breaking news
Adilabad District Latest News
-
అంబులెన్స్కు దారి కష్టాలు
బెల్లంపల్లి: ఛత్తీస్గఢ్లోని గరియాబండ్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం జాడి వెంకటి మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్లిన అంబులెన్స్కు దారి కష్టాలు ఎదురయ్యాయి. బంధువులు వెంకటస్వామి, జనార్దన్, గ్రామస్తుడు దామోదర్గౌడ్లు శనివారం రాత్రి వెంకటి మృతదేహాంతో చంద్రవెల్లికి తిరుగుపయనమయ్యారు. ఆదివారం తెల్లవారుజాము మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో బురదలో చిక్కుకుంది. రెండు గంటలు శ్రమించిన బయటకు రాకపోవడంతో కిలోమీటరు దూరాన గ్రామానికి చేరుకుని ఓ ట్రాక్టర్ను, కొంతమందిని తోడ్కోని వచ్చి బయటకు తీశారు. వార్దా నది బ్రిడ్జి పై నుంచి నీటి ఉధృతి కారణంగా వెనక్కి మళ్లీ మరో దారిని ఎంచుకున్నారు. కుమురం భీం జిల్లా బెజ్జూరుకు అక్కడి నుంచి కౌటాల, కాగజ్నగర్ మీదుగా సాయంత్రం 4 గంటలకు చంద్రవెల్లికి చేరుకున్నారు. అమరుల బంధుమ్రితుల కమిటీ శ్రేణులు, గ్రామస్తులు, బఽంధువులు ఊరి పొలిమేరల నుంచి వెంకటి మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. వెంకటి మృతదేహానికి వవెళ్లిన అంబులెన్స్కు దారికష్టాలు -
ప్రాజెక్టులో మునిగి ఒకరి మృతి
భైంసారూరల్: మండలంలోని కోతల్గాం సమీపంలోని చెక్డ్యాం వద్ద పల్సికర్ రంగారావు ప్రాజెక్టులో మునిగి పవార్ రాజు(36) మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహాగాం గ్రామానికి చెందిన పవార్ రాజు గత నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబీకులు బంధువులు, తెలిసినవారి వద్ద వెతికిన ఆచూకీ దొరకలేదు. కోతల్గాం సమీపంలోని చెక్డ్యాం వద్ద ప్రాజెక్టు వాటర్లో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. భార్య కవిత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రెండు బైక్లు ఢీకొని ఒకరు..రెబ్బెన: మండలంలోని వంకులం స మీపంలో పెద్దవా గు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొని ఒకరు అక్కడికక్క డే మృతి చెందా డు. ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం రాపెల్లికి చెందిన సు నార్కర్ ఆనంద్రావు (47) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం కాగజ్నగర్ నుంచి బైక్పై రాపెల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్ర మాదంలో ఆయన తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరోబైక్పై ప్రయాణిస్తున్న ఎన్నం తిరుపతి, ఎన్నం కృష్ణకుమార్కు గాయాలు కాగా ప్రైవేటు వాహనంలో కా గజ్నగర్ తరలించారు. మృతుడికి భార్య, ఇ ద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య సురేఖ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్షాక్తో ఒకరు..మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధి యాపల్ ప్రాంతంలోని జీఎం ఆఫీస్ సమీపంలో ఆదివారం విద్యుత్ షాక్తో ఛత్తీస్గఢ్కు చెందిన సుకులాల్ యాదవ్వ్ (31) మృతి చెందాడు. ఎస్సై రాజశేఖర్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. నాలుగేళ్ల క్రితం సుకులాల్ కుటుంబంతో జీవనోపాధి కోసం మందమర్రికి వచ్చారు. కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం పనికి వెళ్లడానికి వేడి అన్నం పెట్టుకున్నాడు, చల్లార్చుకోడానికి కూలర్ స్విచ్ ఆన్చేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై కిందపడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమీపంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. సుకులార్ మృతదేహాన్ని చత్తీస్గఢ్ తరలించేందుకు హిందూ శ్మశానవాటిక కేకే–ఓసీ కమిటీ సభ్యులు విరాళాలు సేకరించి రూ.70 వేలను కుటుంబసభ్యులకు అందించారు. -
ఇద్దరు దొంగల అరెస్ట్
బెల్లంపల్లిరూరల్: మండలంలోని గురిజాల రైతువేదికలో జూలై 3న జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. ఎట్టకేలకు రెండు నెలలకు దొంగలను పట్టుకున్నారు. పోలీసుస్టేషన్లో బెల్లంపల్లి రూరల్ సీఐ చందవోలు హనోక్ ఆదివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. గురిజాల రైతు వేదికలో రూ.1.90 లక్షల విలువ గల వీడియో కాన్ఫరెన్స్కు ఉపయోగించే ఎల్ఈడీ టీవీ, ఇతర సామగ్రి చోరికి గురైనట్లు వ్యవసాయ అధికారులు తాళ్లగురిజాల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు. కన్నెపల్లి మండలం జన్కాపూర్కు చెందిన మహమ్మద్ నసీమ్ బేగ్, బెల్లంపల్లి అశోక్నగర్కు చెందిన వర్మ శైలేష్లు జూలై 3న అర్థరాత్రి ఆటోలో వచ్చి బండరాయితో తాళం పగులగొట్టి ఎల్ఈడీ టీవీ, సౌండ్ బాక్స్లు, సీపీయూ, ఆంఫ్లీఫయార్, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఆ సామగ్రిని బెల్లంపల్లిలో విక్రయించేందుకు వస్తున్నారు. తాళ్లగురిజాల పోలీసులు శనివారం వాహనాల తనిఖీలో ఆటోలో ఎల్ఈడీ టీవీ, సామగ్రి అనుమానస్పదంగా కనిపించడంతో సదరు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఇద్దరు నిందితులను బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. తాళ్లగురిజాల ఎస్సై బండి రామకృష్ణ, ఏఎస్సై అలీ, సిబ్బంది అరుణ్, మురళీ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగని నెత్తుటి త్యాగాల ధార
