breaking news
Adilabad District Latest News
-
మనస్తాపంతో ఒకరు..
దండేపల్లి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గుడిరేవు గ్రామానికి చెందిన పూసాల రాజు (36) ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్య రాజేశ్వరితో గొడవపడటంతో రెండు రోజుల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన రాజు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం చిట్టీడబ్బులకోసం వెళ్లిన వ్యక్తి చూడగా ఉరేసుకుని కనిపించాడు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
దాడి కేసులో నలుగురి రిమాండ్
జైపూర్: మండలంలోని వేలాలలో జరిగిన దాడి కేసులో నలుగురిని రిమాండ్కు తరలించినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. గ్రామంలో ప్యాగ రాజ సమ్మయ్య, అతని సోదరులకు 33 గుంటల భూమి ఉంది. ఆ భూమి విషయంలో అన్న మైసయ్య, అతని కుమారులు సమ్మయ్య, నగేష్, మల్లేశ్తో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అందులో ఇటీవల మైసయ్య ఇల్లు నిర్మాణం చేపట్టగా రాజ సమ్మయ్య కుమారులు శ్రీనివాస్, సంతోష్, భార్య మల్లక్క భూమి వద్దకు వెళ్లి భూమిని పంచుకున్న తర్వాత ఇల్లు కట్టుకొమ్మన్నారు. ఈ విషయంలో సమ్మయ్య, నగేష్, మల్లేశ్, లక్ష్మి వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
పాఠశాల ఆవరణలో నాగుపాము కలకలం
నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రంలోని వెంకటపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం నాగుపాము కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం ఇంటర్వెల్ సమయంలో మూత్రశాలల సమీపంలో నాగుపామును గమనించిన విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులతో చెప్పా రు. ప్రధానోపాధ్యాయురాలు సుహాసిని శాంతినగర్ కాలనీకి చెందిన స్నేక్క్యాచర్ గిరిగంటి అనిల్కు సమాచారం అందించడంతో చాకచక్యంగా పామును బంధించి అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ సందర్భంగా స్నేక్క్యాచర్ అనిల్ను అభినందించారు. -
అద్దె కారు తిరిగివ్వని ఇద్దరు..
ఆదిలాబాద్టౌన్: కారు అద్దెకు తీసుకొని తిరిగి ఇవ్వని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. మంగళవారం వన్టౌన్ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. 2025 మార్చి 28న సునార్ గల్లికి చెందిన అన్నదమ్ములు ముమ్మడివార్ రాకేష్, ముమ్మడివార్ కృష్ణ హైదరాబాద్కు వెళ్తామని చెప్పి రవీంద్రనగర్కు చెందిన బొడ్గం రాజేశ్ వద్ద కారు అద్దెకు తీసుకున్నారు. ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అరె స్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. -
ఆత్మీయం.. ఆదివాసీ వైభవం
దండేపల్లి మండలం గుడిరేవులోని ఏత్మాసార్ పేన్ పద్మల్పురి కాకో ఆలయంగుస్సాడీలు అశ్వయుజ పౌర్ణమి మరుసటి రోజు భోగితో మాలధారణ చేసి పది రోజుల పాటు కఠినదీక్ష చేపడతారు. దీక్ష పూర్తయ్యే వరకు స్నానం ఆచరించరు. ఒంటిపై చుక్క నీరుకూడా పడకుండా.. కాళ్లకు చెప్పులు ధరించకుండా.. ఒంటిపై ఎలాంటి వస్త్రాన్ని కప్పుకోకుండా అర్ధనగ్నంగానే గడుపుతారు. నేలపైనే కూర్చోవడం, నేలపైనే పడుకోవడం వారి ఆచారం. గుస్సాడీల్లో పోరీలది మరింత ప్రాముఖ్యత. సీ్త్ర వేషధారణలో ఉండే యువకులను ఆదివాసీలు పోరీలు అని పిలుస్తారు. వారు ఏ ఊరికి వెళ్లినా.. ఏ ఇంటిని సందర్శించినా మహిళలు మంగళహారతులు ఇచ్చి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆరాధ్యదైవం ఏత్మాసార్ పద్మల్పురి కాకో ఆదివాసీలకు పెద్ద పండుగ దీపావళి.. ఇందులో భాగంగానే గోండులకు ఆరాధ్యదైవమైన ఏత్మాసార్ పద్మల్పురి కాకో ఆలయానికి భక్తజన దండు కదులుతుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో కొలువై ఉన్న పద్మల్ పురి కాకో ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివస్తారు. గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకుంటారు. గుస్సాడి టోపీ ప్రత్యేకం గుస్సాడీ టోపీలను నిపుణులైన గోండులు, కొలాంలు తయారు చేస్తారు. నెమలి ఈకలను సేకరించి వాటి తెల్లని కాడలను అల్లికగా మెలివేసి తలకు పట్టే ఒక చిన్న వెదురు బుట్ట అంచు చుట్టూ గట్టిగా కుట్టేసి, నెమలి పింఛాలు పై వైపు అందంగా బయటకు గుండ్రని బుట్టలాగా విస్తరిస్తూ, కదిలినప్పుడు విలాసంగా ఊగేలా ఏర్పాటు చేస్తారు. టోపీకి చుట్టూ ముఖ్యంగా ముందు వైపు, పలు వరుసల్లో, పెద్ద అద్దాలతో, రంగురంగుల జరీ దారాలు, చక్కటి డిజైన్లు ఉన్న గుడ్డపట్టీలతో, పలు ఆకారాల రంగురంగుల చెమ్కీ బిళ్లలు, చిన్ని గంటల మాలలతో, కొన్నిసార్లు రెండు వైపులా జింక కొమ్ములతోనూ అలంకరిస్తారు. ఆదివాసీల మధ్య ఆత్మీయ బంధం దండారీ అంటేనే ఐకమత్యానికి నిదర్శనం. ఈ పండుగ వేళ ఆదివాసీ గ్రామాల గిరిజనం ఒక ఊరి నుంచి మరో ఊరికి విడిది వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రంతా నృత్యం చేస్తూ రేలారె రేలా పాటలతో పాటు గోండి హాస్యపు నాటికలు ప్రదర్శించి వినోదాన్ని అందిస్తారు. తెల్లవారుజామునే కాలకృత్యాలు తీర్చుకుని మాన్కోలాతో నృత్య ప్రదర్శనలు చేసి సాయంత్రం సార్కోలాతో ముగిస్తారు. ఈ సందర్భంగా ఆదివాసీలు అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసి వీడ్కోలు పలుకుతారు. అలా చేయడం ద్వారా రెండు గ్రామాల మధ్య సత్సంబంధాలు, బాంధవ్యాలు పెరుగుతాయని ఆదివాసీ పటేళ్లు పేర్కొంటున్నారు. నాలుగు సగల పేరిట ఉత్సవాలు దండారీ పండుగలో ఏత్మాసార్ పేన్ పేరిట గిరిజనులు నాలుగు సగ(గోత్రం)లలో ఉత్సవాలు జరుపుకుంటారు. నాలుగు సగల అంటే గుమ్మేల, ఐదు సగల వారు అంటే ఫర్ర, ఆరు సగల వారు అంటే కోడల్, ఏడు సగల వారు అంటే తపల్ పేరిట ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. వేడుకల్లో భేటికోలా, మాన్కోలా, సదర్కోలా, కోడల్కోలా, సార్కోలా, కలివల్కోలా నృత్యాలు చేయడం ఆదివాసీలకే సొంతం. పేర్లు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో వారి ఆటపాటలు కూడా అంతే వైవిద్యంగా సాగుతాయి. చచోయ్ ఇట్ కోలారా.. దేనే దేనారా.. రేలా.. రేలా.. లాంటి ఆట పాటల నడుమ ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతాయి. కొలబొడితో ముగింపు దీపావళి రెండు రోజుల తరువాత గురువారం కొలబొడితో ఈ దండారీ వేడుకలు ముగుస్తాయి. ఈ సందర్భంగా దండారీ బృందం ఇంటింటికీ వెళ్లగా గృహిణి ఓ పల్లెంలో ధాన్యాలు, తోచినంత నగదు ఉంచిన హారతిని వారికి అందిస్తుంది. దానిని వారు సంతోషంగా స్వీకరించి ఇంట్లో అందరూ బాగుండాలని, పాడిపంటలు సమృద్ధిగా పెంపొందాలని ఆశీ ర్వదిస్తారు. అనంతరం పాటలు పాడుతూ హారతి పూజ ఇస్తారు. అనంతరం గ్రామ పొలిమేరలో ఉన్న ఇప్పచెట్టు వద్ద తమ ఇలవేల్పు అయిన భీందేవుని సన్నిధికి చేరుకుంటారు. తలకు ధరించిన నెమలి టోపీలను తొలగిస్తారు. గుస్సాడీ వేషధారణ, అలంకరణ వస్తువులను భీందేవుని సన్నిధిలో పెట్టి కోళ్ళు, మేకలను బలి ఇస్తారు. భీం దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం విందు భోజనాలతో కొలబొడి నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తారు. ఆదివాసీ గూడేల్లో అంగరంగ వైభవంగా సాగే దండారీ సంబరం మొదలైంది. డప్పుల దరువులు, గజ్జెల మోతలు, గుస్సాడీ నృత్యాలతో అడవితల్లి మురిసి పోనుంది. ఆదివాసీల ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్’ పేరిట చేసే ప్రత్యేక పూజలతో దండారీ పండుగ ప్రారంభమైంది. దీపావళికి ముందు అశ్వయుజ పౌర్ణమి మరుసటి రోజు భోగితో ప్రారంభమై కొలబొడితో ముగియనుంది. పక్షం రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు గూడేలన్నీ సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దండారీని ప్రత్యేక పండుగగా గుర్తించింది. – బజార్హత్నూర్ పవిత్రమైన పండుగ మా ఆదివాసీ గోండు గిరిజనులకు దీపావళి పవిత్రమైన పండుగ. ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకుంటాం. గిరిజన దేవతలను, వన దేవతలను పూజిస్తాం. బంధువుల ఇళ్లకు వెళ్తాం. గుస్సాడీల థింసా నృత్యం, ఆడపడుచుల రేలారేరేలా నృత్యం ఆకట్టుకుంటాయి. – కొడప భీంరావ్ పటేల్, చింతలసాంగ్వీఘనంగా జరుపుకుంటాం దీపావళికి పక్షం రోజుల ముందే అన్నీ సిద్ధం చేసుకుంటాం. ఎంత పేద గిరిజనుడైనా ఈ పండుగకు ఇంటిని శుభ్రపరచడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, పిండివంటలకు సామగ్రి సమకూర్చుకుంటారు. నెమలి ఈకలతో టోపీలు తయారు చేసుకుంటాం. దండారీ ఘనంగా జరుపుకుంటాం. – కనక లంకు మహాజన్, తుమ్ముగూడ, ఇంద్రవెల్లి ప్రోత్సాహం అందించాలి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత సంవత్సరం రూ.15 వేలు అందించింది. ఈ సంవత్సరం కూడా ప్రోత్సాహకం అందించాలని జిల్లా సార్మేడీలు, కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాను కలిసి విన్నవించాం. – మేస్రం దుర్గు, జిల్లా సార్మేడి, ఉట్నూర్ -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
తిర్యాణి: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామానికి చెందిన కల్పన (28)కు తిర్మాణి మండలంలోని గంభీరావుపేటకు చెందిన సైదం శేఖర్తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్లుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో కల్పన పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో ఇటీవల మళ్లీ అత్తారింటికి వచ్చింది. సోమవారం మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తన కుమార్తె మృతికి అల్లుడే కారణమని మృతురాలి తల్లి దేవక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రైతు నేస్తం.. వాట్సాప్ చానల్
లక్ష్మణచాంద: పంటల సాగులో తరచూ ఎదురయ్యే తెగుళ్లు, వాటి నివారణకు సరైన మందుల ఎంపికలో అవగాహన లోపం కారణంగా రైతులు దిగుబ డులు కోల్పోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సాంకేతికత ఆధారంగా రైతుల ముంగిట ముఖ్య సమాచా రాన్ని అందించేందుకుఈ ఏడాది ఆగస్టు 8న ప్ర త్యేక అధికారిక వాట్సాప్చానల్నుప్రారంభించింది. చానల్ ద్వారా లభించే ప్రయోజనాలు నిపుణుల సలహాలు రైతు సాగు చేసే పంటకు మొలక దశ నుంచి కోత దశ వరకు ఏ తెగులు వచ్చినా, దాని ఫొటోను చానల్లో పోస్టు చేస్తే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆ తెగుళ్లను వెంటనే గుర్తిస్తారు. తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ మందులు, ఏ మోతాదులో ఉపయోగించాలో వివరిస్తారు. చానల్లో చేరడం ఇలా.. గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు -
ఐటీఐ గేటుకు తాళం వేసి నిరసన
మంచిర్యాలఅర్బన్: 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన కోర్సు ఫీజు చెల్లించినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో మంగళవారం డింపి ఐటీఐ గేటుకు తాళం వేసి విద్యార్థులు నిరసన తెలిపారు. కళాశాల చైర్మన్ వచ్చారన్న సమాచారంతో వెళ్లి సర్టిఫికెట్లు అడిగితే దాటవేత సమాధానం ఇవ్వడంతో గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పీడీఎస్యూ, ఏఐఎస్బీ, జేవీఎస్ విద్యార్థి సంఘాల నేతలు శ్రీకాంత్, వంశీ వారికి మద్దతు తెలిపారు. ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కళాశాల యజమానులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లగా విద్యార్థులు, విద్యార్థిసంఘాల నేతలు కూడా అక్కడికి వెళ్లారు. కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్ మధ్య డబ్బుల వివాదంతో సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి వరకు సర్టిఫికెట్ల సమస్య పరిష్కారంపై కొలిక్కిరాలేదు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
బాసర ఆలయ హుండీ లెక్కింపు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ హుండీని మంగళవారం లెక్కించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనాదేవి తెలిపారు. 83 రోజులకు రూ.81,69,099 నగదు, 91 గ్రాముల 500 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి, 79 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్, ఏఈవో సుదర్శన్ పర్యవేక్షకులు శివరాజ్, తదితరులు పాల్గొన్నారు. 108 ఈఎంటీకి ఉత్తమ సేవా పురస్కారంఉట్నూర్రూరల్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 108 సిబ్బందికి రాష్ట్ర ఎంఆర్ఐ సంస్థ అందించే ఉత్తమ సేవా పురస్కారానికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ 108లో మెడికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్న గణేశ్ ఎంపికయ్యారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఖుష్బూ గుప్తా చేతుల మీదుగా పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా ఇన్చార్జి రాజశేఖర్, పైలట్ సుందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
33వ రోజుకు కార్మికుల సమ్మె
ఉట్నూర్రూరల్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఐటీడీఏ కార్యాలయం ఎదుట కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. మంగళవారం గిరిజన సంఘాలు, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు మాట్లాడుతూ సమ్మె చేపట్టి 33 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన వారిలో కొలాం సేవా సంఘం రాష్ట్ర అఽ ద్యక్షుడు కొడప సోనేరావు, కుంర రాజు, భీంరావు, సంజయ్, విజయ్, బీఆర్ఎస్ నాయకులు కొమ్ము విజయ్, కాటం రమేశ్, ధరణి రా జేశ్, బాజీరావు, దావుల రమేశ్ ఉన్నారు. -
పల్లెల్లో వసతులపై సర్వే
నేరడిగొండ: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్ పెంచింది. ప్రతీ పంచాయతీలో మౌలిక వసతులు, ప్రభుత్వ ఆస్తుల స్థితిగతులు గుర్తించేందుకు గాను గత నెల 18 నుంచి సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకంగా జీపీ మానిటరింగ్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కార్యదర్శులు ఆయా జీపీల్లో మౌలిక వసతుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొ త్తం 473 గ్రామ పంచాయతీలు ఉండగా, అన్ని చో ట్ల సర్వే చేపడుతున్నారు. కొద్ది నెలలుగా పంచా యతీ పాలకవర్గాలు లేకపోవడం, అలాగే నిధుల కొరతతో పలు గ్రామాల్లో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సర్వే ద్వారా గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం అంచనా వేయనుంది. తద్వారా పల్లె అభివృద్ధికి దోహదపడనుంది. సమగ్ర సమాచారం సేకరణ.. ఈ సర్వే ద్వారా గ్రామాల్లో మొత్తం 21 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. జీపీ మానిటరింగ్ యాప్ ద్వారా ప్రతీ కార్యదర్శి క్షేత్ర స్థాయిలో డేటా నమోదు చేయాలి. పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీ, వైకుంఠదామం, తాగునీరు, వీధిదీపాలు వంటి ప్రాథమిక వసతులు ఉన్నాయా లేదా పరిశీలించి వివరాలు నమోదు చేయాలి. దీంతో వసతుల స్థాయి, ప్రజా అవసరాల స్థితి, భవిష్యత్ ప్రాధాన్యతలు స్పష్టంగా తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. అభివృద్ధికి పునాది.. గ్రామాల్లోని ప్రభుత్వ ఆస్తుల వాస్తవ స్థితి, అభివృద్ధి అవకాశాలు, ప్రజా వసతుల లోపాలపై ఈ సర్వే ద్వారా సమగ్ర అవగాహన లభిస్తుంది. తద్వారా రాబోయే అభివృద్ధి ప్రణాళికల్లో దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. 21 అంశాలపై పరిశీలన.. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ ఆస్తులు, మౌలిక వసతులపై సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని ఆయా పంచాయతీల కార్యదర్శులకు సర్వే తీరుతెన్నులను వివరించాం. 21 అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివరాలను జీపీ మానిటరింగ్ యాప్లో పారదర్శకంగా నమోదు చేయాలని ఆదేశించాం. – రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
ఉట్నూర్రూరల్: విధి నిర్వహణలో ప్రతి ఒక్క రూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. ఈ నెల 21న ఫ్లాగ్డే వారో త్సవాల్లో భాగంగా ఉట్నూర్లో పోలీస్ అమరవీరుడు ఆర్.శంకర్ స్మారక భవనంను అదనపు ఎస్పీ కాజల్సింగ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నా రు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, నార్నూర్ సీఐ ప్రభాకర్, అమరవీరుడు శంకర్ భార్య దూరిబాయ్, ఎస్సైలు సాయన్న, ప్రవీ ణ్, అఖిల్, సిబ్బంది పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
కైలాస్నగర్: వినియోగదారులకు నిరంతర నాణ్య మైన విద్యుత్ అందించాలని ఎన్పీడీసీఎల్ అపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో విద్యుత్శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో విద్యుత్ డిమాండ్, సరఫరా, ఇబ్బందులపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, 33కేవీ 11కేవీ లైన్స్లో పెట్రోలింగ్ నిర్వహించి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. అన్ని సర్వీసులను ట్రాన్స్ఫార్మర్ల మీద మ్యాపింగ్ చేయాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న, వంగిపోయిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉన్న లైన్స్ను గుర్తించి వెంటనే సరి చేయాలన్నారు. రోజువారీగా ఆ డేటాను యాప్లో నమోదు చేయాలన్నారు. ప్రతీ సెక్షన్ ఆఫీసర్ వారానికి ఒక గ్రామంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న అగ్రికల్చర్ సర్వీసులను వెంటనే రిలీజ్ చేయాలన్నా రు. సమావేశంలో ఆపరేషన్ సీఈ అశోక్, సీఈ కన్స్ట్రక్షన్ జే.ఆర్.చౌహాన్, సర్కిల్ పరిధిలోని డివిజనల్ ఇంజినీర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ డివి జనల్ ఇంజినీర్స్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఇంజినీర్స్, సబ్ ఇంజినీర్స్ తదితరులు పాల్గొన్నారు. -
అనైక్యతతోనే పార్టీ ఓటమి
కై లాస్నగర్: కాంగ్రెస్కు ప్రజల్లో ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, అయితే నాయకుల్లో అనైక్యతే పార్టీ ఓటమికి కారణమవుతుందని ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్ అన్నారు. పట్టణ శివారులోని గాయత్రి గార్డెన్లో జిల్లా అధ్యక్షుడి నియామక ప్రక్రియపై మంగళవారం అభిప్రాయ సేకరణ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లాలోని ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ, మండల నాయకులు హాజరయ్యా రు. వారందరి నుంచి వ్యక్తిగతంగా, లిఖితపూర్వకంగా అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు చేరువైందన్నారు. వారి మద్దతుతో రానున్న స్థానిక సంస్థల్లో పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరి నుంచి అభిప్రాయాలు సేకరించి అందరి ఆమోదం మేరకే జిల్లా అధ్యక్షుడిని నియమిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, సంఘటన్ శ్రుజన్ అభియాన్ సమన్వయ కర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాంభూపాల్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఏఐసీసీ మెంబర్ నరేశ్జాదవ్, ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీలు కంది శ్రీనివాస రెడ్డి, ఆడె గజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కదులుతున్న డొంక
కైలాస్నగర్: జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన భూ కబ్జా వ్యవహరంలో రియల్టర్లతో అంటకాగిన అవి నీతి అధికారుల బండారం బట్టబయలవుతోంది. బ్యాంకు తనఖాలో ఉన్న రూ.కోట్ల విలువైన భూమి ని కాజేసిన బడా రియల్టర్లతో ఇప్పటికే ఊచలు లెక్కపెట్టిస్తున్న పోలీసులు వారికి సహకరించిన అధికారులపైనా చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్ర స్తుతం పొరుగు జిల్లాలో పనిచేస్తున్న మండల సర్వేయర్ శివాజీపైన కేసు నమోదు చేసిన పోలీసులు, భూమాఫియాతో చేతులు కలిపిన రెవెన్యూ, సర్వేల్యాండ్స్ రికార్డ్స్ అధికారుల పాత్రపైనా లోతైన విచారణ జరుపుతున్నారు. వారిపైన కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. దీంతో అక్రమార్కుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అక్రమంగా సప్లిమెంటరీ సేత్వార్.. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ శివారు రణ దీవేనగర్లో గల సర్వేనంబర్ 65/బిలో 1.05 ఎకరాలు, 64/4లో గల 1.04 ఎకరాలు కలిపి 2.09 ఎకరాల భూమి ఆర్థిక నేరాల కేసులో ఈడీ ఆధీనంలో ఉంది. రూ.కోట్ల విలువైన భూమి కావడంతో బ డా రియల్టర్లు దానిపై కన్నేశారు. రెవెన్యూ అధి కారుల అండతో తప్పుడు పత్రాలు సృష్టించారు. దొడ్డిదారిన ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో 2023 ఆగస్టు 17న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్వేల్యాండ్ రికార్డ్స్లోనూ ఈ భూమి తమ పేరిటనే ఉందని తెలిపేలా పన్నాగం పన్నారు. 2024 నవంబర్లో అక్రమంగా సప్లిమెంటరీ సేత్వార్ను చేసుకున్నారు. దీనికి సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏడీ కూడా ఆమోదం తెలిపినట్లుగా పోలీసులు గుర్తించా రు. ఈ వ్యవహారంలో నాటి ఆదిలాబాద్ అర్బన్ మండల సర్వేయర్గా పనిచేసిన శివాజీ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆయనపై కేసు నమోదు చేశారు. విషయాన్ని ముందుగానే పసిగట్టిన సదరు అవినీతి అధికారి ప్రస్తుతం పరా రీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే అక్రమంగా చేసిన సేత్వార్, రిజిస్ట్రేషన్పై కలెక్టర్ రాజర్షి షాకు ఫిర్యాదు అందడంతో ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారుల పాత్రపై విచారణ.. ఈ మొత్తం వ్యవహారంలో పరారీలో ఉన్న మండల సర్వేయర్ ప్రధాన పాత్ర పోషించినట్లుగా స్పష్టమవుతుంది. ఇదే కాకుండా సర్వేయర్గా పనిచేసిన స మయంలో మావలలో ప్రతీ వెంచర్లోనూ ప్రభు త్వ, అసైన్డ్ ల్యాండ్స్ను రియల్టర్లు ఆక్రమించేలా స దరు అధికారి తనవంతు సహకారం అందించినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు అప్పటి రెవెన్యూ అధికారులు సైతం భూకబ్జాలు వారికి తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరించారని సమాచారం. ఇందుకు వారికి పెద్ద మొత్తంలోనే లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ అధికారుల బాగోతంపైనా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో భాగస్వాములైన రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డు అధికారులేవరనే దానిపైనా కలెక్టర్ రాజర్షి షా సైతం ఆరా తీస్తున్నారు. దీంతో బాధ్యులపై శాఖాపరంగానూ వేటు పడే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తప్పవు ఈడీ ఆధీనంలోని భూమిని కబ్జా చేసిన రియల్ వ్యాపారులను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించాం. ఈ అక్రమదందాలో వ్యాపారులకు సహకరించిన మండల సర్వేయర్ శివాజీపై కేసు నమోదు చేశాం. ఆయనతో పాటు రియల్టర్లకు సహకరించి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల పాత్రపైనా విచారణ జరుపుతున్నాం. బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. అక్రమార్కులందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తాం. – ఎల్.జీవన్రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్ -
బాధితులకు సత్వర న్యాయం అందాలి
కై లాస్నగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోని బాధితులకు సత్వర న్యాయం అందించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జిల్లా అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మాని టరింగ్ సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఎస్పీ అఖి ల్ మహాజన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి జిల్లాలో అట్రాసిటీ కేసుల నమోదు, వాటి పురోగతి, బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు, పెండింగ్ కేసులు వంటి అంశాలపై పోలీస్స్టేషన్లు, మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పుర్వాపరాలు పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. అలాగే బాధితులకు పరిహారం జమచేసేందుకు అవసరమైన బ్యాంకు ఖాతాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, సబ్కలెక్టర్ యువరాజ్, అదనపు ఎస్పీ కాజల్సింగ్, ట్రెయినీ కలెక్టర్ సలోని, డీఎస్సీడీవో సునీత కుమారి, ఆర్డీవో స్రవంతి, కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్కు సన్మానం.. నీతి ఆయోగ్ యూజ్ కేసు ఛాలెంజ్లో నాలుగు జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. సమావేశం అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఇందులో సభ్యులు ఆరెల్లి మల్లేశ్, మేస్రం జంగుబాపు, బాల శంకర్కృష్ణ, పంద్రం శ్యామల, తోట విజయ్, ఉషారాణి, లక్ష్మికాంత్ తదితరులున్నారు. -
మాలలను అణచివేసేందుకు కుట్ర
ఆదిలాబాద్టౌన్: తెలంగాణలోని రాజకీయ పార్టీ లు మాలలను అణచివేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాలల సామాజిక వర్గాన్ని కొందరు టార్గెట్ చేసినప్పటికీ మాల నాయకులు, ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదన్నారు. తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్గీకరణ విషయంలో మాట్లాడలేదని, అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేపట్టారని అన్నారు. హస్తం పార్టీ ఎస్సీ వర్గీకరణకు బీజం వేస్తే, ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా వర్గీకరణ చేపట్టారని తెలిపారు. అయితే తాము మాదిగ సోదరులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మాలల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉందన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చెప్పిన విధంగా సీఎం రేవంత్రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేపట్టారని తెలిపారు. వర్గీకరణతో వందలో నలుగురికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ జాబితాలో 1108 కులాలు ఉన్నాయని, వారందరికీ ఏవిధంగా ఫలాలు పంచుతారని ప్రశ్నించారు. ఆయన వెంట మాల మహానాడు నాయకులు బల్లెం లక్ష్మణ్, ప్రభాకర్రావు, బాలచౌరి, తదితరులున్నారు. -
డీఎస్వో వాజిద్ అలీ సరెండర్
కైలాస్నగర్: జిల్లా ఇన్చార్జి పౌరసరఫరాల అధికారిగా పనిచేస్తున్న వాజిద్ అలీపై సరెండర్ వేటు పడింది. ఆయనను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్కు సరెండర్ చేస్తూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, శాఖకు సంబంధించి నివేదికలు సకాలంలో అందించకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయినట్లుగా తెలిసింది. అయితే వారం రోజులుగా సెలవుపై ఉన్న డీఎస్వో జిల్లా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వారి అనుమతి తీసుకోకుండానే వెళ్లడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించా రు. క్రమశిక్షణరాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆయనను సరెండర్ చేశారు. కాగా రేషన్కార్డుల జారీ సమయంలో డీఎస్వో కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ డబ్బులు వసూలు చేసిన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో అప్పట్లోనే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ తీవ్రంగా మందలించారు. ఈ నేపథ్యంలో ఆయనను సరెండర్ చేయడంపై సివిల్ సప్లైతో పాటు అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఇన్చార్జి డీఎస్వోగా ఏఎస్వో నందినికి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమె సోమవారం కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాధ్యతలు చేపట్టారు. -
మందకొడిగా..
16 నుంచి దండారీ ఉత్సవాలు దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ గిరి జన గ్రామాల్లో నిర్వహించే దండారీ ఉత్సవా లు ఈనెల 16 నుంచి ప్రారంభమవుతాయని గ్రామ పటేళ్లు ప్రకటించారు. సాక్షి,ఆదిలాబాద్: ‘మీ పరిధిలోని ప్రతీ దుకాణానికి దరఖాస్తు ఫైల్ అయ్యే విధంగా చూడాలి.. ఈ సారి టెండర్ల సంఖ్యలో 10 శాతం వృద్ధి సాధించాలి.. ఏవిధంగా నైనా కొత్త దరఖాస్తుదారుని కనెక్ట్ చేసే పనిని వ్యక్తిగతంగా చేపట్టాలి.. ఆ వివరాలు ఈ సాయంత్రంలోగా పంపండి.. మిగిలిన రోజుల్లో లక్ష్యం సాధించే దిశగా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలి..’ ఇది రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ నుంచి సంబంధిత జిల్లా అధికారులకు సోమవారం అంతర్గతంగా వచ్చిన ఆదేశాలివి. వైన్స్ షాప్ టెండర్లకు సంబంధించి దరఖాస్తులు పెంచేందుకు ఎకై ్సజ్ అధికారులు అపసోపాలు ప డుతున్నారు. ప్రధానంగా ఈ ప్రక్రియ ప్రారంభమై 18 రోజులు గడిచినప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు మూడంకెల్లోనే దరఖాస్తులు రావడం గమనార్హం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. ఈనెల 18 వరకు దరఖాస్తుకు అవకాశం ఉండటం, మిగిలిన ఐదు రోజుల్లో అన్ని జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య పెంచడంపై ఫోకస్ చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ (డీసీ)తో పాటు జిల్లాల అధికారులైన డీపీఈవోలు టాస్క్గా తీసుకొని లక్ష్యం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాల్లోనే తిష్టవేసి దరఖాస్తుదారులను రప్పించేలా శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ చివరి రోజుల్లోనే దరఖాస్తులు అధికంగా వస్తాయని, గతంలో కూడా ఇదే విధంగా ప్రక్రియ కొనసాగిందని ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నప్పటికీ లోలోపల మాత్రం సంశయనం చెందుతున్నారు. పడరాని పాట్లు.. దరఖాస్తుల పెంపుపై ఎకై ్సజ్ అధికారులు అపసోపాలు పడుతున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను బయటకు తీసి ఈసారి చేసుకునేలా వారికి ఫోన్లు చేస్తున్నారు. అలాగే 2023–25లో ఆయా వైన్స్ల వారీగా ఎకై ్సజ్ ట్యాక్స్ కంటే ఎంత శాతం అధికంగా ఆయా షాపులు విక్రయాలు చేశాయనే లెక్కలతో వాట్సాప్ గ్రూప్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. తద్వారా డిమాండ్ షాపులకు అధిక దరఖాస్తులు వచ్చేలా అధికారులు ఫోకస్ పెంచారు. అంతేకాకుండా ఇతర దుకాణాలకు కూడా తప్పనిసరి దరఖాస్తులు వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెంచిన ఫీజుతోనేనా.. గతంలో దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు ఉండగా, కొత్త ఎకై ్సజ్ పాలసీలో దీనిని రూ.3లక్షలకు పెంచారు. ఈ ప్రభావమే దరఖాస్తులపై పడిందనే చర్చ సాగుతుంది. గతంలో కొత్త దరఖాస్తుదారులు ప్రధానంగా యువత కొంతమంది గ్రూప్గా కలిసి వైన్స్షాప్ పొందేందుకు దరఖాస్తులు అమితంగా చేసుకునేవారు. అయితే ఈసారి ఫీజు పెరగడంతో ఇలాంటి కొత్త దరఖాస్తుదారులు ఆలోచనలో పడ్డారని చెప్పుకుంటున్నారు. అయితే చివరి రోజుల్లో దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వస్తాయని ఎకై ్సజ్ అధికారులు పేర్కొంటున్నారు. మంచి రోజు, ఇతరత్రా చూసుకొని పలువురు దరఖాస్తు ప్రక్రియను పెండింగ్లో ఉంచారని, అలాంటి వారంతా ఈ మిగిలిన రోజుల్లో ముందుకొస్తారని అంటున్నారు. ఆదిలాబాద్లో దరఖాస్తులు స్వీకరించే కౌంటర్ వద్ద ఎకై ్సజ్ సిబ్బంది ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.గత, ప్రస్తుత పాలసీలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య (ఉమ్మడి జిల్లాలో) జిల్లా వైన్స్ షాపుల 2023లో 2025లో సంఖ్య వచ్చినవి ఇప్పటివరకు ఆసిఫాబాద్ 32 1020 99 మంచిర్యాల 73 2242 43 నిర్మల్ 47 1067 30 మొత్తం 192 5376 215చివరి రోజుల్లో అధికంగా.. గడువుకు సమీపిస్తున్న తరుణంలో ఈ మిగిలిన రోజుల్లోనే దరఖాస్తుదారులు ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ముహూర్తాలు చూసుకొని పలువురు దరఖాస్తు చేస్తున్నారు. – రఘురాం, డిప్యూటీ కమిషనర్, ఎకై ్సజ్ శాఖ, ఆదిలాబాద్ డివిజన్ -
బారులు తీరి.. బాధలు చెప్పి
కై లాస్నగర్: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్తో తా త్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని నోటిఫికేషన్ రద్దుతో సోమవారం పునఃప్రారంభించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు బా రులు తీరి సమస్యలపై ఏకరువు పెట్టారు. కలెక్టర్ రాజర్షి షా వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 121 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. అందులో కొందరి నివేదన వారి మాటల్లోనే... -
బుక్స్ కూడా ఇవ్వలేదు
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని మా కు రెండేళ్ల నుంచి యూని ఫాంతో పాటు కనీసం బుక్స్ కూడా ఇవ్వడం లేదు. వాటిని అడిగితే సార్లు మమ్మల్ని టార్గెట్ చేసి కొడుతున్నారు. అంతేకాకుండా సార్ చేనుకు తీసుకెళ్లి అక్కడ పని చేయిస్తున్నారు. దసరా తర్వాత పాఠశాలకు రానివ్వడం లేదు. – అనుదీప్, 7వ తరగతి, బీఏఎస్ విద్యార్థి స్కూల్కు రానివ్వట్లే.. టీసీ ఇవ్వట్లే నా కూతురు బెస్ట్ అవలేబు ల్ స్కూల్లో ఐదో తరగతి చదువుతుంది. ప్రభుత్వం ఆ బడికి ఫీజురీయింబర్స్ మెంట్ అందించడం లేదంటూ పిల్లలకు యూనిఫాం, బుక్స్ కూడా ఇవ్వడం లేదు. ఇటు పాఠశాలకు రాన్విడం లేదు. వేరే స్కూల్లో చేర్పిద్దామంటే కనీసం టీసీ కూడా ఇవ్వడం లేదు. ఇలా చేస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలి. – కే అరుణ, పేరెంట్ -
బెస్ట్ కాదు.. వరస్ట్!
