breaking news
Adilabad District Latest News
-
అప్రమత్తతే రక్ష
ఆదిలాబాద్టౌన్: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన సూచించారు. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్, చికున్గున్యా వంటి వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉందని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు. సాక్షి: సీజనల్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?డీఎంహెచ్వో: వర్షాకాలంలో వైరల్ ఫీవర్, డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. ప్రస్తుతం జిల్లాలో జ్వరాల కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. జిల్లాలో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి. వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ప్రాంతాల్లో ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నాం. పాఠశాలలు, గ్రామ సభలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. సాక్షి: సీజనల్ జ్వరాలకు కారణాలు ఏంటి.?డీఎంహెచ్వో: వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండడం, దోమలు అధికంగా పెరగడం, కలుషితమైన నీరు తాగడం, అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. డెంగీని వ్యాప్తి చేసే ఏడిస్ దోమలు మంచి నీటిలోనే పెరుగుతాయి. దీంతో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. సాక్షి: వ్యాధుల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?డీఎంహెచ్వో: ప్రతీ కుటుంబం తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూల కుండీలు, నీటి ట్యాంకుల్లో నీరు నిల్వ ఉండకుండా వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. దోమ తెరలు ఉపయోగించాలి. తాగునీటిని మరిగించి, శుద్ధి చేసిన తర్వాతే వినియోగించాలి. వేడి, తాజా ఆహారాన్ని తీసుకోవాలి. సాక్షి: జిల్లాలో మందులు అందుబాటులో ఉన్నాయా.?డీఎంహెచ్వో: జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నాయి. కుక్క, పాము, తేలు కాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించాం. సాక్షి: వ్యాధులు నిర్ధారించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.?డీఎంహెచ్వో: ర్యాపిడ్ ఫీవర్ సర్వే జూలై నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఆశ కార్యకర్తలతో ఇంటింటా సర్వే చేపడుతున్నాం. ఫీవర్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ప్రతీ పీహెచ్సీలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేశాం. వ్యాధులు ప్రబలిన గ్రామాల్లో మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నాం. సాక్షి: కొన్నిచోట్ల వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలపై మీ స్పందన ఏంటి.?డీఎంహెచ్వో: పీహెచ్సీలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించాం. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించాం. విధులను విస్మరించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. సాక్షి: జిల్లాలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఏవిధంగా అధిగ మిస్తారు.?డీఎంహెచ్వో: జిల్లాలో వైద్యుల కొరత ఉన్న మాట వాస్తవం. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 మంది వైద్యులు పీజీకి వెళ్లడంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తొమ్మిది పీహెచ్సీలలో వైద్యులు లేకపోవడంతో జన్మన్, ఆర్బీఎస్కే వైద్యులతో సర్దుబాటు చేశాం. రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాం. సాక్షి: హైరిస్క్ గ్రామాలపై ఎలాంటి దృష్టి సారించారు.?డీఎంహెచ్వో: జిల్లాలో 220 హైరిస్క్ గ్రామాలను గుర్తించాం. గత ఐదేళ్లలో డెంగీ, ఇతర వ్యాధులు ప్రబలిన వాటిని గుర్తించాం. ఆయా గ్రామాల్లో ప్రతీరోజు డ్రైడే చేపడుతున్నాం. డెంగీ పాజిటివ్ వచ్చిన గ్రామాల్లో పైరిత్రీన్ స్ప్రే చేస్తున్నాం. నీరు నిల్వ ఉన్న కుంటల్లో గంబూషియా చేపలు, ఆయిల్బాల్స్ వేస్తున్నాం. గర్భిణీల కోసం బర్త్ వెయిటింగ్ రూమ్లను ఏర్పాటు చేశాం. సాక్షి: డెంగీ లక్షణాలను ఎలా గుర్తించాలి.?డీఎంహెచ్వో: అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, ఆకలి లేకపోవడం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో భయపడకుండా వైద్యుల సూచనలు పాటించాలి. అవసరమైతే మాత్రమే ప్రత్యేక చికిత్స అందిస్తాం. ఎలిజా ద్వారానే డెంగీ నిర్ధారణ అవుతుంది. -
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
లక్సెట్టిపేట: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుండారపు మహేష్(35) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఏఎస్సై అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్ ఇటీవల వ్యాన్ కొనుగోలు చేసి నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. వ్యాన్ నెల వాయిదా డబ్బులు చెల్లించేందుకు ఇతరుల వద్ద అప్పులు చేశాడు. వ్యాన్ కుదువ పెట్టి రూ.3లక్షలు అప్పులు చేశాడు. అయినా అప్పులు తీరకపోవడం, వ్యాన్ లేకపోవడం, భార్య అనారోగ్యానికి గురై పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి భార్య వనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై వృద్ధుడు.. లక్సెట్టిపేట: పట్టణంలోని బోయవాడకు చెందిన లింగయ్య(67) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగయ్యకు ఆరుగురు అన్మదమ్ములు ఉండేవారు. గతంలో ఇద్దరు చనిపోగా ఇటీవల మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో తాను కూడా చనిపోతే బాగుండు అని అంటూ ఉండేవాడు. ఆదివారం సాయంత్రం మద్యంమత్తులో గోదావరి రోడ్లోని తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. వృద్ధుడి ఆత్మహత్య లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లి గ్రా మానికి చెందిన రాందేని మల్లేశం(73) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఏఎస్సై అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేశం గత కొద్ది రోజులుగా మోకాళ్ల నొప్పులు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రులకు వెళ్లినా నయం కాకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం సాయంత్రం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. మృతుడి భార్య గురులక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. -
చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి
ఆదిలాబాద్టౌన్: మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు సిబ్బంది చట్టాలపై పూర్తి అవగాహన పెంపొందించుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం పోలీసు హెడ్క్వార్టర్స్లో సివిల్ పోలీసు కానిస్టేబుళ్లకు మూడు రోజుల రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 600 మంది సివిల్ పోలీసు కానిస్టేబుళ్లకు 30 బ్యాచ్లుగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బేసిక్ పోలీసింగ్తో పాటు ప్రో యాక్టివ్ పోలీసింగ్ను సమర్థవంతంగా అమలు చేస్తూ నేరాల నివారణలో కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు. శిక్షణలో దర్యాప్తు ప్రమాణాలు, డయల్100 సేవల నిర్వహణ, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల పర్యవేక్షణ, నూతన బీట్ సిస్టం, ఆయుధాల వినియోగం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వేలిముద్రల సేకరణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. క్రమశిక్షణ, నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ పి.మౌనిక, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, డీసీఆర్బీ ఎస్సై ప్రవీణ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యలు బాధ్యతగా పరిష్కరించాలిఆదిలాబాద్టౌన్: ప్రజా సమస్యలను బాధ్యతగా స్వీకరించి, చట్టపరంగా సత్వర పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 28 మంది ఫిర్యాదుదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే 87126 59973 నంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారి నోట్లో ఇరుక్కున్న టూత్ బ్రష్
కాసిపేట: మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన వేల్పుల సతీష్ కూతురు అమన్వితశ్రీ(2) నోట్లో దవడలకు టూత్ బ్రష్ చిక్కుకోవడంతో నరకయాతన అనుభవించింది. సోమవారం సాయంత్రం నోట్లో బ్రష్ వేసుకుని ఆడుకుంటున్న సమయంలో కిందపడడంతో చర్మాన్ని చీల్చుకుంటూ దవడలో ఇరుక్కుపోయింది. కాసిపేట పీహెచ్సీకి అక్కడి నుంచి 108 అంబులెన్స్లో మంచిర్యాల మాతాశిశు కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వరంగల్ ఏంజీఎంకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించగా.. బ్రష్ను తొలగించారు. బైండోవర్ ఉల్లంఘించిన ఒకరికి జరిమానాఇచ్చోడ: బైండోవర్ నిబంధనలు ఉల్లఘించిన నైతం సంజీవ్కుమార్ అనే వ్యక్తికి రూ.25 వేల జరిమానా విధించినట్లు ఇచ్చోడ ఎస్హెచ్వో నరేశ్కుమార్ తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముఖరా బి గ్రామానికి చెందిన నిందితుడు నైతం సంజీవ్కుమార్ గతంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నందున కేసు నమోదు చేసి బైండోవర్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ మద్యం విక్రయిస్తుండడంతో తహసీల్దార్కు నివేదిక అందజేయగా తహసీల్దార్ ఇమ్రాన్ సోమవారం ఆయనకు జరిమానా విధించినట్లు తెలిపారు. పాము కాటుతో మహిళ మృతిఆదిలాబాద్రూరల్: పాముకాటుతో మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన గజ్జల దేవ్బాయ్ (65) అనే మహిళ మృతి చెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దేవ్బాయ్ కుమారునితో కలిసి కొత్తగూడ గ్రామంలో నివాసం ఉంటుంది. ఆదివారం సాయంత్రం ఆమెను పాము కాటు వేసింది. రక్తస్రావం జరగడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి కేసులో తొమ్మిది మంది అరెస్టుఆసిఫాబాద్: పోలీసుల పెట్రోలింగ్లో భాగంగా తిర్యాణి మండలంలో 170 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అరెస్టు చేశామని డీఎస్పీ అశోక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సోమవారం వివరాలు వెల్లడించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన మిడిదొడ్డి కృష్ణ, దుర్గం ప్రశాంత్, ఉల్లిపిట్ట గ్రామానికి చెందిన ముంజం భరత్ గంజాయి సేవించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు. వీరి ద్వారా సుంగాపూర్కు చెందిన మల్కాడి కృష్ణ, ముంజం శ్రీరామ్, బొర్లకుంట కృష్ణంరాజు, దుర్గం జీవన్, వైరాగడే పుష్పరాజ్, చునార్కర్ నితిన్, బొర్లకుంట సాయికుమార్ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. గంజాయి వినియోగం, రవాణా నేరమని అన్నారు. ప్రత్యేక నిఘా ఉంటుందని హెచ్చరించారు. -
గ్రీవెన్స్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: గ్రీవెన్స్లో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉట్నూర్ మండలం సాలెవాడ గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామానికి అంగన్వాడీ మంజూరు చేయాలని, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన మెస్రం చిత్రు తనకు భూ పట్టా ఇప్పించాలని, ఆసిఫాబాద్ మండలం మాణిక్గూడ గ్రామానికి చెందిన భీము తనకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ పీఈటీ ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు ఇచ్చారు. వీరితో పాటు మరికొందరు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఐటీడీఏ పీవో నిత్యం బిజీగా ఉంటూ గిరిజన ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నిమగ్నమయ్యే ఐటీడీఏ పీవో మంద మకరందు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దీక్ష స్వీకరించారు. -
వార్డెన్ను బెదిరించి వసూళ్లు
ఉట్నూర్రూరల్: సమాజంలో ఏది తప్పు, ఏది ఒప్పు కొడుకుకు చెప్పి సన్మార్గంలో పెట్టాల్సిన తండ్రే, కొడుకును వెంట బెట్టుకుని బెదిరింపులు, వసూళ్లకు పాల్పడిన ఘటన ఉట్నూర్ పట్టణంలో వెలుగుచూసింది. సీఐ ఎం.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పాత ఉట్నూర్కు చెందిన నేతావత్ రాందాస్, నేతావత్ జైల్సింగ్ అనే తండ్రీకొడుకులు గత కొద్ది రోజులుగా ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్కు ఫోన్ కాల్స్ చేసి ఒక కార్యక్రమం పేరుతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఈ నెల 26న హాస్టల్కు వెళ్లిన నిందితులు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని బెదిరించారు. గత ఆరు నెలల్లో రెండు సార్లు రూ.3వేల చొప్పున రూ.6వేలు వసూలు చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుల ప్రమేయం నిర్ధారణ కావడంతో వారిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు. బెదిరింపులు, బలవంతపు వసూళ్ల వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై విజయ్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
తండ్రి చితికి నిప్పుపెట్టిన కూతురు
తాండూర్: తండ్రి చితికి నిప్పంటించి కొడుకులు లేరనే లోటును తీర్చింది. పుట్టెడు దుఃఖంలోనూ దహనసంస్కారాలు నిర్వహించింది. మండలంలోని బోయపల్లి గ్రామానికి చెందిన ఇప్ప కమలాకర్(40) ఆదివారం తీవ్ర అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన మొదటి భార్య శోభ కూడా మూడేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. వీరికి కూతురు కీర్తన ఉంది. ఆ తర్వాత కమలాకర్ మరో వివాహం చేసుకున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలాకర్ తుది శ్వాస విడిచాడు. సోమవారం కమలాకర్ స్థానికులు దహన సంస్కారాలు నిర్వహించారు. కుమారుడు లేకపోవడంతో కూతురు కీర్తన ఆ బాధ్యతను తీసుకొని తండ్రికి తలకొరివి పెట్టింది. కూతురే అన్నీ తానై అంతిమ సంస్కారాలు నిర్వహించడం అక్కడున్న వారిని కలిచివేసింది. -
బహిరంగంగా మద్యం సేవిస్తే కేసులు
ఆదిలాబాద్టౌన్: బహిరంగంగా మద్యం సే విస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆ దిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రై వేట్ పాఠశాలలు, కళాశాలలు, వాటి మైదా నాలు, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివా రం రాత్రి వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని బ్రా హ్మణవాడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మ ద్యం సేవిస్తున్న జుబేర్ను అదుపులోకి తీసుకు ని క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వివరించా రు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఆదిలాబాద్ సబ్డివిజ న్ పరిధిలో ప్రత్యేక గస్తీ బృందాలు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నాయని తెలిపా రు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి గురించి సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. -
సమస్యలు పరిష్కరించి భరోసా కల్పించాలి
కైలాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేఽశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రూలతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధితుల సమస్యలు వివరించి వాటిని పరిష్కరించేలా చూడాలని ఆదేఽశించారు. అందుబాటులో ఉన్న జిల్లా అధికారులకు దరఖాస్తులను అందజేస్తూ వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. 30 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించి వాటి ప్రగతిని ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, భూ భారతి, ఉపాధిహామీ వంటి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 97 అర్జీలు అందాయి. -
చోరీకి పాల్పడ్డ నిందితుడి అరెస్ట్
బోథ్: ఇంటి తాళం పగులగొట్టి నగదు చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బోథ్ ఎస్సై వి. పురుషోత్తం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న పట్టణంలోని న్యూ కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటికి తాళం వేసి పనికి వెళ్లింది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని పెట్టేలో దాచుకున్న రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 26న బోథ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన కృష్ణకాంత్ జాదవ్గా గుర్తించారు. కూలీ పని ద్వారా వచ్చే ఆదాయం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో బాధితురాలి ఇంటి తాళం పగులగొట్టి చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని ఎస్సై పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.5వేలు స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
ఉపాధ్యాయుడిని కొనసాగించాలి
కజ్జర్ల గ్రామంలోని ప్రాఽథమిక పాఠశాలలో 56 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది దుబ్బగూడ, బట్టిసావర్గాం గ్రామాల నుంచి కూ డా పిల్లలను చేర్పించాం. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు సైతం ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సర్దుబాటులో భాగంగా ఒక ఉపాధ్యాయడిని మరో పాఠశాలకు పంపించారు. దీంతో తమ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. కలెక్టర్ స్పందించి ఉపాధ్యాయుడిని ఇక్కడే కొనసాగిస్తూ నాణ్యమైన విద్యనందించేలా చూడాలి. – విద్యార్థుల తల్లిదండ్రులు, కజ్జర్ల, తలమడుగు -
కలెక్టరేట్ ఎదుట ఎన్పీఆర్డీ ధర్నా
కై లాస్నగర్: ఎన్నికల సమయంలో దివ్యాంగులకిచ్చిన హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు నగేశ్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమలు చేయడం లేదన్నారు. 2023 నుంచి 2025 వరకు వీల్చైర్లు, ట్రై సైకిళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న దివ్యాంగులకు వాటిని ఇంకా అందించలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం, ఆర్టీసీ బస్సులో గౌరవం కల్పించా లని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి ఆరిఫా బేగం, గంగసాగర్, ఆశ న్న, ఆర్.మంజుల తదితరులు పాల్గొన్నారు. -
పారామెడికల్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
మావల మండల కేంద్రంలోని డాక్టర్ ఎస్.పవార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తోంది. కోర్సులు పూర్తయిన తర్వాత కూడా వారికి ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు నివేదిక ఇవ్వకముందే ఎలాంటి లోటుపాట్లు లేవంటూ కళాశాల యాజమాన్యం ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి కళాశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలి. – ఏబీవీపీ నాయకులు, ఆదిలాబాద్ -
‘బోథ్లో ఆసుపత్రులు అభివృద్ధి పర్చండి’
బోథ్: నియోజకవర్గంలోని ఆసుపత్రులను వెంటనే అభివృద్ధి పరిచి, గిరిజన, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన, నియోజకవర్గంలో ఎదురవుతున్న వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పరిస్థితులను, ఆసుపత్రుల అభివృద్ధి ఆవశ్యకతను మంత్రికి వివరించారు. బోథ్ ఏరియా ఆసుపత్రిని అందుబాటులోకి తేవడంతో పాటు ఇచ్చోడ, నేరడిగొండ ప్రాంతాల్లోని పీహెచ్సీలను ఆధునీకరించాలని పేర్కొన్నారు. జాతీయ రహదారి ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య వసతులు కల్పించాలని, కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిని నియమించాలని, నేరడిగొండ ఆసుపత్రిలో రూ. 6 కోట్ల అంచనా వ్యయంతో 30 పడకల ఇన్–పేషెంట్ భవ నం, లేబర్ రూమ్, నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేయాలని కోరారు. -
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
మందమర్రిరూరల్: దేశంలో గోహత్యను పూర్తిగా నిషేధించాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గోరక్షణ జిల్లా సేవకులు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని కామాఖ్యపురం వారాహిదేవి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశ వ్యాప్తంగా గోమాత సంరక్షణే ధ్యేయంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మందమర్రి పట్టణంలో 60 వేల సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. సేకరించిన సంతకాల ప్రతులను రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లకు అందజేస్తామని తెలిపారు. సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మంథిని సతీష్, భవానీ, గోరక్షకులు సూరిబాబు, వెంకటేశం, నర్సయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
బాసర: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్థన్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో నూతనంగా చేరిన పీయూసీఐ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయ విద్యావిధానం, క్రమశిక్షణ, పరీక్ష సరళి, క్యాంపస్ వసతులు, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓరియెంటేషన్ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ గుజ్జరి శంకర్, ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్, అసోసియేట్ డీన్ శేఖర్ శీలం, ఇంజినీరింగ్ అసోసియేట్ డీన్ డాక్టర్ మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
‘మా సార్లు మాకే కావాలి’
ఇచ్చోడ: మండలంలోని ముఖరా బి ప్రాథమిక పాఠశాల గేటు ముందు సోమవారం విద్యార్థులు, వారి తలిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు. ‘మా సార్లు మాకే కావాలి’ అంటూ నినాదాలు చేశారు. ముఖరా బి యూపీఎస్ పాఠశాలలో 104 మంది విద్యార్థులు చదువుతున్నారు. 6, 7 తరగతులలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లను ఇతర స్కూళ్లకు డిప్యూటేషన్పై పంపించారు. ఇతర స్కూళ్ల నుంచి ఇద్దరు ఎస్జీటీ టీచర్లను ఇక్కడి పాఠశాలకు కేటాయించారు. దీంతో వేరే స్కూళ్ల నుంచి వచ్చిన ఎస్జీటీ ఉపాధ్యాయులు వద్దని, తమ సార్లనే తమకే కేటా యించాలని ధర్నా నిర్వహించారు. సర్పంచ్ ఖాతున్బీ, మాజీ సర్పంచ్ అడవ్మారుతి, విద్యాకమిటీ చైర్మన్ ఇమాద్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
దొంగను పట్టిచ్చిన సీసీ కెమెరా
మంచిర్యాలక్రైం: ఇంటర్నెట్ సెంటర్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా దొంగను పట్టిచ్చింది. మంచిర్యాల సీఐ ప్రమోద్రావు సోమవారం తన చాంబర్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్థానిక రాజీవ్నగర్కు చెందిన మహ్మద్ మొయిన్ ఇంటర్నెట్ సెంటర్లో ఈ నెల 25న దొంగతనం జరిగింది. కంప్యూటర్, మానిటర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటర్నెట్ సెంటర్లోని సీసీ కెమెరా ఆధారంగా దొంగను బెల్లంపల్లికి చెందిన మహ్మద్ మద్గుంగా గుర్తించారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని హమాలీవాడ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు యజమానిని శాలువాతో సన్మానించారు. -
బాసరలో వ్యాసపౌర్ణమి ఉత్సవాలు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వ్యాస (గురు)పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం గురు ప్రార్థన, వ్యాసపౌర్ణమి ఉత్సవ సంకల్పం, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, నాందీముఖం నిర్వహించారు. అనంతరం నవగ్రహ, యోగిని, వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండల స్థాపన, ప్రధాన కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, స్థాపిత దేవతా పూజలు, హోమాది వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు మురళీశర్మ, దీక్షిత్, వేద పండితులు అంకుశర్మ, నవీన్ శర్మ, శ్రీనివాస్ శర్మ, ఈవో అంజనాదేవి, ఏఈవో గంగ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థే కేంద్రంగా ఆర్జీయూకేటీ అభివృద్ధి
బాసర: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందించడమే లక్ష్యంగా బాసర ఆర్జీయూకేటీని ముందుకు తీసుకెళ్తున్నామని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. క్యాంపస్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, పరిశోధన, స్టార్టప్లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వీసీగా బాధ్యతలు స్వీకరించాక మీ ముందున్న సవాళ్లు ఏమిటి? ఎలా అధిగమించారు?వీసీ: విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది మధ్య పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించడం. కార్యాలయాలకే పరిమితమై నిర్ణయాలు తీసుకోకుండా.. నేరుగా విద్యార్థుల వద్దకే వెళ్లి వారి సమస్యలను ఆలకించడం, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడటం, అధ్యాపకులతో సమగ్రంగా చర్చించడం అనే నూతన శైలిని ఆచరణలోకి తెచ్చా. రాత్రివేళల్లో హాస్టళ్లను సందర్శించాలనే ఆలోచన ఎందుకొచ్చింది?వీసీ: రాత్రివేళల్లో నేరుగా పర్యటించడం వల్ల వారి భద్రత, ఆరోగ్యం, మెస్ భోజన వసతి, పరిశుభ్రత, వారి మానసిక స్థితిగతులను క్షేత్రస్థాయిలోనే తెలుసుకునే వీలుంటుంది. ఒక విద్యార్థి మిమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చా? వీసీ: విద్యార్థుల ఫిర్యాదులు, సమస్యలు పక్కా వ్యవస్థ ద్వారా పరిష్కారం కావడమే సరైన పద్ధతి. అత్యవసర సందర్భాల్లో విద్యార్థులు తమ సమస్యలను నేరుగా నా దృష్టికి తెచ్చేలా సులువైన సమాచార వ్యవస్థలను అందుబాటులోకి తెస్తున్నాం. తల్లిదండ్రుల విశ్వాసాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?వీసీ: క్యాంపస్ విద్యా పురోగతిపై వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం, పారదర్శకమైన నిర్వహణ, విద్యార్థుల క్షేమానికి ఇచ్చే ప్రాధాన్యత వారిలో నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. అవసరమైన సందర్భాల్లో ప్రత్యక్షంగా వారితో మాట్లాడి భరోసా ఇస్తున్నాం. ఆర్జీయూకేటీకి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు మీ ప్రణాళిక ఏమిటి?వీసీ : నాణ్యమైన విద్యాబోధన, పరిశోధన పరిశ్రమల అనుసంధానం, నవకల్పనలు (స్టార్టప్ సంస్కృతి), డిజిటల్ పరిపాలన, సామాజిక బాధ్యత ఆధారంగా క్యాంపస్ను ముందుకు తీసుకెళ్తున్నాం. గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించే కేంద్రంగా దీనిని తీర్చిదిద్దడమే మా ప్రధాన ధ్యేయం. ఆవిష్కరణలు, స్టార్టప్లకు ట్రిపుల్ ఐటీని వేదికగా మార్చే ఆలోచన ఉందా? వీసీ: కచ్చితంగా ఉంది. మా విద్యార్థులు కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మాత్రమే కాక, నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థాపకులుగా ఎదగాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్ ఫండింగ్ మద్దతు, ఇండస్ట్రీ కనెక్టివిటీ, పరిశోధనా వాతావరణాన్ని విస్తృతంగా పెంచుతున్నాం. ‘ఓపెన్ డోర్ పాలసీ’అమలు చేస్తున్నారా? వీసీ: విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తమ సమస్యలను, విలువైన సూచనలను ఎటువంటి భయాందోళనలు లేకుండా వ్యక్తం చేసే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం. ‘సంభాషణే ఏ సమస్యకై నా తొలి పరిష్కారం’అనే సూత్రంతో అందరికీ నిరంతరం అందుబాటులో ఉండే సుపరిపాలనగా తీర్చిదిద్దుతున్నాం. -
సోలార్ ప్రాజెక్టు గ్రిడ్కు అనుసంధానం
ముధోల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని పిప్రి శివారులో రైతు పొద్దుటూరు ప్రేమలతాదేవి, కిష్టారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సోమవారం రెండు మెగావాట్ల పీఎం కుసుం సోలార్ ప్రాజెక్టును ప్రారంభించి గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఎస్ఈ జే.సుభాష్, డీడీఈ తిలక్, సమీప 33/11 కేవీ తరోడ సబ్స్టేషన్ వద్ద గ్రిడ్కు విజయవంతంగా అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పీఎం కుసుమ్ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్కుమార్, విష్ణు, శ్రీకాంత్, టి.మధుసూదన్రావు, ప్రదీప్కుమార్రెడ్డి, డీపీ వర్మ, సునీల్, పి.విక్రంపాటిల్, పి.రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
● ఎయిర్పోర్టు భూసేకరణకు లైన్ క్లియర్ ● రూ.2,278.14 కోట్ల నిధులు మంజూరు ● జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ● డిసెంబర్ 31లోగా ప్రక్రియ పూర్తికి గడువు
