Adilabad District Latest News
-
వేసవి శిబిరాలొచ్చేసినయ్
జిల్లా క్రీడాప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో మే 1నుంచి జూన్ 7వరకు జిల్లాలోని 21 కేంద్రాల్లో విద్యార్థు ల కోసం ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్, కుస్తీ, కబడ్డీ, విలువిద్య, నెట్బాల్, సాఫ్ట్బాల్, బేస్బాల్, ఖోఖో, హాకీ, హ్యాండ్బాల్, వాలీబాల్ వంటి వివిధ క్రీడాంశాల్లో ప్రత్యేక కోచ్లతో శిక్షణ ఇవ్వనున్నారు. అథ్లెటిక్స్ శిక్షణను ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చాందా(టి), భీంపూర్ మండలంలోని అర్లి(టి)లో, కుస్తీ శిక్షణను తలమడుగు మండలం సుంకిడి, ఉట్నూరులో నిర్వహిస్తారు. కబడ్డీ మావలలో, విలువిద్య ఆది లాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్, తలమడుగు మండలం బరంపూర్లో అందుబాటులో ఉంటుంది. వాలీబాల్ శిక్షణను గాదిగూడ, నార్నూరు, ఇంద్రవెల్లి, సాత్నాల మండలంలోని లోకారిలో, ఖోఖో తలమడుగు మండలం కుచులాపూర్లో, హాకీ బోథ్మండలం మర్లపెల్లిలో అందిస్తారు. సాఫ్ట్బాల్ శిక్షణ నేరడిగొండ, బజార్హత్నూర్లో, బేస్ బాల్ ఇచ్చోడ, ఆదిలాబాద్ గ్రామీణ మండలం తంతోలిలో, నెట్బాల్ ఇచ్చోడలో, హ్యాండ్బాల్ శిక్షణ ను ఆదిలాబాద్లోని మహాలక్ష్మివాడ, ఆదిలాబాద్ రూరల్మండలం అంకోలిలో నిర్వహించనున్నారు. ఆసక్తిగల క్రీడాకారులు https:// sat gasc. telan gana. gov. in/ stadiums వెబ్సైట్లో పేర్లు నమో దు చేసుకోవాలని డీవైఎస్వో శ్రీనివాస్ తెలిపారు. వేసవి సెలవులు వచ్చేశాయి. ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు ఆటపాటలకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇప్పటికే పలు శిక్షణ శిబిరాలు ప్రారంభం కాగా.. త్వరలోనే మరిన్ని షురూ కానున్నాయి. ఆయా క్యాంపులు చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి. చిచ్చరపిడుగులకు కొత్త అంశాలు నేర్పడంతో పాటు, భవిష్యత్తులో ఆయా రంగాల్లో రాణించేందుకు ఇవి దోహదపడనున్నాయి. సృజనాత్మకత వెలికితీసే కేంద్రాలుగా నిలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వేసవి శిక్షణ శిబిరాలపై ఓ లుక్కేద్దామా మరి. – ఆదిలాబాద్క్రీడా శిక్షణా శిబిరాలు బాలకేంద్రంలో.. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో.. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా చిన్నారులకు ప్రత్యేక శిక్షణ కా ర్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా 2వ తరగతి నుంచి 10 వ తరగతి చదువుతున్న బాలబాలికలు ఈ శిబి రా ల్లో పాల్గొనేందుకు అర్హులని ఇటీవల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మే 4నుంచి 30వరకు ఐదు చోట్ల ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్ తోపాటు ఇచ్చో డ, ఇంద్రవెల్లి, నార్నూర్,బోథ్ పోలీస్స్టేషన్ల పరి ధిలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయి. కరాటే, యోగా, ఫిజికల్ ఎఫిషియన్సీ ట్రైనింగ్, కబడ్డీ, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నా రు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 30లోపు సమీ పంలోని పోలీస్స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవ చ్చు. వివరాలకు నోడల్ ఆఫీసర్ వెంకటిని 87126 59961 నంబర్లో సంప్రదించవచ్చు. వేసవి సెలవుల సందర్భంగా పట్టణంలోని బాలకేంద్రం 5 నుంచి 16 ఏళ్ల లోపు బాలబాలికలకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. ఏప్రిల్ 27న ప్రారంభమయ్యాయి. మే 31 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 4:30 నుంచి 7:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో కూచిపూడి, జానపద నృత్యం, సంగీతం (లలిత, కర్ణాటక), వాయిద్య పరికరాలు (తబలా, హార్మోనియం), చిత్రలేఖనం, కుట్లు–అల్లికలలో నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు చేపడతారు. ఆసక్తి, అర్హులైన చిన్నారులు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో కలెక్టరేట్ చౌక్ సమీపంలోని బాలకేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. వివరాలకు బాలకేంద్రం సూపరింటెండెంట్ మిట్టు రవిని 9703686368 నంబర్లో సంప్రదించవచ్చు. -
తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం
ఆదిలాబాద్టౌన్: తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రా మన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మెట్టు ప్రహ్లాద్, దాసరి రమేశ్, కస్తాల ప్రేమల, స్వరూపరాణి, మమత, కరుణ, సలీమ్, ధమ్మపాల్, గణేష్, పరమేశ్వర్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
వానాకాలం సాగు ప్రణాళిక
సాక్షి,ఆదిలాబాద్: ఈ వానాకాలం సాగు విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి, సోయా, కంది, జొన్న, మొక్కజొన్న, వరి, పెసర, మినుము ఇతరత్రా పంటలు సాగు కానున్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి పత్తి విస్తీర్ణం స్వల్పంగా తగ్గనుంది. ఇక సోయా, కందుల విస్తీర్ణం కొంత పెరుగనుంది. ఓ వైపు వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి గతేడాది సుమారు 5లక్షల 85వేల 350 ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 73 శాతం పత్తి సాగైంది. ఈఏడాది కూడా పత్తి పంటనే అత్యధికంగా సాగు చేయనున్నారు. అయితే గతంతో పోల్చితే స్వల్పంగా తగ్గనున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సోయా, కందుల విస్తీర్ణం స్వల్పంగా పెరగనుంది. దీనికి తగ్గట్టుగా విత్తనాల ఆవశ్యకతపై వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. గంపెడాశలు.. జిల్లాలో ప్రధానంగా వానాకాలమే ఎక్కువగా పంటలు సాగవుతాయి. యాసంగి సాగు అంతంత మాత్రంగానే ఉంటుంది. వానాకాలంలో సాగు చేసే పత్తి, సోయా, కంది దిగుబడులపై రైతులు ఎన్నో ఆశలతో ముందుకు సాగుతారు. ఈ ఏడాది కూడా ఈ మూడు పంటలే ప్రధానంగా సాగయ్యే అవకాశం ఉంది. గతేడాది అధిక వర్షాలతో రైతులు పంట నష్టం చవిచూశారు. అయితే ఈ సారి ప్రకృతి సహకరించాలని వారు వేడుకుంటున్నారు. నకిలీల బెడద.. వానాకాలం సాగు సమీపిస్తుండగా, ప్రస్తుతం నకిలీ విత్తనాల బెడద మార్కెట్ను ముంచెత్తుతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వీటిని పోలీసులు పట్టుకున్నారు. లూజ్ విత్తనాలతో పాటు కంపెనీలకు సంబంధించిన బ్రాండ్లతో పూర్తిగా నకిలీ విత్తనాల ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. పంటల సాగు అంచనా విస్తీర్ణం ఇలా.. (ఎకరాల్లో) పంట 2025 2026 పత్తి 4,32,285 4,26,500 సోయా 72,235 78,000 కంది 44,447 45,000 మొక్కజొన్న 38,630 39,000 ఇతరత్రా 2,735 2,500 విత్తనాల అవసరం.. పత్తి : 11లక్షల 50వేల ప్యాకెట్లు (450 గ్రాములు) మొక్కజొన్న: 3,200 క్వింటాళ్లు కంది: 1800 క్వింటాళ్లు సోయా: 23వేల క్వింటాళ్లుసరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచుతాం వానాకాలం సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా విత్తనాలను అందుబాటులో ఉంచుతాం. పత్తి విత్తనాలకు సంబంధించి ఎలాంటి కొరత లేకుండా రైతులకు నాణ్యమైనవి అందుబాటులోకి తీసుకొస్తాం. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్ -
ఆగ్రో డీలర్ల నిరసన
ఆదిలాబాద్టౌన్: ఎరువుల కంపెనీలు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొంటూ జిల్లా కేంద్రంలో ఆగ్రో డీలర్లు సోమవారం నిరసన వ్య క్తం చేశారు. పంజాబ్ చౌక్లోని రైతు విగ్రహాని కి పూలమాలలు వేశారు. అనంతరం ప్రదర్శన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా గల ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకా ణాలను సోమవారం మూసివేశారు. వీరికి ఆదిలాబాద్ ఆత్మ డివిజన్ చైర్మన్ గిమ్మ సంతోష్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి శివప్రసాద్ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్కు ముందు కంపెనీలు డీలర్లపై ఎరువులు, యూరియా కొనుగోళ్లలో ఇతర ఉత్పత్తులను అంటగడుతున్నాయని తెలిపారు. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. బస్తాపై రూ.40 నుంచి రూ.50 వరకు అదనపు భారం పడుతుందని తెలిపారు. ఇందులో అగ్రో డీలర్లు ప్రశాంత్, సందేశ్, శ్రీనివాస్, బాలాజీ, సంతోష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో...
ఈ సమితి ఆధ్వర్యంలో ఏటా వివేకానంద బాల సంస్కార్ పేరిట వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది సైతం నైతిక, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాలతో కూడిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈనెల 24న మున్సిపల్ చైర్ పర్సన్ అనూష శిబిరాన్ని ప్రారంభించారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారు ఇందులో చేరేందుకు అర్హులు. యోగా, ధ్యానం, శ్రీమద్భాగవత కథలు, భగవద్గీత శ్లోకాలు, ఏకాగ్రత పెంచే ఆటలు, భజనలు, వేద గణితం, చిత్రలేఖనం, చేతిరాత వంటి అంశాల్లో ఉదయం 7 నుంచి 10.45 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. సంజయ్నగర్లోని శ్రీరామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో శిబిరం కొనసాగుతుందని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూమన్న, లెనిన్ పేర్కొంటున్నారు. వివరాలకు 9490052842, 90328833582 నంబర్లలో సంప్రదించవచ్చని సూచిస్తున్నారు. -
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి
ఆదిలాబాద్టౌన్: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదగా వ్యవరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను సత్వరం పరిష్కరించినప్పుడు బాధితుల్లో పోలీసులపై గౌరవం, నమ్మకం పెరుగుతుందన్నారు. అలాగే జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉన్నా నేరుగా 8712659973 నంబర్కు వాట్సప్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని కవిత, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇందిరమ్మ నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలు అధికారులను ఆదేశించారు. హిమాయత్నగర్లోని హౌసింగ్ కా ర్పొరేషన్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో మంత్రులు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల ఆత్మగౌరవానికి ప్ర తీక అని అన్నారు. నిర్మాణ ప్రక్రియలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. లబ్ధిదారుల దరఖాస్తులను పెండింగ్ పెట్టవద్దని, అధికారుల వద్ద ఫైల్ వారం రోజులకు మించి ఉండవద్దని పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉంటే తక్షణమే అధికారులను డిప్యూటేషన్పై తీసుకొని పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతీ దశలో పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. స్థోమతలేని నిరుపేద లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దశల వారీగా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మంజూరయ్యే నిధుల ద్వారా రుణం తీర్చేలా చూడాలని తెలిపారు. సమావేశంలో ఎంపీలు నగేశ్, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు దండే విఠల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్, రామారావు పటేల్, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీష్బాబు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీసీ గౌతమ్, ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, మంచిర్యాల కలెక్టర్లు రాజర్షిషా, హరిత, భవేష్ మిశ్రా, కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
● నిప్పులకుంపటిలా ఆదిలాబాద్ ● జిల్లాలో 45.9 డిగ్రీల సెల్సియస్ ● ఇళ్లకే పరిమితమవుతున్న జనం ● సాయంత్రం వరకు వడగాలులు
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. పక్షం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం 45.3 డిగ్రీ సెల్సియస్ మార్కు దాటగా సోమవారం 45.9 డిగ్రీ సెల్సియన్గా నమోదైంది. ఒక్కసారిగా ఆదిలాబాద్ నిప్పుల కుపంటిలా మారింది. దీంతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉదయం 9 దాటిందంటే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అప్రకటిత కర్ఫ్యూ వాతవరణం దర్శనమిస్తోంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండ కారణంగా ఉపాధిహామీ కూలీలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు. జిల్లాలో సోమవారం బేలలో జైనథ్ మండలంలో 45.9 డిగ్రీ సెల్సి యస్ నమోదవగా.. సా త్నాలలో 44.4, ఇచ్చోడలో 44.3, భోరజ్లో 44.2, బోథ్లో 43.9 ఇలా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ బారిన పడుతున్న జనం జిల్లాలో వడదెబ్బతో ఇటీవల ఇ ద్దరు మృత్యువాత పడ్డారు. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎండలో పనిచేసే వారు, తిరిగే వారు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. అప్రమత్తంగా ఉండాలని గొ డుగు, ఇతర రక్షణ కవచాలు ధరించాలని సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీ ఫారన్హిట్ దా టడం, కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం, ఫిట్స్ తదితరల క్షణాలు బయట పడితే వడదెబ్బగా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొంటున్నారు. జంకుతున్న జనం ఎండ వేడిమి తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. కూలర్లు, ఏసీలకు విరామం లేకుండా నడుస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో తప్పనిసరి బయటకు వెళ్లే వారు శీతలపానియాలు, కొబ్బరి బోండాలు, తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఎండ తీవ్రత కారణంగా జిల్లాలో వాగులు, చెరువులు ఎండిపోతున్నాయి. మూగజీవాలు దాహార్తితో అల్లాడుతున్నాయి. జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. నీటిని ఎక్కువ తాగాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. ఎండలో వెళ్లేవారు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వేడి ప్రదేశాల వద్ద పనిచేసే వారు జాగ్రత్తలు పాటించాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో -
సీపీఎం పోరాట ఫలితమే పాట్నాపూర్ ఏర్పాటు
సాత్నాల: సీపీఎం పోరాట ఫలితమే సాహెజ్ పాట్నాపూర్ గ్రామం ఏర్పాటు చేయడం జరిగిందని సీపీఎం జిల్లా నాయకులు లంక రాఘవులు అన్నారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయకులకు ఘన స్వాగతం పలికి, పూలమాలతో సన్మానించారు. గిరిజనుల అవసరాలు తెలుసుకొని, పాట్నాపూర్ గ్రామ ఏర్పాటుకు కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామానికి తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బండి దత్తాత్రి, జాదవ్ కాలురామ్, ఉప సర్పంచ్ కడప అయ్యు, ఆత్రం జంగు, ఆత్రం లేతుబాయి, ఆత్రం నాగుబాయ్, ఆత్రం రామారావు, స్వామి పాల్గొన్నారు. -
జనగణన సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఉట్నూర్రూరల్: ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు ఆదివారం తన స్వగ్రామమైన ఉ ట్నూర్ మండలం కల్లూరిగూడ గ్రామంలో నిర్వహించిన జనగణన సర్వేలో పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి సర్వే అధికారులకు పూర్తి వివరాలు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలు అధికారులకు సహకరించి కచ్చితమైన వివరాలను నమోదు చేయించాలని సూచించారు. అధికారులకు నేరుగా చెప్పడమే కాకుండా, తమ మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఆన్లైన్లో నమోదు చేసుకునే సదుపాయం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరాలంటే సర్వే ఎంతో కీలకమని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్విని యో గం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ కోట్నాక్ రఘునాథ్రావు, సర్వే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
మద్యం అమ్మకాలపై నిషేధం
● గ్రామసభలో దప్పాపూర్ గ్రామస్తులు తీర్మానం నార్నూర్: మండలంలోని దుప్పాపూర్ గ్రామం ఆ దర్శ మార్గంలో పయనిస్తోంది. గ్రామంలో మద్యం నిషేధిస్తూ.. గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మా నం చేశారు. ఆదివారం సర్పంచ్ కనక సత్యనారా యణ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో, ఇప్ప టి నుంచి గ్రామంలో మద్యం, సారా విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ తీర్మానం చేశారు. గ్రామస్తుల సంక్షేమం, యువత భవిష్యత్ను దృష్టిలో ఉంచుకు ని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తీర్మానాన్ని ధిక్కరించి ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తూ.. కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మద్యరహిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో దూత్రాజు విశ్వజిత్ (ఉప సర్పంచ్), కనక ప్రభాకర్ (గ్రామ పటేల్), శ్రీరంగ వాగమారె, జ్ఞానోబా తిబొటే, రమేశ్, రామకిషన్, దుత్రాజ్ మధుకర్ ధుతరాజ్, శంకర్ కామ్లె, డి. ప్రేమానంద్, బుద్ధాజి, డిగాంబర్, ఉత్తం, త్రీముక్, రవిరాజ్ పాల్గొన్నారు. -
● స్వీయ నమోదు ప్రక్రియ షురూ ● వివరాలు అందజేసిన ప్రముఖులు ● మే 11 నుంచి ఇంటింటి జనగణన ● ఎస్ఈ ఐడీతో ప్రక్రియ వేగవంతం
జనగణనకు శ్రీకారంకై లాస్నగర్: వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన ప్రక్రియకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. తొలు త స్వీయ గణన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ప్రముఖులు తమ వివరాలు నమో దు చేసుకున్నారు. ప్రతీ కుటుంబం ఈ ప్రక్రియలో బాధ్యతగా పాల్గొని సరైన సమాచారం అందించా లని కలెక్టర్ రాజర్షిషా కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్పీ అఖిల్ మహజాన్, అదనపు కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రు, రాజేశ్వర్తో కలిసి వివరాలు వెల్లడించారు. మే 11నుంచి ఇంటింటి గణన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న జనగణన. ఈ ప్రక్రియను రెండు విడతల్లో డిజిటల్ విధానంలో చేపడుతున్నారు. మొద టి దశలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణనను మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహిస్తారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, గృహ ని ర్మాణం, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, వి ద్యుత్, నివాస స్థితి వంటి అంశాలపై సమగ్ర సమాచారం సేకరిస్తారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా గణన చేపడతారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ వ్యక్తి వివరాలు నమోదు చేస్తారు. 33 ప్రశ్నలతో సమాచారం సేకరణ తొలుత స్వీయ ఎన్యూమరేషన్కు అవకాశం కల్పించారు. ఆదివారం ప్రారంభమైన ఈ ప్రక్రియ మే 10 వరకు కొనసాగనుంది. https://se.censu s.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. మొబైల్ నంబర్తో లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా, విద్య, వృత్తి, సామాజిక పరిస్థితులు వంటి మొత్తం 33 ప్రశ్నలతో కూడిన సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు తెలుగు, ఆంగ్ల భాషల్లో సమాచారం నమోదు చేయవచ్చు. ఎస్ఈ ఐడీతో ప్రక్రియ వేగవంతం స్వీయ నమోదు ప్రక్రియ పూర్తయ్యాక 11 అంకెలతో కూడిన ఎస్ఈ ఐడీ వస్తుంది. దానిని విధిగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది. మే 11 తర్వాత ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ఆ ఐడీ నంబర్ చూపించాలి. తద్వారా ఇంటింటి గణన వేగంగా పూర్తి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష తమ వివరాలను స్వీయ నమోదు ద్వారా పూర్తి చేశారు. వివరాలు పూర్తిగా గోప్యం..జనాభా లెక్కల చట్టం ప్రకారం ప్రజలు అందించే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర శాఖలకు లేదా ఇతర అవసరాలకు వినియోగించరని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాలు, అపోహలు లేకుండా సరైన వివరాలు ఇవ్వాలని సూచించారు. ‘మన జనగణన–మన అభివృద్ధి’ నినాదంతో జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలలు, గ్రామ సభలు, పట్టణ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
బుద్ధుడి మార్గంలో నడవాలి
జైనథ్ : బుద్ధుడు చూపిన మార్గంలో నడవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మండలంలోని లక్షి్మ్పూర్ గ్రామంలో ఆదివారం నూతనంగా నిర్మించిన బుద్ధ విహార్, భగవాన్ గౌతమ బుద్ధ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం బుద్ధుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడు ప్రపంచానికి శాంతి, అహింస, సమానత్వం అనే సందేశాలను అందించడం జరిగిందన్నారు. బుద్ధుడు బోధించిన బోధనలు సమాజానికి మార్గదర్శకంగా ఉంటాయన్నారు. గ్రామంలో బుద్ధ విహార్ నిర్మాణం పూర్తిచేసుకుని విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బౌద్ధ సమాజ్ అధ్యక్షుడు భీమ్ రావు, ఉపాధ్యక్షుడు ఆనందరావు, కోశాధికారి భగత్ అశోక్, సంఘం పెద్దలు భగత్ గౌతమ్, దుర్గే ఆజానంద్, నాందేవ్, గ్రామస్తులు అడప తిరుపతి, దాసరి రాములు, గజంగుల స్వామి, నర్సింగ్ రావు, ఇజ్జగిరి నారాయణ పాల్గొన్నారు -
వడ్డీ వ్యాపారులపై కొరడా
ఆదిలాబాద్టౌన్: అధిక మిత్తీలతో ప్రజల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. అమాయక ప్రజలు, రైతుల అవసరాలు ఆసరా చేసుకొని అప్పులు ఇచ్చి వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలు, బంగారు ఆభరణాలు, ఇతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో వడ్డీ వసూలు చేయడంతో కొంత మంది చేసిన అప్పులు తీర్చలేక వారు కుదుపెట్టిన అస్తులు వ్యాపారుల పాలవుతున్నాయి. జిల్లాలో ఇలాంటి ఘటనలు ఇటీవల అనేకంగా చోటు చేసుకున్నాయి. పిల్లల చదువు, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగా లేకపోవడం, ఆడపిల్లల పెళ్లి, వ్యవసాయం తదితర పనుల కోసం అప్పులు చేస్తున్నారు. సాధారణ వడ్డీ తీసుకుంటే అప్పు చెల్లించడానికి వీలుంటుంది. కానీ చాలా మంది నెల వారీగా 6నుంచి 10శాతం వరకు తీసుకుంటున్నారు. ఈ వ్యాపారులు అప్పు తీసుకున్న వారిని మానసికంగా వేధించడంతో అవమానభారంతో కొందరు ఆత్మహత్య చేసుకుని తనవు చాలిస్తున్నారు. బాధిత కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోవడంతో రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల పలువురు బాధితులు తమ గోడును ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు వ్యాపారుల ఇళ్లపై దాడులు చేసి అప్పు పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి అక్రమ ఆగడాలకు చెక్ పెడుతున్నారు. దీంతో బాధితుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రజల నడ్డి విరుస్తున్న వ్యాపారులు.. జిల్లాలో వడ్డీ వ్యాపారుల దందా జోరుగా సాగుతుంది. జిల్లా కేంద్రంతో పాటు, గ్రామీణ ప్రాంతా ల్లో చోటామోటా వ్యాపారులు, కొంత మంది ప్రభు త్వ ఉద్యోగులు, మరికొంత మంది టీచర్లు ఈ అక్రమార్జనపై దృష్టి సారిస్తున్నారు. మధ్యవర్తుల ద్వారా డబ్బులు వడ్డీకి ఇస్తున్నారు. సామాన్యుల, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక మిత్తీ వసూలు చేస్తున్నారు. అప్పు ఇచ్చే సమయంలో ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, చెక్కులు, స్టాంప్పేపర్లు, ఇంటి స్థలాల పత్రాలను వారి వద్ద కుదువ పెట్టుకుంటున్నారు. ఇటీవలభూములు, ఖాళీ ప్లాట్లను రిజిస్ట్రేషన్, మార్టిగేజ్ చేసుకుంటున్నారు. అప్పు చెల్లింపు కోసం నిర్ణీత గడువు రాసుకుంటున్నారు. అ లోపు తిరిగి ఇవ్వకపోతే వారి అస్తులు వ్యాపారుల పాలవుతున్నాయి. ఇలా భూములు, బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న వారు అనేకం ఉన్నారు. -
స్వీయ జనగణన ప్రారంభం
బజార్హత్నూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చే పట్టిన జనగణన కార్యక్రమంలో భాగంగా ఎ న్యూమరేటర్ చందన్ బాబు, తహసీల్దార్ శ్యా ంసుందర్ ఆదివారం మండల కేంద్రంలో జి ల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లేపూల నర్స య్య నివాసంలో అతని కుటుంబవివరాలు నమో దు చేసి స్వీయ జనగణన ప్రారంభించారు. ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంఇచ్చోడ: మండలంలోని ముఖరా(కె) గ్రా మంలో ఆదివారం బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎడ్ల బండిపై కేసీఆర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, ప్రధాన విధుల గుండా ఊరేగించారు. మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సూభాష్లు మాట్లాడారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పాటు కోసం టీఆర్ఎస్ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారని గుర్తుచేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించాలిఇంద్రవెల్లి: విద్యుత్ వినియోగదారులు ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ రాథోడ్ శేషారావ్ అన్నారు. ఆదివారం మండలంలోని హీరపూర్ విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. విద్యుత్ సరఫరా, బిల్లుల రికవరీ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ బిల్లులు చెల్లింపు కోసం టీజీఎన్పీడీసీఎల్ డిజిటల్ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఇంద్రవెల్లి ఏఈ జాదవ్ రోహిదాస్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వైభవంగా వాసవీ మాత జయంతి వేడుకలుబోథ్: మండల కేంద్రంలోని ధర్మశాలలో వాసవీ కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను కమిటీ సభ్యులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజా కార్యక్రమాలను శాస్తోక్త్రంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం, వర్తక వాణిజ్య రంగాల్లో అందరికీ శుభం కలగాలని కోరు తూ మాతాజీని భక్తులు కోరుకున్నారు. కార్యక్రమంలో వాసవీమాత కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. పోడియం అందజేత జైనథ్: పాఠశాలకు అవసరాల నిమిత్తం పూర్వ విద్యార్థి బోల్లెం రమేశ్ ఆదివారం 6 వేల విలువ గల పోడియాన్ని పాఠశాలకు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోరెడ్డి అశోక్ మాట్లాడుతూ.. పాఠశాలకు అవసరమైన సమస్యలను తెలుసుకుని గ్రామస్తులు సాయం చేయడం చాలా సంతోషకరమన్నారు. పాఠశాలకు గ్రామస్తులు ఇలా తోడ్పాటు అందించడం వల్ల పాఠశాలను అభివద్ధి చేసుకోగలమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గజానన్, గంగన్న, సామల రాజవర్ధన్, దాసరి రాములు, స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళా రిజర్వేషన్ల అమలు ఖాయం
ఆదిలాబాద్: దేశంలో మహిళా సాధికారతకు పట్టం కడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మహిళా ఆగ్రహ సభలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల అమలే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఇందు కోసం ఆర్టికల్ 81కు 131వ రాజ్యాంగ సవరణను ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో దేశ జనాభాకు అనుగుణంగా లోక్సభ స్థానాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 815కి పెంచే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ పునర్విభజన ప్రక్రియ వల్ల ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో భారీ మార్పులు వస్తాయని వివరించారు. పెరిగిన స్థానాల్లో మహిళలకు 33 శాతం కేటాయించడం ద్వారా అణగారిన వర్గాలకు చట్టసభల్లో అధిక ప్రాతినిధ్యం లభిస్తుందని, ఇది నిజమైన సామాజిక న్యాయమని అభిప్రాయపడ్డారు. 1971 జనాభా లెక్కల ప్రకారం 1976లో నిర్ణయించిన 543 సీట్లనే ఇప్పటికీ కొనసాగించాలని చూడటం హాస్యాస్పదమన్నారు. 50 ఏళ్లు గడిచినా నియోజకవర్గాల పెంపును కాంగ్రెస్ వ్యతిరేకించడం వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన వాటా కావాలని కోరుతున్న రాహుల్ గాంధీ, నియోజకవర్గాల పెంపును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోవిడ్ వల్ల ఆలస్యమైన దేశవ్యాప్త జనగణన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వివరించారు. ఇది 2027–28 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. ఆ గణాంకాల ఆధారంగానే శాసీ్త్రయంగా పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని, ఆ వెంటనే 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సుమన్ రాథోడ్, ధోని జ్యోతి, చిలుకూరి జ్యోతిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్తాపురే అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
● 353(బి) హైవే పనులు ● కంకర రోడ్డుపై వాహనదారుల అవస్థలు ● కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం ● కరువైన అధికారుల పర్యవేక్షణ
కై లాస్నగర్: జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి 353(బి) నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభం కాగా, ఈఏడాది మే చివరి లోపు పూర్తి చేయాల్సి ఉంది. ఓ వైపు గడువు సమీపిస్తున్నా పనుల ప్రగతిని పరిశీలిస్తే సకాలంలో పూర్తికావడం గగనమే అనిపిస్తోంది. కాంట్రాక్టర్ పనుల్లో తీవ్ర జాప్యం చేస్తుండటంతో పాటు నిబంధనలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. అధికారుల పర్యవేక్షణ కరువవడమే కారణంగా తెలుస్తోంది. పనుల్లో తీవ్ర జాప్యం.. భోరజ్ మండలకేంద్రంలోని ఎక్స్రోడ్ నుంచి జైనథ్, బేల మీదుగా మహారాష్ట్రలోని అష్టి వరకు గల ఆర్అండ్బీ పరిధిలోని రోడ్డును కేంద్రం భారత్మాల పథకం కింద జాతీయ రహదారిగా మార్చింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు 141కిలోమీటర్లు ఉండగా, జిల్లాలో 33 కిలోమీటర్లు మాత్రమే విస్తరిస్తున్నారు. మహారాష్ట్ర ప్రాంతంలో ఎన్హెచ్ఏఐ నిర్మాణం పూర్తి చేయగా, ఇక్కడ పది మీటర్ల మేర రోడ్డును విస్తరిస్తున్నారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపడుతున్న నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. టెండర్ పొందిన కాంట్రాక్టర్ 2024 అక్టోబర్లో పనులు ప్రారంభించారు. ఈ ఏ డాది మే చివరి నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే పనుల్లో తీవ్ర జాప్యం చేస్తుండటంతో గడువులోపు పూర్తి చేయడం కష్టతరంగా మారింది. లోపించిన పర్యవేక్షణ.. గడువులోపు పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాల్సి న సంబంధిత అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. దీంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా ప నులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్ర కారం రోడ్డుకు ఇరువైపులా మొరం నింపాల్సి ఉండగా, పక్కనే పొక్లెయిన్లతో తవ్వుతూ నల్లమట్టితో నింపుతున్నారు. ఇది కనిపించకుండా ౖపైపెన మొ రం వేస్తున్నారు. దీంతో వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోయే అవకాశముంది. అలాగే తర్నం, జైనథ్, కొబ్బాయి సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులపై పర్యవేక్షణ లోపించింది. ఈ పనులు కూడా నిబంధనల మేరకు సాగడం లేదనే విమర్శలున్నాయి. నాణ్యతతో జరిగేలా చూస్తాం..జాతీయ రహదారి నిర్మాణ పనులను ఈ ఏడాది మే నాటికి పూర్తి చేయాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉండడంతో కూలీల కొరత ఏర్పడి పనులు సకాలంలో సాగలేదు. పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉండటం, బ్రిడ్జి పనులు కొనసాగుతున్నందున గడువు మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉంది. నాణ్యత ప్రమాణాల మేరకు పనులు జరిగేలా దృష్టి సారిస్తాం. ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపడతాం. – సుభాష్, డీఈ, ఎన్హెచ్నిత్యం అవస్థలే..అంతర్రాష్ట్ర రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బేల, జైనథ్ మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి ఈ మార్గం గుండానే ప్రయాణిస్తారు. నత్తనడకన సాగుతున్న ఈమార్గంలో ప్రయాణం వాహనదారుల పాలిట శాపంగా మారుతుంది. తేలిన కంకరతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. -
చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