కైలాస్నగర్/ఆదిలాబాద్రూరల్/ఉట్నూర్రూరల్: తమ పిల్లలను చదువుకు దూరం చేయవద్దని కోరు తూ జిల్లాలో బెస్ట్ అవలేబుల్ స్కూల్ (బీఏఎస్) వి ద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయం ఎదుట వే ర్వేరుగా ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీంచౌక్ చౌక్ నుంచి తమ పిల్లలతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. అనంతరం సమావేశ మందిరం వద్దకు చేరుకుని గంట పాటు నిరసనకు దిగారు. ప్రజావాణి అనంతరం వారి వద్దకు వచ్చిన కలెక్టర్కు తమ గోడును నివేదించారు. ప్రభుత్వం మూడేళ్లుగా బీఏఎస్ విద్యార్థుల ఫీజులు విడుదల చేయడం లేదన్నారు. దీంతో దసరా సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లలను ఆయా యాజమాన్యాలు బడిలోకి రానివ్వ డం లేదన్నారు. విద్యార్థులను ఆయా పాఠశాలలకు పంపించి చదువుకునే అవకాశం కల్పించాలని లే దంటే గురుకులాలు, మోడల్ స్కూల్స్లో అడ్మిషన్లు ఇవ్వాలని విన్నవించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా స్పందిస్తూ సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి పిల్లలను బడుల్లో కొనసాగించేలా చూస్తామన్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. అలాగే ఉట్నూర్లోని ఐటీడీఏ పీ వో కార్యాలయం ఎదుట గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. అక్కడికి చేరుకున్న పీవో ఖుష్బూ గుప్తా తల్లిదండ్రులతో మాట్లాడి సముదాయించారు. తగు చర్యలు తీసుకుంటామని పేర్కొనడంతో వారు ఆందోళన విరమించారు. -
నిర్వాసితులను ఆదుకోవాలి
భీంపూర్:పిప్పల్కోటి భూనిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ రాసినట్లు వెల్లడించారు. గ్రామ రైతులతో సోమవారం ఆయన సమావేశమై మాట్లాడారు. రిజర్వాయర్ కోసం దాదాపు 1200 ఎకరాల సాగు భూమిని రైతులు అందిస్తే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం అందించలేదన్నారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం ఎకరాకు రూ.18లక్షలు, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు తెలిపా రు. పార్టీ జిల్లా కార్యదర్శి కిరణ్, ఆశ న్న, రైతులు నసీరుద్దీన్ స్వామి పాల్గొన్నారు. -
‘ఉపాధి’ గ్రామ సభలకు వేళాయె
కై లాస్నగర్: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వంద రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టాల్సిన పనులు గుర్తించేందుకు గ్రామసభల నిర్వహణకు సన్నద్ధమైంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిర్వహించనున్నారు. ప్రజాభిష్టం మేరకే పనుల ఎంపిక.. ఉపాధి పనుల్లో ప్రజలు, రైతులను భాగస్వాముల ను చేయనున్నారు. వారు కోరిన పనులు కల్పించేలా ప్రభుత్వం ఏటా గ్రామసభలు నిర్వహిస్తోంది. ఈనెల 2నుంచి నిర్వహించాల్సి ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా చేపట్టలేదు. తాజాగా కోడ్ ఎత్తివేయడంతో జిల్లాలో రేపటి నుంచి షురూ కానున్నాయి. ఎంపీడీవోలు, ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు హాజరై రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి పనులు కల్పించాలనే దానిపై గ్రా మస్తులతో చర్చిస్తారు. గుర్తించిన పనులను కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు చదివి వినిపిస్తారు. తర్వాత ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు వాటికి సంబంధించిన అంచనాలు తయారు చేస్తారు. జాబ్కార్డుల ఆధారంగా పనులను నిర్ణయిస్తారు. పంచాయతీల వారీగా నివేదికలను మండల, జిల్లా పరిషత్లకు పంపించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వాటికి పాలకవర్గాలు లేనందున కలెక్టర్కు నివేదిస్తారు. కలెక్టర్ వాటిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదిస్తారు. అక్కడి నుంచి అనుమతి వచ్చాక జిల్లాలో ఆయా పనులు చేపట్టి కూలీలకు ఉపాధి కల్పిస్తారు. భూగర్భజలాల పెంపు, పండ్ల తోటల పనులకు ప్రాధాన్యం వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో ప్రధానంగా భూగర్భజలాలు పెంపొందించడంతో పాటు వ్యవసాయపరంగా రైతాంగానికి మేలు చేకూర్చే పనులకు ప్రాధాన్యతనివ్వాలని అధి కారులు నిర్ణయించారు. నీటి సంరక్షణకు సంబంధించి కుంటలు, చిన్నపాటి చెరువులు, స్టోన్ బండింగ్, గులకరాళ్ల ఏరివేత, పశువులు, మేకలు, గొర్రెల షెడ్ల నిర్మాణం, పండ్ల తోటల పెంపకం, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, నర్సరీల ఏర్పాటు రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు వీలుగా మట్టి రోడ్ల నిర్మాణం వంటి పనులను చేపట్టనున్నారు. వీటితో పాటు రైతులకు అదనపు ఆదాయం చేకూర్చేలా పండ్లతోటలు, ఈత వనాలను పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన మామిడి, కొబ్బరి, సీతాఫల్, జామా వంటి పండ్లతోటల పెంపకంతో పాటు నీలగిరి చెట్ల పెంపకానికి సంబంధించి అంచనాలను రూపొందించనున్నారు. వీటితో పాటు గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా వెదురు మొక్కల పెంపకం, అలాగే పాడి ఉత్పత్తి పెంచేలా పశువుల పాకల నిర్మాణాలకు సైతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వంద రోజులు పని కల్పించడమే లక్ష్యం వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2026–27)గాను ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై చర్చించి ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంది. సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించనున్నాం. ప్రజలకు అవగాహన కల్పించి ఎలాటి పనులు చేపట్టాలనే దానిపై వారి అభిప్రాయాలు తీసుకుంటాం. వాటి ఆధారంగా ప్రతీ కూలీకి వంద రోజుల పాటు పని కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తాం. – కుటుంబరావు, అదనపు డీఆర్డీవో -
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్
మందమర్రిరూరల్: గంజాయి రవాణా చేస్తున్న ము గ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మందమర్రి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై రాజశేఖర్ వివరాలు వెల్లడించారు. కాగజ్నగర్ నుంచి గంజాయి తీసుకువస్తున్నారనే సమాచారంతో జాతీయ రహదారి టోల్గోట్ వద్ద తనిఖీ చేపట్టారు. స్కూటీపై వచ్చిన ముగ్గురిని తనిఖీ చేయగా 100 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని స్కూటీతోపాటు వేల్పుల వర్శిత్ (పొన్నారం), వేల్పుల రాహుల్ (ఆదిల్పేట్), మణిదీప్ (నస్పూర్)ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రైతుల స్వయం సమృద్ధికి కేంద్రం కృషి
బతుకమ్మ సంబురంబతుకమ్మతో చిన్నారి జిల్లాలో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. తాంసి, తలమడుగు మండలాల్లో శనివారం పూల వేడుకలు అంబరా న్నంటాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను గద్దెల వద్ద ఉంచి ఉయ్యాల పాటల నడుమ ఆడబిడ్డలు చప్పట్లతో సందడి చేశారు. అనంతరం డప్పుచప్పుళ్ల నడుమ ఊరేగింపుగా బయలుదేరి పోయిరా బతుకమ్మ అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు. పూల సింగిడిని సమీపంలోని చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేశారు. తాంసి, హస్నాపూర్, పొన్నారి గ్రామాల్లో వీడీసీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. తాంసిలోని హనుమాన్ ఆలయం వద్ద మహిళలు సామూహికంగా ఆడి అలరించారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల, దేవాపూర్లో నిర్వహించిన వేడుకల్లో ఆడబిడ్డలు భారీగా పాల్గొన్నారు. – తాంసి/తలమడుగు సాక్షి,ఆదిలాబాద్: కాంగ్రెస్లో మళ్లీ డీసీసీ అధ్యక్షుడి నియామక వేడి మొదలైంది. ఏఐసీసీ నుంచి పరిశీలకుడు రానున్నారు. నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. పీసీసీ ముఖ్య నేతలు ఆయనతో సమన్వయం చేయనున్నారు. నేడో, రేపో వారు జిల్లాకు రానున్నట్లు చెబుతున్నారు. గతంలో కూడా అనేక సార్లు డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో పార్టీలో ప్రక్రియ జరిగినప్పటికీ ముందడుగు పడకపోవడం గమనార్హం. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ నుంచి పరిశీలకుడి రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాలో.. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ఏఐసీసీ నుంచి 22 మందితో పరిశీలకులను నియమించారు. వారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో సర్వేకోసం ఇప్పటికే పరిశీలకులు వచ్చేశారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సర్వే కోసం ఏఐసీసీ నుంచి మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే అజయ్సింగ్ను నియమించారు. ఆయనతో పాటు పీసీసీ నుంచి రాజ్యసభ ఎంపీ అనిల్కుమార్ యాదవ్, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, ప్రధాన కార్యదర్శులు గడ్డం చంద్రశేఖర్రెడ్డి, సీహెచ్.రాంభూపాల్ కోఆర్డినేషన్ చేయనున్నారు. కాగా ఈ రెండు జిల్లాల్లో వారు బ్లాక్స్థాయిలో కార్యకర్తలతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. అంతే కాకుండా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఐదు రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ప్రస్తుతం ప్రక్రియ గట్టిగానే సాగుతుందనే చర్చ వినిపిస్తోంది. ఆసక్తికరం.. కాంగ్రెస్లో ఏఐసీసీ నుంచి నేరుగా పరిశీలకులు రావడం, డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించనుండటంతో పార్టీలో ఇది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి వారి అభిప్రాయం సేకరించనుండటంతో ఇప్పుడు ఆశావహుల్లో టెన్షన్ కనిపిస్తోంది. కేవలం కార్యకర్తల నుంచే కాకుండా వ్యాపారులు, వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులను కూడా కలిసి అభిప్రాయ సేకరణ చేయనున్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో ఆశావహులు ఎవరినైనా మేనేజ్ చేసి తమ పేరును పరిశీలకుడి ముందు గట్టిగా చెప్పించాలనుకునే ప్రయత్నాలకు ఎక్కడ కూడా అవకాశాలు ఉండకపోవచ్చని చెప్పుకుంటున్నారు. ప్రధానంగా ఈ కమిటీలకు పార్టీలో ముందుగానే శిక్షణ ఇచ్చి అభిప్రాయ సేకరణ ఏ విధంగా చేపట్టాలని పార్టీ దిశానిర్దేశం చేసిందని పేర్కొంటున్నారు. దీంతోనే ఈ ప్రక్రియపై ఇప్పుడు పార్టీలో అందరి దృష్టి నెలకొంది. జిల్లా పరిశీలకుడిగా రానున్న అజయ్ సింగ్ ఆదిలాబాద్టౌన్: రైతులు స్వయం సమృద్ధి సాధించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఎంపీ గోడం నగేశ్ అన్నా రు. రూ.42 వేల కోట్లతో దేశ వ్యాప్తంగా చేపట్టిన ధన్ధాన్య పథకాన్ని ప్రధాని శనివారం వర్చువల్గా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆలకించిన అనంతరం ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాల విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. దేశంలోని రైతులు స్వయం సమృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం ధన్ ధాన్య పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. సాంకేతికత ఉపయోగిస్తూ రైతులు తమ పంట దిగుబడులను ఎగుమతి చేసేలా తయారు చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేవీకే ప్రొగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.రాంగోపాల్వర్మ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్స్వామి, మార్కెటింగ్ అధికారి గజానంద్, ఉద్యాన అధికారి నర్సయ్య, కేవీకే శాస్త్రవేత్తలు రఘువీర్, సురేష్,శివచరణ్ తదితరులు పాల్గొన్నారు.దరఖాస్తుకు సిద్ధమవుతున్న ఆశావహులు.. ప్రధానంగా ఇది వరకే పీసీసీ దృష్టిలో ఉన్న జా బితాలోని పేర్ల ఆధారంగా ఏఐసీసీ పరిశీలకులు క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నారని చెబు తున్నారు. పదవీ ఆశిస్తున్న నేతలు కూడా పరి శీలకులకు దరఖాస్తులను అందించేందుకు సిద్ధ మవుతున్నారు.ప్రధానంగా ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవిని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గోక గణేశ్ రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు నరేష్ జాదవ్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్ ఆశిస్తున్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతుంది. తనకు అవకాశం ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొ జ్జు కూడా దరఖాస్తు అందించేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ ఎంపీ సోయం బాపూరావు కూడా డీసీసీ అధ్యక్ష పదవీని ఆశిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పీఠం కోసం కార్యకర్తలు ఎవరి పేరును సూచిస్తారనేది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. -
గురుకులాలపై ఫోకస్
ఆదిలాబాద్టౌన్: సాంఘిక సంక్షేమ గురుకులాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతుంది. గురుకులాల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి పది జి ల్లాలకు పది మంది ప్రత్యేకాధికారులను నియమించారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ పీఎస్ఆర్.శర్మ నియమితులయ్యారు. రెండు రోజు ల క్రితం జిల్లాకు వచ్చిన ఆయన ఉమ్మడి జిల్లా పరి ధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల ప్రి న్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్, విద్యార్థుల రక్షణపరంగా చర్యలతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించడం, పెండింగ్ అద్దెబిల్లులు వంటి సమస్యల పరిష్కారం కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. జిల్లాలో.. జిల్లాలో నాలుగు సాంఘిక సంక్షేమ గురుకుల వి ద్యాసంస్థలున్నాయి. పట్టణంలో బాలికల పాఠశా ల, జూనియర్ కళాశాల అలాగే బాలికల డిగ్రీ కళా శాల, ఇచ్చోడలో బాలుర కళాశాల, బోథ్లో బాలిక ల డిగ్రీ కళాశాల ఉంది. ఒక్కో పాఠశాల/కళాశాలలో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ కళాశాలలో 480 మంది చదువుతున్నారు. జిల్లాలో మొత్తం 2,400 మంది విద్యార్థులున్నారు. సమస్యల పరిష్కారంపై దృష్టి ఇటీవల గురుకుల సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ఆదిత్య సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన బో ర్డులో పలు సంస్కరణలు తీసుకువచ్చారు. తాజా గా గురుకులాలపై ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది మే నుంచి అద్దె భవనాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో యజమానులు భవనాలను ఖాళీ చేయాలని ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దృష్టి సారించిన ఆయన కళాశాలల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 50మంది వరకు పార్ట్ టైం టీచర్లు, లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. అలాగే 30 మంది సిబ్బంది ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా వీరికి వేతనాలు రావడం లేదు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని సదరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం.. గురుకుల కళాశాలల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఫోకస్ పెట్టా రు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త మెనూ ప్ర కారం విద్యార్థులకు పౌష్టికాహరంతో కూడిన నాణ్య మైన భోజనం అందించే దిశగానూ దృష్టి సారిస్తున్నారు. ఈ విషయమై గురుకులాల జోనల్ అధికారి అరుణ కుమారిని సంప్రదించగా.. ఇటీవల మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఉమ్మడి జిల్లా ప్రిన్సి పాళ్లతో ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి సమావేశం నిర్వహించారని తెలిపారు. పలు అంశాలపై వివరాలు సేకరించినట్లు పేర్కొన్నారు. అలాగే సమస్యలపై ఆరా తీసినట్లుగా వివరించారు. -
ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు
బీసీ రిజర్వేషన్లపై కోర్టుల్లో కేసులు వేసి బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. సుధీర్ఘ పోరాటం తరువాత ప్రభుత్వం 42 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తే అడ్డుకో వడం సరికాదు. బీసీలకు పదవులు వస్తుంటే ఓ ర్వలేకపోతున్నారు. రాజకీయంగా అణిచివేసేందుకే ఇదంతా చేస్తున్నారు. మాకు రావాల్సిన వాటా దక్కే వరకు ఉద్యమిస్తాం. – కరిపే శ్రీనివాస్, వంజరి సంఘం అధ్యక్షుడు, బోథ్బీసీలు నష్టపోతున్నారు 23 శాతం రిజర్వేషన్తో బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం 42 శాతం పెంచితే ఆనందపడ్డాం. జనాభాకు తగ్గట్టు ఫలాలు అందుతాయని ఆశపడ్డాం. కానీ కొందరు కోర్టులో కేసు వేసి మా నోటికాడ ముద్ద లాక్కున్నారు. జనాభా ప్రాతిపదికన మా వాటా మాకు దక్కాల్సిందే. – కలాల శ్రీనివాస్, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
4 కి.మీ కాలినడకన వెళ్లి.. వైద్యం అందించి
ఆదిలాబాద్రూరల్: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన మంగ్లీ వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. మండల వైద్యాధికారి సర్ఫరాజ్, సిబ్బంది 4 కి.మీ కాలినడకన వెళ్లి శనివారం గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యపరీక్షలు చేసి మాత్రలు అందజేశారు. పిల్లలకు ఇమ్యూనైజేషన్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సర్ఫరాజ్ మాట్లాడుతూ గ్రామంలో 11 ఇళ్లు ఉండగా, 64 మంది జనాభా ఉన్నారని పేర్కొన్నారు. అనారోగ్యం బారినపడితే వెంటనే పీహెచ్సీకి, రిమ్స్కు వెళ్లి చికిత్స చేసుకోవాలన్నారు. అంకోలి పీహెచ్సీ హెల్త్ సూపర్ వైజర్ బొమ్మేత సుభాష్, హెల్త్ అసిస్టెంట్స్ వేణుతాయి, పవర్ ప్రేమ్సింగ్, రాథోడ్ నారాయణ, ఆశకార్యకర్తలు సుమిత్ర, రుక్మిణి, దుర్పత బాయి, గ్రామస్తులు ఉన్నారు. -
ఇంట్లో చోరీ
జైనథ్: మండలంలోని దీపాయిగూ డ గ్రా మంలో దు ర్ల రాజలింగు ఇంట్లో గుర్తుతెలి యని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సమీప బంధువులు చనిపోవడతో రాజలింగు కుటుంబంతో కలిసి మూడురో జుల క్రితం ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ ్యక్తులు ఇంటికి ఉన్న కిటికీలోంచి లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపులు పగులగొట్టి మూ డు తులాల బంగారం, 25 వేల నగదును ఎత్తుకెళ్లారు. శనివారం స్థానికులు గమనించారు. వెంటనే అందించిన సమాచారంతో ఎస్సై గౌతమ్ పవర్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. డాగ్స్క్వాడ్ బృందంతో తనిఖీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణం చెందారు. బావిలో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మద్యానికి బానిసైన యువకుడు, వెన్నునొప్పితో బాధ పడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకున్నారు. బావిలో దూకి ఒకరు.. లక్సెట్టిపేట: బావిలో దూకి ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామానికి చెందిన సౌటేపల్లి మౌళి (32), సంజన దంపతులు. వీరికి పది నెలల కుమారుడు ఉన్నాడు. మౌళి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం ఉదయం వాకింగ్కు వెళ్తున్నానని భార్యతో చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు వెతకుతుండగా లక్సెట్టిపేట మండలం దౌడపల్లి శివారులోని వ్యవసాయ బావి ఒడ్డున చెప్పులు, సెల్ఫోన్ కనిపించాయి. బావిలో గాలించగా మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని రెండో ఎస్సై రామయ్య పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడవచ్చని తండ్రి లచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని యువకుడు.. ఆదిలాబాద్టౌన్: మద్యానికి బానిసైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ సీఐ కె.నాగరాజు కథనం ప్రకారం..పట్టణంలోని తాటిగూడకు చెందిన కుమ్ర రుషికేష్ (24) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. తండ్రి ప్రభు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీవితంపై విరక్తితో వ్యక్తి..నర్సాపూర్(జి): వెన్నునొప్పితో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహ త్య చేసుకున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆయన కథనం ప్ర కారం.. మండల కేంద్రానికి చెందిన బొల్లి నర్సయ్య (45), లక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నర్సయ్య రెండేళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన నయంకాలేదు. ఈక్రమంలో జీవి తంపై విరక్తితో శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ ఆట భిన్నమైనది
సెపక్తక్రా ఆట భిన్నమైనది. కేవలం కాళ్ల సహాయంతోనే ఆడాల్సి ఉంటుంది. నాలుగేళ్ల నుంచి ఆడుతున్నా. ఒకసారి నేషనల్స్కు సెలెక్ట్ అయ్యాను. ఇప్పటి వరకు మూడుసార్లు స్టేట్మీట్లో ఆడితే ఒకసారి గోల్డ్మెడల్ సాధించాను. – నిఖిల్, వరంగల్ బంగారు పతకం సాధిస్తా మూడేళ్లుగా సెపక్తక్రా ఆడుతున్నా. ఒకసారి నేషనల్స్లో, రెండు సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండు సిల్వర్ మెడల్స్ సాధించాను. ఈసారి బంగారు పతకం సాధిస్తాను. – ఆర్.విష్ణువర్థన్, మహబూబ్నగర్ గతేడాది నుంచే ఆడుతున్నా గతేడాది నుంచే సెపక్తక్రా మొదలుపెట్టాను. కోచ్, క్రీడాకారుల ప్రో త్సాహం ఇస్తున్నారు. గ తంలో నేషనల్ పోటీల్లో పాల్గొన్నా ప్లేస్ రా లేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడోస్థానం సాధించాను. ఈసారి ఫస్ట్ ప్లేస్ కోసం ప్రయత్నిస్తున్నా. – సింగసాని అశ్విత, కరీంనగర్ -
బహుదూరపు బాటసారులు
లోకేశ్వరం: మండలంలోని రాజూర, వట్టోలి, ధర్మోర, కన్కపూర్ గ్రామాల గొర్రెల కాపరులు బహుదూరపు బాటసారులు. ఏడాదిలో మూడు నెలలు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గొర్రెల మందతోపాటు మేత కోసం తిరుగుతూనే ఉంటారు. నిర్మల్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అనుకుని ఉండటంతో ఇక్కడి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎస్సారెస్పీ నిండనంత వరకు వెనుకభాగం పశుగ్రాసం లభిస్తుండటంతో రోజూ ఉదయం, సాయంత్రం వరకు జీవా లను మేపుతుంటారు. ఏటా జూలై, ఆగస్టులో ఎస్సారెస్పీ నిండుకుండలా మారుతుంది. వెనుకభాగం నీటితో నిండి ఉంటుంది. దీంతో జీవా లకు గ్రాసం దొరకక వలస వెళ్లాల్సిన పరిస్థితి. వీరంతా మళ్లీ వరి నూర్పిడి పూర్తయ్యే వరకు దాదాపు మూడునెలలు ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలోని గుట్టలపై, నిజామాబాద్ జిల్లాలోని బా డ్సీ ప్రాంతాలకు వెళ్తారు. మండలాలకు చెందిన గొర్రెల కాపరులు బృందాలుగా ఏర్పడి మందలతో బయల్దేరుతారు. అడవిలో ఉంటూ వాటిని మేపుతూ అక్కడే వంట, భోజనాలు చేస్తారు. రాత్రి మందల వద్దే నిద్రిస్తారు. వంట సామగ్రి కోసం అక్కడి నుంచి కొందరు రావడమో, లేదంటే ఇక్కడి నుంచి వెళ్లేవారు వెంట తీసుకెళ్తారు. తరచూ ప్రమాదాలు సుదూర ప్రయాణం రోడ్డు మార్గంలో సాగడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాలు ఢీకొని జీవాలు చనిపోతున్నాయి. ఇన్సూరెన్సు లేకపోవడంతో కాపరులు నష్టపోతున్నారు. ఇప్పటికై న పశుసంవర్థక శాఖ అధికారులు పట్టించుకుని జీవాలకు ఇన్సురెన్సు చేసేలా చర్యలు తీసుకోవాలి.పొలాల్లో గ్రాసం పెంచుకోవాలి జీవాలు, పశువుల యజమానులు వారి పంట పొలాల్లో గ్రాసం పెంచుకోవాలి. జీవాలు, పశువులకు ఇన్సురెన్సును చేయించుకోవాలి. గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయిస్తున్నాం. పశువైద్యుల సూచనలు పాటించాలి. – రాజేశ్వర్, నిర్మల్ పశుసంవర్థక శాఖ డెప్యూటీౖ డెరెక్టర్ఇదే వృత్తిని నమ్ముకున్నాం ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఏడాదిలో మూడు నెలలు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నాం. ఒక్కో మందకు నలుగురు కాపలాగా ఉంటారు. గుట్ట ప్రాంతంలో జీవాలను మేపుతూ తిరుగుతాం. గొర్రెల కాపరులను ప్రభుత్వం పట్టించుకోవాలి. – బరిడే పోతన్న, రాజూర మేత దొరకక దూరప్రాంతాలకు ఎస్సారెస్పీ నిండితే జీవాలకు మేత దొరకడం కష్టమవుతుంది. మేత కోసం దూరప్రాంతాలకు జీవాలతో వెళ్తుంటాం. వంట సామగ్రి తీసుకెళ్తాం. అటవీప్రాంతాల్లో జీవాలను మేపుతున్నాం. – గీజాగంగాధర్, ధర్మోరపొలాల్లోనే నిద్రమండలంలోని రాజూర గ్రామానికి చెందిన 20 మంది కాపరులు, వట్టోలిలోని 10 కురుమ యాదవ, కుటుంబాల వారు మూడు నెలలు ఇంటికి దూరంగా ఉంటున్నారు. వందలాది కిలోమీటర్లు తిరుగుతూ ఎక్కడ చీకటిపడితే అక్కడే పొలాల్లో నిద్రిస్తున్నారు. సరైన భోజనం, నీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి జీవాలకు సైతం తాగునీరు లభించని పరిస్థితి. వాగులు, వంకలు అందుబాటులో ఉంటేనే నీరు తాగిస్తున్నారు. తమ గ్రామాల్లో మేత దొరకగానే తిరుగుపయనమతారు.జీవాలు సంఖ్య గొర్రెలు 3.50 లక్షలు మేకలు 1.25 లక్షలు నిర్మల్ జిల్లాలో.. వారంతా తమ కులవృత్తి అయిన గొర్రెల పెంపకాన్ని నమ్ముకొని జీవనం సాగించే యాదవులు. ఉన్న ఊరిలో జీవాలకు గ్రాసం దొరకకపోవడంతో పెంపకందారులు బృందంగా ఏర్పడి ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఏడాదిలో మూడు నెలలు అడవిలో ఉంటూ వండుకొని తింటారు. తమ జీవనోపాధితోపాటు జీవాల మేత కోసం వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న బాటసారులపై ప్రత్యేక కథనం. -
క్రీడా సంబురం
రెబ్బెన: క్రీడా సంబురం మొదలైంది. రెండు రోజు ల పాటు జరిగే 11వ రాష్ట్రస్థాయి జూనియర్స్, సబ్ జూనియర్స్ సెపక్తక్రా పోటీలకు మండలంలోని గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం వేదికై ంది. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లా ల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, కోచ్లు, క్రీడాఽభిమానులతో మైదానం కోలాహలంగా మారింది. శనివారం ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్రెడ్డి క్రీడా పతకాలను ఆవిష్కరించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆపై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. సుమారు 200 మంది క్రీడాకారులు, 50 మంది కోచ్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు గోలేటి ప్రాంతం పుట్టినిల్లులాంటిదని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పోటీల్లో రాణిస్తూ మంచి గుర్తింపు పొందారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలను గోలేటిలో నిర్వహించడం అభినందనీయమన్నారు. సెపక్తక్రా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ప్లేస్ సాధిస్తాం సొంత జిల్లాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఫస్ట్ప్లేస్ సాధిస్తామనే నమ్మకం ఉంది. దానికి తగినట్లుగా ఆటతీరును ప్రదర్శిస్తాం. ఇప్పటి వరకు మూడు సార్లు స్టేట్ మీట్ను ఆడాను. త్వరలో గోవాలో జరగబోయే నేషనల్స్ పోటీల్లో పాల్గొనబోతున్నా. – అభినయ రమ్యశ్రీ, ఆదిలాబాద్ సెపక్తక్రా అంటే ఇష్టం నాకు సెపక్తక్రా అంటే ఎంతో ఇష్టం. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నా. 8వ తరగతి నుంచి ఆడటం నేర్చుకున్నా. ఆటపై ఉన్న ఇష్టంతో పోటీల్లో రాణిస్తున్నా. రాష్ట్రస్థాయి పోటీల్లో నాలుగు బంగారు, ఒకసారి వెండి పతకం సాధించాను. – పి.అభినవ్ రాణా, రంగారెడ్డి ఆత్మవిశ్వాసంతో ఆడుతాం జిల్లా జట్టు క్రీడాకారులు ఆత్మ విశ్వాసంతో పోటీల్లో దిగుతున్నాం. ఇప్పటి వరకు ఒకసారి నేషనల్స్, మూడుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఒకసారి మూడోస్థానంలో సాధించాను. ఈసారి బంగారు పతకం సాధిస్తాను. – కె.రాంచరణ్, ఆదిలాబాద్ -
జిల్లాకు చేరిన భారత్ అన్యుశుద్ధి యాత్ర
కై లాస్నగర్: దేశంలోని ప్రతి వ్యక్తికి శుద్ధమైన ఆహారం అందాలనే ఉద్దేశంతో గౌరవ్ త్యాగి అనే యువకుడు చేపట్టిన భారత్ అన్యుశుద్ధి యాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరింది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని హపూర్ జిల్లా హైదర్పూర్కు చెందిన త్యాగి జూన్ 26న శ్రీనగర్లోని లాలౌచౌక్ నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారు. బాల్య స్నేహితులు రాజత్ భారతి, రియాజ్తో కలిసి ప్రతీరోజుకు 25 నుంచి 30 కి.మీ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేసిన ఆయన మహారాష్ట్ర మీదుగా జిల్లాకు చేరుకున్నారు. పాఠశాల విద్యార్థులు, గృహిణిలు, రైతులను కలుస్తూ ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఇప్పటివరకు 50 వేల మంది చిన్నారులను కలిసి జంక్ఫుడ్ తినొద్దని ప్రతిజ్ఞచేయించినట్లు తెలిపారు. పోకిరీలకు కౌన్సెలింగ్మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల వద్ద షీటీమ్ పోలీసులు మఫ్టీలో ఉండి డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద, మినీ బస్టాండ్ వద్ద శనివారం నలుగురు పోకిరీ యువకులను అ దుపులో తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. షీ టీమ్ ఎస్సై ఉషారాణి, పోలీసులు శ్రావణ్కుమార్, శ్రీలత, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం షాపుల్లో చోరీ కేసు ఛేదింపు
భైంసాటౌన్:ముధోల్, తానూరులోని మద్యం షాపుల్లో మందు బాటిళ్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో శనివారం అదనపు ఎస్పీ అవినాష్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బిలోలికి చెందిన యాపరి వినోద్ గ్రామంలో బెల్టుషాపు నిర్వహిస్తున్నాడు. తన బెల్టుదుకాణంలో మ ద్యం విక్రయం కోసం వైన్స్ షాపుల్లో దొంగతనాలను ఎంచుకున్నాడు. ఇందుకు తన సొంత జిల్లాలో చోరీ చేస్తే దొరికిపోతానని, నిర్మల్ జిల్లాపై ఫోకస్ చేశాడు. తన బెల్టుదుకాణం వద్ద మద్యం తాగేందుకు రెగ్యులర్గా వచ్చే బేగరి రోహిత్, నీరడి శ్రావణ్కుమార్, ఖదులూరి సాయి, ఆదిత్యగౌడ్, సట్ల నవీన్, దిలీప్తో జట్టు కట్టాడు. గత మే నెలలో ముధోల్లోని రాజరాజేశ్వర వైన్స్ షాపు వెనుక రేకులు తొలగించి మందు బాటిళ్లు చోరీకి పాల్పడ్డాడు. తానూరులోని శ్రీ లక్ష్మి వైన్స్షాపులోనూ అదే తరహాలో చోరీ చేశాడు. ఇలా చోరీ చేసిన మందు బాటిళ్లను తన బెల్టుదుకాణంలో విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఇటీవల మరోమారు అదే తరహాలో చోరీ కోసం ముధోల్కు రాగా, అనుమానించిన పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. ముధోల్లో రూ.2.50 లక్షలు, తానూరులోని వైన్స్ షాప్ల్లో రూ.80 వేల మద్యం బాటిళ్లను చోరీ చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. నిందితుడి బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో ముధోల్ సీఐ మల్లేశ్, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
క్రీడలతో ఒత్తిడి దూరం
నిర్మల్టౌన్: అటవీ ఉద్యోగుల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు క్రీడలు నిర్వహిస్తున్నామని రాష్ట్రఅటవీశాఖ చీఫ్ కమిషనర్ జి.చంద్రశేఖర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, వాకింగ్, చెస్, లాంగ్ జంప్, షాట్ఫుట్, క్యారమ్, జాలిన్ త్రో, తదితర క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ ఉద్యోగులకు మానసికోల్లాసం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం కోసం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన సుమారు 350 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం వరకు పోటీలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ డీఎఫ్ఓలు వికాస్ మీనా, రేవంత్ చంద్ర, నాగిని భాను, అధికారులు కుమారి చిన్న, సుధాకర్, శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
రియల్ ఎస్టేట్ ముఠా భారీ కుంభకోణం
ఆదిలాబాద్టౌన్: ఈడీ, బ్యాంక్ అధీనంలోని రూ.కోట్ల విలువైన భూములను నకిలీ పత్రాలతో కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ ముఠా బండారం బయటపడింది. ఇందులో ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసి 14రోజుల పాటు రిమాండ్కు తరలించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి ఆదివారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కోర్టు ద్వారా నియమించబడిన అధికారి దుమ్మటి సూర్య రామకృష్ణ సాయిబాబా భూముల కబ్జాకు సంబంధించి ఈనెల 10న ఆది లాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం.. మనోజ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి సర్వే నంబర్ 65/బీ, 65/4లోని 2.09 ఎకరాలను జీఎస్ ఆయిల్మిల్స్ పేరుతో ఎస్ బీఐలో మార్టిగేజ్ చేసి రుణం తీసుకున్నారు. 2012 లో అదే వ్యక్తి 65/4/1 సర్వే నంబర్లోని భూమిని నలుగురికి విక్రయించగా, ఆ తర్వాత 2013లో అదే భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. జీపీఏ ఆధారంగా పూనమ్ వ్యాస్కు, తర్వాత ఆమె అనుపమ వ్యా స్కు అమ్మినట్లు తేలింది. అలాగే 2023లో రమేశ్శర్మ, అతని కుమారుడు రాకేశ్శర్మ, ఇబ్రహీం మ హ్మద్ అలియాస్ మామ్లా సేట్ తదితరులు నకిలీ ప త్రాలు సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో రిజి స్ట్రేషన్ చేయించుకున్నారు. సర్వే అధికారుల సహకారంతో సప్లిమెంటరీ సేత్వార్ పొందారు. 2024 నవంబర్ 18న నిందితులు జేసీబీలు, టిప్పర్లతో మొరం పోసి చదును చేసి ఆక్రమించారు. అప్పటికే ఆ స్థలం ఈడీ అధీనంలో ఉంది. అక్కడ రిటైర్డ్ ఎస్సై రాములు భద్రత సిబ్బందిగా ఉన్నారు. రాములు అడ్డుకునేందుకు ప్రయత్నించగా నిందితులు అతడిని చంపేస్తామని బెదిరించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రూరల్ సీఐ కె.ఫణీదర్ చర్యలు చేపట్టారు. నిందితులు వీరే.. ఈ కేసులో హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రమేశ్శర్మ, భుక్తాపూర్కు చెందిన ఇబ్రహీం మహ్మద్ అలియాస్ మామ్లా సేట్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరితో పాటు నిందితులు యతేంద్రనాథ్, హితేంద్రనాథ్, రాకేశ్శర్మ, మనోజ్కుమార్ అగర్వాల్, పూనమ్ వ్యాస్, అనుపమ వ్యాస్, సర్వేయర్ శివాజీపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నకిలీ పత్రాలతో భూ ఆక్రమణ రమేశ్శర్మ సర్వే నంబర్ 65/ఋ/1 పేరుతో నకిలీ సేత్వార్ సృష్టించి ఈడీ అధీనంలోని భూమి స్వాధీ నం చేసుకున్నాడు. కలెక్టర్ విచారణలో ఈ కుంభకో ణం వెలుగులోకి రాగా రిజిస్ట్రేషన్లు, సేత్వార్లు ర ద్దు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ ఆధారాలతో రూ రల్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితులు రమేశ్శర్మ, ఇబ్రహీం మహ్మద్ను ఆదివారం అరె స్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో సర్వే అధికారుల సహకారం, సేత్వార్ జారీ ప్ర క్రియపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు డీఎస్పీ వివరించారు. -
దండారీ ఉత్సవాలకు సన్నద్ధం
దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ నెల 14నుంచి ప్రారంభమ య్యే దండారీ ఉత్సవాల నిర్వహణకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. గు స్సాడీ వేషధారణ కోసం నెమలి ఈకల టోపీలు, సంప్రదాయ వాయిద్యాలపై పర, వెట్టే, గుమ్మేల, డప్పుల తయారీలో నిమగ్నమయ్యారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కు చెందిన మెస్రం జంగు, పెందోర్ దేవ్రావ్, దుర్వగూడకు చెందిన పుసం యేశ్వంత్రావ్, దుర్వ గంగారాం గుస్సాడీ టీపీలు, డప్పులు తయారు చేయడంతో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. కాగా, వీటి తయారీతో తమకు ఉపాధి దొరుకుతుందని వారు తెలిపారు. – ఇంద్రవెల్లి ఉపాధ్యాయుల లెర్నింగ్ టూర్!నిర్మల్ఖిల్లా: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ ఈ.నవీన్ నికోలస్ ఉపాధ్యాయుల విదేశీ టూర్కు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు రెండురోజుల క్రితం జారీ చేశా రు. నవంబర్లో ఒక్కో బృందానికి 40మంది చొ ప్పున నాలుగు బృందాల్లో 160 మంది ఐదు రోజు లపాటు సింగపూర్, వియత్నాం, జపాన్, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. అక్కడి పాఠశాలల బోధన విధానం, విద్యార్థి–ఉపాధ్యాయ సంబంధాలు, సాంకేతిక వినియోగం వంటి అంశాలను అధ్యయనం చేసి తిరిగి వచ్చాక రాష్ట్రంలో అమలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది.. ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీంఆసిఫాబాద్, మంచిర్యాల నుంచి ముగ్గురి చొప్పున మొత్తం 12మంది విదేశీ పర్యటనలో భాగం కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 2,855 ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలలు ఉండగా దాదాపు 12వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఎంపికై న ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి బృందంలో ఆయా దేశాల్లో పర్యటించి అక్కడి బోధన విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఎంపిక ప్రక్రియ ఇలా.. బోధన రంగంలో కనీసం పదేళ్ల అనుభవం, 55 ఏళ్ల లోపు వయస్సు, పాస్పోర్టు కలిగి ఉన్నవారు ఈ పర్యటనకు అర్హులు. కలెక్టర్ చైర్మన్గా అదనపు కలెక్టర్, డీఈవో, జిల్లాస్థాయి సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ జిల్లాకు ముగ్గురు చొప్పున ఉత్తమ టీచర్ల పేర్లను ఎంపిక చేయనుంది. ఇందుకుగానూ మూడేళ్లలో వారి పనితీరు పరిశీలిస్తారు. ‘పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచడంలో తీసుకున్న చొరవ, విద్యార్థుల సంఖ్య పెంచడం, వృత్తిపరంగా అభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి తీసుకున్న చర్యలు, వినూత్న బోధన పద్ధతులు, సాధించిన పురస్కారాలు, ఆంగ్లంలో సంభాషించే సామర్థ్యం’ అనే ఏడు కొలమానాల ఆధారంగా జిల్లా కమిటీ టూర్కు వెళ్లే ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ ఈనెల 23 లోపు పూర్తి చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను ప్రవేశపెట్టేందుకు మరో అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతను పెంపొందించేలా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను విదేశాలకు పంపించాలని నిర్ణయించింది. ‘గ్లోబల్ లెర్నింగ్ టూర్’ పేరిట సుమారు 160 మందిని సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్ వంటి దేశాలకు పంపనుంది. వీరు ఆయా దేశాల్లో విద్యా విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. దీంతో విద్యావ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. -
ప్లానింగ్ పక్కాగా..
