత్నూర్ మండలంలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 90 మి.మీ.ల వర్షపాతం కురువాలి. ఇక్కడ ఒక్క మి.మీ. కూడా నమోదు కాలేదు. దీంతో రైతులు విత్తనాలు వేసేందుకు సంకోచించే పరిస్థితి. అయినా 800 ఎకరాల్లో పత్తి విత్తనం పడింది. వరుణుడి కరుణ కోసం కర్షకులకు ఎదురుచూపు తప్పట్లేదు. తొందరపడొద్దు.. ఈనెల 18, 19 తేదీల్లో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు తేలికపాటి వానలే కురిశాయి. వర్షాధారంగానే పంటలు సాగు చేసే పరిస్థితి ఉండడంతో రైతులు మంచి వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేయడం శ్రేయస్కరం. జూన్ చివరి వరకు సమయం ఉన్నందున తొందరపడొద్దు. – శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం, ఆదిలాబాద్ అందుబాటులో పత్తి విత్తనాలు జిల్లాలో ఇప్పటివరకు రైతులు రెండున్నర లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయించారు. 11లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. – రవీందర్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి -
సీసీఐ పునరుద్ధరించే దాకా పోరు
ఆదిలాబాద్టౌన్: సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ లక్ష్యంగా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ‘హలో యువత.. చలో సీసీఐ పరిశ్రమ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర మంత్రులు గతంలో హామీ లు ఇచ్చారని, అయితే ప్రస్తుతం పరిశ్రమను తుక్కు కింద విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్, విద్యుత్ శాఖలకు సీసీఐ బకా యిలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకో వడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు దర్శనాల మల్లేశ్, అఖిలపక్ష నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు బండి దత్తాత్రి, మెట్టు ప్రహ్లాద్, గోడం గణేశ్, యూనుస్ అక్బానీ, వెంకటనారాయణ, రాజు, సతీష్, కస్తాల ప్రేమల, ఆయా పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు పటిష్ట బీట్ వ్యవస్థ
ఆదిలాబాద్టౌన్: జిల్లావ్యాప్తంగా గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు నేరాలు అరికట్టేందుకు రాత్రి సమయాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్లో జిల్లా పోలీసు అధికారులతో మంగళవారం నెలవా రీ నేర సమీక్ష నిర్వహించారు. కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ బాధితులకు త్వరితగతిన న్యా యం జరిగేలా దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరంతరం గస్తీ నిర్వహిస్తూ పటిష్టమైన బీట్ వ్యవస్థ అమలు చేయాలన్నారు. గంజా యి రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు రాత్రి వేళల్లో బస్సులు తదితర వాహనాల్లో నార్కోటిక్ జాగిలాల సాయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు డీడీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. స్టేషన్లలో 5ఎస్ విధానంతో పాటు వర్టికల్ విధానం పూర్తిస్థాయిలో అమలు చేయాలని, సీసీటీఎన్ఎస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు నవీకరించి పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యా ఖ్యలు, శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విధుల్లో ప్రతిభ కనబ ర్చిన 40 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఇందులో అదనపు ఎస్పీ పి.మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్సాయి కొట్టే, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఇంద్రవర్ధన్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, డీసీఆర్బీ, ఐటీ కోర్, ఎన్ఐబీ, కమ్యూనికేషన్, ఫింగర్ప్రింట్ విభాగాల అధికారులు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రెక్కలొచ్చే దిశగా..
కై లాస్నగర్: జిల్లాకేంద్రంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఈ ప్రాంతవాసుల కల సాకారం దిశగా అడుగులు వేగవంతమయ్యాయి. మంగళవారం ఓఎల్ఎస్ సర్వే ప్రారంభమైంది. విమానాయాన శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. పారదర్శకంగా భూసేకరణ ప్రక్రియ : కలెక్టర్ ఆదిలాబాద్ జాయింట్ యూజర్ (డిఫెన్స్–సివిల్) ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో చేపడతామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే శంకర్, బెంగళూరు కు చెందిన ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులు, రాష్ట్ర సి విల్ ఏవియేషన్ డైరెక్టర్ భరత్రెడ్డితో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయ భూసేకరణ చర్యలు వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే 700 ఎకరా ల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అదనంగా డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎయి ర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) కోసం 1,500 ఎకరాలు, సివిల్ ఏవియేషన్ రన్వే విస్తరణ కోసం మరో 80 ఎకరాలు కేటాయించేందుకు ప్రాథమిక ఆమోదం లభించిందన్నారు. జియో కోఆర్డినేట్ల ఆధారంగా భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామ ని సీఎంవో కార్యాలయం, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి రక్షణ శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీకి భూములు అప్పగిస్తామని తెలిపారు. ఎంపీ నగేశ్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన లొకేషన్ల పరిశీలన పూర్తయిందన్నారు. రక్షణశాఖ కోరిన 1,500 ఎకరాల భూసేకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. జిల్లా అధికారులతో కలిసి మ్యాప్ల ఆధారంగా మైక్రో లెవెల్ సమీక్ష నిర్వహించామని, ప్రాజెక్టు వేగవంతానికి ఈ సమావేశంతో కీలక ముందడుగు పడినందన్నారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, జా యింట్ యూజర్ ఎయిర్పోర్ట్ భూసేకరణపై స్ప ష్టత వచ్చిందన్నారు. గతంలో జారీ చేసిన 700 ఎకరాల జీవో ప్రకారం పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 800 ఎకరాల అనుమతుల ప్రక్రియ వేగంగా సాగుతోందని చెప్పారు. తదుపరి విధానపరమైన నిర్ణయాల కోసం త్వరలో ఎంపీ నేతృత్వంలో ఢిల్లీలో ఉమ్మడి సమావేశం జరగనుందన్నారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోందని, జిల్లా అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, ఎస్.