breaking news
Adilabad
-
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్పై కాసుల వర్షం కురిసింది. కేవలం నాలుగు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలిసినప్పటికీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ. 8.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.ఇంగ్లిష్ కోసం లక్నోతో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ కూడా తీవ్రంగా శ్రమించింది. కాగా ఇంగ్లిస్ వచ్చే ఏడాది ఏప్రిల్లో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ కారణంగా అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండనని, కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడుతానని ముందుగానే ప్రకటించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ అతడిని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి విడిచిపెట్టింది.హనీమూన్ వాయిదా?అయితే ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడంతో కేవలం నాలుగు మ్యాచ్ల ఆడాలన్న తన నిర్ణయాన్ని ఇంగ్లిష్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న వివాహం తర్వాత వెంటనే హనీమూన్కు వెళ్లాలనుకున్న ప్లాన్ను వాయిదా వేసి..నేరుగా లక్నో క్యాంప్లో చేరాలని అతను భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయినప్పటికి అతడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశముంది. ఇదే విషయంపై పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ నెస్ వాడియా స్పందించారు. ఇంగ్లిష్ తీరును అతడు తప్పుబట్టాడు."మేము జోష్ ఇంగ్లిష్ను రిటైన్ చేసుకోవాలనుకున్నాము. కానీ అతడు రిటెన్షన్ గడువు ముగియడానికి కేవలం 45 నిమిషాల ముందు తన వ్యక్తిగత కారణాల గురించి తెలియజేశాడు. తన పెళ్లి, హానీమూన్ కారణంగా కేవలం మూడు మ్యాచ్లకే మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పాడు. అందుకే అతడిని వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఏమాత్రం ప్రొఫెషన్లిజం కాదు. కానీ నేను అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతడు అద్భుతమైన ఆటగాడు. ఆస్ట్రేలియా తరపున కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. మరి ఇప్పుడు ఐపీఎల్లో అన్ని మ్యాచ్లు ఆడుతాడో లేదో చూద్దం" అని వాడియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో ఇంగ్లిష్ను రూ. 2.60 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగొలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం అతడు చేశాడు. 11 మ్యాచ్లు ఆడి 162.57 స్ట్రైక్ రేట్తో 278 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు అతడు ఏకంగా రూ.8.60 కోట్లు అందుకోనున్నాడు. అంటే దాదాపు 230.77% పెరుగుదల అనే చెప్పాలి.చదవండి: ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్.. కట్ చేస్తే! అక్కడ డబుల్ సెంచరీతో -
పరీక్ష సమస్య కాదు..
టెట్ ఉత్తీర్ణకు నిర్వహించే పరీక్ష సమస్య కాదు. బోధనతోపాటు పరీక్ష రాయడానికి ఇబ్బంది లేదు. టెట్ ఉత్తీర్ణత సాధించడం కోసం ప్రిపేర్ కావడానికి సెలవులు అవసరం లేదు. ఇవన్నీ గతంలో పాసైనవే. టైం దొరికనప్పుడుల్లా యూట్యూబ్లో వీడియోలు సేకరిస్తూ పరీక్షకు సన్నద్దమవుతున్నా. 15 నుంచి 30 సంవత్సరాలు సేవలందించిన సీనియర్ ఉపాధ్యాయులను పరీక్షించడం సహేతుకం కాదు. ప్రతీ ఉపాధ్యాయుడు ప్రభుత్వం బోర్డులు నిర్వహించిన పరీక్షలన్ని పాసయ్యాడు. – మురళీధర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గర్మిళ్ల -
సర్పంచ్గా ‘మాస్టారు’
చెన్నూర్రూరల్: మండలంలోని లంబడిపల్లి గ్రామ స ర్పంచ్గా విద్యావంతుడు, యువకుడు నగావత్ మ హేశ్నాయక్ ఎంపికయ్యా డు. ఆయన ఎంఏ, బీఈడీ పూర్తి చేసి జైపూర్లోని గు రుకుల జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అ ధాపకుడిగా పని చేస్తున్నాడు. నాలుగున్నర ఏ ళ్లుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న మహేశ్ స ర్పంచ్ జనరల్ రిజర్వు కావడంతో ఉద్యోగా నికి రిజైన్ చేసి ఎన్నికల్లో పోటీ చేశాడు. సమీప ప్రత్యర్థిపై 55ఓట్ల తేడాతో గెలుపొందాడు. ప్రజలు తనపై నమ్మకంతో సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామాభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడుతానన్నారు. -
ఆ కుటుంబాలకే పల్లె పగ్గాలు
భైంసారూరల్: నిర్మల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఈసారి భిన్నమైన తీర్పు ఇచ్చారు. యువతను, చదువుకున్నవారిని ఎన్నుకున్నారు. అయితే కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం.. సంప్రదాయాన్ని కొనసాగించారు. గత పాలకుల కుటుంబీకులకే మరో అవకాశం కల్పించారు. వరుసగా రెండోసారి.. భైంసా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కథ్గాం గ్రామానికి సర్పంచ్గా వరుసగా దెగ్లూర్ రాజు రెండోసారి ఎన్నికయ్యాడు. భైంసాలో దంతవైద్యుడిగా పనిచేస్తూ మొదటిసారి సర్పంచుగా ప్రజాజీవితంలోకి వచ్చాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రాజు ప్రస్తుతం గ్రామంలో ప్రజాప్రతినిధిగానే కొనసాగుతున్నారు. మొదటిసారి జిల్లాలో ఉత్తమ పంచాయతీగా అవార్డు సైతం అందుకున్నాడు. అప్పటి కలెక్టర్లు ప్రశాంతి, ముషారఫ్ అలీ ఫారూఖీ, వరణ్రెడ్డి రాజు చేసిన సేవలను ప్రసంసించారు. పల్లె ప్రకృతి వనం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను నిర్వహించి కలెక్టర్ల మెప్పు పొందారు. రెండోసారి వరుసగా సర్పంచుగా ఎన్నికయ్యాడు. మహాగాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి అప్పాల రాజ్యలక్ష్మి ఎన్నికై ంది. గడిచిన ఐదేళ్లలో అప్పాల రాకేశ్ సర్పంచ్గా పనిచేశారు. రిజర్వేషన్ మహిళకు కేటాయించడంతో భార్యను పోటీలో దింపి సర్పంచ్గా గెలుపించుకున్నారు. అప్పుడు రాకేశ్ ఇప్పుడు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి సర్పంచ్గా పని చేస్తున్నారు. -
ఆర్జీయూకేటీ విద్యార్థునులకు ప్రిన్స్టన్ స్కాలర్షిప్
బాసర:ప్రతిభావంతమైన విద్యార్థినులకు విద్యాసాధికారత కల్పించేందుకు ప్రిన్స్టన్ ఫౌండేషన్ ఏటా ఉపకారవేతనాల అందిస్తోంది. ఈఏ డాది ఉపకార వేతనాలు ఆర్జీయూకేటీ విద్యార్థినులు స్కాలర్షిప్నకు ఎంపికయ్యారు. ఇన్చార్జి వైస్చాన్సలర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ ఈ స్కాలర్షిప్ విద్యార్థినులకు ఆర్థిక సహాయం, ఇంటర్న్షిప్, మెంటరింగ్తో ఉన్నత విద్యలో అవకాశాలు కల్పిస్తాయని వివరించారు. ఇది కళాశాలలో విద్యార్థినుల సాధికారత, విద్యా నిబద్ధతకు నిదర్శనమని అన్నా రు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లడుతూ విద్యార్థులు అకడమిక్ రంగంలో కఠిన శ్రమ, క్రమశిక్షణ, శ్రద్ధ చూపుతున్నారన్నారు. తాజా ఎంపికే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, జేఎన్యూ, శ్రీరామ్ కామర్స్ కాలేజీల విద్యార్థినులతో ఆర్జీయూకేటీ విద్యార్థినులు పోటీపడ్డారని వివరించారు. స్కాలర్షిప్నకు ఎంపికై న విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు ఎస్.విఠల్, మహేశ్, శేఖర్, ఉపకార వేతన కార్యాలయ సిబ్బంది జి.శ్వేత, చిన్నారెడ్డి, హిమబిందు, వినోద్ పాల్గొన్నారు. -
నాడు పతులు.. నేడు సతులు
ఆసిఫాబాద్రూరల్: ఆసిఫాబాద్ మండలంలో పలువురు గతంలో సర్పంచులుగా పనిచేయగా.. ప్రస్తుతం వారి సతీమణులు ఆ పదవులు చేపట్టనున్నారు. 2019లో ఎల్లారం పంచాయతీ సర్పంచ్గా సీతారాం ఎన్నికయ్యారు. గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఈసారి ఆయన భార్య నీలబాయిని ప్రజలు సర్పంచ్గా ఎన్నుకున్నారు. కౌటగూడలో 2019లో లక్ష్మీనారాయణ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఈసారి ఎస్టీ మహిళకు రిజర్వేషన్ రావడంతో భార్య స్వప్పను బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలపగా ఆమె విజయం సాధించారు. పాడిబండ పంచాయతీలో గతంలో దినకర్ సర్పంచ్గా ఎన్నిక కాగా, ఈసారి ఎస్టీ మహిళ రిజర్వేషన్తో అతడి భార్య ఈశ్వరీ విజయం సాధించారు. గుండిలో పంచాయతీలో మాత్రం 2019లో అరుణ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీసీ పురుషులకు రిజర్వేషన్ రావడంతో ఆమె భర్త రవీందర్ బరిలోకి దిగి ఏడు ఓట్లతో గెలుపొందారు. -
టీచర్లకు ‘టెట్’షన్
మంచిర్యాలఅర్బన్:జాతీయ విద్యా విధానం ప్రకారం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పాస్ కావాలని సెప్టెంబర్ 1న ఉత్తరవులు వచ్చాయి. జనవరి 3 నుంచి 20 వరకు ఆన్లైన్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తూనే.. టెట్కు సన్నద్ధమవుతున్నారు. అయిదేళ్లకుపైగా సర్వీస్ ఉన్నవారు రెండేళ్లలో టెట్ అర్హత సాధించాల్సి ఉంది. దీంతో అందరిలో టెన్షన్ కనిపిస్తోంది. సాధన పోరాటం.. తరగతి గది విధుల మధ్య ఖాళీ సమయాల్లో టెట్ కోసం ఆన్లైన్ తరగతులు వింటున్నారు. కొందర సాయంత్రం వేళ శిక్షణ కేంద్రాల్లో పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. సెలవు రోజుల్లో ఇంట్లో ఆన్లైన్ కోచింగ్లతో సిద్ధపడుతున్నారు. ఈ ప్రయత్నాలు వారి రోజువారీ బాధ్యతలతో సమతుల్యం చేసుకోవడం సవాల్గా మారాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు పది వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో సగానిపైగా టెట్ అర్హత లేనివారే. మంచిర్యాల జిల్లాలో 2,507 మంది ఉండగా, 1,562 మందికి టెట్ లేదు. ఆదిలాబాద్ జిల్లాలో 2,636 మంది ఉపాధ్యాయుల్లో 1,845 మందికి అర్హత లేదు. ఆసిఫాబాద్లో 2,030 మంది ఉండగా, 1,015 మందికి టెట్ లేదు. నిర్మల్ జిల్లాలో 2,600 మంది ఉండగా, 1,500 మంది టెట్ లేకుండా పనిచేస్తున్నారు. జిల్లా మొత్తం టెట్ అర్హత మంచిర్యాల 2,507 1,562 ఆదిలాబాద్ 2,636 1,845 నిర్మల్ 2,600 1,500 ఆసిఫాబాద్ 2,030 1,015 -
ముచ్చటగా మూడోసారి
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని మాలన్గొందిలో ముచ్చటగా మూడోసారి ఆ కుటుంబాన్ని సర్పంచ్ గిరి వరించింది. 2014లో తిరుపతి సర్పంచ్గా ఎన్నిక కాగా, 2019లో మడావి భార్య సీత విజయం సాధించారు. ఈసారి మళ్లీ 300 మెజర్టీతో మడావి సీత సర్పంచ్గా ఎన్నికయ్యారు. సీసీరోడ్డు, డ్రెయినేజీల నిర్మాణంతోపాటు భీమన్న ఆలయం అభివృద్ధి చేస్తున్న కృషిని గుర్తించి తమను ఎన్నుకుంటున్నారని వారు తెలిపారు. అలాగే చిర్రకుంట పంచాయతీ సర్పంచ్గా 2019లో పార్వతిబాయి ఎన్నిక కాగా, ఈసారి కూడా బీజేపీ మద్దతుతో ఆమె గెలుపొందారు. వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. వరించిన అదృష్టం ఆసిఫాబాద్ మండలంలోని అడదస్నాపూర్ పంచాయతీలో టాస్ ద్వారా విజేతలను నిర్ణయించారు. పంచాయతీలో మొత్తం 445 ఓటర్లు ఉండగా 382 పోలయ్యాయి. నోటాకు మూడు ఓట్లు పడగా, చెల్లనివి 22 ఉన్నాయి. సర్పంచ్ అభ్యర్థులు నీలాకుమారి, కమలాబాయికి సమానంగా 154 చొప్పున ఓట్లు వచ్చాయి. మూడుసార్లు రీకౌటింగ్ చేసినా ఫలితం మారలేదు. దీంతో చివరికి టాస్ వేయగా నీలాకుమారిని అదృష్టం వరించింది. -
అప్పుడు భర్త... ఇప్పుడు భార్య...
● కధం కుటుంబానికి నాలుగు సార్లు.. లోకేశ్వరం:రాజకీయాల్లో ఒకసారి అడుగు పెట్టాక ఆ అభ్యర్థి తన కంటూ ఏదో ఒక పదవిని దక్కించుకునేందుకు ప్రతిఎన్నికల్లోనూ పోటీ అవకాశాలు వెతుక్కుంటారు. ఒక్కసారి సీటు దక్కించుకోవలంటే పోటాపోటీగా పోరాడాల్సి ఉంటుంది. లోకేశ్వరం మండలం హవర్గ గ్రామానికి చెందిన కధం లక్ష్మి 2000లో మొదటిసారిగా మన్మద్ ఎంపీటీసీగా గెలుపొంది. ఈపరిదిలోని మన్మద్, బిలోలి, హవర్గ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. భూజంగ్రావు 2014లో మండల కోఆప్షన్గా పని చేశారు. మళ్లీ 2019, 2025 భూజంగ్రావు సర్పంచ్గా గెలుపొందారు. లక్ష్మి ఒకసారి, భూజంగ్రావు మూడు సార్లు వివిధ పదవులు పొందారు. కధం భుజంగ్రావు 2019, 2025 ఎన్నికల్లో సర్పంచ్ కధం లక్ష్మి 2000 ఎన్నికల్లో మన్మద్ ఎంపీటీసీ -
రెండు బైక్లు ఢీ
కాసిపేట: మండల కేంద్రంలోని కాసిపేట పెట్రోల్బంక్ కోమటిచేను శివారు ప్రాంతంలో రహదారిపై గురువారం సాయంత్రం ఎదురెదురుగా ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురిని 108అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించగా ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలపై వేగంగా వచ్చి ఢీకొన్నారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను అంబులెన్స్లో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఒకరు మృతి చెందగా, మరొకరు విషమంగా ఉన్నట్లు 108అంబులెన్స్ ఈఎంటీ నరేష్, పైలెట్ పాషాలు తెలిపారు. మృతుడు మందమర్రి మండలం క్యాతన్పల్లికి చెందిన దురిశెట్టి హరిప్రసాద్(26)గా, విషమంగా ఉన్న వ్యక్తి మందమర్రి శ్రీపతినగర్కు చెందిన రమేశ్గా గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. -
జీజీహెచ్లో దయ్యం ఉన్నట్లు ప్రచారం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆ సుపత్రిలో ఒక రహస్యమైన నీడ కనిపిస్తున్నట్లు ఒక వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓపీ విభాగంలోని ల్యాబ్ వైపున బుధవారం అర్ధరాత్రి 12:36గంటలకు ఒక రహస్యమైన నీడ కనిపించినట్లు వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ ఔట్ పోస్టు పోలీసులకు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఫేక్ వీడియోను తయారు చేసినా, వాటిని షేర్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఆసుపత్రి వారు చేస్తే, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రజలు నమ్మొద్దని కోరారు. -
పట్టభద్రులకే ‘పట్టం’...!
తాండూర్: తాండూర్ మండలంలోని 15గ్రామ పంచాయతీల్లో ఓట ర్లు పలువురు పట్టభద్రులకే పట్టం కట్టారు. మండలంలోని ద్వారకాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా ఎన్నికై న మాసాడి తిరుపతి ఎంకాంలో పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో 89ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. బోయపల్లి సర్పంచ్గా గెలుపొందిన సుందిళ్ల శంకరమ్మ గృహిణిగానే తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె కూడా బీఏలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 148ఓట్ల మె జార్టీతో ఎన్నికల్లో విజయం సాధించారు. కాసిపేట సర్పంచ్గా ఎన్నికై న ము దాం వనజ సైతం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గృహిణిగా తన బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మండలంలోనే అత్యధికంగా 805ఓట్ల భారీ మెజార్టీ తో విజయాన్ని కై వసం చేసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు సర్పంచ్లు ఇంటర్మీడియెట్, మరో ఐదుగురు పదో తరగతి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. -
అందుబాటులో ఉన్న పుస్తకాలతో..
పాఠశాల విధులు నిర్వహిస్తూనే అందుబాటులో ఉన్నా పుస్తకాలు చదువుతున్నా. టెట్ రాసేందుకు అనుకున్నంత సమయం లేకుండాపోయింది. నిన్నటి వరకు ఎన్నికల విధులు నిర్వహించాం. ఇటూ ప్రిపేర్ కావడం ఆందోళనగా ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులరాలుగా 31 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేశాను. ఇప్పుడు ఎగ్జామ్ రాయమనడం అన్యాయం. గణితం ఉపాధ్యాయులు హిందీ, హిందీ టీచర్లు సోషల్ రాయమనడం అంతా గజబీజీగా ఉంది. టెట్ తప్పనిసరి నిబంధన సమంజసంగా లేదు. – శారా సంగీత, జీహెచ్ఎస్, పాత మంచిర్యాల -
యూపీఎస్సీ ఫలితాల్లో పొన్నారి యువకుడి ప్రతిభ
తాంసి: మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన సాయికిరణ్ బుధవారం సాయంత్రం విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటాడు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) విభాగంలో ఆలిండియా 82వ ర్యాంక్ సాధించాడు. గత జూన్ 8న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యాడు. ఆగస్టు 10న మెయిన్స్ పరీక్ష రాశాడు. నవంబర్ 7న ఇంటర్వ్యూకు హాజరై యూపీఎస్సీకి ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన నోము ల అనసూయ–గంగన్న దంపతుల కుమారుడు చిన్నప్పటి నుంచి చదువులో ముందుంటూ పదోతరగతి వరకు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేశాడు. హైదరాబాద్లోని ప్రై వేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తిచేసి ఇంజినీరింగ్ విద్యను కరీంనగర్లోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో 2021లో పూర్తిచేశాడు. సివిల్స్ సాధనే లక్ష్యంగా 2021 నుంచి యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ పరీక్షలో చేజారినా నిరాశ చెందకుండా పట్టుదలతో పరీక్షలకు సిద్ధమయ్యాడు. రెండోసారి కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్లినా రిజర్వ్ స్థానానికే పరిమితమయ్యాడు. మూడో ప్రయత్నంలో ఐఈఎస్ విభాగంలో ఆలిండియా స్థాయిలో 82వ ర్యాంక్ సాధించాడు. యూపీఎస్సీ ఫలితాల్లో రైతు కుటుంబానికి చెందిన సాయికిరణ్ ప్రతిభ కనబర్చడంతో గ్రామస్తులు అభినందించారు. -
వృత్తి బాధ్యత నిర్వహిస్తూనే..
ఓవైపు వృత్తి బాధ్యత నిర్వహిస్తూనే వీలు దొరికనప్పుడల్లా టెట్ ప్రిపేర్ అవుతున్నా. ఇంట్లో పుస్తకాలు చదువుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం 1996డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యాను. అప్పుడు బీఎస్సీ బీఎడ్ అర్హతతో ఉద్యోగంలోకి వచ్చాం. తర్వాత క్రమంలో వృత్తిపరమైన పదోన్నతలు కోసం డిపార్?ట్మంటల్ టెస్టుల రాసి ఉన్నాం. ప్రస్తుతం 2010 ఆర్టీఈ చట్టం ద్వారా ఉపాధ్యాయ వృత్తికి టెట్ పరీక్ష తప్పనసరి చట్టం చేయబడింది. 30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా టెట్ కావాలని అడగడం సరికాదు. – సుజాత, స్కూల్అసిస్టెంట్ (బయోలజీ) జెడ్పీహెచ్ఎస్(బాయ్స్) లక్సెట్టిపేట -
పరీక్ష సులువే..
రోజువారీ తరగతి గదిలో బోధన చేస్తున్న తమకు ప రీక్ష రాయటం సులువే. ఏ మాత్రం ఖాళీ సమయం దొ రికినా పుస్తకాలు తిరిగేస్తూ పరీక్షపై దృష్టి పెడుతున్నా. గ్రామ పంచాయతీ ఎన్నికలతో కొంత అటంకం ఏర్పడింది. క్రిస్మస్ సెలవులు.. ఏ ఒక్క హాలిడే వచ్చినా సద్వినియోగం చేసుకుంటా. టెట్ అ ర్హత పరీక్ష అనేది ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునే వారి కోసం ఉద్దేశించింది. ఎంతో అనుభవం గడించిన ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలో అర్హత సాధించాలనే నిబంధన అసంబద్దం. – బోయిని శ్రీనివాస్, జెడ్పీహెచ్ఎస్ తాళ్లపేట్ -
ఆ బస్సుకు ఏటా పూజలు
కడెం: ఏదైనా ఓ గ్రామానికి నూతనంగా బస్సును ప్రారంభిస్తే ఆ బస్సుకు పూజలు నిర్వహించి.. స్వాగతం పలకడం సాధారణం. కానీ నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ బస్సుకు ఏటా పూజలు నిర్వహిస్తుంటారు అక్కడి ప్రజలు. మండల కేంద్రం నుంచి మారుమూల గంగాపూర్ గ్రామానికి వెళ్లాలంటే ఒక్కటే దారి. నవబ్పేట్ సమీప ఆటవీప్రాంతం గుండా వాగులు, వంకలు దాటి 14 కిలోమీటర్లు వెళ్లాలి. లేదంటే కడెం ప్రాజెక్ట్ బ్యాక్వాటర్లో తెప్పపై వెళ్లాలి. ఎత్తెన గుట్టలు, రాళ్లు, రప్పలతో రోడ్డు సరిగా లేకున్నా ఆర్టీసీ ఏళ్లుగా బస్సు నడుపుతోంది. రోజుకు రెండు ట్రిప్పులు వస్తుంది. వర్షాకాలం మాత్రం బస్సును నిలిపివేస్తారు. చలికాలంలో ప్రారంభిస్తారు. ఇలా ప్రారంభించిన ప్రతీసారి బస్సు అలంకరించి, పూజలు చేసి స్వాగతం పలుకుతారు. గంగాపూర్, కొర్రతండా, రాణిగూడ పంచాయతీల ప్రజలు గ్రామాలు దాటి బయట ప్రపంచానికి రావాలంటే సరైన రవాణా వ్యవస్థ లేదు. దీంతో ఆర్టీసీ బస్సుతో వీరికి ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. -
అక్రమ కేసులతో వేధిస్తున్న కేంద్రం
ఆదిలాబాద్: గాంధీ కుటుంబాన్ని వేధించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులతో ఇ బ్బందులకు గురి చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం బీజేపీ కార్యాలయం ఎదుట నిరస న తెలిపారు. నాయకులు, కార్యకర్తలు కార్యాలయంలోకి చొరబడేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు నాయకులు, పోలీసుల మ ధ్య తోపులాట జరిగింది. అనంతరం నరేశ్ జాదవ్ మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో పదేళ్లుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. కోర్టు కూడా దీనిని తప్పు పట్టిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతి పక్షాలను అణిచివేసేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా తీరు మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ ఎంపీ సోయం బాపూరావు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్ సంజీవ్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ దామోదర్రెడ్డి, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, గుడిహత్నూర్ మండలాధ్యక్షుడు మల్యాల క రుణాకర్, టౌన్ అధ్యక్షుడు గుడిపెల్లి నగేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్గౌడ్ పాల్గొన్నారు. -
సర్వేకు సహకరించాలి
ఆదిలాబాద్టౌన్: కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు జిల్లాలోని పీహెచ్సీల పరిధిలో ఈనెల 18 నుంచి 31వరకు కుష్ఠు సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్ పట్టణ ఆ రోగ్యకేంద్రంలో వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్య మాన్ని ప్రారంభించి మాట్లాడారు. 2027నాటి కి భారత్ను కుష్టురహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. కుష్టు రోగులను గుర్తించేందు కు నిర్వహిస్తున్న ఈ సర్వేలో భాగంగా ప్రజలు తమ ఇళ్లకు వచ్చే ఆశ కార్యకర్తలకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. శరీరంపై పాలిపోయిన, రాగి రంగు మొద్దుబారిన మచ్చలు కనిపిస్తే కుష్టుగా అనుమానించాల్సిన అవసరముందని తెలిపారు. ఆశ కార్యకర్తలు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించా లని ఆదేశించారు. ప్రోగ్రాం ఆఫీసర్ శిరీన్, వై ద్యాధికారి సౌమ్య, డీపీఎంవోలు వామన్రావు, రమేశ్, ఎల్టీలు నిజామొద్దీన్, సంతోష్, సీవో రాజారెడ్డి, ఆశ కార్యకర్తలు, సిబ్బంది ఉన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఆదిలాబాద్టౌన్: నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు లో ఉందని, నూతన సర్పంచులు అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు, సభలు, ఊరేగింపులు నిర్వహించరాదని తెలిపారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలపై బోథ్, బజార్హత్నూర్ మండలాల్లో 11 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బోథ్ మండలం ధన్నూర్(బీ)లో 40 బాటిళ్ల మద్యం తరలిస్తున్న సామ ప్రవీణ్రెడ్డి, సామ సా యికిరణ్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఓ అభ్యర్థికి అనుకూలంగా ఓటర్లకు రూ.500 నగ దు, బ్యాలెట్ పత్రం అందజేసిన గొర్ల గంగయ్య, లక్ష్మణ్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బోథ్లో ఎండీ జుబేర్ నుంచి ఒక ఫుల్బాటిల్ మద్యం, రూ.6,730 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సొనాల మండలం గుట్టపక్కతండాకు చెందిన పలువురు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘించడంతో సుభా ష్తో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కౌట(బీ) గ్రామంలో రోడ్డు పక్కన మద్యం సేవించిన రమణయ్య, ఒరగంటి రాజు, దీకొండ ముఖేశ్పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిగిని గ్రామంలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థికి అనుకూలంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన నితిన్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కౌట(బీ) గ్రామానికి చెందిన నిందితుడు కొండల జైపాల్ మద్యం సేవించి ఓటు వేసి బ్యాలె ట్ పేపర్ను చించినట్లు తెలిపారు. ప్రిసైడింగ్ అధి కారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పే ర్కొన్నారు. కౌట(కే)లో ఎన్నికలు పూర్తయిన తర్వా త బ్యాలెట్ బాక్సులతో తిరిగి వెళ్తున్న మొబైల్ పార్టీ ని అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించిన ఎం. రాజేశ్వర్, ఉత్తమ్, కె.రాజేశ్వర్, వెంకటి, పంచపూలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సొనాల మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన గెలిచిన అభ్యర్థి అనుచరులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. బజార్హత్నూర్ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నమోదైనట్లు తెలిపారు. చందునాయక్తండాలో ఓటు వేసి ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులకు ఇ బ్బందులు కలిగించిన రాబ్డే సురేశ్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అదే పోలింగ్ కేంద్రంలో 100, 200 మీటర్ల పరిధిలో గుమిగూడిన రవీందర్, రాజేందర్, ప్రకాశ్, కై లాశ్, సుభాష్, చౌహాన్ రవి, కవీందర్పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
బేలలో సోయా రైతుల ఆందోళన
కైలాస్నగర్(బేల): సోయా పంటను కొనుగోలు చే యాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద గల జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నాలుగు గంటల పాటు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి రాకపోకలు పూర్తిగా నిలిచాయి. జైనథ్ సీఐ శ్రవణ్, ఎస్సై ప్రవీణ్, డీటీ వామన్ అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. కొనుగోళ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పలువురు రైతులు కంటతడి పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చే శారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవితో ఫోన్లో మాట్లాడించారు. కలెక్టర్ను కలిసి సమస్య తెలిపేందుకు అవకాశం క ల్పిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. పంట ను విక్రయించేందుకు బేలలోని సబ్ మార్కెట్యార్డుకు వచ్చి నెలవుతున్నా కొనుగోలు చేయడం లేదని తెలిపారు. నాణ్యత లోపం, కొనుగోలు పరిమితి పూర్తయిందనే సాకుతో కొనుగోళ్లు నిలిపివేశారని పేర్కొన్నారు. తీవ్రమైన చలిలో మార్కెట్ యార్డులో పంటను ఉంచి పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోయారు. తమ పంటనంతా కొనుగోలు చేయాలని, ఆ దిశగా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. -
సమన్వయంతో పనిచేయాలి
ఆదిలాబాద్టౌన్: జిల్లా స్థాయి సైన్స్ఫేర్ను విజయవంతం చేసేందుకు కమిటీ బాధ్యులంతా సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో ఎస్.రాజేశ్వర్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో శుక్రవారం నుంచి నిర్వహించనున్న సైన్స్ఫేర్, ఇన్స్పైర్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించా రు. కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనా త్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణలకు దోహదపడే సైన్స్ఫేర్ను నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని వివిధ కమిటీల బాధ్యులకు సూచించారు. జిల్లా సైన్స్ అధికారి భాస్కర్, వివిధ కమిటీల కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగు లక్ష్యాలను సాధించాలి
కై లాస్నగర్: ఆయిల్పామ్ సాగు లక్ష్యాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఆయిల్పామ్ సాగు, యూరియా ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ లాంటి అంశాలపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,500 ఎకరాల సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 386 ఎకరాల్లోనే సాగైనట్లు తెలిపారు. మండలాల అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించి ఆయిల్పామ్ మొక్కల నాన్ సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, నాన్ సబ్సిడీ డీడీలను ఈ నెలాఖరులోపు అందించాలని ఆదేశించారు. కంపెనీలు రైతులకు అండగా నిలువాలని, క్షేత్రస్థాయి సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతుల యూరియా ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ను తీసుకువచ్చిందని తెలిపారు. ఈ నెల 20నుంచి అందుబాటులోకి రానున్న యాప్లో వివరాల నమోదుపై వలంటీర్లు, ఏఈవోల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. డీలర్, స్టాక్ వివరాలు యాప్లో కనిపిస్తాయని, రైతులు ఇంటివద్ద నుంచే యూరియా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. మొబైల్ నంబర్ ఓటీపీతో లాగిన్ అవుతుందని, పట్టా పాస్బుక్, పంట తదితర వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 24గంటల్లోపు సరుకును రైతులు తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఏవో శ్రీధర్, జిల్లా ఉద్యానవన అధికారి నర్సయ్య, జిల్లా సహకార అధికారి మోహన్, వ్యవసాయ, ఉద్యానవన విస్తరణాధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పల్లె పోరు.. యువత జోరు
కై లాస్నగర్: దాదాపు రెండేళ్లుగా ఎదురుచూసిన పంచాయతీ ఎన్నికలు ముగి శాయి. మూడు విడతలుగా జరిగిన ఎ న్నికల్లో పల్లె ఓటర్లు పంచాయతీ పాలకులను ఎన్నుకున్నారు. అయితే ఈ ఎ న్నికల బరిలో నిలిచిన యువతకు ఓట ర్లు అగ్రతాంబూలం ఇచ్చారు. తమ తీర్పుద్వారా వారికి పెద్దపీట వేశారు. మెజార్టీ గ్రామాల్లో యువతనే తమ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. ఈ పరి ణామం రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలు కుతోంది. రాజకీయాలపై యువత ధోరణిలో వస్తు న్న మార్పునకు సంకేతంగా నిలుస్తోంది. మరో వై పు ప్రజలు కూడా నవతరాన్ని రాజకీయాల్లోకి ఆ హ్వానిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో పలువు రు అభ్యర్థులు తొలిప్రయత్నంలో విజయబావుటా ఎగరేసి పల్లెపాలన పగ్గాలు అందుకోవడం విశేషం. తొలిమెట్టు సర్పంచ్.. రాజకీయాల్లో రాణించేందుకు సర్పంచ్ పదవిని అంతా తొలిమెట్టుగా భావిస్తుంటారు. ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో రాణించిన, ప్ర స్తుతం ఆయా పదవుల్లో కొనసాగుతున్న వారిలో ఎంతోమంది ఇలా సర్పంచులుగా సేవలందించినవారే. అలాంటి సర్పంచ్ పదవులపై యువత ప్ర త్యేక దృష్టి సారించింది. రాజకీయాలంటేనే అంతగా ఆసక్తి చూపని వారు ఈసారి పోటీకి జై కొట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించిన యువతరం తమ ఊరి బాగుకోసం ముందడుగు వేసింది. నిత్యం ఊరిలో, ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి దృష్టి సారించారు. కష్టసుఖాల్లో తోడుగా నిలిచారు. పోటీకి దిగిన తొలి ప్రయత్నంలోనే ప్రజల మెప్పు పొంది ఊరి సర్పంచులుగా వి జయం సాధించారు. సర్పంచ్ సాబ్.. అని పిలిపించుకుంటున్నారు. అత్యధిక గ్రామాల్లో 25 నుంచి 35 ఏళ్లలోపు యువతీయువకులు సర్పంచులుగా ఎన్ని క కావడం రాజకీయాలపై యువతలో వస్తున్న మా ర్పునకు నాందిగా నిలుస్తోంది. డబ్బుతో ముడిపడి న ప్రస్తుత రాజకీయాల్లో చేతి చమురు వదిలించుకుంటేనే గాని పదవి దక్కదనే భావన పూర్తిగా వ్యతి రేకమని నిరూపించారు. గ్రామంలో పట్టు పెంచుకునేలా ప్రజలకు చేదోడు.. వాదోడుగా నిలిస్తే విజ యం అసాధ్యమేమి కాదని తమ గెలుపుతో సత్తా చాటారు. ఇదే స్ఫూర్తితో త్వరలో జరగనున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మరింత మంది యూ త్ పోటీ పడే అవకాశం లేకపోలేదు. ఇది మంచి రాజకీయ పరిణామంగా చెప్పవచ్చు. పాలనపై సర్వత్రా ఆసక్తి.. రాజకీయాల్లోకి కొత్తగా అడుగిడి ఎన్నికల్లో అంతగా ఖర్చు చేయకున్నా చాలామంది యువతీయువకులు ఈసారి సర్పంచులుగా ఎన్నికయ్యారు. వారి కు టుంబాలకూ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అంతగా లే దు. ఇందులో స్వతంత్రులూ ఎక్కువ మందే ఉన్నా రు. అలాంటి వారు పల్లె పాలనలో ఎలాంటి ముద్ర వేస్తారనేదానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తమపై నమ్మకముంచి గెలిపించిన ప్రజల మన్ననలను పొందేలా పరిపాలిస్తామని పలువురు యువ సర్పంచులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
మరోసారి పత్తి ధరలో కోత
ఆదిలాబాద్టౌన్: నాణ్యత తగ్గిందని మరోసారి పత్తి ధరలో కోత విధించేందుకు సీసీఐ రంగం సి ద్ధం చేసింది. గతనెల 27నుంచి క్వింటాల్కు రూ.50 తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రూ.50 తగ్గిస్తూ ఈనెల 22నుంచి అమలు చేసేందు కు నిర్ణయం తీసుకుంది. దీంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే పత్తికి గిట్టుబాటు ధ ర లేదని రైతులు ఆందోళన చెందుతుండగా ప్రభుత్వరంగ సంస్థ తీసుకున్న నిర్ణయంతో వారు దిగా లు చెందుతున్నారు. పత్తి నాణ్యతలో ప్రమాణాలు తగ్గాయని బీబీ స్పెషల్ నుంచి మెక్మోడ్కు మారిందని సీసీఐ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పత్తి క్వింటాల్కు మద్దతు ధర రూ.8,060 ఉండగా, ఈనెల నుంచి నుంచి మద్దతు ధరలో రూ.50 తగ్గనుంది. దీంతో సీసీఐ మద్దతు ధర క్వింటాల్కు రూ.8,010 చెల్లించేందుకు నిర్ణయించింది. పత్తి క్వింటాల్ మద్దతు ధర రూ.8,110 ఉండగా, గత నెలరోజుల్లోనే రూ.100 తగ్గించారు. తేమ పేరిట కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేసిన సీసీఐ మరోసారి ధర రూ.50 తగ్గించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7.33లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు జిల్లాలో ఐదు మార్కెట్ యార్డులున్నాయి. వీటి పరి ధిలో 7లక్షల 33వేల 763 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ఇందులో సీసీఐ 7లక్షల 3వేల 763 క్వింటా ళ్లు కొనుగోలు చేయగా, ప్రైవేట్ వ్యాపారులు 30 వే ల క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పత్తి పంట దెబ్బతింది. సీసీఐకి విక్రయించిన చాలామంది రైతులకు మద్ద తు ధర లభించలేదు. తేమ పేరిట ధర తగ్గించడంతో అన్నదాతలు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొంత మంది రైతులకు సంబంధించిన పత్తిని తేమ పేరిట కొనుగోలుకు నిరాకరించడంతో గత్యంతరం లేక వారు ప్రైవేట్కు తక్కువ ధరకే విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఇదివరకే రూ.50 కోత విధించగా, మరోసారి కోత విధించేందుకు నిర్ణయం తీసుకోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటివరకు కొనుగోలు చేసింది 7,33,763 క్వింటాళ్లు సీసీఐ కొనుగోలు చేసింది 7,03,763 క్వింటాళ్లు ప్రైవేట్ కొనుగోలు చేసింది 30వేల క్వింటాళ్లు ప్రస్తుత మద్దతు ధర రూ.8,060 22నుంచి అమలులోకి రానున్న ధర రూ.8,010 -
ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామపంచాయతీ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలి సరిహద్దున ఉన్న ఘాట్రోడ్డు మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 25 జెడ్ 0067) గురువారం ఉదయం ఆదిలాబాద్ నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరందోలికి వెళ్లింది. తిరిగి ఆదిలాబాద్కు వస్తుండగా ఘాట్రోడ్డుపై బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో డ్రైవర్ సంతోష్ అప్రమత్తతతో బస్సు ఘాట్ పైనుంచి లోయలోకి పడిపోకుండా పొదల్లోకి మళ్లించాడు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. సంజీవ్ (ఉమ్రీ), రమాదేవి, నాందేవ్ (మహారాజ్గూడ)లకు గాయాలయ్యాయి. వారికి గాదిగూడ మండలం ఝరి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి ఆదిలాబాద్ రిమ్స్కు మార్చారు. నార్నూర్ సీఐ అంజమ్మ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై విచారణ చేపట్టారు. హ్యాండ్ బ్రేక్ కూడా ఫెయిలైంది.. పరందోలి గ్రామం నుంచి ఉదయం 9:30 గంటలకు 30 మందితో బయలుదేరామని డ్రైవర్ సంతోష్ తెలిపాడు. ఘాట్పైకి రాగానే ఆకస్మికంగా బ్రేకులు పనిచేయలేదని పేర్కొన్నాడు. దీంతో బస్సు కుడివైపు లోయలోకి పడేదని, వెంటనే అప్రమత్తమై ఎడమవైపు తిప్పి పొదల్లోకి తీసుకెళ్లానని పేర్కొన్నాడు. పత్తి చేలలో బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సు హ్యాండ్ బ్రేక్కూడా పనిచేయలేదని డ్రైవర్ తెలిపాడు. -
మొదటిసారి ఓటేసిన..
