breaking news
Adilabad
-
తోబుట్టువులు లేకపోయినా.. రాఖీ కట్టే అక్కాచెల్లెళ్లు ఉన్నారు
అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రాఖీ వారధిగా నిలుస్తోంది. ఏ దేశంలో ఉన్నా.. ఎంత దూరంలో ఉన్నా తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు పుట్టింటి బాట పట్టేలా చేస్తుంది. ఏ ఒక్క ఏడాదైనా రాఖీ కట్టలేకపోతే అన్నాదమ్ముల ఆత్మీయతకు దూరమయ్యామనే భావన కలిగిస్తుంది. ఆ భావన కూడా రావొద్దనే ఉద్దేశంతో అక్కాచెల్లెళ్లు ఎంత కష్టమైనా భరించి వచ్చి రాఖీ కడితే వచ్చే ఆనందం వెలకట్టలేనిది. తరాలు మారినకొద్దీ రాఖీ అనుబంధాన్ని మరింత దృఢం చేస్తోంది.లండన్ నుంచి వచ్చినచెన్నూర్రూరల్: నా పేరు అనూష. మాది చెన్నూర్ మండలం పొ క్కూరు గ్రామం. పెళ్లి తర్వాత లండన్లో స్థిరపడ్డాం. నా భర్త అక్కడే జాబ్ చేస్తాడు. ప్రతియేటా రాఖీ పండుగకు లండన్ నుంచి స్వగ్రామం వచ్చి అన్నయ్య గద్దె మధుకర్కు రాఖీ కట్టి వెళ్తుంటాను. ఈయేడు కూడా రెండ్రోజుల ముందుగానే వచ్చి రాఖీ కట్టాను. స్వయంగా వచ్చి రాఖీ కట్టడమే ఇష్టం. ఒక్కోసారి వచ్చే వీలు లేకుంటే ముందుగానే రాఖీ పంపిస్తాను. – గద్దె అనూష, లండన్15 ఏళ్లు రాఖీ కట్టించుకోలేదుఖానాపూర్: దేశ సేవలో భాగంగా ఆర్మీలో 15 ఏళ్లకు పైగా విధులు నిర్వహించాను. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో విధుల కారణంగా రాఖీ పండుగకు అక్కాచెల్లెళ్ల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకునే అవకాశం ఉండేది కాదు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించడంతో రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వచ్చేది. అక్కాచెల్లెళ్ల నుంచి ఫోన్లో శుభాకాంక్షలు అందుకున్నా, వారి చేతుల మీదుగా రాఖీ కట్టించుకోలేకపోవడం బాధగా ఉండేది. ప్రస్తుతం ఆర్మీ నుంచి విరమణ పొందాను. రెండేళ్లుగా రాఖీ పండుగను అక్కాచెల్లెళ్లతో కలిసి జరుపుకొంటున్నాను. అక్కల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఉద్యోగ సమయంలో కోల్పోయిన ఆత్మీయ క్షణాలను ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్నాను. దేశ సేవలో భాగంగా పండుగలు, కుటుంబ వేడుకలకు దూరంగా ఉండే సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి.– కడుకుంట్ల ప్రవీణ్, ఖానాపూర్నాకు ఎంతో స్పెషల్ కైలాస్నగర్: రాఖీ పండుగ నాకు ఎంతో స్పెషల్. మా అమ్మ, నాన్నలకు నేను ఏకైక సంతానం. నాకు తోబుట్టువులు లేరు. కానీ, మా పెద్దమ్మ, చిన్నమ్మ, పెదనాన్నల కూతుళ్లు అర్చన, నిఖిత, అంజమ్మ నాకు సొంత అక్కాచెల్లెళ్ల లెక్కనే. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు.. వారు ఎక్కడ ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వచ్చి రాఖీ కడతారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా వారికి దూరంగా ఉన్నప్పటికీ మరిచిపోకుండా రాఖీ కట్టేందుకు వస్తారు. నాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపుతారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ రక్షబంధన్ను ఎంత గొప్పగా జరుపుకొంటామో.. అంత గొప్పగానే మహిళలపై గౌరవభావంతో మెలగాలి. ప్రతి ఒక్కరూ ఎదుటి మహిళ, యువతులను తమ సొంత ఆడబిడ్డలుగా భావించినప్పుడే వేధింపులు లేని ఆదర్శ సమాజ నిర్మాణం సాధ్యపడుతుంది. – మంద మకరందు, ఐటీడీఏ పీవో, ఉట్నూర్ఎదురుచూస్తుంటా..చింతలమానెపల్లి: ఇంటికి దూరంగా దేశసేవ కోసం సరిహద్దుల్లో ఉండే మా సైనికులకు రాఖీ పండుగ ఎంతో ప్రత్యేకం. పోస్ట్లో స్వగ్రామం నుంచి పంపించే రాఖీ కట్టుకుంటే మాకు కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రతీ ఏడాది రాఖీ పౌర్ణమికి ఇంటి నుంచి వచ్చే రాఖీ కోసం ఎదురుచూస్తుంటా. – హరి మ్రిదా, రవీంద్రనగర్, మం.చింతలమానెపల్లి చదవండి: చెఫ్ వికాస్ ఖన్నాకు రాఖీ కట్టిన రాధికా మర్చంట్ -
వ్యూహం.. ప్రతివ్యూహం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. మరోసారి నిర్వహించాలని విపక్షాల పట్టుపడుతుండగా, పదవి ఆశిస్తున్న ఒకరు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఎన్నికను పెండింగ్లో పెట్టాల ని పాలకపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనిపై కోర్టులో రిట్ పిటిషన్ వేయగా ప్రతికూల నిర్ణయం వచ్చింది. సమావేశం ఎలాగైనా నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈనెల 31న మళ్లీ సమావేశం నిర్వహించాలని పాలకపక్షం నిర్ణయించింది. సమావేశం సాఫీగా జరిగితే నాలుగు కోఆప్షన్ సీ ట్లు పాలకపక్షం నుంచి చేజారే అవకాశముంది. సమావేశాన్ని నిరోధిస్తే మరికొంత కాలం విపక్షాన్ని నిరోధించినట్లవుతుంది. ఇలా వ్యూహ, ప్రతివ్యూహాలతో పాలక, విపక్షాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49మంది కౌన్సిలర్ స్థానాలుండగా, గత ఎన్ని కల్లో బీజేపీ 21, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ ఆరు, ఎంఐఎం ఆరు, స్వతంత్రులు ఐ దు స్థానాల్లో గెలుపొందారు. ఎక్స్ అఫీ షియో సభ్యత్వం ద్వారా ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్థానాలను కలుపుకొని స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బల్దియా పీఠాన్ని దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా స్వతంత్ర కౌన్సి లర్ బండారి అనూషను చైర్పర్సన్గా ప్రతిపాదిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం జతకట్టాయి. మిగతా స్వతంత్రుల మద్దతు తీసుకుని బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయి. చైర్పర్సన్ బండారి అనూష భర్త బండారి సతీశ్తో కలిసి అప్పట్లోనే కాంగ్రెస్లో తిరిగి చేరడంతో ఆ పార్టీ బలం 12కు పెరిగింది. ఈ పరి ణామం తర్వాత కోఆప్షన్ పదవులనూ పాలకపక్షం సునాయసంగా దక్కించుకునేలా వ్యూహం వేస్తుంద ని అంతా భావించారు. కానీ, కోఆప్షన్ ఎన్నిక వచ్చే సరికి రాజకీయాలు మా రాయి. నలు గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ పక్షాన నిలిచారు. బీజే పీ, స్వతంత్ర కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో ఓట్లు కలుపుకొని మెజార్టీ మార్క్ను ఇప్పటికే బీజేపీ సాధించింది. గత జూన్ 27న కోఆప్షన్ ఎన్నిక నిర్వహించగా, కోరం లేదంటూ, సమావేశం సాఫీగా నిర్వహించకుండా విపక్ష సభ్యులు ప్రతిఘటిస్తున్నారని ఆరోపిస్తూ పాలకపక్షం ఆ సమావేశాన్ని బహిష్కరించింది. తాజాగా మరోసారి ఎన్నిక నిర్వహిస్తుండడంతో అందరి దృష్టి అటువైపే మళ్లింది. నాలుగు కోఆప్షన్ స్థానాలు ఇలా.. నాలుగు కోఆప్షన్ స్థానాలను భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఇందులో జ నరల్ స్థానంలో ఇద్దరిని, మైనార్టీ స్థానంలో ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంది. రెండు స్థానా ల్లో తప్పనిసరిగా మహిళలను ఎన్నుకోవా ల్సి ఉంటుంది. ఇందుకోసం అప్పట్లో దరఖాస్తులు స్వీకరించగా, జనరల్ స్థానంలో 13 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మ హిళలున్నారు. మైనార్టీలో కూడా 13 దరఖా స్తులు రాగా, అందులో కూడా ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళలున్నారు. ఇప్పు డు వీరి నుంచే ఆ నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎ న్నుకోవాల్సి ఉంటుంది. రెండు నెలల కిందట నిర్వహించిన సమావేశంలో బీజేపీ, స్వతంత్ర, కోఆప్షన్ సభ్యుల సంఘటితంతో మెజార్టీ సాధించి నాలుగు సీట్లు కైవసం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అప్పు డు సమావేశం రద్దు కావడంతో ఇప్పటివరకు ఎన్ని క ఆగినా ఇప్పటికీ ఆ సంఘటితం అలాగే ఉంది. దీంతో సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలని విపక్షం, నిలువరించాలని పాలకపక్షం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో ఎవరిది పైచేయి అవుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎవరిది పైచేయి అవుతుందో!ఆరోజు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారని, అధికార, పాలకపక్షం దౌర్జన్యంగా కమిషనర్తో ఆ మీటింగ్ జరగకుండా చేసి కోఆప్షన్ సభ్యుల ఎన్నికను నిలిపివేశారని విపక్షం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జరగబోయే సమావేశాన్ని సాఫీగా నిర్వహించాలని బీజేపీ, స్వతంత్ర సభ్యులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకోసం స్పెషలాఫీసర్ను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా నీడలో ఎన్నిక సజావుగా నిర్వహించాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పాలకపక్షం ఈ సమావేశాన్ని ఎలాగైనా నిరోధించాలని, మరికొంత కాలం కోఆప్షన్ సభ్యుల ఎన్నికను దాటవేయాలని ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత పరిస్థితులను అనువుగా మార్చుకుని ఎన్నికలకు వెళ్లొచ్చని భావిస్తోంది. ఈ ఎత్తుగడ ఫలిస్తుందో.. లేదో చూడాల్సిందే. కాగా, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రత్యేక సమావేశం ఈనెల 31న మధ్యాహ్నం 3గంటలకు కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జగద్వీర్ గౌడ్ తెలిపారు. సభ్యులంతా సకాలంలో హాజరుకావాలని కోరారు. -
జస్వంత్కు స్వర్ణ పతకం
ఆదిలాబాద్: రాష్ట్ర సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకా రుడు అట్టం జస్వంత్ సత్తాచాటాడు. హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ అండర్–20 బాలు ర రేస్ వాక్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబ రిచి స్వర్ణ పతకం సాధించాడు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్ అ భినందనలు తెలిపారు. వీజీఎస్ రాకేశ్, వీజీ ఎస్ జ్యోతీశ్వరన్, మేనేజర్ సౌమ్య ఉన్నారు. -
తీజ్ జోష్
ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రవెల్లి, హర్కపూర్తండా, మచ్చపూర్, బిక్కుతండా, లాల్టేడికి గ్రామాల్లోని లంబాడీ తండాల్లో గురువారం తీజ్ వేడుకలు ప్రారంభించారు. పెళ్లి కాని యువతులు, చిన్నారులు గ్రామ పొలిమేరల్లోని పంటచేన్ల వద్ద పుట్ట మట్టి సేకరించారు. యువతులు సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం సేకరించిన పుట్టమట్టిని గ్రామపెద్దల ఇళ్లకు తెచ్చారు. వెదురు బుట్టల్లో మట్టివేసి గోధుమ విత్తనాలు నాటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు గోధుమ నారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీజ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు లంబాడీతండా పెద్దలు తెలిపారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. – ఇంద్రవెల్లి -
రెండు నెలలకే నూరేళ్లు...
లక్ష్మణచాంద: సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తమ రెండు నెలల కుమారుడిని కోల్పోయిన విషాధకర సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దస్తురాబాద్కు చెందిన జాజిమొగ్గ శిరీష పార్పెల్లి లో ఉన్న తన సోదరులకు రాఖీ కట్టేందుకు గురువా రం తన ఇద్దరు కుమారులు ప్రన్షు (4), చింటూ (2 నెలలు)తో కలిసి ఖానాపూర్ వరకు ఆర్టీసీ బస్సులో వచ్చింది. అక్కడ ఆటో ఎక్కి వెళ్తుండగా లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ వచ్చే క్రమంలో జాతీయ రహదారి 61 బాబాపూర్ ఎక్స్ రోడ్డుపై డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటో అదుపు తప్పడంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. గ మనించిన వాహనదారులు ప్రయాణికులను బయటకు తీసి 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆటోలో మొత్తం 8 మంది ప్రయాణికులు ఉండగా ఇందులో ఏడుగురికి స్వ ల్పగాయాలయ్యాయి. చింటూకు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ రషీద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. -
ఎన్నడూ మరువలేదు
ఖానాపూర్: దేశ సేవలో భాగంగా ఆర్మీలో 15 ఏళ్లకు పైగా విధులు నిర్వహించాను. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో విధుల కారణంగా రాఖీ పండుగకు అక్కాచెల్లెళ్ల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకునే అవకాశం ఉండేది కాదు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించడంతో రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వచ్చేది. అక్కాచెల్లెళ్ల నుంచి ఫోన్లో శుభాకాంక్షలు అందుకున్నా, వారి చేతుల మీదుగా రాఖీ కట్టించుకోలేకపోవడం బాధగా ఉండేది. ప్రస్తుతం ఆర్మీ నుంచి విరమణ పొందాను. రెండేళ్లుగా రాఖీ పండుగను అక్కాచెల్లెళ్లతో కలిసి జరుపుకొంటున్నాను. అక్కల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఉద్యోగ సమయంలో కోల్పోయిన ఆత్మీయ క్షణాలను ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్నాను. దేశ సేవలో భాగంగా పండుగలు, కుటుంబ వేడుకలకు దూరంగా ఉండే సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి. – కడుకుంట్ల ప్రవీణ్, ఖానాపూర్నిర్మల్చైన్గేట్: మా అన్నయ్య ఉద్యోగరీత్యా అండమాన్లో సీజీఎంగా విధులు నిర్వహించేవారు. విధి నిర్వహణలో వివిధ రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు. ఇటీవలే ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. నేను కూడా నిర్మల్ జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కారణంగా ప్రతీ రక్షాబంధన్ రోజు కలుసుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. అయినప్పటికీ నేను రాఖీ పండుగకు రాఖీ పంపడం ఎన్నడూ మరువలేదు. ఈసారైనా అన్నయ్యకు నా చేతులతో రాఖీ కట్టాలని అనుకుంటున్న. – విజయలక్ష్మి, నిర్మల్ డీఆర్డీవోఎదురుచూస్తుంటా..చింతలమానెపల్లి: ఇంటికి దూరంగా దేశసేవ కోసం సరిహద్దుల్లో ఉండే మా సైనికులకు రాఖీ పండుగ ఎంతో ప్రత్యేకం. పోస్ట్లో స్వగ్రామం నుంచి పంపించే రాఖీ కట్టుకుంటే మాకు కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రతీ ఏడాది రాఖీ పౌర్ణమికి ఇంటి నుంచి వచ్చే రాఖీ కోసం ఎదురుచూస్తుంటా. – హరి మ్రిదా, రవీంద్రనగర్, మం.చింతలమానెపల్లి లండన్ నుంచి వచ్చినచెన్నూర్రూరల్: నా పేరు అనూష. మాది చెన్నూర్ మండలం పొ క్కూరు గ్రామం. పెళ్లి తర్వాత లండన్లో స్థిరపడ్డాం. నా భర్త అక్కడే జాబ్ చేస్తాడు. ప్రతియేటా రాఖీ పండుగకు లండన్ నుంచి స్వగ్రామం వచ్చి అన్నయ్య గద్దె మధుకర్కు రాఖీ కట్టి వెళ్తుంటాను. ఈయేడు కూడా రెండ్రోజుల ముందుగానే వచ్చి రాఖీ కట్టాను. స్వయంగా వచ్చి రాఖీ కట్టడమే ఇష్టం. ఒక్కోసారి వచ్చే వీలు లేకుంటే ముందుగానే రాఖీ పంపిస్తాను. – గద్దె అనూష, లండన్ -
చెడు వ్యసనాలు వద్దు
ఆదిలాబాద్రూరల్: చెడు వ్యసనాల బారిన ప డొద్దని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం మావల మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘వ్యసన రహిత యువత, ఆరోగ్యకరమైన సమాజం, అ భివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్యంతో ప్రతి ఒ క్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శక్తిని, సమయాన్ని విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీ డలు, పరిశోధన, దేశ సేవ వంటి సానుకూల కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులున్నారు. -
నాకు ఎంతో స్పెషల్
కై లాస్నగర్: రాఖీ పండుగ నాకు ఎంతో స్పెషల్. మా అమ్మ, నాన్నలకు నేను ఏకై క సంతానం. నాకు తోబుట్టువులు లేరు. కానీ, మా పెద్దమ్మ, చిన్నమ్మ, పెదనాన్నల కూతుళ్లు అర్చన, నిఖిత, అంజమ్మ నాకు సొంత అక్కాచెల్లెళ్ల లెక్కనే. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు.. వారు ఎక్కడ ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వచ్చి రాఖీ కడతారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా వారికి దూరంగా ఉన్నప్పటికీ మరిచిపోకుండా రాఖీ కట్టేందుకు వస్తారు. నాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపుతారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ రక్షబంధన్ను ఎంత గొప్పగా జరుపుకొంటామో.. అంత గొప్పగానే మహిళలపై గౌరవభావంతో మెలగాలి. ప్రతి ఒక్కరూ ఎదుటి మహిళ, యువతులను తమ సొంత ఆడబిడ్డలుగా భావించినప్పుడే వేధింపులు లేని ఆదర్శ సమాజ నిర్మాణం సాధ్యపడుతుంది. – మంద మకరందు, ఐటీడీఏ పీవో, ఉట్నూర్ -
ఫుల్ గి‘రాఖీ’
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని దుకాణాలు కొనుగోలుదారులతో కిటికిటలాడుతున్నాయి. శుక్రవారం రాఖీ పౌర్ణమి కావడంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో వివిధ రంగులు, డిజైన్లలో రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. ముత్యాలు, రుద్రాక్షలు, రంగురాళ్లు, జర్దోసి, మెటల్ అలంకరణలతో రూపొందించిన, దేవతామూర్తుల చిత్రాలతో కూడిన, చిన్నారులను ఆకట్టుకునే కార్టూన్ పాత్రల బొమ్మలతో తయారు చేసిన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రాఖీలు రూ.20 నుంచి రూ.300 వరకు లభిస్తుండగా, ముత్యాలు, రాళ్లు, ప్రత్యేక అలంకరణలతో కూడినవి రూ.300 నుంచి రూ.1,500 వరకు విక్రయిస్తున్నారు. – ఆదిలాబాద్ -
అంతర్గాం శివారులో పులి సంచారం!
తాంసి: భీంపూర్ మండలంలోని అంతర్గాం శివారులో గురువారం పెద్దపులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. అంతర్గాం శివారులోని పంటచేలకు సమీపంలో ఉన్న గుట్ట సమీపంలో పులి సంచరించినట్లు రైతులు పులి పాదముద్రలను గుర్తించారు. వారం రోజుల క్రితం పులి సంచారంతో భయాందోళనకు గురైన ఆయా గ్రామాల ప్రజలు పులి కదలికలు లేకపోవడంతో మహారాష్ట్ర వైపు వెళ్లిపోయిందని భావించారు. కానీ మళ్లీ అంతర్గాం శివారులో పులి పాదముద్రలు గుర్తించడంతో పులి ఇక్కడే సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పులి ఎప్పుడు ఎటు వైపు నుంచి వస్తుందోనని మండలంలోని అర్లి(టి), అంతర్గాం, ఇందూర్పల్లి, భగవాన్పూర్, గోముత్రి గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. -
నేరాల నియంత్రణకు సహకరించాలి
ఇచ్చోడ: నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకే ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలి పారు. మండలంలోని దాబా(బి) గ్రామంలో గురువారం పోలీసులు మీకోసం కార్యక్రమంతోపా టు వైద్యశిబిరం నిర్వహించారు. ముందుగా ఎస్పీకి గ్రా మస్తులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు. 10 మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రజా సమస్య లను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై స్కిట్ ప్రదర్శించి అవగాహన కల్పించారు. వైద్యశిబిరంలో మహిళలు, బాలికలకు పీసీవోడీ, రక్తహీనత తదితర సమస్యలపై వైద్యులు అవగాహన కల్పించి డెంగీ, మలేరియా నివారణ చర్యలను వివరించారు. కంటి సమస్యలతో బాధపడేవారికి అవసరమైన సందర్భాల్లో ఉచిత కంటి శస్త్రచికిత్స సేవలందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎస్పీ అఖిల్ మహాజన్కు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మాదాపూర్లో సీసీ కెమెరాలు ప్రారంభం ఇచ్చోడ మండలంలోని మాదాపూర్లో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీజీ, అంబేడ్కర్ చిత్రపటాలకు ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఇచ్చోడ ఎస్హెచ్వో నరేశ్కుమార్, సర్పంచులు షేక్ ఇమ్రాన్, ఈశ్వర్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
విదేశీ టూర్కు మనోళ్లు
ఆదిలాబాద్టౌన్/ఆసిఫాబాద్రూరల్:: రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో విద్య సంబంధిత విషయాల పరిశోధన కోసం ఆదిలాబాద్ జి ల్లా బోథ్ మండలంలోని ధనోర జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచే స్తున్న రాజు చోప్డే, కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ ఎంఈవో రాథోడ్ సుభాష్ ఎంపికయ్యారు. మొదటి విడతలో ఆదిలాబాద్ జి ల్లా ఇంద్రవెల్లి మండలం ఏమైకుంటకు చెంది న గంగయ్య పిన్ల్యాండ్కు వెళ్లిన విషయం తెలిసిందే. రెండో విడతలో రాజు చోప్డే, రాథో డ్ సుభాష్ సెప్టెంబర్ 19న సింగపూర్ వెళ్లనున్నారు. ఏడు రోజుల పాటు అక్కడి విద్య విషయాలను పరిశీలించనున్నారు. వి ద్యారంగానికి సంబంధించిన అంశాలను జి ల్లాలో అమలుచేసేలా చర్యలు చేపట్టనున్నారు.సుభాష్ -
కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల గర్జన
కైలాస్నగర్: సమస్యల పరిష్కారానికి ఉద్యోగ, ఉ పాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కదం తొక్కారు. గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకుడు వెంకట్ మాట్లాడారు. ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడం మినహా రాష్ట్ర ప్రభుత్వం మరే సమస్య పరిష్కరించడం లేదని ఆరోపించారు. పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉన్నా అమలు చేయడంలేదని, ఆరు పెండింగ్ డీఏలు చెల్లించాలని కోరారు. రూ.10వేల కోట్ల పెండింగ్ బిల్లులు భేషరతుగా వెంటనే విడుదల చేయాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీంను పకడ్బందీగా అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు శ్రమకు తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 10న హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. వీరికి మాజీ మంత్రి జోగు రామన్న సంఘీభావం తెలిపారు. జేఏసీ నాయకులు నవీన్కుమార్, కె.శివకుమార్, కె.కృష్ణకుమార్, స్వామి, కె.కిష్టన్న, వి.అశోక్, ఎం.శ్రీనివాస్, జె.రవికుమార్, ఎం.శ్రీనివాస్, బి.వృకోధర్, నవీన్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ నిరుద్యోగులు కాంట్రాక్టర్లుగా ఎదగాలి
కైలాస్నగర్: ఎస్సీ నిరుద్యోగులు కాంట్రాక్టర్లుగా ఎ దిగి ఆర్థికంగా స్థిరపడాలని కలెక్టర్ రాజర్షిషా పిలు పునిచ్చారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు కాంట్రాక్టర్లుగా ఎదగడానికి అవసరమైన నియమ, ని బంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించగా ఆయన హాజరయ్యారు. పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, విద్యుత్, మున్సిపాలిటీ, నీటిపారుదల, రోడ్లు, భవనాల శాఖలకు చెందిన ఎస్ ఈలు పాల్గొని పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత, జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి మిల్కా, ఇంజినీరింగ్ శాఖలకు చెందిన అధికారులు పవన్కుమార్, రాజసింహం, రాజేశ్నాయక్, చంద్రమోహన్, సాగర్, కిరణ్, అక్షిత్కుమార్ తదితరులున్నారు. తోషంలో గ్రంథాలయం..గుడిహత్నూర్: మండలంలోని తోషం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్ రాజర్షిషా గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఐటీడీఏ పీవో మంద మకరందుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన గ్రామసభలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. అనంతరం సద్గురు పూలాజీబాబా జన్మదిన మహోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. స్థానిక సర్పంచ్ పద్మ గ్రామ సమస్యలను కలెక్టర్కు విన్నవించగా పరిష్కారానికి హామీ ఇచ్చారు. డీపీవో రమేశ్, డీఎల్పీవో ఫణిందర్, తహసీల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో ఇంతియాజ్, ఎంఈవో గోపాల్సింగ్, ఉపసర్పంచ్ షెహనాజ్, డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ తదితరులున్నారు.వాటర్షెడ్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం నార్నూర్: మండలంలోని గుంజాల గ్రామంలో వాటర్షెడ్ ప్రాజెక్ట్ పనులను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓట రు జాబితా సవరణపై గ్రామసభ, గ్రామాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. హస్నాపూర్–నా ర్నూర్ రహదారితోపాటు పెండింగ్లో రహదా రులకు త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు మండల పరి షత్ ప్రాథమిక పాఠశాలలోని న్యూట్రిగార్డెన్ను పరిశీలించి నిర్వహణ తీరును అభినందించారు. అనంతరం మొక్క నాటి నీరు పోయగా, గ్రామస్తులు ఆ మొక్కకు రాజర్షి షాగా నామకరణం చే శారు. నాబార్డ్ డీడీఎం అబ్దుల్ రౌఫ్, ధాన్ స్వ చ్ఛంద సంస్థ ప్రతినిధి నీలేశ్, పీఆర్ ఈఈ శివరాం, ఎంపీడీవో పుల్లారావు, తహసీల్దార్ రాజ లింగు, ఎంఈవో మనోహర్, డీఎల్పీవో ప్రభాకర్, సర్పంచ్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ హక్కుల సాధనకు కృషి
ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయుల హక్కుల సాధన, సంక్షేమం కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘం కృషి చేస్తుందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి.సదానందంగౌడ్ అన్నారు. సంఘం 80 వసంతాల వేడుకను జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలకు ఎస్టీయూ తల్లి వంటిదని, స్వాతంత్య్రానికి పూర్వమే సంఘం ఆవిర్భవించి ఎన్నో చారిత్రిక విజయాలతో మిగిలిన సంఘాలకు దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదరి గజేందర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల హక్కులను పోరాడి సాధించడంలో సంఘం ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో సంఘ బాధ్యులు పాల్గొన్నారు. -
ఘనంగా మిలాద్ ఉన్ నబీ
ఆదిలాబాద్: మిలాద్ ఉన్ నబీ పండుగను ము స్లింలు జిల్లా కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఖానాపూర్లోని జోహర మసీ దు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఇమామ్ మహ్మద్ జాకీర్ హుస్సేన్ ఖద్రి ప్రవక్త జీవిత చరిత్ర, సేవలు, బోధనలను వివరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జీవితం ఆదర్శప్రాయం కైలాస్నగర్: మహమ్మద్ ప్రవక్త జీవితం యా వత్ మానవాళికి ఆదర్శప్రాయమని కలెక్టర్ రాజర్షిషా ప్రకటనలో తెలిపారు. మిలాద్ ఉన్ నబీ సందేశంతో యువతలో మానవత్వం పెంపొందాలని ఆకాంక్షించారు. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త ప్రపంచా నికి అందించిన ప్రేమ, కరుణ, దయ, సహనం, సోదరభావం, శాంతి వంటి మహోన్నత సందేశాలను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరారు. పండుగలు సోదరభావంతో జరుపుకోవాలి ఆదిలాబాద్టౌన్: జిల్లా ప్రజలు పండుగలను సోదరభావంతో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ బందోబస్తును పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అన్ని పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీసు శాఖ పటిష్ట భద్రత చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, పట్టణ సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరు డీఏలు వెంటనే ప్రకటించాలి
2024 జూన్ నుంచి 2026 జూలై వరకు ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలి. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లయింది. కమిటీ కాలయాపన చేస్తోంది. హెల్త్ స్కీమ్కు సంబంధించి మూడు నెలలుగా ఉద్యోగుల వేతనం నుంచి డబ్బులు కట్ చేస్తున్నారు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చూడాలి. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిల కోసం ప్రతినెలా రూ.2వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ అమలు చేయడం లేదు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. – శివకుమార్, టీజీవో జిల్లా అధ్యక్షుడు -
నేడు గ్రామ, వార్డుసభలు
కై లాస్నగర్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)లో భాగంగా జిల్లావ్యాప్తంగా గురువారం గ్రామ, వార్డుసభలు నిర్వహించనున్నారు. ఇటీవల ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన నేపథ్యంలో వీటిని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతుంది. సభల నిర్వహణపై ఇప్పటికే మండల, వార్డుస్థాయి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. పారదర్శక ఓటర్ల జాబితా తయారీలో కీలకమైన ఈ సభల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త ఓటర్ల నమోదుపై అవగాహన ముసాయిదా జాబితా వివరాలు వెల్లడించడంతో పాటు కొత్త ఓటర్ల నమోదుపై కూడా ఈ సభల్లో అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 2026 అక్టోబర్ 1నాటికి 18ఏళ్ల నిండిన యువత ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు చేపడుతారు. వీరంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా ఫారం–6లను అందించనున్నారు. చిరునామాలో మార్పులు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం వంటి సవరణలు అవసరమైన పక్షంలో ఫారం–8 ద్వారా, జాబితాలో పేరు తొలగింపు, ఇతర ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫారం –7ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. వాటిని పూరించిన తర్వా త తగు ఆధారాలతో తిరిగి స్వీకరిస్తారు. అలాగే గతంలో ఓటు హక్కు కలిగి ఉండి, వినియోగించుకున్నప్పటికీ ముసాయిదాలో పేర్లు లేనటువంటి ఓటర్లు తాము ఆయా ప్రాంతాల్లోని ఓటర్లమేనని నిర్ధారించుకునేలా ఈసీ నిర్దేశించిన 12 ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకదానిని సమర్పించేలా వారికి అవగాహన కల్పించనున్నారు.విజయవంతం చేయాలిఎన్నికల సంఘం ఆదేశానుసారం ఈనెల 27న జిల్లావ్యాప్తంగా వార్డు, గ్రామసభలు నిర్వహిస్తున్నాం. ముసాయిదా జాబితాలోని ఓటర్లతో పాటు ఏఎస్డీ జాబితాలోని ఓటర్ల వివరాలను ఇందులో అధికారులు చదివి వినిపిస్తారు. జాబితాలో పేర్లు లేని ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిన ఈ సభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. – ఎస్.రాజేశ్వర్, అదనపు కలెక్టర్ -
రిమ్స్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
ఆదిలాబాద్టౌన్: రిమ్స్లో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిమ్స్లో ఖాళీగా ఉన్న డైరెక్టర్, సూపరింటెండెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అలాగే రిమ్స్లో కొద్ది రోజులుగా జనరేటర్, ఆక్సిజన్ ప్లాంట్, ఎస్ఏడీపీ పనిచేయడం లేదని తెలిపా రు. వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. క్రిటికల్ కేర్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని పేర్కొన్నారు. రిమ్స్లో ఎనిమి ది లిఫ్ట్లు ఉండగా, రెండు మాత్రమే పనిచేస్తున్నాయని, మిగతావి కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 110 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా ఫ్యాకల్టీని నియమించాలన్నా రు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని, లేనియేడల ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇందులో సంఘం నాయకులు కోట్నాక్ సక్కు, పెందూర్ గోవింద్, భీంరావు, రామారావు పాల్గొన్నారు. -
ఆ భూములపై ఫోకస్
సాత్నాల: భోరజ్ మండలంలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించిన భూముల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇందుకోసం సేకరించనున్న భూముల్లో ఈడీ జప్తు చేసినవి ఉండడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారంది. గతంలో నే తక్కువ ధరకు విక్రయించి, పట్టాలు మారిన భూ ములకు పరిహారం పొందనున్నట్లు గుర్తించిన అధి కార యంత్రాంగం వారికి నోటీసుల జారీకి శ్రీకారం చుట్టింది. మండలంలోని హత్తిఘాట్, గూడ, రాంపూర్, గిమ్మశివారులో ఉన్న 250 ఎకరాల జీఎస్ భూముల్లో క్రయవిక్రయాలు జరిగా యి. ఇందులో 98 మంది రైతులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఏం జరిగిందంటే.. గతంలో ఉన్న జీఎస్ భూములపై కొంతమంది వ్యక్తులు కన్ను వేసి భూముల విలువ పెరుగుతుందని గుర్తించారు. తమకు అనుకూలమైన వారికి, బినామీలపై పట్టాలు చేయించారు. కొన్ని పట్టా భూములు ఉండగా ఇప్పటికే ఇద్దరు ముగ్గురికిపైగా చేతులు మారాయి. ఈ భూములపై ప్రముఖ పారిశ్రామికవేత్త గౌరీశంకర్ రుణాలు తీసుకోగా, వాటిని కట్టలేని పరిస్థితుల్లో ఈడీ జప్తు చేసింది. ఈ భూములకు సైతం భవిష్యత్తులో ధర పెరుగుతుందని గ్రహించిన కొంతమంది నాయకులు తమకు అనుకూలమైన వారిపై పట్టాలు చేయించారు. ఇలాంటివి వందలాది ఎకరాలు ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ భూముల పరిధిలోనే ఇండస్ట్రియల్ కారిడార్ రావడంతో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అసలు ఏం జరుగుతుందని అధికార, రాజకీయపక్షాల్లో ఉత్కంఠ నెలకొంది. -
ఘనంగా ఓనం వేడుకలు
ఆదిలాబాద్రూరల్: మండలంలోని బెల్లూరి అయ్యప్ప ఆలయంలో ఓనం వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ వేర్వేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేరళలో ఏ విధంగా ఓనం పండుగ జరుపుకుంటారో అదే తరహాలో బెల్లూరి ఆలయం వద్ద భక్తులు భారీగా పాల్గొని హోమం, అభిషేకం, దీక్షా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ప్రత్యేకమన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమేశ్, గురుస్వాములు గొర్ల కృష్ణ, గణేశ్, సత్యం, లక్ష్మి, భక్తులు, గ్రామస్తులు, పాల్గొన్నారు. -
సమరభేరికి సై
ఆదిలాబాద్టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. ఇందులో భాగంగా నేడు సమరభేరికి సిద్ధమయ్యారు. టీజీ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం మహా ధర్నా చేపట్టనున్నారు. ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు విన్నవించినా సానుకూల స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైనట్లు జేఏసీ నాయకులు చెబుతున్నారు. జిల్లాలోని నాల్గో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు సుమారు 7వేల మంది వరకు ఇందులో పాల్గొననున్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సైతం భాగస్వాములవుతున్నట్లు వెల్ల డించారు. మరోవైపు ఇప్పటికే కలెక్టర్ రాజర్షిషాను కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశామని, ధర్నాకు అనుమతి కోసం ఎస్పీ అఖిల్ మహాజన్ను కూడా కలిసినట్లు వివరించారు. డిమాండ్లు ఇవే.. -
ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి
కై లాస్నగర్: ఈనెల 27న గ్రామ, వార్డుసభల్లో అర్హులైన ప్రతీ ఓటరును గుర్తించి, అందులో ఏ ఒక్కరూ తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏ–2లు, మండల, పట్టణ, వార్డు అధ్యక్షులపై ఉందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఓటరు జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్క రూ పరిశీలించుకునేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘డయల్ యువర్ ఎస్ఈ’కి నాలుగు ఫిర్యాదులు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని విద్యుత్ భవన్లో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నలుగురు విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులు అందజేశారు. స్తంభాలు, లైన్ల మార్పు, మున్సిపల్ లైన్లకు సంబంధించిన సమస్యలను వారు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఈఈ (టెక్నికల్) అల్తాఫ్, డీఈఈ మునీంద్ర, ఏఈలు తిరుపతయ్య, నరసింహారావు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
రెగ్యులర్ చేసే వరకూ పోరాటం
● నల్లబ్యాడ్జీలతో కాంట్రాక్ట్ నర్సుల నిరసన నెల్లూరు(అర్బన్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ శరత్బాబు మాట్లాడుతూ వైద్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని కోరారు. విధి నిర్వహణలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ సౌకర్యం కల్పించడంతోపాటు రిక్వెస్ట్, మ్యూచ్వల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సమ్మె నోటీసులను జాయింట్ కలెక్టర్, డీఎంహెచ్ఓ, జీజీహెచ్ సూపరింటెండెంట్కు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ షేక్ షఫీ, సిస్టర్ రూత్ గ్రేస్, పి.వేణు, సుసన్న తదితరులు పాల్గొన్నారు. -
మర్యాదపూర్వకంగా..
