breaking news
Adilabad
-
అనుమతి సరే.. పరిహారమేది?
సాత్నాల: జిల్లాలో పారిశ్రామిక రంగంలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ఏ ర్పాటుకు కీలక ముందడుగు పడింది. అయితే పరి హార పంపిణీ అంశం మాత్రం ఇంకా పూర్తి కావడం లేదు. మండలంలోని రామాయి గ్రామ పరిధిలో ప్రతిపాదించిన ఈ పరిశ్రమకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖల నుంచి తాజాగా గ్రీన్సిగ్నల్ లభించింది. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఉన్న ప్రధానఅడ్డంకుల్లో ఒకటి తొలగినట్లయింది. రామా యి–రాంపూర్ ప్రాంతంలో ప్రతిపాదించిన ఈ ప్రా జెక్టులో సిమెంట్ తయారీతో పాటు క్లింకర్ ఉత్పత్తి, అనుబంధ విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధిత శాఖ నుంచి తాజాగా అనుమతి లభించింది. 2 ఎంఎంటీపీఏ ఉత్పత్తి లక్ష్యం.. ప్రాజెక్టులో సుమారు 2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్, 1.20 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో క్లింకర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే విద్యుత్ అవసరాల కోసం 36మెగావాట్ల సామర్థ్యంతో క్యాప్టివ్ థర్మల్ పవర్ ప్లాంట్, వ్యర్థఉష్ణం నుంచి విద్యుత్ ఉత్పత్తి వంటివి ప్రాజెక్టులో కీలకాంశాలు. మరోవైపు ఫ్యాక్టరీ ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. పూర్తిస్థాయిలో అందని పరిహారం ఫ్యాక్టరీ నిర్మాణం జరగనున్న ప్రదేశంలో భూములు కోల్పోతున్న 35 మంది రైతులకు ఇంకా పరిహారం అందలేదు. దాదాపు 110 ఎకరాలకు సంబంధించి పరిహారం అందాల్సి ఉంది. సంస్థ ఆధ్వర్యంలో సేకరించిన భూమిలో ప్రస్తుతం ఫెన్సింగ్ ప్రక్రియ షురూ చేయడంతో ఆ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తమకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేట్టాలని వారు కోరుతున్నారు. -
ఇబ్బందులు పడుతున్నాం
భూములు తీసుకునే సమయంలో పరిహారం అందుతుందని అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చా రు. నెలలు గడుస్తున్నా ఇంకా అందలేదు. వ్యవసాయం చేసుకునే అవకాశం లేక, ఇటు పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం, కంపెనీ ప్రత్యేక దృష్టి సారించి మా సమస్యను త్వరగా పరిష్కరించాలి. – ఠాక్రే ప్రకాశ్, నిర్వాసితుడు పరిహారం అందలేదు..ఫ్యాక్టరీ కోసం మా భూములు తీసుకుని 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పరిహారం అందలేదు. భూమినే నమ్ముకుని జీవిస్తున్న మా కుటుంబాలకు డబ్బులు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి త్వరగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి. -
దేశ సేవలో పల్లె బిడ్డలు
నేరడిగొండ: పల్లె వాతావరణంలో పెరిగిన యువత తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంతో పాటు దేశ రక్షణలోనూ భాగస్వాములవుతున్నారు. మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన 40మంది యువకులు సైన్యంలో చేరి దేశ సేవలో నిమగ్నమయ్యారు. గ్రామంలో మొత్తం 710 జనాభా ఉండగా, 180 కుటుంబాలు, 620 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామం నుంచి ఇంతమంది యువకులు ఆర్మీలో చేరడం ప్రత్యేకతగా నిలుస్తోంది. దేశ సేవ కోసం అడుగులు.. గ్రామానికి చెందిన పలువురు యువకులకు చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలనే కోరిక ఉండేది. ఆ దిశగా పట్టుదలతో ముందడుగు వేశారు. శారీరక శిక్షణ తీసుకుని, ఆర్మీ నియామకాల్లో పాల్గొని ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం వీరిలో కొందరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారిని చూసి.. మరికొందరు గ్రామానికి చెందిన పలువురు ఇప్పటికే సైన్యంలో సేవలందిస్తుండటంతో వారిని చూసి మరికొందరు గ్రామ యువకులు అదే బాట పట్టారు. ఆర్మీలో కొలువే లక్ష్యంగా సిద్ధమవుతున్నారు. సైనికులుగా పనిచేస్తున్న వారు సెలవుల్లో గ్రామానికి వచ్చినప్పుడు వీరికి అవసరమైన సూచనలు, శిక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. కుటుంబాలకు గర్వకారణం.. దేశరక్షణ కోసం తమ పిల్లలు దూరప్రాంతాల్లో విధులు నిర్వహిస్తుండటంతో వారి కుటుంబ సభ్యులు గర్వంగా భావిస్తున్నారు. పండుగలు, ఇతర వేడుకలకు దూరంగా ఉన్నప్పటికీ దేశసేవకు ప్రాధాన్యం ఇస్తున్న తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకే గ్రామం నుంచి 40 మంది యువకులు సైన్యంలో చేరడం.. గ్రామీణ యువతలోని దేశభక్తికి, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది. -
ఆర్వోబీ, ఆర్యూబీ పనులు వేగవంతం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్ఆదిలాబాద్: పట్టణంలో పెండింగ్లో ఉన్న ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణ పనులను రానున్న రెండు నెలల్లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలి పారు. జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ వద్ద కొనసాగుతున్న పనులను రైల్వేశాఖ డిప్యూటీ సీఈ మల్లికార్జున్తో కలిసి ఆదివారం పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతి, గడువుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతోనే పనులు ఆలస్యమయ్యాయని తెలిపా రు. ప్రస్తుతం కేంద్ర నిధులు రూ.104.50 కోట్ల తో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. రైల్వే డిప్యూటీ సీఈ మాట్లాడుతూ మరో 10 నుంచి 20 రోజుల్లో ఆర్యూబీ లాంచింగ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వారం రోజులుగా పనులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పా రు. కార్యక్రమంలో కౌన్సిలర్ గంట జీవన్, బీజేపీ నాయకులు జోగు రవి, రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
వినాయక రూపం..
సందేశాత్మక స్వరూపంమహావినాయకుడికి తుది మెరుగులు దిద్దుతూ..విశాల శిరస్సు ఎవరినైనా ఉన్నత స్థానంలో నిలిపే ది వారి ఉన్నత ఆ లోచనలే. పెద్ద తల విశా ల దృక్పథానికి ప్రతీక. ఉన్నతమైన ఆలోచనలు, మంచి సంకల్పాలతో ముందుకు సాగాలని వినాయకుడి తల మనకు సందేశమిస్తోంది. పెద్ద చెవులు మాట్లాడటం కంటే వినడమే గొప్ప గుణం. ఎదుటివారి మాటలను శ్రద్ధగా ఆలకించి, అందులోని మంచిని గ్రహించాలి. వినే గుణంతో జ్ఞానం, వివేకం పెంపొందుతాయని వినాయకుడి పెద్ద చెవులు చాటుతాయి. అభయహస్తం ధైర్యంగా ముందుకు సాగుతూ లక్ష్యాన్ని చేరుకో వాలని వినాయకుడి అభయహస్తం సూచిస్తుంది. భక్తులను దీవిస్తూ ‘నేనున్నాను’ అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలని అభయమిస్తుంది. పెద్దఉదరం వినాయకుడి పెద్ద పొట్ట మనిషి జీవితంలోని పాపపుణ్యాలను సమానంగా స్వీకరించి, వాటి ఫలితాలను ఓర్పుతో భరించాలనే తత్వాన్ని తెలుపుతుంది. మంచి చెడులను జీర్ణించుకునే మనస్తత్వంతోపాటు, ఆరోగ్యానికి సంబంధించిన జీవన సూత్రాన్ని సూచిస్తుంది. ఏకదంతం.. విఘ్నేశ్వరుడి ఏక దంతం త్యాగం, పట్టుదల, మంచి–చెడుల మధ్య వివేచనకు ప్రతీకగా భావిస్తారు. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతీ విషయాన్ని పూర్తిగా స్వీకరించాల్సిన అవసరం లేదని చెబుతుంది. అవసరమైనప్పుడు స్వార్థాన్ని పక్కనపెట్టి సమాజ శ్రేయస్సు కోసం త్యాగం చేయాలనే గొప్ప సందేశాన్నిస్తుంది. చిన్న నోరు ఎక్కువగా వినాలి.. తక్కువగా మాట్లాడాలి.. ఇదే గణనాథుడి చిన్న నోరు చెప్పే నీతి. ఆలోచించకుండా పలికే మాటలు అనర్థాలకు దారితీస్తాయి. అందుకే ప్రతీ మాటను ఆలోచించి, ఆచితూచి మాట్లాడాలని వినాయకుడి రూపం సందేశమిస్తుంది.తొండం.. తొండం బలానికి, సున్నితత్వానికి ప్రతీక. పెద్ద వృక్షాలను సైతం పెకిలించే, చిన్న సూదిని కూడా అందుకునే నైపుణ్యం ఉంటుంది. మనిషి జీవితంలో ఎ దురయ్యే కఠిన పరిస్థితులను ధైర్యంగా అధిగమించడంతోపాటు, చిన్న విషయాలను సైతం సూక్ష్మంగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకునే వివేకం అవసరమని ఇది సూచిస్తుంది. మోదకం.. గణపతి చేతిలోని మోదకం జ్ఞానం, సాధన, ఆధ్యాత్మిక ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. ఇది బయటకు సాధారణంగా కనిపించినా లోపల తీపిని కలి గి ఉంటుంది. అలాగే నిజమైన ఆనందం బయట ఉన్న సంపదల్లో కాకుండా జ్ఞానం, సత్కర్మ, మంచి ఆలోచనల్లో ఉంటుందని ఇది సూచిస్తుంది. చిన్న కళ్లు.. విఘ్నేశ్వరుడి చిన్న కళ్లు ఏకాగ్రత, పరిశీలన, లక్ష్యంపై దృష్టికి ప్రతీకగా చెబుతారు. మనిషి జీవితంలో ఎన్నో ఆకర్షణలు, ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని మరచిపోకూడదనే సందేశం ఇందులో ఉంది. మనసును చెల్లాచెదురు కాకుండా ఒకే లక్ష్యంపై కేంద్రీకరిస్తే విజయాన్ని సాధించవచ్చని వినాయకుని నయనాలు సూచిస్తాయి.బీపీ.. షుగర్ప్రారంభ దశలో గుర్తించడంతో..ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఏఎన్ఎంల ద్వారా 30 ఏళ్ల వయస్సు పైబడిన వారికి బీపీ, షుగర్, క్యాన్సర్, మహిళలకు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో 73.86 శాతం స్క్రీనింగ్ పూర్తయ్యింది. మరో నెల రోజుల్లో వంద శాతం పూర్తి అవుతుంది. వ్యాధిగ్రస్తులకు అవసరమైన చికిత్స నిర్వహించి మందులు అందిస్తున్నాం. జంక్ఫుడ్, జీవనశైలి మార్పుతోనే ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారు. 30 ఏళ్లు పైబడిన వారు అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ సాధన, డీఎంహెచ్వో ఆదిలాబాద్: గజాననుడి జన్మవృత్తాంతం మొదలు గణాధిపతిగా ఎదగడం వరకూ ప్రతీ ఘట్టం ప్రత్యేకమే. ఆయన రూపంలోని ప్రతీ అవయవం ఓ విశేషమే. విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి తన రూపంలోనే ఎన్నో సమస్యలకు పరిష్కారాలను సూచిస్తాడు. ప్రతి భాగంలోనూ ఓ సందేశం దాగి ఉంటుంది. చవితి పర్వదినం పురస్కరించుకొని వినాయకుడి రూపంలోని విశిష్టతలు, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం.రైతుల వివరాలు సేకరించాంపరిహారం అందని రైతుల వివరాలు సేకరించాం. ఫ్యాక్టరీ ప్రతినిధులతో మాట్లాడి త్వరలోనే అందరికీ పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చూస్తాం. – జగదీశ్వర్రావు, ఆర్డీవో, ఆదిలాబాద్ -
సిర్పెల్లి శివారులో చిరుత సంచారం
సారంగపూర్: మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో చిరుత సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఆదివారం అటవీ ప్రాంతంలో లేగదూడ కళేబరం కనిపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రెండురోజుల క్రితం సిర్పెల్లి గ్రామ శివారులోని అడవిలోకి మేతకు వెళ్లిన ఆవులమందలోంచి ఒక లేగదూడ కనిపించకపోవడంతో స్థానికులు గాలింపు మొదలు పెట్టారు. రెండురోజుల తర్వాత కళేబరం కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్ఆర్ఓ రామక్రిష్ణారావు, డీఆర్వో నజీర్ఖాన్ లేగదూడ కళేబరం లభ్యమైన ప్రాంతంలో సీసీకెమెరాలను అమర్చి చిరుతపులి హతమార్చినట్లు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులు హర్షవర్ధన్, సంధ్యారెడ్డి, సంతోష్, సుజాత, వెన్నెల, తదితరులు ఉన్నారు. -
అభాగ్యులకూ కుటుంబం
ఇతర రాష్ట్రాల నుంచి.. ఉమ్మడి జిల్లాకు చెందిన చిన్నారులను ఇతర రాష్ట్రాల తల్లిదండ్రులు దత్తత తీసుకుంటున్న మాదిరిగానే ఇతర జిల్లాలు, పరాయి రాష్ట్రాలకు చెందిన బాలబాలికలను మన ఉమ్మడి జిల్లా దంపతులు దత్తత తీసుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. 2000 నుంచి 2026 ఆగస్టు నెలాఖరు వరకు 42 మంది చిన్నారులను దత్తత తెచ్చుకున్నారు. అందరూ వంచితులే.. నవ మాసాలు మోసి జన్మనిచ్చిన తర్వాత పిల్లలు ఏదో రకంగా వంచితులు అవుతున్నారు. కారణమేదైనా కొందరు శిశువులు పసిప్రాయంలోనే అనాథలుగా మారుతున్నారు. ఆడపిల్లలు అనే వివక్షతో వదిలి వెళ్తుండగా.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పోషణ భారం తదితర అంశాలతో శిశుగృహకు చేరుతున్నారు.అమెరికా.. ఇతర రాష్ట్రాల్లో ..బెల్లంపల్లి: అనాథగా మిగిలిపోయిన చిన్నారులకు అమ్మానాన్నల ప్రేమ లభిస్తోంది. అర్హులైన దంపతులకు పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం ద్వారా వారికీ ఓ కుటుంబం ఏర్పడుతోంది. అనాథ పిల్లలను కుటుంబం చెంతకు చేర్చడంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముందంజలో ఉంది. దత్తత పొందిన దంపతులు చిన్నారులను అక్కున చేర్చుకుని మమతానురాగాలు పంచుతున్నారు. పేగుబంధాని కన్నా మిన్నగా అనుబంధాన్ని పెనవేసుకుంటున్నారు. దత్తత ద్వారా చిన్నారులు కొత్త కుటుంబాల్లోకి అడుగు పెడుతుండడం వారికి ఆనందాన్ని పంచుతోంది.స్వరాష్ట్రం తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాలకూ చిన్నారులు దత్తత వెళ్లారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, జార్ఘండ్ రాష్ట్రా ల దంపతులు చిన్నారులను దత్తత తీసుకున్నారు. ఇద్దరు బాలికలను అమెరికా దేశీయులకు దత్తత ఇ చ్చారు. రెండేళ్లలోపు చిన్నారులను దత్తత తీసుకోవడానికి దంపతులు ఇష్టపడుతున్నారు. దత్తత విషయంలో బాలబాలికలనే లింగ వివక్షకు దంపతులు చూపించడం లేదని శిశుగృహ నిర్వాహకులు చెబు తున్నారు. ఏక సంతానం అమ్మాయి కలిగిన దంపతులు అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ముందు కు వస్తుండగా, అబ్బాయి ఉన్న దంపతులు అ మ్మా యి కావాలని కోరుతున్నారు. సంతానానికి నో చుకోని దంపతులు ఎవరైనా పరవాలేదని దత్తతకు ముందుకు వస్తున్నారు. దివ్యాంగులైన చిన్నారుల ను దత్తత తీసుకోకపోవడంతో మిగిలిపో తునారు. -
అడవి అందాలు చూస్తూ.. ఆహ్లాదం పొందుతూ
జన్నారం: హైదరాబాద్లోని దూలపెల్లి అకాడమీకి చెందిన 57 మంది శిక్షణ రేంజ్ అధికారులు డిప్యూటీ డైరెక్టర్ మంజుల ఆధ్వర్యంలో ఆదివారం కవ్వాల్ టైగర్జోన్ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్లో పర్యటించారు. జన్నారం అటవీ డివిజన్లోని బైసన్కుంట, గొండుగూడ బేస్క్యాంపు, వాచ్టవర్, తదితర ప్రాంతాల్లో కాలినడకన కలియతిరిగారు. అడవి అందాలను చూస్తూ, ఆహ్లాదం పొందారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు డివిజన్లో తీసుకుంటున్న చర్యల గురించి ఎఫ్డీవో రామ్మోహన్ వారికి వివరించారు. అడవులు, గడ్డి క్షేత్రాల అభివృద్ధి, వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన కుంటలు, గడ్డి మైదానాలు, ఆవాసాలు, కలప స్మగ్లింగ్ నిరోధానికి తీసుకుంటున్న జాగ్రత్తలు వివరించారు. డాగ్స్క్వాడ్ వల్ల ఉపయోగం, స్మగ్లర్లను పట్టుకునే విధానం గురించి డాగ్స్క్వాడ్ బీట్ అధికారి అనిల్ వివరించారు. వారి వెంట రేంజ్ అధికారి ఖాదర్వలీ, సెక్షన్ అధికారులు మమత, శంకర్, బీట్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా వారిని పలుకరించిన ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు వెల్లడించారు. వారి మాటల్లోనే..గేట్ నంబర్1 వద్ద శిక్షణ రేంజ్ అధికారులు -
రైలుకింద పడి తండ్రి, కొడుకు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు.. కేసు ట్రయల్కు రావడంతో తమకు ఎలాగైనా శిక్ష తప్పదని భావించారు. ఈ క్రమంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిశెలపేటకు చెందిన దొంత మల్లేశ్ (52), అతని కుమారుడు నాగరాజు (32) ఇద్దరూ కలిసి 2024లో జయశంకర్ భూపాలపల్లిలో వీఆర్వోగా పనిచేసిన గుల్లకోట గ్రామానికి చెందిన మల్లేశ్ తోడళ్లుడు రమేశ్ను హత్యచేశారు. ఈ కేసులో ఇద్దరూ భూపాలపల్లి జైలుకు వెళ్లారు. భర్త, కుమారుడు జైలుకు వెళ్లడంతో మల్లేశ్ భార్య సువర్ణ అనారోగ్యానికి గురై అదే ఏడాది మృతి చెందింది. జైలు నుంచి బయటకు వచ్చిన తండ్రీ కొడుకులను ఎవరూ ఆదరించడం లేదు. దీంతో కొద్దిరోజులుగా వారు హైదరాబాద్లోని ఓ హోటల్లో పనిచేసుకుంటున్నారు. మరోవైపు హత్యకేసు ట్రయల్కు వచ్చింది. తమకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించిన తండ్రీ కొడుకులు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో నివాసముంటున్న మల్లేశ్ సోదరుడు శ్రీనివాస్ ఇంటికి శుక్రవారం వచ్చారు. శనివారం ఇంటి నుంచి బయలుదేరిన వారు ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ సమీపంలో కేరళ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని జీఆర్పీ ఎస్సై తెలిపారు. -
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
కుభీర్: మండలంలోని జామ్గాంలో బొమ్మెడి మల్లేశ్ అనే రైతుకు చెందిన ఎద్దు విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఆదివారం ఉదయం రైతు తన ఎద్దులను పంటచేనుకు తోలుకెళ్తుండగా శనివారం రాత్రి వీచిన గాలులకు తెగి రోడ్డుపై పడిపోయిన విద్యుత్ తీగకు ఎద్దు తగలడంతో షాక్కు గురై మృతి చెందింది. గ్రామస్తులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. ఎద్దు విలువ రూ.50 వేలు ఉంటుందని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. గేదెలు తరలిస్తున్న ఆరుగురిపై కేసు దహెగాం: అక్రమంగా గేదెలు తరలిస్తున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చుంచు రమేశ్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఆదివారం మండలంలోని కల్వాడ చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఐచర్ వాహనంలో 11 గేదెలు, బొలెరో వాహనంలో ఏడు గేదెలు పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను విచారించగా చింతలమానెపల్లి నుండి జగిత్యాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు, గేదెలు స్వాధీనం చేసుకుని నిందితులు ఎండీ అహ్మద్, షేక్ ఫిరోజ్, అబ్దుల్ సమీర్, షాహీద్ అలీ, ఎండీ అబ్బుషేక్, సర్వర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రైలు ఢీకొని ఒకరు మృతి బెల్లంపల్లి: రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కె.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం కన్నాలబస్తీకి చెందిన కన్నెపల్లి నాగేశ్వరరావు (55) కన్నాల గేటు వద్ద రైలు పట్టాలను దాటే క్రమంలో గుర్తుతెలియని రైలు ఢీకొని మృతి చెందాడు. ఘటనపై మంచిర్యాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో వృద్ధుడు ఆత్మహత్య తలమడుగు: అనారోగ్యంతో వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తలమడుగు మండలంలోని ఉండం గ్రామానికి చెందిన ఎండీ ఖాసీం (60) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు. -
అత్తారింటికి నిప్పుపెట్టిన అల్లుడు
గుడిహత్నూర్: అత్తగారిపై కక్ష పెంచుకున్న ఓ అల్లుడు ఏకంగా ఆ ఇంటికే నిప్పుపెట్టిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కడమంచి రాజమణికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మండల కేంద్రానికి చెందిన వస్తాద్ అరుణ్ అనే యువకుడు రాజమణి చిన్న కూతురిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి రోజూ తాగి వచ్చి భార్యను కొడుతుండేవాడు. ఈనెల 8న రాజమణి ఇంటికి వచ్చిన అరుణ్.. భార్యతో పాటు ఇంట్లో వారిని చంపేస్తానని బెదిరించి వెళ్లాడు. భయాందోళనలకు గురైన రాజమణి, తన చిన్న కుమార్తెను తీసుకుని హైదరాబాద్లోని మరో కుమార్తె వద్దకు వెళ్లిపోయింది. దీంతో కోపం పెంచుకున్న అరుణ్ శనివారం రాత్రి రాజమణి ఇంటికి నిప్పుపెట్టాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
చికిత్స పొందుతూ రైతు మృతి
బజార్హత్నూర్: పత్తి పంటలో పురుగుల మందు పిచికారీ చేస్తూ మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురైన రైతు రాథోడ్ ఈశ్వర్ (48) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీనాయక్తాండ గ్రామానికి చెందిన ఈశ్వర్ తన పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. -
భర్త కళ్ళముందే ప్రాణం విడిచిన నవ వధువు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఎక్స్రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నవ వధువు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చినబూద గ్రామానికి చెందిన తేజశ్రీ(27)ని వాంకిడి మండలం ఖమాన గ్రామానికి చెందిన బండె తిరుపతితో గత జూలై 5న వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ బైక్పై తేజశ్రీ తల్లిగారింటికి వెళ్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలో ఆదిలాబాద్ ఎక్స్రోడ్డు ప్లైఓవర్పై బైక్ అదుపుతప్పి కిందపడటంతో తేజశ్రీ తలకు, ముఖానికి తీవ్ర గాయాలు కాగా, తిరుపతికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు పంపించారు. మంచిర్యాలలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదీ చదవండి: భార్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భర్త! -
వడివడిగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనులు
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ, వాణిజ్యపరంగా అత్యంత వ్యూహాత్మకమైన ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులను వేగంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పురోగతిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో శనివారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ భేటీలో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కిషన్రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రాజెక్టు అమలును పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు రక్షణ శాఖ, పౌరవిమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కో నోడల్ అధికారిని వచ్చే వారంలోగా నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ప్రాజెక్టు డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తీర్మానించారు. ఉత్తర తెలంగాణలో పౌర విమానయాన మౌలిక వసతుల కల్పనతోపాటు ప్రాంతీయ వైమానిక అనుసంధాన మెరుగుదలకు ఈ ప్రాజెక్టు బాటలు వేస్తుందని కిషన్రెడ్డి పేర్కొన్నారు.రక్షణ శాఖ సంపూర్ణ సహకారం..దేశ రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతమైన ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్, ఎయిర్ఫోర్స్ స్టేషన్ అభివృద్ధికి రక్షణ శాఖ సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా కీలక ముందడుగు పడిందని కిషన్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులు ఆదిలాబాద్ విమానాశ్రయ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ కోసం 2.75 కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మాణం అవసరమని తేల్చారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధీనంలో 369.45 ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూసేకరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. -
‘రియల్’ పెట్టుబడి పేరిట మోసం
ఆదిలాబాద్టౌన్: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వన్టౌన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న శాంతినగర్కు చెందిన సాయిని ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుడి నుంచి రియల్ ఎస్టేట్ పెట్టుబడి పేరిట విడతల వారీగా రూ.1.40 కోట్లు బ్యాంకు ఖాతాల ద్వారా, అదనంగా రూ.30 లక్షలు నగదు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. అందులో కొంత మొత్తాన్ని లాభంగా తిరిగి ఇచ్చి, మిగిలిన మొత్తంపై కాలయాపన చేయడంతో మోసం జరిగినట్లు గుర్తించి ఫిర్యాదు చేశారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు బండారి రాకేశ్ను విచారించగా, కుంటవార్ అచ్యుత్రెడ్డితో కలిసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ పేరిట ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లుగా తెలిపారు. తెలిసిన వారిని నమ్మించి ఫోన్పే, గుగూల్పే, బ్యాంకు ఖాతాలు, నగదు రూపంలో డబ్బులు వసూలు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 16 మంది నుంచి సుమారు రూ.13.31 కోట్ల వరకు సేకరించినట్లు తెలిపారు. నిందితుడి అకౌంట్, అతడి భార్య ఖాతాల నుంచి అచ్యుత్రెడ్డి, అతడి కుటుంబ సభ్యులకు సంబంధించిన పలు బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినట్లు గుర్తించారు. సంబంధిత బ్యాంకు లావాదేవీలు, ఖాతాల వివరాలపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈక్రమంలోనే ఈ నెల 11న విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఐ క్రాస్రోడ్ వద్ద రాకేశ్, అచ్యుత్రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలిపారు. మరో నిందితుడు కుంటవార్ చంద్రకాంత్రెడ్డి పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, వన్టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్సైలు నాగనాథ్, సంజయ్, అశోక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ దరఖాస్తులపై దృష్టి
కై లాస్నగర్: ఏళ్ల తరబడి పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారికి లబ్ధి చేకూర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇటీవల దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో అర్హులైన వారిని గుర్తించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. విచారణ అధికారుల నియామకంతో పాటు వారికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ అందించింది. ఈనెల 15నుంచి క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ షురూ కానుంది. 14వేల మంది దరఖాస్తు గత ప్రభుత్వం చేపట్టిన ఆసరా, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ల మంజూరు ప్రక్రియ ఆరేళ్లుగా నిలిచిపోయింది. ఎంతో మంది అర్హులైన వారికి ఎదురుచూపులు తప్పలేదు. ఈ క్రమంలో ఆరేళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్, బోధకాల వ్యాధిగ్రస్తులకు కొత్తగా పింఛన్లు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆగస్టు 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ గడువు 31వ తేదీతో ముగిసింది. అయితే ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారుంటే నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నెల 15వరకు పొడిగించారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 14,034 మంది ఆయా కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్నారు. గెజిటెడ్ అధికారులతో విచారణ ఆన్లైన్లో నమోదు చేసిన పింఛన్ దరఖాస్తులను ఈ నెల 15నుంచి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. అర్హులైన వారికి నష్టం కలగకుండా, అనర్హులకు చోటు కల్పించకుండా ఉండాల నే ఉద్దేశంతో ఈ విచారణ బాధ్యతలను గెజిటెడ్ అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఎంఏవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, పీజీ హెచ్ఎంలు, పీఆర్, ఇరిగేషన్, హౌసింగ్, వాటర్గ్రిడ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వంటి వివిధ శాఖలకు చెందిన 134 మందిని విచారణ అధికారులుగా నియమించారు. మున్సిపల్లో కమిషనర్, మెప్మా పీడీలకు బాధ్యతలు అప్పగించారు. వారికి ఇప్పటికే ప్రత్యేక లాగిన్ ఐడీలు క్రియేట్ చేశారు. దరఖాస్తుల పరిశీలనపై ఆన్లైన్లో సెర్ప్ రాష్ట్రస్థాయి అధికారులు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ అందించారు. చేయూత ప్రత్యేక మొబైల్ యాప్లో ఈ దరఖాస్తుల పరిశీలన చేపట్టనున్నారు. మండలంలోని దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా వాటిని విచారణ అధికారులకు అప్పగించనున్నారు. పారదర్శకంగా ప్రక్రియకొత్త పింఛన్ ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఈ నెల 15 నుంచి షురూ కానుంది. సంబంధిత ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశాం. ఎంపిక చేసిన గెజిటెడ్ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రత్యేక యాప్లో వివరాలు నమోదు చేయనున్నారు. దరఖాస్తు సమయంలో ఏవైనా డాక్యుమెంట్స్ పొందుపర్చకుంటే వాటిని అప్లోడ్ చేయనున్నారు. అర్హులైన వారికి నష్టం కలగకుండా విచారణ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవోజిల్లాలో అందిన పింఛన్ దరఖాస్తుల వివరాలు కేటగిరీల వారీగా దివ్యాంగులు 3,356 ఒంటరి మహిళలు 1,602 వితంతువులు 9,035 చేనేత కార్మికులు 04 గీత కార్మికులు 37 -
భక్తులారా.. ఆలోచించండి
బోథ్: నవరాత్రుల పాటు నన్ను ధూపదీప నైవేద్యాలు, వేద మంత్రోచ్ఛరణ నడుమ అత్యంత నిష్ఠగా కొలుస్తున్నారు. అయితే గంగమ్మ ఒడికి సాగనంపే వేళ మాత్రం ఉదాసీనంగా ఉంటున్నారు. ప్రమాదాల బారిన పడి నాపై మచ్చ వచ్చేలా చూస్తున్నారు. ఈ సారి మాత్రం మద్యం జోలికి వెళ్లకండి. డీజే స్టెప్పులు కాకుండా.. మన సంస్కృతికి తగ్గట్టుగా సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, భక్తి కీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయాత్రగా తరలివస్తే నేను మరింత సంతోషిస్తాను. మీ జిల్లా ఎస్పీ కూడా ఇదే విషయం ఇటీవల మీ దృష్టికి తెచ్చారని తెలిసింది. ఆలోచించండి. ఆచరిస్తారని ఆశిస్తున్నా. నా దీవెనలు ఎళ్లవేళలా మీపైనే ఉంటాయని హామీ ఇస్తున్నా. – మీ గణనాథుడను -
రాజీమార్గంలో కేసుల సత్వర పరిష్కారం
● జిల్లా జడ్జి కె.ప్రభాకరరావుఆదిలాబాద్టౌన్: కోర్టుల్లోని పరిమిత వనరులతో కేసుల సత్వర పరిష్కారానికి వీలు పడదని, ఇరుపక్షాలు రాజీమార్గంలో వాటిని సత్వరం పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆద్వర్యంలో జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను జడ్జి ప్రా రంభించారు. రాజీ మార్గంలో పరిష్కరించే అ వకాశమున్న పలు కేసులను పరిష్కరించారు. ఈ ఆయన మాట్లాడుతూ, కేసుల సత్వర పరి ష్కారంలో జిల్లా స్థానం గతంతో పోల్చితే మె రుగుపడిందన్నారు. సమష్టి భాగస్వామ్యంతో నే ఇది సాద్యమైందన్నారు. కార్యక్రమంలో డీఎ ల్ఎస్ఏ కార్యదర్శి హుస్సేన్ నాయక్, జడ్జీలు రాజ్యలక్ష్మి, తేజస్విని, చింత దివ్యారాణి, అదనపు ఎస్పీ సురేందర్ రావు, బార్ అసోసియేష న్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, ఉపాధ్యక్షుడు చందూసింగ్, ప్రభుత్వ న్యాయవాది దయాకర్, పీపీ రహిమ్, ిసీనియర్ న్యాయవాధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్న వ్యాపారులను వేధించొద్దు
ఆదిలాబాద్: రాష్ట్రంలోని చిన్న, వీధి వ్యాపారులు, దుకాణదారులు ఎలాంటి భయాందోళనలు లేకుండా వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. శనివారం అసెంబీల్లో మాట్లాడుతూ, 65–70 ఏళ్ల క్రితం రూపొందించిన మున్సిపల్ నిబంధనలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించాలని సూచించారు. చిన్నపాటి పొరపాట్లకు వెంటనే కేసులు నమోదు చేయకుండా, ముందుగా వ్యాపారులకు నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. అధికారుల తీరుతో కోర్టుల్లో కేసుల భారం పెరుగుతోందని పేర్కొన్నారు. చిన్న తప్పులకు పెద్ద శిక్షలు విధించకుండా పోలీసింగ్, వ్యాపార వ్యవస్థల్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలన్నారు. పల్లెలు, పట్ట ణాల సమగ్ర అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజన యువత స్వయం ఉపాధికి బ్యాంకులు ఆస్తుల హా మీ పేరుతో ఇబ్బందులు పెట్టకుండా రుణాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. -
ఐటీ టవర్ రెడీ
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ రెడీ అయింది. వారంలో ప్రారంభిస్తామని ఐటీ మంత్రి శ్రీధర్బాబు శుక్రవారం అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ తెలిపారు. ఇప్పటికే రెండు కంపెనీలు ఐటీ సేవలు అందిస్తున్నాయి. ఎన్టీటీ డాటా సొల్యూషన్(300 పోజిషన్కు అవకాశం), ఎన్ల్యాబ్స్ (150 పోజిషన్కు అవకాశం) కంపెనీలతో ఎంవోయూ చేసుకున్న విషయం తెలిసిందే. మరిన్ని కంపెనీలను ఆకర్షించేందుకు.. టవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరా బాద్, ఇతర ప్రధాన నగరాల నుంచి బీపీవో, ఐటీ అనెబుల్డ్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభా గాలకు చెందిన మరిన్ని మధ్యస్థాయి కంపెనీలను ఇక్కడికి ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు, మౌలిక సదుపాయాల వెసులుబాటు కల్పిస్తుంది. ప్రారంభం నుంచి మొదలుకుంటే మూడేళ్ల వరకు కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు అద్దె రాయితీ కల్పిస్తోంది. ప్రత్యేకతలు .. మావల మండలం బట్టిసావర్గాంవ్ వద్ద జాతీయ రహదారి 44ను ఆనుకుని మూడెకరాల విస్తీర్ణంలో ఐటీటవర్ నిర్మించారు. తెలంగాణ పారిశ్రామిక మౌ లిక సదుపాయాల సంస్థ నోడల్ ఏజెన్సీగా ప్రాజెక్ట్ పనులు జరిగాయి. 65వేల చదరపు అడుగుల వైశాల్యంలో జీప్లస్–4 అంతస్తుల్లో నిర్మించారు. 2022–23లో నిర్మాణం మొదలైంది. అంచనా వ్యయం రూ.43 కోట్ల నుంచి రూ.54 కోట్లకు చేరుకుంది. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఆధునిక వర్క్ స్టేషన్లను సిద్ధం చేశారు. ఒక్కోషిప్ట్కు 660 మంది పనిచేసే సామర్థ్యం ఉంది. మూడు షిప్ట్ల్లో కలిపి దాదాపు 2వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. సెంట్రలైజ్డ్ ఏసీ, కాన్పరెన్స్ అండ్ మీటింగ్ హాళ్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం, క్యాంటీన్, రెస్ట్ రూంలు, విశాలమైన పార్కింగ్, లిఫ్ట్ వసతులు కల్పిస్తున్నారు. మొదటి టైర్–3 ప్రాంతం.. రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ ప్రధాన ఐటీ హబ్ కాగా, ఈ సేవలను అక్కడికే పరిమితం కాకుండా ద్వితీయశ్రేణి(టైర్–2, టైర్–3) నగరాలు, పట్టణా ల్లో విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హబ్లు, ఐటీ టవర్లను అందుబాటులోకి తెచ్చింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, సిద్దిపేటలో ఇప్పటికే ఏర్పాటు చేసి విస్తరించింది. ఆదిలాబాద్ టైర్–3లోకి వస్తుంది. మొదటిసారి రాష్ట్రంలో ఇక్కడ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. స్థానిక పట్టణాల నుంచి వచ్చే సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతను, గ్రాడ్యూయేట్లను ఈ సంస్థలు ఇప్పటికే ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. రానున్న కంపెనీలు కూడా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. -
మంచిర్యాల: పోర్న్ వీడియోలు చూస్తున్న ఐదుగురిపై కేసు!