ఐదేళ్లు.. పదేళ్లు కాదు.. ఏకంగా 69 ఏళ్ల తర్వాత ఆ ఊరంతా తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఏకగ్రీవ ఆనవాయితీకి బ్రేక్ పడింది. తలమడుగు మండలం బరంపూర్ వాసులు బుధవారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికలో తొలిసారిగా ఓటేసి సిరా గుర్తు చూపారు. – తలమడుగు నాకిప్పుడు 70 ఏండ్లు దాటి నయ్. ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీటీసీ, జెడ్పీటీపీ, సహకార సంఘాల ఎన్నికల్లోనే ఓటేసిన. మా ఊర్లో సర్పంచ్ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. మొదటిసారి ఓటేయ డం సంతోషంగా ఉంది. – మేకల బాపు -
నిఘా నీడన ఎన్నికలు..
ఆదిలాబాద్టౌన్: మూడో విడత ఎన్నికలో ని ఘా నీడన సాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప టిష్ట బందోబస్తు మధ్య నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు అదనపు ఎస్పీ, డీఎ స్పీలు, సీఐలు, ఎస్సైలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాల వద్ద గుమిగూడిన 80 మందిపై కేసులు నమోదు చేశారు. సుంకిడి, తలమడుగు, రుయ్యాడి, దేవాపూర్, బరంపూర్, బోథ్, సొ నాల, గుడిహత్నూర్ తదితర గ్రామాల్లో ఎన్ని కల ప్రక్రియను ఎస్పీ పరిశీలించారు.ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలుపొందిన వారు విజ యోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని, బా ణసంచా పేల్చవద్దని అభ్యర్థులకు సూచించా రు. నిబంధనలను అతిక్రమిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరు మండలాల్లో నిర్వహించిన ఎన్నికలకు 938 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
పోలింగ్ సరళి ఇలా..
ఓటు హక్కు వినియోగించుకున్న యువతి బోథ్లో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ఓటర్లుకై లాస్నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. జిల్లాలోని 472 (రుయ్యాడి మినహా) గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. తుది విడతలో భాగంగా బోథ్ ని యోజకవర్గంలోని బజార్హత్నూర్, బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్, సొనాల, తలమడుగు మండలాల్లోని 120 సర్పంచ్, 479 వార్డు స్థానాలకు ఎ న్నికలు జరిగాయి. తలమడుగు మండలం బరంపూర్లో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కేంద్రాలకు వ చ్చిన ఓటర్లకు అధికారులు పూలు చల్లుతూ స్వా గతం పలికారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రా రంభం కాగా చలితీవ్రత కారణంగా తొలి రెండు గంటల్లో మందకొడిగా సాగింది. తర్వాత ఓటర్లు కేంద్రాలకు తరలిరావడంతో పోలింగ్ పుంజుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయా కేంద్రాల లోపల ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు హక్కు వి నియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో ప లుచోట్ల మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ కొనసాగింది. వృద్ధుల నుంచి యువత వరకు ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 82.56 శాతం పోలింగ్ నమోదైంది. మలి విడతతో పోల్చితే 4.12 శాతం తగ్గింది. ఆయా మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి పోలింగ్ సరళిపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలి రెండు గంటలు నామమాత్రమే... ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పలుచోట్ల మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది. ఆయా మండలాల పరిధిలో 1,24,880 మంది ఓటర్లు ఉండగా, 1,03,104 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 60,744 మంది పురుష ఓటర్లకు గాను 50,597 మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 64,134 మందికి గాను 52,507 మంది ఓటు వేశారు. చలి తీవ్రత కారణంగా ఓటర్లు ఆలస్యంగా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9గంటల వరకు కేవలం 19.37 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. తర్వాత పుంజుకుంది. తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులను కుటుంబీకులు ఆటోలు, ఇతర వాహనాల్లో తీసుకువచ్చి ఓటు వేయించారు. వారికి కేంద్రాల్లో వీల్చైర్ సౌకర్యం కల్పించారు. పోలింగ్ ముగిసే నిర్ణీత సమయం ఒంటి గంట వరకు 77.95 శాతం నమోదైంది. అప్పటికే పలు చోట్ల కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ కొనసాగింది. చివరకు 82.56 శాతం నమోదైంది. ప్రతి రెండు గంటలకోసారి అధికారికంగా పోలింగ్ శాతం వివరాలను ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ఎన్నికలు జరిగిన ఆయా మండలాల్లోని పలు పో లింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా , ఎస్పీ అఖిల్ మహాజన్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, ఎన్నికల సాధారణ పరిశీలకులు వెంకన్న వేర్వేరుగా పరిశీ లించారు. పోలింగ్ ప్రక్రియపై ఆరా తీశారు. రాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపు..తుది విడతలో నమోదైన పోలింగ్ శాతం వివరాలు మండలం ఎన్నికలు మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు పోలింగ్ బజార్హత్నూర్ 26 21,980 17,560 8,786 8,774 79.89 బోథ్ 18 25,364 20,282 9,805 10,477 79.96 గుడిహత్నూర్ 20 22,695 18,360 9,102 9,258 80.90 నేరడిగొండ 23 19,719 16,630 7,963 8,667 84.33 సొనాల 12 10,804 9,131 4,558 4,573 84.51 తలమడుగు 20 24,318 21,141 10,383 10,758 86.9421.88 53.57 74.51 15.71 47.73 74.32 19.11 58.11 79.00 17.85 50.94 76.84 17.86 55.56 81.25 23.07 61.19 83.32పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత భోజన వి రామం అనంతరం సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. తొ లుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ప్రక్రియ పలు చోట్ల రాత్రి వరకు కొనసాగింది. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడయ్యాయి. మిగతా పంచాయతీల ఫలితాలు ఆలస్యమయ్యాయి. గెలుపొందిన సర్పంచులు తమ అనుచరులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. -
మహాత్ముడి పేరు తొలగింపు సరికాదు
కైలాస్నగర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్ముడి పేరు తొలగించడం సరికాదని డీసీసీ అధ్యక్షు డు డాక్టర్ నరేశ్ జాదవ్ అన్నారు. గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్చౌక్లో గాంధీజీ చిత్రపటాలతో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కక్షపూరితంగా గాంధీజీ పేరును ఉపాధిహామీ పథకం నుంచి కుట్రపూరితంగా మా ర్చిందన్నారు. పథకం పేరును యథావిధిగా కొనసాగించాలని లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రత రం చేస్తామని హెచ్చరించారు. ఇందులో డీసీ సీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు సాజిద్ఖాన్, సుజాత, సంజీవరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, చరణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మూడో విడతలో గులాబీ గుబాళింపు
కై లాస్నగర్: జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. ఈ విడతలో రుయ్యాడి మినహా 120 సర్పంచ్, 479 వార్డు స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. తొలి, రెండో విడతలో సత్తా చాటిన అధికార కాంగ్రెస్ మూడో విడతలో చతికిలపడింది. తృతీయ స్థానానికి పరిమితమైంది. బోథ్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇలాఖా కావడంతో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో విజయఢంకా మోగించారు. రెండో విడతలో సత్తా చాటిన బీజేపీ కేవలం సింగిల్ డిజిట్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక స్వతంత్రులుగా బరిలో దిగిన చాలా మంది పలుచోట్ల సత్తా చాటారు. ప్రధాన రాజకీయ పార్టీలకు గట్టిపోటీనిస్తూ సర్పంచ్లుగా గెలుపొందారు. పలుచోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు, స్వతంత్రుల నడుమ హోరాహోరీ పోరు సాగింది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డారు. మెజార్టీ స్థానాలను కై వసం చేసుకున్న గులాబీ పార్టీ తన పట్టు నిలుపుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్లో పలుచోట్ల జయాపజయాలు స్వల్ప ఓట్లతో దోబూచులాడాయి. గుడిహత్నూర్ మండలం ముత్నూర్ తండాలో రెండు ఓట్ల తేడాతో సర్పంచ్గా జాదవ్ రాంజీ ఎన్నికయ్యారు. ఈ విడతలతో ఏకగ్రీవాలతో కలిపి మొత్తంగా బీఆర్ఎస్ అత్యధికంగా 71సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోగా స్వతంత్రులు 48 చోట్ల విజయం సాధించారు. ఇక అధికార కాంగ్రెస్ మద్దతుదారులు 25 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు కేవలం ఏడు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం రాత్రి వరకు కొనసాగింది. సర్పంచ్ల ఫలితాలను అధికారికంగా ప్రకటించిన అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా పంచాయతీల్లో ఉపసర్పంచ్ల ఎన్నిక నిర్వహించారు. మెజార్టీ ఉపసర్పంచ్ స్థానాలను సైతం బీఆర్ఎస్ తన ఖాతాలోనే వేసుకుంది. గెలుపొందిన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు ఆర్వోలు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. తమ అభిమాన నాయకులు గెలుపొందడంతో వారి అనుచరులు పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. మండలం ఎన్నికలైన జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు బజార్హత్నూర్ 31 05 17 03 06 బోథ్ 21 03 10 01 07 గుడిహత్నూర్ 26 01 10 01 14 నేరడిగొండ 32 06 23 00 03 సొనాల 12 03 04 01 04 తలమడుగు 28 06 07 01 14 -
ఆటంటే మక్కువ.. నిత్య సాధన
ఖానాపూర్: ఖానాపూర్ పట్టణానికి చెందిన పలువురు ఫుట్బాల్ క్రీడాకారులు జిల్లాస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. పట్టణంలోని ప్రైవేట్ క్రీడా మైదా నంలో రోజూ ఉదయం, సాయంత్రం సాధన చేస్తూ ఆటపై తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. గతేడాది నవంబర్లో జరిగిన సీఎం క ప్ జిల్లాస్థాయి పోటీల్లో వీరు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆ తర్వాత నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో కడుకుంట్ల సాయికిరణ్, అల్లం సాయికుమార్, మాదాసు రంజిత్కుమార్, గర్కా గోపాలకృష్ణ, కెల్లేటి మనేశ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పలువురు అభినందించారు. నిత్యం సాధన చేస్తున్నాం నిరంతరం సాధన చేస్తే ప్రతి ఒక్కరూ ఫుట్బాల్ పోటీల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. భవిష్యత్లో మేము రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం. 16మంది జట్టుగా ఉన్న మేము నిత్యం సాధన చేస్తున్నాం. అందరూ పూర్తిస్థాయిలో సహకారమందిస్తేనే ఎంతోమంది క్రీడాకారులు రాణిస్తున్నారు. – కడుకుంట్ల సాయికిరణ్ -
ఒక్క పైసా రాలే
పిల్లల వివాహాలు, చదువులు, వైద్యఖర్చులకు రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ ఉపయోగపడుతాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ను అందించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుని బిల్లులిస్తే ఏళ్లు గడిచినా రావడం లేదు. వచ్చినా సగం డబ్బులే చెల్లిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం రూ.700 కోట్లు విడుదల చేశామంటున్నా ఒక్క పైసా రాలేదు. – ఎస్.సుధాకర్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
సీసీఐ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం
ఆదిలాబాద్: సీసీఐ ఉద్యోగుల బకాయిలు చెల్లి స్తామని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజయ్ భాంగ్రా అన్నారు. ఆదిలా బాద్ సీసీఐ ఉద్యోగుల సమస్యలపై స్థానిక ఎంపీ గోడం నగేశ్ ఢిల్లీలో చైర్మన్ను మంగళవారం కలిసి వినతి పత్రం సమర్పించగా ఆయన స్పందించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగులకు సంబంధించి వీఎస్ఎస్ బెని ఫిట్స్, బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేలా కృషి చేస్తామన్నారు. స్థానికంగా అధికారులు లేకపోతే ఢిల్లీ నుంచే నేరుగా ఆదేశాలిచ్చి, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఎంపీ వెంట ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్, నిరంజన్ రావు ఉన్నారు. -
జేసీబీ యజమాని ఆత్మహత్యాయత్నం
జన్నారం: జేసీబీ యజమాని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలం కల్లెడకు చెందిన వెంబడి శేఖర్ మండలంలోని బాదంపల్లిలో తన అత్తగారింటిలో ఉంటూ జేసీబీ నడుపుకొంటున్నాడు. ఈనెల 14న పుట్టిగూడ సమీపంలో బాల్నాయక్ పొలంలో జేసీబీతో వ్యవసాయ బావి తవ్వాడు. బావి నుంచి వచ్చిన మట్టిని ఇందిరమ్మ ఇళ్ల కోసం తరలించాడు. ఈక్రమంలో అటవీ అధికారులు వచ్చి జేసీబీకి తాళం వేశారు. రైతు బాల్నాయక్ పట్టా పాస్బుక్ తీసుకెళ్లి చూపించగా తిరిగి తాళాలు ఇచ్చారు. మంగళవారం అటవీ అధికారులు మళ్లీ వచ్చారు. జేసీబీ ని సీజ్ చేసేందుకు తాళాలు ఇవ్వాలని శేఖర్పై ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్తాపంతో అతడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు పెట్రోల్ బాటిల్ లాక్కుని అతడిపై నీళ్లు పోశారు. ఈ విషయమై సెక్షన్ అధికారి బోజ్యనాయక్ను సంప్రదించగా, ఇకో సెన్సిటివ్ జోన్ నిబంధనల ప్రకారం మొరం తరలించడం నేరమని తెలిపారు. పట్టా భూమిలో మొరం తీసే అనుమతి లేదని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే జేసీబీని సీజ్ చేసేందుకు వస్తే రాద్ధాంతం చేస్తున్నాడని వివరించారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్/బోథ్/గుడిహత్నూర్: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈమేరకు ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాల ని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎన్నికలు ని ర్వహించే బోథ్ నియోజకవర్గంలోని గుడిహత్నూర్, బోథ్ పోలింగ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆరు మండలా ల్లో ఎన్నికలు జరుగుతున్న దృష్టా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ (144) సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. 33 సమస్యాత్మక కేంద్రాల్లో స్పెషల్ పార్టీ బలగాలు, 10 షాడో పోలింగ్ స్టేషన్లలో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 20 మంది ఎస్సై స్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమస్యాత్మక ప్రాంతాల్లో స్టాటిక్ఫోర్స్ అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. బందోబస్తులో ముగ్గురు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 మంది ఎస్సైలతో పాటు మహిళ సిబ్బంది, హోంగార్డులు, రిజర్వు, సాయుధ సి బ్బంది, స్పెషల్ పార్టీ ఫోర్స్ ఉంటుందని వివరించారు. జీపీ ఎన్నికల్లో ఇప్పటివరకు జిల్లాలో 756 వ్యక్తులను బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన 70 కేసుల్లో 200 మందికి పైగా ఉన్నట్లు వివరించారు. అలాగే 20 ఆయుధాలను సేఫ్ డిపాజిట్ చేసినట్లు చెప్పారు. రూ.20లక్షల విలువ చేసే 2,250 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినా, కించపర్చేలా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రచారం ముగిసిన సందర్భంలో బయట వ్యక్తులు గ్రామాల్లో ఉండరాదన్నా రు. ఎలాంటి సమాచారమైనా డయల్ 100కు ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రా రంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బోథ్ మండలకేంద్రంలో పోలీసులు సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నేరడిగొండ: మండలంలోని లింగట్ల, బొందిడి గ్రామాల్లో ఎన్నికల నియమావళిపై పోలీసులు అవగాహన కల్పించారు. ఓటర్లు నిర్భయంగా ఓ టు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ సూ చించారు. ఇందులో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ రమేశ్, ఎస్సై ఇమ్రా న్, తదితరులున్నారు. -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
గుడిహత్నూర్: ఎన్నికలు పకడ్బందీగా నిర్వహి ంచాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రానికి విచ్చేసిఅధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఆయన వెంట తహసీ ల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో ఇంతియాజ్, ఎంఈవో ఉదయ్రావ్, అధికారులు ఉన్నారు. తలమడుగు: మండల కేంద్రంలో ఏ ర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ రాజమోహన్, సిబ్బంది తదితరులున్నారు. -
ప్రోత్సాహం లేక జాతీయ స్థాయిలోనే ఆగిపోయా..
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ గిరిజన క్రీడా పాఠశాలలో 2002 నుంచి 2005 వరకు చదువుకున్నాను. కోచ్ రఘునాథ్రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయిలో గద్వాల్లో, జాతీయ స్థాయిలో జమ్ముకశ్మీర్లో ఆడి మొదటి స్థానంలో నిలిచాను. 2005లో 10వ తరగతి పూర్తి చేసుకున్న సమయంలో ఉట్నూర్ క్రీడా పాఠశాలను ఎత్తివేశారు. అనంతరం ఇంటర్ ఆదిలాబాద్లోని ఫుట్బాల్ అకాడమీలో చేరడానికి వెళ్లగా దానినీ ఖమ్మం జిల్లాకు తరలించారు. దీంతో ఉట్నూర్కు వచ్చి ఇంటర్ పూర్తి చేశాను. ప్రభుత్వాలు అవకాశం కల్పించకపోవడంతో 2005లో నేషనల్ స్థాయిలోనే ఆగిపోయాను. ప్రస్తుతం ఉట్నూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పీడీగా పని చేస్తున్నాను. ప్రభుత్వాలు దృష్టి సారించి ఆదిలాబాద్, ఉట్నూర్లో ఫుట్బాల్ అకాడమీలు ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు అవకాశం కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశముంది. క్రీడా పాఠశాలల్లో ఫుట్బాల్ అకాడమీని తిరిగి ఏర్పాటు చేసి నాకు అవకాశం కల్పిస్తే గిరిజన విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా తప్పనిసరిగా కృషి చేస్తా. – పాండురంగ్, జాతీయస్థాయి క్రీడాకారుడు -
దశాబ్దాల సేవలకు గుర్తింపేది?
కై లాస్నగర్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించారు. ఉద్యోగ జీవితమంతా ఉరుకులు, పరుగుల మధ్య విధులు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ అనంతరం తమ కుటుంబంతో కలిసి శేషజీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్మైంట్ బెనిఫిట్స్ సకాలంలో అందక అనుకున్న కార్యక్రమాలను పూర్తిచేయలేని దుస్థితితో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే నాణ్యమైన వైద్యసేవలు పొందలేని పరిస్థితి ఉంది. పెన్షన్ సొమ్ముతోనే జీవనం సాగిస్తున్న వారు నానా అవస్థలు పడుతున్నారు. తమకు రావాల్సిన ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పలుసార్లు ఆందోళనలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 8వేల మంది రిటైర్డ్ ఉద్యోగులున్నారు. బుధవారం జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా పెన్షనర్ల సమస్యలు ఓసారి పరిశీలిస్తే.. బెనిఫిట్స్ విడుదలలో తీవ్ర జాప్యం రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం జీపీఎఫ్, జనరల్ ఇన్సురెన్స్, గ్రాట్యూటీ, కముటేషన్ లాంటి బెనిఫిట్స్ను ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. అయితే వీటి విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పెన్షన్ మాత్రమే అందిస్తున్న ప్రభుత్వం ఈ ప్రయోజనాలు కల్పించడం లేదు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు తమ పిల్లల వివాహాలు, ఉన్నత చదువులు, ఇంటి నిర్మాణాలు లాంటివి చేపట్టేందుకు ఆర్థికంగా అవస్థలు పడాల్సి వస్తోంది. వీటికి తోడు బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఆకస్మాత్తుగా వచ్చే రుగ్మతలకు అవసరమైన వైద్య చికిత్స కోసం ఇబ్బంది పడుతున్నారు. నగదు రహిత వైద్యసేవలు అందించాలనే డిమాండ్ వారిలో వ్యక్తమవుతోంది. రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్లు.. -
ఎన్నికల సిబ్బంది కష్టాలు
రోడ్డుపై కూర్చున్న ఉద్యోగులు, సిబ్బందిమూడో విడత ఎన్నికల విధుల నిర్వహణ కోసం మండలానికి మంగళవారం చేరుకున్న సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం కూర్చోవడానికి సరిపడా కుర్చీలు, బల్లలు కరువయ్యాయి. దీంతో చాలా మంది రోడ్డు పక్కన, చెట్ల నీడన నేలపైన కూర్చొని రికార్డులు, సామగ్రిని సరిచూసుకోవాల్సి వచ్చింది. ఏర్పాట్ల తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు. – నేరడిగొండ -
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొడతా ఆసిఫాబాద్రూరల్: నేను మా కోచ్ రవికుమార్ సూ చనలు, పలహాలు పాటిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో మూ డుసార్లు, జాతీయ స్థాయి పోటీల్లో 2023, 2024లో పాల్గొన్నాను. భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి స్పోర్ట్స్ కోటాలో జాబ్ సాధి స్తా. ఇదే లక్ష్యంతో ముందుకుసాగుతున్నాను. – దుర్గాదేవి, పదో తరగతి (గిరిజన బాలికల గురుకుల పాఠశాల) రోజూ సాధన చేస్తున్నాను ఆసిఫాబాద్రూరల్: నేను ఫుట్బాల్ పోటీల్లో 2023, 2025లో రెండుసార్లు జాతీయ స్థాయిలో పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయిలో కూడా పతకాలు సాధించాను. భవిష్యత్లో ఫుట్బాల్ కోచ్గా గిరిజన బాలికలను మంచి క్రీడాకారిణులుగా తీర్చిదద్దడమే నా లక్ష్యం. ఇదే లక్ష్యంతో రోజూ సాధన చేస్తున్నాను. – భూమిక, ఎనిమిదో తరగతి (గిరిజన బాలికల గురుకుల పాఠశాల) ఇండియా కోచ్ కావాలని ఉంది ఆసిఫాబాద్రూరల్: ఇప్పటివరకు 10మంది జాతీ య, 30మంది రాష్ట్ర స్థా యిలో ఆడి ఐదు బంగారు పతకాలు సాధించారు. వి ద్యార్థినులను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నాను. 2014లో మ ధ్యప్రదేశ్లో తెలంగాణ కోచ్గా ఎంపికయ్యా ను. ఇండియా కోచ్గా ఎంపికవ్వడమే లక్ష్యం. – రవికుమార్, ఫుట్బాల్ కోచ్ (గిరిజన బాలికల గురుకుల పాఠశాల) కోచ్ల సహకారంతోనే.. ఫుట్బాల్ ఆటపై ఉన్న ఆసక్తితో మేము వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరుస్తున్నాం. కోచ్లు ఇమ్రాన్, అంబాజీ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మిగతావారు కూడా ఈ క్రీడలో రాణించేలా కృషిచేస్తాం. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న క్రీడతో ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించవచ్చు. – అల్లం సాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలువురు విద్యార్థులు చదువుతోపాటు ఫుట్బాల్ ఆటలోనూ రాణిస్తున్నారు. కోచ్ల పర్యవేక్షణలో శిక్షణ పొంది రాటుదేలుతున్నారు. బాల్ కొడితే గోల్ పడాల్సిందే.. అన్న రీతిలో వివిధ స్థాయిల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి పతకాలు కొల్లగొడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలువురు ఫుట్బాల్ క్రీడాకారులపై కథనం.. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే మరింత రాణించొచ్చు మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న గాలిపెల్లి అను ఫుట్బాల్ ఆటలో రాణిస్తోంది. మందమర్రి మండలానికి గుర్తింపు తెస్తోంది. గత నెల 15 నుంచి 17వరకు నల్గొండ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. డిసెంబర్ 17నుంచి 19వరకు జార్ఖండ్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సారా తస్నీమ్, పీడీ చిన్నక్క అను కి ప్రశంసాపత్రం అందించారు. విద్యార్థిని చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తుందని అభినందించారు. అను మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఫుట్బాల్లో రాణిస్తున్నానని తెలిపింది. విద్యార్థులను పేరెంట్స్ ప్రోత్సహిస్తే వారు వారికి నచ్చిన క్రీడల్లో సత్తా చాటుతారని పేర్కొంది. రాటుదేలుతూ.. రాణిస్తూ..కాగజ్నగర్ టౌన్: సిర్పూర్(టీ) కాగజ్నగర్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఫుట్బాల్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. స్టేట్ లెవల్ మహిళా కోచ్ మాసవేని వనిత శిక్షణలో రాటుదేలుతున్నారు. మైదానంలోకి దిగారంటే గోల్ కొట్టాల్సిందే.. అనే రీతిలో వివిధ స్థాయిల్లో నిర్వహించే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు. 30మంది విద్యార్థులు, 30 మంది విద్యార్థినులు రోజూ ఉదయం 5.30నుంచి 6.30 గంటల వరకు, సెలవు దినాల్లోనూ 4 నుంచి 5గంటల వరకు సాధన చేస్తున్నారు.రాష్ట్రస్థాయిలో రాణించిన రాజేశ్వరి దహెగాం: మండలంలోని చినరాస్పెల్లి గ్రామానికి చెందిన ఎల్కరి రాజేశ్వరి ఫుట్బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయిలో రాణించింది. జిల్లా స్థాయిలో రాణించడంతో రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది. చినరాస్పెల్లి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుకుంటోంది. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తోంది. నవంబర్ 14నుంచి 16వరకు నల్గొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఆడి మంచి పేరు తీసుకురావాలన్నదే తన లక్ష్యంగా రాజేశ్వరి పేర్కొంది. డేట్ అకాడమీని ఓపెన్ చేస్తే బాగుంటుంది ప్రభుత్వం ప్రతీ మండలానికి ఒక డేట్ అకాడమీ సెంటర్ను ఓపెన్ చేస్తే మరింత మంది క్రీడాకారులను తయారు చేయవచ్చు. ప్రతీ జిల్లాలో ఆయా క్రీడలకు సంబంధించిన కోచ్లను ప్రభుత్వం నియమించాలి. 2010 నుంచి కోచ్ల నియామకం నిలిచింది. కాంట్రాక్ట్ పద్ధతిలోనే తీసుకుంటున్నారు. మా పాఠశాల నుంచి ఎనిమిది మంది వరకు నేషనల్ క్రీడాకారులున్నారు. నేషనల్ స్థాయిలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేకున్నా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. పాఠశాలలో నిత్యం ఉదయం 5.30 నుంచి 6.30గంటల వరకు, సెలవు దినాల్లో నాలుగు గంటలపాటు ప్రాక్టీస్ చేయిస్తున్నాం. – మాసవేని వనిత, ఈఎంఆర్ఎస్, కాగజ్నగర్, స్టేట్ లెవెల్ మహిళా విభాగం కోచ్ జాతీయస్థాయికి ఎదిగిన అక్షరమంచిర్యాలఅర్బన్: ఇటీవల ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్బాల్ పోటీల్లో స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న రేగూరి అక్షర మండల స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికై ంది. అక్షర ఫుట్బాల్ అంటే ఆసక్తి చూపడంతో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మొదటిసారి నిర్వహించిన పోటీల్లో మైదానంలోకి అడుగుపెట్టిన అక్షర మండల స్థాయి, జిల్లా, జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా జట్టులో చోటు సాధించింది. నల్గొండ జిల్లాలో అండర్–17లో బాలికల విభాగంలో నిర్వహించిన పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. డిసెంబర్ 18 నుంచి 22వరకు జార్ఖండ్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. బాల్ కొడితే గెలుపే.. ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిజామాబాద్, రామకృష్ణాపూర్, సిద్దిపేటలో నిర్వహించిన అండర్–14 విభాగంలో మొదటి స్థానం సాధించాను. ఒడిశాలో నిర్వహించిన ఈఎంఆర్ఎస్ పరిధిలో నేషనల్ లెవెల్లో పాల్గొన్నాను. ఫుట్బాల్ ఆటలో మరిన్ని మెళకువలు నేర్చుకుని నేషనల్లో ఆడి సత్తా చాటాలనుంది. – రితక పీడీ శిక్షణ ఇవ్వడంతోనే.. నేను ఆరో తరగతిలో పాఠశాలలో చేరాను. ప్రస్తుతం పదోతరగతి చదువుతున్నాను. పీడీ మేడం ప్రతీరోజు ఉదయం, సాయంత్రం కోచింగ్ ఇస్తున్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర, నేషనల్ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఇటీవల కొత్తగూడెంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి, ఒడిశాలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. – అజ్మీర మురళీకృష్ణ ఇండియా తరఫున ఆడాలన్నదే లక్ష్యం పాఠశాల స్థాయి నుంచి జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. అండర్–14 విభాగంలో గతేడాది కొల్లాపూర్లో నిర్వహించిన స్టేట్ లెవెల్ పోటీల్లో ఆడి నేషనల్కు ఎంపికయ్యారు. నవంబర్లో ఒడిశాలో నిర్వహించిన ఎస్జీఎఫ్ పోటీల్లో టీంలో బెస్ట్ ప్లేయర్గా ఆడాను. భారత్ తరఫున ఆడాలన్నదే లక్ష్యం. – ఎలబోయిన అభిలాష్ కొడితే గోల్ పడాల్సిందే ఫుట్బాల్ ఆటలో దిగానంటే బాల్ కొడితే గోల్లో పడాల్సిందే. ఎస్జీఎఫ్, ఖేలో ఇండియా పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి నేషనల్ స్థాయిలో ఆడి గుర్తింపు పొందాను. నేషనల్ స్థాయిలో ఆడుతాను. మా పీడీ చొరవతో ఎంతోమంది నిరుపేద విద్యార్థులు రాణిస్తున్నారు. నాకు కూడా మంచి కోచ్ కావాలని ఉంది. – నిఖిత అందరూ ఆడడం చూసి.. పాఠశాలలో అందరూ ఆడడం చూసి ప్రాక్టీస్ చేసి నేషనల్ స్థాయి ఫుట్బాల్ పోటీల్లో ఆడాను. వనపర్తిలో నిర్వహించిన స్టేట్లెవెల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చాను. రామకృష్ణాపూర్, ఒడిశాలో నిర్వహించిన ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని సత్తా చాటాను. ఇండియా ఫుట్బాల్ జట్టులో ఆడాలన్నదే నా లక్ష్యం. – అజ్మీర హారిక ఉన్నత స్థాయిలో స్థిరపడాలని.. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. పాఠశాలలో సాయంత్రం వేళ నా స్నేహితులు ఫుట్బాల్ ఆడుతుంటే చూసి గతేడాది నుంచి నేనూ గ్రౌండ్కు వెళ్లి శిక్షణ పొందుతున్నాను. గతేడాది వనపర్తిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. నేషనల్ లెవెల్లో అడి ఉన్నతస్థాయిలో స్థిరపడాలని ఉంది. – దీక్షిత ఆర్మీలో చేరి దేశసేవ చేయాలని.. మాది పేద కుటుంబం. ఫుట్బాల్ ఆటల్లో మంచి ప్రతిభ కనబర్చి ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని ఉంది. గతేడాది ఖేలో ఇండియా గేమ్స్లో రామకృష్ణాపూర్లో నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాను. అండర్–14, 17 విభాగంలో ఒడిశాలో నిర్వహించిన ఖేలో ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నాను. – పవార్ అశ్విని రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాను మాది మధ్య తరగతి వ్యవసాయం కుటుంబం. నేను ఆరో తరగతిలో ఏకలవ్య పాఠశాలో చేరాను. అప్పటినుంచి క్రీడలు అంటే చాలా ఇష్టం. దీంతో ఫుట్బాల్ కోచ్ సహకారంతో ఆటలో శిక్షణ పొంది నేషనల్ స్థాయిలో ఆడుతున్నాను. ప్రతీరోజు పాఠశాలలో ఉదయం గంట సాయంత్రం 2గంటల పాటు ప్రాక్టీస్ చేస్తాం. – అల్లం రాణి -
వైద్యసేవలు అందించాలి
రిటైర్డయిన వారిలో అత్యధికులు 60 నుంచి 70 ఏళ్ల వయస్సు పైబడిన వారే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వెల్నెస్ సెంటర్లకు పోతే అక్కడ సరైన వైద్యం అందడం లేదు. ఈ కేంద్రాల్లో నిపుణులైన వైద్యులను నియమించాలి. ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రులన్నింటిలో నగదు రహిత వైద్య సేవలు అందించాలి. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలి. – సాయిరి శశికాంత్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
పత్తి కొనుగోళ్లపై రాష్ట్ర విజిలెన్స్ ఆరా
ఆదిలాబాద్టౌన్: రాష్ట్ర విజిలెన్స్ అధికారులు జిల్లాకేంద్రంలో పత్తి కొనుగోళ్లపై ఆరా తీశారు. స్థానిక మార్కెట్ యార్డులో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. 8 మందితో కూడిన అధికారుల బృందం సభ్యులు సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తున్న పత్తి వివరాలు సేకరించారు. తూకంలో తేడాలను పరిశీ లించారు. రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నా రు. కాంటాలు, సీసీఐ కొనుగోలు చేసిన పత్తి వివరాలు, మార్కెట్ యార్డులో లైసెన్సులు, సీసీ కెమెరాల పనితీరుతో పాటు పింజపొడవు, తేమ శాతం పరిశీలించారు. 1వ కాంటాను పరిశీలించి 5 కిలోల తేడాను గమనించారు. అధికారులను ప్రశ్నించారు. కాంటా బయట ఉండడంతో తేడాలు వస్తాయని అధికారులు తెలిపారు. కిసాన్ యాప్ ఏవిధంగా పనిచేస్తుందని అడిగి తెలుసుకున్నారు. తనిఖీ సమయంలో ఓ పత్తి బండి మార్కెట్ యార్డులో తేమ శా తం తక్కువ ఉండగా, జిన్నింగ్లో ఎక్కువగా రావడంతో సదరు రైతు ఆ బండిని తీసుకొని మార్కెట్ కు వచ్చాడు. అక్కడే ఉన్న అధికారులకు విషయాన్ని తెలియజేశాడు. దీంతో వారు జిన్నింగ్కు వెళ్లి ప రిశీలించారు. జాగృతి నాయకులు వేణుగోపాల్ యాదవ్ రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఫింగర్ప్రింట్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పత్తి, సోయా కొనుగోళ్లకు ఫింగర్ప్రింట్ నిబంధన తొలగించా లని, కుటుంబ సభ్యుల్లో ఎవరైన ఒకరు వచ్చి విక్రయించేలా చర్యలు చేపట్టాలని కోరారు. విజిలెన్స్ అధికారుల్లో అనిల్ కుమార్, దినేష్చంద్ర, వరుణ్ప్రసాద్, ప్రశాంత్రావులు ఉన్నారు. వీరి వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, మార్కెటింగ్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఏవో నగేష్రెడ్డి, రైతులు ఉన్నారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు కీలకనేత
ఆసిఫాబాద్: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బడే చొక్కారావు ఆసిఫాబాద్లో పోలీసులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు సిర్పూర్లో మరో 15మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో 9మంది మహిళలు కాగా ఆరుగురు పురుషులు ఉన్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను పోలీసులు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయుస్టులపై కేంద్రం కన్నెర్రజేసింది. 2026 మార్చి 31లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించడంతో సాయుదబలగాలు వారిపై విరుచుకపడుతున్నాయి. అయితే ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు వదిలారు. అంతేకాకుండా ఆపార్టీ కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీకి చెందిన కీలక నేత బడే చొక్కారావు పోలీసులకు చిక్కడంతో ఆపార్టీకి దెబ్బమీద దెబ్బ తాకినట్లయింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
● మిగిలిన ఆరు మండలాల్లో రేపే ఎన్నికలు ● బీఆర్ఎస్ ఇలాఖాలో ఫలితాలు ఆసక్తికరం ● కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగేనా? ● గులాబీ పార్టీ మార్క్ చూపెట్టేనా ● బీజేపీ ప్రభావం చాటుకునేనా..