ఇంద్రవెల్లి: చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి.. నాణ్యత విద్యను సద్వినియోగం చేసుకోవాలని వడగామ్ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విరేందర్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆది వా రం మండలంలోని వడగామ్ గ్రామంలో బడిబాట నిర్వహించారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి పిల్లల వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆత్రం లక్ష్మణ్, ఆత్రం సీతా రాం, జాదవ్ రాజు, అంగన్వాడీ టీచర్ ఆత్రం నా గుబాయి, విద్యార్థులు పాల్గొన్నారు. బడిబాటతో చదువుకు ప్రోత్సాహంనేరడిగొండ: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐటీడీఏ విభాగం ఆధ్వర్యంలో సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. లఖంపూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆదివారం మండలంలోని రోడ్ లఖంపూర్, గోండ్ లఖంపూర్ గ్రామాల్లో శ్రీబడి బాటశ్రీ నిర్వహించారు. గ్రామ వీధుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి విద్య ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సెడ్మకి సుజాత, గంగారాం, ఉప సర్పంచ్ రేంగెపూజ సిద్దేశ్వర్, ప్రధానోపాధ్యాయులు ఎ.మధుకర్, ఉపాధ్యాయులు వి.రాజేశ్వర్, టి.గంగాభవాని, ఎ.రాజునాయక్ పాల్గొన్నారు. బోథ్: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో ఆది వారం బడిబాట కార్యక్రమాన్ని ఎంపీడీవో రమేశ్ ప్రారంభించారు. బడీడు పిల్లలందరినీ తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, విద్యాభ్యాసం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు మరియు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పి స్తున్న ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ పంద్రం సుగుణ శంకర్, పర్యవేక్షకులు రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు ఆత్రం శంకర్, శే ఖర్, ఉపాధ్యాయులు సాయిరెడ్డి, ఇందల్ సింగ్, మోహన్ సింగ్, మారుతి, లక్ష్మణ్ నాగోరావు, రామచందర్, లాఖాన్ సింగ్, బలిరాం, గోపీచంద్, జైతు పాల్గొన్నారు. సాత్నాల: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన నాణ్య మైన విద్య లభిస్తుందని ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గణేష్ అన్నారు. బడిబాట ముగింపు సందర్భంగా సైద్పూర్ ఆశ్రమ పాఠశాల ఆధ్వర్యంలో ఆదివారం సలయితండా, పలైతండా గ్రామాల్లో విద్యార్థులతో బడిబాట ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యాబోధనపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల వార్డెన్ ప్రేమ్సింగ్, శంకర్, కరుణాకర్, ప్రభు, శిల్ప, తదితరులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలినార్నూర్: మండలంలోని మాన్కాపూర్ గ్రామంలో ఆదివారం బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ తొడసం రేణుక నాగోరావు పా ల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలకు అవగా హన కల్పించారు. ప్రతీ చిన్నారికి విద్య ఎంతో ముఖ్యమని, పాఠశాలకు హాజరు కావడం ద్వారా వారి భవిష్యత్ బలపడుతుందన్నారు. ప్రభుత్వ పా ఠశాలలో అందుతున్న సౌకర్యాలను సద్విని యో గం చేసుకోవాలని, ఉపాధ్యాయులతో సమన్వ యం చేసుకుని పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పె ట్టాలన్నారు. విజయ్కుమార్ ఎస్సీఈఆర్పీ, ఉపాధ్యాయులు సుభాష్ చౌహాన్, ప్రకా ష్, మనిక్, నివేదిక, జేవంత, సరోజ, జ్యోతి పాల్గొన్నారు. -
గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు
బజార్హత్నూర్: మండల కేంద్రంలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ దేవతలకు సల్లనంబలి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహలక్ష్మీ, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోతరాజు దేవతలకు బోనాలు సమర్పించారు. అనంతరం మహ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నాగభూషన్, కొత్త శంకర్, చట్ల గజ్జారాం, చట్ల వినిల్, చిల్కూరి భూమన్న, కొత్తనర్సయ్య, బొమ్మెడి సంజీవ్, చట్ల ఉత్తం, వొర్ని రమణ, చట్ల సుఖ్దేవ్, దీసీ రమణ, తురాటీ భోజన్న, అల్లం శంకర్, కర్వల గంగయ్య పాల్గొన్నారు. -
పొంచి ఉన్న ప్రమాదం
ఆకర్షిస్తున్న పూల వనంబోనమెత్తిన తాంసి తాంసి మండల కేంద్రంలో ఆదివారం గ్రామదేవతలకు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో సామూహిక బోనాలను సమర్పించారు. డప్పుచప్పుళ్లతో ప్రధానవీధుల గుండా ఊరేగింపుగా పోచ్చమ్మ ఆలయానికి చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోచమ్మకు ప్రత్యేకంగా వండిన బోనాలను సమర్పించారు. బోనాల పండుగతో గ్రామంలో పండుగా వాతావరణ నెలకొంది. – తాంసి ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డు సమీపంలో జలాంతండా చౌక్ వద్ద నిర్మించిన కల్వర్టు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కోతకు గురైంది. తరచు ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు స్పందించడం లేదు. కల్వర్టుకు మర్మతులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. – ఇంద్రవెల్లి భోరజ్ మండలం తర్ణం శివారు వాగులో ప్రకృతి అరుదైన అందాన్ని ఆవిష్కరించింది. వాగు నిండా తామర పూలు విరబూసి చూపారులను ఆకట్టుకుంటున్నాయి. మండు వేసవిలో నిండు పూల తోటలా ఉందని కొందరు మొబైల్ ఫోన్లో తామర పూలను బంధిస్తున్నారు. – సాత్నాల -
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
ఆదిలాబాద్: నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బేస్బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించాలని బేస్ బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివా స్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం జిల్లా క్రీడాకారు ల ఎంపిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 27నుంచి నిజామాబాద్లో నిర్వహించనున్న పోటీల్లో జిల్లా జట్లు సత్తా చాటాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికై న క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఇందులో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జ్యోతి అజయ్, కోశాధికారి గౌతమ్, హరిచరణ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికసాయం
బోథ్: మండలంలోని బిర్లాగొంది సర్పంచ్ రాథోడ్ రాజేశ్వర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పంచాయతీ పరిధిలో జరిగే ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. 10,116 ఇస్తానని హామీ ఇచ్చారు. హామీ ప్రకారం ఆడపిల్లల పెళ్లిల్లకు నగదును అందజేస్తున్నారు. కాగా గ్రామానికి చెందిన రాథోడ నందు కుమార్తె ఉమా (విజయలక్ష్మి) వివాహానికి నగదు సాయం అందజేశారు. కార్యక్రమంలో రవీందర్, పవన్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. పంట కొనుగోళ్లు నిలిపివేతబోథ్: బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జొన్న, మొక్కజొన్న. శనగల కొనుగోలు కేంద్రాల్లో పంట నిల్వలు పేరుకుపోవడం వల్ల కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెంటర్ ఇన్చార్జి బారె నాగబూషణం ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు ప్రక్రియకు అంతరాయం కలుగుతుందని, రైతులు గమనించి సహకరించాలని కోరారు. -
ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు సన్మానం
బోథ్: అమెరికన్ యూనివర్సిటీ నుంచి ప్రతిష్ఠాత్మక గౌరవ డాక్టరేట్ అందుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను సొనాల మండల నాయకులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. విద్య , సామాజిక సేవా రంగాల్లో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా డాక్టరేట్ లభించడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న అనిల్ జాదవ్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం బోథ్ నియోజకవర్గానికే గర్వకారణమని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేరడిగొండ: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా మండలంలోని వడూ ర్ గ్రామంలో సంబురాలు జరుపుకున్నారు. సర్పంచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీ రాభిషేకం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో బోథ్ ప్రాంతం మ రింత అభివృద్ధి చెందుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భూ షన్, ఫయాజ్, సుజిల్, రాములు, నవీన్, అస్మత్, రమణ, స్వామి, ఊషన్న, భూమన్న పాల్గొన్నారు. -
వాసవీమాతకు ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్: వాసవీమాత చూపిన మానవ సేవ, అహింసా మార్గం అనుసరణీయమని క లెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలను ఆదివారం అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం తన దృష్టికి తెచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో డీవైఎస్వో శ్రీనివాస్, పర్యాటక శాఖ అధి కారి రవి కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తవార్ రాజేశ్వర్, భక్తులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
నార్నూర్: రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తమ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ నార్నూర్ ద్వారా వ్యవసాయ మార్కెట్ ఇన్ఫ్రా సబ్ మార్కెట్యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. తేమ 14 శాతం లోపు ఉండాలన్నారు. రైతులు తమ పంటను శుభ్రంగా, ఎండబెట్టి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని సూచించారు. అలాగే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, జమాబంది పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లను వెంట తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ ఆడే సురేష్, ఉప సర్పంచ్ మహ్మద్ ఖురేషి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖషీమ్, భిక్షపతి రాథోడ్, సీఈవో ఆడే గణేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ క్రాక్డౌన్లో భారీ సైబర్ మోసాలు
ఆదిలాబాద్టౌన్: జిల్లా పోలీసులు ఆపరేషన్ క్రాక్డౌన్లో భాగంగా భారీ సైబర్ మోసం గుట్టురట్టు చేశారు. 74 అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను గుర్తించారు. 12 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. రూ.7 కోట్లకు పైగా జరిగిన బ్యాంకు లావాదేవీలను గుర్తించారు. మ్యూల్ అకౌంట్ల ద్వారా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, ఫేక్ ట్రేడింగ్ మోసాలను గుర్తించారు. శనివారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నమోదైన ఎన్సీఆర్పీ ఫిర్యాదులతో ఈ అకౌంట్లు అనుసంధానమై ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలను స్నేహితులు, బంధువులు, ఇతరులకు ఇవ్వడం నేరమని స్పష్టం చేశారు. అలా చేసిన వారిపై అరెస్ట్, ఖాతాల ఫ్రీజింగ్, ఎన్సీఆర్పీలో నమోదు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరాలపై, మ్యూల్ అకౌంట్ హోల్డర్లపై, గేమింగ్కు సంబంధించిన అక్రమ ఆర్థిక లావాదేవీలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఎస్సై గోపికష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. నిందితుల రిమాండ్ ఈ కేసులో నిందితులను గుర్తించి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అవేస్ ఖాన్, మడావి ఘన్శ్యామ్, జాధవ్ సంతోష్, సురం ఆశమ్మ, జక్కుల ప్రవీణ్, సురం విశ్వేశ్వర్, రాథోడ్ మనోజ్, జి.ఆర్యన్గౌడ్, జాధవ్ గోవర్ధన్, షేక్ సమీర్, చౌహన్ గోపాల్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ ప్లాట్ఫార్మ్స్, ఫేక్ ట్రేడింగ్, టాస్క్, రివ్యూ మోసాల ద్వారా అక్రమ డబ్బు మార్పిడి జరిపినట్లుగా విచారణలో వెల్లడైంది. షెర్ల రాజవర్ధన్, పేట్లశ్రీ అక్షయ్, రాజేందర్, షేక్ సమీర్ను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. -
జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలు
ఉట్నూర్రూరల్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభించామని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్ అన్నారు. ఉట్నూర్ డివిజనల్ కార్యాలయంలో మేనేజర్లు, సిబ్బందితో శనివారం సమావేశమై మాట్లాడారు. గిరిజనులు, ఆదివాసీలు సేకరించిన ఇప్ప పువ్వు, ఇప్ప పరక, తేనె, మైనం, చింతపండును జీసీసీ సొసైటీ కార్యాలయాలు, డిఆర్ డిపోల వద్దకు తీసుకువచ్చి విక్రయించాలన్నారు. గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్, ఐటీడీఏ పీవో యువరాజు మర్మాట్ ఆదేశాల మేరకు అటవీ ఉత్పత్తుల కొనుగోలు వెంటనే ప్రారంభించామన్నారు. సీనియర్ మేనేజర్లు సంతోష్ కుమార్, తారాచంద్, మేనేజర్లు ఇస్తారి, రమేశ్, మనోహర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు
కై లాస్నగర్(బేల): నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న రాకెట్ను బేల పోలీసులు ఛేదించారు. అక్రమంగా విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 150 నకిలీ విత్తన ప్యాకెట్లతో పాటు వారి వద్ద నుంచి రూ.60 వేల నగదు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం బేల పోలీస్ స్టేషన్లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. బేల మండలం సాంగిడి శివారులో రోడ్డు పక్కన కొందరు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ విత్తనాలు నకిలీవా కావా అనేదాన్ని నిర్ధారించేందుకు వ్యవసాయ అధికారిని సంఘటన స్థలానికి పిలిపించి పరిశీలించగా అవి నకిలీవని నిర్ధారించినట్లు డీఎస్పీ తెలిపారు. పత్తి విత్తన ప్యాకెట్ తయారీ చేసి.. నిందితుడు సాంగిడి గ్రామానికి చెందిన జిట్టావార్ కిశోర్రెడ్డి గుజరాత్కు చెందిన నరేశ్ క్రాప్ సైన్స్ కంపెనీలో కమిషన్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేసే ధర్మేష్ కచ్చడియాతో కలిసి కుట్రపన్ని మౌళి 555తో ఉన్న నిజమైన పత్తి విత్తన ప్యాకెట్ను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రెండు నెలలుగా గుజరాత్ నుంచి నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా సుమారు 4,500 నకిలీ విత్తనాల ప్యాకెట్లు తెప్పించారని డీఎస్పీ తెలిపారు. అందులో 4 వేల ప్యాకెట్లను మహారాష్ట్రలోని ఝరి జామ్ని గ్రామానికి చెందిన రక్తావర్ పవన్ ద్వారా 350 ప్యాకెట్లను సాంగిడికి చెందిన నవగరే కునాల్, మణియార్పూర్కు గ్రామానికి చెందిన కుల్దీప్ టాక్రె ద్వారా రైతులకు అసలైన విత్తనాలుగా నమ్మించి విక్రయించినట్లు విచారణలో తేలింది. రెండు ప్యాకెట్లను నమూనా తీసుకుని పరీక్షకు పంపించి, మిగతా వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఆది లాబాద్ రూరల్ సీఐ కె. ఫణిదఽర్, ఎస్సై మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి స్వీయ గణన షురూ
కై లాస్నగర్: కేంద్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా తలపె ట్టిన జనగణన–2027 ప్ర క్రియ ఆదివారం నుంచి షురూ కా నుంది. తొలివిడతలో భాగంగా ఈ నెల 26నుంచి మే 10 వరకు స్వీయ గణనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రజలు ఇంటి నుంచే ప్రత్యేక యాప్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. http://se.census.gov.in లింక్ను ఓపెన్ చేసి వివరాలను తొమ్మిది స్టెప్లలో నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ వినియోగించాలని, అలాగే సరైన వివరాలు నమోదు చేయాలని సూచించారు. మే 11 తర్వాత ఎన్యూమరేటర్లు ఇళ్లవద్దకు వస్తారని, వారికి ఆన్లైన్లో నమోదు చేసిన ఎస్ఈ ఐడీ చూపిస్తే దానిని పరిశీలించి ఆమోదిస్తారని పేర్కొన్నారు. -
ఇంటర్ ఫలితాల్లో పురోగతి సాధించాలి
కై లాస్నగర్: ఇంటర్ ఫలితాల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీ క్షల నిర్వహణ, ఈ ఏడాది పరీక్షల ఫలితాలు, ఇతర అంశాలపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల ప్రకటించిన పరీక్ష ఫలితాలు జిల్లాకు సంబంధించి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రానున్న విద్యాసంవత్సరంలో ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల ఉండాలని ఆదేశించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజర య్యే విద్యార్థుల కోసం సబ్జెక్టుల వారీగా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో డీఐఈ వో గణేశ్ జాదవ్, సెక్టోరియల్ అధికారి ప్రత్యూష, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు తది తరులు పాల్గొన్నారు. శిక్షణ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బాల కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రచార పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. కూచిపూడి, జానపద నృత్యం, చి త్రలేఖనం, సంగీతం (లలిత, కర్ణాటక, హిందూస్తా నీ), వాయిద్య పరికరాలు (తబల, హార్మోనియం, పియానో), కుట్లు–అల్లికలు, మెహందీ వంటి అంశాలపై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 30 వరకు ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 7:30 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐదు నుంచి 16ఏళ్ల లోపు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతేడాది కరాటేలో అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన మాస్టర్లు మిట్టు దత్తు, గాజుల జగన్నాథ్ రుషి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సాధించగా వారికి మెమొంటో అందజేసి అభినందించారు. ఇందులో డీఐఈవో గణేశ్ జాదవ్, బాల కేంద్రం ప్రతినిధులు మెట్టు రవి, ట్రైనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు డాక్టరేట్
నేరడిగొండ: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు శనివా రం యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ లీడర్షిప్ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, గ్రామీణ ప్రాంతాల్లో చేసిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేసినట్లు వర్సిటీ ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే హాజ రై డాక్టరేట్ను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం తనకు ఆనందంగా ఉంటుందని తెలిపారు. ఆ సేవలే ఈ గౌరవాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. -
రసవత్తరం
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్లో కోఆప్షన్ పదవులకు తీవ్రపోటీ నెలకొంది. నాలుగింటికి గా ను 28దరఖాస్తులు అందాయి. ప్రధాన పార్టీలైన బీ జేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ నుంచి భారీగా రాగా ఎంపిక ప్రక్రియ రసవత్తరంగా మారనుంది. పోటా పోటీ.. నాలుగు కోఆప్షన్ పదవుల్లో రెండు జనరల్, రెండు మైనార్టీలకు కేటాయించారు. చైర్పర్సన్ ఎన్నిక స మయంలో కూటమిగా ఏర్పడి చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల్లో విబేధాలు తలెత్తినట్లుగా తెలు స్తోంది. అందుకే కోఆప్షన్ కేటాయింపుపై ఆయా పార్టీల్లో ఇప్పటి వరకు సఖ్యత కుదరలేదు. ఈ క్ర మంలో బీఆర్ఎస్ మొత్తం నాలుగింటికి తమ పార్టీ వారితో దరఖాస్తు చేయించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుంచి పదవీని ఆశిస్తూ ఏకంగా తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంఐఎం నుంచి ఇద్దరు దరఖాస్తులు అందజేసినట్లుగా తెలి సింది. ఇలా ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందిన నేపథ్యంలో పదవీ ఎవరికి దక్కుతుందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. పక్కా వ్యూహంతో బీజేపీ .. చైర్పర్సన్, వైస్చైర్మన్ఎన్నిక సమయంలో కూటమి తీరుతో భంగపడ్డ బీజేపీ ఈసారి పక్కా వ్యూహంతో ముందడుగు వేస్తుంది.ఆ పార్టీ తరపున నలుగురిని మాత్రమే బరిలో నిలిపింది. ఎమ్మెల్యే తనయుడు పాయల్ శరత్ స్వయంగా అభ్యర్థులను మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి దరఖాస్తు చేయించ డం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. కూట మిలో అనైక్యతను సద్వినియోగం చేసుకోవాలని క మలం పార్టీభావిస్తోంది. ఆదిశగా వ్యూహాలకు పదు ను పెడుతూ సభ్యులగెలుపునకు అవసరమైన మద్ద తు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చైర్పర్సన్ అనుమతితో .. దరఖాస్తు గడువు ముగియడంతో మూడు రోజుల పాటు మున్సిపల్ అధికారులు వాటి పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం అర్హుల జాబితా సిద్ధం చేసి చైర్పర్సన్ అనూష ముందు ఉంచనున్నారు. ఆమె అనుమతితో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. చేతులెత్తే విధానంలో ఈ ఎన్నిక చేపట్టనున్నారు. మే మొదటి వారంలో ప్రత్యేక సమావేశం ఉండే అవకాశం ఉంది. -
రైట్.. రైట్
ఆదిలాబాద్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు మూడు రోజుల పాటు చేసిన సమ్మె శనివారంతో ముగిసింది. ఈ నెల 22నుంచి 24వరకు వినూత్న ఆందోళనలతో ని రసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజా రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కార్మిక జేఏసీతో ప్రభుత్వం శుక్రవారం జరిపిన చర్చలు సఫలం కావడంతో బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కాయి. మరోవైపు తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమైంది. ఆయా డిపోలు, బస్టాండ్ల వద్ద సంబరాల్లో మునిగితేలారు. బస్సులన్నీ అందుబాటులోకి.. సమ్మె ముగియడంతో అన్ని బస్సులు రోడ్డెక్కాయి. ఉదయం నుంచే కార్మికులు విధుల్లో చేరారు. దీంతో ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడాయి. సమ్మె జరిగిన మూడు రోజుల్లో అరకొరగా బస్సులు నడవగా, శనివారం పల్లె వెలుగు మొదలుకొని రాజధాని వరకు అన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. రీజియన్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 641 బస్సులు నడిచినట్లు అధికారులు తెలిపారు. కార్మికుల సంబరాలు.. కార్మిక జేఏసీ నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆదిలాబాద్ డిపో వద్ద కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. నర్సంపేటలో నిప్పంటించుకుని అమరుడైన శంకర్గౌడ్ చిత్రపటానికి ముందుగా నివాళులర్పించారు. అనంతరం సీఎం, మంత్రుల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. డిపో నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు. టపాసులు కాల్చి స్టెప్పులేస్తూ హర్షం వ్యక్తం చేశారు. -
● ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ద్వారా.. ● గూడేలు దాటి.. హైదరాబాద్ సందర్శన ● తొలిసారి నగరాన్ని చూసి పులకింత ● అడవి జీవితాల్లో వినూత్న అనుభూతి
అడవితల్లి ఒడి దాటని జీవితాలవి.. గూడేల్లో సాగు, అటవీ ఉత్పత్తుల సేకరణకే పరిమితమైన ఆ గిరిపుత్రులు ఊరు దాటడమే అరుదు.. పట్టణాలకు వెళ్లడం తక్కువే. ఇక నగరాన్ని చూడని వారెందరో.. అలాంటి వారు హైదరా బాద్ సందర్శనతో పులకించిపోయా రు.. ఎత్తైన భవంతులు, విశాలమైన రోడ్లు, చారిత్రక కట్టడాలు, పర్యాటక స్థలాలను సందర్శించి కొత్త బంగారు లోకంలో విహరించారు. – సాక్షి, ఆదిలాబాద్ ఆదివాసీలకు కొత్త అనుభవాలను ఇవ్వడం, నగర జీవన విధానం పరిచయం చేయడం, ఆత్మవిశ్వాసం పెంచడం, భిన్న సంస్కృతుల మధ్య అవగాహన ఏర్పరచడం, సాంస్కృతిక మార్పిడి, అంతిమంగా గిరపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రివర్స్ టూరిజం పేరిట సరికొత్త ప్రయోగం చేశారు. ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రాంను గడిచిన బుధవారం ఉట్నూర్ మండలం గొండుగూడలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఆ రోజు గొండుగూడ పంచాయతీ పరిధిలోని కొలాంగూడ, మారుతీగూడ, గొండుగూడలకు చెందిన ఆదివాసీలు 250 మంది తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన ఐదు ఏసీ బస్సుల్లో హైదరాబాద్కు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. మంత్రి జూపల్లితో పాటు ఖా నాపూర్ ఎమ్మెల్యే బొజ్జు వారితో కలిసి ప్రయాణం చేశారు. రెండు రోజుల పాటు సాగిన తొలి విడత పర్యటన పూర్తయింది. విమానాశ్రయం, చార్మినార్, హుస్సేన్సాగర్, జూపార్క్, శిల్పారామం, బుద్ధవనంలో తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించిన ఆదివాసీలు కొత్త అనుభూతులను తమ మదిలో పదిలపరుచుకున్నారు. ఆ జ్ఞాపకాల తోడుగా తిరిగి గూడేలకు చేరుకున్నారు. రెండో విడతలో దొంగచింత జీపీ పరిధిలోని కుమ్మరికుంట, భీంజీ గూడ వాసులు సుమారు 500 మంది 11 బస్సుల్లో శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ఇలా ఎక్కువ మంది ఆదివాసీలను నగర సందర్శన చేయించాలనే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతుంది. బుద్ధవనంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కుటుంబ సభ్యులతో ఆదివాసీలుహైదరాబాద్ సందర్శనకు బయలుదేరిన ఆదివాసీ మహిళలతో బస్సులో ముచ్చటిస్తున్న మంత్రి జూపల్లిజూపార్కులో జంతువులను చూస్తూ ఫొటో తీస్తున్న ఆదివాసీలు -
ఆదివాసీల అభివృద్ధికి కృషి
ఉట్నూర్రూరల్: ఆదివాసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. ఉట్నూరు మండలం దొంగచింత, కుమ్మరికుంట గ్రామాల ‘ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్’ రెండో విడత కార్యక్రమాన్ని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఆదివాసీ విజ్ఞాన యాత్ర పేరిట మూడు విడతలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండో విడతలో భాగంగా 450 మందిని 11 టూరిస్ట్ బస్సుల్లో యాత్రకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లోని విమానాశ్రయం, గోల్కొండ తదితర నగర అందాలను వివిధ పర్యాటక ప్రదేశాలను చూపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఆదివాసీలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శిక్షణ అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో స్థానిక వైటీసీలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు, ఐటీడీఏ పీవో యువరాజ్తో కలిసి కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో ఐటీడీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నైపుణ్యంతోనే ఉజ్వల భవిష్యత్తు
ఆదిలాబాద్టౌన్: యువత ఆయా రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో శుక్రవారం ఆధునిక నైపుణ్యాభివృద్ధిపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు.యువత స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. జిల్లా యంత్రాంగం, కళా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో నిపుణులు పవర్పాయింట్ ద్వారా ఐటీ, సేవా, స్వయం ఉపాధి విభాగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను వివరించారు. ఇంటర్వ్యూ, డిజిటల్ స్కిల్స్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఐఈవో గణేశ్జాదవ్, డీడబ్ల్యూవో మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.మనోహర్ రావు, మైనార్టీ సంక్షేమ అధికారి కలీం, డీవైఎస్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.జనగణన పకడ్బందీగా చేపట్టాలి కై లాస్నగర్: జనగణన–2027 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు రెండో విడత శిక్షణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం సమర్థంగా ఉపయోగించడం ద్వారా గణాంకాల్లో ఖచ్చితత్వం పెరుగుతుందన్నారు. నమోదు ప్రక్రియను రెండు విడతల్లో చేపడుతున్నట్లుగా వివరించారు. ముందుగా ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి గృహాల జాబితాను సేకరిస్తారన్నారు. అనంతరం అధికారులకు జనగణన కిట్లను అందజేశారు. ఇందులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్కుమార్, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి
నేరడిగొండ: ఉపాధిహామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని డీఆర్డీవో రవీందర్ అన్నా రు. వడూర్, నేరడిగొండ పంచాయతీల్లో కొనసాగుతున్న ఉపాధి పనులను శుక్రవారం పరి శీలించారు. కూలీల హాజరు నమోదుపై అధికా రులకు పలు సూచనలు చేశారు. ప్రతి జీపీలో కనీసం 150 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో శేఖర్, ఏపీవో వసంతరావు, వడూర్ సర్పంచ్ శ్రీకాంత్, కార్యదర్శి సద్దాం హుస్సేన్ తదితరులున్నారు. పలుచోట్ల పనుల పరిశీలన బోథ్: మండల కేంద్రంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను డీఆర్డీవో రవీందర్ పరిశీలించారు. కూలీలతో మాట్లాడి హాజరు విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం జీడిపల్లిలో ఉపాధి పనులను పరిశీలించారు.ఇందులో పంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఈసీ మధుకర్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మెట్లు,సిబ్బంది పాల్గొన్నారు. -
వంద రోజులపై ఆశలు
కై లాస్నగర్: ఉద్యోగ విరమణ పొంది ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలు అందడం లేదు. వాటిని చెల్లించాలంటూ రిటైర్డ్ ఉద్యోగులు కొంత కాలంగా ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. బకాయిలను వంద రోజుల్లో చెల్లించాలని నిర్ణయించిన సర్కారు ఇందుకు గాను ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. నిర్దిష్ట కాల పరిమితి ప్రకటించడంపై రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తదనుగుణంగా ప్రయోజనాలు అందించాలని కోరుతున్నారు. 2024 నుంచి పెండింగ్లో.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సును కేసీఆర్ సర్కారు మూడేళ్ల పాటు పెంచిన విషయం తెలిసిందే. 2021 మార్చి 31న రిటైర్డ్ అయ్యే వారి సర్వీసును మూడేళ్లు పొడిగించింది. అప్పటికే ఉన్న బకాయిలను చెల్లించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2024 ఏప్రిల్ 30 నుంచి ఉద్యోగ విరమణ ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి జిల్లాలో వందలాది మంది ఉద్యోగులు ఏటా రిటైర్ అవుతున్నారు. వారికి అర్జిత సెలవులు, జీపీఎఫ్, గ్రాట్యూటీ, కంటేషన్ వంటి ప్రయోజనాలను ఉద్యోగ విరమణ పొందిన వెంటనే చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఖజానా ఖాళీ ఉందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది. ఉద్యోగులకు చట్టపరంగా రావాల్సిన ప్రయోజనాలతో పాటు వారు దాచుకున్న సొమ్మును కూడా పొందలేని పరిస్థితి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు ఈ ప్రయోజనాలను పొందకుండానే పరలోకానికి పయనమయ్యారు. ఎట్టకేలకు స్పందన.. జిల్లాలో ఫ్యామిలీ పెన్షనర్స్, సర్వీస్ పెన్షనర్స్ కలిపి 4,273 మంది ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరికి సగటు న రూ.60లక్షల నుంచి రూ.70లక్షల వరకు రా వాల్సి ఉంది. మూడేళ్లుగా ప్రభుత్వం వీటి చెల్లింపులో జాప్యం చేస్తోంది. సుమారు రూ.2,563 కోట్ల 80లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రయోజనాలను వెంటనే చెల్లించాలంటూ రిటైర్ అయిన వారు దశల వారీగా ఆందోళనలు చేస్తున్నారు. పిల్లల చదువు, ఆ రోగ్యం, పెళ్లిళ్లు, ఇతరత్రా అవసరాల నిమిత్తం దా చుకున్న జీపీఎఫ్ సొమ్ము సైతం విడుదల కావడం లేదు. దీంతో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారు. కొంత మంది ఈ వేదన భరించలేక ప్రయోజనాలు పొందకుండానే మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు వాటిపై స్పందించింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. వంద రోజుల్లో బకాయిల సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. సర్కారు నిర్ణయంపై జిల్లాలోని రిటైర్డ్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. జిల్లాలో.. సర్వీస్ పెన్షనర్స్ 2,345 ఫ్యామిలీ పెన్షనర్స్1,928 ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా రావా ల్సిన ప్రయోజనాలు మూడేళ్లుగా అందడం లేదు. దీంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి వంద రోజుల్లో చెల్లించేలా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడాన్ని స్వాగతిస్తున్నాం. బకాయిలన్నీ గడువులోపు విడుదల చేయాలి. – సాయిరి శశికాంత్, ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
కోఆప్షన్ దక్కేదెవరికో?