స్మార్ట్ఫోన్ యుగంలో పోర్నోగ్రఫీ సైట్లతో అశ్లీలత చేతుల్లోకి చేరింది. మైనర్ల నుంచి మొదలుకొని నడివయస్సు వరకు చాలామంది పోర్నోగ్రఫీకి బానిసగా మారుతున్నారు. కొందరు చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తూ జైలు పాలవుతున్నారు. ఈ ఏడాది మంచిర్యాల పోలీస్స్టేషన్ పరిధిలో చైల్డ్పోర్నోగ్రఫీ వీడియోలు చూసి, ఇతరులకు షేర్ చేసినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. వీరిలో ముగ్గురు మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. - మంచిర్యాల జిల్లాఅశ్లీల వెబ్సైట్లపై ప్రత్యేక నిఘా..అశ్లీల వెబ్సైట్లు, టెలిగ్రామ్, సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలపై అమెరికాకు చెందిన యూనైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్సీఎంఈసీ), నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్ర్డన్ అనే ప్రత్యేక విభాగం ప్రత్యేక నిఘా పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులపై జరిగే అశ్లీల దాడులు, చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు, ఫొటోలు ఎవరు చూస్తున్నారు, ఎవరు షేర్ చేస్తున్నారో గుర్తించి ఆయా రాష్ట్రాల పోలీసులకు సమచారం అందిస్తోంది. స్థానిక పోలీస్స్టేషన్లకు పోర్నోగ్రఫీ వీడియోలు చూసిన, షేర్ చేసిన వారి వివరాలు అందించి కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. చట్ట ప్రకారం ప్రైవేటుగా చూడడం నేరం కాకపోయిన, చూసి ఇతరులకు షేర్ చేయడం ఐటీ యాక్ట్ 67 ప్రకారం నేరమవుతుంది. ఒకవేళ ఆ వీడియోల్లో మైనర్లు ఉంటే అది ఐటీ యాక్ట్ 67–బీ, పోక్సో చట్టం ప్రకారం ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.యువత పక్కదారి..విద్యార్థి దశలోనే అరచేతిలో ఉన్న సెల్ఫోన్ వారిని నేరాల్లోకి నెడుతోంది. తాజాగా జిల్లా కేంద్రంలో ఆండాలమ్మ కాలనికి చెందిన ఓ మైనర్ బాలుడు ఫోర్న్ వీడియోలు చూసి మరో మైనర్ బాలికను వేధించినందుకు సదరు బాలిక దగ్గరి బంధువు బాలుడిని మందలించాడు. దీంతో బాలుడు మద్యం మత్తులో మందలించిన వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. సెల్ఫోన్లలో లైంగిక, హింసాత్మక ఆంశాలు కౌమర దశలో ఉన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీడియోలు చూస్తే ఎవరికి తెలుస్తుందిలే అన్న భ్రమలో యువత ఉంటున్నారు. కానీ పోర్నోగ్రఫీ వెబ్సైట్లు ఎవరు చూస్తున్నారు.. ఎవరికి షేర్ చేస్తున్నారు.. ఎవరు డౌన్లోడ్ చేస్తున్నారో ఎన్సీఎంఈసీ ఇట్టే పట్టేస్తోంది. తమ పిల్లలు సెల్ఫోన్లో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేయాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.సర్వర్లు బ్లాక్.. పోర్న్ వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. నిర్వాహకులు బ్లాక్ అయిన వెబ్సైట్ పేరును పోలిన లేదా దాని చివర 1, 2 లాంటి అంకెలు చేర్చి మరో వెబ్సైట్ను ప్రారంభిస్తున్నారు. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉన్నవే కావడంతో వెబ్సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండడం లేదని ఓ పోలీస్ అధికారి చెప్పడం గమనార్హం.వెంటనే తెలిసిపోతుంది..పోర్నోగ్రఫీ వీడియోలు చూడడం నేరమని తెలియక యువత చూస్తున్నారు. కేంద్రం నుంచి అందించిన సమాచారం ఆధారంగా వీడియోలు చూస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఐదు కేసులు నమోదు కాగా అందులో ముగ్గురు మైనర్లు ఉన్నారు. అశ్లీల వెబ్సైట్లపై పూర్తి స్థాయి నిఘా ఉంది.– ప్రమోద్రావు, సీఐ, మంచిర్యాలఇటీవల నమోదైన కేసులు..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్రోడ్కు చెందిన ఓ యువకడు యూట్యూబ్, పోర్న్ వెబ్సైట్లు చూడడమే కాకుండా తనకు తెలిసిన వారికి షేర్ చేశాడు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రెన్ ప్రత్యేక విభాగం స్థానిక పోలీసులకు యువకుడి వివరాలు పంపించి కేసు నమోదుకు ఆదేశించింది. పోలీసులు యువకుడి ఇంటికి వెళ్లి కేసు నమోదు చేశారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భగవంతం వాడకు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు తరచూ చూస్తుండేవాడు. చూడడమే కాకుండా ఇతరులకు షేర్ చేశాడు. దీంతో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయింటెడ్ చిల్డ్రెన్ ప్రత్యేక విభాగం అతడిని గుర్తించి సదరు యువకుని అడ్రస్తో సహా స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించింది.నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మదీన కాలనీకి చెందిన ఓ వ్యక్తి పిల్లల అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతనిపై ఈనెల 5న కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని(కె) గ్రామానికి చెందిన తౌడు శ్రావణ్ పిల్లల అశ్లీల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోర్న్ ఫొటోలు, వీడియోలు బ్రౌజ్ చేసి డౌన్లోడ్, అప్లోడ్ చేసినందుకు అతడిపై ఈనె 5న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి -
ఓరి దేవుడా!
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాను శుక్రవారం తేలికపాటి వర్షం పలకరించింది. ఇది ఎటూ సరిపోని పరిస్థితి. రెండు వారాలుగా వరుణుడి జాడ లేక సాగు చేస్తు న్న పత్తి, సోయా, కంది పంట మొక్కలు వాడిపోతున్నాయి. ఈక్రమంలో రైతుల్లో దుఃఖం తన్నుకవస్తుంది. వర్షాభావ పరిస్థితుల్లో బోర్ల ఆధారంగా స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లందిద్దామంటే కరెంటు కోతల కారణంగా తడులు అందించలేని పరిస్థితి. జిల్లాలో ప్రధానంగా బోథ్, తలమడుగు తదితర మండలా ల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఈ విషయమై ఫోన్లు చేసినా స్పందన కరువైందంటూ వాపోతున్నారు. తలమడుగులో విద్యుత్ శాఖ అధికారులు పడిపోయిన విద్యుత్ స్తంభాలను మరమ్మతు చేయడంలో జాప్యం కారణంగా పంట చేలకు నీళ్లందించలేక రైతులు ఇటీవల ఆందోళన చేపట్టారు. ఇదే మండలంలోని రుయ్యాడిలో పదే పదే కరెంటు కోతలతో పంటలకు నీళ్లందించలేక పోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశా రు. కరెంటు సరఫరాలో డ్రిప్ కావడంతో ఈ సమ స్య ఎదురవుతుందని అధికారులు చెబుతుండడం గమనార్హం. వర్షాభావం.. జిల్లాలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 11 వరకు సాధాణ వర్షపాతం 908.6 మి.మీ.లు కాగా, 598.8 మి.మీ.లు కురిసింది. ఇది 34 శాతం లోటు. అలాగే 21 మండలాలకు గాను 20 మండలాల్లో వర్షాభావం నెలకొంది. రెండు వారాలకు పైగా సరైన వర్షాలు లేకపోవడంతో డ్రైస్పెల్ ఏర్పడుతుంది. తేలికపాటి వర్షం కురుస్తున్నప్పటికీ అది ఎటూ సరిపోలేని పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన విద్యుత్ వినియోగం.. వర్షాభావ పరిస్థితుల్లో పొడి వాతావరణం ఏర్పడింది. భూమిలో తేమ లేకపోవడంతో పంటలు వాడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బోర్ల ద్వారా నీళ్లందిద్దామంటే నిరంతర విద్యుత్ సరఫరా చేయడం లేదు. జిల్లాలో 75వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇటు వ్యవసాయ చేలకు డిమాండ్ పెరగడం, అటు గృహ వినియోగదారులు ఉక్కపోత కారణంగా ఏసీలు, కూలర్లు వినియోగిస్తుండడంతో డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. దీనికితోడు జిల్లాలో ఇటీవల చార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు కావడంతో డిమాండ్ పెరిగిందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంత కరెంటు సరఫరా తగ్గించినప్పటికీ కోతలు విధించడం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.ఇది బోథ్కు చెందిన రైతు రాజు చేనులోని పత్తి మొక్కల పరిస్థితి. ఓ వైపు వర్షాభావం.. మరోవైపు కరెంటు కోతల కారణంగా నీటి తడులందక మొక్కలు ఇలా వాడిపోతున్నాయి. బోరుబావిలో నీరున్నా విద్యుత్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. పంట పెరిగే దశలో కరెంటు కోతలు లేకుండా చూడాలని ఈ రైతు అంటున్నాడు. ఇతనొక్కడే కాదు.. జిల్లాలో చాలా మందిది ఇదే పరిస్థితి. జిల్లాలో విద్యుత్ వినియోగం ఇలా.. వారం క్రితం వరకు: 1.35 మిలియన్ల యూనిట్లు రెండు రోజుల క్రితం: 1.89 మిలియన్ల యూనిట్లు -
● సీఎంకు విన్నవించిన డీసీసీ అధ్యక్షుడు ● ముఖ్యమంత్రి హామీ అమలుపై చిగురిస్తున్న ఆశలు ● ఇప్పటికే కజ్జర్లలో స్థలం గుర్తింపు
ఆదిలాబాద్టౌన్: ఆదివాసీలు అత్యధికంగా కలిగిన జిల్లాలో ఉన్నత విద్య పరంగా అవకాశాలు మెరుగుపర్చేందుకు తోడ్పడే యూనివర్సిటీ లేకపోవడం అవరోధంగా నిలుస్తోంది. గతంలో జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరైనా మరో జిల్లాకు తరలిపోయిన విషయం తెలిసిందే. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారసభతో పాటు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఇంద్రవెల్లిలో నిర్వహించిన సభలోనూ వర్సిటీ ఏర్పాటుపై సానుకూల ప్రకటన చేశారు. దీంతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమైంది. అయితే నెలలు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ సీఎంను గురువారం హైదరాబాద్లో కలిసి విన్నవించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు తమ ఆకాంక్ష త్వరలోనే నెరవేరనుందనే ఆశాభావం ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులు సైతం చొరవ చూపితే త్వరితగతిన కల సాకారమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కజ్జర్లలో అనువైన స్థలం.. వర్సిటీకి అవసరమైన అనువైన స్థలాన్ని సైతం అధికార పార్టీ నేతలు గుర్తించారు. జిల్లా కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తలమడుగు మండలంలోని కజ్జర్లలో వందల ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించినట్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్ సీఎంను కలిసి మరోసారి కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు మరికొన్ని అంశాలపై కూడా సీఎం సానుకూలంగా స్పందించడంతో ఈ ప్రాంత వాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.ప్రాధాన్యతను చాటిన ‘సాక్షి’ వర్సిటీ లేని ఏకై క ఉమ్మడి జిల్లాగా నిలిచిన ఆది లాబాద్లో విశ్వవిద్యాలయ ఆవశ్యకతను వివరి స్తూ ‘సాక్షి’ చొరవ చూపింది. ప్రత్యేక కథనాల ద్వారా ఈ ప్రాంతానికి ఒనగూరే ప్రయోజనాల ను వివరించింది. తొలుత గతేడాది విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, అధ్యాపకులతో చర్చావేదిక ఏర్పాటు చేసింది. ఆ వేదికపైనే వర్సిటీ సాధన కమిటీ ఆవిర్భవించింది. వెంటనే కమిటీ కార్యాచరణ సైతం ప్రకటించి ముందడుగు వేసింది. జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలలను సందర్శించి వర్సిటీ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించింది. వారిని ఉద్యమంలో భాగస్వాములను చేసింది. ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించింది. త్వరలోనే గవర్నర్ను కలిసేందుకు కమిటీ పక్షాన సన్నద్ధమవుతున్నారు. -
42 శాతం రిజర్వేషన్ కల్పించాలి
కై లాస్నగర్: జాతీయ జనగణనలో బీసీల లెక్క తేల్చి, జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ఎదుట బీసీ ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయమైన 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా, పార్లమెంట్లో రాజ్యంగ సరవణ చేపట్టి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు సాధించే వరకు బీసీల ఐక్య ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వివిధ కుల సంఘాలు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నాయి. అనంతరం అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రును కలిసి వినతిపత్రం అందజేశారు. దీక్షకు మాజీ మంత్రి జోగు రామన్న సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, నాయకులు మేకల అశోక్, సత్యనారాయణ, శ్రీనివాస్, విఠల్, చందు, నర్సాగౌడ్, దశరత్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ఆదిలాబాద్: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని యు నైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నా యకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మె చేపట్టారు. ఆదిలాబాద్ శివా జీచౌక్లోని ఎస్బీఐ ఆవరణలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ చౌక్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోరం రీజనల్ సెక్రెటరీ సురేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 28 నుంచి మూడు రోజుల సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పరమేశ్వర్, అనికేత్ జాదవ్, వినయ్కుమార్, బాషా, రమేశ్, పృథ్వీకుమార్, శ్రీకాంత్రెడ్డి, బాలకృష్ణ, సంతోష్ పాల్గొన్నారు. -
విచారణ హైరానా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రత్యేక సమగ్ర పరిశీలన(ఎస్ఐఆర్)లో అన్మ్యాపింగ్, అనామలీస్ ఓటర్ల పరిశీలనతో బీఎల్వోలు, అధికారులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఓటర్లకు నోటీసుల జారీ నుంచి విచారణ(హియరింగ్) చేపట్టడం వరకు ప్రయాసగా మారింది. ఓటర్లకు తగిన రుజువులు లేకపోతే మరోసారి రావడం, ఓటర్లు నిర్ణీత సమయంలో బీఎల్వోల ముందు హాజరు కావడం లేదు. ఆ తేదీలు రద్దు(ల్యాప్స్) అవుతున్నాయి. బీఎల్వోలు ప్రతీ ఓటరు ఫొటో తీసుకుని యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. దీంతో చాలా చోట్ల వేలాది మంది ఓటర్ల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. ఒక్కో రోజు ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సగటున కనీసం వెయ్యికి పైనే ఓటర్ల పరిశీలన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొందరు తగిన రుజువులు తీసుకురాకపోవడంతో మళ్లీ మళ్లీ హియరింగ్ ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలకు చాలామంది పదో తరగతి మార్కుల మెమో, బ్యాంకు పాస్బుక్, లేదా కుల ధ్రువీకరణలు అడుగుతున్నారు. ఆధార్, పాన్, రేషన్ కార్డులు ధ్రువీకరణకు ఆమోదించకపోవడంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి. గడవులోపు పూర్తయ్యేనా? ప్రస్తుతం ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం ఓటర్ల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతోంది. అదే సమయంలో ఓటర్ల తప్పులను సరి చేస్తున్నారు. చాలా వరకు చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ తప్పనిసరిగా రుజువు చూపించాలి. వేలాది ఓటర్లకు నోటీసుల జారీ, హియరింగ్, తేదీలు, బీఎల్వోలు ధ్రువపత్రాల పరిశీలన నుంచి ఆర్వోలు, ఎన్నికల సిబ్బంది, జిల్లా ఎన్నికల అధికారుల వరకు పరిశీలన చేయాలి. దీంతో గడవులోపు సర్ ప్రక్రియ పూర్తవుతుందా? అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ తుది జాబితా ప్రచురణకు అక్టోబర్ 15నుంచి నవంబర్ 9వరకు గడువు పొడగించింది. అయితే నవంబర్ 5వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంది. ఈ క్రమంలో అనేక మంది ఓటర్లు సకాలంలో స్పందించకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. -
ఐటీ పరిశ్రమలు తీసుకురావాలి
ఆదిలాబాద్: ఆదిలా బాద్కు ఐటీ పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక విధానం ప్రకటించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శాసనసభలో శుక్రవారం మా ట్లాడుతూ జిల్లాలో ఐటీ రంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరా రు. కేవలం టవర్ నిర్మి స్తే కంపెనీలు రావని, వా టిని ఆకర్షించేందుకు సబ్సిడీలు, రాయితీ క్లౌడ్ డేటా వంటి ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఆదిలాబాద్లో డేటా సెంటర్ ఏర్పా టు చేయాలని, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను నెలకొల్పాలని కోరారు. హైదరాబాద్కు దూరంగా ఉన్న ఆదిలాబాద్ వంటి ప్రాంతా లకు ప్రత్యేక ఇన్సెంటివ్ పాలసీ అమలు చేస్తే ఐటీ సంస్థలు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. తద్వారా స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధితోపాటు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. -
ఐక్యతతో గ్రామాల అభివృద్ధి
తలమడుగు: గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని కజ్జర్ల గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సమస్యల పరిష్కారంలో ఎక్కడైనా జాప్యం జరిగితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. తోటరాణి–శ్రీధర్ దంపతులు ఏర్పాటు చేసిన ఎద్దు గానుగ నూనె తయారీ కేంద్రాన్ని సందర్శించారు. సహజసిద్ధ యూనిట్లకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు. అనంతరం పల్సి (కె) గ్రామంలో పర్యటించారు. డిజిటల్ క్రాప్ సర్వే, డ్రోన్ ద్వారా పత్తి చేనులో పురుగుమందు పిచికారీని పరిశీలించారు.ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన గ్రామస్తుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. నిరుద్యోగ యువత అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ను పరిశీలించి, నిర్వహణపై సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, తహసీల్దార్ రాజ్మోహన్, ఎంపీడీవో శంకర్, కజ్జర్ల సర్పంచ్ నారాయణరెడ్డి, లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉత్పల్ కుమార్, కేవీకే సీనియర్ సైంటిస్ట్ ఎన్.రామగోపాల్ వర్మ, పల్సి కే సర్పంచ్ చిన్ను, విశ్వామిత్ర, విశ్వనాథ్, కేవీ కే శాస్త్రవేత్తలు రఘువీర్, సురేష్, మండల వ్యవసా య అధికారి ప్రమోద్రెడ్డి, ఉప సర్పంచ్ గంగన్న, ఏపీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిన్లాండ్ పర్యటనకు నవనీత ఎంపిక
సాత్నాల: వినూత్న బోధన పద్ధతులతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్న భోరజ్ మండలం పిప్పర్వాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పైడి నవనీ త ఫిన్లాండ్ పర్యటనకు ఎంపికయ్యారు. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈమెను ఎంపిక చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పర్యటనలో భాగంగా ఫిన్లాండ్లో అమలవుతు న్న విద్యా విధానం, ఆధునిక బోధన పద్ధతుల పై అధ్యయనం చేయనున్నారు. ఈమె ఎంపిక పై తోటి ఉపాధ్యాయులు హర్షంవ్యక్తం చేశారు. -
ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తు చేసుకోండి
కై లాస్నగర్: వందశాతం సబ్సిడీపై అందించనున్న ఆటోమెటిక్ కుట్టు మిషన్లకు జిల్లాలోని బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 55 ఏళ్లలోపు ఉండి తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష 50వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు కలిగిన వారు నివాస ద్రువీకరణ పత్రం, ఆధార్, రేషన్కార్డు, వృత్తి నైపుణ్యం సర్టిఫికెట్, కనీస విద్యార్హత పత్రాలతో tsobmms వెబ్పోర్టల్లో ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో దరఖాస్తుల హార్డ్ కాపీలను స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ఐలమ్మ త్యాగాలు మరువలేనివి
ఆదిలాబాద్రూరల్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ త్యాగాలు మరువలేనివని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. గు రువారం ఆమె వర్ధంతిని జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఎదుటగల ఆమె విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాల వే సి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నా రు. ఐలమ్మ అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాపంపిణీలో అక్రమాలకు తావివ్వొద్దు
కై లాస్నగర్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకు బాధ్యతాయుతమైన సేవలందించాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రేషన్ డీలర్లు, రైస్మిల్లర్లతో వేర్వేరుగా నిర్వహించిన సమీక్షలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. షాపులను నిర్దేశిత వేళల్లో తెరిచి ఉంచి సరుకులు అందించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కృషి చేస్తామని భరోసానిచ్చారు. ధాన్యం సేకరణతో పాటు సీఎంఆర్ ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. మిల్లులకు చేరే ధాన్యం నాణ్యతను పరిశీలించడంతో పాటు, సీఎంఆర్ను ఎఫ్సీఐ గోదాములకు ఎలాంటి జాప్యం లేకుండా అప్పగించడంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రూ, సబ్ కలెక్టర్ కె.ప్రణయ్కుమార్, ఆర్డీవో జగదీశ్వర్, డీసీఎస్వో నందిని, డీఎం సుధారాణి, రేషన్ డీలర్ల యూనియన్ ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోషకాహార లోప నిర్మూలనే లక్ష్యం తల్లీపిల్లల ఆరోగ్య రక్షణతోపాటు జిల్లాలో పోషకాహార లోపాన్ని సంపూర్ణంగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన తొమ్మిదో పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 9నుంచి అక్టోబర్ 8వరకు మన అంగన్వాడీ–మన బాధ్యత నినాదంతో జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తహీనత నివారణకు ఆహారంలో వైవిధ్యం పాటించాలని సూచించారు. ప్రధానమంత్రి మాతా వందన యోజన లాంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులందరికీ చేరవేయాలని తెలిపారు. అనంతరం కార్యక్రమ పోస్టర్ ఆవి ష్కరించారు. జిల్లా సంక్షేమాధికారి మిల్కా, జెడ్పీ సీఈవో రవి, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మెప్మా పీడీ రాజు, సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు పాల్గొన్నారు. భూసేకరణపై అపోహలొద్దు భోరజ్ మండలంలోని రాంపూర్ (టి), గిమ్మ (బి), గూడ, హత్తిఘాట్ గ్రామాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం చేపడుతున్న భూసేకరణపై అపోహలు వద్దని కలెక్టర్ రాజర్షి షా ఓ ప్రకటనలో తెలి పారు. నాలుగు గ్రామాల్లో 2,062.01 ఎకరాల భూ మి సేకరించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈడీ అటా చ్ చేసిన భూముల్లో గూడలో 37.23 ఎకరాలు, రాంపూర్ (టి)లో 9.39 ఎకరాల చొప్పున 47.22 ఎకరాలే ప్రస్తుత భూసేకరణ ప్రతిపాదనల్లో ఉన్నట్లు తెలిపారు. ప్రక్రియ నిబంధనల మేరకు పారదర్శకతతో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏదైనా టైటి ల్ వివాదముంటే తెలంగాణ సవరణ చట్టం–2016 నిబంధనల ప్రకారం తగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఈ–పంచాయతీ ఆపరేటర్లకు స్థానచలనం
కై లాస్నగర్: కర్వీ అండ్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అ భియాన్ (ఆర్జీఎస్ఏ)లో భాగంగా జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో పని చేస్తున్న డాటా ఎంట్రీ (కంప్యూటర్) ఆపరేటర్ల బదిలీల ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగి సింది. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ 28 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. నార్నూర్ మండలంలో పనిచేస్తున్న ఆపరేటర్ను వయస్సు రీత్యా బదిలీల నుంచి మినహాయింపునిచ్చారు. మిగతా 27మందికి వారి అభీష్టం మేరకు ఎంపిక చేసుకున్న మండలాలకు బదిలీ చేశారు. కొత్త మండలాలు, పంచాయతీల్లో విధుల్లో చేరి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ వారికి సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి జి.రమేశ్, డీఎల్పీవో ఫణీందర్రావు, సీనియర్ అసిస్టెంట్ కల్పన తదితరులున్నారు. -
పోలీస్స్టేషన్ ఆకస్మిక తనిఖీ
జైనథ్: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్, రికార్డులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమ రవా ణా, గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అ క్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా పటిష్టమైన నిఘా పెట్టాలని, తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చే సి ఆధారాలతో కూడిన చార్జీషీట్లను సకాలంలో దాఖలు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎస్సై గౌతమ్ పవార్, సిబ్బంది ఉన్నారు. -
మొబైల్ ఫోన్ల అప్పగింత
ఆదిలాబాద్టౌన్: పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.18లక్షల విలువైన 102 మొబైల్ ఫోన్లను ప్రత్యేక బృందం ద్వారా రికవరీ చేయగా పోలీ స్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. ఏడాదిన్నర కాలంలో సుమారు 1,700 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు వివరించారు. మొబైల్ ఫోన్ల రికవరీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తె లిపారు. డీఎస్పీ జీవన్రెడ్డి, టూటౌన్ సీఐ నాగరాజు, ఆర్ఎస్సై గోపీకృష్ణ, మజీద్, అన్వేశ్, నవనీత్, జుబేర్, ఎజాజ్ తదితరులున్నారు. -
విద్యాప్రమాణాల పెంపునకు కృషి చేద్దాం
ఉట్నూర్రూరల్: గిరిజన విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేద్దామని జిల్లా గిరిజన సంక్షేమశాఖ డీడీ అశోక్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ భవనంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతిగృహ సంక్షేమాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడారు. పాఠశాలలు, వసతిగృహాల్లోని సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతీనెల 3వ శనివారం తప్పనిసరిగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం ఏర్పాటు చేయాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. నిర్దేశిత సమయంలో సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. మెస్ కమిటీలు ఏర్పాటు చేసి నిత్యం నిర్ణీత మెనూ పక్కాగా అమలు చేయాలని పేర్కొన్నారు. బెడ్షీట్లు, టవల్స్, షూస్, బ్యా గులు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ వివరా లు తెలుసుకున్నారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణపై ప్ర త్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అనంతరం స మావేశానికి హాజరైన ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్ట్ అధి కారి రాజేశ్వరరావుకు జిల్లాలోని విద్యావ్యవస్థ తీరు ను వివరించారు. పోక్సో చట్టంపై రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించి అన్ని పాఠశాలలకు పంపిణీ చేశారు. ఏపీవోలు వసంతరావు, భాస్కర్, డిప్యూటీ డీఈవో చందన్, ఏటీడీవో క్రాంతి, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, జీసీడీవో ఛాయా, ఏవో సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్.. స్లో!