నెల్లూరు(లీగల్): జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.నరసింహమూర్తిని ఎస్పీ డా.అజిత వేజెండ్ల సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కోర్టులోని ఆయన చాంబర్లో కలిసి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తిశ్రద్ధలతో ‘రంగడి’ పవిత్రోత్సవాలునెల్లూరు(బృందావనం): రంగనాయకులపేటలో కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు తిరుమంజనం, హోమాలు, పవిత్ర సమర్పణలను వేదపండితులు విశేషంగా నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కనులపండువగా గోపురోత్సవం, భక్తిప్రపత్తులతో హోమాలు జరిగాయి. కార్యక్రమాలను కార్యనిర్వహణాధికారి ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి, సభ్యులు పర్యవేక్షించారు. బీజేపీ నేతల నిరసననెల్లూరురూరల్: బీజేపీ నాయకులు కోటమిట్టలోని మహాలక్ష్మమ్మ ఆలయం వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ సాదిక్ ఖాన్ను పూర్తిస్థాయిలో విచారించాలన్నారు. చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటనలో అతనికి సహకరించినట్లు దర్యాప్తులో తేలిన వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పుడు వారి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను కూడా ప్రజలకు తెలియజేయాలని కోరారు. 18వ డివిజన్లో కమిషనర్ పర్యటననెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ సోమవారం 18వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. తొలుత హరనాథపురం ప్రధాన వీధుల్లో నూతనంగా నిర్మిస్తున్న కాలువల పనులను పరిశీలించారు. డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న భవనాలు, అదనపు అంతస్తులను గుర్తించి వాటికి నగరపాలక సంస్థ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని సూచించారు. అనుమతులు ఉన్న నిర్మాణాలను పన్ను పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఖాళీ స్థలాలను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేసి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అన్ని వాణిజ్య సంస్థలు, దుకాణాలు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ పొందేలా చూడాలన్నారు. -
గురువులకు విద్యారత్న పురస్కారాలు
నెల్లూరు(బృందావనం): ఏవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురమందిరంలో సెప్టెంబర్ 6వ తేదీన నిర్వహిస్తామని నిర్వాహకుడు కేతా సుబ్బారావు తెలిపారు. ఆహ్వానపత్రికలను మద్రాస్ బస్టాండ్ దగ్గర ఉన్న ఫౌండేషన్ కార్యాలయంలో సోమవారం మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత వీరిశెట్టి హజరత్బాబు, ప్రపంచతెలుగు సమాఖ్య నెల్లూరు ప్రాంతీయ అధ్యక్షుడు నలుబోలు బలరామయ్యనాయుడు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉత్తమ విద్యాబోధన చేస్తున్న తొమ్మిది మంది గురువులకు విద్యారత్న పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించనున్నామన్నారు. పాటలు, డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు 77299 42543 నంబర్ను సంప్రదించాలన్నారు. -
పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేక దృష్టి
నెల్లూరు(బారకాసు): పీజీఆర్ఎస్ వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వైఓ నందన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మినీబైపాస్లో చేపల విక్రయదారులు, ఎన్టీఆర్ పార్కు వద్ద రకరకాల ఫాస్ట్ ఫుడ్ వ్యాపారాలతో రోడ్లు ఆక్రమణలకు గురైనట్లు చెప్పారు. వాహనదారులకు తీవ్రమైన అడ్డంకిగా మారుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీను నిర్వహించి రోడ్డు ఆక్రమణల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేయడం వల్ల ప్రజా రవాణాకు ఇబ్బందులతోపాటు కాలువలు పూడుకుపోతున్నాయని పేర్కొన్నారు. కన్స్ట్రక్షన్, డెమాలిషన్ వ్యర్థాలను నగరపాలక సంస్థకు అప్పగించాలని సూచించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబర్ 9494018118కు సమాచారం అందిస్తే వ్యర్థాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.మొత్తం 50 వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ రహంతుజానీ, ఈఈలు శేషగిరిరావు, చంద్రయ్య, అనిల్ కుమార్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం టీపీఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
నూతన అధ్యక్షుల నియామకం
నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ నెల్లూరు నగర మహిళా విభాగం అధ్యక్షురాలిగా రజని, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా మహేశ్వరి, ఆర్టీఐ విభాగం అధ్యక్షుడిగా నాగ శ్రీనివాసులురెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. వీరు సిటీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిని సోమవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వారిని అభినందించి పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, నగర నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ధనుజారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం రేపు
నెల్లూరు(బృందావనం): ‘పద్మావతినగర్లోని సాయిదర్బార్ అద్దాల మందిర అనుబంధ సాయిమాత నిత్య అన్నప్రసాదాలయం ద్వారకామాయి పంచమ వార్షికోత్సవ వేడుకలు రెండు రోజులు జరుగుతాయి. బుధవారం లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తాం’ అని ఆ మందిర కమిటీ మేనేజింగ్ ట్రస్టీ చైర్మన్, షిర్డీ సాయి ధర్మ పరిరక్షణ సేవాసమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసాయి తెలిపారు. ఆహ్వాన పత్రికలను అన్నప్రసాదాలయంలో సోమవారం ఆవిష్కరించారు. మంగళవారం ‘ఓం సాయి.. శ్రీసాయి.. జయజయ సాయి’ నామ సంకీర్తన, అనంతరం అన్నప్రసాద వినియోగం జరుగుతుందన్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత పెనుశిల లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహిస్తామన్నారు. భక్తులకు కల్యాణ తలంబ్రాలు, ముత్యాలు కానుకగా ఇస్తామన్నారు. రెండు రోజులు విశేషంగా నిర్వహించే కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. సమావేశంలో సాయిదర్బార్ భజన, సత్సంగ, సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. -
జిల్లాలో టీబీ నిర్మూలనే ధ్యేయం
నెల్లూరు(అర్బన్): జిల్లాలో టీబీ (క్షయ) వ్యాధిని నిర్మూలించడమే ధ్యేయంగా వైద్యసిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కలిసి కృషి చేయాలని అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఖాదర్వలీ అన్నారు. ప్రధానమంత్రి ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్తభారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సోమవారం నగరంలోని భక్తవత్సలనగర్లో ఉన్న డేమియన్ ఫౌండేషన్ కార్యాలయంలో క్షయ నివారణ సిబ్బందితో సమీక్ష జరిగింది. ఆయన మాట్లాడుతూ జబ్బు నిర్ధారణ అయిన వారికి ఉచితంగా ప్రతి పీహెచ్సీ పరిధిలోనే మందులు అందజేస్తారన్నారు. అత్యంత నిరుపేదలుండే ప్రాంతాల్లో టీబీ లక్షణాలుండే వారిని గుర్తించి ఇంటి వద్దనే హ్యాండ్ మెషీన్తో ఎక్స్రే తీయించి డాక్టర్ ద్వారా పరిశీలించాలన్నారు. ఇందుకోసం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సమన్వయకర్త విజయకుమార్, టీబీ, హెచ్ఐవీ కో ఆర్డినేటర్ శ్రావణ్కుమార్, పబ్లిక్, ప్రైవేట్ మిక్స్ కో ఆర్డినేటర్ హరీష్, క్షయ నివారణ సూపర్వైజర్లు, చికిత్స ఆర్గనైజర్లు, భవ్య హెల్త్ కేర్ సిబ్బంది, ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్థానికం
నెల్లూరు / నెల్లూరురూరల్సమస్యను కళ్లముందున్న అధికారులకు చెబితే పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. అయితే కొందరి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వినతులు చేతపట్టుకుని ఎన్నిసార్లు వెళ్లినా తమకు భరోసా దక్కడం లేదని వృద్ధులు, దివ్యాంగులు, అవయవాలు కోల్పోయిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పలువురు బాధితులు తరలివచ్చారు. తమ ఇబ్బందులను అధికారులకు వివరించి వినతులు అందజేశారు. సమస్యను చెప్పుకొనేందుకు అవకాశం దొరికినా.. దాని పరిష్కారం కోసం మళ్లీ ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఎదురవుతోందని కొందరు వాపోయారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
రాఖీ.. ఆర్టీసీ స్పెషల్
మంచిర్యాలఅర్బన్: రాఖీ పండుగ సందర్భంగా ప్ర యాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఈ నెల 25నుంచి మూడు రోజులపాటు రాకపోకలకు ఏర్పాట్లు చేసింది. రద్దీకి అనుగుణంగా ప్రధాన రూట్లతోపాటు హైదరాబాద్ నుంచి వివి ధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులకు ప్రణాళిక సిద్ధం చేసింది. మహాలక్ష్మి పథకం అమలులో ఉండడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సాధారణ బస్సులతోపాటు రద్దీని తట్టుకోవడానికి ఆది లాబాద్ రీజియన్లో ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తెస్తున్నారు. హైదరాబాద్లో చదువులు, వివిఽ ద ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఉన్నవారంతా స్వగ్రామాలకు రానుండడంతో ఈ నెల 25,26, 27న 157 ప్రత్యేక బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చనున్నారు. ముందుస్తు రిజర్వేషన్లు టికెట్ ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉండడంతో ప్రధాన మార్గాల్లో బస్సులన్నీ ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ వయా లక్సెట్టిపేట మీదుగా ఈ నెల 27, 28న మంచిర్యాలకు వచ్చే పది బస్సులు నిండిపోయాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు రాకపోకలు సాగించే బస్సుల్లో మరింతగా డిమాండ్ ఉంది. మరో తొమ్మిది ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు సాధారణ సర్వీసుల్లో రెగ్యులర్ చార్జీలే ఉంటాయి. మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం యథావిధిగా వర్తిస్తుంది. పండుగ సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో ఒకటిన్నర చార్జీలు(50శాతం అదనం) వసూలు చేయనున్నారు. పండుగ వేళ పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనపు చార్జీల భారం పడనుంది. -
27న గ్రామ, వార్డు సభలు
కై లాస్నగర్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఈనెల 27న గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయ న పాల్గొన్నారు. అనంతరం అధికారులతో స మీక్షించారు. పంచాయతీ కార్యదర్శులు, బీఎల్వోలు, సూపర్వైజర్లు ఈ ప్రక్రియను సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించా రు. గ్రామ, వార్డుసభల్లో ముసాయిదా ఓటరు జాబితా, ఏఎస్డీ జాబితాలను తప్పకుండా చదివి వినిపించాలన్నారు. డెత్ కేసులు, షిఫ్టెడ్, డబుల్ ఎంట్రీలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే ఏఎస్డీ జాబితాలో చేర్చాలని, పొరపాటు న ఏఎస్డీ జాబితాలో వస్తే ఫారం–6 ద్వారా సరిచేయాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి, జీపీవో, బీఎల్వో, సూపర్వైజర్లు సమన్వయంతో పని చేసి ఓటర్ల జాబితా ప్రక్షాళనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీ డియో కాన్ఫరెన్స్లో డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావు, పర్యవేక్షకురాలు నలంద ప్రి య, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘నీట్ పీజీ–2026’కు పకడ్బందీ ఏర్పాట్లు కై లాస్నగర్: ఈ నెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ– 2026కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో పరీక్ష ని ర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. నలంద డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించనున్న పరీక్ష కు 100మంది హాజరుకానున్నట్లుగా తెలిపా రు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. స మావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రు, ఎస్.రాజేశ్వర్, డీఎంహెచ్వో సాధన, డీఐఈవో గణేశ్జాదవ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, పర్యవేక్షకురాలు శైలజ తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానం అవసరం
ఆదిలాబాద్టౌన్: విద్యార్థుల అభ్యసన ఫలితా లు మెరుగుపర్చేందుకు బోధనలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగించాలని డీఐ ఈవో జాదవ్ గణేశ్కుమార్ అన్నారు. జిల్లాలో ని నాలుగు క్లస్టర్ల పరిధిలోని లెక్చరర్లకు సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలురజూనియ ర్ కళాశాలలో నిర్వహించిన సమావేశానికి హా జరయ్యారు. విద్యార్థుల ప్రగతి,హాజరుశాతం, అడ్మిషన్ల పెంపు, బోధన ప్రమాణాల మెరుగుదలపై పలు సూచనలు చేశారు. విద్యార్థుల అ భ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు స మర్థవంతమైన బోధన పద్ధతులు అవలంభించాలని, తరగతి గదిలో సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా కళాశాలల లెక్చరర్లు పాల్గొన్నారు. ఇచ్చోడలో..ఇచ్చోడ: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో నిర్వహించిన క్లస్టర్ సమావేశంలో డీఐఈవో పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్లస్టర్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శంకర్, డీఏఎంవో సభ్యులు సునిల్, సత్యనారా యణ, ఉపేందర్రెడ్డి, లక్ష్మణ్, వనజ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి దరఖాస్తులు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో మంద మకరందు ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పిడుగుపాటుతో మృతి చెందిన ఎనిమిది మేకలకు పరిహారం ఇవ్వాలని జైనూర్ మండలం జెండాగూడకు చెందిన గుణవంత్రావ్, ఆసరా పింఛన్ ఇప్పించాలని ఇంద్రవెల్లి మండలం పెద్ద కేస్లాపూర్ గ్రామానికి చెందిన శేకు, అటవీహక్కు పత్రం మంజూరు చేయాలని జన్నా రం మండలం దేవునిగూడెం గ్రామస్తులు దరఖాస్తులు అందజేశారు. ఇంకా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్య ల పరిష్కారం, తదితర అంశాలపై తమ వినతిపత్రాలు అందజేశారు. ప్రతీ దరఖాస్తును సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అధికారులకు సూచించారు. -
38 మందికి ఒకే ఉపాధ్యాయుడు
ఇంద్రవెల్లి: మండలంలోని జాలంతాండ దిశ మోడల్ స్కూల్లో ఒకటి నుంచి ఐదోతరగతి వరకు మొత్తం 38 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ గత జనవరిలో పదవీ విరమణ పొందగా...వేరే ఉపాధ్యాయులను నియమించలేదు. దీంతో ఎస్జీటీ రామారావ్ ఒక్కడే పాఠశాలలోని 38 మంది విద్యార్థులకు చదువుచెప్పాల్సి రావడంతో పని ఒత్తిడితో ఇబ్బందులకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 38 మంది విద్యార్థులకు ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఎస్జీటి ఉపాధ్యాయులు అవసరం ఉండగా...ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉపాధ్యాయులను నియమించకపోవడంతో తమ పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ఐటీడీఏ పీవో దృష్టి సారించి జాలంతాండ దిశ మోడల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో ఎస్జీటీ ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కదం తొక్కిన ఆదివాసీలు
ఉట్నూర్రూరల్: రాజ్యాంగబద్ధమైన హక్కుల పరి రక్షణ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలు కదం తొక్కా రు. తుడుందెబ్బ పిలుపుమేరకు సోమవారం నిర్వహించిన ‘చలో ఐటీడీఏ’ ముట్టడి కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. ఉట్నూర్లోని గిరిజన భవన్కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా ఐటీడీఏ కార్యాలయం వరకు సంప్రదాయ డోలు, సన్నాయి వాయిద్యాలతో ర్యాలీగా బయలుదేరారు. ప్రధాన ద్వారం ఎదు ట రహదారిపై బైఠాయించారు. దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. ముట్టడి నేపథ్యంలో ఉదయం నుంచే వ్యాపారులు స్వచ్ఛందంగా దుకా ణాలు మూసివేయడంతో బంద్ వాతావరణం కని పించింది. ఈ సందర్భంగా తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణల లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షు డు గోడం గణేశ్, ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ మాట్లాడారు. ఏళ్లుగా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారని, చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మండిపడ్డారు. 1/70 చట్టాన్ని సవరించాలని సుప్రీంకోర్టులో కేసు వేసిన గిరిజనేతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మే ఆదివాసీల పక్షాన కౌంటర్ రిట్ పిటిషన్ దాఖ లు చేయాలన్నారు. జీవో ఎంఎస్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంత పోలీస్ ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసీ లకు 75శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, జీవో నంబర్ 3 పునరుద్ధరించి, స్థానిక ఆదివాసీల ఉపాధి, ఉద్యోగ హక్కులను కాపాడాలన్నారు. గిరిజనేతరుల భూ దురాక్రమణలు, అక్రమ భూ బదిలీలు అరికట్టాలని, వలస లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే అంశంపై సమగ్ర విచారణకు ప్ర త్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఆదివాసీ నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని, ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అటవీ హ క్కులచట్టం 2006 ప్రకారం సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 120 రాయ్ సెంటర్లకు పక్కా భవనాలు నిర్మి స్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలన్నారు. ‘కోర్ ఏరియా’, ’బఫర్ ఏరియా’, ’టైగర్ జోన్’ పేర్లతో ఆదివాసీలపై అట వీ అధికారుల దాడులు నిలిపివేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోకూడదన్నారు. ప్రభుత్వాలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చే స్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు నగేష్, సిడాం జంగుదేవ్, పెందుర్ పుష్పారాణి, స త్యం, ఇందిరా, నారాయణ, రాజన్న, మడావి వెంకటేశ్, సోయం చిన్నయ్య, అర్క శేషరావు, కొడప నగేశ్,మనోజ్ ఆదివాసీలుతదితరులు పాల్గొన్నారు. హామీ ఇచ్చిన ఐటీడీఏ పీవో.. విరమించిన ఆందోళన ఆదివాసీలు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్ట డించిన విషయం తెలుసుకున్న పీవో మంద మకరందు స్వ యంగా అక్కడికి చేరుకున్నారు. వారి నుంచి వినతి పత్రం స్వీకరించారు. సమస్యలు అడిగి తెలు సుకున్నారు. ప్రభుత్వందృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఆదివాసీల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఐటీడీఏ ఎల్లప్పుడు క ట్టుబడి ఉంటుందని తెలిపారు. సమస్యలను ప్రా ధాన్యత క్రమలో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆదివాసీలు ఆందోళన విరమించారు.కట్టుదిట్టమైన బందోబస్తు.. ఐటీడీఏ ముట్టడి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో అడ్మిన్ ఏఎస్పీ మౌనిక, ఉట్నూరు, ఆదిలాబాద్ ఏఎస్పీలు రుత్విక్ సాయి కొట్టే, సురేందర్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానద్వారం వద్ద, ఎన్టీఆర్ చౌక్, ఐబీ చౌరస్తాలో భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు ఆదివాసీల భారీ ర్యాలీ, ధర్నా కారణంగా ఉట్నూర్ ఎక్స్రోడ్డు, చెక్పోస్ట్ కొత్తగూడ పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నోటీసులు షురూ
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని పోలింగ్స్టేషన్ 271 పరిధిలో గల ఓటరు షిండే సరస్వతి పేరు ముసాయిదా జాబితాలో వచ్చినప్పటికీ నో మ్యాపింగ్ కారణంగా సోమవారం రెవెన్యూ ఆర్ఐ యజ్వేందర్ రెడ్డి, బీఎల్వోలు లక్ష్మీ, గంగామణి ఆమెకు నోటీసు అందజేశారు. అందులో ఏరోజు వి చారణకు హాజరు కావాలో తేదీని సూచించారు. ఆ రోజు సంబంధిత ద్రువపత్రాలతో విచారణకు హా జరై సరిచేసుకుంటే తుది జాబితాలో పేరు ఉంటుందని తెలిపారు. ఈనెల 10న ప్రత్యేక ఓటరు జాబి తా సవరణ ముగిసిన విషయం తెలిసిందే. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన విషయం విదితమే. సవరణకు ముందు, తర్వాత ఉన్న ఓటర్లలో వేలాది మంది ఓటు తొలగించారు. డెత్, షిఫ్టింగ్, డూప్లికేట్, ఆబ్సెంట్, అదర్స్ కారణాలతో ఈ ఓట్లను తొలగించిన విషయం తెలిసిందే. ఇక ముసాయిదా జాబితాలో ఉన్న వారి పేర్లలో వివిధ కారణాలతో లక్షన్నరకు పైగా ఓటర్లకు నోటీసుల జారీని సోమవారం షురూ చేశారు. ఈనెల 31 వరకు అందించనున్నారు. నోటీసు అందుకున్న ఓటరు అందులో సూచించిన తేదీన విచారణకు హాజరై సంబంధిత ద్రువ పత్రాలతో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. స్పందించకపోతే తుది ఓటరు జాబితాలో తొలగింపునకు గురవుతారు. ఇదీ పరిస్థితి.. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా మొదట ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పూ రించిన ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ వంటి ప్రక్రియ నిర్వహించారు. అందులో వివిధ అంశాల పరంగా జిల్లాలో తొలగింపునకు గురయ్యే ఓటర్లపై స్పష్టత వచ్చింది. ఆ తొలగించిన ఓటర్ల సంఖ్య తర్వాత ముసాయిదా జాబితాలో పేరు ఉన్నప్పటికీ వివిధ కారణాలతో పలువురికి ఇప్పుడు నోటీసులు అందజేస్తున్నారు. అది అందుకున్న ఓటరు సూచించిన తేదీ ప్రకారం ఈఆర్ఓ ఎదుట హాజరై సంబంధిత ద్రువ పత్రాలతో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు, బీఎల్వో లు నోటీసుల జారీలో నిమగ్నమయ్యారు. ఆగస్టు 31 తర్వాత విచారణ పూర్తవుతుంది. సెప్టెంబర్లో తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. నోటీసు అందుకున్న ఓటరు స్పందిస్తేనే ఆ ఓటు నిలుస్తుంది. లేనిపక్షంలో తొలగింపునకు గురవుతుంది. ఈ నోటీసుల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రధానంగా అధికార కాంగ్రెస్ దృష్టిసారించింది.వివిధ అంశాల ఆధారంగా నోటీసులు ఇస్తుండగా, దానికి ఓటరు స్పందించేలా పార్టీ మండల అధ్యక్షులు, బీఎల్ఏలను సంసిద్ధులను చేసింది. వివరాలు ఇలా..సవరణకు ముందు జిల్లాలో ఓటర్లు 4,66,784 ముసాయిదా జాబితాలో ఓటర్లు 4,03,625 తొలగించిన ఓటర్లు 63,159 నోటీసులు అందుకోనున్న ఓటర్లు 1,50,417 అందులో అనామలిస్ ఓటర్లు 1,32,816 నో మ్యాపింగ్ ఓటర్లు 17,601 -
ఏసీబీకి చిక్కిన సేల్స్ట్యాక్స్ అధికారులు
నిర్మల్టౌన్: నిర్మల్ సర్కిల్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ (సీటీవో) కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణ సోమవారం రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ జ్యువెల్లరీ సంస్థకు సంబంధించిన 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల వ్యాపార రికార్డులపై అనుకూలమైన ఆడిట్ నివేదిక ఇచ్చి, తక్కువ పన్ను చెల్లించేలా టర్నోవర్ బాధ్యతను తగ్గించేందుకు అధికారులు రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడి అభ్యర్థనతో రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఏసీబీ అధికారులు సూచించిన విధంగా ఫిర్యాదుదారుడు లంచం మొత్తాన్ని తీసుకుని కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గోదావరికి రూ.50 వేలు అందజేయగా.. ఆమె ఆ మొత్తాన్ని సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణకు అందజేశారు. ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రసాయన పరీక్షలు నిర్వహించగా.. లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
సోదర ప్రేమకు సరిహద్దుల్లేవ్..!