బెల్లంపల్లి: విప్లవోద్యమ చరిత్రలో బెల్లంపల్లికి ఎంతో ప్రత్యేకత ఉంది. పోరాటాల పురిటిగడ్డగా ప్రసిద్ధిగాంచింది. బొగ్గు గనుల క్షేత్రమైన ఈ ప్రాంతం నుంచి ఎందరో యువకులు విప్లవోద్యమంలో చేరి ఏళ్ల తరబడి నుంచి అసువులు బాస్తున్నారు. నేటికీ అదే ఒరవడి కొనసాగుతోంది. విప్లవమే జీవితాశయంగా ఎంచుకుని సాయుధ గెరిల్లా పోరాట పంథాలో సాగుతూ పోలీసు ఎదురుకాల్పులు, అనారోగ్య సమస్యలతో ఒక్కొక్కరుగా కన్నుమూస్తున్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తూ త్యాగాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. ఆ అమరుల నెత్తుటి త్యాగాలతో నల్ల నేల ఎరుపు వర్ణాన్ని పులుముకుంటోంది. అజ్ఞాతంలోకి వెళ్లి దండకారణ్యానికి ఉద్యమబాటలు వేసిన విప్లవకారుల్లో ఈ ప్రాంత అమరుల భాగస్వామ్యం ఎంతో ఉంది. త్యాగాల నెత్తుటి సాళ్లలో మొలకెత్తిన ఆ విప్లవ బీజాలు ప్రస్తుతం కానరాకుండా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దౌర్జన్యాలు, దాష్టీకాలు సహించలేక.. విప్లవ పోరాటానికి ఆకర్శితులైన యువకుల్లో అత్యధిక మంది నిరుపేద, కార్మిక బిడ్డలే. సింగరేణి కార్మికులపై గని అధికారులు సాగిస్తున్న వేధింపులు, దోపిడీ, దౌర్జన్యాలు, అట్టడుగు వర్గాల ప్రజలు, బస్తీల్లో మహిళలపై గూండాలు సాగిస్తున్న దాష్టీకాలకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ప్రజాకంఠకులుగా మారిన గూండాలు, రౌడీలను అంతమొందించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) తరపున గని అధికారుల దోపిడీ, దౌర్జన్యాలు ఎదిరించి విప్లవమార్గంలో పయనించారు. పీపుల్స్వార్, సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) నిర్మాణంలో కార్మిక, నిరుపేద వర్గాల బిడ్డలు భాగస్వాములై రహస్య జీవితంలోకి వెళ్లారు. ఆద్యులు ఆ ముగ్గురు సింగరేణి కార్మిక బిడ్డలైన గజ్జెల గంగారాం, పెద్ది శంకర్, కటకం సుదర్శన్ విద్యార్థి దశలో రాడికల్ విప్లవోద్యమాలకు ఆకర్శితులయ్యారు. విప్లవోద్యమ చరిత్రలో వీరు ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. వీరి అడుగుజాడల్లో ఎందరో యువకులు పోరు బాటపట్టారు. దశాబ్దాలుగా రహస్య జీవితం గడుపుతూ ఎన్కౌంటర్లో అమరులవుతున్నారు. ఎక్కడ జరిగిన అక్కడ బెల్లంపల్లి బిడ్డ ఎవరో ఒకరు నేలకొరగడం ఈ ప్రాంత ప్రజలను, విప్లవ సానుభూతిపరులను తీవ్రంగా కలిచివేస్తోంది. తొలి అమరుడు పెద్ది శంకర్ బెల్లంపల్లి విప్లవకారుల్లో తొలి అమరుడిగా పెద్ది శంకర్ చరిత్ర పుటలకెక్కారు. 1980లో మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా మోయిన్బిన్పేట వద్ద జరిగిన పోలీసు ఎదురుకాల్పుల్లో ఆయన మృతి చెందాడు. ఆయుధాలను పరీక్షిస్తుండగా వరంగల్, కరీంనగర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గ్రేనేడ్ పేలి 1981లో గజ్జెల గంగారాం అమరుడయ్యాడు. 1985లో పులి మధునయ్య సిర్పూర్ తాలూకా లోడ్పల్లి వద్ద, 1987లో బుయ్యారం వద్ద ముద్దు నారాయణ, ఈట శంకర్, మురళీ, 1999లో నస్పూర్ కాలనీలో సికాస అగ్రనేత గెల్లి రాజలింగు, 2000లో తిర్యాణి మండలం లోవగుట్ట వద్ద ఇద్దరు ఆదివాసీ దళసభ్యులతోపాటు శనిగారపు రాంచందర్, 2002లో పులిపాక లక్ష్మణ్ను హైదరాబాద్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. గజ్జెల గంగారాం సోదరి గజ్జెల సరోజ దండకారణ్యంలో అనారోగ్యంతో 2013లో అమరురాలైంది. అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడి స్థాయికి ఎదిగిన కటకం సుదర్శన్ 2023 మే 31న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ్ బస్తర్ అడవుల్లో అనారోగ్య సమస్యలతో కన్నుమూశాడు. 2024లో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో కాసరవేణి రవి మృతి చెందగా తాజాగా ఈనెల 11న ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబండ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన జాడి వెంకటి అసువులు బాశాడు. -
కొండచిలువ హల్చల్
నిర్మల్ఖిల్లా: జిల్లాకేంద్రంలోని శాంతినగర్ చౌరస్తా సమీపంలో శనివారం అర్ధరాత్రి 9 అడుగుల భారీ కొండచిలువ హల్చల్ చేసింది. నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహాదారి డివైడర్ మధ్యలో కనిపించడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని కొండచిలువను బంధించే ప్రయత్నం చేశారు. స్నేక్ క్యాచర్ అనిల్ చాకచక్యంగా కొండచిలువను బంధించాడు. వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్యదస్తురాబాద్: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సాయికుమార్ కథనం ప్రకారం.. మండలంలోని గోడిసీర్యాల గ్రామానికి చెందిన కొంపెల్లి నర్సయ్య(45) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొన్నిరోజుల క్రితం పెద్దకుమార్తెకు వివాహం చేయడంతో కుటుంబంలో తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో శనివారం ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అ‘పూర్వ’ కలయిక