కై లాస్నగర్: ఆహారభద్రత కార్డుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కార్డుల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించి 25రోజులవుతున్నా ఇంకా లక్ష మందికిపైగా కార్డులు అందలేదు. వాటిని అందించే బాధ్యతను రేషన్ డీలర్లకు అప్పగించిన అధికార యంత్రాంగం పర్యవేక్షణను విస్మరించింది. అయితే, మూడు నెలల సన్నబియ్యం కోటాను ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో వాటిని తీసుకుంటున్న లబ్ధిదారులు కార్డులు తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. లబ్ధిదారులు వస్తేనే కార్డులిస్తామనే ధోరణిలో రేషన్ డీలర్లు వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో పూర్తిస్థాయిలో కార్డులు పంపిణీ కాని పరిస్థితి నెలకొంది. 25రోజులు గడిచినా 94వేలే.. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీలో పారదర్శకత తీసుకురావడం, రేషన్కార్డుల ట్యాంపరింగ్కు చెక్పెట్టాలనే ఉద్దేశంతో స్మార్ట్కార్డులు అందించాలని నిర్ణయించింది. క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్తో కూడిన డిజిటల్ కార్డులను సరఫరా చేసింది. జిల్లాలోని 2,26,733 మందికి వీటిని అందజేయాల్సి ఉంది. పంద్రాగస్టు వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ జిల్లాలో గత నెల 15న కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. స్థానిక ఎస్టీయూ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పలువురు లబ్ధిదారులకు స్వయంగా కార్డులు అందజేశారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల వారీగా స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా వీటిని లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంపిణీని ప్రారంభించి 25రోజులు గడిచినా ఇప్పటివరకు 94వేల కార్డులే పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. 25లోపు అందరికీ అందజేస్తాం జిల్లాలో రేషన్ స్మార్ట్కార్డుల పంపిణీలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. మూ డు నెలల కోటా సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేయాల్సి ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బియ్యం పంపిణీ ముగియగా ఉదయం, సాయంత్రం దుకాణాలు తెరిచి స్మార్ట్కార్డులు పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించాం. లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియ చేపట్టడంతోపాటు రేషన్ స్మార్ట్కార్డులన్నీ ఈ నెల 25లోపు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశాం. నిర్లక్ష్యం చేసే డీలర్లపై కఠినచర్యలు తీసుకుంటాం. – నందిని, డీసీఎస్వో స్మార్ట్కార్డుల వివరాలు జిల్లాలోని మండలాలు 21రేషన్ దుకాణాలు 356 జిల్లాకు అందిన కార్డులు 2,26,733ఇప్పటివరకు పంపిణీ చేసినవి 94 వేలు పంపిణీ చేయాల్సినవి 1,32,733 ఇప్పటికీ 94వేలు మాత్రమే అందజేత పంపిణీ బాధ్యత డీలర్లదే..స్మార్ట్కార్డుల పంపిణీ బాధ్యతలను అధికారులు రేషన్డీలర్లకే అప్పగించారు. షాపుల వారీగా కార్డులు సరఫరా చేసిన అధికారులు పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించడంలేదు. స్మార్ట్కార్డులు రాకముందే మూడునెలల సన్నబియ్యం పంపిణీ పూర్తి కాగా, లబ్ధిదారులు వాటిని తీసుకోవడంపై ఆసక్తి చూపడంలేదని డీలర్లు చెబుతున్నారు. లబ్ధిదారులు వస్తేనే ఇస్తామనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారులు, డీలర్లు ఒకే తరహాలో వ్యవహరిస్తుండటంతో పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రధానంగా ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పట్టణ పరిధిలో 35,139 కార్డులుండగా ఇందులో సగం కూడా పంపిణీ జరగనట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. -
ఇక పక్కాగా సెగ్రిగేషన్
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ డంప్యార్డులో చెత్త సెగ్రిగేషన్ ఇక మరింత పక్కాగా చేపట్టనున్నారు. పారిశుద్ధ్య కార్మికులు రోజువారీగా పట్టణంలో సేకరించే తడి, పొడి చెత్తను ఎప్పటికప్పుడు వేరు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.8కోట్ల నిధులు కేటాయించింది. వ్యర్థాల నిర్వహణను చేపట్టే ఏజెన్సీల ఎంపికకు ఇటీవల ఆన్లైన్లో టెండర్లు పిలిచిన మున్సిపల్ అధికారులు వాటిని నేడో, రేపో ఖరారు చేయనున్నారు. ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేసి చెత్త సెగ్రిగేషన్ ప్రక్రియను ఎంపికై న ఏజెన్సీకి ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. చెత్త రహితంగా తీర్చిదిద్దాలనే.. పట్టణాలను చెత్తరహితంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్) 2.0ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే మూడేళ్ల కిందట బయోమైనింగ్ వి ధానాన్ని అమలు చేసింది. దీని ద్వారా పట్టణంలో ని డంప్యార్డులో ఏళ్లుగా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన చెత్తను ఈ ప్రక్రియ ద్వారా తొలగించా రు. ఇటీవలే బయోమైనింగ్ ప్రక్రియ గడువు ముగి సింది. అయితే, పట్టణ పరిధిలో నిత్యం 60 నుంచి 70టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. పారిశుద్ధ్య కా ర్మికులు చెత్త సేకరణ వాహనాల ద్వారా ఇంటింటా సేకరించిన చెత్తను డంప్యార్డుకు తరలిస్తున్నారు. బయోమైనింగ్ జరగకపోవడంతో మళ్లీ చెత్త నిల్వ లు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. దుర్గంధం వ్యా పించడంతోపాటు తరచూ చెత్తకు నిప్పంటుకుని వచ్చే పొగతో సమీప గ్రామాల ప్రజలు, పంట చేలలోని రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పర్యావరణా నికీ ముప్పు వాటిల్లే ప్రమాదముంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం చెత్తను ఎప్పటికప్పుడు వేరు చేయాలని ఆదేశిస్తూ ప్రత్యేక నిధులు కేటాయించింది. ఏజెన్సీల ఎంపికకు టెండర్లుపట్టణంలో చెత్త సెగ్రిగేషన్ నిర్వహణ చేపట్టేందుకు అర్హత, ఆసక్తి కలిగిన ఏజెన్సీల ఎంపికకు మున్సిపల్ అధికారులు ఇటీవల ఆన్లైన్లో టెండర్లు పిలిచారు. రెండుసార్లు టెండర్లు ఆహ్వానించగా వాటికి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా ఇటీవల మూడోసారి పిలవగా రెండు ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఇందులో అన్ని అర్హతలున్న ఏజెన్సీని ఎంపిక చేయనున్నారు. ఎంపికై న ఏజెన్సీ చెత్తను వేరు చేసేందుకు డంప్యార్డులోని అరెకరంలో ప్రత్యేక షెడ్లు నిర్మించాల్సి ఉంటుంది. వ్యర్థాల నిర్వహణకు అవసరమయ్యే 11రకాల అధునాతన యంత్రాలను బల్దియాకు కొనుగోలు చేసి ఇవ్వడంతో పాటు ఐదేళ్లపాటు సదరు ఏజెన్సీనే చెత్త నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు గాను ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సీడీఎంఏనే చెల్లింపులు చేయనుంది. ప్రత్యేక యంత్రాల ద్వారా వేరు చేసిన చెత్తలోని తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేయనున్నారు. ప్లాస్టిక్ కవర్లు, ఐరన్రాడ్లు, కాగితాలు, రబ్బర్లు, దుస్తులు, ఇనుము, గాజు సీసాలు.. ఈ వ్యర్థాలుగా వేరుపడిన చెత్తను స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నారు. వాటి నిర్వహణ ద్వారా ఎస్హెచ్జీలకూ ఆర్థికంగా ఆదాయం లభించనుందని భావిస్తున్నారు. త్వరలో వర్క్ ఆర్డర్ ఇస్తాం చెత్తను వేరు చేసే పనుల నిర్వహణ ఏజెన్సీల ఎంపికకు టెండర్ల ప్రక్రియ చేపట్టాం. రెండు ఏజెన్సీలు టెండర్ దాఖలు చేయగా వాటి వివరాలతో కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించాం. అర్హత కలిగిన ఏజెన్సీని ఎంపిక చేసి త్వరలోనే వర్క్ ఆర్డర్ అందజేస్తాం. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి త్వరలోనే పనులు ప్రారంభించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. – పి.అరుణ్కుమార్, మున్సిపల్ ఇంజినీర్ -
కోనసీమ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి
అమలాపురం టౌన్: పాతికేళ్లుగా అసంపూర్తిగా, నత్తనడకన సాగుతున్న కోనసీమ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్ఎస్ఎస్) ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అంబాజీపేట మండల పర్యటనకు బుధవారం వచ్చిన సీఎంకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రైల్వే లైన్కు అవసరమైన భూ సేకరణలో ఎదురవుతున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం చక్కదిద్దాలని కోరారు. ఈ ప్రాజెక్ట్కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.1,200 కోట్లు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. భూ సేకరణకు సంబంధించి అన్ని కేసులపై స్టేలను కోర్టులు తొలగించినందున ఈ రైల్వే ప్రాజెక్ట్కు సమస్యలు దాదాపు తొలగినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రైల్వే లైన్ను తొందరగా పూర్తి చేసి, ఈ ప్రాంత వాసుల చిరకాల కోరికను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్ఎస్ఎస్ ప్రతినిధులు డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, సప్పా నాగేశ్వరరావు, ఎరగర్త వెంకటేశ్వరరావు, పోలిశెట్టి శివాజీ తదితరులు సీఎంకు వినతిపత్రం అందించారు. -
హాస్టల్ వివాదంపై సమగ్ర విచారణ
వార్డెన్కు మెమో జారీ చింతూరు: స్థానిక ఎస్సీ హాస్టల్ వార్డెన్ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్రంగా విచారణ నిర్వహిస్తున్నట్లు సోషల్ వెల్ఫేర్ డీడీ ఎంవీఎన్ మూర్తి బుధవారం ప్రకటనలో తెలిపారు. వార్డెన్ తాతాజీపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఆరోపణల నేపథకచంలో హాస్టల్ను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు ఆరోపణలు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను కలసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక చర్యల్లో భాగంగా ఇప్పటికే సదరు వార్డెన్కు మెమో జారీ చేశాయపి, పూర్తిస్థాయి విచారణ నిమిత్తం ఆరోపణలు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీడీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం మరోమారు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ను కలసి వార్డెన్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
జాబ్మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ దినేష్కుమార్రంపచోడవరం: స్థానిక లెనోరా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, వికాస ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కె.దినేష్కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువత ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాలి ఏజెన్సీ ప్రాంత యువతలో ప్రతిభ, కష్టపడే తత్వం, క్రమశిక్షణ, విశ్వసనీయత వంటి లక్షణాలు ఉన్నాయని, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకుని అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. జిల్లాలోని రంపచోడవరం, చింతూరు తదితర ప్రధాన కేంద్రాల్లో ప్రతినెలా క్రమం తప్పకుండా జాబ్ మేళాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. నేటి జాబ్ మేళాలో యాక్సిస్ బ్యాంక్, ఎసెంచర్ తదితర ప్రముఖ సంస్థలతో కలిపి 40కి పైగా కంపెనీలు పాల్గొని సుమారు 1,500 ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు వివిధ రంగాల్లోని ఉపాధి, కెరీర్ అవకాశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ప్రత్యేక కెరీర్ కౌన్సెలింగ్ సెల్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ, పోలీస్ ఉద్యోగాలతో పాటు ఐటీ, బ్యాంకింగ్, కార్పొరేట్ తదితర రంగాల్లోని అవకాశాలపై యువతకు మార్గనిర్దేశం చేస్తామని చెప్పారు. స్థానికంగా మాత్రమే కాకుండా హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో లభించే అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రారంభంలో రూ.12 వేలు లేదా రూ.15 వేల వేతనం వచ్చినప్పటికీ నిరాశ చెందకుండా అనుభవాన్ని సంపాదించుకుంటూ నైపుణ్యాలను పెంచుకుని భవిష్యత్తులో నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేలకు పైగా సంపాదించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పోలవరం జిల్లాలోని 12 మండలాలకు సంబంధించిన చదువుకున్న యువతీయువకులు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేయుటకు 396 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ఇందులో 212 మంది యువతీయువకులు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఎంపికై న వారికి ఆఫర్ లెటర్లు అందజేశారు. మొత్తం 40 కంపెనీల్లో 1500 మందిని మందిని ఎంపిక చేయుటకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్ కోరారు. ఎస్ఎస్సీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వివిధ విద్యార్హతలు కలిగిన యువత కోసం 1,500కు పైగా ఉద్యోగ అవకాశాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం గొప్ప అవకాశమని తెలిపారు. కార్యక్రమంలో వికాస డైరెక్టర్ లచ్చారావు, లెనోరా సంస్థ డైరెక్టర్ ఇందిరా జాన్రత్నం, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి నిరుపమ, స్కిల్ డెవలప్మెంట్ అధికారి పెరుమలరావు, మేనేజర్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. -
రంపచోడవరంలో రేపు నియోజకవర్గ స్ధాయి సమావేశం
అడ్డతీగల: రంపచోడవరం భాను ఫంక్షన్ హాల్లో శుక్రవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ స్ధాయి సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కోఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి తనతో పాటు అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి హాజరవుతారన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించనున్నామన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఐడెంటిటీ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. 12 మండలాల వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలి రావాలన్నారు. నియామక ఉత్తర్వుల నిలుపుదలచింతూరు: రంపచోడవరం, చింతూరు సబ్ కలెక్టర్ల నియామకానికి సంబంధించి మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం మరో ఉత్తర్వులను జారీ చేసింది. రంపచోడవరం సబ్ కలెక్టర్గా దొనక పృథ్వీరాజ్కుమార్, చింతూరు సబ్ కలెక్టర్గా చిత్తపులి నరేంద్రపడాల్ను నియమించడంతో పాటు చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ను రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్గా బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా తదుపరి ఆదేశాల వరకు ఇద్దరు సబ్ కలెక్టర్ల నియామకాలతో పాటు చింతూరు ఐటీడీఏ పీవో బదిలీని నిలుపుదల చేస్తున్నట్లు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి
చింతూరు: ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ఐటీడీఏ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షల ముగింపు సందర్భంగా బుధవారం భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. పరిషత్ జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీల ప్రధాన సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఆదివాసీ నిరుద్యోగులకు ఏజన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని, 1/70 చట్టంపై గిరిజనేతరులు వేసిన కేసులో ప్రభుత్వం ఇంప్లీడ్ అవడంతో పాటు చట్టం పరిరక్షణ కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. గొత్తి కోయలకు కులధ్రువీకరణ పత్రాలు, పింఛన్లు మంజూరు చేయాలని, ఆదివాసీ పూజారులు, దేవర బాలలకు గౌరవ వేతనం ఇవ్వాలని ఆయన కోరారు. ధర్నా విషయం తెలుసుకుని ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ వారితో చర్చించారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన హామీనివ్వడంతో వారు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు ఉయికా శంకర్, జిల్లా కన్వీనర్ పాయం లక్ష్మణరావు, శీలం కృష్ణ, మినప నాగేశ్వరరావు, కారం రవి, పూసం శ్రీను, సోడె మురళి, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, ప్రసాద్, రాజయ్య పాల్గొన్నారు.భారీ ర్యాలీ, ఐటీడీఏ ఎదుట ధర్నా -
ఓ మై డాగు
సాక్షి, అమలాపురం: ఒకప్పుడు పనికిరాదని పక్కన పడేసిన కుళ్లిన (డాగు) కొబ్బరి కాయకే ఇప్పుడు బంగారంలాటి ధర పలుకుతోంది. ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని గంగా ఘాట్లలో దహన సంస్కారాలకు, గంగార్పణాలకు దీనికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో, కోనసీమ నుంచి డాగు కొబ్బరి నేరుగా ఉత్తరాదికి తరలిపోతోంది. ఫలితంగా కొబ్బరికి పుట్టినిల్లయిన అంబాజీపేటలోనే డాగు కొబ్బరి కనిపించని పరిస్థితి ఏర్పడింది. లేదు. ‘డాగు’ ఎందుకొస్తుందంటే.. జిల్లావ్యాప్తంగా కొబ్బరి వ్యాపారానికి గడ్డుకాలం వచ్చింది. గతంలో దెబ్బ తిన్న (కుళ్లిన – డాగు పడిన) కొబ్బరిని స్థానిక వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేసేవారు. రైతులు కొబ్బరి కాయను ఒలిచి కురిడీగా తయారు చేసేందుకు అటకల మీద, ప్యాక్ హౌస్లలో నిల్వ చేస్తారు. మార్కెట్లో ధర లేనప్పుడు కొబ్బరి కాయను నేరుగా నిల్వ చేస్తూంటారు. ఈ క్రమంలో లేత కాయలతో పాటు కొన్ని కాయలు కుళ్లిపోతాయి. దీనినే స్థానికంగా డాగు పడటమని అంటారు. ఈ డాగు కొబ్బరిని స్థానిక చిరు వ్యాపారులు కొనుగోలు చేసి, తొక్క తీసి, నూనె తయారు చేసేవారు. దీన్ని డాగు నూనె అంటారు. ఇది దీపాలు వెలిగించేందుకు, సబ్బుల తయారీ, ఇతర పరిశ్రమల్లో వినియోగిస్తూంటారు. ఉత్తరాదిలో డిమాండ్ ఉత్తరాది రాష్ట్రాల్లో మరణించిన తమవారి దహన సంస్కారాలకు డాగు కొబ్బరిని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బిహార్లోని గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో నిర్వహించే అంత్యక్రియల సందర్భంగా ఈ కుళ్లిన కొబ్బరిని వినియోగించడం ఆనవాయితీగా మారింది. దీంతో, ఆయా రాష్ట్రాలకు కుళ్లిన కొబ్బరి కాయలు నేరుగా ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు కొబ్బరి కాయల ధరలు ఆకాశాన్నంటడంతో కురిడీ కొబ్బరి ధర కూడా భారీగా పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో వెయ్యి కురిడీ కాయల ధర రూ.21 వేల నుంచి రూ.24,500 వరకూ పలుకుతోంది. దీంతో, ఉత్తరాదిలోని ఆలయాల్లో, ముఖ్యంగా గంగార్పణం వంటి కార్యక్రమాల్లో సామాన్యులు, పేదలు తక్కువ ధరకే దొరికే ఈ డాగు కొబ్బరిని కురిడీ కొబ్బరికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల కూడా దీనికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో కర్ణాటక నుంచి కూడా డాగు కొబ్బరికి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. అయితే, అక్కడ తయారవుతున్న డాగు నూనెకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో వ్యాపారులు ఇక్కడి నుంచి పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. స్థానిక ఉపాధిపై తీవ్ర ప్రభావం డాగు కొబ్బరి ఉత్తరాదికి తరలిపోవడం స్థానిక ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కోనసీమ జిల్లా అంతటా డాగు కొబ్బరి వ్యాపారం జరుగుతున్నా, పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లోని ముంజవరం, పొత్తాయలంక వంటి ప్రాంతాల్లో ఇది ఒక కుటీర పరిశ్రమలా ఉంది. సుమారు 300 కుటుంబాల వారు ప్రత్యక్షంగా, వెయ్యి కుటుంబాలు పరోక్షంగా ఈ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏడాదికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ వ్యాపారం జరిగేది. ఇప్పుడు కాయ దొరకక వీరికి ఉపాధి లేకుండా పోయింది. ఒకప్పుడు అంబాజీపేట కేంద్రంగా కొబ్బరి నూనెకు జాతీయ స్థాయిలో బ్రాండ్ ఉండేది. కల్తీ నూనెల వల్ల ఆ పరిశ్రమ దెబ్బ తిని, పదో వంతుకు పడిపోయినా, డాగు నూనె మాత్రం ఎంతో కొంత నిలబడింది. ఇప్పుడు డాగు కొబ్బరి కాయలు నేరుగా ఉత్తరాదికి తరలిపోతూండటంతో స్థానికంగా ముడిసరుకు లేక నూనె ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో, ఉన్న నాలుగైదు మిల్లులు కూడా మూతపడే పరిస్థితి నెలకొందని స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబాజీపేట మార్కెట్లో దొరకని డాగు కొబ్బరి ఉత్తరాదికి నేరుగా ఎగుమతి గతంలో వంద కాయల ధర రూ.85 నేడు రూ.800కు పెరుగుదల స్థానికంగా నిలిచిన నూనె ఉత్పత్తి పాలకొల్లు నుంచి కోనసీమ వరకూ.. డాగు కొబ్బరి ఎగుమతులు తొలుత పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి మొదలయ్యాయి. ఇప్పుడు కోనసీమ జిల్లా నుంచే నేరుగా, జోరుగా ఎగుమతులు జరుగుతున్నాయి. ధరల విషయానికి వస్తే గతంలో వంద డాగు కాయల ధర రూ.25 నుంచి రూ.85 మాత్రమే ఉండేది. అంటే కాయకు పావలా నుంచి 85 పైసల వరకూ ధర వచ్చేది. ఇప్పుడు అదే వంద కాయల ధర రూ.500 నుంచి రూ.800కు ఎగబాకింది. ఇందులో రెండో రకమైన ఖచ్చం రకం కాయ ధర అయితే ఏకంగా రూ.950 వరకూ పలుకుతోంది. -
నిరుద్యోగులపై అక్రమ కేసులా!
కాకినాడ రూరల్: ఉద్యోగాల కోసం కాకినాడలో శాంతియుతంగా ధర్నా చేసిన నిరుద్యోగులపై పోలీసు నిర్బంధాన్ని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమేమిటని, వాటిని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ఉద్యోగాల కోసం నిరసన తెలిపితే, వారికి నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. నిరసనలో పాల్గొన్న 20 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు నోటీసులతో వేధింపులకు గురి చేయడం తగదని అన్నారు. పోటీ పరీక్షలపై నిరుద్యోగులకు శిక్షణ అందిస్తున్న శ్యామ్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు జి.శ్యామ్పై కేసు పెట్టడం సరి కాదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నాగమణి డిమాండ్ చేశారు. స్విమ్స్లో అరుదైన శస్త్ర చికిత్స తిరుపతి తుడా: తిరుపతిలోని స్విమ్స్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యాన ఓ పేద రోగికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వివరాలివీ.. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలానికి చెందిన బి.వెంకట సూరిబాబు (50) మూడు నెలలుగా గుండె జబ్బుతో బాధ పడుతున్నాడు. పలు రకాల మందులు వాడుతున్నప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో, అతడు స్విమ్స్ ఆసుపత్రిని సంప్రదించారు. సూరిబాబును వైద్యులు పూర్తి స్థాయిలో పరీక్షించి ప్రాణదానం పథకం కింద ఎంపిక చేసి, సీఆర్టీ–డీ పరికరం అమర్చారు. లక్షల రూపాయల విలువైన శస్త్ర చికిత్సను ఉచితంగా విజయవంతంగా చేశారు. టీటీడీ, స్విమ్స్ అధికారులకు, వైద్యులకు రోగితో పాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ముగిసిన బాస్కెట్బాల్ శిక్షణ రామచంద్రపురం రూరల్: జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు ఉచిత శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి ఈ విషయం తెలిపారు. బాలుర జట్టుకు ఈ నెల 11 వరకూ శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. శిక్షణ ముగింపు సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ, బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆఽఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ శిక్షణ నిర్వహిస్తున్నాయని తెలిపారు. బీసీల పాలిట తెగులు టీడీపీ రాజమహేంద్రవరం రూరల్: తెలుగుదేశం పార్టీ బీసీలను ఎదగకుండా చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ విమర్శించారు. బుధవారం స్థానిక బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈనాడు పత్రికలో ఇచ్చిన ప్రకటనలో తెలుగు బీసీలు అన్నారు కానీ నిజానికి బీసీల పాలిట తెగులుగా టీడీపీ తయారైందని ఆయన ఎద్దేవా చేశారు. బీసీలను కులవృత్తులుగా పనిముట్లుగా ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో వారిని విద్యకు దూరం చేశారని ఆరోపించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పెడితే బీసీ విద్యార్థులు చదువుకుని ఐటి రంగంలో ఎదిగారని ఆయన అన్నారు. అలాగే జగన్మోహన్రెడ్డి 34 శాతం రిజర్వేషన్ను మించి 40 శాతం వరకు వారికి పదవులు కల్పించేలా చర్యలు చేపట్టి స్థాని క ఎన్నికలకు వెళ్లారని వేణు పేర్కొన్నారు. కొన్నిచోట్ల 45 శాతం కూడా వారికి ప్రయోజనం కలిగిందని, అయితే దానిని 24 శాతానికి జగన్ తగ్గించేసినట్లు నాడు టీడీపీ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. మరి ఇప్పుడెలా 34 శాతం రిజర్వేషన్ ఇస్తామని 105 జీవో ఇచ్చారని వేణు ప్రశ్నించారు. న్యాయస్థానాల తీర్పు అధిగమించి హామీ ఇచ్చేసి, ప్రజలను మోసగిస్తారా అని ఆయన అన్నారు. చిత్తశుద్ధి ఉంటె 52 శాతం ఉన్న బీసీలకు 34 శాతం కాకుండా కనీసం 40 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలను కులవృత్తులకు పరిమితం చేయడానికి రూ.వెయ్యి కోట్లు మొదటి బడ్జెట్లో పెట్టి, కనీసం రూ.వెయ్యి ఖర్చు చేయలేదని ఆయన అన్నారు. రెండో బడ్జెట్లోనూ అలాగే పెట్టి రూ.2 వేలు కూడా ఇవ్వలేదన్నారు. మూడో బడ్జెట్లోనూ అలాగే పెట్టి సగం కాలమైనా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. 50 ఏళ్లు ఉన్న బీసీల కు పెన్షన్లు ఏమయ్యాయని వేణు ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వరరావు, కొండపల్లి దుర్గారావు పాల్గొన్నారు. -
ఇంకా గిట్టుపాట్లు!
గిరిజనులు సేకరించిన ఉత్పత్తులను సేకరిస్తామని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) చెబుతున్న మాటలు కార్యాచరణలో కానరావడం లేదు. గిరిజనులు సేకరించే కొండచీపుర్లు, శీకాయ, కరక్కాయ, తేనె వంటి ఉత్పత్తులకు నామమాత్రంగా ధర చెల్లిస్తున్నారు. ఈ ఉత్పత్తులకు బయట దళారులే అధికంగా ధర చెల్లిస్తుండడంతో గిరిజనులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. ● అటవీ ఉత్పత్తులకు లభించని గిట్టుబాటు ధర ● గిరిజనులకు తప్పని ఇబ్బందులు ● పట్టించుకోని గిరిజన సహకార సంస్థ రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకొని అడవిలో ప్రమాదాలను సైతం లెక్క చేయకుండా అటవీ ఉత్పత్తుల సేకరణలో నిమగ్నమైన ఆదివాసీలకు అరకొర ధర చెల్లించి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఎంతో కాలంగా అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించాలని గిరిజనులు ఆందోళన చేస్తున్న జీసీసీ పట్టించుకోవడం లేదు. గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఐటీడీఏ కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని అటవీ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేయడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. కొండచీపుర్ల కొనుగోలుకు జీసీసీ ‘నో’ ఏజెన్సీలో కొన్ని రకాల అటవీ ఉత్పత్తులు కొన్ని ప్రాంతాల్లోనే అధికంగా లభ్యమవుతాయి. మారేడుమిల్లి మండలంలో కొండచీపుర్లు, శీకాయ అటవీ ఉత్పత్తులు ఎక్కువగా లభ్యమవుతాయి. ఎంతో కాలంగా కొండచీపుర్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నా జీసీసీ ధర పెంచడం లేదు. పైగా గత రెండేళ్ల నుంచి జీసీసీ కొండచీపుర్లను కొనుగోలు చేయడం లేదు. దీంతో గిరిజనులు బయట ప్రాంతం నుంచి వచ్చే వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది కొండచీపురు విడికట్ట రూ.40 నుంచి రూ.50 వరకు కొనుగోలు చేశారు. దీంతో గిరిజనుల కష్టానికి తగిన ప్రతిఫలం లభించడంలేదు. కొండచీపుర్ల సేకరణ కోసం గిరిజనులు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. పోడుభూముల్లో ఉన్న చీపురును, సహజంగా లభించే చీపురును సేకరించేందుకు రోజంతా కుటుంబం కష్టపడితే రూ.1000 విలువ చేసే చీపుర్లను అతి కష్టం మీద సేకరించగలరు. ఇంతా కష్టపడిన రూ.50కు అమ్ముకోవాల్సి వస్తుంది. చీపుళ్లను నిల్వ చేసి రేటు వచ్చిన తరువాత అమ్ముకొనే సదుపాయం గిరిజనులకు లేకపోవడంతో దళారులపైనే ఆధారపడవలసి వస్తోంది. జీసీసీ శీకాయను కూడా సహజ సిద్ధమైన పెద్దసైజును ఎగుమతి చేసేందుకు ఎంపిక చేసిన గ్రామాల నుంచి కొనుగోలు చేస్తుంది. జీసీసీ బయట మార్కెట్లో అధిక ధరకు శీకాయను అమ్ముకుంటున్న గిరిజనులకు అరకొర ధర చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొండచీపురు కట్ట రూ.100కు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. వంద రకాల మాట ఉత్తుత్తే.. జీసీసీ సుమారు వంద రకాల అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తుందని చెబుతున్న అనేక రకాల అటవీ ఉత్పత్తులను అసలు కొనుగోలు చేయడం లేదు. గిరిజనులకు అటవీ ఉత్పత్తుల సేకరణలో మెళకువలు నేర్పకపోవడంతో రెల్ల, నరమామిడి చెట్లు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ చెట్ల బెరడు కోసం మొత్తం చెట్లను నరికివేయడంతో చెట్లు అంతరించిపోతున్నాయి. బయట మార్కెట్లో కరక్కాయకు డిమాండ్ ఉన్న జీసీసీ కేజీ రూ.18 మాత్రమే కొనుగోలు చేస్తుంది. అనేక ఔషధాల్లో కరక్కాయను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏజెన్సీలో జీసీసీ తేనె సేకరించడం లేదు. జీసీసీ చెల్లించే ధర కేజీ రూ.300 ఉంటే బయట వ్యాపారులు రూ.500 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. అన్నింటినీ కొనుగోలు చేయాలి గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించాలి. గిరిజనుల కష్టానికి సరిపడా డబ్బులు కూడా రావడం లేదు. జీసీసీ కేవలం ఒకటి రెండు ఉత్పత్తుల కొనుగోలుపైనే దృష్టి పెడుతుంది. గిరిజనులు సేకరించే అన్ని ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అలాగే గిరిజనులు పండించే జాఫ్రా, జీడిమామిడి పిక్కలను జీసీసీ, ఐటీడీఏ కొనుగోలు చేయాలి. – పల్లాల లచ్చిరెడ్డి, బూసిగూడెం -
భారీ విగ్రహాలు తరలిస్తున్నారా.. జాగ్రత్త!
మంచిర్యాలఅర్బన్: వినాయక చవితి పర్వదినానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఇప్పటికే మండపాల ఏర్పాటు, భారీ గణపతి విగ్రహాల తరలింపు పనులు మొదలయ్యాయి. హైదరాబాద్లోని ధూల్పేట్, కోరుట్ల నుంచి భారీ విగ్రహాల తరలింపు కొనసాగుతోంది. విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు భారీ విగ్రహాల తరలింపులో దారిలో విద్యుత్ వైర్లు, ఫ్లైఓవర్లు, అడ్డంకులు లేకుండా ముందే రూట్ ప్లాన్ చేసుకోవాలి. ప్రధాన రహదారులపై రద్దీ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో, తెల్లవారుజామున విగ్రహాలను తరలించాలి. వాహనానికి ముందు, వెనుక హెచ్చరిక బోర్డులు, రెడ్ లైట్లు అమర్చాలి. విద్యుత్ వైర్లు అడ్డంగా ఉన్న చోట విద్యుత్శాఖ సిబ్బందిని వెంట ఉంచుకోవటం సురక్షితం. దారిలో వర్షం కురిస్తే రంగులు వెలిసిపోకుండా వాటర్ప్రూప్ కవర్లతో విగ్రహాన్ని కప్పి ఉంచాలి. దారిలో విద్యుత్ తీగలు తాకకుండా చూసుకోవాలి. వాహనానికి వెనుకభాగంలో కూర్చోవడం అత్యంత ప్రమాదకరం. -
బాలుడు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: చదువుకొమ్మన్ని మందలించినందుకు బా లు డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల మేరకు ఎక్బల్హైమద్ నగర్కు చెందిన మహ్మద్ అబ్బాస్–నూరి దంపతులకు ట్విన్స్ కుమారులు ఎండీ అమేర్, ఎండీ అమీర్(17). అమేర్ లారీ మీద పనికి వెళ్తుంటాడు. ఇంటర్ చదువుతున్న అమీర్ చదువు మానే సి అన్నతోనే వెళ్తానని కాలేజీకి డుమ్మా కొట్టేవాడు. కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ నెల 6న ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ స భ్యులు స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్తితి విషమించి బుధవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతితాండూర్: రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టు కార్మి కుడు మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్రావు తెలి పారు. గోలేటీ సీహెచ్పీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న బోయపల్లికి చెందిన మేకార్తి రాజేశం (32) రోజువారీ విధుల్లో భాగంగా బుధవారం స్కూటీపై గోలేటికి వెళ్తుండగా బెల్లంపల్లి నుంచి గోలేటి వైపు వెళ్తున్న ఎర్టిగా వేగంగా స్కూటీని ఢీకొ ని రోడ్డు పక్కన బోల్తా పడింది. ఘటనలో రాజేశం తలకు తీవ్ర గాయాలు కావడంతో ముందుగా బెల్లంపల్లి ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
పకడ్బందీగా ఓటర్ల జాబితా సవరణ
కై లాస్నగర్/తాంసి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. తాంసి మండలంలోని ఘోట్కోరి, భీంపూర్ మండలంలోని పిప్పల్కోటితో పాటు ఆదిలాబాద్ పట్ట ణంలోని ప్రభుత్వ డైట్ కళాఽఽశాల, ఆర్పీఎల్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. బీఎల్వోలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, దరఖాస్తుల పరిశీ లన ప్రక్రియపై ఆరా తీశారు. కొత్త ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం సరిచేయాలని సూచించారు. ఇంటింటి సర్వేలో ప్రతి కుటుంబంలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించిన సమాచారం ఆధారంగానే మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను నిబంధనల మేర కు గుర్తించి తొలగించాలన్నారు. పత్రాలు అందుబాటులో లేని సందర్భాల్లో తహసీల్దార్లు సంబంధిత వ్యక్తులకు మార్గదర్శకాలు అందించి, అవసరమైన పత్రాలను సేకరించి పూర్తిస్థాయిలో ధ్రువీకరించాలన్నారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునేలా చైతన్యపర్చాలన్నారు. బీఎల్వోలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పొరపాట్లకు అవకాశం లేకుండా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయనకు స్థానికులు డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన వెంట కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు ఆర్ఎస్. చిత్రు, ఎస్.రాజేశ్వర్, తహసీల్దార్లు శ్రీనివాస్, జాద వ్ గణేశ్, రమేశ్, నాయబ్ తహసీల్దార్లు సూరజ్, ఇస్తారీ, ఎంపీడీవో మోహన్రెడ్డి, ఎన్నికల సూపర్వైజర్లు, బీఎల్వోలు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్లు మతీన్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క క్షణం.. ఆలోచించండి..!
మంచిర్యాలక్రైం: సృష్టిలో వెలకట్టలేనిది ప్రాణం.. కానీ కొందరు క్షణికావేశంలో దానిని తృణప్రాయంగా వదిలేస్తున్నారు. చిన్నచిన్న కారణాలకే మనోధైర్యం కోల్పోయి అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. తమవారితో పెనవేసుకున్న బంధాలను బలవంతంగా తెంచేసుకుంటూ.. కన్నవారికి, కట్టుకున్నవారికి ఆప్తులకు తీరని విషాదం మిగిల్చి వెళ్తున్నారు.. ఈ మధ్య కాలంలో జిల్లాలో అత్మహత్యల తీరు ఆందోళన కలిగిస్తోంది. అప్పులు, ఉద్యోగం రావడం లేదని, దంపతుల మధ్య గొడవలు, ప్రేమలో విఫలమయ్యామని.. ఇలాంటి చిన్నచిన్న కారణాలకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. సమస్యలు తమకే ఉన్నాయని, వాటిని అధిగమించలేమోనని ఆత్మస్థైర్యం కోల్పోతున్నా రు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 150 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆలోచిస్తే ఆనందమయం.. అర్ధంతరంగా చావు కొని తెచ్చుకునే సందర్భంలో ఒక్క క్షణం ఆలోచిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఇలా బతుకును జయించిన వారు ఉన్నారని, సానుకుల దృక్పథంతోనే జీవితానికి సార్ధకత అందుతుందని అంటున్నారు. మానసికంగా బలహీనమైన క్షణాల్లో తీసుకునే నిర్ణయమే జీవితానికి అటు.. ఇటుగా మారుతోందని, ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఆనందమయ జీవితాన్ని అందుకోవచ్చని, ఆత్మహత్యల వల్ల సాధించేది ఏమీలేదని, సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యం కూడగట్టుకుని ముందుకు సాగాలని పోలీస్ అధికారులు, చెబుతున్నారు. -
● కబ్జాదారుల భరతం పడుతున్న పోలీసులు ● అక్రమార్కుల్లో గుబులు ● పరారీలో పలువురు
ఆదిలాబాద్టౌన్: భూమాఫియాపై పోలీసులు కొర డా ఝళిపిస్తున్నారు. పేదలు, సామాన్యుల భూములపై కన్నేసి కబ్జా చేయడం, నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించడం, బెదిరింపులు, మోసపూరిత లావాదేవీలకు పాల్పడుతున్న వారి భరతం పడుతున్నారు. ఎంతటి వారైనా లెక్కచేయడం లేదు. జిల్లాలో పేరుమోసిన రియల్టర్లను సైతం ఇటీవల కటకటాల వెనక్కి పంపడమే నిదర్శనం. ఎస్పీ అఖిల్ మ హాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. బాధితులకు న్యా యం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదులు పెరిగి అక్రమార్కుల బాగోతాలు బయటపడుతున్నాయి. తోకముడిచిన కబ్జాదారులు.. అఖిల్ మహాజన్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నరవుతోంది. ఇప్పటికే ఇసుక మాఫియా, వడ్డీ వ్యాపారులు, ల్యాండ్ మాఫియా, నకిలీ పత్రాలు తయారు చేసే డాక్యుమెంట్ రైటర్లు, తదితర నేరాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. భూదందా పేరిట మోసాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకులు, బడా వ్యాపారులను సైతం వదిలిపెట్టడం లేదు. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతుంది. పలువురు ఫోన్లు స్విచ్ఆఫ్ చేసుకొని స్థానికంగా కనిపించకుండా పోతున్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ను వారం క్రితం అరెస్ట్ చేశారు. తాజాగా భోరజ్ మండలంలో భూ దందాకు సంబంధించి బడా వ్యాపారుల అరెస్టు అంశం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. -
అందరికీ వాటాలే..?