కై లాస్నగర్: జిల్లావాసులు ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఏర్పాటులో మ రో ముందడుగు పడింది. కీలకమైన భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఇందుకోసం రూ.2,278.14 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో 36 జారీ చేసింది. ఎయిర్పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏ ఎఫ్) జాయింట్ యూజర్ సర్వీస్లకు అనుగుణంగా భూ సేకరణ త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31లోపు ప్రక్రియ పూర్తి చేయాలని గడువు విధించింది. ఐఏఎఫ్ సర్వేకు అనుగుణంగా ... ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వైమానిక శిక్షణ కేంద్రంతో కూడిన అంతర్జాతీయస్థాయి విమానశ్రాయ ఏర్పాటుకు నిర్ణయించాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రక్షణశాఖ స్థలం 369.45 ఎకరాలకు అదనంగా 700 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే భారీ విమానాలు సైతం రాకపోకలు సాగించేలా ఉండాలని భావించింది. దీనిపై సర్వే చేపట్టిన అనంతరం 9వేల ఫీట్లతో కూడిన రన్ వే నిర్మించాల్సి ఉండటంతో మరో 1500 ఎకరాల భూమి అవసరమవుతుందని, దాన్ని ఐఏఎఫ్కు అప్పగించాలని పేర్కొంటూ కేంద్ర రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించగా అందుకు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ, విమానాయాన శాఖల ఆదేశాల మేరకు ఐఏఎఫ్ అధికారుల బృందం ఈ ఏడాది జూన్ 17న ఎరోడ్రమ్ మైదానాన్ని పరిశీలించింది. ప్రత్యేక సర్వే నిర్వహించి 2009.23 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. రూ.2,278 కోట్లు మంజూరు .. కేంద్ర విమానయాన, రక్షణశాఖల నివేదికలకు అ నుగుణంగా భూ సేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1609.23 ఎకరాలు ఇండియ న్ ఎయిర్ఫోర్స్కు, 400 ఎకరాలు సివిల్ ఏవియేష న్కు కేటాయించేలా ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం రూ.2,278.14 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ జీవో జారీ చేశారు. ఇందులో అత్యధికంగా రూ.1555.11 కోట్లు భూసేకరణ కోసమే కేటా యించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి అనుకుంట వరకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డును మళ్లించేందుకు రూ.35కోట్లు, 765 కేవీఏ సామర్థ్యంతో కూడిన విద్యుత్ హైటెన్షన్ టవర్లు తొలగించేందుకు రూ.310 కోట్లను కేటాయించింది. ఇరిగేషన్శాఖకు సంబంధించిన వాగులకు సంబంధించి రూ.57.49 కోట్లు, మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్ నీటి వనరుల తరలింపునకు రూ.3.20 కోట్లు, విద్యుత్శాఖకు సంబంధించి అడ్డంగా ఉన్న స్తంభాలను తొలగించేందుకు రూ.18.76 కోట్లు, ఇతరాత్ర పనుల కోసం రూ. 31కోట్ల చొప్పున మంజూరు చేసింది. త్వరితగతిన భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ను ఆదేశించిన ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. నిధుల మంజూరుతో త్వరలోనే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. ఎక్కడి భూములను సేకరిస్తారనే దానిపై కలెక్టర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా స్పష్టం కానుంది.‘సాక్షి’ చొరవజిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు ఆవశ్యకత, ఈ ప్రాంతవాసుల ఆకాంక్షను వివరిస్తూ ‘సాక్షి’ గతేడాది చర్చా వేదికతో పాటు పలు ప్రత్యేక కథనాలను ప్రచురించిన విషయం విధితమే. ఈ మేరకు పాలకులు స్పందించా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు అడుగుపడింది. తాజాగా భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ సామాజిక చొరవను జిల్లావాసులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. గతేడాది మార్చి 6న సాక్షిలో ప్రచురితమైన కథనంశుభ పరిణామంఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం శుభపరిణామం. ఈ మేరకు జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్రం తరఫున అవసరమైన సహకారం అందించేందుకు నా వంతు కృషి చేస్తా. – గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ నిధుల మంజూరు హర్షనీయంఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ జీవో జారీ చేయడం హర్షనీయం. విమానాశ్రయ ఏర్పాటు ద్వారా జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. ఇచ్చిన మా టకు కట్టుబడి చర్యలు చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధే లక్ష్యంగా విమానాశ్రయ నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా భూసేకరణ కోసం నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి ప్రత్యేకంగా జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు. – నరేశ్ జాదవ్, డీసీసీ అధ్యక్షుడు -
కార్గిల్ వీరులకు ఘన నివాళి
కై లాస్నగర్/ఆదిలాబాద్: కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి మనందరికి స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. కార్గిల్ విజ య్ దివస్ పురస్కరించుకుని పట్టణంలోని మున్సి పల్ పార్కులో గల అమరవీరుల స్తూపం వద్ద ఆది వారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహనీయుల వీరత్వాన్ని స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ను గర్వంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వన్టౌన్ సీఐ సునీల్, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రీ, రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ ప్రతినిధులు, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. -
ఆదర్శప్రాయుడు అంబేడ్కర్
తలమడుగు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని పల్లి బి గ్రా మంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గా ల అభ్యున్నతికి అంబేడ్కర్ అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి, శ్రీకాంత్, కిరణ్ కుమార్, వెంకటేశ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రతా ప్, తదితరులు పాల్గొన్నారు. -
‘నిధుల కేటాయింపును స్వాగతిస్తున్నాం’
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటులో భాగంగా భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటనలో పేర్కొన్నారు. కొ రటా–చనాఖా బ్యారేజ్ 90 శాతం పూర్తయ్యిందని తెలిపారు. మిగతానిధులు సైతం కేటాయిస్తే 50వేల ఎకరాల సాగునీరు అందుతుందని దీంతో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. సీసీఐ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్ల నిధులు కేటాయిస్తే పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ విషయంలో చొరవ చూపాలని పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ క్యారిడార్తో పాటు విమానాశ్రయం, సీసీఐని పునఃప్రారంభిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సంపాదిత సెలవులు మంజూరు చేయాలిఆదిలాబాద్టౌన్: జనగణన కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిరి శ్రీకాంత్, ఎం. జలంధర్రెడ్డి కోరారు. ఈమేరకు డీఈవో మాధవికి ఆదివారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని అన్ని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు తక్షణమే ఆదేశాలు జారీ చేసి అర్హులైన వారికి సంపాదిత సెలవులు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఈవో అర్హులైన ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు. -
● లేని కోర్సులకు అడ్మిషన్లు ● జిల్లా కేంద్రంలో ఓ పారామెడికల్ కళాశాల తీరిది ● వైద్యఆరోగ్యశాఖ తనిఖీల్లో వెల్లడి ● విద్యార్థుల ఫిర్యాదుతో వెలుగులోకి.. ● అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని ఎస్ పవార్ పారామెడికల్ కళాశాల యాజమాన్యం అమాయక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోంది. మావల మండలకేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలోని బ స్టాండ్ సమీపంలో కళాశాలను తెరిచింది. కేవలం నాలుగు కోర్సులకు సంబంధించి మాత్రమే అనుమతి ఉండగా, వందల సంఖ్యలో కోర్సులు ఉన్నట్లుగా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులను మభ్యపెట్టి అడ్మిషన్లు తీసుకుని తరగతులు మాత్రం నిర్వహించడం లేదు. దీంతో పలువురు విద్యార్థులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. రేపుమాపు అంటూ కాలం వెల్లదీయడంతో కలెక్టర్తో పాటు వైద్యారోగ్య శాఖాధికారులకు ఇటీవల ఫిర్యా దు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే రిమ్స్ డైరెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారులతో విచారణకు ఆదేశించారు. దీంతో సదరు కళాశాలకు బీఎస్సీ నర్సింగ్తో పాటు జీఎన్ఎం తదితర కోర్సులకు అనుమతి లేదని తేలింది. ఈమేరకు కళాశాలపై ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. నాలుగింటికే అనుమతి.. ఈ పారామెడికల్ కళాశాలలో డీఎంఎల్టీ, డిప్లొ మో అండ్ రేడియోగ్రఫీ అసిస్టెంట్, ఆప్తాలమిక్ అసిస్టెంట్ డిప్లొమో, డిప్లొమో ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఈ నాలుగు కోర్సులకు మాత్రమే అనుమతి ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కళాశాల యాజమాన్యం జీఎన్ఎం నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, బీఫార్మసీ, డీఫార్మసీతో పాటు అనేక కోర్సుల పేరిట విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం పర్మిషన్ ఉన్న కోర్సుల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకొని బోధించాల్సి ఉంటుంది. కానీ అక్కడ బోధన చేసేవారు సైతం లేకపోవడం గమనార్హం. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు అక్కడికి వెళ్లి చూస్తే బోధన చేసేవారు లేకపోవడం, కళాశాలలో రెండే గదులు ఉండటం, ల్యాబ్, ఇతర వసతులు లేకపోవడంతో అవాక్కయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. జిల్లా కేంద్రంతో పాటు ఆయా ప్రాంతాల్లో కొన్ని పారామెడికల్ కళాశాలలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. కళాశాలలో కోర్సులు లేకపోయినప్పటికీ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఉన్న కోర్సుల్లోనూ సక్రమంగా తరగతులు నిర్వహించకపోవడం, బోధన చేసేవారు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రిమ్స్లో కేవలం ప్రాక్టికల్ తరగతులు మాత్రమే కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు సబ్జెక్టుపై పట్టు సాధించలేక పోతున్నారు. భవిష్యత్తులో వీరు రోగులకు నిర్వహిస్తే రిపోర్టులు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. -
ఎట్టకేలకు ‘పరిషత్’ సమావేశాలు
కై లాస్నగర్: మండల పరిషత్ సర్వసభ్య సమావేశా ల నిర్వహణకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఇ క నుంచి ప్రతి 45 రోజులకోసారి విధిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మే రకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. తతదనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని మండలాల్లో ఈనెల 29న సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మండల అధ్యక్షులు లేకపోవడంతో ప్రత్యేకాధికారి అధ్యక్షతన కొనసాగనున్నాయి. రెండేళ్ల తర్వాత నిర్వహించనున్న సమావేశాలతో స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై గ్రామీణులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇదీ పరిస్థితి.. పాలకవర్గాలు ఉన్న సమయంలో ప్రతీ మూడు నెలలకోసారి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు జరిగేవి. ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి జెడ్పీటీసీతో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల, పలువురు డివిజన్ స్థాయి అధికారులు హాజరయ్యేవారు. గ్రామాల సమస్యలను సభ్యులు ఇందులో ప్రస్తావించేవారు. అధికారుల దృష్టికి రావడంతో పాటు పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు అవకాశముండేది. అయితే పరిషత్ పాలకవర్గాల గడువు 2024 జూన్ 24న ముగిసింది. ప్రభుత్వం తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. ఎంపీపీల స్థానంలో ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించినా సమావేశాలు మాత్రం నిర్వహించని పరిస్థితి. పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో కార్యదర్శులు మినహా ఇతర శాఖల అధికారులు పర్యటించిన దాఖలాలు కన్పించడం లేదు. ఇటీవల ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా వారిలో చాలా మంది కొత్తవారే ఎన్నికయ్యారు. సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి చాలామందిలో ఉంది. మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తే స్థానికంగా ఉన్న సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకొచ్చే అవకాశముండేది. సమస్యల పరిష్కారంపై ఆశలు.. రెండేళ్ల జాప్యం తర్వాత ఎట్టకేలకు సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మండల ప్రత్యేకాధికారి అధ్యక్షతన ప్రతి 45 రోజులకోసారి నిర్వహించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులంతా హాజరుకానున్నారు. దీంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచ్లు వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశముంటుంది. తద్వారా వాటి పరిష్కారానికి మోక్షం లభించే అవకాశముంటుంది. అలాగే పల్లెపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కొత్తగా ఎన్నికై న సర్పంచ్లకు అవగాహన కల్పించేలా ఈ సమావేశాల ద్వారా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. -
29న సమావేశాల నిర్వహణ
మండల పరిషత్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. తదనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. ఈనెల 29న జిల్లాలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించాం. మండల ప్రత్యేకాధికారి అధ్యక్షతన జరిగే సమావేశంలో సర్పంచ్లతో పాటు మండలస్థాయి అధికారులంతా హాజరవుతారు. గ్రామీణ సమస్యలు చర్చకు వస్తాయి. వాటి పరిష్కారానికి అవకాశం ఉంటుంది. సర్పంచ్లు సద్వినియోగం చేసుకోవాలి. – బి.రవి, జెడ్పీసీఈవో -
చట్టాలపై అవగాహన అవసరం
ఆదిలాబాద్టౌన్: చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగా హన అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకరరావు అన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా న్యాయ సేవాసంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భ ద్రత, బాలల హక్కులు, పోక్సో చట్టం, సైబర్ భద్ర త, మంచి–చెడు స్పర్శ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై వచ్చే ఏడాది మే వరకు ప్రతి నెల ప్ర త్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మౌనిక, డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, డీఈవో మాధవి, బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసా ద్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, న్యా యవాదులు, బాలల రక్షణ అధికారులు పాల్గొన్నారు. నైపుణ్యాలు పెంపొందించుకోవాలిన్యాయశాఖ ఉద్యోగులు నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ కోర్టు విధుల్లో సమర్థతను చాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకరరా వు సూచించారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో న్యాయశాఖ ఉద్యోగులకు విధుల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. పలు అంశాలపై రిసోర్స్ ప ర్సన్లు ఉద్యోగులకు అవగాహన కల్పించారు. -
ఓం నమో నారాయణాయ
తొలిఏకాదశి వేడుకలను జిల్లావాసులు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాల బాటపట్టారు. శ్రీ మహావిష్ణువు దర్శ నం కోసం గంటల తరబడి బారులు తీరి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఓం నమో నారాయణాయ నామస్మరణ మారుమోగింది. జిల్లా కేంద్రంలోని శ్రీ మార్వాడి ధర్మశాల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం, శ్రీరమాసత్యనారాయణస్వామి ఆల యం, రాంనగర్ కాలనీలోని శ్రీవిఠలేశ్వర–రుక్మాబాయి ఆలయాల్లో రద్దీ కనిపించింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీలు,దేవాదాయ శాఖ అధికా రులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. – ఆదిలాబాద్ -
27న ఎన్నిక తేదీని ప్రకటిస్తాం
కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన తేదీని ఈనెల 27న (సోమవారం)ప్రకటిస్తాం. ఎన్నికకు మేము సిద్ధంగానే ఉన్నాం. హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం. బీజేపీ దొంగ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. – బండారి అనూష, మున్సిపల్ చైర్పర్సన్ ఇది చైర్పర్సన్ వైఫల్యంకో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు ఈ పాలకవర్గం ముందుకు రాలేదు. ప్రత్యేక అధికారాలతో ఎజెండా అంశాలను ఆమోదించుకున్నామని కాంగ్రెస్ చైర్పర్సన్ చెబుతున్నా, ఆ తీరు సబబు కాదు. కొన్ని ఎజెండా అంశాలకు కలెక్టర్ ఆమోదం ఇవ్వలేదు. మరికొన్నింటికి బడ్జెట్ తగ్గించారు. ఇది చైర్పర్సన్ వైఫల్యానికే నిదర్శనం. – కలాల శ్రీనివాస్, విద్యానగర్ స్వతంత్ర కౌన్సిలర్ -
ఎఫ్ఎల్ఎన్ రాష్ట్ర బృందం పరిశీలన
ఆదిలాబాద్టౌన్: ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) రాష్ట్ర బృందం స భ్యులు శనివారం జిల్లాలో విద్యా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. డీఈవో మాధవి, ఏఎంవో లక్ష్మణ్తో పాటు సెక్టోరియల్ అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, హాజరు శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభ్యసన సామర్థ్యాలను మరింత మెరుగుపర్చేందుకు రాబో యే రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అలాగే ఉపాధ్యాయులకు అందిస్తున్న శిక్షణ, బోధన తీరుపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను కలిసి జిల్లాలో విద్యారంగానికి సంబంధించిన అంశాలపై చ ర్చించారు. ఈ బృందంలో నిఖిలేష్, రాజశేఖర్, గీత, శ్యామ్ తదితరులున్నారు. -
‘పరిపాటిగా మారిన కేంద్రం తప్పులు’
ఆదిలాబాద్టౌన్: కేంద్ర ప్రభుత్వం వరుసగా తప్పులు చేస్తూ, అనంతరం వాటికి మూల్యం చెల్లించుకోవడం పరిపాటిగా మారిందని మా జీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి రావడం విద్యార్థుల పోరాట విజయానికి నిదర్శనమని అన్నారు. యువత ఐక్యంగా పోరా డితే ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిప్రాయానికి తలొగ్గాల్సిందేనని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి తో ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం కోసం సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి, పరిశ్రమ పునఃప్రారంభమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. -
● మున్సిపల్లో పొలిటికల్ హీట్ ● మెజార్టీ సభ్యులు ఒక వైపు.. ఎంఐఎం, కాంగ్రెస్ మరోవైపు ● కోర్టు ఆదేశాలతో ఎన్నికకు రంగం సిద్ధం
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికకు రంగం సిద్ధమైందా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈమేరకు ఎవరి బలం ఎంతో త్వరలోనే తేలనున్నట్లు తెలుస్తోంది. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ చైర్పర్సన్ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో గత సర్వసభ్య సమావేశంలో ఎజెండా అంశాలను ఆమోదించబోమంటూ బీజేపీ కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్, స్వతంత్ర సభ్యులు కూడా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఎజెండా అంశాలను కోఆప్షన్ ఎన్నికలకు ముడిపెట్టడం సరికాదని చైర్పర్సన్ వర్గం వాదిస్తోంది. అత్యవసర ప్రజాపనులకు ఆమోదం పొందేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టర్ను ఆశ్రయించామని కలెక్టర్కు ఉన్న ప్రత్యేక అధికారా ల ద్వారా ఎజెండా అంశాలకు ఆమో దం పొందినట్లు ఆ వర్గం చెబుతోంది. మరో వైపు ప్రతిపక్ష సభ్యులు కోఆప్షన్ ఎన్నికను నిర్వహించకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ పరి ణామాలు బట్టి చూస్తే మున్సిపల్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న వివాదాలన్నీ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎవరిది పైచేయి..? గత జూన్ 29న మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగిన విషయంతెలిసిందే.అందులో బీజేపీ, బీఆర్ ఎస్, స్వతంత్ర కౌన్సిలర్లు కోఆప్షన్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎజెండా అంశాల ను బహిష్కరించారు. కాంగ్రెస్తో కలిసి పాలకపక్షంలో ఉన్న బీఆర్ఎస్కు చెందిన కొందరు సభ్యులు, ఒకరిద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు కూడా ఆ వైఖరికి మద్దతు ఇ వ్వడంకాంగ్రెస్పాలకవర్గానికి ఇబ్బందికరంగా మా రింది. ఆ రోజు ఎజెండా అంశాలను బహిష్కరించడం ద్వారా తామే పైచేయి సాధించామని కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్న మెజార్టీ కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సభ్యులు వ్యతిరేకించినప్పటికీ కలెక్టర్కు ఉన్న ప్రత్యేక అధికారాల ద్వారా కీలక ఎజెండా అంశాల కు ఆమోదం పొందామని, అందువల్ల తమదే విజయమని చైర్పర్సన్ వర్గం చెబుతోంది.అయితే కలెక్టర్ అన్ని ఎజెండా అంశాల ను కాకుండా కొన్నింటికే ఆమోదం తెలిపారని, మ రికొన్ని పనుల బడ్జెట్ను కూడా తగ్గించారని పే ర్కొంటూ ఇది కాంగ్రెస్ పాలకవర్గం వైఫల్యమేనని మెజార్టీ కౌన్సిలర్లు చురకలు అంటిస్తున్నారు. మరో వైపు తాము తెరచాటు రాజకీయాలకు పాల్పడబోమని, అదే సమావేశంలో అప్రజాస్వామికంగా వ్యవహరించిన కౌన్సిలర్లపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేసి ఉంటే కోఆప్షన్ ఎన్నికలో తమకు అనుకూల పరిస్థితులు ఏర్పడేవని చైర్పర్సన్ వర్గం పేర్కొంటోంది. అయినప్పటికీ ప్రజా సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, అత్యవసర ప్రజాపనులు నిలిచిపోకుండా కలెక్టర్ ప్రత్యేక అధికారాలతో ఆమో దం తెలిపారని కాంగ్రెస్ వర్గం వివరిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ రాజకీయాల్లో అసలు పైచేయి ఎవరిది అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికకు సిద్ధం తాజా పరిస్థితుల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు కాంగ్రెస్ పాలకవర్గం సిద్ధమవుతోంది. హైకోర్టు 28 రో జుల్లోగా నిర్వహించాలని ఆదేశించడంతో ఆ దిశగా అడుగులు వేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వార్డులో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిని తమవైపు తిప్పుకుని బీజేపీ కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని తద్వారా పాలకవర్గంఏర్పాటులో తమకు మద్దతుగా నిలిచిన సభ్యులబలంతో కోఆప్ష న్ సభ్యుడిని గెలిపించుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.మొత్తంగాకోఆప్షన్ఎన్నిక చుట్టూ నే మున్సిపల్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. -
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
తలమడుగు: బోథ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని సుంకిడి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని శనివారం ప్రారంభించారు. 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కుచులాపూర్లో మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేశారు. మీసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఆ యా గ్రామాల్లో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, తహసీల్దార్ రాజ్మోహన్, ఎంపీడీవో శంకర్, సర్పంచ్లు మగ్గిడి నర్సమ్మ ప్రకాశ్, వెంకన్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ వెంకటేశ్, నాయకులు కిరణ్ కుమార్, కేదారేశ్వర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అభిరామిరెడ్డి, అబ్దు ల్లా, ప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● బోథ్లో కొలువు.. ఆదిలాబాద్లో మకాం! ● చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్న వైనం ● పర్యవేక్షణ మరిచిన అధికారులు ● పనుల నాణ్యతపై ప్రభావం
ఇది బోథ్ సబ్ డివిజన్ ఆర్అండ్బీ శాఖ కార్యాలయంలోని డీఈ కుర్చీ. కొంతకాలంగా ఖాళీగా దర్శనమిస్తోంది. ఈ కార్యాలయంలో ముగ్గురు కిందిస్థాయి సిబ్బంది విధులకు హాజరవుతున్నా.. డీఈ, ఏఈఈ వంటి వారు మాత్రం ఇటు వైపు రావడం లేదని స్థాని కులు చెబుతున్నారు. ప్రధాన రహదారు ల నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల మరమ్మతు పనులను అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధి కారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆదిలాబాద్ కార్యాలయాని కే పరిమితమవుతున్నట్లుగాతెలుస్తోంది. బోథ్: వారు పేరుకే బోథ్ నియోజకవర్గ కేంద్రంలో విధి నిర్వహణ. అయితే నిత్యం జిల్లా కేంద్రం నుంచే పాలన సాగిస్తున్నారు. చుట్టపుచూపుగా వస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని పలు వి భాగాల ఇంజినీర్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రజా సమస్యల వేగవంతమైన పరిష్కారం, అభివృద్ధి పనుల ప్రత్యక్ష పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన పలు ఇంజినీరింగ్ కా ర్యాలయాలు అధికారుల అందుబాటులో లేక వెలవెలబోతున్నాయి. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా శాఖ వంటి కీలకమైన విభాగాల్లో పనిచేసే ఇంజినీర్లు బోథ్ కేంద్రంగా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం విరుద్ధంగా మారింది. సంబంధిత అధికారులు ఇక్కడికి రాకుండా జిల్లా కేంద్రంలో ఉండి మమ అనిపిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులు, వాటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు అవేమీ చూడకుండానే, ఎంబీ కొలతలు ఇంట్లోనే కూర్చుండి రాస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆదిలాబాద్కే రమ్మంటున్న ఇంజినీర్లు.. స్థానికంగా కార్యాలయాల్లో మౌలిక వసతులు ఉన్నా అధికారులు ఇక్కడ విధులకు హాజరుకాకపోవడం గమనార్హం. సంతకాలు, రికార్డుల పరిశీలన, బిల్లుల ఆమోదం కోసం కాంట్రాక్టర్లను ఆదిలాబాద్ లోని కార్యాలయాలకు రమ్మంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆయా విభాగాల అధికారులు నియోజకవర్గ కేంద్రంలోనే అందుబాటులో ఉండి విధులకు హాజరయ్యేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
అంకితభావంతో పనిచేయాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్రూరల్: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ను శనివారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి రహిత జిల్లాకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వీపీవో విధానం ద్వారా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకుని సమాచారం సేకరించాలన్నారు. స్టేషన్కు వచ్చే బాధితులతో గౌరవపదంగా వ్యవహరించాలని సూచించారు. ముందుగా స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి, రూరల్ సీఐ రహీంపాషా, ఎస్సై విష్ణువర్ధన్, గంగాప్రసాద్, సిబ్బంది ఉన్నారు. -
‘జలసిరి’ పకడ్బందీగా అమలు చేయాలి
ఆదిలాబాద్: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శనివారం సెర్ప్ సీఈవో, పంచాయతీరాజ్ –గ్రామీ ణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్తో కలిసి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. జలసిరి, వీబీజీ–ఆర్ఎంజీఎస్ పనులను సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంటకు పంటకుంట, ప్రతి ఊరికి ఊట కుంట లక్ష్యంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి రైతు ఫామ్ పాండ్ నిర్మించుకునేలా ప్రోత్సహించాలని, రెయిన్వాటర్ హార్వెస్టింగ్ ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంచాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
ఆదిలాబాద్, మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం ఎసన్వాయి గ్రామంలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త దాడులు జరిపారు. ఈ దాడుల్లో సరైన ధృవపత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేశారు. అయితే, గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. నిలువ ఉంచబడిన సుమారు 1,000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 9 మందిపై కేసులు నమోదు చేశారు. గుడుంబా నిర్మూలనపై.. ఏసీపీ వెంకటేశ్వర్లు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే, ఇలాంటి కార్యకాలపాలు చట్ట విరుద్ధమని, ఇందులో పాల్గొన్నవద్దని వారికి చెప్పడంతోపాటు, గుడుంబా తయారీలో పాల్లొన్నవారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులను ఏసీబీ హెచ్చరించారు. -
పారామెడికల్ కళాశాల తనిఖీ
ఆదిలాబాద్టౌన్: ఎస్.పవార్ పారామెడికల్ కళాశాలను డీఎంహెచ్వో సాధన, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ శుక్రవారం తనిఖీ చేశారు. ఇటీవల అందులో అడ్మిషన్ పొందిన విద్యార్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు కళాశాలలో రికార్డులను పరిశీ లించారు. అనుమతిలేని కోర్సులో అడ్మిషన్ తీ సుకోవద్దని, వెళ్లిపోవాలనుకుంటున్న వారికి ఒరిజినల్ సర్టిఫికెట్లు అందజేయాలని యాజ మాన్యాన్ని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిసే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో డీఐవో వైసీ.శ్రీనివాస్ తదితరులున్నారు.అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలినేరడిగొండ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నా రు. మండల కేంద్రంలోని నాలుగు పోలింగ్ బూత్లలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను కాంగ్రెస్ మండల కన్వీనర్ రాజశేఖర్ రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. బీఎల్వోలు, సూపర్వైజర్లతో మాట్లాడి సవరణ ప్రక్రియ వివరాలు తెలుసుకున్నారు. అనంత రం మాట్లాడుతూ, అర్హులైన వారు ఓటు హక్కు కోల్పోకుండా పారదర్శకంగా జాబితా లను రూపొందించాలని కోరారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి రమేష్, బద్దం పోతరెడ్డి, మనోజ్, నరేష్ రెడ్డి, రామ్లక్ష్మణ్ గౌడ్, కపిల్, ఊశన్న, చంద్రశేఖర్, వసంత్రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యాసంస్థల బంద్ విజయవంతం
ఆదిలాబాద్టౌన్: నీట్పేపర్ లీకేజీ ఘటనతో పాటు ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన వి ద్యార్థులపై లాఠీచార్జిని నిరసిస్తూ వామపక్ష వి ద్యార్థి సంఘాలు శుక్రవారం దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వగా జిల్లాలో విజయవంతమైంది. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెస్రం భాస్కర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంత రం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఇందులో ఎన్ఎస్యూఐ, యూఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐ ఎస్ఎఫ్, పీడీఎస్యూ, బీఆర్ఎస్వీ, ఏఐవైఎఫ్, ఏఐ ఎస్ఎఫ్ నాయకులు గెడం కేశవ్, తోట కపిల్, నగేష్, అశోక్,సాయికుమార్, ఇషాంత్, భాస్కర్, వరుణ్, శివకుమార్, తదితరులున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని అఖిలపక్ష రైతు సంఘాల జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బాసెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. ఇందు లో నాయకులు పోశెట్టి, దేవిదాస్, వెంకటనారాయ ణ, జగన్సింగ్, లక్ష్మణ్, ఆశన్న, పాల్గొన్నారు. -
● జిల్లాలో రైల్వే ప్రగతిపై శీతకన్ను ● డీపీఆర్కే పరిమితమైన ‘ఆదిలాబాద్ – హైదరాబాద్’ ● కొత్త లైన్ల కేటాయింపులోనూ అన్యాయం ● నిర్మాణ పనుల పురోగతిలో సైతం అలసత్వమే..
ఆదిలాబాద్: ఆదిలాబాద్పై రైల్వే కేటాయింపుల్లో దశాబ్దాలుగా నిర్లక్ష్యం కొనసాగుతోంది. జిల్లా ప్ర జల చిరకాల వాంఛ అయిన ఆదిలాబాద్–హైదరా బాద్ రైల్వే లైన్ ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోగా, ఇటీవల ప్రతిపాదిత ముకుట్బన్ కూడా జిల్లాకు దూరమవడం నిరాశ కు గురిచేసింది. కొత్త మా ర్గాల అభివృద్ధిని పక్కనబెడితే ఇప్పటికే ఉన్న ఆది లాబాద్ రైల్వే స్టేషన్లోనూ ఆధునికీకరణ పనులు, ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన ఆశించిన స్థాయిలో జరగడం లేదు. సరిపడా రైళ్ల సౌకర్యం లేకపోవడం, అనుసంధాన సేవలు బ లహీనంగా ఉండటంతో జిల్లావాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పట్టాలపై పట్టింపు కరువు.. ఆయా రామ్.. గయా రామ్జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న రైల్వే అభివృద్ధి పనులను అధికారులు అడపాదడపా తనిఖీ చేస్తున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ వాటి అమలుపై నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తేనే పనులు త్వరితగతిన పూర్తవుతాయనే అభిప్రాయాలు జిల్లా వాసుల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.