14ఎంసీఎల్256: 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు, గురువులుమంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1973–74 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన వారందరూ ఒకేచోట కలుసుకుని ఆనందంగా గడిపారు. వీరి అపూర్వ కలయికకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. చదువు నేర్పిన గురువులు నర్సయ్య, కాంతయ్య, డి.నారాయణరావు, ఎస్.సూర్యనారాయణలను సన్మానించారు. పూర్వవిద్యార్థులు మంగీలాల్సోమాని, గుండా సుధాకర్, అనిల్కుమార్, సుబ్రహ్మణ్యం, జుబేర్ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు. – మంచిర్యాలఅర్బన్మంచిర్యాలఅర్బన్: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1973–74 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన వారందరూ ఒకేచోట కలుసుకుని ఆనందంగా గడిపారు. వీరి అపూర్వ కలయికకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. చదువు నేర్పిన గురువులు నర్సయ్య, కాంతయ్య, డి.నారాయణరావు, ఎస్.సూర్యనారాయణలను సన్మానించారు. పూర్వవిద్యార్థులు మంగీలాల్సోమాని, గుండా సుధాకర్, అనిల్కుమార్, సుబ్రహ్మణ్యం, జుబేర్ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్లో ఆదిలాబాద్ సత్తా
జఫర్గఢ్: జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి 44వ సబ్ జూనియర్ ఇంటర్షిప్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల విభాగంలో మెదక్ జట్టు మొదటి స్థానం, ఖమ్మం ద్వితీయ, వరంగల్ తృతీయ, ఆదిలాబాద్ జట్లు నాలుగో స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో ఆదిలా బాద్ ప్రథమ, నల్లగొండ ద్వితీయ, కరీంనగర్ తృతీయ, నిజా మాబాద్ జట్టు నాలు గో స్థానంలో నిలిచా యి. ఈ జట్లకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదెపాక అయోధ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు జయాకర్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి రమణ హాజరై మాట్లాడారు. దేశంలో క్రీడలు, క్రీడాకారులకు గుర్తింపు ఉందన్నారు. మారుమూల ప్రాంతమైన కూనూర్లో రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పో టీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అ సోసియేషన్ బాధ్యులు నారాయణరెడ్డి, వీరభద్రరా వు, రవీందర్ కుమార్, వీరయ్య, కమల్కుమార్, తి రుపతి, శ్రీనివాస్రెడ్డి, నిర్వాహకులు పాల్గొన్నారు. -
‘చలో భద్రాచలం’ విజయవంతం చేయండి
ఆదిలాబాద్రూరల్: ఈనెల 28న నిర్వహించే చలో భద్రాచలం కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 9 తెగల ఆదివాసీలు విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ సంఘాల రాష్ట్రస్థాయి రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సోయం బాపూరావు, జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని చలో భద్రాచలం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోయం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ జేఏసీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 9న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ, ఆ తర్వాత ఢిల్లీలో సభ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో 9 తెగల సంఘాల నాయకులు, అడ్వొకేట్, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతినర్సాపూర్(జి): మండలంలోని రాంపూర్ గ్రామం 61వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరికి గాయాలయయ్యాయి. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు.. భైంసా పట్టణంలోని రాహుల్నగర్కు చెందిన రోహిత్ (21), చంద్రకాంత్లు బైక్పై నిర్మల్ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో అతివేగంగా, జాగ్రత్తగా నడుపుతూ నిలిపి ఉన్న ఎడ్లబండిని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో రోహిత్కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు 108 వాహనంలో నిర్మల్ తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు. చంద్రకాంత్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. బైక్ దొంగ రిమాండ్ఆదిలాబాద్టౌన్: రిమ్స్లో బైక్ దొంగలించిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు. పట్టణానికి చెందిన నిసార్ హుస్సేన్ తన ఆరోగ్యం బాగాలేకపోవడంతో శనివారం రిమ్స్లో వైద్యం కోసం వెళ్లి బైక్ను పార్కింగ్ చేశాడు. తిరిగివచ్చేసరికి బైక్ కనిపించలేకపోవడంతో బాధితుడు టూటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన విజయ్కుమార్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. దాడి ఘటనలో ఐదుగురు అరెస్ట్తాండూర్: మండల కేంద్రానికి చెందిన తాళ్లపల్లి సృజన్గౌడ్పై దాడి చేసిన ఘటనలో ఐదుగురి యువకులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఈనెల 5న రాత్రి తాండూర్ ఐబీలో తనపై దాడి చేసి గాయపర్చారని సృజన్గౌడ్ ఫిర్యాదు మేరకు సుభద్ర కాలనీకి చెందిన అనిల్, సాయి, రాజు, నరేశ్, హరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిఖిల్ పరారీలో ఉన్నాడని తెలిపారు. -