కై లాస్నగర్: ఉపాఽధిహామీ పథకం అమలులో అక్రమాలను కట్టడి చేసేందుకు కేంద్రం అనేక సంస్కరణలు తీసుకువస్తోంది. తాజాగా ఒకేచోట పనులు చేపట్టడానికి ఆస్కారం లేకుండా పనుల ప్లానింగ్ను పక్కాగా అంచనా వేసేందుకు యుక్తధార జియో స్పెషియల్ ప్లానింగ్ పోర్టల్ను అందుబాటులోకి తె చ్చింది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) భువన్ పోర్టల్ ఆధారంగా అధికారులు పనులను ఆన్లైన్లో గుర్తించనున్నారు. అంచనాల తయారీ నుంచి పనుల మంజూరు, బిల్లుల చెల్లింపు లాంటి పనులన్నీ ఇక నుంచి ఈ పోర్టల్ ద్వారానే జరగనున్నాయి. దీంతో అక్రమాలకు పూర్తిగా చెక్పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమాలకు తావు లేకుండా.. ఉపాధిహామీలో కొన్నిచోట్ల పనులు చేయకున్నా చే సినట్లు రికార్డులు నమోదు చేసి క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. సో షల్ ఆడిట్లోనూ ఇలాంటివి బయటపడుతున్నా యి. ఇందుకు తావులేకుండా యుక్తధార పోర్టల్ తో డ్పడనుంది. గ్రామాల్లో పనులు చేపట్టే ప్రాంతాల ను ఈ యాప్లో ఆన్లైన్ ద్వారా లైవ్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇస్రో భువన్ పోర్టల్ ద్వారా చేపట్టనుండగా ఇదివరకు ఆ ప్రాంతంలో పనులు చే పట్టారా.. పనులు చేసేందుకు ఆ ప్రాంతం అనుకూలంగా ఉందా.. లేదా? అనే వివరాలు చెప్పడంతో పాటు ఆ ప్రాంతం ఫొటోలనూ ప్రత్యక్షంగా చూపిస్తుంది. దీంతో పనులు చేపట్టే ప్రాంతాలనే ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాలను గుర్తించే ప నిలో టెక్నికల్ అసిస్టెంట్లు నిమగ్నమయ్యారు. ఏ వి ధంగా పనుల అంచనాలు గుర్తించాలనేదానిపై ఇది వరకే అధికారులు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప నులు మంజూరయ్యాక నిర్దేశిత ప్రాంతంలోనే పనులు చేయాల్సి ఉంటుంది. పనులు చేయకముందు ఒకసారి, 60శాతం పనులు పూర్తయ్యాక, 90 నుంచి వంద శాతం పనులు పూర్తయ్యాక ఇలా మూడుసార్లు ఆ ప్రాంతం ఫొటోలు తీసుకుంటారు. దాన్ని నిర్ధారించాకే కూలీలకు బిల్లులు మంజూరవుతాయి. గ్రామానికో లాగిన్ ఐడీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెక్నికల్ అసిస్టెంట్లు జిల్లాలో ఎలాంటి పనులు చేపట్టాలో గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ గ్రామానికో లాగిన్ ఐడీని క్రియేట్ చేశారు. వాటి ఆధారంగా యుక్తధార పోర్టల్లో పనులు చేపట్టే ప్రాంతాలను వారు నమో దు చేయనున్నారు. ఈ ప్రక్రియ సోమవారం నుంచి మొదలయ్యే అవకాశమున్నట్లు అధికారులు చెబు తున్నారు. గ్రామానికి సంబంధించి ఉపాధి పనులకు హాజరైన కూలీల మూడేళ్ల వివరాలు తీసుకుంటారు. అందులో సంవత్సరం వారీగా ఎంతమంది పనులకు వచ్చారనే వివరాలను యావరేజ్గా తీసుకుని చేపట్టాల్సిన పనులు, మెటీరియల్ కాంపొనెంట్ను కలిపి లేబర్ బడ్జెట్ ప్రణాళికను సిద్ధం చేస్తా రు. ఈ వివరాల ఆధారంగా పనులు మంజూరు చే యడంతో పాటు బడ్జెట్ కేటాయింపులు, కూలీలకు బిల్లుల చెల్లింపులు తదితర పనులన్నీ ఇక నుంచి ఈ పోర్టల్ ద్వారానే చేపట్టనున్నారు. నేరుగా కేంద్ర మే వీటిని పర్యవేక్షించనుంది. ఫలితంగా రాష్ట్ర ప్రమేయం తగ్గి అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. 17 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్గా.. యుక్తధార పోర్టల్ను అమలు చేసేందుకు పైలెట్ ప్రాజెక్ట్ కింద గతేడాది మండలానికో గ్రామం చొ ప్పున జిల్లాలోని 17 గ్రామాలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో అంకాపూర్, బేల మండల కేంద్రం, జైనథ్లో నిరాల, తలమడుగులో కుచులాపూర్, తాంసిలో జామిడి, నార్నూర్లో గుంజాల, ఇంద్రవెల్లిలో దేవాపూర్, గుడిహత్నూర్లో శంభుగూడ, ఇచ్చోడలో బోరిగామ, బజార్హత్నూర్లో దహెగాం, బోథ్లో కౌట, ఉట్నూర్లో ధన్పూర్, నేరడిగొండలో కుంటాల–కే, భీంపూర్లో మర్కగూడ, గాదిగూడలో పర్సువాడ (కే), మావలలో వాగాపూర్, సిరికొండలో రిమ్మ గ్రామాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆయాచోట్ల ఈ విధానం విజయవంతం కావడంతో ప్రస్తుతం ప్రతీ గ్రామంలో దీనిని అమలు చేయనున్నారు. పారదర్శకత పెంచేందుకే.. ఉపాఽధిహామీ పనుల్లో పారదర్శకత పెంచాలనే ఉద్దేశంతోనే కేంద్రం యుక్తధార పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. గ్రామ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు అవకాశం ఉందా.. అనేదాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించి ప్రాంతాలను ఎంపిక చేయనున్నాం. గతంలో కొండ ప్రాంతాల్లో ఇంకుడుగుంతలు, ఫాంపాండ్స్ లాంటి నిర్మాణాలు చేపట్టారు. అలాంటి అవకాశం లేకుండా ఎత్తు, పల్లాలను గుర్తించి పనులు చేసేందుకు వాస్తవంగా అవకాశం ఉందా.. అనే దాన్ని గుర్తించేందుకు ఈ విధానం తోడ్పడుతుంది. – కుటుంబరావు, అడిషనల్ డీఆర్డీవో -
‘కేంద్ర పథకాలతో ప్రయోజనం శూన్యం’
ఆదిలాబాద్టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ పథకాలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న విమర్శించారు. ఆదివా రం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతు వ్యతిరేక విధానాలతో విఫలమైన మోదీ ప్రభుత్వం ఇప్పుడు పథకాల పే ర్లు మార్చి మళ్లీ రైతులను మోసం చేస్తోందని ఆరో పించారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు లబ్ధిదా రుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో మాత్రం రైతుల సంఖ్య 59లక్షల నుంచి 33లక్షలకు పడిపోయిందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ధన్, ధాన్య కృషి యోజనలో జిల్లాను చేర్చకపోవడం స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధుల వైఫల్యమని విమర్శించారు. వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎరువులు, విత్తనాలు, మందులపై సబ్సిడీ తగ్గించి, ధరలు పెంచు తూ రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు కుమ్రా రాజు, గంగయ్య, ధమ్మపాల్, కనక రమణ, శుక్లల్, అశోక్, భూమన్న తదితరులున్నారు. -
లక్ష్మీనారాయణుడిపై సూర్యకిరణాలు
జైనథ్: మండల కేంద్రంలోని ప్ర సిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఆదివా రం నుంచి స్వా మివారి మూలవిరాట్టుపై సూ ర్యకిరణాలు ప డుతున్నాయి. స్వామివారి పా దాల నుంచి వి గ్రహం మొత్తం తాకుతూ వెళ్తుంటాయి. సూర్య కిరణాలు తాకుతున్న సమయంలో స్వామివారు సువర్ణ ఆకృతితో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో స్వామి వారిని దర్శించుకుంటే సకల దోషాలతో పాటు చర్మవ్యాధులు తొలగుతాయని భక్తుల నమ్మ కం. కుటుంబ సభ్యుల్లో సుఖఃశాంతులు కలు గుతాయని విశ్వాసం. కాగా, అక్టోబర్, ఫిబ్రవరి నెలల్లో ఏటా రెండుసార్లు విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకుతూ ఉంటాయి. -
● యూజ్ కేస్ చాలెంజ్లో నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్కు అవార్డులు ● జిల్లాకు దక్కిన అరుదైన గుర్తింపు ● కలెక్టర్ పాలన దక్షతకు నిదర్శనం
కై లాస్నగర్: జిల్లాకు మరోసారి జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆస్పిరేషనల్ బ్లాక్లలో భాగంగా నీతి ఆయోగ్ చేపట్టిన ‘యూజ్ కేస్ చాలెంజ్’లో జిల్లా ఏకంగా నాలుగు అంశాల్లో పురస్కారాలు సా ధించింది. నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్లో విద్య, సామాజికాభివృద్ధి, ఆరోగ్యం, పోషణ విభాగాల్లో సాధించిన ప్రగతికి గాను అవార్డులతో పాటు నగ దు పురస్కారాన్ని అందుకోవడం కలెక్టర్ రాజర్షి షా సమర్ధతకు నిదర్శనం. ఇదివరకే ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుని జాతీ యస్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటిచెప్పారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేలా.. నార్నూర్ మండలంలోని 34 ప్రభుత్వ పాఠశాలల్లో ని 202మంది పేద విద్యార్థుల ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పెంచేలా ‘ఇంప్రూవింగ్ సాఫ్ట్ స్కిల్స్ అ మాంగ్ ద స్టూడెంట్స్’ థీమ్ అమలు చేశారు. విద్యార్థుల్లో క మ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం తదితర స్కిల్స్ పెంచేదిశగా ప్రత్యేక శ్రద్ధ వహించారు. ముఖ్యంగా నార్నూ ర్ బ్లాక్ పరిఽధిలో ఇంగ్లిష్ ఫౌండేషన్ లెర్నింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపర్చేలా బేస్లైన్ టెస్ట్ నిర్వహించారు. టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రత్యేక మాడ్యుల్స్ను అందజేసి పక్కాగా అమలుపరిచారు. ఇదీ విజయవంతమై విద్యార్థుల భాషా నై పుణ్యం మెరుగుపడేలా చేసింది. ఇందుకు రూ.2లక్షల నగదు బహుమతి సాఽధించింది. విద్యా విభాగంలో.. సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థుల్లోని చెడు అ లవాట్లను దూరం చేసి చదువులో రాణించేలా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేకంగా ఆరోగ్య పాఠశాలను అ మలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 81 పాఠశాలల్లో దీ న్ని అమలు చేస్తుండగా 39వేల మంది విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నిత్యం రోజుకో అంశంలో తర్ఫీదునిస్తున్నారు. గుట్కా, పాన్, తంబాకు లాంటి వాటిని వాడకుండా చూడటంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్ర త ప్రాధాన్యతను చాటి చెబుతున్నారు. వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని నా ర్నూర్ బ్లాక్లోనూ పటిష్టంగా అమలుచేశారు. ప్రతీ వారం విద్యార్థులు, టీచర్లతో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ఆరోగ్యపరంగా గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. విద్యార్థులతో పాటు వారి కుటుంబీకులు చెడు అలవాట్లు మానుకునేలా తోడ్పడింది. ఈ కార్యక్రమానికీ రూ.లక్ష పురస్కారం అందుకుంది. సామాజికాభివృద్ధి విభాగంలో.. నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్కు ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. ఈ బ్లాక్ పరిధిలో విద్య, వైద్యం ఆరోగ్యం, పోషకాహారంతో పాటు వ్యవసాయం, ఆర్థిక చేయూత, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు లాంటి వివరాలన్నింటినీ అందులో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. ఆయా వివరాలు రా ష్ట్ర, జాతీయ స్థాయిలో ఏ విధంగా అమలవుతున్నా యి.. జిల్లా స్థాయిలో వాటి అమలు ఎలా ఉందనే దానిపై పూర్తి గణాంకాలతో ఎప్పటికప్పుడు నమో దు చేస్తున్నారు. నీతి ఆయోగ్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేస్తూ వివరాలు పొందుపరుస్తున్నారు. ఆయా ప్యారామీటర్ల ను గణాంకాలతో నిర్దేశించుకుని జిల్లాకు అవార్డు, రూ.లక్ష నగదు పురస్కారం ప్రకటించారు. నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ వివరాలు గ్రామాలు 24 కుగ్రామాలు 34 జనాభా 29,152 పీహెచ్సీలు 1 అంగన్వాడీ కేంద్రాలు 77 ఆరోగ్య ప్రమాణాలను పెంచడంతో పాటు చిన్నారులు, విద్యార్థులకు పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందించేలా పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేశారు. జిల్లాలోని 17 కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేసి వ్యక్తిగత పరిశు భ్రత ప్రాధాన్యతను తెలియజేశారు. 10వేల మంది విద్యార్థినులకు ప్రయోజనం చేకూర్చేలా 40 పాఠశాలల్లో శానిటరీ న్యాప్కిన్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నారు. నార్నూర్ బ్లాక్లో మూడు హ్యాబిటేషన్లలో టెలి మెడిసిన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. తాగునీటి వసతి కలిగిన అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్రస్థాయిలో 47.6శాతం ఉండగా నార్నూర్లో వందశాతం, మరుగుదొడ్డి ఉపయోగించే కేంద్రాలు రాష్ట్రంలో 36.8శాతం ఉంటే నార్నూర్లో 32.46 శాతంగా ఉన్నాయి. ఐదేళ్లలోపు చిన్నారుల్లో పోషకాహారలోపం రాష్ట్రస్థాయిలో 3.3 శాతంగా ఉంటే నార్నూర్ బ్లాక్లో 2.70శాతానికి తగ్గించారు. ఐదేళ్లకు పైబడిన చి న్నారుల్లో తీవ్రమైన పోషకాహారలోపం రాష్ట్రస్థాయిలో 1.1శాతంగా ఉండగా నార్నూర్ బ్లాక్లో 0.5 శాతానికి తగ్గించారు. 2,500 గ్రాముల కంటే తక్కువ బరువుతో జన్మించిన శిశువుల శాతం రాష్ట్రంలో 7.8శాతం ఉండగా ఈ బ్లాక్లో జీరోకు తగ్గించారు. అలాగే ఆస్పత్రి ప్రసవాలు రాష్ట్రంలో 87.8శాతం ఉండగా జిల్లాలో వందశాతం జరిగేలా శ్రద్ధ వహిస్తున్నారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు 87.8శాతం ఉండగా జిల్లాలో వందశాతానికి తీసుకువచ్చారు. పోషణ్ అభియాన్, నేషనల్ హెల్త్ మిషన్, ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసి రూ.లక్ష నగదు పురస్కారాన్ని సాధించారు. -
పెద్దగా ఒరిగేదేం ఉండదు
జిల్లాకు ముగ్గుర్ని ఎంపిక చేసి విదేశాలకు పంపడం వల్ల ఇక్కడి విద్యావిధానంలో పెద్దగా ప్రయోజనాలేం ఉండకపోవచ్చు. మన దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న విద్యాబోధన ప్రక్రియలు అధ్యయనం చేయడం మేలు. ఆయా దేశాల్లో సామాజిక ఆర్థిక కోణాలు మన దేశానికి భిన్నంగా ఉంటాయి. కాబట్టి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడి పొరుగు రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయడం సమంజసంగా ఉంటుంది. – దాసరి శంకర్, టీఎస్యూటీఎఫ్ అధ్యక్షుడు, నిర్మల్ విప్లవాత్మక మార్పులకు అవకాశం ఎంపికై న ఉపాధ్యాయులు విదేశాల్లోని విద్యావిధానాలు, బోధన పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా నూతన విషయాలు తెలుసుకుంటారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గ్రహించిన అంశాలను అమలుపరచడం ద్వారా ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంటుంది. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్ -
ఇంద్రవెల్లి పీజీహెచ్ఎం సరెండర్
● నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ కొరడాఆదిలాబాద్టౌన్: ఇంద్రవెల్లి పీజీ హెచ్ఎం రాంమోహన్పై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. పాఠశాలలోని పీఎంశ్రీ నిధులకు సంబంధించి దుర్వినియోగంపై చర్యలు చేపట్టారు. ఇటీవల పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యా య సంఘాల నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సదరు ప్రధానోపాధ్యాయుడు పీఎంశ్రీ నిధులను దుర్వినియోగం చేశాడని, అలాగే పాఠశాలలో వాతావరణానికి భంగం కలిగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు విచారణకు ఆదేశించిన కలెక్టర్ ఆయనను వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డికి సరెండర్ చేశారు. ఇదిలా ఉండగా ఇంద్రవెల్లి పాఠశాలలో పోక్సో కేసులో ఇటీవల సస్పెండ్ అయిన నాందేవ్ అనే ఉపాధ్యాయుడిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈయనకు బోథ్లోని ప్రభుత్వ పాఠశాలలో విధులు కేటాయించారు. -
విద్యాశాఖ అప్రతిష్టపాలు
ఆదిలాబాద్టౌన్: జిల్లా విద్యాశాఖ ఇటీవల అప్రతిష్ట మూటగట్టుకుంటుంది. ఆ శాఖలో సస్పెన్షన్లు, సరెండర్లు, టర్మినేట్, మెమోల జారీ.. ఇలా వరుస ఘటనలు కారణమని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పర్యవేక్షణ లోపమనే చర్చ సాగుతోంది. కొన్నేళ్లుగా జిల్లాకు రెగ్యులర్ విద్యాశాఖాధికారి కరువయ్యారు. దీంతో పలువురు ఉద్యోగులు, కొంత మంది ప్రధానోపాధ్యాయులు అక్రమాలకు తెర లేపుతున్నారు. పాఠశాలలో విద్యార్థులపై కొందరు గురువులు అసభ్యంగా ప్రవర్తిస్తూ కటకటాల పాలవుతున్నారు. పౌష్టికాహారం మాట పక్కనబెడితే.. కనీసం నా ణ్యమైన విద్యాబోధన సైతం అందకుండా పోతుందనే విమర్శలున్నాయి. అక్రమాల జోరు.. విద్యాశాఖలో ప్రతీ పనికి ఎంతో కొంత ముట్టజెబితే కానీ కొంత మంది ఉద్యోగులు ఫైళ్లు కదలనివ్వడం లేదని పలువురు చెబుతున్నారు. రెగ్యులర్ డీఈవో లేకపోవడం, ఇన్చార్జి అధికారి స్థానికంగా ఉండకపోవడంతో వారి ఆగడాలు మితిమీరుతున్నట్లు తెలుస్తోంది. కొంత మంది ప్రధానోపాధ్యాయులు సైతం పాఠశాల నిధులను దుర్వినియోగం చేస్తున్నా రు. విద్యాభివృద్ధి కోసం కేటాయించాల్సిన వాటిని సొంతగా వినియోగించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాడితప్పిన పాలన.. జిల్లాకు ఐదారేళ్లుగా రెగ్యులర్ విద్యాధికారి కరువయ్యారు. ఇటీవల ఇన్చార్జి అధికారి ఉద్యోగ విరమణతో వయోజన విద్యాశాఖ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన పనితీరు సరిగా లేకపోవడంతో ఆయనను తప్పించారు. ఐటీడీఏ పీవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే సదరు అధికారికి కీలకమైన ఐటీడీఏ శాఖ ఉండడంతో పూర్తిస్థాయిలో జిల్లా విద్యాశాఖపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. దీంతో పాలన గడితప్పినట్లు తెలుస్తోంది. ఫేషియల్ అటెండెన్స్ ఉన్నప్పటికీ కొంత మంది సమయపాలన పాటించడం లే దు. కొందరు మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను ప ర్యవేక్షించాల్సి ఉండగా, కార్యాలయానికే పరిమితమవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతుంది. పదో తరగతికి సంబంధించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యా శాఖాధికారులు గత మంగళవారం ఆ దేశాలు జారీ చేస్తే కొన్ని పాఠశాలల్లో మాత్రమే ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే కేజీబీవీల్లో వి ద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. మెనూలో కోత విధిస్తూ కొంత మంది ఎస్వోలు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల నాణ్యమైన భోజనం అందక విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మె నూ ప్రకారం అందడం లేదు. సర్కారు బడుల బా గు కోసం ప్రభుత్వం చర్యలు చేపడితే కొంత మంది ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల తీరుతో విద్యాశాఖకు చెడ్డపేరు వస్తోంది. ఈ విషయమై విద్యా శాఖ ఏడీ వేణుగోపాల్ గౌడ్ను వివరణ కోరగా, ఇటీవల నార్నూర్ మండలంలోని కేజీబీవీలో జరిగిన సంఘటనపై సెక్టోరియల్ అధి కారి ఉదయశ్రీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని తెలిపారు. అలాగే ఇంద్రవెల్లి ప్రధానోపాధ్యాయుడిని ఆర్జేడీకి కలెక్టర్ సరెండ్ చేసినట్లు వివరించారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
● ఎస్పీ అఖిల్ మహాజన్ఇంద్రవెల్లి: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఉట్నూర్ సబ్డివిజన్ పోలీసు అధికారులతో శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. పలు అంశాలపై వారికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో రౌడీలు, సస్పెక్ట్ రౌడీల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రతీ గ్రామంలో విలేజ్ పోలీస్ అధికారి కీలకంగా వ్యవహరించాలన్నారు. అలాగే జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు మడావి ప్రసాద్, ఎస్సై సాయన్న, కానిస్టేబు ళ్లు ఉన్నారు.ఒత్తిడికి గురికావద్దుఆదిలాబాద్టౌన్: ఒత్తిడికి గురైతే మానసిక ఆరో గ్యంతో బాధపడతారని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో డ్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని రిమ్స్ డైరెక్టర్ చాంబర్లో తెలంగాణ జూనియర్ డాక్టర్లు మానసిక ఆరోగ్య హెల్ప్డెస్క్, ఫీర్ సపోర్ట్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మానసిక వైద్యనిపుణులు ఓంప్రకాశ్, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. -
పొగాకుతో ఆరోగ్యంపై ప్రభావం
ఆదిలాబాద్టౌన్: పొగాకు సేవించడంతో ఆరో గ్యంపై ప్రభావం చూపుతుందని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని బాలక్మందిర్, ప్రభుత్వ నం.2 పాఠశాలల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పొగాకు, మత్తుపదార్థాలతో క్యాన్సర్, ఇతర రోగాల బారిన పడతా రని తెలిపారు. కోట్పా చట్టం ప్రకారం మైనర్లు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నం.2 పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్, పొగాకు నియంత్రణ విభాగం సోషల్ వర్కర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
అడ్డుపడితే గుణపాఠం చెబుతాం
ఆదిలాబాద్రూరల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్కు ఎవరు అడ్డుపడుతున్నారో తమకు తెలుసని, రాబో యే రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు అన్నారు. బీసీ రిజర్వేషన్కు వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషనర్ల దిష్టిబొమ్మతో శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌక్ వద్ద దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తొపులాట చోటుచేసుకుంది. అనంతరం రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు అసెంబ్లీలో జీవో చేసి గవర్నర్ వద్దకు పంపితే అక్కడ పెండింగ్లో ఉందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే జీర్ణించుకోలేక కొందరు హైకోర్టులో కేసు వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరున్నారో బీసీలకు తెలుసని, తగిన సమయంలో వారికి గుణపాఠం తప్పదన్నారు. రిజర్వేషన్ అమలయ్యే దాకా పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, నాయకులు అంజయ్ కుమార్, శ్రీనివాస్, అశోక్, రాము, చందు, సామల ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి
ఉట్నూర్రూరల్: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. మాతా శిశు మరణాలు, ఇతర అంశాలపై వైద్యాధికారులు, సూపర్వైజర్లతో జిల్లా అదనపు వైద్యాధికారి కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణుల వివరాలు నమోదు చేసి సమయానుసారం వారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందించాలన్నారు. అనంతరం మండలంలోని శ్యాంపూర్, దంతన్పల్లి పీహెచ్సీలను సందర్శించారు. వారి వెంట అదనపు డీఎంహెచ్వో మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, క్షయ నివారణ అధికారి సుమలత, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తోషం సబ్సెంటర్ తనిఖీ గుడిహత్నూర్: మండలంలోని తోషం సబ్సెంటర్ను డీఎంహెచ్వో శుక్రవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గర్భిణులకు అవసరమైన సలహాలు అందిస్తూ పీహెచ్సీలో ప్రసవం అయ్యేలా చూడాలన్నారు. వారి వెంట హెల్త్ అసిస్టంట్ ఎజాజ్, ఏఎన్ఎంలు సునీత, తుర్పాబాయి, ఆశవర్కర్ రేణుక ఉన్నారు. -
‘ఇందిరమ్మ’కు ఉపాధిహామీ
కై లాస్నగర్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆ శించిన స్థాయిలో ముందుగుసాగడం లేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం లబ్ధిదారులకు ఆర్థికభారం త గ్గించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ స్కీంకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చే సింది. తాజా నిర్ణయంతో జాబ్కార్డు కలిగిన కూ లీలకు అదనపు ప్రయోజనం కలిగి ఆర్థిక సాంత్వన చేకూరనుంది. సర్కారు నిర్ణయంపై ఇందిరమ్మ లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. నిర్మాణాలు వేగవంతం చేసేలా.. ఇందిరమ్మ పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి ప్రభుత్వం 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేసింది. ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు రూ.5లక్షల చొప్పున చెల్లిస్తోంది. ఇళ్ల నిర్మాణ దశలను అనుసరించి బిల్లులు చెల్లించనుంది. బేస్మెంట్ దశలో రూ.లక్ష, గోడల నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష, స్లాబ్ లెవల్ వరకు పూర్తయితే రూ.2లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తిస్థాయిలో జరిగాక రూ.లక్ష చొప్పున నాలుగు విడతల్లో అందజేస్తోంది. లబ్ధిదారులు ఆర్థి కంగా ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష చొ ప్పున తక్షణమే ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలని భావిస్తోంది. అదనపు లబ్ధి చేకూర్చేందుకే.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేసింది. ఉపాధి కూలీలకు 90రోజుల పనిదినాలు కల్పించాలని నిర్ణయించింది. రోజుకు రూ.307 చొప్పున 90రోజుల పనిదినాలకు గాను రూ.27,630 వారికి అదనంగా లబ్ధి చేకూర్చాలని భావిస్తోంది. అయితే బేస్మెంట్ స్థాయి వరకు 40 రోజులు, లెంటల్ స్థాయి వరకు 30 రోజులు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో 20రోజుల పాటు పని కల్పించనుంది. ఒకవేళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే బేస్మెంట్ వరకు నిర్ణీత 90రోజుల పనిదినాలు పూర్తయితే మిగతా పనిదినాలను వచ్చే ఆర్థికసంవత్సరంలో ఇచ్చే వెసులుబాటు కల్పించింది. కూలీల వేతనాల చెల్లింపు కోసం నిర్మాణ పనుల్లోని మూడు దశల్లో లబ్ధిదారుడి ఫొటోలు తీసుకుని వాటిని ఆన్లైన్లో హౌసింగ్శాఖ అధికారులు ఆప్లోడ్ చేయనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత పంచాయ తీ సెక్రటరీ దాన్ని ధ్రువీకరించినట్లయితే దాని ఆధారంగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో బిల్లులు జమకానున్నాయి. తద్వారా లబ్ధిదారు ఇంటి నిర్మాణాన్ని వేగవంతం చేసుకోవడంతో పాటు కూలీలకు చెల్లించే ఆర్థికభారాన్ని తగ్గించుకోన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి వివరాలు మంజూరైన ఇళ్లు 15,486 మార్కౌట్ ఇచ్చినవి 7,763 బేస్మెంట్ దశలో.. 4,547 రూప్ లెవల్లో.. 1,092 ఆర్సీ లెవెల్లో.. 236 పూర్తయిన ఇళ్లు 02 -
