breaking news
Adilabad District Latest News
-
సులభ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నస్పూర్: సింగరేణిలో పనిచేస్తున్న సులభ్ కార్మికు ల సమస్యలు వెంటనే పరష్కరించాలని సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మానందం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన సులభ్ కార్మికులతో కలిసి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రతీనెల 10 లోపు వేతనాలు చెల్లించ డం లేదన్నారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్, గత సంవత్సర కాలంగా పెండింగ్ ఉన్న డీఏ విడుదల చేయాలన్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని కోరారు. సులభ్ కాంప్లెక్స్లు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటికి మరమ్మతులు చేపట్టాలన్నారు.జిల్లా నాయకులు శంకరి, మంతెన లక్ష్మయ్య, నేదురి, నర్సయ్య, లక్ష్మయ్య, రాజేందర్, పరుశరాములు, విజయ, రౌతు లక్ష్మి, జ్యోతి, సుగుణ, తదితరులు పాల్గొన్నారు. -
ఆల్ ది బెస్ట్
ఆదిలాబాద్టౌన్: నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు షురూ కానున్నాయి. ఏప్రిల్ 13 వరకు కొ నసాగనున్నాయి. విద్యా శాఖాధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నా రు. ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ మాత్రం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఉంటాయి. అయితే ఈసారి పరీక్షలు దాదాపు నెల పాటు కొనసాగనున్నాయి. ఒక్కో పరీక్షకు మూడు నుంచి నాలుగు రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ సమయంలో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే అవకాశం ఉంది. మరో వైపు మాస్ కాపీయింగ్ జరగకుండా నిఘా కట్టుదిట్టం చేశారు. ఆయా కేంద్రాల్లోని చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి సమక్షంలో పేపర్ తెరడం, సీల్ వేయ డం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలు.. పరీక్షలకు మొత్తం 10,888 మంది విద్యార్థులు హా జరుకానున్నారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డి పార్ట్మెంటల్ అధికారులు, 13 కస్టోడియన్లు, ము గ్గురు అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు, 545 మంది ఇన్విజిలెటర్లను నియమించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఎంఈవో, సీనియర్ హెచ్ఎం, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. కేంద్రాల్లో సౌకర్యాలు.. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, తాగునీరు, వైద్య సేవలతో పాటు పూర్తిస్థాయిలో బెంచీలను ఏర్పా టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంటున్నారు. ఆయా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు. విద్యార్థులకు ఏ వైనా ఇబ్బందులు తలెత్తితే జిల్లా కేంద్రంలోని డీఈ వో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 90329 74127 నంబర్పై కూడా సంప్రదించవచ్చు. -
విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టాలి
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్నారపు రాజేశ్వర్ డి మాండ్ చేశారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఏటా పదుల సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారని, దీనికి కారణగాలను యూనివర్సిటీ అధికారులు వెల్లడించాలన్నారు. యూనివర్సిటీలో అడ్మిషన్స్ జరిగిన విధానంపై రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి విడుదలైన నిధుల ఖర్చులు, అన్ని టెండర్ ప్రక్రియ చెల్లించిన బిల్లులపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు. నాయకులు మనోజ్,అక్షయ్, రాకేశ్, గౌతం, ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
గాడితప్పిన సమయ ‘పాలన’
కై లాస్నగర్(బేల): బేల మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన పూర్తిగా గాడితప్పింది. సంబంఽధిత అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తమ ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఎంపీడీవో, తహసీల్దార్, వ్యవసాయాధికారి కార్యాలయాలను సంప్రదించగా ఉద్యోగులెవరూ లేక ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రతినిత్యం ఇదే పరిస్థితి. వివిధ పనుల నిమిత్తం ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుండటం ఉద్యోగులు, సిబ్బంది నిర్వాకానికి నిదర్శనంగా నిలుస్తోంది. మధ్యాహ్నం 12.30 తర్వాత తీరిగ్గా హాజరయ్యే ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకల్లా తిరిగి ఇంటిముఖం పడుతారని అక్కడి సిబ్బంది చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. ఎంపీడీవో కార్యాలయంలో ఖాళీగా పర్యవేక్షకుడి కుర్చీ ఖాళీగా ఉన్న నాయబ్ తహసీల్దార్ సీటు -
● జిల్లాలో మూడు ఎంపిక ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి షురూ ● ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక ● జేఈఈ, నీట్ తదితర పరీక్షలకు ప్రత్యేక శిక్షణ
‘ఎక్స్లెన్స్’ కేజీబీవీలుఆదిలాబాద్టౌన్: కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో ఇక ఎక్స్లెన్స్ చదువు అందనుంది. కార్పొరేట్, ప్రైవేట్కు ధీటుగా నాణ్యమైన బోధన అందించాలని నిర్ణయించింది. యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్కు సంబంధించి విద్యార్థులకు జేఈఈ, నీట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రాత పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది. చాలామంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా దూర ప్రాంతాల్లో శిక్షణకు వెళ్లకుండా ఇంజినీరింగ్, వైద్య, లా కోర్సుల్లో చేరలేకపోతున్నారు. ఇంటి వద్దనే సిద్ధమవుతూ అవగాహన లేక వాటిలో రాణించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం జిల్లాలో మూడు కేజీబీవీలను ఎంపిక చేసింది. ఇందులో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఆయా ప్రవేశ పరీక్షలకు నిపుణులతో శిక్షణ అందించనున్నారు. మూడు కేజీబీవీల్లో.. జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. 6 నుంచి ఇంటర్ వరకు ఇక్కడ విద్యాబోధన ఉంటుంది. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో మొత్తం 4,620 మంది విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరంతా పేద విద్యార్థులే. ప్రభుత్వం ఈ ఏడాది యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్ కింద మూడు సీవోఈలను ఎంపిక చేసింది. ఆదిలాబాద్అర్బన్ కేజీబీవీలో ఐఐటీ, జేఈఈకి సంబంధించి శిక్షణ కల్పించనున్నారు. జైనథ్ కేజీబీవీలో నీట్తో పాటు ఎప్సెట్, అగ్రికల్చర్ తదితర కోర్సులకు సంబంధించి శిక్షణ ఉంటుంది. తలమడుగు కేజీబీవీలో కామన్ లా ఎంట్రెన్స్ టెస్ట్కు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఈ పాఠశాలల్లో గ్రంథాలయంతో పాటు ఎన్సీసీ, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. వీటికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. అవసరమైన విషయ నిపుణులను సైతం నియమించింది. జూన్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందించనున్నారు. ఏప్రిల్ 15 వరకు గడువు.. ఈ మూడు కేజీబీవీల్లో వచ్చే ఏడాది ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఈనెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు గడు వు ఉంది. మే 5న పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సె స్సీ పూర్తి చేసిన వారు అర్హులు. ఎంపికై న విద్యార్థులు జేఈఈ, నీట్, ఎప్సెట్, లాసెట్ తదితర ఎంట్రెన్స్ కోచింగ్లతో పాటు సీఏకు సంబంధించి కూడా శిక్షణ కల్పించనున్నారు. -
ఆదివాసీలు ఐక్యత చాటాలి
ఆదిలాబాద్రూరల్: ఈనెల 15న జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న హీరా సుకా జయంతి వేడుకలకు ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు భారీగా తరలి రావాలని మాజీ ఎంపీ, రాజ్గోండ్ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావ్ కోరారు. ఆదివాసీ పర్ధాన్ కులస్తులు శుక్రవారం ఆయనకు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీలంతా ఐక్యంగా ఉంటూ సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మెస్రం శంకర్, గేడం మాధవ్, కుర్సేంగే తానా జీ, సిడాం రాంకిషన్, యాదవ్రావ్, మనోహర్, శివ, శేషారావ్, పురుషోత్తం, దత్తు, భాస్కర్, నిరంజన్, దిలీప్, ఉత్తం, తదితరులున్నారు. -
ప్లాంటు పనులు వేగవంతం చేయాలి
చెన్నూర్: సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన 800 మెగావాట్ల ప్లాంట్ పనులు వేగవంతం చేయాలని సింగరేణి జీఎం (సివిల్) వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జీఎం నరసింహారావుతో కలిసి శుక్రవారం జైపూర్లోని ఎస్టీపీపీని సందర్శించారు. ప్లాంట్లో భాగంగా నిర్మించబోయే కూలింగ్ టవర్స్ పనులను పర్యవేక్షించారు. ప నుల వివరాలను బీహెచ్ఈఎల్ డైరెక్టర్ మధుకిరణ్, పీఎంపీఎల్, కేపీసీ అధికారులు వివరించారు. ప్లాంటు ప్రస్తుత స్థితిగతులను ఎస్ఈ సివిల్ బానోతు రాము డయాగ్రామ్ ద్వారా ఆయనకు తెలియజేశారు. ప్లాంట్ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కిరణ్బాబు, రాము ఉన్నారు. యువకుడి అదృశ్యం మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన చిట్టిమల్ల అనిల్(26) అదృశ్యమయ్యారు. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. రాపల్లికి చెందిన అనిల్ వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 10వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. అతని ఆచూకీపై బంధువులు, స్నేహితులతో ఆరా తీసిన దొరకలేదు. అనిల్ సోదరుడు దిలీప్ ఫిర్యాదు మేరకు శుక్రవారం మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒకరి బైండోవర్ దహెగాం: మండలంలోని కర్జి గ్రామానికి చెందిన కాటెల కమలాకర్ను శుక్రవారం తహసీల్దార్ మునవార్ షరీఫ్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. గ్రామంలో మద్యం తాగి గొడవలకు పాల్పడుతున్నందున సత్ప్రవర్తన కోసం బైండోవర్ చేశామని పేర్కొన్నారు. మరోసారి గొడవలకు పాల్పడితే రూ.లక్ష జరిమానాతోపాటు జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. -
జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
చెన్నూర్: రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన ధారావత్ ధనుష్ ప్రతిభ కనబర్చాడు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఎన్9 బ్యాడ్మింటన్ అకాడమీలో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన సీఎం కప్–2025 బ్యాడ్మింటన్ పోటీల్లో రెండు పతకాలు సాధించాడు. ధనుష్..సింగరేణి ఎస్టీపీపీలో డీజీఎం (ఈఅండ్ఎం) ధారావత్ దంపతుల కుమారు డు. ఏప్రిల్ 16 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నాడు. అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా డిప్యూటీ స్పోర్ట్స్ ఆఫీసర్ యాకుబ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సుధాకర్లు అతన్ని అభినందించారు. -
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దుచేయాలి
రెబ్బెన: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టీయూ ఏరియా అధ్యక్షుడు గోలేటి శ్రీనివాస్, కార్యదర్శి అరికెళ్ల పోచం అన్నారు. ఐఎప్టీయూ ఆధ్వర్యంలో ఈనెల 16న కలెక్టరేట్ల ముట్టడి, 23న హైదరాబాద్ రీజినల్ లేబర్ కమిషనర్ కార్యాల యం ఎదుట నిర్వహించే ధర్నా పోస్టర్లను శుక్రవా రం గోలేటిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను సింగరేణిలో అమలు చేయొద్దన్నా రు. లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని గెజిట్ విడుదల చేసిందన్నారు. వీటిని రద్దు చేసేవరకు దేశవ్యాప్తంగా కార్మికవర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు భీమేశ్, చందు, వెంకటేశ్, చంద్రయ్య, కుమార్, పోసుబాయి, తార, నాగలక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు
నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలభైంసా: బాసర ట్రిపుల్ఐటీలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను శుక్రవారం వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పూర్తిచేసిన అర్హులైన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్ని కల్పించేందుకు ఈ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని తెలిపారు. పదిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రతీ సబ్జెక్ట్ మార్కులకు అదనంగా డిప్రైవేషన్ స్కోర్ను జోడించి పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను టీజీ ఆన్లైన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు లేదా https:// www. rgukt. ac.in/ÌZలో ఆన్లైన్లో సమర్పించవచ్చని అధికా రులు తెలిపారు. ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శ న్, అడ్మిషన్ కన్వీనర్ శీలం శేఖర్, కోకన్వీనర్ బండి హరికృష్ణ, అసోసియేట్ డీన్స్ డా. మహేశ్, డా. విఠ ల్, డా. దేవరాజ్, సునీత తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
ఆదిలాబాద్టౌన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇవి గత నెల 25న ప్రారంభమైన విషయం తెలిసిందే. శుక్రవారం ద్వితీయ సంవత్సరం పరీక్షతో ముగిశాయి. ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పడ్డ విద్యార్థులు ఆటాపాటలతో గడపనున్నారు. చివరి రోజు స్నేహితుల ఫోన్ నంబర్లు తీసుకుంటూ టచ్లో ఉండాలంటూ పరీక్ష కేంద్రం నుంచి వెనుదిరిగారు. జిల్లా కేంద్రంలో వసతిగృహాలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్లో ఉంటూ చదివిన విద్యార్థులను తీసుకోవడానికి వారి తల్లిదండ్రులు, కుటుంబీకులు చేరుకున్నారు. విద్యార్థులు సొంత గ్రామాలకు చేరుకోవడానికి బస్టాండ్కు తరలివెళ్లడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. ఈనెల 15 నుంచి ఇంటర్మీడియెట్ మూల్యాంకనం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఆర్ఐవో జాదవ్ గణేశ్కుమార్ తెలి పారు. మొదటగా తెలుగు, హిందీ, సివిక్స్, గణితం, ఇంగ్లీష్ జవాబు పత్రాల మూల్యాంకనం ఉంటుందని వివరించారు. జిల్లావ్యాప్తంగా ఈ సారి ఒక్క విద్యార్థి కూడా డిబార్ కా లేదని పేర్కొన్నారు. పరీక్ష చివరి రోజు కావడంతో ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల లెక్చరర్లు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద కరపత్రాలు పంచుతూ ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరాలని, దోస్త్ యాప్లో డిగ్రీ కళా శాలలను ఎంచుకోవాలని సూచించారు. మౌలిక వసతులతోపాటు అనుభవజ్ఞులైన లెక్చరర్లు ఉన్నారని వివరించా రు. ఈ ప్రచార కార్యక్రమంలో లెక్చరర్లు సంతోష్ కుమార్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
రామకృష్ణాపూర్ ఓసీపీ–2 విస్తరణపై సమీక్ష
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ ఓపెన్కాస్ట్ ఫేజ్–2 గని అంశంపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణతో సమీక్షించారు. గద్దెరాగిడిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి అనంతరం ఓసీ ఫేజ్–2పై జీఎంతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓసీ విస్తరణలో భాగంగా ఫేజ్–2 మైన్కు అనుమతులు లభించాయని, అయితే గనికి అవసరమైన భూమికి ఇంకా ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. గనికి కేటాయించాల్సిన భూమి నాన్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నప్పటికీ కొందరు అధికారులు దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా పేర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికే క్లియరెన్స్ కోసం డీఎఫ్ఓ సహా సంబంధిత అధికారులతో మాట్లాడి అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కొత్త గని అందుబాటులోకి వస్తే సుమారు 18 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తి కొనసాగడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గనుల కోసం నిర్వహించిన వేలంలో పాల్గొనకుండా అడ్డుకుందని విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి, పల్లెరాజు, గాండ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
చెక్బౌన్స్ కేసులో ఇద్దరికి జైలు
మంచిర్యాలక్రైం: చెక్బౌన్స్ కేసులో ఇద్దరికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ మంచిర్యాల జిల్లా జ్యూడిషీయల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్, జూనియర్ సివిల్ జడ్జి కె.నిరోషా శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మందమర్రి మండలం క్యాతన్పల్లికి చెందిన అశోక్కుమార్ లడ్డా వద్ద ఆర్థిక అవసరాల నిమిత్తం మంచిర్యాల సీసీసీ కార్నర్కు చెందిన నేరెళ్ల రమేశ్ 2018లో రూ.5.77 లక్షలు, సీసీసీకి చెందిన నేరెళ్ల సాయికృష్ణ రూ.4.83 లక్షలను అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు వేర్వేరుగా 2018లో కోర్టును ఆశ్రయించాడు. జడ్జి.. ఈ కేసును విచారిస్తున్న సమయంలో అప్పు తిరిగి చెల్లించడంతోపాటు నేరెళ్ల రమేశ్కు సంవత్సర కాలం పాటు జైలుశిక్ష, నేరెళ్ల సాయికృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. క్యాతనపల్లి అల్లర్ల కేసులో ఐదుగురికి బెయిల్ రామకష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఐదుగురికి శుక్రవారం మంచిర్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామిడికుమార్, మేడిపెల్లి సంపత్, బండారి సూరిబాబు, కుర్మ దినేష్, ముస్తఫాలను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా జైలుకు రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంతో రాత్రి విడుదలయ్యారు. ‘అక్రమ కేసులతో వేధిస్తున్నారు’ మంచిర్యాలటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనపై అక్రమ కేసులను పెట్టి వేధిస్తున్నారని మంచిర్యాలకు చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోగుల రవీందర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గజ్వేల్లోని ఎర్రవల్లి ఫాంహౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. మంచిర్యాలలో తనపై ఇప్పటికే 30కి పైగా పోలీసులు కేసులను నమోదు చేశారని, ఇంకా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బీ ఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భయాందోళన చెందా ల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని కేసీఆర్ పేర్కొన్నారని రవీందర్రెడ్డి తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన నలుగురి అరెస్ట్ ఆదిలాబాద్టౌన్: బెదిరింపులకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పోలీసుస్టేషన్లో శుక్రవారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రాంనగర్కు చెందిన సలాం వరుణ్, దుర్గానగర్కు చెందిన వెట్టి మనోజ్, ఇంద్రవెల్లి మండలానికి చెందిన కుమ్రం ప్రభాత్రావు, బజార్హత్నూర్కు చెందిన దుర్వ సుభాష్ ఆర్కే కోఆపరేటీవ్ సొసైటీ ద్వారా డబ్బులు తీసుకున్నారు. తిరిగి చెల్లించాలని సొసైటీ చైర్మన్ కొండూర్ రాకేందర్ అడిగితే తుడుందెబ్బ పేరుతో బెదిరింపులకు దిగారు. సొసైటీ ద్వారా డబ్బులు తీసుకున్న ప్రభాత్రావు, దుర్వ సుభాష్లు తిరిగి ఇవ్వకుండా వెట్టి మనోజ్, సలాం వరుణ్లు ఆదివాసీ నాయకులమని చెబుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. రాకేందర్ నుంచి రెండు, మూడు విడతల్లో ఒక్కోసారి రూ.20వేల చొప్పున డబ్బులు వసూళ్లు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. సెక్యూరిటీగార్డుపై దాడిచేసిన ఇద్దరిపై కేసు ఆదిలాబాద్టౌన్: వసుంధర షాపింగ్ మాల్ సెక్యూరిటీ గా ర్డుపై దాడిచేసిన ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సు నీల్కుమార్ తెలిపా రు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన నిందితులు షేక్ సమీర్, సాబిల్లు గురువారం పార్కింగ్ విషయంలో గొడవపడి సెక్యూరిటీ గార్డు రాథోడ్ రవిపై దాడికి దిగారు. బాధితుడు ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. వారి బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
నిధులన్నీ ట్రాక్టర్ కిస్తీలకే..
నేను ఇటీవలే సర్పంచ్గా ఎన్నికయ్యా. నిధులు వస్తే గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నిధులను బ్యాంకు అధికారులు ట్రాక్టర్ కిస్తీల కింద జమ కట్టుకున్నారు. ఏం మిగలకపోవడంతో ప్రస్తుతం జీపీలో అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే మరిన్ని నిధులు విడుదల చేయాలి. – రూప్చంద్, సర్పంచ్, బాబెరతండా, బోథ్ మండలం త్వరలోనే మరిన్ని నిధులు..ఇటీవల పంచాయతీ లకు కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. రెండేళ్లుగా ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఆ నిధుల నుంచి చెల్లించాల్సి వచ్చింది. చిన్న పంచాయతీలకు కొంత ఇబ్బంది ఉన్న పరిస్థితి వాస్తవమే. జీపీలకు త్వరలోనే మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. – రమేశ్, డీపీవో -
టెర్మినల్ బెన్ఫిట్స్ వెంటనే అందించాలి
నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలో పదవీ విరమణ పొందిన ప్రతీ ఉద్యోగికి టెర్మినల్ బెన్ఫిట్స్ వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన జీఎం కార్యాలయంలో శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్కాస్టుల మేనేజర్లు, సంక్షేమ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గనుల వారీగా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు వివరాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రాట్యూటీ, సీఎంపీఎఫ్, పెన్షన్ పెండింగ్ వివరాలు సేకరించారు. ఒక్కో గనిలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఏ ఏ కారణాలతో పెండింగ్లో ఉన్నాయో తెలుసుకుని త్వరగతిన పూర్తిచేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అర్హత లేనివారు, ఉద్యోగం అవసరం లేని వారికి ఎల్ఎస్పీ, ఎంఎంసీ పొందే వెసులుబాటు కల్పించాలన్నారు. అదేవిధంగా ఉద్యోగి అతని కుటుంబ సభ్యుల వివరాలు ఆన్లైన్లో నమోదు ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీజీఎం పర్సనల్ ఎస్.అనిల్కుమార్, డీవైపీఎంలు రాజేశ్, కిరణ్, సీనియర్ పీఓలు సురేందర్, మురళీ, ప్రశాంత్, వివిధ గనుల మేనేజర్లు, గనుల సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘డ్రగ్స్ మహమ్మారిని అరికడుదాం’
మంచిర్యాలఅర్బన్: సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల డీఈవో యాదయ్య అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా సైన్స్ కేంద్రంలో 18 మండలాల నుంచి ఎంపిక చేసిన 20 పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులకు డ్రగ్స్ అరికట్టడం, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ప్రహరీ క్లబ్లకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైకియాట్రిస్ట్ వైద్యుడు రామ్నాయక్, పోలీస్ విభాగం నుంచి ఇన్స్పెక్టర్ మధుసూదన్, రిసోర్స్పర్సన్లు కృష్ణారెడ్డి, ముజీర్, సత్యనారాయణమూర్తి, సెక్టోరల్ అధికారి చౌదరి, సైన్స్ అధికారి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
వంటగ్యాస్ పక్కదారి పట్టిస్తే చర్యలు
కై లాస్నగర్: జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని, ఎక్కడైనా పక్కదారి పట్టిస్తే కఠిన చ ర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ఎల్పీజీ సరఫరా నిలిచిన వైనాన్ని వివరిస్తూ ‘నో స్టాక్’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీనీ శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశా రు. స్టాక్, ఆన్లైన్ బుకింగ్ వివరాలను స్వయంగా పరిశీలించారు. సిలిండర్ల సరఫరా, డెలివరీ వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విని యోగదారులతో మాట్లాడి బుకింగ్, సరఫరా వంటి అంశాలపై ఆరా తీఽశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సిలిండర్ల కొరతపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు. జిల్లాలో వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వెంటనే వినియోగదారులకు సిలిండర్లు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి సిలిండర్లను డోర్ డెలివరీ చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. పౌరసరఫరా, రెవెన్యూ పోలీస్ శాఖలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా 1800–425–1939 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఆ యన వెంట అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఎస్వో నందిని, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు. -
బాసరలో అంతఃప్రజ్ఞ 2కే–26
బాసర: దేశంలోనే అతిపెద్ద గ్రామీణ సాంకేతిక ఉత్సవంగా గుర్తింపు పొందిన అంతఃప్రజ్ఞ 2కే–26 బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టె క్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ను గేమింగ్ అరేనాగా మార్చి, ఏఆర్/వీఆర్ సిమ్యులేషన్లు, డ్రోన్ ఆధారిత గేమ్లు, వీడియో గేమింగ్ సెటప్లు ఏర్పాటు చేశారు. ఇవి అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సృజనాత్మక స్టాళ్లు క్యాంపస్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినూత్న ఆవిష్కరణలు, టెక్నాలజీ ప్రదర్శనలు, వినోదాత్మక కార్యక్రమాలతో ప్రాంగణం సందడిగా మారింది. వీసీ, ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ మురళీదర్శన్, ఫ్యాకల్టీ కన్వీనర్ జె.స్వప్నిల్, కాకతీయ శాండ్ బాక్స్ ప్రతినిధి సత్యం కె.చౌబే, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
జీవనశైలిలో మార్పుతోనే కిడ్నీలకు రక్షణ
ఆదిలాబాద్టౌన్: ప్రస్తుత తరుణంలో జీవనశైలిలో మార్పుతోనే కిడ్నీలను రక్షించుకోవచ్చని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రిమ్స్ డయాలసిస్ కేంద్రంలో గురువారం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడంలో మూత్రపిండాల పాత్ర ఎంతో కీలకమన్నారు. వ్యర్థాలు నిండిపోయి శరీరంలో ఉంటే అవి ప్రాణాపాయానికి దారి తీస్తాయన్నారు. శరీరంలో గుండె, మెదడు, కాలేయంతో పాటు కిడ్నీ కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రస్తుతం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ముఖ్యంగా మధుమేహం, బీపీతో బాధపడుతున్న వారిలో కిడ్నీలు చెడిపోతున్నాయన్నారు. కలుషిత నీరు తాగడం ద్వారా, పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు తానాజీ జాడే, డాక్టర్ చందు, నెఫ్రాలజిస్ట్ కొండలరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ విఠల్, డయాలసిస్ ఇన్చార్జి ప్రేమ్దాస్, తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా ఉంటా