నేరడిగొండ: ఉద్యోగ, విద్య, వ్యాపారం నిమిత్తం విదేశాల్లో స్థిరపడిన సోదరులకు రాఖీలు పంపించేందుకు తపాలా శాఖ ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది. ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ (ఐటీపీఎస్) ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాలకు రాఖీలను పంపించే వెసులుబాటు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ కొరియర్ కంటే తక్కువ ఖర్చుతో ఈ సేవ అందుబాటులో ఉండటంతో సోదరసోదరీమణులు తమ అనుబంధాన్ని సరిహద్దులు దాటి చాటుకునే అవకాశం లభిస్తోంది. 3 నుంచి 12 రోజుల్లో చేరేలా..రాఖీ పార్శిళ్లను కార్గో విమానాల ద్వారా విదేశాలకు సురక్షితంగా తరలిస్తారు. బుకింగ్ చేసిన తర్వాత ప్యాకెట్ ఎక్కడ ఉందో ఆన్లైన్లో ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉంది. సాధారణంగా మూడు నుంచి 12 రోజుల్లో గమ్యస్థానానికి చేరుతుందని తపాలా అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆయా దేశాలకు బరువును బట్టి చార్జీలు వసూలు చేయనున్నారు. ఆయా దేశాలను బట్టి పార్సిల్ బరువు 2 కిలోల నుంచి 5 కిలోల వరకు ఉండవచ్చు.సద్వినియోగం చేసుకోవాలి విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీలు పంపాలనుకునే వారు తపాలా శాఖ అందిస్తున్న ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సేవలు, చార్జీలు, బుకింగ్, తదితర వివరాల కోసం సమీపంలోని తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలి. – రాకేష్ కుమార్, సబ్ పోస్ట్మాస్టర్, నేరడిగొండ 135 దేశాలకు రాఖీలు పంపేలా..తపాలా శాఖకు చెందిన ఐటీపీఎస్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 135 దేశాలకు రాఖీలను పంపించవచ్చు. ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. -
వన మహోత్సవ లక్ష్యాలు పూర్తి చేయాలి
కై లాస్నగర్: వన మహోత్సవ లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, దేవా దా య శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున గడువులోపు ల క్ష్యాలు సాధించేలా మొక్కలు నాటాలన్నారు. మంగళవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ మాస్ ప్లాంటేషన్ కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయ క సంఘాల మహిళలను భాగస్వాములను చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు తదితర ప్రాంతా ల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా అధికారులతో మాట్లాడుతూ మంగళవారం తలపెట్టిన భారీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మిగిలిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఆదిలాబాద్, ఇచ్చోడ అటవీ అభివృద్ధి అధికారులు విశ్వనాథ్ బుసిరెడ్డి, ప్రథమేష్, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఏపీడీ గజానన్రావు తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు బడుల్లో సైన్స్ ల్యాబ్లు
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వి ద్యార్థులకు నాణ్యమైన, ప్రయోగాత్మక విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 287 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 29 పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షల చొప్పున నిధు లు మంజూరు చేశారు. తొమ్మిది, పదో తరగతి వి ద్యార్థులకు ప్రయోగాల ద్వారా సైన్స్ అంశాలను సులభంగా అర్థం చేసుకునే అవకాశం కల్పించను న్నారు. ఉమ్మడి జిల్లాలో 29 పాఠశాలలు ఎంపికఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 29 పాఠశాలలు ఎంపిక చేశారు. ఆదిలాబాద్లో 18, ఆసిఫాబాద్లో 3, నిర్మల్లో 6, మంచిర్యాలలో 2 పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రతీ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ఏర్పాటుకు రూ.26 లక్షలు కేటాయించారు. ఇందులో ల్యాబ్ గది నిర్మాణానికి రూ.25 లక్షలు, ప్రయోగశాలకు అవసరమైన పరికరాల కొనుగోలు కోసం రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 287 పాఠశాలలకు ల్యాబ్ గదుల నిర్మాణానికి రూ.71.75 కోట్లు, పరికరాల కోసం రూ.2.87 కోట్లు వెచ్చించనున్నారు. మొత్తంగా రూ.74.62 కోట్లతో పనులు చేపట్టనున్నారు. పేద విద్యార్థులకు ప్రయోజనం..ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్లు అందుబాటులోకి రానుండడంతో పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రయోగశాలలు లేకపోవడం, సౌకర్యాల లేమితో సైన్స్ చదువుతున్న విద్యార్థులకు ఇకపై ప్రయోగాలు చేసే అవకాశం లభించనుంది. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను స్వయంగా ప్రయోగాల ద్వారా పరిశీలించడం ద్వారా సైన్స్పై ఆసక్తి పెరగడంతో పాటు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సైన్స్ ల్యాబ్ల ఏర్పాటుతో కేవలం పరికరాలు అందుబాటులోకి రావడమే కాకుండా బోధన విధానంలోనూ మార్పు రానుంది. ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించిన అంశాలను ల్యాబ్లో ప్రయోగాల ద్వారా విద్యార్థులకు వివరిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది ప్రయోజనకరంగా మారనుంది. వీటి నిర్మాణానికి 15 రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత విద్యా శాఖాధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు.ఆదిలాబాద్లో ఎంపికై న పాఠశాలలు..కేజీబీవీ (బోథ్), జెడ్పీహెచ్ఎస్ (బరంపూర్), జెడ్పీహెచ్ఎస్ (సుంకిడి), జెడ్పీహెచ్ఎస్ (తోషం), యూపీఎస్ (కొల్హారి), యూపీఎస్ (ఖానాపూర్ కాలనీ), కేజీబీవీ (భీంపూర్), జెడ్పీహెచ్ఎస్ (శ్యామ్పూర్), జెడ్పీహెచ్ఎస్ (రాంనగర్), కేజీబీవీ (ఆదిలాబాద్రూరల్), కేజీబీవీ, తాంసి(బి), జెడ్పీహెచ్ఎస్ (కుచులాపూర్), జెడ్పీహెచ్ఎస్ (లక్కారం), కేజీబీవీ (ఇచ్చోడ), జెడ్పీహెచ్ఎస్ (ఉట్నూర్ ఉర్దూ మీడియం), యూపీఎస్ (భీంపూర్), కేజీబీవీ (ఇంద్రవెల్లి), జెడ్పీహెచ్ఎస్, ధనోర(బి) నిర్మల్ జిల్లాలో..కేజీబీవీ (తానూర్), జెడ్పీహెచ్ఎస్ (బోరెగాం), జెడ్పీహెచ్ఎస్ (పెంబి), జెడ్పీహెచ్ఎస్ బాలికలు (ముధోల్), జెడ్పీహెచ్ఎస్ (మాటేగాం), జెడ్పీహెచ్ఎస్ (అనుసూయపవార్ నగర్) మంచిర్యాల జిల్లాలో..కేజీబీవీ (మందమర్రి), జెడ్పీహెచ్ఎస్ బాలుర, (మందమర్రి, ఒర్రెగూడ)కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో..జెడ్పీహెచ్ఎస్ (రాస్పల్లి), కేజీబీవీ (చింతలమానెపల్లి), కేజీబీవీ (పెంచికల్పేట్) -
‘గోడం’కు అవకాశం దక్కేనా?
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించవచ్చని రాష్ట్ర రాజకీయాల్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఆదివాసీ గిరిజన వర్గానికి చెందిన నగేశ్కు సామాజిక సమతుల్యత దృష్ట్యా కేంద్ర కేబినేట్లో చోటు కల్పించే అంశాన్ని పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం నగేశ్కు ఉంది. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు, ఉత్తర తెలంగాణ గిరిజన ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఈ నిర్ణయం ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేపథ్యమిది.. నగేశ్ బోథ్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వంలో గిరిజన, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 లోక్సభ ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి మొదటిసారి ఎంపీగా గెలుపొందారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఓటమిచెందారు. 2024లో ఆయన బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. అప్పుడే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కమలం పార్టీ నుంచి బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. బజార్హత్నూర్ మండలం జాతర్ల గ్రామానికి చెందిన ఈయన గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయల్లోకి వచ్చి వివిధ పదవులను చేపట్టారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా మంత్రి పదవి దక్కవచ్చని.. -
ఉచిత శిక్షణ పరీక్షకు స్పందన
ఆదిలాబాద్టౌన్: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించనున్న ఉచిత శిక్షణకు సంబంధించి ఆదివా రం నిర్వహించిన అర్హత పరీక్షకు స్పందన లభించింది. పట్టణంలోని నలంద కళాశాల, శ్రీ చైతన్య, చావర పాఠశాల కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 3,446 మంది హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 300 మందికి శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలి పారు. జిల్లాకు చెందిన ఆదివాసీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆ యా కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎం.వెంకటనర్సయ్య, సీఐలు ప్రేమ్కుమార్, రహీంపాషా, ప్రణయ్కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి.వెంకటి, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బాలకేంద్రం చిన్నారుల ప్రతిభ
ఆదిలాబాద్: ప్రపంచ జానపద దినోత్సవ సంబురాల్లో స్థానిక బాలకేంద్రం చిన్నారులు పాల్గొని తమ నృత్య ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని సింగరేణి కళావేదికలో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో బోనాల పాటలకు చిన్నారులు అద్భుతంగా నృత్య ప్రదర్శన చేసి అలరించారు. ఇందులో కే.జాహ్నవి, కే.సహస్ర, జి.శ్రీనిధి, కే.కృతిక, కే.వంశిక, శ్రీచైత్ర, ఎం.మహాశ్విని, కే.అనన్య,కే. ఆయుషి, పి.ధన్విక, పి.శ్రీయాన్షి, వి.శ్రేష్ట, కే.లాస్య, బ్రాహ్మణి తదితరులున్నారు. వీరంతా ఈ నెల 31న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించే జానపద సంబరాల ముగింపు వేడుకల్లో పాల్గొననున్నట్లు నృత్య శిక్షకుడు మిట్టు రవి తెలిపారు. అనంతరం చిన్నారులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
ప్రవేశాలు పెరిగాయి..
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు గతేడాదితో పోల్చితే ఈసారి వంద సీట్లు పెరిగాయి. ఈనెల 31 వరకు అడ్మిషన్లకు గడువు ఉంది. మరో వంద వరకు అడ్మిషన్లు జరిగే అవకాశం ఉంది. కళాశాలల్లో అన్ని మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్య అందుతుంది. కళాశాలల పర్యవేక్షణ కోసం కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నెలలో రెండుసార్లు తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సారి మంచి ఫలితాలు సాధిస్తాం. – జాదవ్ గణేష్ కుమార్, డీఐఈవో ప్రభుత్వ కళాశాలలకు పెరిగిన ఆదరణ..జిల్లాలోని నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గతేడాదితో పోల్చితే ఈసారి అడ్మిషన్లు పెరిగాయి. కళాశాలలు ప్రారంభంకు ముందే అడ్మిషన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్య అందుతుంది. త్వరలో స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయి. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరాలి. – సంగీత, ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
పట్టణానికి ప్రత్యేక ప్రాజెక్టు వచ్చేలా కృషి
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులను త్వరలో ఢిల్లీకి తీసుకెళ్లి పట్టణానికి ప్రత్యేక ప్రాజెక్ట్ తీసుకొచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 41,12,18,19,35 వార్డుల పరిధిలో గల కాలనీల్లో యుఐడీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. చైర్పర్సన్ అనూషతో కలిసి ప్రత్యేక పూజలు చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఆదిలాబాద్ భవిష్యత్తులో గొప్పగా మారబోతుందని, కార్పొరేషన్ సైతం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఎయిర్పోర్టుతో పాటు ఇండస్ట్రీయల్ కారిడార్ వస్తున్నాయని తెలిపారు. కేంద్రం అమృత్ పథకం కింద వార్డుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మౌనిక, అన్నపూర్ణ, సాయి, జీవన్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో పదోన్నతులకు వేళాయె
ఆదిలాబాద్: ఆర్టీసీలో పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న కార్మికులకు ఇక ఊరట లభించనుంది. రీజియన్ పరిధిలో పెండింగ్లో ఉన్న ప్రమోషన్ల ప్రక్రియ ఎట్టకేలకు మొదలవడంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సీనియారిటీ, అర్హతలు, ఖాళీల ఆధారంగా పదోన్నతి కల్పించేందుకు అధికారులు విల్లింగ్, అన్విల్లింగ్ కోసం 176 మంది జాబితాతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డ్రైవర్లు 65, కండక్టర్లు 111 మంది ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సెలవు రోజైనా పలువురి నుంచి విల్లింగ్ తీసుకున్నారు. ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రమోషన్ లేకుండానే పదవీ విరమణ పదోన్నతి ప్రక్రియ ఆలస్యం కావడంతో పలువురు ఉద్యోగులు తాము చేరిన కేడర్లోనే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమోషన్ ద్వారా లభించే వేతన పెంపు, ఇతర ప్రయోజనాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా వయసు మీద పడిన ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తే ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. సీనియారిటీ, అర్హతల ఆధారంగా .. ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్, క్లరికల్ విభాగాల్లో సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా పదోన్నతులు ఉంటాయి. డ్రైవర్లు, కండక్టర్లు సీనియారిటీ, అర్హతలు, ఖాళీల ఆధారంగా తదుపరి కేడర్కు ఎదిగే అవకాశం ఉంటుంది. ఏడీసీ, కంట్రోలర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వంటి హోదాల్లోనూ ప్రమోషన్ కల్పించే అవకాశం ఉంది. మెకానికల్, క్లరికల్ విభాగాల్లోనూ ఆయా కేడర్లకు అనుగుణంగా పదోన్నతులు ఉంటాయి. అధికారుల నిర్ణయంపై ఉత్కంఠ.. పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసి అర్హులైన వా రికి త్వరగా ప్రమోషన్లు కల్పించాలనే డిమాండ్ కా ర్మికుల నుంచి వినిపిస్తోంది. పదవీ విరమణకు చే రువలో ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సీనియారిటీ ప్రకారం ఖాళీలను భర్తీ చేయాలనే విజ్ఞప్తులు ఉన్నాయి. రీజియన్ పరిధిలో పదో న్నతుల ప్రక్రియకు త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
● ప్రభుత్వ కళాశాలల్లో జోరుగా ప్రవేశాలు ● గతేడాదితో పోల్చితే ఈసారి ఇంటర్, డిగ్రీలో పెరిగిన అడ్మిషన్లు ● నాణ్యమైన విద్య.. మెరుగైన వసతులు ● ఉపాధి అవకాశాలకు అనుగుణంగా కొత్త కోర్సులు
సర్కారు వైపే మొగ్గుఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ కళాశాలలపై ఒకప్పుడు తల్లిదండ్రులకు ఉన్న అభిప్రాయం మారుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం ఇందుకు నిదర్శనం. నాణ్యమైన విద్యతో పోటీ పరీ క్షలకు శిక్షణ, ఆధునిక బోధన విధానాలు, మౌలిక వసతుల కల్పన వంటి చర్యలు ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరి గింది. మరో అవకాశం ఉండగా ఇంకొన్ని పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్య.. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది 3,482 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరగా, గత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య సుమారు 3,381గా ఉంది. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 6,863 మంది చదువుకుంటున్నారు. ఆయా కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. తరగతి గది బోధనతో పాటు పోటీ పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్, క్రీడా కార్యక్రమాలు, ప్రయోగశాలల వినియోగంపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. విద్యార్థులకు ఇప్పటికే ఉచిత నోట్బుక్స్, టెక్ట్స్బుక్తో పాటు బ్యాగులు, షూ అందించింది. మధ్యాహ్న భోజన పథకం కూడా త్వరలో అమలు చేయనున్నారు. గతేడాది 13 కళాశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.కోటి 95లక్షల నిధులు మంజూరు చేసింది. డిగ్రీలోనూ పెరిగిన ప్రవేశాలు.. ఇంటర్ తర్వాత డిగ్రీ విద్యలోనూ ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థుల ఆసక్తి కనిపిస్తోంది. గతేడాది ప్రభు త్వ డిగ్రీ కళాశాలలు వెలవెలబోగా, ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలో నాలుగు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాలలో 577 మంది, ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో 548, ఇచ్చోడలో 205, ఉట్నూర్లో 844 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అందుబాటులోకి కొత్త కోర్సులు.. డిగ్రీ విద్యను కేవలం పట్టా పొందే స్థాయిలో కాకుండా ఉద్యోగావకాశాలతో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం కొత్త కోర్సులను ప్రవేశపెడుతోంది. ఈవిద్యా సంవత్సరం నుంచి కొత్త అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త విధానంలో డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు పరిశ్రమలు, సంస్థలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ప్రత్యక్ష శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. అప్రెంటిస్షిప్ సమయంలో స్టైపెండ్ అందించే అవకాశం కూడా ఉంది. శిక్షణ అనంతరం విద్యార్థులకు ఉద్యో గ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధా న ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. బోధన విధానాలు, పోటీ పరీక్షల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు పెరగడంతో తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు వస్తోంది. ముఖ్యంగా ఫీజుల భారం లేకపోవడం, ప్రభుత్వ పథకాల ద్వారా విద్యార్థులకు లభిస్తున్న ప్రోత్సాహం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనంగా మారుతోంది.జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల వివరాలు..కళాశాల 2025–26 2027–27 అడ్మిషన్లు(మొత్తం సీట్లు) అడ్మిషన్లు(మొత్తం సీట్లు)ఆదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాల 491 (600) 577 (660) ఆదిలాబాద్ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల 490 (600) 548 (600) ఇచ్చోడ డిగ్రీ కళాశాల 163 (240) 205 (240) ఉట్నూర్ డిగ్రీ కళాశాల 840 (900) 844 (960) -
15వ రోజుకు ‘సీసీఐ’ దీక్ష
ఆదిలాబాద్టౌన్: సీసీఐ పునఃప్రారంభం కో సం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 15వ రోజుకు చేరాయి. ఆదివారం నాటి దీక్షలో అవాల్పూర్, టాక్లీ గ్రామాలకు చెందిన 30 మంది యువకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 6వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో కమిటీ కోకన్వీనర్ విజ్జగిరి నారాయణ, సభ్యులు పోశెట్టి, రమేశ్ నాయకులు మెట్టు ప్రహ్లాద్, రాఘవులు, అశోక్ స్వామి, దయానంద్, శివ, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
● కలెక్టర్ రాజర్షిషా ఆదిలాబాద్: ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్–2026’లో భాగంగా శనివారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద బైక్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. హెచ్ఐవీని ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపారు. ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు రెండు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా ‘ఎయిడ్స్ సురక్ష మాస్ క్యాంపెయిన్’ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఐవీ స్కీన్రింగ్ను రిమ్స్, ఉట్నూర్, బోథ్ ఆసుపత్రులకే పరిమితం చేయకుండా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. పాజిటివ్గా తేలిన వారి వివరాలను గోప్యంగా ఉంచి, ఏఆర్టీ కేంద్రాల ద్వారా ఉచిత చికిత్స అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో సాధన, డీవైఎస్వో దయానంద్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి నాగరాజు, ఐసీటీసీ కౌన్సెలర్లు, పీహెచ్సీల వైద్యులు, సిబ్బంది, యువత పాల్గొన్నారు. -
వినాయక నవరాత్రులకు రూ.34.50 లక్షలు
● కౌన్సిల్ సమావేశంలో ఎజెండాకు ఆమోదం ● బీజేపీ కౌన్సిలర్ల గైర్హాజరు కై లాస్నగర్: రానున్న వినాయక నవరాత్రు ల ఏర్పాట్ల కోసం రూ.34.50 లక్షల కేటాయింపు ప్రతిపాదనలకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. నిధుల కేటాయింపే ఏకై క ఎజెండాగా చైర్పర్సన్ బండారి అనూష అధ్యక్షతన శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బీజేపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఈ నె లాఖరులో ఉండనున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగానే వారు సమావేశానికి దూరంగా ఉన్నారనే చర్చ సాగుతుంది. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు చెందిన కూటమి కౌన్సిలర్లు హాజరై ఏర్పాట్లపై చర్చించారు. పట్టణంలోని 49 వార్డుల్లో వినాయక నవరాత్రులను వైభవంగా నిర్వహించేలా నిధుల కేటాయింపు చేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గ్రావెల్, మొరం, డస్ట్, వెట్ మిక్స్ కోసం రూ.10లక్షలు, సీసీ ప్యాచ్వర్క్ల కోసం మరో రూ.10 లక్షలు కేటాయించారు. లైటింగ్, అంబేడ్కర్ చౌక్ వద్ద స్టేజ్ ఏర్పాట్లు, పెన్గంగా నది, చాందావాగు వద్ద క్రేన్లు, లైటింగ్తో పాటు బారికేడ్ల ఏర్పాటుకు కలిపి మొత్తంగా రూ.34.50 లక్షల కేటాయింపుతో కూడిన ప్రతి పాదనలకు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశారు. చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలోని 49 వార్డుల్లో గణేశ్మండపాలు, ప్రధాన చౌరస్తాల వద్ద లైటింగ్ వ్యవస్థను పటిష్టంగా ఏర్పా టు చేయాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, బ్లీచింగ్,క్లీనింగ్ తదితర పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో వైస్చైర్మన్ రోహిత్, కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ఎంఈ అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటికో కొలువు..
ఉద్యోగాల ఊరు.. వెంకటాపూర్ఇచ్చోడ: వెంకటాపూర్.. ఓ మారుమూల గిరిజన గ్రామం. నేరడిగొండకు 11కిలోమీటర్ల దూరాన అటవీప్రాంతంలో ఉంటుంది. గ్రామస్తులంతా దా దాపు రైతులే. నాడు ఈ ఊరికి కనీసం రోడ్డు లేదు. మండల కేంద్రానికి రావాలంటే ఎడ్లబండి లేదా కాలినడకే దిక్కు. అలాంటి గ్రామంలో 1969లో రూపావత్ బనియా(బలిరాం) మొదటగా సర్కారు కొలువు సాధించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఆయన స్ఫూర్తితో మొదలైన ప్రస్థానం క్రమంగా ఇంటికో ఉద్యోగం వచ్చేలా మారిపోయింది. నాడు ఈ ఊరిలో 50 కుటుంబాల వరకు ఉండగా అందరూ నిరాక్షరాస్యులే. ఆ సమయంలో పక్క ఊరు కుంటాలలో బనియా టీచర్గా కొనసాగాడు. అతడికి ముగ్గురు సంతానం. తన మాదిరిగా వారు కూడా సర్కారు కొలువు సాధించేలా చిన్నప్పటి నుంచి ప్రోత్సహించాడు. ఆయన భౌతికంగా దూరమైన ఆ ప్రేరణతో ఆ ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అంతేకాదు ఆ ఊరివారంతా ఆ టీచర్ను ఆదర్శంగా తీసుకుని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. సర్కారు కొలువులే లక్ష్యంగా తీర్చిదిద్దారు. అన్ని శాఖల్లో గ్రామస్తులు.. గ్రామ జనాభాలో దాదాపు సగం మంది వరకు ప్ర భుత్వ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. ఇందులో ఎ క్కువగా ఉపాధ్యాయులే ఉన్నారు. తర్వాత స్థానా ల్లో రెవెన్యూ, పోలీస్, బ్యాంకు, అటవీశాఖ, పంచా యతీరాజ్, రైల్వే, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్, వ్యవసాయశాఖ, ఎకై ్సజ్, ఐసీడీఎస్, హౌసింగ్, ట్రాన్స్కో, జేన్కో, భూగర్భజల, హాస్టల్ వెల్ఫేర్, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక తదితర శాఖల్లో సేవలందిస్తున్నారు. 100 మంది ఆడపడుచులు సైతం... ఈ గ్రామ ఆడపడుచుల్లో 80 మంది వరకు ప్రభు త్వ ఉపాధ్యాయులు కాగా మరో 20 మంది ఇతర శాఖల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా తమ అత్తగారి ఇళ్లలో ిస్థిరపడ్డారు. గ్రామ ప్రొఫైల్జనాభా: 684 మహిళలు :320, పురుషులు : 364 మొత్తం కుటుంబాలు : 120 ఉద్యోగాలు ఉన్న కుటుంబాలు : 120 పురుష ఉద్యోగులు : 210 మహిళా ఉద్యోగులు : 100 ఇంటికో ఉద్యోగం.. అవునండీ మీరు విన్నది నిజమే. ఆ ఊరిలో ప్రతీ గడపలో కనీసం ఒకరు సర్కారు కొలువు సాధించారు. అంతేకాదు.. కుటుంబంలో గరిష్టంగా ఏడుగురు వరకు ప్రభుత్వ విధుల్లో కొనసాగడం ప్రత్యేకం. ఓ ఉపాధ్యాయుడి స్ఫూర్తి.. మరో ప్రజాప్రతినిధి చేయూతకు అకుంఠిత దీక్ష తోడైంది. పట్టుదల, అలుపెరగని పోరాటం వారిని విజయతీరాలకు చేర్చింది. ఆ కొలువుల ఊరే నేరడిగొండ మండలంలోని వెంకటాపూర్. ఆ మారుమూల గ్రామం విజయగాథపై ఈ వారం సండే స్పెషల్. వెంకట్రామ్ కుటుంబంలో ఏడుగురు.. గంగారాం నాయక్ ఇంట్లో ఐదుగురు.. -
బిడ్డను చూడకుండానే మృత్యు ఒడికి..
హెల్మెట్ లేకపోవడంతో.. ప్రమాద సమాచారం అందుకున్న నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఘటన స్థలాన్ని పరిశీంచారు. వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. అనిల్ హెల్మెట్ ధరించి ఉంటే ఘోరం జరిగేది కాదని పేర్కొన్నా రు. తలకు గాయం కావడంతోనే మృతిచెందిన ట్లు అంచనాకు వచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పెంబి: ఐదు రోజుల్లో భార్యకు ప్రసవం జరగాల్సి ఉంది. నెల క్రితం కాన్పు కోసం పుట్టింటికి పంపించాడు. తొలి కాన్పు సమయంలో ఆమె వెంట ఉండాలనుకున్నాడు భర్త. ఈమేరకు శుక్రవారం రాత్రి అత్తవారింటికి బయల్దేరాడు. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం మాట్లొద్ది వద్ద జరిగింది. మృతుడు కూడా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కావడం విషాదకరం. మూడేళ్ల క్రితం వివాహం.. నిర్మల్ జిల్లా పెంబి మండలం తాటిగూడ గ్రామానికి చెందిన జాదవ్ అనిల్(30)కు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం మాట్లొద్దికి చెందిన స్రవంతితో మూడేళ్ల క్రితం వివాహమైంది. అనిల్ తండ్రి జాదవ్ మాంగ్య 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మర ణం తట్టుకోలేక మరణించాడు. అప్పటి నుంచి తల్లి అనిల్, కూతురును పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. అనిల్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నెలక్రితం భార్యను పుట్టింటికి పంపి.. తన భార్య స్రవంతి గర్భందాల్చడంతో తొలిచూరు కాన్పు కోసం నెలక్రితం పుట్టింటికి పంపించాడు. మరో ఐదు రో జుల్లో ప్రసవం జరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపా రు. దీంతో భార్య అనిల్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. కాన్పు సమయంలో తనవెంట ఉండాలని కోరింది.దీంతో అనిల్ వ్యవసాయ పనులన్నీ ముగించుకుని శుక్రవారం రాత్రి మాట్లొద్దికి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. ఎన్హెచ్–44పై వెళ్తుండగా గౌలిగూడ సమీపంలోకి రాగానే అర్ధరాత్రి సమయంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అనిల్ తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు ఒక్కగానొక్క కొడుకు.. అనిల్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు తండ్రి మాంగ్య 17 ఏళ్ల క్రితం మరణించాడు. తల్లి అన్నీ తానై పిల్లలను పెంచి పెద్ద చేసింది. అనిల్ మరణవార్త తెలియడంతో రిమ్స్కు చేరుకున్న తల్లి, చెల్లి విగతజీవిగా ఉన్న కొడుకు ను చూసి బిడ్డను చూడకుండానే వెళ్లిపోయావా కొడుకా అంటూ గుండెలు పగిలేలా రోదించారు. ఒకవైపుకొత్త ప్రా ణం రాబోతున్న సంతోషంం మరోవైపు ఆ ఆనందాన్ని చూడకుండానే వెళ్లిపోయిన తండ్రి జ్ఞాపకం ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నింపింది. అనిల్ మృతదేహాన్ని శనివా రం స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలునిర్వహించారు.జాదవ్ అనిల్(ఫైల్) -
పేద విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం
ఉట్నూర్రూరల్:పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం సందర్శించారు. ఐఎఫ్ ప్యానెల్ను ప్రారంభించారు. విద్యార్థినులకు యూనిఫాం, కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్షిషా, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సంతోష్, ఎస్ఈటీడబ్ల్యూ ఫణికుమారి, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో మోహన్సింగ్, డి.ప్రేమకళ, డీటీడీవోలు అంబాజీ, నిహారిక, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ అనిత జాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జు ఫొటోను తొలుత బ్యానర్లో చేర్చలేదు. ప్రొటోకాల్ లోపాన్ని గమనించిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమావేశం జరుగుతుండగానే పాత ఫ్లెక్సీని తొలగించి ఎమ్మెల్యే ఫొటోతో కూడిన కొత్త ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం గమనార్హం. దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ మహిళా శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేబీ కాంప్లెక్స్లో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు రూ.30.68 లక్షల విలువగల 26 ఉపకరణాలను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ విఠల్, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అడ్లూరి అన్నారు. కేబీ కాంప్లెక్స్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఐటీడీఏ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో పెండింగ్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పారదర్శకంగా, నిర్దేశిత లక్ష్యాల మేరకు వినియోగించాలని సూచించారు. ఎమ్మెల్సీ విఠల్ మాట్లాడుతూ, అటవీ శాఖ అనుమతుల కారణంగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు త్వరితగతిన క్లియరెన్స్ వచ్చేలా ఆయా శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలోని 569 విద్యాసంస్థల్లో సుమారు 54వేల మంది చదువుతున్నారని తెలిపారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫాం, కిట్ల పంపిణీని ప్రారంభించినట్లు చెప్పారు. పీవో మకరందు మాట్లాడుతూ, ఐటీడీఏ పరిధిలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ, గిరిజన సంక్షేమం, విద్యా సంస్థలు, మౌలిక వసతులపై గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించి సమగ్ర నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. రోడ్లు, వంతెనల పనులకు సంబంధించిన టెండర్లు, అగ్రిమెంట్లను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని, అటవీ అనుమతుల జాప్యాన్ని నివారించాలని కోరారు. అంతకుముందు కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహక నగదు చెక్కులను మంత్రి అందజేశారు. సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సంతోష్, గురుకులాల కార్యదర్శి సీతామహాలక్ష్మి, నాలుగు జిల్లాల ఉన్నతాధికారులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘సర్’ పారదర్శకంగా పూర్తి చేయాలి
కై లాస్నగర్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అనర్హులు, మృతులు, డూప్లికేట్, చిరునామా మారిన ఓటర్ల వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి సరిచేయాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారం–6 దరఖాస్తులు, డిక్లరేషన్ ఫారాలు, ధ్రువపత్రాల సమర్పణ, ఓటర్ల పరిశీలన, నోమ్యాపింగ్, వివిధ అనామలీస్ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమన్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కుకు దూరం కాకుండా చూడటమే ప్రక్రియ ప్రధాన ఉద్దేశమన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురించిన అనంతరం అర్హత కలిగిన కొత్త ఓటర్లు ఫారం–6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఫారం–6తో పాటు నిబంధనల ప్రకారం అవసరమైన డిక్లరేషన్ ఫారం, సంబంధిత ధ్రువపత్రాలను జత చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలోని తప్పులు, నోమ్యాపింగ్, అనుమానాస్పద వివరాలు, ఇతర అనామలీస్ను గుర్తించడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బాలూరి గోవర్ధన్రెడ్డి, నగేష్, సంజీవ్ కుమార్, మోహన్, వెంకటస్వామి, ప్రశాంత్, లక్ష్మి, ఎండీ అఫ్రీద్, శుభన్ అలీ, వినోద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి మారుతున్న కాలానికి అనుగుణంగా యువత, మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్లో భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, ఉద్యమశీలత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జన్ శిక్షణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మోడల్ సెంటర్’ నమూనాల ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ హాజరై శిక్షణ పొందిన అభ్యర్థులు రూపొందించిన చేతివృత్తులు, కుట్టుపని, వివిధ వృత్తి విద్య ఉత్పత్తులు, ఇతర నైపుణ్య ఆధారిత నమూనాలను తిలకించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.మనోహర్రావు, డీఈవో మాధవి, ఎల్డీఎం ఉత్పాల్, సైడ్స్ డైరెక్టర్ సురేందర్, అధికారులు, జన్ శిక్షణ్ సంస్థాన్ ప్రతినిధులు, అభ్యర్థులు పాల్గొన్నారు. -
పెండింగ్ భూసేకరణ వేగవంతం చేయాలి
కై లాస్నగర్: నీటిపారుదల ప్రాజెక్టుల పనులు నిర్దేశిత గడువులోపు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ అంశాలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రాజెక్టుల నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేందుకు భూసేకరణ ప్రక్రియ కీలకమని తెలిపారు. నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈమేరకు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్టు కోసం ఏరియల్ సర్వే
కైలాస్నగర్: జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు అథారి టీ ఆఫ్ ఇండియా ప్రత్యేక బృందం శుక్రవారం పర్యటించింది. బెంగళూరు నుంచి వచ్చిన ఈ బృందం సభ్యులు తాజాగా ఏరియర్ సర్వే చేపట్టారు. భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఏడు గ్రామాల్లో ఈ సర్వే చేపడుతున్న విషయం తెలిసిందే. అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో ప్రతిపాదిత ప్రాంతాల్లో ఎరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం పాత రవ్వే ప్రాంతంతో పాటు దానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మ్యాప్ను పరిశీలించి తదనుగుణంగా అనుకుంట శివారులో సర్వే చేపట్టా రు. రన్వే విస్తరణ, ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు, సివిల్ ఎన్క్లేవ్ ద్వారా ప్యాసింజర్ విమానాల రాకపోకలకు ఉన్న అవకాశాలపై సాంకేతిక నివేదిక రూపొందించనున్నారు. భూ సేకరణ, ఇత ర అనుమతులకు సంబంధించి జిల్లా యంత్రాంగంతో ఎయిర్ఫోర్స్ అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. -
ఆధారాలతో ఫిర్యాదు..
