ఆదిలాబాద్రూరల్: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాన్షీరామ్ ఆశయ సాధనకు అంద రూ కృషి చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ జి ల్లా కోఆర్డినేటర్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అ ధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్ మహరాజ్ అన్నారు. కాన్షీరామ్ జయంతిని జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఆదివారం ఘ నంగా నిర్వహించారు. కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బహుజ నుల కోసం కాన్షీరామ్ అందించిన సేవలను కొనియాడారు. ఇందులో నాయకులు అన్నెల ఆడేల్లు, శ్రీనివాస్, వెంకటేశ్, దర్శనాల సుష్మ, నవీన్, రవి, సాయికుమార్, శ్రీనివాస్, అఖిల్, పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