సాక్షి,ఆదిలాబాద్: పంచాయతీ సంగ్రామం చివరి దశకు వచ్చింది. మూడో విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు రెండు విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. బీఆర్ఎస్ అధికార పార్టీకి పోటీనిచ్చింది. బీ జేపీ ప్రభావం చాటుకుంది. చివరి విడత ఎన్నికలు బోథ్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కొనసాగనున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా.. నేనా అన్నట్టు పోటీ పడగా, బీజేపీ స్వల్ప స్థానాలతో ప్రభావం చాటుకుంది. గులాబీ ఇలాఖాలో జరుగుతున్న చివరి ఫేజ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తుందా.. బీఆర్ఎస్ ఇక్కడ అధిక స్థానాల్లో గెలుపొంది జిల్లాలో ఆధిపత్యం కొనసాగిస్తుందా.. ఈ రెండు పార్టీలకు బీజేపీ ఏమైనా చెక్ పెడుతుందా.. అనేది రేపటి ఫలితాలతో స్పష్టం కానుంది. స్వతంత్రులపై ఫోకస్.. రెండు విడతల్లో రాజకీయ పార్టీ మద్దతుదారులతో పాటు స్వతంత్రులు కూడా అధిక సంఖ్యలో గెలు పొందారు. గెలిచిన వారిలో 60కి పైగా స్వతంత్ర సర్పంచులు ఉండగా, వారు ఇప్పుడు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. అధి క శాతం ఇండిపెండెంట్లు అధికార కాంగ్రెస్ వైపే వెళ్లే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. మరోవైపు ఆదిలాబాద్ నియోజకవర్గంలో స్వతంత్రులను బీజేపీలో చేర్చుకోవడంపై ఆ పార్టీ ముఖ్య నాయకులు దృష్టి సారించారు. ప్రతిష్టాత్మకంగా.. మూడో విడత ఎన్నికలను కొంత మంది నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ ఇద్దరిదీ నేరడిగొండ మండలం. దీంతో ఈ మండలంలో అత్యధిక సర్పంచ్ స్థానాలను సాధించేందుకు ఇరువురు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అనిల్ జాదవ్ స్వగ్రామం రాజురాలో సర్పంచ్ ఏకగ్రీవం కాగా, గజేందర్ స్వగ్రామం బొందిడిలో ద్విముఖ పోటీ నెలకొంది. బజార్హత్నూర్ మండలంలో కాంగ్రెస్కు అత్యధిక సర్పంచ్ స్థానాలను సాధించేందుకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత మండలంలో ఆయన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికార పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్కు చెందిన మాజీ ఎంపీ సోయం బాపూరావు తన సొంత మండలమైన బోథ్తో పాటు ఈ నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుపొందించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తలమడుగులో కాంగ్రెస్కు చెందిన మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్రెడ్డి అత్యధిక సర్పంచ్ స్థానాలు కై వసం చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మండలంలో గట్టి ప్రభావం చూపడం ద్వారా అధికార పార్టీలో తన సత్తా చాటుకునేలా ముందుకు సాగుతున్నారు. ఇక బీజేపీ ఎంపీ గోడం నగేశ్ తన సొంత మండలం బజార్హత్నూర్తో పాటు బోథ్ నియోజకవర్గంలో పార్టీ పరంగా మద్దతుదారులు అత్యధికంగా గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుడిహత్నూర్ మండలంకు చెందిన కమలం పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ తన సొంత మండలంతో పాటు నియోజకవర్గంలో పార్టీ మద్దదారుల గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు ఏ మేరకు సఫలీకృతమవుతారో వేచి చూడాల్సిందే. మొత్తంగా చివరి విడత ఎన్నికలు పార్టీలపరంగా ఆసక్తికరంగా మారాయి. జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఇలా.. విడత మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ స్వతంత్రులు మొదటి 166 61 59 10 36 రెండో 156 56 30 45 25 మొత్తం 322 117 89 55 61 -
పంచాయతీల అభివృద్ధికి కృషి
ఆదిలాబాద్: కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెప్పించి జిల్లాలోని ఆయా పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రెండో విడత ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన 54 మంది గెలుపొందడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సంబరా లు నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎ న్నికై న సర్పంచ్లను సన్మానించి అభినందనలు తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి, ప్ర జా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఇందులో నాయకులు దయాకర్, సంతోష్, కార్తీక్, సన్నీ, రవి, దినేష్ మటోలియా, లాలా మున్నా, దత్తు పాల్గొన్నారు. -
క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్
ఆదిలాబాద్టౌన్: మహిళలు, యువతుల్లో సర్వేకల్ క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం వ్యాక్సిన్ అందిస్తుందని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సమావేశ మందిరంలో హెచ్పీవీ వ్యాక్సిన్పై వైద్యాధికారులు, సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవనశైలిలో మార్పులు, వివిధ రుగ్మతలతో మహిళలు, యువతులు సర్వేకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. 14 ఏళ్లలోపు బాలికలు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రతీ పీహెచ్సీలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఈనెల 18 నుంచి 31 వరకు కుష్ఠు వ్యాధి గుర్తింపు ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్వో సాధన, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
చాపకింద నీరులా కుష్ఠు
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో కుష్ఠు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. వ్యాధి నిర్మూలనకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. 2027 వరకు కుష్ఠు రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అవగాహన లేమితోనే జనం వ్యాధి బారిన పడుతున్నారు. స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. నిర్ధారణ పరీక్షలు చేసినప్పుడు మాత్రమే కేసులు బయట పడుతున్నా యి. మార్చిలో నిర్వహించిన సర్వేలో కొత్తగా 45 మందిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 56 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంటున్నారు. అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సరైన సమయంలో చికిత్స పొందితే నయం అవుతుందని పేర్కొంటున్నారు. 18 నుంచి సర్వే.. జిల్లాలో ఈనెల 18 నుంచి 31 వరకు 14 రోజుల పాటు కుష్ఠు గుర్తింపు ఉద్యమ కార్యక్రమం నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాలని నిర్ణయించింది. ఉదయం 6.30 నుంచి 9 గంటల వరకు ఆశ కార్యకర్తలు ఈ సర్వే చేపడుతారు. ఇంటింటికి తిరుగుతూ కుటుంబీకుల వివరాలు సేకరిస్తారు. శరీరంపై ఉన్న మచ్చలను గుర్తించి సమీపంలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసేలా చూస్తారు. పట్టణంలో రోజుకు 25, గ్రామీణ ప్రాంతాల్లో 20 ఇళ్లను సర్వే చేపడతారు. పర్యవేక్షణ కోసం 200 మంది సూపర్వైజర్లను నియమించారు. వైద్యాధికారులు, సిబ్బందికి సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తగ్గుముఖం పట్టని వైనం.. ఈ వ్యాధి మైకోబ్యాక్టీరియం లెప్రీయ అనే బ్యాక్టీరియాతో సోకుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాప్తి చెందుతోంది. సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే ఒకరినుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. శరీరంపై ఒకటి నుంచి ఐదు స్పర్శలేని మచ్చలుంటే పాసిబ్యాసెల్లరింగ్ అని పేర్కొంటారు. దీని నివారణకు ఆరు నెలల వరకు చికిత్స అందిస్తారు. ఆరు కంటే ఎక్కువ మచ్చలుండి, నరాలు ఉబ్బితే మల్టీ బ్యాసిలరిగా నిర్ధారిస్తారు. దీని నివారణకు ఏడాఇ వరకు చికిత్స అందిస్తారు. తొలి దశలో వ్యాధిని నిర్ధారించుకొని చికిత్స పొందితే అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చు. శరీరంలో ఎరుపు రంగు, రాగి రంగు మచ్చలు స్పర్శ లేకుండా ఉంటే వ్యాధిగా నిర్ధారిస్తారు. మార్చిలో చేపట్టిన సర్వేలో 45 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించారు. జిల్లాలో 10వేల మందిలో ఒకరికి వ్యాధి సోకితే తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా పరిగణిస్తారు. ప్రస్తుతం బజార్హత్నూర్, సొనాల, తాంసి, గిమ్మ, జైనథ్, పీహెచ్సీల పరిధిలో ఒక శాతం కంటే ఎక్కువగా కేసులు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. సర్వే పకడ్బందీగా చేపడతాం.. కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను పకడ్బందీగా చేపడతాం. ఈనెల 18 నుంచి 31 వరకు ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో 56 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. 2027 నాటికి వ్యాధిని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో సంవత్సరం కేసులు 2022–23 71 2023–24 83 2024–25 73 2025–26 45 (మార్చి నుంచి ఇప్పటివరకు) -
అక్రమ రిజిస్ట్రేషన్ల నియంత్రణకు చర్యలు
కై లాస్నగర్: ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్ల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సోమవారం ఆయ న సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అధికారుల పనితీరు, రిజిస్ట్రేషన్ల వివరాలపై ఆరా తీశారు. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందితో మా ట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ రిజిస్ట్రేషన్లను నియంత్రించేలా నిషేధిత భూముల జాబితా లను రాష్ట్రంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు మూడు రోజుల క్రితం అందజేసినట్లుగా తెలిపారు. రెవెన్యూ, వక్ఫ్బోర్డ్, దేవాదాయ శాఖల నిషేధిత భూముల వివరాలన్నీ అందులో ఉన్నట్లుగా వివరించారు. ఎల్ఆర్ఎస్ అమల్లోకి వచ్చాక అక్రమ రిజిస్ట్రేషన్లు తగ్గాయన్నారు. అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేసి ఇబ్బందుల పాలు కావద్దని సూచించారు. రిజిస్ట్రేషన్లలో జాప్యం కాకుండా స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెచ్చినట్లుగా తెలిపారు. అనధికార లేఔట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తే సబ్రిజిస్ట్రార్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు బాధ్యుడైన ఆదిలాబాద్ సబ్రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్పై వేటు వేసినట్లు స్పష్టం చేశారు. అలాగే రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ల నియామకం, కార్యాలయాల నూతన భవన నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లుగా వివరించారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ జి.ప్రసన్న, సబ్రిజిస్ట్రార్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఇందులో సబ్రిజిస్ట్రార్లు, ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
వంద శాతం పోలింగ్ నమోదు లక్ష్యం
కైలాస్నగర్: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం గూగుల్ మీట్ ద్వారా తుది విడత ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరు మండలాల్లోని ఆయా గ్రామాల్లో వంద శాతం పోలింగ్ సాధించేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఓటర్ స్లిప్ల పంపిణీ వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. వార్డువారీగా ఎలక్ట్రో రల్ జాబితాను బీఎల్ఓల వద్ద ఉంచాలని, సహాయక కేంద్రాల ద్వారా ఓటర్లకు పోలింగ్ కేంద్రం, వార్డు, సీరియల్ నంబర్ వివరాలు అందించాలన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రతీ పోలింగ్ కేంద్రంలో వీల్చైర్లు, ఆటో సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. సమస్యాత్మక పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ సామగ్రిని రిటర్నింగ్, ప్రెసిడింగ్ అధికారులు పూర్తిగా పరిశీలించుకుని కేంద్రాలకు వెళ్లాలన్నారు. పోలింగ్ నమోదు వివరాలను నిర్ణీత సమయంలో టి–పోల్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. సిబ్బందికి భోజనం, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, డీపీవో రమేశ్, ఆర్డీవో స్రవంతి, డీఎల్పీవో ఫణిందర్, మాస్టర్ ట్రైనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జోనల్, సెక్టర్, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
నిర్భయంగా ఓటేయండి
తలమడుగు: ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హ క్కు వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. మండలంలోని సుంకిడి, తలమడుగు, బరంపూర్, కజర్ల, దేవాపూర్ గ్రామాల్లో సోమవారం ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. పంచాయతీ ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు విడతల్లో 140 మందిపై 60 కేసులు నమో దు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో రూరల్ సీఐ కె ఫణిదర్, ఎస్సైలు రాధిక, జీవన్రెడ్డి, సిబ్బంది తదితరులున్నారు. గుడిహత్నూర్: ఎన్నికల నిబంధనలు పాటిస్తూ నిర్భయంగా ఓటేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం సా యంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇందులో ఏఎస్పీ కాజల్ సింగ్, సీఐ రమేశ్, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. నేరడిగొండ: మండలకేంద్రంతో పాటు వడూర్, బుగ్గారం(బి), కొరిటికల్(బి)లలోని సమస్యాత్మ క పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ప్ర లోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్, ఎస్సై ఇమ్రాన్, సిబ్బంది ఉన్నారు. -
ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
ఆదిలాబాద్టౌన్: లేబర్కోడ్ల రద్దు కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. యూనియన్ 18వ మహాసభల సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో కార్మిక పోరాట పతాక జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలంటే ఐక్య పోరాటాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న అఖిల భారత మహాసభల్లో దేశ నలు మూలల నుంచి కార్మిక ప్రతినిధులు పాల్గొని కార్మిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చిస్తారని తెలిపారు. ఈ మహాసభలను వి జయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆశన్న, నాయకులు స్వా మి, నవీన్కుమార్, మల్లేశ్, దేవిదాస్, సురేందర్, దత్తాత్రి, మంజుల, గంగారాం, ఆశన్న, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉపసర్పంచ్ ఎన్నికపై డీపీవోకు ఫిర్యాదు
కై లాస్నగర్: తమ గ్రామ ఉపసర్పంచ్ ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని తాంసి మండలంలోని కప్పర్ల పంచాయతీ వార్డుమెంబర్లు ఆరోపించారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన పలువురు వార్డుమెంబర్లు సోమవారం డీపీవో రమేశ్ను ఆయన కార్యాలయంలో కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. గ్రామంలో 12 వార్డులుండగా ఉపసర్పంచ్గా గెలిచిన అభ్యర్థికి కేవలం ఐదుగురు సభ్యుల మద్దతు మాత్రమే ఉందన్నారు. మిగతా ఏడుగురు సభ్యుల ప్రమేయం లేకుండా ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించారని ఆరోపించారు. వార్డు మెంబర్లందరి సమక్షంలోనే ఉపసర్పంచ్ ఎన్నిక జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము ప్రమాణస్వీకారం చేయమని, అవసరమైతే మూకుమ్మడి రాజీనామా చేస్తామని తెలిపారు. డీపీవోను కలిసిన వారిలో వార్డు సభ్యులు సంగీత, అర్చన, వనిత, అనసూయ, షేక్ లతీఫ్, రమేశ్, శ్రీకాంత్ ఉన్నారు. -
నాడు ఎంపీటీసీలు.. నేడు సర్పంచులు
నిర్మల్ జిల్లా: పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎంపీటీసీలు సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. దహెగాం పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సభ్యురాలు రాపర్తి జయలక్ష్మి బీజేపీ మద్దతుతో బరిలో నిలిచి సమీప అభ్యర్థి తుమ్మిడె మల్లీశ్వరిపై 242 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందారు. మండలంలోని ఇట్యాల పంచాయతీ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా గజ్జెల జయలక్ష్మి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి బీఆర్ఎస్ మద్దతుదారు పొన్న కళావతిపై 109 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలిచారు. ముత్యాల కుటుంబానికి మూడోసారి..లోకేశ్వరం: మండలంలోని బాగాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా ముత్యాల శ్రీవేద ఒకే ఓటుతో ఎన్నికల్లో విజయం సాధించింది. 1972లో లోకేశ్వరం, నగర్, భాగాపూర్ గ్రామాలకు ఆమె తాత ముత్యాల నారాయణ్రెడ్డి సర్పంచ్గా ఐదేళ్ల పాటు పని చేశారు. నారాయణ్రెడ్డి చిన్న కోడలు ముత్యాల రజిత 2013లో సర్పంచ్గా గెలుపొందారు. 2018లో డీఎస్సీలో రజిత స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం ముధోల్ మండలం ఎడ్బిడ్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. ఇప్పుడు బీటెక్ చదివిన శ్రీవేద గెలుపుతో ముత్యాల కుటుంబానికి మూడోసారి సర్పంచ్ పదవి దక్కినట్లయింది. -
తొలి ఓటు.. సంబురం
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025బేల మండలం మసాల(కె) గ్రామంలో ఓటరు చేతివేలికి సిరా చుక్క పెడుతున్న సిబ్బందిఓటు వేయడానికి అంధురాలైన తన అత్తను తీసుకొస్తున్న కోడలు బేలలోని పోలింగ్ కేంద్రంలో క్యూలో ఓటర్లు20న కొలువుదీరనున్న కొత్త పంచాయతీ పాలకవర్గాలుకైలాస్నగర్: పంచాయతీ ఎన్నికలు మూడు వి డతల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొ దటి, రెండో విడత ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా తుది విడత ఎన్నికలు ఈ నెల 17న నిర్వహించనున్నారు. ఈ మూడు విడతల్లో ఎన్నికై న పంచాయతీ పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసేలా తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గెజిట్ విడుదల చేసింది. ఈమేరకు ఆ శాఖ డైరెక్టర్ జి.శ్రీజన ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20న ఆదిలాబాద్ జిల్లాలోని 473 గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అదే రోజున సర్పంచ్లు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరు మండలాల్లో నిషేధాజ్ఞలు అమలుకై లాస్నగర్: మూడో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న బోథ్, సొనాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపా రు. అభ్యర్థులు ఈ నెల 15న సాయంత్రం 5 గంటల్లోపు ప్రచారం ముగించాలని పేర్కొన్నా రు. తర్వాత నుంచి నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నందున ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు. ప్రచారం ముగిసిన వెంటనే మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూసివేయాలని తెలిపారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ప్రజ లు సహకరించాలని కోరారు. కోడ్ ఉల్లంఘనపై 27 కేసులుకై లాస్నగర్: జిల్లాలోని ఎనిమిది మండలాల్లో జరిగిన గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నిక ల సందర్భంగా కోడ్ ఉల్లంఘనపై 27 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలిపారు. భీంపూర్లో ఒకటి, ఆదిలా బాద్ రూరల్లో 8, మావలలో 2, తాంసిలో 3, బేలలో 4, జైనథ్లో 9 కేసుల చొప్పున ఆరు పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తు న్న పోలీసులకు అడ్డుపడిన, నియమావళిని ఉ ల్లంఘించిన,మద్యం, బహుమతులు పంపిణీ చేస్తూ, ఎన్నికల ప్రచారం పర్వం ముగిశాక ప్ర చారం చేసిన 66 మందిపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. పల్లె తొలిపౌరుడిని ఎన్నుకునేందుకు యువత ఆసక్తి చూపింది. స్థానికంగా ఉన్న వారితో పాటు దేశ, విదేశాల్లో ఉన్న వారు కూడా సొంతూరుకు విచ్చేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారిగా ఓటు వేసి సంబురపడ్డారు. మనోగతం వారి మాటల్లోనే.. –తాంసి -
వలస ఓటర్లకు గాలం
నేరడిగొండ: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానుంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఏ చిన్న అవకాశాం వదులుకోవడం లేదు. గెలుపుకోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా వలస ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఎలాగైనా పోలింగ్ రోజు రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడెక్కడా ఉన్నారో వివరాలు సేకరించి ఫోన్లు చేస్తూ ఓటు వేసుందుకు రావాలని కోరుతున్నారు. కొంత మంది స్వయంగా కలిసి ఎన్నికల్లో ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రయాణ ఖర్చులు భరిస్తామని, ఓటుకు కొంత మొత్తం ముట్టజెబుతామని బేరసారాలు సాగిస్తున్నారు. ఓటర్లంతా ఒకే దగ్గర ఉంటే వాహనాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. సర్పంచ్కు నీఇష్టం..వార్డుకు మాత్రం నాకే ఓటెయ్ మూడో విడత ప్రచారం జోరందుకుంది. మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ బలపరిచే సర్పంచ్ అ భ్యర్థులు గెలుపే లక్ష్యంగా పార్టీ మద్దతుదారులైన వార్డు సభ్యులకు కొంతమేర ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కాగా గ్రామాల్లో ఓటర్లు వార్డు సభ్యుల అభ్యర్థులకు అనుకూలంగా ఉండి, సర్పంచ్ అభ్యర్థిపై నిరుత్సాహంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వార్డు సభ్యుల అభ్యర్థులు, సర్పంచ్కి నీయిష్టం.. వార్డులో నాకు తప్పనిసరిగా ఓటు వేయ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో చాలా వరకు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. -
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
జిల్లాలో రెండో విడత నమోదైన పోలింగ్ శాతం వివరాలు.. మండలం ఎన్నికలైన మొత్తం పోలైన పురుషులు మహిళలు పోలింగ్ ఆదిలాబాద్రూరల్ 27 26925 23393 11601 11792 86.88 బేల 30 27071 22970 11737 11233 84.85 భీంపూర్ 21 17831 15135 7427 7708 84.88 భోరజ్ 16 14414 12868 6398 6470 89.27 జైనథ్ 16 19145 16791 8342 8449 88.21 మావల 03 4386 3700 1788 1912 84.36 సాత్నాల 15 9896 8685 4353 4332 87.76 తాంసి 11 12880 11260 5527 5733 87.4220.05 58.00 83.96 19.63 59.09 82.66 24.93 59.99 81.16 23.60 55.49 87.09 19.42 56.45 85.87 16.46 53.06 77.43 28.00 63.46 85.85 24.26 57.30 83.38 పోలింగ్ శాతం సరళి ఇలా..పల్లె చైతన్యం వెల్లివిరిసింది. జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గ్రామ ప్రథమ పౌరులతో పాటు వార్డుమెంబర్లు ఎన్నికయ్యారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించగా.. అనంతరం కౌంటింగ్ చేపట్టారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. హోరా హోరీ పోరులో విజేతలుగా నిలిచిన వారి సంబురం అంబురాన్నంటింది. అనంతరం ఉపసర్పంచ్ల ఎన్నిక తంతును అధికారులు పూర్తి చేశారు. – కై లాస్నగర్ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్రూరల్, బేల, భోరజ్, సాత్నాల, జైనథ్, మావల, బోథ్ నియోజకవర్గంలోని తాంసి, భీంపూర్ మండలా ల్లోని 139 పంచాయతీలు, 1,146 వార్డుస్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరిగాయి. పల్లె ఓటర్లు వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. నిర్ణీత సమయం లోపు క్యూలో ఉన్న వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. యువతతో పాటు మహిళలు, పురుషులు, వృద్ధులు స్వచ్ఛందంగా కేంద్రాల కు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నా రు. మొత్తంగా ఈ విడతలో 86.68 పోలింగ్ శాతం నమోదైంది. ఆదిలాబాద్ రూరల్, భీంపూర్, మావ ల మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లు పరిశీలించా రు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నెమ్మదిగా మొదలై.. తర్వాత పుంజుకుని ఆయా మండలాల పరిధిలో మొత్తం 1,32,438 మంది ఓటర్లు ఉండగా, 1,14,802 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 64,577 మంది పురుష ఓటర్లకు గాను 57,173 మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 67,861 మందికి గాను 57,629 మంది ఓటు వేశారు. చలి తీవ్రత కారణంగా తొలుత పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఉదయం 7నుంచి 9గంటల వరకు కేవలం 21.80 శాతం మాత్రమే నమోదైంది. క్రమేణ పుంజుకుంది. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా కదలివచ్చారు. వృద్ధులు, దివ్యాంగులను కుటుంబీకులు ఆటోలు, ఇతర వాహనాల్లో తీసుకువచ్చి ఓటు వేయించారు. వారికి కేంద్రాల్లో వీల్చైర్ సౌకర్యం కల్పించారు. 9గంటల తర్వాత అన్ని చోట్ల ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 11 గంటల వరకు 58.17 శాతం నమోదైంది. పోలింగ్ ముగిసే నిర్ణీత సమయం ఒంటి గంట వరకు 83.80 శాతం నమోదైంది. అప్పటికే పలు చోట్ల క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో మధ్యాహ్నం 3గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. చివరకు 86.68 శాతం నమోదైంది. ప్రతి రెండు గంటలకోసారి అధికారికంగా పోలింగ్ సరళిని ప్రకటించారు. రాత్రి వరకు సాగిన లెక్కింపు..మావల, ఆదిలాబాద్ రూరల్, సాత్నాల, బేల, భోరజ్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియపై ఆరా తీశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ తీరును పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రి య చేపట్టారు. తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. తర్వాత స ర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఈ ప్రక్రి య రాత్రి వరకు కొనసాగింది. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడయ్యాయి. మిగతా చోట్ల ఆలస్యమయ్యాయి. గెలుపొందిన సర్పంచులు తమ అనుచరులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. -
మలి విడతలోనూ ‘హస్తం’ జోరు