ఆదిలాబాద్టౌన్: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆగడాలు మితిమీరుతున్నాయి. అధిక ఫీజులు వసూలు చేయడం, పుస్తకాలు, యూనిఫాం ఒకే షాపులో కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం, అడ్వాన్స్ ఫీజులు చెల్లించాలని, మౌలిక వసతులు లేకపోయినా అందినకాడికి దోచుకోవడం, అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయడం పరిపాటిగా మారింది. విద్య శాఖాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు చేసేదేమి లేక మిన్నకుండి పోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ ద్వారా ప్రత్యేక పోర్టల్ను రూపొందించింది. ఆన్లైనద్వారా ఫిర్యాదు చేసేందుకు చర్యలు చేపడుతుంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇందుకోసం వెబ్సైట్ను రూపొందించింది. ఫీజుల వసూళ్లపై నిఘా.. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయి. స్కూల్ ఫీజుతోపాటు వివిధ రకాల పేర్లతో యాజమాన్యాలు అదనపు రుసుములు వసూలు చేయడం, ముందస్తుగా భారీ మొత్తాలను చెల్లించాలని ఒత్తిడి చేయడం వంటి వాటితో పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆగడాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇలాంటి ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. తద్వారా అధికారులు పాఠశాలలపై మరింత సమర్థవంతంగా పర్యవేక్షణ చేపట్టనున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోటుబుక్లు, యూనిఫాం, షూలు, ఇతర విద్యా సామగ్రిని వారు సూచించిన దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మార్కెట్లో తక్కువ ధరకు లభించే వస్తువులను పాఠశాల సూచించిన దుకాణాల్లో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలాంటి అంశాలపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫీజుల వివరాలను నోటీసు బోర్డులపై తప్పనిసరిగా ప్రదర్శించాలి. టర్మ్, ట్రాన్స్పోర్టు ఫీజు, ఇతర వివరాలు అన్ని విడివిడిగా పేర్కొనాలి. తల్లిదండ్రులు తమ సమస్యను ఆన్లైన్లో నమోదు చేయడంతోపాటు అవసరమైన ఆధారాలను కూడా సమర్పించే అవకాశం ఉంటుంది. సమస్యలు, ఫిర్యాదులను వెబ్సైట్ www.schooledu.telangana.gov. in, pscms లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ కావచ్చు. ఓటీపీ ఆధారంగా వివరాలు నమోదు చేయాలి. అలాగే ఫిర్యాదు పరిస్థితిని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఫీజు రశీదులు, పాఠశాల నుంచి వచ్చిన సందేశాలు, పుస్తకాలు, యూనిఫాం కొనుగోలు చేయాలని ఇచ్చిన సూచనలు తదితర ఆధారాలను ఫిర్యాదుతో జతచేయవచ్చు. ఫిర్యాదు అందిన అనంతరం సంబంధిత అధికారులు అంశాన్ని పరిశీలించి, అవసరమైతే పాఠశాల యాజమాన్యం నుంచి వివరణ అడుగుతారు. తదనుగుణంగా చర్యలు చేపడుతారు. ఫిర్యాదులపై అధికారుల పరిశీలన.. ఆన్లైన్లో నమోదయ్యే ఫిర్యాదులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పరిశీలించి వాస్తవాలను నిర్ధారించనున్నారు. ఆ తర్వాత జిల్లా విద్య శాఖాధికారులకు సమాచారం అందిస్తారు. ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పాఠశాల యాజమాన్యాలకు అవసరమైన సూచనలు, హెచ్చరికలు జారీతో పాటు నిబంధనల ఉల్లంఘన తీవ్రత బట్టి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ పాఠశాలలపై ఫిర్యాదు చేయాలంటే తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాల్సి వచ్చేది. ఆన్లైన్ విధానం అందుబాటులోకి రావడంతో ఇక ఇంటి నుంచే ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంది. -
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి
ఆదిలాబాద్టౌన్: పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ అన్నారు. పట్టణంలోని వన్టౌన్లో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఉత్సవకమిటీ సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించా రు. ఇందులో ఆది లాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు సునిల్ కుమార్, నాగరాజు, ప్రేమ్ కుమార్, రహీం పాషా, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి రివార్డులు విధుల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులను ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఇటీవల బస్టాండ్లో జరిగిన చోరీ కేసులో నిందితుడిని పట్టుకోవడంతో పాటు మహిళపై ఈవ్టీజింగ్కు పాల్పడుతున్న వ్యక్తిని గుర్తించి చురుకై న పాత్ర పోషించిన షీటీమ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
వరలక్ష్మీ నమోస్తుతే
ఆదిలాబాద్: శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. తమ ఇళ్లలో అమ్మవారిని ప్రత్యేక మండపాల్లో అలంకరించి పూజలు చేశారు. సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు. ముత్తైదువులకు వాయినాలు అందజేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఆర్వో స్రవంతి, డీఎంహెచ్వో సాధన, కాంగ్రెస్ నాయకులు గండ్రత్ సుజాత, సమితి జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్లోనూ సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఫెర్టిలైజర్ ఫ్రాంచైజీ పేరిట భారీ మోసం
ఆదిలాబాద్టౌన్: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న బిహారీ ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఐదుగురు సభ్యులుండగా నేషనల్ ఫెర్టిలైజర్ ఫ్రాంచైజీ పేరిట పలువురిని నమ్మించి రూ.లక్షల్లో మోసగించారు. దేశ వ్యాప్తంగా వీరిపై 498 ఫిర్యాదులు రాగా, ఇందులో తెలంగాణకు చెందినవి 90 ఉన్నాయి. వీరు అమాయకుల వద్ద రూ.3.5 కోట్ల వరకు వసూలు చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ శుక్రవారం ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐదుగురు నిందితులు బిహార్ రాష్ట్రంలో తలదాచుకుంటూ దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నకిలీ ఫెర్టిలైజర్ ఫ్రాంచైజీ ఇచ్చే వెబ్సైట్ను తయారు చేసి అప్లికేషన్ ద్వారా బాధితుల వివరాలు, వారి ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. సర్వీస్ ఫీజు, లైసెన్స్ ఫీజు, ట్రేడ్ ట్రాన్స్ఫర్ ఫీజు అంటూ విడతల వారీగా వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారు. బజాజ్ లోన్ అంటూ అప్లికేషన్ ద్వారా వివరాలు సేకరించి వివిధ రకాల ఫీజులు వసూలు చేసి వందలాది మందిని మోసగించారు. జైనథ్ పోలీస్స్టేషన్లో కేసునేషనల్ ఫెర్టిలైజర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ప్రకటన ద్వారా ఫ్రాంచైజీ ఇస్తామని నమ్మించి భోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన ఆకునూర్ గణేశ్ను నిందితులు నమ్మించారు. బాధితుడిని ఫోన్, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా సంప్రదించి వ్యక్తిగత వివరాలు సేకరించారు. మొదట రిజిస్ట్రేషన్ పేరుతో రూ.50వేలు వసూలు చేశారు. ఆ తర్వాత లై సెన్స్, ప్రాంచైజీ, రిజిస్ట్రేషన్ అదనపు చార్జీలు, వివి ధ కారణాలు చూపుతూ బాధితుడి నుంచి రూ. 3,85,725 నగదును బ్యాంక్ ఖాతాలో యూపీఐ, నెఫ్ట్ ద్వారా బదిలీ చేయించుకున్నారు. అనంతరం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, వాట్సాప్ మెస్సేజ్లకు స్పందించకపోడంతో బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో పోలీ సులు బిహార్కు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బిహార్లోని బిగా గ్రామానికి చెందిన అభిషేక్ కుమార్, అశితోష్ కుమార్, రితేశ్ కుమార్, అభినాష్, హుసేన గ్రామానికి చెందిన నిషుకుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి 10 సెల్ఫోన్లు, రూ.70వేల నగదు స్వాధీనం చే సుకున్నారు. బాధితుల నుంచి వసూలు చేసిన రూ.8లక్షలను నిందితులు బ్యాంక్ ఖాతాలు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయగా వాటి పత్రాల ను పోలీసులు సీజ్ చేశారు. ఎవరైనా సైబర్ మోసా ల బారిన పడితే వెంటనే 1930కు సమాచారం ఇ వ్వాలని సూచించారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రె డ్డి, జైనథ్ సీఐ శ్రావణ్, ఎస్సైలు పీర్సింగ్, గౌతమ్, గోపీకృష్ణ, సిబ్బంది త్రిశూల్, రాజేశ్, పురుషోత్తం, రవీందర్, సత్యనారాయణ తదితరులున్నారు. -
గతంలో పలుమార్లు ఫిర్యాదు చేశాం..
జిల్లాలో నిబంధనలను విరుద్ధంగా అనేక పాఠశాలల్లో యూనిఫాం, బుక్స్, ఇతర వస్తువులు విక్రయిస్తున్నారు. గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. యాజమాన్యాలు రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. చాలా పాఠశాలల్లో కనీస వసతులు లేవు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వాటిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం. – రాహుల్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ నిర్ణయం హర్షణీయంప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలపై ఫిర్యాదు కోసం పోర్టల్ను ఏర్పాటు చేయడం హర్షణీయం. నిబంధనలు అతిక్రమించే స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా అధికారులు సత్వరం తనిఖీలు చేపట్టాలి. – గొడం కేశవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
సింగపూర్ పర్యటనకు ఉపాధ్యాయులు
నిర్మల్ఖిల్లా/ఖానాపూర్/ఆసిఫాబాద్ రూరల్: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్టడీ ఎక్స్ప్లోజర్లో భాగంగా సింగపూర్ దేశంలో విద్యాపర్యటనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పలువురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 12నుంచి 19వరకు చేపట్టిన ఈ పర్యటనలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 29మంది హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలతో సహ 40మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్ జన్కాపూర్ స్కూల్ అసిస్టెంట్ వడ్లూరి రాకేశ్, రెబ్బెన ఎంపీపీఎస్ ఎస్జీటీ అడ్లూరి లావణ్య, నిర్మల్ జిల్లా వానల్పాడ్ ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు మాదరి ఎల్లన్న, ఖానాపూర్ మండలం మస్కాపూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు జాడి శ్రీనివాస్ ఎంపికయ్యారు. సింగపూర్లోని ఆధునిక విద్యావిధానాలు, వినూత్న బోధన పద్ధతులు, ఉత్తమ పాఠశాల విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఈ నెల 22న ఎంపికై న ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి వర్చువల్ ఓరియంటేషన్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీసా, ప్రయాణ ఏర్పాట్లు, ఇతర మార్గదర్శకాలపై అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఉపాధ్యాయుల ఎంపికపై ఉమ్మడి జిల్లాలోని విద్యాశాఖ అధికారులు అభినందనలు తెలిపారు. అడ్లూరి లావణ్య వడ్లూరి రాకేశ్జాడి శ్రీనివాస్ -
సీసీఐ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ఆదిలాబాద్ జిల్లాకే తలమానికమైన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమను వెంటనే తెరిపించాలని, అందుకోసం జరిగే ఉద్యమానికి తెలంగాణ జన సమితి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. ఈ పరిశ్రమ పునరుద్ధరణకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు, వనరులు, ఇతర ప్రాంతాలతో పోల్చితే అతిచౌకగా ఇక్కడ ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ పరిశ్రమను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరణకు నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. తాముఽ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధమని, కొత్త పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అమిత్షా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపిస్తే సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ఇప్పటికై నా పరిశ్రమ తెరిపించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. టాస్క్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ చంద్రకుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, ఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి, ప్రొఫెసర్ రవీందర్యాదవ్, చలపతిరావు, నందిరామయ్య, నాగరాజు, గుడిసె రూబీీస్టీవెన్సన్ తదితరులు పాల్గొన్నారు. -
విలీనం.. ఒప్పుకోం
బెల్లంపల్లి: సబ్ కలెక్టర్ మనోజ్కు వినతిపత్రం ఇస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (వైఐఎస్యూలో) లోకి విలీనం చేయొద్దని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని జీవో 97ను రద్దు చేయాలని పట్టుబడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులంతా వారం రోజులుగా నల్లబ్యాడ్జీలు ధరించి తరగతులకు హాజరై నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే పలుసార్లు ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి జీవో రద్దు చేసే దాకా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. వీరికి విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు పలుకుతున్నారు. వైఐఎస్యూలోకి పాలిటెక్నిక్ కళాశాలల విలీనంతో వారికి జరిగే నష్టం వారి మాటల్లోనే.. – బెల్లంపల్లి/నిర్మల్రూరల్/ఆదిలాబాద్టౌన్ఉన్నత చదువులకు దూరమవుతాం ప్రభుత్వ నిర్ణయంతో బీటెక్, ఉన్నత చదువులకు దూరమవుతాం. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేయడం సరికాదు. బీటెక్ చదవాలనుకునే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. రైల్వే, జూనియర్ ఇంజినీర్, ఆర్ఆర్బీ, ఇతర ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంటుంది. – రాధేశ్యామ్, సంజయ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాల, ఆదిలాబాద్ -
నీట్లో విద్యార్థి ప్రతిభ
నార్నూర్: మండలంలోని నాగల్కొండ గ్రామానికి చెందిన షేక్ అసిఫ్ నీట్ ఫలితాల్లో ప్రతిభ చాటాడు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదువుకున్న షేక్ అసిఫ్ స్టేట్ 1,419వ ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్కు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా సర్పంచ్ కుమ్ర మహదు, మసీదు కమిటీ సదర్ హబీబ్ఖాన్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సభ్యులు షేక్ అసిఫ్ను సన్మానించారు. కార్యక్రమంలో షేక్ అజమ్, షేక్ యూసుఫ్ పటేల్, షేక్ నబీ సాబ్, షేక్ వజీర్ పాషా, షేక్ అజర్, మసీదు కమిటీ, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చింత గింజ మింగి బాలుడి మృతి ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీకి చెందిన మంగేష్ (9) అనే బాలుడు చింత గింజ మింగి ఊపిరాడక శుక్రవారం మృతి చెందాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు ఆశాబాయి, జ్యోతిరాం ఇటుకబట్టీ కార్మికులు. వీరికి ఇద్దరు కుమారులు. ఓ కుమారుడు పాఠశాలకు వెళ్లగా చిన్న కొడుకు మంగేష్ ఇంటి వద్దే ఉంటున్నాడు. రోజు మాదిరిగా దంపతులిద్దరూ ఉదయం ఇటుక బట్టీకి వెళ్లారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో చిన్నకొడుకు వారికి టిఫిన్ ఇచ్చి ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో చింతగింజ మింగాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారగా గమనించిన స్థానికులు చికిత్స కోసం రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఏసీబీ పేరిట ఉద్యోగులకు ఫోన్కాల్స్ ఆదిలాబాద్టౌన్: ఏసీబీ అధికారులమని 90592 08198 నంబర్తో ఫోన్ చేస్తూ డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెడతామని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఏసీబీ డీఎస్పీ మధు ఓ ప్రకట నలో తెలిపారు. ఇప్పటికే పలువురు ఉద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు పేర్కొన్నా రు. ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించవద్దని, ఇలాంటి ఫోన్లు వస్తే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని లేదా ఏసీబీ టోల్ ఫ్రీ 1064 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
గురువును హత్యచేయడం దారుణం
ఆదిలాబాద్టౌన్/కై లాస్నగర్: భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులను విద్యార్థులు హత్య చేయడం దారుణమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు గురికావడంతో నిందితులను కఠినంగా శిక్షించాలని ట్రస్మా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. సెంట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదో తరగతి విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి అలవాట్లకు పాల్పడుతుంటే మందలించినందుకు గాను ప్రిన్సిపాల్ను హత్య చేయడం దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాల్సి న అవసరముందన్నారు. అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే హత్యకు నిరసనగా ప్రైవేట్ యాజమన్యాలు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. కార్యక్రమంలో ట్రస్మా ప్రధాన కార్యదర్శి ఆదినాథ్, ప్రైవేట్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు మారియ రోజ్, అతీక్ ఉర్ రహ్మన్, వేదావ్యాస్, మహ్మద్ అమేరొద్దీన్, దేవేందర్, పురుషోత్తం రెడ్డి, స్వామి, భద్రేశ్వర్ రావు, కరస్పాండెంట్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్స వ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న సామూహిక వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వేద పండితుడు సంతోష్శర్మ మాట్లాడుతూ.. సామూహికంగా వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తే వ్రత పుణ్యఫలం రె ట్టింపవుతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. పదేళ్లుగా సమితి ఆధ్వర్యంలో సా మూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమితి అధ్యక్షుడు ప్రమోద్కుమార్ ఖత్రి, ప్రతినిధులు రవీందర్, రవీందర్, సంతోష్ అగర్వాల్ తదితరులున్నారు. -
తెరుచుకోని కొర్టికల్(బి) పాఠశాల
నేరడిగొండ: మండల పరిధిలోని కొర్టికల్(బి) మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల గురువారం తెరుచుకోకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎ దుర్కొన్నారు. ఈ పాఠశాలలో 22 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే, స్కూల్ కాంప్లె క్స్ సమావేశానికి పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు వెళ్లిపోయారు. దీంతో పాఠశాల తెరుచుకోకపోవడంతో విద్యార్థులు ఆవరణ లోనే ఆడుకుంటూ గడిపారు. కాంప్లెక్స్ సమావేశాలు ఉన్నప్పుడు కనీసం ఒక ఉపాధ్యాయుడినైనా పా ఠశాలలో అందుబాటులో ఉంచకుండా, ఇద్దరూ వె ళ్లిపోవడంపై స్థానికులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు వివేకానందను వివరణ కోరగా.. గురువారం కాంప్లెక్స్ సమావేశం నిర్వహించడంతో ఉపాధ్యాయులు హాజరయ్యారని, మధ్యాహ్నం నుంచి పాఠశాల వద్ద ఉపాధ్యాయులు ఎవరూ అందుబాటులో లేరని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు పట్టణ ఎస్సై శ్రీధర్ తెలిపారు. కాసిపేట మండలం ధర్మారావుపేటకు చెందిన నూకల సంతోష్కుమార్ (22) బైక్పై శ్రీరాంపూర్ నుంచి క్యాతనపల్లి వైపు రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొన్నాడు. తీవ్రగాయాలు కావడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఘటనలో ద్విచక్ర వాహ నం, బొలెరోకు మంటలు అంటుకోవడంతో ఫైరింజన్ సహాయంతో అదుపు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
వరలక్ష్మీ వ్రతం.. సౌభాగ్యాల వరం
కెరమెరి/కుంటాల: శ్రావణ మాసం వచ్చిందంటే పల్లెలు, పట్టణాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. మహిళలకు ఈ వారం అత్యంత శ్రేష్టమైనది. ఏటా శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ముత్తైదువులు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నిండు మనసుతో చేస్తే వారికి సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి సుఖంగా ఉంటారని ప్రతీక. మహాలక్ష్మిని వరలక్ష్మి పేరుతో అర్చించడం మన సంప్రదాయం. ఈ రోజు ఇళ్లంతా శుభ్రపరిచి, ముగ్గులతో అలంకరించి కలశాన్ని ఏర్పర్చి పూజలు నిర్వహిస్తే సిరిసంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే వరలక్ష్మీ వ్రతం గురించి వివిధ రకాల కథలు, పురాణాలు, ప్రాచూర్యంలో ఉన్నాయి. నేడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కథనం... -
లారీని ఢీకొన్న బొలెరో.. ఇద్దరికి తీవ్ర గాయాలు
రెబ్బెన: మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్, ఇందిరానగర్ మద్యలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కౌటాల మండలం వీర్దండికి చెందిన జాడి ప్రదీప్, జాడి మహేష్ బొలెరో వాహనంలో ఇంటి సామాను వేసుకుని మంచిర్యాల వైపు వెళ్తుండగా ఆసిఫాబాద్ వైపు నుండి రెబ్బెన వైపు ఐరన్ పైపుల లోడ్తో వెళుతున్న లారీని బొలెరో ఢీకొట్టింది. దీంతో లారీ రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో, బొలెరో రోడ్డుపైనే బోల్తా పడ్డాయి. బొలెరో నడుపుతున్న ప్రదీప్, మహేష్ క్యాబిన్లోనే ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్సై వెంకటకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని మహేష్ను బయటకు తీశారు. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో ప్రదీప్ కాళ్లు క్యాబిన్లో ఇరుక్కుపోగా అతికష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను ముందుగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బొలెరో రాంగ్రూట్లో కాగజ్నగర్ ఎక్స్రోడ్ వైపు వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడం మూలంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
‘ఎస్హెచ్జీ’లకు ఈ కేవైసీ
కైలాస్నగర్: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల ఆర్థిక పరిపుష్టికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి, వడ్డీ లేని రుణాలిస్తున్నాయి. వారి స్వయం ఉపాధి కల్పనకు చేయూతనందిస్తున్నాయి. ఈ రుణాల మంజూరు, చెల్లింపుల్లో అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు పారదర్శకతకు పెద్దపీట వేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా లోకోస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీని అమలులో భాగంగా సంఘాల్లోని ప్రతీ సభ్యురాలి ఈకేవైసీ నమోదు చేయిస్తున్నారు. తద్వారా సభ్యుల వాస్తవ డాటా అందుబాటులోకి వచ్చి రుణాల మంజూరులో జరుగుతున్న అక్రమాలకు చెక్ పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా పారదర్శకత పెరుగనుంది. జిల్లాలో ఈకేవైసీ నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. యాప్లో సమగ్ర సమాచారం స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రతీ సభ్యురాలి ఆధార్కార్డు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్తో పాటు వారి ఈకేవైసీ వివరాలను లోకోస్ యాప్లో నమోదు చేస్తున్నారు. తద్వారా సంఘాల్లోని సభ్యుల సంఖ్య వాస్తవంగా తెలియడంతో పాటు ఈకేవైసీ వివరాల నమోదు ద్వారా వారు పొందిన రుణాలు, చెల్లింపులు లాంటి వివరాలన్నింటినీ ఆన్లైన్లో నేరుగా పర్యవేక్షించేందుకు అవకాశమేర్పడుతుంది. రుణాల మంజూరులో ఇదే డాటా కీలకం కానుండటంతో బోగస్ రుణాలకు చెక్ పడనుంది. అలాగే, మరణించిన సభ్యులు, ఎలాంటి పొదుపు చేయనివారి వివరాలు తొలగించేందుకు ఆస్కారమేర్పడుతుంది. వాస్తవికతతో కూడిన డాటా అందుబాటులోకి రానుంది. జిల్లాలో 2,278 మంది ఈకేవైసీ పూర్తి రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత పెంచేలా చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ జిల్లాలో ఇటీవలే ప్రారంభమైంది. ఆధార్ నంబర్తో ఫేస్ అఽథెంటికేషన్ను (ఫేస్ స్కానింగ్), ఓటీపీ ద్వారా లోకోస్ మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 20 మండలాల పరిధిలో 90,853 మంది సభ్యులుండగా ఇందులో ఇప్పటివరకు 85,372 మంది సభ్యుల బ్యాంక్ ఖాతాల వివరాలు నమోదు చేశారు. ఈ ప్రక్రియ 93.97శాతం పూర్తయింది. 77,737 మంది సభ్యుల ఆధార్ వివరాలు సేకరించారు. అలాగే, 89,862 మంది సభ్యుల మొబైల్ నంబర్లు నమోదు చేశారు. ఇందులో ఇప్పటివరకు ఆధార్తో కూడిన 2,278 మంది సభ్యుల ఈకేవైసీని పూర్తిచేశారు. జిల్లాలోని గ్రామీణ మండలాలు 20 స్వయం సహాయక సంఘాలు 11,446 సంఘాల్లోని సభ్యులు 90,853 ఈకేవైసీ పూర్తయిన సభ్యులు 2,278తలమడుగులో అత్యధికంసభ్యుల ఈకేవైసీ నమోదులో తలమడుగు మండలం అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ మండలంలో 529 మంది సభ్యుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 532, ఆదిలాబాద్ రూరల్లో 312, తాంసిలో 158, ఇంద్రవెల్లిలో 135, భీంపూర్లో 131, నేరడిగొండలో 129, మావలలో 91, నేరడిగొండలో 71, నార్నూర్లో 71, జైనథ్లో 63, బోథ్లో 35, బేలలో 25, సిరికొండలో 10, బజార్హత్నూర్లో 14, గుడిహత్నూర్లో 12, ఇచ్చోడలో 10, భోరజ్లో 2, గాదిగూడలో ఒకరి ఈకేవైసీ వివరాలు ఇప్పటివరకు నమోదు చేశారు. కొత్తగా ఏర్పడిన భోరజ్ మండలంలో ఇప్పటివరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు సత్తా చాటాలి
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటా లని డీవైఎస్వో దయానంద్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుంద ని పేర్కొన్నారు. అథ్లెటిక్స్లో జిల్లా క్రీడాకారులు వరుసగా పతకాలు సాధిస్తుండటం అభినందనీయమని కొనియాడారు. విజయం సాధించిన క్రీడాకారులు ఈ నెల 26, 27 తేదీల్లో హన్మకొండలోని జేఎన్ఎస్ వేదికగా నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్ తెలిపారు. కార్యక్రమంలో అ సోసియేషన్ కోశాధికారి వీజీఎస్ రాకేశ్, సీని యర్ పీడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
తలమడుగు: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంటుబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. మండలంలోని పల్లి(బి) గ్రామానికి చెందిన రైతు మోతే అశోక్ ఇటీవల పంట చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్మ చేసుకోగా అతడి కుటుంబాన్ని గురువారం బొర్రన్న కలిసి సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్లో అశోక్ తన 4.30 ఎకరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేయగా, గతేడాది కురిసిన అతి భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో అతడు తీవ్రంగా నష్టపోయి మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వం జీవో 194 ప్రకారం బాధిత కుటుంబానికి రూ.6లక్షల పరిహారంతోపాటు ఆర్థిక భరోసా కల్పించాలని, కుటుంబానికి నెలకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని, పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటట్ రమాకాంత్, దశరథ్, గంగారెడ్డి, రాజు తదితరులున్నారు. -
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
పాతమంచిర్యాల: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆటో జేఎసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ఆటో జేఎసీ(అన్నిసంఘాల) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గాజుల ముఖేష్గౌడ్ అన్నా రు. గురువారం హైదరాబాద్లో అన్ని రాజ కీయ పార్టీల నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఆటో కార్మికులు రోడ్ల దిగ్భందం చేపట్టి ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిస్తే సరి.. లేదంటే చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.పాదయాత్రగా వెళ్లి.. అధినేతను కలిసి..వాంకిడి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మ ళ్లీ కేసీఆర్ రావాలని కోరుతూ వాంకిడికి చెంది న జాడి తిరుపతి, శంకర్ ఈ నెల 10న మండల కేంద్రం నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి పాదయాత్ర చేపట్టారు. 274 కిలోమీటర్లు కా లినడక సాగించి గురువారం బీఆర్ఎస్ అధి నే త, మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. సుమా రు 30 నిమిషాలు వాంకిడి, ఆసిఫాబాద్ విషయాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని శాలువాలతో సత్కరించి తన ఇన్నోవా వాహనంలో ఇంటికి పంపించారు. -
నందులపల్లెకు ఓ వెబ్సైట్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఇక ప్రతీ గ్రామ వివరాలన్నీ కూడా వెబ్సైట్లో నిక్షిప్తం కానున్నాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ప్రతీ గ్రామానికి సంబంధించి ప్రస్తుత గ్రామ వివరాలు, మూడేళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక, వార్షిక పనులు–ఆర్థిక పురోగతి అనే మూడు అంశాలకు సంబంధించి వివరాలను ఈ వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. మొదటి విభాగంలో ప్రస్తుతం గ్రామ జనాభా, వ్యవసాయ, ఉద్యానవనం, నీటి వనరులు, సంస్థలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, నీటి సంరక్షణ, భూములు, వాతావరణ పరిస్థితులు, ఆదాయ, వ్యయాలు, పెన్షన్లు, వన మహోత్సవం, వీబీజీ–రామ్జీ, సీ్త్రనిధి, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాలు, తదితర వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. మూడేళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక ఇలా.. 2026 నుంచి 2029 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడేళ్ల ప్రణాళిక తయారు చేస్తారు. ఇందులో గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛభారత్ మిషన్ భగీరథ, మహిళా సాధికారత, సీ్త్రనిధితో పాటు జీపీ అభివృద్ధికి అవసరమైన అంచనా బడ్జెట్కు సంబంధించి నివేదిక తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. నందులపల్లె ఎంపిక.. గ్రామానికో వెబ్సైట్ కార్యక్రమం ఈనెల 21న శుక్రవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభం కా నుంది. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలో మొదటి దశలో నెన్నెల మండలంలోని నందులపల్లె ఎంపికై ంది. ఈ నెలాఖరు వరకు నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి విడతల వారీగా జిల్లాలోని గ్రామాలన్నింటి సమగ్ర సమాచారం వెబ్సైట్లో నమోదు చేయనున్నారు.అందుబాటులో సమగ్ర నివేదిక.. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో గ్రామ పంచాయతీ వివరాలు, మూడేళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక, వార్షిక పనులు, ఆర్థిక పురోగతికి సంబంధించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తాం. మొదటి విడతలో నందులపల్లె వివరాలను ఆన్లైన్ చేశాం. దశల వారీగా జిల్లాలోని గ్రామాల సమగ్ర అభివృద్ధి నివేదిక ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. – కిషన్, డీఆర్డీఓ, ఇన్చార్జి డీపీఓ, మంచిర్యాల -
జీవో 97ను రద్దు చేయాలి
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా తీసుకువచ్చిన జీవో 97ను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఇషాంత్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు గు రువారం జిల్లా కేంద్రంలోని సంజయ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాలను బంద్ చేయించారు. విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇషాంత్ మాట్లాడుతూ.. ఎస్బీటెట్ బోర్డు పా త్రను పరిరక్షించాలని కోరారు. విద్యార్థుల ఫీజులు పెంచవద్దని విజ్ఞప్తి చేశారు. కళాశాలలు, హాస్టళ్లు, వర్క్షాప్లకు నిధులు పెంచాలని కోరారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్ విధానం అమలు చేయవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు నితిన్, రాధేశ్యామ్, మజర్, దశాంత్, చరణ్ తదితరులున్నారు. -
ప్రాణం తీసిన అతివేగం
బెల్లంపల్లి: అతివేగం అజాగ్రత్త ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ విషాద ఘటన బెల్లంపల్లి శివారులోని కన్నాల జంక్షన్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వన్టౌన్ ఎస్హెచ్ఓ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు మందమర్రి ఏరియా శాంతిఖని గనిలో జనరల్ అసిస్టెంట్ కార్మికుడిగా పనిచేస్తున్న ఎడమనూరి సురేష్ (39) బెల్లంపల్లి స్టేషన్రోడ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో తన స్నేహితుడు గట్లే చిరంజీవితో కలిసి పల్సర్ బైక్పై కన్నాల నుంచి రోడ్క్రాస్ చేసి బెల్లంపల్లి వైపు వస్తుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన నుంచి హైదరాబాద్కు అతివేగంగా వచ్చిన బొలెరో ఢీ కొట్టింది. దీంతో బైక్ కొన్ని మీటర్ల దూరంలో పడిపోయింది. ఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా చిరంజీవికి తీవ్రగాయాలయ్యాయి. విష యం తెలుసుకున్న చిరంజీవి కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెబ్బెనకు చెందిన బొలెరో డ్రైవర్ మోర్లే మహేందర్ వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు. బిడ్డను చూడకుండానే... మృతుడు సురేష్ భార్య సుష్మ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. ఆరేళ్ల క్రితం తండ్రి కొమురయ్య వారసత్వంగా వచ్చిన సింగరేణి ఉద్యోగం చేస్తున్నాడు. తొ లుచూరు బిడ్డను తనివితీరా ముద్దాడాలని తపన ప డిన ఆ తండ్రి ఆ అదృష్టానికి నోచుకోకుండానే అ ర్థంతరంగా రోడ్డు ప్రమాదం రూపంలో తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడు. జీవితాంతం తోడుంటాన ని మూడుముళ్లు.. ఏడడుగులు నడిచిన భర్త కానరాకుండా పోవడంతో ఆమె దుఖించిన తీరు అందరిని కలిచి వేసింది. మృతుని తండ్రి ఎడమనూరి కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ శ్రీనివాసరావు తెలిపారు. -
అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి
శ్రావణమాసంలో శుక్లపక్షాన వచ్చే రెండో శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో పవిత్రంగా ఆచరిస్తారు. ఈ వ్రతం నోచుకోవడం ద్వారా సకల సౌభాగ్యాలు, అష్టై శ్వర్యాలు సిద్ధిస్తాయి. – శ్రీకాంత్ రామానుజ దాస్, అర్చకుడు, కుంటాల సౌభాగ్యాలకు ప్రతీక సిరి సంపదలు, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలిచే వరలక్ష్మీ వ్రతాన్ని కొన్నేళ్ల నుంచి చేస్తున్నా. మహాలక్ష్మీ అమ్మవారిని కొలిస్తే అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు కలుగుతాయి. ఈ మాసం ఎంతో ప్రవిత్రమైనది. మాసమంతా మహిళలు దేవుని లీలాగానంలో ఉండి దేవుని అనుగ్రహం పొందాలి. – సున్వబాయి, కెరమెరి -
టేకు చెట్లకు ఏమైంది..?