రాజేశ్వర్, ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులు జేపీ సబర్వాల్, ఎస్.జి.హెడ్గే, ఎస్.కె.రెడ్డి, ఆర్డీవో జగదీశ్వర్, ల్యాండ్ సర్వే ఏడీ ప్రభాకర్, తహసీల్దార్లు శ్రీనివాస్, గోవింద్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన .. ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులు, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర అధికారులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో మైక్రో లెవల్ సర్వే చేపట్టారు. ఎరోడ్రమ్తో పాటు ఇందిరమ్మకాలనీ, అనుకుంట, సీసీఐ, ఇందిరమ్మ కాలనీ వంటి ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించారు. రన్వే విస్తరణతో పాటు ఇతరత్రా సాంకేతిక అంశాల ఆధారంగా మ్యాపుల ప్రకారం భూములను పరిశీలించి ఒక అంచనాకు వచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో సేల్స్మెన్కు గాయాలు
కెరమెరి: మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన డీఆర్ డిపో సేల్స్మెన్ చహకటి రాజేశ్వర్ తెల్లవారుజామున తన కుమారుడు జగదీశ్వర్ను బైక్పై ఎక్కించుకుని ఆసిఫాబాద్కు బయలుదేరాడు. మానిక్గూడ సమీపంలో వాహనానికి పందులు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. జగదీశ్వర్కు స్వల్పంగా రాజేశ్వర్కు తీవ్రగాయాలయ్యాయి. 108లో ముందుగా ఆసిఫాబాద్ అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జగదీశ్వర్ మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
తలమడుగు: చేపలు పట్టడానికి వెళ్లి విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కొత్తూరుకు చెందిన కాటిపల్లి కపిల్రెడ్డి (31)మంగళవారం అతని స్నేహితులు శైలేందర్, రామయ్య, ప్రమోద్, గంగయ్యతో కలిసి చేపలు పట్టేందుకు సమీపంలోని వాగుకు వెళ్లారు. విద్యుత్ తీగల సహాయంతో చేపలు పట్టే ప్రయత్నంలో కపిల్రెడ్డి షాక్కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాధిక తెలిపారు. అనుమానాస్పదంగా ఒకరు..తానూరు: అనుమానాస్పదంగా ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని బోల్సాలో పాలేరుగా పనిచేస్తున్న కందురోళ్ల పీరాజీ (35) సోమవారం రాత్రి యజమాని పశువుల పాకకు వెళ్లి అక్కడే పడుకున్నాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన తోటి పాలేర్లకు చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్పీ సాయికిరణ్, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా చాకు, మృతదేహాంపై చింపేసినట్లు ఉన్న చొక్కా, కల్లు సీసాలు, మద్యం బాటిళ్లు గుర్తించారు. భూ వివాదం విషయమై పాత కక్షలతో సమీప బంధువులే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బెల్తరోడా–భైంసా రహదారిపై ధర్నా నిర్వహించారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..దిలావర్పూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంజులాపూర్కు చెందిన ఉప్పల గణేశ్ (57)కు దిలావర్పూర్లోని పాత బస్టాండ్ ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉంది. దానిని ము జ్టిగ ముత్యంకు కౌలుకు ఇచ్చాడు. మంగళవారం పంటచేను చూసేందుకు వచ్చాడు. ముత్యంను బస్టాండ్ వరకు రమ్మని పిలవడంతో అతని ఎలక్ట్రిక్ వాహనంపై వెళ్తుండగా నిర్మల్–భైంసా రహదారిపై వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గణేశ్ అక్కడికక్కడే మృతి చెందగా ముత్యంకు గాయాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. యువతి అదృశ్యంసిర్పూర్(టి): మండలంలోని చీలపెల్లికి చెందిన నిఖిత(21) ఈ నెల 15న రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదని, కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్ తెలిపారు. గ్రామానికి చెందిన యు.సునీత కుమార్తె నిఖిత 15న రాత్రి బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదన్నారు. గతంలో ఆసిఫాబాద్ మండలం నవేగాంకు చెందిన రెగర్ల వెంకటేష్ నిఖితను తీసుకెళ్లి సిర్పూర్(టి)లో వది లేసి వెళ్లిపోయాడన్నారు. ఇప్పుడు కూడా తమ కూ తుర్ని అతనే తీసుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సునీత ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బహుదూరపు బాటసారులు
పొట్టకూటి కోసం పిల్లాపాపలతో వందల మైళ్లు ఎండనకా..వాననకా వలస జీవులు ప్రయాణం సాగిస్తున్నారు. రాజస్థాన్ నుంచి జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలు అధికంగా ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వస్తుంటారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనిముట్ల తయారీ కోసం నిర్మల్, భైంసా, ఆదిలాబాద్ ప్రాంతాలకు రాజస్థాన్ నుంచి వలస కార్మికులు ఐదారు కుటుంబాలు చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకే వాహనంపై నిర్మల్ జిల్లా కేంద్రం నేషనల్ హైవే–61 మీదుగా భైంసా వైపు వెళ్లారు. పిల్లాజెల్లతో.. మూటామల్లె సర్దుకుని వలస వెళ్తున్న కుటుంబాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
అస్మదీయులకు ఓడీ.. తస్మదీయులకు డీడీ
ఆదిలాబాద్:సిబ్బంది కొరతతో ఆర్టీసీ సతమతమవుతోంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం 8 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక్కోసారి 12 గంటల వరకు పనిచేయాల్సిన దుస్థితి. సిబ్బందిలేమి కారణంగా పనిభారం అధికమై ఎంతోమంది ఉద్యోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారికే డబుల్ డ్యూటీ (డీడీ)లు కేటాయిస్తూ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది అధికారులు అవుట్ ఆఫ్ డిసిగ్నేషన్ డ్యూటీస్ (ఓడీ)లు ఇస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఓడీఎం బదిలీపై వెళ్తూ కొంతమంది ఉద్యోగులకు ఓడీలు ఇచ్చి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా రీజియన్ వ్యాప్తంగా కొంతమంది ఉన్నతాధికారులు అడ్డగోలుగా ఓడీలు ఇస్తూ అక్రమంగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. అయినవారికి