కై లాస్నగర్: జిల్లాలో నిర్వహించిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ విడతలో 139 సర్పంచ్, 1,146 వార్డుమెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మె జార్టీ స్థానాల్లోనూ హస్తం పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. పలు చోట్ల అధికార కాంగ్రెస్, బీజేపీలు బలపర్చిన అభ్యర్థుల నడుమ నువ్వా నే నా అన్నట్లుగా పోటీ సాగింది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు పోటీ పడ్డారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆరు మండలా లు, బోథ్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఎన్నికలు జరగ్గా బీజేపీ స్థానికంగా తన బలాన్ని చాటుకుంది. అధికార కాంగ్రెస్కు గట్టిపోటీనిచ్చి రెండో స్థానానికి ఎగబాకింది. పలుచోట్ల ఉత్కంఠ భరితంగా సాగిన లెక్కింపులో జయాపజయాలు పదుల సంఖ్యల ఓట్లతో దోబూచులాడాయి. కొన్ని చోట్ల రెండు, మూడు ఓట్ల తేడాతోనూ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి మొత్తంగా కాంగ్రెస్ 56 సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోగా, బీఆర్ఎస్ 30 చోట్ల విజయం సాధించింది. బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబా ద్ నియోజకవర్గంలో ఆ పార్టీ బలం పుంజుకుంది. కమలం పార్టీ మద్దతుదారులు 45 మంది గెలుపొందారు. స్వతంత్రులు సైతం మూడు పార్టీలకు గట్టి పోటీనిచ్చారు. 25మంది ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. సర్పంచ్ల ఫలితాల ను అధికారికంగా ప్రకటించిన అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా పంచాయతీల్లో ఉ ప సర్పంచ్ల ఎన్నిక నిర్వహించారు. గెలుపొందిన సర్పంచ్లు, వార్డుమెంబర్లకు ఆర్వోలు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అభిమాన నాయకులు గెలుపొందడంతో అనుచరులు టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. పూ లమాలలతో సత్కరించారు.ఆయా మండలాల్లో పార్టీల మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ల వివరాలు.. మండలం ఎన్నికలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు ఆదిలాబాద్రూరల్ 31 09 02 11 09 బేల 31 13 08 08 02 జైనథ్ 17 07 02 05 03 సాత్నాల 17 04 04 09 00 భోరజ్ 17 04 03 04 06 మావల 03 01 00 01 01 భీంపూర్ 26 12 07 04 03 తాంసి 14 06 04 03 01ప్రముఖుల సొంతూళ్లలో.. సాక్షి,ఆదిలాబాద్: రెండో విడత ఎన్నికల్లో ఆదిలా బాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వగ్రామం జైనథ్ మండలం అడలో బీజేపీ కి చెందిన కుర్సంగే నిర్మ ల ఏకగ్రీవం అయ్యారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు జోగు రామన్న స్వగ్రామమైన జైనథ్ మండలం దీపాయిగూడలో బీఆర్ఎస్కు చెందిన మౌనిషా రెడ్డి గెలుపొందారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి స్వగ్రామమైన వడూర్లో అన్ని పార్టీలు బలపర్చిన దత్తు యాదవ్ విజేతగా నిలిచారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి వేళలో చలితీవ్రత పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూశా.. సాత్నాల: ఎన్నికల్లో ఓటు వేయాలని ఎంతో కాలంగా ఆత్రుతగా ఎదురుచూశాను. ఈ సారి అవకాశం వచ్చింది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నా. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని గుర్తించాను. ఇక ప్రతీ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకుంటా. – బావునే స్వేచ్ఛ, గిమ్మ, భోరజ్ (మం) -
పెద్దమ్మా.. ‘గుర్తు’ంచుకో
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి వేళలతో చలి తీవ్రత పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. సమయం : శనివారం సాయంత్రం 6 గంటలు.. ‘అవ్వా.. బాపు ఉన్నాడా.. ఏం చేస్తున్నారు..’ అంటూ గేటు తీసుకుంటూ ఐదారుగురితో కలిసి లోనికి వచ్చాడు ఓ సర్పంచ్ అభ్యర్థి. అయ్యో నువ్వా బిడ్డా.. రా.. రా.. కూర్చో.. ఇప్పుడే బాయి కాడికి పోయి వచ్చినం.. బాబాయ్కి కుర్చీ ఇవ్వు అంటూ మనుమనితో అనంగనే.. టైమ్ లేదు పెద్దమ్మ.. రేపే కదా పోలింగ్.. చివరగా అందరినీ కలుస్తున్న.. మన గుర్తు మర్చిపోవద్దు.. అంటూ చేతిలో ఉన్న ఓటరు జాబితా తీసి మనింట్ల ఐదో ట్లు ఉన్నయ్ కదా.. అని టిక్ మార్కు పెట్టుకున్నడు.. వెంటనే వెనకాల బ్యాగ్ పట్టుకొని ఉన్న వ్యక్తి రూ.500 నోట్లు పది ఇచ్చిండు.. మాకెందుకు బిడ్డా పైసలు.. మేము దూరపోల్లమా.. అంటూనే రూ.5వేలు తీసుకొని నువ్వు మల్లమల్ల చెప్పాల్నా.. మాయి పక్కా నీకే బిడ్డా.. అంది. అది కాదు పెద్దమ్మ ఆపోసిటోళ్లు కూడా వస్తరు.. వాళ్లిచ్చినా తీసుకోండి.. కానీ ఓటు మనకే పడా లే.. అన్న అభ్యర్థి మాటలు పూర్తి కాకుండా నే.. నువ్వు ఉండంగ వేరే వాళ్లకు ఎట్లేత్తం బిడ్డా.. వాళ్లు పది వెలిచ్చినా ఎయ్యం.. నువ్వు మనోనివి.. ఆపద.. సంపదకి వచ్చేటోనివి.. నిన్న కోడలు కూడా ఇంటికొచ్చి బొట్టు పెట్టి చెప్పింది.. అని చెప్పంగనే.. గట్లనే పెద్దమ్మ యాది మరువద్దు.. మీ అందరి దీవెనలు ఉండాలె.. తమ్ముడు.. మరదలు.. చిన్నోడు.. బాపు.. నువ్వు అంతా కలిసి ఎగిలి వారంగనే వచ్చి ఓటేయండి. మనోళ్లందరికీ చెప్పండి.. గుర్తు మరిచిపోవద్దు.. మళ్లా కొడుకు రాలేదనుకోవద్దు.. ఇప్పటికే లేట్ అయింది.. పంచుడు మన కానుంచే మొదలు పెట్టిన.. ఇంకా పది వార్డులున్నయ్.. యూత్ పిలగన్లకు దావత్ నడుస్తంది.. తమ్ముడు ఆడనే ఉన్నడు.. ఈ ఒక్క రాత్రి జాగారమే.. మరిచిపోకు పెద్దమ్మ.. బాపు పోయస్తనే.. అనగానే బైక్పై ఉన్న బాక్స్లో నుంచి ఓ వ్యక్తి క్వాటర్.. లీటర్ థంసప్ బాటిల్ ఇయ్యంగనే పెద్దాయన మొఖం ఎలిగిపోయింది.. అన్నకు జై.. గుర్తూ గుర్తుంచుకో.. అంటూ వచ్చిన వాళ్లు జై కొడుతూ వెళ్లిపోయారు. ఇలా చివరి రోజు అభ్యర్థుల ప్రచార పర్వం సాగింది. మద్యం, డబ్బు, విందులతో పల్లె పండుగ చేసుకుంది. – సాక్షి, ఆదిలాబాద్ డెస్క్ -
పట్టాలెక్కనున్న ఆశల రైలు
నిర్మల్: ఈ ప్రాంతప్రజల ఆశల రైలు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ..!? అన్న ప్రజల ఆకాంక్షలను ప్రజాప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ ఒత్తిడి పెంచుతున్నా రు. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ ప్రాంతంలోని దాదాపు ఏడు లక్షల మంది జనాభాతోపాటు, దే శంలోని రెండు మహానగరాలైన హైదరాబాద్, నాగ్పూర్ మధ్య అనుసంధానానికి రైల్వేలైన్ నిర్మాణం వేగవంతం చేయాలంటూ ఇటీవలే రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి కోరారు. లోక్సభ సమావేశాల్లో రైల్వేలైన్ గురించి చర్చించడంతోపా టు తాజాగా శనివారం రైల్వేశాఖమంత్రి అశ్వినీవైష్ణవ్ను ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ కలిశారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు ప్రతిపాదించిన రైల్వేలైన్కు సంబంధించిన డీపీఆర్ రైల్వేశాఖకు చేరిందని, దీన్ని త్వరగా ఆమోదించి లైన్నిర్మాణం చేపట్టాలని మరోసారి విన్నవించారు. రూ.4,300 కోట్ల అంచనా.. పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ లైన్ వేస్తామంటూ ప్రజలను గందరగోళానికి గురిచేయకుండా, కేవలం ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు లైన్ నిర్మిస్తే సరిపోతుందని ఎంపీ నగేశ్ మరోమారు రైల్వేమంత్రికి వివరించారు. గతంలోనూ ఈమేరకే చేసిన వినతిప్రకారం దక్షిణమధ్య రైల్వే 136.50 కిలోమీటర్ల ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లైన్ ని ర్మాణానికి రూ.4,300 కోట్ల అంచనాతో డీపీఆర్ పూ ర్తిచేసింది. సోన్వద్ద గోదావరిపై బ్రిడ్జితోపాటు ఘా ట్రోడ్లలో ఎనిమిది చోట్ల టన్నెళ్ల నిర్మాణాలు చే పట్టాలని ఇందులో పేర్కొన్నారు. ఈ నివేదిక ఇప్పటికే రైల్వేశాఖకు చేరిందని, దీన్ని త్వరగా ఆమోదించేలా చూడాలని ఎంపీ నగేశ్ మంత్రిని కోరారు. రైల్వేబోర్డు గ్రీన్సిగ్నల్ ఇస్తే.. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) పూర్తయినా మరో రెండు దశలు పూర్తయితేనే రైల్వేలైన్కు గ్రీన్సిగ్నల్ లభిస్తుంది. ప్రస్తుతం ఒక అడుగు ముందుకు పడింది. ఈ డీపీఆర్ను రైల్వేబోర్డు ఆమోదించి, ఆర్థికశాఖ క్లియరెన్స్ కోసం పంపిస్తే సరిపోతుంది. రైల్వేబోర్డు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఒప్పుకుంటే దాదాపు నిర్మల్ మీదుగా రైల్వేలైన్కు పచ్చజెండా ఊపినట్లే. ఆయా ప్రక్రియలను త్వరగా పూర్తిచేసి, ప్రజల ఆకాంక్ష మేరకు లైన్ నిర్మాణం చేపట్టాలని మరోమారు రైల్వేమంత్రిని కోరినట్లు ఎంపీ నగేశ్ ‘సాక్షి’కి తెలిపారు. త్వరగా పనులు ప్రారంభించాలని.. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ పూర్తయింది. మిగితా ప్రకియలనూ త్వరగా పూర్తిచేసి లైన్ నిర్మాణ పనులు ప్రారంభించాలని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ను కోరాం. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. –గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ ప్రతిపాదిత రైల్వేలైన్ వివరాలు.. రైల్వేలైన్ : ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ లబ్ధిపొందే డివిజన్లు : ఆర్మూర్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, ఆదిలాబాద్ లబ్ధిపొందే ప్రజలు : దాదాపు 7లక్షలు లైన్ నిర్మాణ అంచనా : రూ.4,300 కోట్లు లైన్ నిర్మాణ దూరం : 136.50 కిలోమీటర్లు -
నిఘా నీడన గ్రామాలు
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకం. పోలీసుల సూచనతో ఆయా గ్రామాల్లో వీటి ఏర్పాటుకు పల్లెజనం ముందుకు వస్తున్నారు. ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ప్రశాంతంగా ‘నవోదయ’ ప్రవేశ పరీక్షకై లాస్నగర్: జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్లోని ఐదు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్, మావలలోని చావర అకాడమీ ఉన్నత పాఠశాల, బోథ్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఉట్నూర్లోని పూలా జీబాబా ఏ, బీ కేంద్రాల్లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష కొనసాగింది. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు.1291 మందికి గాను 942 మంది హాజరైనట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. కై లాస్నగర్: జిల్లాలో రెండో విడత పల్లె సమరానికి సర్వం సిద్ధమైంది. ఈమేరకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎనిమిది మండలాల్లో 156 పంచాయతీలు, 1,260 వార్డులుండగా అందులో 17 సర్పంచ్, 114 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 139 సర్పంచ్, 1,146 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో సర్పంచ్ పదవుల కోసం 520మంది బరిలో నిలువగా వార్డుమెంబర్ స్థానాలకు 2,496 మంది పోటీ పడుతున్నారు. వీరి భవితవ్యాన్ని 1,32,438 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,146 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,375 మంది పీవోలు, 1509 మంది ఓపీవోలను నియమించారు. ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతీ పోలింగ్ కేంద్రానికో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారిని నియమించారు. పోలింగ్ ప్రారంభం నుంచి ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహణ వరకు జరిగే ప్రక్రియను వీరే పర్యవేక్షించనున్నారు. నాలు గు, ఐదు పోలింగ్ కేంద్రాలను కలిపి ఒక జోనల్ ఆఫీసర్ చొప్పున 34 మందిని నియమించా రు. మొత్తం పోలింగ్ కేంద్రాలను 36రూ ట్లుగావిభజించి ఒక్కో రూట్కు ఓ రూట్ ఆఫీ సర్ను నియమించారు. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ .. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. నిర్దేశిత సమయంలోపు కేంద్రాలకు వచ్చిన ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ ముగిశాక గంట పాటు భోజన విరామం ఉంటుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపడుతారు. ప్రతీ రెండు గంటలకోసారి పోలింగ్ సరళిని ప్రకటిస్తారు. సర్పంచ్ అభ్యర్థులకు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్, వార్డుమెంబర్ అభ్యర్థులకు వైట్కలర్ బ్యాలట్ అందిస్తారు. ప్రతీపోలింగ్ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్ను ఏర్పాటు చేస్తారు. సర్పంచ్, వార్డుమెంబర్లకు సంబంధించిన రెండు ఓట్లు ఇదే బాక్స్లో వేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ ము గిసి ఫలితాలు ప్రకటించిన తర్వాత ఉపసర్పంచ్ ఎన్నికను చేపడుతారు. ఆయా మండలాల్లోని ఓట ర్లకు ఇప్పటికే బీఎల్వోల ద్వారా ఫొటోలతో కూడి న ఓటరు పోల్ చీటీలను పంపిణీ చేశారు. సమస్యాత్మక కేంద్రాలపై నిఘా ఆయా మండలాల పరిధిలోని 36 లోకేషన్స్లో గల 65 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా తగు చర్యలు చేపట్టారు. 17 లోకేషన్స్లోని 33 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేయగా, 19 లోకేషన్స్లోని 32 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా అధికారులు పోలింగ్ సరళిని పర్యవేక్షించేలా అనుసంధానం చేశారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్న సిబ్బంది శనివా రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకుని ప్రత్యేక వాహనాల్లో బందోబస్తు నడుమ తరలివెళ్లారు. ఆదిలాబాద్ రూరల్, బేల, జైనథ్ మండల కేంద్రాల్లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బంది, పోలీసులకు పలు సూచనలు చేశారు. మొక్కజొన్న కొనుగోళ్లు క్లోజ్ జిల్లాలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అధికారులు మూసివేశారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలిపకడ్బందీ ఏర్పాట్లు ఆదిలాబాద్రూరల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ రూరల్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎన్నికల విధులకు హాజరు కానున్న పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం పలు సూచనలు చేశారు. ఎని మిది మండలాల్లో నిర్వహించనున్న ఎన్నికలకు 962 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా రు. జిల్లాలో ఇప్పటికే 598 మందిని బైండోవర్ చేశామని, అలాగే 20 మంది నుంచి ఆయుధాలను సేఫ్ డిపాజిట్ కింద తీసుకున్నట్లు తెలిపా రు. ముగ్గురు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 ఎస్సైలతో పాటు మహిళా సిబ్బంది, హోంగార్డ్స్, రిజర్వ్, సాయుధ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలతో బందోబస్తు ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై విష్ణువర్ధన్, తదితరులున్నారు. మండలం ఎన్నికలు జరిగే బరిలో నిలిచిన పోలింగ్ ఓటర్లు పంచాయతీలు అభ్యర్థులు కేంద్రాలు ఆదిలాబాద్ రూరల్ 27 98 228 26,925 బేల 30 103 246 27,071 భీంపూర్ 21 74 168 17,831 భోరజ్ 16 60 130 14,414 జైనథ్ 16 60 136 19,035 మావల 3 11 28 4,386 సాత్నాల 15 54 116 9,896 తాంసి 11 60 34 12,880సాత్నాల: ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈమేరకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. సిబ్బందికి ప లు సూచనలు చేశారు. ఇందులో ఏపీడీ కు టుంబరావు, తహసీల్దార్ జాదవ్ రామారావు, ఎంపీడీవో వెంకట్ రాజు, తదితరులున్నారు. -
ఓటమి.. నైరాశ్యం
సాక్షి, ఆదిలాబాద్: ఇటీవల ఇంద్రవెల్లిలో ఓ వార్డు సభ్యుడిగా పోటీ చేసిన యువ సామాజిక కార్యకర్త ఓటమిపాలయ్యాడు. తన అంచనాల ప్రకారం గెలు పు ఖాయమనుకున్నాడు. అనుకున్నదొకటైతే.. అ య్యింది మరొకటి అన్నట్లు పరాజయం తలుపుతట్టింది. ఎందుకిలా జరిగిందని లెక్కలు వేశాడు. ఎ క్కడ ఓట్లు చేజారాయనే సమీకరణలు తీశాడు. ఒకవేళ ఆ ఓట్లు పడి ఉంటే తన గెలుపు ఖాయమని అనుకున్నాడు. తనకు వారు ఓటు వేయలేదని నిర్ధారించుకున్నాడు. విషయాన్ని జీర్ణించుకోలేకపోయా డు. నా ఓటమికి నువ్వే కారణమంటూ నేరుగా వేలెత్తి చూపాడు. మొదటి విడత పంచాయతీ ఫలితాలు వెలువడిన తర్వాత ఇంద్రవెల్లిలో జరిగిన ఈ ఘట న ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఔరా అనుకునే పరిస్థితి తలెత్తింది. ఓటమి చెందిన చోటే గెలుపును వెతుక్కోవాలంటారు.. ఇది ఏ రంగానికై నా వర్తిస్తుందని పెద్దలు చెబుతుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన యువత తొలిసారి పరాజయం చవిచూస్తే ఓర్పు ప్రదర్శించాలి తప్ప నిరాశకు గురికావద్దు. విజయం దిశగా మరో ప్రయత్నం చేయాలి. అంతేకానీ ఇతరులను నిందించడం సరికాదు. ఇంద్రవెల్లిలో జరిగిన ఘట న ఓటర్లను విస్తుపోయేలా చేసింది. ఆ వార్డులో ఓ సామాజికవర్గం వారు అధిక సంఖ్యలో ఉండటం, గెలిచిన వ్యక్తి అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఓటమి చెందిన అతడికి సందేహాలు తలెత్తాయి. ఆ సామాజికవర్గం వ్యక్తులు తనకు ఓటు వేయలేదని అనుమానించాడు. ఇంకేముంది ఆ వర్గానికి చెందిన పెద్దను ఫోన్లో దూషించాడు. ఈ పరిణామాన్ని ఊహించని ఆ పెద్ద తన అనుచరులతో కలిసి శనివారం మార్కెట్ బంద్ చేయించి నిరసన తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ఇది హాట్టాపిక్గా మారింది. ఓడిపోతే ఇలా అంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంకెన్నెన్నో .. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యా యి. ఫలితాలు వచ్చాయి. సర్పంచ్లు ఎవరనేది తేలిపోయింది. ఉప సర్పంచ్ల ఎన్నిక కూడా జరి గిపోయింది. పార్టీల బలాబలాలు స్పష్టమయ్యా యి. ఓటమి చెందిన వారు మాత్రం తాము ఖర్చు చేసిన డబ్బులకు సంబంధించి లెక్కలు కడుతున్నా రు. ఎక్కడెక్కడైతే డబ్బులు పంచారో ఆ ఓట్లు పడ్డా యా లేదా అనే సమీకరణాలు వేసుకుంటున్నారు. కొంతమంది ఈ ఎన్నికల ద్వారా ఆర్థికంగా చతికిలపడ్డారు. అయినప్పటికీ పలువురు ఓర్పు ప్రదర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు రెండో విడత, ఈనెల 17న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి చిత్రవిచిత్రాలు ఇంకెన్ని చోటు చేసుకుంటాయో చూడాల్సిందే. -
వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు
కై లాస్నగర్: జిల్లాలో కొంతమంది తన పేరిట దుకాణాల నుంచి శాంపిల్స్ సేకరించి యజ మానులను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని మార్వాడీ ధర్మశాలలో ‘సురక్షిత ఆహారం–ఆరోగ్యం’ అంశంపై హోట ళ్లు, బేకరీలు, కిరాణ, స్వీట్మార్ట్ యజ మానులు, వినియోగదారులతో శనివారం అవగాహ న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. సురక్షిత ఆహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆహార పదార్థాల తయారీలో నిషేధిత రంగులు వాడకూడదన్నారు. ఇందులో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దినేష్ మాటోలియా, కందుల రవీందర్, కోశాధికారి మనోహర్ కుపాట్, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆ పంచాయతీలు.. చాలా హాట్ గురూ!
కై లాస్నగర్: జిల్లాలోని పెన్గంగ పరీవాహక ప్రాంతంతో పాటు పలు మండల కేంద్రాలు, పట్టణాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఖరీదైనవిగా మారాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే రాజకీయ పలుకబడితో ఇసుక, రియల్ దందాలను శాసించే అధికారం వస్తోందనే భావనతో పలువురు బరిలోకి దిగారు. రూ. లక్షల్లో అక్రమ ఆదాయం సమకూరే అవకాశముండటంతో సర్పంచ్, వార్డుమెంబర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. పదవీ ద క్కితే ఐదేళ్ల పాటు తిరుగుండదు. ఆదాయానికి కొదవుండదు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. రూ.లక్షలు గుమ్మరిస్తున్నారు. మద్యాన్ని గ్రామాల్లో ఏరులుగా పారిస్తున్నారు. పోటాపోటీగా కుల సంఘాలతో ఒప్పందాలు, యువకులకు దావత్లు, ఇంటింటా డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ పోల్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేపడుతున్నారు. అక్రమ దందాలతో ఆదాయం.. పెన్గంగ నది పరీవాహకంలోని భీంపూర్, బేల, జైనథ్, భోరజ్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఇసు క దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆయా గ్రామాల్లో పేరుకుపోయిన ఇసుక నిల్వలకు వీడీసీల ఆధ్వర్యంలో వేలం నిర్వహిస్తున్నారు. ఇసుక లభ్యత ప్ర కారం ఒక్కో గ్రామంలోని నిల్వలకు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు వేలం ద్వారా అప్పగిస్తున్నారు. ఈ వ్యవహారంలో సర్పంచ్ల పాత్రనే కీల కం. రాజకీయ పలుకుబడి ఉండటంతో తమ అక్రమ దందాకు అడ్డు రాకుండా ఉండేందుకు గా ను ఆయా గ్రామాల సర్పంచ్లకు ఇసుక నిల్వలను దక్కించుకున్న వారు రూ.లక్షల్లో ముట్టజెబుతున్నారు. ఇది బహిరంగ రహస్యమే కావడంతో ఇసు క నిల్వలు కలిగిన గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ దందా అధికంగా సాగే మావల, బేల, నేరడిగొండ, బోథ్, ఆదిలాబాద్ రూరల్ వంటి మండలాల్లోని పలు గ్రామాల్లోనూ సర్పంచ్ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. కొత్తగా వెంచర్లు, లేఅవుట్లను ఏర్పాటు చేయాలంటే సర్పంచ్ అనుమతి తీసుకోక తప్పదు. ఇందుకోసం లేఅవుట్లలోని ప్లాట్ల సంఖ్య, విక్రయ ధర ఆధారంగా వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎన్నికలు ఖరీదుగా మారాయి. ఖర్చుకు వెనుకాడని వైనం .. అక్రమ దందాలతో ఆదాయం వచ్చే ఆయా గ్రామాల్లో సర్పంచ్ పదవిని ఎలాగైనా సొంతం చేసుకో వాలని పలువురు ఆరాటపడుతున్నారు. గతంలో ఈ దందాలో ఆరితేరిన వారు రిజర్వేషన్ కలిసివచ్చి న చోట సర్పంచ్ బరిలో ఉండగా.. అనుకూలించని చోట ఉప సర్పంచ్ పదవీనైనా దక్కించుకుని చక్రం తిప్పాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వార్డుమెంబర్లుగా బరిలోకి దిగారు. సర్పంచ్ పదవి కోసం రూ.10 లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఖ ర్చు చేస్తుండగా.. వార్డుమెంబర్ స్థానం కోసం రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు వెచ్చిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు చూసి ఆయా గ్రామస్తులే ఆశ్చర్య పోతుండడం గమనార్హం. బేల, మావల, నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్ -
‘రైతు భరోసా’ విడుదల చేయాలి
ఇచ్చోడ: రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేసి అన్నదాతను ఆదుకోవాలని రైతు స్వ రాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెం బొర్రన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఇచ్చోడలో రైతులతో కలిసి మాట్లాడారు. ఈ ఏడాది భారీ వర్షాలతో పత్తి, సోయా తదితర పంటల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. యాసంగి సాగుకు పెట్టుబడి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపా రు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రైతులు గంగయ్య, ఎల్ల య్య, ముక్రామ్, జమాల్ తదితరులున్నారు. -
రోడ్డెక్కిన సోయా రైతులు
బోథ్: మూసివేసిన సోయా కొనుగోలు కేంద్రాలను తెరిపించాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని రహదారిపై సుమారు గంటపాటు బైఠాయించి నిరసన తెలిపారు. తమ వద్ద ఇంకా పంట నిల్వలు ఉన్నాయని, ఇప్పుడే కేంద్రాలను మూసివేస్తే ప్రైవేట్లో తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సీఐ గురుస్వామి, ఎస్సై శ్రీ సాయిలు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. మార్క్ఫెడ్, జిల్లా స్థాయి అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సోమవారం లోపు కొనుగోలు కేంద్రాలను తెరవకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇందులో బీఆర్ఎస్ నాయకులు పోతన్న, శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పచ్చదనం కనుమరుగు
రాజరాజేశ్వరనగర్లో నరికివేసిన పచ్చని చెట్లు కై లాస్నగర్: పచ్చదనం పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం పేరిట ఏట కోట్ల రూపాయలు వెచ్చిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. మరోవైపు ఏపుగా పెరిగిన ఆ చెట్లను విద్యుత్ శాఖ ఇష్టారాజ్యంగా నరికివేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం విద్యుత్ వైర్లు ఉన్న ప్రాంతాల్లోని చెట్ల కొమ్మలు తొలగించాలంటే ఆ పనులు చేపట్టే కాంట్రాక్టర్ విధిగా అటవీశాఖ అనుమతి తీసకోవాలి. అయితే పట్టణంలోని రాజరాజేశ్వరనగర్లో ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్, సంబంధిత ఏఈ అత్యుత్సాహం ప్రదర్శించారు. అటవీశాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే అవెన్యూ ప్లాంటేషన్లో పదుల సంఖ్యలో ఉన్న వృక్షాలను కట్టర్ సాయంతో మొదళ్లకు నరికివేశారు. ఫలితంగా ఈ ప్రాంతంలో ఏళ్ల తరబడి ఉన్న పచ్చదనం కనుమరుగైంది. పర్యావరణ పరిరక్షణ నినాదం ప్రశ్నార్థమవుతోంది.అనుమతి తీసుకోలేదు.. చెట్ల నరికివేతకు సంబంధించి విద్యుత్శాఖ అధికారులు కానీ, కాంట్రాక్టర్ కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. విష యం తెలియగానే టాస్క్ఫోర్స్ బృందం అక్కడికి వెళ్లి చెట్లను తొలగిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్తో పాటు విద్యుత్ శాఖ అధికారులపై వాల్టా చట్ట ప్రకారం కేసు నమోదు చేశాం. – గులాబ్సింగ్, ఎఫ్ఆర్వో విచారణ జరుపుతున్నాం.. 33/11 కేవీ వైర్లకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించే పనులను కాంట్రాక్టర్కు అప్పగించాం. నిబంధనల ప్రకారం కొమ్మలనే తొలగించాల్సి ఉండగా చెట్లను నరికివేసినట్లుగా మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరుపుతున్నాం. – జాదవ్ శేష్రావు, ఎస్ఈ -
ఉత్కంఠ విజయం
ఒక్క ఓటుతో గట్టెక్కిన సత్తన్న నార్నూర్ మండలంలోని ఖైర్దాట్వ పంచాయతీలో కనక సత్యనాయణ, మాడావి జైవంత్రావు సర్పంచ్గా పోటీ చేశా రు. సత్యనారాయణకు 113 ఓట్లు రాగా, జైవంత్రావుకు 112 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటే ఒకరిని అందలం ఎక్కించి విజేతగా నిలిపింది. అదృష్టం.. నర్వటే వైపేఇచ్చోడ మండలం దాబా (బి) పంచాయతీ సర్పంచ్గా నర్వటే ఈశ్వర్ను అదృష్టం వరించింది. ఈ పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్గా కేటాయించగా నర్వటే ఈశ్వర్, మా నే రామేశ్వర్, సింధుబాయి బరిలో నిలిచారు. మొత్తం 494 ఓట్లు ఉండగా 434 పోలయ్యాయి. నర్వటే రామేశ్వర్కు 176, మానే రామేశ్వర్కు 176 ఓట్లు సమంగా రాగా, మరో అభ్యర్థి సింధుబాయికి 104 ఓట్లు, 8 చెల్లని ఓట్లు పోల య్యాయి. ఎన్నికల అధికారులు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయగా.. నర్వటే రామేశ్వర్ను సర్పంచ్ గిరి దక్కింది. ఇక్కడ చెల్లని ఓట్లు గెలుపోటముల్లో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. -
ఎన్నికల నియమావళి పాటించాలి
తాంసి: ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని వడ్డాడి గ్రామంలో ఓటర్లతో శుక్రవారం మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా ఉండకూడదని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే 100 డయల్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. అ లాగే ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీ లకు అనుమతి లేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మూడో విడత ఎన్నికలు పూర్తి అయిన తరువాత అనుమతితో ర్యాలీలు చేసుకోవాలని తెలిపారు. ఇందులో రూరల్ సీఐ ఫణిందర్, స్థానిక ఎస్సై జీవన్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. లాండసాంగ్విలో..ఆదిలాబాద్రూరల్: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలో ని లాండసాంగ్వి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో ఎస్పీ పా ల్గొని మాట్లాడారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. -
డోంట్ కేర్!