గంజాయి రహిత జిల్లా లక్ష్యం ఇంద్రవెల్లి: గంజాయి, మాదక ద్రవ్యాల రహిత జిల్లా లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈమేరకు అందరూ సహకరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని దనోరా(బి) గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పోలీసులు మీ కోసం కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా 16 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి సాగు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం, సేవించడం వంటివి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా సంబంధిత శాఖలకు సిఫారసు చేస్తామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం వాలీబాల్ టోర్నీలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి, సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న, సర్పంచ్ జాదవ్ జముననాయక్, ఉపసర్పంచ్ కరీంలాల, గ్రామస్తులు పాల్గొన్నారు. హైవేపై భారీ వాహనాలు పార్కింగ్ చేయొద్దు గుడిహత్నూర్: దాబాల సమీపంలోని జాతీయ, అంతర్రాష్ట్ర రహదారుల పక్కన వాహనాల పార్కింగ్ బాధ్యత ఆయా నిర్వాహకులదే అని ఎస్పీ స్పష్టం చేశారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ఓ దాబా వద్ద జిల్లాలోని ఆయా దాబాల నిర్వాహకులతో సమావేశం అయ్యారు. రహదారి ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలన్నారు. ముఖ్యంగా రహదారులపై వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాలన్నారు. అలాగే దాబాలలో మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలు వంటివి విక్రయిస్తే కేసుల నమోదుతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతీ దాబా వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, ఇచ్చోడ, గుడిహత్నూర్ ఎస్హెచ్వోలు నరేష్కుమార్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
సర్ద్ బాటు
సాక్షి, ఆదిలాబాద్: ‘పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణలో భాగంగా 2025 ఓటరు జాబితా ప్రకారం 1200 మందికి పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలను మా త్రమే పునర్ వ్యవస్థీకరించే ప్రతిపాదన ఉంది.. మ రణించిన, చిరునామా మారిన ఓట్ల తొలగింపు అ నంతరం మిగిలే తుది ఓట్ల సంఖ్య ఆధారంగా అవసరమైన చోట్ల మాత్రమే సర్దుబాటు ఉంటుంది.’ ప్రత్యేక ఓటరుజాబితా సవరణ కార్యక్రమంపై రాజ కీయ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించి న సమావేశంలో కలెక్టర్ మాటలివి. దీన్నిబట్టి సర్ ప్రక్రియ పూర్తయినతర్వాత తొలగింపునకు గుర య్యే ఓట్ల సంఖ్యపై స్పష్టత రానుంది. ఆ తర్వాత తగ్గట్టుగా మార్పులు చేర్పులు జరగనున్నాయి. మరో 10 రోజులు సర్ ప్రక్రియ జూన్ 25న మొదలైంది. ఆగస్టు 3న ముగియనుంది. మరో పది రోజుల గడువు మిగిలింది. మొదట ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేయడంతో మొదలైన ఈ ప్రక్రియలో ప్రస్తుతం బీఎల్వోలు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ప్రతి ఓటరుకు సంబంధించి వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్నారు. మూడు అంశాల ఆధారంగా ఫారాన్ని నింపేలా రూపొందించిన విషయం తెలిసిందే. గత సర్ ఓటర్ల జాబితాలో ఓటరు వివరాలు, బంధువుల వివరాలు, ప్రస్తుత వివరాల ఆధారంగా వాటిని పూరించి ఇస్తున్నారు. దీంట్లో మొదట అయోమయం చెందినప్పటికీ ఫారాలను బీఎల్వోలే ఓటరు వివరాలు తెలుసుకొని పూరించడం, అవగాహనపర్చడం వంటి వాటితో ప్రక్రియ ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చే దశకు చేరుకుంది. లెక్క గడుతున్నారు.. ఓటరు నుంచి ఎన్యూమరేషన్ ఫారం పూరించి తీసుకోవడం, మ్యాపింగ్ పూర్తయిన తర్వాత కొన్ని అంశాల్లో తొలగింపునకు గురయ్యే ఓటర్ల వివరాలపై అవగాహన కుదురుకుంటున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారం ట్రాకింగ్ డిజిటలైజేషన్లో భాగంగా మొత్తం 26 అంశాల ఆధారంగా జిల్లాకు సంబంధించిన వివరాలను అధికార యంత్రాంగం చేపట్టింది. దీంట్లో నమోదుకు నోచుకోని.. పరిశీలనలో నిర్ధారణ కానటువంటి ఓటర్లకు సంబంధించి కొన్ని వివరాల ఆధారంగా లెక్కగడుతున్నారు.మోడల్ పోలింగ్ కేంద్రం (ఫైల్)పోలింగ్ కేంద్రాల వివరాలునియోజకవర్గం పోలింగ్ కేంద్రాలు ఆదిలాబాద్ 292 బోథ్ 303 మొత్తం 595ఓటర్ల వివరాలు.. మొత్తం ఓటర్లు 4,66,784 ఆదిలాబాద్ నియోజకవర్గం 2,50,393 బోథ్ నియోజకవర్గం 2,16,391ఇప్పటివరకు గుర్తించిన ఓటర్ల వివరాలు (జూలై 24 వరకు) డెత్ 12,854 షిఫ్టెడ్ 24,645 డూప్లికేట్ 6,353 ఆబ్సెంట్ 4,691 అదర్స్ 146 మొత్తం 48,689 -
డిజిటలైజేషన్ పక్కాగా నిర్వహించాలి
ఆదిలాబాద్టౌన్: ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియ ను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. పట్టణంలోని రిక్షా కాలనీ, పోలీస్ కాలనీ, టైలర్ కాలనీల్లో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ఓటరు వివరా ల డిజిటలైజేషన్ ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాల నమోదు, డిజిటలైజేషన్ పనుల తీరును బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతిఒక్కరి వివరాలను పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, డిజిటలైజేషన్ ప్రక్రియను ఖచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. ఏ ఒక్క అర్హుడి పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా శ్రద్ధ వహించాలని అన్నారు. పోలీస్ కాలనీలో ఆశా కార్యకర్త ద్వారా ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆదిలాబాద్, మావల తహసీల్దార్లు శ్రీనివాస్, వేణు, సూపర్వైజర్లు అంకిత్రెడ్డి, శ్రీధర్, బీఎల్వో లు విఠాబాయి, మీనాక్షి, ఇతర సిబ్బంది ఉన్నారు. కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులే నివసించాలి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లబ్ధిదారులే నివసించాలని, వాటిని అద్దెకు ఇవ్వడం, విక్రయించడం వంటివి చేస్తే రద్దు చేస్తామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో 6 నుంచి 16 వార్డులకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు రశీదులను మున్సిపల్ చైర్పర్సన్ అనూషతో కలిసి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులను వార్డుల వారీగా పూర్తి పారదర్శకతతో లక్కీడ్రా విధానంలో ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, కేటాయించిన ఇళ్లను పరిశుభ్రంగా, బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. త్వరలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అధికారిక ప్రొసీడింగ్స్ కాపీలను అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్, హౌసింగ్శాఖల అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. నిర్మాణ పనులు పరిశీలనతాంసి: జిల్లా కేంద్రంలోని హరిఓం నగర్ కాలనీలో చేపడుతున్న వంతెన నిర్మాణ పనులను కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం పరిశీలించారు. త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మైనార్టీల సమస్యల పరిష్కారానికి చర్యలుఆదిలాబాద్టౌన్: జిల్లాలోని మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైనార్టీల సంక్షేమం, వారి సమస్యలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మైనార్టీ వర్గాల ప్రతినిధులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, నిధులు, విధానపరమైన నిర్ణయాలు అవసరమైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి షేక్ కలీమ్, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్ గౌడ్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. యువతకు మార్గదర్శిగా ‘ఎచీవర్స్ డాక్యుమెంట్స్’తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఎచీవర్స్ డాక్యుమెంట్స్’ యువతకు మార్గదర్శిగా నిలుస్తుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్–ఎచీవర్స్ డాక్యుమెంట్స్’ పుస్తకాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, మార్గదర్శక సమాచారం యువతకు పోటీ పరీక్షల్లో రాణించేందుకు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేశ్ పాల్గొన్నారు. -
రీసర్వేతో వివాదాలకు తెర
తలమడుగు: ప్రభుత్వం చేపడుతున్న భూభార తి భూముల రీసర్వేతో భవిష్యత్తులో వివాదా లకు తెరపడుతుందని అదనపు కలెక్టర్ చిత్రు అన్నారు.మండలంలోని బరంపూర్, ఉమ్రి, దే హగామ గ్రామాల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, గ్రామాల్లో ఈ సర్వే తో భూసమస్యలకు చెక్ పడనుందన్నారు. అలాగే రెవెన్యూ, అటవీశాఖల మధ్య భూవివాదాలకు పరిష్కా రం లభిస్తుందన్నారు. ఇందులో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, సహకార సంఘ చైర్మన్ దామోదర్రెడ్డి, తహసీల్దార్ రాజ్మోహన్, సర్పంచ్ దేవరావు, ఉపసర్పంచ్ రంజిత్, కార్యదర్శి అనిల్రెడ్డి పాల్గొన్నారు. -
సీసీఐ పునఃప్రారంభమే లక్ష్యంగా పోరాటం
ఆదిలాబాద్టౌన్: సీసీఐ పునఃప్రారంభం కోసం సా ధన సమితి చేపట్టనున్న భవిష్యత్ కార్యాచరణలో బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ, సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభంపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని విమర్శించారు. పరిశ్రమను వంద శాతం తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని, ఈ విషయమై ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లతో పాటు అవసరమైన రాయితీలు కల్పిస్తే పరిశ్రమను తిరిగి నడిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్: పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని దుర్గానగర్ కాలనీలో పర్యటించి మురికి కాలువలు, రోడ్లు, ఇళ్ల పరిస్థితిని పరిశీలించారు. కాలనీవాసులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు తదితర సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దుర్గా, నాయకులు రఘుపతి, రాష్ట్రపాల్, శివ, అనిల్ పాల్గొన్నారు. క్రీడలతో శరీరం దృఢంగా ఉంటుంది ఆదిలాబాద్రూరల్: క్రీడలతో శరీరం ధృడంగా ఉంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. యాపల్గూడ శివారులో గల 2వ బెటాలియన్లో తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ కంపెనీ వార్షిక క్రీడాపోటీలు ప్రారంభించారు. బెటాలియన్ కమాండెంట్ వెంకటేశ్వరరెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ నారాయణ, రఘునాథ్ చౌహన్, సర్పంచ్ నిరోషా, తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వం పెండింగ్ బకా యిలు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి కేశవ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నేళ్లుగా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉండడంతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యా జమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ఎంఈఓ, ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
ఏదో జరుగుతోంది..!
సాక్షి,ఆదిలాబాద్: రెండు నెలల కిందట ఆదిలాబాద్ పట్టణంలో వీధిదీపాలు అమర్చడం, వాటి విడిభాగాలు సరఫరా చేసేందుకు టెండర్లు నిర్వహించారు. వర్షాకాలంలో సమస్య ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా వీటిని చేపట్టి పనులను కాంట్రాక్టర్కు అప్పగించాలనేది ఉద్దేశం. అనుకున్న విధంగానే ప్రక్రియ చోటు చేసుకుంది. ఓ కాంట్రాక్టర్ అంచనా వ్యయం కంటే అమితంగా తక్కువ వ్యయానికే ఆ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చాడు. దీంతో అతనికి ఆ పనులు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆ వర్క్స్ నిర్వహించేందుకు ఆ కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. దీంతో అతనికి నోటీసులు పంపించారు. దానికి అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. తాజాగా ఆ కాంట్రాక్టర్ను డిబార్ చేస్తున్నట్లు, రెండేళ్ల పాటు ఎలాంటి పనులు చేపట్టకుండా చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఆ కాంట్రాక్టర్ ఎందుకిలా చేసి ఉంటాడు.. అంచనా వ్యయం కంటే 32 శాతం తక్కువ ధరకే తాను పనులు చేపడతానని ముందుకొచ్చిన అతను.. ఆ తర్వాత అగ్రిమెంట్ ఎందుకు చేసుకోలేదు.. మున్సిపాలిటీ నుంచి నోటీసులు జారీ చేసినా ఎందుకు పట్టించుకోలేదు.. రెండేళ్ల పాటు అతనికి ఏ పనులు దక్కకుండా చర్యలు తీసుకునేంత వరకు వచ్చినా ‘డోంట్ కేర్’ అన్నట్టుగా ఎందుకు వ్యవహరించాడు.. అనేది అంతుపట్టనిది. దీని వెనుక కొంత మంది మున్సిపల్ అధికారులు, బడా కాంట్రాక్టర్ల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. మొదటి కాంట్రాక్టర్ పనులు చేపట్టకుండా చేసి, అత్యవసరంగా చేపట్టే పనులంటూ రీటెండర్ల నిర్వహణ ద్వారా ఈ పనులను తమ అనునాయులకు దక్కేలా చేయడమే వ్యూహం అనే అపవాదు వ్యక్తమవుతోంది. వరుసగా విద్యుత్ టెండర్లలోనే.. మున్సిపాలిటీలో విద్యుత్ పనులకు సంబంధించిన టెండర్లలో వరుసగా ఆరోపణలు వ్యక్తమవుతున్నప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతనెల జూన్లో రూ.65 లక్షల విద్యుత్ పనుల్లో అక్రమాలు జరిగినట్లు ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ వాటి విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆన్లైన్లో నిర్వహించాల్సిన టెండర్లను ఆఫ్లైన్లో నిర్వహించి తమకు అనువైన కాంట్రాక్టర్కు పనులను అప్పగించారని ఓ అధికారిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైనప్పటికీ దాని విషయంలో ఎలాంటి విచారణ చేపట్టకపోవడం గమనార్హం. పనుల వివరాలు ఇలా.. 15వ ఆర్థిక సంఘం నిధులతో పట్టణంలో వీధిదీపాల ఏర్పాటు, వాటి విడిభాగాలు సరఫరా చేసేందుకు రెండు నెలల కిందట ఈ టెండర్లను నిర్వహించారు. బాలాజీ ఎంటర్ప్రైజెస్ పేరిట రంగారెడ్డి జిల్లా సరూర్నగర్కు చెందిన స్పెషల్ క్లాస్ సివిల్ కాంట్రాక్టర్ ఈ పనులను దక్కించుకున్నారు. రూ.48 లక్షల అంచనా వ్యయం గల ఈ పనులను 32 శాతం లెస్లో టెండర్లో కోడ్ చేసి పనులను హస్తగతం చేసుకున్నాడు. ఆ తర్వాత అగ్రిమెంట్ చేసుకోకుండా వెనుకడుగు వేయడమే ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న. -
మధిరకు సై.. మనకు నై..
నిర్మల్: ‘నాన్నా.. ఇంకెంత దూరం వెళ్లాలి. ఈ బస్ సీట్ల గంటల కొద్ది కూర్చుంటున్నందుకేమో కాళ్లు, నడుము నొస్తుంది నాన్నా..’ ఇది ఇంజినీరింగ్ చదవడానికి బోథ్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఓ విద్యార్థి అవస్థ. ‘ఏం చేస్తాం బిడ్డా..! మన ప్రాంత పరిస్థితులు అట్లున్నయ్. ఓట్లేయించుకునేందుకే తప్పా.. ఇక్కడి ప్రజల కష్టాలను ఓళ్లు కూడా పెద్దగా పట్టించుకోరు. మన ఉమ్మడి ఆదిలాబాద్ అంటేనే చిన్నచూపు. మేం చదువుకున్నప్పటి నుంచి అడుగుతున్నం. నిర్మల్ల్లన్న, ఆదిలాబాద్ల్లన్న ఇంజినీరింగ్ కాలేజీ పెట్టాలని. కానీ.. ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు బిడ్డా..?! మీ భవిష్యత్ బాగుండాలని మాలాంటి తల్లిదండ్రులం కాయకష్టం చేసుకుంట, ఎంత కష్టనష్టమైనా వంద ల కిలోమీటర్ల దూరంల ఉన్న హైదరాబాద్ల మి మ్మల్ని సదివించుకుంటున్నం..’ అని ఆ తండ్రి ఆవేదన వ్యక్తంచేశాడు. ఆదిలాబాద్–నిర్మల్ జిల్లాలకు కనీసం వంద కిలోమీటర్ల దూరంలోనూ ఒక్క ప్రభు త్వ ఇంజినీరింగ్ కాలేజీ లేదు. ఆదిలాబాద్ నుంచి 310కిలో మీటర్ల నిర్మల్ నుంచి 220కిలో మీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ వరకు వెళ్లాల్సిందే. అక్కడలా.. ఇక్కడెందుకిలా..? రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకూ ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. మాటిచ్చిన వారంలోనే మధిరకు ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపడం అభినందనీయమే. కానీ.. ఇదే సమయంలో ఇప్పటివరకూ కనీసం యూనివర్సిటీ కూడా లేని ఉమ్మడి జిల్లానూ లెక్కలోకి తీసుకోవాలన్నదే ఈ ప్రాంతవాసుల వాదన. మధిరకు 210కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్, కేవలం 75కిలో మీటర్ల దూరంలో విజయవాడ ఉంది. పైగా రెండు నగరాలకు మధ్యన గల ఈ నియోజకవర్గానికి రైల్వేమార్గం కూడా ఉంది. అలాంటి చోటును కరుణించిన సర్కారు.. వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న మన ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. జిల్లాలతో దోబూచులాట గత ప్రభుత్వమైనా, ఇప్పటి సర్కారైనా నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలతో విద్యారంగం విషయంలో దోబూచులాడుతున్నాయే గాని ముందడుగు వేయడం లేదన్నది స్పష్టమవుతోంది. ముందుగా ఆదిలాబాద్ సభలో జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. అనంతరం నిర్మల్ సభలో ఇదే జిల్లాలో తాత్కాలికంగా బాసరలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇలా రెండు జిల్లాల్లో అదే మాటిచ్చారు. కానీ.. ఆరునెలలు దాటినా అక్కడ.. ఇక్కడ.. యూనివర్సిటీకి సంబంధించి అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక గతంలో నిర్మల్లో ఇంజినీరింగ్ కాలేజీ కావాలని అడిగితే అప్పటి సీఎం కేసీఆర్ ఆదిలాబాద్కు ఇస్తున్నట్లు చెప్పారు. పోనీ.. అక్కడైనా ఏర్పాటు చేశారా.. అంటే అదీ లేదు. ఇలా ప్రభుత్వాలే దోబూచులాడటంపై రెండుజిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చదువులతల్లి కొలువైన ప్రాంతంలో పూర్తిస్థాయి విద్యాభివృద్ధి ఇంకెప్పుడు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. 10న హామీ.. 18న జీవోఈనెల 10న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డిని మధిర ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమకు ఇంజినీరింగ్ కాలేజీ కావాలని కోరారు. వెంటనే సీఎం సుముఖత వ్యక్తంచేశారు. అంతే కాదు.. వారం వ్యవధిలోనే మధిరకు ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేస్తూ ఈనెల 18న జీవో జారీచేశారు. మధిరకు కేవలం 84కిలో మీటర్ల దూరంలోగల ఇదే ఖమ్మం జిల్లా పాలేరులో ఇప్పటికే ప్రభుత్వ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ ఉండటం గమనార్హం. మూడేళ్లు దాటినా ముచ్చటేది?నిర్మల్ జిల్లా కేంద్రంలో 2023 జూన్ 4న కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. అప్పటి సీఎం కేసీఆర్ హాజరు కాగా, అప్పటి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు కేసీఆర్ స్పందిస్తూ నిర్మల్ పేరు చెప్పకుండా ఉమ్మడి జిల్లాలో జేఎన్టీయూ ఇంజి నీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రెండ్రోజుల తర్వాత దానిని ఆది లాబాద్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించా రు. కానీ, ఇప్పటిదాకా ఇంజినీరింగ్ కాలేజీ ముచ్చటే లేదు. అడిగిన నిర్మల్కు ఇవ్వలేదు.. ఇస్తామన్న ఆదిలాబాద్కూ దక్కలేదు. -
కాలేజీ ఏర్పాటు చేయాలి
ప్రస్తుతం ప్రతీ విద్యార్థి సాంకేతిక విద్యవైపు వెళ్లాలని కోరుకుంటున్నాడు. రాష్ట్రంలో దాదాపు ప్రతీ ఉమ్మడి జిల్లాకో యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. మా ప్రాంతంలోనూ కాలేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. – రమణగౌడ్, పోటీపరీక్షల నిపుణుడు, బోథ్ ఇచ్చిన హామీ నెరవేర్చాలిఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా అక్కడ విద్యావనరులు ఉండాలి. ప్రధానంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వెంటనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అలాగే, గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇంజినీరింగ్ కాలేజీని ప్రారంభించాలి. – గెడం కేశవ్, ఏఐఎస్ఎఫ్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి -
● ఢిల్లీకి చేరిన సిమెంట్ పరిశ్రమ అంశం ● ఇప్పటికే కేంద్ర మంత్రిని కలిసిన బీఆర్ఎస్, సాధన కమిటీ సభ్యులు ● సీఎం, మంత్రులను కలిసేందుకు ప్రయత్నం.. ● స్పందించకుంటే సెప్టెంబర్ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామిక చరిత్రలో ఒకప్పుడు కీలక స్థానాన్ని సంపాదించిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమ పునఃప్రారంభం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పరిశ్రమను పునఃప్రారంభించాలని కొన్నేళ్లుగా సీసీఐ సాధన కమిటీ ఉద్యమిస్తోంది. దశాబ్దాలుగా మూతపడిన ఈ పరిశ్రమను తిరిగి ప్రారంభించే వరకు ఉద్యమాలు, ఆందోళనలు కొనసాగి స్తామని సీసీఐ సాధన కమిటీ స్పష్టం చేసింది. సీసీఐ పరిశ్రమను 1982లో స్థాపించగా 1984లో ప్రారంభమైంది. 1996లో ఉత్పత్తి ఆగిపోయింది. 1998లో పూర్తిగా మూసివేశారు. ఈ ఏడాది కూలగొట్టి స్క్రాప్ కింద విక్రయించిన విషయం తెలిసిందే. దీంతో వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎంతో మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్యాక్టరీ పునఃప్రారంభిస్తే జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడనున్నాయి. పారిశ్రామిక పునరుజ్జీవనానికి.. సీసీఐ పునరుద్ధరణ కేవలం ఒక పరిశ్రమను తిరిగి ప్రారంభించడం మాత్రమే కాదని, జిల్లాలో పారిశ్రామిక పునరుజ్జీవనానికి నాంది పలుకుతుందని సీసీఐ సాధన కమిటీ సభ్యులు, మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొంటున్నారు. పరిశ్రమ తిరిగి ప్రారంభమైతే జిల్లాలో పెట్టుబడులు పెరగడంతో పాటు కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా జిల్లాలో 6 వేల మంది నిరుద్యోగులకు, 80 శాతం స్థానికులకే ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. హామీలతోనే సరి.. సీసీఐ పునఃప్రారంభంపై గతంలో కేంద్ర, ప్రభుత్వాలు పలుమార్లు హామీలు ఇచ్చినప్పటికీ అవి అమలుకు నోచుకోలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదని యువతతో పాటు కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీసీఐ పునరుద్ధరణపై స్పష్టమైన ప్రకటన చేసి, కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీసీఐ సాధన కమిటీ సభ్యులు, మాజీ మంత్రి జోగు రామన్న కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని కలిశారు. రెండు రోజుల క్రితం కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సీసీఐపై వైఖరి స్పష్టం చేయాలని అందులో పేర్కొన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు సాధన కమిటీ సభ్యులు తెలిపారు. ఇటీవల చర్చాగోష్టి, ఢిల్లీ పర్యటన తదితర కార్యక్రమాలు చేపట్టారు. మొదట గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రంలో అవగాహన సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఇంటింటికీ కరపత్రాల పంపిణీ, ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు, నిరాహార దీక్షలు, వినతిపత్రాల సమర్పణ వంటి కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే ఢిల్లీలోని సంబంధిత కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట కూడా ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీసీఐ పునరుద్ధరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజాసంఘాలు, వ్యాపారవేత్తలు, మేధావులు, యువజన సంఘాలు ఒక్క తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిశ్రమను తిరిగి ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీఐలో మళ్లీ ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు తమ ఉద్యమం ఆగదని, అవసరమైన అన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.స్పందించకుంటే ఉద్యమాలే..సీసీఐ ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని సాధన కమిటీ సభ్యులు, మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబును కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకుంటామని, వారు స్పందించకుంటే హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు జిల్లా కేంద్రంలో అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, యువజన సంఘాలతో కలిసి రిలే దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామన్నారు. -
ఆనందరావుకు రూ.25 వేల ప్రోత్సాహకం
ఆదిలాబాద్టౌన్/ఇచ్చోడ: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్తున్న ఇచ్చోడ మండలంలోని దూబార్పేట్కు చెందిన కాత్లే ఆనందరావుకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ ఆధ్వర్యంలో రూ.25 వేల ప్రోత్సాహకం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈనెల 22న ఆనందరావు ఎవరెస్ట్ శిఖరం అధిరోహనకు వెళ్లడంతో గురువారం అతని అన్న కాత్లే శ్రీధర్కు కలెక్టర్ చేతుల మీదుగా ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సత్యనారాయణ, ఆనంద్రెడ్డి, రమేశ్బాబు, అన్వర్ అలీ, రమాకాంత్, దయానంద్రెడ్డి, నరేందర్, బండారి, దేవన్న, నిఖిని వర్మ, సుధాకర్రెడ్డి, పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
ఆదిలాబాద్టౌన్: ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజ కీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు చోట్ల ఓటు హక్కు నమోదైన వారు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణ యం తీసుకుని, మరో ప్రాంతంలోని ఓటును తొలగించేందుకు ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు అందజేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీ కరణలో భాగంగా 2025 ఓటరు జాబితా ప్రకారం 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలను మాత్రమే పునర్వ్యవస్థీకరించే ప్రతిపాదన ఉందన్నా రు. అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ఆర్డీవో జగదీశ్వరరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థికి కలెక్టర్ అభినందనఆదిలాబాద్టౌన్: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం (జేఎన్టీయూ)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగంలో సీటు సాధించిన విద్యార్థి కొత్తపల్లి హరివర్ధన్ను కలెక్టర్ రాజర్షిషా గురువారం అభినందించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కొత్తపల్లి ఆశన్న కుమారుడు ప్రతిష్ఠాత్మకమైన కోర్సులో సీటు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.డేటా ఆధారిత పాలనతోనే సమర్థవంతమైన సేవలుఆదిలాబాద్టౌన్: సాంకేతిక పరిజ్ఞానం, ఖచ్చితమైన డేటా విశ్లేషణ, పారదర్శక విధానాల అమలుతో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించవచ్చని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ నీతి ఆయో గ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘నీతి–తార’ సామర్థ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు డిజిటల్ సాంకేతిక సాధనాలను సమర్థవంతంగా వినియోగిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యలను శాసీ్త్రయంగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రవీందర్ రాథోడ్, నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ అధికారి రాహుల్, బ్లాక్ అధికారుల మాస్టర్ ట్రైనర్ నర్సింగ్ దాస్, తదితరులు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి..