ఏటీసీల్లో యువతకు శిక్షణ
ఉట్నూర్రూరల్: ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) ఏర్పాటు చేసి యువతకు ఆధునిక సాంకేతిక వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇస్తోందని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు. గురువారం కేబీ ప్రాంగణంలోని అ డ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను సందర్శించి ని ర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా యువతకు సాంకేతిక శిక్షణ ఇ చ్చేందుకు ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి వృత్తి విద్య కోర్సులు అందిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేయించాలని ప్రిన్సిపల్ శ్రీనివాస్ను ఆదేశించారు. -
ఆందోళనలో అన్నదాతలు
సాత్నాల: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. భారీ వర్షాలు, వరదలతో వివిధ పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు కుమిలిపోతున్నా రు. జిల్లాలోని పెన్గంగా పరీవాహక ప్రాంతాలైన భీంపూర్, భోరజ్, జైనథ్, బేల, సాత్నాల మండలా ల్లో వేల ఎకరాల్లో పంట ముంపునకు గురైంది. భీంపూర్ మండలంలో 1,016 ఎకరాల్లో పత్తి, 53 ఎకరాల్లో సోయాబీన్, 16 ఎకరాల్లో కంది పంట లకు నష్టం జరిగింది. బేల మండలంలో పత్తి 1,400, సో యాబీన్ 550, కంది 50, భోరజ్ మండలంలో పత్తి 1,880, సోయాబీన్ 353, కంది 68, సాత్నాల మండలంలో పత్తి 285, సోయాబీన్ 80, కంది 40, జైన థ్ మండలంలో పత్తి 1,200, సోయాబీన్ 1,200, కంది 160ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మానసిక ఒత్తిడికి లోనవుతూ.. పెన్గంగా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పత్తి, సోయాబీన్, కంది పంటలు నాశనమై రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ఆర్థికంగా ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులు ఇప్పుడు పూర్తిగా విసిగిపోయారు. దిగుబడి రాదని ఆవేదనతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. భోరజ్ మండలంలో ఇప్పటికే ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.15వేల వరకు పెట్టుబడి పెట్టారు. వేల ఎకరాల్లో పంట నష్టపోయిన నేపథ్యంలో ప్ర భుత్వం ఎకరాకు రూ.10వేల పరిహారం ఇస్తామని చెప్పడంతో ఎదురుచూస్తున్నారు. పంట నష్టంపై స ర్వే చేసిన అధికారులు కలెక్టర్కు నివేదిక అందించారు. అయినా ఇప్పటివరకు రైతులకు పరిహారం అందలేదు. ప్రభుత్వం నుంచి పరిహారం అందకుంటే ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి భారీ వర్షాలతో ఇప్పటికే పంటలు కోల్పోయాం. రైతులకు ఆర్థికభారం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రబీ సాగు కోసం రైతులకు విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించాలి. నష్టాల్లో ఉన్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి. – పట్టెపు విలాస్, పెండల్వాడ పరిహారం అందించాలి భారీ వర్షాలు, వరదల కారణంగా ఎరువులు, విత్తనాల ఖర్చులు వృథా అయ్యాయి. ఇప్పటికే ఎకరానికి రూ.15వేల ఖర్చయింది, ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలి. రబీ సాగుకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందించి ఆదుకోవాలి. – సంతోష్రెడ్డి, పిప్పర్వాడ -
సైన్స్పై ఆసక్తి పెంచడమే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి పెంచడమే లక్ష్యమని జిల్లా సైన్స్ అధికారి ఆరే భాస్కర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో ‘మానవజాతి ప్రయోజనం కో సం శాస్త్ర సాంకేతికత’ అంశంపై జిల్లా స్థాయి సైన్స్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పలు పాఠశాల ల విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు శాస్త్ర స్ఫూర్తి ని ప్రతిబింబించాయి. బంగారిగూడ మోడల్ స్కూ ల్ ప్రథమ, బరంపూర్ జెడ్పీహెచ్ఎస్ ద్వితీయ, ఇంద్రవెల్లి జెడ్పీహెచ్ఎస్ తృతీయ స్థానాల్లో నిలువగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్ర థమ స్థానంలో నిలిచిన బంగారిగూడ విద్యార్థులు ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా సైన్స్ అధికారి తెలిపారు. హెచ్ఎంలు లచ్చిరాం, డైట్ కళాశాల ప ర్యవేక్షకులు మమత, శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్గౌడ్, హెచ్ఎం లక్ష్మణ్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్రెడ్డి తదితరులున్నారు. -
ఘనంగా పోస్టల్ దినోత్సవం
ఆదిలాబాద్: తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కా ర్యాలయంలో పోస్ట్మాస్టర్లను సన్మానించారు. యూనియన్ అధ్యక్షుడు జనగం సంతోష్ మాట్లాడుతూ.. 70ఏళ్లుగా పోస్టల్శాఖ సేవలందిస్తోందని, ప్రస్తుత మొబైల్ ఫోన్ల యుగంలోనూ అధునాతన సేవలు అందిస్తుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. యూనియన్ ప్రతినిధులు దుర్గం రాజేశ్వర్, రాఘవేంద్రనాథ్ యాదవ్, రాంకిషన్, అమర్, జార్జ్, జగదీశ్, అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
● జీవో 9పై స్టే విధించిన హైకోర్టు ● ‘సుప్రీం’కు వెళ్తామన్న ప్రభుత్వం ● సర్కారుపై విపక్షాల విమర్శలు ● ఆదరిస్తేనే మద్దతు: బీసీ నేతలు
సాక్షి, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు తా త్కాలిక బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల జీవో 9, ‘పరిషత్’ ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించింది. గురువారం ఉదయం 10.30 గంటలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొదటివిడత ఎన్నికలు జరిగే మండలాల్లో ఆయా రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ హైకోర్టులో విచారణ ఉండడంతో ఎన్నికలు జరుగుతాయా.. లేదా? అనే సందేహం ఓ వైపు ఉంటే, నామినేషన్ వేయాలా.. వద్దా? అనే సంశయం ఆశావహుల్లో నెలకొంది. ఈ సందిగ్ధంలోనూ బజార్హత్నూర్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేశారు. జిల్లా వ్యాప్తంగా ఇదొక్కటే నామినేషన్ దాఖలు కావడం గమనార్హం. మధ్యాహ్నం నుంచి విచారణ ప్రారంభం కావడం, ఆ తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈ ఎన్నికలు నిలిచిపోతున్నాయని తెలియడంతో ఆశావహుల్లో నిరుత్సాహం వ్యక్తమైంది. సర్కారు ఎలా ముందుకెళ్తుందో! జిల్లాలో మొదటి విడతలో 10 జెడ్పీటీసీ, 80 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ప్రభుత్వం ఇందుకు సంబంధించి గురువారం ఉద యం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత హై కోర్టు స్టే నేపథ్యంలో ఎన్నికలు నిలిచిపోయాయి. జీవో నంబర్ 9కి సంబంధించి స్టే ఇవ్వగా ఎన్నికల నోటిఫికేషన్ నిలిచిపోయినట్టేనని స్పష్టమైంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపింది. ఎన్నికలు నిలిపివేస్తామని, ‘కోడ్’ తొలగిస్తామని ప్ర కటించడంతో ప్రస్తుతం జారీ చేసిన రిజర్వేషన్లకు అ నుగుణంగా ఈ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనని స్పష్టమైంది. దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా.. లేనిపక్షంలో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు మళ్లీ షెడ్యూల్ జారీ చేస్తుందా.. ఇలా వివిధ సందేహాల మధ్య ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషనైతే నిలిచిపోయింది. ఆరోపణలు.. ప్రత్యారోపణలు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పనలో అధికార కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్, బీజేపీ ఆరో పించాయి. ఎన్నికలపై స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువడ్డాక సాయంత్రం ఆయా పార్టీల నాయకులు ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్కు పూర్తి చిత్తశుద్ధి ఉందని, దీనిపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. కాగా, బీసీ కులాలకు మద్దతు ఇచ్చే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలనే ఆదరిస్తామని జిల్లాకు చెందిన బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. -
పనుల్లో నాణ్యత పాటించాలి
ఇంద్రవెల్లి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చే పట్టిన అమ్మ ఆదర్శ కళాశాల పనుల్లో నాణ్యత పాటించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధి కారి జాదవ్ గణేశ్ సూచించారు. గురువారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికే అమ్మ ఆదర్శ కళాశాల కింద నిధులు మంజూ రు చేసి పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంత రం కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ మారుతి, అ ధ్యాపకులు మధుకర్, ప్రమీల, సరితారాణి, వెంకటేశ్, పూర్ణచందర్, రవి ఉన్నారు. -
‘బీసీ రిజర్వేషన్లపై సీఎంకు చిత్తశుద్ధి ఏది’
ఆదిలాబాద్: బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామా చేస్తోందని, సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి లేదని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. 42శాతం బీసీ రిజర్వేషన్లపై తాను అసెంబ్లీలో చర్చించానని, రిజర్వేషన్ అమలులో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించానని గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలే మహారాష్ట్ర, కర్ణాటకలో వచ్చినట్లు తాను ఉదహరించానని వివరించారు. 42శాతం రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్ బీసీలను ఆశల పల్లకిలో ఊరేగించిందని, ఏమీ కాకముందే కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా జీవో తీసి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేసేందుకే కుట్ర పన్నిందని మండిపడ్డారు. రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసిందని ఆరోపించా రు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని, అ ప్పటివరకు బీసీల పక్షాన పోరాడుతామని వెల్లడించారు. ఆయన వెంట నాయకులు లాలా మున్నా, సంతోష్, మయూర్ చంద్ర, దయాకర్, విజయ్, దినేశ్ మాటోలియా, భీమ్సేన్రెడ్డి, రాందాస్, అశోక్, సన్నీ, విశాల్, రమేశ్ తదితరులున్నారు. -
ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్: ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వి నియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ ఎస్.భవానీ ప్రసాద్ అన్నారు. దసరా పండుగ పురస్కరించుకొని ఆర్టీసీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బుధవారం స్థానిక బస్టాండ్ ఆవరణలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 27నుంచి అక్టోబర్ 6వరకు ఆర్టీసీలో ప్రయాణించిన వారిలో రీజియన్ వ్యాప్తంగా ముగ్గురిని డ్రా ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. పండుగ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించామన్నారు. అనంతరం విజేతలను ప్రకటించారు. వైభవ్ (ప్రథమ, రూ.25వేలు), గణేశ్(ద్వితీయ, రూ.15వేలు) మహేశ్ (తృతీయ, రూ.10వేలు) బహుమతులకు ఎంపికై నట్లు వెల్లడించారు. వీరికి త్వరలో హైదరాబాద్ వేదికగా నగదు బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐలు శ్రీనివాస్, రవీందర్, డిప్యూటీఆర్ఎం శ్రీహర్ష, రామయ్య, సీఐ రాజశేఖర్, ఎంఎఫ్ శ్రీకర్, ఎస్ఎం పోశెట్టి, రిజర్వేషన్ ఇన్చార్జి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం’
నేరడిగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాలను కై వసం చేసుకుంటుందని ఎంపీ గోడం నగేశ్ ధీమా వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలపరిచిన సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూ చించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలన్నారు. అలాగే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆకుల రాజశేఖర్, నాయకులు రాజు, భీంరెడ్డి, శంకర్, మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘కూచిపూడి’లో ప్రతిభ
ఆదిలాబాద్: శాసీ్త్ర య కళకు ఆదరణ తగ్గిపోతున్న ప్ర స్తుత తరుణంలో జై నథ్ మండల కేంద్రానికి చెందిన చిన్నారి సామ మ హతి కూచిపూడి నృత్యం కోర్సులో ఉత్తీర్ణత సాధించింది. జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో మిట్టు రవి పర్యవేక్షణలో నాలుగేళ్లుగా నృత్యంలో శిక్షణ తీసుకుంటుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ కోర్సు చేస్తూ ప్రాక్టికల్, థియరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు రవి తెలిపారు. ఈ సందర్భంగా బాల కేంద్రం తల్లిదండ్రుల సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. -
చిత్తగూడను సందర్శించిన అధికారులు
నార్నూర్: గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు మౌలిక వసతులు కల్పించకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని మండలంలోని మాలేపూర్ పంచాయతీ పరిధి చిత్తగూడ గ్రామస్తులు వారం క్రితం ఉమ్రీ వాగు వద్ద నిరసన వ్యక్తం చేసిన విషయం విధితమే. ఈ మేరకు గ్రామాన్ని స్థానిక తహసీల్దార్ జాడి రాజలింగు, ఎంపీడీవో గంగాసింగ్, ఎస్సై అఖిల్ బుధవారం సందర్శించారు. సమస్యలపై ఆరా తీశారు. గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేదని, రవాణా కష్టాలు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. రోడ్డుకు మరమ్మతులు, కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఆర్టీసీకి పండుగ
ఆదిలాబాద్: బతుకమ్మ, దసరా సీజన్ ఆర్టీసీకి కలి సొచ్చింది. పండుగ సెలవుల నేపథ్యంలో సెప్టెంబ ర్ 20 నుంచి ఈనెల 6వరకు యాజమాన్యం ప్రత్యేక బస్సులను నడపింది. 17 రోజుల పాటు స్పెషల్ స ర్వీసులతో సంస్థకు భారీగా ఆదాయం సమకూరింది. బతుకమ్మ పండుగకు ఆడపడుచులు పట్టణాల నుంచి ఊర్లకు చేరుకోవడం, దసరాకు విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి దూర ప్రాంతాల నుంచి సొంతూర్లకు రావడంతో బస్సులు కిటకిట లాడాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ఈ సారి రెగ్యులర్ బస్సులతో పాటు రీజియ న్ వ్యాప్తంగా 599 ప్రత్యేక సర్వీసులను నడిపింది. గతేడాది పండుగ సందర్భగా రూ.19.42 కోట్ల ఆదాయం రా గా.. ఈసారి రూ.24.11కోట్ల ఆదా యం సమకూరింది. గతేడాదితో పోలిస్తే రూ.4.59 కోట్ల అదనపు ఆమ్దాని సమకూరడం విశేషం. పకడ్బందీ ప్రణాళికతో.. పండుగ రద్దీకి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా బస్సులను నడిపి ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చే ర్చారు. గతేడాది 412 ప్రత్యేక బస్సులు నడపగా, ఈసారి 414 స్పెషల్ సర్వీసులు నడపాలని తొలుత నిర్ణయించారు. రద్దీ పెరగడంతో మరో 185 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో మొత్తంగా 599 బస్సులను గతనెల 20 నుంచి ఈనెల 6 వరకు నడపడం గమనార్హం. అగ్రస్థానంలో నిర్మల్ డిపో.. ఆదాయం విషయంలో నిర్మల్ డిపో ఈ సారి కూడా అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది ఈ డిపో పరిధిలో రూ.4.96 కోట్ల ఆదాయం సమకూరగా, ఈసారి రూ.6.53 కోట్ల ఆదాయంతో దూసుకెళ్లింది. రూ.1.57కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. రీజియన్ వ్యాప్తంగా పరిశీలిస్తే మొత్తం బస్సులు 44 లక్షల కిలోమీటర్ల మేర తిరిగాయి. 83శాతం ఆక్యుపెన్సీ రేషియోతో రూ. 24.11 కోట్ల ఆదాయం సమకూరింది. అదనపు బస్సులతో.. రూ.1.85 కోట్లు రీజియన్ వ్యాప్తంగా మొత్తంగా 599 అదనపు బస్సులను నడిపారు. ఈ సర్వీసులు మొత్తం 3.04 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి. 82,921 మంది ప్ర యాణికులు రాకపోకలు సాగించగా, 92 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో రూ.1.85 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వివరించారు. కలిసొచ్చిన అదనపు చార్జీ.. పండుగ సమయంలో ఈసారి ప్రయాణికులపై ఆర్టీసీ అదనపు చార్జీలను వసూలు చేసింది. ప్రత్యేక బస్సుల్లో ఏకంగా 50శాతం అధికంగా వసూలు చేయడం గమనార్హం. గతంలో సూపర్ లగ్జరీ, లహరి, రాజధాని వంటి ఉన్నతశ్రేణి సర్వీసుల్లోనే అదనపు చార్జీలు ఉండగా ఈసారి స్పెషల్ బస్సులన్నింటిలోనూ అదనపు వడ్డన చేయడంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడ్డాయి. ‘మహాలక్ష్మి’లే అధికం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో ఆర్టీసీలో మొత్తం 49,31,476 మంది ప్రయాణించారు. వీరి లో మహాలక్ష్మి లబ్ధిదారులే అధికంగా ఉన్నారు. మ హాలక్ష్ములు 32,60,025 మంది ఉండగా, టికెట్ డ బ్బులు చెల్లించి ప్రయాణించిన వారు 16,71,451 మంది ఉన్నారు. అత్యధికంగా నిర్మల్ డిపో పరిధి లో 13,73,205 మంది ప్రయాణించగా, ఇందులో 9,99,123 మంది మహాలక్ష్ములు ఉన్నారు. రీజియన్ పరిధిలో డిపోల వారీగా సమకూరిన ఆదాయం డిపో ఆదాయం (రూ. లక్షల్లో) ఆదిలాబాద్ 550.84 భైంసా 234.97 నిర్మల్ 653.81 ఉట్నూర్ 141.07 ఆసిఫాబాద్ 277.90 మంచిర్యాల 552.41సమష్టి కృషితోనే సాధ్యం పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకొని రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి హైదరాబాద్కు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ముందుకు సాగాం. సమష్టి కృషితోనే ఈ ఏడాది అధిక ఆదాయం సమకూరింది. రాబోయే రోజుల్లో సైతం ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తాం. – ఎస్. భవానీ ప్రసాద్, రీజినల్ మేనేజర్ -
నాణ్యమైన వైద్యసేవలందించాలి
ఆదిలాబాద్టౌన్: రోగులకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సిబ్బందితో తన చాంబర్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతాశిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. నవజాత శిశువుల మరణాల రేటు 10 లోపు తగ్గించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు. గర్భిణుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, హైరిస్క్ ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. టీబీ లక్షణాలు ఉన్నవారికి స్క్రీనింగ్ చేసి వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, డీపీఓ దేవిదాస్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేవపూర్ పీహెచ్సీ తనిఖీ తలమడుగు: మండలంలోని దేవపూర్ పీహెచ్సీని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. -
పులకించిన పోరుగడ్డ
కెరమెరి(ఆసిఫాబాద్):జల్.. జంగల్.. జమీన్ కోసం పోరుసలిపి అసువులు బాసిన ఆదివాసీ పోరాట యోధుడు కుమురంభీం స్మరణతో పోరుగడ్డ పులకించింది. రణభూమి జోడేఘాట్లో వీరుడి 85వ వ ర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమా ర్ హాజరై భీంవిగ్రహానికి పూలమాలలు వేసి, ఆయ న సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు. ఎన్ని కల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వేదికపైకి వెళ్లలేదు. దర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరికి వారుగా వచ్చి నివాళులర్పించి వెళ్లిపోయారు. సంప్రదాయపూజలు కుమురంభీంకు ఆయన వారసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. భీం సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. ముందుగా ఆచార, వ్యవహారాలతో పాత జెండాలు తీసేసి కొత్త జెండాలు ఆవిష్కరించారు. అంతా వరుసక్రమంలో నిల్చుని జెండాలకు మొక్కారు. ధూప, దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. కోడి, మేకలతో జాతకం చూశారు. భీం ఆశయాలు నెరవేర్చుతాం: మంత్రులు కుమురం భీం ఆశయాలు నెరవేర్చుతామని మంత్రులు జూపల్లి, అడ్లూరి అన్నారు. ఆదివాసీలను సంఘటితం చేసి వారి హక్కుల సాధనకు పోరాడిన వీరుడు కుమురంభీం అని కొనియాడారు. తెలంగా ణ రాష్ట్ర సాధనలో ఆయన స్ఫూర్తి ఎంతో ఉందని పేర్కొన్నారు. 1935 నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి వారి బలగాలను ఎదురించారని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధికి రూ.740 కోట్లతో రోడ్లు, గిరి జన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. విద్య, ఆశ్రమ పాఠశాలలను మరింత తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వేదికపై మాట్లాడలేకపోతున్నామని అన్నారు. ‘కుమురం’ స్ఫూర్తితో ముందుకు..: కలెక్టర్ కుమురం భీం స్ఫూర్తితో ముందుకు సాగుదామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చా రు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడతామని పేర్కొన్నారు. భీం వర్ధంతికి ఉచిత బస్సు సౌకర్యం, భోజనం వసతులు కల్పించామన్నారు. అనంతరం భీం మనుమడు కుమురం సోనేరావు కు టుంబానికి కలెక్టర్ నూతన వస్త్రాలు అందించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు పాటగూడ, జోడేఘాట్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గుస్సాడీ నృత్యాలు కనువిందు చేశాయి. ఐసీడీఎస్, రెవెన్యూ, ఐటీడీఏ, సఖీ, వైద్యారోగ్యశాఖ, కొలాం అభివృద్ధి, ఇప్పుపూలు, విస్తరాకుల తయారీ తదితరస్టాళ్లు ఆకట్టుకున్నాయి. నివాళులర్పించినవారిలో.. ‘స్థానిక’ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దర్బార్ రద్దు చేయగా భీం ఆరాధికులు అనుకున్న స్థాయిలో హాజరు కాలేదు. మంత్రులు, కలెక్టర్తోపాటు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్పాటిల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎఫ్వో నీరజ్కుమార్, ఆర్డీవో లోకేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీడీ రమాదేవి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, భీం మనుమడు కుమురం సోనేరావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ, నాయకులు విశ్వప్రసాద్, శ్యాంనాయక్ తదితరులు భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినవారిలో ఉన్నారు. -
ప్రొసీడింగ్.. జాప్యం
కైలాస్నగర్: అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్– 2020 స్కీం కింద ఫీజు లో 25శాతం రాయితీ కల్పిస్తూ మే 3వ తేదీ వరకు ఈ పథకాన్ని అమలు చేసింది. అయితే ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో దీనికి ఆశించిన మేర స్పందన లభించలేదు. దరఖాస్తులు పెద్ద సంఖ్యలో అందినప్పటికీ ఫీజు చెల్లింపునకు మాత్రం అంతగా ముందుకు రాలేదు. మరోవైపు ఫీజు చెల్లించిన వారి విషయంలో బల్దియా అధికారులు అలసత్వం ప్రదర్శి స్తున్నారు. క్షేత్రసాయి పరిశీలనలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రొసీడింగ్ ఆర్డర్ల జారీలో తీవ్ర జాప్యమవుతోంది. దీంతో ఫీజు చెల్లించిన వారికి నిరీక్షణ తప్పడం లేదు. స్పందన నామమాత్రమే.. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీంకు 2020లో శ్రీకా రం చుట్టింది. నాడు మీసేవ కేంద్రాల్లో రూ.1000 చె ల్లించి దరఖాస్తు చేసుకున్న వారి ప్లాట్లను క్రమబద్ధీ కరించాలని ఇటీవల కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. 25శాతం రాయితీతో కూడిన ఫీజు చెల్లింపున కు రెండు నెలల పాటు అవకాశం కల్పించింది. దీంతో బల్దియాకు భారీగా ఆదాయం సమకూరుతుంద ని భావించారు. అయితే ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.దరఖాస్తుదారుల్లో సగంలో సగం మంది కూడా ఫీజు చెల్లించలేదు. చెల్లింపులోనూ సాంకేతిక సమస్యలు తలెత్తడం, పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరిదిద్దాల్సిన సంబంధిత అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, చాలామంది ప్లాట్లను విక్రయించడం, కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని వెనుకడుగు వేయడం వంటి కారణాలతోనే ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. వేల సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ ఫీజు చెల్లించేందుకు మాత్రం వారు అంతగా ముందుకు రానట్లుగా అధికారులు చెబుతున్నారు. ఫీజు చెల్లించినా.. అందని ప్రొసీడింగ్ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి నెలల తరబడి ప్రొసీడింగ్ ఆర్డర్లు అందించకపోవడం బల్దియా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాలో ఇంకా 602 మందికి ప్రొసీడింగ్ కాపీలు అందించాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి అందించాల్సిన అధికారుల తీరుపై దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రొసీడింగ్ అందకపోవడంతో ఇళ్లను నిర్మించుకోవాలని భావిస్తున్న వారు అనుమతుల కోసం ఇబ్బందులు పడుతున్నా రు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సత్వరం అందేలా చూడాలని కోరుతున్నారు. మున్సిపల్లో అందిన దరఖాస్తులు : 22,489 ఫీజు చెల్లింపునకు అర్హులు : 17,854 ఫీజు చెల్లించిన వారు : 4,498 జారీ చేసిన ప్రొసీడింగ్ పత్రాలు : 3,806 బల్దియాకు చేకూరిన ఆదాయం : రూ.9కోట్లు ప్రక్రియ వేగవంతం చేశాం ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుదారుల ప్లాట్ల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేశాం. ఇందుకోసం పది మంది వార్డు ఆఫీసర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. వారికి లాగిన్ ఐడీలు సైతం కేటాయించాం. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి ప్రొసీడింగ్ ఆర్డర్లు అందించేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. – సుమలత, టౌన్ప్లానింగ్ అధికారి -
ఇక వారి పింఛన్ డబ్బులు బ్యాంకు ఖాతాలకే..