నేరడిగొండ: అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని బొరిగామలో ప్రమాదవశాత్తుగా జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ఘటనలో నాలుగు ఇళ్లు, మూడు పశువుల పాకలు కాలిపోవడం బాధాకరమన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. ఇల్లు పూర్తిగా దగ్ధమైన జాదవ్ ప్రేమ్సింగ్కు వ్యక్తిగతంగా రూ.30వేలు తక్షణ సహాయంగా అందజేశారు. బాధితులకు నిత్యావసర సరుకులను అందించారు. -
● జీపీలకు విడుదలైన నిధులు ● పాత పనులకు చెల్లింపులపై పలుచోట్ల వివాదాలు ● మొత్తం చెల్లిస్తే పనులు చేయడమెలా? అంటున్న కొత్త సర్పంచులు
బోథ్: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో బిల్లుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 473 గ్రామ పంచాయతీలు ఉండగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.20.31 కోట్ల నిధులు మంజూ రు చేసింది. అయితే గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుంటుందని భావించారు. అయితే ని ధులు విడుదలైన వెంటనే పాత పనులకు సంబంధించిన బిల్లుల అంశం తెరపైకి వచ్చింది. దీంతో అ నేక గ్రామ పంచాయతీల్లో వివాదం నెలకొంటోంది. పాత బిల్లులు చెల్లించాలి పాత సర్పంచుల పదవీకాలం 2024, ఫిబ్రవరి 1న ముగిసింది. అప్పటికే సర్పంచులు గ్రామాల్లో పలు పనులను సొంత ఖర్చులతో పూర్తి చేశారు. సర్పంచుల పదవీకాలం ముగిసిన అనంతరం ప్రభుత్వం ప్రత్యేకాఽధికారులతో ప్రత్యేక పాలన అమలు చేసింది. ఆయా గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు పంచాయతీలను అంతగా పట్టించుకోలేదు. దీంతో జీపీల్లో పనుల బాధ్యత కార్యదర్శులపై పడింది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కార్యదర్శులు తమ సొంత డబ్బులను వెచ్చించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీలు, శానిటేషన్, తాగునీటి వంటి పనులు చేపట్టారు. కేంద్రం నుంచి నిధులు రావడంతో తా ము ఖర్చు చేసిన బిల్లులు ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తం బిల్లులు ఇవ్వలేం.. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే విడుదలైన నిధులను పూర్తిగా పాత బిల్లులకే చెల్లిస్తే గ్రామాల్లో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేపట్టాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం వచ్చిన నిధుల్లో కొంత బిల్లులు చెల్లిస్తామని, రాబోయే నిధుల్లో మరికొంత చెల్లిస్తామని కొత్త సర్పంచులు పేర్కొంటున్నారు. మరికొన్ని పంచాయతీల్లో ముగ్గురి మధ్య సయోధ్య కుదరుతోంది. ఇక్కడ బిల్లుల విషయంలో ఇబ్బందులు తలెత్తడం లేదు. కాగా కొన్ని గ్రామాల్లో ఈ విషయంపై పాత, కొత్త సర్పంచుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. పాత పనుల బిల్లులు చెల్లించాల్సిందేనని ఒక వర్గం పట్టుబడుతుండగా, ముందు ప్రస్తుత అవసరాలపై ఖర్చు చేయాలని మరో వర్గం వాదిస్తోంది. దీంతో గ్రామపంచాయతీల్లో బిల్లుల వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. రికార్డు ఉంటేనే చెల్లింపు.. గ్రామ పంచాయతీల్లో గతంలో పనిచేసినట్లు ఎంబీ రికార్డు ఉంటే బిల్లుల చెల్లింపులు సులభంగా జరుతున్నాయి. పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాల్లోని ఇంజినీర్లు పనిచేసినట్లు ఎంబీలు రికార్డు చేశారు. వీటికి బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే గ్రామాల్లో రికార్డు లేకుండా, వ్యాపారుల వద్ద నుంచి తెచ్చిన బిల్లుల విషయంలో కొత్త సర్పంచులు పేచీ పెడుతున్నారు. జిల్లాలో అనేక చోట్ల ఇలాంటి బిల్లుల పంచాయతీ నడుస్తోంది. -
సర్పంచులు, కౌన్సిలర్ల చేతుల్లోనే జిల్లా అభివృద్ధి
కై లాస్నగర్: గ్రామం, వార్డుల అభివృద్ధితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని, ఆదిశగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపైనే ఉందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం స్థానిక రెవెన్యూ గార్డెన్లో జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌ న్సిలర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 99 రోజుల పాటు అమలు చేయనున్న కార్యక్రమాల కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజంటేష న్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక కార్యాచరణతో గ్రామాలు, వార్డుల రూపురేఖలను మార్చేలా విజయవంతం చేయాలని కోరారు. ఏప్రిల్ 2న అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, ప్రతీ వార్డులో వార్డు సభ నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ పనులపై సమీక్షించాలని సూ చించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అధికారులతో ఘర్షణ వాతావరణానికి వెళ్లకుండా సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం రైతులకు ఉచితంగా అందించేందుకు రూ.500 విలువగల ఐదు రకాల కూ రగాయల విత్తనాల కిట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, జెడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, అదనపు ఎస్పీలు సురేందర్ రావు, మౌనిక, మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, తదితరులు పాల్గొన్నారు. జనగణన పారదర్శకంగా నిర్వహించాలికై లాస్నగర్: హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ ప్రక్రి య పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జనగణన–2027 లో భాగంగా గురువారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, కలెక్టరేట్ పర్యవేక్షకురా లు రాథోడ్ పంచపూల, తదితరులు పాల్గొన్నారు. ‘బడికి సెలవులొచ్చాయి’ ఆవిష్కరణ సాత్నాల: భోరజ్ మండలంలోని మండగడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు జైకర్ రచించి గానం చేసిన ‘బడికి సెలవులొచ్చాయి’ సీడీని కలెక్టర్ రాజర్షి షా గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. విద్యార్థుల కోసం పాటను రచించి, గాత్రం చేసిన జైకార్ను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశికళ, అభవ్ కుమార్, నారాయణ, స్వాతి, అనిత, మాళవిక, అశోక్, నాందేవ్, గణేశ్, చింతామణి, శైలేందర్, తదితరులు పాల్గొన్నారు.యువ ఆవిష్కర్తలకు ప్రోత్సాహంకై లాస్నగర్: జిల్లాలోని యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 14న కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలా బాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన యువ త, విద్యార్థులు, ఆవిష్కర్తలు తమ వినూత్న ఆలోచనలను నిపుణుల ముందుంచి మార్గదర్శకత్వం పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వివరాలకు 91006 78543 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
మౌలిక వసతుల కల్పనపై దృష్టి
సాత్నాల: విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. భోరజ్ మండలం బాలాపూర్లో ఈజీఎస్ నిధులు రూ.8 లక్షలతో నిర్మించనున్న కిచెన్ షెడ్ పనులకు గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైనథ్ మండలం బెల్గాం గ్రామ సమీపంలో దాదాపు రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పాఠశాల ద్వారా సుమారు 3,500 మంది పేద విద్యార్థులకు ఉచితం విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావత్ అచ్యుత్, జక్కుల వేణు, భగవాన్లు, రాజశేఖర్, శంకర్, విట్టల్, రాజు, తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఆదిలాబాద్టౌన్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు గురువా రం బీఆర్డీయూ అనుబంధ తెలంగాణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ పద్మ మాట్లాడుతూ రెండు నెలలుగా వేతనాలు చె ల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎ దుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.18వేల వేతనాలు చెల్లించాలని, లెప్రసీ, టీ బీ కేసులకు సంబంధించిన బకాయిలు కూడా విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల ఆశ వర్కర్లు పద్మ, జ్యోతి, ఈశ్వరి, ఇందిర, ప్ర త్యూష, గోదావరి, రేఖ పాల్గొన్నారు. -
బోగస్ కార్డులకు చెక్
కై లాస్నగర్: ఓ వైపు అర్హులైన నిరుపేదలకు కొత్తగా రేషన్కార్డులు జారీ చేస్తున్న ప్రభుత్వం మరోవైపు అనర్హులను ఏరివేసే దిశగానూ చర్యలు చేపడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఈ ప్రక్రియ నిర్వహిస్తోంది. అనుమానితంగా గుర్తించిన 4,182 కార్డులతో కూడిన జాబితాను జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి పంపించింది. వాటిపై క్షేత్రస్థాయిలో విచారించి అనర్హులని నిర్ధారణ అయితే ఆ కార్డులు రద్దు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మండలాల వారీగా రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నారు. ఈ నిర్ణయంతో అక్రమకార్డుదారుల్లో వణుకు మొదలైంది. 360 డిగ్రీస్ సాఫ్ట్వేర్ ఆధారంగా .. రేషన్కార్డు కలిగిన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటికీ రేషన్కార్డునే ప్రమాణికంగా తీసుకుంటుంది. దీంతో ఈ కార్డుకు డిమాండ్ ఏర్పడింది. అయితే అర్హతలేని వారు అక్రమంగా కార్డులు పొందినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రవాణా, ఆదాయ పన్ను శాఖల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా 360 డిగ్రీస్ సాఫ్ట్వేర్ సాయంతో అనర్హులను గుర్తించింది. వీరితో పాటు గడిచిన మూడు నెలలుగా బియ్యం పొందనటువంటి కార్డుదారుల వివరాలను సేకరిస్తోంది. ఇందులో ప్రభుత్వ కొలువులు సాధించిన వారు, చనిపోయిన వారు, రాష్ట్రంతో పాటు పొరుగురాష్ట్రంలోనూ కొందరికి కార్డులున్నట్లుగా గుర్తించింది. ఆయా కార్డుల్లోని సభ్యులను అనుమానితులుగా భావించి విచారణకు ఆదేశించింది. జిల్లాకు అందిన కార్డుదారుల జాబితా ఆధారంగా రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. దీంతో సిబ్బందికి అక్రమంగా డబ్బులిచ్చి కార్డులు పొందిన వారిలో ఆందోళన మొదలైంది. కార్డు పోకుండా ఉండేందుకు మళ్లీ ముడుపులు ముట్టజెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నుంచి అందిన అనుమానిత అనర్హుల కార్డుల వివరాలు (మండలాల వారీగా) మండలం అనుమానిత కార్డులు ఆదిలాబాద్ అర్బన్ 1,351 ఆదిలాబాద్ రూరల్ 268 మావల 186 బజార్హత్నూర్ 79 బోథ్ 125 ఇచ్చోడ 210 నేరడిగొండ 106 సొనాల 55 బేల 77 భోరజ్ 94 జైనథ్ 140 సాత్నాల 58 గుడిహత్నూర్ 111 ఇంద్రవెల్లి 266 సిరికొండ 199 ఉట్నూర్ 440 భీంపూర్ 47 తలమడుగు 116 తాంసి 80 గాదిగూడ 52 నార్నూర్ 122విచారణ కొనసాగుతుంది.. ప్రభుత్వం నుంచి అందిన అనుమానిత కార్డుదారుల వివరాలను మండలాల వారీగా సంబంధిత తహసీల్దార్లకు పంపించాం. క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ జరుగుతుంది. అనర్హులని తేలిన వారి పేర్లను కార్డుల్లో నుంచి తొలగిస్తాం. రేషన్ పంపిణీని నిలిపివేస్తాం. – నందిని, ఇన్చార్జి డీఎస్వో -
సమాజంలో మహిళల పాత్ర కీలకం
ఆదిలాబాద్టౌన్: సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. రిమ్స్ నర్సింగ్ కళాశాలలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గెజిటెడ్ అధి కారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుకోవాలన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న పలువురు మహిళా ఉద్యోగులను సత్కరించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా క్షయ నివారణ అధికారి సుమలత, సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, కార్యదర్శి రమణాచారి, టీజీవో ఉపాధ్యక్షుడు వామన్రావు, కృష్ణ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సంఘం నాయకులు శ్రీదేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
ఆదిలాబాద్టౌన్: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్ స్పోర్ట్స్ ప్రాంగణాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శారీరక వ్యాయామం, క్రీడలు, వినోదాత్మక కార్యక్రమాలు సిబ్బందికి మానసిక ప్రశాంతతతో పాటు పనితీరును మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హెడ్క్వార్టర్స్లో స్నూకర్, టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ క్రీడలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ స్వయంగా సిబ్బందితో కలిసి స్నూకర్, టేబుల్ టెన్నిస్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్ రావు, ఏఎస్పీ పి.మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
● అక్రమదందాపై పోలీసుల నజర్ ● జిల్లాలో అంతరపంటగా సాగు ● విక్రయ, వినియోగదారులపై కేసులు
ఆదిలాబాద్టౌన్: గంజాయిపై జిల్లా పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇది సాగు చేయవద్దని రైతులకు అవగాహన కల్పించినా కొంత మందిలో మార్పు రావడం లేదు. స్వల్ప వ్యవధిలో ఎక్కువ డబ్బులు సంపాదించా లనే ఆశతో కొందరు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దళారులు సై తం మభ్యపెడుతూ అంతరపంటగా సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. అయితే పట్టుబడిన సమయంలో రైతులు కేసులపాలవుతున్నారు. పోలీసుల సిఫారసులతో ప్రభుత్వ పథకాలకు దూరం కావాల్సి వస్తోంది. గతంలో కలెక్టర్ ఐదారుగురు రైతుల రైతుబీమా, రైతు భరోసా, ఇతర పథకాలను సైతం నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా గంజాయి సాగు చేస్తున్న రైతుల వివరాలను సైతం అధికారులకు నివేదించారు. అక్రమ మార్గంలో.. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులు చర్యలు చేపడుతుండగా అక్రమార్కులు మా త్రం అమాయక రైతులను ప్రలోభాలకు గురిచేస్తూ దందా సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లోని వారిని లక్ష్యంగా చేసుకుని అంతర పంటగా సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఉట్నూర్, గాదిగూడ, భీంపూర్, బజార్హత్నూర్, బోథ్, తాంసి, తలమడుగు, అటవీ ప్రాంతాల్లో ఈ సాగు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మత్తులో తూగుతూ.. గంజాయికి అలవాటుపడ్డ యువత మత్తులో తూగుతున్నారు. అక్రమార్కులు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో వారికి అంటగడుతున్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్, ఖుర్షీద్నగర్, తిర్పెల్లి, ఖానాపూర్, బస్టాండ్, ఏరోడ్రమ్ తదితర ప్రాంతాల్లో ఈ విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. ఇటీవల వన్టౌన్, టూటౌన్, సీసీఎస్ పోలీసులు విక్రయదారులను పట్టుకుని అరెస్టు చేస్తున్నప్పటికీ ఇంకా చాలా మంది తీరులో మార్పు రావడం లేదు. గ్రాము, రెండు గ్రాముల ప్యాకెట్లను తయారు చేసి రూ.100 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. జిల్లాలో గంజాయి కేసులు, పట్టుబడిన సరుకు సంవత్సరం కేసులు ఎండిన గంజాయి విలువ 2025 190 48.327 కేజీలు (2,264 మొక్కలు) రూ.2కోట్ల 16లక్షలు 2026 32 14.910 కేజీలు (520 మొక్కలు) రూ.55లక్షలువిభిన్న రీతిలో విక్రయాలు.. గంజాయి విక్రయించేందుకు గాను మహారాష్ట్రకు చెందిన వారు జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల వారిని ఏజెంట్లుగా నియమించుకున్నారు. రహస్య ప్రదేశాల్లో ప్యాకెట్లను ఉంచుతున్నారు. సరుకు కావాలంటే ముందుగానే వారికి ఓ కోడ్ కేటాయిస్తున్నారు. సదరు వ్యక్తి ఆ కోడ్ చెబితేనే ప్యాకెట్ అందించి డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం. హోటళ్లు, పాన్షాపులు, మైదాన ప్రాంతాల్లో కొంత మంది కూర్చొని వీటిని కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం మేరకు అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేస్తున్నారు. గంజాయి రహిత జిల్లా లక్ష్యం.. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి. ఎవరైనా గంజాయి విక్రయించినా, సాగు చేసినా, సేవించినా పోలీసులకు సమాచారం అందించాలి. వాట్సాప్ నంబర్ 8712659973కు సమాచారం అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. గంజాయి సాగు చేసిన 40 మంది రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తించకుండా సిఫార్సు చేశాం. ఇప్పటివరకు 30 మందిపై పరీక్షలు చేసి నిర్ధారణ అనంతరం కేసులు నమోదు చేశాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ ఇద్దరి అరెస్ట్ గంజాయి సేవిస్తున్న ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలి పారు. పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన తోట సాగర్, విద్యానగర్కు చెందిన వికేష్ గెజి టెడ్ నం.1 పాఠశాల వెనకాల గంజాయి సే వి స్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద 22 గ్రాముల గంజాయి లభించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
కొనుగోలు కేంద్రాలేవి?
సాక్షి,ఆదిలాబాద్: యాసంగిలో సాగు చేసిన శనగ పంట దిగుబడి చేతికందుతుంది. రైతులు పంటను కోసి ఆరబెట్టడంతో పాటు ఇళ్లలో నిల్వ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైతే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు సెంటర్ల ప్రారంభానికి సంబంధించి ఊసే లేదు. మరోపక్క ఈనెల 15 నుంచి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందనే సూచనతో వారిలో గుబులు మొదలైంది. అంతకుముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. ఆరబెట్టకుండా ఇంట్లో నిల్వ ఉంచడమే ఉత్తమమని రైతులు భావిస్తున్నారు. ఇదీ పరిస్థితి.. ప్రభుత్వరంగ సంస్థ మార్క్ఫెడ్ ద్వారా శనగలు కొనుగోలు చేస్తారు. గతేడాది శనగకు మద్దతు ధర రూ.5,650 ఉండగా, ప్రైవేట్లో అధిక ధర లభించడం ద్వారా రైతులు ఎక్కువగా అటే మొగ్గుచూపారు. గతేడాది జిల్లాలో తొమ్మిది కేంద్రాలు ఆదిలాబాద్, జైనథ్, తాంసి, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్లో ఏర్పాటు చేశారు. ఈసారి కూడా అవే కొనుగోలు కేంద్రాలు ఉండనున్నాయి. మార్క్ఫెడ్లో కేవలం 60వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ సారి కూడా జిల్లాలో పెద్ద ఎత్తున శనగ సాగైంది. ప్రస్తుతం దిగుబడులు చేతికందుతున్నాయి. ఇప్పటికే రైతులు సగం పంటను కోసి ఆరబెట్టారు. ఇంట్లో దిగుబడులను పెద్ద ఎత్తున నిల్వ చేశారు. కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం.. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. అక్కడి నుంచి అంగీకారం రాగానే ప్రారంభించడం జరుగుతుంది. – ప్రవీణ్రెడ్డి, మార్క్ఫెడ్ డీఎం, ఆదిలాబాద్ ఇక్కడ కనిపిస్తు న్న రైతు గడ్డం సురేందర్రెడ్డి. తాంసి మండలకేంద్రం. నాలుగెకరాల్లో శనగ సా గు చేశాడు. ఇటీవల రెండున్నర ఎకరాల్లో కోత చేపట్టాడు. 28 క్వింటాళ్ల వరకు చేతి కొచ్చిన దిగుబడిని ఇంటి సమీపంలో ఆరబెట్టి నిల్వ చేశాడు. అయితే మార్కెట్లో ఇప్పటివరకు కొనుగో లు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఆందో ళన చెందుతున్నాడు. ఇతనొక్కడే కాదు.. జిల్లాలో అనేక మంది శనగ రైతులది ఇదే పరిస్థితి. సాగు, దిగుబడి వివరాలు.. సాగు విస్తీర్ణం: 42వేల ఎకరాలు దిగుబడి అంచనా: 3లక్షల 28వేల క్వింటాళ్లు మద్దతు ధర: రూ.5,875 -
గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి
కై లాస్నగర్(బేల): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై అభివృద్ధికి బాటలు వేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ అన్నారు. బేల మండలంలోని కాప్సి గ్రామంలో బుధవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జ్యోతిభాపూలే గురుకులాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధికి జనగణన దిక్సూచి
కై లాస్నగర్: దేశాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు జనగణనే దిక్సూచిగా నిలుస్తుందని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. భారత జనగణన–2027 నిర్వహణపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జనగణన నుంచి జనకల్యాణం’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించే సమాచారం భవిష్యత్లో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆధారమవుతుందన్నారు. ఎక్కడా పొరపాట్లు లేకుండా గణన చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ, ఈ ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని, మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మే 11, 2026 నుంచి జూన్ 9, 2026 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో ఇంటి నిర్మాణం, వసతులు, కుటుంబ యజమాని వివరాలు తదితర 33 అంశాలపై సమాచార సేకరణ ఉంటుందని పేర్కొన్నారు. రెండో దశ ఫిబ్రవరి 2027లో నిర్వహించి మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణించనున్నట్లు వివరించారు. మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్ ద్వారా గణన చేపట్టడంతో పాటు, ప్రజలు తమ వివరాలు స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గణన ప్రారంభానికి 15 రోజుల ముందే ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి రానుందన్నారు. హైదరాబాద్ జనాభా గణన విభాగం గణాంక అధికారులు ఆదెపు వినయ్, వై. జంగయ్య హాజరై అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో రవీందర్ రాథోడ్, డీపీవో రమేశ్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘పైసా వసూల్’పై విచారణ
ఆదిలాబాద్టౌన్: ఇచ్చోడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు పదో తరగతి పరీక్షల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారనే కథనంపై జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజేశ్వర్ స్పందించారు. ‘పైసా వసూల్..’ శీర్షికన సాక్షిలో బుధవారం కథనం ప్రచురితమైంది. అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో స్పందించి ఎంఈవోను విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఇచ్చోడ ఎంఈవో బిక్కు నాయక్ పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విద్యార్థులు ఎవరైనా డబ్బులు ఇచ్చారనే దానిపై ఆరా తీశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు కాపీయింగ్పై ఆధారపడవద్దని సూచించారు. ఉపాధ్యాయులేవరైనా కాపీయింగ్కు ప్రోత్సహిస్తే శాఖాపరంగా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. -
నీటిని వృథా చేయొద్దు
కై లాస్నగర్: వేసవి దృష్ట్యా ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నా రు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆమె లాండసాంగ్వి పంప్హౌస్ను బుధవారం సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న 500 కేవీ ట్రాన్స్పార్మర్ మరమ్మతు పనులను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణానికి అన్ని వనరుల నుంచి 30 ఎంఎల్డీ నీరు అందాల్సి ఉండగా కేవలం 50 శాతం మాత్రమే అందుతుందన్నారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా కుళాయిలకు ఆనాఫ్ బటన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంజయ్నగర్లో రైల్వేఫ్లైఓవర్ పనుల కారణంగా పైప్లైన్ను తొలగించడం జరిగిందని, యుద్ధప్రతిపాదికన ఆ మరమ్మతు పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా ఇన్చార్జి మంత్రిని కోరినట్లుగా తెలిపారు. ఆమె వెంట కౌన్సిలర్లు సాయి చరణ్గౌడ్, సంజయ్, సతీశ్ తదితరులున్నారు. -
జీవితానికి ‘పొగ’ పెట్టొద్దు!
కాలిపోతున్న సంసారాలు.. అనాథలవుతున్న పిల్లలు ధూమపానం కేవలం వ్యక్తిగత సమస్య కాదు.. అది ఒక సామాజిక విపత్తుగా మారుతోంది. ఇంటి యజమాని క్యాన్సర్ బారినపడితే ఆ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోతోంది. వైద్యం కోసం ఉన్న ఆస్తిపాస్తులు అమ్ముకుని, చివరకు దిక్కులేని వారవుతున్న కుటుంబాలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. పొగతాగడం ద్వారా కేవలం ఆరోగ్యాన్నే కాదు, పిల్లల భవిష్యత్తును కూడా కాల్చేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధృడ సంకల్పమే మందు.. ధూమపానం మానేయడం అసాధ్యమేమీ కాదని, అది మనసు తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మీ ద ఆధారపడి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. సిగరేట్ మానేసిన 20 నిమిషాల్లోనే రక్తపోటు సాధారణ స్థితికి వస్తుందని, ఏడాది తిరిగేసరికి గుండెజబ్బుల ముప్పు సగానికి తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఆ ఒక్క దమ్ములో అంతులేని ఆనందం ఉందని భ్రమిస్తారు. అది కేవలం పొగ కాదు..జీవితాన్ని బుగ్గి చేసే మంట. అది కేవలం అలవాటు కాదు.. మనిషిని నిలువునా దహించే వ్యసనం. అందులో మృత్యువు దాగి ఉందన్న నిజాన్ని మర్చిపోతున్నారు. ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’అని సిగరేట్ పెట్టెలపై బొమ్మలు వేసి మరీ హెచ్చరిస్తున్నా.. ధూమపాన ప్రియుల్లో మార్పు రావడం లేదు. ఏటా మార్చి రెండో బుధవారం నిర్వహించే ‘జాతీయ ధూమపాన నిరోధక దినోత్సవం’సందర్భంగా కథనం. – బోథ్ధూమపానం వల్ల కలిగే అనర్థాలు అన్నీఇన్నీ కావు. ఒక్క సిగరేట్ ముక్కలో సుమారు 4 వేలకు పైచిలుకు రసాయనాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను కుళ్లింపజేయడమే కాకుండా, గుండెపోటు, పక్షవాతం, నోటి క్యాన్సర్కు ప్రధాన కారకాలుగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో శ్వాసకోస వ్యాధులతో చేరుతున్న వారిలో సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ధూమపానానికి దూరంగా ఉండాలి ధూమపానం నేరుగా ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులకు దారితీస్తుంది. పొగాకులో నికోటిన్ రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేసి రక్తపోటు పెంచుతుంది. దీనివల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఆస్తమా, దీర్ఘకాలిక దగ్గు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యకరమైన జీవితం కోసం ధూమపానానికి దూరంగా ఉండటం అత్యంత అవసరం. నిరంతరం ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. – నవీన్రెడ్డి, వైద్యుడు, బోథ్ -
వారసత్వ బదిలీ చేయడం లేదని నిరసన
ఖానాపూర్: మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలో తన భర్త పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తన పేరుపై చేయాలని కోరుతూ ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన తెలిపింది. పాత ఎల్లాపూర్ గ్రామంలో తన భర్త వెంకటి పేరుమీద 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని పేర్కొంది. తన భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోవడంతో ఆ భూమిని తనపేరిట మార్చాలని అధికారులకు విన్నవించినా పట్టింకోవడం లేదని అల్లెపు చిన్నక్క ఆవేదన వ్యక్తం చేసింది. 20 గుంటల భూమిని ఇతరుల పేరు మీద చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా తాను అర్హురాలినని, ఎందుకు బదిలీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేసింది. భూ రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని కోరింది. అనంతరం తహసీల్దార్ సుజాతకు వినతిప్రతం అందించారు. -
ఆదివాసీ యువకుడి పెళ్లికి చందాలు వేసి..