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో కొంత మంది ఉద్యోగులు ఇష్టారీతి న వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రెగ్యులర్ డీఎఫ్వో లేకపోవడం, అలాగే ఆదిలాబాద్ డివిజన్కు సైతం ఇన్చార్జి అధికారే ఉండడంతో ఉద్యోగులు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా మా రింది. జిల్లాకేంద్రంలోని డివిజన్ కార్యాలయంలో కొన్నేళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కనుసన్నల్లోనే కార్యకలాపాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే నలుగురు ఉద్యోగులు ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్న చందంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారని సమాచారం. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల్లో పైనుంచి కింది వరకు వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మొత్తం 16 శాతం వరకు వారి స్థాయికి అనుగుణంగా వాటాలుగా వెళ్తున్నాయనేది ఆ శాఖలో బహిరంగ రహస్యమే. ఏళ్లుగా ఇక్కడే తిష్ట ఆదిలాబాద్ డివిజన్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి ఏళ్లుగా అక్కడే తిష్ట వేశాడు. ఇటీవల డీఎఫ్వో కార్యాలయానికి బదిలీ అయినప్పటికీ ఆ కుర్చీని వదిలిపెట్టడం లేదు. కాసులు కురిపించే సెక్షన్ కావడంతో అధికారులను మచ్చిక చేసుకొని రాజకీయ నాయకులతో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తె లుస్తోంది. ఆ సెక్షన్కు కేటాయించిన ఉద్యోగికి సై తం చార్జి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నా రు. గతంలో ఈ ఉద్యోగి ఇచ్చోడ డివిజన్లో పనిచేస్తున్నప్పటికీ ఆదిలాబాద్లోనే తిష్ట వేశాడు. ఇచ్చోడ, ఆదిలాబాద్ డివిజన్ అకౌంట్స్ ఆయనే ఏళ్లుగా చూస్తున్నాడు. కమీషన్లతో రూ.లక్షల్లో సంపాదిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆ ఉద్యోగికి కార్యాలయంలో పనిచేసే మరో నలుగురు సైతం వత్తాసు పలకడం గమనార్హం. అంతేకాకుండా తనకు ఓ రాజకీయ నాయకుడు బంధువని చెబుతూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు.. ఉన్నతాధికారుల ఆదేశాలను కొంతమంది ఉద్యోగులు బేఖాతరు చేస్తున్నారు. డివిజన్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు బదిలీ కాగా, ఒక ఉద్యోగి మాత్రమే తనకు కేటాయించిన డీఎఫ్వో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మరో ఉద్యోగి ఇప్పటివరకు రిలీవ్ కాలేదు. పాత స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల పీసీసీఎఫ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటేషన్లో ఉన్న ఉద్యోగులను వారి స్థానాలకు వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు ఎఫ్బీవోల డిప్యూటేషన్ రద్దు కాగా, వారికి కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరారు. అయితే నిర్మల్ జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి డీఎఫ్వో కార్యాలయంలో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. డిప్యూటేషన్ రద్దు చేసినప్పటికీ సదరు ఉద్యోగి అక్కడికి వెళ్లకుండా అక్కడే కొనసాగుతుండడం గమనార్హం.ఆదేశాలు జారీ చేశాంఎఫ్డీవో కార్యాలయం నుంచి డీఎఫ్వో కార్యాలయానికి ఇద్దరు ఉద్యోగులు బదిలీ అయ్యారు. ఒకరు ఇప్పటికే విధుల్లో చేరగా, మరొకరు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. సదరు ఉద్యోగికి పలుమార్లు తెలియజేశాం. నలుగురు ఎఫ్బీవోల డిప్యూటేషన్లు రద్దు కాగా, వారు సొంత స్థానాలకు వెళ్లారు. నిర్మల్కు చెందిన ఉద్యోగి డిప్యూటేషన్ ఉత్తర్వులు రద్దు చేశాం. ప్రస్తుతం ఆ ఉద్యోగి ఇక్కడే పనిచేస్తున్నారు. – ప్రేమలత, ఏవో, డీఎఫ్వో కార్యాలయం, ఆదిలాబాద్ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల్లో పైనుంచి కింది స్థాయి వరకు అధికారులు వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డివిజన్ స్థాయి అధికారికి 5శాతం, ఉన్నతాధికారులకు 3 శాతం, రేంజ్ క్లర్క్కు ఒక శాతం, డివిజన్లో పనిచేసే క్లర్క్లకు 2శాతం, సర్కిల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు 1.5 శాతం.. ఇలా వాటాలు పంచుకుంటారనే ప్రచారం సాగుతోంది. అదేవిధంగా మిగతావి ఎఫ్ఆర్వో స్థాయి అధికారికి 4 శాతం వరకు కమీషన్లు ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే సంబంధిత సెక్షన్ క్లర్క్లకు వాటాలు ఉండడంతో కార్యాలయంలో పనిచేసే మిగతా ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు అదే సీట్లో ఉంటే వారే పంచుకుంటారా.. వాటా కోసం తమవంతు ఎప్పుడు అంటూ ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇలా కమీషన్లు రావడంతో కొందరు ఉద్యోగులు అకౌంట్ సెక్షన్లోనే ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నారు. -
అడవిపంది మాంసం పట్టివేత
బెల్లంపల్లి: అటవీశాఖ అధికారులు బుధవా రం అడవిపంది మాంసం పట్టుకున్నట్లు బెల్ల ంపల్లి రేంజ్ అధికారి సీహెచ్ పూర్ణచందర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేర కు రేంజ్ పరిధిలోని ధర్మారావుపేట బీట్లో బుగ్గగూడ సమీపంలోని పత్తి చేనులో గాలింపు చర్యలు చేపట్టగా సంకుర్తల శ్రీకాంత్ ప ట్టుబడ్డాడు. అతన్ని విచారించగా అడవిపందిని వేటాడి చంపినట్లు అంగీకరించాడు. అతనితో పాటు మాంసం కొనుగోలు చేసేందుకు వచ్చిన శ్రీనివాస్, రంజిత్పై కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. రైల్వే బ్రిడ్జిపై వ్యక్తి మృతదేహంబాసర : బాసర గోదావరి నది మొదటి రైల్వే బ్రిడ్జిపై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి (58) మృతి చెందినట్లు రైల్వే ఏఎస్ఐ మహబూబ్ ఖాన్ తెలిపారు. మృతుడు నీలిరంగు లుంగీ, సిల్వర్ రంగు టీషర్టు ధరించి ఉన్నాడని, చేతిపై ‘కే. లక్ష్మి’ అని పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నకిలీ నంబర్ ప్లేట్ అమర్చిన వ్యక్తి రిమాండ్ఆదిలాబాద్టౌన్: మహారాష్ట్రలోని కేళాపూర్కు చెందిన నంది దగాడే ద్విచక్ర వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్తో బుధవారం పట్టణంలో తిరుగుతుండగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన నంబర్ ఉండగా, ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన నంబర్ప్లేట్ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అడవి పందుల బీభత్సంసిరికొండ: మండలంలోని కొండాపూర్ శివారులో మంగళవారం రాత్రి రైతు సాయిని రాయమల్లు మూడెకరాల మొక్కజొన్న చేనుపై అడవిపందులు దాడిచేసి ధ్వంసం చేశాయి. చేతికి అందివచ్చి న పంటలపై అడవి పందులు దాడులు చేస్తుండడంతో రైతులు రాత్రివేళ కాపలాగా వెళ్తున్నారు. -
ఉత్సాహంగా కబడ్డీ ఎంపిక పోటీలు
ఆదిలాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 లో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు బుధవారం ఉత్సాహంగా సాగా యి. స్థానిక ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో జిల్లా అమెచ్యూర్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పో టీల్లో బాల, బాలికలు పాల్గొని సత్తా చాటారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, పీడీలు సాయి కుమార్, నాందేవ్ పాల్గొన్నారు. -
125 గంజాయి మొక్కలు స్వాధీనం
నేరడిగొండ: పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం నేరడిగొండ పోలీసులు బోరిగాం శివారులో తనిఖీలు చేపట్టారన్నారు. వారిని గమనించిన బోరిగాంకు చెందిన ఆడే కపిల్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని చేనులో పరిశీలించగా పత్తి పంట మధ్యలో 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరిగిన 125 గంజాయి మొక్కలు కనిపించడంతో దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక గంజాయిని రహస్యంగా సాగు చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. పట్టుకున్న గంజాయి మొక్కల విలువ రూ.12.50 లక్షల వరకు ఉంటుందన్నారు. గంజాయి సాగుకు ఉపయోగించిన ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
పర్యాటకరంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
కై లాస్నగర్: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కి ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ ఆదేశించారు. బుధవా రం ఆమె హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా ల్లోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రతి జిల్లాకు నోడల్ అధికారులను నియమించాలన్నారు. పర్యాటక ప్రాంతా ల్లో తాగునీరు, ఆహార పదార్థాలు, ముఖ్య పట్ట ణాల నుంచి రవాణా సౌకర్యం, మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, భద్రత, పార్కింగ్, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలు మెరుగుపర్చాలన్నారు. సినీ చిత్రీకరణకు అనుకూలమైన ప్రాంతాలు గుర్తించి, అభివృద్ధి పర్చాలన్నారు. రానున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించా లని, ఇందులో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని తెలిపారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, ఎస్. రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రవి పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ఆదిలాబాద్రూరల్: ెపండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మావల పోలీస్స్టేషన్ను బుధవారం తనిఖీ చేశారు. రికార్డులతో పాటు పరిసరాలను పరిశీలించారు. రా త్రి వేళల్లో పటిష్టమైన గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరా లకు అడ్డుకట్ట వేసేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, మావల సీఐ బీడీ ప్రేమ్ కుమార్, ఎస్సైలు రాజశేఖర్, సాయిలు ఉన్నారు. కాళోజీ సేవలు చిరస్మరణీయం ఆదిలాబాద్టౌన్: తెలంగాణ భాష, సంస్కృతి, ప్ర జా చైతన్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయమని ఎస్పీ అన్నారు. కాళోజీ జయంతి వేడుకలను జిల్లా పోలీ సు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ, కాళోజీ తన కలంతో ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించారని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో అదనపు ఎస్పీలు పి.మౌనిక, బి.సురేందర్ రావు, డీఎస్పీ ఇంద్రవర్ధన్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మోహన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి.వెంకటి, పోలీ సు కార్యాలయ ఏవో శివకుమార్ పాల్గొన్నారు. పదోన్నతితో మరింత బాధ్యత ఆదిలాబాద్టౌన్: పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్కాని స్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. బుధవారం పోలీ సు కార్యాలయంలో వారికి పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందించారు. ప్రమోషన్ పొందిన వారిలో వన్టౌన్ కానిస్టేబుల్ మహేందర్, గుడిహత్నూర్కు చెందిన ఎం.దేవిదాస్ ఉన్నా రు. వీరిని నిర్మల్ జిల్లాకు కేటాయించారు. అలాగే నేరడిగొండకు చెందిన కె.రమేశ్, తలమడుగుకు చెందిన ఎంఏ కరీమ్ను జగిత్యాల జిల్లాకు బదిలీ చేశారు. -
‘కాకతీయ’.. ఇదేం మాయ..!?
నిర్మల్: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని కలలను చిదిమేసింది. చేయని తప్పుకు పెద్దశిక్ష వేసింది. బీకాం కంప్యూటర్స్ ఆరో సెమిస్టర్ ఇంగ్లిష్ ఆన్సర్షీట్లో రెండు పేజీలు లేవంటూ రిజల్ట్ మెమోలో అన్ని సబ్జెక్టులకూ ‘మాల్ ప్రాక్టీస్’గా పేర్కొంది. ‘సార్.. నేనే తప్పూ చేయలేదు. నాకెందుకు ఈ శిక్ష..’ అంటూ కాలేజీలు, వర్సిటీల చుట్టూ తిరిగింది. ఎక్కడా న్యాయం జరగలేదు. నియమాలు, నిబంధనలు అంటూ వర్సిటీ చెబుతోంది. చేసేది లేక.. తండ్రి తన బిడ్డతో కలిసి ఇటీవల ‘మీరైనా న్యాయం చేయండి..’ అంటూ లోకాయుక్తాను ఆశ్రయించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కంజర్ గ్రామానికి చెందిన బర్కుంట గంగాభవాని నిర్మల్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదివింది. ఏప్రిల్లో ఆరో సెమిస్టర్ పరీక్షలు రాసింది. నెల తర్వాత వచ్చిన ఫలితం ఒక్కసారిగా ఆమెను షాక్కు గురిచేసింది. అన్ని సబ్జెక్ట్ల గ్రేడ్ స్థానంలో ‘ఎంపీ’(మాల్ ప్రాక్టీస్) అని వచ్చింది. వర్సిటీ వరకు వెళ్లి ఆరా తీస్తే.. ఇంగ్లిష్ పరీక్ష జవాబు పత్రాలు పూర్తిగా లేవన్నారు. డిగ్రీ విద్యలో విలువైన ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయింది. ‘లోకాయుక్తా’... న్యాయం చేసేనా..!? తనకు న్యాయం చేయాలని కాకతీయ యూనివర్సిటీ చుట్టూ పలుమార్లు తిరిగినా న్యాయం జరగకపోవడంతో గంగాభవాని, తండ్రి గంగారాం ఇటీవల లోకాయుక్తాను ఆశ్రయించారు. మాల్ప్రాక్టీస్ ఆరోపణలు తొలగించి, విద్యాసంవత్సరం నష్టపోకుండా న్యాయం చేయాలని వేడుకున్నారు. పిల్లల భవిష్యత్తో ముడిపడిన ఇలాంటి వ్యవహారాల్లో యూనివర్సిటీ బాధ్యతాయుతంగా ఉండాలని, ఇలా మమ్మల్ని బాధపెట్టొద్దని తండ్రి గంగారాం వాపోతున్నాడు. -
ఢిల్లీలో ఆకర్షణీయంగా తెలంగాణ స్టాల్
కాసిపేట: ఢిల్లీలోని బాలభవన్లో జరిగిన ఉల్లాస ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర స్టాల్ ఆకర్షణీయంగా నిలిచింది. స్టాల్లో తెలంగాణ రాష్ట్రం వాచకాలను టీఎల్ఎంను ప్రదర్శించినట్లు డీఆర్పీ బండ శాంకారి తెలిపారు. బుధవారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో బోనాలు, అక్షర బతుకమ్మ, బంజార నృత్యం ప్రదర్శించినట్లు తెలిపారు. వేదికపై భువనమ్మ కొండల్లో కోయిలపాటలు పాడా లి అనే అక్షరజ్ఞానం పాటలు పాడి అందరి మనన్నలు పొందినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో అధికారులు పురుషోత్తంనాయక్, మహ్మద్ నుమాన్, రంగారెడ్డి డెప్యూటీ డైరెక్టర్ అనిత, రాష్ట్ర కోఆర్డినేటర్ శైలజ , వాలంటీర్లు రాజేశ్వరి, రజిత, కవిత, పాల్గొన్నారు. -
బసవన్నల పండుగ చేద్దాం!
కెరమెరి/బోథ్: పండుగలన్నీ మానవజాతికి చెందినవే. కానీ పొలాల అమావాస్య మాత్రం ఎద్దులకు చెందిన ప్రత్యేక పండుగ. శ్రావణమాసంలో వచ్చే చివరి పండుగ పొలాల అమావాస్యను గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. గురువారం పండుగ నేపథ్యంలో బుధవారమే ఎడ్లను శుభ్రంగా కడిగి ఇళ్లకు తీసుకెళ్లారు. నేడు గురువారం ఎద్దుల కొమ్ములకు రకరకాల రంగులు వేస్తారు. వీపుపై జూలు, మెడలో గంటలతో పాటు బహుసుందరంగా వాటిని అలంకరిస్తారు. సాయంత్రం ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి ఐదుసార్లు ప్రదక్షణ చేయిస్తారు. అనంతరం గ్రామ పటేల్ తోరణం తెంపిన తర్వాత ఎడ్లను ఇళ్లకు తీసుకెళ్తారు. నైవేద్యంగా... ఆలయాల్లో ప్రదక్షణ అనంతరం ఎడ్లను ఇళ్లకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆ రోజు చేసిన వంటకాలు నైవేద్యంగా తినిపిస్తారు. ఎడ్లు తిన్న వాటిని కుటుంబ సభ్యులు ఆరగిస్తారు. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారమని పెద్దలు చెబుతున్నారు. ఎడ్లు లేని రైతులు కూడా తమ బంధువుల ఎడ్లను తీసుకవచ్చి పూజలు నిర్వహస్తారు. శుక్రవారం బడుగ.. పొలాల అమావాస్య మరుసటి రోజు బడుగ పండుగ జరుపుకుంటారు. శ్రావణమాసంలో నెల రోజులు మాంసాహారం ముట్టకుండా నియమ నిష్టలు పాటించి శుక్రవారం రోజు మాంసాహారం స్వీకరిస్తారు. ‘ఈగలు, దోమలు, రోగాలు, తీసుకపోరా బడుగ’ అంటూ ఇంటి నుంచి కేకలు వేస్తూ రాత్రి చేసిన పిండివంటల నైవేద్యాన్ని తీసుకొని గ్రామ పొలిమేర వరకు వెళ్తారు. అక్కడ జమ్మిచెట్టుకు పూజలు చేసి కలిసికట్టుగా నైవేద్యం ఆరగిస్తారు. ఆ రోజు నుంచి ఈగలు, దోమలు, వ్యాధులు పారిపోతాయని గ్రామీణ ప్రజల నమ్మకం. -
45 కాదు.. ఇక 25 రోజులకే
కై లాస్నగర్: వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వినియోగదారులు ఇకపై 45 రోజుల వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. 25 రోజులకు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించి సోమవారం నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఊరట కలగనుంది. కేంద్ర నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందంటే .. ఇటీవల పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా హోర్మూజ్ నుంచి ఇంధన రవాణాకు అంతరాయం ఏర్పడింది. సరిపడా గ్యాస్ సరఫరా కాకపోవడంతో జిల్లాలో వినియోగదారులు సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ కొరత ఏర్పడుతుందో అని కొంతమంది అవసరం లేకున్నా ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. దీంతో వాస్తవంగా అవసరమైన వారికి గ్యాస్ లభించని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వినియోగదారులందరికీ సిలిండర్లను అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ ఏడాది మార్చిలో బుకింగ్ గడువులో మార్పులు చేసింది. పట్టణ ప్రాంతాల్లోని వారికి 25 రోజులకే అవకాశాన్ని కల్పించగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి మాత్రం 45 రోజులకు పొడిగించింది. ఈ క్రమంలో గ్యాస్ వినియోగం అధికంగా ఉండే పెద్ద కుటుంబాలకు సిలిండర్ కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఇకపై 25 రోజులకే.. యుద్దం ముగియడంతో గ్యాస్ సరఫరా యథావిధంగా జరగడంతో పాటు బుకింగ్ సిలిండర్ల పెండింగ్ సైతం తగ్గిపోవడంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా బుకింగ్ గడువును మార్పు చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులందరికీ ఒకే విధంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆరు నెలలుగా కొనసాగిన 45 రోజుల బుకింగ్ గడువును 25 రోజులకు కుదించడంతో గ్రామీణ ప్రాంతాల వారి ఇక్కట్లకు ఇక తెరపడింది.జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు 17 ఎల్పీజీ కనెక్షన్లు 2,14,413 ఉజ్వల 36,960 జనరల్, దీపం 1,77,453 నెలకు వినియోగమయ్యే సిలిండర్లు 80వేలు -
కుప్టి బ్రిడ్జికి మరమ్మతులు షురూ
ఇచ్చోడ: ‘కుప్టి పాతబ్రిడ్జికి బుంగ’ శీర్షికన ఈనెల 8న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎట్టకేలకు బుధవారం మరమ్మతు పనులు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన 12 మంది సభ్యులు బ్రిడ్జి పై బుంగ పడిన ప్రదేశంలో మరమ్మతు చేస్తున్నారు. బ్రిడ్జికి ఉన్న 13 జాయింట్ల వద్ద పాత స్టీల్ రాడ్లు, కంకరను తొలగించి వాటిస్థానంలో కొత్త రాడ్లు బిగించి సిమెంట్, కంకరతో జాయింట్లను పూ డ్చాల్సి ఉంటుందని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. దాదాపుగా నెల రోజులపాటు పనులు కొనసాగనున్నట్లు ‘సాక్షి’కి వివరించారు. కుప్టి పాత బ్రిడ్జిని ఆర్అండ్బీ శాఖ అధికారులు నిర్మించారు. నేషనల్ హైవే అఽథారిటీ అధికారు లే మరమ్మతులు చేపట్టాలి. కానీ వారు పనులు ప్రా రంభించకుండా నిర్లక్ష్యం చేశారు. చివరి సమయంలో చేతులెత్తేసి మరమ్మతు పనులను కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వారికి అప్పగించి చేతులు దులుపుకున్నారు. -
లోటు వర్షపాతం
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో ప్రస్తుతం 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 21 మండలాలు ఉండగా, 20 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఒక్క తలమడుగు మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం ఉంది. పది రోజుల క్రితం మామూలు వర్షం తప్పితే మళ్లీ జాడలేకుండా పోయింది. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. తగ్గుతున్న నీటిమట్టాలు.. ఈ సీజన్లో ఆగస్టు మొదటి వారంలో కురిసిన వర్షాలు మినహా మిగతా అన్ని వారాల్లో అత్యధికంగా లోటు వర్షపాతమే నమోదైంది. అప్పుడు కురిసిన ఆ వర్షాలకు జలాశయాల్లో నీరు చేరింది. ప్రస్తుత పొడి వాతావరణం కారణంగా ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. నీటిమట్టాలు గణనీయంగా తగ్గుతున్నాయి. సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్ట్ల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. జిల్లాలో 298 చెరువులు ఉండగా, అన్ని చెరువులు సగం మాత్రమే నిండాయి. దీంతో భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. బోరుబావుల పరిస్థితి అలాగే ఉంది. రా బోయే రోజుల్లో వర్షాలు పడకపోతే తాగునీటి ఎద్దడి కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు. పంటల పరిస్థితి.. జిల్లావ్యాప్తంగా 5లక్షల 94వేల ఎకరాల్లో పత్తి, సోయా, కంది, మొక్కజొన్న తదితర పంటలు ఈ వానాకాలంలో సాగయ్యాయి. అత్యధికంగా 4.37 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. పంటలు పూత, కాత దశలో ఉండగా, డ్రైస్పెల్ కారణంగా పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది ఆదిలాబాద్ శివారు లాండసాంగ్వి గ్రామంలో రైతు రాజేందర్ పత్తి చేను. ఇప్పటికే పూత, కాతతో విరివిగా ఉండాల్సిన పంట ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తుంది. అనుకున్న స్థాయిలో కాయలు కాయకపోవడం, ఉన్న వాటికి సైతం సరిపడా తేమ లభించక ఎదుగుదల లోపించింది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు సరిపడా వర్షాలు లేవు. ఇది పంటపై ప్రభావం చూపుతుంది. దిగుబడిపై రైతు ఆశలు సన్నగిల్లుతున్నాయి.వర్షపాతం వివరాలు.. (జూన్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు) సాధారణం : 897.5 మి.మీ.లు కురిసింది : 597.1 మి.మీ.లు లోటు : 33 శాతం -
అరెస్టులతో బీఆర్ఎస్ను అడ్డుకోలేరు
ఆదిలాబాద్టౌన్: అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోలేరని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంబేడ్కర్ చౌక్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యూనుస్ అక్బాని, ప్రకాశ్, మెట్టు ప్రహ్లాద్, సాజిదొద్దీన్, అశోక్ స్వామి, రాజు, రమేశ్, నారాయణ, కస్తాల ప్రేమల తదితరులు పాల్గొన్నారు. -
లక్ష మందితో ‘చలో హైదరాబాద్’
ఆదిలాబాద్టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం లక్ష మందితో ఈనెల 10న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారని, ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచి నా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. చలో హైదరాబాద్కు అనుమతి ఇవ్వడం లేదని పే ర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు ముఖ్య మంత్రి మరో రెండేళ్లు ఓపిక పట్టండి అని అనడం విచారకరమని అన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తామని, అవసరమైతే అసెంబ్లీ వద్దకు వెళ్లి కలుస్తామని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీని వాస్రావు, జిల్లా జేఏసీ చైర్మన్ ఎ.నవీన్కుమార్, టీజీవో జిల్లా అధ్యక్షుడు శివకుమార్, జేఏసీ నాయకులు దామోదర్ రెడ్డి, ఎ.వెంకట్, సదానందం, కట్కం రమేశ్, టి.లింగారెడ్డి, తిరుపతి, లచ్చిరాం, శ్యామ్, కృష్ణకుమార్, స్వామి, కిష్టన్న, అశోక్, శ్రీని వాస్, నరేందర్, వృకోధర్, సుదర్శన్, శ్యామ్యూల్, దిలీప్, చంద్రశేఖర్, సతీశ్, అంగన్వాడీ కార్యకర్తలు, ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ సర్వీస్లో కొనసాగించాలని వినతి వ్యవసాయ శాఖలో డిప్లొమో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న వారిని యథావిధిగా కొనసాగించాలని ఉద్యోగులు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన జగదీశ్వర్కు వినతి పత్రం అందజేశారు. ఇందులో ఏఈవోలు తౌసిఫ్, ఆనంద్, రమేష్, జాహెద్ తదితరులున్నారు. -
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది. మందుల కొరత.. రిమ్స్ ఆస్పత్రి ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉంది. ఇక్కడ ఓ పక్క వైద్యుల కొరత వేధిస్తుండగా, మరోవైపు సరిపడా మందులు అందుబాటులో లేని పరిస్థితి. అధికా రులు సరిపడా ఉన్నాయని చెబుతున్నా ఫా ర్మసిస్టులు మాత్రం పూర్తి స్థాయిలో ఇవ్వ డం లేదని రోగులు పేర్కొంటున్నారు. ఒకట్రెండు టాబ్లెట్లు చేతిలో పెట్టి, మిగతావి ప్రైవేట్ మెడికల్ నుంచి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో ఉన్న మూడు మెడికల్ షాపులకు గిరాకీ పెరిగింది. -
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్ ప్రశాంతం
ఆదిలాబాద్టౌన్: ఫీజురీయింబర్స్మెంట్ బకా యిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చేపట్టిన ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బోరంచు ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ, కొన్నేళ్లుగా ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే బిల్లులను విడుదల చేయాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు పాల్గొన్నారు. -
ఫీవర్రీ!
విజిట్లో తేటతెల్లం..పెరిగిన ఆవాస కాలం మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ వైపు సాగే పులుల వలసలకు బోథ్, సొనాల అటవీ శ్రేణులు అత్యంత కీలకంగా మారాయి. ఉట్నూర్ జిల్లా ఆసుపత్రిలో అన్ని వార్డులు రోగులతో కిటకిటలాడాయి. సరిపడా బెడ్లు లేకపోవడంతో ఒక్కో పడకపై ఇద్దరేసి చొప్పున ఉంచి చికిత్స అందిస్తున్నారు. నా పేరు అంజన. మాది ఝరి. మా పాపకు జ్వరం వచ్చింది. రిమ్స్లో డాక్టర్కు చూపిస్తే మందులు రాసి ఇచ్చారు. కొన్ని ట్యాబ్లెట్లు ఇవ్వగా, సిరప్ ప్రైవేట్ మెడికల్లో కొనుగోలు చేశాను.జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రులను ‘సాక్షి’ మంగళవారం ఉదయం విజిట్ చేయగా పలు చోట్ల కనిపించిన దృశ్యాలివి. జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కై లాస్నగర్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి మంగళవారం జిల్లా కు విచ్చేశారు. స్థానిక పెన్గంగ గెస్ట్హౌస్కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఈవీఎంల భద్రత వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. తాంసి, భీంపూర్, ఆదిలాబాద్అర్బన్ మండలాల్లో బుధవారం పర్యటించనున్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలనతో పాటు క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ అమలు తీరు స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో అధికారులతో సర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించనున్నారు.ఇక్కడ కనిపిస్తున్నది రిమ్స్ ఆస్పత్రిలోని ఓపీ విభావం.. మంగళవారం ఉదయం 10.30గంటల సమయం.. సీజనల్ జ్వరాలతో వచ్చిన రోగులు, వారి సహాయకులతో ఈ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ప్రిస్కిప్షన్ కోసం ఇలా బారులు తీరి దర్శనమిచ్చారు.ఆదిలాబాద్టౌన్: సీజనల్ వ్యాధులతో జనం విలవిల్లాడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో చిన్నా పెద్ద తేడా లేకుండా మంచం పడుతున్నారు. రిమ్స్తో పాటు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు డెంగీ విజృంభిస్తోంది. గడిచిన మూడు నెలల్లో 33 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడమే కారణంగా తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. పీహెచ్సీల్లోనూ సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు తప్పని పరిస్థితి. మందుల కొరతతో ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు, వారి బంధువులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న డెంగీ కేసులు.. జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో 6, ఆగస్టులో 20, సెప్టెంబర్లో 7 కేసులు నమోదైన ట్లు అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన వారం రోజుల్లో పట్టణంలోని బంగారుగూడ, రణదీ వెనగర్, కేఆర్కే కాలనీ, భుక్తాపూర్, ఇచ్చోడలోని ధర్మపురి, ఇంద్రవెల్లిలోని శంకర్గూడ, నేరడిగొండలోని తర్నంలో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వేధిస్తున్న వైద్యుల కొరత.. జిల్లాలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 22 పీహెచ్సీలు ఉండగా, మొత్తం 50 వైద్యాధికార పో స్టులకు గాను 24 ఖాళీగా ఉన్నాయి. 26 మంది మా త్రమే పనిచేస్తున్నారు. ఆయా పీహెచ్సీల్లో పనిచేసే వైద్యులకు పీజీ సీట్లు రావడంతో 16 మంది వెళ్లిపోయారు. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్బీఎస్కే, జన్మన్ వైద్యులతో సర్దుబాటు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. రిమ్స్లోనూ ఇదే పరిస్థితి. గైనిక్ విభాగం దారుణంగా ఉంది. కీలకమైన ఈవిభాగంలో ముగ్గురు, నలుగు రు వైద్యులు మాత్రమే ఉన్నారు. ఓపీ, ఇన్పేషెంట్ వార్డుల్లో సరిపడా వైద్యులు లేకపోవడంతో పీజీలు, జూనియర్ డాక్టర్లతోనే సేవలు అందుతున్నాయి. -
పర్యావరణహితంగా గణేశ్ నవరాత్రులు
కై లాస్నగర్: జిల్లాలో వినాయక నవరాత్రి వేడుకల ను పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో వినాయక చవితి ఉత్సవ శాంతియుత సమన్వ య కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించా రు. ఉత్సవ ఏర్పాట్లు, శాంతిభద్రతలు, నిమజ్జనం, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్యసేవలు తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ‘మట్టి గణ పతులను పూజిద్దాం–పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అనే సత్సంకల్పంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ప్రజలకు పంపిణీ చేసేందుకు 2,000 మట్టి వినా యక ప్రతిమలను అందుబాటులో ఉంచినట్లు తెలి పారు. కావాల్సిన వారు 81063 44637, 97018 88058 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం ఉచిత మట్టి విగ్రహాల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్ఎస్ చిత్రు, సబ్ కలెక్టర్ కే. ప్రణయ్కుమార్, మున్సిపల్ చైర్మన్ అనూష, వైస్ చైర్మన్ రో హిత్, ఆర్డీవో జగదీశ్వర్రావు, వివిధ శాఖల అధికా రులు, ఉత్సవ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. మండపాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఆదిలాబాద్టౌన్: గణేశ్ మండపాలకు ఆన్లైన్ రిజి స్ట్రేషన్ తప్పనిసరి అని ఎస్పీ అఖిల్మహాజన్ అన్నా రు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాట్లాడారు. మండపాల నిర్వహణ, నిమజ్జనం తేదీ, సమయం, మార్గం, ప్ర దేశం, నిర్వాహకులు, వలంటీర్ల వివరాలను పోలీ సుశాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. policeportal. tspolice.gov.in వెబ్సైట్లో వివరాలను పొందుపర్చాలని తెలిపారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి కై లాస్నగర్: ఎయిర్పోర్టు భూసేకరణ ప్రక్రి య వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించారు. బాధితులకు సంబంధించిన ప్రిలిమిన రీ నోటిఫికేషన్ ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలన్నారు. గడువులోపు రైతులు, గ్రామస్తులతో మాట్లాడి భూసేకరణ రేట్లను ఖరారు చేయాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్. చిత్రు, ఎస్.రాజేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో జగదీశ్వర్రావు, సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏడీ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, ఇరిగేషన్ ఈఈ నరేశ్కుమార్, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు. -
యువత కలల సాకారానికి చేయూత
ఆదిలాబాద్టౌన్: యువత కలలను సాకారం చేసే లా పోలీస్ శాఖ చేయూత అందిస్తుందని ఎస్పీ అఖి ల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణను సోమవారం జిల్లా కేంద్రంలోని డీటీసీలో ప్రా రంభించారు. శిక్షణ కోసం నిర్వహించిన పరీ క్షకు 3,500 మంది అభ్యర్థులు హాజరుకాగా, అందులో 300 మందికి పైగా ఎంపిక చేశారు. ఇందులో 100 మంది నిరుపేదలు, ఆదివాసీ యువతకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెంది న నిష్ణాతులైన శిక్షకులతో అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక పరీక్షలో ఉత్తీ ర్ణత సాధించిన వారికి తదుపరి దశలో డీటీసీ ప్రాంగణంలోనే ఉచిత భోజనం, వసతితో శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో అదనపు ఎస్పీ పి.మౌనిక, డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, టూటౌన్ సీఐ కె.నాగరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి.వెంకటి, రూరల్ ఎస్సై వి.విష్ణువర్ధన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఊరును బాగు చేసిన ఎస్పీకి కృతజ్ఞతలు ఆదిలాబాద్రూరల్ మండలం చిట్యాలబోరిలో కల్తీ కల్లు, గుడుంబాలేకుండా చేయాలన్న గ్రామస్తుల తీ ర్మానం మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో వారు ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ అనిత ఉన్నారు. -
సమన్వయంతో పులుల సంరక్షణ
నిర్మల్టౌన్: పులుల సంరక్షణ, అటవీ పరిరక్షణకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం కీలకమని ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, బాసర సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత భవనంలో సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో ‘ఫారెస్ట్ ప్రొటెక్షనన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ టైగర్ ల్యాండ్స్కేప్’ అంశంపై అంతర్ జిల్లా సమన్వయ వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబ్డే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పులుల సంచారానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ప్రస్తుతం తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్ల నుంచి పులులు ఈ ప్రాంతంలోకి వస్తున్నాయన్నారు. పులుల సంరక్షణతో పాటు వాటి ఆవాస ప్రాంతాలను కాపాడడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓలు ప్రశాంత్ పాటిల్ (నిజామాబాద్), రాహుల్ జాదవ్ (మంచిర్యాల), నీరజ్ టెబ్రివాల్ (కామారెడ్డి), రవిప్రసాద్ (జగిత్యాల), డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల కోసం ఢిల్లీలో గర్జించిన గిరిజనులు
ఆదిలాబాద్టౌన్: ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీలో వేలాది మంది గిరిజనులు గళమెత్తారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని సాయి పార్క్లో సోమవారం ధర్నా, ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐదు, ఆరో షెడ్యూళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టం, పెసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ చట్టం–2023తో ఆదివాసీ గ్రామసభల హక్కులకు భంగం కలిగే పరి స్థితి ఏర్పడిందన్నారు. మైనింగ్ పేరుతో ఆదివాసీ లను భూముల నుంచి తరలించడం నిలిపివేయాలని, అడవులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మన్ జితిన్ చౌదరి, జాతీయ కన్వీనర్, మాజీ ఎంపీ ఫు లీన్ బిహారి బస్కే, జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకర్, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్, టీజేజీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, ఉపాధ్యక్షులు సక్కు, పెందూర్ గోవింద్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ఆత్రం బాపూరావు, కార్యదర్శి తొడసం శంబు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యకు మరింత ఊతం
నిర్మల్ఖిల్లా: ప్రభుత్వ విద్యారంగం బలోపేతం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు మెరుగై న విద్య అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ ప బ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) ఏర్పాటుకు ప్రాధాన్యమి స్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 73 ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎని మిది పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ మేరకు నిఽ దులు కేటాయిస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు రూ.83.19 కోట్లు కేటాయించారు. ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల అభ్యసన ఫలి తాలను మెరుగుపరిచేలా నాణ్యమైన, సమగ్ర విద్యా వాతావరణాన్ని కల్పించేలా అభివృద్ధి చేస్తా రు. ప్రస్తుతం ఉన్న జెడ్పీహెచ్ఎస్లు, మోడల్ స్కూళ్లను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేశారు. ప్రభుత్వ విద్యకు కొత్త రూపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల ను మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచడం ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశం. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలు వంటి సదుపాయాలు కల్పించనున్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, సురక్షితమైన పాఠశాల వాతావరణం అందించడంపై దృష్టి సారించనున్నారు. విద్యార్థుల సమగ్ర వికాసంపాఠ్యపుస్తకాల బోధనకే పరి మితం కాకుండా విద్యార్థుల మేధో, శారీరక, మానసిక, సా మాజిక, సాంస్కృతిక వికాసానికి వేదికగా నిలువనున్నా యి. క్రీడలు, కళలు, సైన్స్, సాంకేతికత, తదితర రంగా ల్లో విద్యార్థుల ప్రతిభను వెలి కితీసేలా అవకాశాలు కల్పించనున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లు ప్ర త్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది. నాణ్యమై న విద్యతో పాటు ఆధునిక సదుపాయాలు ప్రభు త్వ పాఠశాలల్లోనే అందుబాటులోకి వస్తే తల్లిదండ్రులపై విద్యా ఖర్చుల భారం తగ్గనుంది.జిల్లా పాఠశాల నిధులు (రూ.కోట్లలో) కుమురంభీం ఆసిఫాబాద్ జెడ్పీహెచ్ఎస్ 8.40 కాగజ్నగర్ జెడ్పీహెచ్ఎస్ 10.09 మందమర్రి మోడల్ స్కూల్ 10.70 మంచిర్యాల కాసిపేట మోడల్ స్కూల్ 10.30 సీతారాంపల్లి జెడ్పీహెచ్ఎస్ 12 నిర్మల్ కుంటాల మోడల్ స్కూల్ 9 నర్సాపూర్(జీ) జెడ్పీహెచ్ఎస్ 12.50 ఆదిలాబాద్ యాపల్గూడ జెడ్పీహెచ్ఎస్ 10.20 ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలు, కేటాయించిన నిధులు -
ఆవేదన విని.. భరోసా కల్పించి
కై లాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, ఆర్ఎస్.చిత్రు తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన. -
సర్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
కై లాస్నగర్: సమగ్ర ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్–2026) ప్రక్రియ పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల ని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితా రాణా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతోపాటు, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. ప్రస్తుత ప్రత్యేక సవరణ గతంలో నిర్వహించిన సవరణలకు భిన్నంగా అత్యంత సమగ్రంగా కొనసాగుతోందన్నారు. 2002, 1984 నాటి రికార్డులు, సంబంధిత పత్రాలను ఆధారంగా చేసుకుని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల సంఖ్యను పరిశీలించాలని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బీ ఎల్వోల పాత్ర కీలకమని, అధికారులు–బీఎల్ఏలు సమన్వయంతో పనిచేసి ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. గడువులోపు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, ఎస్.రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్రావు, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ తదితరులు పాల్గొన్నారు. 60వేల నోటీసుల పరిష్కారం కై లాస్నగర్: సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో లక్ష 50వేల మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అందులో 60వేల వరకు పరిష్కరించామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఈఆర్వోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో, ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో ఎక్కు వ పెండింగ్లు ఉన్నందున వాటిపై ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేస్తున్నట్లుగా తెలిపారు. డాక్యుమెంట్ అప్లోడింగ్, హియరింగ్ లాప్స్, దరఖాస్తుల సేకరణను ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల వద్ద కేవలం 99 మాత్రమే పెండింగ్లో ఉన్నట్లుగా వివరించారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మహాలక్ష్మివాడలో నూతన పైపులైన్
కై లాస్నగర్: పట్టణంలోని మహాలక్ష్మివాడ, జైజవాన్నగర్, చిల్కూరిలక్ష్మినగర్, తాటిగూడ కాలనీవాసులకు నీటి సరఫరాలో తరచూ ఎదురవుతున్న ఇబ్బందులపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్సీసీ 400ఎంఎం డయా పంపింగ్ పైపులైన్ పాతది కావడంతో తరచూ సమస్యలు తలెత్తి నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ క్రమంలో పాత పైపులైన్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజులుగా కొనసాగుతున్న ప నులను మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూ ష సోమవారం పరిశీలించారు. పనుల ప్రగతి పై ఆరాతీశారు. త్వరితగతిన పూర్తయ్యేలా చూ డాలని అధికారులను ఆదేశించారు. రాబో యే వేసవి దృష్ట్యా నీటిసరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం నూతన పైపులైన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా పే ర్కొన్నారు. ఈక్రమంలో మరో వారం వరకు నీటి సరఫరాలో ఇబ్బందులు తప్పవని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆమె వెంట వార్డు కౌన్సిలర్ సంజయ్, పబ్లిక్ హెల్త్ అధికారులు అర్షద్, అమృత్ తదితరులున్నారు. -
కుప్టి పాత బ్రిడ్జికి బుంగ..