అందలం.. సాధారణంగా స్టాఫ్ తక్కువగా ఉంటే నియామకాల ద్వారా ఖా ళీలు భర్తీ చేస్తారు. లేదంటే స్థానికంగా అందుబాటులో ఉన్న ఉద్యోగులకు ఓడీ పేరుతో విధులు కేటాయిస్తారు. ఆర్టీసీలో నియామకాలు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకే అధికారులు ఓడీలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడే కొంతమంది ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తమకు వత్తాసు పలికే వారికి అప్పనంగా ఓడీలు కేటాయిస్తున్నారు. ఓవైపు సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఉంటుండగా, తమకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగులను అందలమెక్కిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల డిపోలో సీనియార్టీని కాదని, కొంతమంది జూనియర్ ఉద్యోగులకు అవుట్ ఆఫ్ డిసిగ్నేషన్ డ్యూటీలు ఇవ్వడం వివాదాస్పదమైంది. అనారోగ్య కారణాలు, వయస్సు రీత్యా సీనియర్లు విజ్ఞప్తి చేసుకుంటే అవసరాన్నిబట్టి ఓడీలు ఇవ్వాల్సింది పోయి, జూనియర్ ఉద్యోగులకు కేటాయించడం విమర్శలకు కారణమవుతోంది. ఓడీలతో పెరుగుతున్న డీడీలు.. అవసరం ఉన్నా, లేకపోయినా కొంతమందికి ఓడీలు కేటాయిస్తుండడంతో మిగిలిన కార్మికులపై భారం పడుతోంది. క్షేత్రస్థాయిలో బస్సులు నడిచేందుకు కీలకంగా వ్యవహరించే డ్రైవర్లు, కండక్టర్లపై డబుల్ డ్యూటీల భారం పడుతుంది. సిబ్బంది లేకపోవడంతో వారికి డబుల్ డ్యూటీ పేరిట అదనంగా పే చేయాల్సి వస్తుంది. తమవారికి లాభం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్న అధికారులు, పరోక్షంగా ఇతర ఉద్యోగులపై పనిభారం నెడుతున్నారు. దీంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగులు ఆసుపత్రుల పాలవుతున్నారు. రీజియన్ పరిధిలోని ఉద్యోగులు డిపో డ్రైవర్లు కండక్టర్లు ఆదిలాబాద్ 129 204 ఆసిఫాబాద్ 90 111 భైంసా 33 128 మంచిర్యాల 149 162 నిర్మల్ 138 204 ఉట్నూర్ 39 46 మొత్తం 578 855వేధిస్తున్న సిబ్బంది కొరత.. ఆదిలాబాద్ రీజీయన్ వ్యాప్తంగా 737 మంది డ్రైవర్లు ఉన్నారు. వీరిలో రెగ్యులర్ డ్రైవర్లు 583 మంది ఉన్నారు. మిగతా 154 మంది అవుట్ సోర్సింగ్లో విధులు నిర్వహిస్తున్నారు. 867 మంది కండక్టర్లు ఉండగా, వీరిలో కూడా సిబ్బంది కొరత ఉంది. మరోవైపు కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అధికారులు ఇష్టారాజ్యంగా ఓడీలు ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది. -
హత్తిఘాట్.. స్పీడప్
కై లాస్నగర్: జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న హత్తిఘాట్ ఇండస్ట్రియల్ కారిడార్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన భూసేకరణకు వడివడిగా అడుగులు వేస్తోంది. 2062.01 ఎకరాల భూ సేకరణకు ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన సర్కారు నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారంపై ఫోకస్ పెంచింది. గ్రామసభల నిర్వహణకు సన్నద్ధమవుతుంది. భూ సేకరణ వేగవంతం ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధి భోరజ్ మండలంలోని హత్తిఘాట్ ప్రాంతాన్ని ఆనుకుని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. అయితే ఈ ప్రాంతం అనువుగా ఉందా లేదా అనేదానిపై జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల ఏరియల్ సర్వే నిర్వహించి భూములను పరిశీలించారు. అనుకూలమని నిర్ధారించడంతో భూ సేకరణ కోసం ఇటీవల పేపర్ నోటిఫికేషన్ జారీ చేశారు. హత్తిఘాట్, గూడ, రాంపూర్–టి, గిమ్మ–బి గ్రామాల్లోని నీటి ఆధారిత పంటల సాగుకు అనుకూలంగా ఉన్న సారవంతమైన భూమలను సేకరించనున్నారు. ఆయా గ్రామాల్లోని పట్టా భూములు, వివాదాస్పద, సాదాబైనామా, ఈడీ అటాచ్లో ఉన్న భూముల వివరాలన్నింటిపై ఇప్పటికే అధికారులు పూర్తి వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేశారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతమైనందున ఆయా భూముల్లో ఈ సారి పంటలు సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు ఆయా గ్రామాల స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ఒకవేళ సాగు చేస్తే స్వల్పకాలిక రకాలకు ప్రాధాన్యం ఇచ్చేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారు. 19 నుంచి గ్రామసభలు భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈనెల 19నుంచి గ్రామసభలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ సభల్లో రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖలతో పాటు భూములు సేకరించనున్న టీజీఐఐసీ అధికారులు పాల్గొనున్నారు. పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలు, మండల సర్వేయర్లతో కూడిన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయనున్నారు. వీరు ఆయా గ్రామాల్లోని సర్వేనంబర్ల వారీగా పట్టాదారులు, వారికున్న భూవిస్తీర్ణం, సాగుభూమి స్థితి వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూ హక్కుదారులే కాస్తులో ఉన్నారా లేక ఇతరులేవరైనా సాగు చేస్తున్నారా అనే అంశాలను పరిశీలించనున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరాకు రూ.3.40 లక్షలు పలుకుతుంది. దీని ఆధారంగా ఎకరాకు ఎంత పరిహారం చెల్లించాలనే దానిపై ఈ సభల్లో నిర్ణయించనున్నారు. భూ వివరాలన్నీ సక్రమంగా ఉన్నట్లయితే పరిహారం నిర్ణయించి తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అనంతరం మండల సర్వేయర్లు, టీజీఐఐసీ నుంచి వచ్చే అధికారులతో కలిసి భూముల సర్వే చేపట్టి తుది నివేదిక సిద్ధం చేస్తారు. దాని ఆధారంగా తగు చర్యలు చేపట్టనుంది. ఈ కారిడార్ ఏర్పాటు ద్వారా అభివృద్ధిపరంగా జిల్లా రూపురేఖలు మారనున్నాయి. కసరత్తు చేస్తున్నాం హత్తిఘాట్ ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించి భూసేకరణ కోసం కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే భూ యజమానులు, వారి పేరిట ఉ న్న భూ విస్తీర్ణం, సర్వేనంబర్లు తెలిపిలా నోటిఫికేషన్ ప్రకటించాం. గ్రామసభలు నిర్వహించి సమగ్ర వివరాలు సేకరిస్తాం. వాటి ఆధారంగా అవార్డు ప్రకటించి తుది జాబితా సిద్ధం చేస్తాం. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్ఎస్ చిత్రు, అదనపు కలెక్టర్ గ్రామాల వారీగా సేకరించనున్న భూముల వివరాలు -