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులు టెండర్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఉన్నతాధికారులు మందలించినా.. పనుల్లో జరిగిన లోపాలపై విచారణలు జరిగినా.. సదరు అధికారుల తీరులో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. తాజాగా అమృత్ సరోవర్ స్కీం కింద చేపట్టిన పనులే ఇందుకు నిదర్శనం. రూ.25లక్షల విలువైన పనులను మరోసారి ఎలాంటి టెండర్లు నిర్వహించకుండానే తమకు అనుకూలమైన కాంట్రాక్టర్తో చేయిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఆగమేఘాలపై చేపట్టిన పనులతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశమేంటంటే... భూగర్భ జలాలు సంరక్షించడంతో పాటు వాటిని మరింతగా పెంపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.25 లక్షల నిధులు కేటాయించింది. వీటి ద్వారా వీటి ద్వారా పట్టణంలోని చెరువులను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందుకోసం చేపట్టిన పనులతో పాటు ఫొటోలతో కూడిన వివరాలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. దీంతో పట్టణంలోని కుమ్మరికుంట, బాలాజీనగర్ చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టాలని బల్దియా అధికారులు నిర్ణయించారు. పూడికతీత పనులు చేస్తున్నాం..పట్టణంలోని రెండు చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నాం. వీటికి టెండర్లు నిర్వహించని మాట వాస్తవమే. డిపార్ట్మెంట్ ద్వారానే పనులు చేస్తున్నాం. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా జరిగేలా చూస్తాం. – సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్ -
స్వతంత్రులపై ఫోకస్
సాక్షి,ఆదిలాబాద్: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన చోట మేజర్ పంచాయతీల్లో ఫలితాలు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు ప్రతికూలంగా రావడం చర్చనీయాంశంగా మారింది. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇక్కడ స్వతంత్రులు విజేతలుగా గెలిచారు. బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ‘హస్తం’కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది. నువ్వా.. నేనా అన్నట్టుగా ఫలితాలు నిలిచాయి. ఈ రెండు పార్టీల తర్వాత స్వతంత్రులు అధిక సంఖ్యలో గెలుపొందడం గమనార్హం. ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లోనే స్వతంత్రులు ఎక్కువగా గెలిచారు. వారు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. రెండో విడత ఏకగ్రీవాలు ఇలా.. రెండో విడత ఎన్నికలు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 6, బోథ్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో జరగనున్నాయి. ఇక్కడ 17 జీపీల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి ముగ్గురు, బీఆర్ఎస్ నుంచి ఒకరు ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఉండగా, ఏడుగురు స్వతంత్రులు ఉండటం గమనార్హం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆదిలాబాద్రూరల్, బేల నుంచి ఏకగ్రీవమైన సర్పంచులు వారు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనే విషయంలో ఇప్పుడే నిర్ణయం వెలువర్చడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా అటువైపే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతుంది. నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పరపతితో ఆయా పార్టీల వైపు మొగ్గుచూపుతారా.. లేదా అనేది కూడా చూడాల్సిందే. మొత్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా, రెండో విడత పంచాయతీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది.మొదటి విడత ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బలపర్చిన, స్వతంత్రులుగా గెలిచిన సర్పంచ్ల వివరాలు మొత్తం పంచాయతీలు 166 కాంగ్రెస్ 61 బీఆర్ఎస్ 59 బీజేపీ 10 స్వతంత్రులు 36 -
● ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం ● మందు, విందులతో ఓటర్లకు గాలం
కై లాస్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల రెండో వి డత ప్రచార పర్వం ముగిసింది. ఈ విడతలో జిల్లాలోని ఆదిలాబాద్రూరల్, మావల, బేల, జైనథ్, సాత్నాల, భోరజ్, తాంసి, భీంపూర్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అనుచరులతో కలిసి వారం పాటు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ము గియడంతో ఆయా పల్లెలన్నీ సైలెంట్గా మారాయి. మరోవైపు ప్రలోభాలు షురూ అయ్యాయి. ఓటర్లకు మందు, విందులు ఏర్పాటు చేసే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. పోలింగ్కు ఒకరోజు సమయం ఉండడంతో పోల్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించారు. డిసెంబర్ 6న.. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 30న వెలువడింది. ఆ రోజు నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించారు. 3న పరిశీలన చేపట్టి అర్హులైన అభ్యర్థుల వివరాలు ప్రకటించారు. ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచి న అభ్యర్థులకు ఈనెల 6న గుర్తులు కేటాయించా రు. దీంతో వారు ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. వారం పాటు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రలోభాలకు ఎర.. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. ప్రతీ ఓటరును వ్యక్తిగతంగా కలుస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. డబ్బులు, మద్యం పంపిణీ చేపడుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు పంచుతున్నారు. మరోవైపు మద్యం పంపకాలు, విందులు జోరందుకున్నాయి. శనివారం ఒక్కరోజే సమయం ఉండటం, తెల్లవారితే పోలింగ్ ఉండనుండడంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఓ టర్లను పూర్తిస్థాయిలో ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా యువతకు గాలం వేసేందుకు ప్రత్యేకంగా విందులు ఏర్పాటు చేస్తున్నారు.రెండో విడతలో..ఎన్నికలు జరిగే మండలాలు 8గ్రామపంచాయతీలు 156వార్డు స్థానాలు 1,260 -
గంటల వారీగా పోలింగ్ శాతం
శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఇంద్రవెల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న యువతి కై లాస్నగర్: జిల్లాలో తొలివిడత ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఇచ్చోడ, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ మండలాల్లోని 133 పంచాయతీలు 433 వార్డు స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరిగాయి. పల్లె ఓటర్లు తమ ఓటు చైతన్యాన్ని ప్రదర్శించారు. గజగజ వణికిస్తున్న చలి తీవ్రతను కూడా లెక్క చేయకుండా పలుచోట్ల ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. నిర్ణీత సమయం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ ముగియాల్సి ఉండగా అప్పటికే పోలింగ్ కేంద్రాల్లో క్యూలో నిలబడిన ఓటర్లందరికీ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో పలుచోట్ల మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ కొనసాగింది. వృద్ధుల నుంచి యువత వరకు ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో ఆయా మండలాల పరిధిలో 77.52 శాతం పోలింగ్ నమోదైంది. ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి పోలింగ్ సరళిపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మందకొడిగా మొదలై...ఆపై పుంజుకుని ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది. ఆయా మండలాల పరిధిలో 1,52,626 మంది ఓటర్లు ఉండగా, 1,05,468 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 75,139 మంది పురుష ఓటర్లకు గానూ 52,211 మంది, 77,476 మంది మహిళా ఓటర్లకు గానూ 53,255 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతరులు ఆరుగురికి గానూ ఇద్దరు ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలుత పోలింగ్ మందకొడిగా సాగింది. చలి తీవ్రత కారణంగా ఓటర్లు ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ నెమ్మదిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు కేవలం 10.67 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆతర్వాత ఓటర్లు కేంద్రాలకు తరలిరావడంతో పోలింగ్ శాతం క్రమేణ పుంజుకుంది. తొలిసారిగా ఓటుహక్కు పొందిన యువత ఉత్సాహంగా కదలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులను కుటుంబ సభ్యులు ఆటోలు, ఇతర వాహనాల్లో తీసుకువచ్చి ఓటు వేయించారు. వారికి పోలింగ్ కేంద్రాల్లో వీల్చైర్ సౌకర్యం కల్పించారు. 9 గంటల తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల బారులు కన్పించాయి. దీంతో పోలింగ్ ఊపందుకుంది. 11 గంటల వరకు 40.37 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే నిర్ణీత సమయం ఒంటిగంట వరకు 69.10 శాతం నమోదైంది. అప్పటికే పలుచోట్ల పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ కొనసాగింది. చివరకు 77.52 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతీ రెండు గంటలకోసారి అధికారికంగా పోలింగ్ సరళిని ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ సిరికొండ మండలం సుంకిడి, ఇచ్చోడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంద్రవెల్లి మండలం ముత్నూర్, ఉట్నూర్ మండలం శ్యాంపూర్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. జిల్లాలో నమోదైన పోలింగ్ వివరాలు..మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు ఇతరులు పోలింగ్ శాతం ఇచ్చోడ 33,166 26,670 13,233 13,437 00 80.41 గాదిగూడ 13,027 10,725 5,370 5,355 00 82.33 ఇంద్రవెల్లి 29,648 22,792 11,302 11,490 00 76.88 నార్నూర్ 19,359 15,643 7,962 7,681 00 80.8 సిరికొండ 9,639 8,390 4,184 4,206 00 87.04 ఉట్నూర్ 47,787 34,092 17,056 17,033 03 71.34 మండలం 9 గంటలకు 11 గంటలకు ఒంటిగంటకు పోలింగ్ ముగిసిన తర్వాత ఇచ్చోడ 9.70 35.61 70.38 80.41 గాదిగూడ 14.29 53.77 78.18 82.33 ఇంద్రవెల్లి 6.17 33.14 57.60 76.88 నార్నూర్ 11.99 45.11 78.22 80.8 సిరికొండ 20.87 60.21 85.12 87.4 ఉట్నూర్ 10.56 38.59 65.95 71.34 రాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపు.. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. 25 ఓట్లను ఒక బెండల్గా వేరు చేసి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. చిన్న పంచాయతీల్లో విజేతలను ప్రకటించారు. గెలుపొందిన సర్పంచులు తమ అనుచరులతో కలిసి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. దీంతో పల్లెల్లో సందడి వాతావరణం కనిపించింది. ఇదిలా ఉండగా ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీల్లో సర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. -
వేతనంలో కోత విధించొద్దు
ఆదిలాబాద్టౌన్: అంగన్వాడీ టీచర్ల వేతనంలో కోత విధించవద్దని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు అన్నారు. గురువారం ఐసీడీఎస్ పీడీ మిల్కాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల అంగన్వాడీల రాష్ట్ర మహాసభలకు వెళ్లిన వారి ఒకరోజు వేతనంలో నుంచి కోత విధించినట్లు తెలిపారు. టీచర్లు, ఆయాలు సెలవు పెట్టినప్పటికీ ఒకరోజు వేతనాన్ని తగ్గించారని పేర్కొన్నారు. కోత విధించిన ఒకరోజు వేతనాన్ని తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్, అంగన్వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత, తదితరులు ఉన్నారు. -
మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు
ఆదిలాబాద్టౌన్: పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 14న ప్రథమ భాష, 18న ద్వితీయ భాష, 23న ఇంగ్లిష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజికల్ సైన్స్, 7న బయోసైన్స్, 13న సాంఘిక శాస్త్రం, 15న ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని డీఈవో వివరించారు. 32 ఏకగ్రీవ స్థానాలు బీఆర్ఎస్వేబోథ్: బోథ్ నియోజకవర్గంలో 47 పంచాయతీలు ఏకగ్రీవం కాగా అందులో 32 మంది బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే ఉన్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో 32 పంచాయతీలను ఏకగ్రీవంగా కై వసం చేసుకున్న సర్పంచులను అభినందించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలనకై లాస్నగర్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సరళిని పరిశీ లించేందుకు 21 పోలింగ్ కేంద్రాల్లోని 41 ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలను కలెక్టరేట్ సమావేశ మందిరంలోని ప్రొజెక్టర్కు అనుసంధానం చేశారు. కలెక్టర్ రాజర్షిషా, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్ర ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్తో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. -
రసకందాయం
సాక్షి,ఆదిలాబాద్:మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత మలి రెండు విడతల సంగ్రామం రసకందాయంగా మారింది. జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్న విషయం తెలిసిందే. ఆయా నియోజకవర్గాల్లో ఆ శాసన సభ్యులు తమ పట్టు నిలుపుకునేందుకు మద్దతు దారులను గెలిపించుకునేందుకు శాయశక్తులు ఒడ్డోడుతుండగా, తొలి ఫలితాలు వారికి కొంత కంటగింపుగా మారాయి. మొదటి విడతలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా, ఈనెల 14న రెండో విడతలో బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉన్నచోట ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ఆరు మండలాల్లోని 166 గ్రామపంచాయతీల్లో జరిగాయి. ఈ ఫలితాలు రెండో విడత ఎన్నికలను రసకందాయంలో పడేశాయి. ఈనెల 14న జరగనున్న మలి పోరులో 156 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 17 ఏకగ్రీవం అయ్యాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాలు, బోథ్ నియోజకవర్గంలోని 2 మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ పరిస్థితి.. మొదటి విడత ఎన్నికలు జరిగిన మండలాల్లో ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు చెందిన అనిల్ జాదవ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో జరిగిన మొదటి విడత ఎన్నికల్లో ఇచ్చోడలో బీఆర్ఎస్ అధిక స్థానాలు సాధించింది. అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్, బీజేపీ కూడా కొన్ని స్థానాలను దక్కించుకున్నాయి. సిరికొండలో కాంగ్రెస్ దూకుడు చూపగా, ఏ పార్టీకి మద్దతు ఇవ్వని మరికొంత మంది గెలుపొందారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్కు చెందిన వెడ్మ బొజ్జు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మొదటి విడతలో ఈ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఉట్నూర్లో కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాలు సాధించారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్తో పాటు బీజేపీ మద్దతుదారులు కూడా గెలుపొందారు. ఏ పార్టీకి సంబంధం లేనివారు కూడా గెలుపొందారు. ఆసిఫాబాద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈ నియోజకవర్గంలోని నార్నూర్, గాదిగూడలో మొదటి విడత ఎన్నికలు జరిగాయి. నార్నూర్లో బీఆర్ఎస్ మద్దతుదారుల ప్రభంజనం కనిపించినప్పటికీ, గాదిగూడలో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ మద్దతుదారులు కూడా గెలుపొందారు. రెండో విడత ఎన్నికల వివరాలు.. మండలాలు: ఆదిలాబాద్రూరల్, మావల, బేల, జైనథ్, సాత్నాల, భోరజ్ తాంసి, భీంపూర్ జీపీల సంఖ్య: 156 ఏకగ్రీవం : 17 వార్డుల సంఖ్య : 1116 ఏకగ్రీవం: 1104 పోటీ నెలకొన్నవి: 139 (జీపీలు), 12 (వార్డులు) -
వణుకుతున్న ‘ఆదిలాబాద్’
ఆసిఫాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలికి వణుకుతోంది. ఈ సీజన్లో గురువారం అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 5.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.ఇదే జిల్లాలోని కెరమెరిలో 5.7, తిర్యాణిలో 5.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి– టి గ్రామంలో 6.1, బోథ్ మండలం పొచ్చరలో 6.4, భోరజ్ మండల కేంద్రంలో 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తీవ్రంగా చలిగాలులు వీస్తున్నాయి. -
‘రూని’కి ఘన నివాళి
ఆదిలాబాద్టౌన్: రూని సేవలు పోలీసు వ్యవస్థకు గర్వకారణమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. దశాబ్దానికి పైగా పోలీసు సేవల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన జాగిలం రూని బుధవారం ఉదయం మృతి చెందింది. 2012 బ్యాచ్కు చెందిన రూని హత్యకేసులు, దొంగతనాలు వంటి 250కు పైగా కేసుల్లో కీలక పాత్ర పోషించి 20 మంది నేరస్తులను పట్టించడంలో సహకరించినట్లు తెలిపారు. పోలీసు శాఖ తరఫున అంత్యక్రియలు నిర్వహించగా, పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ 2011లో జన్మించిన రూని 2012లో విధులు ప్రారంభించి 2021లో విరమణ చేసిందని తెలిపారు. నాలుగేళ్ల విశ్రాంతి అనంతరం మృతి చెందినట్లు పేర్కొన్నారు. అంత్యక్రియల్లో డాగ్ స్క్వాడ్ సిబ్బంది, హ్యాండ్లర్ గంగన్న, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
● పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ● జిల్లాలో 6.2 డిగ్రీల సెల్సియస్ నమోదు
చలి గుప్పిట్లో.. ఆదిలాబాద్టౌన్: జిల్లాలో చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. బుధవారం రికార్డుస్థాయిలో 6.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణికిస్తుంది. వేకువజామున పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చలి మంటలు కాగుతూ జనం ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో అత్యల్పంగా భీంపూర్ మండలంలోని అర్లి(టి)లో 6.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. సొనాలలో 7.6, భోరజ్లో 7.9, తాంసిలో 8, రాంనగర్లో 8.2, నేరడిగొండలో 8.6, ఆదిలాబాద్ పట్టణంలో 8.7, బోథ్లోని పొచ్చరలో 8.9, బజార్హత్నూర్లో 8.9, జైనథ్లో 9.1, బరంపూర్లో 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నాణ్యమైన వైద్యసేవలందించాలి
ఆదిలాబాద్టౌన్: టీబీ రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్ డాక్టర్ స్నేహ శుక్లా అన్నారు. పట్టణంలోని కేఆర్కే కాలనీలో గల ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. టీబీ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఎక్స్రే పనితీరును పరిశీలించారు. మందులు పంపిణీ చేస్తున్నారా, క్షేత్రస్థాయికి వెళ్లి రోగుల పరిస్థితిని తెలుసుకుంటున్నారా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్తో పాటు వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. సేవలు ఎలా అందుతున్నాయి, జిల్లాలో ఎంత మంది క్షయ రోగులు ఉన్నారు, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, తదితర విషయాలను తెలుసుకున్నారు. ఇందులో జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సుమలత, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, ఏసీఎస్ఎం కన్సల్టెంట్ సురేశ్ తదితరులున్నారు. -
పకడ్బందీ ఏర్పాట్లు
ఆదిలాబాద్టౌన్: పంచాయతీ ఎన్నికలకు పోలీ సుశాఖ పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మొదటి విడత ఆరు మండలాల ఎన్నికలకు సంబంధించి బుధవారం ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ తదితర ప్రాంతా ల్లో బందోబస్తును పర్యవేక్షించారు. అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలివిడతకు 936 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. 38 సమస్యాత్మక కేంద్రాల్లో స్పెష ల్ పార్టీ బలగాలు, 10 షాడో పోలింగ్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో 599 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. 20 ఆయుధాల ను సేఫ్ డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్లస్టర్ రూమ్ మొ బైల్స్తో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బందోబస్తులో ముగ్గురు అదన పు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 21 మంది సీఐ లు, 48 మంది ఎస్సైలతో పాటు మహిళా సిబ్బంది, హోంగార్డులు, రిజర్వు, సాయుధ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలు ఉంటాయని వివరించారు. ఇప్పటివరకు జిల్లాలోని 38 గ్రామాల్లో ఫ్లాగ్మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రలోభాలకు గురికావొద్దు.. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. పోలింగ్ కేంద్రం పరి ధిలో 163 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపా రు.సోషల్మీడియా,ఇతర సామాజిక మాధ్యమా ల్లో ఇతరులను రెచ్చగొట్టేలా, కించపర్చేలాపోస్టులు పెట్టవద్దని, వీటిపై పోలీసు నిఘా ఉంటుంద ని పేర్కొన్నారు. ఎలాంటి సమాచారమైనా డయ ల్ 100 ద్వారా అందించాలని సూచించారు. డ బ్బు, మద్యం, బహుమతులు వంటివి పంచే క్ర మంలో పోలీసులకు తెలియజేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలిఇచ్చోడ: పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా ప్రత్యేక కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజ న్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశా ల ఆవరణలో బందోబస్తుకు కేటాయించిన పోలీ సు సిబ్బందితో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, ఇచ్చోడ ఎస్హెచ్వో రాజు, సిబ్బంది ఉన్నారు. -
అందరికీ అభయం.. ఓటేసేదెవరికో?
కై లాస్నగర్: పంచాయతీ ఎన్నికల తొలి విడత అభ్యర్థుల భవితవ్యం గురువారం తేలనుంది. ఓ టర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇప్పటికే తీవ్రంగా శ్రమించారు. రెండు, మూడో విడత ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో బరిలో నిలి చిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తమను ఆశీర్వదించాలని సర్పంచ్గా ఎన్నుకుంటే ఐదేళ్ల పాటు మీకు అండగా ఉండి సేవచేస్తామని, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామంటూ అనేక హామీలు గుప్తిస్తున్నారు. ముఖ్యంగా యువ త మద్దతు చేజారకుండా ఉండేందుకు నామినేషన్ల ప్రారంభం నుంచే మందు, విందులతో ముంచెత్తుతున్నారు. అయితే ప్రచారానికి వెళ్లిన ప్రతీ అభ్యర్థిని నిరాశ పర్చకుండా మా మద్దతు నీకేనంటూ ఓటర్లు అభయమిస్తున్నారు. ఇంటి వద్దకు వచ్చి ఓటు వేయమని వేడుకుంటున్న వారికి మీరు అంతగా చెప్పాలా.. తప్పకుండా మా ఓట్లన్నీ మీకేనంటూ నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే అంశం సర్పంచ్ అభ్యర్థులను కలవరానికి గురి చేస్తుంది. ఓటరు నాడీ వారికి అంతు చిక్కడం లేదు. ఎన్నికల బరిలో నిలిచిన ప్రతీ అభ్యర్థికి మా సపోర్టు నీకేనంటూ చెబుతుండటంతో బ్యాలెట్ పేపర్పై ఎవరికి మద్దుతునిస్తారనే సందిగ్ధంగా మారింది. అభ్యర్థులు పోటాపోటీగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తుండగా ఓటరు ఎవరకి పట్టం కడతారన్నది అంతకు చిక్కడం లేదు. ‘అన్నా.. నమస్తేనే. బాపూ.. ఏంజెత్తన్నవ్.. పాణం మంచిగుందా. అక్కా.. బాగున్నారా... అంటూ వరుసలు కలుపుతూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులు. ‘ఈ సారి సర్పంచ్గా పోటీ చేస్తున్ననే.. జర మీ అందరి సపోర్ట్ కావాల్నే.. పోయిన సారి వాళ్లకు అవకాశం ఇచ్చారు. ఈ తాప జెరంత నాపై దయచూపండే.. మీతో పాటు ఇంటోళ్లవి, దోస్తుల ఓట్లు అందరివీ మనకే పడేలా చూడండే.. అంటూ అభ్యర్థులు చేతులు జోడిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే ఓటర్లు కూడా అలాగే స్పందిస్తున్నారు.. ‘అరే.. నువ్వు భలే ఉన్నవే.. అంతగా బతిమిలాడల్నా... నీకు కాకపోతే ఇంకోళ్లకే.. నాతో పాటు మా ఇంటోళ్ల ఓట్లన్నీ నీకే.. బేఫికర్గా ఉండు. ఈ సారి నువ్వే గెలుస్తున్నవ్ పో.. ’అంటూ ఇంటికి వచ్చే అభ్యర్థులందరికీ ఓటరు ఇస్తున్న అభయమిది. పల్లెపోరులో భాగంగా ప్రతీ ఊరిలో ఎన్నికల ప్రచార పర్వంలో ఎక్కువగా వినిపిస్తున్న మాటలివే. నేడు తొలివిడత ఎన్నికలు జరుగుతుండగా ఓటరు ఎవరిని ఆశీర్వదిస్తారో వేచి చూడాల్సిందే. -
పట్టు నిలిచేనా..?
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో రాజకీయం విభిన్నం.. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం ఉంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తింపుపై జరిగేవి కాకపోయినప్పటికీ ఈ నేతలకు తాము బలపర్చిన అభ్యర్థుల గెలుపు ప్రతిష్టాత్మకం. ఫలితాలు తారుమారైతే తమ పట్టు జారిందనే విమర్శలతో పాటు పార్టీ పరిస్థితిపై మరో రకంగా కార్యకర్తల్లో చర్చ సాగుతుందనే అభిప్రాయం స్థానిక ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. అందుకే పార్టీ పరంగా ఈ ఎన్నికలు జరగకపోయినా వారు మా త్రం తాము బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో ప్రభావం చూపెట్టడం ద్వారా మిగతా రెండు విడతల్లోనూ గట్టి ఫలితాలు సాధించాలని ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మూడు నియోజకవర్గాలు.. ఆరు మండలాలు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు నేడు ఆరు మండలాల్లో జరగనున్నాయి. బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, సిరికొండ, ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని నార్నూర్, గాదిగూడ మండలాల్లో పోరు సాగుతుంది. ఇవన్నీ ఎస్టీ రిజర్వుడ్ పంచాయతీలే. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, ఖా నాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరికి ఈ విడత కీలకం కానుంది. బోథ్లో.. బోథ్ నియోజకవర్గంలో ఈ ఎన్నికలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొదటి విడతలో ఈ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో జరుగుతున్నాయి. ఇక్కడ మంచి ఫలితాలు సాధిస్తే మలి విడతలో జరిగే మిగతా మండలాల్లో పట్టు సాధించవచ్చనేది ఆయన ప్రయత్నం. రెండు మండలాల్లో 52 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా, 12 జీపీలు ఏకగ్రీవాలయ్యా యి. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్లు సమఉజ్జీ లుగా ఉండగా, బీజేపీ తాము ఉన్నామంటే ఉన్నామనే విధంగా ఇప్పటివరకు పరిస్థితి ఉంది. ఇక ఎ న్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరం. ఖానాపూర్లో.. ఖానాపూర్ నియోజకవర్గంలో ఎన్నికలు కాంగ్రెస్ ఎమ్మెలే వెడ్మ బొజ్జుకు అత్యంత కీలకంగా మారింది. ఇటీవలే ఆయన పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా నియామకం అయ్యారు. ఈ క్రమంలో సొంత నియోజకవర్గంలో పార్టీ బలపర్చిన అభ్యర్థుల గె లుపు ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. తొలి వి డత ఎన్నికలు జరిగే రెండు మండలాల్లో 11 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులతో పాటు ఏ పార్టీకి సంబంధం లేని వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కూడా బీజేపీ ఉన్నామంటే ఉన్నామనే విధంగా ఏకగ్రీవంలో కనిపించింది. బీఆర్ఎస్కు ఇక్కడ ఏకగ్రీవాల్లో చో టు లభించలేదు. దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో ఫలి తాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఆసిఫాబాద్లో.. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తనకున్న గట్టి పట్టును ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకుండా ఆమె ముందుకు కదులుతున్నారు. ఈ నియోజ కవర్గంలోని రెండు మండలాల్లో తొలివిడత ఎన్నికలు జరుగుతుండగా, ఇక్కడ 10 ఏకగ్రీవాలకు గాను ఏకపక్షంగా బీఆర్ఎస్ ముందుంది. కాంగ్రెస్ ఉనికి చాటుకునేంత పరిస్థితి మాత్రమే ఉంది. ఇక ఎన్ని కల ఫలితాలపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
ఆదిలాబాద్: జిల్లాలోని జైనథ్ మండలం తరోడ గ్రామ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మూలమలుపులో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జైనథ్ నుండి ఆదాలాబాద్ వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పింది. షేక్ మొహినుద్దీన్, షేక్ మోహిన్, కదం కీర్తి సాగర్లు ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను రిమ్స్కు తరలించారు పోలీసులు.ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అధికమయ్యాయి. డిసెంబర్ 7వ తేదీ నాలుగు యువకులు కారులో ప్రయాణిస్తుండగా, మంచు కారణంగా దృశ్యమానం తగ్గిపోవడంతో వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు శ్రీపతి అశ్రిత్ రెడ్డి, పప్పుల శివమణి) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో, కీసరా నుంచి తర్నాకకు వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో హర్షవర్ధన్ (మల్కాజిగిరి నివాసి) మృతి చెందాడు. గతనెల 3వ తేదీన రంగారెడ్డి చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్– తాండూర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం బాధితుల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రం సమీపంలోని ఓక్లే ఇంటర్నేషనల్ పాఠశాలలో సోమవారం ప్రారంభమైన 10వ వింటర్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా హైదరాబాద్ జిల్లా జట్టు నిలిచింది. విజేతలకు డీటీఎస్వో పార్థసారథి, స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమేష్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీటీఎస్వో మాట్లాడుతూ జిల్లాలో స్విమ్మింగ్ క్రీడాభివృద్ధికి అసోసియేషన్ ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో స్విమ్మర్లు రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయిని రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము కృష్ణ, డాక్టర్ క్రాంతి కుమార్, ఆదిత్య ఖండేశ్కర్, బారే శ్రీధర్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. గ్రూప్ 1 బాలుర విభాగంలో బగ్గు గౌతమ్ శశివర్ధన్ నాయుడు 3 స్వర్ణాలు, 2 రజతాలు, గ్రూప్ 2 లో ఎస్ఎస్.సచిన్ సాత్విక్ 5 స్వర్ణాలు, గ్రూప్ 3లో అర్జున్ కాస్వన్ 5 స్వర్ణాలు, గ్రూప్ 4 విభాగంలో 2 స్వర్ణాలు సాధించారు. బాలికల్లో గ్రూప్ 1 విభాగంలో హర్షిత వర్మ 4 స్వర్ణాలు ఒక రజతం, గ్రూప్ 2లో శివాని కర్ర 5 స్వర్ణ, గ్రూప్ 3 విభాగంలో సంయుక్త 3 స్వర్ణాలు, ఒక రజతం, గ్రూప్ 4 విభాగంలో అడ్డూరి జాగృతి శ్రీనివాసరావు 2 స్వర్ణ పతకాలు సాధించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొమ్ము చరణ్తేజ్ 400 మీటర్ల ఐఎం ఈవెంట్లో, అనిరుధ్ 50 మీటర్ల బెస్ట్స్ట్రోక్ ఈవెంట్లో కాంస్య పతకాలతో మెరిసారు. మొత్తంగా హైదరాబాద్ జిల్లా జట్టు మొత్తం 51 స్వర్ణాలు, 45 రజతాలు, 23 కాంస్య పతకాలతో 266 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్షిప్, ద్వితీయస్థానంలో నిలిచిన రంగారెడ్డి 245 పాయింట్లతో 40 స్వర్ణాలు, 41 రజతాలు, 43 కాంస్య పతకాలు సాధించింది. తృతీయస్థానంలో కరీంనగర్, నాలుగో స్థానంలో ఆదిలాబాద్ జట్టు నిలిచాయి. -
సంతానం కలగడంలేదని ఒకరు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ ఫ్యాక్టరీ వెనుకాల ఈ నెల 8న రాత్రి రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు జీర్పీ హెడ్ కానిస్టేబుల్ జస్వాల్ సింగ్ మంగళవారం తెలిపారు. హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన సాగే శ్రీనివాస్ (35) మంచిర్యాలలో ఇంటర్ నెట్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లయి 14 సంవత్సరాలు కావస్తున్నా సంతానం కలుగడంలేదని రోజూ బాధపడుతుండేవాడు. సోమవారం రాత్రి బల్లార్షా నుంచి మంచిర్యాల వైపు వెళ్లే గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య సరిత ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్టౌన్: గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.. ఎన్నికల నియమావళిని ప్రతిఒక్కరూ పాటించా లి.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు.. గొడవలకు దారి తీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొ ద్దు.. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హె చ్చరించారు. మంగళవారం ‘సాక్షి’కిచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: తొలివిడత ఎన్నికలకు ఎలాంటి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు.? ఎస్పీ: మొదటి విడత ఎన్నికలు ఆరు మండలాల్లో ఈ నెల 11న జరగనున్నాయి. 920 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశాం. ఒక్కో మండలాన్ని డీఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు పర్యవేక్షిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. సాక్షి: పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి నిబంధనలు పాటించాలి..? ఎస్పీ: పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ సెక్ష న్ అమలులో ఉంటుంది. 200 మీటర్ల వరకు ప్రత్యేక నిబంధనలు పాటించాలి. ఓటర్లు క్యూ లో ఉండి ఓటు హక్కు వినియోగించుకోవాలి. సాక్షి: ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.? ఎస్పీ: తొలివిడతలో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైంది. ఎవరూ ప్రచారం చేయొద్దు. బయట వ్యక్తులు గ్రామాల్లో ఉండకూడదు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేసినా, గొడవలకు దారితీస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాక్షి: సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి భద్రత చర్యలు చేపడుతున్నారు..? ఎస్పీ: సమస్యాత్మక కేంద్రాల్లో ఫ్లాగ్మార్చ్ నిర్వహిస్తూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నాం. సాక్షి: సోషల్ మీడియాపై ఎలా నిఘా సారిస్తున్నారు? ఎస్పీ: సోషల్ మీడియాలో ఇతరులను రెచ్చగొట్టేలా,కించపర్చేలా పోస్టులు పెట్టవద్దు. ఎవరైనా అతిక్రమిస్తే గ్రూప్ అడ్మిన్లతో పాటు మెంబర్లపై సైతం కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేక బృందంద్వారా సోషల్ మీడియాపై నిఘా పెట్టాం. సాక్షి: విజయోత్సవ ర్యాలీ చేపట్టవచ్చా..? ఎస్పీ: ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీకి అనుమతి లేదు. సంబంధిత అధికా రుల అనుమతితో నిర్ధారించిన రోజున జరుపుకోవచ్చు. టపాసులు కూడా పేల్చ రాదు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలి. -
బాధ్యత మరవని గిరిజనులు
దండేపల్లి: ఊళ్లోనే పోలింగ్ కేంద్రం ఉన్నప్పటికీ కొందరు, కొన్ని సందర్భాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. కానీ దండేపల్లి మండలం కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఊట్ల గ్రామ ఆదివాసీ గిరిజనులు ఏ ఎన్నికలు వచ్చినా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడిపల్లి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటెయ్యాలి. ఆగ్రామంలో సుమారు 50 మంది ఓటర్లు ఉన్నారు. వారంతా ఎమ్మెల్యే, ఎంపీ, పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏం జరిగినా.. దూరం అని భావించకుండా ఓటు వేయడం మాత్రం మరువడం లేదు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశతో బాధ్యతగా ఓటేసి పాలకులను ఎన్నుకుంటున్నారు. -
కలప పట్టివేత
జన్నారం: మండలంలోని దేవునిగూడలో అక్రమంగా నిలువ ఉంచిన కలపను మంగళవారం పట్టుకున్నట్లు ఇందన్పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ సిబ్బందితో కలిసి వెళ్లి దేవునిగూడ గ్రామానికి చెందిన గవ్వల మురళి ఇంట్లో తనిఖీ చేయగా అక్రమంగా నిలువ ఉంచిన 8 టేకు దుంగలు లభ్యమైనట్లు తెలిపారు. కర్రతో పాటు కోత మిషన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కలప విలువ రూ.30 వేల వరకు ఉంటుందన్నారు. నిందితుడు మురళిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో డీఆర్వో కుమారస్వామి, సెక్షన్ అధికారులు రవి, మధుకర్, పురుషోత్తం, ఎఫ్బీవోలు తన్వీర్పాషా, లవన్, తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ దీక్షతోనే రాష్ట్రం ఏర్పాటు..