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని చాలా కాలంగా విద్యాశాఖకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. ఫలితంగా ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ వంటి వివిధ కేడర్లలోని వారంతా అర్హత సాధించాల్సి ఉంటుంది. పదోన్నతులకోసం కూడా టెట్ ఉపయోగపడుతుంది. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్ -
ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్
నిర్మల్ఖిల్లా: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఎస్జీటీలు, భాషా పండితులు, పీఈటీలు, ఇతర కేటగిరీల టీచర్లకు ఉపశమనం కలిగింది. చాలామంది ఇప్పటికే పరీక్షకు సిద్ధమవుతూ పుస్తకాల కొనుగోలు, శిక్షణ, స్వీయ అధ్యయనంపై దృష్టి సారించారు. ప్రత్యేక టెట్ నిర్వహించనున్నా అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. సాధారణ టెట్కు వర్తించే కనీస అర్హత మార్కులనే దీనికి వర్తింపజేస్తారు. దీంతో పరీక్షలో ఉత్తీర్ణత సాధనకు ఉపాధ్యాయులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రత్యేక టెట్ కాబట్టి అర్హత మార్కులను కొంత సడలిస్తారని ఆశించిన కొందరు ఉపాధ్యాయులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో మొత్తం 11 వేలకు పైగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుండగా 4 వేల మందికి పైగా టెట్ అర్హత సాధించాల్సి ఉంది. మరోవైపు పదోన్నతి కోసం కూడా పేపర్–2 పరీక్ష అర్హత సాధించాల్సి ఉంటుంది. 150 మార్కుల ప్రశ్నపత్రంలో జనరల్ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించాలి. పదోన్నతులకు కీలకం భవిష్యత్లో చేపట్టే పదోన్నతులు, స్కూల్ అసిస్టెంట్, తదితర ఉన్నత పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకాశం లభించనుండడంతో ఈ పరీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. అందుకే జిల్లాలోని ఉపాధ్యాయులు దీనిని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. పేపర్–2 అర్హత సాధించడం ద్వారా ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధ్యాయుని కేడర్ను బట్టి కూడా ఈ అర్హత తప్పనిసరి చేసింది. పరీక్షల షెడ్యూల్ ఇలా.... దరఖాస్తుల స్వీకరణ: ఈనెల 22 నుంచి 29 వరకు ఆన్లైన్ ద్వారా సీబీటీ పరీక్షలు: సెప్టెంబర్ 7 నుంచి 11వరకు ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 28 నుంచి 30 తేదీలలో.. -
నమ్మించి.. దోచేస్తారు
● హార్డ్వేర్ షాప్ యజమాని స్కూటీ ఎత్తుకెళ్లిన దుండగుడుఆదిలాబాద్టౌన్: దుండగులు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. బిజినెస్ మ్యాన్లా రెడీ అయ్యి.. చేతిలో బ్యాగుతో అందరూ నమ్మేలా షాపులకు వెళ్తారు.. షాపు యజమానిని బురిడి కొట్టించి దోపిడీకి పాల్పడతారు. ఇలాంటి సంఘటనే జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో గల కె.శివం హార్డ్వేర్ దుకాణానికి ఉదయం 11 గంటలకు ఫెవికిక్, మొలలు, స్కృలు, ఇతర సామాగ్రి కొనుగోలు చేశాడు. వాటికి సంబంధించి జీఎస్టీ బిల్లు కావాలని షాపు యజమాని ప్రవీణ్కు చెప్పాడు. దీంతో ఆయన జీఎస్టీ నంబర్ చెప్పాలని అడగడంతో తన వద్ద నంబర్ లేదని, ఇప్పుడే తెలుసుకొని వస్తానని, తన బ్యాగ్ అప్పటివరకు ఇక్కడే ఉంచాలని చెప్పి ఆ షాపు యజమాని స్కూటీని తీసుకెళ్లాడు. తిరిగి రాకపోవడంతో వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీఐ సునీల్కుమార్, ఎస్సై అశోక్ ఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ నిందితుడు ఇచ్చోడ నుంచి ఓ ఆటోలో ఆదిలాబాద్కు వచ్చినట్లు తెలిపారు. స్కూటీతో పాటు ఆటో డ్రైవర్ ఫోన్ను సైతం ఎత్తుకెళ్లాడని వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
దరఖాస్తులు.. మస్తు
పోస్టులు, దరఖాస్తుల వివరాలు పోస్టులు అందిన దరఖాస్తులు టీచర్ 63 1,085 ఆయా 179 1,360ఆదిలాబాద్టౌన్: అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. కొన్నేళ్లుగా టీచర్, ఆయా పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఏజెన్సీ పరిధిలోని నాలుగు మండలాలకు సంబంధించి ఇటీవల ఐసీడీఎస్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో అధికారులు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. వచ్చే నెలలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. అనంతరం మైదాన ప్రాంతంలో పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. భారీ సంఖ్యలో దరఖాస్తులు.. అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు సంబంధించి ఈనెల 7న నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్లో ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏజెన్సీకి సంబంధించి నార్నూర్ ప్రాజెక్ట్ పరిధిలో గాదిగూడ, నార్నూర్, ఉట్నూర్ ప్రాజెక్ట్ పరిధిలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విధితమే. మొత్తం 242 పోస్టులకు గాను టీచర్, ఆయా పోస్టులకు సంబంధించి ప్రాజెక్టలు, మండలాల వారీగా మొత్తం 3209 దరఖాస్తులు వచ్చాయి. కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన.. అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. నార్నూర్, ఉట్నూర్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 25 వరకు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అనంతరం అభ్యర్థులకు సంబంధించి జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం కమిటీ సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించనుంది. ఇది పూర్తయిన తర్వాత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ కమిటీలో కలెక్టర్, ఐటీడీఏ పీవో, డీఎంహెచ్వో, జిల్లా సంక్షేమ అధికారి ఉంటారు. పైరవీలు షురూ.. అంగన్వాడీ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో పలువురు పైరవీలకు తెర లేపుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే తమ వారికే పోస్టు కేటాయించాలని కొంత మంది రాజకీయ నాయకులు ఐసీడీఎస్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో ఇంటర్మీడియెట్కు 70 మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉండగా వితంతువులకు 5 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు, అనాథలకు 10 మార్కులు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయిస్తారు. మండలాల వారీగా..ప్రాజెక్టు మండలం టీచర్ ఆయా పోస్టులు దరఖాస్తులు పోస్టులు దరఖాస్తులు నార్నూర్ గాదిగూడ 13 764 83 674 నార్నూర్ 12 ఉట్నూర్ ఉట్నూర్ 33 1085 96 686 ఇంద్రవెల్లి 5 -
బాసరలో వరుణ యాగం
బాసర: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో బుధవారం వైదిక సంప్రదాయం ప్రకారం వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల మధ్య గణపతి పూజతో మొదలై వరుణ జపం, హోదాది క్రతువులు, పూర్ణాహుతి, మహాశీర్వచనంతో యాగం శాస్త్రోక్తంగా కొనసాగింది. ఆలయ ఈవో అంజనిదేవి, ఏఈవో గంగ శ్రీనివాస్, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, అర్చకులు శృతి మురళిశర్మ, అంకుష్శర్మ, నవీన్శర్మ, వేద పండితులు గోవింద్ శర్మ, కిషోర్ పాఠక్, శ్రీనివాస్ శర్మ, కళాధర్ శర్మ పాల్గొన్నారు. -
ఎవరెస్టు శిఖరంపై జెండా ఎగరాలి
ఉట్నూర్రూరల్: ఎవరెస్టు శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే అవకాశం జిల్లాకు చెందిన ఇద్దరు పర్వతారోహకులకు రావడం అభినందనీయమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ నుంచి ఎవరెస్టు శిఖర అధిరోహణకు బయలుదేరుతున్న మడావి కన్నీబాయి, కొట్నక్ ఆనందరావును సత్కరించి సాగనంపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కన్నిబాయి మూడోసారి వెళ్తుండడం ఆమె పట్టుదలకు నిదర్శనమన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని శాంతినగర్లో ‘నంది ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వజ్రం ప్యూర్ ఫైర్‘ శుద్ధ జల కేంద్రాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి ప్రారంభించారు. పెద్ద సుద్దగూడ, గంగాపూర్ గ్రామాలతో పాటు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ను తనిఖీ చేశారు. ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమా అమలులో భాగంగా గంగాపూర్లో నీటికుంటల నిర్మాణాన్ని ప్రారంభించారు. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ‘పోషకాహార తోట‘ను ప్రారంభించి మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ ఏపీవోలు దశరథ్, డి.వసంతరావు, ఆత్రం భాస్కర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు. -
25న నాగన్న సంతాప సభ
ఆదిలాబాద్టౌన్: ప్రజా గాయకుడు, అరుణోదయ నాగన్న సంతాప సభను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకటనారాయణ కోరారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని కుమురంభీం భవన్లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ నాగ న్న సంతాప సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ఐఎఫ్టీయూ నాయకులు సుభాష్, మా రుతి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షురాలు దీపలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గణేష్, ఉపాధ్యక్షుడు నాగేందర్, పీవైఎల్ నాయకులు మారుతి, హరీష్ పాల్గొన్నారు. -
కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలి
ఆదిలాబాద్టౌన్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ ఫౌండేషన్, భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఆసిఫ్, షేక్ అస్లమ్, భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్ మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ క్రీడాకారుడు మృతి
తాండూర్: పాము కాటు కు గురైన మండలంలోని కిష్టంపేటకు చెందిన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీ డాకారుడు బండి సాగర్ (30) హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. వారం రోజుల క్రితం సాగర్ పాము కాటుకు గురికావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతునికి భార్య సాయిశ్రీ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రైలు నుంచి కిందపడి వ్యక్తి మృతిమందమర్రిరూరల్: మందమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రైలులో నుంచి కిందపడి బిహార్కు చెందిన మణిభూషన్కుమార్ (22) మృతి చెందినట్లు రైల్వేహెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. సాగర్ రైలులో కేరళకు వెళ్తున్న మణిభూషన్కుమార్ ప్రమాదవశాత్తు కిందపడిపోగా తీవ్రగాయాలు కా వడ ంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పే ర్కొన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్ర భుత్వ ఆసుపత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. బైండోవర్ ఉల్లంఘించిన ఒకరికి జరిమానాఆదిలాబాద్టౌన్: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ మట్కా నిర్వహిస్తూ పట్టుబడిన వ్యక్తికి రూ.15 వేల జరిమానా విధించినట్లు ఆదిలాబాద్ వన్టౌన్ సీఐ బి.సునీల్ కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రాయి సునీల్ కుమార్ గతంలో మట్కా కేసులో నిందితుడిగా ఉండటంతో బైండోవర్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ అదే తరహా నేరానికి పాల్పడినట్లు గుర్తించి అతనిపై చర్యలు చేపట్టి, నివేదికను ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు. విచారణ అనంతరం తహశీల్దార్ శ్రీనివాస్ నిందితుడికి రూ.15వేల జరిమానా విధించగా, ఆ మొత్తాన్ని చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సీఐ మాట్లాడుతూ బైండోవర్లో ఉన్న వ్యక్తులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వాటిని ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడితే జైలుశిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. -
నిర్మల్లో ఒకేరోజు మూడిళ్లలో చోరీ
నిర్మల్టౌన్న్: జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో బుధవారం వేకువ జామున దొంగలు మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని వెంకటాపూర్ కాలనీకి చెందిన లింగన్న ఇంట్లో 4 తులాల బంగారం, రూ.40 వేల నగదు, సునీత ఇంట్లో 6 గ్రాముల బంగారం, 10 తులాల వెండి, లక్ష్మి ఇంట్లో 7 గ్రాముల బంగారం, 8 తులాల వెండి, రూ.4 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. సోఫీనగర్ కాలనీలో బైక్ను అపహరించినట్లు సమాచారం. పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ సమ్మయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం సిబ్బందిని రప్పించి వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి సీ్త్రనిధి చేయూత
ఆదిలాబాద్టౌన్: గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక సాధికారతకు సీ్త్ర నిధి రుణాలు ఎంతో దోహదపడుతున్నాయని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సీ్త్ర నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ స్వయం సహాయక సంఘాల మహిళలు రుణా లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నతరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించా రు. అర్హులైన ప్రతి మహిళా సంఘానికి సకాలంలో రుణాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా సీ్త్ర నిధి ద్వారా అందించిన రుణాలు, ఆర్థిక సాయం, రుణా ల పంపిణీ, వసూళ్ల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీవో రవీందర్, మెప్మా పీడీ రాజు, సీ్త్రనిధి జిల్లా ప్రతినిధులు, మండల సమాఖ్య ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి పీవోఎస్ మిషన్ మంజూరుఆదిలాబాద్టౌన్: సాత్నాల మండలం మేడిగూడలోని జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి కలెక్టర్ రాజర్షిషా తక్షణమే పీవోఎస్ మిషన్ను మంజూరు చేశారు. బుధవారం యంత్రాన్ని అందజేశారు. మిషన్ అందుబాటులోకి రావడంతో ధాన్యం కొనుగోళ్లు, ఎలక్ట్రానిక్ రశీదుల జారీ మరింత వేగవంతంగా, పారదర్శకంగా సాగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు జాహ్నవి–శివప్రసాద్ దంపతులు కలెక్టర్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. -
దూరవిద్య.. చదువుకు దగ్గర..!
మంచిర్యాలఅర్బన్: కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత, ఇతర కారణాల వలన చదువు మధ్యలో మానేసిన వారిలో ఓపెన్ స్కూల్ విధానం కొత్త ఆశలు నింపుతోంది. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న ఏవయస్సు వారైనా మళ్లీ విద్యను కొనసాగించేందుకు గరిష్ట వయోపరిమితి లేకుండా ప్రోత్సహిస్తోంది. రెగ్యులర్గా తరగతులకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా స్వీయ అధ్యయనం, అనుకూలమైన సమయంలో పరీక్షలు రాసే వెసులుబాటు కల్పిస్తోంది. వారి భవిష్యత్కు బాటలు వేస్తోంది. ప్రవేశాలు ఇలా.. ప్రభుత్వం సార్వత్రిక విద్యను 2008–2009 విద్యాసంవత్సరంలో అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి విద్యార్హత లేనివారికోసం ముందుగా పదోతరగతి చదివేందుకు అవకాశం కల్పించింది. ప్రవేశాలకు స్పందన, అభ్యాసకులకు మరింత ప్రయోజనం కలిగేలా 2010–2011 విద్యాసంవత్సరంలో ఇంటర్ విద్యను అమల్లోకి తీసుకువచ్చింది. ఎంపిక చేసిన మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలు మండల సమన్వయకర్తలకు అప్పగించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలు పదోతరగతి–87, ఇంటర్–97 ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్లో పదో తరగతికి 28, ఇంటర్కు 31, కుమురంభీం ఆసిఫాబాద్లో పదోతరగతి–18, ఇంటర్–19, మంచిర్యాలలో పదోతరగతి–16, ఇంటర్–21 నిర్మల్లో పదో తరగతి–25 ఇంటర్ టాస్ 26 కేంద్రాలున్నాయి. గతేడాది 7,080 మందిని ఎన్రోల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 7,156 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకుని 6,965 మంది ప్రవేశ రుసుము చెల్లించారు. 2026–27 విద్యా సంవత్సరానికి జూలై 1 నుంచి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. జూలై 22 వరకు 350 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా 269 మంది ఫీజు చెల్లించారు. దరఖాస్తులు ఇలా.. ఓపెన్ స్కూల్లో చేరాలనుకునే వారు స్థానిక పాఠశాలలో సంప్రదించి మీసేవ, ఇతర కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. www. telangana openschool. org ద్వారా డెబిట్, క్రెడిట్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఫీజు చెల్లించవచ్చు. అపరాధ రుసుం లేకుండా జూలై 28 వరకు, అపరాధ రుసుంతో ఆగస్టు 29 వరకు గడువు విధించారు. పదోతరగతి జనరల్, బీసీ (పురుషులు) రూ.1400, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పురుషులు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, మహిళలకు రూ.1000, రిజస్ట్రేషన్ ఫీజు రూ. 150 (అందరికీ) చెల్లించాలి. ఇంటర్కు జనరల్, ఓసీ (పురుషులు) రూ.1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పురుషులు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, మహిళలకు రూ.1200 రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.300 ఆన్లైన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బోధన ఇలా.. ఓపెన్ టెన్త్, ఇంటర్లో ప్రవేశం పొందిన వారికి ప్రభుత్వ పాఠశాలలో సెలవు రోజుల్లో తరగతులు కొనసాగుతాయి. ఏదైనా పాఠశాల, కళాశాలలో 20 కు పైగా ఆడ్మిషన్లు ఉన్నట్లయితే వారికి ప్రతీ ఆది వారం, రెండో శనివారం, ఇతర సెలవు దినంలో తరగతులు నిర్వహిస్తారు. 20 కంటే తక్కువగా ఉంటే సమీపంలోని పాఠశాల, కళాశాలల్లో తరగతులు నిర్వహిస్తారు. ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు అధ్యయన సామగ్రి పంపిణీ చేస్తారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో బోధన ఉంటుంది.జూలై 22 వరకు ఉమ్మడి జిల్లా వారీగా ప్రవేశాలుజిల్లా టెన్త్ ఇంటర్ సైన్స్ నాన్సైన్స్ మొత్తం -
ప్రపంచ స్థాయి ఉద్యోగాలకు సిద్ధం చేయాలి
బాసర: ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగించి విద్యార్థులను ప్రపంచ స్థాయి ఉద్యోగాలు సాధించేలా సిద్ధం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. బుధవారం ఆర్జీయూకేటీ క్యాంపస్ను సందర్శించారు. అనంతరం విశ్వవిద్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించేలా విద్యా ప్రణాళికలు రూపొందించాలన్నారు. విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, క్యాంపస్ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ మురళీ దర్శన్, తహసీల్దార్ పవన్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై లాఠీచార్జి దారుణం
ఆదిలాబాద్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పో లీసులు లాఠీచార్జీ చేయడం దారుణమని కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ అన్నా రు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనపై లాఠీచార్జి చేయ డం, రాహుల్గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ జిల్లా కేంద్రంలో బుధవారం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎంపీ ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, కాంగ్రెస్ నాయకులతోకలిసి అంబేద్క ర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం గజేందర్ మాట్లాడుతూ, విద్యార్థుల పక్షాన నిలిచిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన దృష్ట్యా పోలీసులు రంగ ప్రవేశం చేసి నాయకులను అరెస్ట్ చేసి వన్టౌన్కు తరలించారు.ఎంపీ క్యాంపు కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ.. -
రేపు విద్యాసంస్థల బంద్
ఆదిలాబాద్టౌన్: ఈ నెల 24న విద్యాసంస్థల బంద్ చేపట్టనున్నట్లు యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ అల్తాఫ్, ఆత్రం నాగేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లాఠీచార్జి చేయించిందని ఆరోపించారు. ఈ ఘటనను అన్నివర్గాల ప్రజలు ఖండించాలని కోరారు. మోడీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర విద్యాశాఖ మంత్రిని తక్షణమే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని పేర్కొన్నారు. నీట్పేపర్ లీకేజీపై 30 రోజులుగా విద్యార్థులు దీక్షలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన విద్యాసంస్థల బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు. -
అడవిపందిని హతమార్చిన 32 మందిపై కేసు
బెల్లంపల్లి/భీమిని: అడవి పందిని హతమార్చిన 32 మందిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి అటవీరేంజ్ అధికారి(ఎఫ్ఆర్ఓ) పూర్ణచందర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఈనెల 20న భీమిని మండలంలోని ఖర్జీ భీంపూర్లో డీఆర్వో గౌరి శంకర్, టి.గోపికృష్ణ, ఫారెస్టు బీట్ అధికారి గ్రామానికి వెళ్లి నగేష్ ఇంట్లో సోదా చేసినట్లు విచారించారు. కుక్కలు హతమార్చిన అడవిపంది మాంసాన్ని నగేష్తో పాటు గ్రామంలోని మరో 8 మంది, నార్లపూర్కు చెందిన 14 మంది, రాజారాంకు చెందిన ఆరుగురు, పైకాజీగూడకు చెందిన ముగ్గురు పోగులు వేసుకున్నారు. బుధవారం 32 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఎజెండాలో ఐదు.. రెండు ఆమోదం
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ మున్సిపల్ ప్రత్యేక సమావేశం బుధవారం మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. చైర్పర్సన్ అనూష అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎజెండాలో ఐదు అంశాలు ఉండగా, రెండింటికి ఆమోదం లభించింది. మిగిలిన మూడు కౌన్సెల్లో ఉంచారు. మొదటి అంశంగా యూసీఎఫ్ కింద రూ.68 కోట్లతో మినీ ట్యాంక్బండ్ నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్లో రాష్ట్ర ప్రభుత్వం 25శాతం, కేంద్ర ప్రభుత్వం వాటా 25శాతం, మిగిలిన 50శాతం రుణం ద్వారా సమకూర్చేలా ప్రతిపాదనలు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. రెండో అంశంగా ఆదిలాబాద్ పట్టణ ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చైర్పర్సన్ పేర్కొన్నారు. రూ.25లక్షల నిధులు కేటాయించే అంశంపై కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మూడో అంశంగా గతంలో కలెక్టర్ అనుమతితో ఆమోదం పొందిన ఎనిమిది అంశాలను కౌన్సెలింగ్కు సమాచారం నిమిత్తం తెలియజేశారు. నాల్గో అంశంగా న్యూస్ పేపర్ల టెండర్లకు సంబంధించిన బిల్లులను కౌన్సెలింగ్ ముందుంచారు. ఐదో అంశంగా మున్సిపాలిటీలో అప్పగించిన పనులను పూర్తి చేయని నలుగురు కాంట్రాక్టర్లను రెండేళ్ల పాటు డిబార్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పలు అంశాలపై సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ మెజార్టీ సభ్యుల మద్దతులో కౌన్సిల్లో ఆమోదం పొందినట్లు చైర్పర్సన్ ప్రకటించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, టౌన్ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, మున్సి పల్ వైస్ చైర్మన్ రోహిత్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
సీఈఐఆర్లో ఫిర్యాదు చేయండి
ఆదిలాబాద్టౌన్: ఫోన్ పోగొట్టుకున్నా.. చోరీకి గురైన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.12.5 లక్షల విలువైన 105 మొబైల్ ఫోన్లను స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో బాధితులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మొబైల్ పోగొట్టుకున్న వెంటనే https://www.ceir.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని, లేదా సమీప పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేక రికవరీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గడిచిన ఏడాది కాలంగా సుమారు 1,600 ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ దుకాణ యజమానులు దొంగ ఫోన్లను కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మౌనిక, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ప్రత్యేక రికవరీ బృందం సభ్యులు ఆర్ఎస్సై పి.గోపీకృష్ణ, మజీద్, అన్వేష్, నవనీత్, జుబేర్, ఇజాజ్ తదితరులు పాల్గొన్నారు. -
దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్
ఇచ్చోడ: మండలంలోని దాబా బి సర్పంచ్ నర్వటే ఈశ్వర్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజర్షిషా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ ఇటీవల కొంత మంది రైతులకు అనధికారంగా నకిలీ పత్తి విత్తనాలు విక్రయించాడు. ఈ ఘటనలో ఆదిలాబాద్ టాస్క్ఫోర్స్ టీం విచారణ జరిపి విక్రయించిన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. సర్పంచ్పై ఇచ్చోడ పోలీస్స్టేషన్లో కేసు నమోదు కాగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తదుపరి చర్యల నిమిత్తం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదిక అనుసరించి జిల్లా వ్యవసాయాధికారి సమర్పించిన నివేదిక అధారంగా ఈశ్వర్కు జిల్లా పంచాయతీ అధికారి షోకాజ్ నోటీసు జారీ చేస్తూ వివరణ కోరారు. సంజాయిషీ సంతృప్తికరంగా లేనందున అతడిని సర్పంచ్ పదవిలో కొనసాగకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ పరిధి గుడిపేట శివారులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మిట్టపల్లి మల్లేశ్(57) మృత్యువాతపడ్డాడు. హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. మంచిర్యాల ఏసీసీలో నివాసం ఉంటున్న మల్లేశ్ తన ద్విచక్ర వాహనంపై లక్సెట్టిపేట పరిధిలోని గుల్లకోటలో ఉన్న ఓ సిరామిక్స్ కంపెనీకి వెళ్లాడు. వెల్డింగ్ పని పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. గుడిపేట శివారులో లక్సెట్టిపేట నుంచి మంచిర్యాల వైపు వస్తున్న లారీని డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి లక్ష్మణ్ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో లక్ష్మణ్ తన వాహనంతో సహా లారీ ముందు బంపర్లో ఇరుక్కుపోయాడు. చాలా దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలతో మల్లేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య రాజేశ్వరి, కుమారులు శామ్యూల్ రాజ్కుమార్, సాల్మన్రాజ్ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పదంగా ఒకరు..బాసర: మండలంలోని అష్ట గ్రామానికి చెందిన కనకాపురం లింగం (40) మంగళవారం బాసర నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా బాసర ఓని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ దీపక్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా మృతునిపై బైక్ పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతునికి భార్య లక్ష్మి, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుని తల్లి కనకాపురం పోసాని ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. హోంగార్డు మృతిబాసర: జ్ఞాన సరస్వతి దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ హోంగార్డ్ పెరిక రాజన్న మంగళవారం మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన అతడు గత ఏడాదిగా క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నెల రోజులుగా విధులకు దూరంగా ఉన్నాడు. అప్పులు చేసి చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయిందని భార్య గౌరమ్మ తెలిపింది. కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతోంది. రాజన్నకు భార్య, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. -
తాళ్లతో కట్టి.. వాహనంలో కుక్కి
చింతలమానెపల్లి: మహారాష్ట్ర సరిహద్దులోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మీదుగా పట్టణాలు, నగరాలకు పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. తాళ్లతో కట్టి ప్యాసింజర్ వాహనంలో తరలిస్తున్న పశువులను మంగళవారం చింతలమానెపల్లి మండలం ఖర్జెల్లి సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖర్జెల్లి సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అదే మార్గంలో వస్తున్న ఒక మహింద్రా జైలో ప్యాసింజర్ వాహనం డ్రైవర్ పోలీసులను గమనించి కొంత దూరంలో నిలిపివేశాడు. డ్రైవర్ దిగి పారిపోవడం గమనించిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. తప్పుడు నంబర్ ఉండటంతోపాటు తాళ్లతో కట్టేసిన ఒక ఆవు, ఒక ఎద్దు, ఐదు దూడలను గుర్తించారు. పశువులను అక్రమంగా కబేళాకు తరలిస్తున్నట్లుగా నిర్ధారించారు. వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించి పారిపోయిన డ్రైవర్పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తూ ట్రాన్స్ఫార్మర్లను దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్లో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన ఎనిమిది మందిపై ఆదిలాబాద్రూరల్, మావల పోలీస్స్టేషన్ల పరిధిలో 10 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఏడాదిగా ట్రాన్స్ఫార్మర్లను దొంగిలిస్తున్న ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అరెస్టు చేసిన నిందితుల్లో జాదవ్ సంతోష్, మీరాల సంతోష్, మండ్వాకర్ నవ్వడు అలియాస్ నవనాథ్తో పాటు ఒక బాల నేరస్తుడు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో నిందితుడు సరేళా రవి పరారీలో ఉన్నట్లు వివరించారు. దొంగిలించిన రాగి తీగలను కొనుగోలు చేసిన షేక్ అఫ్రోజ్, అబ్దుల్ నౌషీర్ను కూడా అరెస్టు చేయగా, టిటిల్ కరణ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని రాగి తీగలను తీసి తక్కువ ధరకు స్క్రాప్ దుకాణాలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఆ యజమానులు దొంగలతో కుమ్మకై ్క చోరీలకు ప్రోత్సహించినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు, రెండు 5 హెచ్పీ మోటార్ల నుంచి తీసిన సుమారు రూ.1.50 లక్షల విలువ గల వంద కిలోల రాగి తీగ, రెండు మొబైల్ ఫోన్లు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గతంలో కూడా ఇదే ముఠా జైనథ్ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు చెప్పారు. కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన రూరల్ సీఐ రహీం పాషా, ఎస్సై విష్ణువర్ధన్, పోలీసు సిబ్బంది మంగళ్ సింగ్, అబ్దుల్ కరీంను ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, ఎస్సై విష్ణువర్ధన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అదుపు తప్పి లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
ఉట్నూర్రూరల్: అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఘటన ఉట్నూర్ మండలం నాగాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, డ్రైవర్ నర్సింలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నుంచి ఉట్నూరు మీదుగా అమరావతికి లారీలో కొబ్బరిబొండాలు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నాగాపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి లారీ అదుపుతప్పి బోల్తా పడినట్లు డ్రైవర్ తెలిపాడు. కొబ్బరిబోండాలను వేరే వాహనంలో తరలించినట్లు పేర్కొన్నాడు. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, సమీపంలోనే ఉన్న వంతెన వద్ద పడితే పెనుప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు. -
మట్టిపాలైన 90 క్వింటాళ్ల బియ్యం
వాంకిడి: అధికారుల నిర్లక్ష్యంతో రూ.లక్షల విలువ చేసే బియ్యం, తదితర సరుకులు మట్టిపాలయ్యాయి. వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 2024 నవంబర్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో 60 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఒక విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం అధికారుల విచారణ నేపథ్యంలో స్టోర్ రూంలో నిల్వ ఉన్న బియ్యం, నూనె, తదితర వంట సరుకులను సీజ్ చేశారు. ఆ తర్వాత వాటిని పట్టించుకునే వారు లేకపోవడంతో సుమారు రెండేళ్లుగా స్టోర్ రూముకే పరిమితమయ్యాయి. ఇటీవల సరుకులు నిల్వ ఉంచేందుకు ఇబ్బందిగా మారుతుందని హాస్టల్ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఆర్ఐ(గిర్దావార్) శైలజ సమక్షంలో పంచనామా నిర్వహించారు. 90 క్వింటాళ్ల బియ్యం, మూడు కాటన్ల వంట నూనె, కారం, తదితర సరుకులు పూర్తిగా పాడైపోయినట్లు గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని కొలాప్స్ చేసేందుకు నిర్ణయించగా పంచాయతీ సిబ్బంది మంగళవారం వాంకిడి డంపింగ్ యార్డులో జేసీబీతో గుంత తవ్వి పూడ్చివేశారు. కాగా, ఫుడ్ పాయిజన్ ఘటన అనంతరం అధికారులు విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై అనేక రకాలుగా విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే స్టోర్ రూమ్లోని వంట సరుకులు, బియ్యం, కారం, తదితర సామగ్రి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు తరలించినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. కానీ ఆ సరుకుల్లో విష పదార్థాలు ఉన్నాయా లేవా అనేది బయటికి రాలేదు. ఆ సరుకులు విషపూరితమైతే ఇన్ని రోజులు స్టోర్ రూములో ఎందుకు ఉంచాల్సి వచ్చింది.. మంచివే అయితే ఎందుకు వినియోగించ లేదనే ప్రశ్నలు వెల్లువెత్తునున్నాయి. -
బాసర ఆలయంలో ఒడిబియ్యం లెక్కింపు
బాసర : జ్ఞాన సరస్వతి అమ్మవారికి భక్తులు సమర్పించిన ఒడి బియ్యం మంగళవారం లెక్కించారు. ఎండు కొబ్బరి కుడుకలు, బాదం, బరడి పోకలు, పసుపు కొమ్మలు, ఖర్జూరాల ద్వారా రూ.7,308, 50 కిలోల చొప్పున 97 సంచులు (48 క్వింటాళ్లు) ఒడి బియ్యం ద్వారా రూ.93,071 ఆదాయం సమకూరింది. మొత్తంగా ఆలయానికి రూ.1,00,379 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఏఈవో గంగా శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు సంజీవ్రావు, శివరాజ్, నానం సాయిలు, గోపాల్ సింగ్, ఆలయ సిబ్బంది, వాగ్దేవి లేబర్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. -
హరి ఓం విఠల..!