బోథ్: వర్షాకాలం సీజన్లో పచ్చదనంతో ప్రకృతి శోభను సంతరించుకోవాల్సిన ఆదిలాబాద్ జిల్లా అ టవీ ప్రాంతం ప్రస్తుతం ఊహించని రీతిలో రంగు మారి స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. జిల్లా లోని బోథ్, ఇచ్చోడ, బజార్హత్నూర్, భీంపూర్, తాంసీ, ఉట్నూరు మొదలుకొని పలు మండలాల్లో విస్తరించి ఉన్న కొండలు, గుట్టలపై టేకు చెట్ల ఆకులు పూర్తిగా ఎండిపోయినట్లు కనిపిస్తూ గోధుమ రంగులోకి మారుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే పచ్చటి అటవీ ప్రాంతం ఒక్కసారిగా కళావిహీనంగా మారడం స్థానిక ప్రజలతో పాటు పర్యావరణ ప్రేమికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి చెట్లకు ఏదో వింత అంటువ్యాధి సోకిందనే వదంతులు స్థానికంగా ప్రచారంలోకి వచ్చాయి. కీటకాల దాడి ఇది ప్రమాదకరమైన అంటువ్యాధి కాదని, వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా సంభవించే సహజసిద్ధమైన కీటకాల దాడి మాత్రమేనని వృక్షశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా తేమశాతం, ఉక్కపోత పెరిగినప్పుడు లద్దెపురుగు’ (టీక్ డెఫోలియేటర్–హైబ్లియా ప్యూరా), అస్థిపంజర పురుగు’ (టీక్ స్కెలెటోనైజర్–యుటెక్టొన మ్యాకరాలిస్) అనే లార్వాలు వృద్ధి చెందుతాయి. ఈ పురుగుల సమూహం టేకు ఆకుల్లోని పచ్చటి భాగాన్ని, పోషకాలను పూర్తిగా ఆరగించి, కేవలం ఆకుల నరాల వంటి ఈనెలను మాత్రమే వదిలేస్తాయి. దీనివల్ల ఆకులు పూర్తిగా ఎండిపోయి, మాడిపోయినట్లు కనిపిస్తాయి. వర్షాలు కురిస్తే మళ్లీ పునరుజ్జీవం.. ఈ పురుగుల జీవిత చక్రం కొద్ది రోజుల్లో ము గియడం లేదా ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో వీటి ఉధృతి సహజంగానే తగ్గుముఖం పడుతుంది. ఆ వెంటనే టేకు చెట్లకు సరికొత్త లేత చిగుర్లు తొడిగి, కొండలు మళ్లీ మునుపటి సహజ పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. అయినప్పటికీ అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, తెగులు వ్యా ప్తి స్థాయిని నిశితంగా అంచనా వేస్తూ అవసరమైన పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరంఉంది. టేకు జాతికే పరిమితంలద్దెపురుగులు కేవలం టేకు చెట్ల ఆకులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వల్ల, అటవీ ప్రాంతంలోని ఇతర వృక్ష జాతులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదు. వీటి జీర్ణవ్యవస్థ, శరీర నిర్మాణం టేకు ఆకుల్లోని రసాయన గుణాలకు అనుగుణంగానే ఉంటాయి. కాబట్టి పక్కనే వేప, రావి, మద్ది, మోదుగ లేదా ఇతర అటవీ వృక్షాలు ఉన్నప్పటికీ వాటి జోలికి అస్సలు వెళ్లవని నిపుణులు పేర్కొంటున్నారు. -
బోథ్ పోలీస్స్టేషన్ తనిఖీ
బోథ్: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ నిర్వహణ, స్టేషన్ పరిసరాలు, రికార్డులు పరిశీలించారు. ఫైళ్లు, రిజిస్టర్లను తనిఖీ చేసిన ఎస్పీ పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని పేర్కొన్నారు. సీసీటీఎన్ఎస్లో రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. మండలంలో గంజాయి, పేకాట, గుడుంబా లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ, రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, స్టేషన్కు వచ్చే ప్రజల సమస్యలను బాధ్యతతో పరిష్కరించి పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని ఆదేశించారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ గురుస్వామి, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు. -
రైల్లో నుంచి కిందపడి బాలునికి గాయాలు
మంచిర్యాలక్రైం: రైల్లో ప్రయాణిస్తున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు కిందపడడంతో గాయాలపాలైన సంఘటన బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోకి రైలు రాగానే అందులో ప్రయాణిస్తున్న బిహార్కు చెందిన ఎండీ ఆలం కుమారుడు ఎండీ అలీ (13) ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. స్థానికులు జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించడంతో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ గాయాల పాలైన అలీని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. క్షతగాత్రుడి తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లారు. కాగా అలీ తల్లిదండ్రులు హైదరాబాద్కు వలస వెళ్లి అక్కడే ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్తుండగా బాలుడు ప్రమాదానికి గురాయ్య డు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్
ఇచ్చోడ: నేర నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహిస్తున్నామని ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే అన్నారు. గురువారం తెల్లవారు జామున ఇచ్చోడ మండల కేంద్రంలోని ఇస్లాంపూర, రంజాన్పూర కాలనీలో తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలులేని 110 ద్విచక్ర వాహనాలు, ఆటో, 4 కార్లు, నంబర్ ప్లెట్లు లేని, ఫేక్ నంబర్లు ఉన్న 15 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్ ఇచ్చోడ స్టేషన్హౌజ్ ఆఫీసర్ నరేష్కుమార్, సీఐ సీహెచ్ రమేశ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకట్, మురళి, ఎన్.చంద్రశేఖర్, 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదిలాబాద్లో ‘హస్త’వ్యస్తం!
సాక్షి, ఆదిలాబాద్: ‘ఉట్నూర్లో ఈనెల 17న నిర్వహించిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో గందరగో ళం సృష్టించారు.. పార్టీ నాయకత్వంపై అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించా రు..’ ఇది కంది శ్రీనివాస్రెడ్డిపై డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ తెలంగాణ డీఏసీకి ఇచ్చిన ఫిర్యాదు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణ క్రమశిక్షణ చర్యల కమిటీ నుంచి గురువారం పార్టీ ఆది లాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ అయింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. అయితే, గ డువు సమీపిస్తుండడంతో అధిష్టానం తీసుకునే నిర్ణయంపై కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. నియమావళిపై పార్టీలో చర్చ గొడవ చేసిన వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని నరేశ్ జాదవ్ అదేరోజు మీడియా ముందు పేర్కొన్నారు. ‘పీఏసీ సభ్యుల ఎంపిక నేను చేసింది కాదు.. ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే గొడవకు దిగడం సరైంది కాదు.. బూతు పదజాలం పెద్దలే విన్నారు.. పీఏసీ సభ్యుల ఎంపిక తన చేతిలో లేదు.. సమావేశానికి ఎవరెవరిని పిలిచారో నాకు తెలియదు’ అని నరేశ్ జాదవ్ పేర్కొంటున్నారు. కాగా, పీఏసీ సభ్యుల ఎంపిక విధానం ఎలా ఉంటుంది.. పార్టీ నియమావళి ఎలా ఉంది.. అనేదానిపై కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ ఎలా ముందుకెళ్తుందనే దానిపై పార్టీలో ఆసక్తి పెరిగింది. ఆసక్తికర పరిణామాలు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి మధ్యలో గొడవ చోటు చేసుకుంటున్నప్పుడు.. పీఏసీ సభ్యులు గాని వారిని ఈ సమావేశానికి ఎవరు పిలిచారని అంటున్న సమయంలో.. ఓ ముఖ్య నేత కనుసైగలతో సంజీవరెడ్డి ఆ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రత్యర్థి వర్గం పరుష పదజాలం ఉపయోగించినప్పటికీ ఆయన ఎదురు దాడికి దిగకుండా ఆ ముఖ్య నేత సూచించినట్లు సమావేశ మందిరం నుంచి వెళ్లిపోవడం కార్యకర్తల దృష్టిని మరల్చలేకపోయింది. కంది వర్గంతో ప్రత్యర్థి వర్గం వ్యూహాత్మకంగా ఆ సమయంలో వ్యవహరించిందా? అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాాగా, పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని, అధిష్టానానిదే తుది నిర్ణయమని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ పేర్కొన్నారు.ముదిరిన విభేదాలుకాంగ్రెస్లో విభేదాలు మరింత ముదిరాయి. పీఏసీ సమావేశంలో ఇవి బహిర్గతమయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో, ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కార్యకర్తల మధ్య గందరగోళం కొనసాగుతోంది. కంది శ్రీనివాస్రెడ్డి, సంజీవరెడ్డి మధ్య ఇటీవలి కాలంలో గ్రూపు తగాదాలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలోనే పీఏసీ సమావేశంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయని కార్యకర్తలు చెప్పుకొంటున్నారు. -
● విద్యార్థులకు అందని యూనిఫాంలు ● పాత దుస్తుల్లోనే హాజరవుతున్న వైనం ● ఇటీవలే పాఠశాలలకు చేరుకున్న వస్త్రం ● జిల్లాలో కుట్టు ప్రక్రియలో తీవ్ర జాప్యం ● ఇంకా అందని బూట్లు, టైలు, సాక్స్లు ● ఆచరణకు నోచుకోని ప్రభుత్వ ప్రకటన
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు యూనిఫాంల కోసం ఎదురుచూస్తున్నారు. బడులు ప్రారంభమై మూడు నెలలైనా ఇంకా విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేయలేదు. పాఠశాలలు తెరిచిన మొదటిరోజే ఒక జత పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఆచరణకు నోచుకోలేదు. గత నె లలో కొన్ని పాఠశాలలకు వస్త్రం రాగా, ఈ నెలలో మిగతా బడులకు వచ్చింది. ఈనెల 31వరకు రెండు జతల యూనిఫాంలు విద్యార్థులకు అందజేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితులు కానరావడం లేదు. జిల్లాలో ఒకట్రెండు పాఠశాలలకే ఒక జత యూనిఫాం పంపిణీ చేశారు. బూట్లు పాఠశాలలకు చేరగా పలువురు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఇంకా సాక్స్లు, బెల్ట్లు, టైల జాడే లేదు. గురువారం ‘సాక్షి’ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల ను విజిట్ చేయగా, విద్యార్థులు పాత యూ నిఫాంలు, సివిల్ దుస్తుల్లోనే కనిపించారు. యూనిఫాంల కుట్టు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తెలిపారు. ఎదురుచూస్తున్న విద్యార్థులు విద్యార్థుల్లో సమానత్వ భావన పెంపొందుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు అందించడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుంది. జిల్లాలో డీఈవో పరిధిలో 690 ప్రభుత్వ యాజ మాన్య పాఠశాలలున్నాయి. వీటిలో 60,800 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేయాల్సి ఉంది. ఏటా జూన్, జూలైలోనే పంపిణీ చేయగా, ఈసారి ఆగస్టు పూర్తి కావస్తున్నా ఇంకా అందలేదు. గతంలోని యూనిఫాం రంగు మార్చి ఈసారి కొత్తవి ఇవ్వనున్నారు. ఏప్రి ల్, మేలో రావాల్సిన వస్త్రం జూలై, ఆగస్టులో పాఠశాలలకు చేరింది. దీంతో యూనిఫాంలు కుట్టడంలో జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా విద్యార్థులు పాఠశాలలకు పాత యూనిఫాంలు, సివిల్ దు స్తుల్లోనే వస్తున్నారు. కొత్త యూనిఫాంలు ఎప్పుడిస్తారోనని ఎదురుచూస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వీటిని కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. వచ్చేనెల వరకు కూడా ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగే అవకాశం కానరావడం లేదు. అయితే, అధికారులు మా త్రం ఈనెల 31వరకు రెండు జత ల యూనిఫాంలు అందిస్తామని చెబుతున్నారు. సివిల్ దుస్తుల్లో ఇచ్చోడ మండలం అడిగామ విద్యార్థులుసాత్నాల మండలం జామ్ని పాఠశాలలో..నేరడిగొండ మండలం కొర్టికల్ ఆశ్రమ పాఠశాలలో.. -
ఎలాంటి నష్టం వాటిల్లదు
వర్షాకాలంలో తేమ, ఉక్కపోత పెరిగినప్పుడు టేకు డీఫోలియేటర్, టేకు స్కెలిటనైజర్ లార్వాలు వేగంగా వృద్ధి చెంది ఆకుల్లోని పచ్చని భాగాన్ని తినేస్తాయి. కేవలం ఈనెలు మాత్రమే మిగలడంతో చెట్లు ఎండిపోయినట్లు కనిపిస్తాయి. దీనివల్ల చెట్టు కాండానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. పురుగుల జీవిత చక్రం ముగిశాక లేదా వర్షాలు పడగానే ఈ సమస్య సమసిపోతుంది. – డాక్టర్ రూపవత్ చంద్రశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వృక్షశాస్త్ర విభాగం -
ముగ్గురికి ఏడీలుగా ప్రమోషన్
ఆదిలాబాద్టౌన్: పశుసంవర్ధకశాఖలో పని చేస్తున్న ముగ్గురు పశువైద్యాధికారులకు అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీ)గా ప్రమోషన్ లభించింది. బేల పశువైద్యాధికారి వినోద్ దేశ్పాండేకు ఉట్నూర్ పశువైద్యశాలలో ఏడీగా, ఆదిలాబాద్ పశువైద్యశాలలో పనిచేస్తు న్న దూద్రాంకు ఆదిలాబాద్ డీఎల్డీఏలో, యాపల్గూడలో పనిచేస్తున్న వి.సురేశ్కు నిర్మల్ జిల్లాలో ని కార్యాలయంలో ప్రమోషన్ కల్పించారు. ప్రమోషన్ పొందిన అధికారులను గురువారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో పశువైద్యాధికారుల సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి ఆర్.రామారావు, సంఘం నాయకులు గోవింద్నాయక్, గజానంద్, రజనీకాంత్, శ్రవణ్కుమార్, సుభాష్, లావణ్య, నందిని తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్.. కాలేజ్
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇక డిజిటల్మయం కానున్నాయి. సాంకేతిక విద్య కు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. వీటితో ఇతర సాంకేతిక పరికరాలు, విద్యుత్, నెట్వర్కింగ్ తదితర వసతులు సమకూర్చనున్నారు. నాలుగు కళాశాలల్లో ల్యాబ్లు.. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య అందించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమగ్ర శిక్షా వార్షిక ప్రణాళిక 2026–27లో భాగంగా రాష్ట్రంలోని 80 సర్కారు జూనియర్ కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని బోథ్, బేల, ఉట్నూర్తో పాటు ఆదిలాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని 80 కళాశాలలకు మొత్తం రూ.20 కోట్లు కేటాయించగా, ఒక్కో కళాశాలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ లెక్కన జిల్లాకు రూ.కోటి మంజూరయ్యాయి. ప్రాక్టికల్స్తో నైపుణ్యాలు మెరుగు.. కంప్యూటర్ ల్యాబ్లు అందుబాటులోకి వస్తే విద్యార్థులు పాఠ్యాంశాలను ప్రాక్టికల్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ ఆపరేషన్, ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ టెక్నాలజీతో పాటు వివిధ సాఫ్ట్వేర్లపై ప్రాథమిక అవగాహన పెంపొందించుకునే అవకాశం కలగనుంది. తద్వారా విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలు పెరగడంతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో పోటీ పడేందుకు అవసరమైన సామర్థ్యం మెరుగుపడుతుందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ల్యాబ్ల ఏర్పాటుకు సంబంధించిన పనులను ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీటి ఏర్పాటుతో కళాశాలల్లో సాంకేతిక విద్యకు మరింత ప్రాధాన్యం లభించడంతో పాటు విద్యార్థులకు ఆధునిక విద్యా వనరులు అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం ప్రస్తుతం ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షల్లో కంప్యూటర్ పరిజ్ఞానం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్లు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. ఇప్పటికే సర్కా రు కళాశాలల అభివృద్ధి కోసం గతేడాది ల్యాబ్లు, ఫేషియల్ అటెండెన్స్, ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించింది.జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 13 ఫస్టియర్ విద్యార్థులు 3,404 సెకండియర్ విద్యార్థులు 3,214 కంప్యూటర్ విద్యకు ఎంపికై న కళాశాలలు 04 ఒక్కో కళాశాలకు మంజూరైన నిధులు రూ.25లక్షలు -
విద్యార్థులకు ప్రయోజనం..
ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ కింద జిల్లాలోని నాలుగు కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ల కోసం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలకు రూ.25లక్షల చొప్పున కేటాయించింది. ప్రైవేట్, కార్పొరేట్కు ధీటుగా సర్కారు కళాశాలల్లో నా ణ్య మైన విద్యాబోధన అందుతుంది. అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఫలితాలపై దృష్టి సారిస్తున్నాం. కంప్యూటర్ పరిజ్ఞానంతో విద్యార్థుల నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయి. – జాదవ్ గణేశ్కుమార్, డీఐఈవో -
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యం
ఆదిలాబాద్(బేల): ప్రతీ విద్యార్థి కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈవో డి. మాధవి అన్నారు. బేల మండలంలోని సిర్సన్న ఉన్నత పాఠశాల, బేల ప్రాథమిక పాఠశాల, మశాలా బి ప్రాథమికోన్నత పాఠశాలలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో అమలవుతున్న తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమం తీరును పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాలల్లోని బడితోట, మధ్యాహ్న భోజ నాన్ని పరిశీలించి, మండల విద్యా వనరుల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆమె వెంట ఎంఈవో మహాలక్ష్మి తదితరులు ఉన్నారు. -
‘అధికారం లేదనే అక్కసుతోనే దుష్ప్రచారం’
కైలాస్నగర్: అధికారం లేదనే అక్కసుతోనే ప్రజా సంక్షేమ పథకాలపై మాజీ మంత్రి జోగు రామన్న దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాల విషయంలో హైకోర్టు ఇచ్చి నవి కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని, అంతిమ తీర్పుకాదనే విషయాన్ని వారు గ్రహించా లన్నారు. 2014 నుంచి 2023 వరకు పదేళ్ల పా టు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, జీవోలద్వారా అమలుచేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలకు చట్టభద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కోర్టులో అఫిడవిట్ దాఖలులో అలసత్వం వహించిన అధికారులపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్పందించారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఇందులో నాయకులు పాల్గొన్నారు. -
కౌన్సెలింగ్ ఇస్తున్నాం..