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ కోఆప్షన్ పదవులపై నెలకొన్న ఉత్కంఠ వీడటం లేదు. నాలుగు పదవుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుంది. అయినా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో కూడిన కూట మిలో పదవుల పంపకాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయనే దానిపై సందిగ్ధం వీడని పరిస్థితి. ఒక్కో పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్, ఎంఐఎంలు తమ అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో కీలకపాత్ర పోషించిన బీఆర్ఎస్లో మాత్రం పదవులను ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. నాలుగు పదవుల్లో మూడు పదవులు తమకే కావాలని ఆ పార్టీ నాయకత్వం పట్టుబడుతుండటంతో చివరి వరకు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయా పా ర్టీలు తమ అభ్యర్థులతో దరఖాస్తు చేయించేందుకు రంగం సిద్ధం చేశాయి. ఈ మేరకు పోటీలో నిలిపే వారికి సమాచారం కూడా ఇప్పటికే అందజేశాయి. వారు దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మూడు పదవులపై బీఆర్ఎస్ పట్టు.. కోఆప్షన్ పదవులు మున్సిపాలిటీలో నాలుగు ఉండగా రెండు జనరల్, మరో రెండు మైనార్టీ కోటా కింద భర్తీ చేయనున్నారు. ఇందులో మూడు పదవులను బీఆర్ఎస్ కోరుతున్నట్లుగా చర్చ సాగుతుంది. మరోవైపు తమకు ఒక్కో సీటు కావాలని కాంగ్రెస్, ఎంఐఎంలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై కూటమిలో శుక్రవారం రాత్రి వరకు కూడా ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఇదిలా ఉంటే ఎంఐఎం తరఫున రాంనగర్ వార్డు మాజీ కౌన్సిలర్ శనవాజ్ ఉర్ రహమాన్ను కోఆప్షన్ మెంబర్గా ఎంపిక చేయగా, కాంగ్రెస్ తరఫున గతంలో అదే వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి ఓటమి పాలైన ఖయ్యుంను ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే వారికి సమాచారం అందించిన ఆయా పార్టీల నాయకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బీఆర్ఎస్లో మాత్రం ఇప్పటివరకు అభ్యర్థులు ఎవరు అనేదానిపై స్పష్టత రాలేదు. దీంతో ఆశావహుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నుంచి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేనట్లుగా తెలుస్తోంది. బీజేపీ సైతం.. మొత్తం 49 వార్డులకు గాను 21 మంది కౌన్సిలర్లను గెలుచుకొని బీజేపీ బల్దియాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో ఓట్లు సైతం ఉన్నాయి. 23 సంఖ్యాబలం ఉన్నప్పటికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. అయితే కోఆప్షన్ పదవుల్లో మాత్రం సత్తా చాటాలని కమలం పార్టీ భావిస్తోంది. నాలుగు పదవుల కోసం పోటీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. పార్టీలో సీనియర్ నాయకులను బరిలో నిలపాలని యోచిస్తోంది. ఎమ్మెల్యే శంకర్ ఈ విషయమై శుక్రవారం రాత్రి ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో చర్చించినట్లుగా సమాచారం. కూటమికే మెజార్టీ ఉండగా, సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం రాకపోవడం బీజేపీకి కలిసిరానుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు పదవుల్లో కనీసం ఒక్కటైనా దక్కించుకొని తమ ఉనికి చాటుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా ఏ పార్టీకి పదవులు దక్కుతాయి.. ఎవరు దరఖాస్తు చేస్తారనేది తేలిపోనుంది. -
చిన్నారుల్లో సంస్కారం పెంపొందాలి
ఆదిలాబాద్: చిన్నారుల్లో సంస్కారం పెంపొందించాలని మున్సిపల్ చైర్పర్సన్ అనూష అ న్నారు. స్థానిక సంజయ్నగర్లోని శ్రీరామకృష్ణ సేవాసమితి కార్యాలయంలో సమితి ఆధ్వర్యంలో బాలసంస్కార్ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె శిబిరాన్ని ప్రారంభించి మట్లాడారు. వేస వి సెలవుల్లో విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. అనంతరం సేవా సమితి సభ్యులు చైర్ పర్సన్ ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు భూమన్న, ప్రధాన కార్యదర్శి లెనిన్, సభ్యులు లస్మయ్య, కోటేశ్వరరావు, హన్మండ్లు, శ్రీధర్, ఉపాధ్యాయులు పూర్ణచందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
‘తీర్పును స్వాగతిస్తున్నాం’
ఆదిలాబాద్టౌన్: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడం న్యాయ వ్య వస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలపర్చిందని చెప్పారు. కమిషన్ నిబంధనలు పాటించలేదని కో ర్టు పేర్కొనడం ద్వారా నిజం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్ర తో బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చే స్తోందని విమర్శించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జా దవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ను బద్నాం చేయడానికే సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వారి వెంట పట్టణాధ్యక్షుడు అజయ్, నాయకులు వెనగంటి ప్రకాశ్, కేమ శ్రీకాంత్, మొట్టే కిరణ్, చందల రాజన్న, దాసరి రమేశ్, కొండ గణేశ్, ధమ్మపాల్, సలీమ్, దివిటి రాజు, మహేశ్ కలీమ్ తదితరులున్నారు. -
‘రోడ్డు భద్రత’ భేష్..
ఆదిలాబాద్టౌన్: రోడ్డు భద్రతపై పోలీస్శాఖ ఫోకస్ పెట్టింది. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎస్పీ అఖిల్ మ హాజన్ జిల్లాలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అరైవ్–అలైవ్లో భాగంగా జనవరి నుంచి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు ని ర్వహించారు. 500 రోడ్డు సేఫ్టీక్లబ్లు ఏర్పాటు చేసి సీపీఆర్పై శిక్షణ ఇచ్చారు. ప్రథమ చికిత్స కిట్లు అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో వీరు క్షతగాత్రుల కు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలిస్తారు. దీంతో ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు 20శాతం తగ్గుముఖం పట్టగా, ఇటీవల జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్రెడ్డి జిల్లా పోలీసులను అభినందించారు. బ్లాక్స్పాట్లపై దృష్టి జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతా లను బ్లాక్స్పాట్లుగా గుర్తించారు. నేరడిగొండ నుంచి పెన్గంగా వరకు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తరచూ ప్రమాదాలు జరిగే చోట స్పీడ్ బ్రేకర్లు, రంబుల్స్టిక్స్, పోలీస్ కటౌట్లు ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన ప్రమాదాలకు గురై న కారును ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. గుడిహత్నూర్ నుంచి సీతాగోంది వరకు డౌనల్గా ఉండడంతో వాహనదారులు న్యూ ట్రల్లో వెళ్లడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సీతాగోంది, మేకలగండి, వాఘాపూర్ ఎక్స్రోడ్ ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరి గి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వే గాన్ని నియంత్రించేందుకు గుడిహత్నూర్ డౌనల్ నుంచి సీతాగోంది వరకు రంబుల్స్టిక్స్, స్పీడ్ బ్రేక ర్లు ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి అప్రోచ్ రోడ్డు నిర్మించేలా చర్యలు చేపట్టా రు. కుప్టి, గుడిహత్నూర్ శర్మ దాబా వద్ద రోడ్డు ప్ర మాదంలో నుజ్జునుజ్జయిన కారును ప్రదర్శనకు పె ట్టారు. మేకలగండి వద్ద ట్రాఫిక్ పోలీస్కు సంబంధించి వాహన కటౌట్ ఏర్పాటు చేశారు. దీంతో రా త్రివేళ పోలీసులున్నారని వాహనదారులు వేగాన్ని నియంత్రిస్తున్నారు. మేకలగండి నుంచి సీతాగోంది ప్రాంతంలో రాత్రి ప్రమాదాలు జరగకుండా ఎన్హె చ్ అధికారులతో సోలార్ లైటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామాల్లోనూ అవగాహన సదస్సులు విద్యార్థి దశ నుంచే రోడ్డు నియమాలు తెలిసేలా జి ల్లా కేంద్రంలో ట్రాఫిక్ పార్కు ఏర్పాటు చేశారు. రో డ్డు నిబంధనలు పుస్తకాల్లో కాకుండా నేరుగా అధికా రులు విద్యార్థులకు తెలియజేస్తున్నారు. జిల్లాలోని 38 గ్రామపంచాయతీల్లో సర్పంచుల ద్వారా రోడ్డు నిబంధనలు పాటించేలా తీర్మానాలు తీసుకున్నా రు. డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చే సేవారికి జరిమానా విధించేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాలు, ముఖ్య కూడళ్లలో ఉదయం, రాత్రి నిత్యం డ్రంకెన్డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల పలువురికి జైలు శిక్ష విధించిన విషయం విధితమే. దీంతో కొంత మందిలోనైనా మార్పు వస్తుందని పోలీసులు భా విస్తున్నారు. మండలానికో కానిస్టేబుల్తో ఖాకీ కి డ్స్ ఏర్పాటు చేసి మూడ్రోజుల పాటు పాఠశాలలు, మరో మూడ్రోజుల పాటు గ్రామాల్లో అవగాహన స దస్సులు నిర్వహిస్తున్నారు. మారుమూల గ్రామాల యువతకు డ్రైవింగ్ మేళా ద్వారా లైసెన్స్లు జారీ చే స్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్యశిబిరా లు, ‘మైట్యాక్సీ సేఫ్’ అనే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మైనర్లు వాహనాలు నడిపించకుండా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. సంవత్సరాల వారీగా రోడ్డు ప్రమాద వివరాలు సంవత్సరం రోడ్డు మృతుల 2021 245 145 2022 234 137 2023 286 126 2024 349 127 2025 381 117 -
సాలేగూడ.. ఏది నీటి జాడ!
ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయ తీ పరిధి సాలేగూడ గ్రామస్తులు నీటి కోసం కోటి కష్టాలు పడుతున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచింది. ఇతర నీటి పథకాలు నిరుపయోగమయ్యాయి. సర్పంచ్ కోవ రాజేశ్వర్ ట్యాంకర్ ద్వారా ఇంటింటా తాగునీరు సరఫరా చేస్తున్నారు. కానీ, ఇతర అవసరాలకు నీరు లేక పనులు పక్కనపెట్టి ఆదివాసీలు పొద్దంతా భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ బావులు, బోర్ల నుంచి ఎడ్లబండ్లు, ద్విచక్ర వాహనాలపై నీటిని తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇప్పుడే ఇట్లుంటే మే, జూన్ మాసాలను తలచుకుని గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. – ఇంద్రవెల్లి -
రెండోరోజూ.. అదే తీరు
ఆదిలాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె విషయంలో ప ట్టు వీడకపోవడంతో రెండోరోజూ బస్సులు నిలిచి పోయాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కూడా కార్మికుల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్ డిపో ఎదుట, పట్టణంలోని కుమురం భీమ్ చౌక్లో ఆందోళన నిర్వహించి కుమురంభీం విగ్రహానికి వినతిపత్రం అందించారు. తమ ఎంప్లాయ్ ఐడీలపై టికెట్లు జారీ చేస్తూ తామంతా విధుల్లో ఉంటున్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంజేశారు. తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా తమకు వ్యతిరేకంగా ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ మాజీ కన్వీనర్ సుభాష్ రాథోడ్, జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు సంఘీభావం ప్రకటించారు. కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు మెంబర్ పదవులకు ఇద్దరు కార్మికుల రాజీనామా వెల్ఫేర్ బోర్డు మెంబర్లుగా గతంలో నియమితులైన ఇద్దరు ఆర్టీసీ కార్మికులు రాజీనామా చేశారు. కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న కె.ప్రమిళ, డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న సాయిబాబా గురువారం రా జీనామా లేఖను సంస్థ ఉన్నతాధికారులకు అందజేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చేదాకా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రయాణికులకు తప్పని పాట్లు ప్రయాణికుల సౌకర్యార్థం అధికారులు కొన్ని బస్సులు నడిపినా వారికి అవస్థలు తప్పలేదు. మరోవైపు వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యాసంస్థలు, వసతిగృహాల నుంచి విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి లబ్ధిదారుల కన్నా టికెట్ తీసుకున్న వారికే ప్రాధాన్యం ఇవ్వడంతో మహిళల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామానికి చెందిన భానుశ్రియా అనుకుంటా గ్రామంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల పాఠశాలలో ఐదోతరగతి చదువుతుండగా వేసవి సెలవులు ప్రకటించడంతో ఆమె తండ్రి రమేశ్ బైక్పై 95 కిలోమీటర్లు ప్రయాణించి చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ ఘటనతో క్షేత్రస్థాయిలో సమ్మె ప్రభావం ప్రయాణికులపై ఏ మేరకు పడుతుందో తెలుసుకోవచ్చు. -
బడికి టాటా..
ఆదిలాబాద్టౌన్: ఇన్నిరోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు బడికి బై..బై.. చెప్పారు. పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. గురువారం ఈ వి ద్యాసంవత్సరం చివరిరోజు కావడంతో ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారి సమక్షంలోనే వార్షిక పరీక్షల ప్రోగ్రెస్ కా ర్డులను విద్యార్థులకు అందజేశారు. వేసవి సెలవుల్లో పిల్లలను బయట తిరగనివ్వకుండా చూడాలని, చెరువులు, వాగులకు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వేసవి సెలవులు నేటి నుంచి జూన్ 11వరకు ప్రకటించడంతో విద్యార్థులు 49రోజుల పాటు ఇళ్లకే పరిమితం కానున్నారు. ఇక ఆటాపాట పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు చదువులకు టాటా చెప్పారు. ఇక ఆటాపాటలతోనే సెలవులు ఎంజాయ్ చేయనున్నారు. జిల్లాలోని ఆయా గురుకులాలు, వసతిగృహాల నుంచి విద్యార్థులు ఇంటిముఖం పట్టారు. విద్యార్థుల తల్లి దండ్రులు, బంధువులు పాఠశాలలకు వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. వేసవి సెలవుల్లో కొందరు విద్యార్థులు సరదాగా ఇంటి వద్దే గడపనుండగా, ఇంకొందరు అమ్మమ్మలు, బంధువుల ఇళ్లల్లో సెలవులు ఎంజాయ్ చేసేందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. వివిధ కోర్సుల వైపు.. కొందరు తల్లిదండ్రులైతే తమ పిల్లలకు సెలవుల్లో ఏదైన కోర్సు నేర్పించాలని భావిస్తున్నారు. కంప్యూటర్ శిక్షణ, స్విమ్మింగ్, క్రికెట్, డ్యాన్స్, కూచిపూడి నాట్యం తదితర కోర్సుల్లో శిక్షణ ఇప్పించేందుకు సి ద్ధమవుతున్నారు. వేసవి సెలవుల్లో కొందరు ట్యూ షన్లు చెబుతూ వచ్చే విద్యాసంవత్సరం సిలబస్ ఇ ప్పటినుంచే బోధించేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను ట్యూషన్కు పంపించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. -
అతివేగంతోనే ప్రమాదాలు
అతి వేగం కారణంగానే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతుండగా బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. జిల్లాలో నిర్వహించిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించాం. నేరడిగొండ నుంచి పెన్గంగా వరకు బ్లాక్స్పాట్లు గుర్తించి రోడ్డు భద్రత చర్యలు చేపట్టాం. దీంతో 20శాతం వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. అందరి సహకారంతో రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలిచ్చి ప్రమాదాలకు కారకులు కావొద్దు. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
గణిత సబ్జెక్ట్పై భయం వీడాలి
● కలెక్టర్ రాజర్షి షా ● కలెక్టరేట్ అధికారులతో సమావేశం ● పొన్నారిలో ‘ఉపాధి’ పనుల పరిశీలన కైలాస్నగర్: విద్యార్థులు భయం వీడి గణితంపై పట్టుసాధించేలా ప్రత్యేక దృష్టి సారించాల ని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కా ర్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా విమర్శనాత్మక ఆలోచన, తార్కిక విశ్లేషణ లాంటి నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. 1988నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ‘ఫ స్ట్ ఇన్ మ్యాథ్’ ద్వారా గణితాన్ని సులభంగా, ఆసక్తికరంగా నేర్చుకునే అవకాశం ఉందని పే ర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రా జేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు. పథకాలు పక్కా అమలు చేయాలి దివ్యాంగుల సంక్షేమ పథకాలను పక్కాగా అ మలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మంది రంలో జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ స మావేశం నిర్వహించి మాట్లాడారు. 4శాతం రిజ ర్వేషన్లను అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కచ్చి తంగా అమలు చేయాలని, పింఛన్లు, యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని, అర్హులకు స్వయం ఉపాధి పథకాల కింద రుణాలివ్వాలని, దుకాణాల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంత్యోదయ కార్డుల జారీ, బస్సు, రైలు ప్రయాణ రా యితీలు, ఉపాధి పనుల్లో సౌకర్యాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, ము న్సిపల్ కమిషనర్ రాజు, జిల్లా ఎస్సీ సంక్షేమాభివృద్ధి అధికారి సునీత, ఈడీ మనోహర్, డీ ఎండబ్ల్యూవో కలీం, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రా థోడ్, డీసీఎస్వో నందిని, మెప్మా డీఎంసీ శ్రీని వాస్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. కూలీల సంఖ్య పెంచాలి తాంసి: ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య మరింత పెంచాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మండలంలోని పొన్నారి గ్రామంలో చేపట్టిన పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాస్టర్ రోల్స్ను తనిఖీ చేసి, హాజరైన కూలీల సంఖ్యను సరిచూశారు. అనంతరం కూలీలతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. పని ప్రదేశంలో కూలీలకు నీడ, తాగునీటి సౌకర్యం క ల్పించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కలె క్టర్ వెంట సర్పంచ్ భూమన్న, ఉపసర్పంచ్ వెంకట్రెడ్డి, డీఆర్డీవో రవీందర్, ఏపీడీ కుటుంబరావు, ఎంపీడీవో మోహన్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, ఏపీవో విజయ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణాభివృద్ధిశాఖ జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా రాజు
కై లాస్నగర్: తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా జిల్లా కేంద్రానికి చెందిన పి.రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్లోని నాంపల్లి ఎన్జీవో భవన్లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికా రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జేఏసీ ప్రతినిధులు గ్రామీణాభివృద్ధి శాఖ క మిషనర్ దివ్య దేవరాజ న్ను ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకలగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వి నతిపత్రం అందజేసి పరి ష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్లు లింగంపల్లి నర్సయ్య, శ్రీనివాసరావు, జిలీల్ ఖాన్, ప్రతినిధులు పార్థసారథి, నాగయ్య, నారాయణ, ఫిరోజ్ఖాన్ తదితరులున్నారు. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
ఆదిలాబాద్టౌన్/ఆదిలాబాద్రూరల్: విద్యార్థులు విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎ దగాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. బుధవా రం ఆదిలాబాద్రూరల్ మండలంలోని బంగారిగూ డ కేజీబీవీలో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, నవార్స్ ఎడ్యుటెక్ సహకారంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఖగోళ, అంతరిక్ష ప్ర యోగశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ ప్రయోగశాల విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంచి భవి ష్యత్లో వారు అంతరిక్ష శాస్త్రవేత్తలుగా, స్పేస్ స్టార్టప్లు ప్రారంభించే స్థాయికి ఎదగడానికి ప్రేరణని స్తుందని తెలిపారు. ఇది జాతీయ విద్యా విధానంలో ముఖ్య భాగమని వివరించారు. గతంలో బిర్లా ప్లానిటోరియం లాంటి ప్రదేశాల్లోనే ఇలాంటి సౌకర్యాలుండేవని, ఇప్పుడు పాఠశాల స్థాయిలోనే వి ద్యార్థులకు ప్రయోగాత్మక విద్య అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులు ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు వస్తే తె లంగాణ ఇన్నోవేషన్ కౌన్సిల్, వీ హబ్ లాంటి వేదిక ల ద్వారా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలి పారు. అనంతరం పట్టణ కేజీబీవీలో ఖగోళ, అంతరిక్ష ప్రయోగశాలతో పాటు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు అధికారులతో కలిసి పా ఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అవసరమైన మరమ్మతులు, మౌలిక వసతులపై చర్చించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి డా క్టర్ మృణాల్ జైవంత్, టీడీఎఫ్ ప్రతినిధులు రాజేశ్వర్రెడ్డి, వినీల్రెడ్డి, నవార్స్ ఎడ్యుటెక్ ప్రతినిధులు శశాంక కూన, అరుణ్, తహసీల్దార్లు శ్రీనివాస్, గో వింద్, సెక్టోరల్ అధికారి ప్రత్యూష, ప్రత్యేకాధికారులు కవిత, దీప్తి, అధికారులు, సిబ్బంది ఉన్నారు. విత్తన కొరత రానివ్వొద్దు కైలాస్నగర్: ఖరీఫ్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, టాస్క్ఫోర్స్ బృందాలు, విత్తన కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. డీలర్లు నిబంధనలు పాటించాలని, రైతులను మోసం చేస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలో రైతులకు అవగాహన కల్పించాల ని సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు, ఆర్డీవో జగదీశ్వర్రావ్, జేఏవో శ్రీధర్స్వామి తదితరులున్నారు. -
ఉన్నతస్థాయికి ఎదిగేలా చూడాలి
ఇంద్రవెల్లి: విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదిగేలా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ సూ చించారు. మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రవీంద్రాచారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీంద్రచారి దంపతులను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాట లు వేసేది ఉపాధ్యాయులేనని, ఆ దిశగా ఉపాధ్యాయులు వృతి ధర్మంలో విధులు నిర్వహించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేవిధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు రవీందర్రెడ్డి, సర్పంచులు మెస్రం తుకారాం, లఖన్, రాజేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మౌనికకు అదనపు ఎస్పీగా ప్రమోషన్
ఆదిలాబాద్టౌన్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అడ్మిన్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పి.మౌనిక అదనపు ఎస్పీగా ప్రమోషన్ పొందారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆమెను అభినందించారు. ఆమె భుజంపై అదనపు ఎస్పీ హోదా చిహ్నాలు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. మౌనిక ప్రమోషన్ పొందినప్పటికీ ఆమె ప్రస్తుతం నిర్వహిస్తున్న అడ్మిన్ అదనపు ఎస్పీ హోదాలోనే కొనసాగుతారని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సురేందర్రావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, సీసీ కొండరాజు, పలువురు ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘కెనాల్ నిర్మాణానికి భూములివ్వం’
సాత్నాల: భోరజ్ మండలం సావాపూర్ గ్రామ స మీపాన కొరాటా–చనాకా, డీఎల్ 17 కెనాల్ నిర్మాణానికి అధికారులు భూ సేకరణ చేపట్టిన నేపథ్యంలో స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రా మంలో సమావేశమైన రైతులు జీపీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వందేళ్లుగా తమ కుటుంబాలు పూర్తిగా వ్య వసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు తెలి పారు. సారవంతమైన భూములు కోల్పోతే కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని వాపోయారు. తమకు సాగు భూములే జీవనాధారమని, 20 ఏళ్లుగా సాత్నాల ప్రాజెక్ట్ ద్వారా నీరు పుష్కలంగా అందుతోందని, బోరు బావుల్లోనూ నీరుంటుందని తె లిపారు. నీటి వసతుల్లేని భూముల వైపు కెనాల్ను మళ్లించి వారికి సాగునీరు అందించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కెనాల్ నిర్మాణానికి భూములిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. శ్రీనివాస్, సల్ల శీ ను, పబ్బత్ సంజీవ్, బోయర్ కవీశ్వర్, మార్చెట్టి నా గేశ్, సునీల్, వానికర్ బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు. -
నేడు భగీరథ మహర్షి జయంతి
కై లాస్నగర్: భగీరథ మహర్షి జయంతిని గురువా రం అఽధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజ ర్షి షా ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30గంటలకు నిర్వహించనున్న కార్యక్రమానికి జిల్లాలోని సాగర, ఉప్పర కులస్తులు, బీసీ సంఘాల నాయకులు, బీసీ కులస్తులు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఘనంగా సీపీఐఎంఎల్ ఆవిర్భావ వేడుకలుఆదిలాబాద్టౌన్: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆ ధ్వర్యంలో సీపీఐ ఎంఎల్ 57 ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లెనిన్ జయంతి సందర్భంగా బుధవారం నిషాన్ ఘాట్లో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ ఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యదర్శివర్గ స భ్యు డు జగన్సింగ్ మాట్లాడారు. భారతదేశ వి ము క్తి కోసం మార్క్సిజం, లెనినిజం, మావో ఆ లో చన విధానాల వెలుగులో అనేకమంది ప్రా ణా లు త్యాగం చేశారని గుర్తుచేశారు. భూమి, భు క్తి, దేశ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల ను మాస్ లైన్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. నాయకులు నితిన్, వామన్, శీను, రేణుక, లక్ష్మి, వనిత తదితరులున్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
సాత్నాల: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాద వ్ హామీ ఇచ్చారు. భోరజ్ మండలం సావాపూ ర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘ఇందిరమ్మ’ గృహప్రవేశాలకు హాజరయ్యారు. లబ్ధి దారులకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కల నెరవేరుస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రతీ పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షు డు దీపక్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్ఖాన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శాంతన్రావు, టీటీడీ బోర్డు మాజీ మెంబర్ బెజ్జంకి అనిల్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు మల్యాల కరుణాకర్, ధర్మపురి చంద్రశేఖర్, మామిడి మల్లారెడ్డి, భూమారెడ్డి, ఉషమల్ల శంకర్, ఆడే జైపాల్, పొట్టు అశోక్, రాదేశ్యాం తదితరులు పాల్గొన్నారు. -
‘కో ఆప్షన్’పై ఉత్కంఠ
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ పదవుల ఎంపిక వ్యవహారం ఉత్కంఠను రేకిత్తిస్తోంది. మొత్తం నాలుగు పదవులను భర్తీ చేయనుండగా అవి కూటమిలోని ఏ పార్టీకి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు కూటమిగా ఏర్పడ్డ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం తిరిగి కో ఆప్షన్ పదవులు ద క్కించుకోవాలని ప్రయత్నిస్తుండటం రాజకీయంగా వేడిని రాజేస్తోంది. ప్రధానంగా చైరపర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నాలుగు కో ఆప్షన్ పదవులు తమకే కావాలంటూ పట్టుబడుతోంది. కాగా, తమకూ కా వాల్సిందేనని ఎంఐఎం, కాంగ్రెస్ అడుగుతుండటంతో ఈ పదవులు ఏ పార్టీకి దక్కుతాయనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమీపిస్తున్న గడువు గ్రేడ్–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నాలుగు కో ఆప్షన్ మెంబర్ల పదవులు భర్తీ చేసేందుకు అవకాశముంది. ఇందులో రెండు జనరల్ వి భాగంలో, మరో రెండు మైనార్టీలకు కేటాయించా రు. వీటి ఎంపికకు ఈ నెల 17వ తేదీన మున్సిపల్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వారం గడువిచ్చిన అధికారులు ఈ నెల 25న సాయంత్రం ఐదు గంట్లలోపూ అ ర్హులైన వారు దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. ఇందుకు సంబంధించిన గడువు సమీపిస్తుండగా ఇప్పటివరకు ఆయా పార్టీల తరఫున ఎవరినీ ఎంపిక చేయలే దు. మరో రెండ్రోజుల గడువే మిగిలి ఉండటంతో ఈ పదవుల కోసం ఏయే పార్టీల తరఫున దరఖాస్తులు అందజేశారనేది రాజకీయంగా ఉత్కంట రేకిత్తిస్తోంది. కూటమిలోని పార్టీలన్నీ ఈ పదవులు దక్కించుకుంటాయా? లేదా.. ఒకే పార్టీకి నాలుగు పదవులు కేటయిస్తారా? అనేది మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అన్నీ తమకేనని బీఆర్ఎస్ పట్టు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులుండగా 21కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుని బీజేపీ బల్ది యాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనికి తో డు ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి ఈ సంఖ్య 23కు చేరింది. అయినప్పటికీ 11 స్థానా లు గెలుచుకున్న కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, స్వతంత్రుల మద్దతుతో చైర్పర్సన్ పదవిని దక్కించుకుంది. ఎంఐఎంకు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన తమ పార్టీకే నాలుగు కో ఆప్షన్ పదవులు ఇవ్వాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పట్టుబడుతున్నట్లు తెలిసింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సహకరించినందున తమకు ఈసా రి సహకరించాలంటూ కూటమిలోని పార్టీలకు ఆయన తేల్చిచెప్పినట్లు చర్చ సాగుతోంది. ఇదే విషయంపై బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడిన జోగు రామన్న దీనిపై కుండబద్దలు కొట్టినట్లు రాజకీయాల్లో చర్చ సాగుతోంది. అయితే, కూటమిలో భాగస్వాములు గా ఉన్న తమకు కో ఆప్షన్ పదవులు కావాలంటూ అధికార కాంగ్రెస్, ఎంఐఎం కూడా అడుగుతున్నాయి. కాంగ్రెస్ రెండు పదవులు ఆశిస్తుండగా ఎంఐఎం ఒక పదవి కోరుకుంటోంది. మరోవైపు ఆయా పార్టీల తరఫున పదవులు ఆఽశిస్తున్న మాజీ కౌన్సిలర్లు తమకే దక్కేలా చూడాలంటూ ఆయా పార్టీల నేతలపై ఒత్తడి తీసుకువస్తున్నారు. ఈసారి ఎలాగైనా అవకాశం కల్పించాలంటూ వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పదవులు ఏ పార్టీకి దక్కుతాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు రెండే దరఖాస్తులు ఇప్పటివరకు మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ పదవుల కోసం రెండు దరఖాస్తులు మాత్రమే అందాయి. పార్టీ 11వ వార్డు మాజీ కౌన్సిలర్ తుర్పాటి సుజాత, ఖానాపూర్ (అంబేడ్కర్నగర్) మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ కో ఆప్షన్ మెంబర్ పదవుల కోసం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేశారు. పార్టీలపరంగా వారికి ఎలాంటి అంగీకారం లేనప్పటికీ దరఖాస్తు చేయ డం ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్రులను కూడగట్టడంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లా కేంద్రానికి రానున్నారు. పార్టీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలు స్వీకరించే అవకాశముంది. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పార్టీ ముఖ్య నాయకులతో ఆయన నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు పదవుల్లో ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి.. కాంగ్రెస్కు పదవులు దక్కుతాయా.. లేదా? అనేదానిపై చర్చించి నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది. -
మొక్కలను సంరక్షించాలి
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీల్లో అవకాడో మొక్కలను సంరక్షించాల ని పీవో యువరాజ్ మర్మాట్ సూచించారు. బు ధవారం ఉట్నూర్ పరిధిలోని ఉద్యాన నర్సరీని సందర్శించారు. వివిధ మొక్కల వివరాలు, సంరక్షణ చర్యలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన నర్సరీల్లో అవకాడో పంటపై రైతులకు అవగాహన కల్పించి, సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. వేసవిలో మొక్కలకు తప్పనిసరిగా నీరు పట్టాలని తెలిపారు. 50 ఎకరాల ఉద్యాన నర్సరీని సుందరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోనున్న ట్లు పేర్కొన్నారు. మొక్కల సంరక్షణలో భాగంగా నీటి వనరుల వివరాలను ఉద్యాన అధికారి సందీప్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. -
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి
కైలాస్నగర్: ఉపాధి హామీ పనులకు హాజర య్యే కూలీల సంఖ్య పెంచేలా శ్రద్ధ వహించాల ని అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ అన్నారు. జిల్లాలో 25మందికి లోపు కూలీలు హాజరవుతున్న 68 గ్రామాల ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో మంగళవారం టీటీడీసీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. కూలీలు పనులకు రాకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ గ్రామంలో కనీసం 50 మంది కూలీలు పనులకు వచ్చేలా చూడాలన్నారు. పాత పనులు పూర్తయినట్లయితే కొత్త పనులు ఎంపిక చేయాలన్నారు. ఇందులో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, అదనపు డీఆర్డీవో కుటుంబరావు, గజాణన్రావు, ఏవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి జైనథ్: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలకేంద్రంలో ని కేజీబీవీలో మంగళవారం సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఇందులో తహసీల్దార్ నారాయణ, ఎస్వో వీణాకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
ఆదిలాబాద్టౌన్: రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రిమ్స్ ఆస్పత్రిని మంగళవారం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సిబ్బంది ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించినప్పటికీ వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తుందన్నారు. అలాగే కొంతమంది వైద్యులు అందుబాటులో ఉండడం లేదన్నారు. సమస్య పరిష్కరించేందుకు రాష్ట్రస్థాయిలో చర్చించి తగు చర్యలు చేపడతామని అన్నారు. ఆస్పత్రిలో బయో మెడికల్ వేస్టేజ్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ వైద్య సిబ్బంది ఉన్నారు. -
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్రూరల్: విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మావల పోలీస్స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. ఆవరణలో ఉన్న వాహనాలను పరి శీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలు సుకున్నారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. స్టేషన్కు వచ్చే బాధితుల విషయంలో గౌరవంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. డయల్ 100 ద్వారా వచ్చే ప్రతీ కాల్కు స్పందించి నిమిషాల వ్యవధిలో ఘట నా స్థలాలకు చేరుకొని బాధితులకు భరోసా కల్పించాలన్నారు. ఆయన వెంట ట్రెయినీ ఐపీఎస్, ఎస్హెచ్వో రాహుల్కాంత్, సీఐ కర్రె స్వామి, ఎస్సై రాజశేఖర్రెడ్డి, సిబ్బంది, తదితరులున్నారు. -
నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: రిమ్స్లో గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను ఎంపీ గోడం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసూతి విభాగంలో గర్భిణులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని సమయానుకూలంగా పరిశీలించి, తగిన చికిత్స అందించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అంతకుముందు రిమ్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలు, ఇంకా మెరుగుపరచాల్సిన వసతులపై విస్తృతంగా చర్చించారు. ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించిన రూ.6 కోట్ల 33 లక్షల ప్రతి పాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ దీపక్ పుష్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ పోషకాహారంతో చిన్నారుల్లో ఎదుగుదల చిన్నపిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం కీలకమని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. అంబేద్కర్ భవన్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 8వ పోషణ్ పక్వాడ్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. గర్భి ణులు, బాలింతలు, చిన్నారులు రక్తహీనత బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. అంగన్వాడీ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించా రు. ఇందులో డీడబ్ల్యూవో మిల్కా, సెక్టోరియల్ అధికారి ప్రత్యూష, వివిధ ప్రాజెక్టుల సీడీపీవో లు, అంగన్వాడీ టీచర్లు, అధికారులు పాల్గొన్నారు. గ్రామస్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు నేరడిగొండ: గ్రామస్తుల భద్రతకు ప్రాధాన్యతని స్తూ ప్రత్యేక చర్యలు చేపడతామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కిష్టాపూర్ పంచాయతీ పరిధిలో గల రోల్మామడ టోల్ ప్లాజా వద్ద చేపడుతున్న పనులను పరిశీలించారు. సర్వీస్ రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ప్రవేశం వద్ద త్వరలోనే అన్ని వసతులతో కూడిన సర్వీస్ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ జితేందర్ సింగ్, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపా రు. ఆయన వెంట తహసీల్దార్ ఎంఏ కలీం, కేఎన్ఆర్సీ మేనేజర్ సూర్యనారాయణ, ఇన్చార్జి రాంమోహన్ రెడ్డి, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సమ్మె బాటలో..