భైంసా: తెల్లవారుజామున ఆకాశంలో తొలి వెలుగు విరిసేవేళ.. పచ్చనిపొలాల మధ్య ఉన్న మట్టిరోడ్డుపై నుంచి తాళాల మోగింపు వినిపిస్తోంది. కొద్ది క్షణాల్లోనే ఆ నాదం మరింత ఉధృతమైంది. కాషాయ జెండాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. తెల్లని దుస్తులు, తలపై మరాఠీ టోపీలు, మెడలో తులసీమాలలు ధరించిన వే లాదిమంది ఒకే ల యలో పాదం కదుపుతూ.. పదం క లుపుతూ అడుగులు వేస్తున్నారు. వారందరి నో టా ఒకటే నా మం.. ‘విఠల.. విఠల.. విఠల.. హరి ఓం విఠల..’ ఆ నామస్మరణతో గాలి కూడా పవిత్రమవుతుందేమో అనిపిస్తుంది. వాళ్ల అడుగులు ముందుకు కదులుతున్నా... వారి మనసులు మాత్రం పాండురంగడి పాదాల వద్దే నిలిచిఉంటాయి. ఈ మహాయాత్రలో నిర్మల్ జిల్లా కూడా ఏటా భాగమవుతోంది. జిల్లా నుంచి వేలాదిమంది విఠోబా(పాండురంగడి) భక్తులు ఏకాదశి పర్వదినాన ఆ స్వామిని దర్శించుకునేందుకు పండరీపురానికి కాలినడకన బయలుదేరి వెళ్లారు. 250 కిలోమీటర్లు కాలినడక.. ఈ నెల 8న మహారాష్ట్రలోని పూణే జిల్లా అలందిలో ప్రారంభమైన యాత్ర షోలాపూర్ జిల్లాలోని పండరీపూర్కు ఈనెల 24న చేరుకుంటుంది. నిండా ఆధ్యాత్మికతతో 250 కిలోమీటర్లు నడుస్తూనే ఉంటారు. దాదాపు 700 ఏళ్లుగా ఈ యాత్ర కొనసాగుతుందని భక్తులు చెబుతున్నారు. ప్రతీ ఆషాఢ మాసంలో లక్షలాది మంది ఒకే దిశగా నడుస్తూనే ఉంటారు. వారి గమ్యం ఒక్కటే.. పండరీపూర్లో నడుముపై రెండు చేతులు పెట్టుకుని ఇటుకపై నిల్చుని ఎదురు చూస్తున్న విఠోబా దర్శనం. భక్తి ఉద్యమానికి ప్రాణం.. మహారాష్ట్రలో పుట్టిన భక్తి ఉద్యమ ప్రభావం జి ల్లా పై తీవ్రంగా ఉంది. అలాంటి భక్తి ఉద్యమానికి ప్రా ణం పోసింది ఈ వార్కారీ యాత్ర అని చెప్పవచ్చు. 13వ శతాబ్దంలో సంత్ జ్ఞానేశ్వరుడు వెలిగించిన ఈ భక్తి దివ్వెను 1685 నుంచి నారాయణ్ మహారాజ్ ‘వార్కారీ’గా మలిచారు. అప్పటి నుంచి ఏటా 10 నుంచి 15 లక్షలమంది ప్రతీ ఆషాఢంలో పండరీపురానికి కాలినడకన కదులుతూనే ఉన్నారు. దాదాపు 21 రోజులపాటు సాగే యాత్రలో మార్గమధ్యలో ఆలయాలను దర్శిస్తూ.. సంత్ తుకారాం అభంగాలు, భజనలు ఆలపిస్తూ.. పాండురంగడి భక్తిలో మైమరచిపోతారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులూ యువకుల వేగానికి తగ్గట్లు పాటలు పాడుతూ హుషారుగా అడుగులు వేయడం వార్కారీలో కనిపిస్తుంది. దారి పొడవునా గ్రామాలు వీరికి స్వాగతాలు పలకడం, అన్నదానాలు చేయడం ప్రజల్లో ఐక్యతను మరింత పెంచుతున్నాయి. ఎక్కడ ఆగితే అక్కడ రాత్రంతా భజనలు, అభంగాలు, హరికథలతో ఆ ఊరంతా ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చేస్తారు. పండరీపుర యాత్రలో బృందాలుగా సాగుతారు. ఈ బృందాన్ని ‘దిండి’ అంటారు. ఇది కేవలం ఒక బృందం కాదు... ఒక కుటుంబంలా ఉంటుంది. ఎలాంటి భేదాలు, తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి నడుస్తారు. ఎవరికై నా కష్టం వస్తే మిగతావాళ్లు చేయూతనిస్తారు. ఇక్కడ ధనికుడు, పేదవాడు అనే తేడా ఉండదు. అందరూ విఠోబా బిడ్డలే.. అని భావిస్తారు. ప్రతి ఒక్కరూ తులసీమాల ధరించి, సాత్వికాహారం తీసుకుంటూ, విఠల నామస్మరణ చేస్తూ, పరిశుభ్రత పాటిస్తారు. ఈ నెల 24న పండరీపురం చేరుకుని 25న ఆషాఢ ఏకాదశి పర్వదినాన పాండురంగడిని దర్శించుకుంటారు. -
మూడో రైల్వేలైన్ ప్రారంభం
రెబ్బెన: ఆసిఫాబాద్ రోడ్ నుంచి కాగజ్నగర్ మధ్య నిర్మితమైన మూడో రైల్వే లైన్ను మంగళవారం కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ మాధవి ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లైన్ను ప్రారంభించి, మోటర్ ట్రాలీతో అధికారులతో కలిసి ట్రాక్ నిర్మాణ పనులు, నాణ్యతను పరిశీలించారు. పెద్దవాగుపై నిర్మించిన మూడో బ్రిడ్జి వద్ద ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అక్కడి నుంచి ట్రాకును పరిశీలిస్తూ కాగజ్నగర్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అనంతరం స్పెషల్ ట్రైన్తో 130 కిలోమీటర్ల వేగంతో కాగజ్నగర్ నుంచి ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు స్పీడ్ టెస్ట్ నిర్వహించారు. స్పీడ్ టెస్ట్ విజయవంతం కావడంతో రైల్వే అధికారులంతా సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో డీఆర్ఎం గోపాలకృష్ణన్, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
ఉరేసుకొని ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ఉట్నూర్రూరల్: మెదక్ జిల్లా నర్సాపూర్లో ఇంజినీరింగ్ చదువుతున్న ఉట్నూర్ మండలం లింగోజీ తండాకు చెందిన మోతిపల్లి శివశంకర్ (19) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మోతిపల్లి గంగాధర్– శోభ దంపతులకు ముగ్గురు సంతానం. కూరగాయలు విక్రయిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. వీరిలో శివశంకర్ పెద్ద కుమారుడు. నర్సాపూర్లోని బీవీ ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల సమీపంలోని ఓ రూమ్లో ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్న సమయంలో తన గదిలో ఉరేసుకుని విగతజీవిగా మారాడు. తోటి విద్యార్థులు గమనించి సమాచారం అందించగా తల్లిదండ్రులు అక్కడికి బయలుదేరి వెళ్లారు. చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటాడనుకున్న కొడుకు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా, మృతుడి వద్ద సూసైడ్ నోట్ లభించినట్లు తెలిసింది. అందులో తన మృతికి ఎవరూ కారణం కాదని ఉన్నట్లుగా సమచారం. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
ఖానాపూర్: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలైన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన గొండాల రంజిత్ కుమార్ ఆదివారం రాత్రి ఈ–స్కూటీపై ఖానాపూర్ నుంచి నిర్మల్ వెళ్తుండగా కుమురం భీంచౌరస్తా–ఇక్బాల్పూర్ మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో మొదట స్థానికంగా చికిత్స అందించి, మెరుగైన చికిత్సకోసం నిజామాబాద్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా బ్రెయిన్ సర్జరీ చేయాలని, రూ.10 లక్షల వరకు ఖర్చుఅవుతుందని తెలిపారు. దాతలు మానవత్వంతో స్పందించి చేతనైనంత ఆర్థిక సాయం అందించి యువకుడి ప్రాణాలు కాపాడాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దా తలు 9000524553 నంబర్కు ఫోన్పే ద్వారా ఆర్థికసాయం అందించాలని కోరుతున్నారు. అమెరికా రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లావాసికి గాయాలులక్ష్మణచాంద: అమెరికా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన యువ ఇంజినీర్కు తీవ్రగాయాలయ్యాయి. బాఽ దిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని నర్సాపూ ర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన గన్ను శ్రీని వాస్రెడ్డి, విశ్వరూప దంపతుల కుమారుడు నిత్యానందరెడ్డి ఎంఎస్ చేసేందుకు మూడేళ్ల క్రితం అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం లోని డెట్రాయిట్కు వెళ్లాడు. ఎంఎస్ పూర్తి కావడంతో అక్కడే ఉండి ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం బైక్పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ రాగి తీగ చోరీతాండూర్: మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో అమర్చిన ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి కాపర్ వైర్, ఆయిల్ అపహరించారు. రైతులు పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. నూతన ట్రాన్స్ఫార్మర్ అమర్చి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య నస్పూర్: కుటుంబ కలహాల కారణంగా భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘట న నస్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ప్ర శాంత్నగర్లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రశాంత్నగర్కు చెందిన కుచాడి సతీష్(48) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో సూపర్వైజర్గా పని చేసేవాడు. భార్య విజయ, కూతు రు సంజనితో కలిసి అక్కడే ఉండేవాడు. సతీష్ తండ్రి శేఖర్ గత మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో సతీష్ కుటుంబం ఇంటివద్దకే వచ్చి తల్లి తులసితో కలిసి ఉంటున్నారు. సతీష్, విజయ మధ్య నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు నెలలుగా గొడవలు జరగడంతో జీవితంపై విరక్తి చెందాడు. మంగళవారం వేకువజామున సతీష్ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రేషన్ బియ్యం పట్టివేత
రామకృష్ణాపూర్: స్థానిక రవీంద్రఖని రైల్వేస్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ నుంచి బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పట్టణ ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. సుమారు 5 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని.. తరలిస్తున్న ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. లైంగిక దాడి కేసులో ఇద్దరు అరెస్ట్కడెం: మండలంలోని చిన్నబెల్లాల్ సమీపంలో ఈనెల 20న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై సాయికిరణ్ తెలిపారు. మండలంలోని నర్సింగాపూర్ (పెర్కపల్లె)కు చెందిన బియ్యాల గంగన్న, పోషన్నను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. స్కానర్ కోడ్తో ఇటుకల వ్యాపారికి టోకరారామకృష్ణాపూర్: మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామానికి చెందిన ఓ ఇటుకల వ్యాపారి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ.40 వేల నగదు కోల్పోయాడు. పట్టణ ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తినని పరిచయం చేసుకున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ నెల 16న ఫోన్ చేసి తాను పాఠశాల నిర్మాణం చేపడుతున్నానని ఇందుకు పెద్ద మొత్తంలో ఇటుకలు అవసరమని తెలిపాడు. నమ్మకం కల్పించిన సదరు వ్యక్తి ఇటుకల సరఫరాకు ముందుగా రూ.40వేల అడ్వాన్స్ పంపిస్తానని చెప్పాడు. అనంతరం ఓ స్కానర్ పంపిస్తూ దానిని స్కాన్ చేసి పిన్ నంబరు నమోదు చేస్తే రూ.40వేల అడ్వాన్స్ మీ ఖాతాలో జమ అవుతుందని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఇటుకల వ్యాపారి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పిన్ నమోదు చేయగా రావాల్సిన డబ్బుకు బదులు అతని ఖాతా నుంచే రూ.40 వేలు వెళ్లాయి. మోసానికి గురయ్యానని గుర్తించిన బాధితుడు మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
దగ్గు.. జ్వరం
కుంటాలకు జలకళకురుస్తున్న వర్షాలతో కుంటాల జల పాతం మంగళవారం జలకళ సంతరించుకుంది. పర్యాటకుల తాకిడి మొదలైంది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారు ప్రకృతి అందాలను వీక్షిస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. – నేరడిగొండ ఆదిలాబాద్టౌన్: సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. ప్రస్త్తుతం కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రస్తుతం వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. దగ్గు, జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి. రిమ్స్ ఓపీ పెరుగుతోంది. రెండు రోజులుగా 2400కు పైగా నమోదవుతుండడం గమనార్హం. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య పెరుగుతోంది. సీజనల్ వ్యాధులపై వైద్యశాఖ అప్రమత్తమైంది. ర్యాపిడ్ ఫీవర్ సర్వేతో పాటు ఎపడమిక్ టీమ్లను ఏర్పాటు చేసింది. స్టాప్ డయేరియా కార్యక్రమం చేపడుతుంది. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. పలువురు మృత్యువాత పడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలం.. వ్యాధుల కాలం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆయా గ్రామాల్లో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. గుంతలు, మురుగుకాలువలతో పాటు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంటుంది. దీంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి. జిల్లాలో వారం రోజులుగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. జిల్లాలోని సాత్నాల మండలం మాంగుర్లలో ఒకరికి, ఇంద్రవెల్లి మండలంలోని మెండపల్లిలో మరొకరికి డెంగీ పాజిటీవ్ నిర్ధారణ అయింది. ఈమేరకు అధికారులు అప్రమత్తమై చర్యలు చేపడుతున్నారు. వైద్యశాఖ ప్రత్యేక చర్యలు.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ ముందస్తుగానే ప్రణాళిక తయారు చేసింది. చిన్నారులు డయేరియా బారిన పడకుండా స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. జూన్ 1 నుంచి మొదలైన ర్యాపిడ్ ఫీవర్ సర్వే సెప్టెంబర్ వరకు చేపట్టనుంది. ఇంటింటికి వెళ్లి వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు జ్వరపీడితుల వివరాలు సేకరిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యగా పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో ఫ్రైడే.. డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జ్వరం అదుపునకు అవసరమైన మందులు అందజేస్తున్నారు. పలుచోట్ల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గిరిజనులు నివసించే గ్రామాల్లో జన్మన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వాహనాల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు. కురిసింది : 246.5 స్థితి : 41శాతం లోటు వర్షపాతం -
మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక పోలీసు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో షీటీం ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులను వేధించిన 180 మంది ఆకతా యిలు, వారి తల్లిదండ్రులకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ, గడిచిన ఆరు నెలల్లో మహిళలు, చిన్నారులు, విద్యార్థులపై వేధింపులకు సంబంధించి జిల్లాలో 230 పెట్టీ కేసులు, 20కు పైగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా, వా ట్సాప్, ఇన్స్ట్రాగాం ద్వారా అసభ్య సందేశాలు పంపడం, పాఠశాలలు, కళాశాలల వద్ద విద్యార్థినుల ను వేధించడం, వివాహిత మహిళలను బ్లాక్మెయి ల్ చేయడం, ఫోన్ కాల్స్ ద్వారా ఇబ్బందులకు గురి చేయడం వంటి చర్యలు చట్టరీత్యా నేరాలని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మౌనిక, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రె డ్డి, టూటౌన్ ఇన్స్పెక్టర్ కె.నాగరాజు, డబ్ల్యూపీఎస్ ఇన్స్పెక్టర్ కె.ఫణిందర్, షీటీం సభ్యులు సుశీల, వాణిశ్రీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మట్కా రహిత జిల్లా లక్ష్యం మట్కా రహిత జిల్లా లక్ష్యంగా పోలీసు శాఖ చర్యలు చేపడుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మట్కా వంటి జూద కార్యకలాపాల నిర్మూలనే ల క్ష్యంగా సోమవారం ప్ర త్యేక డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 పోలీస్స్టేషన్ల పరిధి లో 20 ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మొత్తం 54 మంది నిర్వాహకులు, ఆటగాళ్లను తనిఖీ చేసి 34 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. యువత ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల సహకారంతో జిల్లాను మట్కా రహితంగా తీర్చిదిద్దుతామని వివరించారు. -
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతుంది. 225 గ్రామాలను హైరిస్క్గా గుర్తించాం. వారానికోసారి డ్రైడే.. ఫ్రైడే నిర్వహిస్తున్నాం. అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని తొమ్మిది పీహెచ్సీల్లో వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జన్మన్, ఆర్బీఎస్కే వైద్యుల ద్వారా సర్దుబాటు చేశాం. ఆశ కార్యకర్తలతో ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేపడుతున్నాం. ప్రతి ఒక్కరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. – డాక్టర్ సాధన, డీఎంహెచ్వో -
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రవాణా, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్రాజ్ స్పష్టం చేశారు. రహదారి భద్రత చర్యలపై మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్రాజ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు, ట్రక్కులను నిర్దేశిత ప్రాంతాలు మినహా ఎక్కడా పార్కింగ్ చేయరాదని స్పష్టం చేశారు. రహదారులపై ఆక్రమణలు తొలగించి, రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి జాతీయ రహదారులపై నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను జిల్లాలో ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ గుర్తించిన బ్లాక్స్పాట్ల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు ఆర్ఎస్.చిత్రు, రాజేశ్వర్, రవాణా శాఖ అధికారి కిశోర్ బాబు, డీఎంహెచ్వో సాధన, రోడ్లు భవనాల శాఖ, పోలీసు, నేషనల్ హైవే, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మాతృభాష పరిరక్షణ అందరి బాధ్యత
ఉట్నూర్రూరల్: ఆదివాసీ భాషలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఐటీడీఏ పీవో మంద మకరందు ఆకాంక్షించారు. మాతృభాషను పరిరక్షించడం ప్రతి ఒక్క రూ బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా గోండి,కొలాం భాషల్లో మాతృభాష దినోత్సవ శు భాకాంక్షలు తెలిపారు. గిరిజన భాషలను సాంకేతికతతో అనుసంధానం చేసి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో ఐఐటీ విద్యార్థుల సహకారంతో ఏఐ ఆధారిత భాషా వేదికను రూపొందిస్తున్నామని వివరించారు. ఈ సాంకేతిక వేదిక ద్వారా గోండి, కొలాం భాషలను నేర్చుకోవడం సులభమవడంతో పాటు ఇతర భాష ల వారికి కూడా అర్థం అవుతుందని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ, గోండి, కొలాం భాషల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం గోండి–కొలామి పొడుపు కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడీ ప్రేమకళ, ఏపీఓ (పీవీటీజీ)భాస్కర్, డిప్యూ టీ ఈఈ చందన్,ఈఈ తానాజీ, డీఎంజీసీ సందీప్ కుమార్, అడిషనల్ డీఎంహెచ్వో మనోహర్, ఐటీడీఏ అధికారులు,ఆదివాసీ సార్మేడిలు, గ్రామపటేళ్లు పాల్గొన్నారు. -
మండలాల్లో మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలు..