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమై ఆరేళ్లుగా మావలలోనే చేయూత పింఛన్ డబ్బులు పొందుతున్న వారి కష్టాలు ఎట్టకేలకు దూరం కానున్నాయి. ఇక నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతా ల్లోనే జమ కానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు.మున్సిపల్ పరిధిలోని 13 కాలనీలకు..ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న దస్నాపూర్, దోబీకాలనీ, దుర్గానగర్, హన్మాన్నగర్, న్యూహౌసింగ్బోర్డు, కై లాస్నగర్, పిట్టలవాడ, రాంనగర్, షాద్నగర్, సుభాష్నగర్, టైలర్స్కాలనీ, టీచర్స్కాలనీ, కేఆర్కే కాలనీలు గతంలో మావల మేజర్ గ్రామ పంచాయతీ పరిదిలో ఉండేవి. 2019లో పునర్విభజనలో భాగంగా వీటిని ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో చేర్చారు. పట్టణ పరిధిలోని పింఛన్దారులకు పింఛన్ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. గ్రామీ ణ ప్రాంత లబ్ధిదారులకు మాత్రం పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తున్నారు. అయితే ఈ కాలనీలు ము న్సిపల్లో విలీనమై ఆరేళ్లవుతున్నా వీరికి మాత్రం దస్నాపూర్, మావలలోని పోస్టాఫీసుల ద్వారానే పింఛన్ చెల్లిస్తూ వస్తున్నారు. ఈ నగదు తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు ఆయా కాలనీల నుంచి ప్రతి నెలా అక్కడికి ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వస్తోంది. అలాగే రద్దీ ఉండటంతో గంటల తరబడి నిరీక్షణ తప్పని పరిస్థితి. ఈ క్రమంలో వారి ఇక్కట్లను గుర్తించిన కలెక్టర్ వారికిచ్చే పింఛన్ను మున్సిపల్ ద్వారానే చేపట్టాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వచ్చే నెల నుంచి ఆయా కాలనీల్లోని 1608 మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ కానున్నాయి.మరి ఆ రెండు కాలనీల పరిస్థితి..ఇదిలా ఉంటే ఆదిలాబాద్ రూరల్ మండల పరి ధిలో గ్రామ పంచాయతీగా ఉన్న అనుకుంట గ్రా మాన్ని మున్సిపల్ 4వార్డులో అలాగే రాంపూర్ గ్రామాన్ని 17వ వార్డులో విలీనం చేశారు. ప్రస్తుతం రాంపూర్లో 320 మంది, అనుకుంటలో 235 మంది పింఛన్ లబ్ధిదారులున్నారు. నిబంధనల ప్రకా రం వీరికి కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే నగదు చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా 13 కాలనీల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా అందించాలని నిర్ణయించిన అధికారులు ఈ రెండు కాలనీలను మాత్రం ఎందుకు విస్మరించారనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే వారికి స్థానికంగానే పోస్టాఫీసులు అందుబాటులో ఉన్నందున ప్రస్తుతం అక్కడ అమలు చేయడంలేదని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే వాటిని కూడా పట్టణ పరిధిలోకి తీసుకొస్తామని పేర్కొంటున్నారు.మున్సిపల్ పరిధిలోకి చేరినలబ్ధిదారుల వివరాలు..కాలనీ లబ్ధిదారుల సంఖ్యదస్నాపూర్ 305దోబీకాలనీ 104దుర్గానగర్ 64హన్మాన్నగర్ 58న్యూహౌసింగ్బోర్డు 82కై లాస్నగర్ 50పిట్టలవాడ 187రాంనగర్ 320షాద్నగర్ 27సుభాష్నగర్ 151టైలర్స్కాలనీ 50టీచర్స్కాలనీ 58కేఆర్కే కాలనీ 142ఈకేవైసీ నమోదు చేసుకోవాలిపట్టణ పరిధిలోని 13 కాలనీల పింఛన్దారులకు ఇచ్చే సొమ్మును ఇక నుంచి నేరుగా మున్సిపల్ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నాం. ఇందుకోసం లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్టివేట్ (ఈకేవైసీ) చేయించుకోవాలి. బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డుతో కూడిన వివరాలను ఈ నెల 25లోపు మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలి. జాప్యం చేస్తే పింఛన్ జమ చేయడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.– రాథోడ్ రవీందర్, డీఆర్డీఓ -
పోరాటయోధుడు కుమురంభీం
ఆదిలాబాద్రూరల్: జల్, జంగల్, జమీన్తో పాటు ఆదివాసీల హక్కుల సాధన కోసం నిజాం సర్కార్తో కుమురం భీం అనేక పోరాటాలు చేశారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. హీరా సుకా జాగృతి సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం కుమురంభీం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన హాజరయ్యారు. కుమురంభీం, రాంజీగోండ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, పోరాటయోధుడు కుమురం భీం జీవి తం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశ య సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నా రు. అనంతరం కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న కొడప సొనేరావ్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, డీఎస్పీ జీవన్ రెడ్డి, జాగృతి సమితి జిల్లా అధ్యక్షుడు సిడాం రాంకిషన్, ఆదివాసీ సంఘాల నేతలు మడావి రాజు, కుర్సేంగే తానాజీ, కుమ్ర రాజు, గేడం వనిత, గేడం గీత, ఆత్రం అనసూయ, యాదవ్రావ్, బాపూరావ్, లక్ష్మణ్, ఆనంద్రావ్, మనోహర్, శంకర్, సుభాష్ పాల్గొన్నారు. కై లాస్నగర్: భూ భారతి పెండింగ్ దరఖాస్తులు ఈ నెలాఖరులోగా పరిష్కరించి నివేదికలు అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ మాడ్యూల్స్లో అందిన దరఖాస్తులు, పరిష్కారమైన, పెండింగ్లో ఉన్న, నోటీసులు జారీ చేసిన, క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన దరఖా స్తుల వివరాలపై మండలాల వారీగా సమీక్షించారు. దరఖాస్తుల పరిశీలనలో అలసత్వం వహించవద్దన్నారు. ప్రతీ మండలంలో రెండు టీంలను ఏర్పాటు చేసి సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ సలోని తదితరులు పాల్గొన్నారు. ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి కై లాస్నగర్: వాల్మీకి మహర్షి జయంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా బీసీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని వాల్మీకి చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి -
అప్రమత్తంగా ఉండాలి
తాంసి: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మహారాష్ట్ర నుంచి మద్యం, డబ్బు వంటివి అక్రమంగా రవాణా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, రూరల్ సీఐ ఫణిందర్, ఎస్సై జీవన్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
కై లాస్నగర్: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు. తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నామినేషన్ల ప్రక్రియపై జిల్లాలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నామినేషన్ల స్వీకరణ నుంచి అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వరకు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, విత్డ్రా, గుర్తుల కేటాయింపు ప్రక్రియతో పాటు ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలన్నారు. సమయపాలన పక్కాగా పాటించాలని, ఆర్వో గదిలో వాల్క్లాక్ ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అనే దాన్ని ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారించుకోవాలన్నారు. ప్రక్రియ అంతా వీడియోగ్రఫీ చేయించాలన్నారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేయాలని తెలిపారు. పోటీలో నిలిచే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు అకౌంట్ ఖాతా తెరిచి నామినేషన్ల సమయంలోనే అందించాలన్నారు. ఎన్నికల ఖర్చులు మొత్తం ఈ ఖాతా నుంచే నిర్వహించాలని తెలిపారు. ప్రతీ ఆర్వో కార్యాలయంలో అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేలా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. నోటిఫికేషన్ జారీకి ముందే మాక్ నామినేషన్ ప్రక్రియ నిర్వహించాలని తద్వారా నిర్వహణలో తప్పిదాలకు అవకాశం లేకుండా ఉంటుందన్నారు. సమస్యత్మాక కేంద్రాలపై తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్హెచ్ఓలు సంయుక్తంగా చర్చించి వాటి వివరాలతో కూడిన జాబితాలను గురువారంలోగా అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, సబ్ కలెక్టర్ యువరాజ్, ఏఎస్పీ కాజల్ సింగ్, జెడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలపై ఉత్కంఠ
సాక్షి,ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి గత నెలలో షెడ్యూల్ జారీ అయ్యింది. సాధారణంగా షెడ్యూల్ ప్రకటన తర్వాత క్షేత్రస్థాయిలో రాజకీయాలు వేడెక్కాలి. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ నేపథ్యంలో ఎన్నికలు ఇ ప్పుడు ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగానే జరుగుతాయా.. లేనిపక్షంలో పరిణామాలు ఎలా ఉంటాయని రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన న్యాయస్థానంలోఈ విచారణ సాగను న్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే నెలకొంది. గత నెలలో షెడ్యూల్.. సెప్టెంబర్ 29న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ జారీ అయిన విషయం తెలిసిందే. పరిషత్ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించేలా అందులో ప్రకటించారు. పరిషత్ మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం రావాల్సి ఉంది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో హైకోర్టులో బుధవారం విచారణ సాగనుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం స్పందనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిజర్వేషన్లు నిలిచేనా..? ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్ జనరల్ (మహిళ)కు కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే జిల్లాలో 20 పరిషత్ స్థానాలకు గాను 8 ఎస్టీ, 8 బీసీ, 2 జనరల్, 2 ఎస్సీలకు రిజర్వేషన్ ఖరారయ్యాయి. ఇందులో సగం స్థానాలను మహిళలకు కేటాయించారు. అలాగే ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ల రిజర్వేషన్ల ఖరారు సైతం ఇప్పటికే పూర్తయింది. హైకోర్టు తీర్పు తర్వాత రోజే గురువారం పరిషత్ ఎన్నికలకు సంబంధించి మొదటి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. అయితే గ్రామాల్లో ఇప్పటివరకు ఈ ఎన్నికలకు సంబంధించి వేడి కనబడటం లేదు. రాజకీయ పార్టీలు కూడా వేచి చూసే ధోరణిలో న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. -
మాతా శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యమని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని శాంతినగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలతో మంగళవారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవజాతి శిశు మరణాల రేటును 10లోపు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే గర్భిణుల ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. ఇందులో డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, మెడికల్ ఆఫీసర్ ఇఫత్, వినోద్ కుమార్, సీఓ రాజారెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
జాతీయ మహాసభల్లో జిల్లా టీచర్లు
ఆదిలాబాద్టౌన్/ఇచ్చోడ: రాజస్థాన్లోని జండోలి ఏబీఆర్ఎస్ఎం జాతీయ మహాసభల్లో టీపీయూఎస్ జిల్లా బాధ్యులు సోమవారం పా ల్గొన్నారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షానిక్ మహాసంఘ్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా మహాసభలను చేపడుతున్నారు. ఇందులో జా తీయ నూతన విద్యా విధానం, టెట్ సమస్య పరిష్కారం, పాత పెన్షన్ విధానం అమలు, సర్వీస్ రూల్స్, బడ్జెట్లో విద్యకు అధిక ప్రాధాన్యం, దేశ వ్యాప్తంగా ఒకే పీఆర్సీ, ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు తదితర అంశాలపై చ ర్చించారు. ఈ మహాసభల్లో టీయూపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సునిల్ చౌహాన్, గోపీకృష్ణ, కిరణ్, మనోజ్రెడ్డి, జీజాబాయి, సంగీత తదితరులున్నారు. -
‘పరిషత్’కు రెడీ
కై లాస్నగర్: పరిషత్ తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 9నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. మండల ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లాస్థాయి అధికా రులనే జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారులుగా నియమించింది. ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారులుగా గెజిటెడ్ హోదా కలిగిన జూనియర్ లెక్చరర్లు, పీజీ హెడ్మాస్టర్లను ఎంపిక చేసింది. అయితే వీరు పని చేసే మండలం, సొంత మండలం కాకుండా ఇతర మండలాల బాధ్యతలు అప్పగించింది. నామినేషన్ల స్వీకరణ మొదలు పరిశీలన, తొలగింపు, ఫిర్యాదుల స్వీకరణ, బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన, ఫలితాల వెల్లడి వరకు ఆర్వోలు కీలకపాత్ర పోషించనున్నారు. వీరికి ఇది వరకే శిక్షణ ఇవ్వగా తాజాగా స్టేజ్–2 ప్రిసైడింగ్ అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం శిక్షణ అందించారు. దీంతో శిక్షణ ప్రక్రియ పూర్తయింది. ఎంపీడీవో కార్యాలయాల్లో.. నామినేషన్ల దాఖలుకు అవసరమైన పత్రాలన్నింటి నీ ఇది వరకే ఎంపీడీవో కార్యాలయాలకు చేరవేసి సిద్ధంగా ఉంచారు. ఆయా కార్యాలయాల్లోనే నామపత్రాలు స్వీకరించనున్నారు. అయితే మండలా ల్లోని ఎంపీటీసీ స్థానాల సంఖ్య ఆధారంగా 3 నుంచి 4 ఎంపీటీసీ స్థానాలను కలిపి ఓ క్లస్టర్గా విభజించారు. ప్రతీ క్లస్టర్కు గెజిటెడ్ హోదా కలిగిన జూని యర్ లెక్చరర్, పీజీ హెచ్ఎంలను ఆర్వోలుగా నియమించారు. ప్రక్రియ సజావుగా సాగేలా రిజ ర్వు ఆర్వోలను సైతం అందుబాటులో ఉంచారు. అయితే మావల మండలంలో కేవలం ఐదు ఎంపీటీసీ స్థానాలే ఉండటంతో వాటన్నింటినీ ఒకే క్లస్టర్గా ఏర్పాటు చేసి ఆర్వోను నియమించారు. ఎంపీటీసీ స్థానాలకు ఏఆర్వోలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించారు. నామినేషన్ల ప్రక్రియ నిర్వహణపై వీరందరికీ మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అయితే బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైన టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈమేరకు జిల్లాకు ఉత్తర్వులు రావాల్సి ఉంది. అవి అందిన వెంటనే అవసరమైన చర్యలు చేపడుతామని అధికారులు చెబుతున్నారు. అందరి దృష్టి హైకోర్టు నిర్ణయంపైనే.. ఓ వైపు తొలి విడత స్థానిక సమరానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు అందరి దృష్టి హైకోర్టు నిర్ణయంపై కేంద్రీకృతమైంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుండటంపై దా ఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్ర ధాన న్యాయస్థానంలో ఈ నెల 8న విచారణ ఉంది. అయితే కోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల ప్రక్రియ పై ముందుకెళ్లే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రకటించి న రిజర్వేషన్లే ఉంటాయా.. లేక మళ్లీ ఏమైనా మారుతుందా అనే దానిపై కూడా సర్వతార చర్చ సాగు తుండడం గమనార్హం.జిల్లాలోని పరిషత్ స్థానాలు, రిటర్నింగ్ అధికారుల వివరాలు : జెడ్పీటీసీ స్థానాలు : 20 రిటర్నింగ్ అధికారులు : 22 ఎంపీటీసీ స్థానాలు : 166 (ఎంపీటీసీ క్లస్టర్లు : 52) రిటర్నింగ్ అధికారులు : 59 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు : 59 -
స్లాట్ బుకింగ్పై అవగాహన కల్పించాలి
ఆదిలాబాద్టౌన్: కిసాన్ కపాస్ యాప్ స్లాట్ బుకింగ్పై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో ఆదిలాబాద్, నిర్మల్ ఏఈవోలకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. యాప్లో స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత ఏడు రోజుల వరకు పంట విక్రయించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మూడుసార్లు బుకింగ్ చేసిన తర్వాత కూడా మార్కెట్కు పత్తి తీసుకురాకపోతే బ్లాక్లిస్టులో పడుతుందని తెలి పారు. ఆ తర్వాత రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి విక్రయించుకోవచ్చని సూచించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పత్తి విక్రయించే తేది ప్రకటించిన తర్వాత స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఏఈవోలు ఆయా గ్రామాల్లో విద్యావంతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్లాట్ బుకింగ్ కోసం ఎవరు కూడా రైతుల నుంచి డబ్బులు తీసుకోవద్దని సూచించారు. ఫిబ్రవరి వరకు పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. హెల్ప్డెస్క్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 8 నుంచి 12 శాతం తేమతో సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుందని, ఈ మేరకు రైతులు నాణ్యమైన పత్తిని తీసుకురావాలని కోరారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మా ర్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్స్వామి, మార్కెటింగ్ శాఖ ఏడీ గజానన్, టెక్నికల్ ఏవో శివకుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈవోలు తది తరులు పాల్గొన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి కై లాస్నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకతతో నిష్పక్షపాతంగా నిర్వహించా లని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులు, స్టేజ్–1 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనుసరించాల్సిన విధి విధానాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఆర్వోలదే కీలకపాత్ర అన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూ చించారు. ప్రిసైడింగ్ అధికారులకు మండలాల్లోనే శిక్షణ ఇచ్చినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీపీవో రమేశ్, డీఎల్పీవో ఫణిందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్
గెలుపే లక్ష్యంగా పని చేయాలి ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబా ద్ ఎంపీ గొడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఔ త్సాహికులకు సంబంధించిన ప్రాథమిక సమాచా రం ఇప్పటికే సేకరించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, జిల్లాలో సంస్థాగతంగా పార్టీ ఎంతగానో బలపడిందని తెలిపారు. కష్టపడిన ప్రతీ కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, నాయకులు దినేష్ మటోలియా, మయూర్చంద్ర, రమేశ్, రాజు, విజయ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.ఆదిలాబాద్టౌన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 32 మంది అర్జీదారులు రాగా బాధితుల సమస్యలను ఎస్పీ ఓపికగా విన్నారు. సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సుదూర ప్రాంతాల వారు నేరుగా 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలుస్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామ ని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని స్టేషన్ల అధికారులు, సీఐలు, డీఎస్పీలతో సో మవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికలకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఇదివరకే చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అక్రమంగా డబ్బు, మద్యం, ఎన్నికలను ప్రభావితం చేసే బహుమతులు రవాణా కాకుండా చూడాలన్నారు. సమస్యలను సృష్టించే వారిని, రౌడీలను, సస్పెక్ట్లను బైండోవర్ చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం, వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా అధి కారుల అనుమతులు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీలు ఎల్.జీవన్రెడ్డి, పోతారం శ్రీనివాస్, సీఐలు సునిల్కుమార్, నాగరాజు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
● ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి ‘జూపల్లి’ కై లాస్నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్య నాయకులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పార్టీ పరంగా బలమైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవడంతో పాటు జెడ్పీలను సైతం కై వసం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఆత్రం సుగుణ, నిర్మల్, ఆసిపాబాద్ జిల్లాల అధ్యక్షులు శ్రీహరిరావు, విశ్వ ప్రసాద్రావు, బైంసా మార్కెట్ చైర్మన్ ఆనంద్రావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రాథోడ్ బాపూరావ్, సోయం బాపూరావ్, ఆత్రం సక్కు, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, అజ్మీరా శ్యామ్నాయక్, నాయకులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పాల్గొన్నారు. -
బతుకమ్మ సంబురాలు
జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో సోమవారం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొని తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడి పాడారు. ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యం పొందడం గొప్ప విషయమని అన్నారు. ఇందులో అదనపు ఎస్పీలు కాజల్ సింగ్, సురేందర్రావు, డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీఐలు, ఎస్సైలు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తలమడుగు మండలం బరంపూర్లో సద్దుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ఉయ్యాల పాటలు, చప్పట్లతో బతుకమ్మ ఆడారు. అనంతరం పూల సింగిడిలను డప్పుచప్పుళ్ల నడుమ నిమజ్జనానికి తరలించారు. వెళ్లిరా బతుకమ్మ అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు. – ఆదిలాబాద్టౌన్/తలమడుగు -
భీం త్యాగానికి గౌరవం
కెరమెరి(ఆసిఫాబాద్): నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కు ల కోసం ప్రాణాలర్పించిన భీం త్యాగాలను రాష్ట్రప్ర భుత్వం గుర్తించింది. జల్.. జంగల్.. జమీన్.. నినాదంతో పోరాడి అమరుడైన కు మురంభీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కెరమెరి మండలం జోడేఘాట్లో మంగళవారం భీం వర్ధంతి అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం నివాళులర్పించనున్నారు. ఉదయం 8గంటలకు జెండాలు ఆవిష్కరించనున్నారు. 9గంట లకు సమాధి వద్ద పూజలు చేసి, 10గంటలకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఇప్పటికే ఆసిఫా బాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఏర్పాట్లు పరిశీలించి, అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. పదివేల మందికి పైగా హాజరు.. ప్రభుత్వం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంతో అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే భీం విగ్రహానికి మెరుగులు దిద్దారు. ట్రాక్టర్లతో పరిసరాలు, పార్కింగ్ స్థలాలు చదును చేయించి.. ప్రజలు కూర్చునేందుకు వీలుగా టెంట్లు వేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు. భోజన సదుపాయం కూడా కల్పించనున్నారు. 10వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వే స్తుండగా, 12 వేల మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నారు. హెలిప్యాడ్ సైతం సిద్ధం చేశారు. మారుమూల ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఏఎస్పీ, డీఎస్పీతోపాటు సీఐ, ఆర్ఐలు 8 మంది, ఎస్సైలు 25, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు 51 మంది, ఇతర సిబ్బంది 136, డబ్ల్యూపీసీలు 56, హోంగార్డులు 79 మంది, ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. బాంబు, డాగ్స్క్వాడ్తో జోడేఘాట్కు చేరుకునే రహదారుల్లో తని టఖీలు ముమ్మరం చేశారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఏటీడబ్ల్యూవోలు ముగ్గు రు, సీఆర్టీలు, రెగ్యులర్ ఉపాధ్యాయులు 100 మంది, వంట మనుషులు 70 మంది, ఆశ్రమ పాఠశాలల వార్డెన్లు ఐదుగురు, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్పై నియమించారు. ఐకేపీ సిబ్బంది 35 మంది, ఇంజినీరింగ్ శాఖకు చెందిన సిబ్బంది పది మందిని కేటాయించారు. ఆయా శాఖల సిబ్బంది సోమవారం రాత్రే జోడేఘాట్కు చేరుకున్నారు. ఆసిఫాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులను జోడేఘాట్కు నడపనున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. హాజరు కానున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం భీం వర్ధంతిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నారు. అలాగే ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు నివాళులర్పించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కేవలం భీం విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి, పూజలకే పరిమితం కానున్నారు. ఆదివాసీలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు ఏటా నిర్వహించే దర్బారు కోడ్ కారణంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కుమురంభీం విగ్రహం -
నారీ.. బీమారి పరారీ
ఆదిలాబాద్టౌన్: మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించిన ప్రభుత్వం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో ఈ కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. గతనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. రోగాలను గుర్తించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. శస్త్ర చికిత్సల నిమిత్తం పలువురిని రిమ్స్కు రిఫర్ చేశారు. రిమ్స్తో పాటు ఉట్నూర్ జిల్లా ఆస్పత్రిలో ఉన్న వైద్య నిపుణులతో జిల్లాలోని ఆయా పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పరీక్షలు నిర్వహించారు. దాదాపు పక్షం రోజుల పాటు 209 క్యాంపులను ఏర్పాటు చేశారు. వేలాది మంది మహిళలకు స్క్రీనింగ్ చేశారు. ఈఎన్టీ, కంటి పరీక్షలు, రక్తపోటు, డయాబెటీస్, దంత పరీక్షలు, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్, గర్భిణులకు రక్తహీనత పరీక్షలతో పాటు పిల్లలకు పీడియాట్రిక్ సేవలు అందించారు. అలాగే చర్మ వ్యాధులు, పల్మనాలజీ, సైకియాట్రి, క్షయవ్యాధి స్క్రీనింగ్, వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షతో పాటు వివిధ రకాల సేవలు అందించారు. ఆరోగ్య నియమాలు, పోషకాహార ఆవశ్యకతను వివరించారు. శిబిరాల్లో పలు రోగాలు నిర్ధారణ అయిన వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.విశేష స్పందన..స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 2 బస్తీ దవాఖానాలు, 67 పల్లె దవాఖానాలు, బోథ్ ఏరియా ఆస్పత్రితో పాటు 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ శిబిరాలను మహిళల కోసం ఏర్పాటు చేశారు. పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ వైద్యులు 25 క్యాంపులు, గైనిక్కు సంబంధించి 33, జనరల్ మెడిసిన్ 23, జనరల్ సర్జరీ 13, డెంటల్ 18, పల్మనాలజీ 17, ఈఎన్టీ 19, ఆప్తమాలజీ 23, ఆర్థో 15, డర్మటాలజీ 19, సైకియాట్రిస్ట్కు సంబంధించి 4, మొత్తం 209 క్యాంపులు నిర్వహించారు. ఇందులో కాళ్ల నొప్పులకు సంబంధించి 27,167 మహిళలకు, బీపీకి సంబంధించి 17,552, డయాబెటిస్కు సంబంధించి 16,780, క్యాన్సర్కు సంబంధించి 10,771మంది, అలాగే 1,714 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. ఎనీమియాకు సంబంధించి 9,938 మందికి, మహిళలతో పాటు 814 మంది ఆడపిల్లలకు వివిధ రకాల టీకాలు వేశారు. 10,552 మందికి ఎనీమియాకు సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించారు. యువతులు, మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. 10,742 మందికి టీబీ పరీక్షలు చేపట్టారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ఫుడ్ కిట్లు ఇచ్చేందుకు 376 మంది మహిళలు ముందుకొచ్చారు. సికిల్సెల్తో బాధపడుతున్న 665 మందికి వైద్య పరీక్షలు చేశారు. దీంతోపాటు ఇతర రుగ్మతలతో బాధపడుతున్న 325 మందికి చికిత్స అందించారు. ఈ కార్యక్రమం ఆయా గ్రామాలు, మండల కేంద్రాల్లో నిర్వహించడంతో మహిళలు ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.పకడ్బందీగా చేపట్టాం..జిల్లాలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాం. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలకు ప్రత్యేక వైద్యనిపుణులతో పరీక్షలు నిర్వహించాం. వ్యాధి నిర్ధారణ అయిన వారికి మందులు పంపిణీ చేశాం. 50 మందికి కంటిశుక్లాలు ఉన్నట్లు గుర్తించాం. వారికి ఆపరేషన్కు ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే వివిధ రుగ్మతలతో బాధపడుతున్న మహిళలపై ప్రత్యేక దృష్టి సారించాం.– రాథోడ్ నరేందర్, డీఎంహెచ్వో -
స్థానిక ఎన్నికలు.. నిఘా కట్టుదిట్టం
కైలాస్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా మద్యం, డబ్బు ప్రవాహా నికి అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టింది. నిరంతర నిఘా ఉంచేందుకు వీలుగా జిల్లాలో 14 ఫ్లయింగ్ స్క్వాడ్, మూడు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను నియమించింది. రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖల డివిజన్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో వాహన తనిఖీలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల వద్ద రౌండ్ది క్లాక్ నిఘా ఏర్పాటు చేశారు. రూ.50వేలకు మించి నగదును ఆధారాలు లేకుండా తరలించినట్ల యితే సీజ్ చేయనున్నారు.చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా..ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు అక్రమాలకు ఆస్కారమిచ్చే అనుమానాస్పద ప్రాంతాల్లో స్టాటిక్ సర్వేలెన్స్ టీం (ఎస్ఎస్టీ)లను ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టు భోరజ్తో పాటు ఉట్నూర్ ఎక్స్రోడ్, నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద నిఘా ఉంచేందుకు వీలుగా మూడు టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ఇద్దరు నాయబ్ తహసీల్దార్లు, ఒక పోలీస్ అధికారిని నియమించారు. ఏఎస్డబ్ల్యూవోకు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు వీడియోగ్రాఫర్ నిత్యం వెంట ఉండనున్నారు. రౌండ్ ది క్లాక్ తనిఖీలు చేపట్టనున్న ఈ బృందాల్లో ఓ అధికారి ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు మరో అధికారి సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు. ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ మద్యం, డబ్బు తరలించకుండా చర్యలు తీసుకోనున్నారు.రంగంలోకి ప్రత్యేక బృందాలు..కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా ఆదేశాల మేరకు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ ప్రత్యేక బృందాలు ఆదివారం నుంచి రంగంలోకి దిగాయి. ఎఫ్ఎస్టీలు తమకు కేటాయించిన మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు పర్యవేక్షణతో పాటు అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచనున్నారు. మద్యం, డబ్బు తరలిస్తూ పట్టుబడితే సీజ్ చేస్తారు. చెక్పోస్టుల వద్ద ఉండే ఎస్ఎస్టీలు వాహన తనిఖీలు ముమ్మరం చేశాయి.రూ.50వేలకు మించి తరలిస్తే సీజ్..మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు రూ.50వేలకు మించి నగదు తరలించొద్దు. ఒకవేళ తరలిస్తే దానికి సంబంధించిన రశీదులు చూపించాలి. లేకుంటే ఆ నగదును సీజ్ చేస్తారు. ఇక అక్రమంగా మద్యం తరలిస్తే మాత్రం సరుకు సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తారు. అలాగే రూ.10వేలకు మించి గిప్ట్లను తరలించినట్లయితే వాటిని కూడా సీజ్ చేయనున్నారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలివిడత ఎన్నికల నామి నేషన్ల గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో బరి లో నిలిచే అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు గాను మద్యం, నగదు, బహుమతులు వంటి ప్రలోభాలకు గురిచేసే ఆస్కారముంటుంది. అయితే వీటికి చెక్ పెట్టేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యం దిగుమతికి అవకాశం ఉండటంతో దాన్ని కట్టడి చేయడంపై దృష్టి సారించింది. అలాగే క్షేత్రస్థాయిలో పకడ్బందీ నిఘా ఉంచేలా 14 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. ఇచ్చోడ – సిరికొండ, బోథ్ – సొనాల, జైనథ్ – భోరజ్, బేల –సాత్నాల, తాంసి – భీంపూర్, నార్నూర్ – గాది గూడ వంటి రెండేసి మండలాలకు ఒక టీంను ఏర్పాటు చేయగా మిగతా మండలాలకు ఒక్కో టీం చొప్పున మొత్తం ఏర్పాటు చేశారు. గిరిజన సంక్షేమ అధికారులు, మిషన్ భగీరథ ఏఈలు, నాయబ్ తహసీల్దార్లు, ఐకేపీ ఏపీఎంలు, మండల వ్యవసాయాధికారులు టీం లీడర్గా వ్యవహరిస్తారు. ప్రతీ బృందంలో ఒక పోలీస్ అధి కారి, ఓ వీడియోగ్రాఫర్ కలిపి ముగ్గు రు ఉండనున్నారు. అలాగే ముగ్గురు అధికారులను రిజర్వ్లో ఉంచారు. ఈ బృందాలు తమకు కేటాయించిన మండలాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నాయి. -
నిరంతర నిఘా
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించాలి. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు చేపట్టొద్దు. జిల్లాలో నిరంతర నిఘా ఉంచేందుకు వీలుగా 14 ఫ్లయింగ్ స్క్వాడ్, మూడు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను నియమించాం. ఎక్కడైనా ‘కోడ్’ ఉల్లంఘన జరి గినా, మద్యం, నగదు, బహుమతులు పంపిణీ చేసినట్లు తెలిసినా వెంటనే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం టోల్ఫ్రీ నంబర్ 18004251939 కు సమాచారం అందించాలి. వాటిపై సత్వరమే స్పందించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – రాజర్షి షా, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి -
సాగు నీరందేదెప్పుడో?