రీజియన్ పరిధిలో బస్సుల వివరాలు.. లహరి ఏసీ సీటర్/స్లీపర్ : 12 లహరి నాన్ ఏసీ సీటర్/స్లీపర్ : 14 రాజధాని : 11 సూపర్ లగ్జరీ : 95 సెమీ డీలక్స్ : 3 ఎక్స్ప్రెస్ : 44 ప్రైవేట్ ఎక్స్ప్రెస్ : 83 పల్లెవెలుగు : 167 ప్రైవేట్ పల్లెవెలుగు : 212 ఆదిలాబాద్: సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉ ద్యోగులు సమ్మె బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యంతో మంగళవారం రాత్రి వరకు జరిపి న చర్చలు విఫలం కావడంతో ఆందోళనకే సై అ న్నారు. నేటి ఉదయం నుంచి బస్సులు డిపోలకే పరిమితం కానుండగా.. ప్రజారవాణా వ్యవస్థకు ఆటంకం కలగనుంది. ప్రయాణికులకు ఇబ్బందులతో పాటు, సంస్థ ఆదాయానికి సైతం భారీగా గండిపడే అవకాశం ఉంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సర్దుబాటు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 641 ఆర్టీసీ బస్సులున్నా యి. వీటిలో సంస్థ సొంత వాహనాలతో పాటు అ ద్దెబస్సులు కూడా నడుస్తున్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో రీజియన్ పరి ధిలోని 162మంది ఔట్సోర్సింగ్ సిబ్బందితో బస్సులు నడిపేందుకు సంస్థ సమాయత్తమవుతోంది. ప్ర యాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే సమ్మెకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా కలిసిరావాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. మరో వైపు ఉన్నతాధికారులు మాత్రం ఈ సిబ్బంది సమ్మెకు మద్దతు తెలపకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటికే వారి నుంచి సమ్మెలో పాల్గొనబోమని సంతకాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సొంత బస్సులు 346 ప్రైవేట్ అద్దె బస్సులు 295 మొత్తం బస్సులు : 641 -
ఆర్డీవోగా జగదీశ్వర్రావు బాధ్యతలు
కై లాస్ నగర్: ఆదిలాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీవో)గా పి.జగదీశ్వర్రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు ఆర్డీ వోగా పనిచేసిన స్రవంతి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అంతకు ముందు కలెక్టర్ రాజర్షిషాను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఇక్కడ ఖాళీగా కనిపిస్తున్నది తాంసి పీహెచ్సీ వైద్యాధికారి కుర్చీ. ఉదయం 11 గంటలకు ఈ సెంటర్ను ‘సాక్షి’ పరిశీలించగా వైద్యాధికారి అందుబాటులో లేరు. ఈ మెడికల్ ఆఫీసర్ ఉన్నత చదువు నిమిత్తం ఈనెల 1నుంచి లాంగ్లీవ్లో వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు మాత్రం విధుల్లో ఉన్నారు. ఫార్మసిస్టు 11 గంటల తర్వాత విధులకు వచ్చారు. స్టాఫ్ నర్సు రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ ఒక్క పీహెచ్సీలోనే కాదు.. జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నట్లుగా ‘సాక్షి’ విజిట్లో తేలింది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం ‘సాక్షి’ విజిట్ చేసింది. పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, సమయపాలన పాటించకపోవడం, మందుల కొరత తదితర సమస్యలు దర్శనమిచ్చాయి. ఆదిలాబాద్టౌన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందని పరిస్థితి. జిల్లాలో 27 పీహెచ్సీలకు గాను 50 వైద్యపోస్టులు ఉన్నా యి. ఇందులో 25 మంది మాత్రమే పనిచేస్తుండగా, మిగతా పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉన్న వైద్యులతో సర్దుబాటు చేస్తూ రోగులకు సేవలు అందిస్తున్నారు. ఇందులో కొంత మంది సమయపాలన పాటించకపోవడం, మధ్యాహ్నమే ఇంటిముఖం పట్టడంతో రోగుల అవస్థలు వర్ణనాతీతం. ప్రస్తుతం భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 44 డిగ్రీల మార్క్ దాటాయి. జనం వడదెబ్బకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలు, జ్వరాల బారిన పడుతున్నారు. ఆస్పత్రికి వెళ్లిన సమయంలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో గత్యంతరం లేక ప్రైవేట్కు వెళ్లాల్సిన దుస్థితి. ఖాళీలతో అవస్థలు.. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు బోథ్, నార్నూర్ సీహెచ్సీలు ఉన్నాయి. పీహెచ్సీల్లో 50 పోస్టులకు గాను 25 మంది పనిచేస్తున్నారు. బజార్హత్నూర్లో నా లుగు పోస్టులకు గాను ఒక్కరు కూడా లేరు. భీంపూర్(టి)లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుడిహత్నూర్, ఝరి పీహెచ్సీల్లో ఇదే పరిస్థితి. ఇద్దరు చొప్పున ఉండాల్సి ఉండగా, ఒక్కరు కూడా లేరు. సైద్పూర్, పీపీ యూనిట్, నేరడిగొండ, గాదిగూడ, పిట్టబొంగరంలో ఒక్కరు చొప్పున వైద్యులు ఉండాల్సి ఉండగాా, ప్రస్తుతం ఈ పీహెచ్సీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోథ్ సీహెచ్సీలో 6 పోస్టులకు గాను ఇద్దరు మాత్రమే పనిచేస్తుండగా, 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా పీహెచ్సీల్లో ఉన్న వైద్యులతో సేవలు అందిస్తున్నారు.ఇదీ పరిస్థితి..పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలికై లాస్నగర్: పెన్షనర్లకు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందించా లని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయిరి శశి కాంత్ డిమాండ్ చేశారు. ఈమేరకు అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రుకు మంగళవారం ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘం నాయకులు దయానందరెడ్డి, జగన్మోహన్, దేవిదాస్, గంగాధర్, శ్యామ్ రాజుగౌడ్, ఉమాకాంత్ తదితరులున్నారు. -
జిల్లా వాసికి అంతర్జాతీయ గుర్తింపు
ఆదిలాబాద్టౌన్: ఆదిలా బాద్కు చెందిన డాక్టర్ మామిడాల ఇస్తారి అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ష్టాత్మక గుర్తింపు సాధించారు. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ప్రముఖ శాసీ్త్రయ సంస్థ రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ ఇస్తారిని ఫెల్లో ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీకి ఎంపిక చేశారు. ఈయన ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు డీఎస్టీ, డీబీటీ, యూజీసీ, ఐసీఏంఆర్, రూసా సంస్థల మద్దతుతో 10 పరిశోధన ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు. 100కు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించడంతో పాటు 22 పుస్తకాలను రచించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు. -
పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెంచాలి
ఆదిలాబాద్టౌన్: పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా విధులు నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజా ఫిర్యాదుల విభాగంలో భాగంగా సోమవారం పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 38 మంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో కుటుంబ కలహాలు, భార్య భర్తల సమస్యలు, గొడవలు వంటివి ఉన్నాయి. కార్యక్రమంలో ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. రిసెప్షనిస్టుల పాత్ర కీలకం పోలీస్స్టేషన్లలో రిసెప్షనిస్టుల పాత్ర కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలోని రిసెప్షనిస్టులతో సోమవారం సమావేశం నిర్వహించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలన్నారు. ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే స్టేషన్ ఇన్చార్జి ద్వారా విలేజ్ పోలీసు ఆఫీసర్కు దర్యాప్తు కోసం అప్పగించాలని సూచించారు. సంఘటన స్థలంలో ఉన్న వాంగ్మూలాన్ని నమోదు చేసి వారి సంతకాలతో కూడిన రిపోర్టును రిసెప్షనిస్టుకు అందజేయాలన్నారు. రాజీ పడితే ఇరువురితో రాజీపత్రం నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో మహిళాస్టేషన్ సీఐ ప్రేమ్కుమార్, డీసీఆర్బీ ఎస్సై ప్రవీణ్, రిసెప్షనిస్టులు పాల్గొన్నారు. -
నీటి వనరుల సంరక్షణ అందరి బాధ్యత
ఆదిలాబాద్: నీటి వనరుల సంరక్షణ అందరి బాధ్యత అని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. పట్టణంలోని చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అమృత్ 2.0 పథకం కింద కేటా యించిన రూ.3.14కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకర్తో కలిసి భూమిపూజ నిర్వహించారు. పట్టణంలోని ఖానాపూర్ చెరువు పునరుద్ధరణ పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వాల లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ముందస్తు జాగ్రత్తలు పాటించాలి
ఆదిలాబాద్టౌన్: అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేశ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫైర్స్టేషన్లో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. వారం పాటు అగ్నిమాపక సేవలను ప్రజలకు తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ముందుగా జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాకటాలతో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఫైర్ అధికారి జైత్రరాం, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
బజార్హత్నూర్: రైతులు తాము పండించిన పంటలను మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. అనంతరం రైతువేదికలో 31మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్యాంసుందర్, పీఏసీఎస్ ఇన్చార్జి సంతోష్, సీఈవో నారాయణగౌడ్, సర్పంచ్ సాయన్న, నాయబ్ తహసీల్దార్ హీరాలాల్, నూర్సింగ్, గోవర్ధన్ రైతులు పాల్గొన్నారు. -
జేఈఈలో మెరిసిన ‘గిరి’ విద్యాకుసుమాలు
సిరికొండ: జేఈఈ మెయి న్–2026 రెండో సెషన్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో మండలంలోని రిమ్మ గ్రామానికి చెందిన పెందూర్ గులబ్ దీప్ 95 పర్సంటైల్తో అడ్వాన్స్కు అర్హత సాధించాడు. ఇంటి వద్ద ఉండే పరీక్షకు సన్నద్ధం అయినట్లు తెలిపాడు. గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఎస్టీ కేటగిరీలో యోగిదాస్ 747వ ర్యాంక్ బజార్హత్నూర్: మండలంలోని కాండ్లీ గ్రామానికి చెందిన జాదవ్ యో గిదాస్ నాయక్ జేఈఈ మెయిన్–2026 ఫలి తాల్లో 94.86 పర్సంటైల్ సాధించాడు. ఆలిండియా ఎస్టీ కేటగిరిలో 747 ర్యాంక్తో అడ్వాన్స్కు అర్హత సాధించాడు. యోగిదాస్ను గ్రామస్తులు అభినందించారు. ఓటర్ మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలికై లాస్నగర్: ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చిత్రు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ఓటరు మ్యాపింగ్పై అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్షించారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. బూత్స్థాయి అధికారులు (బీఎల్వోలు) తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. గడువులోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో ఆర్డీవో స్రవంతి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నత్తనడకన..
కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలను చేయించాలని ఆదేశించింది. అయితే జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిని పరిశీలిస్తే ఆ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. పనులు నత్తనడకన సాగుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇదీ పరిస్థితి.. పేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో నిర్మాణానికి నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తోంది. పథకంలో భాగంగా తొలి విడతగా ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లను మంజూరు చేసింది. ఎస్టీ నియోజకవర్గం, పీవీటీజీ గిరిజనులకు మరో వెయ్యి నుంచి 1500 ఇళ్లను అదనంగా కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో గతేడాది ఫిబ్రవరి, మార్చిలో ఇళ్లు మంజూరు కాగా, పట్టణ ప్రాంతాల్లో మే, జూన్ నెలల్లో ఈ ప్రక్రియ చేపట్టారు. ప్రారంభంలో నిర్మాణాలకు లబ్ధిదారులు అంతగా ఆసక్తి చూపలేదు. ఆర్థిక స్థోమత లేకపోవడం, బిల్లులు సకాలంలో వస్తాయో రావోననే కారణాలతో నిర్మాణాలకు వెనుకడుగు వేశారు. అయితే పూర్తయిన ఇళ్లకు బిల్లులు వస్తుండటంతో మిగతా వారిలో ఆసక్తి పెరిగింది. పనులు వేగవంతం చేశారు. ఇప్పటి వరకు పూర్తయింది 975 మాత్రమే .. జిల్లాలో సుమారు 16వేల ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు కేవలం 975 మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. 2,099 ఇళ్లు ఇప్పటికీ ప్రారంభానికే నోచుకోలేదు. మంజూరు పత్రాలు పొందిన లబ్దిదారులు వాటిని ప్రారంభించడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఈ నెల చివరి వారంలో, రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జూన్ మొదటి వారంలో పెద్ద ఎత్తున గృహప్రవేశాలు చేయించాలని భావించిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు చేపట్టింది. ప్లాస్టరింగ్, ఇంటరీయర్ వర్క్స్ పూర్తికానప్పటికీ స్లాబ్ వేసి, దర్వాజా బిగించి, బయట ప్లాస్టరింగ్ కలరింగ్ చేసిన ఇళ్లకు తుది విడత బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. తద్వారా నిర్మాణాలు వేగవంతమవుతాయని భావించింది. అయినప్పటికి ఆశించిన స్థాయిలో ముందకు సాగడం లేదు. ఇటీవల సిమెంట్, ఇసుక, స్టీల్ సామగ్రి ధరలు పెరగడం కూడా నిర్మాణాలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జిల్లాలో.. మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు : 16,093 పూర్తయినవి : 975 మార్కవుట్ ఇచ్చినవి : 2,235 బెస్మెంట్ స్థాయిలో ఉన్నవి: 5,583 రూప్స్థాయిలో ఉన్నవి : 2,489 స్లాబ్ దశలో ఉన్నవి : 2,712 ఇప్పటికి ప్రారంభం కానివి: 2,099 నిర్మాణాల వేగవంతంపై దృష్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. నిత్యం గ్రామాలను సందర్శిస్తూ త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇంటి లోపల పనులు పూర్తికానప్పటికీ ప్లాస్టరింగ్, కలరింగ్ చేసి దర్వాజా ఏర్పాటు చేస్తే తుది విడత బిల్లులు కూడా చెల్లిస్తున్నాం. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రారంభం కాని ఇళ్ల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – రెడ్డి శంకర్, హౌసింగ్ పీడీ, ఆదిలాబాద్ -
గతంలోనూ ఇలాగే..
సాక్షి,ఆదిలాబాద్: ప్రతీవారం ఏదో రోజు.. ఏదో ఒక సబ్రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి శాఖ దాడులు రాష్ట్రంలో జరుగుతుండటం మనం చూస్తున్నాం. ఎస్ఆర్వో కార్యాలయాల్లో కరప్షన్ రోజురోజుకు పెరిగిపోతుండడంతోనే ఈ దాడులు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతుంది. ఇంత జరుగుతున్నా వారి దారి వారిదే అన్నట్టు ఎస్ఆర్వో కార్యాలయాల్లో ఎలాంటి జంకు లేకుండా అక్రమ వ్యవహారాలు సాగించేస్తున్నారు. అలాంటిదే ఆదిలాబాద్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ అక్రమ వ్యవహారం కోసం ప్రణాళిక చకచకా రూపొందుతుందనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతుంది. అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటూ చెబుతున్నప్పటికీ తెర వెనుక మాత్రం వ్యవహారం పకడ్బందీగా చేపట్టేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్గా ఓ అధికారి కొనసాగుతున్నారు. జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్గా ఇన్చార్జి హోదాలో ఓ మహిళ అధికారి కొనసాగుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో మహిళ అధికారి వ్యక్తిగత కారణాలతో సెలవులు తీసుకుంటున్నారని, ఆ స్థానంలో ఓ జూనియర్ అసిస్టెంట్ను ఇన్చార్జిగా నియమించి అనధికారిక లేఔట్లలోని వందలాది ప్లాట్లను అక్రమ రిజిస్ట్రేషన్లు చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారనే ప్రచారం జోరుగా సాగుతుంది. డీడబ్ల్యూవోలతో రహస్య ఒప్పందం..? సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట సుమారు 30 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లు పనిచేస్తుండటం నిత్యం కనిపిస్తుంది. ఇటీవల ఈ డాక్యుమెంట్ రైటర్లలో కొంత మంది రిజిస్ట్రేషన్ అధికారులతో ఈ అనధికారిక లేఔట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో ఓ ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం సాగుతుంది. సుమారు 400 నుంచి 500 ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం పక్కా ప్రణాళిక రూపొందించారని చెప్పుకుంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా ఉన్న అధికారిణి సెలవుల్లో వెళ్లేలా.. ఓ జూనియర్ అసిస్టెంట్ను ఆ స్థానంలో ఇన్చార్జిగా నియమించి ఆ ప్లాట్లన్నింటినీ చకచకా రిజిస్ట్రేషన్ చేసేలా వ్యూహం రూపొందించారనే ప్రచారం సాగుతుంది. ఇందులో ప్రతీ ప్లాట్కు వేలాది రూపాయల చొప్పున పెద్ద ఎత్తున అధికారులకు ముట్టజెప్పేలా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి నిషేధం ఉన్నప్పటికీ గతేడాది అనధికారిక లేఔట్లలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. వీటికి సంబంధించి గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ‘స్కెచ్ రెడీ’ శీర్షికన ‘సాక్షి’లో మొదట కథనం ప్రచురితమైంది. ఆ తర్వాత వరుస కథనాలు రావడంతో ఈ వ్యవహారంలో అప్పుడు ఇన్చార్జి జిల్లా రిజిస్ట్రార్గా ఉన్న ప్రసన్న విచారణ చేపట్టారు. డీఐజీకి రిపోర్టు అందజేశారు. ఇక ఆ సబ్రిజిస్ట్రార్పై చర్యలు తప్పవని అనుకున్నప్పటికీ వారు నామమాత్రంగా ఇక్కడి నుంచి భైంసా సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి అతడిని పంపించి మమా అనిపించారు. ఇలా పై అధికారులు కొంత మంది కిందిస్థాయి అధికారులను అక్రమ రిజిస్ట్రేషన్ల కోసం నియమించి కోట్ల రూపాయల ఒప్పందాలతో అనధికారిక లేఔట్లలో ప్లాట్లను గంపగుత్తగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా దొడ్డిదారిన స్కెచ్లు రూపొందించి అమలు చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మహనీయుడు బసవేశ్వరుడు
ఆదిలాబాద్/ఆదిలాబాద్రూరల్: సమాజంలో కుల, వర్ణ వివక్ష రూపుమాపేందుకు వందల ఏళ్ల క్రితమే కృషి చేసిన మహానీయుడు బసవేశ్వరుడని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. బసవేశ్వరుని జయంతి వేడుకలను జిల్లాకేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. బసవేశ్వర చౌక్ వద్ద ఆయన చిత్ర పటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, సమ సమాజ స్థాపనకు బసవేశ్వరుడు చేసిన కృషిని కొనియాడారు. కా ర్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, అదనపు కలెక్టర్ చిత్రు, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి సోనియా, మాజీ మంత్రి జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన విద్యనందించాలి
ఉట్నూర్రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం తనిఖీ చేశారు. బోధనతో పాటు విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్వో ప్లాంట్ను పరిశీలించారు. ఏఎన్ఎంలతో మాట్లాడి ఐటీడీఏ పల్స్ యాప్ పనితీరుపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట వార్డెన్, ప్రిన్సిపాల్ తదితరులున్నారు. -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్: దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రీయ వికలాంగుల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్ అలీ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ అందించాలని, అలాగే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. మహిళా సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల శాఖను వేరు చేసి న్యాయం చేయాలని, గ్రామీణ ప్రాంత దివ్యాంగుల పింఛన్ నేరుగా బ్యాంకుల్లో జమ అయ్యేలా చూడాలని కోరారు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు పాటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మహమ్మద్ ఇమ్రాన్, ఫైసల్ అహ్మద్, శివకుమార్ పాల్గొన్నారు. -
నేడు ‘రైతు భరోసా’ విడుదల
ఆదిలాబాద్టౌన్: రెండో విడత రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తుపూర్పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో విడుదల చేయనున్నారు. మొదటి విడత రైతు భరోసా నిధులు మార్చి 23న రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇందులో ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ పట్టా ఉన్న ప్రతీ రైతుకు ఒక ఎకరం డబ్బులు మాత్రమే జమ చేశారు. ఈ విడతలో మరో ఎకరానికి సంబంధించి నిధులు విడుదల కానున్నాయి. ఈ సారి జిల్లాలో లక్ష 52వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. మూడో విడత డబ్బులు త్వరలోనే విడుదల అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎకరం పైబడి, రెండెకరాల వరకు ఉన్న రైతులకు ఈ విడతలో జమ కానున్నాయి. గతంలో విడతల వారీగా డబ్బులు జమ అయ్యేవి. ఎకరం, ఆ తర్వాత రెండెకరాలు ఇలా వేసేవారు. దీంతో ఎకరం పైబడిన రైతులు తమకు ఎప్పుడు డబ్బులు జమ అవుతాయని ఎదురుచూసేవారు. ఈసారి మాత్రం ప్రతీ రైతుకు విడతల వారీగా డబ్బులు జమ చేస్తున్నారు. కాగా సోమవారం జిల్లాలోని రైతు వేదికల్లో సీఎం ప్రసంగాన్ని వీక్షించేందుకు వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేశారు. రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. -
సీఎం ప్రత్యేక దృష్టి
ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపంపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి రాగానే స్మృతి వనం ఏర్పాటుకు సంకల్పించారు. రూ.కోటి మంజూరు చేశారు. గతేడాది సెప్టెంబర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన మాట నిలుపుకున్నారు. బాధిత కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా రాయితీ రుణాలతో వాహనాలు అందించడంతో పాటు మండలంలోని ముత్నూర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశారు. పనులు కొనసాగుతున్నాయి. -
గాయపడ్డ వారిని కూడా ఆదుకోవాలి
ప్రభుత్వం అమరులైన 15 మంది కుటుంబాలను గుర్తించినట్లు నాడు గాయాల పాలైన వారిని కూడా గుర్తించాలి. బాధిత కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి. అలాగే స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. – మెస్రం నాగ్నాథ్, అమరవీరుల ఆశయ సాధన సమితి చైర్మన్ అమరుల ఆశయాలను నెరవేర్చాలి ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయాలను ప్రభుత్వం నెరవేర్చాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్తూపానికి మరో ఎకరం భూమి కేటాయించడంతో పాటు అమరుల కుటుంబాలకు ఐదెకరాల సాగు భూమి, పింఛన్ సౌకర్యం కల్పించాలి. అలాగే ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. – ఆత్రం భుజంగ్రావ్, అమరవీరుల ఆశయ సాధన సమితి వ్యవస్థాపకులు -
సభకు భారీగా తరలిరండి
ఉట్నూర్రూరల్: ఇంద్రవెల్లి అమరువీరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు సోమవారం నిర్వహించే సభకు గిరిజనులు భారీగా తరలిరావాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పెందూర్ దాదిరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ కోరారు. మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఇంద్రవెల్లి ఘటనకు 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మృతివనం వద్ద సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అమరుల ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు. కార్యక్రమంలో కుమురం భీమ్ మనుమడు కుమురం సోనేరావు, జిల్లా సార్మేడి తొడసం అమృత్రావు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందూర్ సంతోష్, నాయకులు మెస్రం నాగనాథ్, త్రిమూర్తి, మోతీరాం, మారుతి, రామ్దాస్, భరత్, ఆదివాసీ పెద్దలు పాల్గొన్నారు. -
చిత్తశుద్ధి ఉంటే పాత బిల్లు ప్రవేశపెట్టాలి
కై లాస్నగర్: ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్కు సంబంధించిన పాత బిల్లు ప్రవేశపెట్టాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్జాదవ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా మహిళా రిజర్వేషన్ ముసుగులో డీలిమిటేషన్, కేంద్రప్రాంతాల సవరణ పే రిట 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చిందని ఆరోపించారు. ఎన్డీఏ సర్కారు మో సపూరితంగా బిల్లు ప్రవేశపెట్టడంతోనే కాంగ్రెస్, ఇతర విపక్షాలు మూకుమ్మడిగా తిరస్కరించాయమన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గతంలో ఆమోదం పొందిన మహిళల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇందులో పార్టీ జిల్లా అధి కార ప్రతినిధి బాలూరి గోవర్ధన్రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గౌలి సంజయ్కుమా ర్, నాయకులు గండ్రత్ సుజాత, అడ్డి భోజా రెడ్డి, అల్లూరి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెకు సై..
ఆదిలాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అంటున్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా తమపై చిన్నచూపు చూస్తోందంటూ పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో జేఏసీగా ఏర్పడి ఆందోళనకు సమాయాత్తం అవుతున్నారు. ఈ నిరసన నిరవధికంగా కొనసాగితే ప్రజా రవాణాకు ఇబ్బందులు తప్పవు. మరోవైపు ఆర్టీసీకి సైతం రూ.కోట్లల్లో నష్టం వాటిల్ల నుంది. కార్మికులతో క్షేత్రస్థాయిలో చర్చిస్తున్న అధి కారులు సమ్మె విరమింపచేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లవైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. రీజియన్ పరిధిలో మొత్తం ఉద్యోగులు :1946 బస్సులు: 641 -
‘జాగృతి’ గూటికి రాథోడ్ బాపూరావ్
ఇచ్చోడ: బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆదివారం జాగృతిలో చేరారు. బాపూరావ్ 2009 ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. బోథ్ నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2014లో టీఆర్ఎస్ టికెట్ దక్కగా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018లో రెండోసారి కారు గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు. 2023 ఎన్నికల్లో గులాబీ బాస్ ఆయనకు టికెట్ నిరాకరించడంతో వెంటనే బీజేపీ చేరారు. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. రెండో రోజే కాంగ్రెస్లో చేరారు. అక్కడ కూడా టికెట్ దక్కకపోగా నిరాశకు గురైన ఆయన ఇప్పటి వరకు ‘హస్తం’ పార్టీలోనే కొనసాగారు. క్రియాశీల రాజకీయాలకు మాత్రం దూరంగా ఉన్నారు. తాజాగా కవిత ఈనెల 25న కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ను వీడి జాగృతి కండువా కప్పుకున్నారు. -
సోలార్.. బడులు
ఆదిలాబాద్టౌన్: సర్కారు బడుల్లో సోలార్ కాంతులు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది పలు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మ రోవైపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యుత్ సంస్థకు డబ్బులు చెల్లించా ల్సి ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సోలార్ విద్యుత్ను అందుబాటులోకి తీసుకువస్తుంది. జిల్లాలో తొలివిడతగా 179 పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటిలో కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్య, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. త్వరలో మిగతా వాటిలో కూడా ఏర్పాటు చేయనున్నారు. తగ్గనున్న విద్యుత్ భారం.. సోలార్ ఏర్పాటుతో సర్కారు బడుల్లో విద్యుత్ బిల్లుల భారం తగ్గనుంది. ప్రభుత్వ సంస్థల్లో ఉత్పత్తి చేస్తున్న సోలార్ విద్యుత్లో అవసరం మేరకు వాడుకొని మిగిలిన దాన్ని వదిలేసే పరిస్థితి ఉంది. ఇకపై అలా కాకుండా అవసరాల మేరకు వినియోగించుకొని మిగిలిన దాన్ని గ్రిడ్ ద్వారా డిస్కౌంట్లకు విక్రయించుకునే అవకాశం ఉంది. బడుల్లో కంప్యూటర్లు, ఫ్యాన్లు, మోటార్ నడవడానికి ఎక్కువ కరెంట్ వినియోగిస్తున్నారు. సోలార్ ప్యానళ్ల ఏర్పాటుతో ప్రతీ పాఠశాలలో రెండు కిలోవాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. కిలోవాట్కు రూ.లక్ష చొప్పున ఖర్చవుతుంది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానిస్తారు. బ్యాటరీ ఇన్వర్టర్ ద్వారా నిలువ చేసుకుని అవసరం మేరకు వినియోగించుకోనున్నారు. ఈ నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం భరించనుంది. ఐదేళ్ల పాటు సంస్థతో నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో ఇందుకు సంబంధించిన టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. విద్యార్థులకు ప్రయోజనం.. సోలార్ ప్యానళ్ల ఏర్పాటుతో పాఠశాలల్లో ఇక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదు. వీటి ఏర్పాటుతో ప్రభుత్వానికి కూడా విద్యుత్ భారం తగ్గనుంది. మిగులు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం ద్వారా ఆయా పాఠశాలల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. వీటిని బడుల అభివృద్ధికి వినియోగించవచ్చు. జిల్లాలో డీఈవో పరిధిలో పాఠశాలలు 739 ప్రాథమిక 500, ప్రాథమికోన్నత 119, ఉన్నత 120 మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాలలు 179 మండలం ఎంపికై న పాఠశాలలు ఆదిలాబాద్రూరల్ 11 ఆదిలాబాద్ అర్బన్ 7 బజార్హత్నూర్ 7 బేల 7 భీంపూర్ 8 బోథ్ 15 గాదిగూడ 3 గుడిహత్నూర్ 11 ఇచ్చోడ 11 ఇంద్రవెల్లి 10 జైనథ్ 18 మావల 2 నార్నూర్ 6 నేరడిగొండ 7 సిరికొండ 3 తలమడుగు 13 తాంసి 8 ఉట్నూర్ 12 179 పాఠశాలలు ఎంపికయ్యాయి.. ప్రభుత్వం జిల్లాలోని 179 పాఠశాలలకు సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సర్కారు బడులకు మేలు జరగనుంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ వీటి నిర్వహణ చేపట్టనుంది. వీటిని పకడ్బందీగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతాం. కొన్ని పాఠశాలల్లో ఇదివరకు పైలెట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేశారు. అది విజయవంతంగా కొనసాగుతున్నాయి. – రాజేశ్వర్, డీఈవో మండలాల వారీగా.. -
‘మహిళా రిజర్వేషన్’కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉట్నూర్రూరల్: మహిళా రిజర్వేషన్ బిల్లు మా త్రమే ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, ఈ బిల్లుకు తమ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకం కాదని ఖా నాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నివాసంలో విలేకరులతో మా ట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళలు అంటే గౌరవం ఉందా.. అని ఆయన ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ చేస్తున్న తప్పుడు, దురుద్దేశ పూరిత ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. డీలిమిటేషన్ పేరుతో చిన్న రాష్ట్రాల హక్కులను దెబ్బతీసేలా, దేశ సమాఖ్య స్వరూపాన్ని బలహీనపరిచేలా బీజేపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. కార్యక్రమంలో జైవంత్ రావ్, తిరుపతి, ఆనంద్రావ్, భాగ్యలక్ష్మి, చంద్రయ్య, తిరుప తి, జాదవ్ జగదీశ్,లాజర్ తదితరులు పాల్గొన్నారు. -
భూ బదలాయింపు సులువేనా ..
సాక్షి, ఆదిలాబాద్: రక్షణ, పౌర విమానయాన శాఖలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదిలాబాద్లో విమానాశ్రయం కోసం నిర్వహించిన అబస్టకిల్ లిమిటేషన్ సర్పేసెస్ (ఓఎల్ఎస్) సర్వే తర్వాత ప్లాన్–బి తెరపైకి వచ్చిందనే ప్రచారం మొదలైంది. ఇందు కోసం 1500 ఎకరాల భూమి అవసరమని అంటున్నారు. ఈ భూసేకరణ వ్యయాన్ని పూర్తిగా రక్షణ శాఖే భరిస్తుందా.. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటుందా.. ఇలా భిన్న రకాలుగా చర్చించుకుంటున్నారు. రక్షణశాఖ నుంచే ఈ మాస్టర్ప్లాన్ అమలవుతుందనే ప్రచారం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్లో జాయింట్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటును రక్షణశాఖ కీలకంగా తీసుకుంటుందా.. అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వేకు సంబంధించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్టును ఆయా శాఖలు ఆయా హెచ్వోడీలకు సబ్మిట్ చేసిన తర్వాత ఆ నివేదకల ఆధారంగా ఢిల్లీలో 20రోజుల్లో తదుపరి సమావేశం ఉంటుందని చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ ఓఎల్ఎస్ సర్వే చేస్తున్న క్రమంలో ఈ అంశాలన్నీ వారు జిల్లా ప్రజాప్రతినిధులను, అధికారులను అడిగినట్లుగా తెలుస్తుంది. ప్లాన్– ఏలో ఏముంది.. రక్షణశాఖకు సంబంధించి జిల్లా కేంద్రంలో 369 ఎకరాలు అందుబాటులో ఉందని, ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం మరో 430కిపైగా ఎకరాలు అవసరమని ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, రాంమోహన్నాయుడు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా అంతకు ముందే ఈ 700 ఎకరాలకు పైగా భూమి సేకరణ కోసం గతేడాది నవంబర్ 3న ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. దీంతో ఈ ప్లాన్ ప్రకారమే భూ సేకరణ ఉంటుందని ఓఎల్ఎస్ సర్వే నిర్వహణకు ముందు ప్రచారం సాగింది. భూ సేకరణ నిధుల వెచ్చింపులోనే .. ప్లాన్–బిలో రక్షణ, పౌర విమానయానశాఖలు, రాష్ట్ర ప్రభుత్వం మూడు కలిసి ముందుకు వెళ్తాయా..అలాంటి పరిస్థితిలో భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తారా.. 1500 ఎకరాలు సేకరించాల్సి ఉండటంతో పెద్ద మొత్తం రాష్ట్రం భరించేందుకు సిద్ధమవుతుందా అనే చర్చ ప్రస్తుతం సాగుతుంది. అలా కాకుండా ఈ ఎయిర్ఫీల్డ్ను రక్షణ శాఖ కీలకంగా పరిగణిస్తుండటం, వైమానిక శిక్షణ కేంద్రంతో పాటు ఇక్కడ యుద్ధ విమానాలను నిలిపేందుకు అనువుగా ప్రత్యామ్నాయ స్థలంగా పరిగణిస్తుందనే ప్రచారం కూడా సాగుతుంది. అటువంటి పరిస్థితుల్లో రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండానే భూసేకరణ వ్యయం పూర్తిగా భరించి ముందుకు వెళ్లవచ్చనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉండదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ జాయింట్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటు విషయంపై అందరి ఆసక్తి నెలకొంది. కొత్త ప్లాన్ ప్రకారం 1500 ఎకరాల భూమి సేకరించాల్సి వస్తే.. అందులో సీసీఐ దగ్గర ఉన్న 800 ఎకరాలను రక్షణశాఖకు బదలాయించుకునే అవకాశం లేకపోలేదని ఇక్కడి ప్రజాప్రతినిధులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన సీసీఐ దశాబ్దాల క్రితం మూతపడటం, తాజాగా స్కారప్ కింద దాన్ని తొలగించే పనులకు సంబంఽధించి ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఈ భూముల బదలాయింపు అంశం కూడా చర్చలోకి వస్తుంది. అలాంటప్పుడు జాయింట్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటులో ప్రస్తుతం రక్షణశాఖ పరిధిలో ఉన్న 369 ఎకరాలు పోను సీసీఐ దగ్గరి 800కు అదనంగా మిగిలిన భూమి ప్రభుత్వాలు భూ సేకరణ చేయడం సులువుగా ఉంటుందనే అభిప్రాయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఢిల్లీలో జరిగే తదుపరి సమావేశంలోనే వీటన్నింటిపై స్పష్టత వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. -
ఎన్యూమరేటర్లకు శిక్షణ
కై లాస్నగర్: జనగణనలో భాగంగా మే 11నుంచి ప్రారంభం కానున్న హౌస్లిస్టింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ జి.రాజు అన్నారు. పట్టణ పరిధిలో ఈ విధులు నిర్వహించనున్న సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమం శనివారం స్థానిక టీటీడీసీలో ప్రారంభమైంది. మొత్తం 400 మందికి గాను నాలుగు బ్యాచ్లుగా శిక్షణనిస్తున్నారు. తొలి బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఎన్యూమరేటర్ బ్లాక్ పరిధిలోని ఇళ్లను పకడ్బందీగా గుర్తించాలన్నారు. ఏ ఒక్కరు తప్పిపోకుండా సర్వే చేపట్టాలన్నారు. ప్రజలు స్వతహాగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకోవచ్చని ఆ దిశగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఇందులో టీపీవో సుమలత, టీపీఎస్ నవీన్ కుమార్, మాస్టర్ ట్రైనర్లు మహేందర్రెడ్డి, సుజాత్ఖాన్, శ్రీహరీబాబు, తిరుపతి, జలీల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు న్యాయం చేయాలి
కై లాస్నగర్: సీసీఐ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయుసీ) నాయకులు శనివారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సెక్రెటరీ, సీసీఐ చైర్మన్ సంజయ్ బంగాను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఎంపీ గోడం నగేశ్ ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్, సీసీఐ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఏ.నిరంజన్రావు చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. హైకోర్టు జడ్జిమెంట్ను అమలు చేయాలని, ఉద్యోగులను ఇంకా పైకోర్టుకు వెళ్లి వేధించవద్దని కోరారు. ఈ మేరకు చైర్మన్ స్పందిస్తూ సీఎండీతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లుగా వారు పేర్కొన్నారు. అనంతరం సీఎండీని కలిసి హైకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయాలని కోరారు. ఇందుకు సీఎండీ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లుగా వారు పేర్కొన్నారు. -
బాల్య వివాహాలను ప్రోత్సహించొద్దు
ఆదిలాబాద్టౌన్: బాల్య వివాహాలు ప్రోత్సహించేవారిపై కఠన చర్యలు తీసుకుంటామని జిల్లా బాల ల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని బాలరక్షక్ భవన్లో పూజారులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముహూర్తాలు ఉన్నాయని వయసు చూడకుండానే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారని, అలాంటి వాటిని ని ర్వహించవద్దన్నారు. బాల్యవివాహాలు చట్య రీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో ధూప దీప నైవేద్య సంఘం జిల్లా అధ్యక్షుడు కలవరపు లింగయ్య, ఎల్సీపీవో రమేశ్, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ సతీష్, పీవోఐసీ ఎన్. స్వామి,ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ వినోద్ కుమార్, అర్చక సంఘం ప్రచార కార్యదర్శి గజానంద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ
ఆదిలాబాద్టౌన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరుస్తూ విద్వేష రాజకీయాలకు దారి తీసేలా బీజేపీ వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, మహిళా బిల్లుపై బీజేపీ చిత్తశుద్ధి లేని తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కుమురం భీం చౌక్లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఎంపీ తేజస్వి చిత్రపటాన్ని దహ నం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, పార్లమెంట్లో తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది ఉన్నప్పటికీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఒక్కరు కూడా ఖండించకపోవడం శోచనీయమన్నారు. మహిళా బిల్లుపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, దానిని నియోజక వర్గాల పూనర్విభజనను లింకు పెట్టడం సరికాదన్నారు. మహిళలందరికీ బీజేపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అజయ్, నారాయణ, రమేశ్, యూనిస్ అక్బా నీ, సాజిదొద్దీన్, ప్రహ్లాద్, రమేశ్, వసంత్, గణేశ్, భూమన్న, ప్రేమల, పర్వీన్, కరుణ, ఉమ తదితరులు పాల్గొన్నారు. -
పరిషత్.. మళ్లీ కదలిక
కై లాస్నగర్: రాజకీయ పార్టీలు, ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరిషత్ ఎన్నికల నిర్వహణపై మళ్లీ కదలిక మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వీలుగా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సీఈసీ ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా అనుసరించి అదనంగా నమోదైన ఓటర్ల ప్రకారం వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. ఈమేరకు ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. ఎస్ఈసీ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. గతంలోనూ ఈ ప్రక్రియ చేపట్టినా ఎన్నికలు నిర్వహించలేదు. ఈ సారైనా నిర్వహిస్తారా లేక మళ్లీ ఓటరు జాబితా తయారీతోనే సరిపెడుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. ‘అసెంబ్లీ’ జాబితా ఆధారంగా.. కేంద్ర ఎన్నికల సంఘం గతేడాది జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5వరకు చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసింది. దీంతో కొత్త ఓటర్లు స్పల్పంగా పెరిగారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించిన తుది జాబితా ప్రకారం జిల్లాలో 4,49,981 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2,19,652 మంది, మహిళలు 2,30,313 మంది ఉన్నారు. ఇతరులు మరో 16 మంది ఉన్నారు. ఇటీవల సవరణ ప్రక్రియ చేపట్టగా జిల్లాలో కొత్త ఓటర్లుగా 3,214 మంది నమోదయ్యారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1,431, బోథ్ నియోజకవర్గంలో 1243, ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల పరిధిలో 330, ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని గాదిగూడ, నార్నూర్ మండలాల పరిధిలో 210 చొప్పున కొత్త ఓటర్లు నమోదయ్యారు. ప్రస్తుతం వీరందరిని వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేయనున్నారు. కసరత్తు షురూ.. నూతన ఓటర్ల జాబితాలను అనుసరించి మండలాల వారీగా సిద్ధం చేయాలని జెడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. తదనుగుణంగా వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలను మ్యాపింగ్ చేయాలని సూచించింది.ఎస్ఈసీ ఆదేశాల మేరకు జెడ్పీ సీఈఓ బి.రవి, జిల్లా పంచాయతీ అధికారి జి.రమేశ్ శనివారం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, జెడ్పీ సిబ్బందితో గూగుల్ మీట్ నిర్వహించారు. మ్యాపింగ్ ప్రక్రియకు అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈనెల 23 వరకు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో..జెడ్పీటీసీ స్థానాలు 20 ఎంపీటీసీ స్థానాలు 166 మొత్తం పల్లె ఓటర్లు 4,49,981 కొత్తగా నమోదైన వారు 3214 ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ గడువు ఈనెల 23పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక పరిషత్ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తుందని రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులంతా భావించారు. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో తేలాకే వాటిపై ముందుకెళతామని సీఎం ప్రకటించడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా ఎస్ఈసీ ఓటర్ల జాబితాకు ఆదేశించడంతో ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లయింది. అయితే వెంటనే చేపడుతుందా.. రిజర్వేషన్లు ప్రకటించాకే నిర్వహిస్తుందా అనేదానిపై మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అధికారులు మాత్రం ఎస్ఈసీ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. చిగురించిన ఆశలు.. -
అగ్నిగుండం
గత వారం, పది రోజులుగా ఉమ్మడి జిల్లా పరిధిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమురంభీం జిల్లాలోని సిర్పూర్–టి మండలం లోనవెల్లిలో, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్, బేలలోని చెప్రాల, బోథ్లోని పొచ్చెర, నిర్మల్లోని మామడ, కడెం, దస్తురాబాద్లలో 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే భైంసా, ముజ్గి, బీరవెల్లి, తలమడుగు, తానూర్లలో 44.2 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మెజార్టీ మండలాలు, గ్రామాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీధి వ్యాపారులు, ఉపాధి హామీ కూలీలు, అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు ఎండ తీవ్రతతో అవస్థలు పడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురవుతున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బ యటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. టోపీ, తలపాగా, స్కార్ప్ ధరించడం, గొడుగుల సాయంతోనే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా శరీరం డిహైడ్రేషన్కు గురవుతుందని, ఈమేరకు వీలైనంత వరకు నీడపట్టునే ఉండాలని , నీళ్లు అధికంగా తాగాలని సూచిస్తున్నారు.సోనేరావ్కు దళితరత్న అవార్డుఆదిలాబాద్రూరల్: దళితరత్న అవార్డు గ్రహీత కొడప సొనేరావ్ను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అభినందించారు. ఈనెల 14న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పలువురిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో ఆదివాసీ గిరిజనుల ను చైతన్యపరుస్తున్న సోనేరావ్ ఎంపికయ్యా రు. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు శనివారం ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా సొనేరావ్ను మంత్రి శాలువాతో సత్కరించి దళిత రత్న అవార్డు అందజేసి అభినందించారు. ఆయన వెంట మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్క రాందాస్, కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టేకం లక్ష్మణ్ తదితరులున్నారు.ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అగ్ని గుండంగా మారింది. మూడు, నాలుగు రోజులు గా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం నిర్మల్ జిల్లా దస్తురాబాద్లోని బుట్టాపూర్లో 44.5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు బేల మండల కేంద్రంలో 44.4 డిగ్రీల సెల్సియస్ నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో వారం పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలాగే నమోదవుతా యని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గతంతో పోల్చితే ఈసారి భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండల తీవ్రత కారణంగా ఉదయం 10 దాటిందంటే జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాలు, గ్రామాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనం భయటకు వెళ్లేందుకే జంకుతున్నారు. సాయంత్రం ఆరు దాటినా వడ గాలులు తగ్గడం లేదు. ఈ ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులపై పడుతుంది. స్కార్ప్ ధరించి స్కూటీపై వెళ్తున్న మహిళమ్యూల్ ఖాతాలు లేకుండా చూడాలి ఓఎల్ఎస్ సర్వే తర్వాత..నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు.. -
సంక్షేమ వారోత్సవాలు విజయవంతం చేయాలి
కై లాస్నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20నుంచి 26వరకు నిర్వహించనున్న సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఇన్చార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. సంక్షేమ వారోత్సవాలను పక్కాగా నిర్వహించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 20న జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, విద్యాసంస్థల్లో శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. రెండోరోజు విద్యార్థులకు టాలెంట్ ఫెస్టివల్ పేరుతో క్విజ్, డిబేట్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మూడో రోజున అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థల్లో ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే వాటిని పూర్తిచేయాలన్నారు. నాలుగో రోజున విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సౌకర్యాలను వివరించాలని తెలిపారు. తదుపరి రోజుల్లో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, సమ్మర్ క్యాంప్స్, బడిబాట తదితర కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
‘రిమ్స్లో రీల్స్’పై విచారణ కమిటీ
ఆదిలాబాద్టౌన్: ‘రిమ్స్లో రీల్స్ మోజు’ శీర్షికన ఈనెల 15 ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈమేరకు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ స్పందించారు. విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. ఇందులో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ విద్యావిల్సన్, ప్రొఫెసర్లు కరుణాకర్, సందీప్ జాదవ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు దీపక్ పుష్కర్, నరేందర్ బండారి ఉన్నారు. వైద్య విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన రీల్స్ను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. అభ్యంతకరంగా ఉన్నట్లయితే వర్సిటీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ పేర్కొన్నారు. -
అత్యవసర సమయంలో సీపీఆర్ కీలకం
ఆదిలాబాద్టౌన్: ప్రమాద సందర్భాల్లో బాధితుల ప్రాణాలు కాపాడడంలో సీపీఆర్ కీలకపాత్ర పోషి స్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏఆర్ హెడ్క్వార్టర్స్లో డయల్ 100, బ్లూకోర్ట్, స్పెషల్ పార్టీ, ఏఆర్ సిబ్బందికి సీపీఆర్, ఫస్ట్ఎయిడ్పై శిక్షణ నిర్వహించారు. రిమ్స్కు చెందిన అనస్తీషియా వైద్యులు పాల్గొని శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారని, ఆ సమయంలో తక్షణ వైద్యసాయం అందిస్తే ప్రాణాలను రక్షించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నా రు. రోడ్డు ప్రమాదాలను గమనించిన వెంటనే స్పందించి బాధితులను సమీప ఆస్పత్రికి తరలించడం ప్రతిఒక్కరు బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి చేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రహ వీర్’ పథకం ద్వారా నగదు బహుమతి అందజేస్తారని తెలిపారు. అలాగే ప్రమాద బాధితులకు సమీప ఆస్పత్రిలో రూ.1.5 లక్షల వరకు క్యాష్లెస్ చికిత్స అందుబాటులో ఉంటుందని చెప్పారు. ట్రా ఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం, హెల్మె ట్, సీట్బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరి చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా సీపీఆర్, ఫస్ట్ఎయిడ్ శిక్షణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, పట్టణ సీఐలు, ఆర్ఐలు, రిజర్వ్ సిబ్బంది, రిమ్స్ అనస్తీషియా డాక్టర్ శ్యామ్సుందర్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ వివేక్, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
లైసెన్స్డ్ సర్వేయర్లకు మండలాలు కేటాయింపు
కై లాస్నగర్: లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపికై ఇటీవ ల సీఎం చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్న జిల్లాలోని 66మందికి మండలాలను కేటా యించారు. వారికి జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ఎల్.ప్రభాకర్ శుక్రవారం తన కార్యాలయంలో ని యామకపత్రాలు అందజేశారు. అత్యధికంగా ఆది లాబాద్ అర్బన్, ఆదిలాబాద్రూరల్ మండలాలకు ఐదుగురు చొప్పున కేటాయించగా..తాంసి,భీంపూ ర్ మండలాలకు ఒక్కొక్కరినే నియమించారు. వీ రంతా సంబంధిత మండలాల రెగ్యులర్ సర్వేయర్లతో కలిసిపనులు నిర్వహించనున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఇటీవల44 మందికి ఉత్తర్వులు అందజేయగా తాజాగా మరో 66మందికి అందించారు. మండలాల వారీగా నియామకం అయిన వారి వివరాలు... మండలం నియామకం అయిన వారు ఆదిలాబాద్రూరల్ జి.నిఖిల్, కె.అవినాష్, బి.ప్రమోద్కుమార్, ఎస్.ఆదిత్య, ఆర్.పవన్నాయక్ ఆదిలాబాద్ అర్బన్ జే.శివానీ, ఎం.సరస్వతి, పి.శ్రీకాంత్, ఆర్.ప్రణయ, వి.లక్ష్మీనారాయణ బజార్హత్నూర్ జే.ఉదయ్ కిరణ్, కె.మల్లికార్జున్, ఎన్.రాజశేఖర్రెడ్డి బేల జి.గజానన్, యు. అభినవ్, వి.నందిని భీంపూర్ సి.సతీశ్రెడ్డి భోరజ్ జి.సచిన్, జి.రాజు బోథ్ జైపాల్, ఆర్.సొనాలి, సాయిచరణ్ గాదిగూడకు ఏ.దిలీప్కుమార్, ఆర్ఈశ్వర్, ఆర్.సాయికిరణ్ గుడిహత్నూర్ జే.దివ్య, ఎం.రమేశ్, ఆర్.ఉదయ్కిరణ్ ఇచ్చోడ కె.సతీశ్, పి.శ్రీపద్, ఏ.నాగోరావు, ఆర్.శ్రీనివాస్ ఇంద్రవెల్లి ఏ.నాగార్జున, విజయ్కుమార్, ఆర్.ప్రవీణ్ జైనథ్ జే.జ్యోత్స్య, జే.గజానంద్, జి.హరికృష్ణ, అక్షయ్ మావల బి.చక్రధర్, బి.మానస, ఎన్.ధన్రాజ్ నార్నూర్ పి.హనుమంత్రావు,డి.పవన్కుమార్,జే.వరప్రసాద్, ఆర్.ఆనంద్ప్రసాద్ నేరడిగొండ క్రాంతికుమార్, జే.అర్జున్, కె.అవినాష్ సాత్నాల బి.రాజ్వరుణ్, ఎం.హన్మంత్రెడ్డి, పి.నరేశ్ సిరికొండ జే.సౌజన్య, పి.శివకృష్ణ, పి.సాయికృష్ణ, టి.రాజశేఖర్ సొనాల సి.ఆనంద్రెడ్డి, ఆర్.మమత, పి.వినిత్ తలమడుగు కె.నవీన్కుమార్, పి.సాయికుమార్ తాంసి పి.శశివర్ధన్రెడ్డి ఉట్నూర్ జే.ధరంపాల్. పి.నాగేశ్వర్, ఆర్.వరుణ్కుమార్, కె.విష్ణుకాంత్ -
బీజేపీ ఎంపీ తీరుపై కాంగ్రెస్ నిరసన
కై లాస్నగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అపహాస్యం చేస్తూ పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీ జేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు డా క్టర్ నరేశ్జాదవ్ డిమాండ్ చేశారు. ఎంపీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్చౌక్లో ఆ పా ర్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి చెంది న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయనతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ శ్రీ కాంత్రెడ్డి, నాయకులు సాజిద్ ఖాన్, సుజాత, సంజీవ్ రెడ్డి, సంజయ్, రూపేష్రెడ్డి, మంగేష్, కౌన్సిలర్ చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విమానాశ్రయ నిర్మాణానికి మరో అడుగు
ఆదిలాబాద్: జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేర్చేలా ఆదిలాబాద్లో అత్యాధునిక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పూర్తిస్థాయి ఎయిర్ఫోర్స్ స్టేష న్తో పాటు సివిల్ ఏవియేషన్ అవసరాలకు అనుగుణంగా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దనున్నట్లు తె లుస్తోంది. ఇందుకు సంబంధించి ఎయిర్పోర్ట్ అ థారిటీ ఆఫ్ ఇండియా, రక్షణశాఖ అధికారులు శుక్రవారం సంయుక్తంగా ‘ఓఎల్ఎస్ ఫీల్డ్ సర్వే’ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని విమానాశ్రయ మైదా నం, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం మొత్తం 1,540 ఎకరాల భూ మి అవసరమని అధికారులు గుర్తించారు. ఇప్పటికే కేంద్రం వద్ద ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 450 ఎకరాలు అవసరం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన భూమి కోసం గతంలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి చెందిన 700 ఎకరాలను సేకరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ విమానాశ్రయంలో రక్షణ, పౌర అవసరాల కోసం 2.5 కిలోమీటర్ల మేర భారీ రన్వేను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుల సహకారంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని, సర్వే నివేదికను మరో 20 రోజుల్లో కేంద్రానికి అందజేస్తామని తెలిపారు. భూ సేకరణ వల్ల ప్రభావితమయ్యే నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తర్వాతే నష్టపరిహారం చెల్లింపులు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విమానాశ్రయ ఏర్పాటుతో ఆదిలాబాద్ పారిశ్రామికంగా, రవాణా పరంగా కొత్త పుంతలు తొక్కనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ఎయిర్ఫోర్స్ అధికారులు రాహుల్ శుక్లా, ఎస్జీ. హెగ్డే, జేపీ సబ ర్వాల్, రాజీవ్ కల్నల్ నటరాజ్ తదితరులున్నారు. -
‘సర్వేల పేరుతో బీసీలకు అన్యాయం’
ఆదిలాబాద్టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పు నర్విభజన, సమగ్ర కుటుంబ సర్వే పేరుతో బీ సీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రా మన్న ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని, ముఖ్యమంత్రి ఇద్ద రు సర్వేల పేరుతో బీసీలను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. బీసీ సమగ్ర గణనపై కాంగ్రెస్ మంత్రులు సైతం అసంతృప్తిగా ఉ న్నారని పేర్కొన్నారు. సమావేశంలో వసంత్, రమేష్, అశోక్ స్వామి, జగదీష్, గంగయ్య, రా ము,ప్రశాంత్,కలీమ్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు పూర్తి సహకారం
కై లాస్నగర్: ఆదిలాబాద్లో విమానాశ్రయ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని ఇన్చార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎయిర్ఫోర్స్ అధికారులతో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదిలాబాద్లో పూర్తిస్థాయి ఎయిర్ఫోర్స్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలి పారు. దీని ద్వారా శిక్షణ కేంద్రం, రక్షణ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు ఆదిలాబాద్ నుంచే కొనసాగనున్నాయని చెప్పారు. త్వరలో ఢిల్లీ లో నిర్వహించనున్న జాయింట్ మీటింగ్లో తుది నిర్ణయంపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మె ల్యే శంకర్ మాట్లాడుతూ, విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కీలక అడుగులు పడుతున్నాయని, ఇది జిల్లాకు శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. ఇందులో అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు, ఆర్డీవో స్రవంతి, ఎయిర్ఫోర్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
హిమోఫిలియోపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్టౌన్: హిమోఫిలియో వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. శుక్రవారం రిమ్స్ కళాశాలలో ప్రపంచ హిమోఫిలియో దినో త్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో మెడికోలు, నర్సింగ్ విద్యార్థులు, వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలతో అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిమోఫిలియో జన్యుపరంగా సంక్రమించే వ్యాఽధి అన్నారు. వ్యాధి గ్రస్తులు గాయా ల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఇందులో జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, జిల్లా అదనపు వైద్యాధికారి సాధన, వైద్యాధికారులు నరేందర్ బండారి, దీపక్ పుష్కర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
కై లాస్నగర్: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదు ట ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి సర్కారు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ కన్వీనర్ కె.శివకుమార్, కోకన్వీనర్ ఏ.నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలను ఆరు నెలల్లోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. ఫలితంగా ఉద్యోగ విరమణ పొందిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీఆర్సీ గడువు ముగిసినప్పటికీ అమలుపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో స్రవంతిని కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు సోగాల సుదర్శన్, కొమ్ము కృష్ణకుమార్, కిష్టన్న, అశోక్, సతీష్, రవీంద్ర, జలందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కోఆప్షన్’ సందడి