జోహార్ వెంకటి
బెల్లంపల్లిరూరల్: ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు ఒడిశా (ఏవోబీ) రాష్ట్ర టెక్నికల్ టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు జాడి వెంకటి అలియాస్ విమల్ అలియాస్ సురేష్ అలియాస్ మంగన్న (56) అంత్యక్రియలు ఆదివారం చంద్రవెల్లిలో ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. గ్రామ శివారు చేరుకున్న మృతదేహానికి నివాళులర్పించేందుకు ప్రజాసంఘాలు, అమరవీరుల బంధుమిత్రుల సంఘం, వివిధ పార్టీల నాయకులు, జనం భారీగా తరలివచ్చారు. ఎర్రని జెండాతో బాణాసంచా కాల్చుతూ విప్లవగీతాలు పాడుతూ నృత్యాలు చేస్తూ స్వగృహానికి తీసుకువచ్చారు. సంఘాల నాయకులు మృతదేహం వద్ద ఎర్రని జెండా కప్పి, పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. మృతదేహాన్ని చూసి కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామ శివారులోని వెంకటికి చెందిన స్థలం వరకు అంతిమయాత్ర చేపట్టారు. అమరుడా లాల్ సలామ్, జోహార్ కామ్రేడ్ వెంకటి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చెల్లెలు రామటెంకి సుజాత అన్న వెంకటికి తలకొరివి పెట్టింది. అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి, కార్యదర్శి శాంతక్క, సభ్యులు సత్తక్క, కవిత, అనిత, రైతు హ క్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్, జిల్లా కార్యదర్శి రామడగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు వెంకటస్వామి, పూర్ణిమ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చాంద్పాషా, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు ప్రవీణ్, మాజీ జెడ్పీటీసీ రాంచందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు, కాంగ్రెస్ నాయకులు శంకర్, స్వామి, ప్రజా కళా మండలి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆడెపు సమ్మయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, అభిమానులు ఆయనకు విప్లవ జోహర్లు అర్పించారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి ఆపరేషన్ కగార్ పేరిట బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని అమవీరుల బంధుమిత్రల కమిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి, రాష్ట్ర కార్యదర్శి శాంతక్క డిమాండ్ చేశారు. బూటకపు ఎన్కౌంటర్పై కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదన కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలన్నారు. -
ముగిసిన ‘మీనం’ టెండర్
కై లాస్నగర్: కులవృత్తిపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ ప్రక్రియ ముగిసింది. జిల్లాకు అవసరమైన చేప పిల్లలను సరఫరా చేసేందు కోసం కరీంనగర్కు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేశారు. వాటికి మత్స్యశాఖ ఈ నెల 12న ఆమోదం తెలిపింది. త్వరలోనే వారి చేపల చెరువులను పరిశీలించి సరఫరాకు ఉన్న అవకాశాలపై నివేదిక అందించాల్సిందిగా జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రత్యేక కమిటీ త్వరలోనే కరీంనగర్లో పర్యటించనుంది. అయితే చేప పిల్లల సరఫరాలో అక్రమాలకు తావు లేకుండా ఉండాలంటే ఈ క్షేత్రస్థాయి పరిశీలనే కీలకం కానుంది. ప్రక్రియ సజావుగా సాగితే ఈ నెలాఖరులోగా చెరువుల్లో చేప పిల్లలను వదిలే అవకాశముంది. రెండు బిడ్లు దాఖలు.. జిల్లాలో ఈ ఏడాదికి గాను కోటి 16లక్షల చేప పిల్లలను ప్రాజెక్టులు, చెరువుల్లో వదిలేలా మత్స్యశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. వీటి సరఫరా కోసం టెండర్లను పిలిచారు. మొదటిసారి కేవలం ఒకే బిడ్ దాఖలైంది. దీంతో మరోసారి ఆహ్వానించగా కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువైంది. ఈ క్రమంలో ఈ ఏడాది చేప పిల్లల సరఫరా ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తిరిగి ఈనెల 12న మూడోసారి టెండర్లు పిలువగా మరో బిడ్ దాఖలైంది. మొత్తంగా జిల్లాకు అవసరమైన చేప పిల్లలను సరఫరా చేసేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు బిడ్లను దాఖలు చేయగా మత్స్యశాఖ వాటికి ఆమోదం తెలిపింది. ఈనెల 16లోపు క్షేత్రస్థాయిలో వారికి సంబంధించిన చేపల చెరువులను ప్రత్యేక కమిటీ పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించింది. అయితే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో పరిశీలన కమిటీ ఇంకా నియామకం కాలేదు. కమిటీ నియామకమైన తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. సదరు కాంట్రాక్టర్లు టెండర్లో చెప్పినట్లుగా చేపల చెరువులు ఉన్నాయా, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, అందులో చేప పిల్లలు ఉన్నాయా, జిల్లాకు సరిపడా వారు సరఫరా చేయగలుగుతారా