ఆదిలాబాద్టౌన్: నాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో కేంద్రం తలొగ్గి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విజయ్ దివస్ నిర్వహించారు. తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేశారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 11 రోజుల పాటు ఆమరణ దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఢిల్లీ మెడలు వంచడంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. కార్యక్రమలో పార్టీ నాయకులు అజయ్, సాజిదొద్దీన్, ప్రహ్లాద్, రమేశ్, స్వరూప, మమత తదితరులు పాల్గొన్నారు. -
అగ్నివీర్లుగా ఎంపిక
ఆదిలాబాద్: అగ్నివీర్–వాయుగా జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. సోమవారం రాత్రి విడుదలై న ఫలితాల్లో అగ్నివీర్ వాయు విభాగంలో జిల్లాకు చెందిన ఇద్ద రు యువకులు, ఓ యువతి ఎంపికై ఉద్యోగా లు సాధించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఊశన్న, దేవత దంపతుల కుమార్తె శ్రే య చందల్వార్, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అర్లి–బి గ్రామానికి చెందిన ఆకుల సురేష్ కుమారుడు వినయ్ కుమార్, బజార్హత్నూర్ మండలం బోస్రా గ్రామానికి చెందిన సోన్టాకే అశోక్, సుగుణ దంపతుల కుమారుడు మన్మత్ ఉద్యోగాలు సాధించారు. శిక్షకుడు వీ జీఎస్ రాకేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. పూలే విగ్రహం ఏర్పాటుకు అనుమతివ్వాలిశ్రీరాంపూర్: శ్రీరాంపూర్ జీఎం కార్యాలయ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని సింగరేణి కాల రీస్ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మంగళవారం జీఎం ఎం శ్రీనివాస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా బీసీ లైజన్ అధికారి ఎన్.సత్యనారాయణ, అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ముస్కే సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ కార్యదర్శి బద్రి బుచ్చయ్య పాల్గొన్నారు. -
24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
కై లాస్నగర్(బేల): బేల మండలంలోని శ్రీ దుర్గా వైన్స్లో ఈనెల 7న జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించినట్లు జైనథ్ సీఐ జి.శ్రావణ్ తెలిపారు. మంగళవారం పో లీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తక్కువ సమయంలో ఎ క్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో చో రీలకు పాల్పడుతున్న టేకం జశ్వ, షిండే అజ య్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.15 వేల విలువైన మద్యం, రూ.2లక్షల 40వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో బేల ఎస్సై ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
రెక్కల పురుగు నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
జన్నారం: యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన వరినారును రెక్కల పురుగు ఆశిస్తుందని, దీని నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాల ఏడీఏ ఎం.కృష్ణ సూచించారు. మంగళవారం జన్నారం మండలంలోని మొర్రిగూడలో వరి నారుమడిని పరిశీలించారు. ఈ సందర్భంగా నారును ఆశించే పురుగు, తెగుళ్ల గురించి రైతులకు వివరించారు. రెక్కల పురుగు ప్రస్తుతం గుడ్లుపెట్టే దశలో ఉందన్నారు. నాటు వేసే ఐదురోజుల ముందు నారుమడిలో క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. మొగి పురుగును మొదటి దశలోనే నివారించడానికి పొలంలో క్లోరాంట్రానిలిప్రోల్ ఎకరానికి 60 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలన్నారు. నాటు వేసే సమయంలో నారు కొనలు తుంచి నాటుకుంటే మొగి పురుగు అదుపులో ఉంటుందన్నారు. నాటు వేసిన 15 రోజులకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరాకు 4 కేజీల చొప్పున వేసుకుంటే కాండం తొలిచే పురుగుబాధ తగ్గుతుందన్నారు. ఆయిల్పాం తోటల పరిశీలన మండలంలోని దేవునిగూడలో ఆయిల్పాం తోటలను పరిశీలించి సాగులో రైతులు అవలంబించాల్సిన పద్ధతులు, దిగుబడికి సంబంధించి పలు సూచనలు చేశారు. అనంతరం వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తాలు, తప్పలేని, 17 శాతం లోపు తేమ ఉన్న వడ్లను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు సయ్యద్ అక్రమ్, దివ్య, రైతులు గుర్రం గోపాల్రెడ్డి, కళ్ళెం బాపురెడ్డి, ముత్యం రాజన్న, భుక్య రాజు, బాదవత్ రాజు నాయక్, కొట్టె గంగన్న, తదితరులు పాల్గొన్నారు. -
ప్రలోభాలు ఘరూ
ముగిసిన మూడోవిడత ఉపసంహరణ.. సాక్షి,ఆదిలాబాద్: ఇన్నిరోజులు ఒక లెక్క.. ఇప్పు డు ఒక లెక్క.. ప్రచారంలో హోరెత్తించిన అభ్యర్థులు ఇక పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచా రం మంగళవారంతో ముగిసింది. సాయంత్రం నుంచి వీధులు మూగబోయాయి. ఇక ఓటరును నేరుగా ప్రసన్నం చేసుకోవడమే మిగిలింది. ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. గురువారం పోలింగ్ జరగనుంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్ల స్వీకరణ నవంబర్ 27 నుంచి మొదలైంది. 29 వరకు ఆ ఘట్టం ముగిసింది. పరిశీలన, ఉపసంహరణ త ర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటించారు. గుర్తులు కేటాయించారు. డిసెంబర్ 4 నుంచి మొ దలైన ప్రచారం మంగళవారంతో పూర్తయింది. ఇంటింటి ప్రచారం చేపట్టిన అభ్యర్థులు తమను ఆదరించాలని ఓటర్లను వేడుకున్నారు. ఇక నేరుగా ప్రసన్నం.. ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థులు ప్రచా రానికి ముగింపు పలికారు. ఇక పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలుస్తూ మద్దతు ఇవ్వాలని, తనకే ఓటు వేయాలని కోరుతున్నారు. వారి ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెర లే పారు. డబ్బులు పంపిణీ మొదలైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్నిచోట్ల రూ.300 నుంచి రూ.500 వరకు, మరికొన్నిచోట్ల రూ.500నుంచి రూ.వెయ్యి వరకు పంచుతున్నారు. మరోవైపు మద్యం పంపకాలు, విందులు జోరందుకున్నాయి. బుధవారం ఒక్కరోజే సమయం ఉండటం, తెల్లవారితే పోలింగ్ ఉండనుండడంతో అభ్యర్థులు, వారి అనుచరులు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. గెలు పే దిశగా పావులు కదుపుతున్నారు. మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న జరగనుండగా, రెండో విడత 14న, మూడోవిడత 17న జరగనున్నాయి. చివరి విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ని లిచే అభ్యర్థుల ప్రకటన మంగళవారం పూర్తయింది. మొదటి విడతలో ప్రచారం పూర్తి కాగా, రెండో విడత, మూడో విడతలకు సంబంధించి ప్రచారం ఊపందుకోనుంది.30 పంచాయతీలు ఏకగ్రీవం కైలాస్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. జిల్లాలోని 151 పంచాయతీలు 1,220 వార్డులకు ఈ విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఏడు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా 30 పంచాయతీలు ఏకగ్రీవమైనట్లుగా అధికారులు తెలిపారు. ఇందులో బజర్హత్నూర్లో 5, బోథ్లో 3, నేరడిగొండలో 9, తలమడుగులో 7, గుడిహత్నూర్లో 6 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. -
నేషనల్ క్యాంపునకు ఎంపిక
ఇంటర్ మొదటి సంవత్సరం (సీఈసీ) చదువుతున్న సంపత్ నాయక్ చిన్న వయసులోనే గొప్ప నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు. 2022లో మహారాష్ట్రలోని నాసిక్ వేదికగా నిర్వహించిన అండర్ 17 ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీల్లో, 2024లో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో నిర్వహించిన జూనియర్ నేషనల్ ఈవెంట్లోనూ మెరిశాడు. నవంబర్ 8 నుంచి 10 వరకు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఔరా అనిపించాడు. కర్ణాటకలోని దావనగెరెలో నిర్వహించిన సౌత్ జోన్ సీనియర్ నేషనల్ మీట్కు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అత్యుత్తమంగా రాణించి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. వరంగల్లోని కాజీపేటలో 2026 జనవరిలో నిర్వహించనున్న పోటీల్లోరాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం సీనియర్ జాతీయ జట్టు క్యాంపులో శిక్షణ తీసుకుంటున్నాడు. సంపత్ నాయక్ -
జట్టు విజయంలో కీలకం
రాథోడ్ రవీందర్–కవిత దంపతుల కుమారుడు ప్రదీప్ ఇప్పటివరకు రెండుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. డిసెంబర్ 6 నుంచి 8 వరకు హైదరాబాద్లో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ఐ అండర్–19 టోర్నీలో జట్టు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. గతంలో మహారాష్ట్రలోని సతారాలో నిర్వహించిన జూనియర్ నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాడు. 2024లో యూపీలోని అయోధ్యలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్ 17 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. మేడ్చల్ వేదికగా నిర్వహించిన జూనియర్ రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ పోటీల్లో, మహబూబ్నగర్లో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొని మెప్పించాడు. నిజామాబాద్లో నిర్వహించిన 42వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో, పటాన్చెరులో నిర్వహించిన జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలోనూ ఆడియువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాథోడ్ ప్రదీప్ -
కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం
ఆదిలాబాద్టౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్ అన్నారు. మెదక్లో మంగళవారం నిర్వహించిన సీఐటీయూ ఐదో రాష్ట్ర మహాసభల్లో పాల్గొని మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు పొంద డం లేదని పేర్కొన్నారు. వారిని వెంటనే ఆదుకో వాలన్నారు. అలాగే స్కీమ్, కాంట్రాక్ట్ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుకు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సునీత, మల్లేశ్, అగ్గిమల్ల స్వామి, నవీన్కుమార్, వెంకటమ్మ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
నార్నూర్: ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో తొలివిడత పోలింగ్ ఏర్పాట్లను మంగళవా రం పరిశీలించారు. తాడిహత్నూర్ జెడ్పీఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. నార్నూర్, గాదిగూడలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నార్నూర్ ఎంపీపీఎస్ను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే గాదిగూడ కేజీబీవీ వసతి గృహం తనిఖీ చేశారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎంపీడీవోలు పుల్లారావు, శ్రీనివాస్, తహసీల్దార్ రాజలింగు తదితరులున్నారు. -
● మొదటి విడతకు సర్వం సిద్ధం ● సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ● ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా పకడ్బందీ చర్యలు ● అందుబాటులో టోల్ఫ్రీ నం.18004251939 ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ రాజర్షిషా
కై లాస్నగర్: ‘తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. సిబ్బందికి మూడు విడతల్లో శిక్షణ అందించాం.. బుధవారం మధ్యాహ్నం వరకు వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు.. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..’ అని కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షిషా అన్నారు. మంగళవారం ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.సాక్షి: ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు..? కలెక్టర్: ఈ నెల 11న జిల్లాలోని గాదిగూడ, నా ర్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లోని గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డుమెంబర్ స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పీవో, ఓపీవోల మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసి విధులు కేటాయించాం. వారు బుధవారం ఉదయం 9.30 గంటలకు ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకొని ఎన్నికల సామగ్రి తీసుకుంటారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సాక్షి: ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? కలెక్టర్: ఆరు మండలాల పరిధిలో 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఇందులో 46 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, 33 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పకడ్బందీగా సాయుధ, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. సాక్షి: మద్యం, డబ్బు ప్రలోభాలను ఏవిధంగా కట్టడి చేస్తారు? కలెక్టర్: ఇప్పటికే ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల పరిధిలోని వైన్స్లను మూసివేయాలని ఆదేశించాం. ఫ్లయింగ్ స్క్వాడ్లతో ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. ఎక్కడైనా డబ్బులు, మద్యం పంచినట్లయితే ప్రజలు డయల్ 100, టోల్ఫ్రీ నం.18004251939 కు సమాచారం అందించాలి. సాక్షి: రోడ్డు సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుంది.. వాటిపై ఏవిధంగా దృష్టి సారించారు..? కలెక్టర్: ఆరు మండలాల పరిధిలో కేవలం ఉట్నూర్ మండలంలోని ఒక పోలింగ్ కేంద్రానికే ఈ పరిస్థితి ఉన్నట్లుగా గుర్తించాం. సిబ్బంది వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. సాక్షి: ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు.. ఈ పరిస్థితిని ఏవిధంగా అధిగమిస్తారు..? కలెక్టర్: ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు నిధులు విడుదల చేసింది. ఈసీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రతీ మండలానికి అవసరమైన నిధులు కేటాయించాం. వారికి సరిపడా అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. సాక్షి: పోలింగ్ శాతం పెంపునకు ఏ విధంగా ముందుకెళ్తున్నారు..? కలెక్టర్: అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో పోల్ చీటీలను ఓటర్లకు అందించాం. ఇప్పటివరకు 95 శాతం ప్రక్రియ పూర్తయింది. ఒకరోజు సమయం ఉండడంతో ప్రతిఒక్కరికీ అందజేస్తాం. గురువారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఓటర్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన 18 గుర్తింపుల్లో ఏదైన ఒకదాన్ని తప్పనిసరిగా తీసుకెళ్లి ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం. ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీసు ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ అందించాం. -
రచ్చపల్లి సర్పంచ్ ఏకగ్రీవం
చెన్నూర్రూరల్: ఈ నెల 17న జరుగనున్న పంచా యతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని రచ్చపల్లి సర్పంచ్గా గెల్లు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ బీసీ మహిళకు రిజర్వేషన్ రాడంతో గెల్లు లక్ష్మి, ఆమె కోడలు గెల్లు కొమురక్క మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం కొమురక్క తన నామినేషన్ను ఉప సంహరించుకోవడంతో గెల్లు లక్ష్మి సర్పంచ్ ఏకగ్రీవం అయ్యారు. కాగా ఆరు వార్డుల్లో కూడా ఒక్కో నామినేషన్ రావడంతో సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాడు జెడ్పీటీసీ... నేడు సర్పంచ్గా బరిలోరెబ్బెన: గతంలో రెబ్బెన జెడ్పీటీసీగా పనిచేసిన అజ్మీర బాబురావు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గోలేటి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అవిర్భావం నుండి పార్టీలో పనిచేస్తున్న ఆయన 2001లో మొదటిసారిగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్ డివిజన్లో బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) సర్పంచ్గా ఎన్నికైంది ఇతనొక్కడే. 2014లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో రెబ్బెన జెడ్పీటీసీ స్థానం ఎస్టీకి రిజర్వ్ కాగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన బాబురావు టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం గోలేటి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎస్టీకి రిజర్వ్ కావడంతో మరోసారి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. సర్పంచ్ బరిలో మాజీ ఎంపీపీలు..!కుంటాల: మండలంలోని అందకూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి గంగామణి 2014లో ఎంపీపీగా, 2019లో జెడ్పీటీసీగా పదవులు చేపట్టారు. కుంటాలకు చెందిన అప్క చిన్న గజ్జారాం 2013లో సర్పంచ్గా, 2019లో ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. మండలంలోని అందకూర్ పంచాయతీ జనరల్ మహిళ, కుంటాల పంచాయతీ జనరల్ కేటాయించగా అందకూర్ నుంచి కొత్తపల్లి గంగామణి, కుంటాల నుంచి మాజీ ఎంపీపీ ఆప్క చిన్న గజ్జారాం బరిలో ఉన్నారు. -
‘బాండ్’ మోగిస్తున్న సర్పంచ్ అభ్యర్థి
నెన్నెల: నెన్నెల మండల కేంద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి దుగ్యాల బాపు బాండ్ పేపర్పై హామీలతో ప్రచారం చేస్తున్నారు. నెన్నెల సర్పంచ్గా గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి పనులు, పేదలకు అందించే ఆర్థికసాయం వివరిస్తూ రూ.50 విలువైన బాండ్ పేపర్పై నోటరీ చేయించి అందరికీ పంచుతున్నారు. అత్యవసర వైద్యం, అంత్యక్రియలు, పేదింటి ఆడబిడ్డల పెళ్లికి రూ.5వేలు, ఆటో ఏర్పాటు చేసి గర్భిణులు, రోగులను ఆస్పత్రికి ఉచిత తరలింపు, ఊరి భద్రత కోసం వీధుల్లో సీసీ కెమెరాలు, విద్యార్థులకు స్కూల్బ్యాగులు, నోట్పుస్తకాలు తదితర హామీలు ఇస్తున్నారు. గెలిచిన తర్వాత ఇందులో ఏ ఒక్కటీ అమలు చేయకపోయినా సర్వేనంబరు 161, 155లో తన పేరిట ఉన్న రెండెకరాల 11గుంటల భూమి పంచాయతీ అప్పగిస్తానని, లేనిపక్షంలో ప్రజలు తనను కాలర్పట్టి నిలదీయవచ్చని పేర్కొన్నారు. -
‘ప్రథమ’ అదృష్టం దక్కేదెవరికో?
కై లాస్నగర్: జిల్లాలో ఇటీవల కొత్తగా ఐదు గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. వాటికి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే ఒక టి ఏకగ్రీవమైంది. మిగతా నాలుగింటిలో సర్పంచ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. తమకు మద్దతివ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఇందులో అదృష్టం ఎవరిని వరించనున్నదనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ ఐదు పంచాయతీలు ఇవే.. ప్రజల విజ్ఞప్తులతో పాటు పాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లాలో ఐదు పంచాయతీలను ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసింది. ఇందులో ఇచ్చోడ మండలంలోని ఎల్లమ్మగూడ, ఉట్నూర్ మండలంలోని వడ్గల్పూర్, బజార్హత్నూర్ మండలంలోని ఏసాపూర్, తాంసి మండలంలోని అట్నంగూడ, తలమడుగు మండలంలోని పునాగూడ పంచాయతీలు ఉన్నాయి. వీటికి తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఎల్లమ్మగూడ, వడ్గల్పూర్–కే జీపీలకు తొలి విడతలో ఈ నెల 11న, అలాగే పునాగూడ, ఏసాపూర్ పంచాయతీలకు ఈ నెల 17న పోలింగ్ నిర్వహించనున్నారు. అట్నంగూడ ఏకగ్రీవం.. తాంసి మండలంలోని లిమ్గూడ పంచాయతీ పరి ధిలో అనుబంధ గ్రామంగా ఉన్న అట్నంగూడను ప్రభుత్వం ఇటీవల జీపీగా ఏర్పాటు చేసింది. ఇక్కడి సర్పంచ్ పదవీని ఎస్టీ జనరల్గా రిజర్వ్ చేసింది. రెండో విడతలో భాగంగా ఈ నెల 14న ఈ పంచాయతీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ గ్రామస్తులు ఐక్యతను చాటారు. గ్రామాభివృద్ధిని కాంక్షిస్తూ తొలి సర్పంచ్గా సంజీవ్ అనే యువకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వార్డు స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి. -
జాతీయ జట్టుకు సారథిగా..
సునీల్–నవనీత దంపతు ల కుమారుడు రాథోడ్ ఆ కాష్ ప్రస్తుతం కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. 2024లో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో నిర్వహించి న జూనియర్ నేషనల్ మీట్లో పాల్గొన్నాడు. మేడ్చల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు ద్వితీయస్థానం కై వసం చేసుకో గా, అందులో కీలకంగా వ్యవహరించాడు. మహబూబ్నగర్లో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. నవంబర్ 28 నుంచి 30 వరకు పటాన్చెరులో నిర్వహించిన 44వ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించాడు. నవంబర్ 8 నుంచి 10 వరకు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన జూనియర్ చాంపియన్షిప్ పోటీల్లో రాణించాడు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఈనెల 25 నుంచి 30 వరకు జరగనున్న జాతీయస్థాయి పోటీలకు సారధిగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఉట్నూరులో నేషనల్ క్యాంపులో శిక్షణ పొందుతున్నాడు. రాథోడ్ ఆకాష్ -
మూడోసారి జాతీయస్థాయి పోటీలకు..
సాధారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన రాథోడ్ రితేష్ నాయక్ ఆటలో తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగుతున్నాడు. తల్లిదండ్రులు గోవింద్ నాయక్, వనిత బాయి ప్రోత్సాహంతో క్రీడాపోటీల్లో సత్తా చాటుతున్నాడు. రెండుసార్లు జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. మూడోసారి మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 6 నుంచి 8 వరకు హైదరాబాద్లో నిర్వహించిన ఖోఖో పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన జూనియర్ నేషనల్ ఈవెంట్లో, 2024లో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో నిర్వహించిన 43వ జూనియర్ నేషనల్ ఈవెంట్లోనూ పాల్గొన్నాడు. వనపర్తిలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్ 17 రాష్ట్రస్థాయి పోటీల్లో, నిజామాబాద్లో నిర్వహించిన 42వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో ప్రతిభ కనబర్చాడు. 2023లో వరంగల్లో నిర్వహించిన సీనియర్ రాష్ట్రస్థాయి టోర్నీలో, ఈ ఏడాది నవంబర్ 8 నుంచి 10 వరకు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాడు. రాథోడ్ రితేష్ నాయక్ -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన 17 మంది తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందజేశారు. వాటిని స్వీకరించిన అనంతరం సంబంధిత పోలీసు అధికారులకు ఆయన ఫోన్ ద్వారా సూచనలు జారీ చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరు గెలిచినా మనోళ్లే!
కై లాస్నగర్: జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు ఆశిస్తూ ఒక్కో పార్టీలో ఇద్దరు, ముగ్గురేసి అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరంతా ఏళ్లుగా ఆయా పార్టీ జెండాలను మోసిన వారే కావడం గమనార్హం. అలాంటి వారికి రిజర్వేషన్ కలిసి రావడంతో సర్పంచ్గా ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. పార్టీల మద్దతును ఆశిస్తున్నారు. మొదటి, రెండో విడత ఎన్నికలకు సంబంధించిన గుర్తులు కూడా ఖరారు కావడంతో ఇంటింటి ప్రచారం ముమ్మురం చేశారు. ఓటర్ల వద్దకు వెళ్లి ఆశీర్వదిస్తే ముఖ్యనేతల అండతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. గెలిపించాలని వేడుకుంటున్నారు. -
బహుముఖ పోటీ
సాక్షి,ఆదిలాబాద్: ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ.. ఇక్కడ సర్పంచ్ పదవి కోసం ఏకంగా 15 మంది బరిలో ఉన్నారు.. 12,622 మంది ఓటర్లు ఉండగా, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఓట్ల చీలికపై పోటీదారుల్లో బెంగ కనిపిస్తుంది. ఓటర్ నాడీ పట్టలేక సతమతం అవుతున్నారు. ప్రచారాన్నే నమ్ముకొని ముందుకు కదులుతున్నారు. మరోవైపు నార్నూర్ మండలం నాగల్కొండలో 1,419 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇలా మొదటి విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో పలుచోట్ల బహుముఖ పోటీ కనిపిస్తుంది. మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న ఎస్టీ రిజర్వుడ్ అయిన నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో జరగనున్నాయి. మొత్తం 166 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 33 చోట్ల సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మిగతా 133 చోట్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 525 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇద్దరే అభ్యర్థులు.. మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో పదుల సంఖ్యల గ్రామాల్లో ఇద్దరే అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ పరిణామం అధికార కాంగ్రెస్కా.. లేనిపక్షంలో బీజేపీ, బీఆర్ఎస్లకు లాభిస్తోందా అనేది వేచిచూడాల్సిందే. కాగా, కొన్నిచోట్ల అనధికారిక పొత్తులే ఇలాంటి పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. త్రిముఖం.. చతుర్ముఖం పలుచోట్ల త్రిముఖం, చతుర్ముఖ పోటీ కనిపిస్తుంది. అలాంటి చోట్ల ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థు లే బరిలో ఉన్నారు. ఆయా చోట్ల అభ్యర్థులు తమ ను ఏ పార్టీ బలపర్చిందో స్పష్టంగా చెబుతూ బ రి లోకి దిగుతున్నారు. దీంతో ఫలితాలు ఎలా ఉంటా యనేది ఆసక్తికరంగా మారింది. నేరుగా పార్టీ కండువా వేసుకొని ప్రచారంలో కదులుతున్నారు. అ యితే ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారో చూడాల్సిందే.తొలివిడత ఎన్నికలు జరిగే మండలాల్లో పరిస్థితి ఇలా..మండలం మొత్తం పోటీ నెలకొన్న ఇద్దరు ముగ్గురు నలుగురు అంతకంటే జీపీలు జీపీలు అభ్యర్థులు అభ్యర్థులు అభ్యర్థులు ఎక్కువ అభ్యర్థులు ఇచ్చోడ 33 28 05 10 07 06 సిరికొండ 18 11 03 03 03 02 ఇంద్రవెల్లి 29 25 06 06 02 11 ఉట్నూర్ 38 31 07 06 06 12 నార్నూర్ 23 17 05 00 07 05 గాదిగూడ 25 21 05 00 10 06 మొత్తం 165 133 31 25 35 42 -
ఎన్నికల నిర్వహణలో ఆర్వోల పాత్ర కీలకం
కై లాస్నగర్: ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో రెండు, మూడోవిడత ఎన్నికల స్టే జ్–2 రిటర్నింగ్ అధికారులకు సోమవారం శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మో డల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఓటుహక్కు వినియో గం కోసం 18 రకాల గుర్తింపు పత్రాలు ఉన్నాయని, వాటిలో ఏదైనా ఒకదాన్ని తప్పనిసరిగా తీసుకువచ్చేలా ఓటర్లకు అవగాహన కల్పించా లన్నారు. ఇందులో స్థానికసంస్థల అదనపు కలె క్టర్ రాజేశ్వర్, జిల్లా శిక్షణ నోడల్ అధికారి మ నోహర్, డీపీవో రమేశ్, డిఎల్పీవో ఫణిందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ విధానం పరిశీలన.. ఇంద్రవెల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు.మండలకేంద్రంలోని ఎంపీడీవో కా ర్యా లయాన్ని సోమవారం సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానం పరిశీలించారు. అ నంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అధికా రులకు పలు సూచనలు చేశారు. ఇందులో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో జీవన్రెడ్డి, ఆర్వోలు,పోలింగ్ సిబ్బంది ఉన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలిఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పీవో యువరాజ్ మర్మాట్తో కలసి కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎంపీడీవో రాంప్రసాద్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
మండలానికో బెస్ట్ స్కూల్
ఆదిలాబాద్టౌన్: సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేద విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేందుకు ముందుకు సాగుతోంది. మండలానికి ఒక బెస్ట్ స్కూల్ను ఏర్పాటు చేసి మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాలు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాగా, అందులో జిల్లా ఉన్నట్లు విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. ప్రాథమికస్థాయి నుంచి ఇంటర్ వరకు ఇందులో విద్యాబోధన అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఒకే ఆవరణలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్న వాటిని ఎంపిక చేశారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా.. మండలానికి ఒకటి చొప్పున విద్యార్థుల సంఖ్య ఎ క్కువగా ఉన్న పాఠశాలలు, అన్ని సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు, పక్కా భవ నం, క్రీడా మైదానం ఉన్నవాటిని ఈ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు విద్యా శాఖాధికారులు జిల్లాలోని 19 ఉన్నత, మూడు ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఉత్తర్వులు అందగానే అందులో అన్ని వసతులు కల్పించేలా చర్యలు చేపట్టనున్నారు. అయితే పదో తరగతి పూర్తయిన తర్వాత గ్రామాల్లో బాలికలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. కొన్నిచోట్ల డ్రాపౌట్గా మిగులుతున్నారు. దీన్ని తగ్గించేలా యంత్రాంగం దృష్టి సారిస్తోంది. ఎంపికై న పాఠశాలలు ఇవే.. భీంపూర్ మండలంలోని యూపీఎస్ భీంపూర్, జైన థ్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ కూర, బేల మండలంలోని యూపీఎస్ ఉర్దూ మీడియం, గాదిగూడలోని యూపీఎస్ లోకారి(బి), నార్నూర్లోని జెడ్పీహెచ్ఎస్ భీంపూర్, ఇంద్రవెల్లిలోని ధనోర(బి), గుడిహత్నూర్లోని గుడిహత్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆదిలాబాద్రూరల్ మండలంలోని భీంసరి, ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, మావలలోని జెడ్పీఎస్ఎస్ మావ ల, తాంసి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశా ల, తలమడుగులోని సుంకిడి, బజార్హత్నూర్లోని జెడ్పీఎస్ఎస్, బోథ్లోని ధనో ర(బి), నేరడిగొండ మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్, ఇచ్చోడలోని జెడ్పీఎస్ఎస్ ఉర్దూ మీడి యం, సిరికొండ మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్, ఉట్నూర్లోని శ్యాంపూర్, భోరజ్లోని గిమ్మ(కె), సాత్నాలలోని అడ, సొనాలలోని జెడ్పీఎస్ఎస్లు ఎంపికయ్యాయి. -
ఓటరు.. బీ కేర్ ఫుల్!
బోథ్: ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు బంధుత్వాలు కలుపుతూ.. ప్రలోభాలకు గురి చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే గుడ్డిగా నమ్మి ఓటేయద్దు. వారి గుణగణాలను పరిశీలించాలి. పాలనలో సామర్థ్యాన్ని అంచనా వేయాలి. లేకుంటే సీన్ రివర్స్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఈ రోజు మందు, డబ్బులు పంపిణీ చేసిన వారిని గెలిపిస్తే రేపు వాళ్లు చేయాల్సిన పనులకు సైతం రేట్లు నిర్ణయిస్తారు. ఇంతకు చాలా రెట్లు అధికంగా వసూలు చేస్తారనే విషయం మరువొద్దు. ఆలోచించండి.. నిర్ణయం తీసుకోండి పంచాయతీ ఎన్నికలనేవి పల్లె ప్రగతికి ప్రాతిపదిక. అందుకే తాత్కాలిక పలకరింపులు, డబ్బు, మద్యం ప్రలోభాలకు గురికావొద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటు వేసే ముందు ప్రధానంగా ఈ అంశాలు గమనించాలి. ‘అక్క.. బావ లేడా.. ఎటుపో యిండు.. అల్లునికి ఓటుంది కదా.. అత్తమ్మ.. మామయ్యవి కలిపి ఐదోట్లు మనకే పడాలే.. మీకేం కావాలన్నా చేసి పెడతా.. సాయంత్రం బావతో మాట్లాడుతా..’ అంటూ ఓ అభ్యర్థి ఇంటింటి ప్రచారం సాగుతుందిలా. ‘తమ్మీ.. మన దగ్గర ఎంత మంది ఉన్నరు.. యూత్ అందరినీ సాయంత్రం పిలువు.. ఓ కాడ కూకుండవెట్టు.. వాళ్లను చిల్డ్ చేద్దాం.. వాళ్లకేం కావాల్నో అడు గు.. ఇచ్చేద్దాం.. నిన్ను నేను చూసుకుంటా.. నువ్వు నా రైట్ హ్యాండ్ లెక్క.. గెలిచినంక ఏ పని కావాలన్నా చేసే బాధ్యత నాది..’ అంటూ మరో అభ్యర్థి యూత్ ఓట్ల కోసం గాలం వేస్తున్నాడు. -
● 8 డిగ్రీలకు చేరువైన కనిష్ట ఉష్ణోగ్రత ● వణికిస్తున్న శీతలగాలులు ● చిన్నారులు, వృద్ధులకు తప్పని తిప్పలు
కై లాస్నగర్: జిల్లాపై చలిపంజా విసురుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. రెండు రోజులుగా 7 నుంచి 8 డిగ్రీల సెల్సియస్గా న మోదవుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో జనం గజగజ వణికిపోతున్నారు. శీతలగాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏజెన్సీ, అటవీప్రాంతాల్లోని పల్లెలు, పంట పొలాలపై మంచు దుప్పటి కప్పేస్తోంది. ఉదయం 10 దాటినా సూర్యుడు బయటకు రాని పరిస్థితి. పొగమంచు రహదారులను కమ్మేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళలో సైతం లైట్లు వేసుకుని ప్ర యాణంచాల్సి వస్తోంది. వేకువజామున పనులకు వెళ్లే కూరగాయాలు, పాల విక్రేతలు, పేపర్బా య్స్, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఆర్టీసీ కా ర్మికులు చలితీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. శీతల గాలుల ప్రభావంతో చిన్నారులు, వృద్ధులు, అస్తమా రోగులకు అవస్థలు తప్పని పరిస్థితి. సా యంత్రం ఆరు దాటిందంటే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర సమయంలో బయట కు వెళ్లే వారు స్వెట్టర్లు, ఇతర రక్షణ కవచాలు ధ రిస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో గ్రామాల్లో జ నం చలి మంటలు కాగుతూ రక్షణ పొందుతున్నా రు. రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలిమంట కాగుతున్న యువకులు జిల్లాలో భీంపూర్ మండలంలోని అర్లి(టి)లో 8డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే బజార్హత్నూర్లో 8.5, బోథ్ మండలం పొచ్చెరలో 8.7, సాత్నాలలో 8.8, తాంసి, ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దరి, బేల, చెప్రాలలో 9.1, సొనాలలో 9.3, గాదిగూడ మండలం లోకారి, తలమడుగులో 9.4, ఆదిలాబాద్ అర్బన్లో 9.5, తలమడుగు మండలం భరంపూర్లో 9.7 మావలలో 9.8, నేరడిగొండలో 9.9, ఇచ్చోడలో 10 డిగ్రీలుగా నమోదైంది. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను అధ్యక్షుడు సాయిని రవికుమార్ ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక ధారుడ్యం పెంపొందుతుందన్నారు. విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడలపై దృష్టి సారిస్తే గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఐదు గ్రూపుల్లో పోటీల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.అంతకుముందు రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను డీటీఎస్వో పార్థసారథి పరిశీలించారు. ఇందులో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమ్ము కృష్ణ, శ్రీధర్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
జీపీవోల నూతన కార్యవర్గం
కైలాస్నగర్: గ్రామ పరిపాలన అధికారుల (జీ పీవో) సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గెస్ట్హౌస్లో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా ఇందూర్ గంగన్న, ప్రధాన కార్యదర్శిగా అయ్యూబ్, ఉపాధ్యక్షులుగా సాయి, సలీం, అ సోసియేట్ అధ్యక్షుడిగా శ్రీధర్, కోశాధికారిగా వామన్, మహిళా అధ్యక్షురాలిగా అనసూయ, ఉపాధ్యక్షురాలిగా సువర్ణ, ప్రధాన కార్యదర్శిగా అహల్య, సహాయకార్యదర్శులుగా నరేశ్కుమార్, పులి స్వామి, కార్యవర్గ సభ్యులుగా పురుషో త్తం, శంకర్, అరుణ్, వినోద్, అక్షయ్, రమేశ్, అరవింద్, జ్యోతి ఎన్నికయ్యారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
ఆదిలాబాద్రూరల్: ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని చాందా(టి), జందాపూర్ సమస్యాత్మక గ్రామాలను ఆదివారం ఆయన సందర్శించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీ లించారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవిని వేలం ద్వారా నిర్ణయించడం చట్టరీత్యా నేరమని అ న్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూ చించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఆయన వెంట డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై విష్ణువర్ధన్, సిబ్బంది ఉన్నారు. తాంసి: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలో ని కప్పర్ల గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రా మస్తులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. ఆయన వెంట తాంసి, తలమడుగు, రూరల్ ఎస్సైలు జీవన్రెడ్డి, రాధిక, విష్ణు ఉన్నారు. జైనథ్: ఎన్నికల నేపథ్యంలో స్థానిక లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఎస్పీ ఓటర్లతో మా ట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పా టించాలన్నారు. వారి వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ శ్రవణ్కుమార్, ఎస్సై గౌతమ్, తదితరులున్నారు. -
డీఎంఈ పరిధిలోకి ‘వెల్నెస్’
ఆదిలాబాద్టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, జర్నలిస్టులకు నగదురహిత వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం 2019లో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు వైద్యులు, మందుల కొ రతతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకనుంచి ఆ స మస్యలకు చెక్ పడనుంది. ఇది వరకు వెల్నెస్ సెంటర్లు ఆరోగ్యశ్రీ సీఈవో పరిధిలో కొనసాగేది. ఇక నుంచి డైరెక్టర్ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ) పరిధిలోకి వచ్చాయి. జిల్లాలో రిమ్స్ నుంచి వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందిన ఉత్తర్వులు.. ఈ మేరకు డీఎంఈ నుంచి రిమ్స్ డైరెక్టర్కు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక నుంచి వెల్నెస్ సెంటర్ను తమ పరిధిలోకి తీసుకొని సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పెన్షనర్లు, ఉద్యోగులు, జర్నలిస్టులు కలిపి దాదాపు 6వేల మంది వరకు ఉంటారు. వెల్నెస్ సెంటర్కు వెళ్లినా వైద్యసేవలు అందక తిరిగి వచ్చిన సందర్భాలు అనేకం. పెన్షనర్లకు బీపీ, షుగర్ తదితర మందులు లేక ఇబ్బందులు పడ్డారు. ఇకనుంచి ఆ అవస్థలు తీరనున్నట్లు తెలుస్తోంది. ఇక ‘స్పెషల్’ సేవలు.. వెల్నెస్ సెంటర్లో ప్రస్తుతం ముగ్గురు ఎంబీబీఎస్ వైద్యులకు గాను ఒకరు మాత్రమే పనిచేస్తున్నారు. ఇద్దరు డెంటిస్టులకు గాను ఒకరు సెలవులో ఉండగా, ఒకరు పనిచేస్తున్నారు. ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఇక నుంచి ఈ సెంటర్లో ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, డెంటల్, గైనిక్, చిల్డ్రన్ స్పెషలిస్టులు, ఇతర వైద్యుల ద్వారా సేవలు అందించనున్నారు. దీంతోపాటు రోగనిర్ధారణ పరీక్షలు సైతం చేపట్టనున్నారు. ప్రతిరోజు వెల్నెస్ సెంటర్కు 100 నుంచి 200 మంది వస్తున్నారు. స్పెషలిస్ట్ వైద్యులు లేకపోవడంతో చాలా మంది ఇక్కడ వైద్యసేవలు పొందలేక పోతున్నారు. ఈ సేవలు ప్రారంభిస్తే వెల్నెస్ సెంటర్ కిటకిటలాడనుంది. మెరుగైన వైద్యసేవలు అందిస్తాం.. ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్లకు వెల్నెస్ సెంటర్లో వైద్యసేవలు అందించడం జరుగుతుంది. ఇదివరకు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండగా, వారం క్రితం డీఎంఈ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. రిమ్స్ ద్వారా వెల్నెస్ సెంటర్లో మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపడతాం. స్పెషలిస్ట్ వైద్యులను నియమిస్తాం. మందుల కొరత, ఇతర ఇబ్బందులు లేకుండా చూస్తాం. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ -
రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శం
ఆదిలాబాద్రూరల్: అంబేడ్కర్ రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శమని ఎంపీ గోడం నగేశ్, ఎ మ్మె ల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ వ ర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహంపై పూలు చల్లి నివాళులర్పించారు. బౌద్ధ వందనం స్వీకరించి పంచశీల జెండా ఆవిష్కరించారు. సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిబిరం పోస్టర్ ఆ వి ష్కరించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు కదలాల్సిన అవసరముందని తెలిపా రు. కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు భీంరావ్ వాఘ్మరే, ప్రధాన కార్యదర్శి దాదాసాహెబ్ జాబడే, భారతీయ బౌద్ధ మహా సభ నేత కాంతారావ్, మాతా రమాబాయి, మహిళా సంఘం అధ్యక్షురాలు దయశీల ఉకే, సభ్యులు కుష్వర్త బాయి లాంగ్డే, నీలాబాయి తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డుల సేవలు కీలకం
ఆదిలాబాద్ టౌన్: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. 63వ హోంగార్డు రైజింగ్డేను పురస్కరించుకుని శనివారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పరేడ్ కమాండర్ భూమన్న ఆధ్వర్యంలో మహిళా సిబ్బందితో కూడిన మూడు ఫ్లాటూన్ల జిల్లా హోంగార్డు బృందం పరేడ్ నిర్వహించి ఎస్పీకి గౌరవవందనం చేశారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16మంది హోంగార్డులకు ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఉలెన్ జాకెట్లు, రెయిన్కోట్లు అందజేశారు. విధి నిర్వహణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, శ్రీకాంత్, హోంగార్డ్ ఆర్ఐ చంద్రశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్లు రాకేశ్, గబ్బర్సింగ్, ఆశన్న, హోంగార్డు సిబ్బంది సురేందర్ తదితరులు పాల్గొన్నారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, వ్యాఖ్యలు చేసినా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఓ ప్రకటనలో హెచ్చరించా రు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. జిల్లా అంతటా 30పోలీస్ యాక్ట్ అమలు లో ఉందని, సభలు, సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల్లో గొడవలు వద్దు బోథ్: పంచాయతీ ఎన్నికలు ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా నిర్వహించేలా నాయకులు, గ్రామస్తులు సహకరించాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ సూచించారు. శనివారం సొనాల, బోథ్ మండల కేంద్రాలతోపాటు మండలంలోని కౌఠ బీ, కనుగుట్ట, ధన్నూర్ బీ గ్రామాల్లో శనివారం సా యంత్రం పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాల ను పరిశీలించారు. ఎన్నికలను వేలం ద్వారా దక్కించుకోవడం చట్టరీత్య నేరమని హెచ్చరించారు. చట్టాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని సూచించారు. ఏదైన సమస్య ఉంటే ‘డయల్ 100’కు ఫోన్ చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు. డీఎస్పీ జీవన్రెడ్డి, బోథ్ సీఐ గురుస్వామి, బోథ్ ఎస్సై శ్రీసాయి, బజార్హత్నూర్ ఎస్సై సంజయ్కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఓట్లన్నీ మనకే పడాలే..