సాత్నాల: నిరుపేద ఆదివాసీ యువకుడి పెళ్లికి చందాలు వేసి జామిని గ్రామస్తులు అండగా నిలిచారు. సాత్నాల మండలంలో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా.. సాత్నాల మండలం జామిని గ్రామానికి చెందిన కుమ్ర భీమ్రావు–జంగుబాయి దంపతుల కుమారుడు గోద్రూ వివాహం బేల మండలం బోర్గావ్ వధువుతో పెళ్లి నిశ్చయమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయ ప్రకారం వరకట్న నిషేధం ఉంది. వరుడి కుటుంబం నిరుపేద కావడం, పెళ్లి ఏర్పాట్లలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విషయం తెలుసుకున్న జామిని గ్రామస్తులు చందాలు వేసుకున్నారు. మంగళవారం పెళ్లి సందర్భంగా రూ.31 వేల నగదు అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెందూరు ఇస్తారి మాట్లాడుతూ మా సంప్రదాయంలో వరకట్న నిషేధం ఉండడంతో పెళ్లి ఖర్చులన్నీ వరుడు భరించాల్సి ఉంటుందన్నారు. వరుడి ఆర్థిక స్థితి అంతంత మాత్రమే ఉందని గ్రహించి గ్రామస్తులు ఒక్కటై కుటుంబంగా ఉండి మాకు తోచిన సాయం అందించామన్నారు. గ్రామపెద్ద మహాజన్ కృష్ణ, దేవారి, సర్మోడి తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్చైన్గేట్: గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లను చేయాలని బైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ అన్నారు. జిల్లాలో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో వారి ఆధ్వర్యంలో చేపట్టబోయే పనులపై దిశా నిర్దేశం చేశారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్వో రాజేందర్, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
420 గంజాయి మొక్కలు స్వాధీనం
ఆదిలాబాద్టౌన్: శనగ పంట మధ్యలో అక్రమంగా పండిస్తున్న 420 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో మంగళవారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఇచ్చోడ మండలం హీరాపూర్లో ప్రధాన నిందితుడైన సిరికొండ మండలం సోంపల్లికి చెందిన పవర్ మాధవ్ 9 ఎకరాల వ్యవసాయ భూమిలో శనగ సాగు చేస్తున్నాడు. పంట మధ్యలో గంజాయి పండిస్తున్నాడనే సమాచారంతో ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో దాడి చేశారు. నలుగురి వద్ద గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి. ప్రధాన నిందితుడు వద్ద 390 గంజాయి మొక్కలు, మిగిలిన ముగ్గురి వద్ద తలా పది గంజాయి మొక్కలు దొరికాయి. మొత్తం 420 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.42 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ వివరించారు. ప్రధాన నిందితుడు పవర్ మాధవ్ ఇచ్చోడకు చెందిన ఆత్రం దత్తాత్రి, షేక్ ముజాయిద్, షేక్ ఆరీఫ్లకు గంజాయి తాగడానికి ఇస్తూ, వారితోనే గంజాయిని విక్రయింపజేసి వ్యాపారం నిర్వహిస్తున్నాడని చెప్పారు. జాతీయ రహదారి వద్ద ప్రయాణించే లారీలకు గంజాయిని అమ్మించి, ఆ డబ్బులో నుంచి రూ.500 చొప్పున వారికి ఇస్తూ వారి జల్సాలకు గంజాయి అందించేవాడన్నారు. ఈ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఇప్పటివరకు పంట పొలాల్లో గంజాయి పండించిన 40 మందికి రైతుబంధు సహా ప్రభుత్వ పథకాలు వర్తించకుండా సిఫారసు చేసినట్లు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులపై గంజాయి టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 30 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి సంబంధిత సమాచారం ఉంటే 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ బండారి రాజు పాల్గొన్నారు. -
బిడ్డను చూడకుండానే బాలింత మృతి
నార్నూర్: అప్పుడే జన్మించిన శిశువును చూడకుండానే బాలింత మృతి చెందింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఈ ఘట న చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వి వరాలు.. ఉట్నూర్ మండలకేంద్రానికి చెందిన ముంజం మల్లేశ్, రాధ దంపతుల కూతురు హి మబిందు (26)ను నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన బుల్లె భారత్, విజయ్మాల దంపతుల కుమారుడు ధమ్మపాల్తో గతేడాది పెళ్లి చేశారు. ధమ్మపాల్.. ఉట్నూర్ మండలం దంతన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. హిమబిందు..నార్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి పరిధి గుంజాల సబ్సెంటర్లో ఎన్హెచ్ఎం ఎంఎల్హెచ్పీగా విధులు నిర్వహిస్తోంది. ఆమె ఏడు నెల ల గర్భిణి. గతనెల 3న పురిటి నొప్పులు రావడంతో ఆదిలాబాద్ రిమ్స్కు తీసుకెళ్లారు. పరీ క్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి రిఫర్ చేశారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గతనెల 14న సాధారణ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె కోమాలోకి వెళ్లగా చికిత్స అందిస్తున్నారు. గతనెల 24న ఫిట్స్ రావడం, అదే రోజు రాత్రి గుండెనొప్పి వచ్చింది. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. బిడ్డను చూడకుండానే మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె మృతిపట్ల వైద్యులు, యూని యన్ సంఘాలు సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలుముధోల్: మండల కేంద్రంలోని నయాబాది రోడ్డు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విఠోలితండా నుంచి అవినాష్, అంజలి ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్పై మహారాష్ట్రలోని కడికి గ్రామానికి వెళ్తున్నారు. బాసర నుంచి భైంసాకు వస్తున్న ఆటో ఢీకొంది. బైక్పై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు భైంసా ఏరియాసుపత్రికి తరలించారు. నాలుగు నెలల పాప, రెండో కుమార్తెను నిజామాబాద్ ఆసుపత్రికి పంపించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. -
రిమ్స్లో బాలింత మృతి
ఆదిలాబాద్టౌన్: తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఇన్నిరోజుల పాటు ఆలనపాలన చూసిన తల్లి కన్నుమూయడంతో మూడేళ్ల బాలుడు ఆమె మృతదేహంపై పడి ఏడ్చిన తీరు కలచివేసింది. రిమ్స్లో మంగళవారం తెల్లవారుజామున బాలింత మృతిచెందింది. ఆమె భర్త ఆత్రం విఠల్ ఆరు నెలల క్రితం చనిపోగా, భార్య సైతం మృతితో చిన్నారులు అనాథలుగా మారారు. ప్రసవమైన వారం తర్వాత మృతిచెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్య కారణంగానే బాలింత మృతిచెందినట్లు ఆరోపించారు. తీవ్ర ఆందోళనకు దిగారు. ఐటీడీఏ, వైద్యారోగ్య శాఖ అధికారులు రిమ్స్కు చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఇద్దరు పిల్లలను ఆదుకోవాలని కుటుంబీకులు, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే.. ఉట్నూర్ మండలం లక్కారం పరిధిలోని రాంజీగోండ్ గూడకు చెందిన ఆత్రం గంగుబాయి (25) ఫిబ్రవరి 28న ప్రసవం కోసం రిమ్స్ మెటర్నిటీ వార్డులో చేరింది. అదేరోజు రాత్రి సిజేరియన్ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. అయితే రెండో సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబీకులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 7న శరీరం అంతటా దద్దుర్లు వచ్చాయి. కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో శరీరంపై దద్దుర్లు వచ్చాయి. డెర్మటాలజీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 8న ఆమెకు జ్వరం వచ్చింది. ఆమెకు పోస్టు ఆపరేటీవ్ వార్డుకు మార్చారు. తీవ్ర అస్వస్థత ఉండడంతో హెచ్బీయూ వార్డుకు సోమవారం తరలించారు. ఫిజీషియన్ వైద్యులు చికిత్స అందించారు. అక్కడి నుంచి ఎంఐసీయూ వార్డుకు షిఫ్ట్ చేశారు. ఆక్సిజన్ శాతం 70 నుంచి 80 ఉందని, బీపీ 80/60గా నమోదైనట్లు తెలిపారు. శ్వాససరిగా ఆడకపోవడం, గుండె ఆగిపోవడంతో వైద్యులు ఆమెకు సీపీఆర్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె మృతిచెందినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు రిమ్స్కు చేరుకుని ఆందోళనకు దిగారు. కాగా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యవర్గం
నస్పూర్: నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆర్ముల్ల రాజు, ప్రధాన కార్యదర్శిగా కొట్టె దేవేందర్, కోశాధికారిగా ఎం.గణరాజ్, ఉపాధ్యక్షులుగా ఇ.వెంకటేశ్, ఎన్.సురేందర్, జి.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాస్గౌడ్, రాజేందర్, కమలాకర్, కార్యవర్గ సభ్యులుగా ఈశ్వర్ ప్రసాద్, శ్రీకాంత్, వినయ్యాదవ్, డానియల్ ఎన్నికై నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అడ్వొకేట్ చుంచు వెంకటేశ్ తెలిపారు. నూతన కార్యవర్గం కాలపరిమితి నాలుగేళ్లు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంత ప్రతాపరెడ్డి, ట్రెజరర్ కె.కృష్ణ, ఒలింపిక్ జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ కనపర్తి రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి బలవన్మరణం
ఖానాపూర్: ఆర్థిక ఇబ్బందులు, అప్పులు బాధ, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై రాహుల్ గైక్వాడ్ కథనం ప్రకారం.. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన పెంచాల గంగాధర్ (45), కవిత దంపతులు. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి పెళ్లయి 20 ఏళ్లు గడుస్తున్నా సంతానం లేకపోవడం, కుటుంబ సమస్యలు, అనారోగ్యంతో బాధపడేవాడు. వీటన్నింటికి తోడు చేసిన అప్పులు పెరిగిపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో సోమవారం అర్ధరాత్రి వేళ హన్మాన్ దీక్ష తీసుకునేందుకు గోదావరిలో స్నానం చేస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. గోదావరి తీరంలో గల షెడ్డులో ఉరేసుకున్నాడు. భార్య కవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఆర్జీయూకేటీలో సోలార్ శిక్షణ
బాసర: బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో సోలార్ పీవీ టెక్నాలజీపై నాలుగు వారాల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. పునరుత్పాదక ఇంధన రంగంలో విద్యార్థులకు అవగాహన, ఆచరణాత్మక నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో ఈ శిక్షణ జరుగుతుంది. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం కాగా, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమ ముఖ్యాంశాలు సోలార్ ప్యానెళ్ల ఇన్స్టాలేషన్, సిస్టమ్ ఆపరేషన్, మెయింటెనెన్స్ వంటి అంశాలపై హ్యాండ్స్–ఆన్ శిక్షణ అందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. భారత్ 2030 నాటికి 450 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంలో 300 జీడబ్ల్యూ వాటా సోలార్ రంగానికే ఉంది. ఈ భారీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి నైపుణ్యవంతమైన మానవ వనరుల అవసరం తీవ్రంగా ఉంది. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వి.చంద్రశేఖరరావు శిక్షణ లక్ష్యాలు, నాలుగు వారాల కార్యక్రమ వివరాలు పేర్కొన్నారు. మెకానికల్ విభాగం హెడ్ ఎ.చరణ్రెడ్డి సోలార్ రంగంలోని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వైస్చాన్సలర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ. మురళీదర్శన్ ఈ కార్యక్రమాన్ని కొనియాడుతూ, అకడమిక్తో పరిశ్రమ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ అమిత్కుమార్ దేశ్పాండే, షేక్ ఆరిఫ్, సుబ్రహ్మణ్యం సిందే, దర్శన్లతో కూడిన సోలార్ పీవీ టెక్నాలజీస్ బృందం శిక్షణను పర్యవేక్షిస్తోంది. అసోసియేట్ డీన్లు డాక్టర్ కె.మహేశ్, శీలం శేఖర్, అనుపమ శ్రీదేవి, అన్పత్ రాహుల్తోపాటు విద్యార్థులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. -
కంటైనర్ బడి
కుమురంభీం కాలనీలో కంటైనర్ పిల్లలకు చదువు చెబుతున్న టీచర్ జిల్లాలో మార్చి ఆరంభంలోనే ఎండలు భగ్గుమంటున్నాయి. కొన్నిరోజులుగా 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు పెద్దలే కాకుండా విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. పట్టణంలోని కుమురంభీం కాలనీలో ఏర్పాటు చేసిన కంటైనర్లో ఇటీవల తరగతులు ప్రారంభమయ్యాయి. మండుతున్న ఎండలతో వారికి అవస్థలు తప్పడం లేదు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
కోర్టు తీర్పు అమలు చేయాలి
బోథ్: హైకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అ ధ్యక్షుడు గుంజాల భాస్కర్రెడ్డి కోరారు. బోథ్లో మంగళవారం ఉద్యమకారులతో కలిసి ఆయన మా ట్లాడారు. హైకోర్టు తీర్పు ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఎనిమిది వారాల్లో నెలనెలా రూ.25 వే ల పెన్షన్, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరా రు. ఈ కేసును ముందుకు తీసుకెళ్లిన అడ్వకేట్ కరుణాకర్రెడ్డి, తీర్పు వెల్లడించిన జడ్జి విజయసేనారె డ్డి, సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్రా వు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే ఉద్యమకారుల కమి షన్ ఏర్పాటు చేసి డిమాండ్లు పరిశీలించాలని భా స్కర్రెడ్డి కోరారు. ఉద్యమకారులు, ఉద్యమంలో కీ లక పాత్ర పోషించిన విలేకరులకు నెలనెలా రూ.25 వేల పెన్షన్, ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, ఐదెకరాల భూమి, పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, బీమా కల్పించాలని కోరారు. తెలంగా ణ ఉద్యమకారులు కుంట వెంకటరమణగౌడ్, దీటీ దేవిదాస్, వెంకటరమణ, ప్రకాశ్సింగ్, మల్లెపూల సుభాష్, అమర్సింగ్ భీమ్రావ్ తదితరులున్నారు. -
ప్రజారోగ్యంపై దృష్టి
ఇంద్రవెల్లి: గ్రామాలాభివృద్ధితో పాటు ప్రజా రోగ్యంపై ప్రజాప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరానికి హాజరై ఎస్బీఐ అందించిన వైద్యపరికరాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మూఢనమ్మకాలకు దూ రంగా ఉండి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చి నా వెంటనే ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందా లని సూచించారు. అనంతరం మండలంలోని దుబ్బగూడలో వీవో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మ ర్మాట్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీఆర్డీ వో రవీందర్రాథోడ్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో జీవన్రెడ్డి, సర్పంచ్ రాథోడ్ మోహన్సింగ్, వైద్యులు పూజతి, వసంత్రావ్, కాంగ్రెస్ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కౌన్సిల్లో రచ్చ
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశమే రచ్చకు దారి తీసింది. బీజేపీ, కూటమి (కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం) కౌన్సిలర్లు పరస్పరం దూషించుకుంటూ గల్లాలు పట్టుకుని బాహాబాహీకి దిగడం తీవ్ర కలకలం రేపింది. ఆయా పార్టీల నాయకులూ అక్కడికి చేరుకోగా అరుపులు, కేకలు, బొబ్బలతో కార్యాలయం దద్దరిల్లింది. చైర్పర్సన్కు వ్యతిరేకంగా బీజేపీ కౌన్సిలర్లు మూడున్నర గంటల పాటు ఆమె ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించిన పోలీసులతో బీజేపీ కౌన్సిలర్లు తీవ్ర వాగ్వాదానికి దిగారు. పరస్పరం నెట్టుకున్నారు. దీంతో ఆందోళన తీవ్రతరమైంది. డీఎస్పీ జీవన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ రక్షణ వలయంలో చైర్పర్సన్ను బయటకు తరలించడంతో వివాదం సద్దుమణిగింది. అసలేం జరిగిందంటే.. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అధ్యక్షతన ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యా రు. తొలుత 49వ వార్డు కౌన్సిలర్ వెనుగంటి ప్రకాశ్తో కమిషనర్ రాజు ప్రమాణాస్వీకారం చేయించారు. అనంతరం కౌన్సిలర్లంతా స భకు పరిచయం చేసుకున్నారు. ఎమ్మెల్యే, చైర్పర్సన్ సభనుద్దేశించి మాట్లాడిన తర్వాత ఆరు అంశాలతో కూడిన ఎ జెండాను మున్సిపల్ సిబ్బంది వి నిపించారు. ఐదు అంశాలు పూ ర్తయిన తర్వాత వైస్ చైర్మన్ రోహిత్ ప్రార్థనలకు సమయమవుతుందని చెప్పగా కూటమి కౌన్సిలర్లు ఎజెండా పాస్ అనడంతో చైర్పర్సన్, కూటమి కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు. చైర్పర్సన్ ఛాంబర్ ఎదుట ఆందోళన సమావేశ మందిరం నుంచి బయటకు వస్తూ చైర్పర్సన్ ఛాంబర్లోకి వెళ్లే క్రమంలో చైర్పర్సన్ భర్త సతీశ్తోపాటు కూటమి కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్లు పరస్పరం వాగ్వాదానికి దిగారు. పరుష పదజాలంతో దూషించుకుంటూ బాహాబాహీకి దిగారు. పలువురు కౌన్సిలర్లు తమతమ కౌన్సిలర్లను వారించడంతో కూటమి కౌన్సిలర్లు చైర్పర్సన్ ఛాంబర్లోకి వెళ్లిపోయారు. చైర్పర్సన్ వైఖరిని నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్లు ఆమె ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తనయుడు పాయల్ శరత్, బీజేపీ మహిళా కౌన్సిలర్ల భర్తలు అక్కడకు చేరుకున్నారు. చైర్పర్సన్ బయటకు రావాలంటూ అరుపులు, కేకలు, బొబ్బలతో హోరెత్తించారు. ఛాంబర్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ అధికారులు, వా రికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, నీటి సమస్య తీర్చాలంటూ బీజేపీ కౌన్సిలర్లు ఖాళీ బిందెలు, బకెట్లతో రెండు గంటల పాటు బైఠాయించి నిరసన కొనసాగించారు. చైర్పర్సన్కు వ్యతిరేకంగా నినదించారు. డీఎస్పీ జీవన్రెడ్డి అక్కడకు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. దీంతో ప్రత్యేక పోలీస్ బలగాలను రప్పించి ప్రత్యేక రక్షణ వలయం మధ్య చైర్పర్సన్తో పాటు కూటమి కౌన్సిలర్లను బయటకు పంపించారు. అనంతరం బీజేపీ కౌన్సిలర్లు కూడా ఆందోళన విరమించి బయటకు వెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. కౌన్సిలర్లు రాజకీయాలతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. మరో 300 మంది పారిశుద్ధ్య కార్మికులను నియామకానికి తీర్మానం చేసి ఇస్తే ప్రభుత్వం నుంచి మంజూరయ్యేలా చూస్తానని చెప్పారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి త్వరలోనే ప్రధాని, సీఎం చేతుల మీదుగా భూమిపూజ ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటువుతుందని పేర్కొన్నారు. సభ్యులంతా భేషజాలకు పోకుండా ఐదేళ్లు ప్రజల్లో మంచిపేరు తెచ్చుకునేలా పనిచేయాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ.. పట్టణంలోని 49 వార్డులను తన సొంత వార్డులుగా అభివృద్ధికి చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన మొదట బీజేపీ కౌన్సిలర్ వార్డునే సందర్శించి అక్కడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించానని చెప్పారు. 99రోజుల కార్యాచరణ ప్రణాళికనూ బీజేపీ కౌన్సిలర్ వార్డు నుంచే మొదలు పెట్టామని, కానీ, ఆ పార్టీ కౌన్సిలర్లు ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తూ ఆందోళనకు దిగడం సరికాదని పేర్కొన్నారు. -
వంట గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తిపై కేసు
కైలాస్నగర్: గృహవసర వంట గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తూ ఓ మెకానిక్ గ్యారేజీలో ఆటోలు, కార్లకు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వైనాన్ని వివరిస్తూ ఈ నెల 1న ‘రీఫిల్లింగ్ దందా’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీన్ని సీరియస్గా పరిగణించిన కలెక్టర్ రాజర్షి షా విచారణకు ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మహేశ్ జిల్లా కేంద్రంలోని రాంనగర్లోగల మెకానిక్షాపును సందర్శించి విచారణ చేపట్టారు. వంటగ్యాస్ను అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు బాధ్యులైన మెకానిక్ షాప్ యజమాని పట్టణంలోని శాంతినగర్కు చెందిన షేక్ జాబీర్, ఆయనకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న జైనథ్ మండలంలోని రుద్ర గ్యాస్ ఎజెన్సీ యజమానిపై మంగళవారం 6ఏ కేసు నమోదు చేశారు. వంటగ్యాస్ సిలిండర్లను అక్రమంగా తరలించినా, ఇతర కార్యకలాపాలకు వినియోగించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. -
ఏఎంసీ పీఠం ఎవరికో?
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ ఏఎంసీ పాలకవర్గాలను వారంలోపు ప్రకటించనున్నట్లు అధికార పార్టీలో చర్చ మొదలైంది. దీంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలను కలుస్తూ పైరవీ చేస్తున్నారు. ఆదిలాబాద్ విషయంలో ఊగిసలాట కొనసాగుతోంది. ప్రతీసారి చైర్మన్ పదవిని భర్తీ చేస్తారని చెప్పడం, ఆ తర్వాత ప్రక్రియ నిలిచిపోవడం జరుగుతూ వస్తోంది. ఈసారి మాత్రం తప్పనిసరిగా ఉమ్మడి జిల్లాలోనే అధిక ఆదాయమున్న ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి భర్తీ విషయంలో రాజకీయ ఎత్తుగడలు కొనసాగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. జోరుగా ఆశావహుల పైరవీలు ఆదిలాబాద్ ఏఎంసీ చైర్మన్ పదవి కోసం కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇది జనరల్ స్థానం కావడంతో పార్టీలో ముందునుంచి ఉన్న తన పేరు పరిశీలించాలని ముఖ్య నేతలను కోరుతూ వస్తున్నారు. పార్టీ నియోజకవర్గ ముఖ్యనేత కంది శ్రీనివాసరెడ్డికి, బోరంచు శ్రీకాంత్రెడ్డికి పొసగకపోవడంతో నాన్చుతున్నారనే ప్రచారం సాగుతోంది. బీసీ నాయకుడు మునిగెల విఠల్కు పదవి ఇప్పించేందుకు కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారనే ప్రచారమూ ఉంది. బోథ్ బీసీ జనరల్ స్థానం కావడంతో బోథ్కు చెందిన మల్లెపూల సత్యనారాయణ, చట్ల ఉమేశ్ ప్రయత్నిస్తున్నారు. ఇదివరకు చైర్మన్గా వ్యవహరించిన బొడ్డు గంగారెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఇక్కడ రిజర్వేషన్ మార్పు కోసం పార్టీకి చెందిన ప్రపుల్చందర్రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలోనూ ఈ పదవి కోసం ప్రయత్నించినా రిజర్వేషన్ అనుకూలించలేదని, ఈసారీ అదే పరిస్థితి ఉందని, ఈ దృష్ట్యా రిజర్వేషన్ మార్పు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పార్టీలో చెప్పుకొంటున్నారు. మొత్తంగా ఈ రెండు ఏఎంసీల చైర్మన్ పదవుల విషయంలో త్వరలో ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. -
మెగా జాబ్మేళాకు స్పందన
ఆదిలాబాద్టౌన్: పోలీస్శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మంగళవా రం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు స్పందన లభించింది. 67 కంపెనీల్లో ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్, నాన్ ఐటీ, ఆటోమొబైల్, నర్సింగ్, మార్కెటింగ్, డ్రైవింగ్, సెక్యూరిటీ, టెక్నికల్, ఫార్మ, హెచ్ఆర్, ఎయిర్ పోర్ట్ తదితర రంగాల్లో 4వేల ఉద్యోగాల కల్పనకు మేళా నిర్వహించగా 7,500 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 67 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 2,100 మంది అర్హులను ఆయా కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీరికి జిల్లా జడ్జి ప్రభాకరరావు, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఆదిలాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్ నియామకపత్రాలు అందజేశారు. రూ.13వేల నుంచి రూ.40వేల వరకు వేతనం అందనుండగా ఉద్యోగాలకు ఎంపికై నవారు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, జాబ్ మేళాతో పోలీస్ పరేడ్ మైదానం కిక్కిరిసిపోయింది. అదనపు ఎస్పీ సురేందర్రావు, ఏఎస్పీలు మౌనిక, రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీలు జీవన్రెడ్డి, ఇంద్రవర్ధన్, శ్రీనివాస్, శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్ కాంత్, వన్టౌన్, టూ టౌన్ సీఐలు సునీల్కుమార్, నాగరాజు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆయా మండలాల ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలి
కై లాస్నగర్: ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి రాథోడ్ రవీందర్ సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేసే ఉద్యోగుల సౌకర్యార్థం మంగళవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో వైద్యశిబిరం నిర్వహించారు. నిజామాబా ద్ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు హాజరై ఉపాధిహామీ లో పనిచేసే ఏపీవోలు, ఈసీలు, టీఏలు, కార్యాల య ఉద్యోగులు, వారి కుటుంబీకులకు ఆరోగ్య పరీ క్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. అడిషనల్ డీఆర్డీవో కుటుంబరావు, ఏవో గంగాధర్, హెచ్ఆర్ మేనేజర్ రషీద్ ఉన్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యుడు -
సీ్త్రనిధి ఏజెంట్ చేతివాటం
● రూ.7 లక్షలు సొంతానికి వాడుకున్న వైనం సాత్నాల: భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో వీవోఏ (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్)గా విధులు నిర్వహిస్తున్న రాయిడి స్వప్న సీ్త్రనిధి సంఘం సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులు సొంతానికి వాడుకోవడం కలకలం రేపింది. ఎస్సై పవర్ గౌతమ్ కథనం మేరకు గ్రామానికి చెందిన వీవోఏ రాయుడి స్వప్న సీ్త్రనిధి స్వయం సహాయక సంఘాలకు ఏజెంట్గా పనిచేస్తుంది. 2022 నుంచి 10 సంఘాలు, 54 మంది సభ్యులు శ్రీనిధి రుణాలు తీసుకున్నారు. సదరు మహిళల వద్ద నుంచి ప్రతీనెల డబ్బులు వసూలు చేసి బ్యాంకులో కట్టినట్లుగా రసీదులు చూపించింది. గడువు ముగిసిన తర్వాత దుమ్మ సంగీత, దుమ్మ బూమక్క, కోర చిన్నమ్మ, నలిమెల కాంత మళ్లీ రుణంకోసం అడుగగా బ్యాంకులో తీసుకున్న పాత లోన్ డబ్బులు పూర్తిగా కట్టలేదని అన్నారు. దీంతో సదరు మహిళలు స్వప్నను సంప్రదించగా రూ.7 లక్షలు వాడుకున్నట్లు ఒప్పుకుంది. నెలరోజులకు చెల్లిస్తానని బాండు రాసి ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత సీ్త్రనిధి సంస్థకు చెందిన అధికారులు డబ్బుల విషయం అడుగగా నేను ఇవ్వలేనని చెప్పింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. చిన్నారికి నారీ పురస్కార్ఆదిలాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన కల్చరల్, ఫ్యాషన్ అవార్డ్స్ కార్యక్రమంలో జిల్లాకు చెందిన కొంకటి ఇతిక్ష విశేష ప్రతిభ కనబర్చింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గౌరవ సభ్యురాలు సరిత గోగుల, నేషనల్ బంజారా భారత్ మహిళా కన్వీనర్ అద్దంకి నాగమణి, ప్రముఖ నటి సంధ్యారాణి చేతుల మీదుగా నారీ పురస్కారాన్ని అందుకుంది. చిన్నారి తల్లిదండ్రులు కొంకటి సృజన, శ్రావణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
ఊరంతా ఒక్కటై.. శుభ్రం చేసి..
లక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి(కే) గ్రామస్తులు ఒక్కటై గ్రామంలో నీటి ట్యాంకును బాగు చేసుకున్నారు. మిషన్ భగీరథ నుంచి నీటి ట్యాంక్లో నీళ్లు బయటకు వెళ్లేందుకు ఏర్పాటుచేసిన ఔట్ ఫ్లో పైపు పైకి ఉంది. ట్యాంకు శుభ్రపర్చిన ప్రతిసారి అందులో చెత్త, మురుగునీటిని తొలగించడం పంచాయతీ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని సర్పంచ్ ముఖేష్.. ఉపాధి అధికారులకు తెలిపారు. సోమవారం ఉపాధి కూలీలందరూ కలిసి కంకర, సిమెంట్ ట్యాంక్ పైకి తరలించారు. ట్యాంకులో ఔట్ ఫ్లో పైపు వరకు సిమెంట్ వేశారు.నీటిట్యాంకు పైకి మెటీరియల్ తరలిస్తున్న గ్రామస్తులు -
పట్టణ అభివృద్ధికి సహకరించాలి
నిర్మల్ టౌన్: నిర్మల్ పట్టణ అభివృద్ధికి సహకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ కోరారు. సోమవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. పట్టణ అభివృద్ధి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం వారు పట్టణంలో ఈద్గా ఏర్పాటు చేయాలని, మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్లో సౌకర్యాలు మెరుగు పరచాలని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషిని కోరారు. -
సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
నిర్మల్: పెన్షనర్లను ఇబ్బందికి గురిచేసేలా రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (టీఎస్జీఆర్ఈఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంసీ లింగన్న డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని, వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని కోరా రు. కేంద్రం ప్రభుత్వం పెన్షనర్లకు ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏలకు వ్యతిరేకంగా చేసిన బిల్లుపై పునరాలోచించాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 25న బ్లా క్డే నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొజ్జ జనార్దన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతారెడ్డి, ఆర్థిక కార్యదర్శి లోలం గంగన్న, యూనిట్ అధ్యక్షుడు కాండ్లీకర్ రమేశ్, కార్యదర్శి పూదరి జనార్దన్, యూనిట్ ఆర్థిక కార్యదర్శి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఆగని దాడులు.. తొలగని దిగులు..