ఇచ్చోడ: నేషనల్ హైవే అఽథారిటీ అధికారుల తప్పిదం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. 44వ జాతీయ రహదారి కుప్టి పాత బ్రిడ్జికి బుంగ పడటంతో వాహనాల రాకపోకాలను పూర్తిగా నిలిపివేశారు. పాత బ్రిడ్జికి రెండు వందల మీటర్ల దూరంలో డ్రైవర్షన్ ఏర్పాటు చేసి వాహనాలను నూతన బ్రిడ్జి వైపు మళ్లిస్తుండడంతో ఒక్కో వాహనం అక్కడి నుంచి పాస్ కావడానికి కనీసం గంట సమయం పడుతోంది. పూర్తిగా డౌన్ ఉన్న చోట డైవర్షన్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా రాత్రి వేళల్లో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే వాహనాలు డైవర్షన్ నుంచి వన్వేలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతోంది. దీంతో జాతీయ రహదారిపై మూడు, నాలుగు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండడంతో ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. ప్రారంభంకాని మరమ్మతులు..నెల రోజుల క్రితం కుప్టి పాత బ్రిడ్జి మధ్యలో బుంగ ఏర్పడింది. అధికారులు గుర్తించినప్పటికీ ఇప్పటి వరకూ మరమ్మతులు చేయకపోవడంతో నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. అంతేకాకుండా బ్రిడ్జిపై 320 మీటర్ల పొడవున 12 జాయింట్ల వద్ద మరమ్మతులు చేపట్టాల్సి ఉందని స్థానిక ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో రెండు వైపులా రక్షణగా రెయిలింగ్ నిర్మించారు. అది అక్కడక్కడ కూలిపోవడంతో దాని స్థానంలో రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంతో కూడా బ్రిడ్జిపై భారం పడినట్లు, రక్షణ గోడ నిర్మించే సమయంలో బ్రిడ్జిపై నెల రోజుల నుంచి వన్వే చేయడంతో ఒకే వైపు నుంచి వాహనాలు రాకపోకలు సాగించడం కూడా బ్రిడ్జిపై బుంగ పడేందుకు కారణం కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామర్ధ్యంపై అనుమానాలు..కుప్టి వద్ద కడెం వాగుపై 1982లో బ్రిడ్జి నిర్మించారు. 10 నుంచి 20 టన్నుల బరువు ఉన్న వాహనాలే ఎక్కువగా రాకపొకలు సాగించేవి. కానీ పదేళ్లుగా ట్రాన్స్పోర్టులో మార్పులు రావడంతో భారీ కంటైనర్లు, వాహనాల్లో 55 టన్నుల వరకు లోడ్తో ఈ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కనెక్టివిటీ ఉన్న ఈ జాతీయ రహదారిలో కేంద్ర ప్రభుత్వం అనుమతితో భారీ లోడ్తో ఉన్న పుల్లర్ వాహనాలు సైతం ఈ బ్రిడ్జి గుండా రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో 55 టన్నుల కంటే రెండు రెట్ల ఎక్కువ లోడ్ ఉంటున్నట్లు సమాచారం. దీంతో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జికి బుంగ పడటంతో బ్రిడ్జి సామర్ధ్యాలపై అనుమానాలకు తావిస్తోంది. బ్రిడ్జికి మరమ్మతులు చేసి రాకపోకలు సాగిస్తామని చెప్తున్న హైవే అథారిటీ అధికారులు మాత్రం బ్రిడ్జి నాణ్యత ప్రమాణాల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. మూడేళ్ల క్రితమే నిపుణుల నివేదిక..బ్రిడ్జి నాణ్యత ప్రమాణాలపై మూడేళ్ల క్రితమే నిపుణులు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు నివేదిక అందజేశారు. పాత బ్రిడ్జి పక్కన నూతనంగా బ్రిడ్జి నిర్మించాలని నివేదికలో పేర్కొనట్లు సమాచారం. నేషనల్ హైవే అఽథారిటీ అధికారులు మాత్రం నివేదికను బుట్టదాఖలు చేసి నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం చర్యలు తీసుకోక పోవడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కుప్టి బ్రిడ్జి విషయమై నేషనల్ హైవే అథారిటీ పీడీ వివరణ కోసం సాక్షి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
మళ్లీ తెరపైకి ‘హస్తం’ లొల్లి
సాక్షి,ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉట్నూర్ పీఏసీ సమావేశంలో జరిగిన గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. కంది శ్రీనివాసరెడ్డి, అల్లూరి సంజీవ్రెడ్డి మధ్య అప్పట్లో జరిగిన వివాదంపై పార్టీ క్రమశిక్షణ కమిటీ సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే. ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుల సమక్షంలోనే ఈ గొడవ జరగడంతో అప్పుడు కేవలం ‘కంది’కి మాత్రమే క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ నుంచి షోకాజు నోటీసు జారీ అయ్యింది. దీనికి ఆయన స్పందిస్తూ సమాధానం కూడా ఇచ్చారు. అప్పుడు రాష్ట్రంలో కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశంపై తీవ్ర చర్చ సాగడం, రాష్ట్ర రాజకీయాలన్నీ అటువైపే దృష్టి సారించడంతో ఈ గొడవను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. తాజాగా ఈ అంశంలో మళ్లీ కందితో పాటు సంజీవ్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతనెల 17న ఉట్నూర్లో జరిగిన పీఏసీ సమావేశంలో పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం విదితమే. పీఏసీ సభ్యులు కాని వారిని సమావేశానికి ఎవరు పిలిచారని సంజీవ్రెడ్డిని ఉద్దేశించి కంది ఆ సమావేశంలో ప్రశ్నించారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇన్చార్జి మంత్రి జూపల్లి ఆదేశాలతో సంజీవ్రెడ్డి ఆ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత సమావేశం జరిగింది. తాజాగా సంజీవ్రెడ్డికి కూడా.. ఈ గొడవకు సంబంధించి అప్పుడు కందితో పాటు ఆయన అనుచరులకు మాత్రమే పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం, ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి తొలగింపు చర్యలు సంచలనం కలిగించాయి. ఇక ఆదిలాబాద్ అంశంలో నామమాత్రంగా వ్యవహారం ఉంటుందా అని అనుకునే లోపే తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పది రోజుల్లో ఇద్దరూ సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.గ్రూపు తగాదాలు..ఉట్నూర్ పీఏసీ సమావేశం తర్వాత బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ ఏకంగా డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్పైనే అధిష్టానానికి ఫిర్యాదు చేయడం గ్రూపు తగాదా లను స్పష్టం చేసింది. ఏకంగా 40 వాహనాల్లో అనుచరులతో కలిసి హైదరాబాద్ వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడిని కలిసి డీసీసీ అధ్యక్షుడిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్, అటు బోథ్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో అయోమయం వ్యక్తమైంది. తాజాగా పార్టీ మళ్లీ ఈ అంశంలో నోటీసు జారీ చేయడంతో ఆయా నేతల అనుచరులు మళ్లీ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటుండడం గమనార్హం. -
● అక్షరక్రమంలో ముందున్నా చదువులో మాత్రం వెనుకంజ ● ఫలితమివ్వని పలు కార్యక్రమాలు ● నేడు అక్షరాస్యత దినోత్సవం
ఆదిలాబాద్టౌన్: అక్షరాస్యతే అభివృద్ధికి తొలిమె ట్టు.. చదువుతో సమాజంలో చైతన్యం వస్తుంది.. ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది.. అక్షరక్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లా అక్షరాస్యతలో మా త్రం ఇంకా వెనుకబడే ఉంది. సర్కారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం కానరావడం లేదు. జిల్లాను అక్షరాస్యతలో ముందుంచేందుకు ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపడుతుంది. గతేడాది నుంచి జిల్లాలో అమలు చేస్తుంది. మరో నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. అప్పటి వరకై నా లక్ష్యం నెరవేరుతుందా అనే చర్చ సాగుతోంది. గ్రామాలు, పట్టణాల్లోని మహిళా సంఘాల సభ్యులతో ఆయా కాలనీలు, వార్డుల్లో నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరాలు నేర్పిస్తున్నారు. అ యితే కొంత మంది మాత్రమే ముందుకొచ్చి అక్షరా లు దిద్దిస్తున్నారు. ఇటీవల ఎన్ఐవోఎస్ పరీక్ష నిర్వహించగా 12,532 మంది హాజరైనట్లు అధికా రులు చెబుతున్నారు. ఇందులో 8,536 మంది ఉత్తీ ర్ణులయ్యారు. మరోసారి ఈనెల 20న పరీక్ష నిర్వహించేందుకు వయోజనవిద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. 1,27,491మంది నిరక్షరాస్యులు.. జిల్లాలో నిరక్షరాస్యులు లక్ష 27వేల 491 మంది ఉన్నట్లు వయోజన విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో పురుషులు 34,635 మంది ఉండగా, మహిళలు 82,827 మంది, ఇతరులు 29 మంది ఉన్నారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా.. జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ కార్యక్రమం చేపడుతున్నారు. గతేడాది అక్టోబర్ 27న కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి విడత జిల్లాలో 55 శాతం నిరక్షరా స్యులు 26,341 మందిని అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. 14,186 మందిని ఎన్ఐఓఎస్ పరీక్ష రాయించేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 12,532 మంది పరీక్ష రాయగా, ఇందులో 8,536 మంది ఉత్తీర్ణులైనట్లు వయోజన విద్యాశాఖ అధికారులు తెలిపారు. -
గంజాయి కేసులో యువకుడి అరెస్టు
బెల్లంపల్లి: గంజాయి కేసులో యువకుడిని అరెస్టు చేసినట్లు వన్టౌన్ ఎస్హెచ్వో కె.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై రామకృష్ణ ఆదివారం జాతీయ రహదా రి పక్కన వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్ పై వస్తున్న ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సల్గుపల్లికి చెందిన గోమాస ప్రకాష్ వద్ద 200 గ్రాముల గంజాయి లభించింది. మహా రాష్ట్రలోని బల్లార్షాలో తక్కువ ధరకు కొనుగో లు చేసి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి బైక్, గంజాయి, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్టౌన్: ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన ఆరు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిరి శ్రీకాంత్, జలందర్రెడ్డి, సంఘ బాధ్యులు లచ్చారెడ్డి, దేవన్న, భీంరావు, అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు. -
కాసిపేట–2 గనిలో పేలుడు
కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిలో సోమవారం రెండో షిప్ట్లో మిస్ఫైర్ జరిగి నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... గనిలోని నార్త్ డిస్ట్రిక్ 22 లెవల్ 18 ఎక్స్ డీప్లో విధులు నిర్వహిస్తుండగా మ్యాన్హోల్ చేసే క్రమంలో డిటోనేటర్ పేలి సపోర్ట్మెన్్ కార్మికులు క్రాంతికుమార్, పుప్పాల శ్రీనివాస్, కోల్ కట్టర్ కార్మికులు రమేశ్, రాజ్కుమార్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ముందుగా మందమర్రి డిస్పెన్సరీకి అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో అమర్చిన డిటోనేటర్ 1 పేలకుండా ఉండటంతో కార్మికులు దగ్గరకు వెళ్లి పరిశీలిస్తున్న క్రమంలో పేలినట్లు తెలిసింది.చికిత్స పొందుతున్న క్రాంతికుమార్చికిత్స పొందుతున్న రమేశ్ -
‘మూగ’వేదన!
కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం తప్పదుఆదిలాబాద్ పట్టణం బొక్కల్గూడకు చెందిన నయిముల్లాఖాన్ పుట్టుమూగ, చెవిటి. దివాంగుడైనా ప్రభుత్వపరంగా అందే ఆసరా పింఛన్ 2015లో నిలిచిపోయింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అనే కారణంతో అధికారులు పింఛన్ను నిలిపివేశారు. అప్పటి నుంచి పునరుద్ధరించాలని కోరుతూ బాధితుడు అధికారులకు విన్నవిస్తూనే ఉన్నాడు. తోటి దివ్యాంగుడి బాధను గుర్తించిన మిగతా మూగ, చెవిటి దివ్యాంగులు ఆయనకు అండగా నిలిచారు. మిత్రుడి ఆవేదనను సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ సైగలు, పేపర్పై రాసి కలెక్టర్ రాజర్షిషాకు సోమవారం వివరించాడు. భార్య, ఇద్దరు పిల్లలు కలిగిన బాధితుడి పింఛన్ను పునరుద్ధరించాలని విన్నవించాడు. – కై లాస్నగర్మిత్రుడికి అండగా తరలివచ్చిన సహచర దివ్యాంగులు (దరఖాస్తు పత్రం పట్టుకున్న వ్యక్తి నయిముల్లాఖాన్ )పోలీసు వ్యవస్థ బాధితుల పక్షాన ఉండాలి ఆదిలాబాద్టౌన్: బాధితుల పక్షాన పోలీసు వ్యవస్థ ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులకు సూచించారు. పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు జిల్లా నలుమూలల నుంచి 33 మంది తరలివచ్చి తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఫోన్ ద్వారా సంబంధిత అధి కారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత తదితరులు పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా విధులు చేపట్టాలి పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అన్నారు. కోర్టులో నేరస్తులకు శిక్ష పడేలా సమర్థవంతంగా కృషి చేసిన కోర్టు డ్యూటీ అధికారులు రాహుల్, కె.స్వామిని పోలీసు కార్యాలయంలో అభినందించారు. ప్రశంసా పత్రాలతో పాటు రివార్డులను అందజేశారు. ఆదిలాబాద్టౌన్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీతో పాటు సీఎం రేవంత్రెడ్డికి ప్రజలే తగిన గుణ పాఠం చెబుతారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీ సుల వ్యవహారాన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. పట్టణంలో ని దస్నాపూర్ బ్రిడ్జివద్ద రాస్తారోకో చేపట్టారు. ప్ర భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రి క్తత నెలకొంది. రాకపోకలునిలిచిపోయాయి. అనంతరం పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. శాంతి యుతంగా నల్ల దుస్తులు ధరించి నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మెట్టు ప్రహ్లాద్, జగదీష్, రమేష్, రాజన్న, అజయ్, సతీశ్, ధమ్మపాల్, శివ, అనిల్, గణేశ్, భోజన్న, రమణ, వెంకన్న, అఖి లేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
బౌన్సర్లు కేరాఫ్ జైపూర్
జైపూర్: బౌన్సర్ అంటే కేవలం కండలు తిరిగిన శరీ రం కాదు.. క్రమశిక్షణ, అప్రమత్తత, బాధ్యతకు ప్రతిరూపం. షాపింగ్ మాల్స్ నుంచి ఫంక్షన్ హాళ్ల వరకు.. ప్రముఖుల కార్యక్రమాల నుంచి భారీ ఈవెంట్ల వరకు ఎక్కడ జన సందోహం ఉంటే అక్కడ వీరి విధులు కనిపిస్తాయి. అలాంటి బౌన్సర్లను తీర్చిదిద్దుతూ గ్రామీణ యువతకు ఉపాధి బాట చూపుతోంది జైపూర్ మండలం రసూల్పల్లిలోని ఒలంపియా జిమ్. వ్యాయామంతో శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు..అదే ఫిటెనెస్ను ఉపాధిగా మలుచుకుంటున్న యువతకు ఈజిమ్ అడ్డాగా మారుతోంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది యువకులు నేడు పట్టణ ప్రాంతాల్లో బౌన్సర్లుగా విధులు నిర్వహిస్తూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగం చేస్తూనే..ఒలంపియా జిమ్లో శిక్షణ పొందుతున్న వారంతా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేస్తూనే బౌన్సర్గా విధులు నిర్వహిస్తున్నారు. తమకు లభించే ఖాళీ సమయాన్ని జిమ్లో వ్యాయామానికి కేటాయిస్తూ ఫిట్నెస్ను కొనసాగిస్తున్నారు. యువతలో శారీరకధారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. వ్యసనాలకు దూరంగా.. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలన్నదే లక్ష్యం. జిమ్ ద్వారా క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభ, శారీరక సామర్థ్యం పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన మార్గదర్శకత్వం లేక అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. నిరుపేద యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తాం. – ప్రవీణ్, ఒలంపియా జిమ్ నిర్వాహకుడు 15 ఏళ్ల క్రితం మొదలై..రసూల్పల్లికి చెందిన కుమ్మరి ప్రవీణ్ 15 ఏళ్ల క్రితం ఒలంపియా జిమ్ను ఏర్పాటు చేశాడు. మొదట చిన్నస్థాయిలో ప్రారంభమైన ఆయన ప్రయత్నం క్రమంగా విస్తరించి ప్రస్తుతం మంచిర్యాల పట్టణంలో రెండు, చెన్నూర్లో రెండు, రసూల్పల్లిలో ఒకటి మొత్తంగా ఐదు బ్రాంచ్ల వరకు చేరింది. జిమ్లో వ్యాయామంతో పాటు శారీరకధారుఢ్యం, క్రమశిక్షణ, ఫిట్నెస్పై యువతకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం సుమారు 40 మంది యువకులు, 10 మంది యువతులు ఇక్కడ శిక్షణ పొందుతూ హైదరాబాద్, సూర్యాపేట, సిద్దపేట, వరంగల్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, బెంగళూర్ వంటి పట్టణాల్లో సేవలందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే కార్యక్రమాల్లో రద్దీని నియంత్రించడం, ప్రవేశ మార్గాలను క్రమబద్ధీకరించడం, ప్రముఖులు, నిర్వాహకులకు భద్రత కల్పించడం వంటి బాధ్యతలు చేపడుతున్నారు. షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ ఈవెంట్లలో అవసరాన్ని బట్టి భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. -
పత్తి పంటను ఆశిస్తున్న ‘పిండినల్లి’
చెన్నూర్రూరల్: పత్తి పంటను ఆశించి రసం పీల్చే వాటిలో పిండినల్లి పురుగులు ప్రధానమైనవి. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఈ పురుగులు పత్తి పంటను ఆశిస్తాయి. ఇవి చిన్నవిగా, మెత్తగా, లేత గులాబీరంగులో ఉంటాయి. కొమ్మలు, కాండం, మొగ్గలు, కాయల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఫలితంగా మొక్కల్లో సాధారణంగా జరిగే ఆవశ్యక మూలకాలు, పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడి గిడసబారి పోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క గుబురుగా చిన్నదిగా కనిపిస్తుంది. దీని నివారణకు చర్యలు చేపట్టాలని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ సూచించారు. నివారణచర్యలుపురుగు ఆశించిన మొక్కలను పీకి కాల్చి వేయాలి. ఇలా చేయడం ద్వారా దాని విస్తరణను అదుపులో ఉంచవచ్చు. పొలం గట్లపైన ఉండే కలుపు మొక్కలు మఖ్యంగా వయ్యారిభామ, తుత్తురబెండ, గడ్డిచామంతి, వంటి కలుపు మొక్కలను పీకి కాల్చి వేయాలి. జైగోగ్రామ బైకోలరేట్ మిత్ర పురుగులను హెక్టారుకు 500 నుంచి 1000 వరకు విడుదల చేయాలి. తద్వారా వయ్యారిభామ, కలుపు మొక్కలను నివారించవచ్చు. దీని ద్వారా పిండినల్లి ఉధృతి తగ్గించవచ్చు. పత్తి ఏరిన తర్వాత ఎండు కర్రలను పీకి కాల్చి వేయాలి. వేసవి దుక్కుల ద్వారా నేలలో దాగి ఉండే పిల్ల పురుగులను నియంత్రించవచ్చు. అంతర పంటగా అలసంద, బబ్బెర, సోయాబీన్, మినుము వంటి పంటలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగుల సంఖ్యను వృద్ధి చేయవచ్చు. కంచె పంటగా లేదా రక్షక పంటగా రెండు వరుసల సజ్జ లేదా కందులను దట్టంగా పెంచాలి. దీని ద్వారా ప్రధాన పంట అయిన పత్తిలో పిండినల్లి ఉధృతి తగ్గించుకోవచ్చు. మొక్కలను పురుగు ఆశిస్తే లీటరు నీటిలో 10 మిల్లీలీటర్ల వేపనూనెతో పాటు ఒక గ్రాము సబ్బు పొడిని కలిపి 10 నుంచి 12 రోజుల తేడాతో మొక్కలపై పిచికారీ చేయాలి. దీంతో చీడ, పీడలు తగ్గుతాయి, తద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు. ఏవిధంగా ఆశిస్తుందిపిండినల్లి పురుగులు ముఖ్యంగా పొలంగట్లపై, పనికి రాని భూముల్లో పెరిగే కలుపు మొక్కల ద్వారా వ్యాపిస్తాయి. బెండ, టమాటా, వంగ, క్యాబేజీ, బొప్పాయి, నిమ్మ, జామ, మందార, గోగు, చామంతి, గడ్డి చామంతి, రామబాణం, వయ్యారిభామ, తుత్తర బెండ, సీతాఫలం, సుబాబుల్, గ్లైరిసిడియా వంటివి పిండినల్లికి అతిథి మొక్కలు. పురుగుపై తెల్లని మైనపు పొర ఉండటం చేత, అది పురుగు మందుల ప్రభావం నుంచి ఇతర సహజ మరణం నుంచి రక్షణ పొందుతుంది. ఈ పురుగు సాధారణంగా సంవత్సర కాలంలో 15 తరాలకు అభివృద్ధి చెందగలదు. అలాగే ఆడ పురుగు పెట్టే ఒక గుడ్ల సంచిలో దాదాపు 600 వరకు గుడ్లు ఉంటాయి. పంట పొలంలో సహజంగా పెరిగే మిత్ర పురుగులు అంతరించి పోవడం వలన పురుగు విసర్జించే తేనె వంటి ద్రవం కొరకు వచ్చే చీమల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు పిండినల్లి వ్యాపిస్తుంది. అంతే కాకుండా పురుగు సహజంగా పంట ఉత్పత్తుల ద్వారా, పత్తి కర్రల ద్వారా గాలి, నీటి కాలువలు, వర్షం, పక్షులు, పశువుల ద్వారా వ్యాపిస్తుంది. మనుషులు ఈ పురుగులు ఆశించిన ప్రాంతం నుంచి ఆశించని ప్రాంతానికి తిరగడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. -
సొంత బడిలో పేపర్లు దిద్దొద్దు
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల మూల్యాంకన విధానంలో కీలకమార్పు చోటు చేసుకోనుంది. ఇకపై జవాబు పత్రాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కాకుండా ఇతర స్కూళ్ల టీచర్లతో క్రాస్ వాల్యుయేషన్ చేయించనున్నారు. విద్యా ప్రమాణాలు మరింత ఖచ్చితంగా అంచనా వేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు విద్యార్థుల ప్రతిభను నిష్పక్షపాతంగా అంచనా వేయడమే లక్ష్యంగా ఈ విధానం అమలు చేయనున్నారు. పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యం ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతుల విద్యార్థుల ఎస్ఏ–1, ఎస్ఏ–2 పరీక్షల జవాబు పత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించనున్నారు. ఈ క్రాస్ వా ల్యుయేషన్ విధానం ద్వారా పక్షపాతం లేకుండా మరింత పారదర్శకత తీసుకురావచ్చని విద్యాశాఖ భావిస్తోంది. విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి అవసరమైన చోట అదనపు బోధన, రెమేడియల్ కార్యక్రమాలు చేపట్టేందుకు దోహదపడనుంది. మండల కేంద్రాల్లోనే.. ప్రతి మండల కేంద్రంలో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఎంఈవో పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. తద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మరింత నిష్పక్షపాతంగా అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆన్లైన్లో మార్కులు నమోదు.. మూల్యాంకనం పూర్తయిన తర్వాత విద్యార్థుల మార్కులను తరగతి, సబ్జెక్టుల వారీగా నమోదు చేసి ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. రికార్డుల్లో ఏవైనా తేడాలు ఉంటే వాటిని సరిచేయనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. మండలాల వారీగా మూల్యాంకన ప్రక్రియను డీఈవో పరిశీలించనున్నారు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేల్లో సర్కారు బడుల్లో చదివే 50 శాతం మంది విద్యార్థులకు చదవడం, రాయడం రావడం లేదనే కారణంతోనే ఈ విధానం చేపట్టినట్లు తెలుస్తోంది. డీఈవో పరిధిలో మొత్తం పాఠశాలలు 678 ప్రాథమిక 467 ప్రాథమికోన్నత 105 ఉన్నత 106 విద్యార్థులు 58వేలు -
గడువులోపు పూర్తి చేయాలి
ఇంద్రవెల్లి: ఎస్ఐఆర్ ప్రక్రియ గడువులోపు పూర్తి చేయాలని ఉట్నూర్ సబ్కలెక్టర్ ప్రణ య్కుమార్ అన్నారు. ఇంద్రవెల్లి, శంకర్గూడ గ్రామాలను ఆదివారం సందర్శించారు. సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్ల నుంచి డాక్యుమెంట్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలతో మాట్లాడి ఇప్పటి వరకు చేపట్టిన సర్వే, నోటీసుల జారీ, డాక్యుమెంట్ల స్వీకరణ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా వ్యహరించాలని, ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ వారి నుంచి డాక్యుమెంట్లను నిబంధనల ప్రకారం స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్కుమార్, సర్పంచ్ జాదవ్ రోమ, వార్డు సభ్యులు జాదవ్ విజయ్కుమార్, బీఎల్వోలు ఉన్నారు. -
ముగిసిన ‘సర్’ ప్రత్యేక శిబిరాలు
కై లాస్నగర్: సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల సౌకర్యార్థం శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక శిబి రాలు ముగిశాయి. జిల్లాలోని 600 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు అందుబాటులో ఉండి ఓటర్ల ము సాయిదా జాబితాలను ప్రదర్శించారు. కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన దరఖాస్తులతో పాటు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించారు. ఆదిలా బాద్లోని డైట్ కళాశాల, మావలలోని ఉన్నత పాఠశాల పో లింగ్ కేంద్రాల్లో సవరణ ప్రక్రియను కలెక్టర్ రాజర్షి షా ఆదివారం పరిశీలించారు. ఓటర్లు అందించిన దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. యాప్ లో నమోదుపై ఆరా తీశారు. సర్ ప్రక్రియను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని బీఎల్వోలను ఆదేశించారు. ఓటర్ల వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్రావు, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
సింగరేణిని దోచుకుంటున్నారు
మందమర్రిరూరల్: రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొ ప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలో ఆదివా రం నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్నివర్గా ల ప్రజలకు న్యాయం చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో అనేక హక్కులు కాలరా స్తోందన్నారు. మరో రెండేళ్ల తర్వాత కేసీఆర్ ప్ర భుత్వం వస్తుందన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటీయూసీ గెలుపునకు టీబీజీకేఎస్ భిక్ష అని అన్నారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు కార్మికులకు అనేక హక్కులు సాధించా మని తెలిపారు. ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘంగా విఫలమైందని, ఆ నాయకులను ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారన్నారు. మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపెల్లి సంపత్, క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ గొడిసెల సంధ్యారాణి, టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
వసతికి చిక్కులు
స్థానిక ఐజా కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న మధుకర్ మూడు నెలల క్రితం ఎస్సీ హాస్టల్లో ప్రవేశం పొందాడు. అయితే స్కాలర్షిప్ ఆన్లైన్ నమోదు ప్రక్రియలో పేరు ఉంటేనే వసతిగృహంలో లెక్కించబడుతుంది. ఆన్లైన్ పోర్టల్లో కాలేజీ పేరు కనిపించకపోవడం, సాంకేతిక లోపాల వల్ల కాలేజీ ఐడీ, హాస్టల్ స్కాలర్షిప్ డేటా అప్డేట్కు ఆటంకంగా మారింది. మూడు నెలలు గడిచిపోవడంతో వార్డెన్లు హాస్టల్కు సంబంధించిన బిల్లులు సమర్పించాల్సి వస్తోంది. కానీ ఆన్లైన్ ప్రవేశం లేని విద్యార్థుల విషయంలో ఏంచేయాలో పాలుపోక వార్డెన్లు గందరగోళంలో పడ్డారు. ఆన్లైన్లో కళాశాలల పేరు లేకపోవడం.. ఆధార్లో తప్పుల కారణంగా జిల్లాలో 65 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంచిర్యాలఅర్బన్: ఎస్సీ వసతి గృహాల్లో ఇంటర్ ప్రవేశాలకు ఆధార్ కార్డులోని తప్పులు ఆటంకంగా మారాయి. పదో తరగతి ఒరిజినల్ మెమోలు రాకపోవడం, ఆధార్లో పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీలు తప్పుగా ఉండడంతో తెలంగాణ ఈ–పాస్ వెబ్సైట్లో స్కాలర్షిప్, హాస్టల్ ప్రవేశాలకు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇంటర్, వృత్తి విద్య కోర్సులు చదివే గ్రామీణ ప్రాంత ఎస్సీ విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, లక్సెట్టిపేటలో రెండేసి హాస్టళ్లలో 100 నుంచి 150 మందికి మాత్రమే ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది. మీసేవ కేంద్రాల ద్వారా ఆధార్ సవరణలు జరగటానికి ఆలస్యం అవుతుండటంతో ఆన్లైన్ దరఖాస్తులు ముందుకు సాగడం లేదు. నమోదు ప్రక్రియ ఆలస్యమై హాస్టల్ సీట్లు నిండిపోతే చదువుకు దూరమవుతామోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో నమోదు చేసే వార్డెన్లకు ఆధార్కార్డుతో సరిపోలకపోవటంతో (మిస్మాచ్డ్) వెబ్సైట్లో కనిపించడంతో సమస్య పరిష్కారం తలకు మించిన భారంగా మారింది. బీసీ, ఎస్టీ తరహాలో ఎస్సీ ప్రవేశాలు కల్పిస్తే..పోర్టల్లో వివరాలను వెంటనే అప్డేట్ చేసి, కళాశాలల పేర్లు కనిపించేలా సంబంధిత అధికారులతోపాటు ఆయా కళాశాలల యాజమాన్యాలు చొరవ చూపాల్సి ఉంది. పోర్టల్లో సమస్య పరిష్కారమయ్యే వరకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక అనుమతి ఇస్తే విద్యార్థులకు తాత్కాలిక ఇబ్బందులు తొలగుతాయి. స్కాలర్షిప్తో నిమిత్తం లేకుండా బీసీ, ఎస్టీ హాస్టళ్లలో ప్రవేశాలు కల్పించినట్లే ఎస్సీ వసతి గృహల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. పోర్టల్లో కళాశాలల నాట్ఫౌండ్ విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఈ– పాస్ ఆన్లైన్ పోర్టల్లో కళాశాలల పేర్లు కని పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కళాశాలల వివరాలు (మాస్టర్ డేటా) సిస్టమ్లో అప్డేట్ కాకపోవడంతో పోర్టల్లో నాట్ఫౌండ్ అని వస్తుండటంతో విద్యార్థులు అధికారుల చుట్టూ తిరగా ల్సి వస్తోంది. ఏటా ప్రభుత్వం మాస్టర్ డేటా ను అప్డేట్ చేస్తోంది. కొన్ని కళాశాలల యా జమాన్యాలు రెన్యూవల్ సమాచారం, అనుబంధ ఆఫిలియేషన్ పత్రాలను సమయానికి సమర్పించకపోవడం, సాంకేతిక కారణమో తెలియదుగానీ ఆలస్యమవుతోంది. స్కాలర్షిప్ దరఖాస్తులతోనే కళాశాలల, హాస్టల్ ప్రవేశాలు ముడిపడి ఉండటంతో విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. హాస్టల్ బిల్లుల సమర్పణకు సంబంధించి వార్డెన్లపై ఒత్తిడి పెరుగుతోంది. మూడు నెలల వసతి సౌకర్యం కల్పించిన వార్డెన్లు ఆన్లైన్లో పేరు లేకపోవడం వల్ల వెళ్లిపొమ్మనే పరిస్థితులుండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రత్యేక రైలును కొనసాగించాలి
కాగజ్నగర్టౌన్: ఇటీవల శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడిపిన ప్రత్యేక రైలు (07235/36)ను పండుగల సీజన్ వరకు కొనసాగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు కాకుండా 11.20 గంటలకు బయల్దేరితే సిర్పూర్ కాగజ్నగర్కు సాయంత్రం 4.10 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15 గంటలకు సిర్పూర్ కాగజ్నగర్లో బయల్దేరి రాత్రి 10.25 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఒకవేళ ఈరైలు నుంచి ఆదరణ లభిస్తే క్రమబద్ధీకరించి అప్గ్రేడ్ చేసి కుమురంభీం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా నామకరణం చేయాలని ఉత్తర తెలంగాణ రైల్వేఫోరం సభ్యులు కోరుతున్నారు. ప్రస్తు తం కాజీపేట్ జంక్షన్లో 14 గంటల పాటు ఖాళీగా ఉన్న 17035/36 బల్లార్షా–కాజీపేట ఎక్స్ప్రెస్ను లింగంపల్లి వరకు పొడగించాలని, బల్లార్షా నుంచి బయల్దేరే సమయం 5.20 గంటలకు మార్పు చేసి కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. చొరవ చూపాలి ఈ రెండు రైళ్ల మంజూరు విషయంలో ఎమ్మె ల్యే పాల్వాయి హరీశ్బాబు, ఎంపీ నగేశ్ ప్రత్యేక చొరవ చూపాలి. కేంద్ర రైల్వేమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. ఎమ్మెల్యే హరీశ్బాబు గతంలో మాదిరిగా వీటిని పరిష్కరించాలి. – ఫణిరాజ్, ఉత్తర తెలంగాణ రైల్వే వినియోగదారుల ఫోరం ప్రతినిధి -
జాతీయస్థాయి పోటీల్లో ‘బాలకేంద్రం’ ప్రతిభ
ఆదిలాబాద్: హైదరాబాద్లోని తెలుగు యూని వర్సిటీలో కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ జాతీయస్థాయి నృత్య పోటీల్లో ఆదిలాబాద్ బాలకేంద్రం చిన్నారులు ప్రతిభ కనబరిచారు. సబ్జూనియర్ కూచి పూడి విభాగంలో మందోళ్ల మహాశ్విని, పడాల ధన్విక, ముమ్మడి శ్రీ ఆధ్య ద్వితీయ స్థానంలో నిలిచారు. సీనియర్ విభాగంలో వేల్పుల శ్రేష్ఠ, గన్న ఆశ్రిత, పందిరి శ్రేయాన్షి, సామ మహతి, క్షీరసాగర్ జాహ్నవి, కనిందే మహాశ్రీ, జంగలి రిధిక్ష, గడ్డం శ్రీనిధి, ఠాకూర్ హర్షిణి రెండో స్థానంలో నిలిచారు. సోలో విభాగంలో గడ్డం శ్రీనిధి ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. వీరంతా మలేషియాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికై నట్లు బాలకేంద్రం పర్యవేక్షకులు మిట్టు రవి తెలిపారు. -
రెండు అడుగుల దూరం నుంచి చూశా
15 రోజుల క్రితం గ్రామ శివారులోని చేను వద్దకు కూలీ పనులకు వెళ్లాం. సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో పొదలో పులి నక్కి ఉండటాన్ని రెండడగుల దూరం నుంచే చూశాను. పులి అని కేక వేసి స్పృహ తప్పి పడిపోయాను. గ్రామంలో మహిళలు కొద్ది రోజులుగా అటు వైపు పనులకు వెళ్లడం లేదు. – గోల్లి లక్ష్మి, కూలీ, అర్లి(టి) ప్రజలను అప్రమత్తం చేస్తున్నాంపులి సంచారం గుర్తించిన వెంటనే సిబ్బంది ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులి ఇటు వైపు తరచూ వస్తోంది. టైగర్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మానిటరింగ్ చేస్తున్నాం. – రాథోడ్ అవినాష్, ఎఫ్ఆర్వో -
పుష్కరాల నాటికి బాసర ముస్తాబు
భైంసా/బాసర: తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా వచ్చే ఏడాది జూన్ 27 నుంచి నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏడాది ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా బాసరలో శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధికి రూ.354 కోట్లు, పుష్కర ఘాట్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, అభివృద్ధి పనులకు రూ.20 కోట్లతో చేపట్టనున్న పనులకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరి నదీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. బాసరను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు భవిష్యత్తులో పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. భక్తులకు మెరుగైన వసతులు పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఘాట్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూంలు, మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన పుష్కర ప్రాంతాల్లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లు, అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, వైద్య, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,000 కోట్లతో పనులు గోదావరి పుష్కరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1,000 కోట్లతో వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల పనులు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. బాసరతోపాటు గోదావరి నదీ తీర జిల్లాల్లోని 12 ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రజాభవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యత, పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బాసర పుష్కర ఘాట్ల అభివృద్ధి, ఆలయ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మ్యాపులు, ప్రతిపాదనలు, పనుల పురోగతిని మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
2009.23 ఎకరాల భూసేకరణ..