గంజాయి, తెల్లకల్లు, దేశీదారు, ఇతర మా దకద్రవ్యాలకు బాని స అవుతున్న వారికి నెల రోజుల పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వైద్య సేవలతో పాటు సైకియాట్రిస్ట్తో సూచనలు అందిస్తున్నాం. చాలా మందిలో మార్పు వస్తుంది. ఈ ఏడాది మూడు నాలుగు నెలల్లో పది మంది మైనర్లు డి–అడిక్షన్ సెంటర్లో చేరారు. మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలను వారికి వివరిస్తున్నాం. – దేవేందర్, డవ్ సెంటర్ నిర్వాహకుడు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దుయువత, మైనర్లు మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. గంజాయి బారిన పడినవారు ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యం బారిన పడుతున్నారు. వారికి కౌన్సెలింగ్తో పాటు డి–అడిక్షన్ సెంటర్లో చేర్పిస్తున్నాం. 40 శాతం వరకు మార్పులు వస్తున్నాయి. భవిష్యత్తులో మళ్లీ వ్యసనాల బారిన పడకుండా సంబంధిత ఎస్సైల ద్వారా నిరంతరంగా నిఘా ఉంచుతున్నాం. ఎక్కడైన గంజాయి విక్రయించినా, సేవించినా పోలీసులకు సమాచారం అందించాలి. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
బల్దియా ఖాళీలమయం
కై లాస్నగర్: గ్రేడ్–1 స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. పాలనపరంగా ప్రజలకు సేవలందించాల్సిన రెవెన్యూ, టౌన్ప్లానింగ్తోపాటు పారిశుద్ద్యం వంటి కీలక వి భాగాల్లో అధికారుల పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. మున్సిపాలిటీ విస్తరణకు ముందు మంజూరైన పోస్టుల్లోనే సగానికిపైగా ఖాళీలు ఉండటం గమనార్హం. ఫలితంగా ఉన్నవారిపై అదనపు పనిభారంతో పాటు ప్రజలకు అందాల్సిన సేవల్లో జాప్యమవుతోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సైతం కొరవడుతుంది. పట్టణ జనాభా, అవసరాలకనుగుణంగా పోస్టులు పెరగాల్సి ఉండగా ఉన్న పోస్టులే ఖాళీగా ఉండడం పట్టణాభివృద్ధిపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పట్టణ అభివృద్ధిపై ప్రభావం.. 49 వార్డులు, 1.50లక్షలకు పైగా జనాభా కలిగిన ఆదిలాబాద్ మున్సిపల్లో పలు కీలక అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐదు నెలల క్రితం అసిస్టెంట్ కమిషనర్గాబాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ 15రోజుల్లోనే క్యాతన్పల్లికి పదోన్నతిపై బదిలీ అయ్యారు. దీంతో ఈ పోస్టు దాదాపు మంజూరు నుంచి ఖాళీగానే ఉంటుంది. మున్సిపల్ ఇంజినీర్ పోస్టు పరిస్థితి ఇలాగే ఉంది. ఇది వరకు పనిచేసిన పేరిరాజు నిజామాబాద్ కార్పొరేషన్కు బదిలీపై వెళ్లడంతో ఈ పోస్టులో ఇన్చార్జి అధికారి కొనసాగుతున్నారు. పట్టణంలో జరిగే అన్ని అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలుకుని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంఈపై ఉంటుంది. ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ కొరడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతంంది. మున్సిపాలిటీకి మంజూరయ్యే నిధులు, చేస్తున్న ఖర్చులు, ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాల లెక్కలను చూడాల్సిన మరో కీలకమైన అకౌంటెంట్ పోస్టు భర్తీకి నోచుకోవడం లేదు. ఇది వరకు పనిచేసిన అధికారి ఏసీబీకి పట్టుబడటంతో ఖాళీ అయింది. అకౌంటెంట్తో పాటు సహాయకులగా వ్యవహరించాల్సిన సీనియర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి. దీంతో కార్యాలయంలోని ఉద్యోగులతో ఈ బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. మరికొన్ని విభాగాల్లో.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ప్రజారోగ్యం కాపాడటంలో పారిశుద్ధ్య విభాగం కీలకపాత్ర పో షిస్తుంది. అయితే ఈ విభాగంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్, హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచుకోవడంలేదు. అలాగే పట్టణంలో ఆక్రమణల కట్టడితో పాటు భవన నిర్మాణ అనుమతులను పర్యవేక్షించాల్సిన పట్టణ ప్రణాళిక విభా గంలోనూ పలు కీలక పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రభావం ప్రజాసేవలపై పడుతుంది. మున్సిపల్ కార్యాలయ నిర్వహణతో పాటు ఉత్తర, ప్రత్యుత్తరాలను పర్యవేక్షించాల్సిన మేనేజర్ పోస్టు సైతం భర్తీకి నోచుకోవడం లేదు. ఇది వరకు పనిచేసిన మేనేజర్ ఏడాదిక్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి పోస్టు భర్తీకి నోచుకోవడం లేదు. ప్రస్తుతం రెవెన్యూ అధికారి ఇన్చార్జి మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. ఇలా కీలకమైన పలు పోస్టులు ఖాళీగా ఉండటంతో బల్దియా పాలనపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నధికారులు, ప్రజాప్రతినిధులు స్పందింది ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. మున్సిపల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు అసిస్టెంట్ కమిషనర్ 01 శానిటరీ ఇన్స్పెక్టర్ 02 సూపర్వైజర్ 01 హెల్త్ అసిస్టెంట్లు 02 మేనేజర్ 01 అకౌంటెంట్ 01 సీనియర్ అకౌంటెంట్ 01 జూనియర్ అకౌంటెంట్ 01 టీపీబీవో 03 టీపీఎస్ 02 ఏసీపీ 01 యూడీఆర్ఐ 01ప్రభుత్వానికి నివేదించాం మున్సిపల్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న మా ట వాస్తవమే. వీటిని భర్తీ చేయాలని కోరు తూ ఇదివరకే ప్రభుత్వానికి నివేదించాం. మరోసారి తాజా ఖాళీలతో ప్రతిపాదనలు పంపిస్తాం. – ఎస్ రాజేశ్వర్, అదనపు కలెక్టర్ -
నైపుణ్యాభివృద్ధికి శిక్షణ దోహదం
ఆదిలాబాద్టౌన్: నైపుణ్యాభివృద్ధికి ఓరియంటేషన్ ఎంతగానో దోహద పడతాయని డీఐఈవో జాదవ్ గణేశ్కుమార్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్లకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన రెండు రోజుల ఓరియంటేషన్ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధునాతన పద్ధతులు, మెళకువలు పాటిస్తూ సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతంగా వినియోగించుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని సూచించారు. రిసోర్స్ పర్సన్స్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ కమిటీ అధికారి కె.నాగరాజు, డీఆర్పీలు కె.లక్ష్మణరావు, శ్రీనివాస్, శివకుమార్, నాగేశ్వర్, ఉదయ్కుమార్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘కంది’కి షోకాజ్ నోటీసు
● మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ‘క్ర మశిక్షణ కమిటీ’ ఆదేశం కై లాస్నగర్: కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డికి ఆ పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఆదిలాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఇజ్జగిరి సంజయ్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 17న ఉట్నూర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి సచిన్ సావంత్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో చోటుచేసుకున్న గొడవతోపాటు పార్టీ నాయకులను పరుషపదజాలంతో దూషించారనే కారణంతో ఈ నోటీసులు జారీ చేశారు. సీనియర్ నాయకుల సమక్షంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగా పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ తమ దృష్టికి తెచ్చిన ఈ విషయంపై నోటీసు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. దీనిపై మూడు రోజుల్లో గా వివరణ ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ వైస్ చైర్మన్ ఏ.శ్యాంమోహన్ పేర్కొన్నారు. వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మా సారు.. మాక్కావాలే!ఆదిలాబాద్(బేల): తమకు విద్యాబుద్ధులు నేర్పుతూ, ఎంతో శ్రద్ధగా బోధిస్తున్న ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు డిప్యూటేషన్పై పంపడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ‘మా సారు మాకు కా వాలి’ అంటూ బుధవారం నిరసనకు దిగారు. బేల మండలంలోని బెదోడ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణను ఇటీవల విద్యాశాఖ అధికారులు మౌఖిక ఆదేశాలతో కాంగార్పూర్ పాఠశాలకు డిప్యూటేషన్పై పంపించారు. దీంతో వి ద్యార్థులు, వారి తల్లిదండ్రులు బుధవారం పా ఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు స్పందించి సదరు ఉపాధ్యాయుడిని తిరిగి బెదోడ పాఠశాలకు పంపించారు. చిన్నారులు హర్షం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయుడికి స్వాగతం పలికారు. -
● ఎంపీ గోడం నగేష్
టెలికాం సేవలు బలోపేతం చేయాలిఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెలికాం సేవలను మరింత బలోపేతం చేసి, మారుమూల గ్రామాలకు మెరుగైన మొబైల్ నెట్వర్క్ అందేలా చర్యలు చేపట్టాలని ఎంపీ గోడం నగేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో సెల్ టవర్ల నిర్వహణ, కొత్త టవర్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. బీఎస్ఎన్ఎల్ పీజీఎం వెంకటేశ్వర్లు, సలహా కమిటీ సభ్యులు ఎస్.కృష్ణకుమార్, బూర రమేష్, కే.వినోద్కుమార్, కొండ ప్రభాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. యువకుడిని కాపాడిన పోలీసులుకడెం: కడెం ప్రాజెక్ట్లో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని పోలీసులు కాపాడారు. మండల కేంద్రానికి చెందిన రాజ్కుమార్ మద్యానికి బానిసయ్యాడు. తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. సోమవారం రాత్రి కడెం ప్రాజెక్ట్ కుడి కాలువ వద్ద దూకేందుకు ప్రయత్నిస్తుండగా అటుగా పెట్రోలింగ్కు వెళ్లిన బ్లూ కోర్ట్ కానిస్టేబుళ్లు వెడ్మ భీంరావు, గణేశ్ యువకుడిని బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. అనంతరం అతని ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. అర్లి(టి) శివారులో పులి సంచారంతాంసి: భీంపూర్ మండలంలోని అర్లి(టి) శివారులో మంగళవారం పంటచేలకు వెళ్లిన మహిళా కూలీలకు పులి కనిపించడంతో భయంతో ఇంటికి పరుగులు తీశారు. పత్తి చేనులో అడవిపంది కళేబరం కనిపించడంతో పులి దాడిచేసి హతమార్చినట్లు గుర్తించారు. ఈ విషయమై అటవీశాఖ సెక్షన్ అధికారి మోపత్రావును సంప్రదించగా పులి పాదముద్రలుగా గుర్తించామన్నారు. పులి సంచారం ఉన్నందువల్ల రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పులి కదలికలను ఎనిమల్ ట్రాకర్స్ ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పులి కనిపిస్తే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. శీర్షాలో పెద్దపులి సంచారంకౌటాల: కౌటాల మండలం శీర్షా గ్రామ శీవారులోని పత్తి చేనులో మంగళవారం పెద్దపులి సంచరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పులి పాదముద్రలు గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు తులసీదాస్, శ్రీదేవి మాట్లాడుతూ పెద్దపులి సిర్పూర్(టి) మండలం కొమ్ముగూడ నుంచి శీర్షా పంట పొలాల మీదుగా చింతలమానెపల్లి మండలం డబ్బా అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని గ్రామపంచాయతీ కార్యదర్శి కై లాస్ మండల కేంద్రంలో టాం టాం వేయించారు. కంకమల్మ గుట్ట ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారని, గుట్టకు ఆవులు, మేకలు, గొర్రెలను తోలుకుని వెళ్లవద్దని సూచించారు. నాగోబా ఆలయ హుండీ లెక్కింపుఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో నాగుల పంచమిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన హుండీని మంగళవారం మెస్రం వంశీయులు లెక్కించారు. రూ.1,06,035 ఆదాయం వచ్చిందని నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ తెలిపారు. ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి సహకరించిన పోలీసులు, అధికారులకు మెస్రం వంశీయుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెస్రం తుకారాం, మెస్రం వంశీయులు పాల్గొన్నారు. -
ఆత్మగౌరవ ప్రతీక పాపన్నగౌడ్
ఆదిలాబాద్రూరల్: బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతి వేడుకలనుజిల్లా కేంద్రంలో మంగళవారం అధికారికంగా నిర్వహించారు. బస్టాండ్ ఎదుట గల పాపన్నగౌడ్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన పాపన్నగౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సి పల్ చైర్పర్సన్ అనూష, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి సునీతకుమారి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, చరణ్గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
10వ రోజుకు ‘సీసీఐ’ దీక్ష
ఆదిలాబాద్టౌన్: సీసీఐ పునఃప్రారంభించాలని డి మాండ్ చేస్తూ సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కానసాగుతున్నాయి. మంగళవా రం నాటికి పదోరోజుకు చేరాయి. దీక్షలో సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు సుమారు 25 మంది కూర్చున్నారు. సీపీఎం సీనియర్ నాయకుడు లంకా రాఘవులు మాట్లాడుతూ, సీసీఐని పునఃప్రారంభిస్తే ఈ ప్రాంతం పారిశ్రామికాభివృద్ధి తోపాటు వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దీక్షలో మంజుల, గంగసాగర్, ఆరిఫా బేగం, స్వామి, సునీత కూర్చున్నారు. వీరికి సాధన కమిటీ కన్వీనర్ మల్లేశ్, కోకన్వీనర్ నారాయణ, రమేశ్, పోశెట్టి, రంగన్న, ఈశ్వర్, అశోక్ స్వామి మద్దతు తెలిపారు. -
24 గంటల్లో చోరీ కేసు ఛేదన
ఆసిఫాబాద్అర్బన్: ఓ ఇంట్లో చోరీ జరిగిన కేసును 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆసిఫాబాద్ సీఐ నీలం రవి తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని కొత్త రహపల్లికి చెందిన ముంజం లలిత ఈ నెల 16న ఇంటికి తాళం వేసి పంటచేలకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి అల్మారాలో ఉన్న సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన వడై లాలాజీని అదుపులోకి తీసుకుని 38.320 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
కల్యాణలక్ష్మి రద్దుకు ప్రభుత్వం కుట్ర
కై లాస్నగర్/ఇచ్చోడ: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మంగళవారం ఆందోళన చేపట్టింది. మాజీ మంత్రి రామన్న ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట, ఇచ్చోడలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేతృత్వంలో ధర్నా చేపట్టారు. జిల్లాకేంద్రంలో పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రహదారిపై గంట పాటు బైఠాయించారు. ఆర్డీవో కార్యాలయ ఏవో వారి వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించగా ఆందో ళన విరమించారు. ఈ సందర్భంగా రామన్న మా ట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడం విచారకరమన్నారు. కార్యక్రమంలో నాయకులు అజయ్, నారాయణ, సాజిదొద్దీన్, యూనిస్ అక్బాని, స్వరూపరాణి, మమత, రమేష్, జగదీష్, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ్చ తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు ఏనుగు కృష్ణారెడ్డి, గాడ్గె సుభాష్, పాండుతో పాటు మాజీ జెడ్పీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
నంబర్ మారుస్తూ.. నకిలీ పత్రాలు సృష్టిస్తూ
వరుస తనిఖీల్లో వెలుగుచూసిన ఘటనలు.. బోథ్: ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి చట్టబద్ధమైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా అతి తక్కువ ధరకు వాహనాలు కొనుగోలు చేసి వాటికి తెలంగాణలో స్క్రాప్గా మారిన లేదా తీవ్ర ప్రమాదాల్లో ధ్వంసమై కదల్లేని స్థితిలో ఉన్న పాత వాహనాల నంబర్లు, ఛాసిస్, ఇంజిన్ వివరాలను అమర్చుతున్న భారీ అక్రమ నెట్వర్క్ జిల్లాలో కలకలం రేపుతోంది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్తో పాటు ఇతర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి దొంగిలించిన లేదా పత్రాల్లేని వాహనాలను సరిహద్దులు దాటించి తెస్తు న్న కేటుగాళ్లు, ఇక్కడి స్క్రాప్ వాహనాల ఆర్సీపత్రా ల ఆధారంగా నకిలీ గుర్తింపును సృష్టించి దర్జాగా రోడ్లపై తిప్పుతున్నారు. ఇటీవల పోలీసుల వరుస తనిఖీల్లో పట్టుబడుతున్న వాహనాలు ఈ ముఠాల పక్కా పన్నాగాలను బహిర్గతం చేస్తున్నాయి. అక్రమదందా సాగుతున్న తీరు ఇలా.. ఈ ముఠాలు ప్రధానంగా రెండు మార్గాల్లో వ్యవహారాన్ని నడిపిస్తున్నాయి. మొదటిది మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో లభించే పత్రాల్లేని సెకండ్ హ్యాండ్ వాహనాలు, దొంగిలించిన బైకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాకు తరలిస్తున్నారు. రెండోది తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో పూర్తిగా దెబ్బతిని తుక్కుగా మారిన లేదా ఇంజిన్ పాడై నిరుపయోగంగా పడి ఉన్న పాత వాహనాల ఆర్సీ పత్రాలు, నంబర్లను స్క్రాప్ వ్యాపారుల నుంచి రూ.5వేల నుంచి రూ.10వేలకు తీసుకుంటున్నారు. ఆ తర్వాత స్థానిక మెకానిక్లు, వెల్డర్లతో కుమ్మకై ్క పరాయి రాష్ట్ర వాహనంపై ఉన్న అసలు ఛాసిస్, ఇంజిన్ నంబర్లను గ్రైండింగ్ మెషీన్ల ద్వారా పూర్తిగా చెరిపివేస్తున్నారు. వాటి స్థానంలో ఇక్కడి పాత స్క్రాప్ వాహనం తాలూకు వివరాలను డై–పంచ్, ప్రత్యేక వెల్డింగ్ సాంకేతికతతో కొత్తగా ముద్రిస్తున్నారు. అనంతరం పాత నంబర్ ప్లేట్ను తగిలించి, దానికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ పత్రాలు జతచేసి, పూర్తి చట్టబద్ధమైన స్థానిక వాహనంగా భ్రమింపజేస్తూ మార్కెట్లో అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అప్రమత్తంగా ఉండాలి సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులు కేవలం నంబర్ప్లేట్, ఆర్సీ కార్డు మాత్రమే చూసి మోసపోవద్దని పోలీసు, రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాహనం బాడీ పై ముద్రించి ఉన్న ఛాసిస్, ఇంజన్ నంబర్లను నిశి తంగా గమనించాలని, అక్కడ గ్రైండింగ్, వెల్డింగ్ గుర్తులు ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని పే ర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘పరివాహన్’ పోర్ట ల్ ద్వారా ఆన్లైన్ డేటాతో చాసిస్ నంబర్ సరిపోలుతుందో లేదో నిర్ధారించుకున్న తర్వాతే లావాదేవీలు జరపాలని స్పష్టం చేస్తున్నారు. మోటారు వా హనాల చట్టం ప్రకారం చాసిస్ నంబర్లను మా ర్చడం, నకిలీ పత్రాలను సృష్టించడం నాన్బెయిలబుల్ నేరమని, ఇటువంటి ఫోర్జరీలకు పాల్పడే వారిపై చీటింగ్ కేసులతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నకిలీ నంబర్ ప్లేట్తో బైక్ పట్టివేతఆదిలాబాద్టౌన్: నకిలీనంబర్ ప్లేట్తో తిరుగుతున్న ద్విచక్ర వాహనాన్ని పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునిల్ కుమార్ తెలిపారు. ఈనెల 12న రాత్రి పట్టణంలో వాహన తనిఖీలు చేస్తుండగా పల్సర్ బైక్పై వచ్చిన వ్యక్తి ఎలాంటి పత్రాలు చూపించలేదని, ఆన్లైన్లో వాహనం వివరాలు పరిశీలించగా, బైక్పై ఉన్న ఇంజిన్, చాసిస్ నంబర్లకు తేడా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వాహనదారుడిని ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన షేక్ అర్బాస్గా గుర్తించినట్లు పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం ఇచ్చోడలోని రెడ్డి కాలనీకి చెందిన పుసపత్రి కృష్ణ వద్ద బైక్ను తాకట్టు పెట్టినట్లు అర్బాస్ తెలిపాడు. అయితే కృష్ణ తన సోదరుడి బైక్ నంబర్ ప్లేట్ను ఈ వాహనానికి అమర్చాడు. ఈ క్రమంలో తప్పుడు నంబర్ ప్లేట్తో వాహనం నడుపుతున్న షేక్ అర్బాస్తో పాటు నంబర్ ప్లేట్ మార్చిన కృష్ణపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. వాహనాలు కొనేముందు సరిచూసుకోవాలి సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు చాసిస్, ఇంజన్ నంబర్లను భౌతికంగా క్షుణ్ణంగా పరిశీలించాలని, ఒరిజినల్ ఆర్సీ పత్రాలను సరిచూసుకున్న తర్వాతే నగదు చెల్లించాలి. నంబర్లు చెరిపివేసిన వాహనాలను కొని మోసపోవద్దు. నంబర్లు మార్చే వారిపై చీటింగ్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలో వాహనాల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. – జీవన్రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్ -
జీవో 97 రద్దు చేయాలి
ఆదిలాబాద్టౌన్: సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని, జీవో నం.97 వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కోకన్వీనర్ బుదారి గంగాప్రసాద్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు మంగళవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. నూతన జీవో ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి’ విభాగంలో విలీనం చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, మైరెన్ ఇంజినీరింగ్, నేవీ తదితర రంగాల్లోని ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో ఏబీవీపీ జిల్లా కన్వీ నర్ ఆదిత్య, జిల్లా మీడియా కన్వీనర్ సాయి, సిద్దు, శివ, వినయ్,విద్యార్థులు పాల్గొన్నారు. -
అప్రమత్తతతోనే నేరాల నియంత్రణ
ఆదిలాబాద్టౌన్: అప్రమత్తతతోనే నేరాలను నియంత్రించవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించి ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందిని అభినందించారు. స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు ప్రశంసాపత్రాలతో పాటు నగదు రివార్డులు అందజేశారు. రిమ్స్ వద్ద తనిఖీల సందర్భంగా కత్తులు, తల్వార్లను పట్టుకున్న కానిస్టేబుల్ ఎం.సాయి, రైల్వేస్టేషన్లో గంజాయి ప్యాకెట్ను పట్టుకున్న కానిస్టేబుల్ కె.కిశోర్, బస్టాండ్లో మొబైల్ చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకున్న కానిస్టేబుల్ ఎస్.నగేశ్కు ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
● ఐటీడీఏ పీవో మంద మకరందు
‘కుంటాల’ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాంనేరడిగొండ: మండల కేంద్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుంటాల జలపాతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. మంగళవారం జలపాతాన్ని సందర్శించారు. ప్రకృతి సోయగాలకు నిలయంగా ఉందని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపడతామన్నారు. ముఖ్యంగా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కేవలం రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేక గుర్తింపు పొందేలా అ భివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. స్థా నిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎకో టూరిజం కార్యక్రమాలను ప్రోత్సహిస్తామన్నారు. ప్రకృతి అందాలను కాపాడుకుంటూనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో పాటు గిరిజన యు వతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నా రు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూ పొందించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు. కుంటాల జలపాతం వద్ద పీవో మకరందు -
నామినేటెడ్పై రైతుల గుర్రు
‘అరే రాజయ్య.. ఈ సంగతి ఇన్నావా? ఇక నుంచి మన సొసైటీ లీడర్లను ఓట్లేసి ఎన్నుకునే పద్ధతి లేదట.. అధికార పార్టీ నుంచే నామినేట్ చేస్తరట..’ అంటూ మల్లయ్య అనగానే టీ తాగుతున్న రాజయ్య ‘అవునా.. గట్లెట్లుంటది.. గతంలో ఓట్లతోనే కదా డైరెక్టర్లు, చైర్మన్ను ఎన్నుకున్నది. ఇప్పుడు ఉండదంటున్నవ్.. మనకు ఓటు హక్కు పోయినట్టేనా..’ అని అనుమానంగా అడిగాడు. ‘అదే గదా గోస! ఇగ ఎన్నికలే ఉండవట.. పెద్ద లీడర్లు కూర్చొని పేర్లు రాసిస్తారట.. వాళ్లు చెప్పినోళ్లే ఇక చైర్మన్లు, డైరెక్టర్లట!’ అని మల్లయ్య అసహనంగా చెప్పాడు. పీఏసీఎస్ పాలకవర్గాలను నామినేటెడ్ విధానంలో భర్తీ చేస్తామని ప్రభుత్వ ప్రకటించిన నేపథ్యంలో గ్రామాల్లో సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది.జిల్లాలో పీఏసీఎస్లు 28 సంఘాల్లో సభ్యులు 59,483 -
ఉట్నూర్ ఎంఈవో ఆశన్న మృతి
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ ఐబీ ప్రాంతంలో ఈనెల 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఎంఈవో ఆశన్న హైదరాబాద్లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మంగళవారం భౌతికకాయం స్వగ్రామానికి చేరుకోవడంతో మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల ఉపాధ్యాయులు, లక్కారం జెడ్పీఎస్ఎస్ పాఠశాల విద్యార్థులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు అధికసంఖ్యలో ఎంఈవో నివాసానికి చేరుకున్నారు. ‘సార్.. ఇక రారా... మమ్మల్ని ఒంటరివాళ్లను చేసి ఎక్కడికి వెళ్లారు!’ అంటూ విద్యార్థులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. డీఈవో, ఉపాధ్యాయ సంఘాల నివాళి ఉట్నూర్రూరల్: ఎంఈవో ఆశన్న పార్థివ దేహానికి డీఈవో మాధవి, వివిధ ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ నాయకులు నివాళులర్పించారు. అంత్యక్రియల్లో సర్పంచ్ అనిత శ్రీనివాస్, ఉపసర్పంచ్ బే గం అన్సారి, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముడుగు శ్యా ముల్, ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీ తల్ చవాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ రవికుమార్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాథోడ్ సుమన్బాయి, బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకులు భరత్ చౌహాన్, తదితరులు పాల్గొన్నారు. -
సొనాలలో కమ్యూనిటీ కాంటాక్ట్
బోథ్: ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారు జామున సొనాల మండల కేంద్రంలో పోలీసులు ‘కమ్యూనిటీ కాంటాక్ట్’ నిర్వహించారు. సరైన పత్రాలు, పెండింగ్ చలానాలు, నంబరు ప్లేట్లు లేని 232 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.వెంకటనర్సయ్య తెలిపారు. వీటిలో ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చిన ఒక కారును గుర్తించి, నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 318(4) కింద చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరి వద్ద నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఎకై ్సజ్ కేసులు నమోదు చేశామని, గంజాయి సేవిస్తున్న మరొకరిపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సీఐలు సీహెచ్.రమేశ్, బి. ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, ఎస్సైలు వి.పురుషోత్తం, రమేశ్, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
బాసర: ఆర్జీయూకేటీ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సెమీకండక్టర్ డిజైన్పై ఐదు రోజుల జాతీయ స్థాయి బూట్క్యాంప్ శిక్షణ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. బాసర ఆర్జీయూకేటీ, నైలిట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం ఈ నెల 22 వరకు కొనసాగనుంది. ‘సెమీకండక్టర్ డిజైన్: ఆర్టీఎల్, ఐపీ ఇంటిగ్రేషన్, ఎస్ఓసీ సైన్ఆఫ్’ అంశాలపై విద్యార్థులకు నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా లోతైన విజ్ఞానాన్ని సాధించవచ్చన్నారు. వైఫల్యాలను నిరాశగా కాకుండా పాఠాలుగా మలుచుకోవాలని సూచించారు. వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించేందుకు దేశ, విదేశాల్లోని ప్రముఖ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు చేసుకోనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్కుమార్, ఓఎస్డీ ఏవో ప్రొఫెసర్ మురళీదర్శన్, నైలిట్ హైదరాబాద్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ లక్ష్మణ్ కొర్రా, ఐడెక్స్ మాజీ డైరెక్టర్ కల్నల్ (రిటైర్డ్) ఏకే సింగ్, వీరా టాక్టికల్ డైనమిక్స్ సీఈఓ సాయితేజ పెద్దినేని, తదితరులు పాల్గొన్నారు. -
సర్.. బీకేర్ఫుల్!
సాక్షి,ఆదిలాబాద్: ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటరు జాబితా విడుదలైంది. అందులో తమ పేరు ఉంటుందా.. లేదా అనేదానిపై అందరూ ఆతృతగా ఎదురుచూశారు. ఇప్పుడు జాబితాలో వివరాలు వెతుక్కుంటున్నారు. కొంత మంది ఇప్పటికే వాటిని చూసేశారు. ఈ జాబితాలో ఉండడంతో ఇక తమ ఓటుకు ఏమి కాదనుకుంటే పొరపాటే. ఎన్నికల సంఘం ఈ జాబితాలో ఉన్నవారికి కూడా వివిధ కారణాలతో ఈఆర్వో ద్వారా నోటీసులు జారీ చేయనున్నారు. ఆ నోటీసు అందుకున్న వారు నిర్దేశిత సమయంలో ఎలాంటి ఆధారం సమర్పించకపోయినా, వెరిఫికేషన్ పూర్తి చేసుకోకపోయినా తుది ఓటరు జాబితా నుంచి తొలగింపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇదీ పరిస్థితి.. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి ఇచ్చినప్పటికీ పొరపాట్లు, ఇతర కారణాలతో అనేక మంది ఓటర్లను అనామలిస్ కేటగిరీలో చేర్చడం జరిగింది. ఇలా లక్షకు పైగా ఓటర్లు ఉండటం గమనార్హం. ఇప్పుడు వారందరికీ ఈఆర్ఓ నుంచి నోటీసులు జారీ చేయనున్నారు. ఓటరు ఎన్యూమరేషన్ ఫారం నింపే సమయంలో బీఎల్వోలు పాత ఓటర్ల జాబితా ఆధారాలతో ప్రస్తుత ఓటరు కార్డు వివరాలను లింక్ (మ్యాపింగ్) చేస్తారు. ఒకవేళ ఓటరు నమోదు డేటా సరిగ్గా మ్యాచ్ కానట్లయితే వారిని నో మ్యాపింగ్ వర్గంలో చేరుస్తారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఉన్నప్పటికీ ఈ రెండు కేటగిరీల్లో పలువురు ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇతర అంశాల ఆధారంగా ఇప్పటికే వేలాది ఓట్లు తొలగింపునకు గురైన విషయం తెలిసిందే. వివరాలు జూన్ నాటికి ఓటర్ల సంఖ్య : 4,66,784డిజిటలైజేషన్ పూర్తయింది : 4,03,625అనామలిస్ నోటీసులు : 1,32,833మ్యాపింగ్ కానివారు : 17,591శాశ్వతంగా తొలగించిన ఓట్లు : 63,159 -
కుంటాల ఆశ్రమ పాఠశాల తనిఖీ
ఇచ్చోడ: ‘నో ఎంట్రీ.. గేటు నుంచే మాట్లాడాలి’ శీర్షికన ఈ నెల 16న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం నేపథ్యంలో ఐటీడీవో పీవో మంద మకరందు మంగళవారం సాయంత్రం కుంటాల బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఇచ్చోడ ఏటీడీవో సుచేతన్రెడ్డి ఉన్నారు. -
మేకల దొంగలు అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని జైజవాన్నగర్లో మేకల చోరీకి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. సోమవారం టూటౌన్లో వివరాలు వెల్లడించారు. ఈనెల 16న జైజవాన్నగర్కు చెందిన కోహినూర్ బేగం తన మేకలు కనిపించడం లేదని డయల్ 100 ద్వారా టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సైలు అఖిల్, ప్రణయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మహమ్మద్ పర్వేజ్, షేక్ ఐజాన్ మేకలను చోరీ చేసి మహమ్మద్ ఫిర్దోస్, ఆసిఫ్ఖాన్కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చోరీకి గురైన ఐదు మేకలతో పాటు కారు, మూడు సెల్ఫోన్లు, రూ.2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
18 రకాల సేవలు..