నిర్మల్ఖిల్లా: దుబాయ్లోని పలుప్రాంతాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నిర్మల్ జిల్లాకు చెందిన వలస కార్మికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దుబాయ్, అబుదాబి విమానాశ్రయాలపై డ్రోన్ దాడులు జరిగినట్లు సమాచారం రావడంతో అక్కడి పరిస్థితులపై ఇక్కడి ప్రవాసీల కుటుంబాలు టెన్షన్ పడుతున్నాయి. ఇదే సమయంలో తాముంటున్న సమీపప్రాంతాల్లోని కొన్ని బహుళ అంతస్తుల భవనాలపై కూడా డ్రోన్ దాడుల ప్రయత్నాలు జరిగాయని వలస కార్మికులు చెబుతున్నారు. గల్ఫ్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే విధులకు వెళ్లకుండా గదుల్లోనే ఉండాల్సి వస్తోందని నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామానికి చెందిన కాపుకుమ్మరి రవి... ‘సాక్షి’కి వెల్లడించారు. గల్ఫ్ దేశాలపై దాడుల వార్తలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎయిర్ పోర్టులపై దాడులు.. -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కడెంకు చెందిన జామ్లాబాయ్ తనకి వ్యవసాయ క్షేత్రానికి సాగునీరు అందించేందుకు పైపులు మంజూరు చేయాలని, సిర్పూర్ (యు)కు చెందిన గేడం గజానంద్ ఏకలవ్య పాఠశాలలో స్లీపర్ ఉద్యోగం ఇప్పించాలని, సిరికొండ మండలానికి చెందిన రామారావు సోలార్ పంపుసెట్ మంజూరు చేయించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. -
ఉమ్మడి జిల్లాలో పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు
కుమురంభీంనిర్మల్మంచిర్యాల ఆదిలాబాద్నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శిరీష ఇటీవల తరచూ తలనొప్పి, ఆందోళనతో బాధపడుతోంది. పరీక్షలు గుర్తుకొస్తే చేతుల్లో చెమటలు పట్టడం, చదవడానికి కూర్చుంటే గజిబిజి ఆలోచనలు రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటోంది. ఇది ఒక్క గాయత్రి పరిస్థితి మాత్రమే కాదు.. జిల్లాలో అనేక మంది విద్యార్థులు ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక రెండురోజుల క్రితం మంచిర్యాల జిల్లా మందమర్రిలో పదోతరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంత చదివినా ఏ పరీక్షలోనైనా పాస్ మార్కులు మాత్రమే వస్తున్నాయని తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేవాడు. ఆదివారం ఉదయం తల్లి నిద్రలేపి చదువుకొమ్మని చెప్పింది. కాసేపటి తర్వాత వచ్చి చూసే సరికి ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. మార్కులు తక్కువ వస్తున్నాయనే ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో చదవాలి
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న ఈ సమయంలో విద్యార్థులు అనవసరంగా ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛ వాతావరణంలో చదవాలి. లక్ష్యాన్ని ఎంచుకుని క్రమపద్ధతిలో కృషి చేస్తే విజయం సాధించడం కష్టంకాదు. ‘ఒత్తిడిని భయంగా కాకుండా సవాల్గా తీసుకుంటే విజయం కచ్చితంగా సిద్ధిస్తుంది. – అల్లం సాయికృష్ణ, కెరీర్ గైడెన్స్ నిపుణులు, బోథ్, ఆదిలాబాద్ ఒత్తిడికి గురికావొద్దు పరీక్షల సమయంలో విద్యార్థులు అనవసరమైన ఒత్తిడికి గురికావొద్దు. ప్రతిరోజూ చదువు కోసం సమయపట్టిక రూపొందించుకుని మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా సరిపడా నిద్ర, సమతుల్య ఆహారం, తేలికపాటి వ్యాయామం మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. పరీక్షలను జీవితంలో ఒక దశగా మాత్రమే భావించాలి. ఫలితాలకంటే నేర్చుకున్న జ్ఞానమే ప్రధానం. – అడ్డిగ శ్రీనివాస్, సైకాలజిస్టు, మోటివేషన్ స్పెషలిస్టు -
బాలింతను ఆస్పత్రికి తరలించిన వైద్యసిబ్బంది
గుడిహత్నూర్: మండలంలోని చెరువాయికి చెందిన ఆదివాసీ మహిళ మారుబాయి గత నెల 22న రిమ్స్ ఆస్పత్రిలో ప్రసవించింది. రక్తహీనతతో బాధపడుతున్న ఆమె పూర్తి చికిత్స తీసుకోకుండానే ఈ నెల 2న ఇంటికి చేరింది. ఈ క్రమంలో గ్రామ సందర్శనకు వెళ్లిన వైద్యబృందం కదలలేని స్థితిలో ఉన్న మారుబాయిని రిమ్స్కు తరలించేందుకు ప్రయత్నించగా నిరాకరించింది. మండల వైద్యాధికారి శ్యాంసుందర్ ఆమెకు నచ్చజెప్పి రిమ్స్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు.మారుబాయిని తీసుకెళ్తున్న వైద్య సిబ్బంది -
అంగన్వాడీల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలని వినతి
ఆదిలాబాద్: అంగన్వాడీల సమస్యలను అ సెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ను తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిలారు రాధ, పుప్పాల సునంద కోరా రు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రీప్రైమరీ టీచర్లుగా గుర్తించి, కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని డిమాండ్ చే శారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్గా టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్షతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రధాన అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
రైతు చుట్టూ రాజకీయం
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో రైతు చుట్టూ రాజకీయం కొనసాగుతుంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ని ఎండగడుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు పోరుబాట పట్టాయి. రైతుభరోసా ఎప్పుడేస్తారంటూ గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తుండగా, ఫసల్ బీమా అమలు చేయాలంటూ కమలం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా సంతకాల సేకరణ చేపట్టి గ్రామాల్లో పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంతకాల సేకరణతో.. రైతుభరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామం నుంచి గత శనివారం రైతుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు పోరుబాట కార్యక్రమాన్ని షురూ చేశారు. అందులో భాగంగా సంతకాల సేకరణ చేపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు లక్ష్యంగా.. రానున్న అసెంబ్లీ సమావేశాలు లక్ష్యంగా ఈ రెండు పార్టీల ముఖ్య నేతలు రైతుల నుంచి సంతకాల సేకరణ చేపడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోగా, రైతుల నుంచి 10లక్షల దరఖాస్తులు సేకరించి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ అందజేస్తామని చెబుతున్నారు. అలాగే రైతు భరోసా ఇవ్వాలని, పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్రూరల్ మండలం కచ్కంటి, బేల మండలం సాంగిడిలోనూ ఈ కార్యక్రమాలు సాగాయి. రైతు భరోసా త్వరగా విడుదల చేయాలని, అలాగే ప్రతీ పంటకు రూ.500 బోనస్ అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సంతకాల సేకరణతో రైతుల వద్దకు వెళ్తోంది. కార్యక్రమాన్ని ఆదిలాబాద్ రూరల్ మండలం అకోలి గ్రామంలో ఇటీవల ప్రారంభించారు. భోరజ్ మండలంలోని అకోలి, బేల మండలం సాంగిడిలో కొనసాగాయి. రైతులు అధైర్యపడొద్దు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదలలో తీవ్ర జాప్యం చేస్తుంది. రైతులు అధైర్య పడవద్దు. బీఆర్ఎస్ అండగా ఉంటుంది. – జోగు రామన్న, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రైతు సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఫసల్ బీమా యోజన అమలు చేయాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అందుకే సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టాం. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ -
అక్రమార్కులు ఎంతటివారైనా ఉపేక్షించం
ఆదిలాబాద్ ఎస్పీగా గతేడాది మార్చి 10న బాధ్యతలు చేపట్టిన అఖిల్ మహాజన తొ లుత పోలీసు శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఉద్యోగులంతా క్ర మశిక్షణతో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. విధులు విస్మరించే వారి పై శాఖాపరమైన చర్యలకు పూనుకున్నారు. మరోవైపు మహిళల భద్రతకు పెద్దపీటవేశారు. షీటీం, పోలీస్ అక్క వంటి కార్యక్రమాలతో బాలికలు, యువతులకు అండగా నిలుస్తున్నారు. ఇక రాత్రి వేళ లో ప్రజలు అనవసరంగా బయట తిరకుండా ఆపరేషన్ చబుత్రా కొనసాగిస్తున్నారు. అలాగే వాహనాలు నడిపిస్తున్న మైన ర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. రౌడీషీటర్లకు రౌడీమేళా నిర్వహించి హద్దు మీరితే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నా రు. సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ వాటిని ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తున్నారు. అక్రమాలకు చెక్.. జిల్లాలో బ్లాక్మెయిలింగ్, వడ్డీ వ్యాపారం, రియల్ ఎస్టేట్లో డబుల్ రిజిస్ట్రేషన్, సైబర్క్రైమ్, నిషేధిత వ్యాపారాలకు అడ్డుకట్ట వేశారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈ చర్యలతో అక్రమార్కులు తోకముడిచి స్థానికంగా కనిపించకుండా పోయారు. అలాగే ఇసుక, మొరం అక్రమ దందాకు సైతం చెక్ పెట్టారు. హైవే పక్కన ఉన్న దాబాల్లో మద్యం పూర్తిగా నిషేధించారు. రోడ్డు ప్రమాదాలను అడ్డుకట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతీ వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటూ న్యాయం జరిగేలా చొరవ చూపుతున్నారు. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే నేరుగా సమాచారం అందించాలనే ఉద్దేశంతో ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు ఎలాంటి సమస్యలు, సమాచారం ఉన్నా వాట్సాప్ నంబర్ 8712659973 ద్వారా తెలియజేసేందుకు వీలు కల్పించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. సత్వర పరిష్కారం అందేలా చొరవ చూపుతుండడంతో కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది.జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపుతాం. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటివారైనా ఉపేక్షించబోం. ఏదైన అక్రమ దందాలకు సంబంధించి సమాచారం ఉంటే వాట్సాప్ నంబర్ 8712659973కు తెలియజేయాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. రియల్ ఎస్టేట్ మోసాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. అలాగే గంజాయి, మట్కా, ఆన్లైన్ బెట్టింగ్, ఇసుక, మొరం అక్రమ దందాపై దృష్టి సారించాం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
అందరి చూపు.. కొత్త కౌన్సిల్ వైపు
కై లాస్నగర్: ఇటీవల నూతనంగా ఎన్నికై న ఆదిలా బాద్ మున్సిపల్ కౌన్సిల్ తొలి సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించనున్నారు. చైర్పర్సన్ బండారి అనూష అధ్యక్షతన ఉదయం 11గంటలకు కౌన్సిల్ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభం కానుంది. దాదాపు 13 నెలల తర్వాత నిర్వహిస్తుండడంతో సమస్యల పరిష్కారంపై పట్టణవాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా వేసవి షురూ కావడంతో తాగునీటి సమస్యను కౌన్సిల్ ఏ విధంగా అధిగమిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నీటి ఎద్దడిని నియంత్రిస్తారా.. పట్టణంలో 49 వార్డులున్నాయి. ఇందులో విలీన కా లనీలకు ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా కా ని పరిస్థితి. పలు కాలనీల్లో నల్లాలకు ఆనాఫ్ బటన్ లేకపోవడంతో నీరు వృథాగా పోతుంది. లాండసాంగ్వీ పంప్హౌస్పైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ఈ సారి కూడా పలు కాలనీలకు ట్యాంకర్ల నీరే దిక్కయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనిపై ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగుతారో చూడాలి. ఆదాయం పెంచుకునే అవకాశమున్నా .. గ్రేడ్–1 స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్ మున్సిపల్లో కార్మికుల వేతనాల చెల్లింపునకు ప్రతిసారి ఇబ్బందులు తప్పడం లేదు. దీన్నిఅధిగమించేలా బల్దియా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలున్నా ఆ దిశగా దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. చాలా చోట్ల మడిగెలు ఖాళీగా ఉంటున్నా వాటిని అద్దెకు ఇచ్చే ఆలోచన చేయకపోవడం గమనార్హం. ఆ నిధుల వినియోగం ఎప్పుడో.. ఆదిలాబాద్ పట్టణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.18.50 కోట్ల ప్రత్యేక నిధులను విడుదల చేసింది. వాటితో వివిధ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించేలా అధికారులు ప్రతిపాదనలు గతంలోనే సిద్ధం చేశారు. అయితే రాజకీయ కారణాల కారణంగా వాటిని నిలిపివేశారు. నూతన కౌన్సిల్ రావడంతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ప్రాధాన్యత క్రమంగా నిధులు కేటాయించి త్వరగా అభివృద్ధి పనులు చేపడుతారా లేక రాజకీయ జోక్యంతో వాయిదా వేస్తారా అనేదానిపై సర్వత్రా చర్చ సాగుతుంది. అసంపూర్తి నిర్మాణాల పరిస్థితేంటో.. పట్టణ ప్రజలకు కూరగాయలతో పాటు మాంసం, చేపలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మంజూరు చేసింది. రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భవన నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. నాలుగేళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగని పరిస్థితి. ఇండోర్ స్టేడియం పరిస్థితి అలాగే ఉంది. నిధులు విడుదల లేక ఫిల్లర్లదశలోనే ఆగిపోయింది. వీటిపై కౌన్సిల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారా లేక నిధుల లేమి సాకుతో వదిలేస్తారా వేచి చూడాలి. -
● అక్రమార్కుల పాలిట సింహస్వప్నంలా పోలీస్ బాస్ ● శాఖలోనూ సమూల మార్పులకు శ్రీకారం ● నూతన కార్యక్రమాలతో ప్రజలకు చేరువ ● మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు ● ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది
ఎస్పీ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు.. ఆపరేషన్ ఛబుత్రా, మెసేజ్ యువర్ ఎస్పీ, గ్రామాల్లో వీపీవో విధానం, పోలీస్ అక్క, రౌడీమేళా, మైనర్ డ్రైవింగ్పై కౌన్సెలింగ్, అభయ మై టాక్సీ ఇస్ సేఫ్, ఖాకి కిడ్స్ జిల్లా పోలీసు బాస్గా అఖిల్ మహాజన్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి కానుంది. 12 నెలల వ్యవధిలో తనకంటూ ప్రత్యేకత చాటుతున్నారు ఎస్పీ. అక్రమార్కుల భరతం పట్టడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. బ్లాక్ మెయిల్, అక్రమదందాలకు చెక్ పెడుతున్నారు. తప్పు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించకుండా ఊచలు లెక్కించేలా ముందుకు సాగుతున్నారు. అలాగే మహిళలు, యువతులు, విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతీ సోమవారం గ్రీవెన్స్కు వచ్చే బాధితులకు అండగా ఉంటూ సత్వర న్యాయం అందేలా చొరవ చూపుతున్నారు. – ఆదిలాబాద్టౌన్అఖిల్ మహాజన్, ఎస్పీ -
ప్రజారోగ్యంపై ఫోకస్
ఆదిలాబాద్టౌన్: ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నాలుగు దశల్లో వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. మొదటి దశలో గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నారు. రెండో దశలో అసంక్రమిత వ్యాధులు, మూడో దశలో సంక్రమణ వ్యాధులు, నాలుగో దశలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రత్యేక వైద్యులతో వైద్య సేవలు అందించనున్నారు. 99 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో 30 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. రిమ్స్తో పాటు పీహెచ్సీలు, సీహెచ్సీలు అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, సబ్ సెంటర్లలో ఈ సేవలు అందించనున్నారు. అలాగే ఆస్పత్రుల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు. నాలుగు దశల్లో సేవలు.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యారోగ్య శాఖ ద్వారా నాలుగు దశల్లో వైద్య పరీక్షలు చేపట్టనున్నారు. మొదటి విడత ఈనెల 6 నుంచి 12వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రసుతి, కౌమర, వృద్ధులకు రక్తహీనత పరీక్షలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆరోగ్యం, స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో విడత ఏప్రిల్ 1 నుంచి 15 వరకు బీపీ, షుగర్, క్యాన్సర్ తదితర వ్యాధులకు సంబంధించి సబ్సెంటర్లలో స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. మూడో విడత ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అంటువ్యాధులు, టీబీ, హెచ్ఐవీ తదితర వ్యాధులకు సంబంధించి పరీక్షలు చేయనున్నారు. నాలుగో విడత మే 16 నుంచి జూన్ 12 వరకు కంటి పరీక్షలు, దంత పరీక్షలు చేపట్టనున్నారు. దీంతోపాటు హెచ్ఐవీపై అవగాహన, మాతా శిశు, నవజాత శిశు మరణాలు తగ్గించడం, ఔషధ మొక్కలపై అవగాహన, మందులు అధికంగా వాడడంతో దుష్పరిణామాలను తెలియజేయనున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో చికిత్స అందించనున్నారు. అలాగే మహిళ సంఘాల సభ్యులకు వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్ చేపట్టనున్నారు. వేసవిలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వ్యాధుల గురించి అవగాహన కల్పించనున్నారు. పకడ్బందీగా నిర్వహిస్తాం.. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోనూ పకడ్బందీగా అమలు చేస్తాం. 99 రోజుల పాటు చేపట్టే కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేపడతాం. లక్ష 20వేల మంది సభ్యులు ఉండగా, ప్రతిఒక్కరికి వైద్య పరీక్షలు అందిస్తాం. రిమ్స్లోని స్పెషాలిటీ వైద్యులతో గ్రామాల్లో సేవలు అందించేలా చర్యలు చేపడతాం. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
కై లాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలను పెండింగ్లో ఉంచొద్దని, ప్రతీ దరఖాస్తును త్వరితగతిన పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ వారం 71 అర్జీలు అందగా ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూసమస్యలు ఉన్నాయి. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఏవో వర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే ..అధికారుల తీరుపై ఆగ్రహం పలువురు జిల్లా స్థాయి అధికారులు ప్రజావాణికి గైర్హాజరు కావడంపై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీవెన్స్కు ప్రతి అధికారి విధిగా హాజరుకావాలని పదేపదే చెబుతున్నా కొంతమందిలో మార్పు రావడం లేదని సీరియస్ అయ్యారు. తీరు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
‘ప్రగతి’ బాటలో కలెక్టర్
కై లాస్నగర్: ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్ర జ లకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కా ర్యాచరణలో భాగంగా సోమవారం కలెక్టరేట్ లో పారిశుధ్యం, ఫైళ్ల క్లియరెన్స్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి ప్రాంగణంలో చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. డీసీవో కార్యాలయంలో పరిసరాలు, సీపీవో కార్యాలయంలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రెజరీ కార్యాలయంలో ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోవడంపై ప్రశ్నించారు. అనంతరం మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఐదు రోజుల్లో పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. వారి వెంట ఆర్డీవో స్రవంతి, కమిషనర్ జి.రాజు, కౌన్సిలర్ స్వాతి, ప లు శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆరోగ్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి ఇచ్చోడ: జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న మెగా ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో సోమవా రం నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఇందులో డీఎంహెచ్వో నరేందర్రాథోడ్, ఇచ్చోడ వైద్యాధికారి మధురిమ, రిమ్స్ వైద్యులు ఉన్నారు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ మండల పరిషత్ కార్యాలయంలో చేపడుతున్న ప్ర జావాణిలో కలెక్టర్ పాల్గొని ప్రజలనుంచి దరఖాస్తు లు స్వీకరించారు. ఇందులో తహసీల్దార్ ఇమ్రాన్ఖా న్,ఎంపీడీవో రవీందర్, అధికారులు పాల్గొన్నారు. -
మహిళా సమాఖ్యలకు భవనాలు
కై లాస్నగర్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఇబ్బందులు దూరం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలోనూ పక్కా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఉపాధి నిధులతో వీటిని నిర్మించనున్నారు. ఈ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతగా జిల్లాకు 398 మంజూరు చేయగా ఇందులో ఇప్పటివరకు 70 నిర్మాణాలకు అధికారులు భూమి పూజ చేశారు. ఈ నెలాఖరులోగా మిగతా చోట్ల స్థలాలు గుర్తించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇబ్బందులను దూరం చేసేలా.. స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాల మంజూరు, పొదుపు డబ్బులు చెల్లించడం, రుణాల కిస్తీలు చెల్లింపు కోసం సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం జిల్లా, మండల స్థాయిలో సమాఖ్యలకు భవనాలు ఉన్నాయి. గ్రామస్థాయిలో మాత్రం పక్కా భవనాలు లేక ఇబ్బందులు తప్పని సరిస్థితి. కొన్ని చోట్ల చెట్ల కింద, అంగన్వాడీ, సంఘం అధ్యక్షురాలి ఇంటి ఆవరణలో అవస్థల నడుమ నిర్వహించాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం వారి ఇక్కట్లను దూరం చేసేలా గ్రామస్థాయిలోనూ భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్) కింద ఒక్కో భవనాన్ని రూ.10 లక్షల వ్యయంతో 200 గజాల స్థలంలో నిర్మించనున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలోనూ స్థలాన్ని ఎంపిక చేసి భవన నిర్మాణానికి భూమి పూజ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ సమాఖ్య సభ్యులు తమ పరిధిలో ప్రభుత్వ సూచన మేరకు అనువైన స్థలాన్ని గుర్తించి తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మానాన్ని గ్రామసభ ఆమోదం కోసం పంచాయతీకి పంపించాలి. జీపీ ఆమోదం అనంతరం ఎంపీడీవోకు పంపుతారు. ఎంపీడీవో తహసీల్దార్ సంయుక్తంగా స్థలాన్ని పరిశీలించి ఎంపిక చేస్తే జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అనంతరం పంచాయతీరాజ్ అధికారులు నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో.. గ్రామీణ మండలాలు : 20 స్వయం సహాయక సంఘాలు : 10,990 గ్రామ సమాఖ్య సంఘాలు : 554 స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు : 1,48,052 స్థలాల గుర్తింపు ప్రకారం పనులు జిల్లాకు తొలి విడతగా 398 గ్రామ మహిళా స మాఖ్య భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఇప్పటివరకు అధికారులు స్థ లాల ను గుర్తించిన 78 భవనాల నిర్మాణాలకు మా ర్కౌట్ ఇచ్చాం. పనులు సాగుతున్నాయి. మిగతా చోట్ల కూడా స్థలాలను గుర్తించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం. – రాథోడ్ శివరాం, పంచాయతీరాజ్ ఈఈ -
ఉదయం చలి.. మధ్యాహ్నం ఎండ
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో భిన్న వాతావరణంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి వరకు చలి తీవ్రత ఉండగా, ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజామున మాత్రం చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఎండ ప్రభా వంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా చాలామంది జలు బు, దగ్గుతో పాటు జ్వరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అప్పుడే మండుతున్న భానుడు.. మార్చి మొదటి వారంలోనే జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 16.2 నమోదు కాగా, గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మధ్యాహ్నం 12 దాటిందంటే బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిత్యం కిటకిటలాడే బస్టాండ్, రైల్వేస్టేషన్, తెలంగాణచౌక్, అంబేద్కర్, గాంధీచౌక్ ప్రాంతాల్లో రద్దీ కనిపించని పరిస్థితి. చిరు వ్యాపారులు, ఇతర కూలీ పనులు చేసేవారు ఎండ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బతో జాగ్రత్త.. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ఎండలో ఎక్కువగా తిరిగే వారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తప్పనిసరిగా ఎండలో బయటకు వెళ్లే వారు గొడుగు, ఇతర రక్షణ కవచాలు ధరించాలని సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీ ఫారన్హీట్ దాటితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె ధడ, చెమట ఎక్కువగా రావడం, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అలాగే శరీరంలో ప్రొటీన్ స్థాయి తగ్గిపోయి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయని పేర్కొంటున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
ఐక్య పోరాటాలతో సమస్యలు పరిష్కారం
ఆదిలాబాద్టౌన్: ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు జ్యోతి అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. మార్చి నెలను వేడుకగా కాకుండా పోరాట మా సంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మ హిళలు అన్నిరంగాల్లో రాణించాలని సూచించా రు. కార్యక్రమంలో మావల ఎంఈవో సరోజ, జీసీడీవో ప్రత్యూష, కవైత్రి శైలజ, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోతె శ్రీనివాస్, బి.వృకోధర్, రామేశ్వర్, జ్ఞానేశ్వర్, సాయికాంత్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ధర పెంపుపై సీపీఎం ఆందోళన
ఆదిలాబాద్టౌన్: గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టా రు. జిల్లాకేంద్రంలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలి పారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ వద్ద రహదారి పై బైఠాయించి నినా దాలు చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లే శ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే గ్యాస్ ధర పెరుగుతుందని ఆరోపించారు. గృహ వినియోగ గ్యాస్పై రూ.60, కమర్షియల్ గ్యాస్పై రూ.115 పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బండి దత్తాత్రి, పూసం సచిన్, ఆర్.సురేందర్, ఆర్. మంజుల, ఆరిఫా, రాధా, గంగారాం, రాములు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి
నేరడిగొండ: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవాలని శ్రీ శివానంద భారతి స్వామిజీ అన్నారు. మండలంలోని తేజాపూర్లో ఆదివా రం నిర్వహించిన సాధు సమ్మేళనం, వేదాంత విజ్ఞాన మహాసభల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆధ్యాత్మిక జీవనం మనిషికి శాంతితో పాటు ఆనందాన్ని ఇస్తుందన్నారు. దేవునిపై విశ్వాసం పెంపొందించుకోవడంతో పాటు పరస్పరం సహకారం, స్నేహభావం కలిగి ఉండాలన్నారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం కూడా ఒక విధమైన భక్తి అని వివరించారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి సాధువులు, ఆధ్యాత్మిక గు రువులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. -
కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి
● డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి ఆదిలాబాద్టౌన్: మహిళలు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగాల ని సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్.రాజ్యలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా జైలులో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా జడ్జి ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. మహిళలు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించా రు. జిల్లా జైలు సూపరింటెండెంట్ పి.గోపిరెడ్డి మాట్లాడుతూ మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థికంగా స్థిరపడాలన్నారు. జైలులో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు మహిళా సిబ్బందిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఖైదీలు, సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ రాథోడ్ ప్రకాశ్, జవాన్లు జావీద్, వేణుగోపాల్, సాయికిరణ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
జాగ్రత్తలు పాటించాలి
ప్రస్తుతం జిల్లాలో భిన్న వాతావరణం ఉంది. ఉదయం చలి.. మధ్యాహ్నం ఎండ కారణంగా దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని తాగడం మంచిది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. బయటకు వెళ్లే వారు ఎక్కువగా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి. – ఆడె విఠల్, రిమ్స్ వైద్యులు -
బాలికల ఆరోగ్య రక్షణకు ‘హెచ్పీవీ’
ఆదిలాబాద్టౌన్: బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్పీవీ టీకా ఎంతో కీలకమని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. 14–15 ఏళ్ల బాలికలకు ఇవ్వనున్న హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీ గొడం నగేశ్తో కలిసి రిమ్స్లో ఆదివా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. బాలికలు ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వంటివి రాకుండా నిరోధించవచ్చన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1700 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీఎస్ఆర్ నిధులతో రిమ్స్లో మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం అధునాతన సదుపాయలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మదర్ ఫీడింగ్ గదులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా క్యాన్సర్ మరణాల రేటు ఎక్కువగా ఉందని, ముందస్తుగా వ్యాధి ని గుర్తించడం ద్వారా నివారించవచ్చని పేర్కొన్నా రు. జిల్లా ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ వ హిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, అదనపు డీఎంహెచ్వో సాధన, వార్డు కౌన్సిలర్ శ్వేత, డీఐవో డాక్టర్ వైసీ శ్రీనివాస్, డీటీసీవో సుమలత, ఎన్సీడీ పీవో శ్రీధర్, ఎన్హెచ్ఎం డీపీవో జాదవ్ దేవిదాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం అభినందనీయం మహిళలు రక్తదానం చేయడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ ఆధ్వర్యంలో రిమ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో 16 మంది నర్సులు రక్తదానం చేశారు. వారిని కలెక్టర్తో పాటు ఎంపీ నగేశ్ అభినందించారు. -
రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఆదిలాబాద్: కొల్లాపూర్ నుంచి ధన్బాద్ వెళ్తున్న దీక్షభూమి ఎక్స్ప్రెస్లో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే పోలీస్ ఇన్చార్జి టి.ప్రభాకర్ తెలిపారు. శనివారం అర్ధరాత్రి 12.15 గంటలకు రైలు ఆదిలాబాద్ స్టేషన్కు చేరుకోగా, అపస్మారక స్థితిలో ఉన్న సదరు వ్యక్తిని రైల్వే డాక్టర్ పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి వయస్సు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎరుపు రంగు ఫుల్హాండ్స్ రౌండ్ నెక్ టీషర్ట్, నీలిరంగు నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడని వివరించారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రిలో భద్రపర్చినట్లు వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసినవారు 9963313395 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఉరేసుకుని మహిళ ఆత్మహత్య తాంసి: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భీంపూర్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పూదరి నాగమ్మ (57) గృహిణి. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. శనివారం ఉదయం గమనించిన కుటుంబీకులు అందించిన సమాచారంతో ఎస్సై అక్కడికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మూటలు పంపడమే తప్ప రైతు సంక్షేమమేది?
జైనథ్: సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న ఆసక్తి రైతులకిచ్చిన హామీలు అమలు చేయడంపై లేదని బీజేపీ శాసనసభపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకోని రేవంత్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుభరోసా నిధులు జమచేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అందుకోసం ఉంచిన రూ.9వేల కోట్లను నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని ఢిల్లీ నుంచి పిలుపురాగానే జమ చేయలేదన్నారు. రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన డబ్బులను కాంట్రాక్టర్ల ఖాతాల్లో వేసి వారి నుంచి కమీషన్లు తీసుకుని రాహుల్గాంధీ ద్వారా వెయ్యి కోట్లు ఢిల్లీకి పంపించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కౌలు రైతులను ఆదుకుంటామని, రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతుభరోసా జమ చేయకుండా కమీషన్లు, భూముల విక్రయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి అనేక హామీలను విస్మరించారన్నారు. 99 రోజుల ప్రజాపాలన పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్ని డబ్బులు కేటాయించరని సీఎంను ప్రశ్నించారు. అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారని, ఈ కార్యక్రమంలో పాల్గొనే దమ్ము అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉందా అని నిలదీశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు రూ.2,500 నగదు, వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ల పెంపు, అలాగే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యానికి కూడా డబ్బులు లేవన్నారు. మాజీ సర్పంచ్లు చేసిన పనులకు బిల్లులివ్వని దద్దమ్మ సీఎం అని మండిపడ్డారు. అసమర్థ పాలనపై రైతుల నుంచి సేకరించిన సంతకాలను సీఎంకు పంపుతామని తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ముఖ్యమంత్రి అర్థం చేసుకుని వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు కార్యక్రమాన్ని కొనసాగించి పది లక్షల సంతకాలు సేకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ గోడం నగేశ్, బీజేపీ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు బ్రహ్మానంద్, రిథిష్ రాథోడ్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జనంలోకి వెళ్లే ధైర్యం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేదు -
బాధితుల వద్దకే పోలీసు
ఆదిలాబాద్టౌన్: పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేరం జరిగిన చోటకే పోలీసులు వెళ్లి సంఘటన స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో ఇటీవల 6 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ వన్టౌన్లో, మావల పోలీస్ స్టేషన్లో, తలమడుగు, బోథ్, బేల, భీంపూర్ ఒకటి చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు. సంఘటన జరిగిన చోట సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడికి ల్యాప్టాప్తో వెళ్లి ఎఫ్ఐఆర్ను ఆన్లైన్లో నమోదు చేస్తారని, బాధితులకు ఓ కాపీ అందజేస్తారని వెల్లడించారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. -
‘తల్లి పిలుపు’నకు ఏడేళ్లు
ఆదిలాబాద్టౌన్: మాతా, శిశుమరణాల కట్టడికి వైద్యారోగ్యశాఖ ప్రారంభించిన ‘తల్లి పిలుపు’జిల్లాలో సత్ఫలితాలిస్తోంది. అప్పటి కలెక్టర్, ప్రస్తుత సెర్ప్ కమిషనర్ దివ్యదేవరాజన్ శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2018లో ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంటుంది. జిల్లాలో గర్భిణుల ఆరోగ్యంపై ఫోకస్ పెట్టిన కలెక్టర్ వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆశకార్యకర్తలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. గర్భం దాల్చిన సమయం నుంచి వారి ప్రసవం వరకు ఫోన్ కాల్ చేస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. హైరిస్క్ ఉన్నవారిని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. వారు సుఖ ప్రసవమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పీహెచ్సీల వారీగా సేకరించిన సమాచారం ఆధారంగా ఫోన్లు చేస్తూ వారి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. వివిధ భాషల్లో.. తల్లి పిలుపు కార్యక్రమం కోసం నలుగురు ఆశ కార్యకర్తలను నియమించారు. ప్రతీరోజు ఒక్కొక్కరు వంద చొప్పున నెలకు 5వేల వరకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, లంబాడీ, గోండి, కొలాం భాషల్లో గర్భిణుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటారు. ఇప్పటి వరకు 5 వేల గర్భిణులకు అవసరమైన రక్తాన్ని వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిందని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. వారికి ప్రసవమయ్యే వరకు మూడు, నాలుగు సార్లు ఫోన్కాల్స్ చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 4 లక్షల వరకు కాల్స్ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంతో ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లోని గర్భణులకు ప్రయోజనం చేకూరుతున్నట్లు పేర్కొంటున్నారు. -
గ్యాస్ ‘ధర మండింది’!