కై లాస్నగర్: ఆదిలాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టు భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. ఓ వైపు భూసేకరణ సర్వే ప్రక్రియ కొనసాగుతుండగా, మరోవైపు సేకరించనున్న భూములకు అధికారులు ప్రాథమిక నోటిఫికేన్లను జారీ చేస్తున్నారు. ఇప్పటికే మూడు గ్రామాలకు సంబంధించి జారీ కాగా నిషాన్ఘాట్లోని భూములకు సంబంధించి ఆదివారం విడుదల చేశారు. అత్యధికంగా సేకరించనున్న అనుకుంట భూములకు నేడో, రేపో జారీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. సర్వే పూర్తై, నోటిఫికేషన్ కాల పరిమితికి చేరువైన గ్రామాల్లోని భూములపై ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రామసభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలను సైతం ఖరారు చేశారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేంతవరకు ఇదే స్పీడ్ కొనసాగితే త్వరలోనే ఎయిర్పోర్టు భూమిపూజ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రక్రియ వేగవంతం.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఎయిర్పోర్టుకు అసవరమైన భూమి గుర్తించేందుకు రెవెన్యూ, సర్వేయర్లతో కూడిన ఆరు ప్రత్యేక బృందాలను యంత్రాంగం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ బృందాలు సర్వే ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నాయి. తుది దశకు చేరినట్లుగా తెలుస్తోంది. కాగా ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోకి వచ్చే కచ్కంటి గ్రామంలో 29.19 ఎకరాలు, టాక్లిలో 5.20 ఎకరాలు, అర్లి–బి మండల పరిధిలో 160.30 ఎకరాల భూమిని సేకరించేందుకోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే అత్యధికంగా పట్టణా నికి అనుకుని ఉన్న అనుకుంటలో 800 ఎకరాల భూమిని సేకరించేందుకు సోమ, మంగళవారాల్లో ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి అధికారులు నిర్ణయించారు. ఇక పట్టణ పరిధిలోని నిషాన్ఘాట్లో 428.16 ఎకరాల భూమికి అధికారులు ఆదివా రం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులోని రైతుల భూవిస్తీర్ణం, ఖాతాదారు పేరు వంటి వివరాల్లో ఏ మైనా తేడాలుంటే భూసేకరణ అధికారి, కలెక్టర్ కార్యాలయంలో అభ్యంతరాలు అందజేయాలని క లెక్టర్ రాజర్షి షా సూచించారు. కాగా నిర్వాసితులకు నోటీసులు అందిన తర్వాత వారం రోజుల్లో ఇక్కడ కూడా గ్రామ సభ నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలనే ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ప్రక్రియను చేపడుతున్నట్లగా కలెక్టర్ వివరించారు.9,11 తేదీల్లో గ్రామసభలు భూసేకరణకు గాను ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన గ్రామాల్లో నిర్వాసిత రైతుల అభ్యంతరాలు, విజ్ఞప్తులను తెలుసుకునేందుకు గాను తొలుత ఈనెల 9న అర్లి–బి, 11న కచ్కంటిలో గ్రామసభలు నిర్వస్తున్నాం. నిర్వాసితులు తెలిపే అభ్యంతరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. సర్వే పూర్తయిన కొద్ది నోటిఫికేన్లను జారీ చేసి అన్ని గ్రామాల్లో సభలను నిర్వహిస్తాం. ఏ గ్రామంలో ఎంత నష్టపరిహారం ఇవ్వాలనేది ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలకనుగుణంగా ఉన్నతాఽధికారులు నిర్ణయిస్తారు. – పి.జగదీశ్వర్రావు, ఆర్డీవో రక్షణాశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఎరోడ్రమ్లోని 369.49 ఎకరాలకు అనుబంధంగా మరో 2009.23 ఎకరాలతో కలిపి రక్షణ, పౌర విమానాయాన శాఖల ఆధ్వర్యంలో జాయింట్ యూజర్ ఫీల్డ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రం ఆదేశాలకనుగుణంగా పౌర విమానయాన శాఖకు 400, ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు 1609.23 ఎకరాల చొప్పున సేకరించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. ఈమేరకు రూ.1500 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. జిల్లాలో ఎయిర్పోర్టు భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగా సీఎం రేవంత్రెడ్డి ఇటీవల కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ఢిల్లీలో కలిసి కార్గో, ప్యాసింజర్, టెర్మినల్ వసతుల ఏర్పాటుకు సహకరించాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే నిర్వాసితులకు ఎంత పరిహారం చెల్లించాలనే దానిపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందనట్లుగా అధికారులు చెబుతున్నారు. -
టైగర్.. టెన్షన్!
తాంసి: జిల్లాలో పులుల సంచారం పెరిగింది. ఇ టీవల వరుసగా ఎక్కడో ఓ చోట బెబ్బులి తారసపడుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. తిప్పేశ్వర్ పులుల అభయారణ్యం నుంచి పెన్గంగ దాటి వచ్చిన పులులు నెలల తరబడి జిల్లాలోనే తిష్ట వేస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల శివారులో సంచరిస్తూ పశువులపై పంజా విసురుతున్నాయి. ఈక్రమంలో పశువులకాపరులు, చేలకు వెళ్లేందుకు రైతులు,కూలీలు జంకుతున్నారు. సరిహద్దు మండలాల్లోనే.. తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులులు జిల్లాలోని భీంపూర్, తాంసి, తలమడుగు, బజార్హత్నూర్తో పాటు బోథ్ మండలాల్లోనే ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ మండలాల్లో అటవీప్రాంతం ఎక్కువగా ఉండటంతో మాకాం వేస్తున్నట్లు తెలుస్తోంది. తరచూ సమీప గ్రామాల పంటచేలకు వస్తూ పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి. అటవీశాఖ అప్రమత్తం.. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో వరుసగా పులులు సంచరిస్తుడటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమవుతున్నారు. విషయం తెలియగానే బేస్క్యాంప్లు ఏర్పాటు చేస్తూ పులి కదలికలు, జాడ కోసం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వేటగాళ్ల ద్వారా టైగర్కు ఎలాంటి అపాయం కలగకుండా ప్రత్యేక ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు సైతం అవగాహన కల్పిస్తున్నారు. చేలకు గుంపులుగా వెళ్లాలని, అటవీ జంతువులు, పులి కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు. -
వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య
ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో వేర్వేరు కారణాలతో నలుగురు బలవన్మరణం చెందారు. అనారోగ్యం, ఒంటరితనం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అనారోగ్యంతో వివాహిత..తాంసి: అనారోగ్యంతో బాధపడుతున్న వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన ఇప్ప అనుసూయ(46) వివాహిత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈక్రమంలో జీవితంపై విరక్తితో ఆదివారం ఉదయం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. భర్త లస్మన్న ఫిర్యాదు మేరకు ఎస్సై పీర్సింగ్ నాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ ఒకరు..భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన ఎండీ.సమ్రీన్ (24) చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై పీర్సింగ్నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..సమ్రీన్కు గతేడాది బాబు జన్మించాడు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది. శనివారం ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రిమ్స్లో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతదేహన్ని ఎస్సై పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి షేక్ సయ్యద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీర్సింగ్నాయక్ తెలిపారు. ఉరేసుకుని వ్యవసాయ కూలీ..తాంసి: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వ్యవసాయ కూలీ పంటచేనులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాంసి మండల కేంద్రంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాంసికి చెందిన బెల్లపు అనిల్(40) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా వెన్నుపూస, నరాల నొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రికి వెళ్లి చూపించుకున్నా నొప్పి తగ్గలేదు. శనివారం రాత్రి గ్రామ సమీపంలోని పంటచేల్లో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆదివారం ఉందయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జీవన్రెడ్డి ఘటనస్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. భార్య రమ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారుడితోపాటు దివ్యాంగురాలైన కూతురు ఉంది. భవనం పైనుంచి దూకి యువకుడు..కోటపల్లి: అనారోగ్య సమస్యలతో ఒంటరిగా ఉంటున్న యువకుడు మనస్తాపంతో భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. కోటపల్లి మండలంలోని నాగంపేటకు చెందిన దుర్గం మల్లయ్య, సుగుణ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు స్వామిరాం(26) డిగ్రీ పూర్తి చేశాడు. 2025లో ఎన్ఐటీ నాగ్పూర్లో సీటు రాగా, అనారోగ్య సమస్యలతో జాయిన్ కాలేదు. ఇంటి వద్దే ఉండి కుటుంబసభ్యులకు ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఆదిలాబాద్లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రవేశం పొందాడు. నాలుగు నెలలుగా కోచింగ్ తీసుకుంటున్నాడు. ఒక వైపు అనారోగ్య సమస్యలు, ఒంటరితనం భరించలేక ఆదివారం ఆదిలాబాద్లోని ఎస్సీ స్టడీ సర్కిల్ భవనం మూడోఅంతస్తు నుంచి దూకాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, తండ్రి మల్లయ్య కోటపల్లి రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. కుమారుడు ఉద్యోగం సాధించి తమతో ఉంటాడని అనుకున్న తరుణంలో ఇలా జరగడంతో తండ్రి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. స్వామిరాం మృతితో నాగంపేటలో విషాదచాయలు అలుముకున్నాయి. -
ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి
● ఆదిలాబాద్ డిప్యూటీ ఆర్ఎం మల్లేశయ్యమంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ ప్రయాణికులకు మరింతగా మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ ఆదిలాబాద్ డిప్యూటీ ఆర్ఎం (ఆపరేష న్స్) మల్లేశయ్య సూచించారు. ఆదివారం మంచిర్యాల డిపో, బస్స్టేషన్, సిబ్బంది క్వార్టర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిపో సౌకర్యాలు, ప్రయాణికులకు అందుతున్న సేవలను ప రిశీలించి అధికారులకు పలు సూచనలు చేశా రు. ఛార్జీలు చెల్లించి ప్రయాణించే వారిని మ రింతగా ఆకర్షించి సంస్థకు రాబడి పెంపునకు దిశనిర్ధేశం చేశారు. ఆయన వెంట డిపో మేనేజర్ నరేష్కుమార్, అధికారులు ఉన్నారు. -
బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం ఎర్రవెల్లిలో నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి బోథ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ జాదవ్ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేలా సమష్టిగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ ఎల్పీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్టౌన్: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. గడిచిన వారంలో 10 సైబర్ ఫిర్యాదులు అందాయ ని పేర్కొన్నారు. బేల పరిధిలో బాధితుడికి టెలి గ్రా మ్ ద్వారా పెట్టుబడి పేరుతో పరిచయం చేసుకొని రూ.9850 ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. గుడిహత్నూర్లో ఆ న్లైన్ షాపింగ్ పేరిట ఇన్స్ట్రాగామ్లో వస్తువులు పంపుతామని నమ్మించి రూ.5,195 మోసం చే సినట్లు చెప్పారు. ఆదిలాబాద్ టూటౌన్ ప రిధిలో రమ్మిబ్లస్ట్ ఆన్లైన్గేమ్ ఆడుతూ బాధితుడు రూ.లక్ష వరకు డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిపారు. టూటౌన్ పరిధిలో క్రెడిట్కార్డుయాప్ వివరాలు, ఓటీ పీ నమోదుతో రూ.29,933 బాధితుడు పో గొట్టుకున్నట్లు పేర్కొన్నారు. తాంసి పరిధి లో బాధితుడు ఓఎల్ఎక్స్లో మొబైల్ఫోన్ ప్రకటన చూసి రూ.85 వేలు చెల్లించి మోసపోయిన ట్లు తెలిపారు. ఇచ్చోడలో డీలర్షిప్ పేరుతో రూ. 35వేలు, ఆదిలాబాద్రూరల్ స్టేషన్పరిధిలో నకిలీ లోన్యాప్ పేరుతో వేధింపులు, ఉ ట్నూర్లో పెట్టుబడి పేరిట రూ.24,500 బాధితులు మోసపోయినట్లు తెలిపారు.ఎవరైనా సైబర్ మోసా నికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని, సమీప పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. -
1/70 చట్ట పరిరక్షణకు పోరాటాలు
ఆదిలాబాద్టౌన్: ఆదివాసీల భూహక్కుల పరి రక్షణ కోసం ఉన్న 1/70 చట్టాన్ని కాపాడేందు కు తెలంగాణలోని ఆదివాసీ ప్రాంతాల్లో పోరా టాలు చేస్తామని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఆదివాసీ హక్కుల సభలో పాల్గొ ని రాష్ట్రంలోని ఆదివాసీల సమస్యలను ప్రస్తావించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్ట పరిరక్షణ, పేసా చట్టం అమలుపై ప్రభుత్వాల విధానాలు ఆదివాసీల హక్కులకు భంగం కలి గించేలా ఉన్నాయనివిమర్శించారు. ఆదివాసీల భూ ములు అన్యాక్రాంతం కాకుండా చట్టా న్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశా రు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ యువతకు ఉ ద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంబంధించిన జీవో3ను పునరుద్ధరించాలన్నారు. ఈ సభ లో జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, కొట్నాక్ సక్కు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఐ సాధనాలపై అవగాహన
నెల్లూరురూరల్: జిల్లా గ్రామీణ విలేకరులకు ఆదివారం కలెక్టరేట్లోని తిక్కన సమావేశ మందిరంలో సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఏఐ ట్రైనర్ విజయ్కుమార్ ‘కృత్రిమ మేధ’పై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వార్తా కథనాలకు అవసరమైన సమాచారం, గణాంకాలను ఏఐ ద్వారా సేకరించవచ్చన్నారు. సీనియర్ పాత్రికేయుడు, ఐజేయూ సెక్రటరీ జనరల్ డి.సోమసుందర్ గ్రామీణ వార్తా కథనాలు అనే అంశంపై ప్రసంగించారు. 54 శాఖలకు చెందిన 80 పథకాలు గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, వాటి అమలు తీరుపై జర్నలిస్టులు దృష్టి సారించాలని సూచించారు. వ్యక్తులను కాకుండా సమస్యలను లక్ష్యంగా చేసుకుని వార్తలు రాయాలన్నారు. వాసిరెడ్డి వాసంతి జర్నలిజంలో నైతిక నిష్ట అనే అంశంపై ప్రసంగించారు. సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్కుమార్ మాట్లాడుతూ ఆయా రంగాల్లో నిష్ణాతులైన సీనియర్ జర్నలిస్టులు, ఫ్యాకల్టీ సభ్యులతో తరగతులు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో నెల్లూరు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
నెల్లూరు(బృందావనం): బాలాజీనగర్లోని గీతామయి వృద్ధాశ్రమంలో జగదీష్నగర్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా రాచపాళెం రఘు, కార్యదర్శిగా వేనాటి నవీన్రెడ్డి, కోశాధికారిగా దోనిపర్తి గిరిప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా దుర్గంపాటి పద్మజ, జాలీ వాకర్గా కె.మురళీమోహన్రాజు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఆ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు శింగంశెట్టి మురళీమోహన్రావు, గౌరవ సలహాదారులు వీరిశెట్టి హజరత్బాబు, తమ్మినేని పాండు, పప్పు నారాయణ, లీగల్ అడ్వైజర్ గుండు సుబ్రహ్మణ్యం, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 203 గవర్నర్ నలుబోలు బలరామయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్కు సన్మానం నెల్లూరు(అర్బన్): ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్కుమార్ను పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సన్మానించారు. అసోసియేషన్కు చెందిన 60 సంవత్సరాల సావనీర్ను అందజేశారు. రాష్ట్ర కోశాధికారి శాఖవరపు వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజారోగ్యానికి సంబంధించిన పల్స్ పోలియో, టీబీ నివారణ చైతన్య కార్యక్రమాలు, ఉచిత వైద్యశిబిరాలు చేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో పీఎంపీ గౌరవాధ్యక్షుడు అనుమల జయప్రకాష్, గోరంట్ల శేషయ్య, ప్రసాద్, మాలిని, శ్రీధర్రావు, శంకర్రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎరుకల సేవా సంఘం అధ్యక్షుడికి పురస్కారం నెల్లూరురూరల్: సామాజిక సేవా రంగంలో విశేష సేవలందిస్తున్న ఏపీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు నల్లగొండ్ల శివకు, దాసరి పోలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉత్తమ సేవా పురస్కారం సందర్భంగా ఆదివారం అభినందన సభ నిర్వహించారు. దర్గామిట్ట ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శివ మాట్లాడుతూ ఎరుకల సమాజానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలందేలా, యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎరుకల జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాలపర్తి శ్రీనివాసరావు, దాసరి కోటయ్య, నల్లగొండ్ల వెంకయ్య, దాసరి రామస్వామి, కట్ట రమణయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చేయూత నెల్లూరు(బృందావనం): విద్యా ప్రోత్సాహక, సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా లయన్స్క్లబ్ ఆఫ్ సంఘమిత్ర అధ్యక్షురాలు షేక్ పర్వీన్ ఆధ్వర్యంలో మూలాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు ఆదివారం యాంప్లిఫైర్ను అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల కార్యక్రమాలు, సమావేశాలు, విద్యార్థుల కార్యక్రమాలకు ఉపయోగపడేందుకు హైదరాబాద్కు చెందిన ప్రవాస భారతీయుడు రవికిరణ్ సౌజన్యంతో రూ.25 వేల విలువైన యాంప్లిఫైర్ను ప్రధానోపాధ్యాయురాలు రమాదేవికి అందజేశారు. కార్యక్రమంలో లయన్స్క్లబ్ ఆఫ్ సంఘమిత్ర కార్యదర్శి సాయిలక్ష్మి, కోశాధికారి అనూరాధ, సంధ్య పాల్గొన్నారు. తలసేమియా రోగుల కోసం రక్తదానం నెల్లూరు(అర్బన్): తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం పోతిరెడ్డిపాళెం యాదవ యువత ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న రెడ్క్రాస్ బ్లడ్బ్యాంక్లో పలువురు యువకులు రక్తదానం చేశారు. తమ మిత్రుడు శివకృష్ణ జ్ఞాపకార్ధం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బ్లడ్బ్యాంక్ అడహక్ కమిటీ సభ్యుడు చమర్తి జనార్దన్రాజు మాట్లాడుతూ తలసేమియా చిన్నారులకు తరచూ రక్త మార్పిడి జరగాల్సి ఉందన్నారు. అలాంటి వారి కోసం రక్తదానం చేసిన యువతను అభినందించారు. కార్యక్రమంలో అశోక్, శేషసాయి, ప్రణయ్, మహిత్, మస్తానయ్య, శ్రీకాంత్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
దుప్పట్లు, పండ్ల పంపిణీ
నెల్లూరు(బృందావనం): క్రాంతి మహిళా మండలి అధ్యక్షురాలు గుమ్మడి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. సమాజ సేవకురాలు దొడ్ల ప్రమీలమ్మ కుమారుడు, ప్రవాస భారతీయుడు దొడ్ల శ్రీకర్రెడ్డి షష్టిపూర్తి మహోత్సవాన్ని పురస్కరించుకుని పడారుపల్లి దివ్యాంగుల కాలనీ, కల్లూరుపల్లి హౌసింగ్బోర్డు కాలనీలోని మూగజీవుల సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న 50 మంది కార్మికులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే మూగజీవుల పశుగ్రాసం కోసం రూ.2 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సంరక్షణ కేంద్రం నిర్వాహకురాలు యు.ఉమాదేవి, శివకుమార్రెడ్డి, శీనమ్మ పాల్గొన్నారు. -
అడ్డగోలుగా డివిజన్ల విభజన
నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన వ్యవహారం అధికార పార్టీ ప్రయోజనాల కోసమే అన్నట్టుగా సాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న 54 డివిజన్లను ఏకంగా 72కు పెంచుతూ విడుదల చేసిన ప్రాథమిక డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై ఇటు నగర ప్రజల్లో, అటు ప్రతిపక్షాల పార్టీల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కనీస శాసీ్త్రయ ప్రమాణాలను గాలికొదిలేసి కేవలం అధికార పార్టీకి అనుకూలంగానే సరిహద్దులను గుర్తించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనాలోచిత నిర్ణయం జగరబోయే కార్పొరేషన్ ఎన్నికల కోసం డివిజన్ల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితంగా ఉంది. డివిజన్ల పెంపు 2011 జనాభా ప్రాతిపదికన చేపట్టాలని సూచించింది. కార్పొరేషన్ అధికారులు పద్ధతి ప్రకారం కాకుండా కేవలం జనాభా ప్రాతిపదికతో సర్వే నంబర్ల ఆధారంగా సంఖ్యను పెచేలా చేశారు. దీంతో పాతవార్డుల నంబర్లు పోయి కొత్తవి కేటాయించాల్సి రావడం.. అంతేకాకుండా పరిధి కూడా తగ్గిపోయి ఒక వార్డు మరొకదాంట్లో కలవడం వల్ల అంతా గందరగోళంగా మారింది. పున ర్విభజనలో ఎక్కడా భౌగోళిక పరిస్థితులు, ప్రజా సౌకర్యాలను గుర్తించకుండా గాలికొదిలేసి కేవలం డివిజన్లను ముక్కలు చేయడం జరిగింది. ఇష్టారాజ్యంగా.. వైఎస్సార్సీపీకి పట్టున్న డివిజన్లను లక్ష్యంగా చేసుకుని విభజన చేశారనే విమర్శలున్నాయి. ఆ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్గా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ప్రాంతాలను ఇష్టారీతిన అడ్డగోలుగా ముక్కలు చేసి సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించారు. 2011 జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేశామంటూనే అధికార పార్టీకి అనుకూలంగా వార్డులను ఏర్పాటు చేయడం వెనుక స్పష్టమైన రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది. అనేక డివిజన్లను ఇష్టారాజ్యంగా చీల్చి పక్క డివిజన్లో కలిపినప్పటికీ, కొన్ని డివిజన్లలో జనాభా పెరగడం, మరికొన్నింటిలో తీవ్రంగా తగ్గిపోవడం వంటి అంతు చిక్కని లెక్కలు అధికారుల పనితీరును బట్టబయలు చేస్తున్నాయి. హైకోర్టు డివిజన్ బెంచ్కు.. మున్సిపల్ ఎన్నికల డీలిమిటేషన్పై వైఎస్సార్సీపీ సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్ని ఆశ్రయించనుంది. ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ ఆ పార్టీ గత జూన్ నెలలో రాష్ట్రంలోని వివిధ మున్సిపాల్టీలకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రిట్ పిటిషన్ నంబర్ 16060/2026 ద్వారా నెల్లూరు నగర పాలక సంస్థ డీలిమిటేషన్ ప్రక్రియపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వైఎస్సార్సీపీ తరపున, అలాగే మరికొందరు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వాటిని పరిశీలించిన హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించనుంది. అభ్యంతరాలుంటే చెప్పొచ్చు ప్రస్తుతం డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 11వ తేదీ వరకు గడువు విధించారు. ప్రతిపాదిత 72 వార్డుల ముసాయిదా సరిహద్దులను శనివారం నుంచి ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. ఎన్ఎంసీ కార్యాలయంతోపాటు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లోని నోటీస్ బోర్డులో వీటిని ఉంచారు. ప్రతిపాదిత వార్డుల పునర్విభజన, సరిహద్దులపై ప్రజలు ఏవైనా సూచనలు, అభ్యంతరాలు ఉంటే అందజేయాలని కమిషనర్ నందన్ కోరారు. వాటిని పరిశీలించిన అనంతరం తదుపరి ప్రక్రియ చేపడతామన్నారు. సర్వే నంబర్ల ఆధారంగా వార్డుల హద్దులతో 72కు పెంపు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న యంత్రాంగం నేడు డివిజన్ బెంచ్ను ఆశ్రయించనున్న వైఎస్సార్సీపీ -
ఉపాధ్యాయులకు సన్మానం
నెల్లూరు(టౌన్): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత, ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లను ఘనంగా సన్మానించారు. డీవీ సుబ్బరాజు, స్వర్ణ రమేష్బాబు, హబీబ్ఖాన్, చంద్రమౌళి, కొండారెడ్డిలను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎంకె రెడ్డి, కార్యదర్శి ప్రసాద్, గౌరవాధ్యక్షుడు మేకల నరేంద్రరెడ్డి, కోశాధికారి ఖలీల్బేగ్, రాఘవరెడ్డి, సునీల్కుమార్రెడ్డి, పొన్నం రవిచంద్ర, విజయమోహన్నాయుడు, సుబ్బరామిరెడ్డి, హరిరావు, శేషగిరిరావు, గఫర్, మస్తానయ్య, ప్రభాకర్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ● నెల్లూరు(బృందావనం): ట్రంకురోడ్డు ఛత్రపతి శివాజీసెంటర్లో ఉన్న టీవీఎస్ కల్యాణ సదన్లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అధ్యాపకుడు, సీనియర్ రంగస్థల నటుడు వల్లకవి వెంకటసుబ్బారావుతోపాటు మరో 15 మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల, కళాశాలల టీచర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆ సమితి అధ్యక్షుడు గుడ్లదొన వాసుదేవరావు, ప్రధాన కార్యదర్శి దుద్దుకూరు రమేష్, కార్యనిర్వాహక కార్యదర్శి మద్దులపల్లి శ్రీధర్, యువజన సంఘం అధ్యక్షుడు విష్ణుతేజ, మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయలక్ష్మి, నాగలక్ష్మి, జ్యోతి, ఛాయాదేవి, విజయలక్ష్మి, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. -
సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర కీలకం
నెల్లూరురూరల్: సమాజ నిర్మాణంలో, విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఎస్.యానాదిరెడ్డి, జి.విజితను ఆదివారం నెల్లూరులోని రాంజీ నగర్లో ఉన్న కార్యాలయంలో సత్కరించి అభినందించారు. ఏపీ వైఎస్సార్టీఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధన చేయడంతోపాటు వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో టీచర్లు కీలకంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు కె.శివశంకర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బి.రఘురామిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.వాసు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ప్రసాద్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఎన్.శ్రీలత, వేణుగోపాల్రావు, మంజుల, మాలిని, శోభన్బాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
● యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య నెల్లూరు(వేదాయపాళెం): ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎస్టీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు భక్తవత్సలనగర్లోని గిరిజన భవన్లో ఆదివారం ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడుతూ హామీలు నెరవేర్చకపోతే రానున్న ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గ పరిధిలో యానాదులు తమ సత్తా చాటుతారని హెచ్చరించారు. వాగ్దానాలను విస్మరించే వారికి తగిన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల ఎదుట వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 16న యానాదుల ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి కార్యవర్గ సభ్యులు హాజరై పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బాపట్ల బ్రహ్మయ్య, కోశాధికారి చలంచర్ల పెద బ్రహ్మయ్య, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు సుబ్బారావు, మహిళా విభాగం అధ్యక్షురాలు చెంబేటి ఉష, నీలం అంకమ్మ, పొన్నూరు అంకమరావు, మానికల మురళి తదితరులు పాల్గొన్నారు. -
బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీకి రుణాలు
నెల్లూరు(పొగతోట): ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులకు వ్యవసాయం, వ్యాపారం, వ్యక్తిగత అవసరాలకు బంగారు ఆభరణాలపై తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తామని నెల్లూరు రీజినల్ మేనేజర్ పి.వెంకటరమణ అన్నారు. ఆదివారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో అప్రైజర్లతో నిర్వహించిన సమావేశంలో ఆర్ఎం మాట్లాడారు. ఖాతాదారులకు బంగారు రుణాలు చేరువ చేయడంలో అప్రైజర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. డిపాజిట్ల సేకరణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖాతాదారులకు నాణ్యమైన సేవలందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సీనియర్ మేనేజర్లు ఎం.వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. బాల్య వివాహాలపై పోరాటానికి గుర్తింపు నెల్లూరురూరల్: బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి నవంబర్ 27ను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించడాన్ని చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ స్వాగతించింది. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్ ఇరగనబోయిన శ్రీనివాసరావు మాట్లాడారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ భాగస్వామిగా బాల్య వివాహాల నివారణకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1,200 బాల్య వివాహాలను అడ్డుకున్నామని చెప్పారు. పాఠశాలలు, పంచాయతీలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐ.శ్రీనివాసరావు, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ జి.శంకరయ్య, సీఎస్డబ్ల్యూ షేక్ మున్వీర్, కార్యకర్తలు వి.పద్మావతి, వి.కనకాద్రి, కె.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ఇన్స్టాగ్రాంలో ఫాలోవర్లతో టాప్ 10లో ఉన్నవారు
సాక్షి, మంచిర్యాల: జెన్జీ.. జెన్ ఆల్ఫా ఎవరైనా కావొచ్చు.. అందరి చేతుల్లోనూ సెల్ఫోన్ ఆరో వేలుగా మారింది. యువత సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ తమ అభిప్రాయాలు, సలహాలనూ పంచుకుంటోంది. ఇటీవల కాలంలో ఇన్ స్టాగ్రాం వినియోగం విపరీతంగా పెరిగింది. అందుకే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత ఖాతాల ద్వారా నియోజకవర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇన్స్టాగ్రాంను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కలిసినా క్షణాల్లో తమ ఖాతాల్లో పోస్టు చేయిస్తున్నారు. ప్రత్యేక సిబ్బందిఇన్స్టాగ్రాంతోపాటు ఇతర సామాజిక మాధ్యమాల నిర్వహణకు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తదితర పార్టీల నాయకులూ భారీసంఖ్యలోనే ఉ న్నారు. అందరూ సోషల్మీడియా ఖాతాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరిలో చాలామంది సోషల్ మీడియాపై అవగాహన ఉన్నవారితో ఖాతాలు నిర్వహిస్తున్నారు. పర్యటనల్లో రాజకీయకా ర్యక్రమాలు చిత్రీకరణకు ఫొటో, వీడియోగ్రాఫర్లు వెంటే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయా కార్యక్రమాలు, ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు.వ్యాపారంలోనూ..వ్యాపారం ఏదైనా సరే విభిన్నమైన ప్రచారం చేస్తే ఆకట్టుకోవచ్చు. అందుకే చాలామంది వ్యాపారులు తమ వస్తువులకు సంబంధించిన వివరాలతో వీడియోలు చేస్తూ ఇన్స్టాగ్రాంలో అప్లోడ్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో ఆఫర్లు ప్రకటిస్తూ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.పదివేలలోపు..ఇన్స్టాగ్రాంలో ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులను ప్రజలు భారీ సంఖ్యలోనే అనుసరిస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావును 10వేలలోపు మంది ఫాలో అవుతున్నారు.ఇది జెన్జీ యుగం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకుని వినియోగించుకోకపోతే కాలం చెల్లినవారవుతారు(అవుట్డేట్). ఇప్పుడు యువత ఇన్స్టాగ్రాంలో హల్చల్ చేస్తోంది. మనం కూడా ఆ బాట పట్టాలి. ఇన్స్టాగ్రాం ఖాతాలు తెరిచి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలి. – ఇదీ ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం -
మాదకద్రవ్యాలతో జీవితాలు నాశనం
ఆదిలాబాద్టౌన్: మాదకద్రవ్యాలతో జీవితా లు నాశనం అవుతాయని డీఎల్ఎస్ఏ కార్యదర్శి హుస్సేన్ హుస్సేన్ అన్నారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలతో పాటు చట్టాలు, న్యాయ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం, ఓటీపీ, పాస్వర్డ్ తదితర వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూ చించారు. న్యాయ సేవాధికార సంస్థల చట్టం ద్వారా అందుతున్న న్యాయ సేవలు, ప్రజలకు లభించే ఉచిత న్యాయ సాయం తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ రాజీనామా చేయాలి
కై లాస్నగర్: పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీల అమలులో విఫలమయ్యారని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్జాదవ్ ఆరోపించారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగానూ విఫలమైన ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాతీర్పును ఎదుర్కొవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోవడాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంబేడ్కర్చౌక్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా ముందుకు సాగుతుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి , ఏఐసీసీ నేత రాహుల్గాంధీపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు మాని నిరుద్యోగం, రైతు సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి వంటి అంశాలపై చర్చకు రావాలని సవాలు విసిరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్రెడ్డి, నాయకులు సాజిద్ఖాన్, సుజాత, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్వయంగా రోడ్డెక్కి ట్రాఫిక్ క్లియర్ చేయించిన ఎమ్మెల్యే
విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆరోగ్యం బాగా లేకపోయిన 3 గంటల పాటు ఎండలో నిలబడి స్వయంగా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అనంతరం కుప్టి బస్టాప్ సమీపంలో భారీ వాహనాల రాకపోకల కోసం జేసీబీ సాయంతో తాత్కాలిక దారి మళ్లింపు పనులు దగ్గరుండి చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, హైవే అధికారులు సమస్యను పట్టించుకోక పోవడంతోనే నియోజకవర్గ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. కుప్టి బ్రిడ్జి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు త్వరలోనే హైదరాబాద్లో ఉన్నత స్థాయి హైవే అధికారులతో సమావేశమవుతానని తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ సాయంత్రం చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించారు. -
ఇన్స్టాంట్ ప్రచారం!