తాంసి: మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణ పనులు పూర్తయి ఏడాది దాటినా ఆయకట్టు రైతులకు సాగునీరందని పరిస్థితి. పనులు పూర్తవడంతో అధికారులు ట్రయల్రన్ సైతం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏడాది క్రితం జిల్లా పర్యటన సందర్భంగా దీనిని ప్రారంభిస్తారని అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం పర్యటన వాయిదా పడటంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. రూ.7.34 కోట్లతో పనులు తాంసి మండలంలోని వడ్డాడి సమీపంలో రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 20 ఏళ్ల క్రితం మత్తడివాగు ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2008లో ప్రాజెక్టును ప్రారంభించారు. ఎడమకాలువ ద్వారా ప్రస్తుతం 8500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నిర్మాణ సమయంలో కుడికాలువ పనులు చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఈ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నూతన సాంకేతికతో పైపులైన్ ద్వారా భూసేకరణ సమస్య లేకుండా వడ్డాడి, హస్నాపూర్, ఖోడద్, పొన్నారి శివారు రైతులకు నీటిని అందించాలని నిర్ణయించారు. 1200 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా 2017లో రూ.7.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు గుత్తేదారు పనులను ఏడాది క్రితం పూర్తి చేశారు. ట్రయల్రన్ సైతం సక్సెస్ కావడంతో పోయిన సంవత్సరం రబీ నుంచి సాగు నీరు అందుతుందని రైతులు ఆశపడ్డారు. అయితే ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం. పైపులైన్ ద్వారా చేలకు నీరు కుడి కాలువ వద్ద పంప్హౌస్ నిర్మాణం చేపట్టి అందులో మోటార్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి భూగర్భ పైపులైన్ ద్వారా చేలకు నీరు అందేలా పనులు పూర్తి చేశారు. మొత్తం 9 కిలోమీటర్ల మేర ప్రధాన పైపులైన్తో పాటు 25 బ్లాక్లను ఏర్పాటు చేశారు. ప్రతీ బ్లాక్కు ఐదు ఆటోమెటిక్ వాల్వ్లను ఐదెకరాలకు ఒకటి చొప్పున బిగించారు. నీటి వృథా అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఏడాదైనా ప్రారంభానికి నోచుకోని పరిస్థితి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. నవంబర్ నుంచి అందించేలా చర్యలు ప్రాజెక్టు కుడికాలువ పైపులైన్ పూర్తి కావడంతో పాటు ట్రయల్ రన్ సైతం నిర్వహించాం. కుడి కాలువను అధికారికంగా ప్రారంభించకపోయినా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులకు వచ్చే నవంబర్ నుంచి నీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. – హరీశ్కుమార్, మత్తడివాగు ప్రాజెక్టు ఏఈవెంటనే సాగు నీరందించాలి ప్రాజెక్టు కుడికాలువ లేక ఏళ్లుగా ఎదురుచూశాం. ఇప్పుడు పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోక సాగునీరందని పరిస్థితి. దీంతో రబీలో పంటలు వేయలేకపోతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి త్వరగా సాగునీరందించే చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. – బాగిడి కిష్టయ్య రైతు వడ్డాడి గ్రామం -
జాతీయ రహదారిపై కంటైనర్ను ఢీకొన్న లారీ
గుడిహత్నూర్: మండలంలోని సీతాగోంది స మీపంలో గల జాతీయ రహదారిపై ఆదివారం ఓ కంటైనర్ను లారీ ఢీకొన్న ఘటనలో మంట లు లేచి ఆ వాహనాలు దగ్ధమయ్యాయి. స్థాని కులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ వైపు నుంచి ఆదిలాబాద్ వైపు జాతీయ రహదారిపై వెళ్తున్న కంటైనర్ వెనకాలే మరో లారీ వస్తోంది. అయితే కంటైనర్ను వెనుక వస్తున్న లారీ వేగంగా ఢీకొని ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో ఘర్షణ ఏర్పడి మంటలు చెలరేగాయి. కంటైనర్లో ఉన్న దుస్తులు, ఇతర ఆయుర్వేద మందులు పూర్తి గా దగ్ధమయ్యాయి. ఇద్దరు డ్రైవర్లు వాహనాల ను అక్క డే వదిలి పారిపోయారు. స్థానికుల సమాచా రంతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కంటైనర్ పూర్తి స్థాయిలో దగ్ధమవగా.. లారీ పాక్షికంగా కాలి పోయింది. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్థానికులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలిఇంద్రవెల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చే యాలని ఎంపీ నగేశ్ అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఇందులో పార్టీ నిర్మ ల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, రాజలింగు, బాలాజీ, తుకారాం, రాజేశ్వర్, హనుమంత్రావ్, మారుతి, దిలీప్ తదితరులున్నారు. -
ఆమెదే ఆధిపత్యం
కై లాస్నగర్: స్థానిక సంస్థల్లో మహిళలకు అగ్రపీఠం దక్కనుంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తలరాత మార్చగల శక్తితో పాటు ప్రజాప్రతినిధులుగానూ సత్తా చాటేందుకు ఆమెకు అవకాశం కలగనుంది. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కోటా అమలు చేస్తున్నారు. దీంతో వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ పోటీకి అవకాశం ఉంది. ఫలితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుమెంబర్ వంటి పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. తద్వారా అన్ని రంగాల్లో రాణిస్తున్న అతివలు రాజకీయంగానూ ఆధిపత్యం చాటేందుకు తోడ్పడనుంది. మహిళా ఓటర్లే అధికం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఇటీవల ఓటరు జాబితా ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా 20 గ్రామీణ మండలాల పరిధిలో మొత్తం 4,49,981 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో పురుష ఓటర్లు 2,19,652 మంది, మహిళా ఓటర్లు 2,30,313 మంది, ఇతరులు మరో 16 మంది ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు 10,661మంది అధికంగా ఉన్నారు. ఉట్నూ ర్ మండలంలో అత్యధిక మంది మహిళా ఓటర్లు ఉండగా జిల్లాలోని సగానికి పైగా మండలాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గెలుపోటములను ప్రభాఠి వితం చేసే శక్తి వారికుంది. ఈక్రమంలో రాజకీయ పార్టీలన్నీ వారి మద్దతు కూడగట్టుకునేందుకు య త్నిస్తున్నాయి. వారి అనుగ్రహం ఉంటే గెలుపుఖాయమనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. సీట్లలోనూ వారిదే హవా... ఓట్ల పరంగానే కాకుండా సీట్లలోనూ మహిళలదే ఆధిపత్యం సాగనుంది. 50 శాతం రిజర్వేషన్ల అమలుతో పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సగం సీట్లు వారికే కేటాయించబడ్డాయి. జెడ్పీటీసీలు పది స్థానాలు మహిళలకు కేటాయించగా మరో పది స్థానాలను జనరల్కు కేటాయించారు. అలాగే ఎంపీపీ స్థానాల్లో 8 మహిళలకు, 12 స్థానాలను జనరల్గా కేటాయించారు. ఇవే కాదు అటు సర్పంచ్, వార్డుమెంబర్ పదవులను సైతం సగం సీట్లను మహిళలకే రిజర్వ్ చేశారు. ఈ స్థానాలతో పాటు జనరల్లోనూ మహిళలు పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయనుండడంతో వారి ప్రాతినిధ్యం పెరగనుంది. జిల్లాలోని ఓటర్ల వివరాలు మండలం పురుషులు మహిళలు ఆదిలాబాద్రూరల్ 13,854 14,674 బజార్హత్నూర్ 11,687 12,141 బేల 13,825 13,762 భీంపూర్ 9,312 10,166 భోరజ్ 7,302 7,656 బోథ్ 13,022 14,236 ఇచ్చోడ 17,131 18,114 గాదిగూడ 7,695 8,104 గుడిహత్నూర్ 12,361 12,929 ఇంద్రవెల్లి 16,033 16,416 జైనథ్ 9,741 10,253 మావల 2,103 2,283 నార్నూర్ 11,606 11,775 నేరడిగొండ 11,517 12,352 సాత్నాల 5,271 5,421 సిరికొండ 6,431 6,714 సొనాల 5,293 5,511 తలమడుగు 13,481 14,376 తాంసి 6,515 7,267 ఉట్నూర్ 25,472 26,163 -
శిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు
ఆదిలాబాద్టౌన్: నవజాత శిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం రిమ్స్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. పలు వార్డులను పరిశీలించారు. బాలింతలు, రోగులతో మాట్లాడి వైద్యసేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. 28 రోజుల లోపు పసికందుల మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలోని మూడు మెడికల్ షాపులతో పాటు విజయ డెయిరీ పార్లర్ను తనిఖీ చేశారు. రికార్డులు సరిగా లేకపోవడంతో మెడికల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పునరావృతమైతే షాపులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆస్పత్రిలో అందుబాటులో లేని మందులను మాత్రమే మెడికల్ షాపుల ద్వారా విక్రయించాలన్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, వైద్యులు అనంత్రావు తదితరులు ఉన్నారు. విజయ డెయిరీ పార్లర్కు జరిమానా రిమ్స్ ఆవరణలో కొనసాగుతున్న విజయ డెయిరీ పార్లర్కు మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు జరి మానా విధించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు షాపును ఆయన పరిశీలించారు. డెయిరీలో ఇతర వస్తువులు అమ్మడం, అధిక ధరలకు విక్రయాలు జ రపడం, వస్తువులపై ఉన్న ఎమ్మార్పీ కనిపించకుండా మార్కర్తో దిద్దడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రూ. వెయ్యి జరిమానా విధించారు. మరోసారి పునరా వృతమైతే షాపును సీజ్ చేస్తామని హెచ్చరించారు. భోరజ్ మండలంలో పంట నష్టం పరిశీలన.. సాత్నాల: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భోరజ్ మండలంలో దెబ్బతిన్న పంటలను కలెక్టర్ రాజర్షి షా శనివారం పరిశీలించారు. పెండల్వాడ, శాంగ్వి గ్రామాలను సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, ఎంపీడీవో మహేశ్కుమార్, ఏవో పూజ, ఏఈవో సుజాత, రైతులు ఉన్నారు. -
సర్కారు బడులు వెలవెల
● శనివారం 15 శాతం విద్యార్థులు మాత్రమే హాజరు ఆదిలాబాద్టౌన్: దసరా సెలవులు ముగిసినప్పటికీ విద్యార్థులు బడిబాట పట్టలేదు. దీంతో జిల్లాలోని సర్కారు బడులు శనివారం వెలవెలబోయాయి. 13 రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే కేవలం 15 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. బతుకమ్మ పండగ, బంధువుల ఇంటికివెళ్లడం, కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఉండడంతో బడికి రానట్టుగా తెలుస్తోంది. పాఠశాలల్లో ఉండాల్సిన పిల్లలు ఆరుబయట ఆడుకుంటూ కనిపించారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా కనిపించింది. కాగా, ఉపాధ్యాయుల హాజరు మాత్రం 98 శాతం నమోదైనట్లు విద్యా శాఖాధికారులు తెలిపారు. -
నాగోబా ఆలయంలో పూజలు
ఇంద్రవెల్లి: మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ఐఎఫ్ఎస్,ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జి.త్రినాథ్కుమార్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ను మెస్రం వంశీయులు శాలువా కప్పి సన్మానించారు. నాగోబా ప్రతిమ అందించారు. ఆల య నిర్మాణం, చరిత్ర, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, జాతర నిర్వహణ వివరాల ను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఏమాయికుంట నుంచి సమాక, పాటగూడ రోడ్డును పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన అనుమతుల వివరాలు తెలుసుకున్నారు. అటవీ రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఉట్నూర్ ఎఫ్డీవో రేవంత్చంద్ర, డీఆర్వో నరేశ్, ఇంద్రవెల్లి, బేల ఎఫ్ఆర్వోలు సంతోష్, గులాబ్సింగ్, ఎఫ్ఎస్వోలు రాజేందర్ తదితరులు ఉన్నారు. -
వరద.. గో‘దారి’లో
సాక్షి,ఆదిలాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు.. దీని ద్వారా ఆయా జిల్లాల్లోని 18 లక్ష ల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాద్ జిల్లాలోని మండలాలను ఆనుకొని ఉండే దిగువ పెన్గంగ నుంచి ఈ వానాకాలంలో దిగువకు వెళ్లిన ప్రవాహం అక్షరాలా 360 టీఎంసీలు.. అంటే ఎస్ఆర్ఎస్పీ నీటి సామర్థ్యం కంటే నాలుగు రేట్లు అధికం. ఇక్కడ కొరటా–చనాఖ సరిహద్దులు గా ఇటు తెలంగాణ నుంచి అటు మహారాష్ట్ర వరకు బ్యారేజ్ నిర్మించిన విషయం తెలిసిందే. దీని గేట్లు తెరిచే ఉంటాయి. అయితే జిల్లా జల వనరుల శాఖ అధికారులు ఇక్కడి నుంచి వెళ్లే వరద ప్రవాహాన్ని లెక్కగట్టడం జరుగుతుంది. ఆ లెక్కలే ఇవి. లోయర్ పెన్గంగ నుంచి కొరటా–చనాఖా.. తెలంగాణ–మహారాష్ట్ర సంయుక్తంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్ట్ లోయర్ పెన్గంగ. ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్. 1975లో ఈ ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ తీవ్రంగా ఉండేది. 1996లో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఇరు రాష్ట్రాలకు సంబంధించి నీటి వినియోగ లెక్కలను నిర్ధారించింది. ప్రధానంగా నది ప్రవహించే భూభాగ నిష్పత్తులను పరిగణలోకి తీసుకొని నీటి వినియోగాన్ని అప్పట్లో నిర్ధారించారు. ఆ సమయంలో వంద టీఎంసీల సామర్థ్యంతో లోయర్ పెన్గంగ ప్రాజెక్ట్ నిర్మించాలని తలపెట్టారు. అందులో మహారాష్ట్ర వాటా 88 టీఎంసీలు కాగా, తెలంగాణ వాటా 12 టీఎంసీలుగా నిర్ధారించారు. అదేనిష్పత్తిలో నిధులు కూడా వె చ్చించాల్సి ఉంటుంది. అయితే మహారాష్ట్రలో భూ సేకరణ, వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. ఆ తర్వాత కాలంలో దీని నీటి సామర్థ్యం తగ్గిపోయింది. ఆ తర్వాత సీడబ్ల్యూసీ తెలంగాణ వాటా 5.12 టీఎంసీలుగా నిర్ధారించింది. అయితే లోయర్ పెన్గంగప్రాజెక్ట్ నిర్మాణానికి ముందడుగు పడకపోవడంతో ప్రత్యేక రాష్ట్రంలో జిల్లాకు సరిహద్దులో నది భూభాగంపై ఇరు రాష్ట్రాలను కలుపుతూ కొరటా–చనాఖా బ్యారేజ్ నిర్మించడం జరిగింది. ఈ బ్యారేజ్ సామర్థ్యం కేవలం 0.830 టీఎంసీలు మాత్రమే. ప్రధానంగా జిల్లా నుంచి దిగువకు వందలాది టీఎంసీల వరద నీరు వృథాగా పోతుండగా, ఇక్కడ వాటిని వినియోగించుకునేందుకు సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. సాత్నాల, మత్తడి సామర్థ్యానికి మించి వరద.. జిల్లాలోని రెండు మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటి సాత్నాల, మరొకటి తాంసి మండలంలోని మత్తడివాగు. సాత్నాల పూర్తిస్థాయి సామర్థ్యం 1.24 టీఎంసీలు కాగా, మత్తడివాగు సామర్థ్యం 0.571 టీఎంసీలు. ఈ వర్షాకాలంలో ఈ ప్రాజెక్టుల నుంచి దిగువకు ఎన్నో రేట్లు అధికంగా వరద నీటిని వదిలారు. సాత్నాల నుంచి 4.172 టీఎంసీలు, మత్తడివాగు నుంచి 4.218 టీఎంసీలు దిగువకు వదలినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా భారీ వరదలు రావడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి ప్రవాహాన్ని దిగువకు వదలాల్సి వచ్చింది. సాత్నా ల ప్రాజెక్ట్ కింద లక్ష్మిపూర్ రిజర్వాయర్ ఉన్నప్పటి కీ, మత్తడివాగుకు దిగువ భాగంలో ఎలాంటి రిజర్వాయర్లు లేకపోవడంతో వరద ప్రవాహం వృథాగా గోదావరిలో కలవాల్సిందే. అయితే రానున్న రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టుల నీటి సామర్థ్యం పెంచడం ద్వారా ఆయకట్టు అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ లేకపోలేదు.మత్తడివాగు గేట్ల నుంచి దిగువకు నీటి పరవళ్లు (ఫైల్)ఈ సీజన్లో వరద ప్రవాహం ఇలా.. ప్రాజెక్ట్ వచ్చిన వరద సామర్థ్యం (టీఎంసీలలో) కొరటా–చనాఖా బ్యారేజ్ 360 సాత్నాల 4.172 మత్తడివాగు 4.218 జిల్లాలో వర్షపాతం వివరాలు.. (జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) సాధారణం : 996.1 మి.మీ.లు కురిసింది: 1,362 మి.మీ.లు వ్యత్యాసం : 35 శాతం అధికం -
జోష్గా..
సాక్షి,ఆదిలాబాద్: దసరా వేడుకలను ప్రజలు ధూమ్దామ్గా జరుపుకున్నారు. ఎక్కడా జోరు తగ్గించలేదు. గాంధీ జయంతి ప్రభావంతో మార్కెట్లో బహిరంగంగా ఉల్లంఘనలు జరగకపోయినప్పటికీ లోలోపల మాత్రం యథేచ్ఛగా కొనసాగాయి. మద్యం దుకాణాలు మూసివేసి ఉంచగా, బహిరంగంగా మాంసం విక్రయాలు చేపట్టలేదు. లిక్కర్ను ముందే కొనుగోలు చేసిన మద్యం ప్రియులు పండుగ జోష్లో రాజీపడలేదు. లోలోపల మేకలు, గొర్రెలు, కోళ్ల వధ చోటుచేసుకుని.. మటన్, చికెన్ విక్రయాలు సాగాయి. మార్కెట్పై ప్రభావం అక్టోబర్ 2న గాంధీ జయంతి, దసరా పండగ కలిసి రావడంతో ఆ ప్రభావం బహిరంగ మార్కెట్పై పడింది. ప్రధానంగా దసరా పండగ అంటేనే మద్యం, మాంసం విక్రయాలతో సంబంధం ఉన్న వేడుక. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలన్నీ మూసివేశారు. అలాగే స్లాటర్ హౌస్లలో ఎక్కడ కూడా పశువధ జరగలేదు. అయితే జిల్లాలో వారం రోజులుగా లిక్కర్, బీర్ల అమ్మకాలు మాత్రం జోరుగా సాగాయి. మద్యం ప్రియులు పండుగకు ముందుగానే స్టాక్ తీసుకొని ఇంట్లో నిల్వ చేసుకున్నారు. అలాగే మాంసం విక్రయదారులు తమ ఇళ్లలో, లేనిపక్షంలో ఏదైనా అనువైన స్థలంలో మేకలు, కోళ్లను వధించారు. కిక్కెక్కించిన మద్యం.. జిల్లాలో గడిచిన ఆరు రోజుల్లో రూ.6.84 కోట్ల మ ద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోల్చితే సుమారు 10 శాతం పెరిగినట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా 12,564 కేసుల లిక్కర్, బీర్ల అమ్మకాలు జరిగాయి. అందులో 9,932 కేసుల లిక్కర్, 2,632 కేసుల బీర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో దసరా రోజు సుమారు 15 టన్నుల వర కు మాంసం విక్రయాలు జరిగాయి. ఇందులో 5 ట న్నుల వరకు మటన్, 10 టన్నుల వరకు చికెన్ విక్రయాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. -
‘స్లాట్’తోనే పత్తి కొనుగోళ్లు
ఆదిలాబాద్టౌన్: పత్తి కొనుగోళ్లకు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే మార్కెట్ యార్డులో విక్రయాలు జరిపేలా చర్యలు చేపట్టింది. దీంతో దళారులు, మధ్యవర్తుల అక్రమాలకు చెక్ పడనుంది. అలాగే రైతులకు గంటల తరబడి నిరీక్షణ తప్పనుంది. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు దీనిపై అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈనెల 6న జిల్లాలోని ఏఈవోలకు శిక్షణ కల్పించనున్నారు. వీరు ఆయా గ్రామాల్లో రైతులకు యాప్ డౌన్లోడ్, స్లాట్ బుకింగ్పై వివరించనున్నారు. అయితే స్లాట్ బుకింగ్ ద్వారా పత్తి కొనుగోళ్లు ఏ మేరకు జరుగుతాయనేది చూడాల్సి ఉంది. కిసాన్ కపాస్ యాప్.. కేంద్ర ప్రభుత్వం కిసాన్ కపాస్ యాప్ను గతేడాది ప్రవేశపెట్టింది. అయితే ఇది పూర్తిస్థాయిలోకి అమలులోకి రాలేదు. ఈసారి ఖచ్చితంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ యాప్లో రైతులు ముందుగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తద్వారా మండలాలు మ్యాపింగ్, షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు ఉంటాయి. పత్తి విక్రయించే సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారం అధికారులు అంచనా వేసిన దిగుబడి మేరకే కొనుగోలు చేస్తారు. ఒకసారి ఎంత పత్తి వస్తుందో అంతే అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తారు. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయ అధికారులు క్రాప్ బుకింగ్ వివరాలు నమోదు చేస్తున్నారు. మధ్యవర్తుల దోపిడీకి చెక్.. రైతులు పత్తి విక్రయించాలంటే మధ్యవర్తుల దోపిడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు సీసీఐ ‘కపాస్ కిసాన్’ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా నేరుగా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకొని పంట విక్రయించేందుకు అవకాశం కల్పించింది. కొంత మంది వ్యాపారులు, దళారులు ఇతర రైతుల పేరిట సీసీఐకి పత్తి విక్రయించి లబ్ధి పొందుతున్నారు. అలాంటి వాటికి ఇక చెక్ పడనుంది. ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందో.. ఆ మేరకు మాత్రమే కొనుగోలు చేయనున్నారు. గతేడాది జిల్లాలో కొంత మంది దళారులు రైతుల పేరిట ఎక్కువ మొత్తంలో సీసీఐకి పత్తి విక్రయించినట్లు తేలింది. దీంతో వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులపై వేటు పడిన విషయం తెలిసిందే. యాప్లో వివరాల నమోదు ఇలా.. రైతులు పంట అమ్ముకునేందుకు సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రైతు పేరు, జెండర్, పుట్టిన తేది, కులం, చిరునామా, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. అనంతరం పంట వివరాలు తెలియజేయాలి. సొంత భూమి, కౌలుదారా అనేది వివరించాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, మొత్తం భూమి, పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం లాంటి వివరాలతో పాటు రైతు ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 5.83 లక్షల ఎకరాలుపత్తి సాగు విస్తీర్ణం 4.28 లక్షల ఎకరాలుగతేడాది సీసీఐ కొనుగోలు చేసిన పత్తి25 లక్షల క్వింటాళ్లుప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసింది2.50 లక్షల క్వింటాళ్లుఈ ఏడాది పత్తి దిగుబడి అంచనా30 లక్షల క్వింటాళ్లు -
ప్రజలంతా విజయం సాధించాలి
ఆదిలాబాద్టౌన్: విజయదశమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకొని ప్రజలంతా విజయం సాధించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ హెడ్క్వార్టర్స్లోని ఆయుధ భాండాగారంలో గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయానికి చిహ్నంగా తుపాకీతో ఐదు రౌండ్ల కాల్పులు జరిపి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్శాఖ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి,వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం, మోటార్ ట్రాన్స్పోర్టు టీం, తదితరులు పాల్గొన్నారు. వినూత్నంగా ‘హాకీ’ ఆయుధపూజఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా వేడుకలను వినూత్నంగా నిర్వహించా రు. హాకీ స్టిక్స్, గోల్ పోస్టులకు పూజలు చేశారు. అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి పార్థసార థి మాట్లాడుతూ, జిల్లా క్రీడాకారులు ఈ ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించా రు. ఇందులో బాస్కెట్బాల్ జాతీయ క్రీడాకారుడు రాధాకృష్ణ, సీనియర్ హాకీ క్రీడాకారులు జే రవీందర్, సుధీర్, గోవింద్, అతుల్, విజయ్, శేఖర్, జంగు తదితరులు పాల్గొన్నారు. -
గోపాలమిత్రల సమస్యలు పరిష్కరించాలని వినతి
బోథ్: గోపాలమిత్రల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను కలిసి వారు వినతిపత్రం అందించారు. తమను పశుసంవర్ధక శాఖలో ఉద్యోగులుగా గుర్తించి, రూ.24వేల వేతనం అందివ్వాలన్నారు. శాఖలో ఉన్న ఆఫీస్ సబార్టినేట్గా గోపాలమిత్రలను నియమించాలని కోరారు. ప్రమాదబీమా, ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు ఏప్రిల్ నెల నుంచి జీతాలు రాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దృష్టికి గోపాలమిత్రల సమస్యలను తీసుకెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపాలమిత్రలు రాజు, గోకుల్ జాదవ్, ఆశన్న, గంగన్న, జంగు పాల్గొన్నారు. విధుల్లో చేరిన విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ బజార్హత్నూర్: మండల విద్యుత్ శాఖ సబ్ఇంజినీర్ గుండేటి రవి కుమార్ శుక్రవారం ఇచ్చోడ విద్యుత్ శాఖ ఏడీఈ లక్ష్మణ్కు జాయినింగ్ రిపోర్టు అందజేసి మండల విద్యుత్ శాఖ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఆయన గత సంవత్సరం డిప్యూటేషన్పై మంచిర్యాల జిల్లాకు వెళ్లారు. ఇచ్చోడ, బజార్హత్నూర్ విద్యుత్ శాఖ ఏఈలు రాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
వ్యవసాయ శాఖ ఏఈవోలకు కిసాన్ కపాస్ యాప్, స్లాట్ బుకింగ్పై ఈనెల 6న అవగాహన కల్పించనున్నాం. అనంతరం అధికారులు మండలాల్లోని రైతులకు తెలియజేస్తారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాతే రైతులు పంట దిగుబడిని మార్కెట్కు తీసుకురావాలి. దీంతో యార్డులో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. అలాగే యాప్లో డబ్బులు ఎప్పుడు పడనున్నాయి, జమ అయ్యాయా.. లేదా అనే వివరాలు కూడా తెలుస్తాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఈనెల 20 తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభించే అవకాశం ఉంది. – గజానన్, మార్కెటింగ్ ఏడీ, ఆదిలాబాద్ -
మహాత్ముడికి ఘన నివాళి
ఆదిలాబాద్టౌన్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్ముని చిత్రపటానికి కలెక్టర్ రాజర్షి షా, వివిధ శాఖల అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాపూజీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీవైఎస్వో శ్రీనివాస్, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప ఆదర్శవాది గాంధీజీఆదిలాబాద్: అహింసాయుత స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించి దాస్య శృంఖలాల నుంచి భారతమాతకు విముక్తి కల్పించిన గొప్ప ఆదర్శవాది జాతిపిత మహాత్మగాంధి అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గాంధీ జయంతి పురస్కరించుకుని పట్టణంలోని మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే దేశ రెండో ప్రధాని లాల్బహదూర్ శాసీ్త్ర జయంతి సందర్భంగా ఆయన చిత్రానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అలాగే జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ కార్యాలయంలో జక్కుల శ్రీనివాస్ గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. -
ఎన్నికల విధుల్లో మినహాయింపు ఇవ్వాలి
ఆదిలాబాద్టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో దివ్యాంగులు, గర్భిణులు, ఫీడింగ్ ఉపాధ్యాయులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్ అన్నారు. ఈమేరకు కలెక్టర్ రాజర్షిషాను బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల రోజు వివాహ శుభకార్యాలు ఉన్నటువంటి, ఉద్యోగ విరమణ దగ్గర ఉన్న ఉపాధ్యాయులకు విధులు కేటాయించవద్దని కోరారు. 2024లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, ఆ డబ్బులను ఇప్పించాలని విన్నవించారు. ఇందులో యూనియన్ నాయకులు రవీందర్రెడ్డి, దేవ్రావు, నతీన్ కుమార్, ప్రభాకర్, శ్రీనివాస్, నాందేవ్ తదితరులు ఉన్నారు. -
సర్వం సిద్ధం
ఆదిలాబాద్: దసరా మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. విజయదశమి వేడుకలను గురువారం వై భవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని దసరా మైదానంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది దశాబ్దాలుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ముందుగా పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వ రి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం శోభా యాత్రగా సాగి దసరా మైదానంలో జమ్మి పూజ నిర్వహిస్తారు. ధ్వజారోహణం చేపట్టి అతిథులు రావణ దహన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్ర జలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు బొంపె ల్లి హనుమాండ్లు వెల్లడించారు. మరోవైపు సనా తన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించి సైతం ఏర్పాట్లు పూర్తయినట్లు సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమా ర్ ఖత్రి తెలిపారు.పండుగకు సొంతూరుకే..తాంసి: మా సొంతూరు తాంసి. ఉద్యోగరీత్యా కుటుంబంతో సహా కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాం. రాష్ట్ర సచివాలయంలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా. ఎన్ని పనులున్నా పండుగలకు మాత్రం అందరం కలిసి ఇక్కడికే వస్తుంటాం. పుట్టి పెరిగిన గ్రామంలో పండుగలు జరుపుకోవడం ఆనందంగా ఉంటుంది. అలాగే అందరిని కలుసుకునే అవకాశం ఉంటుంది. –రామగిరి స్వామి -
ప్చ్.. దశ మారలే!
సాక్షి,ఆదిలాబాద్: దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా.. దశమి వచ్చిందయ్యా.. దశనే మా ర్చిందయ్యా.. ఇది ఓ సినిమాలోని పాట. అయితే ఇప్పుడు జిల్లాలోని రైతులకు ఆ సరదా లేదు.. దశ అంతకంటే లేదు.. ఎందుకంటే ఈ దసరా వచ్చిందంటే ఇటు పత్తి, అటు సోయా దిగుబడులు చేతి కొచ్చేవి. పండుగ వేడుకలు నిర్వహించేందుకు ఆ దిగుబడుల్లో కొంతమేర విక్రయించుకొని సంబరాలు జరుపుకునేవారు. ఇప్పుడు మాత్రం ఆ ప రిస్థితే లేదు. దీనంతటికి వానాకాలంలో కురిసిన భారీ వర్షాలే కారణం. ఏకంగా 35 శాతం అధిక వర్షపాతం నమోదుతో పంటల పరిస్థితి పూర్తిగా ఆగమాగం అయిపోయింది. పత్తి కాయలు విచ్చుకొని తెల్లటి పత్తి బయటకు కనిపించాల్సిన సమయంలో దిగువ భాగంలో ఆ కాయలు పూర్తిగా మురిగిపోయి ఉండటం, పైభాగంలో ఉన్న కాయలు అసలుకే విచ్చుకోలేదు. తేమశాతం అధికంగా ఉండడమే కా రణంగా తెలుస్తోంది. పత్తి పంట కాలం మరో నెల పెరిగింది. దీంతోపాటు రైతు అంతర్కృషి, మందుల కోసం మళ్లీ పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి. దిగుబడులు చేతికొచ్చి ఆనందపడాల్సిన సమయంలో ఇంకా పంట కోసం తిప్పలు పడాల్సిన దుస్థితి లో అన్నదాతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దశమి ఉత్సాహం రైతు ఇంట్లో కనిపించడం లేదు. చేతిలో కాసులు లేక కర్షకులు దిగాలు చెందుతున్నారు. వెంటాడుతున్న అప్పులు.. సాధారణంగా జిల్లాలో వానకాలం సీజన్లోనే భారీగా పంటలు సాగవుతాయి. పత్తి, సోయా, కందులను పెద్ద మొత్తంలో సాగు చేస్తారు. దీనికోసం రైతులు బ్యాంకులతో పాటు దళారుల వద్ద ప్రైవేట్ అప్పులు తీసుకుంటారు. పంట దిగుబడులు ఏటా దసరా వరకు చేతికొస్తాయి. దీంతో వాటిని విక్రయించి అప్పులు తీర్చి రైతు తన ఖర్చుల కోసం మిగతా మొత్తాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు, పిల్లల చదువులు, ఇతరత్రా వాటి కోసం డబ్బులను లెక్కలతో సరిపోల్చుకుంటాడు. అయితే ఇప్పుడు ఇవేమి రైతుకు కనిపించడం లేదు. అప్పులు మాత్రం మీద పడ్డాయి. ప్రైవేట్ అప్పుల పరంగా దళారుల నుంచి రైతులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వానాకాలంలో పంటల సాగు వివరాలు.. (ఎకరాల్లో) మొత్తం సాగు విస్తీర్ణం: 5.85లక్షలు పత్తి : 4.40లక్షలు సోయా : 62,500 కంది : 55వేలు ఇతర పంటలు : 27,500 -
నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్టౌన్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనంతో పాటు దసరా పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నిమజ్జనోత్సవం కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పోలీసు సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డీజేలకు అనుమతి లేదని తెలిపారు. 30 మంది మహిళా సిబ్బందితో బందోబస్తు, షీటీంతో పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆకతాయిల వేధింపులకు గురయితే మహిళలు డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. నిమజ్జనం దృష్ట్యా ఆదిలాబాద్ వన్టౌన్, టూటౌన్, మావల పోలీసు స్టేషన్ల పరిధిలో 200 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 9 సెక్టార్లు, 4 క్లస్టర్లుగా విభజించి సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో డీఎస్పీలు జీవన్రెడ్డి, శ్రీనివాస్, పట్టణ సీఐలు సునిల్ కుమార్, నాగరాజు, ఫణిందర్, ప్రేమ్కుమార్, స్వామి, అంజమ్మ, పద్మ, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఆదర్శం.. పల్సి(బి) తండా
మహాత్ముడి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటున్న గ్రామమది. మాటకు కట్టుబడి దశాబ్దాలుగా మద్యపానం, జీవహింసకు దూరంగా ఉంటున్న పల్లె. దాదాపు మూడు దశాబ్దాలుగా మద్యం, మాంసం ముట్టకుండా నిత్యం ఆధ్యాత్మిక భావనతో ఆదర్శంగా నిలుస్తోంది తలమడుగు మండలంలోని పల్సి(బి)తండా. ఎలాంటి గొడవలు లేకుండా ఠాణా మెట్లు ఎక్కకుండా ఐక్యతతో ముందుకు సాగుతున్నా రు ఈ గ్రామస్తులు. ఐక్యత రాగంతో అభివృద్ధిలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా గ్రామంపై ప్రత్యేక కథనం. – తలమడుగుపల్సి(బి) తండా గ్రామ ముఖచిత్రం ఈ గ్రామంలో 1997లో పలువురు మద్యానికి బాని సయ్యారు. నిత్యం గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాలు ఛిద్రమయ్యాయి. అప్పుడే గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. గ్రామంలో ఎవ రూ మద్యం ముట్టవద్దని, విక్రయించవద్దని తీర్మా నం చేశారు. అదే సమయంలో గ్రామానికి నారాయణ బాబా వచ్చారు. ఆయన బోధనలకు ప్రభావి తమై మాంసానికి సైతం దూరమయ్యారు. ఆధ్యాత్మికానికి చేరువయ్యారు. దశాబ్దాలుగా అదే బాట లో కొనసాగుతున్నారు. గ్రామ జనాభా దాదాపు 900 వరకు ఉంటుంది. బాబా మరణాంతరం గ్రా మంలో ఆయన పేరిట సద్గురు నారాయణ ఆల యం నిర్మించుకున్నారు. ఇందులో ప్రతీ గురువా రం ప్రత్యేక పూజలు నిర్వహించడం, అన్నదానం చేయడం, ఏటా దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామాభివృద్ధిలోనూ సమష్టిగా భాగస్వాములవుతున్నారు. స్థానిక వృద్ధులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వృద్ధాశ్రమం సైతం నిర్మించారు. నారాయణ బాబా సంస్థాన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నూతన పంచాయతీగా.. పల్సి(బి)గ్రామ పంచాయతీ పరిధిలో పల్సి(బి)తండా ఉండేది. 2019లో నూతన జీపీగా ఆవిర్భవించింది. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచ్, వార్డుమెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయా పదవులను ఏకగ్రీవం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు గ్రామస్తులు. గత పాలకవర్గంలో ప్రతీ వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇంటింటికి తాగునీటితో పాటు, సెగ్రిగేషన్ షెడ్లు వంటివి నిర్మించుకున్నారు. అలాగే గొడవలకు దూరంగా ఉంటూ పోలీస్ స్టేషన్ మెట్లు సైతం ఎక్కడం లేదు. ఆధ్యాత్మిక బాటలో ఐక్యంగా ఉంటూ గ్రామాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. -
ఏడుగురే.. ఎంపీడీవోలు!