● సరఫరా సైతం నిలిచింది ● డొమెస్టిక్ సిలిండర్పై రూ.60 పెంపు ● లబోదిబోమంటున్న ‘గృహ’ లబ్ధిదారులు కై లాస్నగర్: వంట గ్యాస్ ధర మండింది. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ద ప్రభావం మన వద్ద సెగ చూపుతోంది. చాలా దేశాలకు ఇంధన కేంద్రమైన ఇరాన్ నుంచి గ్యాస్, క్రూడాయిల్ సరఫరాకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో జిల్లాకు శనివారం సిలిండర్ల సరఫ రా నిలిచిపోయింది. దీనికి తోడు గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ ధరను ఆయిల్ కంపెనీలు ఏకంగా రూ.60 పెంచేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ కూడా అందని పరిస్థితి. దీంతో సిలిండర్ ధర రూ.1000కి చేరువైంది. ఇప్పటికే ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరతో లబోదిబోమంటున్న సామాన్యుడికి ఇది మరింత భారం కానుంది. ధర పెంపుతో జిల్లాలోని వంటగ్యాస్ వినియోగదారులపై నెలకు రూ.1.23 కోట్ల అదనపు భారం పడనుంది. ఉజ్వల, దీపం లబ్ధిదారులకు సైతం వర్తింపు ఇది వరకు వంట గ్యాస్ ధర పెంపును కేంద్ర ప్రభుత్వం కేవలం జనరల్ కనెక్షన్ దారులకు మాత్రమే పరిమితం చేసేది. తాజాగా ఉజ్వల,దీపం కనెక్షన్దా రులకు సైతం వర్తింపజేసింది. ఈ కనెక్షన్లన్నీ నిరుపేదలకు కేంద్రం మంజూరు చేసినవే. వీటికి సిలిండర్కు రూ.300 సబ్సిడీగా ఇచ్చేది. తాజాగా అలాంటి వారిపైన కూడా భారం పడనుంది. మొన్నటి వరకు నామమాత్రంగా అందించే రూ.47 సబ్సిడీని సైతం నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వపరంగా చెల్లించే సొమ్ము నెలల తరబడి లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాని పరిస్థితి.జిల్లాలో.. వంట గ్యాస్ ఏజెన్సీలు 17 గ్యాస్ కనెక్షన్ల వివరాలు 2,05,250 దీపం 46,136 ఉజ్వల 36,960 జనరల్ 1,22,154 నిన్నటి వరకు ఎల్పీజీ ధర రూ.932 పెంపు తర్వాత ధర రూ.992 -
భుక్తాపూర్లో పర్యటించిన చైర్పర్సన్
కైలాస్నగర్: పట్టణ పరిశుభ్రతలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ‘సాక్షి’ స్టార్ రిపోర్టర్ క్యాంపెయిన్లో భాగంగా పట్టణంలోని అంబేడ్కర్చౌక్లో విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల వద్దకు వేకువజామున వెళ్లి పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జీవన స్థితిగతులపై ఆరా తీఽశారు. వారితో కలిసి టీ తాగారు. అన్ని సమస్యలు పరిష్కరించేలా తనవంతు కృషి చేస్తానని భరోసానిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు ‘సాక్షి’ తీసుకున్న చొరవ అభినందనీయమని అన్నారు. మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కార్మికుల ఆరోగ్యానికి పెద్దపీట ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడారు. వేకువజామునే పట్టణంలోని రోడ్లపైకి చేరుకుని వీధులను శుభ్రం చేసే మహిళా కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అధిక ప్రాధాన్యతనివ్వాలి.. ఇందుకోసం మున్సిపల్ పరంగానూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.. విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం.. నెలకు 6 చీపుర్లు ఇవ్వడంతో పాటు డ్రెయినేజీలు, రోడ్లను శుభ్రపరిచే క్రమంలో వచ్చే దుమ్మతో ఇబ్బందులు పడకుండా ఉండేలా గ్లౌజులు, కొబ్బరినూనె, సబ్బులతో పాటు బెల్లం అందించేలా చర్యలు తీసుకుంటాం.. తొలి కౌన్సిల్ సమావేశంలోనే ప్రాధాన్యత అజెండాగా చేర్చి నిధులు కేటాయించేలా తీర్మానం చేస్తాం.. ఇక నుంచి వాటిని రెగ్యులర్గా అందించేలా ప్రత్యేక శ్రద్ద వహిస్తాం.. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రతీ మూడు నెలలకోసారి బల్దియా ద్వారా ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం.. అవసరమైన వారికి ఉచితంగా మెడిసిన్ అందించేలా చూస్తాం.. పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాం.. మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే విధులు నిర్వహించే వెసులుబాటు కల్పిస్తాం. ఆరోగ్యపరంగానూ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత జవాన్, కమిషనర్ లేదంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు.. వేతనాల పెంపు విషయాన్ని కూడా పరిశీలిస్తాం. ప్రస్తుతం బల్దియా ఖజానా ఖాళీగా ఉంది. రానున్న రోజుల్లో మున్సిపల్ ఆదాయం పెంచుకునేలా చర్యలు చేపడుతామని అన్నారు.అనంతరం పట్టణంలోని 45వ వార్డు భుక్తాపూర్లో పర్యటించారు. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వీధి కుక్కల బెడద అధికంగా ఉందని వారు చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రాత్రివేళలో మూగ జీవాల సంచారంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని వివరించగా పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. -
మహిళా శక్తిగా ఎదుగుతూ
ఆదిలాబాద్టౌన్: మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారనేందుకు ఈ అతివలే నిదర్శనం. హోటల్ నిర్వహణపై ఆసక్తి చూపిన వీరికి ఇందిరా మహిళా శక్తి ద్వారా ప్రభుత్వం అండగా నిలిచింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో స్వ యం సహాయక సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. నిర్వాహకులతో పాటు మరికొంత మందికి ఉపాధి చూపుతోంది. రుచితోపాటు శుచి ఆసుపత్రిలో తినాలంటే చాలామంది ముందుకు రా రు. పరిసరాల్లో దుర్గంధం, అపరిశుభ్రతే కారణం. అయితే సూపర్ స్పెషాలిటీలో ఏర్పాటు చేసిన క్యాంటిన్లోని ఆహారపదార్థాలు రుచితో పాటు శుచి పా టిస్తుండడంతో నిత్యం వినియోగదారులతో కిటకిటలాడుతుంది. వైద్యులతో పాటు రోగుల బంధువులు, పేషెంట్స్ ఇక్కడే టిఫిన్, భోజనం చేస్తున్నారు. ఉదయం 6నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహణ చేపడుతున్నారు. తమకు లాభాలు ముఖ్యం కాదని రుచికరమైన భోజనం అందించడమే ప్రధానమని అంటున్నారు నిర్వాహకులు. మహిళాశక్తిగా చాటుతున్నారు.. ఈ క్యాంటీన్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 2025 జనవరి 6న ప్రారంభమైంది. మొదట్లో గిరాకీ లేక వండిన ఆహార పదార్థాలను పడేసేవారు. తొలుత నిర్వాహకులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఓపికగా ముందుకు సాగారు. ప్రస్తుతం ముగ్గురు సభ్యులు సరోజ, రమాదేవి, లావణ్యతో పాటు మరో ఇద్దరు వర్కర్లు పనిచేస్తున్నారు. వర్కర్లకు నెలకు రూ.12వేల చొప్పున చెల్లించడంతో పాటు తమకు సైతం గిట్టుబాటు అయ్యేలా క్యాంటిన్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రోజు 30 మంది వైద్యులు, 60నుంచి 70 మంది రోగులు, వారి సహాయకులు టిఫిన్ చేస్తున్నారని, 50 మంది వరకు భోజనం చేస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. బయటి హోటళ్ల మాదిరిగానే రేట్లు ఉన్నప్పటికి నాణ్యతలో రాజీపడటం లేదు. కజ్జర్ల గ్రామానికి చెందిన సరోజ చిన్నచిన్న భోజనం ఆర్డర్లను తీసుకుంటూ జీవనం సాగిస్తుండగా, ఆది లాబాద్ పట్టణానికి చెందిన రమాదేవి టైలరింగ్, కజ్జర్లకు చెందిన లావణ్య వ్యవసాయ పనులు చేసేవారు. ప్రస్తుతం తమతో పాటు మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నామని చెబుతున్నారు వీరు. తమకు ఉపాధి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి
ఆదిలాబాద్టౌన్: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక సరస్వతి నగర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ‘లక్ష్యం’ కరదీపికను ఆవిష్కరించి, ‘ఆల్ ఇన్ వన్’ స్టడీ మెటీరియల్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టంగా కాకుండా ఇ ష్టపడి చదవాలన్నారు. పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడి ఉంటే ‘టెలీమానస్’ హెల్ప్లైన్ నంబర్ ద్వా రా సాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్, డీసీఈబి సెక్రెటరీ గజేందర్, సెక్టోరియల్ అధికారులు లక్ష్మణ్, అజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముత్నూర్ పాఠశాల త నిఖీ..ఇంద్రవెల్లి: మండలంలోని ముత్నూర్ గురుకుల పా ఠశాలను సందర్శించారు. కిచెన్, స్టోర్ రూమ్లను తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో మాట్లాడారు. చదువుతో పాటు ఆరో గ్యంపై కూడా దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, అదనపు వైద్యారోగ్య అధికారి మనోహర్, ఉపాధ్యాయులు, విద్యార్థినులున్నారు. శ్యాంపూర్లో మెగా వైద్యశిబిరంఉట్నూర్రూరల్: మండలంలోని శ్యాంపూర్ పీహెచ్సీలో శనివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆదిలాబాద్ రిమ్స్కు చెందిన పలు విభాగాల వైద్యులు పాల్గొని సుమారు 300 మందికి వైద్య పరీక్షలు చేశారు. శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంత రం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీ లించి త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్వో నరేందర్, అదనపు డీఎంహెచ్వో మనోహర్, ఉట్నూర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉపేందర్, శ్యాంపూర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సందీప్, వైద్య సిబ్బంది ఉన్నారు. గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలికై లాస్నగర్: సర్పంచ్లు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. డీపీఆర్సీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించి న బోథ్, సోనాల, భీంపూర్, మా వల మండలాల సర్పంచ్ల నాలుగో విడత శిక్షణ ముగి సింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అ నంతరం మాట్లాడుతూ,ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతీగ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూ చించారు. కార్యక్రమంలో డీపీవో రమేశ్, డీఎల్పీవో ఫణీందర్రావు, బోథ్ ఎంపీడీవో రమేశ్, మాస్టర్ ట్రైనర్ మహేశ్, సర్పంచులు పాల్గొన్నారు.ఉత్సాహంగా క్రీడా పోటీలుఆదిలాబాద్: మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మహిళా ఉద్యోగులకు శనివారం క్రీడా పోటీలు నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా, మున్సిపల్ చైర్పర్సన్ అనూషతో కలిసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించి, వారిలో ఉత్సాహం నింపేందుకు పోటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ క్రీడల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. అనంతరం ఇటీవల నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో గెలుపొందిన విజేతలను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో మిల్కా, మున్సిపల్ కమిషనర్ రాజు, డీవైఎస్వో శ్రీనివాస్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, వార్డ్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
నేరరహిత పట్టణానికి సహకరించాలి
ఆదిలాబాద్టౌన్: పట్టణాన్ని మరింత సురక్షితంగా, నేర రహితంగా మార్చేందుకు సీసీ టీవీ కెమెరాల ఏ ర్పాటు కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణంలోని ఏఆర్హెడ్ క్వార్టర్స్లో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలోని 27 వ్యాపార సంఘాల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీసీ టీవీ కెమెరాల ఏర్పా టు ద్వారా నేరాలను ముందుగానే నిరోధించవచ్చన్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించడానికి ఉపయోగపడుతుందని తెలి పారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు ఎల్.జీవన్రెడ్డి, ఇంద్రవర్ధన్, సీఐలు సునీల్కుమార్, కె.నాగరాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలి పా రు. గడిచిన వారంలో సైబర్ కార్యాలయానికి 8 ఫి ర్యాదులు అందినట్లుగా పేర్కొన్నారు. సైబర్మోసా నికి గురైన వెంటనే బాధితులు 1930 నంబర్లో లేదా సైబర్క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నా రు. గంటలోపు ఫిర్యాదు చేస్తే పూర్తి న్యాయం జరిగే ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. -
‘కడెం’ తీరాన పురాతన ఆలయం
● తొమ్మిదో శతాబ్దం నాటిదిగా గుర్తింపురాష్ట్రకూటుల కాలం నాటి గణపతి విగ్రహం నరసింహస్వామి భగ్నశిల్పం కాకతీయుల కాలం నాటి గణపతి విగ్రహం చాళుక్యశైలి చామరధారిణి చాళుక్యశైలి భువన శిల్పం పురాతన నరసింహస్వామి ఆలయం కడెం: మండలంలోని గంగాపూర్ పంచాయతీ పరి ధి దేవునిగూడెం గ్రామ శివారులో క్రీస్తు శకం తొ మ్మిదో శతాబ్దంలో పురుడు పోసుకున్న పురాతన ఆలయాన్ని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్కుమార్ గుర్తించారు. కడెం నది కుడి వైపున ఎత్తైన కొండపై ఇది ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. రాతి దూలాలు, రాతి స్తంభాలు చెల్లాచెదురుగా ప డి ఉన్న ఈ గుడి గర్భాలయం కొంచెం పదిలంగా నే ఉంది. గర్భగుడి, ఆలయ ప్రాంగణం, అక్కడికి కొంత దూరంలోనూ ఆరుబయట ఉన్న విగ్రహాల శైలిని బట్టి ఈ ఆలయం రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయుల కాలంలోనే కాకుండా కాకతీయు ల అనంతర కాలంలోనూ ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. రాష్ట్రకూటుల శైలికి చెందిన గణపతి విగ్రహం అందంగా శిల్పీకరించబడింది. చాళుక్య శైలికి చెందిన భువనశిల్పం, ఇదే శైలికి చెందిన మ రో గణపతి విగ్రహం, ఏక దేవత అధిష్టాన పీఠం, మరో అధిష్టాన పీఠం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆలయం ఎదుట ఈశాన్య దిశలో ఒక శాసన ఫల కం ఉంది. దాని మీది అక్షరాలు చెరిగిపోయి దాదా పు సమతలంగా కనిపిస్తోంది. ఆలయ ప్రాంగణంలో చెట్టు కింద భగ్నమైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి విగ్రహం, నందులు, సౌందర్యారాధకుల విగ్రహా లున్నాయి. స్థానికులు ఈ గుడిని ప్రస్తుతం లక్ష్మీ న రసింహస్వామి గుడిగానే పిలుస్తున్నారు. కడెం న దీ తీరం దాటి దేవుని గూడ గ్రామ సమీపంలోకి చే రితే ఎడమవైపు ఉండి లేనట్టున్న చిన్న పందిరి కింద నాలుగు విగ్రహాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. కాకతీయుల అనంతర కాల చతుర్భుజ వినాయకుడు, ఇదే కాలానికే చెందిన దుర్గను పోలి న విగ్రహం, అందమైన శిరోజాలంకరణతో చాళు క్య శైలికి చెందిన చా మరధారిణి, నంది ప్రతిమలు దర్శనమి స్తాయి. ఇవి భిన్నం కావడం మూలాన ఆలయం బయట ఉంచి ఉంటారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలి పారు. ఈ ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తే ముందు తరాల వారికి రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి చరిత్ర అందించవచ్చని అభిప్రాయపడుతున్నారు. -
అడవిపందిని వేటాడిన ముగ్గురి అరెస్ట్
పెంచికల్పేట్: పెంచికల్పేట్ శివారులోని పంట చేలలో అడవిపందిని వేటాడిన ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పెంచికల్పేట్ ఎఫ్ఆర్వో అనిల్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 4న వ్యవసాయ పొలాల సమీపంలో వన్యప్రాణులను వేటాడటానికి విద్యుత్ తీగలు అమర్చారనే పక్కా సమాచారంతో అటవీశాఖ సిబ్బంది దాడులు నిర్వహించారు. వీరికి వేటకు వినియోగించిన విద్యుత్ తీగలు లభించాయి. అనుమానంతో పెంచికల్పేట్ గ్రామానికి చెందిన అప్పాజి శ్రీనివాస్ ఇంట్లో సోదాలు నిర్వహించగా వండిన పంది మాంసం లభించింది. అతడిని అదుపులో తీసుకుని విచారించగా అదే గ్రామానికి చెందిన అప్పాజి బుచ్చన్న, గణపతితో కలిసి వేటాడినట్లు అంగీకరించాడు. నిందితులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో డిప్యూటీ రేంజ్ అధికారి ఆస్మా, ఎఫ్బీవోలు సతీశ్, మనోహర్, లచ్చన్న, సంగదీప్, మహేశ్, దినేశ్, సిబ్బంది వాజీద్, రాజు పాల్గొన్నారు. -
నిర్మల్ కవి దేవరావుకు సారస్వత పరిషత్ పురస్కారం
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కవి, సాహితీవేత్త, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావుకు ప్రతిష్టాత్మక డాక్టర్ బీఎన్ శాస్త్రి ధర్మనిధి పురస్కారం వరించింది. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో భాష, సాహిత్యం, చరిత్ర రంగాల్లో విశేష కృషి చేస్తున్నవారికి ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుండగా ఈసారి దేవరావు ఎంపికై నట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య వెల్లడించారు. ఈ నెల 17న హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాంగణంలోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో నిర్వహించే కార్యక్రమంలో పురస్కారం అందజేయనున్నారు. ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన, డాక్టర్ చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రూ.5వేల నగదు, జ్ఞాపిక, శాలువా, ప్రశంసాపత్రాన్ని దేవరావుకు ప్రదానం చేయనున్నారు. చరిత్ర పరిశోధనలో ప్రత్యేక ముద్ర ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూనే పాతికేళ్లుగా తుమ్మల దేవరావు చరిత్ర పరిశోధనలో నిరంతరం కృషి చేస్తున్నారు. కన్నడ, తె లుగు, ఉర్దూ, ఫారసీ భాషలకు చెందిన 17 శాసనాలను వెలుగులోకి తెచ్చి చారిత్రక అధ్యయనానికి తోడ్పడ్డారు. నిర్మల్ ఉత్సవాల్లో తాను శోధించిన అనేక అంశాలు, పురాతన వస్తువులతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గతంలోనూ అవార్డులు సాహిత్య, చారిత్రక రంగాల్లో చేసిన కృషికి గాను దేవరావు ఇప్పటికే పలు పురస్కారాలు అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, భాషా సాంస్కృతిక శాఖ ఉత్తమ పరిశోధన పురస్కారం, సినారె పురస్కారం, సినారె కళాపీఠం జాతీయ పురస్కారం, రంజని–కుందుర్తి, ఎక్స్రే, కవిసంధ్య, గుర్రం జాషువా, విమల శాంతి, గిడుగు రామమూర్తి పంతులు జాతీయ అవార్డులు ఆయనకు లభించాయి. తాజాగా ఆయనకు ధర్మనిధి పురస్కారం దక్కడంతో జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వన్యప్రాణులను వేటాడటం నేరం
వేమనపల్లి: వన్యప్రాణులను వేటాడటం నేరమని చెన్నూర్ ఎఫ్డీవో సర్వేశ్వర్ హెచ్చరించారు. నీల్వాయి రేంజ్ కల్మలపేట అటవీ సమీప వ్యవసాయ భూముల్లో చుక్కల దుప్పిని హతమార్చిన ప్రదేశాన్ని శుక్రవారం రేంజ్ అధికారి హఫీజొద్దీన్, నీల్వాయి ఎస్సై జగదీశ్రెడ్డి, ట్రాన్స్కో సబ్ ఇంజినీర్ ఆకాశ్, డిప్యూటీ రేంజ్ అధికారి ప్రమోద్కుమార్ సర్పంచ్ ఆవులమర్రి పున్నంతో కలిసి పరిశీలించారు. విద్యుత్ తీగెలు అమర్చి చుక్కల దుప్పిని వేటాడిన పేరగాని రాజ్కుమార్, బొద్దున శ్రీకాంత్, హనుమాండ్ల సంతోష్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలం వద్ద దుప్పి తల, కాళ్లు, తోలు స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ తీగెలు అమర్చటంతో పశువులు, ప్రజలకు ప్రాణాపాయం ఉంటుందని, అలా చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఎఫ్బీవో మహిపాల్, బేస్క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్యబాసర: మండల కేంద్రంలోని బొర్ర గణేశ్కాలనీకి చెందిన యువకుడు షిండే అమృత్ (25) వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. షిండే రాజాబాయి–దత్తూరాం పటేల్ దంపతుల రెండో కుమారుడైన అమృత్ హోటల్లో పనిచేస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. తండ్రి దత్తూరాం పటేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. -
కానిస్టేబుల్, హోంగార్డ్పై సస్పెన్షన్ వేటు
● ఏఎస్సైని హెడ్కార్టర్స్కు అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు ఉట్నూర్రూరల్: ఉట్నూర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై రామయ్యను ఆదిలాబాద్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేయడంతోపాటు కానిస్టేబుల్ సిద్ధార్థ, హోంగార్డు శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ అఖిల్ మహాజన్ నుంచి రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధి నిర్వహణలో వివిధ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులపై వీరు వ్యవహరించే తీరుపై క్రమశిక్షణ రాహిత్యం కింద ఎస్పీ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై ఉట్నూర్ ఎస్సై విజయ్ను సంప్రదించగా, సస్పెన్షన్ వేటు వేసింది వాస్తవమేనని తెలిపారు. పైకాజీనగర్లో దొంగల కలకలంఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని పైకాజీ నగర్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి సంచారం కలకలం రేపింది. స్థా నికంగా నివాసముంటున్న జాడే లక్ష్మీదాస్ నూ తనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద ఈ ఘటన చో టు చేసుకొంది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో సదరు వ్యక్తి ఇంటి పరిసరాల్లో అనుమానానస్పదంగా తిరుగుతూ సీసీ కెమెరాకు చిక్కాడు. ఇంటి చుట్టుపక్కల పరిస్థితులను గమనించిన ఆ వ్యక్తి కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయం స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. -
పేరుకుపోతున్న ప్లాస్టిక్
జొహరాకాలనీలోని నాలాలో.. కురానాపేట్ జౌళినాలాలో.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయా కాలనీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు వినియోగించిన పట్టణవాసులు వాటిని ఎక్కడపడితే అక్కడే పడవేస్తున్నారు. దీంతో పట్టణంలోని పలు కాలనీల్లోగల నాలాలు, మురుగు కాలువల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువుల్లోకి చేరి నీరు కలుషితమవుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ రామారావుబాగ్లోని జౌళినాలాలో.. -
తప్పు ఒకరిది.. జరిమానా మరొకరికి..
దండేపల్లి: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను కట్టడి చేసేందుకు పోలీసులు ఉపయోగిస్తున్న ఈ–చలాన్ల విధానంలో అప్పుడప్పుడు దొర్లుతున్న పొరపాట్ల కారణంగా తప్పు చేయని వారికి శిక్షలు పడుతున్నాయి. ఫొటోలు తీసి జరిమానా విధించే క్రమంలో నంబర్లు సరిగా గుర్తించకపోవడంతో ఒకరు చేసిన తప్పునకు మరొకరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రెండ్రోజుల క్రితం ఏం జరిగిందంటే.. మంచిర్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం మందమర్రి సమీపంలో ఒక వాహనదారుడు హెల్మెట్ ధరించలేదని పోలీసులు ఫొటో తీశారు. అయితే, ఆ ఫొటో ఆధారంగా చలాన్ జనరేట్ చేసే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యమో లేదా సాంకేతిక లోపంతో నో వాహనం నంబర్ తప్పుగా నమోదైంది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వాహన దారుడికి కా కుండా 65 కిలోమీటర్లు దూరంలోని దండేపల్లి మండలం తాళ్లపేట బస్టాండ్ సమీపంలో నిలిపి ఉంచిన ఏ తప్పు చేయని వాహనదారుడికి జరిమానా విధించినట్లు మెసేజ్ వెళ్లింది. దీంతో అతను వెంటనే ఈ–చలాన్ ఓపెన్ చేసి చూడగా, మందమర్రిలో ఉన్న వాహనాన్ని ఫొటో తీస్తే నాకు జరిమానా రావడం ఏమిటని ఆశ్చర్య పోవడమే కాకుండా ఇదేమిటని తలపట్టుకున్నాడు. దీనికి ఎవరు బాధ్యులు, నేను చేయని తప్పునకు జరిమానా ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నాడు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి సాంకేతిక లోపాలను సరిదిద్ది, చలాన్లు విధించే ముందు నంబర్ ప్లేట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు. -
పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లోనే పులి
తాంసి: మండలంలోని పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు పులి టెన్షన్ పట్టుకుంది. పులి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నాలు గు నెలలుగా భీంపూర్లోని ఆయా గ్రామాల శివా రుల్లో తరచూ పులి సంచరిస్తోంది. దీంతో ఎటు వై పు నుంచి పులి వస్తుందో తెలియని పరిస్థతి నెలకొంది. పంటచేలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. నెలక్రితం గొల్లఘాట్ శివారులో పులి ఎద్దుపై దాడి చేసి హతమార్చింది. తాజాగా మళ్లీ గొల్లఘాట్ శివారులోని పంటచేలలో పులి సంచరిస్తున్నట్లు దాని పాదముద్రలు గుర్తించిన రైతులు తెలిపారు. నెలక్రితం పులి సంచరించడంతో ఆందోళనకు గురైన ప్రజలు అది వెళ్లిపోయిందనుకునే లోపే మళ్లీ రైతులకు పాదముద్రలు కనిపించాయి. దీంతో పులి ఇక్కడే సంచరిస్తున్నట్లు నిర్ధారణైంది. న దీ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు, రైతులు, కూలీలు పులి భయంతో వణికిపోతున్నారు. పంటచేలకు పనులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పులి వరుసగా ఇక్కడే సంచరిస్తుండటంతో ఎప్పుడు ఎటు నుంచి వస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని నెలలుగా ఇక్కడే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి నాలుగు నెలలుగా ఇక్కడే తిష్ట వేసినట్లు తెలుస్తోంది. గత డిసెంబర్లో ఇటు వైపు వచ్చిన పులి ఇక్కడే పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లో సంచరిస్తోంది. పులి సంచారాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతూ దాని కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కానీ, గత నెల 3న పులి ఎద్దుపై దాడి చేసి హతమార్చడంతో అది సంచరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడే ఉన్న పులి తరచూ ఆయా గ్రామాల శివారులోని పంటచేలలో సంచరిస్తూ రైతులకు కనిపిస్తోంది. మండలంలోని గొల్లఘాట్, తాంసి(కే), పిప్పల్కోటితో పాటు గుంజాల శివారులో తరచూ సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజులకు ఒకచోట పులి కనిపిస్తుండంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అటవీశాఖ అధికారులు పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించినప్పుడే అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసి హతమార్చడంతో తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు వాపోతున్నారు. పులి సంచారం ఉన్నట్లు ముందస్తు సమాచారం ఇస్తే అటు వైపు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు పులి సంచారం ఉన్నప్పుడు ముందస్తుగా అప్రమత్తం చేయాలని రైతులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
జీవితంపై విరక్తి చెంది..
కడెం: మండలంలోని కొండుకూర్ గ్రామానికి చెందిన పెద్ది రాజు (28) జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం..పెద్ది రాజు గతంలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై గురువారం పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసంనిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. మృతుడి తల్లి సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
‘యంగ్ ఇండియా’ జాడేది?