సాగు భూముల కోసం పోరు
కడెం: సాగు భూముల కోసం మండలంలోని పెత్తర్పు గోండుగూడ వాసులకు అటవీ అధికారులకు మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. మంగళవారం పునరావాసంలో భాగంగా కవ్వాల్ టైగర్జోన్లో రాంపూర్, మైసంపేట్ వాసులకు అప్పగించిన సాగు భూములకు హద్దులు ఏర్పాటు చేయించేందుకు వెళ్లిన అటవీ, రెవెన్యూ అధికారులను గోండుగూడ వాసులు మళ్లీ అడ్డుకున్నారు. పునరావాస గిరిజనులతో పాటుగా ఏళ్లుగా ఇక్కడే సాగు చేస్తున్న తమకు సాగు భూములు కేటాయించాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పది మంది ఆదివాసీలను జీపులో ఇందన్పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. అడ్డుకునేందుకు వెళ్లిన మహిళలను ఈడ్చుకెళ్లారు. ఓ ఆదివాసీ మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పునరావాసంలో భాగంగా రాంపూర్, మైసంపేట్ వాసులకు భూములు అప్పగించామని, వారికి పట్టాలు సైతం వచ్చాయని, గోండుగూడ వాసులు అడ్డుకోవడం సరికాదని ఎఫ్డీవో శివకుమార్ అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో దేవదాసు, తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎఫ్ఆర్వోలు గీతారాణి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్రావు, అనితా, కల్పనదేవి, వాణి, రామకృష్ణ, కిరణ్, ఎస్సైలు సాయికిరణ్, సాయికుమార్, హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు. అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదు కడెం: మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ జీపీ పరిధిలోని గోండుగూడ వాసులపై అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదని రాంజీగోండ్ సేవాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గోండుగూడ ఆదివాసీలు సాగు భూముల కోసం పోరాడితే వారిని అడ్డుకుని ఇందన్పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారన్నారు. ఆదివాసీలకు సాగు భూములు దక్కే వరకు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్, తొడసం భీంరావు, తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయాలి
ఒంగోలు టౌన్: పొగాకు కొనుగోళ్ల కంపెనీల నిలువు దోపిడీకి గురవుతున్న పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల సాధన కోసం ఈ నెల 19వ తేదీ ఒంగోలు నగరంలో నిర్వహించనున్న ట్రాక్టర్ల ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, ఏపీ రైతు కూలీ సంఘ జిల్లా నాయకుడు సీఎస్ సాగర్, ఏపీ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి, రైతు సంఘ జిల్లా కార్యదర్శి వీరారెడ్డి పిలుపునిచ్చారు. పొగాకు రైతులకు మద్దతుగా చేపట్టిన రైతు చైతన్య ప్రచార జాతా సోమవారం ఒంగోలు మండలంలోని ముక్తినూతలపాడు గ్రామానికి చేరింది. ఈ సందర్భంగా పొగాకు రైతులతో జరిగిన సమావేశంలో రైతు నాయకులు మాట్లాడారు. సిండికేట్గా ఏర్పడిన పొగాకు కంపెనీలు రైతులను నిలువునా దోచుకుంటున్నాయని మండిపడ్డారు. గతేడాది కంటే ఈ ఏడాది తక్కువ ధరకు పొగాకు కొనుగోలు ప్రారంభించారన్నారు. క్వింటా రూ.16 వేలకు కొంటూ రైతుల శ్రమ, సంపదను అడ్డగోలుగా మెక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనుగోలు కొనసాగితే రైతులు అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమని చెప్పారు. రైతుల జీవితాలు ప్రశ్నార్థకం అవుతాయని చెప్పారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని, రూ.1000 కోట్లు కేటాయించి ఎస్టీసీ, పొగాకు బోర్డు ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు సూదనగుంట శ్రీనివాసులు, సర్పంచ్ కామేపల్లి శ్రీనివాసరావు, వీరయ్య, లక్ష్మీనారాయణ, మారుతి, పొగాకు రైతులు పాల్గొన్నారు. అనంతరం కరవది, త్రోవగుంట, మద్దిరాలపాడు గ్రామాల్లో ప్రచార జాతా సాగింది. నాగులుప్పలపాడు మండలంలో... నాగులుప్పలపాడు: ఒంగోలులో ఈ నెల 19వ తేదీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ట్రాక్టర్ల ర్యాలీలో రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని రైతు సంఘ జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు కోరారు. పొగాకు రైతుల సమస్యలపై తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ తలపెట్టిన రైతు చైతన్య ప్రచార జాతా కార్యక్రమం సోమవారం నాగులుప్పలపాడు మండలంలోని బీ నిడమానూరు, పోతవరం గ్రామాల్లో సాగింది. రైతు సంఘ నాయకులు వడ్డే హనుమారెడ్డి, సాగర్, వీరారెడ్డి, రైతులు పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు -
బీఎల్ఓలకు ‘సర్’ కిట్ల పంపిణీ
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమానికి సంబంధించి సంతనూతలపాడు మండలంలోని బీఎల్ఓలకు ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాల చొప్పున కిట్లను స్థానిక తహసీల్దార్ నారాయణరెడ్డి సోమవారం పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని 60 మంది బీఎల్ఓలకు కిట్లు పంపిణీ చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి బీఎల్ఓలు మండలంలోని గ్రామాల్లో వారి పరిధిలోని ఇళ్లకు తిరిగి ఓటర్లకు సంబంధించిన సమగ్ర సర్వే ప్రక్రియ చేపట్టాలని తహసీల్దార్ సూచించారు. ముఖ్యంగా ఫారం 6, 7, 8కు సంబంధించి చేర్పులు, తీసివేతలు, సవరణల ప్రక్రియ చేపట్టాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పకడ్బందీగా నిర్వహించాలని బీఎల్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం కంప్యూటర్ ఆపరేటర్ అనీల్, బీఎల్ఓలు పాల్గొన్నారు. మద్దిపాడు మండలంలో ప్రారంభమైన సర్... మద్దిపాడు: మండల వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. మండలంలోని 54 మంది బూత్ స్థాయి అధికారులు వారి బూత్ల పరిధిలో ఇంటింటికి తిరిగి ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలిచ్చి నమోదు చేయాల్సిన వివరాల గురించి ఓటరుకు తెలియజేశారు. మండల కేంద్రమైన మద్దిపాడు గ్రామంలోని 163 బూత్లలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ ఆదిలక్ష్మి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలిచ్చి మాట్లాడారు. ఓటర్లకు అందజేసిన రెండు ఫారాల్లో పేరు, చిరునామా, గుర్తింపు కార్డు నంబర్, పాత ఫొటో ముద్రించి ఉంటాయన్నారు. వాటిలో వివరాలు పూర్తి చేయడానికి బీఎల్వోలు సహకరిస్తారని ఆమె తెలిపారు. జూలై 14వ తేదీ వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఈ నెల రోజుల్లో ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడానికి, పూర్తి చేసిన వాటిని తీసుకోవడానికి పలుమార్లు బీఎల్ఓలు వస్తారని ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో బీఎల్ఓ జాన్సన్బాబు, బీఎల్ఏ చైతన్యక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