అనే విషయాలను పరిశీలిస్తుంది. వారిచ్చే నివేదిక ఆధారంగానే ఉన్నతాధికారులు కాంట్రాక్టర్కు సీడ్ సరఫరాకు అనుమతి ఇవ్వనున్నారు. పారదర్శకంగా వ్యవహరిస్తాం చేపల చెరువుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ నియమించాల్సి ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకు కమిటీని సోమవారం ఏర్పాటు చేస్తాం. మంగళ, బుధవారాల్లో కరీంనగర్లో పర్యటించి టెండర్ దాఖలు చేసిన కాంట్రాక్టర్ల చెరువులు, చేప పిల్లల నిల్వ, సరఫరా సామర్థ్యం వంటి అంశాలను క్షేత్రస్థాయికి వెళ్లి పక్కాగా పరిశీలిస్తాం. పారదర్శకమైన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం. ఆరోగ్యకరమైన సీడ్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూస్తాం. – టి.భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి జిల్లాలో.. మత్స్యపారిశ్రామిక సంఘాలు : 107 ఆయా సంఘాల్లోని సభ్యులు: 5040 మొత్తం చెరువులు : 224 చేప పిల్లల పంపిణీ లక్ష్యం : 1.16కోట్లు 35–40 ఎంఎం సైజ్ : 83 లక్షలు 90–100 ఎంఎం సైజ్ : 33లక్షలు -
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది. ఖానాపూర్: మండలంలోని మేడంపల్లి సమీపంలోగల గోదావరిపై 1891లో నిజాం పాలనలో ప్రెంచ్ ఇంజినీర్ జేజే ఒటలే సదర్మాట్ ఆనకట్ట నిర్మించారు. ఇది రెండు మండలాల్లోని సుమారు 15వేలకు పైగా ఎకరాలకు పైసా ఖర్చు లేకుండా 130 ఏళ్లుగా సాగునీరు అందిస్తోంది. ఎలాంటి సాకేంతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో పూర్తిగా రాళ్లతో గోదావరికి అడ్డంగా కట్టారు. దీనికి కుడి, ఎడమ కాలువలు నిర్మించారు. వీటి ద్వారా నీటిని విడుదల చేసేందుకూ ఎలాంటి టెక్నాలజీ, ఖర్చు అవసరం లేదు. చెరువు తూములాగే గేట్లు మనుషులే ఎత్తవచ్చు. అప్పట్లో వర్షాధారంగా నిండే నీటితోనే పంటలకు నీరందించేలా దీన్ని నిర్మించడం విశేషం. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత 1985–86వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సదర్మాట్కు నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత నుంచి ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆయకట్టు రైతులే పోచంపాడ్ వరకు వెళ్లి శ్రీరాంసాగర్ నుంచి నీళ్లు పోరాడి తెచ్చుకోవాల్సి వస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విషయం తెలుసుకుని స్వయంగా తానే సదర్మాట్ వరకు వచ్చారు. నిపుణులతో సర్వే చేయించి సదర్మాట్ కాలువ, బ్యారేజీ నిర్మాణానికి రూ.386కోట్లు మంజూరు చేశారు. కాగా, ఆయన మరణానంతరం బ్యారేజీ నిర్మాణంలోనూ మార్పులు జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం ఎగువనున్న మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరిపై సదర్మాట్ నూతన బ్యారేజీ నిర్మిస్తోంది. కాగా, కేంద్రప్రభుత్వం మూడేళ్ల క్రితం సదర్మాట్ను వారసత్వ సాగునీటి కట్టడంగా గుర్తించింది. రోడ్లపైనే నిరీక్షణ.. ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. బస్టాండ్ ఉన్నా బురదమయం కావడంతో బస్సులు లోనికి వెళ్లని దుస్థితి. వారసత్వ కట్టడంగా ‘సదర్మాట్’నిర్మాణ కౌశలం.. నిమ్మల -
వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్టౌన్: వైద్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యూనైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూపాల్ అన్నారు. జిల్లా కేంద్రంలో యూనియన్ తృతీయ మహాసభలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయిస్తుందని, పనికి తగ్గ వేతనం చెల్లించడం లేదని పేర్కొన్నారు. ఆధార్ బేస్డ్ అటెండెన్స్ తొలగించాలని డిమాండ్ చేశారు. రెండో, అర్బన్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఉద్యోగుల జీవోను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. రిమ్స్ ఉద్యోగుల వేతనాల్లో కాంట్రాక్టర్ కోత విధించకుండా నేరుగా వేతనాలు చెల్లించేలా చూడాలని కోరారు. ఇందులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశ్, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశన్న, కిరణ్, స్వామి, పుష్పల, విద్య, నాగనాథ్, సురేందర్, శ్రీనివాస్, తులసీ, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
● చారిత్రక సాక్ష్యాలు.. ఈ నిర్మాణాలు