కై లాస్నగర్: నిరుపేద విద్యార్థులకు అధునాతన వసతులతో కూడిన కార్పొరేట్ స్థాయి విద్యనందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేసింది. రూ.200 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించేలా గతేడాది డిసెంబర్ 2న జీవో జారీ చేసింది. ప్రతిష్టాత్మకమైన స్కూల్ మంజూరు కావడంపై నియోజకవర్గ ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. అవసరమైన స్థలం కూడా సిద్ధంగా ఉండటం, జీవో సైతం జారీ కావడంతో ఇక పనుల ప్రారంభమే తరువాయి అని అంతా భావించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. ఉద్దేశమేంటంటే.. నిరుపేద విద్యార్థులకు కేజీ టు పీజీ వరకు ఒకే చోట నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాలుగు మంజూరు చేయగా అందులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒకటి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అధునాతన వసతులతో కూడిన పాఠశాల భవనం, వసతిగృహ భవనాలను నిర్మించాలని సంకల్పించింది. 1200 మంది విద్యార్థులకు ఒకే చోట బోధన అందించేలా అన్ని వసతులు కల్పించాలని భావించింది. దీంతో నియోజకవర్గంలోని పేద తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమైంది. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని ఆశపడ్డారు. ఆ స్కూల్ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే పనుల ప్రారంభంలో నెలలు గడుస్తున్నా కదలిక లేకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది. మూడు నెలలు దాటినా... ప్రభుత్వ ఆదేశాల మేరకు రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం ఆదిలాబాద్ పట్టణ శివారు నిషాన్ఘాట్లో 30 ఎకరాల స్థలాన్ని జిల్లా అధికారులు గుర్తించారు. వివరాలతో కూడిన ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. గతేడాది పంచాయతీ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగసభకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో రెండు రోజుల ముందుగా జిల్లాకు కానుక అందించినట్లుగా ప్రభుత్వం ఈ స్కూల్ను మంజూరు చేస్తూ డిసెంబర్ 2న జీవో జారీ చేసింది. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో భవన సముదాయం నిర్మించనున్నట్లుగా పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నిర్మాణానికి అవసరమైన స్థలం సిద్ధంగా ఉండటం, జీవో జారీ కావడంతో ఇక పనులే తరువాయి అని అంతా భావించారు. మూడు నెలలు దాటిన నిర్మాణ దిశగా అడుగు ముందుకు పడలేదు. దీంతో నియోజకవర్గ ప్రజలతో పాటు నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల్లో నిరాశ వ్యక్తమవుతుంది. టెండర్ దశలో ఉంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరుకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్థలం కూడా ఇది వరకే ఎంపిక చేసి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం భవన నిర్మాణానికి సంబంధించి టెండర్ దశలో కొనసాగుతుంది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలయ్యేలా చూస్తాం. –రవీందర్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ -
● స్థిరాస్తి విక్రయాల్లో అక్రమ కోణం ● ఒకే ప్లాట్.. డబుల్ రిజిస్ట్రేషన్ ● లబోదిబోమంటున్న బాధితులు ● కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
సాక్షి,ఆదిలాబాద్: డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న మహిళపై మావల పోలీసు స్టేషన్లో గురువారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 175 సర్వేనంబర్లోని 23వ ప్లాట్ నంబర్కు సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్ విషయంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ రియల్ వ్యాపారిని అరెస్టు చేశారు. అయితే ఈ సర్వేనంబర్లో ఇలాంటి అనేక ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ జరిగాయనే ఆరోపణలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి. మిగతా బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆదిలాబాద్ పట్టణ చుట్టుపక్కలా ఉన్న బట్టిసావర్గాం, మావల, దస్నాపూర్, ఖానాపూర్, అంకోలి రోడ్, రణదీవెనగర్లలో అనేక లేఔట్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల కింద ఇవి ఏర్పడ్డాయి. వాటిలో అనేకచోట్ల డబుల్ రిజిస్ట్రేషన్లు, ఒక ప్లాట్ చూయించి వేరేది రిజిస్ట్రేషన్ చేయడం వంటివి కోకొల్లాలు. ధనార్జనే ధ్యేయంగా.. రియల్ వ్యాపారులు, కొంత మంది దళారులు స్వార్థంగా వ్యవహరిస్తూ ధనార్జనే ధ్యేయంగా ఇలా అమాయకులకు ఒకే ప్లాట్ను రెండు సార్లు విక్రయిస్తున్నారు. 175 సర్వేనంబర్లో 1996లో ఏర్పాటు చేసిన లేఔట్లో 100కు పైగా ప్లాట్లను విక్రయించారు. ఆ తర్వాత 2011–12లో ఇవే ప్లాట్లలో కొన్నింటిని ఇతర వ్యక్తులకు విక్రయించారు. వారు ఇతరులకు విక్రయించే క్రమంలో ఈసీ తీయగా, మొదటి రిజిస్ట్రేషన్ పేర్లు రావడంతో ఖంగు తిన్నారు. ఇలా అనేక మంది తాము నష్టపోయామని నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలో మొదటి పార్టీకి, రెండో పార్టీకి మధ్య ప్లాట్ విషయంలో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. అధికారుల పాత్రపైనా అనుమానాలు ఆన్లైన్ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని ఆ సమయంలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవహారాలు మ్యానువల్గా సాగేవి. సబ్ రిజిస్ట్రార్ ఈసీని ఆఫీస్ నుంచి ఈ విధానంలోనే జారీ చేసేవారు. ఈ క్రమంలో రియల్టర్లు, అధికారులు కలిసి అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలూ లేకపోలేదు. 1996లో మొదటి పార్టీ రిజిస్ట్రేషన్లు 175 సర్వేనంబర్లో జరిగినప్పటికీ, అక్కడ ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదని నిల్ అని పేర్కొంటూ ఈసీ జారీ చేయడం ఇదే కోవలోకి వస్తుందని రిజిస్ట్రేషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎస్పీ చొరవతో.. ఎస్పీ అఖిల్ మహాజన్ ఇలాంటి విషయాల్లో బాధితుల పక్షాన నిలవడంతో మోసాలకు సంబంధించి కేసులు నమోదవుతున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 175 సర్వే నంబర్లో ఇప్పటికే పలువురి ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్లు జరగగా, వారు రియల్ వ్యాపారిని ఆశ్రయించి ఈ విషయంలో నిలదీశారు. ఆ వ్యాపారి 2011–12లో డబుల్ రిజిస్ట్రేషన్ బాధితులు ఏ రేటుకై తే ప్లాట్ను కొనుగోలు చేశారో ఆ రేటు తిరిగి ఇస్తానని వారితో పేర్కొనడం జరిగింది. అందులో కొంత మొత్తం మొదటి పార్టీ భరించాలని ఆమె మొదటి రిజిస్ట్రేషన్ వ్యక్తులను అడిగారు. అయితే రెండో రిజిస్ట్రేషన్ ద్వారా ప్లాట్ పొందిన బాధితులు తమకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర విలువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వారి మధ్య సయోధ్య కుదరకపోవడంతో కొంత మంది పోలీసులను ఆశ్రయించారు. మావలలో ప్రస్తుతం ఒక్క ప్లాట్కు సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్ విషయంలో కేసు నమోదైంది. అనేక మంది బాధితులు ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతున్నారు. 2012లో తీసిన ఈసీలో మొదటి రిజిస్ట్రేషన్ వివరాలు నిల్ అని ఉన్న దృశ్యమిది ఇది 175 సర్వేనంబర్లో 70, 110, 107, 119, 121 ప్లాట్లకు సంబంధించి ఇన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ). స్పష్టమైన యాజమాన్యాన్ని నిరూపించడానికి ఇది సబ్రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి జారీ చేస్తారు. ఇందులో మొదటి మూడు నంబర్లు గల ప్లాట్లు ఆ దిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన సంతోష్ కుమార్, భాస్కర్లకు సంబంధించినవి. 1996లో మావలలోని సర్వే నం.175లో వారు ఈ ప్లాట్లను చింతలపల్లి ఆశలత అనే స్థిరాస్తి వ్యాపారి నుంచి కొనుగోలు చేశారు. అవే ప్లాట్లను 2011–12లో ఇదే స్థిరాస్తి వ్యాపారి ఆ ప్లాట్లను ఇతర వ్యక్తులకు విక్రయించారు. డబుల్ రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయాయి. ఆ సమయంలో ఈసీ తీయగా, ఆ ప్లాట్లపై మొదటి రిజిస్ట్రేషన్ వివరాలు అసలుకే లేకపోవడం గమనార్హం. -
‘మీథేన్’ వెలికితీతకు సన్నాహాలు!
కోల్బెడ్ రూపంలో.. విజయవంతమైతే ఉపాధిపై ఆశలు ప్రస్తుతం సింగరేణిలో కొత్తగా బొగ్గు గనులు లేక కంపెనీ ప్రాభవం కోల్పోతున్న తరుణంలో సహజ వాయువు ఉత్పత్తితో సంస్థ మనుగడ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. కొత్తగా మీథేన్ వాయువు వెలికితీత మొదలైతే స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. సింగరేణి ఆధ్వర్యంలో మీథేన్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు విజయవంతమైతే స్థానికంగా కంపెనీ పురోగతి చెందనుంది. -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
కై లాస్నగర్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని జిల్లాలో శుక్రవారం నేరడిగొండలో లాంఛనంగా ప్రారంభించారు. అలాగే కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా హాజరుకాగా మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయ న మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా చూడాలన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యే క శ్రద్ధ వహించాలన్నారు. మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ, కేసుల పురోగతి వంటి అంశాలపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను ఆఽ దార్, బ్యాంక్ ఖాతాలకు అనుసంధించి వాటి వివరాలను శాఖలు, పనిచేయిస్తున్న ఏజెన్సీల వారీగా అందజేయాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఇసుక అక్ర మ రవాణా, మైనింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వి ద్యార్థుల సంఖ్య పెంచేలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు గాను లబ్ధిదారుల ఎంపిక, అమలు కోసం సాంకేతికత వినియోగించుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 10–15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలన్నారు. అనంతరం 25 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు మంజూరు చేశారు. సమావేశంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొ జ్జు పటేల్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూ ష, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా నోడల్ అధి కారి అగ్రోస్ ఎండీ రాములు పాల్గొన్నారు. నేరడిగొండలో వైద్యశిబిరం ప్రారంభం నేరడిగొండ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి జూపల్లి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసి న ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో కలిసి ప్రారంభించారు. శిబిరంలో ప్రజలకు వివిధ విభాగాల నిపుణుల ద్వారా వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంవో శ్రీధర్, డీటీసీవో డాక్టర్ సుమలత, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సద్దాం తదితరులు పాల్గొని వైద్యసేవలు అందించారు. ముందుగా మంత్రికి కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, మాజీ ఎంపీ సోయం బాపురావుతో కలిసి కార్యకర్తలు రోల్మామడ టోల్ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు. పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం కై లాస్నగర్(బేల): పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని మంత్రి జూపల్లి అన్నా రు. బేల మండలంలోని డోప్టాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మివాడలో ... జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. మున్సిపల్ చైర్పర్సన్ అనూష తదితరులు పాల్గొన్నారు. -
రైతు భరోసా నిధులు విడుదల చేయాలి
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వం అన్నదాతకు ఇచ్చి న హామీ మేరకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7నుంచి చేపట్టనున్న రైతుల సంతకాల సేకరణపై పార్టీ కార్యాలయంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో పార్టీ శ్రేణులు శనివారం ఇంటింటికి తిరుగుతూ సంతకాలు సేకరిస్తారని చెప్పా రు. కార్యక్రమంలో రౌతు మనోహర్, నాయకులు ప్రహ్లాద్, రాజు, లింగారెడ్డి, నారాయణ, రమేశ్, జగదీశ్, గండ్రత్ రమేశ్, సతీష్ పవార్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి
కైలాస్నగర్: ప్రభుత్వం చేపట్టిన 99రోజుల ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చే యాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సూ చించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ము న్సిప ల్ కార్యాలయ సమావేశ మందిరంలో కార్యక్రమ విజయవంతంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి వార్డుల సందర్శన ప్రారంభమవుతుందని, వార్డుల్లోని సమస్యలు గుర్తించి వాటిని అ క్కడికక్కడే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. 49వార్డులకు సంబంధించిన పారిశుద్ధ్యం, వీధి దీపాలు, నీటి సమస్య, పెండింగ్ ఫైళ్లపై ప్రత్యే క దృష్టి సారించాలని, కాలనీలో నెలకొన్న సమస్యలపై పూర్తి నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు. వార్డు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదేశించారు. సమావేశంలో వైస్ చైర్మన్ రోహిత్, కమిషనర్ రాజు, ఆర్వో కళ్యాణ్, ఎంఈ అరుణ్కుమార్ తదితరులున్నారు. -
మరింత చేరువగా సంక్షేమ పథకాలు
కైలాస్నగర్: అభివృద్ధి, సంక్షేమ పథకాలను జిల్లా ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమాన్ని నిర్వహిస్తోందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’పై మండల, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తుల క్రోడీకరణ, అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని సూచించారు. వై ద్యం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫి ర్యాదులను గడువులోపు పరిష్కరించాలని సూచించారు. మండల, జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి, అభివృద్ధి ఫలాలు ప్రతీ పేదవా డికి అందేలా చూడాలని సూచించారు. సంక్షేమ ప థకాల అమలులో ఎక్కడా అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని, నిర్లక్ష్యం చేసే అ ధికారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు జిల్లాలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. స్థానిక సంస్థల అడిషన ల్ కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, జెడ్పీ సీఈవో రవీందర్ రాథోడ్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వివి ధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
జయంత్యుత్సవాల్లో ఐక్యత చాటాలి
కై లాస్నగర్(బేల): ఈ నెల 15న జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ఆదివాసీ పర్ధాన్ కుల గురు గోండి ధర్మ గురు హీరా సుకా జ యంత్యుత్సవాలకు అధికసంఖ్యలో హాజరై ఐక్యత చాటాలని రాష్ట్రీయ పర్ధాన్ జన్జాతి ఉత్తన్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు మెస్రం శంకర్ పిలుపునిచ్చా రు. హీరా సుకా జయంతి ప్రచారంలో భాగంగా గు రువారం బేల మండలంలోని పాఠన్, కంగార్పూర్, గూడ, దహెగాం, కొబ్బాయి, భవాన్గూడ తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ పర్ధాన్ సమాజ్ సర్పంచులను శాలువా లతో సత్కరించి హీరా సుకా చిత్రపటం, ఆహ్వానపత్రం, కరపత్రం అందజేశారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీ పర్ధాన్ సమాజ్ వెనుకబాటుకు గురవుతోందని తెలిపారు. రాజకీయంగా, ఆర్థికంగానే కాకుండా సంక్షేమంలో వెనుకబడిన ఆదివాసీ పర్ధాన్ కులస్తులకు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఆదివాసీ పర్ధాన్ సర్పంచులు కిశోర్, పొచ్చిరాం, గులాబ్, ఉత్తన్ సంఘటన్ మహిళా విభాగం జిల్లా గౌరవాధ్యక్షురాలు మెస్రం సంగీత, ఉపాధ్యక్షురాలు కాంతాబాయి, ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు రాజేశ్వర్, జైనథ్ మండలాధ్యక్షుడు కోవా ప్రభాకర్, నాయకులు గేడం విఠల్, మెస్రం దత్తు తదితరులు పాల్గొన్నారు. -
నిరంతరం సాధన చేయాలి
ఆదిలాబాద్రూరల్: బాలికలు ఉన్నత లక్ష్యాలు చేరుకునేందుకు నిరంతం సాధన చేయాలని అదనపు ఎస్పీ మౌనిక సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కొలాం ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ‘ఇగ్నైట్ యువర్ డ్రీమ్స్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ ఉద్యోగ సాధన చాలా శ్రమతో కూడినదైనా దృఢ సంకల్పంతో ముందుకు సాగితే విజయం మన పాదాల చెంతకు వస్తుందని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఉన్నత ఫలితాలు సాధించా లని ఆకాంక్షించారు. ఐటీడీఏ ఏటీడీవో నిహా రిక, ప్రధానోపాధ్యాయులు నారాయణరావ్, స్వర్ణలత, జిల్లా గిరిజన క్రీడల అధికారి కే పార్థసారథి, ఎస్.విజయ్బాబు, యోగేశ్వర్, డాక్టర్ క్రాంతి, కరణ్సింగ్, కృష్ణారెడ్డి, అశోక్, గంగారాం, సునీత తదితరులున్నారు. -
వంటగ్యాస్ రీఫిల్లింగ్ దందాపై డీటీ విచారణ
ఎఫెక్ట్..కైలాస్నగర్: గృహవసర వంట గ్యా స్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తూ ఓ మెకానిక్ గ్యారేజీలో ఆటోలకు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వైనాన్ని వివరిస్తూ ఈ నెల 1న ‘రీఫిల్లింగ్ దందా’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీన్ని సీరియస్గా పరిగణించిన కలెక్టర్ రాజర్షి షా ఈ అక్రమదందాపై విచారణకు ఆదేశించారు. దీంతో పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ బూస మహేశ్ ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్లోగల మెకాని క్షాపును గురువారం సందర్శించారు. అక్కడి పరి స్థితులను స్వయంగా పరిశీలించి వంటగ్యాస్ను అ క్రమంగా ఆటోల్లో రీఫిల్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారించా రు. బాధ్యులైన మెకానిక్ షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు నివేది క అందజేశారు. అయితే, పౌరసరఫరాల శాఖ జిల్లా ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే సాగుతున్న ఈ దందా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ విషయాన్ని గతంలో మాదిరి ‘మామూలు’గా తీసుకుంటారా? లేదా.. అక్రమంపై కొరడా ఝులిపిస్తారా? అనేది వేచి చూడాలి. -
పక్కాగా ‘ప్రగతి’
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో నేటి నుంచి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రారంభించి 99రోజుల పా టు నిర్వహించనున్నారు. ఐదు స్థాయిల్లో 10 అంశాల ఆధారంగా జూన్ 12 వరకు కార్యక్రమం కొనసాగనుంది. శు క్రవారం మొదటిరోజు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో స న్నాహక సభలు నిర్వహించనుండగా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, మున్సిపల్, సొసైటీల చైర్మ న్లు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు పాల్గొననున్నా రు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులందరి కీ చేరేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 99రోజుల్లో ఆ యా శాఖలకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాలు విస్తృతంగా చేపట్టనున్నారు. ప్రణా ళికశాఖ ఈ కార్యక్రమానికి నోడల్ శాఖగా వ్యవహరిస్తోంది. ప్రధాన అంశాల వారీగా గ్రామసభల్లో చ ర్చించాల్సిన విషయాలను ప్రభుత్వం రూపొందించింది. మొదటిరోజు రాష్ట్ర గీతంతో ప్రా రంభించి సీఎం వీడియో సందేశాన్ని ప్రదర్శించనున్నారు. సంక్షేమ పథకాలల బ్ధిదారుల అభిప్రాయాలు సేకరించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదన ప్రభుత్వం ఈ కార్యక్రమ నిర్వహణకు బడ్జెట్ ప్రతిపాదించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు నిధుల కేటాయింపుపై స్పష్టత రాలేదు. గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డులకు రూ.10వేల చొప్పున, మండల, మున్సిపాలిటీకి రూ.2లక్షల వరకు, నియోజకవర్గ స్థాయిలో రూ.10లక్షలు, జిల్లా స్థాయిలో రూ.50 లక్షలు కేటాయించనున్నట్లు పొందుపర్చినప్పటికీ ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. పనితీరుకు కొలమానం 99రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యాచరణను అన్ని జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేయాలని ఇటీవలే కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించా రు. అధికారుల పనితీరుకు ఈ కార్యక్రమం కొలమానంగా నిలుస్తుందనడం గమనార్హం. ఇటీవల ఎ న్నికై న సర్పంచులు, కౌన్సిలర్లకు తమ గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టేలా చూడాల్సి ఉంది. జిల్లాలో ప్రతిపక్ష ఎంపీ, ఎమ్మెల్యేలుండగా వారిని సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బా ధ్యత జిల్లా ఇన్చార్జి మంత్రిపై ఉంది. మొదటిరోజు జిల్లాలో మంత్రి ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ఐదు స్థాయిలు.. షెడ్యూల్ ఏప్రిల్ 2న గ్రామస్థాయిలో, 16న మండల స్థాయిలో, మే 2న నియోజకవర్గ స్థాయిలో, 22న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా, పరిసరాల పరి శుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్యం, సురక్షితంగా చేరుకోండి (అరైవ్.. అలై వ్), సంక్షేమం, పిల్లల భద్రత, రక్షణ, డ్రగ్స్కు నో, రైతులు (వ్యవసాయం), విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం మొదలైన అంశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. -
ఉట్నూర్ ఏఎస్పీగా రుత్విక్ సాయి
ఆదిలాబాద్టౌన్: ఉట్నూర్ ఏఎస్పీగా రుత్విక్ సాయి కొట్టేను నియమిస్తూ డీజీపీ బీ శివధర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ను రుత్విక్ సాయి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. అనంతరం ఉట్నూర్ నూతన ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉట్నూర్ సబ్ డివిజన్ పరిధిలోని పరిస్థితులు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నూతన ఏఎస్పీకి వివరించారు. వివిధ అంశాలపై చర్చించారు. 2023 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి రుత్విక్ సాయి కొట్టే గతంలో వేములవాడ ఏఎస్పీగా విధులు నిర్వహించి బదిలీపై ఉట్నూర్కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
అన్ని మౌలిక వసతులతో..
ఆదిలాబాద్టౌన్: పేదలకు మరింత నా ణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మండలానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చే సేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తు తం జిల్లాలోని కొత్త మండలాలు మినహా మిగతా చో ట్ల వీటిని ఏర్పాటు చేయనుంది. ఒక్కచోటే ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను అధికారులు ఎంపిక చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశమున్న బడులను గుర్తించారు. మండలానికి ఇతర గ్రామాలకు సమీపంలోని పాఠశాలలను ఎంచుకున్నారు. అయితే, ఈ బడుల్లో పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే బోధన సాగనుంది. జూన్ నుంచి భవన నిర్మాణాలు చేపట్టే అవకాశముందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రెండేళ్లపాటు సాధారణంగానే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఆ తర్వాత ప్రవేశ పరీక్షల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వనున్నారు. అన్ని మౌలిక వసతులు, హంగులతో ఈ పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. కార్పొరేట్కు దీటుగా వీటిని ఏర్పాటు చేయనుండగా ఒక్కో పాఠశాల భవన నిర్మాణానికి రూ.కోటి వరకు ఖర్చు అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో పూర్తిస్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో బోధన జరగనుంది. పాఠశాలల భవన నిర్మాణాలు చేపట్టే క్రమంలో ఆ పాఠశాలలోని విద్యార్థులను సమీపంలోని పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న బడిలో చదివే విద్యార్థులు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదివే అవకాశం కల్పిస్తారు. తెలుగు మీడియంలో చదువుకోవాలనుకునే వారిని పక్క పాఠశాలలో చేర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాఠశాలల ఏర్పాటుతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుతం జిల్లాలో ఆరు మోడల్ స్కూళ్లు ఉన్నప్పటికీ వీటిలో ఆరోతరగతి నుంచి ప్రవేశాలున్నాయి. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు, అవసరమైతే ఇంటర్ కూడా ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.జిల్లాలోని ఎంపికై న పాఠశాలలివే.. మండలం పాఠశాల భీంపూర్ యూపీఎస్, భీంపూర్ జైనథ్ జెడ్పీహెచ్ఎస్, కూర బేల జెడ్పీహెచ్ఎస్, సిర్సన్న గాదిగూడ యూపీఎస్, లోకారి(బీ) నార్నూర్ జెడ్పీహెచ్ఎస్, భీంపూర్ ఇంద్రవెల్లి జెడ్పీహెచ్ఎస్, ధనోర(బీ) గుడిహత్నూర్ ప్రభుత్వ పాఠశాల, గుడిహత్నూర్ ఆదిలాబాద్రూరల్ జెడ్పీహెచ్ఎస్, భీంసరి ఆదిలాబాద్అర్బన్ ప్రభుత్వ బాలికల పాఠశాల మావల జెడ్పీహెచ్ఎస్, మావల తాంసి జెడ్పీహెచ్ఎస్, తాంసి(బీ) తలమడుగు జెడ్పీహెచ్ఎస్, సుంకిడి బజార్హత్నూర్ జెడ్పీహెచ్ఎస్, బజార్హత్నూర్ బోథ్ జెడ్పీఎస్ఎస్,ఽ దన్నూర్(బీ) నేరడిగొండ జెడ్పీహెచ్ఎస్, నేరడిగొండ ఇచ్చోడ జెడ్పీఎస్ఎస్, ఉర్దూ మీడియం ఇచ్చోడ సిరికొండ జెడ్పీహెచ్ఎస్, సిరికొండ ఉట్నూర్ జెడ్పీహెచ్ఎస్, శ్యామ్పూర్ భోరజ్ జెడ్పీహెచ్ఎస్, గిమ్మ(కే) సాత్నాల జెడ్పీహెచ్ఎస్, అడ సొనాల జెడ్పీహెచ్ఎస్, సొనాలఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించనున్నారు. కంప్యూటర్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, ఇతర సౌకర్యాలు ఉండేలా వీటిని తీర్చిదిద్దనున్నారు. కార్పొరేట్కు దీటుగా ఈ పాఠశాలల్లో విద్యాబోధన చేయనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నింటిలో ఇంగ్లిష్ మీడియంలో తరగతులు నిర్వహిస్తున్నా పూర్తి స్థాయిలో బోధన జరగడం లేదు. అయితే, ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో మాత్రం పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే బోధించనున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి చేరే విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా కల్పించనున్నారు. -
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్టౌన్: జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ అఖిల్మహాజన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అ సోసియేషన్ (ఐఎంఏ) అందజేసిన 37 సీసీ కెమెరా లను కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులు, డాక్టర్ల సమక్షంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో 24గంటల పర్యవేక్షణతోపాటు నేరాలు, చోరీలు జరగకుండా అరికట్టవచ్చని తెలిపారు. ఒకవేళ చోరీ జరిగినా ఛేదించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలు, వ్యా పార సంస్థలు, సంఘాలు సీసీ కెమెరాల ఏర్పాటు కు ముందుకురావాలని సూచించారు. ప్రస్తుతం ఆ దిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 250 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ముగ్గురు సిబ్బంది 24గంటలపాటు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగా ఏ ర్పాటు చేసిన కెమెరాలను బస్టాండ్, రైల్వేస్టేషన్, మహాలక్ష్మివాడ, రిమ్స్ ప్రాంగణాల్లో అమర్చినట్లు చెప్పారు. పట్టణంలో నూతనంగా ఎన్నికై న కౌన్సి లర్లు వార్డుల్లో కనీసం 10సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సర్పంచులు కూడా సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేసి నేరాలకు అడ్డుకట్టవేయడానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతమున్న సీసీ కెమెరాలను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినట్లు వివరించారు. ఆదిలాబాద్ డీఎ స్పీ జీవన్రెడ్డి, పట్టణ సీఐలు సునీల్కుమార్, నాగరాజు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సతీశ్, కార్యదర్శి డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్లు రంజిత్, దీపక్ పుష్కర్, విజయసారథి, వెంకటేశ్, సిబ్బంది పాల్గొన్నారు. షీ టీంకు 54 ఫిర్యాదులుగత నెల జిల్లావ్యాప్తంగా ఆదిలాబాద్ షీటీం బృందానికి 54 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అఖిల్ మ హాజన్ ఓ ప్రకటనలో తెలిపారు. 61 సందర్భాల్లో కౌన్సిలింగ్ ద్వారా మహిళలకు సేవలందించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 118 హాట్స్పాట్లలో ఆకస్మికంగా తనిఖీ చేసి మహిళలపై వేధింపుల ను అరికట్టడానికి కృషి చేసినట్లు తెలిపారు. జిల్లాలో డబుల్ ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. షీ టీం బృందాన్ని ‘డయల్ 100’ లేదా 8712659953లో సంప్రదించాలని సూచించారు. 10న జాబ్మేళా ఈ నెల 10న జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్లో పోలీస్శాఖ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన గురువారం వెల్లడించారు. రెండువేలకు పైగా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రూ.13వేల నుంచి రూ.40వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. మేళాకు 50కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నట్లు చెప్పారు. యువత చదువు, స్థాయినిబట్టి ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కుల ఆధారంగా జీతభత్యాలు ఇస్తారని తెలిపారు. యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యూఆర్ కోడ్, లింక్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
మూఢనమ్మకాలను విశ్వసించొద్దు
కై లాస్నగర్ (బేల): శాస్త్ర సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో చేతబడి లాంటి మూఢనమ్మకాలను విశ్వసించి ఆందోళ న చెందవద్దని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్రెడ్డి సూచించారు. గురువారం బేల మండల కేంద్రంలోని ఇంద్రానగర్లోగల అక్బర్ దుకాణం సమీపంలో గుర్తు తెలి యని వ్యక్తులు మూడు రంగుల అన్నాన్ని పెట్టారు. విషయం సామాజిక మధ్యమాల ద్వారా తెలుసుకున్న ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అన్నాన్ని స్వయంగా తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఆకతాయిల ప ని అని, ఇలాంటి వాటికి భయపడాల్సిన అవస రం లేదని గ్రామస్తులకు భరోసా కల్పించారు. మండలాధ్యక్షుడు ఉరడే దేవేందర్, కార్యదర్శి బోయర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచాలి
కై లాస్నగర్: దివ్యాంగులకు అందిస్తున్న చేయూత పింఛన్ను రూ.6వేలకు పెంచాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యను బుధవారం హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని, స్ట్రీట్ వెండర్ షాపుల్లో 5శాతం షాపులను దివ్యాంగులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల చట్టం– 2016ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బావునే నగేశ్, ఉగ్గే నానయ్య తెలిపారు. చైర్మన్ను కలిసిన వారిలో సంఘ నాయకులు సయ్యద్ హంజ, వినోద్, మేరాజ్, రాకేశ్, సంతోష్ తదితరులున్నారు. -
నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్పై ఫోకస్
మారుమూల ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ బ్లాక్ ఆస్పిరేషనల్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేశారు. దేశవ్యాప్తంగా 426 ఆస్పిరేషనల్ బ్లాకుల్లో అమలు చే యగా జిల్లాలోని గిరిజనులు అత్యధికంగా ఉన్న నార్నూర్ను ఎంపిక చేశారు. ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2024 వరకు ఆ బ్లాక్లో ఆరో గ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై నీతి ఆయోగ్ దృష్టి సారించింది. ఆ సంస్థ గైడ్లైన్స్ను పక్కాగా పాటిస్తూ నార్నూర్ పలు రంగాల్లో ప్రగతి సాధించేలా చొరవ చూపారు. వాటిపై పలు విడతల్లో మదింపు చేసిన నీతి ఆయోగ్ అధికారులు ఐదు ప్రధాన అంశాల్లో సాధించిన సమగ్ర అభివృద్ధికి గాను జిల్లా అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన ప్ర జాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారానికి కలెక్టర్ ఎంపికయ్యారు. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుని జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. -
ఏకాభిప్రాయం కుదిరేనా..