● కలెక్టర్ రాజాబాబు కొత్తపట్నం: నిత్యం యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. ప్రతిఒక్కరూ చిన్ననాటి నుంచే యోగా సాధన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాలలో భాగంగా సోమవారం కొత్తపట్నం మండలంలోని కె.పల్లెపాలెం బీచ్లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్యతో కలిసి కలెక్టర్ యోగా చేశారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి తేళ్ల రవికుమార్, యోగాంధ్ర ఆఫీసర్ డాక్టర్ భీమ్నాథ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా స్థాయి అధికారులు, కొత్తపట్నం తహసీల్దార్ డి.రామానాయుడు, ఎంపీడీవో శ్రీకృష్ణ, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. -
ఘనంగా మాజీ మంత్రి మేరుగు జన్మదినం
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున జన్మదిన వేడుకలను సంతనూతలపాడులోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి కేక్ కట్ చేయగా, పలువురు నాయకులు పాల్గొని మేరుగు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సంతనూతలపాడు ఎంపీపీ బుడంగుంట విజయ, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, మండల అధ్యక్షురాలు ఎం.సీత, సొసైటీ మాజీ అధ్యక్షుడు దుంపా ఎల్లమందారెడ్డి, మాదాల వెంకట్రావు, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి పల్లెపాటి రామారావు, నాయకులు గొడుగు కాలేశా, రావూరి శ్రీనివాసరెడ్డి, వెంకారెడ్డి, కె.నాగాంజనేయులు, కె.లక్ష్మణ్, వల్లపు శ్రీను, షేక్ మస్తాన్వలి, అంజి, వెంకట్రావు, బి.నాగేశ్వరరావు, రాజబాబు, అల్లాబక్షు, రామచంద్రారెడ్డి, తేళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మద్దిపాడులో... మద్దిపాడు: మద్దిపాడులోని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం మాజీ మంత్రి మేరుగు నాగార్జున జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి కేక్ కట్ చేసి మేరుగు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మోరబోయిన సంజీవరావు, బెజవాడ శ్రీరామ్మూర్తి, బొమ్మల రామాంజనేయులు, గుడ్డపాతల రవి, పల్లపాటి అన్వేష్, కంకణాల సురేష్, పైడిపాటి వెంకట్రావు, మనం సంధ్య, కాకర్లపూడి రజిని, కందుల డానియేల్, సన్నపురెడ్డి రమణమ్మ, నాదెండ్ల మహేష్, గద్దె జాలయ్య, మేకల కృష్ణారెడ్డి, మద్దినేని శ్రీకాంత్, పిట్టల ఆంజనేయులు, మంద చిన్న, బొమ్మల దాసు, పైనం ప్రభాకర్రావు, కాకుమాను శశి, జగన్నాథం, పూర్ణచంద్రరావు, బొమ్మల జగ్గయ్య, రహీం, రాంబాబు, అద్దంకి శ్రీకాంత్, అన్నంగి మోహన్, వల్లెపు వెంకటేశ్వర్లు, వేల్పుల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. ఉప్పుగుండూరులో... నాగులుప్పలపాడు: మండలంలోని ఉప్పుగుండూరులో సోమవారం మాజీ మంత్రి మేరుగు నాగార్జున జన్మదినాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అరుణోదయ వృద్ధాశ్రమంలో వృద్ధులచే పుట్టినరోజు కేక్ కట్ చేయించారు. ఆశ్రమంలోని వృద్ధులకు భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, నాయకులు పేరాల చెన్నకేశవులు, యువజన, రైతు విభాగం మండల అధ్యక్షులు ఇమ్మిశెట్టి బాలకృష్ణ, తగిరిశ సుబ్బారావు, నాయకులు గండు హరిబాబు, కొలకలూరి విజయ్ కుమార్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూనంనేనివారిపాలెంలో... చీమకుర్తి రూరల్: మండలంలోని కూనంనేనివారిపాలెంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులు పూజలు చేయించారు. పార్టీ మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు నివాసంలో కేక్ కటింగ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు చీదర్ల శేషు, గ్రామ అధ్యక్షుడు ఎర్రగుంట్ల మోహన్, వసంతరావు, గోరంట్ల రామకృష్ణ, నల్లూరి నారాయణ, పి.శ్రీను, హనుమంతరావు, రమేష్, పేరయ్య, దాసు, వేమా గోవింద్, ఇమ్మాన్యేలు, తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్తో ప్రజలపై తీవ్ర దుష్ప్రభావం
ఒంగోలు సబర్బన్: కొణిజేడు – మర్లపాడు ఐరన్ ఓర్ మైనింగ్ లీజ్ ప్రతిపాదిత పరిధిలో మైనింగ్తో ప్రజలపై ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయని కొణిజేడు గ్రామ సహకార కమిటీ కలెక్టర్ పి.రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. ప్రకాశం భవన్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొణిజేడుతో పాటు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు వచ్చి వారి గోడును వెళ్లబోసుకున్నారు. కొణిజేడులో ఉన్న 529.04 హెక్టార్ల ప్రాంతంలో మైనింగ్ చేసే కలిగే దుష్ప్రభావాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో కూడా చాలా వాదోపవాదనలు జరిగి స్థానిక ప్రజల మేలు కోసం ప్రాజెక్టును నిలిపివేశారని గుర్తు చేశారు. ఒక ప్రభుత్వ సంస్థగా స్థానిక ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ఏపీఎండీసీపై ఉందన్నారు. ఈ ప్రాజెక్టు కొణిజేడు, మర్లపాడు, కందులూరు, యరజర్ల, సర్వేరెడ్డిపాలెం గ్రామాల్లో వేలాది కుటుంబాలపై ప్రభావం చూపుతుందన్నారు. తవ్వకం, ఖనిజ శుద్ధితో వచ్చే వ్యర్థాలతో వచ్చే విషయువాయువులతో పొందూరు, నిడమానూరు, వెంగముక్కలపాలెం, చెరువుకొమ్మపాలెం, చిలకపాడు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. కేవలం లాభాల కోసం చూస్తూ గ్రామీణ ప్రజల జీవితాలతో ఆటలాడటం సరికాదన్నారు. ప్రాజెక్టు అమల్లోకి వస్తే దాదాపు 10 గ్రామాల ప్రజలు, పశువులు, పక్షులు, పర్యావరణంతో పాటు భవిష్యత్ తరాలు కూడా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. సర్వే