కై లాస్నగర్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సైతం అమల్లోకి వచ్చింది. త్వరలో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ నుంచి కౌంటింగ్ వరకు మండలంలో నిర్వహించేఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాల్సిన గురుతర బాధ్యత ఎంపీడీవోపైనే ఉంటుంది. అయితే జిల్లాలో ఎంపీడీవోల కొరత తీవ్రంగా వేఽధిస్తోంది. పలు మండలాల్లో ఎంపీవోలే ఇన్చార్జి ఎంపీడీవోగానూ వ్యవహరిస్తున్నారు. రెండు పోస్టుల బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. సగానికిపైగా మండలాల్లో ఇన్చార్జీలే ఉండటంతో ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపే అవకాశముంది. రెగ్యులర్ విధులతోనే బిజీ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్కార్డులు, ఇందిరమ్మ, గృహజ్యోతి, మహలక్ష్మి వంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించేలా చూడాల్సిన బాధ్యత ఎంపీడీవోలదే. వీటితో పాటు తమ పరిధిలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ విధులతోనే వారు నిత్యం బీజీగా ఉంటున్నారు. తాజాగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అదనంగా వచ్చాయి. నామినేషన్ల స్వీకరణ మొదలు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఉత్తర్వుల జారీ, శిక్షణలు, ఎన్నికల సామగ్రి సరఫరా వంటి పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. మెజార్టీ మండలాల్లో ఇన్చార్జీలే.. జిల్లాలో మొత్తం 20 గ్రామీణ మండలాలు ఉండగా, వీటి పరిధిలో 20 జెడ్పీటీసీలు, 166 ఎంపీటీసీ స్థా నాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఎంపీడీవోల కొరత ఉండగా తాజాగా మావల రెగ్యులర్ ఎంపీడీవో ఆకుల భూమయ్య ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ప్రస్తుతం తాంసి, తలమడుగు, భీంపూర్, బజార్హత్నూర్, బోథ్, ఉట్నూర్, గాదిగూడ మండలాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంపీడీవోలు ఉన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు ప్రభుత్వం పోస్టులను మంజూరు చేయకపోవడంతో ఉన్నవారిని తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. మిగతా పది మండలాల్లో ఎంపీవోలు, సూపరింటెండెంట్లకే ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇది వారికి తలకుమించిన భారంగా మా రుతోంది. ఆదిలాబాద్రూరల్ ఎంపీవోగా ఉన్న అ ధికారికి ఇన్చార్జి ఎంపీడీవోతో పాటు మావల ఎంపీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒకే అధికారి రెండు మండలాల్లో ఏ విధంగా బాధ్యతలు నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా రెగ్యులర్ ఎంపీడీవోగా విధులు నిర్వహించాల్సి ఉండగా, కొంతమంది పైరవీలతో తమకు అనుకూలమైన మండలాలకు డిప్యూటేషన్పై వెళ్లారు. ఫలితంగా పాలన గాడితప్పడంతో పాటు ఎన్నికల నిర్వహణపై కూడాప్రభావం చూపే అవకాశముంది. జిల్లాకు ఆరుగురు కొత్త ఎంపీడీవోలు..? ఇటీవల విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో కొత్తగా కొలువు సాధించిన ఆరుగురిని ఆదిలాబాద్ జిల్లాకు ఎంపీడీవోలుగా నియమించినట్లుగా తెలుస్తోంది. వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులను జిల్లాకు కేటాయించినట్లుగా సమాచారం. అయితే మంగళవారం వరకు ఏ ఒక్క అధికారి రిపోర్టు చేయలేదు. వీరంతా విధుల్లో చేరితే అధికారుల కొరత దూరమై ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మావల ఎంపీడీవోగా కృష్ణవేణిమావల నూతన ఎంపీడీవోగా కృష్ణవేణి నియామకమయ్యారు. సూపరింటెండెంట్ హోదా కలి గిన ఈమె ప్రస్తుతం హైదరాబాద్లోని పంచా యతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. ఇది వరకు మా వల రెగ్యులర్ ఎంపీడీవోగా పనిచేసిన భూమ య్య మంగళవారం పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో కృష్ణవేణిని నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా ఇది వరకు ఆమె జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిగానూ బాధ్యతలు నిర్వహించారు. -
● ఉట్నూర్లో సద్దుల సంబురం
బతుకమ్మ ఎత్తుకున్న చిన్నారి ఉట్నూర్లో బతుకమ్మ జోష్లో యువతులుఉట్నూర్తో పాటు మండలవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబ రాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను కూడళ్లలో ఉంచి మహిళలు, యువతులు చిన్నారులు ఆడిపాడారు. అనంతరం గంగన్నపేట చెరువుకు చేరుకుని బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఉట్నూర్ పాత బస్టాండ్లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బతుకమ్మలకు స్వాగతం పలికారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. – ఉట్నూర్రూరల్ -
పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికలు
కై లాస్నగర్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఎన్నికల నిర్వహణ పై అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతిని ధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినందున ఓటర్లను ప్రభా వితం చేసే ప్రచార అంశాలను వెంటనే తొలగించాలన్నారు. మీడియాలో వచ్చే ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు మూడు విడతల్లో ఉంటాయని పేర్కొన్నారు. మద్యం, డబ్బు కట్టడికి ప్రత్యేక చెక్పోస్టుల ఏర్పాటుతో పా టు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలను నియమిస్తున్నట్లు తెలి పారు. ప్రజలు రూ.50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లవద్దని, పట్టుబడితే అ నగదు సీజ్ చేస్తామని పేర్కొన్నారు. పోటీచేసే అభ్యర్థులు ప్రచార సభలు, సమావేశాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకో వా లన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ఆర్డీవో, సబ్ కలెక్టర్ నుంచి, సర్పంచ్ అభ్యర్థులు సంబంధిత తహసీల్దార్ ద్వారా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా,ఆర్డీవో స్రవంతి పాల్గొన్నారు. దుర్గా మాతా ఆలయంలో కలెక్టర్ పూజలు ఆదిలాబాద్రూరల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భా గంగా మావల మండలం దుర్గానగర్లో గల దుర్గా మాతా ఆలయంలో కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. -
రిజర్వేషన్ల ‘పంచాయితీ’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయితీ మొదలైంది. పలు గ్రామాల్లో పోటీలో నిలబడేందుకు అభ్యర్థులే లేని పరిస్థితి నెలకొంది. దీంతో తమ గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుపై పునః పరిశీలన చేయాలని విన్నవిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యా రు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను కలుస్తూ రిజర్వేషన్లు మార్చాలని కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత మార్చే అవకాశం లేకపోవడంతో ఆ గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే సందిగ్ధత నెలకొంది. జనాభా లేకున్నా అవకాశాలు ఎందుకీ పరిస్థితి? 2011 నాటి జనాభా లెక్కలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలు, రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక కుల గణన సర్వేను పరిగణనలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల ర్యాంకింగ్ ఇచ్చారు. బీసీ వర్గాల రిజర్వేషన్లకు డెడికేషన్ కమిషన్ సిఫారసులు పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 2019 తర్వాత ఇప్పుడు జరుగుతున్న రెండో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ మండలం యూనిట్గా, జెడ్పీటీసీ జిల్లా యూనిట్గా ర్యాంకింగ్లు ఇచ్చే క్రమంలో ఆయా వర్గాల్లో జనాభా లేనప్పటికీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక మహిళలకు 50శాతం, వందశాతం ఎస్టీలు ఉన్న చోట్ల వారికే నోటిఫై చే యడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంది. ఎస్టీ, ఎస్సీ, బీసీల ర్యాకింగ్ ఇచ్చే క్రమంలో ఒక్క ఓటరు లేని వర్గాలకు కూడా ఆయా చోట్ల రిజర్వేషన్లు ప్రకటించాల్సి వచ్చింది. ఇక గత ఎన్నికల్లో ఏదైనా కారణంతో ఎన్నిక జరగకపోతే ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లు అనుభవించని కారణంగా మరోసారి వారికే అవకాశం కల్పించేలా జీవో జారీ చేశారు. ఇక షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజ నులే పోటీకి అర్హులు. దీంతో ఏ గ్రామంలోనైనా గిరిజనులు ఉన్నా లేకున్నా వారికే అవకాశాలు వస్తున్నాయి. గతంలో జనాభా లెక్కల సమయంలోనూ కొన్ని చోట్ల ఆయా వర్గాల వివరాల నమోదులో తప్పిదాలు జరగడంతోనూ ఇబ్బందులు వస్తున్నా యి. మళ్లీ జనాభా లెక్కలు జరిగి, ఆయా వర్గాల వివరాలు స్పష్టత వచ్చే వరకు ఈ పరిస్థితి మారే అవకాశం లేదు. ఉప సర్పంచ్లకే పగ్గాలు సర్పంచ్ పదవులు ఆయా వర్గాలకు రిజర్వు కావడంతో వార్డు స్థానాలకు ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. దీంతో వార్డు సభ్యులు తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నిక జరగని చోట్ల రిజర్వేషన్ వర్తించని ఉప సర్పంచ్లే సర్పంచ్ హోదాలో పాలన కొనసాగించే అవకాశం ఉంది. -
పర్ధాన్ తెగకు గుర్తింపునివ్వాలి
ఆదిలాబాద్రూరల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్ని కల్లో ఆదివాసీ పర్ధాన్ తెగకు అన్ని రా జకీయ పార్టీలు గుర్తింపు నివ్వాలని పలువురు పర్ధాన్ సమాజ్ నాయకులు కోరారు. జిల్లా కేంద్రంలో ని అంబేద్కర్ భవనంలో మంగళవారం వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీ పర్ధాన్ సమాజ్కు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జిల్లాలోని ప్రతీ మండలంలో పర్ధాన్ సమాజ్ ఓటు బ్యాంకు కలిగి ఉందన్నారు. గిరిజనేతరుల మద్ధతు సైతం తమకు సంపూర్ణంగా ఉందని, ఈమేరకు ఆయా పార్టీ లు గుర్తించాలని కోరారు. ఇందులో నాయకులు యాదవ్రావ్, ఆనంద్ రావ్, శంకర్, దే విదాస్, సురేష్, సుభాష్, దిగంభర్, జనార్దన్, విలాస్, అశోక్, దేవిదాస్ పాల్గొన్నారు. -
దసరా మహోత్సవానికి తరలిరండి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని దసరా మైదా నంలో ఈనెల 2న నిర్వహించనున్న దసరా మహోత్సవానికి హిందూ బంధువులంతా తరలిరావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరా రు. స్థానిక దస్నాపూర్ కాలనీలోని మైదానంలో హిందూ సమాజ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా విజయదశమి ఉత్సవా లను ఏటా నిర్వహించుకుంటున్నట్లు తెలిపా రు. ఆయనవెంట ఉత్సవ సమితి అధ్యక్షుడు హనుమాండ్లు, నాయకులు భరత్, కృష్ణయాద వ్, జ్యోతిరెడ్డి,దాము,రాకేశ్ తదితరులున్నారు. -
ఎట్టకేలకు ఉట్నూర్ పంచాయతీకి ఎన్నికలు
ఉట్నూర్రూరల్: ఆరేళ్లుగా ఉట్నూర్ గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. ఈ సారి మాత్రం నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. గత ప్రభుత్వం ఈ మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసేందుకు సన్నద్ధం కాగా.. గిరిజన చట్టాలను ప్రస్తావిస్తూ ఆదివాసీ, గిరిజనులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఈ క్రమలోనే 2019లో ఉట్నూర్ పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి మేజర్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి పాలనలో సాగింది. తాజాగా ఈ సారి నోటిఫికేషన్లో ఉట్నూర్కు సైతం ఎన్నిక ఉంటుందని ప్రభుత్వం వెల్లడించడంతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. ఆయా పార్టీల నాయకులు ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేవారు. అయితే సర్పంచ్ స్థానానికి ఎస్టీ మహిళా రిజర్వేషన్ ఖరారు కావడంతో పలువురు నాయకులు తమ సతులను బరిలోకి దించేందుకు సిద్ధం చేస్తున్నారు. -
ప్రతీ ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడే పోలీసులపై నమ్మకం మరింతగా పెరుగుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎస్పీకు విన్నవించారు. సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. సు దూర ప్రాంతాల ప్రజలు తమ ఫిర్యాదులను 87126 59973 నంబర్కు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా 56 మంది అర్జీదారులు భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, భార్యభర్తల విభేదాలు, పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు తదితర సమస్యలపై ఫిర్యాదు చేశా రు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, విభాగ అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు.‘మత్స్య సంపదతో ఆర్థికాభివృద్ధి’ఉట్నూర్రూరల్: మత్స్య సంపదతో ఆర్థిక లబ్ధి చేకూరుతుందని జిల్లా మత్స్య శాఖ సొసైటీ డైరెక్టర్ సిడాం సోనేరావు అన్నారు. సోమవారం ఆదివాసీ భవనంలో గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా మత్స్యకారులు, చేపల పెంపకం దారులు, చేపల విక్రయదారులు, మత్స్య మహిళా సంఘాలకు ద్విచక్ర వాహనాలు, పికప్ వాహనాలు, ఫిష్ఫాంలు, రుణ సదుపాయం వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ లక్ష్మి, కిసాన్ మిత్ర కోఆర్డినేటర్ కుంర వినాయక్, ప్రతినిధి పెందూర్ వినోద్, ఆయా సంఘాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు ఉన్నారు. -
మద్యం షాపులకు బోణీ
● ఆదిలాబాద్లో ఒకటి, ఇచ్చోడలో రెండు షాపులకు టెండర్లు ఆదిలాబాద్టౌన్: మద్యం షాపుల టెండర్లకు సోమవారం బోణీ అయ్యింది. ఈనెల 26న ప్రక్రియ ప్రారంభం కాగా ఆదివారం వరకు దరఖాస్తుదారులు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తూ టెండర్లు వేయలేదు. కాగా సోమవారం జిల్లాలో మూడు దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఒకటి, బోథ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధి ఇచ్చోడలో రెండు దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులకు అక్టోబర్ 18 వరకు గడువు ఉంది. 23న జిల్లా కేంద్రంలో లక్కీడ్రా తీయనున్నారు. జిల్లాలో 40 షాపులు ఉండగా, 15 షాపులకు రిజర్వేషన్లు ఉన్నాయి. వీటిలో గౌడ్స్కు ఒక షాపు, ఎస్సీలకు 5, ఎస్టీలకు 9 షాపులు కేటాయించారు. టెండర్లు దక్కించుకున్న వారు డిసెంబర్ నుంచి షాపుల నిర్వహణ చేపట్టేందుకు అవకాశం కల్పించారు. రెండేళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది. దరఖాస్తులను స్వీకరించిన వారిలో ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ విజేందర్, బోథ్, ఉట్నూర్ ఎకై ్సజ్ సీఐలు రూప్సింగ్, జుల్ఫేఖార్ అహ్మద్తో పాటు ఎకై ్సజ్ ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించండి
– ఆదివాసీ మహిళలు, చించుఘాట్, ఆదిలాబాద్రూరల్ మేమంతా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలం. కూలీనాలీ చేసుకుని జీవించే నిరుపేదలం. మాకు ఉండేందుకు పక్కా ఇళ్లు కూడా లేవు. గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్నాం. మాకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వసతి సౌకర్యం కల్పించేలా చూడాలి. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. -
అన్నదాతకు అండగా..!
ఆదిలాబాద్టౌన్: అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2018లో సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాలు అందించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రక్రియను నిలిపివేసింది. 2025 –26 సంవత్సరంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీంతో రైతులకు మేలు జరగనుంది. రాయితీపై పరికరాలు కావాల్సిన రైతులు ఆయా మండలాల వ్యవసాయ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. మార్చి 31, 2026 వరకు దరఖాస్తులకు గడువు విధించింది. యాంత్రీకరణ సాగు కోసం జిల్లాకు 5,193 యూనిట్లను అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3 కోట్ల 80లక్షల 22వేల నిధులను కేటాయించింది. చిన్న, సన్నకారు రైతులతో పాటు మహిళ రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈప్రక్రియ పూర్తి చేసేందుకు మండల, జిల్లా పరిధిలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఆరేళ్ల తర్వాత.. వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 –18 సంవత్సరంలో యంత్రలక్ష్మి పేరుతో రైతులకు సబ్సిడీపై పరికరాలను అందజేసింది. ఆ తర్వాత పథకాన్ని పక్కనబెట్టారు. దీంతో అన్నదాతలు సబ్సిడీ పరికరాల కోసం ఎదురుచూసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించింది. ఇందుకోసం ప్రభుత్వం నిధులు సైతం కేటాయించింది. చిన్న, సన్నకారు రైతులు వివిధ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు, మహిళ రైతులకు 50 శాతం సబ్సిడీపై, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై పరికరాలను అందించనున్నారు. రైతులకు తగ్గనున్న భారం.. యాంత్రీకరణ సాగుతో రైతులకు సాగు భారం తగ్గనుంది. ప్రస్తుతం వ్యవసాయంలో కూలీల కొరత వేధిస్తోంది. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించి పనులు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. దీంతో రైతులకు అదనపు ఆర్థిక భారం పడుతుంది. అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు యాంత్రీకరణ సాగు ఎంతగానో దోహద పడుతుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ పథకం ఉపయుక్తంగా మారనుంది. -
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
కైలాస్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు శిక్షణనిచ్చారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ రోజు వరకు ఆర్వోలు అనుసరించాల్సిన విధానాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినందున, పకడ్బందీగా అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత ఆర్వోలు, ఎంపీడీవోలపై ఉందన్నారు. కోడ్ ఉల్లంఘనలు జరగకుండా శ్రద్ధ వహించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ రాజర్షి షా -
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలు అమలు చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. పెండింగ్ కమీషన్ డబ్బులను విడుదల చేయాలని సోమవారం రేషన్ డీలర్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బతుకమ్మలతో నిరసన వ్యక్తం చేశారు. వారికి ఎమ్మెల్యే మద్దతు తెలిపి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశపడ్డ డీలర్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేసిందన్నారు. పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ డబ్బులను వెంటనే విడుదల చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో డీలర్ల సమస్యలను ప్రస్తావించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని భరోసానిచ్చారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేతో పాటు అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవికి డీలర్లు అందజేశారు. రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాంపల్లి వేణుగోపాల్ పాల్గొన్నారు. -
బాధితులకు భరోసా కల్పించాలి
కైలాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలను సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేస్తూ సమస్యల పరిష్కారానికి శ్రద్ధ వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, కలెక్టరేట్ ఏవో వర్ణ, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మొక్కలు తెప్పించారు.. పంపిణీ మరిచారు
● బల్దియా అధికారుల నిర్వాకం కైలాస్నగర్: పచ్చదనం పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వన మహోత్సవ కార్యక్రమంపై బల్దియా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మీడియన్ ప్లాంటేషన్, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఇప్పటికే లక్ష్యం మేర మొక్కలు నాటడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. తాజాగా పట్టణంలోని ప్రతీ ఇంటి ఆవరణలో నాటేందుకు అవసరమైన జామ, మల్లె, నందివర్ధనం, చక్రంపూలు వంటి వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను తెప్పించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్లోని కడియం నర్సరీ నుంచి సుమారు 40వేల వరకు ఆయా రకాల మొక్కలను సరఫరా చేశాడు. ఇటీవల జిల్లాకు తీసుకువచ్చిన ఈ మొక్కలను మున్సిపాలిటీకి సంబంధించిన బంగారుగూడలోని డంపింగ్యార్డులో నిల్వ చేశారు. పట్టణానికి చేరి 20 రోజులవుతున్నా ప్రజలకు అందించే దిశగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. నిర్వహణ లోపంతో పలు మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. వాటిని నాటేందుకు అనువైన పరిస్థితులున్నాయి. కాగా, ఈ విషయమై బల్దియా డీఈఈ కార్తీక్ను సంప్రదించగా.. ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టామని పేర్కొనడం గమనార్హం. -
తొమ్మిది ఉద్యోగాలకు ఎంపికై న ఉదయ్
పోటీ పరీక్ష ఏదయినా కొలువు కొట్టడమే ఆనవాయితీగా మా ర్చుకున్నాడు బిట్లింగ్ ఉదయ్.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. తాజాగా డిప్యూటీ తహసీల్దార్ కొలువు సాధించాడు. బజార్హత్నూర్కు చెందిన లక్ష్మణ్– సరస్వతి దంపతుల కుమారుడు ఉదయ్ ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్లో నివా సం ఉంటున్నాడు. తండ్రి రేషన్ డీలర్ కాగా, తల్లి గృహిణి. 2019లో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పోస్టల్ అసిస్టెంట్, పంచాయతీరాజ్లో జూనియర్ అసిస్టెంట్, సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్, గ్రూప్–3లో 72వ ర్యాంక్ సాధించాడు. అలాగే ట్రెజరీలో జూనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్గా ఎంపికై 2024 నుంచి ఆదిలాబాద్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం గ్రూప్–2లో 51వ ర్యాంక్ సాధించి డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపికయ్యాడు. సివిల్స్కు ఎంపిక కావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ఉదయ్. ఉదయ్ -
సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు
కై లాస్నగర్: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డుమెంబర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఏ గ్రామం, వార్డు ఏయే సామాజిక వర్గానికి కేటాయించబడిందనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. శనివారం మధ్యాహ్నం జెడ్పీ సమావేశ మందిరంలో చేపట్టిన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఆదివారం వేకువజామున 3గంటల వరకు కొనసాగింది. జిల్లా పంచాయతీ అధికారులు, ఉద్యోగులు, ఎంపీడీవోలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కలెక్టర్ రాజర్షి షా ఆమోదంతో రిజర్వేషన్ల గెజిట్ సైతం ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల మాదిరిగానే పంచాయతీ రిజర్వేషన్లు సైతం భిన్నంగా రావడంతో పలు గ్రామాల్లో పోటీ చేద్దామనుకునే అశావహులకు నిరాశే ఎదురుకానుంది. కాగా సగం సీట్లు అతివలకే కేటాయించడంతో పంచాయతీల్లో వారి ప్రాతినిధ్యం పెరగనుంది. రిజర్వేషన్లు స్పష్టం కావడంతో పల్లె రాజకీయం వేడెక్కనుంది. మరోవైపు పోటీకి సై అంటున్న వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో.. జిల్లాలో 20 గ్రామీణ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 473 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 251 జీపీలు ఏజెన్సీ పరిధిలోని షెడ్యూల్డ్ ఏరియాలోనే ఉండగా.. మరో 15 పంచాయతీల్లో వందశాతం ఎస్టీ జనాభానే ఉంది. దీంతో ఆయా పంచాయతీలన్నింటినీ ఎస్టీలకే రిజర్వ్ చేశారు. నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో గల మరో 207 పంచాయతీలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆన్ రిజర్వ్డ్గా కేటాయించారు. ఇందులో ఎస్టీలకు 47, ఎస్సీలకు 31, బీసీలకు 86 కేటాయించగా, మరో 43 పంచాయతీలను ఆన్ రిజర్వ్డ్ (జనరల్)గా ఖరారు చేశారు. మొత్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి 234 జీపీలను మహిళలకు రిజర్వ్ చేశారు. జనరల్ స్థానాల్లోనూ వీరు పోటీ చేసే అవకాశం ఉండటంతో పంచాయతీల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగే అవకాశముంది. రిజర్వేషన్లు తేలడంతో ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వీటతో పాటు జిల్లాలోని 3,870 వార్డు స్థానాలకు గాను ఎంపీడీవోల ఆధ్వర్యంలో రిజర్వేషన్లను పూర్తి చేశారు. వీటిల్లోనూ సగం స్థానాలను మహిళలకు కేటాయించారు. సర్పంచ్ రిజర్వేషన్ల కేటాయింపు వివరాలిలా... (షెడ్యూల్డ్ ఏరియాలో..) మహిళలకు : 124 జనరల్ : 127 వందశాతం ఎస్టీ జనాభా కలిగిన పంచాయతీల్లో.. మహిళలు : 07 జనరల్ : 08 నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ... ఎస్టీలు ఎస్సీలు బీసీలు అన్ రిజర్వ్డ్ మహిళలు 24 17 41 21 జనరల్ 23 14 45 22 -
మహా పోచమ్మకు నీరా‘జనం’
సారంగపూర్/దిలావర్పూర్: జిల్లాలో అత్యంత ప్రా శస్త్యం గల అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర మహోత్సవం ఆదివారం ముగిసింది. శనివారం దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రా మంలోగల గో దావరి నదికి అశేష భక్తజన సందోహం మధ్య అమ్మవారి ఆభరణాల శోభా యాత్ర చేరింది. ఆది వారం తెల్లవారుజామున గోదావరి నీటితో భక్తులు ఆభరణాలను శుద్ధి చేశారు. అనంతరం కాలినడకన ఆయా గ్రామాల మీదుగా తిరిగి అమ్మవారి ఆలయానికి ఆభరణాలు చేర్చారు. అమ్మవారికి నగలు అంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో జాత ర ముగిసింది. దారి పొడవునా ‘అమ్మ’ నామస్మరణ అడెల్లి పోచమ్మ తల్లి ఆభరణాల ఊరేగింపు శోభా యాత్ర శనివారం ఉదయం సారంగపూర్ మండలం అడెల్లి దేవస్థానం నుంచి దిలావర్పూర్ మండలంలోని కదిలి, మాడేగాం, దిలావర్పూర్, బన్సపల్లి, కంజర్ గ్రామాల మీదుగా రాత్రి సాంగ్వి పోచ మ్మ ఆలయం వరకు కొనసాగింది. అమ్మవారి ఆభరణాల వెంట వచ్చిన భక్తులు శనివారం రాత్రంతా పోచమ్మ ఆలయ పరిసరాల్లో అమ్మవారి నామస్మరణ చేస్తూ జాగరణలో పాల్గొన్నారు. ‘గంగ నీకు శరణమే.. ఘనమైన పూజలే..’ ‘ఉయ్యాలో ఉయ్యాలో.. ఊరూవాడ జంపాలో..’ ‘పోచమ్మ తల్లి చల్లంగా చూడ మ్మో..’ అంటూ భక్తులు అమ్మవారిని వేడుకుంటూ ఆటాపాటలతో ఆభరణాలను ఆదివారం తెల్లవారుజామున గోదావరి తీరానికి తీసుకువెళ్లారు. ఊరి పెద్దలు, అమ్మవారి ఆలయ పూజారులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారి నగలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలను గడ ముంతల్లో తీసుకుని గంగనీళ్ల జాతరకు వచ్చిన భక్తులు అమ్మవారి ఆభరణాల వెంట వెళ్లారు. సాంగ్వి ఆలయం నుంచి ఉదయం ప్రారంభమైన గంగనీళ్ల జాతర అడెల్లి దేవస్థానానికి తిరుగు పయనమైంది. ఈక్రమంలో కంజర్, బన్సపల్లి, దిలావర్పూర్, మాడేగాం, కదిలి గ్రామాల్లో స్థానిక నాయకులు అమ్మవారి ఆభరణాల శోభాయాత్రకు మేళతాళాలు, భాజాభజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. జాలుక దండతో ఘనస్వాగతం దిలావర్పూర్ గ్రామానికి ఆభరణాల శోభాయాత్ర చేరుకోగానే గ్రామస్తులు జాలుక దండ (భారీ పూలతోరణం) తో స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన పోతరాజులు అమ్మవారికి పూజలు నిర్వహిహించి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు యాట పిల్లలను (గొర్రె పొట్టేళ్లు) బహూకరించారు. శివసత్తులు పూనకాలు, నృత్యాల మధ్య ముందుకుసాగారు. దారిపొడవునా అమ్మవారి ఆభరణాలపై పసుపు నీళ్లు చల్లుతూ, కొబ్బరి కాయలు కొడుతూ భక్తులు మొక్కు తీర్చుకున్నారు. యాకర్పెల్లి గ్రామ గంగపుత్రులు సన్నని వలతో గొడుగుపట్టి ఆభరణాలను గ్రామ పొలిమేరల వరకు సాగనంపారు. ఆభరణాల శోభాయాత్ర, జాతరలో పాల్గొన్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏఎస్పీ రాజేశ్ మీనా, నిర్మల్ సీఐ కృష్ణ, దిలావర్పూర్ ఎస్సై రవీందర్తో పాటు పలువురు ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం గంగనీళ్ల జాతర నేపథ్యంలో అడెల్లి మహాపోచమ్మ ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజామాబా ద్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, హైదరాబా ద్, మెదక్, మహారాష్ట్రల నుంచి అధికసంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ తీర్థప్రసాదాలు అందించారు. జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్ యంత్రాంగం, వైద్య సిబ్బంది, ఆర్టీసీ సిబ్బందికి, ఆయా గ్రామాల ప్రజలకు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, ఈవో రమేశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏటీసీలో నైపుణ్యంతో కూడిన శిక్షణ
ఆదిలాబాద్టౌన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) లో నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తెచ్చిన 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను శనివారం హైదరాబాద్లోని మల్లెపల్లి ఏటీసీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని గ్రంథాలయ చైర్మ న్ మల్లెపూల నర్సయ్య, ఏటీసీ చైర్మన్ గోవర్ధన్రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఆధునిక యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, సరికొత్త సాంకేతికత అంశాలతో యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్లేస్మెంట్ ఉంటుందని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, ఏటీసీ పిన్సిపాల్ శ్రీనివాస్, ముత్యం రెడ్డి, ఏటీసీ కేంద్రాల ప్రిన్సిపాళ్లు, ఇన్స్ట్రక్టర్లు పాల్గొన్నారు. ఉట్నూర్రూరల్: ఉట్నూర్లోని కుమురంభీం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీసీని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా శనివారం ప్రారంభించి మాట్లాడా రు. రూ.5 కోట్లతో భవన నిర్మాణం పూర్తికాగా పరికరాలు, యంత్రాలు, ఇతర ఏర్పాట్లకు రూ.35 కోట్లు కేటాయించామన్నారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే ఐటీడీఏ తరఫున సమకూరుస్తామన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏటీసీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ రొడ్డ శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి
ఆదిలాబాద్టౌన్: ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సీనియర్ నాయకులు లంకా రాఘవులు జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం నిర్వహించిన సమావేశలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇప్పటివరకు దానిని అమోదించకుండా నిర్లక్ష్యం చేయడం బీసీలను బీజేపీ అవమానించడమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం స్వతంత్రంగా పోటీ చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే పార్టీని ప్రజలు ఆదరించి గెలిపించాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రవికుమార్, రాష్ట్ర నాయకులు శోభన్, రమేశ్, జిల్లా కార్యదర్శి మల్లేశ్, కార్యదర్శివర్గ సభ్యులు రాఘవులు, సచిన్, కిరణ్, దత్తాత్రి, మంజుల, సురేందర్, ఆశన్న, కిష్టన్న తదితరులు పాల్గొన్నారు. పిప్పల్కోటి నిర్వాసితులను ఆదుకోవాలి భీంపూర్: పిప్పల్ కోటి రిజర్వాయర్ భూ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని జాన్వెస్లీ కోరారు. శనివారం పిప్పల్కోటి నిర్వాసితులను కలిసి ఆయకట్టను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రిజర్వాయర్ కోసం దాదాపు 1200 ఎకరాల సాగుభూమిని రైతులు అందిస్తే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం అందించలేదన్నారు. తక్షణమే నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుత ధరకు మూడింతలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ప్రజా భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇందులో నిర్వాసితుల సంఘం కన్వీనర్ నసిరుద్దీన్, కోకన్వీనర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
నేరడిగొండ: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను సద్వి నియోగం చేసుకోవాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. పలు రికార్డులను పరిశిలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతున్న రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేయాలని ఏఎన్ఎంలకు సూచించారు. గర్భిణులు, బాలింతలు విధిగా పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి సద్దాం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లు
ఆదిలాబాద్టౌన్: కిసాన్ కపస్ యాప్ ద్వారానే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి, వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో శనివారం జూమ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతులు స్లాట్ బుకింగ్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ ఈ యాప్ ద్వారానే కొనుగోళ్లు చేపడుతుందన్నారు. పంట అమ్మకానికి తేదీని ఖరారు చేసుకోవాలని, యాప్లో బుకింగ్ చేసుకున్న రైతులు తప్పనిసరిగా అవే తేదీల్లో విక్రయించాల్సి ఉంటుందన్నారు. రైతు వేదికల్లో ఏఈవోలు స్లాట్ బుకింగ్ చేసుకునే విధంగా చూడాలన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్స్వామి, మార్కెటింగ్ ఏడీ గజానంద్ మాట్లాడారు . జిల్లాలో ఈ ఏడాది 4.28లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైందన్నారు. 30లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేసినట్లుగా తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా మార్కెట్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 20వ తర్వాత పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపారు. 34 జిన్నింగ్ మిల్లులను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. గతేడాది జిల్లాలో సీసీఐ ద్వారా 25లక్షల క్వింటాళ్ల పత్తిని, ప్రైవేట్ ద్వారా 2.50 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 6న కిసాన్ యాప్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో టెక్నికల్ ఏవోలు శివకుమార్, విశ్వనాథ్ తదితరులు ఉన్నారు. -
‘కొండా’ సేవలు చిరస్మరణీయం
బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలోబతుకమ్మ వేడుకలను జిల్లా కేంద్రంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో శనివారం అధికారికంగా నిర్వహించారు. ఉయ్యాల పాటలు హోరెత్తాయి. ఎస్టీయూ భవన్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక బతుకమ్మ అని పేర్కొన్నారు. ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో అసిస్టెంట్ కమిషనర్ వై.హిమశ్రీ, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూగార్డెన్లో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ రాజర్షి షా హాజరై బతుకమ్మలకు పూజలు చేశారు. కోలాటమాడి సందడి చేశారు. ఇందులో డీఎఫ్వో ప్రఽశాంత్ బాజీరావు పాటిల్, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. – ఆదిలాబాద్/కైలాస్నగర్ఆదిలాబాద్రూరల్: తెలంగాణ ఉద్యమంలో ఆచా ర్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాజరై కొండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, బీసీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి రాజలింగు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, పద్మశాలి సంఘం నాయకురాలు ఆశమ్మ పాల్గొన్నారు. -