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్లో కోఆప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది. న లుగురిని ఎన్నుకునేందుకు గాను కమిషనర్ జి. రాజు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన వారి నుంచి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీ కరించనున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. కై వసం చేసుకునేందుకు చైర్పర్సన్ ఎన్నిక సమయంలో మాదిరిగానే స్వతంత్రులతో కలిసి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్లు కూ టమి కట్టే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ సైతం పోటీ పడనున్నట్లుగా తెలుస్తోంది. ఆశావహులు ఆయా పార్టీల ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునేలా పడ్డారు. ఈ నేపథ్యంలో సభ్యుల ఎంపిక ఏకగ్రీవం అవుతుందా.. లేదా ఎన్నిక అని వార్యం కానుందా అనేది ఆసక్తికరంగా మారింది. పదవులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ దృష్టి నాలుగు కోఆప్షన్ పదవులు భర్తీ చేయనుండగా ఇందులో రెండు మహిళలకు కేటాయించారు. చెరో రెండు పదవులు దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లు భావిస్తున్నాయి. ఆయా పా ర్టీల తరఫున ఎవరిని బరిలో నిలపాలనే దానిపై ఇప్పటికే ప్రాథమికంగా అభ్యర్థులను ఎంపిక చేశా యి. అయితే వారి వివరాలతో కూడిన జాబితాను జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వద్దకు తీసుకెళ్లి ఆమోదముద్ర వేయించేలా ప్రయత్నిస్తున్నారు. చైర్పర్సన్ ఎన్నిక వ్యూహాన్నే ఈ పదవుల భర్తీలోనూ అనుసరించాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం స్వతంత్రులు, ఎంఐఎం కౌన్సిలర్లతో కలిసి కూటమిని ఏర్పాటు చేయనున్నారు. దీనిపై డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఎంఐఎం యాకత్పూర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెహ్రజ్లు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లిని త్వరలోనే హైదరాబాద్లో కలిసి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లుగా సమాచారం. అయితే ఈ పదవుల కోసం బీజేపీ కూడా పోటీ పడే అవకాశమున్నట్లుగా సమాచారం. మెజార్టీ లేనప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది. అర్హతలేంటంటే.. 25 వరకు దరఖాస్తుల స్వీకరణ అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25 సాయంత్రం ఐదు గంటల్లోపూ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కమిషనర్ సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంఽధిత అర్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలని పేర్కొన్నారు. సంబంధిత నోటిఫికేషన్ను మున్సిపల్ కార్యాలయ నోటీసుబోర్డుపై అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
తాగునీటి సమస్య పరిష్కరించాలి
ఇంద్రవెల్లి: గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని, గ్రామాలాభివృద్ధికి కృషి చేయాలని సర్పంచులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించిన సమావేశానికి హాజరైన అధికారులను వివిధ సమస్యలపై ఆయా గ్రామాల సర్పంచులు మెస్రం తుకారాం, కోవా రాజేశ్వర్, చంగోనదుది రాం, రాథోడ్ రోహిదాస్, జాదవ్ లఖన్తోపాటు మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ మసుద్, మీర్జా జిలానీబేగ్ నిలదీశారు. వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన ప్రత్యేక అ ధికారి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ.. అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజల కోసం పని చేయాలని, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని గ్రామాలాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎస్సై సాయన్న, ఎంపీడీవో జీవన్రెడ్డి, ఏవో రాథోడ్ గణేశ్, విద్యుత్ శాఖ ఏఈ రోహిదాస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భానుకుమార్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం తదితరులున్నారు. -
రాజకీయ ముఖచిత్రంలో మార్పు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాసనసభ, లోక్సభ స్థానాలు పెరగనున్నా యి. దీంతో నాయకులకు అవకాశాలూ రానున్నా యి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల పెంపు కోసం బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ స్థానాల సంఖ్య పెంచేందుకు పునర్విభజన బిల్లు ఆమోదం కోసం చర్చ జరుగుతోంది. ఇక నియోజకవర్గాల పు నర్విభజన కోసం డీ లిమిటేషన్ కమిషన్ కూడా ఏ ర్పాటు చేస్తున్నారు. దీంతో ఒకేసారి అటు మహిళా నాయకులకు అవకాశాలు, ఇటు సీట్ల పెంపుతో అందరికీ అవకాశాలు పెరగనున్నాయి. రాష్ట్రంలో 50 శాతం చొప్పున స్థానాలు పెంచితే రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడు 543 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఈ సంఖ్య 850కి చేరుతుంది. రాష్ట్రంలో ఎంపీ స్థానాలు ప్రస్తుతం 17ఉండగా.. కొత్తగా తొమ్మిది పెరిగి ఆ సంఖ్య 26 స్థానాలకు చేరుతుంది. ఇక రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా 179 స్థానాలకు పెరుగుతాయనే అంచనా ఉంది. కొత్తగా 60 స్థానాలు పెరగనున్నా యి. 2011 ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనాభా 19 లక్షలు ఉంది. మహిళా జనాభా అధికంగా ఉండడంతో ఇక్కడ సీట్లు కూడా మహిళలకు రిజర్వ్ కానున్నాయి. ప్రస్తుతం మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లులపై పార్లమెంట్లో చర్చ కొనసాగుతోంది. పార్లమెంట్లో ఆమోదం పొందితే మహిళలకు అవకాశాలు కలుగనున్నాయి. పునర్విభజన బిల్లుతో కొత్త స్థానాలు ఏర్పడనున్నాయి. ఎవరికి వారే అంచనాల్లో.. ఉమ్మడి జిల్లాలో కొత్తగా నియోజకవర్గాల పెంపుతో రాజకీయ ముఖచిత్రమే మారనుంది. ప్రస్తుతం పది అసెంబ్లీ స్థానాలైన ఆదిలాబాద్, బోథ్, ముథోల్, నిర్మల్, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చె న్నూరు, సిర్పూర్, ఆసిఫాబాద్ ఉండగా, లోకసభ స్థానాలు ఆదిలాబాద్, పెద్దపల్లి ఉన్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు లేదా ఐదు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయనే అంచనా ఉంది. మొత్తం స్థానాలు 14లేదా 15కావొచ్చు. ఇక లోకసభ స్థానం కొత్తగా ఒకటి ఏర్పడే అవకాశం ఉంది. దీంతో కొత్తగా కనీసం ఐదు నుంచి ఆరుగురు ప్రజాప్రతినిధులు చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఏ నియోజకవర్గం, ఏ మండలంతో కొత్త నియోజకవర్గం ఏర్పడుతుందని ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కూడా మారనున్నాయి. మహిళలకు 33 శాతం కోటా అమలుతో ఉమ్మడి జిల్లాలో కనీసం నాలుగు స్థానాలు రిజర్వ్ కానున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలుగా అయ్యే అవకాశముంది. ఇక ఎస్సీ, ఎస్టీ, జనరల్ స్థానాల్లోనూ మార్పులు, చేర్పులు రా నున్నాయి. దీంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా, మాజీలు, రాజకీయ ఆశావహులు ఎక్కడ పో టీ చేయాలో అని అంచనాలు వేసుకుంటున్నారు. ఇక మహిళలకు రిజర్వ్ చేసిన చోట్ల తమ కుటుంబ సభ్యుల నుంచి మహిళా నాయకులను ప్రోత్సహించనున్నారు. కొన్ని చోట్ల తమ మండల కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. అయితే, జిల్లా భౌగోళిక సరిహ ద్దు, జనాభాను బట్టి ఏ ప్రాంతం కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడుతుందనేది ఇంకా స్పష్టత లేదు.2011 ప్రకారం ఉమ్మడి జిల్లాలో.. -
ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలి
కై లాస్నగర్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, రవాణా, పోలీస్, మున్సిపల్, ఆర్అండ్బీ శాఖల అధికారులతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వాహనాల సంఖ్య పెరుగుతున్నందున ప్రమాదాలను నివారించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి, సూచిక బోర్డులు, హెచ్చరిక లైట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రహదారుల పక్కనున్న ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా యువతకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగం మానుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన కారణంగా జరిగిన ప్రమాదాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఆర్ఎస్ చిత్రు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకోవాలి
ఆదిలాబాద్టౌన్: వాహన డ్రైవర్లు ప్రతీ ఆరునెలలకోసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీందర్కుమార్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పుత్లీబౌళి పట్టణ ఆరోగ్యకేంద్రంలో డ్రైవర్లకు నేత్ర వైద్యశిబిరం నిర్వహించగా డీటీసీతోపాటు డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ హాజరై మాట్లాడారు. డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ఫోన్ మాట్లాడవద్దని తెలిపారు. ఆటో డ్రైవర్లు ముందు సీటులో ప్రయాణికులను కూర్చోబెట్టుకోవద్దని సూచించారు. వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు. రాంగ్రూట్, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. జిల్లా రవాణాశాఖ అధికారి ఎస్.శ్రీనివాస్, కంటి వైద్య నిపుణుడు అభినయ్, ఎంవీఐలు అల్లె శ్రీనివాస్, ప్రదీప్కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
లైఫ్ సేవర్స్గా పోలీసులు, వైద్యులు
ఆదిలాబాద్టౌన్: వైద్యులు, పోలీసులు లైఫ్ సేవర్స్గా ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారని గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్ అడిషనల్ డీజీపీ డాక్టర్ అనిల్కుమార్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భా గంగా అరైవ్–అలైవ్ పేరిట గురువారం పట్టణంలో ని రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన రోడ్డు సేఫ్టీ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 25మంది డ్రైవర్లకు ఉచితంగా కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై వాహనదారుల్లో మరింత అవగాహన పెంపొందించాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలి పారు. అనంతరం ద్విచక్రవాహనాలపై వెనుక కూ ర్చుని వెళ్తున్న ఇద్దరు పిల్లలకు హెల్మెట్లు ధరింపజేశారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, అడిషనల్ ఎస్పీ మౌనిక, ట్రైనీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్రెడ్డి, వైద్యులు, సీఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రమాద సూచికలు ప్రారంభం గుడిహత్నూర్: అరైవ్–అలైవ్లో భాగంగా అదనపు డీజీపీ డాక్టర్ అనిల్కుమార్ స్థానిక శర్మ దాబా వద్ద ఏర్పాటు చేసిన ప్రమాద సూచికలను ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ప్రారంభించారు. గతంలో ప్రమాదానికి గురై తీవ్రంగా దెబ్బతిన్న కారును వా హనదారులకు కనిపించేలా ఏర్పాటు చేశారు. దీని ని ప్రారంభించిన అదనపు డీజీపీ ప్రభుత్వ ఆమోదిత రేడియం స్టిక్కర్లను లారీలకు అతికించారు. అదనపు ఎస్పీ మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్కాంత్, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్రెడ్డి, హైవే నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ శివకుమార్, ఇచ్చోడ సీఐ రమేశ్, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
బకాయిల గండం!
కైలాస్నగర్: ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి ఆస్తిప న్ను అత్యంత కీలకంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల నుంచి ఇటీవల నిధుల విడుదల పూర్తిస్థాయిలో లేక ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇలాంటి ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో ప్ర భు త్వ శాఖలకు సంబంధించి బకాయిలు పేరుకుపోయాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల వసూళ్లు గత మార్చి 31తో ముగి శాయి. ఒకటి, రెండు ప్రభుత్వ శాఖలను మినహా యిస్తే అత్యధిక శాఖలు పన్ను చెల్లించడంలో విఫలమయ్యాయి. అక్షరాలరూ.22కోట్ల 56లక్షల 92వేల 400 చెల్లించాల్సి ఉంది. పన్నులు వసూలు చేయాల్సిన అధికారులు నోటీస్లతోనే సరిపెడుతున్నారు. 668 ఆస్తులు.. బకాయిలు రూ.22కోట్లు ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 40 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 668 ఆస్తులున్నాయి. వీటికి సంబంధించి రూ.22.56 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. పాత బకాయిలు రూ.9,34,27,324 ఉండగా ఏళ్ల తరబడి పన్ను చెల్లించకపోవడంతో వడ్డీ పడుతూ వస్తోంది. బకాయిల కంటే వడ్డీయే ఎక్కువగా ఉంది. రూ.12,18,55,784 వడ్డీ చెల్లించాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.98,19,774 బకాయిలు ఉండగా వీటి వడ్డీ రూ.5,89,518 చెల్లించాలి. బకాయిలు, వడ్డీ కలిపి బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. ఇందులో అత్యధికంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (సీసీఐ)కి 326 ఆస్తులుండగా వీటి బకాయిలు రూ.4,80,81,474 బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆర్అండ్బీ శాఖకు సంబంధించి 57 ఆస్తులు ఉండగా రూ.1,12,13,237 పన్ను చెల్లించాలి. ఈ రెండు శాఖలే కాదు.. జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ శాఖలు పన్నులను ఏళ్లుగా చెల్లించడం లేదు. మార్చిలోనే హడావుడి ప్రభుత్వ శాఖల నుంచి ఆస్తి పన్ను రెగ్యులర్గా వసూలు చేయాల్సిన బల్దియా అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో కొంత హడావుడి చేస్తున్నారు. పన్ను చెల్లించాలని కోరుతూ నోటీస్లకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వ శాఖలు స్పందించి స్వచ్ఛందంగా పన్ను చెల్లించేందుకు ముందుకు వస్తే తీసుకుంటున్నారు. లేదంటే మిన్నకుండి పోతున్నారు. దీంతో ఏళ్ల తరబడి బకాయిలు వసూళ్లకు నోచుకోవడం లేదు. బకాయిలు బల్దియా ఆదాయానికి గుదిబండాల మారి అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పలు శాఖల బకాయిలు రూ.లక్షల్లో ఉండటం గమనార్హం. జిల్లా కేంద్రంలోని తుక్కు కింద విక్రయానికి సిద్ధమవుతున్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.4.83 కోట్ల ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఫ్యాక్టరీ ఆనవాళ్లు కోల్పోతున్న పరిస్థితుల్లో బకాయిలు వసూలయ్యే పరిస్థితి అనుమానంగానే ఉంది.ప్రధాన శాఖల ఆస్తిపన్ను బకాయిల వివరాలు ప్రభుత్వ శాఖ బకాయిలు కలెక్టరేట్ రూ.2.73 కోట్లు రైల్వే రూ.1.38 కోట్లు ఆర్అండ్బీ రూ.1.14 కోట్లు సోషల్ వెల్ఫేర్ రూ.95.83 లక్షలు డీఎంహెచ్వో ఆఫీస్ రూ.59.24 లక్షలు జెడ్పీ కార్యాలయం రూ.75.92 లక్షలు పోస్టాఫీస్ రూ.66.65 లక్షలు జిల్లా పరిశ్రమల కేంద్రం రూ.61.21 లక్షలు ఎంపీడీవో ఆఫీస్ రూ.89.91 లక్షలు విజయ డెయిరీ ఆఫీస్ రూ.43.14 లక్షలు జిల్లా జైలు రూ.32.32 లక్షలు జిల్లా క్రీడాశాఖ ఆఫీస్ రూ.32.17 లక్షలు పీడబ్ల్యూడీ ఆర్అండ్బీ రూ.29.29 లక్షలు డీపీవో ఆఫీస్ రూ.28.92 లక్షలు రవాణాశాఖ కార్యాలయం రూ.26.57 లక్షలు జిల్లా అటవీశాఖ రూ.25.92 లక్షలు మార్కెట్ యార్డు రూ.12.76 లక్షలునోటీసులు జారీ చేశాం పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని ప్రతీ ప్రభుత్వశాఖ ఉన్నతాధికారికి మార్చిలో నోటీసులు జారీ చేశాం. బీఎస్ఎన్ఎల్, పోలీస్ శాఖ, ఆర్టీసీ సంస్థలు మాత్రమే స్పందించి పన్నులు చెల్లించాయి. మిగతా శాఖలు నిధుల కొరత ఉందంటూ చెల్లించడం లేదు. దీంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా గత నెలలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పన్నులు చెల్లించాలని ఆదేశించారు. అయినప్పటికీ బకాయిదారుల నుంచి స్పందన లేదు. బకాయిలు చెల్లించి బల్దియా అభివృద్ధికి సహకరించాలి. – కళ్యాణ్, బల్దియా రెవెన్యూ అధికారి -
సమస్యలు పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మండల ప్రగతి నివేదిక చదివి వినిపించారు. సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి నర్సయ్య, తహసీల్దార్ రఘునాథ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీసీఐ.. ఆశలు అవిరి!
కై లాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి తలమానికంగా నిలిచిన ఆదిలాబాద్ సిమెంట్ కా ర్పొరేషన్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ శకం ముగిసినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పటికై నా పునః ప్రారంభం కాకపోతుందా అని ఎదురుచూసిన వారికి నిరాశే కనిపిస్తోంది. ఇటీవలే ఫ్యాక్టరీ పునః ప్రారంభంపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో పునరుద్ధరణపై ఆశలు చిగురించాయి. అయితే కేంద్రం తాజాగా ఫ్యాక్టరీని తుక్కుగా విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి టెండర్ దక్కించుకున్న ఢిల్లీకి చెందిన ఓ సంస్థ పరిశ్రమలో తుప్పు పట్టిన యంత్రాలను తొలగించే పనులు చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. మరికొన్ని రోజుల్లో తొలగింపు ప్రక్రియ పూర్తయి చరిత్రపుటల్లో నిలిచిపోనుంది. అయితే నాడు ఫ్యాక్టరీకి స్థలాన్ని ఇచ్చిన రైతులకు భూమిని తిరిగి కేటాయిస్తారా లేక విక్రయానికి పెడతారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. 1984లో ప్రారంభం.. ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నో లాస్..నో ప్రాపిట్ కింద దేశవ్యాప్తంగా సొంత సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని 1965లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీపీఐ)ను జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి సమీపంలో ఏర్పాటు చేసింది. 1969లో మంజూరు కాగా 1984 మేలో నాటి సీఎం ఎన్టీఆర్, కేంద్రమంత్రి ఎన్డీ తివారీలు దీన్ని ప్రారంభించారు. రూ.47కోట్ల పెట్టుబడితో మూడు వేల మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఫ్యాక్టరీ నెలలో రూ.3కోట్ల టర్నోవర్ సాధించి రికార్డు సృష్టించింది.1989 వరకు లాభాల బాటలోనే నడించింది. రోజూ 1200 టన్నుల మేర సిమెంట్ ఉత్పత్తి చేసింది. కేంద్రమే లెవీ కింద కొనుగోలు చేసి ప్రభుత్వ సంస్థలకు పంపిణీ చేసేది. 1991లో ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాల మేరకు ఈ ఫ్యాక్టరీ నుంచి లెవీ సిమెంటు కొనుగోలును రద్దు చేసింది. ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా నిలిపివేసింది. దీంతో బహిరంగ మార్కెట్లో సిమెంట్ విక్రయానికి టెండర్లలో పాల్గొన్నప్పటికీ ప్రైవేటు పరిశ్రమల పోటీని తట్టుకోలేక చతికిలపడింది. చివరికి సిమెంట్ నిల్వలు భారీగా పెరిగి నష్టాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం 1996లో పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ మండలి (బీఐఎఫ్ఆర్)కి అప్పగించింది. ఈ యూనిట్కు ఆర్థిక పరిపుష్టి కలిగించాలని బీఐఎఫ్ఆర్ సూచించినా కేంద్రం స్పందించలేదు. దీంతో ఆదిలాబాద్ యూనిట్ను మూసివేయాలని సీసీఐ నిర్ణయించింది. ఎలాగోలా ఆరేళ్లు నెట్టుకుంటూ వచ్చిన సీసీఐ 2008లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అప్పుడు మూతపడ్డ పరిశ్రమ తెరచుకోలేదు. తుక్కుగా మారనున్న పరిశ్రమ 1,500 మందికి ప్రత్యక్షంగా.. మరో 3వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ ఫ్యాక్టరీ తుక్కుగా మారనుంది. ఈ పరిశ్రమకు 30 ఏళ్ల నిర్వహణకు అవసరమైన సున్నపురాయి నిక్షేపాలతో పాటు 750 ఎకరాల సొంత భూమి, మరో 2వేల ఎకరాల వరకు లీజు భూములున్నాయి. 120 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీని తుక్కుగా విక్రయించాలని కేంద్రం భావించింది. ఇందులోని యంత్రాలన్నీ తుప్పుపట్టాయి. భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఈ క్రమంలో పనికిరాని వాహనాలు, ఇతర సామగ్రిని తుక్కుకింద విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. 71యంత్రాలు, ఇతర భవనాల సామగ్రి అమ్మేందుకోసం రూ.50 కోట్లతో టెండర్లు పిలిచారు. గతేడాది మార్చిలోనే ఈ ప్రక్రియ చేపట్టగా కార్మికులు, ప్రతిపక్ష పార్టీల ఆందోళనతో నిలిచిచిపోయింది. తాజాగా యంత్రాలను స్క్రాప్గా మార్చి విక్రయిచేందుకు ఢిల్లీకి చెందిన హెచ్ఆర్ సంస్థ టెండర్ దక్కించుకుంది. ఇక్కడికి చేరుకుని యంత్రాలను స్క్రాప్గా మార్చేందుకు సన్నద్ధమైంది. ఈ చర్యలతో సీసీఐ పునఃప్రారంభంపై నెలకొన్న ఆశలు ఆవిరైపోయాయి. తదుపరి చర్యలేంటో.. సీసీఐని పునరుద్ధరించాలని కొన్నేళ్లుగా కార్మిక సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ వ స్తున్నాయి. తమను గెలిపిస్తే పునరుద్ధరించేలా చూ స్తామని ఎంపీ, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారిద్ద రూ బీజేపీకి చెందిన వారే కావడంతో పునరుద్ధరణ పై ఆశలు చిగురించాయి. అయితే కేంద్ర తాజా నిర్ణయంపై కార్మికవర్గంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంలోని సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభ డీపీఆర్కు ఆదేశించినా ...స్క్రాప్ మాత్రమే తొలగింపు ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ 80 ఏళ్ల కిందటి మోడల్ది. స్వాతంత్య్రానికి ముందటి టెక్నాలజీతో కూడిన పరిశ్రమ కావడంతో అందులోని స్క్రాప్ మాత్రమే తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. దాన్ని తొలగించాకే కేంద్రం పరిధిలో పరిశ్రమను ప్రారంభించాలా, లేక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలా, లేక పీపీపీ మోడల్లో పునరుద్ధరించాలా అనేదానిపై నిర్ణయించాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీలోని స్క్రాప్ తొలగింపు పరిశ్రమ పునరుద్ధరణకు ముందడుగు లాంటింది. కానీ ప్రతిపక్షపార్టీలు , కార్మిక సంఘాలు దీన్ని అర్థం చేసుకోకుండా అసత్య ప్రచారం చేయడం సరికాదు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కట్టుబడి ఉన్నాం. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రారంభించేలా చూస్తాం. తప్పుడు ప్రచారం మానుకోవాలి. –పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గతేడాది సెప్టెంబర్లో శాఖ అధికారులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు సీసీఐ సీఎండీ సంజయ్ బంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి అదే నెల 8న హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిశ్రమ పునరుద్ధరణకు అందుబాటులో ఉన్న వనరులు, చేకూరే ఉపాధి వంటి అంశాలపై చర్చించారు. డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేఽశించడంతో పునరుద్ధరణపై ఆశలు చిగురించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉండటంతో తిరిగి ప్రారంభం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీలోని యంత్రాలను విక్రయించే ప్రక్రియ మొదలవడంతో పునరుద్ధరణ అటకెక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘సీసీఐ దొంగచాటు పనులపై సమాధానం చెప్పాలి’ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని సీసీఐ పరిశ్రమలో జరుగుతున్న దొంగచాటు పనులపై ఎంపీ, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్ ఇజ్జగిరి నారాయణ అన్నారు. బుధవారం ఫ్యాక్టరీ వద్ద క్వార్టర్స్లో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు తాము గెలిస్తే సీసీఐని పునఃప్రారంభిస్తారని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించేంత వరకు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇందులో సాధన కమిటీ నాయకులు బండి దత్తాత్రి తదితరులు ఉన్నారు. -
వడగాలులతో అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో రానున్న ఐదు రోజుల పాటు భాను డు తన ప్రతాపం చూపనున్నాడు. ఈ నెల 15 నుంచి 19వరకు ఉత్తర తెలంగాణలోని ఆదిలా బాద్, నిర్మల్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజ న్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులతో పాటు గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ హె చ్చరించింది. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో బయట తిరుగవద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. -
రహదారి నిబంధనలు పాటించాలి
ఆదిలాబాద్/కైలాస్నగర్:ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని, ప్రజాభాగస్వామ్యం తోనే ప్రమాదాల నివారణ సాధ్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రవా ణాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘అరైవ్.. అలైవ్’ అవగాహన కార్యక్రమంలో పాల్గొని మా ట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలపై నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపా రు. ఇందులో చనిపోతున్న వారిలో 25 నుంచి 40ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉండటం విచారకరమన్నారు. పలువురు డ్రైవర్లకు కళ్లద్దాలు, యువతకు డ్రైవింగ్ లైసెన్స్లు, రహదారి భద్రతపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కా ర్యక్రమంలో భాగంగా హెల్మెట్ సేవ్స్ లైవ్స్ అంటూ విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం గాంధీ పార్కు నుంచి అంబేద్కర్ చౌక్ వరకూ ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో మంత్రి ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులతో ముచ్చటించి.. సూచనలు తెలిపి హాజరైన చిన్నారులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమం ఉద్దేశం గురించి ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఓ చిన్నారికి హెల్మెట్ పెట్టి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్రాజ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మ ర్మాట్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డిప్యూటీ ట్రా న్స్పోర్ట్ కమిషనర్ పి.రవీందర్ కుమార్, ము న్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు నరేష్జాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్రెడ్డి, ఎంవీఐ ఎస్.శ్రీనివాస్, ఏఎంవీఐ కె.హరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన అవసరం ఆదిలాబాద్రూరల్: రహదారి నిబంధనలపై చి న్నతనం నుంచే అవగాహన కలిగి ఉండాలని మంత్రి పొన్నం అన్నారు. మావల మండలంలో ని ఓ ప్రైవేట్ పాఠశాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా ఏర్పా టు చేసిన చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ను ప్రా రంభించి మాట్లాడారు. ఈ పార్క్ ద్వారా విద్యార్థులు ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులపై ప్రత్యక్షంగా అవగాహన పెంచుకోవచ్చన్నారు. -
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు దిశగా ముందడుగు
ఆదిలాబాద్: జిల్లాలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ బుధవారం ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ స్థలాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అనుమతుల కోసం త్వరలోనే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఓఎల్ఎస్ (అబ్స్టాకిల్ లిమిటేషన్ సర్ ఫేసెస్) సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక ఆసక్తితో ఉందని, ఎయిర్పోర్ట్ కోసం అవసరమైన 434 ఎకరాల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. విమానాశ్రయాన్ని డిఫెన్స్, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ సమగ్ర అభివృద్ధికి ఎయిర్పోర్ట్ ఏర్పాటు అత్యంత కీలకమని, దీని కోసం కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వారి వెంట ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. యువకుడు దుర్మరణం
వాంకిడి: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చిన్నపుల్లార గ్రామానికి చెందిన కుమురం వెంకటేష్ (16), గాగ్రు అనే మరో పదేళ్ల బాలుడు మధ్యాహ్నం చౌపన్గూడ వైపు నుంచి వాంకిడి వైపు వెళ్తున్న ట్రాక్టర్పై ఎ క్కారు. చిన్న పుల్లార గ్రామ సమీపంలో చెరువు కల్వర్టు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. గాగ్రు, డ్రైవర్ భీంరావు పక్కకు పడిపోగా వెంకటేష్ మాత్రం ట్రాక్టర్ కింద ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ ఆత్రం భీంరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
18 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
తాండూర్: మండలంలోని కిష్టంపేట ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. కిష్టంపేట ఎస్సీ కాలనీకి చెందిన మోటం దేవేందర్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి తన ఇంట్లో నిల్వ ఉంచాడు. తమకు అందిన సమాచారం మేరకు దేవేందర్ ఇంటికి వెళ్లి తనిఖీ చేసి సుమారు 18 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించినట్లు తెలిపారు. -
జొన్నపంట దగ్ధం
తాంసి: భీంపూర్ మండలంలోని తాంసి(కె) శివారులో బుధవారం రెండున్నర ఎకరాల జొన్నపంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన కరీం తనకున్న రెండున్నర ఎకరాల్లో జొన్నపంట సాగు చేశాడు. పక్కనున్న పంట చేనులో రైతులు వ్యర్ధాలను కాల్చివేసే క్రమంలో ఈదురు గాలులకు నిప్పురవ్వలు ఎగిరిపడి జొన్నచేనులో పడడంతో మంటలు వ్యాప్తి చెంది చేతికి అందివచ్చే దశలో ఉన్న జొన్నపంట పూర్తిగా దగ్ధమైంది. స్థానిక రైతులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. పంట పెట్టుబడికి రూ.లక్షకు పైగా అప్పు చేసినట్లు రైతు తెలిపాడు. ఘటనలో రూ.5 లక్షల మేర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. పెళ్లి చేయడం లేదని తండ్రిని చంపిన తనయుడుకౌటాల: తనకు పెళ్లి చేయడంలేదని కుమారుడు తండ్రిని హతమార్చిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై డి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కనికి గ్రామానికి చెందిన అవ్తారే లింబాజీ (69), పెంటుబాయి దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు కరీంనగర్లో, మూడో కుమారుడు కాళేశ్వరంలో పని చేస్తున్నారు. రెండో కుమారుడు కుశబ్రావు తల్లిదండ్రులతో పాటు ఇంటి వద్దనే ఉంటూ కూలీ పని చేస్తున్నాడు. మంగళవారం మద్యం సేవించి ఇంటికి వచ్చి తండ్రితో పెళ్లి విషయమై గొడవపడ్డాడు. ఈ క్రమంలో లింబాజీ కడుపులో పిడిగుద్దులు గుద్దాడు. తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు లింబాజీని మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి బుధవారం ఇంటికి తీసుకొచ్చారు. కడుపులో అంతర్గత గాయాల కారణంగా సాయంత్రం ఇంటి వద్ద మృతి చెందాడు. మృతుని భార్య పెంటుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం గురువారం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. -
జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ
కుంటాల: మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ స్వప్న, పీఈటీ సంతోశ్రెడ్డి దంపతుల కుమార్తె రితిక జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ కనబరించింది. నవంబర్లో నిర్మల్ పట్టణంలో నిర్వహించిన జోనల్స్థాయి అండర్–14 పోటీల్లో సత్తాచాటింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనవరి 22 నుంచి 24 వరకు వరంగల్ జిల్లా డోర్నకల్లో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచింది. ఈనెల 8 నుంచి 11 వరకు ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్ పట్టణంలోని కలింగ మైదానంలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నాలుగో స్థానంలో నిలిచింది. నీలగిరి దుంగలు పట్టివేతచెన్నూర్రూరల్: మండలంలోని బావురావుపేట గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి రెండు ఎడ్లబండ్లలో అక్రమంగా తరలిస్తున్న నీలగిరి దుంగలను పట్టుకున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ తెలిపారు. దుంగలను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేసి పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దుంగలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఎడ్లబండ్లను చెన్నూర్ ఫారెస్టు కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. మద్యం మత్తులో ఒకరి ఆత్మహత్యభైంసారూరల్: మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సుప్రియ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన జువేకర్ ఉత్తం (35) వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం రాత్రి మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. కొద్ది సేపటికి వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బుధవారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
గజదొంగ తుకారాంపై పీడీయాక్ట్
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న గజదొంగ టేకం తుకారాంపై బుధవారం పీడీయాక్ట్ నమోదు చేసినట్లు ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ తెలిపారు. ఉట్నూర్ మండలంలోని దంతనపల్లికి చెందిన తుకారాంపై గతంలో 36 కేసులు నమోదు కాగా, అందులో దాదాపు 18 కేసుల్లో జైలుశిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇటీవల అతనిపై ఉట్నూర్ పోలీస్స్టేషన్లో మరో ఏడు కేసులు, మంచిర్యాల పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదయ్యాయి. మొత్తంగా అతనిపై 44 కేసులు ఉన్నట్లు తెలిపారు. జైలుశిక్ష అనుభవించినా అతని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో మళ్లీ చోరీలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రజల భద్రతను కాపాడడం కోసం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు కలెక్టర్ నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. దీంతో నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించినట్లుగా వివరించారు. నిందితుల అక్రమ కార్యకలాపాలను అరికట్టడమే పోలీసుల లక్ష్యమన్నారు. -
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు
నిర్మల్ఖిల్లా/కుంటాల: కుంటాల మండలంలోని పెంచికల్పహడ్ గ్రామానికి చెందిన కదం రూప, సంతోష్ దంపతుల కుమార్తె హారిక 2014 నుంచి 2019 వరకు అదే గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసింది. అనంతరం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివింది. నిర్మల్లో ఇంటర్ బైపీసీ పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటింది. ఇదే గ్రామానికి చెందిన సూర్వే వసుంధర, గంగాధర్ దంపతుల కుమార్తె సూర్వే సారిక కూడా తన ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే 2014 నుంచి 2019 వరకు పూర్తి చేసింది. ఆదర్శ పాఠశాలలో పదో తరగతి వరకు అభ్యసించింది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 993 మార్కులు సాధించింది. -
తండ్రి చనిపోయిన రోజునే కుమారుడు..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): తండ్రి చనిపోయిన రోజునే జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందిన ఘటన హాజీపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని సీసీసీకి చెందిన సింగరేణి కార్మికుడు న్యాతరి రమేశ్(35) తండ్రి గట్టయ్య గతేడాది ఏప్రిల్ 15న మృతి చెందాడు. బుధవారం తండ్రి చనిపోయిన రోజు కావడంతో సొంత ఊరైన హాజీపూర్ మండలంలోని దొనబండకు వెళ్లాడు. కుటుంబ సభ్యులతో రోజంతా గడిపిన రమేశ్ తన భార్య రజిత, కుమారుడు ఆనందన్తో కలిసి రాత్రి ద్విచక్ర వాహనంపై సీసీసీకి బయలు దేరాడు. వేంపల్లి శివారులో ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రజితకు కాలు విరగగా కుమారుడు ఆనందన్ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
గ్రూప్స్ లక్ష్యంగా ముందుకెళ్తా
కాసిపేట: తెలంగాణ మోడల్ స్కూల్లో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశా. ప్రథమ సంవత్సరంలో 467 మార్కులతో థర్డ్ ర్యాంకు సాధించా. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 992 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించా. మా నాన్న కొమ్మల సంతోష్ ఓరియంట్ సిమెంట్ కంపనీలో లోడింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నా. భవిష్యత్లో గ్రూప్స్కు ప్రిపేరై ప్రజాసేవ చేసే ఉద్యోగం సాధిస్తా. ఏ మార్గం ఎంచుకున్నా గ్రూప్స్ లక్ష్యంగా ముందుకెళ్తా. – కొమ్మల స్వతంత్ర -
డాక్టర్ కావాలని ఉన్నా..