కై లాస్నగర్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో ఏ ఊరికెళ్లినా గ్రామ రాజకీయాలపైనే చర్చ నడుస్తోంది. తొలి, మలి విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు ఖరారు కావడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నిన్న, మొన్నటి వరకు చూసీచూడనట్లు పట్టించుకోకుండా వెళ్లిన వారు ప్రస్తుతం ఓటర్లను ఆపి మరీ పలకరిస్తున్నారు. లేని పోని ప్రేమలు ఒలకబోస్తూ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. తమను సర్పంచ్గా గెలిపిస్తే మీరు అడిగిన పనులన్నీ చేసి పెడుతామని హామీ ఇస్తున్నారు. ఇంట్లోని ఓట్లన్నీ వేయాలని కోరుతున్నారు. అందుకు ఏం చేయమన్నా చేస్తామని నమ్మబలుకుతున్నారు. ముఖ్యంగా యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వారి మద్దతు కూడగట్టి ప్రచారం జో రుగా సాగిస్తే గెలుపు సునాయసమవుతుందనే ఉద్దేశంతో వారిని మందు, విందులతో ముంచెత్తుతున్నారు. అందుకు అవసరమైన డబ్బులను ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపిస్తున్నారు. క్రీడా కిట్లు అందిస్తున్నారు. విహారయాత్రలకు వెళ్లేందుకు అవసరమైన ఖర్చులన్నింటినీ సమకూర్చుతామని వారిని మచ్చిక చేసుకుంటున్నారు. మహిళల ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకుంటే ఆ ఇంట్లోని ఓట్లన్నీ మనకే వస్తాయనే ధీమాతో వారి అనుగ్రహం కోసం ఆరాటపడుతున్నారు. అలాగే తమతమ సామాజికవర్గాల ఓటర్ల పై గురి పెడుతున్నారు. గంపగుత్తగా ఓట్లు రాబట్టుకుంటే గెలుపు ఖాయమనే భావనతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా సామాజిక వర్గాల్లో పలుకుబడి కలిగిన పెద్ద మనుషులను మధ్యవర్తులుగా ఉంచి తమ సామాజిక ఓటర్లకు గాలం వేస్తున్నారు. వారికి మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఓట్లన్నీ పడాలంటూ వారడిగినంత ముట్టజెబుతున్నారు. ఆలయాలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు తమవంతు ఆర్థిక చేయూతనందిస్తున్నారు. తమను గెలిపిస్తే భవిష్యత్లో ఏం కావాలన్నా చేసి పెడతామని భరోసానిస్తున్నారు. ఇలా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా తమ చేతిచమురు వదిలించుకుంటున్నారు. నిన్న, మొన్నటి వరకు బరిలో ఉంటామని చెబుతూ వచ్చిన అభ్యర్థులు గుర్తులు ఖరారు కావడంతో వాటిని ఓటర్ల వద్దకు చేర్చి, వారిని ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబీకులూ గ్రామంలోని ప్రతీ ఇంటిని పలుసార్లు సందర్శిస్తూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓట్లు ఏ విధంగా రాబట్టుకోవాలి, ఎవరి మద్దతు కూడగడితే మెజార్టీ ఓట్లు తమకు వస్తాయంటూ జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. దీంతో పల్లెల్లో పంచాయతీరాజకీయ ప్రచారపర్వం జోరుగా సాగుతోంది. -
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
కైలాస్నగర్: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతా రణంలో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ ఎన్నికల సూక్ష్మ పరిశీలకులు, జోనల్ అధి కారులకు శిక్షణ ఇవ్వగా కలెక్టర్ హాజరై మాట్లాడా రు. సూక్ష్మ పరిశీలకులు పంచాయతీ పరిధిలోని వా ర్డులను పరిశీలించాలని తెలిపారు. 28కాలం ప్రొఫా ర్మాను విధిగా నింపాలని, పోల్ డే రోజు వివరాలు ఎప్పటికప్పుడు తెలుపాలని సూచించారు. జోనల్ అధికారులకు 9నుంచి 10పోలింగ్ కేంద్రాలు కేటా యించనున్నట్లు తెలిపారు. తన పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ పక్కాగా అమలు జరిగేలా చూడాలని సూచించారు. ఎస్ఎస్టీ, ఎ ఫ్ఎస్టీ బృందాలతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను కలిసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని తెలిపారు. ఫొటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, అభ్యర్థులు ఖర్చుల వివరా లు సంబంధిత అధికారులకు పంపేలా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు వెంకన్న, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా శిక్షణ నోడల్ అధికా రి మనోహర్, డీపీవో రమేశ్, డీఎల్పీవో ఫణీందర్రావు, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తదితరులున్నారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా నియమావళి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదాకా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచినవారు విజయోత్సవ ర్యాలీలు, ప బ్లిక్ మీటింగులు నిర్వహించరాదని తెలిపారు. ప్రకటనలు, అభివృద్ధి హామీలు చేయరాదని పేర్కొన్నా రు. ఇలాంటి చర్యలను తక్షణమే నిరోధించాలని రి టర్నింగ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపా రు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గమనిస్తే వెంట నే సంబంధిత ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు మండలాల విధుల కేటాయింపునకు జెడ్పీ సమావేశ మందిరంలో రెండో విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎన్నికల సాధారణ పరిశీలకుడు వెంకన్న ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి ఆదిలాబాద్రూరల్: అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సాంఘిక సంక్షేమ కార్యాలయ ఆవరణలో అంబేడ్కర్ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటం, విగ్రహాలతోపాటు మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్రావు, దళితాభివృద్ధి శాఖ అధికారి సునీతాకుమారి తదితరులున్నారు. -
● సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తుల ఆదర్శం ● నిత్యం ప్రజలతో ఉండేవారికే అందలం ● గతంలో ఓడిన అభ్యర్థులకూ అవకాశం ● ఆయా గ్రామాల్లో ఓటర్ల సమష్టి నిర్ణయం
సాక్షి, ఆదిలాబాద్: మొదటి విడత పంచాయతీ ఎన్ని కల్లో జిల్లాలో ఇప్పటికే పలువురు సర్పంచులు, వా ర్డు సభ్యులను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకుని ప్రత్యేకత చాటారు. ఆ గ్రామ అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ ఆదర్శంగా ముందుకు కదిలారు. నిత్యం ప్రజ లతో మమేకమై ఉండే వ్యక్తులు, సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారం చూపే చొరవ ఉన్నవారిని కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన వారికి అండగా నిలుస్తూ ఈసారి ఏకగ్రీవంగా ఎన్నుకుని వారిని అందలమెక్కించారు. ఓ పంచా యతీ పరిధిలో అనుబంధ గ్రామాలుండగా, గతంలో ఓ గ్రామానికి సర్పంచ్ పదవి కట్టబెట్టిన గ్రామస్తులు.. ప్రస్తుతం మరో గ్రామానికి పదవి అప్పగి స్తూ ఒప్పందం ప్రకారం నడుచుకున్నారు. దీంతో రెండు గ్రామాల్లో అభివృద్ధి సమపాళ్లలో జరగనుండడంతో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతలో 33 స్థానాలు.. మొదటివిడతలో ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏకగ్రీవ సర్పంచుల స్పష్టత వచ్చింది. మొదటి విడతలో 33 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నా ర్నూర్ మండలంలో ఆరు, ఇచ్చోడలో ఐదు, గాది గూడలో నాలుగు, ఇంద్రవెల్లిలో నాలుగు, సిరికొండలో ఏడు, ఉట్నూర్ మండలంలో ఏడు సర్పంచ్ సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పుడు అటు.. ఇప్పుడు ఇటు ఇచ్చోడ మండలం దేవుల్నాయక్ తండా సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా రాథోడ్ లలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కిందటి ఎన్నికల్లో రాథోడ్ లలిత ఎన్నికల్లో పోటీ చేసి రాథోడ్ భీంబాయి చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. గ్రామస్తులు మాత్రం ఈసారి ఆమైపె నమ్మకం చూపెడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా ప్రత్యేకత చాటారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోయిన ఆమైపె ఆదరణ చూపెట్టడం ద్వారా గ్రామస్తులు విలువలు కలిగిన రాజకీయాలను చాటారు. ముచ్చటగా మూడోసారి.. అప్పుడు ఓడిపోవడంతో.. గ్రామ రాజకీయాల్లో ఇదో ఔన్నత్యం. సాధారణంగా మనకు దగ్గరగా నివసించే వ్యక్తి సమస్యలు పరిష్కారిస్తారని, ఇక్కడే అభివృద్ధి పనులు చేపడతారని జనాలు నమ్మకం పెట్టుకుని ఆదరించడం చూస్తుంటాం. గతంలో గ్రామంలో ఒక వైపు నివసించే వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకుంటే ఆ సమయంలోనే వచ్చే ఎన్నికల్లో మరోవైపు నుంచి వ్యక్తిని ఆదరిస్తామని ఒప్పందం చేసుకోవడం, దానికి అనుగుణంగా మాట నిలుపుకొని ఈ ఎన్నికల్లో ఆచరించడం గ్రామస్తులకే సాధ్యం. అలాంటిదే ఈ ఏకగ్రీవాలకు నిదర్శనం. ఇంద్రవెల్లి మండలం గట్టెపల్లి సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా సర్పంచ్గా ఈసారి ఆత్రం అనితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమె ఆ గ్రామంలోని అనుబంధ గ్రామమైన చింతగూడకు చెందిన మహిళ. కిందటి సారి గట్టెపల్లికి చెందిన కుమ్ర మోహన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం మరోవైపు నివసించే వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకున్నారు. సమక గ్రామపంచాయతీ ఎస్టీ జనరల్కు కేటాయించగా, సర్పంచ్గా ఈసారి కుమ్ర రాజేశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో సమకకు చెందిన సోయం రంభబాయిని సర్పంచ్గా ఎన్నుకోగా, అప్పుడే మరోవైపు ఉండే పాఠగూడకు చెందిన వారికి అవకాశం కల్పిస్తామని ఒప్పందం చేసుకున్నారు. దానికి అనుగుణంగా ముందుకు కదిలారు. గ్రామంలో ఈ ఆదర్శ రాజకీయాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. -
టూరిజం అభివృద్ధికి చర్యలు
ఆదిలాబాద్ టౌన్: అటవీ సంపద వృద్ధి, టూరి జం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ట్లు రాష్ట్ర అడిషనల్ పీసీసీఎఫ్ రత్నాకర్ జోహా రి తెలిపారు. అటవీ ప్రాంతాలను పరి శీలించేందుకు జిల్లాలో పర్యటించిన ఆయన శనివా రం అటవీశాఖ గెస్ట్ హౌస్లో మీడియాతో మా ట్లాడారు. కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ పరి ధిలో టైగ ర్ జోన్ ఏర్పాటుకు పలు గ్రామాలను గుర్తించినట్లు తెలిపారు. పులుల సంరక్షణ, ఎకో టూరి జాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నా రు. అటవీ ప్రాంతంలో లక్కను ప్రోత్సహిస్తూ స్థానికులు ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అటవీ సరిహద్దుల రక్షణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. బాసర జోన్లోని కవ్వాల్ టైగర్ అభివృద్ధికి ఇన్చార్జీగా తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అటవీ ప్రాంతంలో పులుల రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో వాటి రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. డీఎఫ్వో ప్రఽశాంత్ బాజీరావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
‘సీఎంను ఎందుకు పొగుడుతున్నవ్’
ఆదిలాబాద్ టౌన్: రాష్ట్ర బీజేపీ నేతలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే, ఎమ్మె ల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్రెడ్డిని ఎందుకు పొగుడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ప్రశ్నించా రు. ఎమ్మెల్యే వైఖరిని బీజేపీ నేతలే విమర్శిస్తున్నారని ఆరోపించారు. శనివారం స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఎమ్మెల్యే తనపై చేసిన వ్యాఖ్యలు ఖండించారు. హైదరాబాద్లో కార్యాలయం ప్రారంభించి ఢిల్లీలో పైరవీలు చేస్తున్న విషయాన్ని ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్ శ్రేణులతో చ ర్చించారని, ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరనే విష యం ఆ పార్టీ నేతలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. పరిశ్రమలు స్థాపించి యువతకు ఉ ద్యోగాలిప్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రస్తుతం పరిశ్రమను ప్రైవేట్ పరం చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్ర శ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ కౌ న్సిలర్లు, స్థానిక నేతలను ఎమ్మెల్యే నయవంచనకు గురి చేశారని ఆరోపించారు. పార్టీ కార్యాలయ నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారని, కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేశారని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలున్నారు. -
వదిన, మరిది మధ్య పంచాయతీ పోరు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ గ్రామ పంచాయతీలో ఈ నెల 11న జరగనున్న పంచా యతీ ఎన్నికల్లో వదిన, మరిది మ ధ్య రసవత్తర పోరు సాగుతోంది. హాజీపుర్కు చెందిన మాధవరపు రామారావు భార్య శ్రీలత బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవగా రామారావు సోదరుడు వెంకటరమణారావు బీజేపీ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వదిన, మరిది మధ్య జరుగుతున్న పోరులో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.బరిలో తోడికోడళ్లు...మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలోని టీకానపల్లి పంచాయతీలో తోడికోడళ్లు సర్పంచ్ పదవికోసం పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన బద్రి రమేశ్ భార్య సౌజన్య బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవగా అతని సోదరుడు బద్రి వేణు భార్య లక్ష్మి బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీలో ఉంటోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా మాధవరపు శైలజ పోటీలో ఉంది. మరి ముగ్గురిలో విజయం ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సర్పంచ్గా నాడు భర్త.. నేడు భార్యదండేపల్లి: 2019 పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని మామిడిపల్లి సర్పంచ్గా ఎల్తపు శ్రీనివాస్ గెలుపొందాడు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో శ్రీనివాస్ తన భార్య ఎల్తపు వైష్ణవిని బరిలో నిలిపాడు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ రోజున సమీప ప్రత్యర్థి గుర్రాల మాధవి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో వైష్ణవి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఇచ్చోడ: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సహ కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని గుండాల, కేశవపట్నం, అడేగామ(బి), ఇచ్చోడ పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించి మా ట్లాడారు. ఎన్నికల్లో వేలం పాటలు నిర్వహించడం చట్టా రీత్యా నేరమన్నారు. నామినేషన్ కేంద్రాల పరిశీలన తలమడుగు: మండలంలోని సుంకిడి, తలమడుగు గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పరిశీలించారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శంకర్ తదితరులున్నారు. -
‘సీసీఐని ప్రైవేట్ పరం చేసే కుట్రలు’
ఆదిలాబాద్టౌన్: సీసీఐని ప్రైవేట్ పరం చేసే కుట్ర లను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్తో ఎమ్మెల్యే శంకర్ చే తులు కలిసి సీసీఐ పరిశ్రమను ప్రైవేట్కు అప్పగించే దిశగా కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీసీఐ పునరుద్ధరణ కో సం కేటీఆర్తో వెళ్లి కేంద్ర మంత్రులను కలిసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవ సభల పేరిట మోసపూరిత కా ర్యక్రమాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ విజయోత్సవ సభలను విమర్శిస్తుంటే, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేశంకర్ మాత్రం సీఎంను పొగడ్తలతో ముంచెత్తడం రెండు పార్టీల మధ్య ఉన్న కుట్ర ను బట్టబయలు చేస్తోందన్నారు. ఇందులో పార్టీ పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు ప్రహ్లాద్, సాజితోద్దీన్, రమేశ్, జగదీష్, శ్రీని వాస్, ప్రశాంత్ తదితరులున్నారు. -
నేల సంరక్షణ అందరి బాధ్యత
ఆదిలాబాద్టౌన్: నేల సంరక్షణ అందరి బాధ్య త అని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై.ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదిలా బాద్ వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పరిశోధన స్థానం, సీపీఎఫ్ ఎన్జీవో సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ నేలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ భవిష్యత్తు తరాలకు సారవంతమై న, కాలుష్యం లేని నేలను అందించాలంటే ర సాయనాల అధిక వాడకాన్ని తగ్గించి, నేలలో కరగని ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించాలన్నా రు. ఇందులో వ్యవసాయ పరిశోధన స్థానం ప్ర ధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహన్, హెచ్వోడీ డాక్టర్ జి.మంజులత, కీటక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త రాజశేఖర్, సీపీఎఫ్ ఎన్జీవో ప్రతినిధి సుదర్శన్, జి.అనిత, డి.కుమారస్వామి, సుధాన్షు, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
ఆదిలాబాద్టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో యూనియ న్ రాష్ట్ర ఐదో మహాసభల పోస్టర్లను శుక్రవా రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 7 నుంచి 9 వరకు మెద క్ పట్టణంలో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు వేలాది మంది కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గిమల్ల స్వామి, సహాయ కార్యదర్శులు సురేందర్, పొచ్చన్న, నగేశ్, స్వామి, రాకేష్, సురేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘అభివృద్ధిని జీర్ణించుకోలేకే అసత్య ఆరోపణలు’
ఆదిలాబాద్: నియోజకవర్గ పరిధిలో అభివృద్ధిని జీర్ణించుకోలేకనే మాజీ మంత్రి జోగు రామన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రగతి గురించి సీఎం రేవంత్రెడ్డిని కలిస్తే అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి అడుగులు పడడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరవ్వడం వంటివి జరిగితే ఇష్టానుసారంగా వ్యాఖ్యానించడం సరి కాదన్నారు. గతంలో యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్కు ఇతర జిల్లాలకు తరలిపోతుంటే అధికారంలో ఉండి కూడా ఏమి చేయలేకపోయారని దుయ్యబట్టారు. సమావేశంలో నాయకులు రఘుపతి, రవి, దినేష్ మటోలియా, జ్యోతి, రాకేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
కై లాస్నగర్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఇందులో పాల్గొనే వారందరిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్ వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ, ష్యూర్ ఎన్జీవో సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యా రు. పండితులు, మౌలానా, పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. చిన్న వయసులో వివాహం చేస్తే వారి భవిష్యత్తుతో పాటు పు ట్టబోయే పిల్లల ఆరోగ్యం పాడవుతుందని తెలిపా రు. అనంతరం బాల్య వివాహం చట్టపరమైన నేరం హెచ్చరిక వాల్పోస్టర్ను సంబంధిత మత పెద్దలతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకట్ స్వామి, సభ్యులు సమీర్ ఉల్లాఖాన్, దశరథ్, డేవిడ్, ష్యూర్ ఎన్జీవో జిల్లా కో ఆర్డినేటర్ వినోద్, అర్చక సంఘం సభ్యులు, చర్చి పాస్టర్లు, మౌలానా ఖాజీలు, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డి నేటర్ సతీశ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. దేశభక్తి అలవర్చుకోవాలి విద్యార్థి దశ నుంచే దేశభక్తి, సేవాభావం అలవర్చుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సాయుధ ద ళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని ఎన్సీసీ కేడెట్లు చేపట్టిన విరాళాల సేకరణను తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. దేశ రక్షణకు అంకితమైన సైనికుల కుటుంబాల సహా యార్థం ఎన్సీసీ కేడెట్స్ అధిక మొత్తంలో విరా ళా లు సేకరించాలని సూచించారు. వాటిని సైని క సంక్షేమ సహాయ నిధి ఖాతాలో జమచేస్తామని తెలిపా రు. మాజీ సైనికులు శంకర్, దేవన్న పాల్గొన్నారు.స్టేజ్–2 అధికారుల పాత్ర కీలకంగ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తొలి విడత ఎన్నికల అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టి ఫలితాలు ప్రకటించాక వాటి వివరాలు యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. అంతకు ముందు ఆర్వోల ఎన్నికల విధుల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ వారికి శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు టి. వెంకన్న, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా శిక్షణ నోడల్ అధికారి మనోహర్, డీపీవో రమేశ్, డీఎల్పీఓ ఫణిందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
నేరడిగొండ/తలమడుగు/బజార్హత్నూర్/బోథ్: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధి కారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు వెంకన్న అన్నారు. నేరడిగొండ, తలమడుగు, బజార్హత్నూర్, బోథ్, సొ నాల మండలాల్లో శుక్రవారం ఆయన పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. నేరడిగొండ ఎంపీడీవో కార్యాలయంలో భద్రపర్చిన ఎన్నికల సామగ్రిని తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే ‘టిపోల్’ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవోలు శేఖర్, శంకర్, ఆర్వో పవన్, ఏఆర్వో గంగయ్య తదితర సిబ్బంది తదితరులున్నారు. -
● పోలింగ్ సాఫీగా సాగేలా చర్యలు ● జిల్లాలో 50 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ● 64 కేంద్రాల్లో మైక్రోఅబ్జర్వర్స్
కై లాస్నగర్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో తలెత్తిన ఘటనల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 229 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఆయా కేంద్రాలపై జిల్లా అధికారులు నిరంతరం నిఘా ఉంచేలా వెబ్కాస్టింగ్ చేయనున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు సాగుతోంది. ప్రశాంత పోలింగ్ లక్ష్యం... జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మకమైన 102 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్స్ను నియమించనున్నారు. బ్యాంకు, రైల్వే, పోస్టల్శాఖల ఉద్యోగులను ఎంపిక చేశారు. వారికి శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే మరో 127 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఉన్నతాధికారులు ఆయా కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ తీరును పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ పర్యవేక్షించే సిబ్బందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నారు. విడతల వారీగా ఇలా.. ఎన్నికలు సాఫీగా సాగేలా చర్యలు గతంలో స్థానిక ఎన్నికలు జరిగిన సమయంలో గ్రామాల్లో తలెత్తిన సంఘటనల ఆధారంగా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశాం. అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాతంగా నిర్వహించేలా వెబ్ కాస్టింగ్తో పాటు మైక్రోఅబ్జర్వర్స్ను నియమిస్తున్నాం. వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నాం. ఎన్నికలు సాఫీగా సాగేలా చర్యలు చేపడుతున్నాం. – జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
సాక్షి,ఆదిలాబాద్: పంచాయతీ ఎన్నికల్లో నామినేష న్ల పర్వానికి తెరపడింది. జిల్లాలో మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా, స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగిసింది. మొదటి విడతకు సంబంధించి ఇప్పటికే పరిశీలన, ఉపసంహరణ ఘట్టం పూర్తవగా ఈ విడతలోని పలు జీపీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాలు కూడా స్పష్టమయ్యాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరెవరనేది తేటతెల్లమైంది. వారికి గుర్తులు కూడా కేటాయించారు. ఇక రెండో విడతకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రి య పూర్తి కాగా, శనివారం ఉపసంహరణ ఘట్టం సాగనుంది. మూడో విడతకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ శుక్రవారం రాత్రి వరకు ఎన్ని వచ్చాయనే దానిపై సంఖ్యాపరంగా అధికారులకు ఇంకా స్పష్టత రాలేదు. ఏకగ్రీవం.. మొదటివిడతకు సంబంధించి పలు సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విడతకు సంబంధించి ఏకగ్రీవాల సంఖ్యపై పంచాయతీ అధికారులు స్పష్టంగా ప్రకటించారు. రెండో విడతలో ఏకగ్రీవాలు, అభ్యర్థులు పోటీలో ఎవరెవరనేది నేడు తేలనుంది. ఈ విడతకు సంబంధించి ఉపసంహరణ ఘట్టం ఈరోజు జరగనుండగా, ఆయా పంచాయతీల్లో పోటీ పరిస్థితిపై ఆసక్తి నెలకొంది. ఇక మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం పూర్తి కాగా, శనివారం పరిశీలన ప్రక్రియ జరగనుంది. వచ్చే మంగళవారం ఉపసంహరణ ప్రక్రియ ఉంది. మొదటి విడతకు ఈనెల 11న, రెండో విడతకు 14న, మూడో విడతకు 17న ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనుంది. పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేస్తారు. ఆ ప్రక్రియ పూర్తయితే అదే రోజు ఫలితాలు వెలువడతాయి. ఎన్నికలు జరిగే మండలాలు.. జిల్లాలో ఆదిలాబాద్అర్బన్ మినహా మిగతా 20 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నా యి. మొదటి విడతలో 6 మండలాలు ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చో డ, రెండోవిడత 8 మండలాలు ఆదిలాబాద్రూరల్, మావల, బేల, జైనథ్, సాత్నాల, భోరజ్, తాంసి, భీంపూర్, మూడో విడత 6 మండలాలు బోథ్, సొ నాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగులో ఎన్నికలు జరగనున్నాయి.ప్రచారం షురూ.. మొదటి విడతలో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరెవరనేది స్పష్టత రావడంతో అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులతో ప్రచార పర్వం మొదలుపెట్టారు. ఇక ఆయా పార్టీలు తాము బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం రంగంలోకి దిగాయి. నియోజకవర్గ, మండల, పంచాయతీ పార్టీ ముఖ్య నేతలు తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రణాళికలు రూపొందించి ముందుకు కదులుతున్నారు. మొత్తంగా పంచాయతీ పోరు రసవత్తరంగా సాగుతుంది. విడతల వారీగా పంచాయతీ ఎన్నికల పరిస్థితి..విడత సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం వార్డు స్థానాల సంఖ్య ఏకగ్రీవంమొదటి 166 33 1390 953 రెండో 156 –– 1260 –– మూడో 151 –– 1220 –– మొత్తం 473 33 (ఇప్పటివరకు) 3870 953 (ఇప్పటివరకు) -
అలాగెలాగ..!
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధి లోని ఆదిలాబాద్రూరల్ మండలంలో గల ఓ గ్రా మపంచాయతీకి ఎస్టీ (జనరల్) రిజర్వేషన్ ఖరారైంది. ఇక్కడ మొదటి నుంచి మూడు ప్రధాన పార్టీలు తాము బలపర్చిన అభ్యర్థులను బరిలోకి దించాలని యోచించాయి. రెండో విడతలో ఈ పంచాయతీలో ఎన్నికలు ఉండగా, ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఉపసంహరణ ప్రక్రియ నేడు ఉంటుంది. ఇక్కడ రెండు కంటే ఎక్కువ నామినేషన్లు దాఖ లైనప్పటికీ ఓ ఇద్దరు అభ్యర్థులు తమకు సంబంధించి నామినేషన్ ప్రక్రియలో ఏదైన పొరపాటు జరిగి తిరస్కరణకు గురవుతుందనే ఆలోచనతో తమ సంబంధికులతోనే బినామీగా నామినేషన్లు వేయించా రు. స్క్రూటీని పూర్తికాగా ఆ నామినేషన్లు అలాగే నిలిచినప్పటికీ ఉపసంహరణలో ఆ ఇద్దరు మాత్ర మే చివరికి బరిలో నిలుస్తారనేది ఆ గ్రామంలో ఇప్పుడు చర్చ సాగుతోంది. బినామీలు తమ నామి నేషన్లను పసంహరించుకుంటారనేది ప్రచా రం జరుగుతుంది. ఇద్దరు మాత్రమే బరిలో నిలుస్తుండగా, ఓప్రధానపార్టీకి తాము బలపరిచే అభ్యర్థి ప్రత్యేకంగా లేకపోవడంతో కంగు తినాల్సి వచ్చింది. ఈ గ్రామంలో అనధికారిక పొత్తులు చేసుకొని రెండు పార్టీలు కలిసి ఒకే అభ్యర్థిని సమర్థిస్తుండడంతో ఇప్పుడు ఆ ప్రధాన పార్టీ సందిగ్ధంలో పడింది. అనధికార పొత్తులు.. గ్రామాల్లో అనధికారిక పొత్తులు ప్రధాన పార్టీలకు తలనొప్పి తెచ్చి పెడుతుంది. జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ఈ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీల నుంచి బలపర్చిన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్రణాళికలు రూపొందించాయి. తాము అనుకున్నది ఒకటైతే.. అక్కడ మరో లా జరిగిపోవడంతో చివరికి తమ ప్రాతినిధ్యానికే ఎసరు వస్తుందనే యోచనలో ఆయా పార్టీల నేతలు ఉన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతోనేనా.. గ్రామాల వారీగా పార్టీ బలపర్చిన అభ్యర్థులను బరిలోకి దించే విషయంలో సరైన ప్రణాళిక లేకపోవడం కొన్ని గ్రామాల్లో ఇప్పుడిప్పుడు బయట పడుతుండడంతో పార్టీ ఇన్చార్జీలు కంగు తినాల్సిన పరి స్థితి ఏర్పడుతుంది. అలాంటిదే ఆదిలాబాద్ రూర ల్ మండలంలోని ఓ గ్రామంలో తేటతెల్లం కావడంతో ఈ ఎన్నికల్లో గెలవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఓ పార్టీకి అక్కడి పొత్తు కారణంగా ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇది ఆ ఒక్క గ్రామపంచాయతీ అని కాకుండా పలు పంచాయతీల్లో బయటకొస్తుండడంతో ఆయా పార్టీల కు తలనొప్పిగా మారాయి. ఇది పరిస్థితి.. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం చివరిదైన మూడో విడతకు సంబంధించి శుక్రవారంతో పూర్తయింది. ఇక నామినేషన్ల పరిశీలన పరంగా మొదటి, రెండో విడతలు పూర్తి కాగా, శనివారంతో మూడో విడత కూడా పూర్తి కానుంది. ఉపసంహరణ ఘట్టం రెండో విడతకు సంబంధించి శనివారం పూర్తి కానుండగా, మూడో విడతకు సంబంధించి వచ్చే మంగళవారంతో పూర్తి కానుంది. ఉపసంహరణ ఘట్టాల ప్రక్రియ కొలిక్కి వస్తుండడంతో గ్రామాల్లో ఇలాంటి సిత్రాలు బయటకొస్తున్నాయి. కొన్నిచోట్ల చివరికి ఇద్దరే అభ్యర్థులు నిలిచే పరిస్థితి ఉండడంతో మూడో పార్టీ నేతలు తాము ప్రత్యేకంగా బలపర్చిన అభ్యర్థి లేకపోవడంతో కిం కర్తవ్యం అంటూ ఆలోచనలో పడుతున్నారు. -
ఏకగ్రీవం దిశగా..
నేరడిగొండ: మండలంలో ఏడు సర్పంచ్ స్థానా లకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. రాజురా, ఆరెపల్లి, కొర్టికల్(కె), కుంటాల(కె), వెంకటాపూర్, కుంటాల(బి), లఖంపూర్(జి) గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వగ్రామమైన రాజురా సర్పంచ్, ఉపసర్పంచ్, 8 మంది వార్డు సభ్యులను గ్రామస్తులు ఏకగ్రీవం చేసుకున్నా రు. సర్పంచ్గా జాదవ్ స్వరాజి, ఉపస ర్పంచ్గా రాథోడ్ బాపురావు, వార్డుసభ్యులుగా మీరా బాయి, సంజుల, రెనాబాయి, అశోక్ , మెగాజీ, రాథోడ్ బాపురావు, సాయమ్మ, అమర్సింగ్ను ఎన్నుకున్నారు. బజార్హత్నూర్లో రెండు జీపీలు .. బజార్హత్నూర్: మండలంలోని భూతాయి (కే), చింతలసాంగ్వి జీపీల్లో గ్రామపెద్దలు శు క్రవారం సింగిల్ నామినేషన్లు వేయించి సర్పంచ్, ఉపసర్పంచ్లతోపాటు వార్డుమెంబర్ల ను ఏకగ్రీవం చేసుకున్నారు. చింతలసాంగ్వీ స ర్పంచ్గా మడవి పద్మలత,ఉపసర్పంచ్గా నీలకంఠ, భూతాయి(కే) సర్పంచ్గా సింధుజైతు, ఉపసర్పంచ్గా భీంరావ్ ఎన్నికయ్యారు. -
విజయోత్సహాం..