మంచిర్యాలక్రైం: డయల్ 100 అనగానే అందరూ టక్కున ఇది పోలీస్ స్టేషన్ నంబర్ కదా అంటారు. నిజమే.. కానీ ఇది మొన్నటి వరకు. తెలంగాణ ప్రభుత్వం డయల్ 100కు స్వస్తి పలికింది. కొత్తగా డయల్ 112 నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో మరింత వేగవంతమైన సేవలు అందించే లక్ష్యంతో ఈ కొత్త నంబర్ ప్రవేశపెట్టారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్, అత్యవసర సేవల దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగుల్లో నెక్ట్స్ జనరేషన్ డయల్ 112 ప్లాట్ఫాం ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో బాధితులకు డయల్ 112 మొదటి రక్షణ కవచంగా పనిచేస్తోంది. డయల్ 112 ప్రత్యేకతలు -
రాష్ట్రంలో అగమ్యగోచరంగా రైతుల పరిస్థితి
ఆదిలాబాద్: రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రూ.2 లక్షలకు పైగా రుణాలున్న రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో మాఫీ కాలేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరకపోవడంతో రైతులకు పంట నష్టం సమయంలో భరోసా దక్కడం లేదన్నారు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించడంలోనూ సర్కారు విఫలమైందని, ఆత్మ కమిటీ చైర్మన్ల నియామకాలను సైతం రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇందులో నాయకులు రాందాస్, దయాకర్, కార్తీక్, సన్నీ, కరుణాకర్రెడ్డి, అశోక్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
కై లాస్నగర్: అర్జీలు పెండింగ్లో ఉంచొద్దని, ప్రాధాన్యతతో నిర్ణీత గడువులోపు పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, ఆర్ఎస్. చిత్రు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాఽధితుల నుంచి వారు అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించినా అర్జీదారులు ఎప్పటి మాదిరిగానే జిల్లా కేంద్రానికి తరలిరావడం గమనార్హం. కాగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పింఛన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి వంటి పలు సమస్యలకు సంబంధించి వినతులు భారీగా అందాయి. కార్యక్రమంలో డీఆర్వో స్రవంతి, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఏవో వర్ణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కే.నలందప్రియ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.. -
విద్యుత్ ఉద్యోగుల నిరసన
ఆదిలాబాద్టౌన్: విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఎస్ఈ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ సుద్దాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల వేతన సవరణ కోసం పీఆర్సీ కమిటీ నియమించాలని డిమాండ్ చేశారు. జెన్కోను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. 14 డిమాండ్లతో ఈనెల 19న విద్యుత్ సౌద ఎదుట మహా ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్ర దం చేయాలని కోరారు. ఇందులో జేఏసీ కన్వీ నర్లు రమేశ్, విలాస్, నాయకులు సత్తయ్య, మధుకర్, శ్రీనివాస్, నూర్సింగ్, బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వరుస చోరీలకు పాల్పడుతున్న ఐదుగురి అరెస్టు
నిర్మల్టౌన్: వరుస చోరీలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు భైంసా ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నిర్మల్కు చెందిన రాజశేఖర్, రాజేశ్వర్, రామ్చరణ్ స్నేహితులు. ముగ్గురు పనిచేసే ప్రాంతంలో నిర్మల్ రూరల్ మండలం చిట్యాలకు చెందిన శ్రీకాంత్, అక్కాపూర్కు చెందిన క్రాంతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా స్నేహంగా మారడంతో ఐదుగురూ కలిసి చోరీలకు పాల్పడడం ప్రారంభించారు. తొలుత ఇళ్లను ఎంచుకున్న నిందితులు పో లీసులకు త్వరగా చిక్కే అవకాశం ఉందని భావించి ఆలయాలను టార్గెట్ చేసుకున్నారు. రాత్రివేళల్లో రెక్కీ నిర్వహించి సీసీ కెమెరాలు లేని గుర్తించి చోరీకి పాల్పడేవారు. నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ అయ్యప్పస్వామి ఆలయం, శాస్త్రినగర్ హనుమాన్ఆలయం, బంగల్పేట్ మహాలక్ష్మీ ఆలయం, కౌట్ల కె రామాలయం, మామడ మండలం కొరిటికల్ వేంకటేశ్వరస్వామి ఆలయం, సారంగాపూర్ మండలం వంజర్ మహాలక్ష్మీ ఆలయం, ఆలూర్ శివాలయం, లోకేశ్వరం మండలం కిష్టాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, లక్ష్మణచాంద మండలం వడ్యాల్ హనుమాన్ఆలయం, తానూర్ మండలం పోచమ్మ ఆలయాల్లో జరిగిన చోరీ కేసుల్లోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన 25 చోరీ కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఏపీలోనూ..నిందితులు నిర్మల్ జిల్లాకే పరిమితం కాలేదని ఏపీలోని గన్నవరం పోలీస్స్టేషన్ పరిధిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, ఏలూరు 3 టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని వినాయక ఆలయంలో జరిగిన చోరీ కేసుల్లోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. టెక్నాలజీతో చిక్కారువరుస చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన టైగర్స్ టాస్క్ఫోర్స్ పోలీసులు సీసీ పుటేజీలు, సాంకేతిక ఆధారాలతో ఒక్కొక్కరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. 16 కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేశామని, మూడు ద్విచక్ర వాహనాలు, ఏడున్నర గ్రాముల బంగారం, 300 గ్రాము ల వెండి, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంకా కొన్ని కేసులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్, నిర్మల్ పట్టణ, రూరల్ సీఐలు సమ్మయ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బోర్వెల్ మంజూరు చేయాలని గుడిహత్నూర్ మండలం తోయగూడకు చెందిన పెందోర్ వినా యక్, ఆశ్రమ పాఠశాలలో వాచ్మెన్ ఉద్యోగం ఇప్పించాలని మంచిర్యాల మండలం పెద్ద గోపాలపూర్కు చెందిన హన్మంతు, పై చదువులకు ఆర్థికసాయం అందించాలని కెరమెరికి చెందిన భూదేవి దరఖాస్తు అందజేశారు. -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
సాక్షి, ఆదిలాబాద్/ఉట్నూర్రూరల్: అర్హులైన ఓటర్ల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి.. సర్ ఫేజ్–2లో పార్టీ మండల అధ్యక్షులు, బీఎల్ఏ–2ల ద్వారా పూర్తిగా సమీక్షించాలని కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని జీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల పీఏసీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ‘సర్’, పార్టీ కమిటీల నియామకాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, స్థానిక రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. పలు అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమర్థవంతంగా పర్యవేక్షించాలి.. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల, తొలగింపునకు గురయ్యే ఓటర్లపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో సర్ ఫేజ్–2 ప్రక్రియలో పార్టీ శ్రేణులు సమర్థవంతంగా పర్యవేక్షించి అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్య నేతలు పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో పట్టణ, డివిజన్, మండలస్థాయి కాంగ్రెస్ కమిటీల నియామకాలు, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని స్పష్టం చేశారు. ఆగస్టు 31లోగా అన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలపై సమీక్షించారు. కాల పరిమితితో పూర్తి చేయాలని చెప్పారు. పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నామినేటెడ్ పదవులపై చర్చ.. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులతో నామినేటెడ్ పదవులపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పనిసరిగా గుర్తింపునిస్తామని ముఖ్య నేతలు పేర్కొన్నారు. అటువంటి వారికే కమిటీలో చోటు ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ, ఆ పార్టీ చేస్తున్న మతతత్వ రాజకీయాలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టడానికి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పీఏసీ కమిటీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా నేతలు పాల్గొన్నారు. ఇందులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్, ఆత్రం సుగుణ, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావు, నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాస రెడ్డి, ఆడే గజేందర్, సాజిద్ఖాన్, గండ్రత్ సుజాత, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అనూష, ఓబీసీ విభాగం అధ్యక్షుడు అశోక్, ఎస్సీ విభాగం అధ్యక్షుడు పరమేశ్వర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్గౌడ్, ఆయా జిల్లాల కాంగ్రెస్ పీఏసీ సభ్యులు తదితరులు ఉన్నారు.కంది వర్సెస్ సంజీవ్రెడ్డి సమావేశంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశం ప్రారంభం కాగానే.. అర్హత లేని నేతలను పీఏసీ సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారని కంది ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వీడిన నేతలను ఎలా పిలుస్తారని పేర్కొన్నారు. అధిష్టానం ఆహ్వానం మేరకే వచ్చామని కందితో సంజీవరెడ్డి వాగ్వాదానికి దిగారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఇన్చార్జి మంత్రి జూపల్లి సమక్షంలోనే ఈ గలాట చోటుచేసుకుంది. ఆ తర్వాత సంజీవ్ రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఇరువురు నేతల వర్గీయుల వాగ్వాదంలో ముఖ్య నేతల ముందే పరుష పదజాలం ఉపయోగించడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ విషయంలో ముఖ్య నేతలు జిల్లా నేతలతో పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. నిబంధనలు అతిక్రమించిన వారికి షోకాజు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై పీఏసీ సమావేశంలో చర్చించారు. ప్రజలకు వివరించడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గ పరిధిలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకలాపాలు, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. -
జిల్లా ఓటర్లు @ 4,03,625
కై లాస్నగర్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను యంత్రాంగం సోమవారం విడుదల చేసింది. ఎస్ఐఆర్కు ముందు జిల్లాలో 4,66,784మంది ఓటర్లు ఉండగా ప్రక్రియ తర్వాత 4,03,625 మంది ఉన్నట్లుగా తేల్చింది. మొత్తంగా 63,159మంది ఓటర్లు తగ్గారు. వీరందరినీ తొలగింపు జాబితాలో చేర్చారు. ఈ ముసాయిదా జాబితా లను జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) కార్యాలయంతోపాటు ఆదిలాబాద్, బోథ్ ని యోజకవర్గాల ఎలక్ట్రోరల్ అధికారులు, తహసీల్దా ర్ కార్యాలయాలు, పోలింగ్కేంద్రాల పరిధిలో నోటీస్బోర్డులపై అందుబాటులో ఉంచారు. అయితే జిల్లాలో భారీగా ఓటర్ల సంఖ్య తగ్గడంపై రాజకీయ పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్లి అర్హులైన వారితో అభ్యంతరాలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఓటర్ల జాబితా విడుదలైన విషయం తెలిసిన వెంటనే చాలా మంది తమ పేర్లు జాబితాలో ఉన్నయో లేవోనని తెలుసుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. నోటీసుబోర్డుల్లోని జాబితాలను పరిశీలించారు. నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు తమ పరిధిలో ఈ ఏడాది జూన్ 25 నుంచి జూలై 24వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించారు. వారికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి వాటిని తిరిగి స్వీకరించారు. ఫారాలు తిరిగి రా ని, 2002 జాబితాలో పేర్లు లేని ఓటర్లను జిల్లా వ్యా ప్తంగా 63,159 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరిని మృతులు, వలసవెళ్లిన, ఒకటి కంటే ఎక్కువ చోట ఓటు కలిగి ఉండటం వంటి జాబితాలో చేర్చారు. ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 16వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లను స్వీకరిస్తారు. అర్హత కలిగిన ఓటర్లు సైతం ఫారం–6 ద్వారా నిర్ణీత గడువులోపు ఓటు హక్కు కోసం నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలపై అక్టోబర్ 15వరకు నోటీసులు జారీ చేసి వాటిపై విచారణ చేపట్టి పరిష్కరిస్తారు. అక్టోబర్ 19న తుది జాబితా ప్రకటిస్తారు. నియోజకవర్గాల వారీగా ఇలా... ఓటర్లు ఎస్ఐఆర్కు ముందు ఎస్ఐఆర్ తర్వాత పురుషులు 2,26,796 1,99,396 మహిళలు 2,39,980 2,04,226 ఇతరులు 08 03 మొత్తం 4,66,784 4,03,625 నియోజకవర్గాల వారీగా తగ్గిన ఓటర్ల వివరాలు .. నియోజకవర్గం తగ్గిన ఓటర్లు ఆదిలాబాద్ 39664 బోథ్ 23,495 -
బాధితుల పక్షాన ఉండాలి
ఆదిలాబాద్టౌన్: పోలీసు వ్యవస్థ బాధితుల పక్షాన ఉండి వారి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 33 మంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా, ప్రతీ ఫిర్యాదును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాధితుల సమస్యలపై సత్వరమే దర్యాప్తు చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు న్యాయం అందించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని అన్నారు. జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలు, నేరాలకు సంబంధించిన సమాచారం ఉన్నా 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్మార్ట్’లో ఊరు పేరే మారింది
ఇచ్చోడ: రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 15న పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్కార్డుల్లో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. మండలంలోని అడేగామ కే పంచాయతీ పరిధిలోని అడేగామ(కే), ఆదర్శనగర్, ఎస్సీకాలనీ, గుబ్బ గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల్లో ఊరు పేరే మారింది. అడేగామ(కే)కు బదులుగా అడేగామ (బి) అని రావడంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. అధికారుల తప్పిదంతో 821 రేషన్ కార్డులపై అడేగామ బి పేరును తప్పుగా ముద్రించారు. అడెగామ (కే) పేరుతో ఉన్న కార్డులు పంపిణీ చేయాలని రేషన్ లబ్ధిదారులు కోరుతున్నారు. -
8వ రోజుకు రిలే దీక్ష
ఆదిలాబాద్టౌన్: సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం నాటికి 8వ రో జుకు చేరాయి. ఇందులో భాగంగా దీక్షలో కూ ర్చున్న వారు చెవులో పూలు.. కళ్లకు నల్లగుడ్డలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్ ఇజ్జగిరి నారాయణ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సీసీఐని పునఃప్రారంభిస్తామని బీజేపీ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. దీక్షలో ఆదిలాబాద్రూరల్ మండలం తంతోలి గ్రామానికి చెందిన యువకులు కూర్చున్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్.విలాస్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధరేంద్ర తదితరులు మద్దతు తెలిపారు. -
తాగునీటికి కొత్త పైపులైన్
కైలాస్నగర్: ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఏర్పాటు నే పథ్యంలో లాండసాంగ్వి పంప్హౌస్ నుంచి పట్ట ణానికి నీటిని సరఫరా చేసే పైపులైన్ ఇక కనుమరుగుకానుంది. ప్రత్యామ్నాయంగా మరొకటి ఏర్పా టు చేయాలని మున్సిపల్ అధికారులు భావించా రు. ఇందుకోసం రూ.10.85 కోట్ల అంచనాతో ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అత్యవసరం కావడంతో ఆమోదం తెలిపిన సర్కారు వెంటనే నిధులు సైతం మంజూరు చేసింది. ప్రజారోగ్యశాఖ అధికారులు టెండర్ల నిర్వహణ కు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పాతపైపులైన్ కనుమరుగు పట్టణ శివారులోని లాండసాంగ్వి పంప్హౌస్ నుంచి మున్సిపల్ కార్యాలయం వద్దనున్న రిజర్వాయర్లోకి 12ఎంఎల్డీ నీటిని తరలించేందు కోసం గతంలో 1.8 కిలోమీటర్ల దూరంతో కూడిన పైపులైన్ను ఏర్పాటు చేశారు. పంప్హౌస్ నుంచి సీసీఐ క్రాస్ రోడ్, అనుకుంట రోడ్లోని క్రిస్టల్ గార్డెన్, ఖానాపూర్, అబ్దుల్లాచౌక్, వినాయక్చౌక్ల మీదుగా ఉన్న ఈ పైపులైన్ ద్వారా ప్రస్తుతం 7 ఎంఎల్డీ నీరు అందుతోంది. రిజర్వాయర్లోకి చేరిన నీటిని పలు కాలనీలకు సరఫరా చేస్తున్నారు. అయితే ఎయిర్పోర్టు ఏర్పాటులో భాగంగా ప్రస్తుతం క్రిస్టల్ గార్డెన్ నుంచి అబ్దుల్లాచౌక్ వరకు ఉన్న పైపులైన్ కనుమరుగుకానుంది. దీంతో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏర్పడింది. కొత్త పైపులైన్ ఇలా.. పట్టణం నుంచి లాండసాంగ్వి మీదుగా నీరాలకు వెళ్లే జాతీయ రహదారిని ఆనుకుని పాత జాతీయ రహదారి మీదుగా కొత్త పైపులైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీసీఐ క్రాస్ రోడ్ నుంచి తిర్పెల్లి శ్మశానవాటిక, అక్కడి నుంచి భుక్తాపూర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వరకు గల పాత జాతీయ రహదారి, నేతాజీచౌక్, వినాయక్చౌక్ల మీదుగా మున్సిపల్ కార్యాలయం వద్ద గల రిజర్వాయర్ వరకు 5.2 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్నారు. ఈ సారి 3.4 కిలోమీటర్ల మేర అదనంగా ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇందుకు గాను రూ.10.85కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించారు. క్షేత్రస్థాయి పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది. నిధులు సైతం మంజూరు చేసింది. పనులు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ 250 మీటర్ల స్థలమే ప్రధాన అడ్డంకి కొత్త పైపులైన్కు భూ సేకరణ చేయాల్సిన అవసరమేర్పడలేదు. జాతీయ రహదారి మీదుగా దీన్ని ఏ ర్పాటు చేయనున్నారు. అయితే తిర్పెల్లి సమీపంలో రామాలయంవరకు గల 250మీటర్ల స్థలంలో కోర్టు కేసు కారణంగా పాత జాతీయ రహదారిని నిర్మించలేదు. పనులు పెండింగ్లో ఉన్నాయి. అక్కడ పైపులైన్ ఏర్పాటు చేస్తే రహదారి నిర్మాణ పనులు చేపడితే మళ్లీ కొత్తగా పైపులైన్ చేపట్టాల్సి వస్తోంది. దీంతో నిధులు వృథా అయ్యే అవకాశముంది. దారికి ఇబ్బంది లేకుండా పక్క నుంచి పైపులైన్ వేయాలంటే రెండునుంచి మూడు ఇళ్లను తొలగించాల్సి రా వడం సమస్యాత్మకంగా మారుతుంది. అక్కడ కొంత భూమిసేకరించాల్సి వస్తోంది. దీనిపై స్పష్టత లేకపోవడంతో పనులకు అడ్డంకిగా మారే అవకాశముంది. దీన్ని ఎలా అధిగమించాలనే దానిపై అధి కారులు ఆలోచిస్తున్నారు. ఎయిర్పోర్టు భూసేకరణ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తూ ముందుకు సాగుతున్నారు. టెండర్ల నిర్వహణకు కసరత్తుఎయిర్పోర్టు ఏర్పాటుతో కనుమరుగయ్యే పైపులైన్తో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో కొత్త పైపులైన్కు ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం కూడా ఆమోదించి నిధులు మంజూరు చేసింది. పనుల ఆమోదం కోసం ఈఎన్సీకి పంపించాం. రెండు, మూడు రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ ప్రకటిస్తాం.మూడు నెలల్లోపు పనులు పూర్తయ్యేలా ముందుకు సాగుతున్నాం. – పి.అరుణ్ కుమార్, మున్పిపల్ ఈఈ -
నో ఎంట్రీ.. గేటు నుంచే మాట్లాడాలి!
ఇచ్చోడ: ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులపై కొన్నిచోట్ల సిబ్బంది నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. చిన్నారులకు ఆరోగ్య సమస్యలు వచ్చినా వారి తల్లిదండ్రులను సైతం కలవనివ్వకుండా అడ్డుపడుతున్నారు. నేరడిగొండ మండలం కుంటాల బాలికల ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఊరటి రమాదేవి చేతికి గాయం ఏర్పడి నొప్పితో బాధపడుతుంది. తండ్రి గంగాధర్ ఆదివారం సాయంత్రం కూతురు యోగక్షేమాలు తెలుసుకునేందుకు పాఠశాలకు వెళ్లాడు. అయితే సి బ్బంది అతడిని లోనికి అనుమతించలేదు. చేసే దిలేక ఇలా గేటు బయట నుంచే మాట్లాడి వెళ్లి పోవడం అతడి వంతయింది. ఈ విషయమై ఇచ్చోడ ఏటీడీవోను ‘సాక్షి’ వివరణ కోరగా.. సాయంత్రం వరకు పేరెంట్స్ను అనుమతించామని, సోమవారం నాగుల పంచమి ఉండడంతో విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లేందుకు కొందరు అడుగుతున్న క్రమంలోనే సిబ్బంది గేటు మూసివేసినట్లుగా పేర్కొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి
ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, సత్వర ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రారంభించనున్న మండల ప్రజావాణిని ప్రజలు సద్వినియో గం చేసుకోవాలి. ఎంపీడీవోలు, కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణనిచ్చాం. మండలస్థాయి అధికారులంతా విధిగా హాజరుకా వాలి. దరఖాస్తుదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. వారు పరిష్కరించలేని సమస్యలను డివిజన్, జిల్లాస్థాయికి పంపించాలి. బాఽధితులను పదేపదే తిప్పకుండా స త్వర న్యాయం చేకూర్చేలా వ్యవహరించాలి. – ఎస్.రాజేశ్వర్, అదనపు కలెక్టర్ -
● మండల ప్రజావాణికి నేడు శ్రీకారం ● సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం ● దరఖాస్తుదారులకు తప్పనున్న తిప్పలు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
కై లాస్నగర్: ప్రజా సమస్యలను మండలస్థాయిలో నే పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మండల ప్రజావాణికి శ్రీ కారం చుట్టింది. సోమవారం నుంచి అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ని ర్వహణపై ఎంపీడీవోలు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దరఖాస్తుదారులు అందించే ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసే లా ఆపరేటర్లకు ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ల ను క్రియేట్ చేశారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంటవరకు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్న గ్రీవెన్స్కు ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. నిర్వహణ ఇలా... కలెక్టరేట్లో నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి తరహాలోనే ఇది కొనసాగనుంది. కార్యక్రమానికి ఎంపీడీవో, తహసీల్దార్తో పాటు ఎంపీవో, ఎంఏవో, ఉద్యానవన , పశుసంవర్ధక , మత్స్యశాఖ అధికారులు, ఎంఈవో, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, సీడీపీవో, ఐసీడీఎస్ సూపర్వైజర్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఏఈలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ట్రాన్స్కో ఏఈ, డిప్యూటీ తహసీల్దార్ వంటి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఏఎస్డబ్ల్యూవో, ఏటీడీవో, బీసీ, మైనార్టీ సంక్షేమాధికారులు, మున్సిపల్ కమిషనర్ హాజరుకావాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వీరంతా ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తుదారులకు సౌకర్యవంతంగా ఉండేలా యూ ఆకారంలో కూర్చోవాలి. ఒకవేళ అక్కడ స్థలం లేక ఇరుకుగా ఉంటే రైతు వేదికలు, ఇతర సౌకర్యవంతమైన భవనాల్లో నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తుల స్వీకరణ ఇలా.. సమస్యలతో వచ్చే బాధితుల దరఖాస్తులను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేందు కోసం ఒక్కో మండలానికి ముగ్గురు ఆపరేటర్లను అందుబాటులో ఉంచనున్నారు. వారికి ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయించారు. ప్రజావాణి పోర్టల్లో దరఖాస్తులు, వాటితో అందించే డాక్యుమెంట్స్ను ఏ విధంగా నమోదు చేయాలి, స్కాన్ చేసి ఎలా అప్లోడ్ చేయాలి, దరఖాస్తుదారులకు రశీదు ఏ విధంగా ఇవ్వాలనే దానిపై ప్రత్యేక శిక్షణ అందించారు. దరఖాస్తుదారు ఆపరేటర్ను సంప్రదించి తమ సమస్యను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ సమస్య ఏ శాఖకు సంబంధించిందో నమోదు చేసి రశీదు అందజేస్తారు. దానికి ప్రత్యేక ఐడీ కేటాయించి ఆన్లైన్లో సంబంధిత శాఖకు పంపిస్తారు. అనంతరం అధికారులను కలిసి దరఖాస్తు అందజేస్తే వారు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారు. కార్యక్రమ నిర్వహణపై ఎంపీడీవోలకు హైదరాబాద్లో ఈనెల 13న ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.ఎంపీడీవోలు 20 (15 మంది రెగ్యులర్, ఐదుగురు ఇన్చార్జి )జిల్లాలో మండల పరిషత్లు 20కేటాయించిన ఆపరేటర్లు 60 మందిభరోసా కల్పిస్తారా ..మండల ప్రజావాణి ద్వారా దరఖాస్తుదారులు జిల్లా కేంద్రానికి వచ్చే వ్యయ, ప్రయాసాలు తొలగిపోనున్నాయి. స్థానికంగా అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండటంతో తమ సమస్యలను చెప్పుకునే వెసులుబాటు కలుగుతుంది. అయితే వాటి పరిష్కారంపైనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే దరఖాస్తుదారులు ఇప్పటి వరకు మండలస్థాయి అధికారులను కలిసి పలుమార్లు విన్నవించినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. అధికారుల నుంచి స్పందన కరువవడంతోనే జిల్లా స్థాయి వరకు వస్తున్నారు. తిరిగి మండలస్థాయి అధికారులకే విన్నవించడం ద్వారా ఏ మేరకు పరిష్కారమవుతాయనే దానిపై సర్వత్రా చర్చ సాగుతుంది.మండల ప్రజావాణి వివరాలు.. -
పకడ్బందీగా స్క్రీనింగ్
జిల్లాలో 1,461 పాఠశాలలు, కళాశాలల్లో ప్రశస్త్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల వైకల్యం నిర్ధారణ కోసం చర్యలు చేపడుతున్నాం. మూడు విడతల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈనెల 1 నుంచి 31 వరకు ఉపాధ్యాయులు వీడియోలు చూసి విద్యార్థుల లోపాలను గుర్తించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు స్క్రీనింగ్ చేసిన తర్వాత ప్రత్యేక విద్య, ఐఆర్పీలు ఆ విద్యార్థులను పరిశీలించి వైకల్యాన్ని నిర్ధారిస్తారు. అవసరమైన విద్యార్థులకు వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. – ఉష్కం తిరుపతి, సెక్టోరియల్ అధికారి -
సమ్మిళిత విద్యకు ‘ప్రశస్త్’
ఆదిలాబాద్టౌన్: ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. వివిధ రుగ్మతలతో అవస్థలకు గురవుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న వారిలో ప్రత్యేక అవసరాలున్న వారిని తొలి దశలోనే గుర్తించాలని భావించింది. ఈ మేరకు వారికి అవసరమైన విద్య, వైద్య, పునరావాస, సామాజిక సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రశస్త్’ యాప్ రూపొందించింది. జాతీయ విద్యా విధానం–2020, ఆర్పీడబ్ల్యూ 2016 చట్టం ఆశయాలకు అనుగుణంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలను సాధారణ విద్యా వ్యవస్థలో సమాన భాగస్వాములుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది సమన్వయంతో విద్యార్థుల వివరాలను గుర్తించి నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల వరకు విద్యార్థులకు పూర్తిస్థాయిలో గుర్తింపు ప్రక్రియ పూర్తి కానుంది. 21 వైకల్యాల స్క్రీనింగ్.. ప్రతి విద్యార్థి సామర్థ్యాలతో పాటు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రారంభ దశలోనే గుర్తించడం ‘ప్రశస్త్’ ప్రధాన ఉద్దేశం. దృష్టి లోపం, వినికిడి, శారీరక, మేధో, అభ్యసన సమస్యలు ఇలా 21 వైకల్యాలను స్క్రీనింగ్ చేసేందుకు ఈ యాప్ను రూపొందించారు. ఇందులో విద్యార్థులకు ఉన్న సమస్యలను ఆన్లైన్లో పొందుపర్చుతారు. ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా పరిశీలిస్తారు. రెండో విడతలో ప్రత్యేక విద్యా టీచర్లు, ఐఆర్పీలు గుర్తించిన విద్యార్థుల వద్దకు వెళ్లి మరోసారి స్క్రీనింగ్ నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం వైద్యుల వద్దకు తీసుకెళ్లి అవసరమైన చికిత్స అందేలా చర్యలు చేపడతారు. ఆ తర్వాత వైకల్యం ఉన్న విద్యార్థులకు సదరం సర్టిఫికెట్ అందజేసి ప్రభుత్వ పథకాలు, అవసరమైన పరికరాలు అందించేలా విద్యా శాఖాధికారులు చర్యలు చేపడతారు. మూడు దశల్లో గుర్తింపు.. ప్రస్తుతం పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులకు ఏ విధంగా పరీక్షలు నిర్వహించేలానే అంశానికి సంబంధించి వీడియోలు పంపించారు. ఈనెల 31వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, రెసిడెన్షియల్స్, అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు సెప్టెంబర్ 30 వరకు వీడియోలు చూడాల్సి ఉంటుంది. అక్టోబర్ 31 వరకు ప్రత్యేక విద్యాటీచర్లు, ఐఆర్పీలు విద్యార్థులను పరిశీలించి వైకల్యాన్ని నిర్ధారిస్తారు. తల్లిదండ్రులకు అవగాహన అవసరం.. తల్లిదండ్రులు తమ పిల్లల్లో కనిపించే సమస్యలను ఉపాధ్యాయులకు తెలియజేయాలి. నిర్లక్ష్యం చేయకుండా తొలి దశలోనే గుర్తించాలి. అయితే ఇదివరకు వైకల్యం లోపాలు ఉన్న పిల్లల్ని సదరం క్యాంప్నకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాల్సి ఉండేది. శిబిరాల విషయంలో అవగాహన లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులకు గురయ్యేవారు. ఇక ఆ సమస్యకు చెక్ పడనుంది. పాఠశాల స్థాయిలోనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సమ్మిళిత విద్యకు బలమైన అడుగు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులను ఇతర విద్యార్థులతో సమానంగా పాఠశాల విద్యలో భాగస్వాములను చేయడమే సమ్మిళిత విద్య లక్ష్యం. ఇందుకోసం పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు, సహాయక ఉపకరణాలు, అనుకూల బోధనా పద్ధతులు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఈమేరకు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులను గుర్తించిన అనంతరం వారి అర్హతకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు, విద్యా సదుపాయాలు, సహాయక ఉపకరణాలు, స్కాలర్షిప్ తదితర ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటారు. జిల్లాలో పాఠశాలలు 1461 అన్ని యాజమాన్యాల్లోని టీచర్లు 7349 ప్రత్యేక విద్య టీచర్లు 23 ఐఆర్పీలు 22 విద్యార్థులకు నిర్వహించే పరీక్షలు 21 రకాల పరీక్షలు -
కరెంటు.. కాటేస్తోంది!