ప్రకారం ఈ ప్రాంత పరిధిలో ఉన్న ఐరన్ సాంద్రత కేవలం 29.89 శాతం మాత్రమేనని గుర్తు చేశామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం గుండ్లకమ్మ నుంచి భారీ మొత్తంలో నీటిని వినియోగించి ఏపీ ట్రాన్స్కో నుంచి 132 కిలో వాట్ పవర్ లైన్కు వృథాగా ఖర్చు చేస్తారన్నారు. ఈ తవ్వకాలతో భూగర్భ జలాల నీటిమట్టం తగ్గిపోయి పంట బోర్లు, నీటి బావులు, చెరువులు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్, క్రషింగ్, రవాణాతో వచ్చే దుమ్ము ధూళి వల్ల చుట్టుపక్కల గ్రామస్తులు శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకొని ప్రాజెక్టు విషయంలో ముందుకు సాగాలని కోరారు. అర్జీలపై దృష్టి సారించండి ప్రజల సంతృప్తే లక్ష్యంగా అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్ఓ మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావు, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ శాంతిలక్ష్మిలతో కలిసి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమానికి మొత్తం 275 అర్జీలు వచ్చాయని తెలిపారు. అర్జీలను పరిష్కరించకుంటే అందుకు కారణాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. తరుచూ అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దన్నారు. అధికారులంతా తమ లాగిన్లో పెండింగ్ ఉన్న అర్జీలను ప్రతిరోజూ పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొణిజేడు గ్రామ సహకార కమిటీ ఫిర్యాదు -
ఎంపీటీసీ మాజీ సభ్యుడు మృతి
మద్దిపాడు: మద్దిపాడు ఎంపీటీసీగా 2014 – 19 మధ్య కాలంలో పనిచేసిన పాటిబండ్ల చినరామయ్య (90) వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. వివాదరహితుడుగా అందరి మన్ననలు పొందిన చినరామయ్య మృతి చెందడంపై స్థానిక నాయకులు పలువురు ఆయన కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలియజేశారు. కొత్తపట్నం: రోడ్డు ప్రమాదంలో మూడు గేదెలు, ఒక ఆవు మృతి చెందాయి. ఆ వివరాల ప్రకారం.. కొత్తపట్నం గ్రామానికి చెందిన పుచ్చలపల్లి తిరుమల పశువులు మేపుకుని జీవిస్తుంటాడు. రోజూలాగే ఆదివారం పశువులను పొలానికి తోలుకెళ్లాడు. అవి మేత మేసి తిరిగి ఇంటికొచ్చే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గేదెల కోసం రాత్రంతా ఎదురుచూసిన తిరుమల.. సోమవారం ఉదయం వెళ్లి చూడగా, డీడీ కాలనీ ఎదురుగా ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా రెండు గేదెలు, ఒక ఆవు మృతి చెంది పడి ఉన్నాయి. మరో గేదె కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. కొనప్రాణంతో ఉన్న గేదెకు పశువైద్యుడిని పిలిపించి చికిత్స చేసినా ఫలించలేదు. ఆ గేదె కూడా చనిపోయింది. వాటన్నింటి విలువ రూ.2.5 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్సై వేముల సధాకర్బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఢీకొట్టిన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ● సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు ఒంగోలు టౌన్: నాణ్యమైన పొగాకు పండినప్పటికీ సరైన ధరకు కొనుగోలు చేయకుండా నో బిడ్ల పేరుతో కంపెనీలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు కేవలం 10 శాతం మాత్రమే కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. గత ఏడాది కిలో రూ.280 తో ప్రారంభించగా ఈ ఏడాది గరిష్ట ధర రూ.250 కే పరిమితమైందన్నారు. ప్రారంభంలో ప్రకటించిన ధరలను కూడా క్రమంగా తగ్గిస్తూ కనీస ధరలను రూ.160 కు దిగజార్చారని వివరించారు. పొగాకు కంపెనీలు సిండికేట్లుగా మారి రైతుల శ్రమను దోచుకుంటున్నాయని విమర్శించారు. అండగా నిలబడాల్సిన ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషిస్తుండడం దారుణమన్నారు. ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరగడంతో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రస్తుత ధరలతో ఒక్కో బ్యారన్కు రూ.3 నుంచి రూ.4 లక్షల నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొందన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు కేటాయించి ఎస్టీసీ, మార్క్ఫెడ్, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా నిల్వలన్నిటినీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతుల గిట్టుబాటు ధరల కోసం ఈ నెల 19వ తేదీ రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. ● కలెక్టరేట్ ఎదుట వాచ్మెన్ల ధర్నా ఒంగోలు టౌన్: అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా పనిచేస్తున్న కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, తద్వారా వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.మోహన్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా అపార్ట్మెంట్ల వాచ్మెన్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ గ్రామాల్లో జీవనోపాధి లేకపోవడంతో పొట్ట చేతపట్టుకుని వేలాది మంది నిరుద్యోగ యువకులు, కార్మికులు పట్టణాలకు వలస వస్తున్నారని తెలిపారు. వారిలో వేరే పనులేమీ దొరక్కపోవడంతో అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి వారందరినీ ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, భవన నిర్మాణ కార్మికులకు ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఏదైనా అనుకోని విధంగా ప్రమాదాలు సంభవించినప్పుడు సంక్షేమ బోర్డు ఆదుకుంటుందన్నారు. అపార్ట్మెంట్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.రామకృష్ణ, జి.నరసింహరావు మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన ఒంగోలులోని అపార్ట్మెంట్లలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. ఒంగోలులో పనిచేస్తున్న 1000 మంది కార్మికులకు తలదాచుకునేందుకు సొంత గృహాలు లేవని ఆవేదన చెందారు. ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలన్నింటినీ అందజేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఉల్లగంటి వెంకటేశ్వర్లు, వినుకొండ పాపారావు, స్వర్ణ రమేష్, జటావత్ నాయక్, అంజి, వెంకటేష్, మాట రామారావు పాల్గొన్నారు. -
ఎన్నో కలలతో అలల ప్రయాణం..!