వరదలను తట్టుకుని నిలిచిన ‘కడెం’కడెం: నిర్మల్, మంచిర్యాల జిల్లాల వరప్రదాయిని కడెం ప్రాజెక్ట్. 18 గేట్లున్న దీని పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా, పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం దీని సామర్థ్యం 4.699 టీఎంసీలు మాత్రమే. కుడి, ఎడమ కాలువల ద్వారా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట్, హాజీపూర్ మండలాల్లోని 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందిస్తుంది. గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై 1949లో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. 1958లో 9 జర్మనీ టెక్నాలజీ గేట్లతో నిర్మాణం పూర్తయింది. 1958 ఆగష్టులో వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్ట్ తెగిపోయింది. అవుట్ఫ్లో సామర్థ్యం పెంచేందుకు 1969లో మరో 9 ఇండియన్ గేట్లు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 1995, 2022, 2023లో ప్రాజెక్ట్ సామర్థ్యానికి మించి భారీ స్థాయిలో(5లక్షల క్యూస్కెకులకు పైగా) ఇన్ఫ్లో వచ్చి గేట్లపై నుంచి వరద పారినా ఏమీ కాలేదు. అప్పటి ఇంజినీర్ల నైపుణ్యంతో నేటికీ కడెం ప్రాజెక్ట్ చెక్కుచెదరకుండా నిర్మల్, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి అండగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో నిజాం, నిమ్మల రాజుల హయాంలో నిర్మించిన పలు కట్టడాలు చారిత్రక సాక్ష్యాలు గా దర్శనమిస్తున్నాయి. శతాబ్దాలు దాటినా చెక్కు చెదరని ఆ నిర్మాణా లు నాటి ఇంజినీర్ల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తున్నాయి. భారీ వరదలను సైతం తట్టుకుని నిలిచిన కడెం ప్రాజెక్టు ఇందులో ప్రత్యేకం. ఇక ఆదిలాబాద్లోని మావల చెరువు గ్రావిటీ స్పెషల్గా.. ఖానాపూర్లోని సదర్మాట్ ఆనకట్ట వారసత్వ కట్టడంగా నిలుస్తున్నాయి. నిర్మల్ బురుజులు, కోటలు, నస్పూర్లోని గడి, ఆసిఫాబాద్లోని జిల్లా జైలు నాటి ఇంజినీర్ల నైపుణ్యాన్ని చాటుతున్నాయి. నేడు ఇంజినీర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.అప్పటి ఇంజినీర్ల గొప్పతనమే.. కడెం చాలా పురాతన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేసిన ఆనాటి ఇంజినీర్ల ప్రతిభతో నేటికీ ఆయకట్టుకు సాగునీరందిస్తోంది. భారీ వరదలనూ తట్టుకుని నిలవడం అప్పటి ఇంజినీర్ల గొప్పతనమే. – ప్రవీణ్, ఈఈ కడెం -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయుల సమస్యల పరి ష్కారానికి తమ సంఘం ముందుండి పోరాటం చేస్తుందని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్రఅధ్యక్షుడు పుల్గం దామోదర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఆదివారం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పక్షం రోజుల్లో నూతన హెల్త్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జీవో 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారిని శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఇందులో జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి నర్సింహాస్వామి, డీసీఈబీ కార్యదర్శి కందుల గజేందర్, సంఘ బాధ్యులు గోవర్ధన్, భాస్కర్, రవీందర్, శశికళ, కిషన్, లక్ష్మి, శ్రీహరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మావల @ గ్రావిటీ స్పెషల్
కై లాస్నగర్: నిజాం హయాంలో ఆదిలాబాద్ పట్టణానికి గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేసేలా చేపట్టిన పైపులైన్, ఫిల్టర్బెడ్ నిర్మాణాలు నాటి ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా నిజాం హయాంలో ఆదిలాబాద్ వాసుల దాహా ర్తి తీర్చేందుకు పట్టణానికి పది కిలోమీటర్ల దూ రంలో గల మావల అటవీ ప్రాంతంలో 60 ఎకరాల విస్తీర్ణంలో చెరువు నిర్మించారు. 1925లో నిర్మాణాన్ని ప్రారంభించగా 1948లో అందుబాటులోకి వచ్చింది. భారీ వరదలు, తుపానులు వచ్చినా తట్టుకుని నిలబడేలా కట్టను నిర్మించారు. ఇప్పటికీ చిన్నపాటి లీకేజీలు సైతం లేకపోవడం పనుల నాణ్యతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా చెరువు నుంచి ఫిల్టర్బెడ్ వరకు భూగర్భంలో నిర్మించిన ఫైపులైన్ ఔరా అనిపిస్తోంది. గ్రావిటీ ద్వారా వచ్చే చెరువు నీరు ఆదిలాబాద్ పట్టణంలోని 25 శాతం జనాభాకు తాగునీటి ఇబ్బందులను దూరం చేస్తోంది. ఫిల్టర్బెడ్ మావల చెరువు నుంచి వచ్చే నీటిని శుద్ధిచేసేలా కలెక్టరేట్ పక్కన పదెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఫిల్టర్బెడ్ సైతం ప్రత్యేకంగా నిలుస్తోంది. చెక్డ్యాంల ద్వారా మూడు దశల్లో శుద్ధి చేసిన జలాన్ని పంప్హౌస్ నుంచి పట్టణంలోని ట్యాంకులకు విడుదల చేస్తారు. వాటి ద్వారా ఇళ్లకు సరఫరా అవుతోంది. దీనిని లండన్కు చెందిన ది క్యాండీ ఫిల్టర్ కంపెనీ 1947లో నిర్మించడం గమనార్హం. -
120 ఏళ్ల ‘నస్పూర్ గడి’
నస్పూర్: మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ పరిధిలోని విలేజ్ నస్పూర్లో 120 ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక గడి నాటి పాలనకు సాక్ష్య ంగా నిలుస్తోంది. 1905లో నిజాం హయాంలో నస్పూర్కు చెందిన జీవీ వంశీయులు ఇనుము, కాంక్రీట్ వాడకుండా కేవలం డంగుసున్నంతో రెండంతస్తుల భవనం నిర్మించారు. చుట్టూ నాలుగెకరాల ప్రహరీ సైతం డంగుసున్నంతోనే నిర్మించడం ప్రత్యేకత. ఈ గడి కేంద్రంగా నిజాం సంస్థానాధీశులు లక్సెట్టిపేట, ఇందారం, జన్నారం, తపాలాపూర్, మంథని, పెద్దపల్లి, భూపాలపల్లి, మహారాష్ట్రలోని సిరొంచ, చంద్రపూర్, మధ్యప్రదేశ్లోని బస్తర్ వరకు ఇక్కడి నుంచే పాలన కొనసాగించే వారు. స్వాతంత్య్రానంతరం ఈ కట్టడం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరింది. కొద్ది నెలల క్రితం హెరిటేజ్ కంపెనీ ఆధ్వర్యంలో ఆధునికీకరించారు. -
టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి
ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం అన్నారు. పట్టణంలోని హిందీ హైస్కూల్లో ఇటీవల పదోన్నతులు పొందిన, ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్న టీచర్లను ఆదివారం శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సుప్రీంకోర్టు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని చెప్పడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. ఏ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు అదే సబ్జెక్టు టెట్ రాసే వీలు ఉండాలని పేర్కొన్నారు. అర్హత మార్కుల్లో కులాల వారీగా కాకుండా అందరికీ 40 శాతం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, జలెందర్ రెడ్డి, బలిరాం జాదవ్, గండ్రత్ నారాయణ, అరుణ తదితరులు పాల్గొన్నారు. -
నిజాం నాటి ఆసిఫాబాద్ జైలు
ఆసిఫాబాద్: 1916లో అప్పటి జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్లో గల జన్కాపూర్లో ఐదెకరాల్లో జైలు నిర్మించారు. నిజాం హయాంలో దీనిని పూర్తిగా డంగుసున్నంతో నిర్మించారు. ఇందులో మూడు బారక్లు ఉన్నాయి. సుమారు 200 మంది ఖైదీలు ఉండేలా భవన నిర్మాణం చేపట్టారు. అనంతరం కొన్నేళ్లపాటు మూసి ఉండగా మరమ్మతులు చేసి 1991 మార్చి 15న అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఎంజీ గోపాల్ తిరిగి ప్రారంభించారు. 17 ఏళ్లపాటు తిరిగి జిల్లా జైలుగా కొనసాగగా అనంతరం ఆసిఫాబాద్ జిల్లా జైలును 2008లో ఆదిలాబాద్కు తరలించి, ఇక్కడి జైలును స్పెషల్ సబ్ జైలుగా మార్చారు. -
గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడిగా సాయి చైతన్య
కై లాస్నగర్: ఆదిలాబాద్ జిల్లా గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడిగా సాయి చైతన్య ఎన్నికయ్యారు. జిల్లా నూతన పాలకవర్గ ఎన్నిక భుక్తాపూర్లోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. జిల్లా సహకార అధికారి బి.మోహన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్ష పదవీ కోసం సాయి చైతన్య, మేకల రవికాంత్, ఉపాధ్యక్ష పదవి కోసం కేమ లక్ష్మణ్, కెంద రాకేశ్ పోటీపడ్డారు. బ్యాలెట్ విధానంలో నిర్వహించిన ఎన్నికలో సదరు అభ్యర్థులకు ఆరేసి ఓట్లు చొప్పున సమానంగా వచ్చాయి. లాటరీ విధానంలో సాయి చైతన్య, కేంద రాకేశ్ను అదృష్టం వరించింది. ఇరువురు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికై నట్లుగా డీసీవో ప్రకటించారు. అనంతరం మద్దతుదారులు, యాదవ కులస్తులు, డైరెక్టర్లు వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కాగా సంఘం డైరెక్టర్లుగా మేకల రవికాంత్, కేమ లక్ష్మణ్, వై.కిష్టయ్య, జి.వేణుగోపాల్, అసుర రమేశ్, పాత దేవన్న, గొర్ల రాజన్న, కేమ ఊషన్న, జి.వెంకటేశ్, బి.రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
పెన్గంగ భవన్కు కలెక్టరేట్..?
కై లాస్నగర్: నిజాం హయాంలో నిర్మించి సుమారు ఏడున్నర దశాబ్దాల పాటు జిల్లా పాలనకు వేదికై న కలెక్టరేట్ భవనం ఇక చరిత్రకు సాక్ష్యంగా నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. శిథిలావస్థకు చేరిన ఈ భవనంలోని ఏ సెక్షన్ బ్లాక్ బాల్కనీ గురువారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులతో పాటు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. భవనాన్ని ఆర్అండ్బీ శాఖ సీఈ రాజేశ్వర్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. కార్యాలయ ముందరి భాగం పటిష్టంగానే ఉన్నట్లుగా భావించినా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తరలించడమే ఉత్తమమని కలెక్టర్కు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంజినీరింగ్ అధికారుల బృందం సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో జిల్లా పాలనాధికారి కూడా తరలింపే ఉత్తమమని భావిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాలతో కలెక్టరేట్లోని ఆయా విభాగాల అధికారులు నిర్వహణకు అనువైన భవనాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. శనివారం కొన్నింటిని పరిశీలించి ఫైనల్ కూడా చేశారు. అయితే కలెక్టరేట్ తరలింపుపై మాత్రం రేపటి వరకు స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జిల్లా పాలనకు కేంద్రబిందువైన కలెక్టరేట్ను తాత్కాలికంగా పక్కనే ఉన్న ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పెన్గంగ భవన్కు మార్చాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధునాతన వసతులతో కూడిన ఈ భవనం ఇటీవలే నిర్మించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ చాంబర్లతో పాటు అన్ని సెక్షన్ల నిర్వహణకు అనుకూలంగా ఉండనున్నట్లుగా భావిస్తున్నారు. పైగా ప్రస్తుత కలెక్టరేట్కు ఆనుకునే ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సైతం అందుబాటులో ఉండనుంది. కలెక్టర్ నిర్ణయం మేరకు కార్యాలయ తరలింపు సోమవారం వరకు స్పష్టతవచ్చే