సాక్షి, మంచిర్యాలడెస్క్: జెన్జీ.. జెన్ ఆల్ఫా ఎవరైనా కావొచ్చు.. అందరి చేతుల్లోనూ సెల్ఫోన్ ఆరో వేలుగా మారింది. యువత సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ తమ అభిప్రాయాలు, సలహాలనూ పంచుకుంటోంది. ఇటీవల కాలంలో ఇన్స్ట్రాగాం వినియోగం విపరీతంగా పెరిగింది. అందుకే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత ఖాతాల ద్వారా నియోజకవర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇన్స్ట్రాగాంను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కలిసినా క్షణాల్లో తమ ఖాతాల్లో పోస్టు చేయిస్తున్నారు. ప్రత్యేక సిబ్బందిఇన్స్ట్రాగాంతోపాటు ఇతర సామాజిక మాధ్యమాల నిర్వహణకు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తదితర పార్టీల నాయకులూ భారీసంఖ్యలోనే ఉ న్నారు. అందరూ సోషల్మీడియా ఖాతాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరిలో చాలామంది సోషల్ మీడియాపై అవగాహన ఉన్నవారితో ఖా తాలు నిర్వహిస్తున్నారు. పర్యటనల్లో రాజకీయ కా ర్యక్రమాలు చిత్రీకరణకు ఫొటో, వీడియోగ్రాఫర్లు వెంటే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయా కార్యక్రమాలు, ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు. వ్యాపారంలోనూ..వ్యాపారం ఏదైనా సరే విభిన్నమైన ప్రచారం చేస్తే ఆకట్టుకోవచ్చు. అందుకే చాలామంది వ్యాపారులు తమ వస్తువులకు సంబంధించిన వివరాలతో వీడియోలు చేస్తూ ఇన్స్ట్రాగామ్లో అప్లోడ్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో ఆఫర్లు ప్రకటిస్తూ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.పేరు ఫాలోవర్లు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ 86,000 ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ 56,500 ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, నిర్మల్ 46,500 మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి 39,600 ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బోథ్ 32,900 పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ 25,400 మాజీ మంత్రి జోగు రామన్న 22,400 ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు, మంచిర్యాల 21,400 ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ 19,400 ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఖానాపూర్ 11,700ఇన్స్ట్రాగాంలో ఫాలోవర్లతో టాప్ 10లో ఉన్నవారు పదివేలలోపు..ఇన్స్ట్రాగాంలో ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులను ప్రజలు భారీ సంఖ్యలోనే అనుసరిస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావును 10వేలలోపు మంది ఫాలో అవుతున్నారు. ఇది జెన్జీ యుగం. సాంకేతిక పరిజ్ఞానా న్ని ఒడిసిపట్టుకుని వినియోగించుకోకపోతే కాలం చెల్లినవారవుతారు(అవుట్డేట్). ఇప్పుడు యువత ఇన్స్ట్రాగాంలో హల్చల్ చేస్తోంది. మనం కూడా ఆ బాట పట్టాలి. ఇన్స్ట్రాగాం ఖాతాలు తెరిచి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలి. – ఇదీ ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం -
మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
బాసర: కుటుంబ సమస్యలతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను నిర్మల్ జిల్లా బాసర పోలీసులు కాపాడి కుటుంబ సభ్యుల కు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. సికింద్రాబాద్లోని అల్వాల్కు చెందిన షేన్ సవిత(30) కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహ త్య చేసుకోవాలని శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు బాసర గోదావరి నదిలో దూకింది. నీటిలో తు అక్కడ తక్కువ ఉండగా.. అక్కడే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది గుర్తించి రక్షించారు. బాసర పోలీ సుస్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించి ఆమె సోదరుడు దాడెల్ల రాజేశ్కు అప్పగించినట్లు ఎస్హెచ్వో దీపక్ తెలిపారు. -
రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
ఆదిలాబాద్: 22–ఏ భూముల విషయంలో రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. 22–ఏ భూముల జాబితా నుంచి రైతుల భూములను తొలగించి, వారికి సంపూర్ణ హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ‘చలో ఇందిరాపార్క్’ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలంతా 22–ఏ భూముల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి, రైతుల తరఫున బలంగా తమ వాణిని వినిపిస్తామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
మథుర.. స్పెషల్
గిరిజన తెగకు చెందిన మథుర లబానాలకు జిల్లా పుట్టినిల్లుగా మారింది. సంచార జీవ నం క్రమంగా తగ్గి ఏజెన్సీ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వ్యవసాయం, పశుపోషణ వీరి జీవనాధారం. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పాటు వేషధారణతో ప్రత్యేక గుర్తింపు పొందిన వీరిపై ఈ వారం సండే స్పెషల్. – ఇచ్చోడశ్రీకృష్ణుడు ఇలవేల్పుగా..ప్రత్యేక వస్త్రధారణ మథుర మహిళలు సంప్రదాయ వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. రంగురంగుల వస్త్రాలతోపాటు వెండి, ఇత్తడితో చేసిన ఆభరణాలు ధరిస్తారు. చేతులకు కడియాలు, చెవులకు పెద్ద సైజు రింగులు, మెడలో పూసల దండలు కనిపిస్తాయి. పొడవాటి జుట్టుతో కూడిన అలంకరణతో పాటు చీర కట్టు మరో ప్రత్యేకత.వీరు శ్రీకృష్ణుడిని పూజిస్తారు. కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. అలాగే హోలీ పండుగను రంగులతో పాటు సంప్రదాయ నృత్యాలతో ఘనంగా జరుపుకుంటారు. తమ పూర్వీకుల చరిత్రను, ప్రకృతిని, దేవుళ్లను కీర్తిస్తూ లబానా భాషలో పాటలు పాడుతారు. బండారాలోనూ భాగస్వాములవుతారు. తీజ్తోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. శ్రావణమాసంలో రాఖీపౌర్ణమి నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగలో మహిళలు గోధుమలను వెదురు బుట్టలలో వేసి పెంచుతారు. తొమ్మిది రోజుల పాటు సంప్రదాయ కార్యక్రమాలను పెళ్లికాని యువతులు నిర్వహిస్తారు.సంస్కృతిని కాపాడుకుంటున్నాం..అనాదిగా వస్తున్న మథుర సంస్కృతిని తరాలుగా కాపాడుకుంటున్నాం. ఆధునికత పెరుగుతున్నా సంప్రదాయాలను కొనసాగిస్తున్నాం. భావితరాలకు అందిస్తున్నాం. – నిస్తే దర్యావ్సింగ్ మహరాజ్, మాంజిరతండా, బజార్హత్నూర్ మండలం పండుగలప్పుడు ఊరంతా సందడి..మా ఇలదైవం శ్రీ కృష్ణుడు. కృష్ణాష్టమి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. తీజ్తో పాటు బండారా వేడుకలను కోలహలంగా నిర్వహించుకుంటాం. ఈ పండుగలప్పుడు బంధువులతో ఊరంతా సందడిగా ఉంటుంది. – సాబ్లె ప్రతాప్సింగ్, నేరడిగొండ ఆటపాటలకు పెద్దపీటమా గ్రామాల్లో ఆటపాటలకు పెద్దపీట ఉంటుంది. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అంతా కలిసి ఉత్సహంగా పాల్గొంటాం. పండుగలను ఊరంతా కలిసి ఓకే చోట జరుపుకుంటాం. – నారాయణ్సింగ్, లింగట్ల, నేరడిగొండ మండలం సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు -
కుంగిన కుప్టి.. తోడైన ప్రమాదం
నేరడిగొండ/ఇచ్చోడ: నిర్మల్–ఆదిలాబాద్ 44వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలకు తరచూ ఆటంకం ఎదురవుతోంది. మండల పరిధిలోని కుప్టి వద్ద ఉన్న పాత వంతెన కుంగిపోవడంతో అధికారులు ఇటీవల దానిపై రాకపోకలను నిలిపివేశారు. ఇరువైపులా రాకపోకలు సాగించే వాహనాలన్నింటినీ ఒకే వంతెన మీదుగా మళ్లించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీనికితోడు శుక్రవారం రాత్రి బ్రిడ్జి వద్ద టమాటా లారీ, సిమెంట్ ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొనడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పక్షం రోజులుగా ఇదే దుస్థితి.. వంతెన కుంగిపోయి 15 రోజులు గడుస్తున్నా నేషనల్ హైవేస్ అథారిటీ(ఎన్హెచ్ఏఐ) అధికారులు, సంబంధిత యంత్రాంగం గానీ ఎలాంటి మరమ్మతు చర్యలు చేపట్టకపోవడంపై ప్రయాణికులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే వంతెన పైనుంచి భారీ వాహనాలు, బస్సులు, కార్లు వెళ్లాల్సి రావడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు.ప్రమాదానికి గురైన వాహనాలు, చిందరవందరగా పడి ఉన్న టమాటాలుబ్రిడ్జిపై రెండు వాహనాలు ఢీ ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలుకుప్టి జాతీయ రహదారిపై గల బ్రిడ్జిపై రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శుక్రవారం రాత్రి 11 దాటాక జరిగిన ఈ ఘటనలో గాయాలపాలైన డ్రైవర్ శనివారం రిమ్స్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ నుంచి నాగపూర్ వైపు టమాటా లోడ్తో వెళ్తున్న ఐచర్ వాహనం ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న సిమెంట్ క్రషర్ వాహనం కుప్టి జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో టమాటాలు చెల్లాచెదురైపోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన ఐచర్ వాహన డ్రైవర్ మహమ్మద్ యూసుఫ్(38) రిమ్స్లో చికిత్స పొందుతూ మృతిచెందగా, ఐచర్ క్లీనర్, క్రషర్ వాహన డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ప్రమాదం చోటు చేసుకోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
నెన్నెల: కట్టుకున్న భార్యను హత్యచేసిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం బెల్లంపల్లిలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ కేసు వివరాలు వెల్లడించారు. నెన్నెలలోని కాపువాడకు చెందిన తోట సబిత, తోట మల్లేశ్ భార్యాభర్తలు. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో ఈనెల 2న సబితను హత్య చేసి పరారయ్యాడు. గతంలో రెండుసార్లు హత్యకు యత్నించినట్లు విచారణలో వెల్లడైంది. ఘటన అనంతరం దుస్తులు మార్చుకుని పరారైన మల్లేశ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా సమాచారంతో శనివారం సాయంత్రం తాళ్లగురిజాల వై జంక్షన్ వద్ద అదుపులో తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. నెన్నెల ఎస్సై జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు. తల్లి కాటికి.. తండి జైలుకు..తల్లి కాటికి.. తండ్రి జైలుకు వెళ్లడంతో పిల్లలు ఒంటరి వారయ్యారు. తాతయ్య, అమ్మమ్మ సంరక్షణ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పెద్ద మనుషులకే ఒకరు సాయం చేసే స్థితిలో ఉండగా ఈ పిల్లల భారం వారిపై పడింది. అమ్మప్రేమకు దూర మై నాన్న జైలు పాలు కావడంతో తమను ఎవరు చూసుకుంటారో తెలియని అయోమయంలో పిల్ల ల బాల్యం మిగిలిపోయింది. వారి చదువుపై తల్లికి ఎంతో శ్రద్ధ ఉండేదని అమ్మమ్మ, తాతయ్య తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చిన పిల్లలను బాగా చదివించాలనేది ఆమె కోరిక నెరవేరకుండానే కన్నుమూసిందని పేర్కొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో సిగరెట్ షాప్లో చోరీకి పాల్పడిన రాజస్థాన్కు చెందిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో శనివారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్లోని పాలి జిల్లా కై తారానికి చెందిన కుమావత్ గుందారం, కుమావత్ ఘన్శ్యామ్, కుమావత్ మాణిక్చంద్, కుమావత్ లక్ష్మణ్, హైదరాబాద్లోని పటాన్చెరు బండ్లగూడకు చెందిన తేజ్పాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆదిలాబాద్లోని అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో సిగరెట్ షాప్ వద్ద రెక్కీ నిర్వహించారు. ఇటీవల రాత్రి సమయంలో గడ్డపారతో షాప్ తాళాలు పగులగొట్టి లోపల వివిధ రకాల సిగరెట్ బాక్సులతోపాటు కౌంటర్లోని నగదు చోరీ చేశారు. హైదరాబాద్లోని పఠాన్చెరులో వారికి పరిచయమైన వ్యక్తికి విక్రయించేందుకు ప్రయత్నించారు. వీటి విలువ సుమారు రూ.5.35 లక్షలు ఉంటుంది. కొంత మొత్తానికి సిగరెట్ బాక్సులు విక్రయించి, వచ్చిన నగదును నలుగురు పంచుకున్నారు. మిగిలినవి విక్రయించేందుకు, ఆదిలాబాద్లో మరో చోరీకి పాల్పడే ఉద్దేశంతో తిరిగివచ్చారు. వాటిని విక్రయిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకుంటుండగా పారిపోవడానికి ప్రయత్నించారు. వెంబడించి అదుపులో తీసుకుని విచారించగా, చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి 27 అమెరికన్ సిగరేట్ బాక్స్లు, 10 కింగ్ సైజ్, లైట్ 11, స్మాల్ గోల్డ్ 14, బ్రిస్టల్14, ఒకటి క్లాసిక్ రెడ్, ఓల్డ్ అడిషన్ 21, రెండు ఐస్ బస్ట్, కనెక్ట్ సిగరేట్ ఒక బాక్స్తో పాటు రూ.60వేల నగదు, చోరీకి వినియోగించిన మారుతీ కారుతోపాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, వన్టౌన్ సీఐ సునీల్కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. -
జామిడిలో మద్యనిషేధం
తాంసి: మండలంలోని జామిడి గ్రామంలో గ్రామస్తులు శనివారం మద్యనిషేధం కోసం నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ అశోక్ అధ్యక్షతన గ్రామస్తులు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మద్యంతో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతాయని, యువ త చెడుదారి పట్టకుండా మద్యనిషేధం సోమవారం నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామస్తులు, మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. మద్య నిషేధం తీర్మానం చేస్తున్న గ్రామస్తులు -
భవ్య క్షేత్రంగా బాసర
భైంసా: గోదావరి తీరాన కొలువైన జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం ఇక కొత్తరూపు సంతరించుకోనుంది. దేశంలోనే ప్రఖ్యాతగాంచిన బాసరను భవ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఆలయానికి రూ. 354 కోట్లు, పుష్కరఘాట్లకు రూ.20 కోట్లు మొత్తం రూ.374 కోట్ల నిధులు కేటాయించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలికవసతుల కల్పన, సుందరీకరణ తదితర ప నులు చేపట్టనున్నారు. పుష్కరఘాట్ల అభివృద్ధి, పు నరుద్ధరణతో పాటు పారిశుద్ధ్యం, భద్రత, విద్యుత్ తదితర వంటివి మెరుగుపర్చనున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఉద యం 10.50 గంటలకు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. భక్తులకు మరింత సేవలుసరస్వతీ అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అక్షరాభ్యాసం కోసం చిన్నారులతో వచ్చే కుటుంబాలతో క్షేత్రం నిత్యం సందడిగా ఉంటుంది. రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులతో భక్తులకు మెరుగైన వసతులు అందుబా టులోకి రానున్నాయి. ఆలయ అభివృద్ధితోపాటు సుందరీకరణ జరిగితే ఇక్కడ భక్తుల సంఖ్య పెరిగే అవకాశముంది.స్థానికంగా వాణిజ్యం, రవాణా రంగాలకు కూడా పర్యాటకానికి ఊతం లభించనుంది. ఆలయ నమూనా చిత్రంబాసర సరస్వతీ అమ్మవారు మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆది వారం బాసర పర్యటన నేపథ్యంలో పకడ్బందీ గా ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం కలెక్టర్ పరిశీలించా రు. పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. భైంసా సబ్కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అధికారులు, తహసీల్దార్లు, ఆలయ ఈవో అంజనాదేవి ఉన్నారు. -
పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం
సాక్షి,ఆదిలాబాద్: పత్తి కొనుగోళ్లకు సంబంధించి భారత పత్తి సంస్థ (సీసీఐ) సన్నద్ధమవుతుంది. ప్రణాళిక మేరకు కొనుగోలు కేంద్రాలు, మౌలిక వసతుల ఏ ర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించింది. జిల్లాలో అక్టోబర్ మూడో వారంలో కొనుగోళ్లు షురూ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ వానా కాలం పత్తి పంట అంచనా లకు అనుగుణంగా సాగైంది. అక్టోబర్లో దిగుబడులు చేతికందనున్నాయి. ఈమేరకు సీసీఐ ఏర్పాట్లను ప్రారంభించింది. జిల్లాలో గతేడాది మా దిరిగానే 11 కేంద్రాల ద్వారా పత్తిని సేకరించనున్నారు. ఆదిలాబాద్లో 2, బోథ్, నేరడిగొండ, పొచ్చెర, సొనాల, ఇంద్రవెల్లి, నార్నూర్, గుడిహత్నూర్, ఇచ్చోడ, బేలలో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులతో అనుసంధానం రైతులకు ఇబ్బందులు కలగకుండా సీసీఐ ఏటా జిల్లాలో జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులను అద్దెకు తీసుకుని అక్కడే పత్తి కొనుగోళ్లు చేపడుతుంది. ఆధునిక జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులను ఇటీవల అద్దెకు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను సీసీఐ ప్రారంభించింది. సేకరించిన పత్తి ద్వారా అదే జిన్నింగ్లో పత్తి బేల్స్ తయారు చేయడం జరుగుతుంది. వాటిని భద్రపర్చడానికి గోదాంలను అద్దెకు తీసుకుంటుంది. గతేడాది జిల్లాలో 34 మిల్లులను సీసీఐ అద్దెకు తీసుకుంది. లోడింగ్ ఆన్లోడింగ్, రవాణాకోసం కూలీలను నియమించింది. ఇలా ఒక్కో ప్రక్రియను కొనుగోళ్లు మొదలు పెట్టే సరికి పూర్తి చేసేలా సీసీఐ ప్రణాళిక ప్రకారం సాగనుంది.మద్దతు ధర పెంపు ..క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగానే..కేంద్ర ప్రభుత్వం పత్తికి సంబంధించి ఈ ఏడాది మద్దతు ధర పెంచింది. గతేడాది పొడువు పింజ పత్తి క్వింటాల్కు రూ.8,110 ఉండగా ఈ సారి రూ.557 పెంచారు. గతేడాదితో పోల్చితే 6.9 శాతం పెరుగుదల ఉంది. పత్తిలో తేమ శాతం 8నుంచి 12 మధ్య ఉంటేనే నిర్ణీత మద్దతు ధర లభిస్తుంది. తేమ శాతం పెరిగితే నిబంధనల ప్రకారం సీసీఐ ధరలో కోత పెడుతుంది. సేకరించిన పత్తికి సంబంధించి నగదును నేరుగా రైతుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలోకి డీబీటీ పద్ధతి ద్వారా జమ చేస్తుంది.పంటల సాగు విస్తీర్ణానికి సంబంధించి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్రాప్ బుకింగ్ ఏటా చేపడుతారు. కాటన్ ఫార్మర్ యాప్లో నమోదు చేసిన విస్తీర్ణం, క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగానే సీసీఐ కొనుగోళ్లు సాగుతాయి. అక్టోబర్లో పంట చేతికి వచ్చే సమయానికి కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. -
పట్టణ అభివృద్ధికి కృషి
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇందుకోసం రూ.154 కోట్ల తో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామ ని, త్వరలోనే రూ.50 కోట్ల నిధులు విడుదల కానున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసిన నాలుగు ట్రాక్టర్లను అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్తో కలిసి శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మున్సి పాలిటీలో పారిశుధ్య నిర్వహణను మరింత మె రుగుపరిచేందుకు అవసరమైన వాహనాలను సమకూరుస్తున్నామని అన్నా రు. ప్రభుత్వం మున్సిపాలిటీలకు కేటాయించిన టీయూఎఫ్ఐడీసీ నిధుల్లో రూ.18 కోట్లు మంజూరయ్యాయ ని, వాటితో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. మరోరూ.43 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ క మిషనర్ ఏ.జగదీశ్వర్గౌడ్ , శానిటరీ ఇన్స్పెక్ట ర్ శంకర్, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు ఇజ్జ గిరి సంజయ్, వెనగంటి ప్రకాష్, కౌన్సిలర్లు బొడిగం శ్రీకాంత్, ఆత్రం వెంకటేష్, నాయకులు బండారి సతీష్, అన్నెల వసంత్, బొంపల హనుమాండ్లు తదితరులు పాల్గొన్నారు. -
సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర కీలకం
ఆదిలాబాద్టౌన్: ఆదర్శ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మంది రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినో త్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. భార త మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత రం జిల్లాస్థాయిలో ఉత్తమపురస్కారాలకు ఎంపికై న ఉపాధ్యాయులను సన్మానించారు. జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్విని యోగం చేసుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన బో ధన అందించాలని సూచించారు. గతేడాది జిల్లాకు చెందిన 60మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ఐటీలో ప్రవేశం పొందారని ఈ ఏడాది ఆ సంఖ్య 100కు చేర్చేలా ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. గ్రా మాల్లో మద్యం దుకాణాలు లేకుండా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని, ఇందుకు యంత్రాంగం సహకరిస్తుందని చెప్పారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. తన ఎదుగుదలలో గురువుల ప్రోత్సాహాన్ని గుర్తుచేసుకున్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మా ట్లాడుతూ, విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యత పెంపొందించేలా బోధన సాగాలన్నారు. వచ్చే ఏడాది ఉత్తమ ఉపాధ్యాయులను అధికారులే ఎంపిక చేస్తారని డీఈవో మాధవి తెలిపారు. జాతీ య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సంతోష్, ఉత్తమ పురస్కార గ్రహీత లావణ్య తమ బోధనా వి ధానంలో తీసుకొచ్చిన మార్పులను వివరించారు. ఇందులో గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కలీం అహ్మద్, ఏఎంవో లక్ష్మణ్, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
విద్యారంగాన్ని విస్మరించి విజయోత్సవాలా?
కై లాస్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఆరు గ్యారెంటీల అమలులోనూ విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పోరుబాటకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకుడు శివకుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. విద్యార్థులు, యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలతో పాటు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు వాగ్మారె ప్రశాంత్, బట్టు సతీశ్, కరుణ, సాబీర్, హరీష్, శృతి, త్రిష, పల్లవి, రఘు, సాయి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
చోరీలకు పాల్పడిన నిందితుడి అరెస్టు
నిర్మల్టౌన్: చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బాగులవాడకు చెందిన మారేపెద్ది రాజశేఖర్, గడ్చంద రాజేశ్వర్, నిర్మల్రూరల్ మండలం చిట్యాలకు చెందిన కల్గద్దవార్ శ్రీకాంత్, హైదరాబాద్లోని హల్దియాబాద్కు చెందిన సారా సాయికిరణ్ పరస్పరం పరిచయంతో ఒక్కటయ్యారు. స్నేహం కాస్తా చోరీలకు దారితీసింది. కలిసి ఇళ్లు, దుకాణాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. వరుస చోరీలపై టైగర్స్ టాస్క్ఫోర్స్ ప్రత్యేక దృష్టిపెట్టింది. సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలను గుర్తించింది. మారేపెద్ది రాజశేఖర్, గడ్చంద రాజేశ్వర్, కల్గద్దవార్ శ్రీకాంత్ను గతనెల 17న పట్టుకుంది. పరారీలో ఉన్న సాయికిరణ్ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారించగా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, గన్నవరం పోలీస్స్టేషన్న్పరిధిలో చోరీలు చేసినట్లు అంగీకరించారు. జిల్లాలో నమోదైన 25 చోరీ కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు తేలింది. 16 కేసులకు సంబంధించిన చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. 12 కిలోల వెండి ఆభరణాలు, రూ.67 వేల నగదు, నిస్సాన్మాగ్నైట్ కారు, మెల్టింగ్ మెషిన్న్, గ్యాస్ పైప్ మెషిన్న్ స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, సమ్మయ్య, ఎస్సైలు లింబాద్రి, గణేశ్, శ్రీకాంత్, అశోక్, ఎస్.కె.గఫార్, హెడ్కానిస్టేబుల్ జగన్సింగ్, పీసీలు తిరుపతి, సతీశ్ తదితరులను ఎస్పీ అభినందించారు. ఆలయాలే టార్గెట్..పట్టణంలోని దివ్యనగర్, బంగల్పేట్, శాస్త్రినగర్, సారంగాపూర్ మండలం వంజర, ఆలూర్, నిర్మల్ రూరల్ మండలం కౌట్ల–కె, లోకేశ్వరం మండలం కిష్టాపూర్, మామడ మండలం, లక్ష్మణచాంద మండలం వడ్యాల్లోని ఆలయాల్లో జరిగిన చోరీలో నిందితుల ప్రమేయం ఉంది. వీటితోపాటు ఇందిరానగర్, ప్రియదర్శినినగర్, శాస్త్రినగర్, ఏఎన్న్రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగిన హౌస్ బ్రేకింగ్ కేసుల్లోనూ వీరి పాత్ర ఉన్నట్లు తేలింది. -
విద్యుత్ షాక్తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి
జన్నారం: విద్యుత్ షాక్తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. ఈ ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం గ్రామానికి చెందిన మహ్మద్ వలియోద్దీన్ (45) ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం కాలనీలోని ఓ ఇంట్లో కరెంట్ మోటారుకు వైరు బిగిస్తున్నాడు. ఈక్రమంలో విద్యుత్ సరఫరా కావడంతో షాక్ గురై ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు సీపీఆర్ చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబీకులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఉదయ్కిరణ్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ఆసుపత్రికి తరలించారు. రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44పై మన్నూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం..మన్నూర్ గ్రామానికి చెందిన కేంద్రే విజయ్ (23) శనివారం రాత్రి దాబాలో భోజనం చేసి బైక్పై తిరిగివస్తున్నాడు. మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్సులో రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
విద్యాప్రమాణాలు పెంచాలి
ఉట్నూర్రూరల్: ఉపాధ్యాయులు స్వీయప్రేరణతో విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ భవనంలో శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో 133 ఆశ్రమ పాఠశాలలు, 900 పైచిలుకు ప్రాథమిక పాఠశాలలు, గురుకులాలు, ఈఎంఆర్ఎస్లో తొలిసారిగా ఎఫ్ఎల్ఎన్ అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు సులభపద్ధతిలో పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. ఏపీవో భాస్కర్, డిప్యూటీ డీఈవో చందన్, గిరిజన క్రీడా అధికారి పార్థసారథి, డీటీడీవోలు, హెచ్ఎంలు విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ వృత్తి నుంచే వచ్చా..
రాజకీయాల్లో ఎంతో మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి వరకు ఎదిగారు. విజయవంతంగా పనిచేస్తున్నారు. నా గురువు సత్తయ్య రిజర్వేషన్తో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని టీచర్ ఉద్యోగం సాధించాను. తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టాను. విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఎల్లప్పుడు స్మరించుకుంటాను. – గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ కపటం, క ల్మశం లేకుండా..ఉపాధ్యాయులు కపటం, కల్మశం, స్వార్థం లేకుండా విద్యాబుద్ధులు నేర్పిస్తారు. వారు చెప్పిన పాఠాలతో ఈ స్థాయికి ఎదిగాను. అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి గొప్పది. గురువులు సమాజ మార్గదర్శకులుగా నిలుస్తారు. నాకు ఇచ్చోడలో టీచర్ నారాయణ రెడ్డి బోధన చేశారు. చదువులో నిత్యం ప్రోత్సహించేవారు. ఇప్పటికీ ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటాను. – అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే విలువలతో కూడిన విద్య నేర్పించారు..నా విద్యాభ్యాసం ఆదిలాబాద్లోనే. ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. ఇంటర్, డిగ్రీ గవర్నమెంట్ కళాశాలల్లో పూర్తి చేశాను. మా గురువులు విలువలతో కూడిన విద్యను బోధించారు. తప్పు చేస్తే దండించేవారు. వారి మార్గదర్శకంలో ఈ స్థాయికి ఎదిగాను. ప్రస్తుతం సెల్ఫోన్లు, సోషల్ మీడియాతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. నేను సూపరింటెండెంట్ అయ్యేవరకు కూడా సెల్ఫోన్ ఉపయోగించలేదు. – డి.మాధవి, డీఈవో -
అడ్డగోలుగా అక్రమాలు!
సాక్షి,ఆదిలాబాద్: గత జూలైలో జిల్లాలో ఆర్అండ్బీ ఈఈగా వ్యవహరిస్తూ పదోన్నతి పొంది నిజామాబాద్ ఎస్ఈగా బదిలీపై వెళ్లిన ఎస్.నర్సయ్య అవి నీతి బాగోతం బట్టబయలైంది. జిల్లాలో ఆర్థిక అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో అంతర్గతంగా విజిలెన్స్ విచారణ జరపడం, ప్రాథమికంగా రుజువు కావడంతో సస్పెండ్ వేటు వేశారు. సరిగ్గా ఆయన ఉద్యోగ విరమణ రోజే అంటే.. ఆగస్టు 31న ఆయనపై వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. ఆర్అండ్బీ ఉన్నతాధికారి నర్సయ్య జిల్లాలో ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా సుమారు నాలుగేళ్ల పాటు విధులు నిర్వహించారు. మధ్యలో నిర్మల్ జిల్లాలో కూడా కొద్దికాలం ఇన్చార్జి ఈఈగా వ్యవహరించా రు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఆయనకు ఈ ప్రాంతంలోని కాంట్రాక్టర్లతో సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఆ శాఖలో ఉంది. దీంతోనే ఆయన ఆర్థిక అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. తాజాగా ఈ విషయం ఆ శాఖలో హాట్ టాపిక్గా మారింది. టెండర్లలో అవకతవకలు అధికారి నర్సయ్య జిల్లాలో పనిచేసినకాలంలో ఇక్క డ చేపట్టిన పలు రహదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణ టెండర్లలో నిబంధనలు ఉల్లంఘించి తన కు కావాల్సిన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేలా ప్ర క్రియను మళ్లించారనే ఆరోపణలున్నాయి. అర్హత లేని, సిండికేట్గా మారిన కాంట్రాక్టర్లకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిబంధనలు సవరించి మరీ పనులు కట్టబెట్టడం ద్వారా భారీగా కమీషన్లు కుదుర్చుకోవడం జరిగిందనే విమర్శలున్నాయి. రహదారులు, వంతెన నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పా టించకుండానే పనులు పూర్తి చేసినట్లు చూపి, క్షేత్రస్థాయి తనిఖీలు సరిగ్గా నిర్వహించకుండానే కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ బిల్లులు ఆమోదించి నిధుల దు ర్వినియోగానికి సహకరించారని విజిలెన్స్ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. నాణ్యత ప్రమాణాల తనిఖీ సరిగ్గా చేపట్టకుండానే ఆ పనులకు ఆమోదముద్ర వేసినట్లు చెప్పుకుంటున్నా రు. నాణ్యత పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయ ల బోగస్, అడ్వాన్స్ బిల్లులను కాంట్రాక్టర్లకు మంజూరు చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఏకంగా నిధులే మళ్లింపు.. ఆర్అండ్బీ శాఖకు కేటాయించిన అభివృద్ధి నిధుల ను, నిర్వహణ (మెయింటనెన్స్) గ్రాంట్లను నిర్దేశిత పనులకు కాకుండా ఇతర పనుల పేరిట కాగితాల పై రికార్డు చేసి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు విచారణలో ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అనుమతులు లేని పనులను మంజూరు చేయడం, శాఖాపరమైన విచారణలు ఎదుర్కొంటున్న సమయంలోనూ విధానపరమైన నిర్ణయాల్లో అక్రమాలకు పాల్పడినట్లు దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం ఆర్అండ్బీ ఈఈ రమేశ్ పవార్ను వివరణ కోరగా, సస్పెన్షన్ వాస్తవమేనని, ప్రస్తుతం తాను స్థానికంగా అందుబాటులో లేనని, శనివారం వివరాలు తెలియజేస్తానని చెప్పారు. -
● జిల్లాలో 1,50,425 మందికి గాను ఇప్పటి వరకు ఇచ్చింది 49,955 మందికే.. ● నేడు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు
సర్.. నోటీసుల జారీ స్లో!కై లాస్నగర్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా అన్మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లకు సంబంధించిన నోటీసుల జారీ ప్రక్రి య జిల్లాలో నెమ్మదిగా సాగుతుంది. జిల్లావ్యాప్తంగా 1,50,425మంది ఓటర్లు ఆయా కేటగిరీల్లో ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు వారందరికీ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు నెలాఖ రు వరకే అందజేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అందులో సగం మందికి కూడా ఇవ్వలేదు. నోటీసులు అందుకున్న ఓటర్ల విచారణ కూడా నెమ్మదిగానే సాగుతుంది. ఇలాగే కొనసాగితే గడువులోపు ప్రక్రియ పూర్తికావడం కష్టమే. కాగా ఓటర్ల సౌకర్యార్థం శని, ఆదివారాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. నెమ్మదిగా ప్రక్రియ.. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు జూలైలో ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలు సేకరించారు. 2002 జాబితాతో ప్రస్తుత ఓటర్ల వివరాలు మ్యాపింగ్ కానటువంటి, పేరు, ఇంటిపేరు, డేట్ ఆఫ్ బర్త్, చిరునామా వంటి వివరాలు తప్పుగా ఉన్న వారిని అనామలిస్గా గుర్తించారు. ఇలాంటి వారు జిల్లావ్యాప్తంగా 1,50,425 మంది ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 295 పోలింగ్ కేంద్రాల పరిధిలో 85,525 మంది అన్మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లు ఉండగా వీరిలో 8201 మందికి మాత్రమే నోటీసులు జారీ చేశారు. అలాగే బోఽథ్ నియోజకవర్గ పరిధిలోని 305 పోలింగ్ కేంద్రాల పరిధిలో 64,900 మంది ఓటర్లున్నట్లుగా గుర్తించిన అధికారులు వీరిలో 41,754 మందికి నోటీసులు జారీ చేశారు. ఆదిలాబాద్తో పోలిస్తే బోథ్లో ఈ ప్రక్రియ వేగంగా సాగుతుంది. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలున్నాయి. విచారణలోనూ తీవ్ర జాప్యం.. నోటీసుల జారీలోనే కాదు ఓటర్ల విచారణ ప్రక్రియలోనూ తీవ్రజాప్యమవుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 85,525 మందికి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 662 మంది విచారణ మాత్రమే పూర్తి కావడం గమనార్హం. ఇక బోథ్లో 64,900 మందికి నోటీసులిచ్చి విచారించాల్సి ఉండగా 4,615 మందిని మాత్రమే విచారించినట్లుగా చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎస్ఈసీ ప్రకటించిన గడువులోపు ప్రక్రియ పూర్తవడం గగనమే అనిపిస్తోంది. నేడు, రేపు ప్రత్యేక శిబిరాలు .. ఓటర్ల సౌకర్యార్థం ఈనెల 5, 6 తేదీల్లో తొలి విడత, 12, 13తేదీల్లో రెండో విడత ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 600 పోలింగ్ కేంద్రాల్లో ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు బీఎల్వోలు అందుబాటులో ఉండనున్నారు. ఓట ర్లు నేరుగా తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ముసాయిదా జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవచ్చు. జాబితాలో పేరు లేకుంటే ఫారం–6 ద్వారా ఓటరుగా పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఫారం–7, 8 ద్వారా అభ్యంతరాలు, ఫిర్యాదులు అందజేసే అవకాశం కల్పించనున్నారు.సద్వినియోగం చేసుకోవాలిపారదర్శక ఓటర్ల జాబితా తయారీలో భా గంగానే ఎస్ఈసీ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు బీఎల్వో లు ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. జాబితాలో పేరు లేనటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యంతరా లు, ఫిర్యాదులుంటే కూడా అందించవ చ్చు. బీఎల్వోలు వాటిని పరిశీలించి సరిచేసే దిశగా చర్యలు తీసుకుంటారు.నోటీసుల జారీప్రక్రియ వేగవంతం చేసి విచారణ సై తం సత్వరం జరిగేలా చర్యలు తీసుకుంటాం. – ఎస్.రాజేశ్వర్, అడిషనల్ కలెక్టర్ జిల్లాలో.. పోలింగ్ కేంద్రాలు 600 బీఎల్ఓలు 600 మొత్తం ఓటర్లు 4,03,625 నోటీసులను అందుకున్న వారు 48,955 విచారణకు హాజరైన ఓటర్లు 5277 -
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఆదిలాబాద్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో వాసుదేవుని దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. తమ చిన్నారులను శ్రీకష్ణుడు, గోపికల వేషధారణతో తీర్చిదిద్ది తల్లిదండ్రులు మురిసిపోయారు. జిల్లా కేంద్రంలోని రాంపూర్ సమీపంలో గల ఇస్కాన్ ఆలయంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో శ్రీ సత్యభామారుక్మిణి సమేత గోపాలకృష్ణ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో మఠాధిపతి యోగానంద సరస్వతిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా...?’