● ఎండిపోతున్న పంటలకు జీవం ● జిల్లాను కమ్మేసిన మేఘం ● ఏకధాటిగా వాన ● భారీ వర్షాలపైనే రైతుల ఆశలు సాక్షి,ఆదిలాబాద్: హమ్మయ్య.. ఊరూరా చేసిన జలాభిషేకాలు, పూజలు ఫలించాయి. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోసినట్లయింది. వర్షాభావంతో చేలల్లో వాడిన మొక్కలకు ప్రస్తుతం మళ్లీ జీవం వచ్చినట్లయింది. మరో 15 రోజులు వాన పడకున్నా ఏమి కాదన్న ధైర్యం రైతుల్లో కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ముసురు వాన కురుస్తూనే ఉంది. మరో రెండు మూడు రోజుల పాటు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. తేలికపాటి వర్షం జిల్లాలో సోమవారం తేలికపాటి వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి ముసురు మొదలైంది. ఏకధాటిగా కొనసాగుతుంది. జిల్లాకేంద్రంతో పాటు అన్ని మండలాల్లో కురుస్తుండగా సామాన్యులతో పాటు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు జీవం.. జిల్లాలో పత్తి, సోయా, కంది, మొక్కజొన్న అత్యధి కంగా సాగుకాగా, వరి,జొన్న స్వల్పంగా సాగయ్యా యి. పత్తి 4లక్షల 23వేల 955 ఎకరాలు, సోయా 56,762, కందులు 42,701, మొక్కజొన్న 21,725 ఎకరాల్లో సాగయ్యాయి. రెండు వారాలుగా వరుణు డు ముఖం చాటేయడంతో మొలకెత్తిన పంటలు వాడిపోయాయి. మరికొద్ది రోజులు వర్షం కురువకపోతే ఎండిపోయి జీవం కోల్పోయే పరిస్థితి కనిపించింది. ఈ దశలో ముసురుతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇప్పుడు చేయాల్సింది.. వర్షాలు కురుస్తున్నందున ప్రస్తుతం ఎరువులు వేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నా రు. కలుపు నివారణ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా అనువైన గడ్డి మందులతో పాటు సస్యరక్షణ చ ర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. కురుస్తున్న వర్ష పు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. ఫలితంగా భూమిలో తేమ శాతం పెరుగుతుందని, మళ్లీ వర్షాభావ పరిస్థితులు ఎదురైనా పంటలు తట్టుకునే వీలుంటుందని అభిప్రా య పడుతున్నారు. ఇవి కూడా.. వర్షాభావం నేపథ్యంలో ఇప్పటివరకు పంట సాగు చేపట్టని రైతులు కందితో పాటు స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పత్తి,సోయా, కందిసాగు చేసి న రైతులు మొలకలు సరిగ్గా రాకపోతే ఆ గ్యాప్ ఫిల్ చేసుకునేందుకు మళ్లీవిత్తుకోవాలనిసూచిస్తున్నారు. సాధారణం: 419.9 భారీ వర్షాలు పడితేనే.. జిల్లాలో ఇప్పటికీ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. 41 శాతం లోటు ఉంది. భారీ వర్షాలు కురిస్తేనే దానిని పూరించే పరిస్థితులు ఉన్నాయి. రెండు మధ్య తరహా ప్రాజెక్టులు సాత్నాల, మత్తడివాగులో నీటి మట్టం, నీటి సామర్థ్యం ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. చెరువులు 50 శాతం కూడా నిండలేదు. భారీ వర్షాలు కురిసి వాగులు పారితే ఈ జలాశయాల్లో నీరు చేరే పరిస్థితి ఉంది. తద్వారా భూగర్భ జలాలు పెరిగేందుకు దోహద పడతాయి. -
ఓటు హక్కు విలువైంది
తలమడుగు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని మాజీ ఎంపీ, రాజ్గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరా వు అన్నారు. మండలంలోని ఖోడత్, ఉండం, సుంకిడి, లింగి, కుచులాపూర్, పల్సి కే, పల్సి బి, పల్సి తండా, ఉమ్రీ, బరంపూర్, దేవాపూర్ తదితర గ్రామాలలో సర్ ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. బీఎల్వోలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్ర పూరితంగా మైనారిటీ క్రిస్టియన్, కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి అర్హులైన ఓటర్లను జా బితా నుంచి తొలగిపోకుండా చూడాలన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రతాప్, నాయకులు వెంకన్న యాదవ్, తదితరులున్నారు. -
‘హస్తం’లో వర్గపోరు
సాక్షి,ఆదిలాబాద్: ‘మన పార్టీలో కొంతమంది ము ఖ్య నాయకులు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెదులుతున్నారు.. ఇండ్ల పట్టాలు కూడా ఆ ఎమ్మెల్యే చొరవతోనే సాధ్యమైందని బహిరంగంగా చెబుతున్నారు.. జొన్నల కొనుగోలులో కూడా ఎ మ్మెల్యేదే పాత్ర అని అంటున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరు చెప్పాలి.. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి సారథ్యంలో ఇవి జరిగాయని పేర్కొనాలి.. వాస్తవంగా జరిగింది కూడా అదే.. కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను పొగడడం ఏవిధంగా సబబంటూ..’ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఓ బహిరంగ వేదికపై ఆదివారం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓటరు సవరణ ‘సర్’ కార్యక్రమానికి సంబంధించి కార్యకర్తలతో తలమడుగు మండలం భరంపూర్లో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఆరెపల్లి మోహన్ సమక్షంలోనే ఇది జరగడం గమనార్హం. హస్తం పార్టీలో వర్గపోరు తీవ్రతకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ముఖ్య నేతల మధ్య మళ్లీ విభేదాలు తీవ్రమయ్యాయనే చర్చ పార్టీలో సాగుతుంది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య పోరు ఇటీవల ముదిరి పాకాన పడ్డాయని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పార్టీలో అంతా అయోమయం నెలకొందని వారు అభిప్రాయ పడుతున్నారు. ఎవరికి వారే.. సహకార సంఘాల నామినేటెడ్ కమిటీల ఏర్పాటు కోసం ప్రభుత్వం పరిశీలన చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోనూ పలువురు ఈ పదవుల కోసం ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్య నేతల మధ్య విభేదాల కారణంగా ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని పార్టీలో కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఎవరికి వారే జాబితాలు పార్టీ రాష్ట్ర నాయకులకు, జిల్లా ఇన్చార్జి మంత్రికి అందజేస్తుండటం తలనొప్పిగా మారిందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. సంక్షేమ పథకాల అమల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చర్చించుకుంటున్నారు. వీరి మధ్య వైరంతో అర్హులైన వారికి పథకాలు దక్కుతాయో.. లేదోననే సందేహం పలువురు వ్యక్తం చేస్తున్నారు. -
పేదల గుండెల్లో సీఆర్ఆర్ పదిలం
ఆదిలాబాద్టౌన్: మాజీ మంత్రి స్వర్గీయ చిల్కూరి రామచంద్రారెడ్డి పేదల గుండెల్లో పదిలంగా ఉన్నారని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సీఆర్ఆర్ నివాసంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రామచంద్రారెడ్డి వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సీఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తడి వాగు, రిమ్స్తో పాటు జిల్లా అభివృద్ధికి సీఆర్ఆర్ చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్రావు పాటిల్, చంద్రశేఖర్, అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి, శేఖర్, వసీం, ఖీజర్పాషా, నగేష్, అనిల్ పాల్గొన్నారు. సీఆర్ఆర్ సేవలు చిరస్మరణీయం.. సీఆర్ఆర్ సేవలు చిరస్మరణీయమని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. రామచంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ అశోక్, జహీర్, హిమాబిషేక్ రెడ్డి, రాహుల్ పాల్గొన్నారు. -
కలమడుగులో మాయం.. ఆసిఫాబాద్లో ప్రత్యక్షం
జన్నారం: తండ్రికి తెలియకుండా పిల్లలను తల్లి తనతో తీసుకెళ్లడంతో తండ్రితో పాటు పోలీసులు, గ్రామస్తులు హైరానా పడిన ఘటన మండలంలోని కలమడుగులో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపారు. గుడిహత్నూర్కు చెందిన వెలాడి సంతోష్కుమార్ కరీంనగర్లో ఉంటున్నాడు. సోమవారం తన ముగ్గురు పిల్లలతో కలిసి కరీంనగర్ నుంచి గుడిహత్నూర్కు బయల్దేరాడు. జన్నారం మండలం కలమడుగు వరకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దస్తురాబాద్ రోడ్డులో ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడే ఉన్న బెంచీలపై పిల్లలను కూర్చోబెట్టి బయటకు వెళ్లి వచ్చే సరికి పిల్లలు కనిపించలేదు. వెంటనే విషయాన్ని పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఉదయ్కిరణ్ కలమడుగుకు చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులతో పాటు గ్రామస్తులు సైతం పిల్లల కోసం వెతికారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించినా ఆచూకీ దొరకలేదు. పోలీసులు పిల్లల కోసం వెతుకుతూ దస్తురాబాద్ వైపు వెళ్లారు. అక్కడ గొండుగూడకు చెందిన పెద్దలను విచారించగా పిల్లలను వారి తల్లి వెలాడి దేవేంద్ర తన పుట్టిళ్లు ఆసిఫాబాద్కు తీసుకెళ్లినట్లు తెలిపారు. దీంతో ఎస్సై వెంటనే దేవేంద్రకు ఫోన్ చేసి మాట్లాడారు. తన భర్త సంతోష్తో గొడవ కారణంగా పది రోజుల నుంచి ఆయనకు దూరంగా ఉంటున్నానని ఆమె పేర్కొంది. తన పిల్లలు కలమడుగులో ఉన్నట్లు తెలియడంతో అక్కడికి వచ్చి తండ్రికి తెలియకుండా వారిని తన వెంట తీసుకెళ్లినట్లు దేవేంద్ర అంగీకరించింది. దీంతో తండ్రి, గ్రామస్తులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
వరప్రదాయిని.. వెలవెల
భైంసా: ఉత్తర తెలంగాణకు జీవనాడిగా, రైతాంగానికి వరప్రదాయినిగా పేరొందిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల దాటినా ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో వరద ప్ర వాహం చేరకపోవడంతో నీటి నిల్వలు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చేరాయి. మహా రాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై ప్రారంభం నుంచి ఎత్తి ఉంచినప్పటికీ, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవడంతో గోదావరిలో వరద ఉధృతి పెరగలేదు. ఫలితంగా ఎస్సారెస్పీకి ఆశించిన మేర నీటి చేరిక లేక రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఐదేళ్లలోనే అత్యల్ప నిల్వలు.. ఈ ఏడాది నమోదైన నీటి నిల్వలు గత ఐదేళ్లతో పోలిస్తే అత్యల్పంగా ఉన్నాయి. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి 2,083 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. అవుట్ఫ్లో 751 క్యూసెక్కులు కొనసాగుతోంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తికి 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు. ఇటీవలి రోజులతో పో లిస్తే ఇన్ఫ్లో పెరిగినా, నిల్వలను గణనీయంగా పెంచేంత స్థాయిలో వరదలు మాత్రం ఇంకా రావడం లేదు. 18 లక్షల ఎకరాల ఆయకట్టు.. ఎస్సారెస్పీ కింద సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉ మ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాల వ్యవసాయం ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంది. పంటల సాగుకు మాత్రమే కాకుండా ఉత్తర తెలంగాణ వ్య వసాయ ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా నిలుస్తోంది. నీటి నిల్వలు ఇలాగే కొనసాగితే ఖరీఫ్ సాగు నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథకు కీలకమే.. ఎస్సారెస్పీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని అనేక గ్రామాలు, పట్టణాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు కూడా ఈ ప్రాజెక్టు నుంచే సరఫరా అవుతోంది. దీంతో నిల్వలు తగ్గడం వ్యవసాయంతో పాటు తాగునీటి నిర్వహణపైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర ఎగువ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి గోదావరిలో భారీ వరదలు వస్తేనే ఎస్సారెస్పీకి మళ్లీ జలకళ వచ్చే పరిస్థితి ఉంది. ఉత్తర తెలంగాణ రైతుల చూపంతా ఇప్పుడు గోదావరి వరదలపైనే నిలిచింది. భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టు నిండితేనే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్పై నెలకొన్న అనిశ్చితి తొలగే అవకాశం ఉందని రైతులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ వివరాలు (సోమవారం ఉదయం 6 గంటల నాటికి).. పూర్తి స్థాయి నీటిమట్టం: 1091 అడుగులు ప్రస్తుతం: 1064.40 అడుగులు నీటి నిల్వ సామర్థ్యం: 80.50 టీఎంసీలు ప్రస్తుతం: 15.274 టీఎంసీలుగత కొన్నేళ్లుగా నీటి నిల్వ (టీఎంసీలలో).. 2022 64.677 2023 42.452 2024 22.436 2025 21.029జూన్ 1 నుంచి జూలై 20 వరకు ఎస్సారెస్పీలోకి మొత్తం 2.574 టీఎంసీల నీరు మాత్రమే కొత్తగా చేరింది. కాగా మిషన్ భగీరథ, విద్యుత్ ఉత్పత్తి, తదితర అవసరాల కోసం 3.644 టీఎంసీల నీటిని విడుదల చేశారు. చేరిన నీటి కంటే విడుదలైన నీరే ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు నిల్వలు రోజురోజుకూ తగ్గుముఖం పట్టాయి. ప్రాజెక్టులో ప్రస్తుతం ఐదో వంతు నీరు కూడా నిల్వ లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. -
సీసీఐ పునరుద్ధ్దరణకు ఉద్యమిద్దాం
ఆదిలాబాద్టౌన్: సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఐక్యంగా ఉద్యమించాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఫ్యాక్టరీ పునరుద్దరణ, ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై సోమవారం జిల్లా కేంద్రంలోని సుందర య్య భవనంలో చర్చా గోష్టి నిర్వహించారు. ప లువురు మేధావులు, కళాకారులు, ఆయా సంఘాల నాయకులు పాల్గొని సీసీఐ పునరుద్ధరణకు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఉద్యమించా లని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రామ న్న మాట్లాడుతూ, 13 ఏళ్లుగా కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ సర్కారు సీసీఐపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదన్నారు. 2022లో సీసీఐ సాధన సమితి ఏర్పాటు చేసి సిమెంట్ ప రిశ్రమ పునఃప్రారంభం కోసం ఉద్యమిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి సీసీఐ పునరుద్దరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీసీఐ సాఽ దన సమితి కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కో కన్వీ నర్ నారాయణ, బండి దత్తాత్రి, నగేష్, సంగెపు బొర్రన్న, నారాయణ, మంజుల, స్వప్న, కిరణ్, సచిన్, వెంకటనారాయణ పాల్గొన్నారు. -
అక్రమంగా కలప రవాణా.. వాహనం సీజ్
జన్నారం: వాహనంలో సెంట్రింగ్ సామగ్రి కింద అక్రమంగా టేకు కలప, ఫర్నీచర్ తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం సెంట్రింగ్ వాహనంలో కలప తరలిస్తున్నారనే సమాచారంతో ఇందన్పల్లి అటవీ రేంజ్ పరిధిలోని కలమడుగు చెక్పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. జన్నారం నుంచి వెళ్తున్న మినీ వ్యాన్ తనిఖీ చేయగా అడుగున టేకు దుంగలు, ఫర్నీచర్ లభ్యమయ్యాయి. కాగా అధికారులు తనిఖీ చేస్తుండగా వాహనాన్ని వదిలి డ్రైవర్తో పాటు మరో వ్యక్తి పరారయ్యారు. కలపతో పాటు వాహనాన్ని సీజ్ చేశామని, కలప విలువ సుమారు రూ. 60 వేలు ఉంటుందని రేంజ్ అధికారి తెలిపారు. ఎఫ్ఎస్వో మధుకర్, బీట్ అధికారులు పోచయ్య, తన్వీర్ పాషా, బేస్ క్యాంప్ వాచర్లు ఉన్నారు. -
నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
ఆదిలాబాద్రూరల్: నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం మావల పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 18న ఆదర్శ్నగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తులు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరించారు. కేసు నమోదు చేసుకున్న మావల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారంతో దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా షిండే సునీల్ అలియాస్ రాకీ, కుమ్రే సుజల్ యురాజ్, మార్జివే శేఖర్, గైక్వాడ్ లక్ష్మణ్లను నిందితులుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి 36 గ్రాముల బంగారం, 25.5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరు మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్నగర్, టైలర్స్ కాలనీల్లో జరిగిన పలు ఘటనల్లో పాల్గొన్నట్లు అంగీకరించారు. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో నమోదైన ఇతర చోరీ కేసుల్లోనూ వీరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు షిండే సునీల్పై మహారాష్ట్రలోని వార్ధా, యవత్మాల్ జిల్లాల్లో ఎనిమిది దొంగతనం కేసులు, మరో నిందితుడు కుమ్రే సుజల్పై మూడు కేసులు నమోదైనట్లు వివరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, మావల సీఐ ప్రేమ్కుమార్, ఎస్సై రాజశేఖర్రెడ్డి, పోలీసు సిబ్బంది షబ్బీర్, సట్ల శ్రీను, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
చిమ్మన్గూడలో కార్డెన్ సెర్చ్
సిరికొండ: మండలంలోని చిమ్మన్గూడ గ్రామంలో సోమవారం ఉదయం వేకువజామున ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతీ ఇంటిని తనిఖీ చేయగా నలుగురు నిందితుల నుంచి 10 లీటర్ల గుడుంబా, 50 లీటర్ల గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం ఊట, 3 క్వింటాళ్ల ఇప్పపువ్వుతో పాటు ఓ బెల్ట్ షాపులో 3.5 లీటర్ల అక్రమ మద్యం లభ్యమైంది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా సరైన పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సీఐ మాట్లాడుతూ ఎవరైనా గుడుంబా తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బైక్ అదుపుతప్పి ఒకరికి గాయాలు
ఆదిలాబాద్(బేల): మండలంలోని దహెగాం క్రాస్ వద్ద సోమవారం బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఒకరు గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భోరజ్ మండలంలోని సావాపూర్ గ్రామానికి చెందిన శంకర్ దహెగాం నుంచి తన స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, దహెగాం క్రాస్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో అతని తలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. -
సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలి
ఆదిలాబాద్టౌన్: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అ న్నమొల్ల కిరణ్ అన్నారు. ఈ మేరకు సోమవా రం కలెక్టరేట్లో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాద, సహజ మరణం, శాశ్వత, పా క్షిక అంగవైకల్యానికి సంబంధించిన సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడంతో నిర్మాణ రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జీవో నం.12 రద్దు చేసి సంక్షేమ పథకాల అమలును వెల్ఫేర్ బోర్డుకే అప్పగించాలని, రెన్యువల్ కాని 13 లక్షలకు పైగా లేబర్ కార్డులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో దిశాంత్, అశోక్ తదితరులున్నారు. -
జీపీడీపీ ప్రకారం ప్రణాళికలు రూపొందించాలి
గుడిహత్నూర్: గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) ప్రకారం కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నరసింహులు అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచ్లు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయితీ ప్రగతి దిశగా సాగాలంటే ఎలాంటి ప్రణాళికలు అవసరమో వాటిని స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో రూపొందించి నివేదికలు పంపాలని సూచించారు. పల్లెల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారానే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాభివృద్ధిలో ప్రతి పౌరుడిని భాగస్వాములను చేయాల్సిన బాధ్యత సర్పంచులు, కార్యదర్శులదేనని స్పష్టం చేశారు. పనితీరులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో మాణిక్ ప్రభు, ఎంపీవో దిలీప్కుమార్, ఏవో భగత్ రమేశ్, ఎంఈవో గోపాల్ సింగ్ తిలావత్, కార్యదర్శులు పాల్గొన్నారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధి గద్దెరాగిడిలోని జీఆర్ఎం టౌన్షిప్లో చోరీ జరిగింది. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి బొమ్మ మొగిలి రెండు రోజుల క్రితం ఊరికి వెళ్లి సోమవారం తిరిగి ఇంటికి రాగా తాళం పగులగొట్టి తలుపులు తెరిచి ఉండటంతో పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసి ఉండటాన్ని గుర్తించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా ఓ ఎల్ఈడీ టీవీతో పాటు గళ్ల గురిగిలో దాచిన సుమారు రూ.50వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు పట్టణ ఎస్సై శ్రీధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పశువైద్యం అంతంతే!
ఇచ్చోడ: జిల్లాలో పశువైద్య సేవలు అంతంత మాత్రంగా మారాయి. వైద్యపోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. తద్వారా సేవలపై ప్రభావం చూపుతోంది. ఇక్కడి రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ చేస్తుంటారు. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా ఆర్థికభారం నుంచి గట్టెక్కడానికి ఇది కొంత దోహదపడనుంది. అయితే జిల్లా వ్యాప్తంగా పశువైద్యాధికారుల పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి. దీంతో సకాలంలో సరైన వైద్యం అందక మూగజీవాలు మృత్యవాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదనపు బాధ్యతలు.. జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో పశువైద్యాధి కారులు లేక పోవడంతో ఉన్నవారితోనే ఆ శాఖ నె ట్టుకోస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో పలు మండలా ల్లో రెగ్యులర్ వైద్యులు లేక ఉన్న వారికే అదనపు బాఽ ద్యతలు ఇవ్వడంతో వారు పూర్తిస్థాయిలో సేవలు అందించలేక పోతున్నారు. వారు దూరభారం, అదనపు బాధ్యతలతో సతమతమవుతున్నట్లు తెలు స్తోంది. ఇచ్చోడలో పనిచేస్తున్న పశువైద్యాధికారి ఇటీవల నేరడిగొండ మండలంలోని వాంకిడికి బది లీ అయ్యారు. ఆయన స్థానంలో ఇచ్చోడకు ఎవరూ రాకపోవడంతో బేల పశువైద్యాధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే బజార్హత్నూర్ పశువైద్యాధికారిని ఇటీవల భోరజ్ మండలంలోని గిమ్మకు బదిలీ చేశారు. ఆయనకే బజార్హత్నూర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంద్రవెల్లి పశువైద్యాధికారికి సిరికొండకు అదనపు బాధ్యతలు అప్పగించారు. భీంపూర్ పశువైద్యాధికారి ఇటీవల బదిలీపై వేరే జిల్లాకు వెళ్లగా తాంసి పశువైద్యాధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. వెక్కిరిస్తున్న ఖాళీలు.. జిల్లాలో బోథ్, భీంపూర్, సిరికొండ, ఇచ్చోడ, బజా ర్హత్నూర్, గాదిగూడ, తాడిహత్నూర్, నార్నూర్ మండలాల్లో పశువైద్యాధికార పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అదనపు బాధ్యతలు అప్పగించిన వైద్యులు సమయానికి రాక పోవడంతో అటెండర్లే పశువులకు వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఉన్నవారికే అదనపు బాధ్యతలు.. జిల్లాలో ఎనిమిది పశువైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో కొంత మంది సొంత జిల్లాలకు వెళ్లారు. ఈ క్రమంలో ఉన్న వారికే అదనపు బాధ్యతలు అప్పగించి సేవలకు ఆటంకం కలగకుండా చూస్తున్నాం. – రామారావు, జిల్లా పశువైద్యాధికారి పశుసంపద వివరాలు ఆవులు 3.50 లక్షలు మేకలు 2.50 లక్షలు గొర్రెలు 85 వేలు గేదెలు 51 వేలు జిల్లాలో పశువైద్యశాలలు 22వైద్యుల సంఖ్య 14ఖాళీలు 8 -
సింగరేణి స్క్రాప్ పట్టివేత
శ్రీరాంపూర్: ఏరియాలోని ఎస్ఆర్పీ 3 గని సమీపంలో సింగరేణి స్క్రాప్ను ఎస్అండ్పీసీ విభాగం సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఆదివారం రాత్రి ఎస్ఆర్పీ 3 గనిలో దొంగలు దూరి స్క్రాప్, విద్యుత్ కేబుల్ చోరీ చేసేందుకు ప్రయత్నించారు. గమనించిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డు వెంటనే మొబైల్ టాస్క్ఫోర్సుకు సమాచారం అందించారు. వారు గని లోపలికి వచ్చే సరికి దొంగలు జారుకున్నారు. గని పరిసరాల్లో వెతకగా సుమారు 60 మీటర్ల డ్రిల్ కేబుల్ లభ్యమైంది. అనంతరం బంకర్పై ఉన్న ఎస్డీఎల్ యంత్రం కేబుల్ చోరీకి గురైనట్లు గుర్తించి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు మళ్లీ సోదాలు చేశారు. ఈ క్రమంలో గని మెయిన్ సబ్స్టేషన్ వద్ద ఆటో అనుమానాస్పదంగా కనిపించింది. దీన్ని వెంబడించి పట్టుకోగా ఆటోలో సుమారు రూ. 60 వేల విలువ చేసే ఐరన్స్క్రాప్, డ్రిల్ మిషన్ కేబుల్ స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ శ్రీధర్ను పట్టుకోగా రమేశ్ అనే దొంగ పరారయ్యాడు. ఆటోతో పాటు డ్రైవర్ను శ్రీరాంపూర్ పోలీసులకు అప్పగించినట్లు సెక్యూరిటీ అధికారులు పేర్కొన్నారు. -
గురి తప్పొద్దు..
ఫైరింగ్ చేస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్ ఫైరింగ్లో గురి తప్పొద్దని, దృష్టి పెడితే బుల్లెట్ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోని పోలీస్ ఫైరింగ్ మైదానంలో నాలుగు రోజులుగా జిల్లాలోని కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి వరకు వార్షిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ముగింపు కార్యక్రమానికి ఎస్పీ పాల్గొని ఫైరింగ్లో మెలకువలు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రిత్విక్ సాయి, డీఎస్పీలు వెంకటనర్సయ్య, జీవన్రెడ్డి, ఇంద్రవర్ధన్, సీఐలు తదితరులు పాల్గొన్నారు. – తలమడుగు -
అత్యాచారయత్నం కేసులో జరిమానా
ఆదిలాబాద్టౌన్: అత్యాచారయత్నం కేసులో నిందితుడికి రూ.20వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె.ప్రభాకర్ రావు తీర్పునిచ్చినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. బోథ్ పోలీస్స్టేషన్ పరిధి లోని సొనాల మండలం పునియా నాయక్ తండా కు చెందిన సోలంకి సుందర్ సింగ్ 2024లో బాధితురాలు కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న సమయంలో ఆమైపె అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అప్పటి బోథ్ ఎస్సై ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో ఎనిమిది మంది సాక్షులను ప్రవేశపెట్టి పీపీ రహీం వాదనలు వినిపించగా నేరం రుజువైంది. ఈ మేర కు జడ్జి తీర్పునిచ్చినట్లు వివరించారు. కేసులో ప్రతి భ కనబర్చిన కోర్టు డ్యూటీ అధికారి, లైజన్ అధి కారులను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. అదృశ్యమైన యువకుడి అనుమానాస్పద మృతినర్సాపూర్(జి): ఇటీవల అదృశ్యమైన మండలంలోని రాంపూర్కు చెందిన యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన పంచగూడ సాయితేజ (26) అనే యువకుడు ఈనెల 16న ఉదయం నుంచి కనిపించడం లేదని యువకుడి తల్లి పంచగూడ ముత్తవ్వ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ సిగ్నల్, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామ శివారులో గల కెనాల్ ఒడ్డుపై అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నట్లు సోమవారం గుర్తించారు. సంఘటన స్థలాన్ని నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై గణేశ్, క్లూస్టీంలు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. యువరైతు ఆత్మహత్యలక్ష్మణచాంద: క్షణికావేశానికి లోనై యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పార్పెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం పార్పెల్లి గ్రామానికి చెందిన మెరుగు గణేశ్ (30) తన స్నేహితుడు అడెల్లి దేవస్థానం వద్ద పండుగ చేస్తున్నాడని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి సాయంత్రం 7.30 గంటలకు మద్యం తాగి ఇంటికి రాగా భార్య మౌనిక ఎందుకు ఇంతలా తాగి వచ్చావని అడిగింది. దీంతో మనస్తాపం చెందిన గణేశ్ క్షణికావేశంలో రూమ్లోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. పిల్లలు గమనించి తల్లికి చెప్పగా ఆమె వచ్చి ఉరి నుంచి కిందకు దించింది. కానీ అప్పటికే గణేశ్ మృతి చెందాడు. తండ్రి భూమన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. లైంగికంగా వేధించారని మహిళ ఫిర్యాదు కడెం: మండలంలోని చిన్నబెల్లాల్ జీపీ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులు, గ్రామ శివారులోని పొదల్లోకి తీసుకెళ్లి తనను లైంగికంగా వేధించారని ఒక మహిళ సోమవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లి గ్రామానికి చెందిన రాందేని రాకేశ్ (25) అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రాకేశ్కు గత ఏడాది ఇదే గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. ఈనెల 19న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్నపాటి గొడవకు భార్య వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాకేశ్ గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. రాకేశ్ తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
గిరిపుత్రులు క్రీడల్లోనూ ముందుండాలి
ఉట్నూర్రూరల్: గిరిపుత్రులు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక పరిశీలకుడు హేమంత్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఆహారం, నిద్ర, నీరు తగినంతగా ఉండాలని సూచించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించడం అభినందనీయమన్నారు. అనంతరం క్రీడల్లో రాణిస్తున్న పాఠశాల విద్యార్థులను సత్కరించారు. ఏపీవో పీవీటీజీ ఆత్రం భాస్కర్, డిప్యూటీడీఈఓ గోడం చందన్, జేడీఏ నాగభూషణం, జిల్లా క్రీడల అధికారి కె.పార్థసారథి, హెచ్ఎం ఆర్.ఉత్తం, హెచ్డబ్ల్యూవో మెస్త్రం గంగారాం, కోచ్లు శివకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఐటీడీఏ పీవో మంద మకరందును కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం మహువా లడ్డూ తయారీ, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఇంద్రవెల్లి: కేస్లాపూర్ నాగోబా ఆలయంలో సోమవారం మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షణ అధికారి హేమంత్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మెస్రం వంశీయులు శాలువాతో ఆయనకు సన్మానం చేశారు. నాగోబా ఆలయాభివృద్ధి, నాగోబా చరిత్ర, నాగోబా జాతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఇంద్రవెల్లి ఐఎఫ్పీసీఎల్ జిన్నింగ్ మిల్లును సందర్శించారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని సందర్శించి అమరులకు నివాళులర్పించారు. ఆశ్రమ పాఠశాలను సందర్శించి తరగతి గదిలో విద్యార్థినులతో కలిసి ఉపాధ్యాయుల బోధన తీరు పరిశీలించారు. ట్రైకార్ డీజీఎం రవికుమార్, ఐటీడీఏ పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, జేడీఎం నాగభూషణం, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. -
సీపీఎస్ రద్దు చేయాలి
ఆదిలాబాద్టౌన్: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని టీఎస్ సీపీఎస్ఈయూ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బాలక్ మందిర్ పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో జ నజాగరణ యాత్ర పోస్టర్ను సోమవారం ఆ విష్కరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సహా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడు తూ పాత పెన్షన్ విధానం అమలు కోరుతూ ఈనెల 24న జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని సంఘాలు మద్దతు పలకాలని కోరారు. కార్యక్రమంలో ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు చరణ్దాస్, పొచ్చన్న, కలీమొద్దీన్, భూమేశ్, వివేక్ భవాని, విజయ్ మోహన్రావు, దేవి దాస్, గీతేశ్వర్, హరిచరణ్, విష్ణు పాల్గొన్నారు. -
బైక్ ఇంజిన్తో కలుపుతీత యంత్రం
కౌటాల: పంటల్లో కలుపుతీత కోసం కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల కష్టాలను దూరం చేసేందుకు ఒక యువరైతు వినూత్నంగా ఆలోచించాడు. మండలంలోని పార్డీ గ్రామానికి చెందిన యువరైతు తొర్రె శ్రీకాంత్ 7వ తరగతి వరకు చదువుకొని వ్యవసాయం చేస్తున్నాడు. శ్రీకాంత్ ప్రస్తుతం సిర్పూర్(టి) మండలం హుడ్కులి గ్రామంలో ఉంటూ తన మూడు ఎకరాల చేనులో పత్తి పండిస్తున్నాడు. ఏటా తన చేనులో కలుపును నిర్మూలించేందుకు పంటకాలంలో నాలుగుసార్లు దౌర కొట్టడానికి రూ. 8వేలు ఖర్చు చేసేవాడు. కొన్నిసార్లు దౌరలు, కూలీల కొరతతో పంటలో కలుపు తీయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో కలుపు ఖర్చును తగ్గించుకోవడంతో పాటు కూలీలు, అరకలపై ఆధారపడకుండా ఉండేందుకు పాత బైక్ ఇంజిన్ను వినియోగించి కలుపుతీత యంత్రాన్ని తయారు చేశాడు. రూ.4వేలతో పాత బైక్ ఇంజిన్ను కొనుగోలు చేసి ఇంజిన్కు చైన్సిస్టమ్ను అనుసంధానం చేసి 1.5 లీటర్ల పెట్రోల్ ట్యాంకును అమర్చి యంత్రాన్ని సిద్ధం చేశాడు. రూ. 9 వేల వ్యయంతో తయారు చేసిన యంత్రం మూడెకరాల పత్తి చేనులోని కలుపును కేవలం రెండు రోజుల్లో రూ.600 పెట్రోల్ ఖర్చుతో పూర్తి చేసిందని శ్రీకాంత్ తెలిపాడు. యువరైతు సృజనాత్మకతతో తయారు చేసిన కలుపు యంత్రం పనితీరును రైతులు ఆసక్తిగా చూసి ఆయనను అభినందిస్తున్నారు. -
బాధితుల పక్షాన పోలీసులు
ఆదిలాబాద్టౌన్: బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించి ప్రజల విశ్వాసం చూరగొనాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్డేలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 49 మంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా, ప్రతీ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
ఆదిలాబాద్టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లయ్ హమాలీలు సోమవారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ సివిల్ సప్లయ్ హమాలీ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ మాట్లాడుతూ, హమాలీలకు ప్రతినెల 10వ తేదీలోపు బిల్లులు చెల్లించి సకాలంలో వేతనాలు అందించాలని డి మాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూ డిన వినతిపత్రాన్ని ఆర్డీవో జగదీశ్వర్రావుకు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జి ల్లా అధ్యక్షుడు ఎం.రమేశ్, ప్రధాన కార్యదర్శి దేవేందర్, నాయకులు షేక్ సలీం, వెంకటేశ్, షేక్ మోసిన్, కిశోర్, రాజేందర్, అహ్మద్, ఊష న్న, తబ్రేజ్, రవి తదితరులు పాల్గొన్నారు. -
వానమ్మా.. ఒక్కసారి వచ్చిపోవమ్మా..