ఇచ్చోడ: జిల్లాలో చాలాచోట్ల విద్యుత్ తీగలు చేతి కందే ఎత్తులోనే దర్శనమిస్తున్నాయి. స్తంభాలు ఎప్పుడు కింద పడతాయో అన్న చందంగా మారా యి. ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కరువై ప్రమాదాలకు కేరాఫ్గా మారాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో విద్యుదాఘాతంతో పలువురి మృతి చెందగా.. వందలాది మూగజీవాలు చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికారులు మాత్రం ఫిర్యాదులు అందితే స్పందిస్తామని పే ర్కొంటుండడం గమనార్హం. పెండింగ్లో 21 ఫిర్యాదులేనట! జిల్లావ్యాప్తంగా విద్యుత్ సమస్యల పరిష్కారం కో సం అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని మరో 21 మాత్రమే పెండింగ్లో ఉ న్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక్కో మండలంలోనే పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలాగ్రామాల్లో తక్కువ ఎత్తులో వేలా డుతున్న విద్యుత్ తీగలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకా లం కావడంతో ఈదురుగాలుల కారణంగా అవి తెగిపడుతున్నాయి. గమనించని మనుషులు, మూ గజీవాలు వాటికి తగిలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు మనుషులు, నాలుగు మూగజీవాలకు సంబంధించి బాధితులకు పరిహారం అందజేసినట్లుగా అధికారులు పేర్కొనడం గమనార్హం. ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం..విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ఇంకా 21 వరకు పెండింగ్లో ఉన్నాయి. వర్షాకాలం కావడంతో చేలలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో కొంత ఆలస్యమవుతుంది. – జాదవ్ సుభాష్, ఎస్ఈ, విద్యుత్శాఖ -
‘హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం’
ఆదిలాబాద్టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు, యువజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం నుంచి పట్టణంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం యాదవ సంఘ భ వనంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ సర్కారు 12 ఏళ్ల పాలనలో అనేక ప్రభుత్వరంగ సంస్థలను మూసివేసిందని తెలిపారు. యువత ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, ఏఐవైఎఫ్ నాయకులు మెస్రం భాస్కర్, కేశవ్, తబ్రేజ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం
ఆదిలాబాద్టౌన్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన అమరవీరుడు శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శ్రీకాంతాచారి జయంతి వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ఎదుట గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్రం సాకారమైందని, వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, నరసింహులు, దశరథ్, హనుమాండ్లు, వెంకట్స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
రాజ్భవన్ వేడుకలకు సంతోష్కుమార్
ఆదిలాబాద్టౌన్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవా ర్డు గ్రహీత, తోషం జెడ్పీఎస్ఎస్ సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు సంతోష్కుమా ర్ బెదుడ్కర్కు అరుదైన గౌరవం లభించింది. శనివారం హైదరాబాద్లోని లోక్భవన్లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందింది. గవర్నర్ శివ ప్ర తాప్ శుక్లా–జానకి శుక్లా దంపతులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ సాంకేతిక పరిజ్ఞానంను సమ్మిళితం చేస్తూ, సృజనాత్మకత బోధనతో విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించడమే కాకుండా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ, గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషికి గాను ఈ గౌరవం దక్కింది. పలువురు ఉపాధ్యాయులు, అభినందనలు తెలిపారు. -
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
ఆదిలాబాద్టౌన్: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగా లకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు పోలీస్శాఖ ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మే రకు శనివారం సంబంధిత పోస్టర్ విడుదల చే శారు. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టర్లోని క్యూ ఆర్ కోడ్ ద్వారా లేదా సమీప పోలీస్స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఈనెల 23న జిల్లా కేంద్రంలోని డీటీసీలో అర్హత పరీక్ష ఉంటుందని తెలిపారు. అందులో ప్రతిభ కనబరిచిన వారికి స్థానిక ఆదిలా బాద్ డీటీసీ(డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్)లో ఈనెల 24 నుంచి సబ్జెక్టు నిపుణులతో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు పేర్కొన్నారు. బాసర జోన్ పరిధిలో ఎస్సై పోస్టులు సివిల్–29, ఏఆర్–2, ఫైర్–5, టీజీఎస్పీ–1, డిప్యూటీ జైలర్(పురుషులు)–1, జిల్లా పరి ధిలో కానిస్టేబుల్ పోస్టులు సివిల్–130, కానిస్టేబుల్స్–56, ఫైర్–12, జైల్వార్డెన్ (పురుషులు)–4 ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో అదనపు ఎస్పీలు పి.మౌనిక బి.సురేందర్రావు, ఉట్నూ ర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీలు ఎల్. జీవన్రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు. -
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
● అర్హులందరికీ సంక్షేమ పథకాలు ● త్వరలోనే యంగ్ ఇండియా స్కూళ్లు ● కీలకం కానున్న ఆదిలాబాద్ ఎయిర్ఫీల్డ్ ● భూ సర్వేరికార్డుల నిర్వహణతో శాశ్వత రక్షణ ● పంద్రాగస్టు వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీమాట్లాడుతున్న షబ్బీర్ అలీపోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న షబ్బీర్ అలీసాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంతో పాటు ఆదిలాబాద్ జిల్లా సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించడమే ఈ ప్రభుత్వ ఏకై క లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. విద్యార్థుల సాంస్క్రృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ మౌనిక, మున్సిపల్, మార్కెట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు చైర్పర్సన్ బండారి అనూష, బోరంచు శ్రీకాంత్రెడ్డి, మల్లెపూల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్మార్ట్కార్డుల పంపిణీ షురూ ల్యామినేటెడ్ రేషన్ స్మార్ట్కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో 2,26,733 కుటుంబాలకు పంపిణీ చేస్తాం. ఇప్పటి వరకు నూతనంగా 37,420 కొత్త రేషన్కార్డులను 46,098 మంది కొత్త యూనిట్లను నమోదు చేశాం. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ.500కే సిలిండర్ అందిస్తూ ఇప్పటి వరకు రూ.19.20 కోట్ల సబ్సిడీని వారి ఖాతాల్లో జమచేశాం. రూ.24.70 కోట్లతో తొమ్మిది నూతన సబ్స్టేషన్ల పనులు, రెండేళ్లలో 3,410 వ్యవసాయ కనెక్షన్లు, సీఎం గిరివికాసం ఎస్సీ కార్పొరేషన్, డీఏజేజీయూఏ పథకాల ద్వారా అంగన్వాడీలు, నిరుపేదల ఇళ్లకు నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నాం. ఉత్తర తెలంగాణ అభివృద్ధికే కీలకమైలురాయి ఆదిలాబాద్ అభివృద్ధిలో చారిత్రాత్మకమైన జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ప్రాజెక్ట్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,278.14 కోట్ల పరిపాలన ఆమోదం ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం 2009.23 ఎకరాల భూమిని సేకరిస్తున్నాం. ఈ ఎయిర్ఫీల్డ్ ద్వారా ఆదిలాబాద్ కు మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం వృద్ధి చెందుతాయి. ఇది ఉత్త ర తెలంగాణ అభివృద్ధికి కీలకమైలురాయిగా నిలు వనుంది. జిల్లా అభివృద్ధిలో మరో కీలక అడుగుగా భోరజ్ మండలంలో 2,062.01 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మావలలో రూ.40 కోట్లతో నిర్మాణం పూర్తయిన ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఐటీ రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో జిల్లా ఆర్థిక ప్రగతి మరింత వేగవంతమవుతుంది. సొంతింటి కల సాకారం.. బడుగు, బలహీనవర్గాల సొంతింటి కల సాకారం అవుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తొలి రెండు విడతల్లో 21,767 ఇళ్లు కేటాయించగా 14,772 నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 3,605 పూర్తయ్యాయి. దశలవారీగా రూ.311.36 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశాం. మావల, కేఆర్కే కాలనీల్లో 934డబుల్ బెడ్ రూం ఇళ్లు అర్హులైన పేదలకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.చేయూత ఫించన్ పథకంలో భాగంగా దరఖాస్తులను ఈనెల 31వరకు స్వీకరించనున్నాం. అర్హులందరికీ పింఛన్ అందజేస్తాం. రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు భరోసా కోసం 61,121 మంది రైతులకు రూ.327.92 కోట్లు విడుదల చేశాం. వైద్యసేవలు మెరుగు.. బోధన విధానం ఇతర అంశాలు ప్రామాణికంగా ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో రిమ్స్ వైద్య కళాశాల జాతీయ స్థాయిలో 139, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించడం గర్వకారణం. ఎంబీబీఎస్ సీట్లను 150కి పెంచాం. నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి రూ.40 కోట్ల , ఉట్నూర్, బోథ్ ఆ సుపత్రుల నవీకరణకు రూ. 41.70 కోట్ల నిధులు మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయి. 380 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాం. తెలంగాణ జలసిరి.. జల సంరక్షణ పనుల అమలులో దక్షిణ భారతదేశంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రపతి ప్రశంసతో పాటు రూ.2కోట్ల నగదు బహుమతిని గెలుచుకుంది. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను అధిగమించి ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టేందుకు తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని రూపొందించి గ్రామసంఘాలను సమన్వయం చేశాం. ఇందులో భాగంగా జిల్లాలో రూ.88.17 కోట్ల అంచనా వ్యయంతో 94,600 ఇంకుడుగుంతలు, 1786 పంట కుంటలు, 40 ఊట కుంటలు, 6270 బోర్బావుల నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుతం ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. వీబీ–జీరాంజీ ద్వారా జాబ్కార్డు కలిగిన ఉపాధి కూలీలకు 31.37లక్షల పనిదినాలు కల్పించి రూ.86.65 కోట్లు చెల్లించాం. భూ సర్వే రికార్డుల ప్రక్షాళన..జిల్లా అభివృద్ధి కోసం భూసర్వే రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ వేగంగా చేపడుతున్నాం. రైతుల భూములకు శాశ్వత రక్షణ, కచ్చితమైన హక్కులు కల్పించే దిశగా సమగ్ర భూరీసర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతుంది. ప్రణాళిక, ప్రణాళికేతర నిధులు రూ.132 కోట్ల వ్యయంతో సుమారు 146 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మరమ్మతులు పూర్తయ్యాయి. హ్యామ్ పథకం కింద 175కిలోమీటర్ల రహదారులకు రూ.323.79 కోట్లు మంజూరై టెండర్ దశలో ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి యూఐడీఎఫ్ కింద రూ.17.94 కోట్లతో 50పనులు, టీయూఎఫ్ఐడీసీ కింద రూ.10.50 కోట్లతో సీసీ, బీటీ రోడ్లు మంజూరై పురోగతిలో ఉన్నాయి. వివిధ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ జరుగుతుంది.ఆదిలాబాద్: వేడుకల్లో భాగంగా పరేడ్ మైదానంలో వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల కళాశాల విద్యార్థినులు సంప్రదాయ చీరకట్టులో నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అలాగే తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల– బంగారిగూడ విద్యార్థులు మేరీ భారత్ కి భేటి పాటకు నృత్యం చేసి ఔరా అనిపించారు. జిల్లా కేంద్రంలోని సంజయ్నగర్ కేజీబీవీ పాఠశాల, కళాశాల విద్యార్థినులు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ చేసిన నృత్య ప్రదర్శనకు కరతాళధ్వనులు ప్రతిధ్వనించాయి. గెజిటెడ్ ఉన్నత పాఠశాల నంబర్ వన్కు చెందిన విద్యార్థినులు ప్రభుత్వం నూతనంగా అందించిన యూనిఫాంతో ‘సబ్సే ఆగే హై హిందుస్తానీ’ అంటూ డ్యాన్స్తో ఉర్రూతలూగించారు. భుక్తాపూర్ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థినులు గోండి వేషధారణలో నృత్యం చేసి ఆదివాసీ సాంస్కృతిక వైభవాన్ని చాటారు. అనంతరం చిన్నారి కళాకారులకు ముఖ్య అతిథులు, అధికారులు జ్ఞాపికలు అందజేసి అభినందించారు.ఆకట్టుకున్న స్టాల్స్..వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను షబ్బీర్ అలీ ప్రారంభించారు. కలెక్టర్ తో కలిసి వాటిని పరిశీలించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాఖల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
అవసరం లేకుంటే బియ్యం తీసుకోకండి..
స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబ సభ్యుడి సన్మానిస్తూ..ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తూ..సాంస్కృతిక ప్రదర్శనలు తిలకిస్తున జనంసాంస్కృతిక ప్రదర్శనలో విద్యార్థులుకై లాస్నగర్: ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం అవసరం లేకుంటే కార్డుదారులు తీసుకోవద్దని, వాటిని తీసుకుని మాత్రం అమ్ముకోవద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లామినేటెడ్ స్మార్ట్రేషన్ కార్డుల పంపిణీని శనివా రం ఆదిలాబాద్లో ప్రారంభించారు. ఎస్టీయూ భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతి థిగా హాజరైన ఆయన ఎంపీ గోడం నగేశ్,కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జా దవ్, వెడ్మ బొజ్జుపటేల్తో కలిసి పలువురు లబ్ధిదా రులకు స్మార్ట్కార్డులు అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.వేలకోట్ల ఖర్చును భరిస్తూ సన్నబియ్యం అందజేస్తున్న ఘనత రేవంత్రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రజలు విషయాన్ని గుర్తించి బియ్యంను విక్రయించవద్దని సూచించారు. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా ప్రభు త్వ కార్యక్రమాల్లో పాల్గొని సమన్వయంతో విజ యవంతం చేయడం అభినందనీయమన్నారు. -
పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం
కై లాస్నగర్: పంద్రాగస్టు వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పోలీసుల కవాతు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు వీలుగా మైదానాన్ని చదును చేసి రంగువల్లులతో తీర్చిదిద్దారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రాంతంతోపాటు ముఖ్య అతి థులు ఆసీనులయ్యే వేదికను, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, అధికారులు, మీడియా ప్రతినిధులు కూర్చునేందుకు వీలు గా ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి తెలియజేసేలా స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు గాను శాఖల వారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొననున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ శుక్రవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు స్థానిక పెన్గంగ గెస్ట్హౌస్ లో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్లు పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఆయన ఉద యం 9.30 గంటలకు జాతీయ పతాకావిష్కరణ అనంతరం పోలీసుల నుంచి గౌరవవంద నం స్వీకరిస్తారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. పాఠశాలల వి ద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేయనున్నారు. -
రాజువయ్యా!
ఆదిలా‘బాదలు’ వింటూ.. అండగా ఉంటూ అవును నిజమే.. ఆయన పేరుకు తగ్గట్లుగా రాజయ్యాడు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. గోడు వింటూ.. గోస తీరుస్తూ.. జనం మెచ్చిన పాలకుడయ్యాడు. అంతేకాదు ఆరాధ్యదైవంగా మారిపోయాడు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ కలెక్టర్లుగా ఎంతో మంది పనిచేసినా తన పేరును మాత్రం గూడెం గుండెలో భద్రపరుచుకున్నాడు. గ్రీవెన్స్కు పెద్దపీట వేస్తూ ఆదర్శంగా నిలిచాడు. ఆయనే జిల్లా బాస్ రాజర్షి షా. జిల్లా అభివృద్ధే లక్ష్యం జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. విద్య, వైద్యం, రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తున్నాం. గ్రీవెన్స్కు ప్రా ధాన్యం ఇస్తూ ప్రజా సమస్యల పరిష్కారాని కి పాటుపడుతున్నాం. జాతీయ స్థాయిలో అందిన అవార్డులు బాధ్యతను మరింత పెంచాయి. ఇప్పటికే ఆరోగ్య పాఠశాల ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంచేలా స్పోకెన్ ఇంగ్లిష్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు చేపడుతున్నాం. ఓ వైపు పాలనలో అన్ని విధాలా సహకరిస్తున్న యంత్రాంగం, మరోవైపు ప్రజలు చూపుతున్న అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. – రాజర్షి షా, కలెక్టర్ అభివృద్ధికి బాట.. గ్రీవెన్స్కు పెద్ద పీట జిల్లాపై రాజర్షి షా మార్కుకలెక్టర్ను కలిస్తే పని అయినట్లే.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జనం సమస్యలను ఓపిగ్గా వింటూ సంబంధిత అధికారులతో ఫోన్లో, ప్రత్యక్షంగా మా ట్లాడి వాటిని పరిష్కరించేలా చొరవ చూపుతున్నారు. పెద్దసారును కలిస్తే తమ సమస్యలు తీరుతాయనే నమ్మకాన్ని పెంపొందించుకుంటున్నారు. ఏదైనా ఓ వారం కలెక్టర్ అందుబాటులో లేకుంటే అర్జీలతో వచ్చిన వారు వాటిని ఇవ్వకుండానే వెనుదిరుగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కై లాస్నగర్: మార్చి 6, 2024న ఆదిలాబాద్ కలెక్టర్గా రాజర్షి షా బాధ్యతలు స్వీకరించారు. క్రమంగా ఏజెన్సీ జిల్లాపై పట్టు సాధించారు. ప్రజావాణికి ప్రాధాన్యం ఇస్తూ జనం గోడుకు పెద్ద పీట వేశారు. ప్రతీ సోమవారం వారి సమస్యలను సావధానంగా వింటూ పరిష్కార మార్గం చూపారు. అంతేకాదు.. అట్టడుగున ఉన్న నార్నూర్ మండలాన్ని అభివృద్ధి బాట పట్టించారు. ఈ ఆస్పిరేషనల్ బ్లాక్ను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారు. ‘ఆరోగ్య పాఠశాల’తో విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేసి జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డు అందుకున్నారు. జలసిరితో బొట్టుబొట్టు ఒడిసి పట్టి ‘జలసంచా య్.. జన భాగీధారి’ సత్కారం పొందారు. విద్య, పోషణ, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధికి గాను నీతి ఆయోగ్ ప్రశంసలందుకున్నారు. ఆది కర్మ యోగి ధరిత్రి ఆబా జన భాగిధారి కార్యక్రమాలను అమలు పరిచి ఉత్తమ జిల్లాగా కేంద్రం నుంచి ప్రత్యేక గుర్తింపు దక్కేలా చొరవచూపారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. సేవాభావంతో కూడిన పాలన అందిస్తూ ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. తమకు గూడు దక్కేలా చూపిన చొరవకు ఆ గూడెం హర్షించింది. కాళ్లు కడిగి.. ఆరాధ్యదైవంగా భావించిన ఆదివాసీలు ఏకంగా తమ గ్రామానికి ‘రాజర్షి షా గూడ’గా గురువారం నామకరణం చేసుకోవ డం గమనార్హం. పంద్రాగస్టు నేపథ్యంలో జిల్లా బాస్ మార్కు పాలనలో ప్రత్యేకతలు.. మచ్చుకు కొన్ని.. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా గురువారం కలెక్టర్ కాళ్లు కడిగి స్వాగతం పలుకుతున్న ఇందిరమ్మ లబ్ధిదారులు -
ఎరువు రవాణా భారం
ఈ రైతు పేరు సురేందర్రెడ్డి. తాంసి మండలకేంద్రం. ఈయనకు నాలుగు ఎకరాల సొంత చేను ఉండగా, మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వానకాలం సాగు మొదలు పెట్టాడు. పత్తి, సోయా వేశాడు. కౌలు రైతు పేరిట యూరియా కోసం ఈనెల 10న ఆన్లైన్ యాప్లో పది బ్యాగుల కోసం బుకింగ్ చేసుకున్నాడు. 11న తాంసి సొసైటీకి వచ్చాడు. రూ.266 చొప్పున యూరియాకు సంబంధించి పది బ్యాగులకు రూ.2,660 చెల్లించాడు. ఒక్కో బ్యాగ్కు రూ.19 చొప్పున మరో రూ.190 రవాణా చార్జీల కింద చెల్లించాలని సొసైటీ అధికారి చెప్పడంతో అవి ఎందుకని రైతు అడిగాడు. మార్క్ఫెడ్ నుంచి సొసైటీకి వాహనంలో వచ్చిన లోడ్కు సంబంధించిన రవాణా చార్జీలని అధికారి చెప్పాడు. తప్పని పరిస్థితిలో రైతు చెల్లించగా, సొసైటీ నుంచి రశీదు సైతం ఇచ్చారు. -
‘సీసీఐ ఉద్యమంపై విషం చిమ్మొద్దు’
ఆదిలాబాద్టౌన్: మూతపడిన సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించాలని చేపట్టిన ప్రజా ఉద్యమంపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ విషం చిమ్మడం మా నుకోవాలని సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్ విజ్జగిరి నారాయణ అన్నారు. శుక్రవారం దీక్ష శిబిరంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ మూతపడిన సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. దీక్షలో అంకోలి గ్రామస్తులు కూర్చున్నారు. కార్యక్రమంలో సాధన కమిటీ కోకన్వీనర్లు కొండ రమేశ్, బండి దత్తాత్రి, పోశెట్టి, దాసరి రమేష్, అరుణ్ కుమార్, చిలుక దేవిదాస్, రంగన్న తదితరులు పాల్గొన్నారు. -
● మార్క్ఫెడ్ నుంచి సొసైటీ వరకు అయ్యే ట్రాన్స్పోర్ట్ రైతే భరించాలి ● ప్రతీ బ్యాగ్పై మోత ● చేతులెత్తేసిన సర్కార్
సాక్షి,ఆదిలాబాద్: సొసైటీకి మార్క్ఫెడ్ ద్వారా వచ్చే ఎరువుల లోడ్కు సంబంధించి ఇదివరకు ప్రభుత్వమే రవాణా చార్జీలు భరించేది. తాజాగా దీన్ని ఎత్తివేసింది. ఫలితంగా ఎరువు ధరతో పాటు రైతుపై అదనంగా ట్రాన్స్పోర్టు భారం పడుతుంది. బస్తాపై రూ.32 వరకు.. ఎరువులను సొసైటీలు, ఆగ్రోస్ సేవ కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాల ద్వారా విక్రయిస్తుంటారు. మార్క్ఫెడ్ ద్వారా పీఏసీఎస్లకు లోడ్ సరఫరా జరుగుతుంది. ఇదివరకు ఈ భారాన్ని ప్రభుత్వమే భరించేది. ఇటీవల ఆన్లైన్ యాప్లో ఎరువుల బుకింగ్, విక్రయాలను పూర్తి స్థాయిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో పాటు రవాణా చార్జీలను రైతుపైనే మోపింది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్.. ఇలా అన్ని ఎరువులపై ఈ రవాణా భారం రైతే భరించాల్సి వస్తోంది. గరిష్ట రవాణా చార్జీలు రూ.20 వరకే ఉన్నట్లు మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. నేరడిగొండలో ఏకంగా ఒక్కో బస్తాపై రూ.32లకు పైగా వసూలు చేస్తుండడం గమనార్హం. దూరాన్ని బట్టి భారం.. జిల్లా కేంద్రం నుంచి నేరడిగొండ సుమారు 50 కి లోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటీవల ఆ సొసైటీకి 444 బ్యాగ్ల యూరియా లోడ్తో వాహనం వ చ్చింది. ప్రస్తుతం రైతులు కొనుగోలు చేస్తుండగా, ఒక్కొక్కరి వద్ద నుంచి బ్యాగ్కు రవాణా చార్జీ కింద రూ.32.57 పైసలు వసూలు చేస్తున్నారు. ఈ సొ సైటీకి వచ్చిన ఆ బ్యాగులన్నీ విక్రయిస్తే రవాణా చా ర్జీ కింద రైతులపై రూ.14,460 భారం పడుతుంది. నెల క్రితం నుంచే.. సొసైటీ నుంచి ఎరువులను తీసుకునే రైతు రవాణా చార్జీ కూడా చెల్లించాలి. ఇది నెల కిందటి నుంచే అమలైంది. దూరభారాన్ని బట్టి ఒక్కో బ్యాగ్పై కనిష్టంగా రూ.8 నుంచి గరిష్టంగా రూ.20 వరకు చెల్లించాలి. – మహేశ్కుమార్, డీఎం, మార్క్ఫెడ్ -
అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి
ఆదిలాబాద్టౌన్: పోలీసు, అటవీశాఖ ఆధ్వర్యంలో అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో పోలీసు, అటవీశాఖల సమన్వయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో స్మగ్లింగ్, అక్రమ పోడు వ్యవసాయం, వన్యప్రాణులను వేటాడటం, పంట పొలాల చుట్టూ విద్యుత్ తీగలను అమర్చే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇలాంటి వాటిపై ప్రజలు పోలీసు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సుశాంత్ సుఖ్దేవ్ బొబాడే, ఆదిలాబాద్ ఎఫ్డీవో చిన్నవిశ్వనాథ్ బూసరడ్డి, ఇచ్చోడ ఎఫ్డీవో ప్రత్మేష్ కేశవ్ తిజారే, ఉట్నూర్ ఎఫ్డీఓ అరవింద్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ ఎఫ్ఆర్వో అవినాష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. విధుల్లో ప్రతిభ కనబర్చిన పోలీసులకు ప్రశంస ఆదిలాబాద్టౌన్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రాయితీ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు రిమ్స్లో సెల్ఫోన్ దొంగలను పట్టుకుని ప్రతిభ కనబర్చిన 11 మంది పోలీసు సిబ్బందిని అభినందించారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా వారిని సన్మానించి నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. రైల్వే స్టేషన్లో ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని పట్టుకున్న బి.గజానంద్, ఎం.సాయి, జి.సుధాకర్, అరవింద్, శ్రీనివాస్తో పాటు బస్టాండ్లో రాయితీ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న ఏఆర్ ఎస్సై దినకర్, నగేష్, సాయిప్రసాద్, కృష్ణవేణిని అభినందించారు. రిమ్స్లో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకున్న రుక్మారెడ్డి, శ్రీకాంత్, ముజమిల్లాలను ప్రశంసించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం ఆదిలాబాద్(బేల): గ్రామాల్లో నేరాల నియంత్రణతో పాటు నిందితులను త్వరగా గుర్తించేందుకు సీసీ కెమెరాల నిఘా ఎంతో కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని చప్రాల, సిర్సన్న, ఎకోరి గ్రామాల్లో ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలను శుక్రవారం గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా మరింత అవసరమని పేర్కొన్నారు. చప్రాలలో 15, సిర్సన్నలో 16, ఎకోరిలో 4 కెమెరాలను ఏర్పాటు చేశారు. సహకరించిన గ్రామ పెద్దలు, గ్రామస్తులను అభినందించారు. అనంతరం చప్రాల రైతు వేదికలో నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. 15 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. చప్రాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 20 మందికి కంటి అద్దాలు అందించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్, ఎస్సైలు మధుకృష్ణ, పి.గౌతమ్, సర్పంచ్, పెద్దలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
కన్గుట్టకు బస్సు వచ్చేసింది..
● మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే అనిల్ బోథ్: మాటకు కట్టుబడి ఒక్కరోజులోనే గ్రా మానికి ఆర్టీసీ బస్సు వచ్చేలా చొరవ చూపారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్. బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామంలో గురువారం నిర్వహించిన అఖండ జ్యోతి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజ రయ్యారు. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన రేపటి నుంచే గ్రామానికి బస్సు నడిచేలా చూ స్తానని హామీ ఇచ్చారు. మాట ప్రకారం ఆర్టీసీ అధికా రులతో వెంటనే మాట్లాడారు. ఒక్కరోజులోనే సర్వీసు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టా రు. 15 ఏళ్ల తరువాత గ్రామానికి శుక్రవారం ఉదయం బస్సు రావడంతో గ్రామస్తులు హ ర్షం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలి పారు. ఇందులో గంగమల్లు, భోజారెడ్డి, రమణ, రాజు, రవీందర్, రాములు, రామకృష్ణ, స్వామి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగానికి వరం
ఆదిలాబాద్టౌన్: మారుమూల ప్రాంతాలు.. గిరిజన గ్రామాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో వీటిని మంజూరు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. పలు పథకాలతో పాటు కొత్తగా మరో ఏడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సైతం నిధులు కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలో బోథ్లో అడిగామ(కె), ఆదిలాబాద్ నియోజకకవర్గంలోని జైనథ్ మండలం బెల్గాం పాఠశాలలకు నిధులు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ మండలంలోని కుమ్మరితండాలోనూ మంజూరుకాగా తాజాగా నిధుల విడుదలతో పనులు వేగవంతం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో కేజీ నుంచి పీజీ వరకు తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకే ప్రాంగణంలో.. యంగ్ ఇండియా స్కూల్ సాధారణ పాఠశాలల మాదిరిగా కాకుండా ఇంటర్నేషనల్ స్కూళ్ల తరహాలో ఉండనున్నాయి. ఒక్కోస్కూల్కు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఒకే ప్రాంగణంలో చదువుతో పాటు వసతి, క్రీడలు, డిజిటల్ సౌకర్యాలు, ప్రయోగశాలలు కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇదివరకు నిర్ణయించిన విషయం తెలిసిందే. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో దీనికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పాఠశాలల ఏర్పాటుతో విద్యారంగంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. గిరిజనులు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన విద్య, సౌకర్యాలు లేక పేద విద్యార్థులు ఉన్నత చదువుకు దూరమవుతున్నారు. పట్టణాలకు వెళ్లి చదువుకోలేని కుటుంబాలకు ఇది వరంగా మారనుంది. పేద విద్యార్థులకు మేలు జిల్లాలో మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరయ్యాయి. ఇదివరకే టెండర్లు పూర్తి కాగా, కుమ్మరితండాలో పనులు కొనసాగుతున్నాయి. బెల్గాం, అడిగామ(కె)లో ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఈ స్కూళ్లు పేద విద్యార్థులకు వరం లాంటిది. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యాబోధన జరుగుతుంది. – మాధవి, డీఈవో విద్యార్థుల భవిష్యత్తుకు బాట.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు పడనున్నాయి. సామాజిక బాధ్యత, క్రమశిక్షణ, క్రీడా ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. అన్ని వర్గాల విద్యార్థులు కలిసి చదువుకునే వాతావరణం కల్పించనున్నారు. దీంతో సమానత్వ భావన పెంపొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకేచోట కేజీ నుంచి పీజీ వరకు విద్యాబోధన చేయనుండడంతో స్థానిక విద్యార్థులు ఇకపై దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా పోతుంది. -
కాంగ్రెస్ నిరసన
కై లాస్నగర్: ఉత్తరాఖండ్లోని హల్దావనిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జు న ఖర్గే ప్రసంగించిన వేదికను బీజేపీ, ఆర్ఎస్ ఎస్ నాయకులు శుద్ధిచేయడం దేనికి సంకేతమని డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ ప్రశ్నించారు. హల్దావని ఘటనను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. డీసీసీ కార్యాలయం నుంచి అంబేడ్కర్చౌక్ వరకు ర్యాలీగా వచ్చిన నాయకులు అంబేడ్కర్ విగ్రహం ఎదుట బైఠాయించారు. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చర్య రాజ్యాంగ స్ఫూర్తి, దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నారు. అంతరాలు పోవా లనే లక్ష్యంతో బాబాసాహెబ్ అంబేడ్కర్ రా జ్యాంగాన్ని రచించి అందరికీ సమాన హక్కులను కల్పించారన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ నా యకులు అంటరానితనాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తుండటం శోచనీయమన్నారు. సభ వేదికలపై దళితులు మాట్లాడితే వాటిని శుద్ధి చేస్తారా అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ చేసిన ఈ చర్యలను పార్టీ పరంగా ఖండిస్తున్నామన్నారు. ఇందులో మున్సిప ల్, మార్కె ట్, గ్రంథాలయ చైర్మన్లు అనూష, శ్రీకాంత్రెడ్డి, నర్సయ్య, పార్టీ నాయకులు సాజిద్ ఖాన్, భోజారెడ్డి, సతీష్, పరమేశ్వర్, సంజీవ్, అన్నపూర్ణ, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు. -
సరైన గుర్తింపు లేదు..
తాంసి: మా తాతలు, తండ్రులు స్వాతంత్య్రం కోసం ఎంతో పోరాడారు. మేము మాత్రం పొట్ట కూటి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. మా కుటుంబానికి పెద్ద ఉద్యమ చరిత్ర ఉంది. ఉద్యమ సమయంలో నిర్మల్లోని కుభీర్లో గణష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మా నాన్న స్వామి రామానందతీర్థ్ వారితో ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశం కోసం ఉద్యమాన్ని చేస్తున్నామని మా నాన్న గంగారం సింగ్ తెలిపేవారు. నిజాంకు వ్యతిరేకంగా సైతం పోరాడి నాందేడ్ జైలులో మూడు నెలలపాటు ఉన్నారు. సమరయోధుల కుటుంబాలకు సాగుభూమితో ఇళ్లను ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతియేటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం రోజున సన్మానించి గౌరవిస్తే బాగుంటుంది. ఠాకూర్ రాంసింగ్, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు -
వీధుల్లో వందేమాతరం నినాదాలు
మంచిర్యాలఅర్బన్: ప్రస్తుత కాలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు భారీ వేదికలు, మైకులు, విద్యుత్ కాంతులతో సాగుతున్నప్పటికీ నాటి రోజుల్లో కనిపించే దేశభక్తి, నిరాడంబరత కొంతమేర కొరవడ్డాయి. అప్పట్లో తెలంగాణ గ్రామాల్లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే అత్యంత పవిత్రమైన దేశభక్తి భావంతో జెండా ఎగురవేశాం. గ్రామ పంచాయితీ కార్యాలయం, పాఠశాలల వద్ద హెడ్మాస్టర్లు, పెద్దల ఆధ్వర్యంలో ఊరంతా ఏకమై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేవారు. గ్రామస్తులు, యువకులందరూ చేతుల్లో త్రివర్ణపతాకాలు పట్టుకుని వీధుల్లో వందేమాతరం అంటూ నినాదాలు చేశాం. స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ చేసే ప్రసంగాలు రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఉండేవి. – విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తవడ్ల రామయ్య(88), మంచిర్యాల -
పాత నాణెం.. నాగన్నకు ప్రాణం
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ పట్టణానికి చెందిన ఉస్కామొల్ల నాగన్న పాత నాణేలు, విదేశీ కరెన్సీ సేకరణను హాబీగా చేసుకున్నారు. పాత బస్టాండ్ ఆవరణలో ఓ చిన్న పాన్ షాప్ నడుపుకొనే నాగన్న ఇప్పటివరకు పాత నాణేలతోపాటు 57 దేశాల కరెన్సీని సేకరించారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు వాడుకలో ఉన్న రాగి నాణేలు, అణాలు, పైసల నుంచి మొదలుకుని నేటి ఆధునిక కరెన్సీ వరకు నాగన్న వద్ద విభిన్న రకాల నాణేలున్నాయి. బ్రిటిష్ కాలం నాటి రాగి నాణేలు, నిజాం నవాబుల కాలం నాటి నాణేలు, పాతకాలపు రంధ్రం నాణేలు, ఒక పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు, ఇందిరాగాంధీ, నెహ్రూ బొమ్మల నాణేలను ఆయన ఎంతో భద్రంగా దాచారు. తన షాప్నకు వచ్చే వారికి నాణేలు చూపిస్తూ అప్పటి చరిత్రను వివరిస్తుంటారు. అతని అభిరుచిని చూసిన వారంతా అభినందించకుండా ఉండలేకపోతున్నారు.