సాక్షి,ఆదిలాబాద్: అధికార కాంగ్రెస్లో ఇక పదవుల పందేరం షురూ కానుంది. పక్షం రోజుల్లో బూత్స్థాయి నుంచి మొదలుకుని గ్రామ, మండల, జిల్లా కమిటీల్లో అన్నిరకాల పదవులను భర్తీ చేయాలని పార్టీ నిర్ణయించింది. గ్రూపు తగాదాల నేపథ్యంలో ఆయా కమిటీల్లో ఎంపికలో ఏకాభిప్రాయం కుదురుతుందా.. లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వికారాబాద్లో డీసీసీ అధ్యక్షులకు ఇటీవల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ నేపథ్యంలో స్థానిక కమిటీల నియమాకంపై దృష్టి సారించాలని, డీసీసీ అధ్యక్షున్ని సమన్వయం చేసుకొని జిల్లా ఇన్చార్జి మంత్రి ఈ ప్రక్రియ కొలిక్కి తేవాలని పార్టీ పరంగా ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నెల 15లోగా ప్రక్రియ పూర్తి.. మూడు నెలల కిందట డీసీసీ అధ్యక్షుడిగా నరేశ్జాదవ్ నియామకం కాగా జిల్లా కమిటీలోని ఇతర పదవులు భర్తీ చేయలేదు. తాజాగా ఈ పదవులన్నింటిని తక్షణం భర్తీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఈనెల 15లోగా ప్రక్రియ ముగించాలని పేర్కొంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీలోని ముఖ్య నేతలంతా ఏకతాటిపైకి వచ్చినట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం వారి మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా కమిటీలో వారి అనుచరులకు ప్రాధాన్యత కల్పించే విషయంలో ముఖ్య నేతల మధ్య విభేదాలు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదు. మరోపక్క ఆశావహులు ఆయా నేతల ద్వారా జిల్లా కమిటీలో పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. బూత్, గ్రామ, మండల కమిటీలను కూడా నియమించాలని, పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఆ ప్రక్రియలన్నింటిని పూర్తి చేసేందుకు జిల్లా కాంగ్రెస్ దృష్టి సారించింది. డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్ ఎంపికై న తర్వాత పార్టీలో గ్రూపు తగాదాలను నివారించేందుకు విస్తత ప్రయత్నాలు చేస్తున్నరు. ముందు నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డిని విభేదిస్తూ టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్ రెడ్డిలు ఓ వర్గంగా కొనసాగుతున్నారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఓ గ్రూప్గా, మాజీ జెడ్పీటీసీ గణేశ్రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి మరో గ్రూప్గా.. ఇలా కాంగ్రెస్లో వర్గపోరు కొనసాగుతుంది. పార్టీ పదవుల్లో తమ అనుచరులకు చోటు దక్కేందుకు ఎవరికి వారు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో అందరూ సమన్వయంగా ఉన్నట్టు పైకి కనిపించినప్పటికీ అంతర్గతంగా మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా కొనసాగారు. ఈ ప్రభావం కారణంగానే మున్సిపల్లో అత్యధిక వార్డుల్లో కాంగ్రెస్ గెలుస్తుందని భావించినప్పటికీ రెండో స్థానానికి పరిమితమైందనే విమర్శలున్నాయి. సమన్వయం కుదిరేనా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో హస్తం పార్టీలో ఇలాంటి పరిస్థితే ఉండడంతో ఇటీవల డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాల అనంతరం పార్టీ అధిష్టానం కమిటీల ఎంపిక విషయంలో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. ప్రధానంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులను సమన్వయం చేసుకొని ప్రక్రియను ఏకాభిప్రాయంగా ముగించాలని చెప్పారు. జిల్లాలో మాత్రం పరిస్థితు భిన్నంగా ఉన్నాయి. జిల్లా పరిధికి వచ్చే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ హస్తం పార్టీకి చెందిన నేతే అయినప్పటికీ ఆయన నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఉండడంతో ఆదిలాబాద్ విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఇక జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలు పార్టీ పరిస్థితులపై దృష్టి సారించే పరిస్థితి ఉంది. ఇటు డీసీసీ అధ్యక్షుడు, అటు ముఖ్య నాయకులను ఏకాభిప్రాయానికి తీసుకొచ్చి పదవుల పందెరాన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. -
ప్రజాతీర్పును గౌరవించకుండా దౌర్జన్యం
ఆదిలాబాద్టౌన్: రాష్ట్ర మంత్రి వివేక్ ప్రజాతీర్పును గౌరవించకుండా దౌర్జన్యం, దాడులు చేస్తూ బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో అరెస్టయి జిల్లా జైలులో రిమాండ్పై ఉన్న ఆయన బుధవారం బెయిలుపై విడుదలయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయమే జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు. భుజాలపైన ఎత్తుకుని గజామాలతో సత్కరించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి ము న్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ కలిసి పోటీ చేసిందన్నారు. మొత్తం 22 వార్డులకు గాను 14 వా ర్డులను బీఆర్ఎస్, సీపీఐ కూటమి గెలిచిందన్నారు. ఏడు సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవీ కోసం మంత్రి వివేక్ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ 14 మంది కౌన్సిలర్లు భద్రాచలంలో ఉంటే పోలీసులతో కిడ్నాప్ చేసే యత్నం చేయగా తాను వెళ్లి వారిని అక్కడి నుంచి చెన్నూర్లోని తన నివాసానికి తీసుకు వచ్చానన్నారు. 16న చైర్మన్ ఎన్నికకు హాజరయ్యే క్రమంలో పోలీసులు అడ్డుకుని అలస్యం చేసి ఎన్నిక ప్రకయ వాయిదా వేశారన్నారు. 17న కూడా పోలీసులతో తమను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. మున్సిపాలిటీకి రెండు కిలోమీటర్ల దూరంలో తనతో పాటు పార్టీ ఎన్నికల పరిశీలకురాలిగా నియమించిన కోవ లక్ష్మిని పోలీసులు నిలవరించారన్నారు. కానీ మంత్రి కాన్వాయ్తో వందల మందిని పంపిస్తే తాము ప్రశ్నించినందుకు తమపై లాఠీచార్జితో పాటు కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడి చేశారన్నారు. అంతేకాకుండా మాపైనే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఇదే కాకుండా 16 రోజులుగా తనకు బెయిల్ రాకుండా అనేక కుట్రలు పన్నారన్నారు. మంచిర్యాల, హైదరాబాద్ కోర్టులో బెయిల్ వచ్చిన కూడా చెన్నూర్కు రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. చిన్న కొడుకు జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో ఉండనివ్వకుండా, అలాగే హోలి పండగ సంబరాలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్రావుల సహకారంతో పాటు లాయర్ల కృషి ఫలితంగా తాను బయటకు వచ్చినట్లుగా తెలిపా రు. ఆయన వెంట మాజీ మంత్రి జోగు రామన్న, నాయకులు యూనీస్ అక్బానీ తదితరులున్నారు. -
గల్ఫ్ ప్రయాణమా.. ఇప్పుడే వద్దు
గల్ఫ్ దేశాల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వెకేషన్ ప్లానింగ్ కోసం అక్కడికి వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. భూ గర్భజలాలను సంరక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జల్ సంచాయి.. జన్ భాగీదారి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో నీటి సంరక్షణకు చేపట్టిన చర్యలకు గాను దక్షణాది రాష్ట్రాల కేటగిరీలో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇందుకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డుతో పాటు రూ.2కోట్ల నగదు పురస్కారం అందుకున్నారు. మరోసారి జిల్లా పేరును జాతీయ స్థాయిలో మారుమోగించారు. నీటిని సంరక్షించి.. అవార్డు అందుకుని -
మూడు నెలల కోటా బియ్యం ఒకేసారి
● కేంద్ర ప్రభుత్వం ఆదేశం కై లాస్నగర్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించే బియ్యం మూడు నెలల కోటా ఒకేసారి అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎండల తీవ్రత నేపథ్యంలో కార్డుదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన కోటాను ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 2లక్షల 26వేల 248 మందికి లబ్ధి చేకూరనుంది. మూడు నెలలకు గాను 14,073 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా పౌరసరఫరా శాఖ చర్యలు చేపడుతోంది. ఇదివరకు గతేడాది జూన్లో వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలల కోటాను లబ్ధిదారులకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమిస్తూ అధికారులు తాజాగా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. -
భక్తుల ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు
ఆదిలాబాద్: శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలంలోని సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బుధవారం ఆదిలాబాద్ డిపో మేనేజర్ కార్యాలయంలో పథకానికి సంబంధించిన వాల్పోస్టర్ను డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ, భక్తులు సమీపంలోని ఆర్టీసీ లా జిస్టిక్స్ కౌంటర్ల ద్వారా కానీ www.tgsrt clogistics.co.in వెబ్సైట్ ద్వారా కేవలం రూ.151లు చెల్లించి తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 91542 98531, 91542 98533, 91542 985 53 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
హీరా సుకా జయంతి వేడుకలకు తరలిరండి
ఆదిలాబాద్రూరల్:ఈనెల 15న జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదా నంలో నిర్వహించనున్న గోండి ధర్మగురు హీరా సుకా జయంతి వేడుకలకు అందరూ తరలి రావా లని రాష్ట్రీయ జన్జాతి పర్ధాన్ ఉత్తన్ సంఘటన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెస్రం శంకర్, గేడం మాధవ్ కోరారు. హోలి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హీరా సుకా దేవస్థానం ఆవరణలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రయాలను కాపాడు తూ భావితరాలకు అందించాలన్నారు. అనంతరం భోరజ్ మండలంలోని రాంపూర్, ఆకో లి, మాజ్రా గ్రామాల్లో పర్యటించారు. కులస్తులకు కర పత్రాలు పంపిణీ చేసి సర్పంచ్లకు ఆ హ్వాన పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సంఘటన్ జాతీయ ముఖ్య సలహాదారుడు సిడాం రాంకిషన్, గోడం లక్ష్మణ్, జిల్లా అధి కార ప్రతినిధి కన్నక విఠల్, ఉపాధ్యక్షుడు దుర్వ ప్రదీప్, వర్కింగ్ ప్రెసిడెంట్ మెస్రం భా స్కర్, పర్ధాన్ సమాజ్ నాయకులు భూమన్న, దత్తు, అభిమాన్ తదితరులున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ఆదిలాబాద్టౌన్: అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావు ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 780 అంగన్వాడీ కేంద్రాలకు కనెక్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నా రు. ఆయా కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు, అంతర్గత వైరింగ్, ఇతర సదుపాయాలు కొనసాగుతున్నాయని, ఇవి పూర్తిగా ఉచితమని వివరించారు. చిన్నారుల కోసం నిర్వహించే ప్రీస్కూల్లో కార్యకలాపాలు, పౌష్టికాహార పంపిణీ, ఆరోగ్య సేవలు సజావుగా సాగేందుకు విద్యుత్ సౌకర్యం ఎంతగానో దోహదం పడుతుందని తెలిపారు. విద్యుత్ సౌకర్యంతో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆయా కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
అరటి పండ్లు తిని.. అవగాహన కల్పించి
ఆదిలాబాద్: చంద్ర గ్రహణం సందర్భంగా సమాజంలో ఉన్న అపోహలు, మూఢ విశ్వాసాలు తొలగించేందుకు జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గ్రహణ సమయంలో అరటిపండ్లు తింటూ, నీళ్లు తాగుతూ గ్రహణాన్ని వీక్షించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్ మాట్లాడుతూ.. సాంకేతికంగా పురగమిస్తున్న తరుణంలోనూ అశాసీ్త్రయంగా వ్యవహరించడం విచారకరమన్నారు. గ్రహణాల వెనుక ఉన్న శాసీ్త్రయ కారణాలు తెలిసినా, విద్యావంతులు సైతం సంకుచితంగా ఆలోచించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు దండనాయక ఉమాకాంత్, గౌరవాధ్యక్షులు వీరన్న, ఉదారి నారాయణ, నాయకులు శ్రీధర్ బాబు, సంతోష్ కుమార్, గంగన్న, రాజు, లింగారెడ్డి, నర్సయ్య, ప్రేమ్కుమార్, గంగయ్య, సంతోష్ పాల్గొన్నారు. -
భానుడి భగ భగ
ఆదిలాబాద్: జిల్లాలో అప్పడే ఎండలు మండిపోతున్నాయి. మార్చి ఆరంభంలోనే భానుడు తన ప్ర తాపం చూపుతున్నాడు. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ మార్కు దాటాయి. ఉక్కపోత ప్రభావం మొదలైంది. మధ్యాహ్న వేళలో సూ ర్య ప్రభావానికి జనం ఇళ్లకే పరిమితమవుతున్నా రు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ ని ర్మానుష్యంగా మారుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదలతో ప్రజలు ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. ఫ్యాన్లకు విరామం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందో అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపశమనానికి పాట్లు.. మార్చిలోనే సూర్యుడు సుర్రుమంటుండడంతో జనం విలవిల్లాడుతున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానియాలను ఆశ్రయిస్తున్నారు. మధ్యాహ్నం వేళలో బయటకు వచ్చేవారు తలకు రుమాళ్లు, టోపీలు ధరిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చల్లదనం కోసం ఇళ్లలో ఫ్రిజ్లు, కూలర్ల వాడకంతో పాటు మార్కెట్లో కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు, దోసకాయలకు గిరాకీ పెరిగింది. ఐస్క్రీంల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. దాహార్తి తీర్చుకునేందుకు జనం తాజా పండ్ల రసాల వైపు మొగ్గు చూపుతున్నారు.. గిర్రున తిరుగుతున్న మీటర్లు.. ఉష్ణోగ్రత తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు నడుస్తుండడంతో విద్యుత్ వినియో గం పెరిగిపోతుంది. దీంతో మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలవుతుండడంతో, నిర్దేశిత మార్కు దాటితే బిల్లు భారం తప్పదు. జనవరితో పోలిస్తే, ఫిబ్రవరిలో కరెంట్ వినియోగం పెరిగింది. తాజాగా భానుడి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండడంతో ఈనెలలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. జిల్లాలో వారం రోజుల గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్లో) ఫిబ్రవరి 25 33.2 26 34.8 27 33.8 28 35.8 మార్చి 01 36.8 02 37 03 37.5 -
ఘనంగా కామ దహనం
గోపాలకృష్ణ మఠం వద్ద కామ దహనం జిల్లా కేంద్రంలో సోమవారం కామదహనం ఘనంగా చేపట్టారు. పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం, మార్వాడి ధర్మశాల, శ్రీశనీశ్వరాలయ ప్రాంగణాల్లో ఈ కార్యక్రమాన్ని రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామీజీ, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ భక్తులపై రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్రెడ్డి, సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు ప్రమోద్ కుమార్ఖత్రి, ప్రపుల్ వజే, తదితరులు పాల్గొన్నారు. – ఆదిలాబాద్ -
అమృత్.. ఆలస్యమే!
ఈ ‘సారీ’ కటకటేనా! కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని విలీనకాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్–2.0 పథకం కింద ప్రత్యేక నిధులను విడుదల చేసింది. వీటి ద్వారా ఆయా కాలనీల్లో ట్యాంకుల నిర్మాణంతో పాటు కుళాయిల ద్వారా నీటి సరఫరాకు అవసరమైన పైపులైన్ల ఏర్పాటకు ఆదేశించింది. నిధులు విడుదలై ఏడాది గడిచినా ట్యాంకుల నిర్మాణాలు స్లాబ్ లెవల్ దాటకపోగా, పైపులైన్ల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వేసవిలోపూ పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో ఈ సీజన్లోనూ విలీన కాలనీల్లో తాగునీటి ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు. ప్రజలు మళ్లీ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి దాపురించనుంది. నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేలా.. మావల మేజర్ గ్రామ పంచాయతీలోని రాంనగర్, దస్నాపూర్, సుభాష్నగర్, పిట్టలవాడ, కేఆర్కేకాలనీ, బాలాజీనగర్, హనుమాన్నగర్, 170 సర్వేనంబర్ కాలనీలతో పాటు, బట్టిసావర్గాం పంచాయతీ పరిధిలోని న్యూ హౌసింగ్బోర్డు, కచ్కంటి పంచాయతీ పరిధిలోని అటెండర్స్కాలనీ, కృష్ణానగర్, అనుకుంట పంచాయతీ కేంద్రంతో పాటు దాని పరిధిలోని బంగారుగూడ, రాంపూర్ గ్రామం 2019లో ఆదిలాబాద్ మున్సిపల్లో విలీనమయ్యాయి. దీంతో పట్టణ పరిధిలో జనాభా భారీగా పెరిగింది. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్–2.0 పథకం కింద ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.95.05 కోట్ల నిధులు మంజూరు చేసింది. నిధులు వచ్చి ఏడాది దాటినా పనులు మాత్రం ఇంకా బెస్మెంట్ స్థాయిలోనే ఉండటం గమనార్హం. నత్తనడకన పనులు.. విలీనకాలనీల్లో తాగునీటి వసతి కల్పించేలా పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వా రా పనుల కార్యాచరణను సిద్ధం చేశా రు. పట్టణంలోని బంగారుగూడ, వా ల్మీకినగర్, పాలిటెక్నిక్ కళాశాల స మీపంలో, కేఆర్కే కాలనీ, కుమురంభీంకాలనీ, న్యూ కలెక్టరేట్ సమీపంలో, టైలర్స్కాలనీ, మహాలక్ష్మివాడ , ఖుర్షీద్నగర్లో ఒక్కోటి చొప్పున తొ మ్మిది భారీ రిజర్వాయర్ల(ట్యాంక్)ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో ఖుర్షీద్నగర్లోని ట్యాంకు నిర్మాణం ఇప్పటికీ బెస్మెంట్స్థాయిలోనే ఉంది. మిగతావి స్లాబ్ లెవ ల్ వరకు వచ్చాయి. వచ్చే వర్షాకాలం నాటికి కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆ యా కాలనీల వాసులకు ఈ వేసవిలోనూ బల్దియా ట్యాంకర్లు, చేతిపంపులే దిక్కు కానున్నాయి. పైపులైన్ పనులదీ అదే పరిస్థితి ట్యాంకుల నిర్మాణాలే కాదు.. పైపులైన్ల పనుల పరిస్థితి అలాగే ఉంది. మొత్తంగా 124 కిలోమీటర్ల మేర ఈ పైపులైన్ వేయాల్సి ఉంది. ఈ పనుల్లోనూ జాప్యమవుతోంది. ఇప్పటి వరకు 87కిలోమీటర్ల మేర వేసినట్లుగా పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. విలీనకాలనీల్లో ఎక్కడ చూసినా పైపులే దర్శనమిస్తున్నాయి. దీనిని పూర్తి చేయాలంటే మరో రెండు నెలల సమయం పట్టే అవకాశముంది. ఒకవేళ పైపులైన్లను పూర్తి చేసినా ట్యాంకుల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో నీటి సరఫరా కష్టమే.నీటి సమస్య తలెత్తనీయం అమృత్ 2.0 పనుల్లో జాప్యమవుతున్న మాట వాస్తవమే. ట్యాంకుల నిర్మాణాలు కొనసాగుతుండటంతో ఈ సీజన్ నాటికి అవి అందుబాటులోకి వచ్చే అవకాశముండదు. అయితే విలీన కాలనీలతో పా టు పట్టణంలోని ప్రధాన కాలనీల్లో ఎక్కడా నీటి సమస్య రానివ్వం. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం. లాండసాంగ్వి నుంచి పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. అక్కడ పూడికతీతతో పాటు 24గంటల పాటు నడిచేలా విద్యుత్ మోటర్లను ఏర్పాటు చే స్తాం. అలాగే ట్యాంకర్ల ద్వారానూ నీటిని సరఫరా చేస్తాం. – అరుణ్కుమార్, మున్సిపల్ ఇన్చార్జి ఈఈ -
కంపెనీల ఒత్తిడితో..
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో యూరియా కొరత కనిపిస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలో పదుల సంఖ్యలో ప్రైవేట్ ఎరువుల డీలర్లు, వ్యాపారులు ఉన్నారు. ప్రస్తుతం వారి వద్ద ఎక్కడా యూరియా అందుబాటులో లేదు. జిల్లాలోని పలు మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో రైతుల నుంచి అంతగా డిమాండ్ లేదు. దీంతో సమస్య కనిపించని పరిస్థితి. వానాకాలం సీజన్లోనూ ఇలాగే ఉంటే రైతులు ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. జిల్లాలో ఏటా ప్రభుత్వ కేంద్రాలైన సొసైటీలు, డీసీఎంఎస్లు, ఆగ్రో సేవా కేంద్రాలతో పాటు ప్రైవేటు షాపుల్లో కలిపి లక్ష మెట్రిక్ టన్నులకు పైగా ఎరువుల విక్రయాలు జరుగుతాయి. ఇందులో ప్రభుత్వ కేంద్రాల్లో 60శాతం, ప్రైవేట్లో 40శాతం వరకు విక్రయిస్తారు. ఒక్కోసారి ప్రభుత్వ కేంద్రాల్లో అందుబాటులో లేకపోతే రైతులు ప్రైవేట్లో కొనుగోలు చేస్తారు. ఒకవేళ ప్రైవేట్లో విక్రయం జరగకపోతే, సీజన్లో వారి కష్టాలు ఇక వర్ణనాతీతమే. ఫర్టిలైజర్ యాప్ అమలు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 20 నుంచి జి ల్లాలో ఫర్టిలైజర్ యాప్ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా రైతు ముందుగా బుక్ చేసుకొ ని ఆ నిర్ధారిత సమయానికి, ఎంపిక చేసుకున్న కేంద్రంలో వాటిని తీసుకునేందుకు అవకాశం కల్పించారు. యాప్లో బుక్ చేసుకునే క్రమంలో ప్రభుత్వ కేంద్రాలతో పాటు ప్రైవేట్ సెంటర్లలో ఎక్కడెక్కడ ఎరువులు అందుబాటులో ఉన్నాయనేది ఆన్లైన్లో స్పష్టంగా కనిపిస్తుంది. అనుగుణంగా ఉన్న సెంటర్ను ఎంపిక చేసుకొని రైతులు నిర్దేశిత సమయానికి ఎరువులు తీసుకున్నారు. సమస్య ఇలా.. యాప్ అమలులోకి వచ్చాక రైతులు ముందుగా బుక్ చేసుకొని కావాల్సిన ఎరువులు మాత్రమే తీసుకుంటున్నారు. అంతకు ముందు యూరియా కోసం వచ్చే రైతులకు వాటితో పాటు డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్ఎస్పీ ఇలా ఇతర ఎరువులను కూడా డీలర్లు, వ్యాపారులు అంటగట్టి వ్యాపార పరంగా ప్రయోజనం పొందేవారు. యాప్ రాకతో పరిస్థితి మారింది. డీలర్లు ప్రస్తుతం రైతు బుక్ చేసుకున్న ఎరువు మాత్రమే ఇచ్చే పరిస్థితి. ఈ క్రమంలో ప్రైవేట్ వ్యాపారులకు యూరియా విక్రయాలపై పెద్దగా మార్జిన్ లేకపోవడం, ఇతర ఎరువులను విక్రయించే పరిస్థితి లేకపోవడంతో ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రైవేట్లో యూరియా నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయనే ప్రచారం సాగుతోంది. వానాకాలం సీజన్లోనూ ఇదే పరిస్థితి ఎదురైతే మాత్రం రైతులకు కష్టాలు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కొరత లేదు.. ప్రైవేట్లో యూరియా పరిస్థితిపై ఇప్పుడే అంచనా వేయలేం. ప్రస్తుతం ఎక్కడా కొరత లేదు. వానాకాలం సీజన్లో ఆ పరిస్థితి ఎదురవుతుందా అనేది చెప్పలేం. ఫర్టిలైజర్ యాప్ జిల్లాలో సక్సెస్ అయ్యింది. గత డిసెంబర్ 20న జిల్లాలో ఈ యాప్ అమలు చేయగా, లక్ష 32వేల మంది రైతులు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకొని ఎరువులు తీసుకున్నారు. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి జిల్లాలో సాగు వివరాలు.. వానాకాలం సాగు విస్తీర్ణం(అంచనా): 4లక్షల 40వేల ఎకరాలు అవసరమయ్యే యూరియా : 35వేల మెట్రిక్ టన్నులుప్రైవేట్ డీలర్లు వివిధ కంపెనీల నుంచి యూరియాతో పాటు ఇతర ఎరువులను హోల్సెల్గా తీసుకుంటారు. ఆ డీలర్లతో పాటు రిటేల్లో వ్యాపారులు కూడా వాటిని విక్రయిస్తారు. యాప్ రాకతో రైతులు కేవలం బుక్ చేసుకున్న యూరియా మాత్రమే తీసుకొని ఇతర ఎరువులు కొనుగోలు చేయకపోవడం, ఆ యూరియాపై పెద్దగా ఆదాయం రాకపోవడం, ఇతర ఎరువుల విక్రయాలు లేకపోవడంతో డీలర్లు, వ్యాపారులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. కంపెనీలేమో ఇతర ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామనే షరతుతో ఉండడం, డీలర్లు, వ్యాపారులకు ఇది నష్టంగా మారడంతో వారు వీటి విక్రయాలకు మొగ్గుచూపడం లేదని మార్కెట్లో ప్రచారం సాగుతుంది. -
● ప్రజావాణిలో అర్జీదారుల మొర ● దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా
గోడు విని.. గోస తీర్చండికై లాస్నగర్: భూ సమస్య పరిష్కరించాలని ఒకరు.. పింఛన్ మంజూరు చేయాలని మరొకరు.. ఉపాధి కల్పించాలని ఇంకొకరు.. ఇలా సమస్యలతో తరలి వచ్చిన వారు కలెక్టర్ రాజర్షి షా ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. గోస తీర్చాలని వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి కలెక్టర్ అ ర్జీలు స్వీకరించారు. మండల స్థాయి సమస్యలపై సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న జిల్లాస్థాయి అధికారులకు దరఖాస్తులను అందజేస్తూ సత్వరం పరిష్కరించేలా చూడాలన్నారు. కాగా ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 87 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన.. -
దళిత మహాసభ జయప్రదం చేయండి
కై లాస్నగర్: అంబేడ్కర్ అభయహస్తం పేరిట దళి తులకు రూ.12లక్షల ఆర్థికసాయం ప్రకటించి అమలు చేయాలని మాదిగ హక్కుల పోరాట సమితి జి ల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెదెల్లి మహేందర్, కల్లెపెల్లి రాజు డిమాండ్ చేశారు. ఈమేరకు ప్ర భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 18న హన్మకొండలోని హరిత కాకతీయలో దళిత మహాసభ ని ర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభకు సంబందించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో చెవేళ్లలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ చేసిన డిక్లరేషన్ను అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే డిమాండ్తో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైస ఉపేందర్ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు జి ల్లాలోని దళితులు అధికసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు కాంతారావు, కరుణాకర్, ఆనంద్రావు, రాజన్న, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయ సన్మానం
ఉద్యోగ విరమణ పొందిన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి దంపతులను జిల్లా అధికార యంత్రాంగం ఆదివారం ఘనంగా సత్కరించింది. పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆమె సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. – కై లాస్నగర్ -
పీఆర్సీ అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
ఆదిలాబాద్టౌన్: పీఆర్సీ అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి అన్నారు. పట్టణంలోని యాదవ సంఘ భవనంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ప్రతినెలా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించేలా చర్యలు చేపడతామన్నారు. 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. జీవో 317 బాధితుల కోసం త్వరలో జీవో 190 అమలుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సమగ్ర శిక్షా అభియాన్, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు ఇప్పించడానికి చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రావు, అసోసియేట్ అధ్యక్షుడు అభిమాన్, గౌరవాధ్యక్షుడు ప్రకాశ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడె నూర్సింగ్, నర్ర నవీన్ యాదవ్, విఠల్ గౌడ్, మోహన్ సింగ్, జాదవ్ ప్రకాశ్, ముజీబ్, సునిల్ తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణం.. కమనీయం
పూజలు నిర్వహిస్తున్న ఎంపీ గోడం నగేశ్ దంపతులు బజార్హత్నూర్ మండలం జాతర్ల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన స్వామివారి కల్యోణోత్సవం నేత్రపర్వంగా సాగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ ఎంపీ గోడం నగేశ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి గంగాధర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మేకల వెంకన్న, రమణ, నంది నర్సయ్య, ఈశ్వర్, చందు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. – బజార్హత్నూర్ -
‘లక్ష్యం’ నెరవేరేలా..
ఆదిలాబాద్టౌన్: విద్యార్థులకు పదో తరగతి తొలిమెట్టు. ఇక్కడ సాధించిన ఫలితాలే భవిష్యత్తులో అన్నింటిలో పరిగణలోకి తీసుకుంటారు. జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక దృష్టి సారించారు. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి బోధన, మౌలిక వసతులపై ఫోకస్ పెంచారు. విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో తరచూ సమీక్షలు నిర్వహించడం వంటివి చేపట్టారు. అలాగే విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు ఇప్పటికే కరదీపికలను అందించారు. ఈనెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు షురూ కానున్నాయి. ఈ క్రమంలో సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ‘లక్ష్యం’ పేరిట లేఖలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా ఈనెల 4న వాటిని విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా పదో తరగతి విద్యార్థులందరికీ అందజేయనున్నారు. వందశాతం లక్ష్యం సాధన దిశగా.. పదో తరగతిలో జిల్లా విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ‘లక్ష్యం’ పేరిట లేఖలను విడుదల చేయనున్నారు. జిల్లాలో 108 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 5,568 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. వీరిలో జెడ్పీ యాజమాన్యంలో 3552 మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 783, కేజీబీవీల్లో 688 మంది, మోడల్ స్కూళ్లలో 545 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 10,928 మంది టెన్త్ పరీక్షలకు హాజరు కానుండగా, మిగతా వారు ప్రైవేట్, గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. డీఈవో పరిధిలో పాఠశాలలకు మాత్రం ఈ లేఖలను పంపిణీ చేస్తున్నారు. లేఖలో ఏముందంటే.. -
లెక్చరర్లకూ టార్గెట్లు..