బోథ్: బోనాలతో వెళ్తున్న మహిళలుఇంద్రవెల్లి: పూజలు చేస్తున్న ఆదివాసీలువరుణుడు కరుణించాలని జిల్లాలోని వివిధ గ్రామాల్లో ప్రజలు పూజలు చేస్తున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని 30 గ్రామాల ఆదివాసీలు వడగాం గ్రామ పంచాయతీ పరిధిలోని గజ్జల రాజుల్ దేవతకు పూజలు చేశారు. బోథ్ మండల కేంద్రంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ, రజక సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ, ముత్యాల పోచమ్మకు బోనాలు సమర్పించారు. జైనథ్ మండలంలోని బెల్గాంలో గంగనీళ్లతో గ్రామ దేవతలను అభిషేకించారు. నేరడిగొండలో ముదిరాజ్ కులస్తులు భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. – బోథ్/ఇంద్రవెల్లి/జైనథ్/నేరడిగొండ -
హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలి
ఆదిలాబాద్టౌన్: కార్మికులు హక్కుల సాధనకు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బజరంగ్ ఫంక్షన్ హాల్లో ఏఐటీయూసీ జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి, పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. సమాన పనికి సమాన వేతనం, కార్మిక చట్టాల అమలు, ఉద్యోగ భద్రత, తదితర డిమాండ్ల సాధన కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భారతల గోవర్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్, రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఆదివాసీల హక్కులకు భంగం కలిగిస్తే ఊరుకోం’
నేరడిగొండ: తమ హక్కులకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆదివాసీలు పేర్కొన్నారు. మండలంలోని లఖంపూర్(జి) రాయి సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం ఆదివాసీల అత్యవసర సమావేశం నిర్వహించారు. 32 గ్రా మాల ఆదివాసీ పటేళ్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఆదివాసీ ఉద్యోగులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీల తొమ్మిది తెగల అస్తిత్వ పరిరక్షణ, జాతి మనుగడతో పాటు గ్రామాల పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై విస్తృతంగా చర్చించి కీలక తీర్మానాలు చేశారు. పీచర జీపీ పరిధిలోని లక్ష్మీపూర్, తిమ్మాపూర్ గ్రామాలను కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తరతరాలుగా అడవిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న ఆదివాసీల జీవనాధారాన్ని దెబ్బతీసే విధంగా ఈ నిర్ణయం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన హక్కులను పరిరక్షించేందుకు రాయి సెంటర్ల ఆధ్వర్యంలో ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
‘జీసీసీ డివిజనల్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలి’
ఆదిలాబాద్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇన్చార్జి డివిజనల్ మేనేజర్ (హార్టికల్చర్) గుడిమల్ల సందీప్ కుమార్ను విధుల నుంచి తొలగించి, శాఖాపరమైన విచారణతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని వస్తువులను ప్రొసీడింగ్స్లో చేర్చారని ఆరోపించారు. నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న సదరు అధికారి టెండర్ ప్రొసీడింగ్స్ను స్వయంగా సిద్ధం చేసి, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి సంతకాలు తీసుకున్నారన్నారు. టెండర్లో లేని నాణ్యతలేని కారం పొడి వంటి వస్తువులను ప్రైవేటు కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క సరఫరా చేస్తున్నారన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు వెట్టి మనోజ్, అర్క శేషరావు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు సర్దుబాటు
ఆదిలాబాద్టౌన్: ఎట్టకేలకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. టీచర్ల కొరతతో కొన్ని పాఠశాలల్లో ఇబ్బందులు తలెత్తాయి. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ గతనెలలోనే సర్దుబాటు చేపట్టాలని ఆదేశించినప్పటికీ ఈ ప్రక్రియలో జాప్యం జరిగింది. శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి సర్దుబాటు ప్రక్రియకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు కేటాయించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి ఎక్కువ మొత్తంలో విద్యార్థులు ఉన్న బడులకు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు కేటాయించారు. మొత్తం 55 మంది ఉపాధ్యాయులకు సర్దుబాటు చేపట్టారు. ఇందులో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు ఉన్నారు. అయితే ఆయా మండలాల పరిధిలో అవసరం ఉన్న ఉపాధ్యాయులు 34 మందిని సర్దుబాటు చేయగా, ఇతర మండలాలకు, పక్క మండలాలకు 21 మందిని సర్దుబాటు చేశారు. సంబంధిత మండలాల విద్యాధికారులకు వీటికి సంబంధించిన జాబితాను పంపించారు. అయితే కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు అవసరం ఉన్నప్పటికీ కేటాయించకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేటట్టు కానరావడం లేదు. కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ఇటీవల విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు చూపించి ఆ పోస్టును వదలకుండా చూస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా ఈ ప్రక్రియ ద్వారా అవసరం ఉన్న పాఠశాలలకు టీచర్లను కేటాయించడంతో విద్యార్థులకు మేలు జరగనుంది. గతేడాది దాదాపు 200 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. వారు ప్రస్తుతం అదే పాఠశాలల్లో కొనసాగుతుండగా, కొంతమంది వారు పనిచేసే పాఠశాలలకు వెళ్లిపోయారు. నేటి నుంచి కేటాయించిన స్థానాల్లో.. సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులకు కేటాయించిన పాఠశాలల్లో విధులు నిర్వహించాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా వెళ్లకపోతే శాఖపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. సోమవారం నుంచి సంబంధిత పాఠశాలలకు వెళ్లి విద్యాబోధన చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 3066 పోస్టులు ఉండగా, 2602 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 464 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు విద్యాశాఖ కార్యాలయంలో కొందరు ఫారెన్ సర్వీస్, మరికొందరు డిప్యూటేషన్లో పనిచేస్తున్నారు. డైట్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లను నియమించకపోవడంతో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ విధులు కేటాయించారు. ఏఎంఓ పోస్టుతో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ ఏఎంఓలు డిప్యూటేషన్పై ఉన్నారు. గతంలో ఈ పోస్టులో ఒక్కరే పనిచేస్తుండగా, అదనంగా అసిస్టెంట్ ఏఎంఓలను నియమించడంపై పలువురు ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యాబోధన కోసం కేటాయించిన ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయంలో సిబ్బందిగా విధులు నిర్వహించడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై జిల్లా విద్యా శాఖాధికారి మాధవిని వివరణ కోరగా, జిల్లాలో 55 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినట్లు తెలిపారు. గతేడాది సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులు యధావిధిగా పనిచేస్తున్నారన్నారు. పాఠశాలల అవసరాన్ని బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం జరిగిందని వివరించారు. -
‘ఉదారి’కి ముల్కనూర్ కథా పురస్కారం
ఆదిలాబాద్: జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డా.ఉదారి నారాయణ ప్రతిష్టాత్మక ‘ముల్కనూర్ కథా పురస్కారం’ అందుకున్నారు. హన్మకొండ జిల్లా ముల్కనూర్లో ఆదివారం నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవ వేడుకల్లో ప్రముఖ ప్రకృతి కవి జయరాజు, ముల్కనూర్ సంస్థ చైర్మన్, ఐఏఎస్ అధికారి వేముల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై పురస్కారం అందజేశారు. ఇందులో భాగంగా రూ.5 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. సాహితీ రంగంలో తనదైన ముద్రవేస్తూ, ప్రాంతీయ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న డా.ఉదారి ఈ పురస్కారాన్ని అందుకోవడంపై పలువురు కవులు, రచయితలు, ‘ఐత్యారం ముచ్చట్లు’ వేదిక సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
ఎరువు.. ధరువు!
బోథ్:పెరిగిన ఎరువుల ధరలతో జిల్లా రైతాంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధం కారణంగా ఎరువుల కంపె నీలు ధరలు విపరీతంగా పెంచాయి. కాంప్లెక్స్, ఎస్ఎస్పీ (సింగిల్ సూపర్ ఫాస్ఫేట్), ఎంవోపీ (మ్యూరేటాఫ్ పొటాష్) ఎరువులలో రకాన్ని బట్టి ధరలు పెరిగిపోయాయి. నాలుగేళ్లలోనే ఐదుసార్లు ధరలు పెరగ్గా, తాజా పెంపుతో కొన్ని రకాల ఎరువుల ధరలు ఏకంగా రెట్టింపయ్యా యి. వానాకాలం సీజన్ ప్రారంభంలోనే ఎరువుల ధరలు పెరగడంతో సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంప్లెక్స్ ధరలు ౖపైపెకి.. కేంద్ర ప్రభుత్వం డై అమోనియా ఫాస్ఫేట్ (డీఏపీ) సరఫరా, రాయితీలను పెంచడం వల్ల దాని ధరలో ప్రస్తుతానికి మార్పు రాలేదు. ప్రస్తుతం జిల్లా మార్కెట్లో డీఏపీ బస్తా రూ.1,350 నుంచి రూ.1,450కే లభిస్తున్నప్పటికీ, మిగిలిన ఎరువుల ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అయినప్పటికీ పత్తి, సోయాబీన్ వంటి పంటల దిగుబడి కోసం దుక్కిలోనే వేయాల్సిన కాంప్లెక్స్ ఎరువులను రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో దాదాపు 5,45,643 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. తాజా ధరల పెరుగుదలతో జిల్లా రైతాంగంపై ఏడాదికి రూ.75 కోట్లకు పైగా అదనపు ఆర్థిక భారం పడనుంది. రైతుపైనే రవాణా చార్జీల భారం ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం జిల్లాలో ఎరువుల సరఫరాపై మరింత ప్రభావం చూపనుంది. మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా రేక్ పాయింట్ల నుంచి విక్రయ కేంద్రాలకు అందించే ఎఫ్ఓఎల్ (ఫ్రైట్ ఆన్ లారీ) రవాణా రాయితీని నిలిపివేస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి ఈ నెల 8న ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ప్రైవేటు డీలర్లు, ప్యాక్స్, డీపీఎంఎస్, ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాలు, హాకా, ఎఫ్పీవోలు రేక్ పాయింట్ల నుంచి రవాణా ఖర్చులను సొంతంగా భరించాల్సి వస్తుంది. రేక్ పాయింట్ల నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని మండలాలు, ఇతర గ్రామాలకు ఎరువులను తరలించడానికి బస్తాకు రూ.20 నుంచి రూ.40 వరకు అదనపు ఖర్చు అవుతుంది. ఈ రవాణా భారాన్ని కూడా వ్యాపారులు చివరకు జిల్లా రైతులపైనే మోపుతున్నారు. యూరియా అతివాడకంతో దెబ్బతింటున్న భూసారం కాంప్లెక్స్ ఎరువుల ధరలు భరించలేక, పంటలకు విచ్చలవిడిగా యూరియాను వాడటం వల్ల భూసారం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించి యూరియా వాడితే తాత్కాలికంగా పంట పచ్చగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో నేలసారం తీవ్రంగా క్షీణించి దిగుబడులు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎరువులు పాతధర కొత్తధర పెరుగుదల 20–20–0–13 1,500 2,150 650 10–26–26 1,950 2,450 500 16–16–16 1,675 2,050 375 24–24–0 2,000 2,300 300 12–32–16 1,900 2,450 550 14–35–14 1,350 1,900 550 ఎంవోపీ 1,850 1,975 125పెరిగిన ఎరువుల ధరలు ఇలా.. -
ముందుగా గర్భిణుల నమోదుతోనే..
మంచిర్యాల జిల్లాలో హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి రెగ్యులర్గా చెకప్లు చేయించడం, ప్రసవం అయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవడంతోనే మృత శిశు మరణాలు తగ్గాయి. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు ముందుగానే రక్తం ఎక్కించేలా ఏర్పాట్లు చేయడం, సరైన పౌష్టికాహారం తీసుకునేలా వైద్య సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలతో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం చేస్తున్నాం. ఇద్దరు గైనకాలజిస్టులు, మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో గర్భం దాల్చిన నుంచి ప్రసవం అయ్యే వరకు పరీక్షించడం వంటి చర్యలు తీసుకున్నాం. – డాక్టర్ నరేందర్రాథోడ్, మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
చివరి మజిలీలో అన్నీ తామై..
125 మృతదేహాలకు..2014 సంవత్సరంలో ఏర్పడిన ఈ స్వచ్ఛంద సంస్థ ఇప్పటివర కు 125 మృతదేహాలకు అంతి మ సంస్కారాలు నిర్వహించింది. వృత్తిలో బిజీగా ఉన్నా ఏనా డూ ఈ సేవా కార్యక్రమాలకు వెనుకంజ వేయలేదు. మహారా ష్ట్రకు చెందిన పేద కుటుంబాలు రిమ్స్లో చికిత్స కోసం వచ్చినప్పుడు మరణించిన ఘటనలు అనేకంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో మృతదేహాన్ని స్వస్థలానికి తరలించలేని పేదలకుసైతం ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. కులమత బేధం లేకుండా అన్ని మతా లకు సంబంధించి వారి సంప్రదాయబద్దంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం అభినందనీయం. -
సమాజాభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర కీలకం
ఉట్నూర్రూరల్: గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమ ఫలాలు ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. ఉట్నూ ర్ కేబి కాంప్లెక్స్లోని సమావేశ మందిరంలో గిరిజన ఏజెన్సీ మండలాలకు చెందిన పాత్రికేయులతో శనివారం నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అవగాహన కల్పించడంలో మీడియా సహకారం అవసరమని అన్నారు. సమావేశంలో అదనపు పౌర సంబంధల అధికారి వై. సంపత్కుమార్, ఐటీడీఏ అధికారులు, గిరిజన ఏజెన్సీ మండలాలకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. -
రీసర్వే గడువులోపు పూర్తి చేయాలి
● కలెక్టర్ రాజర్షిషాఆదిలాబాద్టౌన్: భూభారతిలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన భూముల రీసర్వే గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సర్వే పురోగతిపై శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి పారదర్శకమైన భూరికార్డుల కోసం ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపడుతుందని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. డ్రోన్ సర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సర్వేలో సాంకేతిక లోపాలతో పాటు సమస్యలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆర్డీవో, ల్యాండ్ సర్వే ఏడీలను ఆదేశించారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలు, వినతులను పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. ప్రతి గ్రామంలో సరిహద్దు గుర్తింపులు పక్కాగా జరగాలని, సర్వే రికార్డులు డిజిటలైజేషన్ చేయాలని, ఎక్కడ తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డీవో జగదీశ్వర్రావు, ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇతర సేవల్లోనూ ముందు..
అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో పాటు పలు సేవ కార్యక్రమాల్లో సైతం వీరు ముందుంటున్నారు. ఆకలితో అలమటిస్తున్న పేదలకు సొంత ఖర్చుతో భోజనం పెట్టడం, పండుగల సమయంలో వృద్ధాశ్రమాల్లో వృద్ధులతో కలిసి జరుపుకోవడం ప్రత్యేకం. రిమ్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అన్నదానం నిర్వహించడం, యాచకులకు చలికాలంలో బ్లాంకెట్లు, వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, కరోనా సమయంలో పేదలకు సరుకులు పంపిణీ చేయడం వంటి అనేక సేవ కార్యక్రమాలను చేపట్టారు.చిన్నారి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్తున్న సంస్థ సభ్యురాలు (ఫైల్) అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా చివరి వీడ్కోలు పలుకుతూ సేవే పరమోధర్మం అంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఆ నలుగురు. మరణించిన తర్వాత అంత్యక్రియలు చేసేవారు లేక ఆస్పత్రి, మార్చురీ, రహదారులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న మృతదేహాలకు అన్ని తామై సంప్రదాయబద్దంగా అంతిమ సంస్కారం నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలోనూ తమ సేవానిరతిని చాటి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న వారే ‘మానవ సేవే మాధవ సేవ’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. – ఆదిలాబాద్టౌన్ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మానవ సేవే మాధవ సేవ స్వచ్ఛంద సంస్థను 2014లో నలుగురితో ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యురాలైన శశి కళ ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న చిందం దేవిదాస్తో పాటు మరో ఇద్దరు శ్రీపాద శ్రీనివాస్, రాజు ఈ సేవ కార్యక్రమాల్లో ముందుంటున్నారు. జిల్లాలోని ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో గుర్తు తెలియని శవాలు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినవారు, ఆస్పత్రిలోని మార్చురీలో రోజుల తరబడి ఉన్నటువంటి గుర్తు తెలియని మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అలాగే డబ్బులు లేని వారు వీరిని సంప్రదిస్తే వారి సంప్రదాయబద్దంగా నిర్వహించేందుకు సైతం ముందుంటున్నారు. ఆర్ఐతో పాటు కానిస్టేబుల్ సొంత డబ్బులతో వీటిని చేపడుతున్నారు. కట్టెలు, బట్ట, పూలు, ఇతరత్రా దాదాపు రూ.4వేల వరకు ఖర్చవుతుంది. శవయాత్ర వాహనాల్లో మృతదేహాలను శ్మశానవాటికకు తరలించి అక్కడ అంతిమ కార్యం పూర్తి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పాడెమోస్తూ తీసుకెళ్లి చివరి మజిలో భాగస్వాములవుతున్నారు. -
జయహో జగన్నాథా
జగన్నాథుని నామస్మరణతో ఆదిలాబాద్ పురవీధులు మారుమోగాయి. శనివారం ఇస్కాన్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూరి జగన్నాథుని రథయాత్ర నేత్రపర్వంగా సాగింది. సోదరుడు బలబద్ర, సోదరి సుభద్రలతో కలిసి కొలువుదీరిన ఆ దేవదేవుని రథాన్ని లాగేందుకు భక్తజనం పోటీ పడ్డారు. ముందుగా శ్రీ ప్రణవానంద ప్రభూజీ ఉత్సవ విగ్రహాలను రథంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ బద్ధంగా చీపుల్లను చేత పట్టి ఊడస్తూ ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ రథయాత్రను ప్రారంభించారు. మథుర జిన్నింగ్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌక్, గాంధీచౌక్, అశోక్రోడ్డు, గోపాలకృష్ణ మఠం, నేతాజీ చౌక్ మీదుగా శోభాయమానంగా సాగింది. మహిళలు, చిన్నారులు భజన సంకీర్తనలు చేయగా, యువతులు లయబద్ధంగా నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. హరే రామ...హరే కృష్ణ, జై జగన్నాథ అంటూ జయజయ ధ్వానాలు చేస్తూ భక్తజనం పులకించిపోయారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పూరి జగన్నాథుని కథా శ్రవణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ప్రమోద్కుమార్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. – ఆదిలాబాద్ -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ఆదిలాబాద్టౌన్: పోలీసులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్లో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని శనివారం ప్రారంభించారు. ఆయా విభాగాలకు చెందిన 10 మంది స్పెషలిస్టు వైద్యులు సేవలు అందించారు. సుమారు 250 మంది సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిదని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు ఇంద్రవర్ధన్, పెంచాల వెంకటేశ్వర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, సీఐలు ఫణిదర్, జి.శ్రావణ్, యశోద ఆస్పత్రి వైద్యులు, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గంజాయి రహిత సమాజమే లక్ష్యం బోథ్: గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సొనాల మండలం గుర్రాలతండా గ్రామంలో శనివారం ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన 20 సీసీ మెరాలను ప్రారంభించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువత, ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అనంతరం 20 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, బోథ్ సీఐ గురుస్వామి, ఎస్సై పురుషోత్తం, సర్పంచులు దినేష్, ఎం.రమాదేవి, గ్రామ నాయక్ తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు. బోథ్లో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ టోర్నీలో విజేత జట్టుకు ఎస్పీ బహుమతి ప్రదానం చేశారు. బోథ్ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులను ఎస్పీ అభినందించారు. -
కార్మిక వ్యతిరేక విధానాలు వీడనాడాలి
ఆదిలాబాద్టౌన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు వీడనాడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ అన్నా రు. సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో శనివారం జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ సర్కారు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ చట్ట సవరణలను ఉపసంహరించుకోవాలని, పాత ఉపాధిహామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించే ‘జైల్ భరో’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. ఇందులో సంఘం జిల్లా కార్యదర్శి లంకా రాఘవులు, జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్, ఆశన్న, స్వామి, మంజుల, పాల్గొన్నారు. -
రక్తదానం సామాజిక బాధ్యత
ఆదిలాబాద్టౌన్: రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి ముందుకు రావాలని డీఎంహెచ్వో సాధన అన్నారు. రిమ్స్ ఆడిటోరియంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో కలిసి ప్రారంభించా రు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు పండ్లు అందించి అభినందించారు. అలాగే సర్టిఫి కెట్లు అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల సభ్యులు బాలశంకర్ కృష్ణ, ఠాకూర్ ప్రతాప్ సింగ్, ప్రశాంత్, రక్తదాతలు, రిమ్స్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. -
విశ్వాసం పెరిగేలా సేవలందించాలి
ఉట్నూర్రూరల్: పోలీసుశాఖపై మరింత వి శ్వాసం పెరిగేలా సేవలందించాలని ఎస్పీ అ ఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భా గంగా ఉట్నూర్ ఏఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టేను అడిగి వివరా లు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును న మోదు చేసి సంబంధిత అధికారుల ద్వారా సత్వర పరిష్కారం అందించేలా చర్యలు తీ సుకోవాలన్నారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించినప్పుడే పోలీసు శాఖపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సీఐలు ఎం ప్రసాద్, సీహెచ్ రమే శ్, కె నరేశ్, ఎస్సైలు సాయన్న, ఇమ్రాన్, ఎల్ శ్రీకాంత్, విక్రమ్, విజయ్, ఉన్నారు. -
నీట్ ఫలితాల్లో ఎస్ఆర్ ప్రతిభ
ఆదిలాబాద్టౌన్: నీట్ ఫలితాల్లో ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు ప్ర తిభ కనబర్చారు. 720మార్కులకు గాను పెర్క సంజన 501,వైలె దివ్య 449, వొర్స సాయితేజ 405, గోడ్సే అక్షర 344, ఎస్.మయూరి 329, జ్యోత్స్న 324, అక్షర 322 మార్కులు సాధించినట్లు కళాశాల జోనల్ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి తె లిపారు. విద్యార్థులు ఎలాంటి కోచింగ్ లేకుండా మంచి మార్కులు సాధించారని పేర్కొన్నా రు. ఇంటర్ చదువుతూనే ఏటా పదుల సంఖ్య లో విద్యార్థులు నీట్, జేఈఈ పరీక్షల్లో అర్హత సా ధిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. డీన్ రాంబాబు, ప్రిన్సిపాల్లు జైపాల్రెడ్డి, అరవింద్, లలిత తదితరులున్నారు. -
ఆదివాసీ సమస్యల పరిష్కారానికి కృషి
ఉట్నూర్రూరల్: ఆదివాసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మండలంలోని కుమ్మరికుంట గ్రామాన్ని కమిషన్ సభ్యులు, ఐటీడీఏ పీవో మకరందుతో కలిసి శుక్రవారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శాశ్వత గృహాల అవసరం, భూమి, నివాస హక్కులు, తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి సమస్యలను దృష్టికి తెచ్చారు.వాటిని శ్రద్ధగా విన్న చైర్మన్ సంబంధిత శాఖల అధికారులతో చర్చించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ, అట వీ, వైద్య ఆరోగ్య, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గిరిజన సంస్కృతికి ప్రతీక నాగోబాఇంద్రవెల్లి: గిరిజన సంస్కృతికి ప్రతీక నాగోబా అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కమిషన్ స భ్యులతో కలిసి శుక్రవా రం కేస్లాపూర్లోని నా గోబా ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు వారికి నాగో బా ప్రతిమ అందించి స న్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. గిరిజనుల ఆధ్యాత్మిక విశ్వాసానికి నా గోబా ప్రతీకగా నిలిచిందన్నారు. గ్రామ సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేయాలని సర్పంచ్ మెస్రం తుకారాం, గ్రామ పటేల్ వెంకట్రావ్లు చైర్మన్కు వి నతి పత్రం అందించారు. ఇందులో కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, నీలాదేవి, ప్రవీణ్, ఐటీడీఏ ఏపీవో జనరల్ వసంత్రావ్ తదితరులున్నారు. -
జిల్లాస్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు
ఆదిలాబాద్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వీఎన్ఆర్ క్రికెట్ అకాడమీలో శుక్రవారం అండర్–16, అండర్–19 విభాగాల్లో జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించారు. టీసీఏ ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా సెక్రెటరీ నరోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపికై న వారు వచ్చే నెలలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ కమిటీ సభ్యులు అమిత్ డోక్వాల్, యూసుఫ్ఖాన్, రమేశ్, డాక్టర్ కేమ శీను సెలక్షన్ కమిటీ సభ్యులు రామరాజు, హర్ష, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గానికి ఒకటి చొప్పున..