‘బెస్ట్ ఇన్నోవేటివ్ టీచర్’కు ముగ్గురు ఎంపిక
ఆదిలాబాద్టౌన్/సాత్నాల: జటాదార ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఎన్జీవో ప్రతిష్టాత్మకంగా అందజేసే రాష్ట్రస్థాయి బెస్ట్ ఇన్నోవేటివ్ టీచర్ పురస్కారానికి జిల్లాలోని ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇంద్రవెల్లి ఉన్నత పాఠశా ల పీజీహెచ్ఎం రాంమోహన్, భీంసరి ఉన్నత పాఠఽశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ నీలం వెంకట్, కెనాల్ మేడిగూడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చిల్క సతీశ్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. పాఠశాలలో వారు బోధిస్తున్న వినూత్న బోధన తీరు, వారి నిరంతర కృషికి గాను అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 29న హైదరాబాద్లోని కళాభవన్లో ఈ అవార్డుల ప్రదానం ఉంటుందని వెల్లడించారు.చిలుక సతీశ్నీలం వెంకట్రాంమోహన్ -
‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కై లాస్నగర్: ఏఐసీసీ చేపట్టిన ఓట్ చోర్ గద్దీ చోడ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనవాసరెడ్డి అన్నారు. శుక్రవా రం తన క్యాంపు కార్యాలయం నుంచి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో జూమ్ నిర్వహించారు. నూతన ఓటర్ జాబితా లో ఏవైనా దొంగ ఓట్లు నమోదైతే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రాను న్న స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వృద్ధులకు అండగా ఉంటా.. వద్ధుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ‘కంది’ అన్నారు. పట్టణంలోని వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. -
వడ్డీ వ్యాపారులపై కొరడా
● జిల్లాలో ఏకకాలంలో దాడులు ● 43 బృందాలతో.. 13 మండలాల్లో తనిఖీలు ● 18 మందిపై కేసులుఆదిలాబాద్టౌన్: వడ్డీ వ్యాపారులపై ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 13 మండలా ల్లో 43 బృందాలతో శుక్రవారం దాడులు ని ర్వహించారు. అధిక వడ్డీతో రైతుల నడ్డీ విరుస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకొని, భూములు రాయించుకొని కొంత మంది వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తున్నారని తెలి పారు. ఈ మేరకు తనిఖీలు నిర్వహించి పది పోలీసు స్టేషన్ల పరిధిలో 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారుల నుంచి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బాండ్ పేపర్లు, సేల్డీడ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నార్నూర్లో బంగారం కు దువపెట్టుకొని అధిక వడ్డీకి డబ్బులు ఇస్తున్న వ్యాపారి నుంచి 12 గ్రాముల బంగారం, 235 గ్రాముల వెండీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లక్ష్మీప్రసన్న జ్యూయలరీ యజ మాని నిందితుడు ఉట్ల రవిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే ఆదిలాబాద్ వన్టౌన్లో 2 కేసులు, టూటౌన్లో 1, తలమడుగులో 2, బజార్హత్నూర్లో 4, బేలలో 1, ఇచ్చోడలో 3, గుడిహత్నూర్లో 1, నార్నూర్లో 1, ఇంద్రవెల్లిలో 1, ఉట్నూర్లో 2 మొత్తం 18 కేసులు నమోదైనట్లు తెలి పారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో వ్యాపారం చేసే వారు ఇకనైనా తీరు మార్చుకోవాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
కొత్త కిక్కు
ఆదిలాబాద్టౌన్: మద్యం షాపుల ఎకై ్సజ్ పాలసీ గెజిట్ను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో 40 షాపులకు గాను టెండర్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. అక్టోబర్ 18 వరకు కొనసాగనుంది. తొలి రోజు ఒక్క టెండర్ కూడా నమోదు కాలేదు. రెండేళ్ల క్రితం జిల్లాలో 975 టెండర్లు నమోదవగా, వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.19.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దాదాపు వెయ్యికి పైగా దాఖలయ్యే అవకాశముందని తెలుస్తోంది. జిల్లాలో .. జిల్లాలో మొత్తం 40 వైన్షాపులు ఉండగా ఇందులో 15 రిజర్వు చేశారు. 25 జనరల్గా కేటాయించారు. ఎస్సీలకు 1, 4, 18, 21, 28 షాపులను రిజర్వు చేశారు. గౌడకులస్తులకు అడెగామ–కే లోని 25వ షాపును కేటాయించారు. ఎస్టీలకు ఉట్నూర్ ఎకై ్సజ్స్టేషన్ పరిధిలోని తొమ్మిది షాపులను రిజర్వు చేశారు. అందులో 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 షాపులున్నాయి. దరఖాస్తు ఇలా.. మద్యం షాపుల టెండర్లకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆదిలా బాద్ ఎకై ్సజ్స్టేషన్ పరిధికి సంబంధించి రెండు, ఇచ్చోడ, ఉట్నూర్ స్టేషన్లకు ఒక్కోటి చొప్పున కౌంటర్లను ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారులు డీడీ లేక, చలాన్లు చెల్లించి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఆధార్ జిరా క్స్, పాన్కార్డు, రిజర్వు షాపుల కోసం దరఖాస్తు చేసుకునేవారు కులధ్రువీకరణ పత్రాలు, ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారు ఏజెన్సీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు మూడు పాస్ ఫొటోలు జతచేయాలని ఎౖక్సైజ్ అధికారులు పే ర్కొంటున్నారు. 21ఏళ్లు నిండిన వారు టెండర్లో పాల్గొనవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్ర మే లక్కీడ్రాలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తా రు. డ్రాలో షాపులు దక్కించుకున్న వారు అదే రోజు రెండు నెలలకు సంబంధించి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రెండేళ్ల పాటు అవకాశం ఉంటుంది. రెండేళ్లలో 12 సార్లు, రెండు నెలకోసారి ఎకై ్సజ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. షాపులకు సంబంధించి మూడు స్లాబ్లుగా విభజించారు. ఆదిలా బాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటన్నింటికి రూ.65లక్షలు, రూ.55లక్షలు, రూ.50లక్షల చొప్పు న మూడు స్లాబ్లున్నాయి.ఆయా దుకాణాల స్లాబు కు అనుగుణంగా నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది దరఖాస్తు ఫీజు రూ.3లక్షలుగా నిర్ణయించారు. 23న లక్కీడ్రా..నూతన మద్యం టెండర్లకు సంబంధించిన పాలసీ విడుదల చేశాం. అక్టోబర్ 18 వరకు దరఖాస్తు గడువు ఉంది. దరఖాస్తు ఫారాలు సమర్పించేందుకు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశాం. అక్టోబర్ 23న జిల్లా కేంద్రంలోని రత్నా గార్డెన్లో కలెక్టర్ చేతుల మీదుగా లక్కీడ్రా ప్రక్రియ ఉంటుంది. – హేమశ్రీ, డీపీఈవో -
తల్లుల సౌకర్యార్థం కియోస్క్
● ఆర్పీఎఫ్ ఐజీ అరోమా సింగ్ ఆదిలాబాద్: పాలిచ్చే తల్లులకు సౌకర్యవంతంగా ఉండేందుకే కియోస్క్ను ఏర్పాటు చేసినట్లు ఆర్పీఎఫ్ ఐజీ ఆరోమ సింగ్ ఠాకూర్ అన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన కియోస్క్ను కలెక్టర్ రాజర్షిషాతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషణ్ మహా కార్యక్రమంలో భాగంగా కియోస్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వే తరఫున కూడా సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. నవజాత శిశువులకు పాలు ఇవ్వడానికి తల్లులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అనంతరం రైల్వేస్టేషన్లోని వెయిటింగ్ గదులను పరిశీలించారు. ఇందులో ఆర్పీఎఫ్ నాందేడ్ డివిజన్ సెక్యూరిటీ కమిషనర్ అమిత్ ప్రకాశ్మిశ్రా, డీడబ్ల్యూవో మిల్క, డీసీపీవో రాజేంద్ర ప్రసాద్, యశోద తదితరులు పాల్గొన్నారు. -
వీరనారి చాకలి ఐలమ్మ
ఆదిలాబాద్రూరల్: వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఐలమ్మ జయంతిని బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అధికా రికంగా నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రి ఎదుట గల ఆమె విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివా ళులర్పించారు. అనంతరం మాట్లాడారు. తెలంగా ణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్రను కొనియాడారు. అంతకుముందు బీసీ సంక్షేమ సంఘం, రజక సంఘం నేతలతో పాటు పలు పార్టీల నేతలు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, మాజీమంత్రి జోగు రామన్న, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, శ్రీనివాస్, మనీషా, సుజాత, పాల్గొన్నారు. తెలంగాణ పౌరుషానికి ప్రతీక ఐలమ్మ ఆదిలాబాద్టౌన్: తెలంగాణ పౌరుషానికి, పోరాటా నికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ శ్రీనివాస్, సీహెచ్ నాగేందర్, ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, కార్యాలయ ఏవో భక్త ప్రహ్లాద్, సూపరింటెండెంట్లు సులోచన, సంజీవ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
● జల సంరక్షణ సంకల్పం.. జాతీయ అవార్డు సొంతం ● జిల్లాకు దక్కిన ‘జల్ సంచయ్ జన్ భాగీదారి’ పురస్కారం ● రూ.2 కోట్ల నగదు కూడా.. ● రాష్ట్రపతి చేతుల అవార్డు అందుకోనున్న కలెక్టర్
కలెక్టర్కు సన్మానంజిల్లాకు జల్ సంచయ్ జన భాగీదారి జాతీ య పురస్కారం వరించడంపై జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో రాథోడ్ రవీందర్ ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు, ఉపాధి హామీ ఏపీవోలు, ఇతర సిబ్బంది శుక్రవారం కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపా రు. ఇందులో ఏడీఆర్డీవో కుటంబరావు, ఏపీ డీ కృష్ణారావు, ఏవో అందె గంగాధర్ తదితరులున్నారు. అంతకు ముందు ఈజీఎస్లో పనిచేసే ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు డీఆర్డీవోను సత్కరించి అభినందనలు తెలిపారు.కై లాస్నగర్: జిల్లాకు మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. నీటి సంరక్షణ చర్యలకు గాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో నాలుగోస్థానం కై వసం చేసుకుంది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ‘జల్ సంచయ్ జన్ భాగీ దారి’ పురస్కారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి కలెక్టర్ రాజర్షి షాకు ఉత్తర్వులు అందాయి. త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కలెక్టర్ ఈ అవార్డు అందుకోనున్నారు. దీని కింద రూ.2కోట్ల నగదు కూడా అందనుంది. జిల్లా ఉన్నతాధికారులతో పాటు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పురస్కారం వరించిందిలా.. నీటి సంరక్షణ ప్రాధాన్యత చాటి చెప్పడంతో పాటు ఆయా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసేలా కేంద్ర ప్రభుత్వం జల్ సంచయ్.. జన భాగీ దారి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అడవుల జిల్లాగా ముద్రపడ్డ ఆదిలాబాద్లో గుట్టలు, రాళ్లు రప్పలతో కూడిన భూములే అధికం. వర్షపునీరంతా భూమిలోకి చేరేలా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యలో పలు సంరక్షణ చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద పంట చేలు, అటవీ ప్రాంతాలు, చెరువులు, బోర్వెల్స్, కాలువల వద్ద ప్రత్యే క నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా లక్షకుపైగా నీటి సంరక్షణ పనులు చేపట్టి 98వేల ఫొటోలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేశా రు. వాటిని పరిశీలించిన కేంద్రం జిల్లాకు ప్రత్యేక బృందాన్ని పంపించింది. ఈ ఏడా ది జూన్లో ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ నీటి కమిషన్ సభ్యులు నెల పాటు ఇక్కడే ఉండి జిల్లాలో చేపట్టిన ఆయా పనులను పరిశీలించారు. వెయ్యి ఫొటోలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. వాటిని పరిగణలోకి తీసుకున్న జల్శక్తి మంత్రిత్వ శాఖ జిల్లాకు పురస్కారం ప్రకటించింది. జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలివి.. వర్షపు నీటిని బొట్టుబొట్టుగా ఒడిసి పట్టి సంరక్షించడమే లక్ష్యంగా వాగులు, చెరువుల వద్ద ఉపాధి హామీ నిధులతో పెద్ద ఎత్తున చెక్డ్యాంలను నిర్మించారు. వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాల్లో పంటచేలకు నీటిని ఉపయోగించుకునేలా ఊటకుంటలు, కంటూరు కందకాలు, మ్యాజిక్ సోక్పిట్లు, బోర్వెల్స్ రీచార్జ్ స్ట్రక్చర్స్, ఫిష్ పాండ్స్, ఫార్మర్స్ బౌండ్రీ ట్రెంచెస్ వంటి నిర్మాణాల ను భారీగా చేపట్టారు. వీటితో పాటు గ్రామాల్లోని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపొందించేందుకు వీలుగా ఉపాధి కూలీలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి పూడిక తీత పనులు చేపట్టారు. ప్రధానంగా వేసవి లో నీటి ఎద్దడి నెలకొనే ఏజెన్సీ పరిధిలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, సిరికొండ, గాదిగూడ వంటి మండలాల్లో ఈ కార్యక్రమాలను ఎక్కువగా నిర్వహించారు. వీటి ద్వారా భూగర్భజలాలు పెంపొంది నీటి ఎద్ద డి నియంత్రణకు దోహదపడింది. తద్వారా జాతీయ అవార్డు వచ్చేందుకు తోడ్పడింది. -
చాలా సంతోషంగా ఉంది
జల్ సంచయ్.. జన్ భాగీదారి జాతీయ స్థాయి పురస్కారానికి జిల్లా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఇందులో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల కృషి అభినందనీయం. వర్షపునీటిని ఒడిసిపట్టి సంరక్షించేలా జిల్లాలో అనేక కార్యక్రమాలను అమలు చేశాం. ప్రధానంగా ఏజెన్సీ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టాం. అవార్డు ద్వారా వచ్చే రూ.2కోట్లతో మరిన్ని నీటి సంరక్షణ చర్యలు చేపడుతాం. – రాజర్షి షా, కలెక్టర్ జిల్లాకు గర్వకారణంనీటి సంరక్షణలో జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానం, దేశంలో నాలుగో స్థానంలో నిలిచి జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికవడం గర్వకారణంగా ఉంది. కలెక్టర్ రాజర్షి షా మార్గదర్శకంలో వారి సూచనలకు అనుగుణంగా పనులు చేపట్టాం. సమష్టి కృషి ఫలితమే ఈ అవార్డు. ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం మరింత ఉత్సాహన్ని అందిస్తోంది. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
పంట కాలం పెరిగినట్టే..
పత్తి పంట కాలం సుమారు నెల పాటు పెరిగినట్టే. ప్రస్తుతం మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా రైతులు చేలల్లో పనులు చేపట్టలేని పరిస్థితి ఉంది. వర్షాలు తగ్గిన తర్వాతే ఏదైనా చేపట్టాలి. వానలు తగ్గిన తర్వాత పత్తికి అనుకూల వాతావరణం ఏర్పడితే పూత, గూడు, కాయ పోయిన చోట మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలోనే అవసరమైన ఎరువులు ఇవ్వాలి. దీంతోపాటు సూక్ష్మధాతువు లోపాల నివారణకు పోషక విలువ కల్పించాలి. అంతేకాకుండా రానున్న రోజుల్లో చలి పెరిగే అవకాశాలు ఉన్నందున రసం పీల్చే పురుగులతో పాటు ఇతర పురుగుల ప్రభావం పెరుగుతుంది. వాటి నివారణకు కూడా మందులు వాడాలి. – శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
కై లాస్నగర్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వురు మాట్లాడుతూ, వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మూడు నెలల బకాయిలతో పాటు దసరా పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలను గ్రీన్చానల్ ద్వారా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలన్నా రు. అనంతరం అతనపు కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో యూనియన్ నాయకులు ఎస్.రవి, గంగన్న, అశోక్, ప్రమోద్, హనుమాన్లు, మారుతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎలుగుబంట్ల దాడిలో రైతులకు గాయాలు
నెన్నెల: మండలంలోని మైలారం గ్రామ శివారులో గురువారం మూడు ఎలుగుబంట్లు దాడి చేయడంతో దుబ్బపల్లి గ్రామానికి చెందిన అర్శ మారయ్య, గావిడి మల్లేశ్ అనే గిరిజన రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. సదరు రైతులు మధ్యాహ్నం గ్రామ శివారులోని పత్తి చేన్లకు వెళ్తుండగా మూడు ఎలుగుబంట్లు అకస్మాత్తుగా వచ్చి దాడి చేశాయి. తీవ్రగాయాలు కావడంతో బాధిత కుటుంబ సభ్యులు వెంటనే 108లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యంకోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బ్రాండెడ్ పేరిట పీడీఎస్ బియ్యం విక్రయం
ఆదిలాబాద్టౌన్: బ్రాండెడ్ బియ్యం పేరిట పీడీఎస్ బియ్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్టౌన్ సీఐ బీ.సునీల్కుమార్ తెలిపారు. గురువా రం వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని చిల్కూరి లక్ష్మీనగర్ కాలనీకి చెందిన షేక్ అయూబ్ పట్టణంలోని శివాజీచౌక్లో ఆంధ్రా కిరా ణషాపు నడుపుతున్నాడన్నారు. బ్రాండెడ్ బియ్యం సంచుల్లో పీడీఎస్ బియ్యం నింపి ప్రజలకు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఆరు క్వింటాళ్ల రాయితీ బియ్యంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అతనిపై పలు కేసులు న మోదైనట్లు తెలిపారు. నిందితుడి దుకాణా న్ని జప్తు చేసేందుకు ఆదిలాబాద్ ఆర్డీవోకు సిఫార్సు చేసినట్లుగా వెల్లడించారు. -
ముంబై ఎయిర్పోర్టులో ఆదిలాబాద్ వాసి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: టాంజానియా దేశంలో ఉంటూ మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన షేక్ ఇర్ఫాన్ను ముంబై ఎయిర్పోర్టులో అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. గురువారం వన్టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్రూరల్ పోలీసులు రౌడీషీటర్ కై ంచి సలీంను అరెస్ట్ చేసిన ఘటనపై నిందితుడు ఇర్ఫాన్ ‘సిల్సిలా ఆదిలాబాద్’ అనే వాట్సాప్ గ్రూపులో టాంజానియాలో ఉంటూ వివాదాస్పద వాయిస్, టెక్స్ ్ట మెసేజ్లు పోస్ట్ చేశాడు. దీంతో గత ఏప్రిల్ 15న ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడు విదేశాల్లో ఉండటంతో ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు ఇమిగ్రేషన్ అధికారులు అతనిపై లుక్ అవుట్ సర్క్యూలర్ (ఎల్ఓసీ) జారీ చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం టాంజానియా నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన షేక్ ఇర్ఫాన్ను ఇమిగ్రేషన్ అధికారులు డిటైన్ చేసి ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై పీర్సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ముంబైలో అతన్ని పట్టుకొని ఆదిలాబాద్కు తరలించినట్లు చెప్పారు. జడ్జి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల జుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు వివరించారు. నిందితుడి వద్ద నుంచి పాస్పోర్ట్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జవహర్గర్కు చెందిన సింగరేణి కార్మికుడు రెక్కల గోవర్ధన్రెడ్డి (39) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఆర్కేపీ సీహెచ్పీలో జనరల్ అసిస్టెంటుగా పనిచేస్తున్న గోవర్ధన్రెడ్డికి అతని భార్యకు మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఏఎన్రెడ్డి కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం సారంగాపూర్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రమేష్ చందర్గౌడ్ ఈనెల 22న కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలో ఉంటున్న కూతురు ఇంటికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. విషయాన్ని రమేష్ చందర్గౌడ్కు ఫోన్ ద్వారా చెప్పడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు ఐదున్నర కేజీల వెండి, తులం నర బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు. క్లూస్టీం, ఫింగర్ ప్రింట్ టీం వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉయ్యాలో..
పాటపాడే అక్కాచెల్లెళ్లు బతుకమ్మ అనగానే అందరికీ గుర్తొచ్చేవి.. తీరొక్క పువ్వులు.. బతుకమ్మ పాటలు. ప్రస్తుతం పూలకు ఎంత డిమాండ్ ఉందో.. పాటలకు అంతే ఉంది. ఏటా కొత్త కొత్త పాటల కోసం మహిళలు ఎదురు చూస్తుంటారు. అయితే ఒకప్పుడు బతుకమ్మ ఆట, పాటలు సంప్రదాయబద్ధంగా ఉండేవి. మహిళలు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే పాటలు పాడేవారు. క్రమంగా ఆ పాటలు కనుమరుగవుతున్నాయి. అయితే ఇప్పటికీ కొందరు పాత పాటలతో ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రస్తుత తరం.. జానపద పాటలు, కోలాటాల నృత్యాలతో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకల్లో పాటలు సద్దుల బతుకమ్మ వరకు ఊరూరా.. వాడవాడలా మార్మోగుతున్నాయి. పూల పండుగలో పాడే పాటల్లో సామాజిక అంశాలు, కుటుంబ బాంధవ్యాలు దాగి ఉన్నాయి. బతుకమ్మ పాటలపై నాటి, నేటి మహిళల అభిప్రాయాలు..పల్లెదనాన్ని ప్రతిబింబించేలా... నిర్మల్ఖిల్లా: బతుకమ్మ పాటలు అంటేనే పల్లె జీవనాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి. మన సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం ఉట్టిపడే బతుకమ్మ పాటలు వారసత్వ సంపదగా కాపాడుకుంటూనే భావితరానికి తెలియజెప్పేందుకు ప్రయత్నం చేయాలి. నేటితరం అభిరుచికి అనుగుణంగా పాతకొత్తల మేలు కలయికగా పాటల్ని రూపొందించుకుంటే మంచిది. – ఎల్.నవ్య, సింగర్, నిర్మల్ ప్రోత్సహించాలి నిర్మల్ఖిల్లా: పాటలు పాడే వారిని గుర్తించి ప్రోత్సహిస్తేనే బతుకమ్మ సంప్రదాయం నిలుస్తుంది. ప్రభుత్వంతో పాటు సంఘాలు కూడా బతుకమ్మ పాటల పోటీలు నిర్వహిస్తే కొత్తతరానికి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటి తరానికి బతుకమ్మ పాటల్ని సొంతంగా పాడేవారన్న విషయమే తెలియదు. – పర్కిపండ్ల లక్ష్మి, తాండ్ర, సారంగపూర్ పాటల వెనుక నాటి జ్ఞాపకాలు నిర్మల్ఖిల్లా: మా చిన్నప్పటి నుంచి బతుకమ్మ పాటలు అంటే ప్రాణం. సాయంత్రం వేదికల వద్ద బతుకమ్మల చుట్టూ తిరుగతూ పాటలు పాడటం ఆనందంగా ఉండేది. బీడీ కంపనీలో తోటివారితో కలిసి సామూహికంగా బతుకమ్మ ఆడుతూ స్వయంగా పాటలు పాడుకునే వాళ్లం. కానీ ఇప్పటి తరం మాత్రం మొబైల్, టీవీ, డీజే పాటలతో బతుకమ్మ ఆడుతున్నారు. – సంగెం భూదేవి, అనంతపేట, నిర్మల్ రూరల్ ఏడు దశాబ్దాలకు పైగా.. నాకు 80 సంవత్సరాలు. నా చిన్ననాటి నుంచి ఏడు దశాబ్దాలకు పైగా బతుకమ్మను చూస్తూ వస్తున్నా. ఇప్పటికీ బొడ్డెమ్మ పాటలు కై గట్టి పాడుతా. ఈతరం మహిళలు బతుకమ్మ ప్రాధాన్యతను తెలియజెప్పే విధంగా ఆ పాటలు నేర్చుకోవాలి. వారసత్వ సంపద లాంటి బతుకమ్మ పాటలు కనుమరుగు కాకుండా సంరక్షించుకోవాలి. – కట్కం రుక్మాబాయి, బోరిగాం, సారంగాపూర్ సంస్కృతిని పరిరక్షిస్తూనే... నిర్మల్ఖిల్లా: కాలానుగుణంగా పాటలరూపం మారినా, ఆత్మ మాత్రం అదే. ఈ తరం భాషలో, బీట్లో పాడినా బతుకమ్మ స్ఫూర్తి అందుతుంది. కొత్తగా సృజనాత్మకంగా పాటలను వెలుగులోకి తెస్తున్నారు. నవతరం యువతుల అభిరుచికనుగణంగా పాటలు రూపుదిద్దుకుంటున్నాయి. – శైలజ, జానపద గాయని, నిర్మల్ -
లంబాడీలను తొలగించే వరకు ఉద్యమిస్తాం
తలమడుగు: ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు ఉద్యమిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేశ్ అన్నారు. గురువారం రాయి సెంటర్, 9 ఆదివాసీ తెగలు, తుడుందెబ్బ, ఇతర సంఘాల ఆధ్వర్యంలో వేంకటేశ్వర ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకు దెరువు కోసం వలస వచ్చి ఆదివాసీలకు రావాల్సిన అభివృద్ధి ఫలాలను రాకుండా చేస్తున్న లంబాడీలను వెంటనే తొలగించాలన్నారు. అక్రమంగా వలస వచ్చిన వారికి ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దన్నారు. అనంతరం తహసీల్దార్ రాజమోహన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు జంగాల పోచన్న, డివిజన్ అధ్యక్షుడు కుముర జ్ఞానేశ్వర్, రాయి సెంటర్ అధ్యక్షుడు రామారావు, ఉపాధ్యక్షుడు భుజంగరావు పాల్గొన్నారు. -
గిరి గ్రామాల అభివృద్ధే లక్ష్యం
నేరడిగొండ: గిరిజన గ్రామాల అభివృద్ధే ఆదికర్మ అభియాన్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ పరిశీలకుడు జితేంద్రసింగ్ అన్నారు. గురువారం మండలంలోని వివిధ గ్రామపంచాయతీల్లో పర్యటించి కార్యక్రమం అమలు తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా లింగట్ల గ్రామ పంచాయతీలోని గోండుగూడలో గుస్సాడీ నృత్యంతో ఆయనకు స్వాగతం పలికారు. లింగట్ల రాజురా, వెంకటపూర్ గ్రామపంచాయతీల్లో కార్యక్రమం అమలు, గ్రామాభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక, గ్రామసభ, గ్రామ సోషల్ మ్యాపింగ్, నిరుద్యోగ యువత గుర్తింపు వంటి అంశాలను పరిశీలించి సంతృప్తి చెందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి వంటి అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. నేరడిగొండ మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం అమలవుతుందని ఆయన పేర్కొన్నారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
కాగజ్నగర్టౌన్: అనారోగ్యంతో బాధపడుతూ మూడు రోజులుగా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని సీతానగర్కు చెందిన మౌల్కార్ అమృత (40) గురువారం రాత్రి మృతి చెందింది. కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన వైద్యం అందించకపోవడంతోనే ఒక నిండు ప్రాణం బలైందని, దీనికి ఆస్పత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. -
డిగ్రీ చేసిన డిపెండెంట్లకు క్లర్క్ పోస్టులు
శ్రీరాంపూర్: సింగరేణి గని ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల స్థానంలో డిగ్రీ చదివిన డిపెండెంట్లకు సూటబుల్ జాబ్ కింద గ్రేడ్ 3 క్లర్క్పోస్ట్ ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 2009లో అప్పుడున్న గుర్తింపు సంఘం ఏఐటీయూసీకి, యజమాన్యానికి మధ్య జరిగిన చర్చల్లో గని ప్రమాదాల్లో ఉద్యోగులు చనిపోతే వారి పిల్లలకు విద్యార్హతను బట్టి సూటబుల్ జాబ్ కల్పించాలని ఒప్పందం జరిగింది. కానీ కేవలం ఐటీఐ, బీటెక్ వంటి టెక్నికల్ చదువులు చదివిన వారికి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టెక్నికల్ సూపర్వైజర్లుగా సూటబుల్ జాబ్ కల్పిస్తున్నారు. నాన్ టెక్నికల్ చదువులైన డిగ్రీ మరే ఇతర సత్సమాన డిగ్రీ విద్యార్హత ఉన్న డిపెండెంట్లకు మాత్రం అండర్గ్రౌండ్లో జనరల్ అసిస్టెంట్గా ఉద్యోగం కల్పిస్తున్నారు. దీనిపై ప్రస్తుత గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు పలుమార్లు యజమాన్యంతో చర్చించారు. స్ట్రక్షరల్ సమావేశంలో కూడా ఈ డిమాండ్ను పెట్టారు. దీంతో గురువారం ఈ అంశంపై హైదరాబాద్లో డిప్యూటీ సీఎల్సీ సమక్షంలో యజమాన్యానికి, గుర్తింపు సంఘానికి మధ్య ట్రైపార్టీయేట్ సమావేశం జరిగింది. ఇందులో సమస్యలను పరిష్కరిస్తూ రాత పూర్వక ఒప్పందం జరిగింది. ఉద్యోగి గని ప్రమాదంలో మృతి చెందితే డిగ్రీ అర్హత కలిగిన వారి పిల్లలకు గ్రేడ్ 3 క్లర్క్గా ఉద్యోగం కల్పించబోతున్నారని గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే 2009 నుంచి మైన్స్ యాక్సిడెంట్ కేసుల్లో డిపెండెంట్లు డిగ్రీ అర్హత ఉండి జనరల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేస్తున్న వారికి కూడా గ్రేడ్ 3 క్లర్క్ ఇప్పిస్తామని తెలిపారు. -
ఓరియంట్ కార్మికులకు బోనస్ పెంపు
కాసిపేట: దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపనీ పర్మినెంట్, లోడింగ్ కార్మికులకు బోనస్ పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గుర్తింపు సంఘం అధ్యక్షుడు సత్యపాల్రావుతో యాజమాన్యం గురువారం నిర్వహించిన చర్చల్లో రూ.4 వేలు పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతంలో రూ.35,500 ఉండగా ప్రస్తుతం రూ.39,500కు పెంచారు. రాబోయే సంవత్సరానికి రూ.2వేలు పెంచుతూ రూ 41,500లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.16,800 ఇస్తుండగా రూ.వెయ్యి పెంచుతూ రూ.17,800 ఇవ్వనున్నట్లు తెలిపారు. చర్చల్లో కంపనీ హెచ్ఆర్ హెడ్ ఆనంద్ కులకర్ణి, గుర్తింపు సంఘం సెక్రటరీ భీమిని మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. అగ్రిమెంట్ పత్రాలతో సత్యపాల్రావు -
సౌత్ జోన్ పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇంది రాప్రియదర్శిని స్టే డియంలోగల ఆది లాబాద్ క్రీడా పా ఠశాలకు చెందిన విద్యార్థి ఎస్.చరణ్ సౌత్ జోన్ జాతీ యస్థాయి పోటీల్లో సత్తా చాటాడు. ఈనెల 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో గల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రా రంభమైన 36వ సౌత్ జోన్ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ట్రయాథ్లాన్–ఏ పోటీల్లో గురువారం స్వర్ణంతో మెరిసినట్లు అథ్లెటిక్స్ కోచ్ రమేశ్ తెలిపారు. ఈ సంవత్సరం అథ్లెటిక్స్ పోటీల్లో జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన తొలి అథ్లెట్ చరణ్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చరణ్ను డీవైఎస్వో శ్రీనివాస్ తదితరులు అభినందించారు. -
అసాంఘిక చర్యలకు పాల్పడవద్దు
ఇచ్చోడ: అసాంఘిక చర్యలకు పాల్పడవద్దని ఎస్పీ అఖిల్మహాజన్ సూచించారు. గురువారం ఉద యం 5గంటలకు మండలంలోని కేశవపట్నంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించగా ఎస్పీ భారీ వర్షంలోనూ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో గ్రామానికి చెందిన పలువురిపై 90 కేసులు నమోదైనట్లు తెలిపారు. కలప స్మగ్లింగ్, పీడీ యాక్ట్, రౌడీ షీట్లు నమోదైన వారు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెదిలితే కేసులు ఎత్తివేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. చదువుకోలేక కొన్నేళ్లుగా ఇక్కడి ముల్తానీలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఐదేళ్లున్న పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీస్శాఖకు సహకరించాలని కోరారు. పత్రాలు లేని వాహనాలు స్వాధీనం కేశవపట్నం గ్రామంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్లో భాగంగా పోలీసులు ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలులేని 82 ద్విచక్రవాహనాలు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఉట్నూర్ అడిషనల్ ఎస్పీ కాజల్సింగ్, ఆదిలాబాద్ డీఎస్సీ జీవన్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, ఇచ్చోడ, ఉట్నూర్ సీఐలు రాజు, ప్రసాద్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, నేరడిగొండ, సిరికొండ ఎస్సైలు పురుషోత్తం, సాయన్న, శ్రీకాంత్, ఇమ్రాన్, పూజ, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్, 180మంది పోలీసులు, 20 మంది మహిళా పోలీసులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శి నుంచి ఎంపీడీవోగా..
ఉట్నూర్రూరల్: మండలంలోని కొత్తగూడ చెక్ పోస్టు గ్రామానికి చెందిన తుడుం లవ్కుమార్ గ్రూప్–1లో రాణించి ఎంపీడీవోగా ఉద్యోగం సాధించాడు. ఆదిలాబాద్లోని గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు, డీఆర్డీఏ ద్వారా హైదరాబాద్లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివాడు. బీటెక్లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. 2016లో గ్రూప్–2లో విఫలమై, 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఎంిపికయ్యాడు. ప్రస్తుతం నార్నూర్ మండలం మాన్కాపూర్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే 2022 నుంచి గ్రూప్–1 కోసం ప్రయత్నించాడు. 440 మార్కులతో (తెలుగు మీడియం) స్టేట్ 902, ఎస్సీ కేటగిరీలో 88వ ర్యాంక్ సాధించి ఎంపీడీవో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కాగా, లవకుమార్ పదేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు మరణించారు. భార్య మృణాళిని, మిత్రులు ప్రవీణ్, వెంకటేశ్, రాజు, అన్నయ్య రాజేందర్ ప్రోత్సాహంతో తాను ఈ విజయం సాధించినట్లు లవకుమార్ తెలిపాడు. -
సజావుగా ఇంటర్వ్యూల ప్రక్రియ
కై లాస్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమి క విద్య (ప్రీ ప్రైమరీ స్కూల్స్)ను అందించేందుకు ప్రభుత్వం 19 ఇన్స్ట్రక్టర్, 19 ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా 38 పో స్టులకు 735మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఎంపిక కోసం గురువారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థులను పిలిచి ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ప్రక్రియ సజావుగా సా గింది. కాగా, పోటీ తీవ్రంగా ఉండటంతో డీఎడ్ అ భ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించి నట్లు అధికారులు తెలిపారు. ఎంపికై న అభ్యర్థుల జాబితా త్వరలో ప్రకటిస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
మొదటి ప్రయత్నంలోనే డీఎస్పీగా..
ఇంద్రవెల్లి: మండలంలోని వాగాయితండాకు చెందిన సత్యభామ–రాథోడ్ దుదిరాం దంపతుల కుమారుడైన రాథోడ్ ప్రమోద్ గ్రూప్–1లో 458.5 మార్కులతో 420వ ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగం దక్కించుకున్నాడు. ప్రమోద్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివాడు. 2007–10 విద్యాసంవత్సరంలో ఢిల్లీలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో డిగ్రీలో బీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసి అక్కడే ప్రస్తుతం పీహెచ్డీ మూడో సంవత్సరం చదువుతూ గ్రూప్స్కు సిద్ధమయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే సత్తా చాటి డీఎస్పీగా ఉద్యోగం సాధించాడు. కాగా, ప్రమోద్ ఐదుసార్లు యూపీఎస్సీ సివిల్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లడం గమనార్హం. -
స్వతహాగా సన్నద్ధమై డీఎస్పీగా ఎంపికై ..
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రానికి చెందిన సునీల్కుమార్ మకారియా–శ్వేత మకారియా దంపతుల కుమార్తె సాక్షి మకారియా గ్రూప్–1లో డీఎస్పీ ఉద్యోగం సాధించింది. జిల్లా కేంద్రంలోని కాన్వెంట్ పాఠశాలలో పదో తరగతి, హైదరాబాద్ చైతన్యలో ఇంటర్, ఢిల్లీలోని ఎల్ఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఢిల్లీలోనే ఉంటూ పీజీ, బీఏ, ఎంఏ చదివింది. సివిల్స్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించింది. ఐదుసార్లు యూపీఎస్సీ పరీక్షలు రాసినా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉంటూ పరీక్షల కోసం సన్నద్ధమైంది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే స్వతహాగా సన్నద్ధమై గ్రూప్–1లో సత్తా చాటింది. 65వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికై ంది.