సముద్రంలో చేపల వేట మళ్లీ మొదలైంది. కొద్దిరోజులుగా కొనసాగుతున్న వేట విరామం ఆదివారంతో ముగిసింది. సోమవారం వేకువజాము నుంచే మత్స్యకారులు వలలు, బోట్లు, తదితర వేట సామగ్రితో సముద్రంలో చేపల వేటకు బయలుదేరి వెళ్లారు. ఎన్నో కలలతో అలలపై ప్రయాణం ఆరంభించారు. ఆయా సంఘటనలతో కొత్తపట్నంలోని కె.పల్లెపాలెం బీచ్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్మనిపించింది – సాక్షి, ఒంగోలు -
దరఖాస్తులు 80 వేలు.. ఇళ్లు 3,700
కై లాస్నగర్: జిల్లాలో ఇందిరమ్మ రెండోవిడత ఇళ్లకు తీవ్ర పోటీ నెలకొంది. మంజూరైన ఇళ్ల సంఖ్య గొరంత కాగా.. అర్హులైన వారి సంఖ్య కొండంతగా ఉంది. దీంతో ఇల్లు ఎవరికి దక్కుతుందనే దానిపై దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక అధికారులకు సవాలుగా మారనుంది. గుడిసెలో నివసిస్తున్న వారికి మాత్రమే మంజూరు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో అర్హుల గుర్తింపుపై అధికారులు ఫోకస్ పెంచారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొంటున్నారు. నియోజకవర్గానికి 1500 చొప్పున.. రెండో విడతలో ఒక్కో నియోజకవర్గానికి 1500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఈ లెక్కన ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు కలిపి 3వేల ఇళ్లు మంజూరయ్యాయి. పాక్షికంగా ఉన్న ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలకు మరో 786 ఇండ్లను మంజూరు చేసింది. వీటిని ఆయా మండలాల్లో అందిన ఎల్–1 దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా కేటాయించారు. అదే ప్రతిపాదికన గ్రామాల వారీగా కూడా కేటాయింపులు పూర్తి చేసిన హౌసింగ్ అధికారులు కలెక్టర్ రాజర్షి షా ఆమోదం కోసం పంపించారు. అయితే ఈ కేటాయింపుల్లో ఒక్కో గ్రామానికి 5నుంచి 15, జిల్లా కేంద్రంలోని ఒక్కో వార్డుకు 12 నుంచి 13 ఇళ్లు ఎల్1 దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. లబ్ధిదారుల ఎంపిక సవాలే.. తొలి విడతలో జిల్లావ్యాప్తంగా 16వేల ఇళ్లు మంజూరయ్యాయి. ప్రజల నుంచి అంతగా పోటీ లేకపోవడంతో ఈ విడతలో అర్హులైనవారితో పాటు రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి ఇళ్లు మంజూరయాయి. వాటి నిర్మాణాలు ముమ్మరంగా సాగుతుండటం, బిల్లులు సైతం వెంటవెంటనే వస్తుండటంతో ఈ విడతలో డిమాండ్ ఏర్పడింది. అలాగే ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్లోనూ వందలాది మంది దరఖాస్తులు అందజేయడం తీవ్రతకు అద్దం పడుతుంది. రెండో విడతలో కేవలం 3,786 ఇళ్లు మాత్రమే జిల్లాకు మంజూరయ్యాయి. అయితే జిల్లా వ్యాప్తంగా ఇంటి స్థలం కలిగి ఉండి ఇళ్లు లేనటువంటి వారి సంఖ్య (ఎల్–1 జాబితాలో) 80,123 మంది ఉన్నారు. వారంతా సొంతింటి కోసం గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక అధికారులు, ప్రజాప్రతినిధులకు సవాలుగా మారనుంది. తొలి విడతలో ఈ బాధ్యతను పూర్తిగా ఇందిరమ్మ కమిటీలకే అప్పగించారు. దీంతో అనర్హలకు సైతం పెద్ద ఎత్తున ఇళ్లు వచ్చాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ సారి కమిటీలు అర్హులైన పేర్లను సిఫారసు చేసినప్పటికీ ఎంపిక మాత్రం అధికారులకే అప్పగించారు. గుడిసెల్లో ఉన్న వారికే ప్రాధాన్యత .. ఈ విడతలో గుడిసెల్లో నివసించే వారినే ఎంపిక చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ గ్రామాల్లో అలాంటి వారు లేకపోవడంతో ఇంటి పైకప్పుగా తాడిపత్రి వేసుకుని, రేకుల షెడ్డులో నివసించే వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి వారికి తప్పనిసరిగా ఇళ్లను కేటాయించాలి. ఇ లాంటి వారి గుర్తింపు కోసం ఎంపిక చేసిన మండల స్థాయి గెజిటెడ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతున్నారు. వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో చేయనుండగా, మున్సిపల్లో కమిషనర్, వార్డు ఆఫీసర్లు చేపట్టనున్నారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక రెండో విడతలో జిల్లాకు 3786 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిని మండలాలు, గ్రామాల వారీగా అందిన ఎల్–1 దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా కేటాయించాం. ఈ విడతలో గుడిసెల్లో ఉన్న వారికే ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాంటి వారి గుర్తింపునకు సర్వే జరుగుతుంది. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తాం. కలెక్టర్ ద్వారా వారికి ప్రొసీడింగ్ పత్రాలు అందజేస్తాం. – రెడ్డి శంకర్, హౌసింగ్ పీడీ -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది. చదువుతో పాటు ఆటలు.. నాన్న హర్జి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నేను కూడా హసన్పర్తి లోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివాను. ఫాతి మా స్కూల్లో టెన్త్ పూర్తయింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది. మా గురువులు మాపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. చదువుతో పాటు ఆటపాటలు నేర్పించేవారు. అప్పుడు సెల్ఫోన్లు లేవు. జంక్ ఫుడ్ దొరికేది కాదు. బడి ముందర పండ్లు అమ్మేవారు. ఇప్పటికీ మా గురువులు కళ్లలో మెదులుతూనే ఉంటారు. వారంటే ఎనలేని అభిమానం. – డాక్టర్ సాధన, డీఎంహెచ్వో -
బడి స్మృతులు..