ఆదిలాబాద్టౌన్: పదో తరగతి పరీక్షలు పూర్తి కాకముందే కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల పర్వానికి తెరలేపాయి. పీఆర్వోలు, లెక్చరర్ల సాయంతో విద్యార్థుల ఇళ్ల బాట పడుతున్నారు. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి నమ్మబలుకుతున్నారు. ఇప్పుడే అడ్మిషన్ తీసుకుంటే డిస్కౌంట్ వర్తిస్తుందని తర్వాత సీట్లు ఉన్నా ఫీజు ఎక్కువగా ఉంటుందని భయపెడుతున్నారు. నిజమే అని భావించిన పేరెంట్స్ సరే అంటున్నారు. తీరా అడ్మిషన్ పొందిన తర్వాత పరీక్షల సమయంలో ఫీజుల కోసం ఇబ్బందులకు గురిచేయడం యాజమాన్యాలకు పరిపాటిగా మారింది. పరీక్షల సమయంలో హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. రూ.లక్షల్లో ఫీజులు.. తాము పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. మెయిన్స్, అడ్వాన్స్, నీట్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని చెబుతున్న యాజమాన్యాలు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. వేలల్లో ఒకరిద్దరికి వచ్చే ర్యాంకులను చూపి మాయమాటలతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. అది నిజమే అని నమ్మిన చాలా మంది పేరెంట్స్ ప్లాట్లు, ఇండ్లు, పొలాలు, స్థిరాస్తులను అమ్ముకొని తమ పిల్లలను చదివిస్తున్న పరిస్థితి. ఆఫర్లతో ఆకట్టుకుంటూ.. జిల్లాలోని ఆయా కళాశాలల యాజమాన్యాలు నియమించుకున్న పీఆర్వోలు రెండు నెలల ముందు నుంచే విద్యార్థుల ఇళ్ల బాట పట్టారు. ఆఫర్ల పేరిట తల్లిదండ్రులను ఆకర్షిస్తూ జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. దసరా సెలవుల సమయంలో ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామాలు సేకరించి తర్వాత నుంచి తమ పని కానిచ్చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, తదితర ప్రాంతాలకు చెందిన కళాశాలలకు చెందిన పీఆరోలు జిల్లాలో 50 మంది వరకు ఉండడం గమనార్హం. కాగా, పదో తరగతి పరీక్షలు పూర్తి కాకముందే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని ఇంటర్మీడియెట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన అందుతుంది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలను నమ్మి తమ పిల్లలను చేర్పించవద్దు. సర్కారు కళాశాలల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు కానుంది. ప్రైవేట్ కళాశాలలు ముందస్తుగా అడ్మిషన్లు తీసుకోవద్దు. మార్చి13 తర్వాత అఫ్లియేషన్ ఇవ్వడం జరుగుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. – జాదవ్ గణేశ్కుమార్, డీఐఈవో తమ కళాశాలలో విద్యార్థులను చేర్పించిన పీఆర్వోతకు సంబంధిత యాజమాన్యాలు రూ.వెయ్యి నుంచి రూ.5వేల చొప్పున నజరానాగా చెల్లిస్తోంది. మరోవైపు సంబంధిత కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తప్పకుండా 20 వరకు అడ్మిషన్లు తీసుకురావాలని ఆయా మేనేజ్మెంట్లు టార్గెట్లు విధిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఉదయం, సాయంత్రం విద్యార్థుల ఇళ్ల బాట పడుతున్నారు. తల్లిదండ్రులను ఆఫర్లు, మాయమాటలతో మచ్చిక చేసుకుంటూ లక్ష్యాలను పూర్తి చేసుకుంటున్నారు. ఒకసారి అడ్మిషన్ పొందితే ఆ విద్యార్థి రెండేళ్ల పాటు చదవాల్సిందే. మధ్యలో వెళ్తే ఫీజు కట్టాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్టౌన్: దివ్యాంగుల సమస్యలు పరి ష్కరించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) జిల్లా అధ్యక్షుడు మెస్రం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆది వారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. దివ్యాంగుల పెన్షన్, ఉపకరణాల కోసం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యా ప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 13 నుంచి హైదరా బాద్లోని ఇందిరా పార్క్ వద్ద రిలే దీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే 28, 29 తేదీ ల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా విభాగం సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం కార్యదర్శి ఆరీఫా బేగం, ఆశన్న, గంగా రాం, రాధ, పద్మ, జాహ్నవి పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు నవసమాజ నిర్మాతలు
ఆదిలాబాద్: నవ సమాజాన్ని నిర్మించే గొప్ప అవకాశం ఉపాధ్యాయులకే ఉందని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. పట్టణంలోని శిశుమందిర్లో ఆదివారం ఏకలవ్య ఫౌండేషన్ విద్యా వాహిని ఆధ్వర్యంలో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులను చదువుకే పరిమితం చేయకుండా, వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలన్నారు. అనంతరం నిస్వార్థంగా సేవలందిస్తున్న పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు సతీష్ దేశ్పాండే, దిగంబర్, సీఈఓ మధుకర్, జిల్లా ఇన్చార్జి ముత్యం, ఎంఈవోలు ఉదయ్కుమార్, వెంకట్రావు, ప్రాజెక్ట్ మేనేజర్ ప్రశాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పంచాయతీలకు నిధులొచ్చాయ్
కై లాస్నగర్: గ్రామ పంచాయతీలకు ఎట్టకేలకు నిధులు విడుదలయ్యాయి. ఇటీవల నూతన పాలకవర్గాలు కొలువుదీరడంతో పెండింగ్లో ఉన్న 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. తాజాగా రూ.12.09 కోట్లు నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో సర్పంచ్ల పాలన అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో కలిపి రూ.20.31 కోట్లు పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత విడుదలైన ఈ నిధులు ట్రాక్టర్ల ఈఎంఐలు, కరెంట్ చార్జీలకు ఖర్చయ్యే అవకాశముందని కార్యదర్శులు చెబుతున్నారు. వేసవి ప్రారంభం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తే తప్ప పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉండదంటున్నారు. కాగా, మాజీ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు క్లియరయ్యే అవకాశమున్నట్లుగా చెబుతున్నారు. రూ.20.31కోట్ల జమ.. జిల్లాలోని 473 గ్రామ పంచాయతీలకు గాను విడతల వారీగా రూ.20కోట్ల 31లక్షల 83వేల 331ల నిధులను విడుదల చేసిన ప్రభుత్వం వాటిని జనాభా ప్రతిపాదికన నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ చేసింది. ఇందులో రూ.12కోట్ల 9లక్షల 76వేల 507లను శుక్రవారం విడుదల చేసింది. తొలుత రూ.8కోట్ల 06లక్షల 50,964 విడుదల కాగా తర్వాత రూ.9లక్షల 32వేల 694లు, మరో సారి రూ.6లక్షల 23వేల166 నిధులను విడతలవా రీగా మంజూరు చేసింది. రెండేళ్లుగా నిధుల లేమితో సతతమవుతున్న పంచాయతీలకు ఈ నిధుల విడుదలతో కాస్తా ఊరట లభించినట్లైంది. ఈఎంఐలు, సీసీ చార్జీలకే సరి రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జీపీల్లో ట్రాక్టర్ల నెలవారీ కిస్తీలు, కరెంట్ బిల్లులు భారీగా పేరుకుపోయాయి. ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తాయనే ఉద్దేశంతో గత పంచాయతీల పాలకవర్గం ముగిసే సమయంలో అప్పటి సర్పంచ్లు అడ్వాన్స్గా పనులు చేపట్టారు. చాలాచోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు పూర్తి చేశారు. అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోగా, 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. దీంతో అప్పటి నుంచి బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో మాజీ సర్పంచ్లు చేసిన కొద్దిపాటి బిల్లులు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. సర్పంచ్ల బిల్లులతో పాటు పంచాయతీల నిర్వహణ కోసం కార్యదర్శలు అప్పులు చేసి మరీ పనులు చేపట్టారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా ఇతరాత్రా పనులు చేపట్టేందుకు తమ జేబుల్లో నుంచి వెచ్చించారు. ప్రస్తుతం ఈ బకాయిలు కూడా పేరుకుపోయాయి. వీటితో పాటు ట్రాక్టర్ కిస్తీలు, కరెంట్ బిల్లులు చెల్లించేందుకు పంచాయతీ ఖజనాలో డబ్బులు లేకపోవడంతో భారీగా పెండింగ్ పడ్డాయి. ప్రస్తుతం నిధుల విడుదల కావడంతో ఇలాంటి బకాయిలు క్లియరయ్యే అవకాశం కనిపిస్తోంది. ట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లో ఉండటంతో బ్యాంకర్లు పంచాయతీ ఖజానాలో జమయ్యే నిధులను ఆటోమెటిక్గా డెబిట్ చేసుకునే అవకాశముంటుంది. దీంతో జీపీల్లో వాటిని ఇతర పనులకు ఉపయోగించే అవకాశం ఉండదు. కనుక ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేయాలని సర్పంచ్లు కోరుతున్నారు. తాజాగా విడుదలైన నిధుల వివరాలు (మండలాల వారీగా) మండలం విడుదలైన నిధులు(రూ.లలో) ఆదిలాబాద్రూరల్ 74,66,225 బజార్హత్నూర్ 65,32,125 బేల 62,59,706 భీంపూర్ 50,30,532 భోరజ్ 32,27,583 బోథ్ 72,33,988 గాదిగూడ 53,21,262 గుడిహత్నూర్ 66,93,021 ఇచ్చోడ 89,20,582 ఇంద్రవెల్లి 94,27,789 జైనథ్ 44,44,264 మావల 13,13,907 నార్నూర్ 73,83,357 నేరడిగొండ 66,16,962 సాత్నాల 30,31,117 సిరికొండ 37,56,967సొనాల 28,41,578 తలమడుగు 69,77,765 తాంసి 32,85,375 ఉట్నూర్ 1,52,12,402 -
సరస్వతికి జాతీయస్థాయి పురస్కారం
ఉట్నూర్రూరల్: ఆదివాసీలకు దక్కాల్సిన అట వీ హక్కులు, మహిళా సాధికారితపై నిరంత రం కృషి చేస్తున్న ఉట్నూరు మండలం లక్కా రం గ్రామానికి చెందిన మర్సుకోల సరస్వతికి జాతీయస్థాయి పురస్కారం లభించింది. ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తేదీల్లో ఒడిశా రాజధా ని భువనేశ్వర్లో ‘యాక్షన్ ఎయిడ్ సంస్థ’ నిర్వహించిన ‘ఫారెస్ట్ లైవ్లీ హుడ్ ఐడెంటిటీ’పై నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి సరస్వతి పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ సందీప్ చాచ్రా, ఎస్తేర్ సెల్వం చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. -
భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
ఆదిలాబాద్టౌన్: విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అన్నారు. జాతీయ సైన్స్ దినో త్సవాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా ఆయా పా ఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నిత్యజీవితంలో ఉపయోగపడేలా ఆవిష్కరణ లు తయారు చేసి అందరినీ అబ్బురపరిచారు. పట్టణ సమీపంలోని ఎస్ఆర్ప్రైమ్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హా జరై మాట్లాడారు. విద్యార్థుల్లో సైన్స్పై పరిజ్ఞా నం పెంపొందేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ ప్రమోద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే బేల జెడ్పీఎస్ఎస్లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ప్ర భుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కా ర్యక్రమంలో లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
ఆదిలాబాద్టౌన్: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, అలాగే ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం శనివారం నిర్వహించగా, కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పాల్గొన్నారు. డీఆర్డీవో రవీందర్ రాథోడ్ ఏజెండా వివరాలు చదివి వినిపించారు. అనంతరం 50 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి శాఖల పరంగా తీసుకుంటున్న చర్యలు, పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రభుత్వ గ్రాంట్లు, నిధుల అంచనాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను రాబోయే 45 రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అమలుపై ఆరా తీశారు. ప్రతీ రైతుకు సాయిల్ హెల్త్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. పశువ్యాధి నియంత్రణ, ఉద్యానవన శాఖ ద్వారా అందుతున్న ప్రోత్సాహకాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని, మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పాటించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. యువతకు పీఎం కౌశల్ వికాస్ యోజన ద్వారా నైపుణ్య శిక్షణ అందించాలన్నారు. మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఆర్డీవోను ఆదేశించారు. పీఎంజీఎస్వై కింద చేపట్టిన గ్రామీణ రోడ్డు పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మున్సిపల్ పరిధిలో మిషన్ అమృత్ కింద తాగునీరు, మురుగునీటి పారుదల పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. వీటితో పాటు జిల్లాలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల ఏర్పాటు, డిజిటల్ ఇండియా, భూ రికార్డుల ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇళ్లను త్వరగా పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, జాతీయ రహదారుల నిర్మాణం, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ పంపిణీ సక్రమంగా జరగాలని, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ పథకాల్లో పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యతో ప్రగతి సాధ్యం
నార్నూర్: విద్యతోనే ప్రగతి సాధ్యపడుతుందని, అలాగే మూఢ నమ్మకాలకు దూరంగా ఉండవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గాదిగూడ మండలంలోని డాబా–బి గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో శని వారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ హాజరై మాట్లాడారు. గిరి గ్రామాల్లో ప్రతి ఒక్కరూ చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అలాగే నాటు వైద్యానికి దూ రంగా ఉండాలని సూచించారు. ఆదివాసీ యు వత కోసం మార్చి 10న జాబ్మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించాలని సూచించా రు. అనంతరం 200 మంది గ్రామస్తులకు వై ద్యులు పరీక్షలు ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అ సోసియేషన్ వైద్యులు శరత్రెడ్డి, సందీప్రెడ్డి, చంద్రశేఖర్, విజయరాహుల్, ఉట్నూర్ సీఐ ప్రసాద్, గాదిగూడ ఎస్సై ప్రణయ్కూమార్, నార్నూర్ ఎస్సైశ్రీసాయి సర్పంచ్ కొడప కన్ను తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఆదిలాబాద్టౌన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 14 నుంచి ఏప్రిల్ 15వరకు నిర్వహించనున్న పరీక్షలకు జిల్లాలో 10,928 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లుగా పేర్కొన్నారు. ఇందుకోసం 52 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధులకు సంబంధించి 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 13 మంది సి–కస్టోడియన్లను నియమించినట్లు పేర్కొన్నారు. ఆయా సెంటర్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశించారు. పరీక్షా పత్రాల రవాణాకు, ఫ్లయింగ్ స్క్వాడ్ల కోసం తగిన వాహనాలను సిద్ధం చేయాలని రవాణా శాఖా అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షల సమయానుకూలంగా బస్సు వేళలను సర్దుబాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్, ఆర్టీసీ, వైద్య, విద్యుత్, పోలీస్, రవాణా, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీ కేసు నిందితుల రిమాండ్
ఖానాపూర్: గత కొన్ని నెలలుగా ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకున్నట్లు నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలి పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా నిర్మల్ డివిజన్లోని ఖానా పూర్, లక్ష్మణ్చాంద, నిర్మల్ టౌన్, మామడ తదితర మండలాల్లోని ఆలయాలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా ను పట్టుకున్నట్లు తెలిపారు. ఖానాపూర్ మండలం సేవ్యానాయక్ తండాలోని జగదాంబ ఆలయంలో దొంగతనానికి పాల్పడిన నలు గురు వ్యక్తులను శుక్రవారం సత్తనపెల్లి గ్రామశివారులో, గురువారం మరో ఇద్దరు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల వ్యవధిలో పట్టుబడిన నిందితులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడే వారన్నారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడిన గాదె రమేశ్, దొసండ్ల శ్రీనివాస్, గురిజాల నడ్చి నర్సయ్య, బూట శంకర్, చీమల శ్రీకాంత్, బుర్క లక్ష్మణ్ అనే ఆరుగురు వ్యక్తులు కలిసి ఖానాపూర్ మండలంలోని తర్లపాద్ గ్రామంలో గల ఓంకారేశ్వర ఆలయం, అగ్గిమల్లన్న ఆలయం, మస్కాపూర్లోని శివాలయం, మధురనగర్లోని ఉగ్రనరసింహ స్వామి ఆలయం, ఖానాపూర్లోని సాయిబాబా ఆలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలతో పాటు ఇతర ఆలయాల్లో దేవునిపై ఉండే ఆభరణాలతో పాటు హుండీలో నగదును చోరీ చేశారన్నారు. ఖానాపూర్ సీఐ అజయ్, నిర్మల్ పట్టణ సీఐ నైలు, ఖానాపూర్ ఎస్సై రాహూల్ గైక్వాడ్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
పరీక్షల సీజన్.. నేత్రాలు పదిలం!
నిర్మల్ఖిల్లా: ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతుండగా, మరో రెండు వారాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు రోజంతా పుస్తకాలు చదవడం, మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం, రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని ఉండడంవల్ల నయనాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షల సమయంలో కంటి సంరక్షణను విస్మరించకూడదని వైద్యులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే కంటి నొప్పి, డ్రైనెస్ భావన, తలనొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్యనిపుణులు డాక్టర్ యు.కృష్ణంరాజు విద్యార్థులకు పలు కీలక సలహాలు ఇచ్చారు. పాటించాల్సిన జాగ్రత్తలు.. -
బహ్రెయిన్లో పార్పెల్లి వాసి మృతి
లక్ష్మణచాంద: ఉపాధికోసం బహ్రెయిన్ వెళ్లిన పార్పెల్లి వాసి గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పార్పెల్లి గ్రామానికి చెందిన కందుకూరి చిన్న రాజేశ్వర్(54) గత మూడు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లాడు. శుక్రవారం ఎప్పటిలాగే కంపెనీలో పనిచేసే క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తనతో పాటు కుమారుడు రంజిత్ కూడా అక్కడే పని చేస్తుండటంతో ఆయన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. కుటుంబ పెద్ద దేశం కాని దేశంలో ప్రాణాలు విడవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
పూర్వ ప్రాథమిక విద్యకు నిధులు
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు (ప్రీ కేజీ తరగతులు) ప్రారంభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 55 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో నిర్మల్ జిల్లాలో 10, ఆదిలాబాద్ జిల్లాలో 6, కుమురంభీం జిల్లాలో 13, మంచిర్యాల జిల్లాలో 26 ఉన్నాయి. వసతుల కల్పన..పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రతీ పాఠశాలకు ఒక ఆయాను నియమించారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద నడుస్తున్న వాటిలో నవంబర్ నుంచి ఇన్స్ట్రక్టర్, ఆయాలను తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ.8000, ఆయాలకు నెలకు రూ.6000 వేతనం చెల్లించనున్నారు. వీరికి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మొత్తం 6 నెలలకు వేతనాలు విడుదలైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.ఉమ్మడి జిల్లా సమాచారం..జిల్లా పూర్వ ప్రాథమిక కేటాయించిన పాఠశాలలు నిధులు నిర్మల్ 10 రూ.8.40 లక్షలు ఆదిలాబాద్ 6 రూ.5.88 లక్షలు కుమురంభీం 13 రూ.12.74 లక్షలు మంచిర్యాల 26 రూ. 25.48 లక్షలు మొత్తం 55 రూ.52.50 లక్షలు -
వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు మృతి
ఆదిలాబాద్టౌన్: వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన శుక్రవారం ఆదిలాబాద్ ప ట్టణంలోని బస్టాండ్ ఎదుట గల ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వి వరాల ప్రకారం.. భోరజ్ మండలం పెండల్వాడకు చెందిన ఓ గర్భిణీ వారం క్రితం ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. కాగా ఈనెల 23న మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుతో పాటు తల్లి ఆరోగ్యంగా ఉ న్నట్లు వైద్యులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం శిశువు పాలు తాగకపోవడంతో వైద్యులకు విష యం తెలిపారు. మధ్యాహ్నం పిడియాట్రీక్ వైద్యు డు వైద్యం కోసం మరో ఆసుపత్రికి ఆటోలో తమకు తెలియకుండానే శిశువును తరలించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తాము కూడా వెంట వెళ్లగా కాసేపటికే బిడ్డ మృతి చెందినట్లు అక్కడి వైద్యుడు చెప్పాడన్నారు. కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసిబిడ్డ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. -
దోపిడీలు చేస్తున్న ముఠా అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: సెల్ఫోన్లు దోపిడీ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వేస్టేషన్, రిమ్స్లో ఈ గ్యాంగ్ దోపిడీకి పాల్పడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 26న ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాధితుడు సగుడారపు కనిష్క్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈనెల 15న రైల్వే స్టేషన్లో పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డుపై నలుగురు వ్యక్తులు అడ్డగించి కనిష్క్ వద్ద డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించారని తెలిపారు. డబ్బులు లేకపోవడంతో మొబైల్ ఫోన్ లాక్కున్నారన్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఒకరు మైనర్ ఉన్నారని తెలిపారు. నిందితుల్లో పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన సయ్యద్ నవీద్, వడ్డెరకాలనీకి చెందిన మీర్జా ముషారప్ బేగ్, షేక్ బిలాల్, ఖానాపూర్కు చెందిన షేక్ అర్షద్, నెహ్రునగర్కు చెందిన బాన్సోడే కిషన్, భుక్తాపూర్కు చెందిన మైనర్ బాలుడు ఉన్నట్లుగా తెలిపారు. గతంలో వీరిపై పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్లుగా తెలిపారు. వీరు బస్టాండ్, రైల్వేస్టేషన్, రిమ్స్ పరిసర ప్రాంతాల్లో దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. -
యంగ్ సైంటిస్ట్లకు ఇస్రో ఆహ్వానం
లక్ష్మణచాంద: పాఠశాలల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి వారిని భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో ఇస్రో విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. అంతరిక్ష సాంకేతిక అనువర్తనాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించడ మే లక్ష్యంగా యంగ్ సైంటిస్ట్ పేరుతో యువ విజ్ఞా న్ కార్యక్రమాన్ని (యువికా) భారత అంతరిక్ష పరి శోధనా సంస్థ నిర్వహిస్తోంది. 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 9వ తరగతి అభ్యసిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని నిర్మల్ జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఎంపిక ఇలా...నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 10,556 మంది విద్యార్థులు 9వ తరగతి అభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులందరు తమ తమ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎంపికై న విద్యార్థులకు...ఇందులో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు ఎప్పటికై నా అంతరిక్ష కేంద్రానికి వెళ్లే అవకాశం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురం వంటి కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎంపికై న విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చా వేదికలు, ప్రయోగశాల సందర్శన, అంతరిక్ష శాస్త్రం, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమికంగా అవగాహన కల్పించనున్నారు.సమాచారం..దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 27 చివరి తేదీ: మార్చి 31 అర్హులు: 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునే వెబ్సైట్: www.isro.gov.in ఇస్రో వద్ద రిపోర్టు చేయవలసిన చివరితేదీ: మే 10 యువికా కార్యక్రమం: మే 11 నుంచి 22 మధ్య -
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
ఆదిలాబాద్రూరల్: మద్యం తాగొద్దని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై విష్ణువర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. బంగారుగూడకు చెందిన కొప్పులవార్ దేవనంద్ (24) ఈనెల 25న మద్యం తాగి భార్యతో గొడవపడ్డాడు. ఈక్రమంలో మద్యం తాగొద్దని భార్య మందలించింది. దీంతో మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి బాపురావ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి రెబ్బెన: కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన యువకుడు నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి శుక్రవారం మృతి చెందినట్లు రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం దుర్గాపూర్ గొండుగూడకు చెందిన మడావి అజయ్ (18) బెల్లంపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతుండగా స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో గత నెల 27వ తేదీన వైద్యం చేయించుకునేందుకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. గ్రామ శివారులో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రికి, మంచిర్యాలకు, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
గల్ఫ్ మృతుల కుటుంబాల దీనస్థితిపై అధ్యయనం
లక్ష్మణచాంద: గల్ఫ్ దేశాలలో ఉపాధి కోసం వెళ్లి ఆకస్మికంగా మరణిస్తున్న కార్మికుల కుటుంబాల పరిస్థితులను, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను జాతీయస్థాయిలో వెలుగులోకి తెచ్చేందుకు ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ శుక్రవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో పర్యటించారు. గత ఐదు నెలల క్రితం దుబాయ్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన మండల కేంద్రానికి చెందిన బీమా రమేశ్ కుటుంబాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రమేశ్ భార్య, తల్లిదండ్రులతో మాట్లాడారు. రమేశ్ మరణానికి గల కారణాలు, మృతదేహం స్వదేశానికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిందా.. వంటి వివరాలను ఆమె ఆరా తీశారు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు మరణించినప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను అధ్యయనం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో ఎన్నారై అడ్వైజర్ కమిటీ సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల, నిర్మల్ మార్కెట్ వైస్చైర్మన్ ఈటెల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఒస రాజేశ్వర్, జిల్లా కిసాన్సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్ల పోతారెడ్డి, బిక్నూర్ రాజు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలి
ఉట్నూర్రూరల్: ఆదివాసీ గిరిజన గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని నిబంధనల పేరుతో అడ్డుకోకుండా మానవత దృక్పథంతో వ్యవహరించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. ఆయన శుక్రవారం ఉట్నూర్ మండలంలోని కుమ్మరికుంట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఐటీడీఏ పీఓ యువరాజ్ మార్మట్, ఆదిలాబాద్ ఏఎస్పీ మౌనిక, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సమావేశంలో గిరిజనులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇండ్ల నిర్మాణాలతో పాటు ఇతర అభివృద్ధి పనులను కోర్ ఏరియా పేరిట అధికారులు అడ్డుకుంటున్నారన్నారు. తాగునీరు, విద్యుత్తు, రవాణా సౌకర్యాలతో పాటు పీఎం జన్మన్ ద్వారా గిరిజనులకు అందుతున్న లబ్ధి వివరాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, అధికారులు, నాయకులు ఉన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే అభివృద్ధికి దూరం’ఇంద్రవెల్లి: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు పాల న సాగించిన బీఆర్ఎస్, ప్రస్తుతం పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గ్రామీణ ప్రాంత గ్రామాల ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నారని జాటోత్ హుస్సేన్నాయక్ అన్నారు. శుక్రవారం హర్కపూర్అంద్గూడ, మచ్చపూర్ గ్రామాల్లో పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మచ్చపూర్ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు, దేవదాయ శాఖ అధికారులు శాలువాలతో ఆయనను సన్మానించి నాగోబా ప్రతి మ అందించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, డీటీడీఓ అంబాజీ, నిర్మల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రితేష్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో జీవన్రెడ్డి, సర్పంచ్లు మెస్రం తుకారం, రాథోడ్ రోహిదాస్, మార్కడ్ అనసూయ ఉన్నారు. -
‘అభివృద్ధి చూసి ఓర్వలేకే ఆరోపణలు’
ఆదిలాబాద్: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూ సి ఓర్వలేకే మాజీ మంత్రి జోగు రామన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు కొద్దినెలల్లో పూర్తి కాబోతున్నాయని, ఆర్వోబీ, ఆర్యూబీ పనులు జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఆదిలాబాద్కు వస్తే విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ శశాంక సమక్షంలో జరిగిన సర్వేను దొంగచాటు సర్వే అని ఎలా అంటారని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దా వా వేస్తానని హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆదిలాబాద్ అభివృద్ధి కోసం తమ ప్రయత్నం ఆగదని స్పష్టం చేశారు. నాయకులు వేదవ్యాస్, లాలా మున్నా, జోగు రవి, సతీశ్, గంట జీవన్, తోకల నరేశ్, దినేశ్ మటోలియ, సాయి, కృష్ణయాదవ్, గటిక క్రాంతికుమార్ తదితరులున్నారు. -
అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన
బోథ్: ప్రసిద్ధి గాంచిన కై లాస్ టెక్డి శివాలయ అభివృద్ధిని వన్యప్రాణుల పరిరక్షణ పేరిట అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ భక్తులు శుక్రవారం మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆలయానికి అనుబంధంగా 25ఏళ్లుగా కొనసాగుతున్న గోశాలను తొలగించాలని అధికారులు సూచించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గోశాల నిర్వాహకుల్లో నలుగురిని రాత్రి పూట అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లడం ఏమిటని భక్తులు, నాయకులు ప్రశ్నించారు. ఉదయం సమాచారం అందుకున్న మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్తో పాటు భక్తులు అటవీ కార్యాలయానికి చేరుకుని విషయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు ఫోన్లో తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరినట్లు సమాచారం. తదుపరి చర్చల అనంతరం గోశాలకు ఇబ్బంది కలగకుండా పరిష్కారం చూపాలని అటవీ అధికారులతో మాట్లాడి నిర్వాహకులను విడుదల చేయించారు. నిగిని, కంటేగావ్, బాబేర తండా గ్రామాల సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట దగా’
ఆదిలాబాద్టౌన్: ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజలను వంచిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం హెలిక్యాప్టర్లో రావడంలో ఆంతర్యమేమిటని, హైదరాబాద్–నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏమైందని ప్రశ్నించారు. భూమాఫియాను పరోక్షంగా ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని, ఆ ప్రాంతంలో 150ఎకరాలు ఎమ్మెల్యే బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారని, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, వేం నరేందర్రెడ్డి కూడా జిల్లాలో భూములు కొన్నారని ఆరోపించారు. ఈడీ అటాచ్డ్లో ఉన్న భూములను కొల్లగొట్టేందుకు ఎమ్మెల్యే సిద్ధమైనట్లు విమర్శించారు. ఎయిర్పోర్టు పేరిట ప్రజల భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ రోపించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని, ఇది జనాలకు అర్థమైనట్లు చెప్పారు. భోరజ్ తహసీల్దార్ బీజేపీ ఏజెంట్గా, కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నాయకులు మెట్టు ప్రహ్లాద్, ఇజ్జగిరి నారాయణ, దాసరి రమేశ్, సతీశ్, యాసం నర్సింగ్రావు తదితరులున్నారు.