చెన్నూర్: మాది చెన్నూర్ మండలంలోని ఎల్లక్కపేట. బుడిగ జంగాలోల్లం. మాది నిరుపేద కుటుంబం. టీవీలు, సోషల్ మీడియా ప్రభావంతో కులవృత్తికి ఆదరణ తగ్గింది. కుటుంబ పోషణకు మా తల్లిదండ్రులు వెంకటేశ్, విజయ ఊరూరా తిరిగి అల్లం, ఎల్లిగడ్డలు విక్రయిస్తున్నారు. ఇంటర్ సెకండియర్ బైపీసీలో 985 మార్కులు సాధించా. నాకు డాక్టర్ చదవాలని ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక స్థోమత కారణంగా నీట్కు దరఖాస్తు చేసుకోలేక పోయా. ఎడ్సెట్కు దరఖాస్తు చేశా. అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలని ఉంది. వ్యవసాయ శాఖలో ఉద్యోగం సంపాదించి రైతులకు సేవలందించాలని ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
చింతలమానెపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్హెచ్వో పోచయ్య తెలిపారు. కాగజ్నగర్కు చెందిన గొడిసెల రామాగౌడ్(67) బుధవారం బాబాసాగర్ నుండి కాగజ్నగర్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కాగజ్నగర్ నుంచి డబ్బా వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఘటనలో రామాగౌడ్కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్హెచ్ఓ వివరించారు. చికిత్స పొందుతూ యువకుడు..ఉట్నూర్రూరల్: మండలంలోని హర్కాపూర్ సమీపంలో మంగళవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో సాలెగూడకు చెందిన టేకం తులసీరాం (25) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఆత్రం ఉదయ్ కిరణ్ (19)ను ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు స్థానిక పులాజీ బాబా కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు ఆత్రం భీంరావు, తల్లి లలిత కన్నీరుమున్నీరుగా విలపించారు. డీఅడిక్షన్ కేంద్రానికి ఇద్దరి తరలింపుచెన్నూర్: పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థి, మరో బాలుడు గంజాయికి బానిసైనట్లు గుర్తించి డీఅడిక్షన్ కేంద్రానికి తరలించినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. కొంతకాలంగా గంజాయికి అలవాటు పడిన ఇద్దరు విద్యార్థులు మహారాష్ట్ర, చంద్రపూర్, బల్లార్ష నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నూర్ ప్రాంతంలో సేవిస్తున్నట్లు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఇద్దరికి వైద్యుల సమక్షంలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. ఇరువురిని మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టి మంచిర్యాలలోని డీఅడిక్షన్ కేంద్రానికి తరలించినట్లు సీఐ తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనించి పోలీసులకు సమాచారం ఇస్తే కౌన్సెలింగ్ ఇస్తామని, మార్పు రాకపోతే డీఅడిక్షన్ సెంటర్కు తరలిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు. -
పంటలకు బీమా కల్పించడంలో ప్రభుత్వం విఫలం
తలమడుగు: రైతులు పండించిన పంటలకు బీమా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని దేవాపూర్, భరంపూర్ గ్రామాల్లో జొన్నపంటలు దగ్ధమైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గ్రామానికి వెళ్లి పరిశీలించారు. దేవాపూర్లో రైతు అజీస్ పటేల్ దగ్ధమైన జొన్న పంటను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరెకరాల్లో రూ.6 లక్షల పంట నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. అధైర్య పడవద్దని, ప్రభుత్వం తరపున పరిహారం వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ భీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. అనంతరం బరంపూర్లో రైతు మోహన్, ఆశన్నను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ సర్పంచ్ సంతోష్, మాజీ సర్పంచ్ అబ్దుల్లా, మండల కన్వీనర్ తోట వెంకటేష్, అధికార ప్రతినిధి కిరణ్ కుమార్, కేదేరేశ్వర్ రెడ్డి, అభిరామ్రెడ్డి, మాడూరి రమాకాంత్, బరంపూర్ ఉపసర్పంచ్ రంజిత్రెడ్డి, తోట శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. -
కువైట్లో చిక్కుకున్న యువతి స్వదేశానికి..
నిర్మల్ఖిల్లా: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువతి కువైట్లో చిక్కుకుంది. స్వదేశానికి తిరిగి రావడంలో ఆమెకు అనేక సమస్యలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి స్పందించి కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఉన్నతాధికారులతో మాట్లాడి, యువతి సురక్షితంగా భారత్కు చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయించారు. ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కారం కావడంతో బాధిత యువతి కుటుంబ సభ్యులు శ్వేత, మధు బుధవారం జిల్లా కేంద్రంలో ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
మాతృభాష, సంస్కృతిని కాపాడుకోవాలి
ఉట్నూర్రూరల్: మాతృభాష, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీఎంఆర్సీలో ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో గిరిజన అభివృద్ధి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ, సుస్థిర అభివృద్ధి కోసం సమగ్ర వ్యూహాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజనులు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ పరంగా అభివృద్ధి సాధించాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. ఆయా రాష్ట్రాల ప్రముఖ విద్యా సంస్థల ప్రొఫెసర్లు రాంబో, మాయాదేవి, ప్రియాంక, విజయ్ కుమార్, అనిల్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదిలాబాద్, ఇచ్చోడ, నిర్మల్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ జాదవ్ సంగీత, డాక్టర్ శ్రీనివాస్, సుధాకర్ మాట్లాడారు. నేటి ప్రపంచంలో నేటి ప్రపంచంలో సంకల్పబలం ఉంటేనే ఏదైనా సాధించవచ్చన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి.ప్రతాప్సింగ్, ఉట్నూర్ సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్, మెస్రం మనోహర్, దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, రీసెర్చ్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
కై లాస్నగర్: ప్రతి ఒక్కరూ అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ నెల 14 నుంచి నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన ప్రచార పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించారు. వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డి.జయరాం, ఎల్ఎఫ్ఎఫ్టి సుంగన్న, ఎఫ్ఎఫ్టి ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’పై అదనపు భారం
కై లాస్నగర్: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇందిరమ్మ ఇళ్లపై పడింది. నిర్మాణాలకు అవసరమైన స్టీల్, సిమెంట్ ధరలు నెల వ్యవధిలోనే భారీగా పెరి గాయి. ఒక్కో ఇంటిపై సుమారు రూ.25వేల వరకు అదనపు భారం పడుతుండడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్ర ణాళిక కార్యాచరణలో భాగంగా వచ్చే ఏప్రిల్, జూన్ మాసాల్లో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పెరిగిన సామగ్రి ధరలతో నిర్మాణాలు మందగించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వమిచ్చే మొత్తం సరిపోకపోవడంతో లబ్ధిదారులు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల వ్యవధిలోనే... ఇందిరమ్మ లబ్ధిదారులకు స్థానికంగా లభించే ఇసు క లభ్యతే ఇబ్బందికరంగా మారగా పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలు అదనపు భారం కానున్నాయి. ట్రా క్టర్ ఇసుక ధర రూ.5వేల నుంచి రూ.6వేలు పలుకుతుంది. ఇసుక ఉచితంగా అందజేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పెన్గంగ పరీవాహక ప్రాంతాల నుంచి తెచ్చుకునేందుకు ట్రాక్టర్, లేబర్ చార్జీ అదనపు భారమవుతున్నాయి. నెల క్రితం వరకు రూ.62వేలు ఉన్న టన్ను స్టీల్ ధర ప్రస్తుతం రూ.70 వేలకు చేరింది. అలాగే సిమెంట్ బస్తా ధర మొన్న టి వరకు రూ.280 ఉండగా ప్రస్తుతం రూ.300కు చేరింది.యుద్ధం కారణంగా స్టీల్, సిమెంట్ సరఫరా పూర్తిస్థాయిలో జరుగకపోవడం, ఇంధనకొరత నేపథ్యంలోనే ఈధరలు పెరిగినట్లుగా వ్యాపారులు చె బుతున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మరింత పెరిగే అవకాశమున్నట్లుగా అభిప్రాయపడుతున్నా రు. కాగా ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సగటున రెండు టన్నుల స్టీల్, 200 బస్తాల సిమెంట్ అవసరం కానున్నట్లుగా అధికారులు చెబుతున్నా రు. ఈలెక్కన స్టీల్పై రూ.16వేలు,సిమెంట్పై మరో రూ.4వేల చొప్పున రూ.20వేల వరకు అదనపు భా రం పడుతున్నట్లుగా లబ్ధిదారులు చెబుతున్నారు. వీటితో పాటు ఇంటి తుది పనుల్లో వినియోగించే పీవీసీ పైపుల ధరలు సైతం 40శాతం పెరిగినట్లుగా పేర్కొంటున్నారు. వీటిపై సుమారు రూ.10వేల వరకు అదనపు భారం కానుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారుపై రూ.30వేల అదనపు భారం పడి నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అప్పులు చేయాల్సిందే.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తుంది. పనులు సా గిన కొద్ది బిల్లులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నాలుగు విడతల్లో జమ చేస్తుంది. నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు ప్రభుత్వమిచ్చే నగదకు మరి కొంత జోడించి పనులు చేపడుతున్నారు. అయితే పెరిగిన సామగ్రి ధరలతో లబ్ధిదారులపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే ఆర్థికస్థోమత లేకపోవడం, స్వయం సహాయక సంఘాల ద్వారా అందించే ఆర్థికసాయం సకాలంలో అందకపోవడం వంటి కారణాలతో నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో నిర్మాణాలు పూర్తిచేయలేని పరిస్థితి ఏర్పడనుందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు ... మంజూరైనవి:16,093 ఇప్పటి వరకు పూర్తయినవి:404 ప్రారంభం కానివి:2,099 మార్కౌట్ ఇచ్చినవి:2,235 వివిధ దశల్లో కొనసాగుతున్నవి:11,355జైనథ్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన కుడ్మెత కంసుల పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. స్లాబ్ లెవల్ వరకు నిర్మాణం పూర్తి కాగా రూ.4లక్షల వరకు ఖర్చు చేసింది. లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుకకు రూ. 6వేలకు వెచ్చించాల్సి వస్తోందని ఈమె చెబుతోంది. అలాగే స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే అప్పు తప్పడం లేదని వాపోతోంది. -
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నేరడిగొండ: కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ప్ర జా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి ‘పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణ మహా అభియాన్’ శిక్షణ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండల కేంద్రంలో బీజేపీ మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందంతో కలి సి ఆయన హాజరై మాట్లాడారు. పండిత్ దీన్ దయాళ్ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందులో జిల్లా కార్యదర్శి శంకర్, ప్రధానకార్యదర్శి మాధవ్రావు ఆమ్టే, ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి బాబా రావు పటేల్, మండల అధ్యక్షుడు రాజశేఖర్, రాజు, జీవీ రమణ, రమేశ్, రాజేశ్వర్, రంజిత్, గంగిరెడ్డి, నరేంద్ర, మహేందర్, పరుశురాం, పాల్గొన్నారు. -
భగభగ
● జిల్లాలో 42.8 డిగ్రీ సెల్సియస్ ● నిప్పుల కొలిమిగా మారిన వైనం ● నిర్మానుష్యంగా ప్రధాన కూడళ్లు ● ఎండవేడిమి తాళలేక జనం ఇక్కట్లుభానుడి నిర్మానుష్యంగా జిల్లాకేంద్రంలోని తెలంగాణచౌక్ కై లాస్నగర్: భానుడి ప్రతాపంతో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలోనే పగటి ఉ ష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరువవుతున్నాయి. ఈ సీజన్లో మంగళవారం అత్యధికంగా 42.8డిగ్రీ సె ల్సియస్గా నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధిక పగ టి ఉష్ణోగ్రతల్లో జిల్లా రెండో స్థానంలో నిలువడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఉదయం 11 గంటల నుంచే వడగాలులు మొదలవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రోడ్లు, ప్రధాన కూడళ్లునిర్మానుష్యంగా మా రుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యోగులు, కూలీలు, చిరు వ్యాపారులు ఇతరత్రా అత్యవసర పనుల్లో బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇళ్లకే పరిమితమవుతున్న జనం ఎండ తీవ్రత తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటి కొనుగోళ్లు పెరిగాయి. పేదవాడి ఫ్రిజ్గా పేరొందిన రంజన్లకు గిరాకీ పెరిగింది. ఎండలో బయటకు వెళ్లే వారు శీతలపానియాలు, కొబ్బరి బోండాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. -
రాజ్యాంగం ద్వారానే సమానత్వం
ఆదిలాబాద్రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశ ప్రజలకు సమానత్వం వంటి హక్కులు లభించాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అంబేడ్కర్ జయంతి వేడుకలను జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువత ఆధునిక, సాంకేతిక రంగాల్లో రాణిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్ర ధాన లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దళితులు అన్ని రంగాల్లో మరింత ముందు కు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు బహుమతి ప్రదానంతో పాటు గ్రూప్–2లో విజయం సాధించిన అవినాష్ను సన్మానించారు. అనంతరం రహదారి భద్రతకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఇందులో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీంద్ర కుమార్, ఆదిలా బాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, డీటీవో శ్రీనివాస్, పట్ట ణ సీఐలు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు.. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ స్ఫూర్తికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ మండలం భీంసరి గ్రామంలో డీసీసీ ఆధ్వర్యంలో ‘న్యాయ్ భోజ్’ నిర్వహించారు. ముందుగా గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సమానత్వాన్ని చాటి చెప్పడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇందులో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ బోరంచు శ్రీకాంత్రెడ్డి, నాయకులు సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన బోధన అందించాలి
ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయులు నాణ్యమైన బోధనతో విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ అన్నారు. జిల్లాస్థాయి టీఎల్ఎం మేళాలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు సోమవారం సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. కృత్యాధార బోధనతో విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటారని తెలిపారు, సర్టిఫికెట్లు పొందిన వారిలో సిరికొండ మండలం రాంపూర్గూడ చెందిన ఉపాధ్యాయుడు చౌహన్ నరేష్, రాంపూర్–బి కి చెందిన పైడి సునీత, కప్పర్లకు చెందిన సామన్పెల్లి గంభీర్, తేజాపూర్కు చెందిన కోడూర్ సంతోష్కుమార్, మావల–2కు చెందిన కవిత, గోండ్గూడకు చెందిన శ్రీనివాస్, మాంగూర్లకు చెందిన కె. రాజన్న, యాపల్గూడకు చెందిన అకాష్, ఆదిలాబాద్ పట్టణంలోని ఖిల్లా పాఠశాలలకు చెందిన ఇర్ఫాన్బేగం ఉ న్నారు. ఇందులో ఏఎంవో లక్ష్మణ్, అసిస్టెంట్ ఏఎంవో అజయ్కుమార్, తదితరులున్నారు. -
‘మన ఇసుక–వాహనం’పై అవగాహన కల్పించాలి
కై లాస్నగర్: మన ఇసుక వాహనం పోర్టల్లో లబ్ధి దారులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేలా అవగా హన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇసుక బుకింగ్, రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు. బుకింగ్ సమయంలో అవసరమైన పత్రాలు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో వార్డు ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించాలని ఆదేశించారు. ఇందిరమ్మ లబ్ధిదా రులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంటికి 8 ట్రిప్పుల వరకు ఇసుక పొందే అవకాశం ఉందని, అవసరమైతే దీనిని 10 నుంచి 12 ట్రిప్పులకు పెంచే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. పోర్టల్లో వచ్చే దరఖాస్తులను తహసీల్దార్లు, వార్డు ఆఫీసర్ల స్థాయిలో ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, జా ప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను 7569538588, 9491053611 అందుబాటులోకి తెచ్చామని, ఇబ్బందులుంటే సంప్రదించాలని సూచించారు. అంతకు ముందు రిజిస్ట్రేషన్, బుకింగ్ విధానంపై హైదరాబాద్ నుంచి సీజీజీ కోఆర్డినేటర్ నరేష్ వర్చువల్ విధానం ద్వారా అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో ఆర్డీవో స్రవంతి, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ రాజు, జిల్లా మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ రమేశ్, సతీష్, తహసీల్దార్ రాజేశ్వరి, పంచాయితీ కార్యదర్శులు, వార్డు అధికారులు, ట్రాక్టర్ వాహన యజమానులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీలోనూ ‘ఎఫ్ఆర్ఎస్’
ఆదిలాబాద్టౌన్: పాఠశాల, ఇంటర్ విద్యలో ఇప్పటికే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అటెండెన్స్ను ప్రభుత్వం అమలు చేస్తోంది. రానున్న విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలోనూ అమలుకు యోచిస్తోంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ప్రవేశాల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టగా తాజాగా విద్యార్థులు, లెక్చరర్లకు హాజరుపై దృష్టి సారించింది. ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేట్లోనూ ఈ విధానం అమలు చేయనున్నారు. దీంతో సక్రమంగా విధులకు హాజరుకాని లెక్చరర్లు, డుమ్మా విద్యార్థులకు చెక్ పడనుంది. 75ఽశాతం అటెండెన్స్ ఉంటేనే పరీక్షలకు అనుమతించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానంతో డిగ్రీ విద్య మరింత బలోపేతమై మెరుగైన ఫలితాలు సాధించేందుకు అస్కారం ఏర్పడనుంది. ఉత్తర్వులు విడుదల.. డిగ్రీ విద్యను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణా ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, లెక్చరర్లకు ఎఫ్ఆర్ఎస్ హాజరు అమలు చేయాలని నిర్ణయించారు. శనివారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేశారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు కానుంది. జిల్లాలో.. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలల్లో తరగతులు సక్రమంగా నడుస్తుండగా మండల కేంద్రాల్లోని కాలేజీలు మాత్రం మొక్కుబడిగా సాగుతున్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులు హాజరుకాకపోయినా అటెండెన్స్ వేస్తున్నారు. లెక్చరర్లు పూర్తిస్థాయిలో లేకున్నా.. ఉన్నట్లుగా రికార్డులు నిర్వహిస్తున్నారు. దీంతో పేద విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. ప్రవేశాల సమయంలోనే తరగతులకు హాజరుకాకపోయినా పర్వాలేదంటూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే కాలేజీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పరీక్షల సమయంలో ఫలితాల కోసం ఆయా ప్రైవేట్ కళాశాలలు పరస్పరం సహకరించుకుంటూ అడ్డదారులు తొక్కుతున్నాయనే విమర్శలున్నాయి. అయితే డిగ్రీ పాసైన వారిలో అత్యధికులు పోటీ పరీక్షల్లో వెనుకబడిపోతుండడం గమనార్హం. ఇలాంటి పరిస్థితులకు పూర్తిగా చెక్పెట్టాలనే ఉద్దేశంతో ఎఫ్ఆర్ఎస్ అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 36 ఇందులో చదివే విద్యార్థులు 15వేల మంది75 శాతం హాజరు ఉండాల్సిందే.. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫేషియల్ అటెండెన్స్ అమలులో ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్లకు గతనెల 25 నుంచే ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ కళాశాలల లెక్చరర్లు, విద్యార్థులకు అమలు కానుంది. చాలా మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకొని తరగతులకు హాజరు కావడం లేదు. దీంతో స్కిల్స్ నేర్చుకోవడం లేదు. ప్రభుత్వం డిగ్రీ విద్యపై ఫోకస్ పెట్టింది. ఇంటెన్షిప్ ఇవ్వడానికి సిద్ధమైంది. – శ్రీనివాస్, ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ -
ఎక్స్లెన్స్ అవార్డు గ్రహీతలకు కలెక్టర్ అభినందన
కై లాస్నగర్: రోడ్డు భద్రతపై జిల్లా యంత్రాంగం, రవాణాశాఖ చేపట్టిన వినూత్న ప్రచారానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రవాణా రంగంలో చేసిన కృషికి గాను జిల్లాకు 2వ జాతీయ రోడ్డు భద్రతా ఎక్స్లెన్స్ అవార్డు–2026 దక్కింది. ఇటీవల బెంగళూరులో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లా రవాణ శాఖ అధికారులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారు కలెక్టర్ రాజర్షిషా ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అరైవ్ అలైవ్ పేరిట ఏప్రిల్ 13 నుండి 18 వరకు నిర్వహించే వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు, స్టిక్కర్లు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఇందులో రవాణా శాఖ అధికారి రవీందర్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కె. హరీంద్ర కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం,డీఎం తదితరులున్నారు. -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
కై లాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. ఇందులో ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, మెప్మా పీడీ రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 85 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన..అయ్యా నా భర్త పేరి ట గ్రామ శివారులో 2.30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎనిమిది నెలల క్రి తం ఆయన చనిపోయాడు. కొడుకు ఉన్నా తిండి పెట్టడం లేదు. భూమిని నా పేరిట పట్టా చేసి ఇవ్వాలని తహసీల్దార్కు దరఖాస్తు చేసిన. డిపెండెంట్ సర్టిఫికెట్తో పాటు మీసేవలో స్లాట్ బుక్ చేసిన. అ యినా తహసీల్దార్ పట్టా చేయడం లేదు. నాకు పట్టా చేసి న్యాయం చేయాలని కోరుతున్నా. – జక్కుల గంగమ్మ, సుంకిడి, తలమడుగు మా గ్రామంలో సామాజికపరమైన కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు అనువైన భవనం లేక ఇబ్బందులు పడుతున్నాం.కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉంది. స్పందించి మంజూరు చేయాలని కోరుతున్నాం. – దాబా–బి గ్రామస్తులు, గాదిగూడ పదేళ్లుగా మా గ్రామంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదు. సమస్యలు పరిష్కరించమని కోరితే పట్టించుకోవడం లేదు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కార్యదర్శిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. – కంఠ గ్రామస్తులు, జైనథ్ మండలం మా గ్రామ పంచాయతీ పరిధిలో మూడు ఆవాస ప్రాంతాలున్నాయి. సుమారు 5వేల జనాభా ఉంది. మిషన్ భగీరథ నీరు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే స్పందించి ప్రత్యేక పైపులైన్ల తో పాటు వాటర్ట్యాంక్ నిర్మించి సమస్యను పరిష్కరించాలని విన్నవించాం. – టేకం కవిత, సర్పంచ్, ఉమ్రి, ఉట్నూర్మేమంతా ఇందిరమ్మ లబ్ధిదారులం. ఇళ్లు మంజూరుతోఉన్న గుడిసెలు తొలగించి నిర్మాణ పనులు ప్రారంభించాం. ప్రస్తుతం రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. అయినా ఇప్పటివరకు పైసా బిల్లు రాలేదు. మూడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. స్పందించి మాకు న్యాయం చేయాలి. – ధనోరా –బి గ్రామస్తులు, ఇంద్రవెల్లి -
సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఆందోళన
కై లాస్నగర్: పట్టణంలోని నిషాన్ఘాట్, 170 సర్వేనంబర్లలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇంటిపట్టాల జారీతో పాటు విద్యుత్, రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ రాజేశ్వర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మేస్రం భాస్కర్, పట్టణ కార్యదర్శి చంద్రమౌళి, కృష్ణస్వామి, కేశవ్, సంగీత, భాను, నిస్సర్, భూ మన్న, షబానాఖాన్, సుజాత, సునీత, అమీర్ తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ సీఈవోగా రవి బాధ్యతలు
కైలాస్నగర్: జెడ్పీ సీఈవోగా బి.రవి సో మవారం జిల్లా పరి షత్ కార్యాలయ చాంబర్లో బాధ్యతలు స్వీకరించా రు. హన్మకొండ జెడ్పీ డిప్యూటీ సీఈవోగా పనిచేస్తున్న ఈయనకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం జిల్లాకు బదిలీ చేసింది. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన ఈయనకు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. రెగ్యులర్ అధికారి రాకతో ఏడు నెలలుగా కొనసాగిన ఇన్చార్జి పాలనకు తెరపడింది. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
లక్ష్యంగా జిల్లాలో డీజీపీ సుడిగాలి పర్యటన
ఆదిలాబాద్టౌన్/ఆదిలాబాద్/ఉట్నూర్రూరల్: రహదారి భద్రతకు ప్రాధాన్యం కల్పించడం..యువ త భవితకు చేయూత అందించడం.. ఆదివాసీలు, మాజీ మావోలకు భరోసా కల్పించడం లక్ష్యంగా డీజీపీ శివధర్రెడ్డి పర్యటన సోమవారం ఆదిలాబా ద్ జిల్లాలో సాగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పోలీసుల గౌర వ వందనం స్వీకరించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పార్క్ను ప్రారంభించారు. పోలీసు హెడ్క్వార్టర్స్లో మైనర్ డ్రైవింగ్చేస్తూ పట్టుబడ్డ పిల్లల తల్లిదండ్రుల కు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రయాణికుల భద్ర త దృష్ట్యా ఆర్టీసీబస్సుల్లో, పోలీసు కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఆదిలాబాద్రూరల్ మండలంలోని చించుఘాట్లో లైబ్రరీని ప్రారంభించి ఆదివాసీలతో సమావేశం నిర్వహించారు. వారితో కలిసి సామూహిక భోజనం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు.. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని డీజీ పీ సూచించారు. పోలీసు హెడ్క్వార్టర్స్లో తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్లో పలు విషయాలను వివరించారు. జిల్లాలో డ్రైవింగ్ చేస్తూ ప ట్టుబడ్డ 400 మంది మైనర్ పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. మైనర్లు డ్రైవింగ్ చే యడం ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటాయని తెలిపారు. ట్రాఫిక్ పార్క్ ప్రారంభం.. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలు అలవర్చుకునే విధంగా జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాల యం ఎదుట ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పార్క్ను డీజీ పీ ప్రారంభించారు. పాఠ్య పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాలను నేరుగా అర్థమయ్యే విధంగా దీన్ని రూపొందించారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో పాటించాల్సిన నిబంధనలు, సూచిక బోర్డులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేలా పార్క్ను ఏర్పాటు చేశారు. ‘అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్ 2.0’.. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రూపొందించిన ‘అభయ మై టాక్సీ ఈజ్ సేఫ్ 2.0‘ కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే 5వేలకు పైగా ఆటోలు నమోదు చేసుకోగా 500 మందికి గుర్తింపు పత్రాలను అందజేశారు. ఆదివాసీలతో సామూహిక భోజనం.. చించుఘాట్లో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఏర్పాటు చేసిన అధునాతన లైబ్ర రీని ప్రారంభించారు. గుస్సాడీ వేషధారణలో డీజీపీ ఆదివాసీ ల కులదైవానికి ప్రత్యేక పూజలు చేశారు. మావలలో ఇంటెలిజెన్స్కు సంబంధించి నిర్మించిన క్వార్టర్లను ప్రారంభించారు. సర్పంచులతో తీర్మానాలు.. గుడిహత్నూర్లోని ఎస్కన్వెన్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 500 మంది రోడ్ సేఫ్టీక్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రహదారి భద్రత ని యమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని డీజీపీ సూచించారు. ఇందులో భాగంగా 36 గ్రామాల సర్పంచులు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు తీర్మానాలు చేశారు. నర్సాపూర్లో ఆర్వో ప్లాంట్ ప్రారంభం ఆదివాసీల కోసం ఉట్నూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను డీజీపీ ప్రారంభించారు. మారుమూల ఆదివాసీ గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వెయ్యి మంది ఆదివాసీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉట్నూర్ పోలీసు స్టేషన్లో 205 మంది యువతకు డ్రైవింగ్ మేళా ద్వారా లైసెన్సులను అందజేశారు. కార్యక్రమంలో ఐజీ గజరావ్ భూపాల్, కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీలు బి.సురేందర్ రావు, పి.మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభిస్తున్న డీజీపీ శివధర్రెడ్డి ఇంటి స్థలం పట్టాలను అందజేస్తూ..గతంలో పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ మావోయిస్టు సభ్యులకు డీజీపీ ఇంటి స్థలం పట్టాలను పంపిణీ చేశారు. పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్ దళానికి చెందిన కుమురం సుశీల, కొమురం సక్కుబాయిలకు పిట్టలవాడలో ఇంటి స్థలాలు, అలాగే అల్లంపల్లి ఫైరింగ్ ఘటనలో అమరుడైన పోలీసు కానిస్టేబుల్ జె.ముకుంద్రావు కుటుంబానికి ఇంటి స్థలం పట్టా అందజేశారు. -