ఆదిలాబాద్టౌన్/కై లాస్నగర్: ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ సక్సెస్ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించిన సభకు జనం భారీగా తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రాక గంటన్నర ఆలస్యమైనా ప్రజలు ఓపిగ్గా ఎదురుచూశారు. జిల్లాలో రూ.260 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించి సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణతో సభ ను ప్రారంభించారు. ఇందులో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, జి.వినోద్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా అంటే అభిమానం..: సీఎం ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమని, పీసీసీ అధ్యక్షుడినయ్యాక ఇక్కడి నుంచే కార్యక్రమాలను ప్రారంభించానని సీఎం గుర్తు చేశారు. జిల్లాను దత్తత తీసుకున్నానని త్వరలోనే అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తానని పేర్కొన్నారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న జిల్లాకు ఏడాదిలోనే ఎయిర్బస్సు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అలాగే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీ మంజూరు చేయనున్నట్లుగా హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కేంద్రంగా నాగోబా సన్నిధిలో కుమురంభీం పేరిట ఉంటే బాగుంటుందని, ఇది తన సూచనగా పేర్కొన్నారు. అలాగే మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ సెక్టార్లో పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుని ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. కొరటా–చనాఖ ప్రాజెక్ట్ను త్వరలోనే ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. అలాగే కుమురంభీం జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహితపై ప్రాజెక్ట్ నిర్మించి ఉమ్మడి జిల్లా సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేలా జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేసినట్లుగా వివరించారు. ఇలా సీఎం జిల్లాకు అనేక వరాలు కురిపించడంతో ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. భారీ బందోబస్తు సీఎం పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీల నాయకులను పోలీసులు వేకువజామునే ముందస్తు అరెస్ట్లు చేసి స్టేషన్లకు తరలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకను సభ ప్రాంగణంలో ఉన్న ప్రజలకు తెలియజేసేలా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. అంతకు ముందు ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నాయకులు, ట్రెయినీ కలెక్టర్ సలోనిచాబ్రా హెలీప్యాడ్ వద్దకు చేరుకుని సీఎంకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. భూ సేకరణకు నిధులివ్వండి కొరటా–చనాఖా ప్రాజె క్ట్ నిర్మాణం 97శాతం పూర్తయింది. పెండింగ్లో ఉన్న ఆయకట్టు భూసేకరణ నిధులు త్వరగా విడుదల చేసి సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇచ్చిన మాట ప్రకా రం ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సీఎం ఆదిలా బాద్కు ఎయిర్పోర్టు భూ సేకరణ జీవో జారీ చేశారు. అలాగే పంటచేలకు రోడ్లు వేసేలా పొ లంబాటకు రూ.40 కోట్లు విడుదల చేశారు. జిల్లాను దత్తత తీసుకుని ప్రత్యేక ప్రేమ చూ పుతూ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎంకు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ సమస్యలపై సమీక్ష నిర్వహించాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సాగునీటి చెరువులు, కెనాల్స్, రోడ్లు, పాఠశాలల పరిస్థితులు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల ను పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉమ్మడి జిల్లాస్థాయి సమీ క్ష సమావేశం సీఎం అధ్యక్షతన నిర్వహించాలి. ఉ ట్నూర్ ఐటీడీఏకు ఆరేళ్లుగా పాలకవర్గం నియమించకపోవడంతో పీఎంకేఎస్వై, పోడు భూములు వంటి ఆదివాసీల సమస్యలపై చర్చించే అవకాశం లే దు. ఐటీడీఏ పాలకవర్గాన్ని నియమించాలి. ఎయిర్పోర్టు భూ సేకరణకు జీవోజారీ, ఇంటిగ్రేటేడ్ స్కూ ల్ మంజూరు చేసిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ అన్నివర్గాలకు న్యాయం సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర భుత్వం అన్నివర్గాల ప్ర జల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తుంది. జిల్లాలోని రైతులకు మేలు చేకూర్చేలా రూ.2,500 కోట్ల రుణమాఫీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి సా యాన్ని అందించాం. అర్హులైన పేదలందరికీ రేషన్కార్డులిచ్చాం. పేదలకు దొడ్డుబియ్యం కాకుండా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. – పి.సుదర్శన్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం ప్రభుత్వం రూ. లక్షల కోట్ల అప్పులున్నా.. ప్రతీ నెలా రూ.కోట్ల రూపేనా వడ్డీలు చెల్లిస్తున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ, అభివృద్ధి ని ఎక్కడా ఆపకుండా అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద విద్యార్థులు రూపాయి ఖర్చులేకుండా కార్పొరేట్స్థాయిలో విద్యనభ్యసించేలా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశాం. రెండేళ్లలోనే 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందించేలా ప్రతిపాదనలు స్వీకరించాం. త్వరలోనే ఆ మొత్తాన్ని రైతులకు అందజేస్తాం. జిల్లాను పర్యాటకపరంగా ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. – జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి యువత నైపుణ్యాభివృద్ధికి చర్యలు అహంకార, అవినీతి కారణంగానే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు ద్వారా గద్దెదించి ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రూ.500లకు గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో అమలు కానీ అనేక పథకాలను ప్రజలకు అందిస్తున్నాం. ముఖ్యంగా యువతలో నైపుణ్యాలు మెరుగుపర్చేలా ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేశాం. – గడ్డం వివేక్, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి -
పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేయాలి
కై లాస్నగర్: ఆర్వో, స్టేజ్–2 జోనల్ అధికారులు వెంటనే పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రోడ్డు మార్గాలను పరిశీలించాలన్నారు. నిర్దేశించిన జాబితా ప్రకారం ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు ఉన్నాయో లేదో చూడాలని తెలిపారు. సిబ్బంది, ఎన్నికల సామగ్రి తరలింపునకు అనువైన వాహనాలు వెంటనే సమకూర్చాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్లో జనరల్ అబ్జర్వ ర్స్ టి.వెంకన్న, ఎల్.విజయ, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఆదిలాబాద్టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ని ష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ బి.శివధర్రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నేపథ్యంలో అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టుల ద్వారా తనిఖీలు చేపట్టాలని సూచించారు. మతపరమైన, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత చర్యలు ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో సాయుధ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో సమస్యలను సృష్టించే వారిని బైండోవర్ చేయాలని అన్నారు. ప్రజల్లో నమ్మకం పెంచేందుకు, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫ్లాగ్మార్చ్ నిర్వహించాలని, ప్రజల్లో పోలీసులపై ధైర్యం నింపాలని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు చేయాలని, గ్రామాలను సందర్శిస్తూ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీ లు జరగకుండా పర్యవేక్షించాలని చెప్పారు. విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాలను సందర్శిస్తూ సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. వీడీసీ ఆగడాలను అరికట్టాలని, మద్యం అక్రమ రవాణా ను అడ్డుకోవాలని, గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించకుండా వేలం పాటలు వేసే వారిపై చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సెల్ఫోన్ నెట్వర్క్ లేని సందర్భంలో వీహెచ్ఎఫ్ సెట్ ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్మించాలని తెలిపారు. పోలీస్స్టేషన్ల వారీగా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకుని గ్రా మాల్లో జరుగుతున్న విషయాలను తెలుసుకోవాల ని అన్నారు. పోలీసు సిబ్బంది ప్రత్యక్ష, పరోక్ష రాజ కీయాలకు దూరంగా ఉండాలని, ఎన్నికలు ప్రభావి తం చేసే ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సూచించా రు. సమావేశంలో మల్టీ జోన్–1 ఐజీ ఎస్.చంద్రశేఖర్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల, ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, అదనపు ఎస్పీలు కాజల్సింగ్, బి.సురేందర్రావు, ఏఎప్పీ చిత్తరంజన్, పి.మౌనిక, డీఎస్పీలు వహీదుద్దీన్, వెంకటేశ్వర్, పోతారం శ్రీనివాస్, జీవన్రెడ్డి, ఉమ్మడి జిల్లా అధికారులు, సీఐలు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి -
ఆకాంక్షకు అక్షరం తోడైంది..
ఆకాంక్షకు అక్షరం తోడైంది.. అడవి బిడ్డల దశాబ్దాల కలలు సాకారమవుతున్నాయ్.. ఆశలకు రెక్కలతోపాటు ఇక పెద్ద చదువులూ దగ్గరకానున్నాయ్.. ఎర్రబస్సు కాదండోయ్.. ఇక ఎయిర్బస్ సేవలు అందుబాటులోకి రానున్నాయ్.. ఉన్నత విద్య చేరువయ్యేలా వర్సిటీ కూడా మన చెంతకే వచ్చేస్తోంది. ఈ ప్రాంతవాసుల ఆకాంక్షలకు అనుగుణంగా ‘సాక్షి’ ఈ ఏడాది చర్చా వేదికలకు శ్రీకారం చుట్టింది. ప్రజల గొంతుకగా నిలి చి ‘రెక్కలొచ్చేనా..’ అంటూ ఎయిర్పోర్టు ఆవశ్యకతపై గళమెత్తింది.. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నత విద్య అందుబాటులోకి రావాలన్నా, ఉద్యోగావకాశాలు మెరుగుపడాలన్నా విశ్వవిద్యాలయ ఏర్పాటు తథ్యమని భావించి ‘వర్సిటీ.. కావాల్సిందే’ అంటూ నినదించింది. ‘సాక్షి’ వరుస కథనాలు పాలకులను ఆలోచింపజేశాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు. ఆదిలాబాద్ గడ్డపై సీఎం గురువారం ఎయిర్పోర్టుపై కీలక ప్రకటన చేశారు. అంతేకాదు వర్సిటీ మంజూరు బాధ్యత తమదే అని అన్నారు. ఇంద్రవెల్లి అమరుల కేంద్రం అనుకూలంగా ఉంటుందని సూచించారు.. సామాజిక బాధ్యతగా ‘సాక్షి’ చొరవ సర్వత్రా చర్చనీయాంశమైంది.. ప్రజా గొంతుకపై అభినందనలు వెల్లువెత్తాయి. – ఆదిలాబాద్టౌన్/కై లాస్నగర్/ఆదిలాబాద్సీఎంకు ధన్యవాదాలు దశాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్న విశ్వవిద్యాలయ ఏర్పాటుపై సీఎం ప్రకటన చేసినందుకు యూనివర్సిటీ సాధన సమితి తరఫున ధన్యవాదాలు. ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేయడం, అలాగే కుమురంభీం పేరును ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. – తొగరి భాస్కర్, యూనివర్సిటీ సాధన సమితి కోకన్వీనర్ దశాబ్దాల కల నెరవేరనుంది అడవుల జిల్లాలో త్వరలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా సీఎం ప్రకటించడం హర్షణీయం. వర్సిటీ ఏర్పాటు ఆవశ్యకతపై ‘సాక్షి’ 2025 జూలై 9న చర్చావేదిక నిర్వహించింది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. జిల్లావాసుల దశాబ్దాల కల సాకారంలో పాలు పంచుకున్నందుకు ‘సాక్షి’ మీడియాకు ధన్యవాదాలు. – రమణాగౌడ్, కోకన్వీనర్ వర్సిటీ ప్రకటన హర్షణీయం సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ వేదికగా ఈ ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడం హర్షించదగ్గ విషయం. విశ్వవిద్యాలయం అందుబాటులో లేకపోవడంతో స్థానిక యువత దశాబ్దాలుగా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో సీఎం ప్రకటన జిల్లా వాసులకు ఆనందం కలిగించింది. ‘సాక్షి’ ఆధ్వర్యంలో ప్రారంభించిన యూనివర్సిటీ ఏర్పాటు ఉద్యమానికి ముఖ్యమంత్రి మద్దతు పలకడం హర్షణీయం. – బద్దం పురుషోత్తంరెడ్డి, యూనివర్సిటీ సాధన సమితి జిల్లా కన్వీనర్ సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నాం.. జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు సంవత్సరం వరకు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ ప్రాంతం వాణిజ్య పరంగానూ అభివృద్ధి చెందుతుంది. అలాగే యూనివర్సిటీ ఏర్పడితే జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. – ముడుపు ప్రభాకర్రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు నిర్మాణమైతే దూరభారం తగ్గుతుంది. ఈ ప్రాంతం వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే యూనివర్సిటీ ఏర్పాటుతో పేద విద్యార్థులకు మేలు చేకూరుతుంది. ఎయిర్పోర్టు, యూనివర్సిటీ సాధన కోసం ‘సాక్షి’ కృషి అభినందనీయం. – చిల్క సతీశ్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు త్వరగా అందుబాటులోకి తేవాలి సీఎం రేవంత్రెడ్డి జిల్లాకు ఎయిర్పోర్టు, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సభలో హామీ ఇచ్చారు. వీటిపై ఈ ప్రాంతవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. హామీలకే పరిమితం కాకుండా త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజాసమస్యలపై జనం గొంతుకగా ‘సాక్షి’ కృషి అభినందనీయం. – రంగినేని మనిషా, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ‘సాక్షి’ చొరవ అభినందనీయం.. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం అనేది జిల్లావాసుల చిరకాల కోరిక. ఈ క్రమంలో ‘సాక్షి’ ఇటీవల అన్నివర్గాలతో చర్చావేదిక నిర్వహించింది. సాధన కమిటీని సైతం ఏర్పాటైంది. రా జకీయ నాయకులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. ప్రజాపాలన విజయోత్సవ సభలో సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి ఎయిర్పోర్టు పనులు ఏడాదిలో ప్రారంభిస్తామని హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మీ డియా పాత్ర ఎంతో కీలకమనేది స్పష్టమైంది. – విజయ్బాబు సల్ల, రిటైర్డ్ లెక్చరర్ వర్సిటీ ఏళ్ల నాటి కల.. యూనివర్సిటీ అనేది ఈ ప్రాంత ప్రజల ఏళ్ల నాటి కల. ముఖ్యమంత్రి ప్రకటనతో అది సాకారమవుతుందనే నమ్మకం కలిగింది. గతంలో మంజూరైన యూనివర్సిటీ చేజారిపోయినట్లు కాకుండా జిల్లాలోని రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా ప్రయత్నించాలి. యునివర్సిటీ సాధన విషయంలో ‘సాక్షి’ కృషి అభినందనీయం. – ఉదారి నారాయణ, కవి, రచయిత -
ఘంటసాలకు ఘన నివాళులు
చీమకుర్తి: సినీ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా గురువారం చీమకుర్తిలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అభయ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు మద్దాళి మాధవరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ముందురోజు నిర్వహించిన పాటల పోటీలలో విజేతలకు బహుమతులను అందించారు. ఒంగోలు టౌన్: ఒంగోలు రైల్వేస్టేషన్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహిళా పోలీస్స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం ఒంగోలు రైల్వేస్టేషన్లో స్పెషల్ పార్టీ పోలీసులు, టాస్క్ఫోర్స్, ఈగిల్ టీం సిబ్బంది డాగ్ స్క్వాడ్తో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా కరూర్ ఈ రోడ్కు చెందిన పి.రమేష్ నుంచి 6.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం జీఆర్పీ పోలీసులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. గంజాయి విక్రయించే, వినియోగించే వ్యక్తులపై చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమాచారం ఉంటే టోల్ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, పోలీసు వాట్సప్ నంబర్ 9121102266కు తెలియజేయాలని కోరారు. తనిఖీల్లో ఎస్సై శివరామయ్య, సుదర్శన్, చెంచయ్య, ఏఎస్సై మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: పశుసంవర్థక శాఖ ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్లో ఎన్సీడీసీ రుణాల అక్రమాలపై శుక్రవారం ఒంగోలు నగరంలోని ప్రకాశం భవన్లో విచారణ చేపట్టనున్నారు. విచారణాధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ తన చాంబర్లో ఉదయం 11 గంటలకు విచారణ చేపట్టనున్నారు. గతంలో ఏడీ ఎం.రవికుమార్ అక్రమాలకు పాల్పడ్డారంటూ కొందరు సమాఖ్యలోని సంఘాల చైర్మన్లు, సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇంటిగ్రేటెడ్ షిప్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్, ఇతరులు రుణాల పంపిణీ సమయంలో నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టనున్నారు. ఒంగోలులో గతంలో పనిచేసిన ముగ్గురు జాయింట్ డైరెక్టర్లను కూడా విచారణకు రావాలని జాయింట్ కలెక్టర్ సమాచారం పంపించారు. చీమకుర్తి రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో దేవస్థానాల భూములను ఎండోమెంట్ అధికారులు పరిశీలించారు. గురువారం మండలంలోని గోనుగుంట గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయ భూములు, అలాగే చీమకుర్తిలో వేణుగోపాలస్వామి, చండ్రపాడు గ్రామంలో రుద్రేశ్వర స్వామి ఆలయ భూములను పరిశీలించారు. ఆలయ భూములను దేవస్థానాల పేరిట నమోదు చేయాలన్న అర్జీ విషయంలో ఎండోమెంట్ అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. తహసీల్దారు బ్రహ్మయ్య, ఎండోమెంట్ ఆఫీసర్లు రజినీ కుమారి, లక్ష్మీ ప్రసన్న, మండల సర్వేయర్ మోజెస్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కొత్తపట్నం: జాతీయ స్థాయి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ప్రణవి సిల్వర్ మెడల్ సాధించింది. నవంబర్ 24 నుంచి ఈ నెల 3వరకు రాజస్థాన్లో జైపూర్లో యూనిర్సిటీ స్థాయి పోటీలు జరిగాయి. ఈపోటీల్లో మండలంలోని రంగాయపాలెం పంచాయతీ, వలసపాలేనికి చెందిన ప్రణవి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. ఈమె తండ్రి ద్వారం జాలిరెడ్డి ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. రాబోయే రోజుల్లో ప్రణవి అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పతకాలు సాధించాలని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామస్తులు, డి.వెంకటేశ్వరరెడ్డి అభినందనలు తెలిపారు. ఒంగోలు టౌన్: కనిగిరి పోలీసు స్టేషన్లో సీపీఎం కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం అక్రమమని ఆపార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. కనిగిరి మండలం మాచవరం గ్రామానికి చెందిన ఒక మహిళకు సంబంధించిన సమస్య విషయంలో తగిన న్యాయం చేయాలని పోలీసుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. -
మీ ఆలోచనలు సమాజానికి ఉపయోగపడాలి
ఒంగోలు సబర్బన్: నేటి యువత ఆలోచనలు, మేధోసంపత్తి సమాజంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార దిశగా ఉండటంతో పాటు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ట్రిపుల్ ఐటీ, క్విస్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో గురువారం నిర్వహించిన ఐడియా టు ఇంపాక్ట్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డీవీఆర్ మూర్తి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ, సీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వరరావు, ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థులు, క్విస్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఒంగోలు మెట్రో: అపర చాణిక్యుడిగా పేరు పొందిన స్వర్గీయ కొణిజేటి రోశయ్య మన జిల్లా ప్రకాశం జిల్లా వాసి కావడం మన అదృష్టవని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బొగ్గవరపు సుబ్బారావు పేర్కొన్నారు. గురువారం ఒంగోలు ఆర్టీసీ డిపో వద్ద గల ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యాలయం, వాసవీ భవన్లో కొణిజేటి రోశయ్య నాలుగో వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా, తమిళనాడు గవర్నర్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి పేరు తెచ్చారని కొనియాడారు. అంతకుముందు ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొని రోశయ్య విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ యక్కల తులసిరావు, మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మువ్వల శ్రీనివాసులు, కొల్లిపర్ల సురేష్, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షుడు తాతా గుప్తా, జలదంకి కృష్ణారావు, శ్రీనివాసరావు, దుడ్డు రంగనాయకులు జెమినీ నాగేశ్వరరావు, అచ్యుత సత్యం తదితరులు పాల్గొన్నారు. -
పుల్లారెడ్డి కుటుంబ సభ్యులకు వైవీ పరామర్శ
ఒంగోలు సిటీ: మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పల్లెర్ల పుల్లారెడ్డి ఇటీవల మృతి చెందారు. మృతుడు పల్లెర్ల పుల్లారెడ్డి కుటుంబ సభ్యులను రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి గురువారం పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఒంగోలు నగరాధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, తదితరులు ఉన్నారు. -
పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు
ఒంగోలు సిటీ: పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం టెలిఫోన్ అడ్వైజరీ కమిటీలో మెంబర్లుగా స్థానం కల్పించినందుకు దామరాజు క్రాంతికుమార్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రరెడ్డి మర్యాద పూర్వకంగా సుబ్బారెడ్డిని కలిసి శాలువతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, ప్రస్తుతం పార్టీకి అండగా ఉండి పనిచేస్తున్న ప్రతి నాయకుడునీ, ప్రతి కార్యకర్తకు భవిష్యత్లో మాజీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేస్తారని తెలిపారు. అనంతరం ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబుని దామరాజు సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, 45వ డివిజన్ అధ్యక్షుడు పల్నాటి వెంకటేశ్వర రెడ్డి, 44వ డివిజన్ అధ్యక్షుడు మల్యాద్రి రెడ్డి, ఉండెల వెంకటేశ్వర రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పుస్తకాన్ని చుండూరి రవిబాబు తయారు చేసి అందజేశారు. -
ప్రచారంతో జిమ్మిక్కు మోసంతో మ్యాజిక్కు..!
చీమకుర్తి: గత ప్రభుత్వంలో రాజులా బతికిన రైతన్న చంద్రబాబు ప్రభుత్వంలో ధీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడొచ్చినా రైతులకు అన్నీ ఇబ్బందులే. వ్యవసాయం అంటే ముందు నుంచి చిన్నచూపే. వ్యవసాయం దండగా అని చెప్పిన ఏకై క నాయకుడు ఆయన అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూరియా వాడొద్దు క్యాన్సర్ వస్తుందంటారు ? తినే వారు లేరు వరి సాగు ఎందుకంటారు ? పొగాకు వద్దు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని పిలుపునిస్తారు. నల్లబర్లీ పొగాకు బ్యాన్ పెట్టాం దాని జోలికి వెళ్లొద్దంటారు ? ఇదీ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన గత 18 నెలల కాలంలో రైతులకు చేసిన మేలు. ఇలాంటి తరుణంలో రైతుల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోందని గమనించి నవంబర్ 25 నుంచి 30వ తేదీవరకు రైతన్న మీకోసం పేరుతో కార్యక్రమం చేప్పటారు. ఈ కార్యక్రమం ప్రచారం కోసం తప్ప రైతులకు ఒరిగిందేమి లేదని రైతులు బాహాటంగానే ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. నీటిలభ్యత ఆధార పంటలు, విలువ ఆధారిత పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్ టెక్నాలజీ, ప్రభుత్వ సేవల యాప్ల ద్వారా వ్యవసాయ సమాచారం తెలుసుకోవాలనే 5 రకాల అంశాలతో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందని రైతులు విమర్శలు చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్ కార్యమంపై అంతగా ఆసక్తి చూపలేదని పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. అందుకేనేమో అధికార పార్టీ ప్రజాప్రతినిధితో పాటు కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనటానికి పెద్దగా ఉత్సాహం, ఆసక్తి చూపించలేదు. ఏదో వ్యవసాయ అధికారులను అడ్డంపెట్టుకొని స్థానిక అనుకూల రైతులతో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రజల్లో పరువుపోకుండా చల్లగా లాక్కొచ్చారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మార్కెట్ యార్డులు ఉన్నా వృథానే.. నియోజకవర్గ పరిధిలో మద్దిపాడు మార్కెట్ యార్డు ద్వారా ఇప్పటి వరకు ఒక్క పంట ఉత్పత్తికి కొనుగోలు చేయటం, మద్దతు ధరను అందించడం వంటి పనులు చేసిన పాపాన పోలేదని యార్డు కార్యాలయంలోని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. నియోజకవర్గంలోని చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల పరిధిలో ఖరీఫ్, రబీ సీజన్లలో ఎక్కువుగా రైతులు పొగాకు, శనగ, మొక్కజొన్న, వరి, కంది, మిర్చి వంటి ప్రధాన పంటలను సాగు చేశారు. నియోజకవర్గం పరిధిలో దాదాపు 1.20 లక్షల ఎకరాలకు పైగా సాగు భూమిలో దాదాపు 60 వేల మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతుంటే వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం పేపర్ మీద ప్రకటనల జోరు తప్ప ఆర్థిక మద్దతు చేకూర్చింది లేదని వాపోతున్నారు. అరుగుల వద్దకు వచ్చి .. ఫొటోలకు పోజులిచ్చి సంతనూతలపాడు: వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఇంటి వద్దకు వెళ్లి సమాచారం సేకరించి యాప్లో అప్లోడ్ చేసేందుకు ఉద్దేశించిన రైతన్నా మీ కోసం కార్యక్రమం ఫొటోలకే పరిమితమైందని వాదనలు వినిపిస్తున్నాయి. మండలానికి చెందిన అధికారులు, టీడీపీ నేతలు, వారికి అనుకూలంగా ఉన్న కొందరు రైతులకు పోస్టర్లు ఇచ్చి ఫొటోలు తీసుకున్నారు. ప్రజలు కూర్చునే అరుగుల వద్దకు కొందరు రైతులను ఆహ్వానించి పోస్టర్లు ఆవిష్కరించి ఫొటోలతో సరిపెట్టారు. పూర్తిగా నష్టపోయిన శనగ రైతు.. మద్దిపాడు: మండలంలో ప్రధానంగా శనగ, పొగాకు పంటలను పండిస్తారు. ఈఏడాది ఖీరీఫ్లో 4 వేలకు మించలేదు. పొగాకు రైతుల పరిస్థితి మాత్రం ధీనంగా ఉంది. వేలం కేంద్రంలో పొగాకు బేళ్లను నాణ్యత పేరుతో కొనుగోలు చేయకపోవడంతో తిరిగి పంపారు. ప్రతిరోజు వందల బేళ్లను తిరస్కరణ పేరుతో పొగాకు రైతు పొట్టగొట్టారు. దళారులు, పొగాకు వేలం కేంద్రం అధికారులు, ప్రభుత్వం వలన రైతన్నలు పూర్తిగా అప్పులపాలయ్యారు. పరిహారం ఇవ్వకకుండా.. పరిహాసం చీమకుర్తి రూరల్: మండలంలో మోంథా తుపాన్ ప్రభావంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. వరి 70 ఎకరాలు, మొక్కజొన్న 175 ఎకరాలు, మినుము 4 ఎకరాలు, సజ్జ 5 ఎకరాలు, లేత పంటలు వరి 350, మొక్కజొన్న 150 ఎకరాలలో రైతులు నష్టపోయారు. వరికి మద్దతు ధర ఏ రకం రూ.2389, బీ రకం రూ. 2369 ప్రకటించారు. కానీ తీరా చూస్తే కొనే నాథుడు లేకపోవడంతో రైతులు రూ.1200 అమ్ముకున్నారు. రైతుల్లో భ్రమ కల్పించేందుకు చంద్రబాబు సర్కార్ అపసోపాలు రైతన్న మీకోసం అంటూ సర్కార్ మరో మోసం చంద్రబాబు సర్కార్లో కనిపించని మద్దతు ధర కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించని టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు నాలుగులుప్పలపాడు: మండలంలో ముఖ్యంగా బర్లీ పొగాకు సాగు చేస్తే నేటికీ రైతుల ఇళ్లల్లో నిల్వలు అలానే ఉన్నాయి. మిర్చి పంటకు రూ.12300 మద్దతు ధర అని చెప్పినా ఆచరణలో అది ఏమాత్రం సాధ్యం కాకపోవడంతో నేటికీ కోల్డు స్టోరేజీల్లో తమ పంటలను నిల్వ చేసుకున్నారు. మరికొంత మంది రైతులు సాగు కోసం నష్టాలకు అమ్మాల్సి వచ్చింది. సబ్సిడీపై రైతులకు శనగలు ఇస్తామని మోసం చేసింది. ప్రభుత్వం అమ్మే ధర కన్నా దళారుల వద్దే తక్కువ రేటుకు శనగలు వస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతన్నా మీ కోసంలో స్థానిక ఎమ్మెల్యేను పాల్గొనమని చెప్పినా ఏ ఒక్క గ్రామంలో కూడా ఎమ్మెల్యే పాల్గొనలేదు. ఇక్కడే అర్థమవుతోంది చంద్రబాబు సర్కార్కు రైతంటే ఎంత అలుసోనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యా సంస్థల బంద్ విజయవంతం
ఒంగోలు సిటీ: మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని, జిల్లా యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీలకు నిధులు కేటాయించి భవన నిర్మాణాలు ప్రారంభించాలని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు సీహెచ్ వినోద్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏపీ జేఏసీల ఆధ్వర్యంలో గురువారం ఒంగోలు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను మూయించి నెల్లూరు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించాలని, పది రకాల డిమాండ్లతో బంద్ నిర్వహించామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై సైకిల్ యాత్రలు, ధర్నాలు, చలో విజయవాడ వంటి పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రితో చర్చలు నిర్వహించినా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని విమర్శించారు. విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యపు ధోరణికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. మార్కాపురంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరాస్వామి పాల్గొని ర్యాలీ నిర్వహించి బంద్ను జయప్రదం చేశారని తెలిపారు. దర్శిలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ పాల్గొని విద్యార్థులతో సభ నిర్వహించి అనంతరం ర్యాలీ చేశారు. కనిగిరిలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారావు పాల్గొని బంద్ నిర్వహించారు. గిద్దలూరులో జిల్లా అధ్యక్షుడు ఆరోను, నాయకులు తేజ, అమర్నాథ్ పాల్గొని బంద్ విజయవంతం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు ఇచ్చారు. చీమకుర్తిలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి దేవరాజు పాల్గొని బంద్ చేశారు. సింగరాయకొండలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు దేవా పాల్గొని బంద్ నిర్వహించారు. సంతనూతలపాడు మండలం మంగమూరులో ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్ పాల్గొని బంద్ నిర్వహించారు. కొండపిలో విద్యార్థులు బంద్ నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడు కేజీ మస్తాన్ మద్దతు తెలిపారు. -
‘తెల్ల’బోతున్నారు!
పత్తి రైతులను కష్టాలు వీడడంలేదు. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవక విత్తనా లు మొలకెత్తలేదు. మళ్లీ మళ్లీ విత్తుకోవాల్సి వచ్చింది. తర్వాత వర్షాలు సమృద్ధిగా కురవడంతో పంట ఎదుగుదల ఆశించిన స్థాయిలో ఉంది. దీంతో రైతులు సంతోషపడ్డారు. కానీ సెప్టెంబర్ చివరివారంలో, అక్టోబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు పూత, కాయలు రాలిపోయాయి. చివరకు మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో దిగుబడి సగానికి పడిపోయింది. ఇక వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు కూడా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం నాణ్యత లేదని సీసీఐ మద్దతు ధర తగ్గించింది. మరోవైపు ఎకరాకు 12 క్వింటా ళ్లకు మించి కొనబోమని నిబంధన విధించింది. దీంతో కాస్త బాగా దిగుబడి వచ్చిన రైతులు ఇప్పుడు తెల్ల బంగారాన్ని ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. మరోవైపు చేలల్లో ఉన్న పత్తిని ఏరేందుకు కూలీలు కూడా దొరకడం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
● క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య ● తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు ● బిర్సాయిపేటలో విషాదం
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ ఎస్సై ప్రవీణ్, మృతురాలి కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం.. ఉట్నూర్ మండలం బిర్సాయిపేటకు చెందిన ఏళ్ల ర జిత (27)కు ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మాన్కుగూడకు చెందిన సుదర్శన్తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఆరు నెలలపాటు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత సుదర్శన్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు రజితకు తెలిసింది. అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దంపతులకు ఇద్దరు పిల్లలు (రెండేళ్ల పాప, ఆరు నెలల బాబు)ఉన్నారు. మరోవైపు సుదర్శన్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ‘నువ్వు సచ్చిపోతే.. నేను మరో అమ్మయిని పెళ్లి చేసుకుంటా’ అని వేధించేవాడు. పంచాయితీలు జరిగినా మారలేదు.. సుదర్శన్–రజిత దంపతుల గొడవలపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. పెద్ద ల ముందు సక్రమంగా ఉంటానని చెప్పే సుదర్శన్ తర్వాత తన పాత పద్ధతినే కొనసాగించాడు. ఎప్పటికై నా మారకపోతాడా అని రజిత ఎదురు చూసింది. కానీ, భర్త నిత్యం తాగి వచ్చి సూటిపోటి మా టలు అనడం.. సచ్చిపో అని వేధించడాన్ని తట్టుకో లేకపోయింది. ఈ క్రమంలో బుధవా రం ఉదయం దంపతులు గొడవ ప డ్డారు. అనంతరం సుదర్శన్.. తన భా ర్య తమ్ముడు రవికి ఫోన్ చేసి.. మీ అక్క ను తీసుకుపో అని చెప్పాడు. దీంతో ర వి సాయంత్రం వచ్చాడు. ర జితను బైక్ పై తీసుకుని పుట్టింటికి బయల్దేరారు. భర్త మాటలు భరించలేక.. ఈ క్రమంలో మండలంలోని ఘన్పూర్ గ్రామం వద్దకు రాగానే భర్త అన్న మాటలు, వేధింపులు గుర్తుకురావడంతో రజిత కన్నీటిపర్యంతమైంది. ఈ క్రమంలో బైక్ పైనుంచి ఒక్కసారిగా కిందికి దూకి అడవిలోకి పరుగెత్తింది. అప్పటికే చీకటి పడడంతో రవి ఆమెను వెతుక్కుంటూ లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో చున్నీతో ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గురువారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. తల్లి కోసం ఆరాటపడుతున్న పసి హృదయాలను చూసి చూసిన ప్రజలు కంటతడి పెట్టుకున్నారు. -
జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య
లక్ష్మణచాంద: జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల మేరకు సోన్ మండలంలోని గంజాల్ గ్రామానికి చెందిన బందెల రవి (38) అప్పుల బాధతో మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 3న గ్రామ సమీపంలోని తన పొలంలో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు 108లో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలు..కుభీర్: అనారోగ్యంతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దొడర్నా తండాకు చెందిన జాదవ్ రేణబాయి (70) వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలు భరించలేక బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. మృతురాలి కుమారుడు జాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిలక్ష్మణచాంద: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి మహిళ మృతి చెందిన సంఘటన సోన్ మండలంలోని గంజాల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం మతిస్థిమితం లేని ఓ మహిళ గురువారం రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంజాల్ గ్రామానికి చెందిన నేల లింగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు..ఉట్నూర్రూరల్: ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను నిరాకరించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందుతాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గంగన్నపేటకు చెందిన జాడి లక్ష్మీనారాయణ (17) కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను యువతి నిరాకరించడంతో గత నెల 7న పురుగుల మందు తాగాడు. విషయం స్నేహితులతో చెప్పడంతో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆదిలాబాద్లోని రిమ్స్కు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఐఐఎస్ఎఫ్కు ఎంపిక
కాసిపేట: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ సైన్స్ ఉపాధ్యాయుడు జాడి ప్రవీణ్ ప్రతిష్టాత్మకమైన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) 2025కు ఎంపికయ్యారు. ఈనెల 6 నుంచి 9 వరకు హర్యానాలోని పంచకులాల్లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరగనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పరిశోధకుల వినూత్న ఆలోచనలు, సాంకేతిక అభివృద్ధి పరిశోధనలను ప్రదర్శించే అతిపెద్ద వేదికల్లో ఐఐఎస్ఎస్ ఒకటన్నారు. గూడెంలో పౌర్ణమి జాతర దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం మార్గశిర పౌర్ణమి జాతర వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకున్నారు. 201 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. దత్తాత్రేయ జయంతి వేడుకలు.. మండలంలోని గూడెం శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం శ్రీ దత్తసాయి జయంతి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. అష్టోత్తర శతకలశ పూజలు, పాలాభిషేకం, పల్లకి సేవ, తదితర పూజలు చేశారు. 13 మంది బైండోవర్కై లాస్నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 13 మంది పాత నేరస్తులను బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బేల మండలంలోని చప్రాలకు చెందిన పలువురు పాత నేరస్తులను గురువారం బేల తహసీల్దార్ రఘునాథ్ రావు ఎదుట బైండోవర్ చేశారు. ఎన్నికల సందర్భంగా గొడవలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గొడవలకు పాల్పడితే రూ.లక్ష జరిమానా విధించనున్నట్లు తెలిపారు. -
108, 102 ఉద్యోగులకు శిక్షణ
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గురువారం మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన 108, 102 ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, రాష్ట్ర ప్రధాన కార్యాలయ అధికారి గజేందర్, 108, 102 వాహనాల సాంకేతిక అధికారి లింగాచారి ఆధ్వర్యంలో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్), సీపీఆర్లతో పాటు, సుఖ ప్రసవాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం ఉత్తమ ప్రతిభను కనబర్చిన కాసిపేట పైలట్ జె.కొమురయ్యకు ఉత్తమ ఉద్యోగి అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో సంపత్, కొండలరావు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.