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026హుషారుగా వెళ్లేవాడిని.. చిన్నతనంలో బడికి హుషారుగా వెళ్లేవాడిని. ఏ రోజు మారం చేయలేదు. అమ్మ అమిత్షా చిన్నతనంలోనే చదువు ప్రాధాన్యత, క్రమశిక్షణ నేర్పించారు. ఆ స్ఫూర్తితో ఉదయమే నిద్రలేచి ఉత్సాహంగా రెడీ అయ్యేవాడిని. పాఠశాలకు ఎప్పుడూ గైర్హాజరు కాలేదు. చిన్నతనం నుంచి సివిల్స్ వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేవాడిని. హోంవర్క్ పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసేవాడిని. బీహార్లోని శిశు మందిరంలో ఒకటి నుంచి రెండో తరగతి, మిథిల పబ్లిక్ స్కూల్లో మూడో నుంచి ఐదో తరగతి వరకు చదివాను. తర్వాత మా కుటుంబం రాజస్థాన్లోని జైపూర్కు రావడంతో అక్కడి మహేశ్వరీ పబ్లిక్ స్కూల్లో 6 నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివాను. కాన్పూర్ ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్ బీటెక్ పూర్తి చేశాను. – రాజర్షిషా, కలెక్టర్ సర్కారు బడిలోనే చదివా.. నేను మొదటిరోజు బడికి సంతోషంగానే వెళ్లాను. మా ఇంటి దగ్గరే బడి ఉండేది. 1,2 తరగతులు బ్రాహ్మణవాడ ప్రా థమిక పాఠశాలలో చదివాను. ఆ తర్వాత 5,6 తరగతులు స్టేషన్ రోడ్లో, 7 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ బాలికల పాఠశాలలో పూర్తి చేశాను. ఇంటర్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల్లోనే పూర్తి చేశాను. గురువులు మాపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. రోజూ క్రమం తప్పకుండా బడికి వెళ్లేదానిని. ఆటాపాటలతో విద్యాబోధన చేసేవారు. టీఎల్ఎం ఉపయోగించేవారు. – డి.మాధవి, డీఈవో బాల్యం తిరిగి రాదు.. పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటిరోజే బ డికి వెళ్లేవాడిని. నేను జ మ్ముకశ్మీర్లోని లిటిల్ఫ్లవర్ పాఠశాలలో చ దివా ను. వేసవి సెలవుల్లో ఇంటివద్ద ఉండడంతో స్నేహితులతో కలిసే అవకాశం ఉండేది కాదు. పాఠశాలకు వెళితేనే ఫ్రెండ్స్తో సరదాగా ఉండేది. మా గురువులు మా పై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. నా ణ్యమైన బోధన చేసేవారు. వారంటే ఎనలేని అభిమానం. అలాగే బాల్యం తిరిగి రాదు. అదో మధుర జ్ఞాపకం. – అఖిల్ మహాజన్, ఎస్పీ కష్టపడి చదివారు.. ఉన్నతస్థాయికి ఎది గారు.. ప్రస్తుతం జిల్లా ఉన్నతాధికారులుగా కొనసాగుతున్నారు.. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో తమ బాల్యంలో బడి స్మృతులను ‘సాక్షి’తో మరోసారి గుర్తుకు చేసుకున్నారు. వారి మాటల్లోనే.. – ఆదిలాబాద్టౌన్ -
ఇసుక తోడేళ్లు మస్తూ..!
బేల మండలంలోని సాంగిడి వద్ద గల పెన్గంగ ఇది. నదిలో నీరు ఉన్నా ప్రతిరోజు ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. గతంలో ఇక్కడ వేలం నిర్వహించిన వీడీసీ సభ్యులపై కేసులు సైతం నమోదయ్యాయి. అయినప్పటికీ అక్రమ దందా మాత్రం ఆగడంలేదు.ఆదిలాబాద్: పెన్గంగలో ఇసుకాసురులు మకాం వేశారు. నదిని నిత్యం జేసీబీలతో తోడేస్తున్నారు. సహజ సంపదను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడంతో వీరి అక్రమ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. పరీవాహక ప్రాంతాల్లో.. జిల్లాలో పెన్గంగ పరీవాహక ప్రాంతాలైనా భీంపూర్ మండలంలోని వడూర్, అంతర్గాం, అర్లి టీ, గుబిడి, తాంసి కె, భోరజ్ మండలంలోని పెండల్వాడ, జైనథ్ మండలంలోని సాంగ్వి, ఆనందపూర్, బేల మండలంలోని కామ్గార్పూర్, సాంగిడి సమీపంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నదిలో నీరు ఉన్నప్పటికీ జేసీబీలతో తవ్వుతూ ప్రతీ పది నిమిషాలకో టిప్పర్ నింపుతుండడం గమనార్హం. వీటిని సమీప ప్రాంతాలకు తరలిస్తూ డంపింగ్ చేస్తున్నారు. తర్వాత ఇతర ప్రాంతాలకు చేరవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్ ఇసుక ధర ప్రస్తుతం రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పలుకుతోంది. ఇలా రోజుకు లక్షల్లో ఆదాయం సమకూరుతుండడంతో అక్రమార్కులు దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అనుమతుల పేరుతో అక్రమంగా.. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి విధానాలను తీసుకువచ్చింది. ఆన్లైన్లో చలానా చెల్లిస్తే ట్రాక్టర్లో ఒక ట్రిప్పు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడే తతంగమంతా మారిపోతుంది. ట్రిప్పు కోసం అనుమతి తీసుకుంటున్న కొంతమంది స్థానిక అధికారులను మచ్చిక చేసుకొని అదనంగా ట్రిప్పులు కొడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఇసుకను చౌకగా అందిస్తుండగా, దానిని సాకుగా చూపి మరికొందరు అక్రమ దందాకు తెరలేపుతున్నారు. మినహాయింపులతో ఇసుక తరలింపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెన్గంగ నుంచి ఇసుక తరలింపులో కొన్ని మినహాయింపులున్నాయి. ఇంద్రవెల్లి, గాదిగూడ మండలాలకు తరలింపు ఇబ్బందవుతుందని కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. టిప్పర్లలో కూడా తరలిస్తున్నారు. విషయం నా దృష్టిలో ఉంది. – రవీందర్, మైనింగ్, ఏడీ ఇది బేల మండలం కాంగార్పూర్ సమీపంలోని పెన్గంగ నది. ఇక్కడ నిత్యం జేసీబీలతో ఇసుకను తోడుతూ టిప్పర్లు, ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. సమీపంలోని తీర ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు.