‘గులాబీ’ జోష్
మంచిర్యాలలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నస్పూర్/రామకృష్ణాపూర్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాకరామారావు జిల్లా పర్యటన ఆ పార్టీ క్యాడర్లో జోష్ నింపింది. నస్పూర్లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమావేశానికి హాజరై కాంగ్రెస్ పాలనపై ఘాటైన విమర్శలు చేశారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, మారుపేర్ల సమస్య, మెడికల్ బోర్డు నిర్వహణ కోసం తాము ఆందోళనలు నిర్వహిస్తామని, సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ ప్రసంగిస్తుండగా పలువురు నిరుద్యోగులు సేవ్ సింగరేణి.. మెడికల్ బోర్డు నిర్వహించాలి.. మారు పేర్ల సమస్య పరిష్కరించాలి.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. కత్తి మరొకరికిచ్చి యుద్ధం తమను చేయమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీరు గెలిపించిన ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని సూచించారు. సింగరేణిలో సమస్యల పరిష్కారానికి టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి.. నస్పూర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డికి మూసిపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన క్యాతన్పల్లి కౌన్సిలర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చివరివరకు పోరాడి చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు దక్కించుకోవడం అభినందనీయమని కొనియాడారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు మాట్లాడుతూ.. గోదావరినదిపై నిర్మించ తలపెట్టిన మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి నిర్మాణాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే తన స్వార్థంతో రద్దు చేయించారని ఆరోపించారు. క్యాతనపల్లిలో పర్యటన.. సమావేశం తర్వాత.. క్యాతనపల్లిలోనూ కేటీఆర్ పర్యటించారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ పర్యటన రద్దయిన నేపథ్యంలో ఆయన రాకతో శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. మున్సిపల్ ఎన్నికల్లో క్యాతనపల్లి పీఠాన్ని దక్కించుకున్న నేపథ్యంలో మిత్రపక్షమైన సీపీఐ, బీఆర్ఎస్ నాయకులను వెన్నుతట్టాలని ఆయన రావటంపై కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ నివాసానికి వచ్చిన కేటీఆర్ సీపీఐ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ధైర్యంగా నిలబడి మున్సిపాలిటీని దక్కించుకోవటం అభినందనీయమని పేర్కొన్నారు. సింగరేణిలో కార్మికుల హక్కులు, వారసత్వ ఉద్యోగాల కోసం సంయుక్తంగా పోరాటం చేస్తే బాగుంటుందని సీపీఐ నేతలకు సూచించినట్లు సమాచారం. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లకు సన్మానం ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలు పొందిన క్యాతనపల్లి, ఆసిఫాబాద్ మున్సిప ల్ చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్లను కేటీఆర్ శాలువాలతో సన్మానించి అభినందించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్జాదవ్, మంచిర్యాల, సిర్పూర్, రామగుండం మాజీ ఎ మ్మెల్యేలు దివాకర్రావు, కోనేరు కోనప్ప, కో రుకంటి చందర్, రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు మిర్యాల రాజిరెడ్డి, కేతిరె డ్డి సురేందర్రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, నాయకులు అక్కూరి సుబ్బ య్య, వంగ తిరుపతి తదితరులున్నారు. -
‘స్పోర్ట్స్’.. అప్గ్రేడ్ కావాలె!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 2016 సంవత్సరంలో క్రీడా పాఠశాలను ప్రారంభించారు. ఇందులో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు ఆసక్తి ఉన్న క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అయితే ఇంటర్ అందుబాటులో లేకపోవడంతో ప్రతిభావంతులైన క్రీడాకారుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పది పూర్తికాగానే విద్యార్థులు పాఠశాలను వదిలి వెళ్లాల్సి వస్తోంది. ఆటపై పట్టు సాధించే క్రమంలో శిక్షణ నిలిచిపోవడంతో వారి క్రీడా భవిష్యత్తు సందిగ్ధంలో పడుతోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రీడా పాఠశాలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేయాలని క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. పతకాల పంట.. ఇందులో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఆయా క్రీడాంశాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నా రు. జిల్లా, రాష్ట్ర స్థాయికే పరిమితం కాకుండా, జా తీయ స్థాయిలోనూ ప్రాతినిధ్యం వహిస్తూ గుర్తింపు పొందుతున్నారు. ఇటీవల నిర్వహించిన ‘సీఎం కప్ రెండో ఎడిషన్’ పోటీల్లో విద్యార్థులు అత్యధిక పతకాలు సాధించడం వారి ప్రతిభకు నిదర్శనం. ‘ఓవరాల్ చాంపియన్’ సైతం కై వసం చేసుకున్నారు. కీలక సమయంలో బయటికి.. ఇక్కడ పాఠశాల స్థాయిలో రాణిస్తున్న విద్యార్థులు ఇంటర్మీడియెట్ అందుబాటలో లేకపోవడంతో వేరే చోట చదవాల్సి వస్తోంది. ఈ క్ర మంలో చదువుపై ఒత్తిడి పెరిగి విద్యార్థులు క్రీడల కు దూరమవుతున్నారు. ఆడాలనే ఆసక్తి ఉన్నప్పటి కీ, సమయం, సదుపాయాలు, శిక్షకులు లేక వారి ప్రతిభ మరుగున పడిపోతోంది. కొంతమంది స్థానికంగా ఉంటూ ఇంటర్ కళాశాలల్లో చేరి, ప్రతిరోజూ తమ పాత శిక్షకుల వద్ద శిక్షణ తీసుకుంటున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వారిని వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఆటకు శాశ్వతంగా దూరమవుతున్నారు. అప్గ్రేడ్ చేస్తే.. ప్రస్తుతం ఉన్న క్రీడా పాఠశాలను ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేస్తే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. దీనివల్ల వారి క్రీడా శిక్షణ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఫలితంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయి వేదికలపై కూడా సత్తా చాటే అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని క్రీడాకారులు కోరుతున్నారు. పదో తరగతి వరకూ... ఈ క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశాలు ప్రారంభమై పదో తరగతి వరకు బోధన కొనసాగుతోంది. విద్యార్థులకు జూడో, అథ్లెటిక్స్, బాక్సింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్ వంటి క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. అలాగే నాణ్యమైన విద్యాబోధనతో పాటు ఉచితవసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 195 మంది విద్యాభ్యాసంతో పాటు క్రీడల్లో మెలకువలు నేర్చుకుంటున్నారు. -
పడిపోయిన ఇంటర్ ఫలితాలు
ఆదిలాబాద్టౌన్: అక్షర క్రమంలో ముందున్న ఆ దిలాబాద్ జిల్లా ఇంటర్మీడియెట్ ఫలితాల్లో వెనుకబడిపోయింది. రాష్ట్రస్థాయిలో అట్టడుగున నిలిచింది. ఈ ఏడాది పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏ ర్పాటుతో మాస్ కాపీయింగ్కు అవకాశం లే కుండా పోయింది. ఈ ప్రభావం ఫలితాలపై పడినట్లుగా తెలుస్తోంది. పదో తరగతిలో 95 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించిన ఈ విద్యార్థులే ఇంటర్లో వెనుకబడడం గమనార్హం. ఆదివారం వెల్లడైన ఫ లితాల్లో జిల్లా ప్రథమ సంవత్సరం ఏకంగా 32వ స్థానంలో నిలువగా, ద్వితీయ సంవత్సరం 33వ స్థానానికి పడిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. సెకండియర్లో మరింత దారుణం.. గతేడాదితో పోల్చితే సెకండియర్ ఫలి తాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఏకంగా 21 స్థానాలకు పడిపోవడం విద్యార్థుల సామర్థ్యాలను ప్రశ్నిస్తోంది. రాష్ట్ర స్థాయిలో జిల్లా 33వ స్థా నంలో నిలిచింది. జనరల్ కోర్సులో 7518 మంది హాజరు కాగా, 4,699 మంది ఉత్తీర్ణులయ్యారు. 62. 50 శాతం నమోదైంది. ఇందులో బాలురు 3,647 మందికి గాను 1847 మంది (50.64 శాతం)పాసయ్యారు. బాలికలు 3,871 మందికి గాను 2852 మంది పాస్ అయ్యారు. 73.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 69.57 శాతం నమోదు కాగా ఈ సారి 7.07 శాతం తగ్గింది. ఒకేషనల్లో 905 మంది పరీక్షలు రాయగా 669 మంది పాసయ్యా రు. ఉత్తీర్ణత శాతం 73.92గా నమోదైంది. ఇందులో బాలురు 63.03 శాతం, బాలికలు 81.02 శాతంగా ఉంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానంలో నిల వగా, ఈసారి 18కి పడిపోయింది. ద్వితీయ సంవ త్సరంలో ప్రైవేటు విద్యార్థులు (గతంలో ఫెయిల్ అయిన వారు) జనరల్ కోర్సులో 452 మంది రాయగా, 162 మంది ఉత్తీర్ణులయ్యారు. 35.85 శాతం నమోదైంది. ఒకేషనల్ కోర్సులో ప్రైవేట్ విద్యార్థులు 53 మంది పరీక్షకు హాజరు కాగా 15 మంది పాస్ అయ్యారు. 28.30 శాతం నమోదైంది. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు డీఐ ఈవో జాదవ్ గణేశ్కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వి తీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఈనెల 13 నుంచి 20 వరకు చెల్లించేందుకు గడువు ఉందన్నారు. రీకౌంటింగ్ కోసం ప్రతీ పేపర్కు రూ.100, రీవెరిఫికేషన్, స్కానింగ్ కాపీ కోసం రూ.800 ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు. అలాగే అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫె యిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందవద్దని, అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావచ్చని తెలిపారు. సర్కార్ కళాశాలల ఫలితాలు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బజార్హత్నూర్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. 86 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో టాప్లో నిలిచారు. అలాగే బేలలో 85.51 శాతం, నేరడిగొండ 78.79 శాతం, తాంసిలో 77.6 శాతం ఉత్తీర్ణులయ్యారు. తక్కువ శాతం ఉత్తీర్ణత అయిన కళాశాలల్లో ఉట్నూర్ 26.25 శాతం, ఆదిలాబాద్ బాలుర కళాశాలలో 35.69 శాతం, నార్నూర్ 41 శాతం, గుడిహత్నూర్లో 44 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫస్టియర్ ఐదు స్థానాలు డౌన్.. ప్రథమ సంవత్సరం ఫలితాలు గతేడాదితో పోల్చితే మరో ఐదు స్థానాలు దిగజారింది. జనరల్ కోర్సులో 7,701 మంది పరీక్షకు హాజరు కాగా, 3,910 మంది ఉత్తీర్ణులయ్యారు. 50.77 ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతేడాదితో పోల్చితే ఈసారి 2.3 శాతం తగ్గింది. బాలుర ఉత్తీర్ణత 36.87 శాతం కాగా.. బాలికలది 64.13 శాతంగా నమోదైంది. ఒకేషనల్ కోర్సులో 935 మందికి గాను 620 మంది ఉత్తీర్ణత (66.31 శాతం)సాధించారు. ఇందులో బాలురది 53.37 శాతం ఉత్తీర్ణత కాగా.. బాలికలది 75.41 శాతంగా నమోదైంది. రాష్ట్ర స్థాయిలో ఒకేషనల్ కోర్సులో 9వ స్థానం నిలిచింది. గతంతో పోల్చితే ఆరు స్థానాలు పడిపోయాయి. -
బాబ్బాబు.. మా కాలేజీలో చేరండి
ఆదిలాబాద్టౌన్: కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ప్రవేశాల కోసం ప్రచారం నిర్వహించడం పరిపాటి. కానీ ఇందుకు భిన్నంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ప్రవేశాల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగిన సమయంలో ఆయా కేంద్రాల వద్దకు వెళ్లి తమ కళాశాలల్లో చేరాలంటూ విద్యార్థులకు బ్రోచర్లు అందజేస్తూ కళాఽశాల ప్రత్యేకతను వివరించారు. ప్రభుత్వ కళాఽశాలకు కేటాయించిన సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు. నెల రోజులుగా ఈ ప్రక్రియ జరుగుతుండగా ప్రస్తుతం ప్రచారం ముమ్మరం చేశారు. అధ్యాపకులు విద్యార్థుల ఇళ్ల బాట పడుతున్నారు. తల్లిదండ్రులకు సర్కారు కళాశాలల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ తమ పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. వీరితో పాటు గ్రామాల్లోని సర్పంచ్లు, పట్టణాల్లోని కౌన్సిలర్లను కలుస్తూ సహకరించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. వందశాతం సీట్ల భర్తీయే లక్ష్యం.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 36 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ డిగ్రీ కళాఽశాలలు ఆదిలాబాద్లో రెండు, ఉట్నూర్లో ఒకటి, ఇచ్చోడలో ఒకటి ఉండగా గిరిజన, సోషల్ వెల్ఫేర్ సంక్షేమ డిగ్రీ కళాశాలలు రెండు ఉన్నాయి. గతంలో కేవలం ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఐదారు మాత్రమే ఉండగా, ప్రస్తుతం మండలానికి ఒకటి అన్నట్లుగా 28 వరకు చేరాయి. గతేడాది ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు నిండక అధ్యాపకులు ఆందోళన చెందారు. ఆదిలాబాద్ పట్టణంలోని కళాశాలల పరిస్థితి అలాగే ఉండింది. దోస్త్ ద్వారా మూడు విడతల్లో సీట్ల భర్తీ చేయగా వందలోపే ప్రవేశాలు పొందారు. విద్యార్థులంతా తమ మండలాల్లోని ప్రైవేట్ కళాశాలల్లో చేరడంతో ప్రభుత్వ కళాశాలలు సైతం వెలవెలబోయాయి. చివరి విడతలో ప్రవేశాల సంఖ్య పెరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని సైన్స్ డిగ్రీ కళాశాలలో 660 సీట్లకు గాను 491 మంది చేరారు. ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో, ఇచ్చోడ డిగ్రీ కళాశాలలో 241 సీట్లకు గాను 163 మంది చేరారు. ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో మాత్రం సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అయ్యాయి. ఇలా మొత్తం ఆయా కళాశాలల్లో 840 మంది చేరారు. ఈ ఏడాది కొత్తగా రెండు కోర్సులను అందుబాటులోకి తీసుకురాగా 120 సీట్లు అదనంగా పెంచారు. వీటి భర్తీ కోసం ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నారు. విద్యార్థుల ఇళ్లకు లెక్చరర్లు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు ప్రవేశాల కోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు. ప్రతిరోజు ఒకటి, రెండు గ్రామాలకు వెళ్తూ ప్రచా రం నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులను కలుస్తూ అడ్మిషన్లు పెంచేలా చూడాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో ప్ర స్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను అంబాసిడర్లుగా నియమించా రు. ఆ గ్రామంలో ఇంటర్ చదివిన విద్యార్థుల వివరాలను సేకరించారు. ఇది వరకే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సెల్నంబర్లు, చిరునామాలు సేకరించి వాటి ఆధారంగా ఇళ్ల వద్దకు వెళుతూ వారిని కలుస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ప్రచారానికి మోసపోవద్దని, అర్హత కలిగిన లెక్చరర్లు తమ కళాశాలల్లో ఉన్నారని, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెబుతూ అడ్మిషన్ తీసుకోవాలని కోరుతున్నారు.పూర్తిస్థాయిలో సీట్లను భర్తీ చేయడమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. సర్కారు కళాశాలల్లోనే నాణ్యమైన విద్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది. ఉన్నత విద్యతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన జరుగుతుంది. ప్రైవేట్ కళాశాలల ఆర్బాట ప్రచారం చూసి మోసపోవద్దు. ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఈ ప్రవేశాల కోసం విద్యార్థులను అంబాసిడర్లుగా నియమించాం. – జే. సంగీత, ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఆదిలాబాద్ -
నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర
● ఎస్పీ అఖిల్ మహాజన్ ఇచ్చోడ: నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇచ్చోడ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన 40 సీసీ కెమెరాలను ఆదివారం ప్రారంభించారు. ఆయా కాలనీలతో పాటు వ్యాపార సంస్థలు తమ పరిధిలో సీసీ కెమెరాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలన్నారు. కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ బండారి రాజు, సర్పంచ్లు కోడప జలైజాకు, ఆసిఫ్ ఖాన్, ఇచ్చోడ పంచాయతీ ఈవో సురేశ్, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు అశ్వాక్ అహ్మద్పై సస్పెన్షన్ వేటు వేస్తూ అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఓ విద్యార్థినికి వాట్సాప్ ద్వారా అసభ్యకర మెసేజ్లు పెడుతూ ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో ఆ విద్యార్థిని కు టుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదైంది. అలాగే ‘సాక్షి’లోనూ కీ(టీ)చకులు శీర్షకన ప్రత్యేక కథనం ప్ర చురితమైంది. ఈ క్రమంలో ఆ ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలి
ప్రస్తుతం క్రీడా పాఠశాలలో పదోతరగతి వరకు మాత్రమే చదివే అవకాశం ఉంది. తర్వాత వేరే కళాశాలలో చదవాల్సి ఉంటుంది. చదువు విషయంలో ఇబ్బంది లేకపోయినా క్రీడా శిక్షణ విషయంలో మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఇక్కడే ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేస్తే బాగుంటుంది. – పి.కావ్య, పదోతరగతి, స్పోర్ట్స్ స్కూల్ సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. క్రీడా పాఠశాలను ఇంటర్మీడియెట్ వరకు ఉన్నతీకరించేందుకు గత జూన్లోనే ప్రతిపాదనలు పంపించాం. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకే కాకుండా, సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లినం. ఈ విషయంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అప్గ్రేడ్ అ యితే విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. – జక్కుల శ్రీనివాస్, డీవైఎస్వో -
● పరీక్షలే జీవితం కాదు..! ● ఒక్క ఫలితమే నిర్ణయించలేదు ● నేడు ఇంటర్మీడియెట్ ఫలితాలు ● ఒత్తిడికి గురైతే టెలిమానస్ నంబరు 14416లో సంప్రదించవచ్చు
పరీక్ష ఫలితాల్లో ఫెయిలైతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చదువు కొనసాగించడం.. మార్కులు పెంచుకునేందుకు బోర్డు పలు అవకాశాలు కల్పిస్తోంది. ఫెయిలైన సబ్జెక్టులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే సంవత్సరం ఉన్నత చదువులకు వెళ్లేందుకు వీలుంటుంది. తమకు వచ్చిన మార్కుల(మార్కులు తక్కువొచ్చినా, ఫెయిలైనా)పై నమ్మకం లేని విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. పాసైనా మార్కులు తక్కువొచ్చాయని భావిస్తే విద్యార్థులు బెటర్మెంట్ పరీక్షలు రాసి మెరుగుపర్చుకోవచ్చు. ఇరుగు పొరుగు పిల్లలతో పోల్చి పలుచన చేయకుండా తల్లిదండ్రులు సన్నిహితంగా ఉంటూ ధైర్యం కల్పించాలి.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వరకు పరీక్షలు జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 53,307 మంది పరీక్షలు రాశారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానుండడంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిరుత్సాహం దరిచేరనీయొద్దుపరీక్ష ఫలితాల్లో తగిన మార్కులు రాలేదని ఫెయిల్ అయ్యామని చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. భావోద్వేగాలను సమన్వయపర్చుకుంటూ ఒత్తిడికి గురి కాకుండా జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించే గాథలు, అనుభవాలను వారితో పంచుకోవాలి. పరీక్షలే జీవితానికి పరమావధి కాదని వారికి తెలియజెప్పాలి. జీవితంలో ఎదిగేందుకు అనేక మార్గాలు ఉంటాయని అవగాహన కల్పించాలి. – మోత్కూరి రామచందర్, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ఈ చిత్రంలో మధ్యలో కనిపిస్తున్న యువకుడు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామానికి చెందిన పంతిక ప్రవీణ్. ఎంసీఏ పూర్తి చేశాడు. ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. నచ్చిన ఉద్యోగం రాకపోవడంతో స్వయంశక్తితో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. పౌల్ట్రీ రంగంలో మెలకువలు నేర్చుకుని ప్రభుత్వ రుణ సదుపాయంతో పౌల్ట్రీఫామ్ నెలకొల్పాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మంచి ఆదాయం ఆర్జిస్తున్నాడు. శిక్షణ ఐఏఎస్లు, ఉన్నతాధికారులు వ్యవసాయం, పౌల్ట్రీఫాంను సందర్శించి అతడిని అభినందించారు. ఉద్యోగంలో ప్రవేశిస్తే ఎక్కడో ఒకచోట మాత్రమే పరిమితమైన సేవలందించే వాడినని, ప్రస్తుతం మరో పదిమందికి ఉపాధి కల్పించడం గొప్ప అనుభూతిని ఇస్తుందని ప్రవీణ్ చెబుతున్నాడు.‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’.. అంటే నీ కర్తవ్యాన్ని నిష్కామంగా చేయడం మాత్రమే నీ చేతుల్లో ఉంది. ఫలితంపై నీకు హక్కు లేదు. ఏది జరిగినా అది భగవంతుని సంకల్పంగా భావించి సమత్వంతో స్వీకరించడమే నిజమైన జ్ఞానం. – భగవద్గీతమంచిర్యాలఅర్బన్/నిర్మల్ఖిల్లా: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. పదో తరగతి రిజల్ట్స్ త్వరలో వెలువడుతాయి. ఏడాదంతా కష్టపడ్డాం.. ఫలితం ఎలా ఉంటుందోననే ఒత్తిడి.. ఆశలు ఉండడం విద్యార్థులకు సహజమే. కానీ.. ఫలితాలు ఒక్కటే జీవితాన్ని పూర్తిగా నిర్ణయించలేవు. పరీక్ష తప్పితే మరోసారి రాసుకోవచ్చు. ఆశించిన ర్యాంకు.. మార్కులు రాలేదని తట్టుకోలేకపోతుంటారు. తల్లిదండ్రులు కాస్త భరోసా కల్పించాలి. క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి తీరని శోకం మిగుల్చుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చదువు జీవితంలో భాగమే కానీ అదే జీవితం కాదని ఉపాధ్యాయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆత్మస్థైర్యాన్ని నింపాలని విద్యావేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు.నిరాశ వద్దు..పౌల్ట్రీరంగంలో ఎదిగి..53వేల మంది..ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులుమంచిర్యాల 12,317ఆదిలాబాద్ 17,564నిర్మల్ 13,125ఆసిఫాబాద్ 10,301 -
ఎస్టీపీపీలో జ్యోతిబాపూలే జయంతి
జైపూర్: ఎస్టీపీపీలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్టీపీపీ ఓపెన్ ఆడిటోరియంలో ఈడీ చిరంజీవి, జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్తో కలిసి జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఎస్టీపీపీలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ పిట్ సెక్రెటరీ సత్యనారాయణ, సీఎంవోఏఐ బ్రాంచి ప్రెసిడెంట్ పంతులా, పీఎంపీఎల్ హెడ్ అఖిల్కపూర్, డీజీఎం పర్సనల్ కిరణ్బాబు, బీసీ లైసన్ ఆఫీసర్ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం మంచిర్యాలటౌన్: మహాత్మా జ్యోతిబా పూలే సేవలు చిరస్మరణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. శనివారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, మహిళా సాధికారత, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్రావు, మాజీ ఎంపీపీ మంత్రి రామన్న, బీజేపీ కార్యాలయ కార్యదర్శి మల్లికార్జున్, గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్కుమార్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో బీజేపీ కార్పొరేటర్లు గాజుల ముఖేష్గౌడ్, కస్తూరి నాగరాజు, మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యనారాయణ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వే శారు. షార్ట్ సర్క్యూట్తో మొక్కజొన్న దగ్ధం బోథ్: ఆరుగాలం శ్రమించి పంట చేతికందే సమయంలో షార్ట్ సర్క్యూట్తో ఐదెకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది. మండలంలోని నిగిని గ్రామంలో శనివారం ఈఘటన చోటు చేసుకుంది. జాదవ్ అంకుష్ తన చేనులో ఐదెకరాల్లో మొక్కజొన్న వేశాడు. ప్రస్తుతం పంట కోతలు ప్రారంభించాల్సి ఉంది. అయితే విధి పగబట్టడంతో చేతికి రావల్సిన పంట ఆగ్నికి అహుతైంది. చేనులో విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగలడంతో మంటలు చెలరేగి పంటకు అంటుకున్నాయి. దాదాపు మూడున్నర ఎకరాల్లో పంట మొత్తం కాలిబూడిదైంది. దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాఽధిత రైతు కోరాడు. పెన్గంగలో పడి వ్యక్తి మృతి సాత్నాల: పెన్గంగ నదిలో పడి వ్యక్తి మృతిచెందాడు. మృతుడు భువనగిరి పరమేశ్వర్ (45) భోరజ్ మండలం బాలాపూర్ గ్రామ వాసిగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. మృతుడు గత కొన్నేళ్లుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడలో నివసిస్తున్నారు. శనివారం పెన్గంగ సరిహద్దు ప్రాంతంలో మృతి చెందడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదవశాత్తు నదిలో పడిపోయడా, ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఘనంగా ‘వారసత్వ సంబురాలు’
నిర్మల్చైన్గేట్: పట్టణంలోని సిటీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో శనివారం ‘వారసత్వ సంబురాలు’కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్ ఐఏఎస్, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా చరిత్ర, వైద్యవృత్తి, సంస్కృతి, సంప్రదాయాలపై జిల్లా రచయితలు రచించిన పలు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం రిటైర్డ్ పార్థసారథి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జిల్లాలో రచయితలు సాహిత్య అభివృద్ధికి, భాషా పరిరక్షణకు కృషి చేస్తున్నారని, ముఖ్యంగా మహిళా రచయితలు ముందుకు రావడం గర్వకారణమన్నారు. అనంతరం వైద్యులను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా వైద్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు. -
వైద్యుల సూచన మేరకే మందులు విక్రయించాలి
మంచిర్యాలటౌన్: మెడికల్ దుకాణాల నిర్వాహకులు వైద్యుల సూచన మేరకే మందులు విక్రయించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ చందన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నిష్ణాతులైన వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నారని, ప్రజలు వైద్య సేవలు పొందాలని అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏడు పడకలతో ఏర్పాటు చేసిన డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, ఆసుపత్రి సూపరింటెండెంట్ వేదవ్యాస్, ఆర్ఎంవో భీష్మతో కలిసి ప్రారంభించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సెంటర్ను ప్రారంభించి, వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయంపై హెల్ప్లైన్ నంబర్లు 14416, 1908లో సమాచారం ఇవ్వాలని అన్నారు. అనంతరం వైద్య విద్యార్థులతో జీవితంలో ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కెమిస్టు, డ్రగ్గిస్టు అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్, సుధాకర్, వైద్యులు సునిల్కుమార్, కిరణ్కుమార్, నర్సింగ్ అధికారులు, డెమో బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
శభాష్ నరేశ్
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనానికి వరంగల్ జిల్లా నుంచి శనివారం ఇద్దరు యు వకులు వచ్చారు. గోదావరిలో పుణ్యస్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో దిగి స్నానం చేస్తుండగా, లో తు తెలియకుండా లోపలికి వెళ్లారు. దీంతో ఇద్దరు నీటమునుగుతూ కాపాడాలని కేకలు వేశారు. అ క్కడే ఉన్న జాలరి డప్పు నరేశ్ వెంటనే నదిలో దూ కాడు. ఈదుకుంటూ వెళ్లి వారిని ఒడ్డుకు తీసుకొ చ్చాడు. వరంగల్ జిల్లాకు చెందిన యశ్వంత్, సా త్విక్ స్నేహితులు. బాసరకు వచ్చిన వీరు గోదావరిలో స్నానం చేసేందుకు దిగారు. లోతు తెలియకపోవడంతో నది లోపలికి వెళ్లారు. ఈక్రమంలో మొ దట ఒకరు కొట్టుకుపోగా, అతడిని కాపాడేందుకు మరొకరు లోపలికి వెళ్లాడు. దీంతో ఇద్దరు కొట్టుకుపోతూ కేకలు వేశారు. జాలరి గమనించి వెంటనే నదిలో దూకి ఇద్దరిని ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయినట్లు భక్తులు తెలిపారు. నిండు ప్రాణాలు కాపాడినందుకు నరేశ్ను అభినందించారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు..బాసర వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరిని పోలీసులు కాపాడారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలానికి చెందిన వెంకటేశ్, మహారాష్ట్రలోని ధర్మబాద్కు చెందిన శివ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకునేందుకు శనివారం బాసర గోదావరి వద్దకు వచ్చారు. వారిని గమనించిన స్థానికులు వెంట నే డయల్ 100కు సమాచారం అందించారు. స్పందించిన పోలీస్ బృందం సంఘటన స్థ లానికి చేరుకుని, అప్రమత్తంగా వ్యవహరించి ఆ ఇద్దరిని కాపాడింది. స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు అ ప్పగించారు. ఇద్దరిని కాపాడిన బాసర పోలీసులను ఎస్పీ జానకీషర్మిల అభినందించారు. -
మేకలు, గొర్రెల చోరీపై వీడని మిస్టరీ
దిలావర్పూర్: మండలంలోని మాడేగాం గ్రామంలో మేకలు, గొర్రెలు చోరీపై మిస్టరీ వీడలేదు. రైతు పులిండ్డ శ్రీనివాస్ గురువారం మధ్యాహ్నం 80 మేకలు 30 గొర్రెలకు నీరు తాగించి గ్రామానికి ఆనుకుని ఉన్న వ్యవసాయ క్షేత్రం సమీపంలో చుట్టూ జాలి వేసి ఉంచాడు. గ్రామంలోని శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చాడు. సాయంత్రం మేకల మంద వద్దకు వెళ్లి చూడగా కనిపించలేదు. చుట్టూ ఉన్న అటవీప్రాంతంలోకి వెళ్లి ఉండవచ్చునని అక్కడికి వెళ్లి వెతికినా కనిపించలేదు. శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో శనివారం మేకల మంద ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న సారంగాపూర్ మండలంలోని ప్యారమూర్, నర్సాపూర్(జి) మండలంలోని కుస్లి అంజనీతండా తదితర గ్రామాల ప్రజలను విచారించారు. త్వరలో మేకలు, గొర్రెల మంద చోరీ మిస్టరీని ఛేదిస్తామని తెలిపారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులో తీసుకుని విచారించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.