నేరడిగొండ: రహదారి ప్రమాదాలు జరుగుతు న్నా సంబంధిత అధికారులు పట్టించుకోరా.. అంటూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. మండలంలోని కుప్టి హైవే (ఎన్హెచ్44)ను శు క్రవారం పరిశీలించారు. ఈ జాతీయ రహదారి కి కుప్టి వద్ద గుంతలు పడటం,రోజులు గడుస్తు న్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ని త్యం లక్షలాది వాహనాలు తిరిగే ఈ రహదారి పై గల బ్రిడ్జిపై సింగిల్వే చేయడంతో అనేక ప్ర మాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు. సమాధానం రాకపోయినా, అధికా రులు పనులు పూర్తి చేయకపోయినా హైవే దిగ్బంధం చేస్తానని హెచ్చరించారు. -
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
ఆదిలాబాద్: జి ల్లాకి చెందిన యు వ క్రీడాకారుడు అట్టం జశ్వంత్ అథ్లెటిక్స్లో ప్రతి భ చాటుతూ జా తీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పుదుచ్చేరిలో నిర్వహించనున్న 37వ నేషనల్ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటీవల హన్మకొండ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ –20 బాలుర రేస్వాక్ విభాగంలో అట్టం జశ్వంత్ బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డిబోజా రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్, శిక్షకులు వీజీఎస్ రాకేశ్, జ్యోతి స్వరణ్ క్రీడాకారుడిని అభినందించారు. -
పశువులు తరలిస్తున్న వాహనాలు పట్టివేత
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని టోల్ప్లాజా వద్ద టాస్క్ఫోర్స్ ఏసీ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు వాహనాలను సీజ్ చేశారు. ఆ వాహనాల్లో 13 ఆవులు, 17 దూడలు ఉండడంతో వాహనాలు నడుపుతున్న నక్క రాజ్కుమార్, షేక్ అహ్మద్, సుకే కుమార్, సహాయకులు షేక్ షఫి, షేక్ షాహీద్, ఓరగంటి రాజ్కుమార్, తాండ్ర శ్రీనివాస్లను అదుపులోకి తీసుకొని మొబైల్ ఫోన్లు స్వాధీ నం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ పశువులను ఆసిఫాబాద్ జిల్లా కౌటాల నుంచి జగి త్యాల జిల్లా రాజారాంపల్లె మార్కెట్కు అక్రమంగా తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఉత్తమ పీడీగా మేకల సౌమ్యకు అవార్డు
ఆదిలాబాద్: ఇంద్రవెల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మేకల సౌమ్యకు ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ అవార్డు –2026 లభించింది. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుల్లో ఆమెను పురస్కారానికి ఎంపిక చేశారు. విద్యార్థినులకు క్రీడాశిక్షణ అందించడంతో పాటు క్రీడారంగంలో ఆమె చేస్తున్న కృషి, ప్రతిభను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. ఉత్తమ పీడీగా ఎంపిక కావడంపై పలువురు క్రీడా సంఘాల బాధ్యులు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు. -
ఆ ఇద్దరిని మరిచిపోలేను
ప్రాథమిక విద్యాభ్యాసంలో నా గురువు అమరేష్ గణిత బోధన తీరు నన్ను గణితం వైపు ఆకర్షించింది. ఆయన ప్రోత్సాహంతో మ్యాథ్స్లో పట్టు సాధించాను. ఇది జేఈఈలో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు తోడ్పడింది. మరో గురువు పవన్ ప్రోత్సాహంతో సివిల్స్లో టాపర్గా నిలిచాను. అమరేష్ సార్తో ప్రస్తుతం టచ్లో లేనప్పటికీ, పవన్ సార్తో అనుబంధం కొనసాగుతుంది. ఆ ఇద్దరిని జీవితాంతం మరిచిపోలేను. విద్యార్థులు సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలంటే తల్లిదండ్రులతో పాటు గురువు పాత్ర ఎంతో కీలకం. – రాజర్షిషా, కలెక్టర్ మార్గదర్శకులుగా నిలవాలి ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలి. విద్యార్థి ఎదుగుదలలో టీచర్ల పాత్ర కీలకం. నేను ఈ స్థాయికి ఎదగడానికి మా గురువు జోగిందర్ కృషి ఎంతగానో ఉంది. 9, 10 తరగతుల్లో ఆయన జమ్ములో నాకు విద్యాబుద్ధులు నేర్పించారు. నా జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులను ఎన్నటికీ మరిచిపోను. అప్పుడప్పుడు వారితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుంటాను. – అఖిల్ మహాజన్, ఎస్పీ నిస్వార్థ సేవకులు.. గురువులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు గురువులు నిస్వార్థంగా సేవ చేస్తారు. అందుకే సమాజంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు, శాస్త్రవేత్తలందరినీ తీర్చిదిద్దేది టీచర్లే. నా గురువు గంగారెడ్డి పాఠశాలలో ‘నువ్వు పెద్ద లీడర్ అవుతావని..’ ఎప్పుడూ చెప్పేవారు. వారు చేసిన బోధనలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ -
గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్
రెబ్బెన: మహారాష్ట్రలోని బల్లార్షాలో గంజాయి కొనుగోలు చేసి రెబ్బెనలో విక్రయించేందుకు తీసుకొస్తు న్న వ్యక్తులను గురువారం పట్టుకుని రిమాండ్కు తరలించారు. మండల కేంద్రంలోని సీఐ కార్యాలయంలో శుక్రవారం సీఐ సంజయ్ వివరాలు వెల్ల డించారు. ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రెబ్బెన బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు పో లీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా 130 గ్రాముల గంజాయి లభ్యమైంది. నిందితులు రెబ్బెన మండలం జక్కులపెల్లికి చెందిన దాగం సందీప్, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన కొండగుర్ల రాజేంద్రప్రసాద్గా గుర్తించారు. నింది తులు జక్కులపెల్లికి చెందిన దుర్గం అభినేష్ అలి యాస్ చింటూతో కలిసి గురువారం మహారాష్ట్రకు వెళ్లి అక్కడ అజిత్ వికాస్ వద్ద 130 గ్రాముల గంజాయిని రూ.7వేలకు కొనుగోలు చేశారు. దాన్ని గంజాయి సేవించే అలవాటు ఉన్న రెబ్బెన మండలం జక్కులపల్లికి చెందిన పబ్బతి అనిల్, మేడి అంజయ్యతో పాటు మరికొంత మందికి విక్రయించేందుకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై వెంకటకృష్ణ, సిబ్బంది రవికుమార్, పీసీ నౌషద్లు ఉన్నారు. పెరట్లో గంజాయి సాగు సిరికొండ: సిరికొండ మండల కేంద్రానికి చెందిన గైక్వాడ్ రుక్మాబాయి తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇచ్చోడ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇంటి పెరట్లో కంది పంట మధ్య సాగు చేస్తున్న 46 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 136 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ రూ.4.60 లక్షలు, ఎండు గంజాయి విలువ రూ.3,400 ఉంటుందని తెలిపారు. గైక్వాడ్ రుక్మాబాయితో పాటు ఆమె కుమారుడు గైక్వాడ్ బాలాజీపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
ఆధ్యాత్మిక కారిడార్
ఆచూకీ లేని భైంసా: చదువుల తల్లి కొలువైన బాసర.. ప్రకృతి అందాల సహస్రకుండ్.. రేణుకామాత, దత్తాత్రేయ క్షేత్రాలతో ప్రసిద్ధి చెందిన మాహోర్.. ఈ మూడు ప్రాంతాలను కలుపుతూ ఆధ్యాత్మిక– పర్యాటక కారిడార్ చేపట్టాలని డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. తెలంగాణలోని బాసర నుంచి మహారాష్ట్రలోని మాహోర్ వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బాసర నుంచి సహస్రకుండ్ జలపాతం వరకు సుమారు 76 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మాహోర్ వరకు 97 కిలోమీటర్లు ఉండగా మొత్తంగా సుమారు 173 కిలోమీటర్ల మార్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తే తెలంగాణ –మహారాష్ట్ర మధ్య కీలకమైన ఆధ్యాత్మిక –పర్యాటక మార్గంగా ఈ రహదారి మారే అవకాశం ఉంది. ప్రమాదాల మార్గం..ప్రస్తుతం ఈ మూడు ప్రాంతాల్లోని ఘాట్ రహదారులు, మలుపులు, రోడ్డు పరిస్థితులు ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సోమవారం మాహోర్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న కుభీర్ మండలం పార్డీ (బి) గ్రామానికి చెందిన నలుగురు జీపు ప్రమాదంలో మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది. గతంలో భైంసా మండలం సుంక్లి గ్రామానికి చెందిన ముగ్గురు మాహోర్ నుంచి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈక్రమంలో ఆధ్యాత్మిక –పర్యాటక కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బాసర –సహస్రకుండ్ –మాహోర్ను ఒకే పర్యాటక సర్క్యూట్గా అభివృద్ధి చేస్తే మూడు ప్రాంతాలకూ ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటికే బాసర నుంచి భైంసా వరకు జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. ఇక భైంసా నుంచి మహారాష్ట్ర వైపు రహదారి అనుసంధానాన్ని కొనసాగిస్తూ మాహోర్ దిశగా నిర్మాణం చేపడితే ఈ ప్రాంలాల ముఖచిత్రం మారిపోతుంది. ప్రస్తుతం ఉన్న రహదారులను విస్తరించడం, అవసరమైన చోట కొత్త మార్గాలు నిర్మించడం, ఘాట్ ప్రాంతాల్లో రక్షణ గోడలు, క్రాష్ బ్యారియర్లు, హెచ్చరిక బోర్డులు, పార్కింగ్, అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ప్రయాణం సురక్షితంగా మారుతుంది. భక్తులకు ఉపయోగకరం..నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి తీరాన కొలువైన శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం విద్యారంభం, అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలోని మాహోర్ రేణుకాదేవి ఆలయం, దత్తాత్రేయ క్షేత్రంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగి ఉంది. రేణుకాదేవి ఆలయాన్ని ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటిగా మహారాష్ట్ర పర్యాటక శాఖ పేర్కొంటోంది. వీటి మధ్యలోని సహస్రకుండ్ జలపాతం వర్షాకాలంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మిస్తే భక్తులు ఒకే ప్రయాణంలో ప్రకృతి అందాలు– ఆధ్యాత్మిక అనుభూతి పొందుతారని పలువురు పేర్కొంటున్నారు. కేంద్ర మంత్రి దృష్టికి..బాసర–భైంసా జాతీయ రహదారిని మహా రాష్ట్ర వైపు విస్తరించి మాహోర్తో అనుసంధా నం చేయాలనే అంశాన్ని ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ పలుమార్లు కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేశారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కేంద్రానికి సమగ్ర ప్రతిపాదన పంపి తే ఈ మార్గం రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఈ రహదారి నిర్మాణం కేవలం ప్రయాణ సౌకర్యం కోసం చేపట్టే ప్రాజెక్టుగా కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య భక్తి, పర్యాటకం, వ్యా పారం, సాంస్కృతిక సంబంధాలను బలోపే తం చేసే మార్గంగా మారుతుంది. -
క్రీడాకారులు కోలిండియా స్థాయిలో రాణించాలి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులు కో లిండియా స్థాయిలో రాణించాలని శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ప్రగతి మైదానంలో ఏరియా స్థాయి డబ్ల్యూపీఎస్, జీఏ వా ర్షిక క్రీడలు మొదలయ్యాయి. మొదటిరోజు వాలీ బాల్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏరియా క్రీ డాకారులు గత సంవత్సరం సాధించిన పతకాల కంటే రెట్టింపు పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈసారి క్రీడా సామగ్రి కొనుగోలు కోసం ఏరి యాకు రూ.4.5 లక్షలు మంజూరు చేశామన్నారు. విన్నర్గా ఆర్కే5 గ్రూప్..వాలీబాల్ పోటీల్లో విన్నర్గా ఆర్కే 5 గ్రూప్, రన్నర్గా ఆర్కే7 గ్రూపు నిలిచిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే.వీరభద్రయ్య, ఏరియా ఎస్ఓటు జీఎం కృష్ణప్రసాద్, డీజీఎం(పర్సనల్) ఎస్.అనిల్కుమార్, క్రీడల గౌరవ కార్యదర్శి పాల్ సృజన్, స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, కోఆర్డినేటర్ తోట సురేశ్, కెప్టెన్లు చిన్నయ్య, ఎం.శ్రీనివాస్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
పశువులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
నేరడిగొండ: రోల్మామడ టోల్ప్లాజా వద్ద విధుల్లో ఉన్న సిబ్బందిపైకి వాహనాలు ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడటంతో పాటు, అక్రమంగా గోవులను తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నేరడిగొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీస్స్టేషన్లో ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్ వివరాలు వెల్ల డించారు. ఈనెల 1న నేరడిగొండ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న మహీంద్రా బొలెరో టోల్గేట్లను ఢీకొడుతూ వేగంగా దూసుకెళ్లింది. టోల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారిని చంపాలనే ఉద్దేశంతో వాహనాన్ని వారిపైకి తీసుకెళ్లారు. వెనుక వస్తున్న కంటైనర్ లారీ కూడా సైన్ కోన్లు, డివైడర్లను ఢీకొట్టి వేగంగా పరారైంది. టోల్ప్లాజా సూపర్వైజర్ ఎంపల్లి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా 3వ తేదీ తెల్లవారుజామున కుంటాల గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆదిలాబాద్లో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్ తాటిగూడకు చెందిన ఎండీ షఫీ ముదస్సిర్, గోపాల్ సింగ్ షెకావత్, మహారాష్ట్ర నాగ్పూర్కు చెందిన లారీ డ్రైవర్ ఫిర్దోస్ బేగ్, మహమ్మద్ హైదర్అలీ, క్షితిజ్ భీమ్రావు సేవట్కర్, యవత్మాల్కు చెందిన సందీప్ విఠల్ ముప్పిడివార్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మహమ్మద్ మజార్, రాజు, రవి జగదీశ్ బాగ్డేల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రాంతంలో దొంగిలించిన పశువులను లారీలో నిజామాబాద్ జిల్లా సతాపూర్ వైపునకు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి 24 ఎద్దులు, 23 ఆవులను మొత్తం 47 పశువులు స్వాధీనం చేసుకున్నారు. ఊపిరాడక మూడు పశువులు మృతిచెందగా, మిగిలిన 44 పశువులను సురక్షితంగా గోశాలకు తరలించారు. వీటితో పాటు బొలెరో, కంటైనర్ లారీ, 4 గ్రాముల గంజాయి, ఐఫోన్ 16 సహా పలు సెల్ఫోన్లు, రూ.6,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి బోథ్ జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఇచ్చోడ సీఐ రమేశ్ -
పట్టుచీరపై తెలుగు వైభవం
బాసర: తెలుగు భాష గొప్పతనాన్ని చేనేత కళతో మేళవిస్తూ సిరిసిల్లకు చెందిన ఓ కళాకారుడు అద్భుతమైన పట్టుచీర నేశాడు. తెలుగు భాషకు మూలమైన 56 అక్షరాలను పట్టుచీరపై అందంగా పొందుపరిచాడు. శుక్రవారం మేళతాళాల మధ్య పద్మశాలీ సంఘం సభ్యులు ఈ చీరను ఆలయానికి తీసుకొచ్చి ఈవో అంజనాదేవి, ఆలయ స్థానాచా ర్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీ పూజారి, వేద పండితుల సమక్షంలో అమ్మవారికి సమర్పించారు. 35ఏళ్ల అనుభవం..నల్ల జగదీష్ గత 35 ఏళ్లుగా చేనేత వృత్తిలో కొనసాగుతున్నారు. తన అనుభవంతో ఎన్నో వినూత్న వస్త్రాలు తయారు చేసిన ఆయన తెలుగు భాషకు సంబంధించిన 56 అక్షరాలను చేనేత చీరపై నేసి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి నల్ల పరంధాములు కూడా చేనేత రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని, ఆయన ఆశీర్వాదంతోనే తాను ఈ కళాఖండాన్ని రూపొందించినట్లు జగదీష్ తెలిపారు. తన తండ్రి కలలో సూచించినట్లుగా ఈ చీరను అమ్మవారికి సమర్పించాలనే సంకల్పంతో కుల, సత్రం ప్రతినిధుల సహకారంతో బాసర అమ్మవారికి సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో సత్రం అధ్యక్షుడు రాపోల్ సుధాకర్, కార్యనిర్వహక అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, ప్రధా న కార్యదర్శులు రమణ విశ్వం, జెంటిల్ శ్యామ్, స్థానిక సర్పంచ్ తీగల వెంకటేశ్గౌడ్, కొక్కుల గంగాధర్, మోరే సాయిలు, ఎలగందుల శ్రీనివాస్, ఓని స్వామి, రువ్విపోశెట్టి, మేకల అశోక్, అంకం రమేశ్ తదితర గ్రామ పద్మశాలీ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. 15 రోజులు నిష్ఠతో..సిరిసిల్ల వాస్తవ్యుడు నల్ల పరంధాములు కుమారుడు నల్ల జగదీశ్ నేత తన తండ్రి ఆశయాలు, ఆశీర్వాదంతో ఈ వినూత్న చీరను రూపొందించా రు. పొడవు ఆరు మీటర్ల 30 సెంటీమీటర్లు, వెడ ల్పు ఒక మీటరు 25 సెంటీమీటర్లు, 650 గ్రాముల బరువున్న ఈ చీరను చేనేత మగ్గంపై 15 రోజులపాటు నిష్ఠతో నేశారు. చీర మొత్తం తెలుగు అక్షరమాలతో కళాత్మకంగా తీర్చిదిద్దడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
చెరువులో పడి బాలుడు మృతి
కుభీర్: ఎల్లమ్మ చెరువులో గత నెల 10వ తేదీన ఇద్దరు చిన్నారులు ఈతకు వెళ్లి మృతిచెందిన విషయం మరువక ముందే శుక్రవారం మరో బాలుడు చెరువులో పడి మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవిదాస్ (16) శుక్రవారం ఉదయం గొర్రెలను మేపేందుకు ఎల్లమ్మ చెరువు కట్ట వద్దకు ఇతరులతో కలిసి వెళ్లాడు. మధ్యాహ్నం చెరువులో గొర్రెలు నీరు తాగుతుండగా ఒక గొర్రెపిల్ల నీటిలోకి వెళ్లింది. దానికి బయటకు తీసేందుకు నీటిలోకి వెళ్లి గుంతలో పడిపోయాడు. గమనించిన కాపరులు వెంటనే బయటకు తీయగా అప్పటికే బాలుడు మృతిచెందాడు. దేవిదాస్కు తల్లి, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తల్లి గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు.. నిర్మల్టౌన్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన జిల్లా కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చింతకుంటవాడ కాలనీకి చెందిన పోలకొండ లక్ష్మీనారాయణ వర్మ (50) శాంతినగర్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి బైక్పై తిరిగి వస్తుండగా జయశంకర్ కూడలి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే లక్ష్మీనారాయణ వర్మను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య ఉండగా, సంతానం లేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాలువలో పడి యువకుడు.. ముత్తారం: మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సాయిరాం(21) ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో పడి శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై కథనం ప్రకారం.. సాయిరాం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖ మ్మంపల్లిలోని తమ బంధువు ఇంటికి చుట్టపుచూపుగా వచ్చాడు. పనిమీద ఖమ్మంపల్లి నుంచి హ రిపురం వచ్చి మళ్లీ ఖమ్మంపల్లికి తిరిగి వెళ్తున్న క్ర మంలో కేశనపల్లిలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద బైక్ అదుపుతప్పి కాలువలో పడి దుర్మరణం చెందాడు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ వివరించారు. కడుపు నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య బజార్హత్నూర్: కడుపునొప్పి భరించలేక యువతి కోలపురి స్రవంతి(18) ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మోర్కండి గ్రామానికి చెందిన కోలపురి గంగన్న –అడెల్లబాయిల కూతురు స్రవంతి గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. గురువారం తల్లితండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు గమనించి వెంటనే స్రవంతిని ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందింది. తండ్రి గంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. మృతురాలు బజార్హత్నూర్లోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మద్యానికి బానిసై ఒకరు.. ఆదిలాబాద్రూరల్: మండలంలోని బృందావన్కాలనీకి చెందిన శివ్శెట్టి మన్మద్(32) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేవ్ జిల్లా ధర్మబాద్కు చెందిన శివ్శెట్టికి ఆదిలాబాద్ రూరల్ మండలంలోని నిరాల గ్రామానికి చెందిన యువతితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ సభ్యులతో కలిసి బృందవన కాలనీలో నివాసముంటున్నాడు. ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. అనా రోగ్యంతో బాధపడుతున్నాడు. మద్యం మానేయాలని తండ్రి విఠల్ మందలించాడు. దీంతో గురువారం ఇంట్లో ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్తో గేదె మృతి ఇచ్చోడ: మండలంలోని కామాగిరి గ్రామానికి చెందిన రైతు ఫడ్ భగవత్కు చెందిన గేదె శుక్రవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మేస్తుండగా విద్యుత్ తీగకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు తెలిపాడు. గేదె విలువ సుమారు రూ.80 వేల వరకు ఉంటుందన్నాడు. -
రేపట్నుంచి వేళాంగణిమాత జన్మదిన మహోత్సవాలు
నెల్లూరు(బృందావనం): పరిశుద్ధ కోడూరు వేళాంగణి మాత జన్మదిన మహోత్సవాలు కొత్తకోడూరు బీచ్, మహాలక్ష్మీపురంలో ఈనెల 6, 7, 8 తేదీల్లో వైభవంగా జరుగుతాయని రోమన్ కేథలిక్ మిషన్ నెల్లూరు బిషప్ మోస్ట్ రెవరెండ్, మేత్రాసన గురువులు డాక్టర్ పిల్లి ఆంథోనిదాస్, విచారణ గురువులు, డైరెక్టర్ ఫాదర్ పినపాటి లూకాస్రాజ్ తెలిపారు. పోస్టర్లు, ఆహ్వానపత్రికలను శుక్రవారం సంతపేటలోని రోమన్ కేథలిక్ మిషన్ బిషప్ హౌస్లో ఫాదర్స్ కొండెపోగు ప్రేమ్రాజ్, మనోహర్, జాన్, రాయప్ప, బి.పాల్, షడ్రఖ్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహోత్సవాలను ఆర్సీఎం నెల్లూరు బిషప్ మోస్ట్రెవరెండ్ డాక్టర్ ఎండీ ప్రకాశం ప్రారంభిస్తారన్నారు. రోజూ సాయంత్రం 6 గంటలకు జపమాల, తేరుప్రదక్షిణ, దివ్య బలిపూజ, రోగుల కోసం ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా జరుగుతాయన్నారు. తొలిరోజు ఆదివారం సాయంత్రం మరియతల్లి – ఆధునిక ప్రపంచానికి ఆశాదీపంపై ధ్యానాంశం నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు మహోత్సవాల్లో పాల్గొని వేళాంగణిమాతను దర్శించుకుని పునీతులు కావాలన్నారు. ఆత్మకూరు బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం ఉందన్నారు. అలాగే మూడురోజులు భక్తుల కోసం సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. -
కృష్ణం వందే జగద్గురుమ్
● వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలునెల్లూరు(బృందావనం): మినీబైపాస్ రోడ్డు సమీపంలోని ఇస్కాన్ సిటీలోని అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మందిరంలో వేంచేసి ఉన్న జగన్నాథ, సుభద్ర, బలరాములు ప్రత్యేకాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బాలకృష్ణుడికి ఊంజల్ సేవను భక్తులు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. భజనలు, కీర్తనలతో మందిరం ఆధ్యాత్మిక చింతనతో మార్మోగింది. ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన బాలలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. మధ్యాహ్నం స్మారికను ఆవిష్కరించారు. సంప్రదాయంగా అర్ధరాత్రి శ్రీకృష్ణ భగవానుడికి అభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవాలి శ్రీకృష్ణుడు దేవదేవుడని, ఆయన చెప్పిన శ్రీమద్భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవాలని ఇస్కాన్ మందిర అధ్యక్షుడు డాక్టర్ శుకదేవస్వామి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో దైవానుగ్రహం కలుగుతుందన్నారు. సనాతన ధర్మం, మానవత్వం నాలుగు కాలాలపాటు మనగలగాలంటే జీవితానికి ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమన్నారు. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకులు, శ్రీకృష్ణ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేసిన శ్రీల ప్రభుపాద వ్యాసపూజ శనివారం ఉదయం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం హారతి, శ్రీల ప్రభుపాద పుష్పాంజలి, నందోత్సవం జరుగుతాయన్నారు. శివకేశవుల దేవస్థానంలో.. దర్గామిట్ట క్రాంతినగర్ కొండాబలరామిరెడ్డి వీధిలోని శివకేశవుల దేవస్థానంలో 40వ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం బాలబాలికలు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో కనువిందు చేశారు. ఉట్టి మహోత్సవం వేడుకగా సాగింది. దీనికి దాతలుగా జలకం మనోహర్బాబు, సుజాత, రాచపూడి మధుజయ వ్యవహరించారు. ముఖ్యఅతిథులుగా విశ్వహిందూ పరిషత్ నేతలు మోడెం మల్లికార్జునరావు, ఏవీఆర్ రాజేంద్రప్రసాద్, విభాగ్ మాతృశక్తి సంయోజక్ అన్నపూర్ణ, బట్టేపాటి హరిప్రసాద్రెడ్డి, తాటిపర్తి బాలాజీ, మునిరాజ్, లోకనాథం తదితరులు విచ్చేశారు. శనివారం సాయంత్రం రుక్మిణీదేవి, జాంబవతి దేవి సమేత వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం జరుగుతుందని ట్రస్ట్ చైర్మన్ దర్శిగుంట పెంచలయ్య తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన ట్రస్ట్ సభ్యులు గోవిందు, శేఖర్బాబు, విజయ్చంద్ర, నరసయ్యస్వామి, బి.స్వామి, సూర్యప్రకాష్, సాయి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ● బాలాజీనగర్ పిండిమిల్లు సెంటర్ శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చిరంజీవి సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బాలాజీ నగర్ యూత్, స్థానిక పెద్దల సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల కోలాట ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఇంకా కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొనగా నిర్వాహకులు సత్కరించారు. -
20 ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ చర్యల్లో భాగంగా బాలాజీ నగర్ పోలీసులు శుక్రవారం స్టేషన్ పరిధిలోని శ్రామికనగర్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన సిబ్బంది ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను సేకరించారు. పత్రాలు సక్రమంగా లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఓ సస్పెక్ట్ షీటర్ను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎస్సైలు విజయ్శ్రీనివాస్, సూర్యప్రకాష్రెడ్డి స్థానికులతో మాట్లాడారు. మహిళలు, చిన్నారుల రక్షణ చట్టాలు, శక్తియాప్, డయల్ 112, ఎల్హెచ్ఎంఎస్, హెల్మెట్ ధారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలన్నారు. వాహనపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తే తక్షణమే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
చివరి ఆయకట్టు వరకు నీరందించాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో ఎడగారులో వేసిన వరిపైరుకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు జనార్దన్, శ్రీరాములు, మూలి వెంగయ్య డిమాండ్ చేశారు. నెల్లూరులోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో ఎడగారులో రైతులు వరిసాగు చేశారన్నారు. ఏప్రిల్ నెలలో నిర్వహించిన సాగునీటి సలహా సంఘం సమావేశంలో సరిపోయినంత నీరు అందించేందుకు తీర్మానం చేశారని గుర్తుచేశారు. నేడు కొన్ని ప్రాంతాల్లో వరి కోత దశకు వచ్చిందని, మరికొన్నిచోట్ల చిరు పొట్ట దశకు వచ్చిందన్నారు. ఇప్పుడు పంటకు నీరు ఎంతో అవసరమన్నారు. అయితే కావలి, దక్షిణ కనుపూరు కాలువల కింద నీటి పారుదలకు తరచూ ఆటంకం కలుగుతోందన్నారు. సోమశిల ప్రాజెక్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు బృందంగా ఏర్పడి అవసరం లేనిచోట నీరు తగ్గించి, అవసరమైన రైతులకు అందించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమశిల రిజర్వాయర్లో నీటిమట్టం 13 టీఎంసీలకు తగ్గిపోతోందని, వెంటనే శ్రీశైలం నుంచి 10 టీఎంసీలను తీసుకొచ్చేలా మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంతో మాట్లాడాలని కోరారు. -
వినాయకచవితి ఉత్సవాలపై సమీక్ష
నెల్లూరు(బృందావనం): గణేష్ ఉత్సవ సమితి జిల్లా కార్యవర్గ సమావేశం మినీబైపాస్రోడ్డు రామమూర్తినగర్లోని వారాహి ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు వాయుగుండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీ పరిధిలో సమితి జిల్లా కమిటీ సభ్యులు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి గణేష్ మండపాల వద్ద, నిమజ్జన ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరాలన్నారు. ఉత్సవాల నిర్వాహకులకు జిల్లాలో ఏ అవసరమొచ్చినా కమిటీ సభ్యులను సంప్రదించితే అందుబాటులో ఉంటారన్నారు. శనివారం ట్రంకురోడ్డు శివాజీ సెంటర్లోని టీవీఎస్ కల్యాణసదన్లో సింగిల్ విండో అనుమతుల కోసం గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు వెంకటేశ్వర్లు చెప్పారు. ● ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బయ్యా వాసు మాట్లాడుతూ విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సమితి ఏర్పాటైందన్నారు. గతేడాది ప్రభుత్వపెద్దలతో సంప్రదించి రాష్ట్రంలోని అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేశామన్నారు. సమితి గౌరవాధ్యక్షుడు పిట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ మండపాల్లో బాలగంగాధర్ తిలక్, ఛత్రపతి శివాజీ మహరాజ్ల చిత్రపటాలను పెట్టాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం విజయకుమార్ మాట్లాడుతూ మండపాలకు అవసరమైన జెండాలు, బ్యానర్లు గణేష్ గీతాల డ్రైవ్ను అందజేస్తామన్నారు. సమావేశంలో మధుసూదన్రెడ్డి, కేవీ మురళీకృష్ణ, వి.హర్షవర్ధన్, ఏవీఆర్ మోహన్రావు, టి.భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సమాధానం చెప్పాలి
నెల్లూరురూరల్: చైనాకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అనుచరులు కాదా? అని వైఎస్సార్సీపీ నేత, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ప్రశ్నించారు. వేమిరెడ్డి అనుచరుడిగా చెప్పబడుతున్న డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ ఆ దేశంలో మేయర్ హోదాలో స్వాగతాలు అందుకున్నారనే అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లూరులో రాజన్న భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేమిరెడ్డి, ఆయన అనుచరులపై అనిల్ అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు. ఆధారాలతో కొన్ని అంశాలను మాత్రమే ప్రజల ముందుంచారని తెలిపారు. మైనింగ్ వ్యవహారంలో ‘డౌవ్’ అనే చైనా వ్యక్తి స్థానిక వ్యాపారులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై వేమిరెడ్డి వర్గం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనిల్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కొంతమంది వీపీఆర్ అనుచరులు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డిని విమర్శించారని, తాము కూడా అంతకంటే ఘాటుగా మాట్లాడగలమని, అయితే తమకు సంస్కారం ఉందని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్నందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ విధంగా మాట్లాడుతున్నారని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. అనిల్కు మున్సిపల్ ఎన్నికలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే మేయర్ అభ్యర్థి విషయంలో మ్యాచ్ఫిక్సింగ్ చేసుకున్నారనే అనుమానాలకు తావిచ్చేలా కొందరు ధైర్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 2024 నవంబర్లో గిరిజన మహిళ మేయర్గా ఉన్న సమయంలో డిప్యూటీ మేయర్గా ఉన్న వ్యక్తి చైనాలో మేయర్గా చలామణి అయ్యారనే ఆరోపణలపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరారు. ఇది గిరిజనులు, దళితుల పట్ల ఉన్న వివక్షకు ఉదాహరణగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చైనాకు చెందిన డౌవ్తో ఎలాంటి సంబంధం లేదని, ఆ దేశంలో తప్పుడు హోదాలో తిరిగిన ఇద్దరు వ్యక్తులు తన అనుచరులు కాదని వీపీఆర్ బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో సామాజిక న్యాయం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని మేయర్గా, బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని మంత్రిగా, గిరిజన మహిళను మేయర్గా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని నాగార్జున పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన మహిళ మేయర్ పట్ల వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని, నెల్లూరు ప్రజలు ఈ పరిణామాలను గమనించారన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కేవలం జెండాలు మోయడానికేనా? పదవులు అనుభవించేందుకు పనికిరారా? అని మంత్రి నారాయణను ఉద్దేశించి ప్రశ్నించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు నీలి రాఘవరావు, వేనాటి శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