ఆదిలాబాద్టౌన్: విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్కారు బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతుంది. అంతర్జాతీయ స్థాయి తలపించేలా నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగుతుంది. వరంగల్ జిల్లాలోని అరుట్లలో ఏర్పాటు చేసిన టీపీఎస్లో ప్రస్తుతం ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యాబోధన చేపడుతున్నారు. ఇందులో అధునాతన ల్యాబ్లు, క్రీడా మైదానాలు, గ్రంథాలయాలు వంటి సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన అందుతుంది. ఉమ్మడి జిల్లా పరి ధిలోని విద్యా శాఖాధికారుల నుంచి నియోజకవర్గానికి ఒక పాఠశాలను ప్రతిపాదనలు తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మోడల్ స్కూళ్లను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పాఠశాలకు దాదాపు రూ.100 కోట్ల వరకు నిధులు సమకూర్చనున్నట్లు విద్యాశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. సకల సౌకర్యాలు.. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసే ఈ పాఠశాలలో 4 నుంచి 6 ఎకరాల స్థలంలో భవనా లు, క్రీడా మైదానాలు, ల్యాబ్లు, డైనింగ్ హాల్, లై బ్రెరీ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ప్రతి తరగతి గదిలో స్క్రీన్ వైర్లెస్ మైక్లు, డిజిటల్ క్లాస్ రూమ్లు, ఏఐ ల్యాబ్లు, 700 మంది విద్యార్థులు కూర్చునేలా డైనింగ్ హాల్, సీసీ నిఘా, ఆర్ఓ ప్లాంట్స్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. వీటితో పా టు విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందించేందుకు కళలు, క్రీడలు, గార్డెన్ రూపొందించనున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఒకేచోట విద్యాబో ధన జరగనుంది. ప్రీప్రైమరీలో 20 మంది, ప్రైమరీలో 30, ఉన్నత తరగతుల్లో 40 మంది విద్యార్థులతో క్లాసులు నిర్వహించనున్నారు. అలాగే ఆయా గ్రామాల నుంచి వచ్చే పిల్లల కోసం బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు చేపడతారు. మొత్తం మీద ఒక క్యాంపస్లా ఈ పాఠశాలను రూపొందించనున్నారు. పరీక్ష విధానం ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్లో పది నియోజకవర్గాలు, నాలుగు జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం నియోజకవర్గానికి ఒకటి చొ ప్పున ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆ దిలాబాద్ నియోజకవర్గంలో జెడ్పీఎస్ఎస్ యా పల్గూడ, జెడ్పీఎస్ఎస్ నేరడిగొండ, నిర్మల్ జిల్లాలో మోడల్ స్కూల్ కుంటాల, జెడ్పీఎస్ ఎస్ నర్సాపూర్, ప్రభుత్వ పాఠశాల ఖానాపూర్, మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల చెన్నూర్, కేజీబీవీ బెల్లంపల్లి, జెడ్పీఎస్ఎస్ మంచిర్యాల/ప్రభుత్వ పాఠశాల గర్మిల ప్రతిపాదనలు పంపించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జెడ్పీఎస్ఎస్ కాగజ్నగర్, జెడ్పీఎస్ఎస్ ఆసిఫాబాద్ ప్రతిపాదనలు పంపించారు. వీటితో పాటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆరు మోడల్ స్కూళ్లు, ఆసిఫాబాద్లో రెండు మోడల్ స్కూళ్లు, మంచిర్యాలలో ఐదు మోడల్ స్కూళ్లు, నిర్మల్లో ఒక మోడల్ స్కూలు ఉన్నాయి. వీటిని సైతం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్చేందుకు అవకాశాలు ఉన్నట్లు విద్యా శాఖాధికారులు పేర్కొంటున్నారు. -
రీసర్వే పకడ్బందీగా చేపట్టాలి
బజార్హత్నూర్: రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా భూముల రీసర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మండలంలోని గంగాపూర్, రాంపూర్, దాబాడి, మోహద గ్రామాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామసభల్లో పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దాదాపు 90ఏళ్ల తర్వాత భూముల రీసర్వే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలో తొలి విడతలో 70 గ్రామాల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఈ సర్వే పూర్తయితే పట్టాదారుల భూములకు పూర్తి భద్రత ఏర్పడుతుందని తెలి పారు. అనంతరం అటవీ ప్రాంతంలో గల డేడ్రా, మాన్కపూర్ గ్రామాల్లో పర్యటించారు. అటవీశాఖ అనుమతులు లభించినందున రోడ్డు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు వంటివి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మాన్కపూర్ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలకు ఏడీ ప్రభాకర్ స్మార్ట్టీవీని కలెక్టర్ చేతుల మీదుగా ఉపాధ్యాయులకు అందజేశారు. ఇందులో తహసీల్దార్ శ్యాంసుందర్, సర్పంచ్లు సుభాష్, సాయన్న, అరవింద్, అనిల్, విజయ, ఉపసర్పంచ్ పాల్వే మారుతి, ఏవో ఎండీ సౌద్, ఏఈవో ప్రవీణ్, ఆర్ఐ నూర్పింగ్, సర్వేయర్ బాపురావ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, జల సంరక్షణ, న్యూట్రీ గార్డెన్స్తో పాటు పలు ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అర్హులందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో ‘జలసిరి–జల్ సంచయ్ జన్ భాగీదారి’ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా నిర్వహించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పోషకాహార భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ స్థలాల్లో న్యూట్రీ గార్డెన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ రవి, డీఆర్డీవో రవీందర్, డీపీవో రమేశ్, హౌసింగ్ పీడీ శంకర్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీసీఐపై స్పష్టత రాకపోతే ఆమరణ దీక్ష
ఆదిలాబాద్టౌన్: సీసీఐ పునరుద్ధరణపై ఆగస్టు 31లోపు స్పష్టత రాకపోతే ఆమరణ దీక్ష చేపడతానని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీసీ ఐ పునరుద్ధరణ కోసం అవసరమైతే తన ప్రాణా లను సైతం లెక్కచేయనని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభం విషయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. చట్టవిరుద్ధంగా స్క్రాప్ టెండర్లు పిలిచారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అలాంటి టెండర్లు జరగకుండా తాము కోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజా సమస్యలను విస్మరించి కమీషన్లు వచ్చే పనులపైనే స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించారని విమర్శించారు. ఏటా 5వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇండస్ట్రీయల్ కారిడార్పై చూపుతున్న శ్రద్ధను సీసీఐ పునరుద్ధరణపై ఎందుకు చూపడం లేదని నిలదీశారు. ఇది ప్రజలను పక్కదారి పట్టించే ప్ర యత్నమేనని విమర్శించారు. సీసీఐ పునరుద్ధరణపై స్పష్టమైన ప్రకటన రాకపోతే ఆగస్టు 31 నుంచి ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపాలి ఆదిలాబాద్టౌన్: సీసీఐ పునఃప్రారంభానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి అనుమతులు మంజూరు చేయాలని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 15న కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న నాయకత్వంలో సీసీఐ సాధన కమిటీ ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి, సీసీఐ సీఎండీ సంజయ్ బంగాను కలిసి పరిశ్రమ పునఃప్రారంభంపై చర్చించినట్లు తెలిపారు. పరిశ్రమను తిరిగి ప్రా రంభించేందుకు సుమారు రూ.2వేల కోట్లు అవసరమని, అందులో కేంద్రం రూ.250 కోట్లు, రా ష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు అందిస్తే, మిగిలిన రూ.1,500 కోట్లను సంస్థ రుణంగా సమీకరించేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అవసరమైన అనుమతులు, ఆర్థిక సహకారం అందించాలన్నారు. ఈవిషయమై త్వరలోనే సీఎంను కూడా కలిసి సమస్యను వివరించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సాధన కమిటీ కోకన్వీనర్లు నారాయణ, రమేశ్, వెంకట్ నారాయణ, జగన్ సింగ్, పోశెట్టి, దత్తాత్రి, ఈశ్వర్ దాస్, అరుణ్కుమార్, దేవిదాస్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో చర్చనీయాంశం
సాక్షి, ఆదిలాబాద్: నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ (ఇరిగేషన్, క్యాడ్ డిపార్ట్మెంట్)లో ఏసీ బీ దాడులు సంచలనం సృష్టించాయి. ఆ శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రాథోడ్ విఠల్తో పాటు అదే కార్యాల య ఏఈ రూపావత్ రమేశ్ గురువా రం రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడటం సంచలనం కలిగి స్తోంది. కాగా, ఇందులో ఓ డీఈ, మరో ఏఈ పాత్ర కూడా ఉందని, ఈ సంఘటన జరిగిన తర్వాత వారిద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులోకి రావడం లేదనేది ఆ శాఖలో చర్చ సాగుతోంది. కాగా, ఏసీబీ అధికారు ల విచారణ సందర్భంగా పట్టుబడ్డ అధికారుల్లో ఒక రు ఓ ఉన్నతాధికారికి కూ డా లంచం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్లు చ ర్చించుకుంటున్నారు. ఆ అధికారిని పిలిపించి వి చారణ చేపట్టగా, ఇ లాంటి అనుమతులకు తన పాత్ర ఉండదని అత డు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరు అధికారులు ఇప్పుడు పట్టుబడగా, మరో ఇద్దరు అధికారుల విషయంలో ఏసీబీ ఏం నిర్ణయం తీసుకుంటుందో. నలుగురి పాత్ర ఉందన్న బాధితుడు సొనాలకు చెందిన చౌహాన్ విక్రమ్సింగ్ తన వ్యవసాయ భూమిలో పౌల్ట్రీ ఫార్మ్ నిర్మిస్తుండగా, దానికి సంబంధించి వివిధ అనుమతులు తీసుకున్నాడు. సమీపంలో ఉన్న కాలువ విషయంలో నీటిపారుద ల శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో జూన్ 9న నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించి ఈఈ పేరిట దరఖాస్తు ఇచ్చాడు. ఈఈ నుంచి డీఈ, ఏఈలకు దరఖాస్తు ఫార్వర్డ్ చేయగా, వారు సైట్ విజిట్ చేసినట్లు ఫిర్యాదుదారు పేర్కొంటున్నాడు. ఆ సమయంలోనే రూ.లక్ష లంచం ఇ వ్వాలని అధికారులు కోరినట్లు ఆరోపిస్తున్నాడు. దీ నిపై ఆదిలాబాద్ కార్యాలయంలో నలుగురు అధి కారులతో సంప్రదింపులు జరిగాయని, ఇందులో నలుగురు అధికారుల పాత్ర ఉందని ఆయన ఏసీబీ అధికారుల ముందు స్పష్టం చేసినట్లు సమాచారం. నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధిశాఖ కార్యాలయంఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడటం, మరో ఇద్దరు అధికారుల పేర్లు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఓ అధికారి ప్రజాప్రతినిధికి బంధువు అనే చర్చ సాగుతోంది. ఫిర్యాదుదారు మాత్రం ఆ నలుగురు అధికారులపై చర్యలు తీసుకోవాలని చెబుతుండటం సంచలనం కలిగిస్తోంది. ఏసీబీ దాడుల తర్వాత మరో ఇద్దరు అధికారులు ఎవరికీ అందుబాటులోకి రాకుండా సెల్ఫోన్లు స్విచ్ఆఫ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో విపత్తుల సమయంలో అత్యవసర సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రి త్వ శాఖ, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. 40మంది విద్యార్థులు శిక్షణలో పా ల్గొని నైపుణ్యాలు నేర్చుకున్నారని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్డీఎంఏ, తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖల్లో ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి సురేశ్, స్టేషన్ అగ్నిమాపక అధికారి జైత్రామ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగి వర్ష, విద్యార్థులు పాల్గొన్నారు. -
పోయినోళ్లకు పింఛన్లు!
కైలాస్నగర్: మరణించిన వారి పేరిట ఇంకా పెన్షన్లు వస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మృతి చెంది ఏళ్లు గడుస్తున్నా వారి బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ సొమ్ము ప్రతీనెల జమవుతూనే వస్తోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 234 మంది చనిపోయినోళ్ల ఖాతాల్లో పెన్షన్ డబ్బులు పడుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. ఫలితంగా ప్రజాధనం వృథా అవుతోంది. చేయూత పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాల నే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఫేషియల్ రికగ్నిషన్ అథెంటిఫికేషన్ (ఎఫ్ఆర్ఏ) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 14,133 మంది లబ్ధిదారులు బ్యాంకుల ద్వారా పెన్షన్లు పొందుతుండగా వారు జీవించి ఉన్నారా? అనే దాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక సర్వే చేపట్టింది. మెప్మా ఆర్పీలు, మున్సిపల్ వార్డు ఆఫీసర్ల ద్వారా ప్రత్యేక లాగిన్ కేటాయించి క్షేత్రస్థాయిలో వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ గడువు ఈ నెల 10వ తేదీతో ముగిసింది. అయితే, 234 మంది మృతి చెందినప్పటికీ వారికి చెల్లించే పెన్షన్ మాత్రం నిలిచిపోలేదు. గత కొన్నేళ్లుగా రెగ్యులర్గా వారి ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ అవుతునే ఉన్నాయి. మృతులకు డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న మున్సిపల్ యంత్రాంగం పెన్షన్లు నిలిపివేసేలా దృష్టి సారించకపోవడం గమనార్హం. లభించని 1,212 మంది ఆచూకీ క్షేత్రస్థాయి సర్వే ఇటీవల ముగియగా 1,212 మంది లబ్ధిదారుల ఆచూకీ లభించలేదని అధికారులు చె బుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. వారి ఫోన్ నంబర్లు పనిచేయకపోగా, ఇంటి అడ్రస్లు కూడా మారినట్లు చెబుతున్నారు. కొన్ని సెల్ నంబర్లు పని చేసినప్పటికీ తాము పెన్షన్ లబ్ధిదారులం కాదంటూ దాటవేత వైఖరిని అవలంభిస్తున్నారు. అయితే, వా రి ఖాతాల్లో మాత్రం పెన్షన్లు జమవుతూనే ఉండటం గమనార్హం. కాగా, 655 మంది రాష్ట్రంలో పెన్షన్ పొందుతూ మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో నివసిస్తున్నట్లు డీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి కోసం వచ్చిన సమయంలో పెన్షన్ తీసుకుని తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లగా వారి పెన్షన్లు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే, మరో 47మందికి సంబంధించి ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నట్లు గుర్తించారు. మరో నలుగు రు పెన్షన్ తీసుకునేందుకు ఆసక్తి చూపనట్లు చెబు తున్నారు. ఇలాంటి వారిలో అత్యధికులు అనర్హులే ఉండే అవకాశమున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఎవరైనా నిజమైన లబ్ధిదారు ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో పెన్ష న్లు నిలిపివేయడం లేదని చెబుతుండటం గమనా ర్హం. మరింత లోతుగా, పారదర్శకంగా సర్వే నిర్వహిస్తే మరింత మంది అనర్హులు బయటపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా మున్సిపల్, డీ ఆర్డీఏ, మెప్మా శాఖలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటీఎం, యూపీఐల ద్వారా డ్రా మృతి చెందిన పెన్షన్దారుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతున్న పెన్షన్ సొమ్మును వారి కుటుంబీకులు అక్రమంగా డ్రా చేసుకుంటున్నట్లు సర్వేలో గుర్తించారు. లబ్ధిదారుల పేరిట ఉన్న ఏటీఎంలు, ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐల ద్వారా నగదును విత్ డ్రా చేసుకుంటున్నట్లు నిర్ధారించారు. ఇలా, పలువురు లబ్ధిదారుల ఖాతాలను అధికారులు పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. అనర్హులకు అందకుండా చూస్తాం బ్యాంకుల ద్వారా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులు జీవించే ఉన్నారా? అనేదాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వం ఎఫ్ఆర్ఎస్ సర్వేకు ఆదేశించింది. రెండు నెలలుగా పట్టణంలో సర్వే నిర్వహించాం. 234 మంది మృతి చెందినట్లు గుర్తించాం. ఈ నెల నుంచి వారి పెన్షన్ నిలిపివేస్తాం. చిరునామా లభించని వారిలో ఎవరైనా అర్హులుంటే డీఆర్డీఏ, మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించి వివరాలు అందజేయాలి. – జాదవ్ శేష్రావు, డీపీఎం పెన్షన్స్, డీఆర్డీఏ -
‘విడతలవారీగా అభివృద్ధి చేస్తా’
గుడిహత్నూర్: కొల్హారి గ్రామాన్ని విడతల వారీగా అభివృద్ధి చేస్తానని, అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హామీ ఇచ్చారు. మండలంలోని కొల్హారి గ్రామంలో రూ.18లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా ఏ ర్పాటు చేసి వాటి సమగ్రాభివృద్ధికి పాటుపడినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ పల్లెకు అన్ని సౌకర్యాలు కల్పించడమే ధ్యేయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు అల్లూరి శివాజీ, ప్రతా ప్సింగ్ రాథోడ్, పీఏసీఎస్ చైర్మన్ సంజీవ్ ముండే, మాజీ సర్పంచులు తిరుమల్గౌడ్, రవినాయక్, బీఆర్ఎస్ నాయకులు గజానంద్ పాటిల్ గిత్తే, తగ్రే ప్రకాశ్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే.. నేరడిగొండ: తెలంగాణలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ధీమా వ్యక్తం చేశారు. బజార్హత్నూర్ మండలంలోని భూతాయి గ్రామానికి చెందిన సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఫడ్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో కేంద్రే బాలాజీ గురువారం బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చే రారు. మండలంలోని బలాన్పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు తులసీరాం ఆధ్వర్యంలో పలువురు వార్డు మెంబర్లు గులాబీ గూటికి చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో రానున్నది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంజేశారు. పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి చేయాలి
ఆదిలాబాద్టౌన్: ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కి కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలపై నమోదైన అట్రాసిటీ కేసుల దర్యాప్తు, విచారణలో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థా యి సమీక్షకు హాజరయ్యారు. ముందుగా చైర్మన్, సభ్యులకు కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్, అధికా రులు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్, సభ్యులు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసుల దర్యాప్తు, భూ సమస్యలు, రిజర్వేషన్ల అమలు, సబ్ప్లాన్ నిధుల వినియోగంపై శాఖలవారీగా సమీక్షించారు. అట్రాసిటీ కేసుల నమోదు, చార్జిషీట్ల దాఖలు, బాధితులకు పరిహారం చెల్లింపు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యాపథకం, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఉపాధిహామీ అమలుపై అధికారులతో చర్చించారు. అనంతరం వెంకటయ్య మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు చట్టప్రకారం అందాల్సిన పరిహారం, పునరావాసం, ఇతర సౌకర్యాలను సకాలంలో అందించాలని, పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతినెలా చివరి వారంలో సివిల్ రైట్స్ డే సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించి ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. గురుకుల విద్యాసంస్థలను తరచూ తనిఖీ చేసి లోపాలుంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. పెండింగ్ నిధుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కామన్ మెనూ అమలు, ఉపకార వేతనాలు, కులాంతర వివాహాల ఆర్థిక సహాయం, అంబేడ్కర్ ఓవర్సీస్, ఇందిరమ్మ, ఉపాధిహామీ పథకాలు సక్రమంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని తెలిపారు. అనంతరం కమిషన్ వెంకటయ్య, సభ్యులను కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. అంతకుముందు రిమ్స్లో చికిత్స పొందుతున్న భోరజ్ మండలం మాండగడకు చెందిన వాణిశ్రీని కమిషన్ చైర్మన్ పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. కమిషన్ సభ్యులు కుస్త్రం నీలాదేవి, రాంబాబు నాయక్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఏఎస్పీ సాయిరుత్విక్ కొట్టే, అదనపు కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రూ, రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్డీవోలు జగదీశ్వర్రావు, మోహన్సింగ్, డీఎస్పీ జీవన్రెడ్డి, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు
ఇచ్చోడ: శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని సిరిచెల్మలో ఉదయం 6నుంచి 9గంటలకు వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించగా ఎస్పీ హాజరయ్యారు. అసాంఘిక కార్యకలాపా ల సమాచారం తెలిస్తే 8712659973 నంబర్కు వాట్సప్ ద్వారా తెలుపాలని సూచించారు. కార్డన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 156 బైక్లు, రెండు ఆటోలు, ఎనిమిది కార్లు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్లును కల్తీ చేసేందుకు ఉపయోగించే క్వింటాల్ అమ్మోనియం బై కార్బోనెట్ను స్వాధీనం చేసుకుని నిల్వ చేసిన సురేందర్గౌడ్పై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న శ్రీనివాస్గౌడ్పై కేసు నమో దు చేసి 200 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ వెంకటనర్సయ్య, ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, ఇచ్చోడ స్టేషన్హౌస్ ఆఫీసర్ నరేశ్, రిజ ర్వ్ ఇన్స్పెక్టర్ డి.వెంకటి, మురళి, వివిధ ఠాణాల ఎస్సైలు, 120 మంది సిబ్బంది పాల్గొన్నారు. మారుతిగూడలో.. ఆదిలాబాద్(బేల): మండలంలోని మారుతిగూడ గ్రామంలో గురువారం తెల్లవారుజామున కార్డన్ సె ర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జీవన్రెడ్డి ఆధ్వర్యంలో లీటర్ గుడుంబా, తయారీకి ఉపయోగించే పాత్రలను స్వాధీనం చేసుకుని ధ్వంసంచేశారు. గుడుంబా తయారీకి సిద్ధం చేసిన ద్రావణాన్ని పారబోశా రు. నిబంధనలు పాటించని, సరైన ధ్రువపత్రాలు లేని సుమారు 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక శక్తుల కదలికలను గమనించేందుకు గ్రామంలోని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించా రు. జైనథ్ సీఐ శ్రావణ్కుమార్, ఎస్సైలు మధుకృష్ణ, గౌతమ్, పీర్ సింగ్నాయక్ పాల్గొన్నారు. -
చినుకమ్మా.. వాన చినుకమ్మా..
నేరడిగొండ: బోరిగంలో పూజలు చేస్తున్న రైతులు, గ్రామస్తులుబోథ్: పూజలు నిర్వహిస్తున్న నాయకులు, రైతులుతాంసి: రామునిగుట్టపైకి నడుచుకుంటూ వెళ్తున్న మహిళలుఎల్నినో ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ రైతులు, యువకులు గురువారం బోథ్ పట్టణంలో బిందెల్లో నీటిని తీసుకుని ఊరేగింపుగా వెళ్లి గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూజలు చేశారు. సొనాల మండలంలోని కోట(కె) గ్రామ యువకులు కప్పతల్లి ఆడారు. తాంసి మండలంలోని గుబిడిపెల్లికి చెందిన మహిళలు పాలోది రామునిగుట్టపైకి పాదయాత్ర చేపట్టారు. నైవేద్యం వండి రాములోరికి సమర్పించారు. నేరడిగొండ మండలంలోని వడూర్, బోరిగం గ్రామాల్లో రైతులు, గ్రామస్తులు గ్రామ దేవతలకు సంప్రదాయ పూజలు నిర్వహించారు. – బోథ్/తాంసి/నేరడిగొండ -
ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: ప్రతీ పేద కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందించి ఆదిలాబాద్ను ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సాధన పేర్కొన్నారు. గు రువారం జిల్లా కేంద్రంలోని కేర్ అండ్ సపోర్ట్ సెంటర్లో నెట్వర్క్ ఆఫ్ హెల్పింగ్ పూర్, షూర్, వై ఆర్జీ లింక్ వర్కర్స్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో హెచ్ఐవీతో జీవిస్తున్న కుటుంబాల్లో హెచ్ఐవీ లేని 25మంది చిన్నారులకు పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హెచ్ఐవీతో జీవిస్తున్న కుటుంబాల పిల్లలకు విద్య ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. విద్యతోనే ఉన్నత స్థా యికి చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఏఆర్టీ కేంద్రాల ద్వారా బాధితులకు ఉ చితంగా మందులు అందించడంతో పాటు దాతల సహకారంతో పిల్లలకు విద్యా సామగ్రి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నాకో, తెలంగాణ రాష్ట్ర ఎయి డ్స్ నియంత్రణ మండలి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి ఆదిలాబాద్ను హెచ్ఐవీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. హెచ్ఐవీతో జీవిస్తున్న చిన్నారుల విద్యకు పూర్తి సహకారం అందిస్తామని, వారికి ఉన్నత విద్యతో పాటు పెద్దలకు ఆసరా పింఛనుఅందించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, అవసరమైన వారికి ఉచిత హెచ్ఐవీ పరీక్షలు, బాధితులకు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఈశ్వర్రాజ్, ఏఆర్టీ సెంటర్ వైద్యురాలు పద్మిని, ప్రియదర్శిని, సీపీఎం నాగరాజు, ఎన్జీవో ప్రతినిధులు సాయినాథ్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఐటీఐ–ఏటీసీ విద్యార్థులకు ఆఫర్ లెటర్లు
ఉట్నూర్రూరల్: ప్రపంచ యువ నైపుణ్య దినో త్సవం సందర్భంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్గల ఆదివాసీ భవన్–బంజారా భవన్లో గురువా రం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో ఉట్నూర్ ప్రభుత్వ ఐటీఐ–ఏటీసీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. గిరిజన ప్రాంత విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ ఇస్తూ, ఉపాధి కల్పనలో దూసుకుపోతున్న ఉట్నూర్ ఐటీఐ–ఏటీసీ ప్రతి భను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అ తిథిగా హాజరై ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ ఉట్నూర్కు చెందిన ఐదుగురు విద్యార్థులకు ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్లు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంత యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిస్తూ.. ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఉట్నూర్ ఐటీఐ పనితీరును మంత్రి ప్ర శంసించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి, పరిశ్రమలతో అనుసంధానానికి, క్యాంపస్ ప్లేస్మెంట్లలో విశేష కృషి చేసిన ఉట్నూర్ ప్రిన్సిపాల్ రొడ్డ శ్రీనివాస్ను మంత్రి, ఉన్నతాధికారుల సమక్షంలో శాలువాతో సత్కరించారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
సిరికొండ: గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు సూచించారు. మండలంలోని రిమ్మ గ్రామంలోని గిరిజన ఆ శ్రమ పాఠశాలను గురువారం ఆకస్మికంగా త నిఖీ చేశారు. రిజిష్టర్లు, విద్యార్థుల హాజరు న మోదు, వంటగది, పరిశుభ్రతను పరిశీలించా రు. పాఠశాల భవనానికి అవసరమైన మరమ్మతులు చేపట్టి మూడు నెలల్లోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఏటీడీవోను ఆదేశించా రు. అనంతరం గ్రామంలో నిర్వహించిన గ్రా మసభలో పాల్గొన్నారు. మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరిన డీఆర్డీవో డిపో భవనాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఎంపీడీవో సంతోష్కుమార్, ఏవో శ్రద్ధారాణి, సర్పంచ్ జంగుబాయి, మాజీ సర్పంచ్ పెందుర్ అనిల్కుమార్ తదితరులున్నారు. -
‘సీసీఐ’ పునఃప్రారంభించాలి
ఆదిలాబాద్టౌన్: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జోగు రామన్న బుధవారం ఢిల్లీలో కలిశారు. ఆదిలాబాద్లో మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీ(సీసీఐ)ని ప్రారంభించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, పునఃప్రారంభించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు వివరించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవిచంద్ర, జాన్సన్ నాయక్, సీసీఐ సాధన క మిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కోకన్వీనర్ నారా యణ, అరవింద్, అరుణ్ కుమార్, జగన్ సింగ్, పోశెట్టి, దేవిదాస్, ఈశ్వర్దాస్, తదితరులున్నారు. -
టీపీసీసీ అధ్యక్షుడికి సన్మానం
కై లాస్నగర్: కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ప్రత్యేక చొరవ తీసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్జాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన వెంట కుమురంభీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు, పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. -
బడి బ్యాగు భారం
మొత్తం పాఠశాలలు : 1,494 జిల్లాలో విద్యార్థులు : 1.60 లక్షలుఆదిలాబాద్టౌన్: బడి బ్యాగు భారమవుతోంది. పుస్తకాల మోత వారి అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. వయసుకు మించి బరువు మోయలేక బాల్యం తంటాలు పడుతోంది. విద్యార్థులపై పుస్తకాల భారం ఉండకూడదనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు మార్గదర్శకాలను రూపొందించాయి. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ–2020)లోనూ విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్న విషయం తెలిసిందే. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్ పేరుతో చిన్నారులపై అధిక భారం మోపుతున్నారనే విమర్శలున్నాయి. ఒకప్పుడు పదో తరగతి వరకు కూడా ఆరు నోట్బుక్స్, ఆరు టెక్ట్స్ బుక్స్ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ప్రైవేట్లో ఎల్కేజీ విద్యార్థికి కనీసం పది పుస్తకాలు, అదనంగా నోట్బుక్స్ ఉండడం గమనార్హం. దీంతో ఇటు పిల్లలకు బడిబ్యాగు భారం కాగా, అటు తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్పని పరిస్థితి. శరీర బరువులో 10 శాతానికి మించకుండా.. కేంద్ర విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బ్యాగ్ విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించకూడదని స్పష్టం చేస్తుంది. అలాగే రోజువారీ టైమ్టేబుల్కు అవసరమైన పుస్తకాలనే తీసుకురావాలని పేర్కొంది. విద్యార్థులకు లాకర్ సౌకర్యం కల్పించడం, డిజిటల్ లెర్నింగ్ను ప్రోత్సహించడం, హోంవర్క్ పరిమితం చేయడం వంటి సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.. అధిక బరువున్న బ్యాగులను రోజూ మోయడంతో చిన్నారుల్లో మెడ, భుజం, నడుము నొప్పితో పాటు వెన్నెముకపై ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న వయసులోనే శరీర భంగిమలో మార్పులు రావడంతో పాటు కండరాలపై అధిక ఒత్తిడి ఏర్పడి భవిష్యత్తులో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం నిబంధనలు రూపొందించినా వాటిని చాలా పాఠశాలలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రైవేట్లో పరిస్థితి భిన్నం.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. తరగతి పుస్తకాల బరువు 1, 2 1.5 – 2 కిలోలు 3,4,5 2 – 3 కిలోలు 6, 7 4 కిలోల వరకు 8, 9 4.5 కిలోల వరకు 10 5 కిలోల వరకు ప్రభుత్వ మార్గదర్శకాల అమలుపై విద్యాశాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. బ్యాగ్ బరువును పరిశీలించడం, నిబంధనలు పాటించని విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేయడం, అవసరమైతే చర్యలు తీసుకోవడంతోనే పరిస్థితిలో మార్పు వస్తుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రతి పాఠశాలలో అమలయ్యేలా పటిష్ట చర్యలు అవసరమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. పుస్తకాల భారం తగ్గినప్పుడే పిల్లలు ఉల్లాసంగా, ఆరోగ్యంగా విద్యాభ్యాసాన్ని కొనసాగించగలరని అభిప్రాయపడుతున్నారు.పర్యవేక్షణ లోపం.. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రతీ సబ్జెక్టుకు టెక్ట్స్ బుక్స్, క్లాస్వర్క్, హోంవర్క్, వర్క్బుక్, అసైన్మెంట్ బుక్, ప్రాక్టీస్ బుక్ పేరిట ఐదు నుంచి ఆరు పుస్తకాలు తీసుకురావాలని సూచిస్తున్నారు. దీంతో చిన్నారులు రోజూ 5 నుంచి 8 కిలోల వరకు బరువున్న బ్యాగులను మోయాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కొన్ని పాఠశాలల్లో లాకర్ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులకు మోత భారం తప్పడం లేదు.