అవకాశముంది. కలెక్టరేట్ మార్గాల మళ్లింపు.. కలెక్టరేట్లో కూలిన శిథిలాల తొలగింపు పూర్తి కానందున ప్రజల భద్రత దృష్ట్యా ప్ర వేశ, బయటికి వెళ్లే మార్గాలను మార్చినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అధికారిక కార్యక్రమాల కోసం సీపీవో, డీసీవో కార్యాలయం, కలెక్టర్ సమావేశ మందిరం, ఎస్బీఐ వైపు నుంచి ట్రెజరీ కార్యాలయానికి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. వెనుక వైపు నుంచి ఉన్న ర్యాంపు ద్వారా డీపీఆర్వో కార్యాలయం, ఆధార్ కేంద్రానికి అనుమతించనున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజలు పోర్టికో/మెయిన్ డోర్ ద్వారా కలెక్టరేట్ కాంప్లెక్స్లోకి ప్రవేశించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సహకరించాలని కలెక్టర్ కోరారు. -
బదిలీలకు వేళాయె
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే శా ఖల్లో బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అ య్యాయి. ఇందుకు సంబంధించి ఆయా శాఖల్లో విధి విధానాలు రూపొందిస్తున్నారు. త్వరలో జారీ చేయనున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఎౖక్సైజ్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో బది లీలకు రంగం సిద్ధమవుతుంది. ఒకే చోట సుదీర్ఘకా లం పనిచేస్తున్న వారికి స్థానచలనం కల్పించనున్నా రు. సాధారణ బదిలీల సమయంలో అప్పట్లో అన్ని శాఖల్లో బదిలీలు చోటు చేసుకున్నాయి. అయితే స ర్కారుకు ఆదాయాన్నిచ్చే ఈమూడు శాఖలను మిన హాయించారు. తాజాగా ప్రత్యేక ఉత్తర్వు ద్వారా వీరి బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయా శాఖల్లో ఇలా.. ఎకై ్సజ్ శాఖలో సుదీర్ఘకాలం ఒకే చోట పనిచేస్తున్న ఎస్సైలకు సంబంధించిన జాబితా తయారు చేయాలని ఆ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మౌ ఖికంగా ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో రెండేళ్లకుపైబడి ఒకే చోట పనిచేస్తున్న వారి వివరాలను అధి కారులు సేకరిస్తున్నారు. అలాగే కానిస్టేబుళ్లకు సంబంధించి కూడా విధి విధానాలు రూపొందిస్తున్న ట్లు చెబుతున్నారు. వీరితో పాటు ఉన్నతాధికారుల బదిలీలు కూడా ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఇక రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్లతో పాటు ఉద్యోగుల బదిలీలు సైతం ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న సబ్రిజిస్ట్రార్ పోస్టుల్లో ఇతర ప్రాంతాల నుంచి అధికారులు ఇక్కడకు వస్తారా లేదా అనేది చూడాల్సిందే. ఇక వాణిజ్యపన్నుల శాఖలోనూ బదిలీలకు రంగం సిద్ధమవుతుంది. ఈ విషయంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్చార్జి డీఆర్ ప్రసన్నను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడినప్పటికీ శాఖాపరంగా రావాల్సి ఉందని, ఆ తర్వాతే ఏయే క్యాడర్ ఉద్యోగుల బదిలీలు ఉంటాయనేది స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. -
నమ్మకమైన మోసాలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పుత్తడి ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో మోసాలు సైతం అదే తీరుగా పెరుగుతున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో వెలుగులోకి వచ్చిన మోసాలతో సర్వత్రా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమేర్పడింది. ఎంతో నమ్మకంగా వ్యవహరిస్తున్న బ్యాంకుల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కొందరు బ్యాంకు ఉద్యోగుల తీరుతో ఆయా సంస్థల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారంపై రుణాలు పొందాలన్నా, రుణ సంస్థలపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బంగారంతో పాటు విలువైన ఆస్తులు, బ్యాంకుల్లో తనఖా పెట్టేముందు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కొన్నిచోట్ల మోసం ఆదిలోనే బయటపడుతుండగా మరికొన్ని చోట్ల నెలల తరబడి జరుగుతోంది. నమ్మకమున్న చోటనే.. ప్రజల్లో బ్యాంకులపై నమ్మకానికి మారుపేరుగా విశ్వాసం ఉంది. అయితే కొంతమంది సిబ్బంది తప్పటడుగులతో అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుంది. సాధారణంగా బ్యాంకులు, ప్రైవేటు రుణసంస్థల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. నగదు, బంగారం వంటి లావాదేవీల్లో క్షుణ్ణంగా పరిశీలనలు, తనిఖీలు ఉంటాయి. ప్రతీ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ప్రతీస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకత ఉంటుంది. అంతేకాక కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారులపై పర్యవేక్షణ ఉంటుంది. లావాదేవీల విషయంలో ప్రతీది అత్యంత భద్రత మధ్య సాగుతుంటాయి. అయితే అలాంటి నమ్మకున్న చోటనే ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్రమత్తమైన బ్యాంకులు, సంస్థలు చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచి–2 వ్యవహారంతో బ్యాంకర్లు, రుణసంస్థలు అప్రమత్తమై తమ సంస్థల్లోని అన్ని బ్రాంచీల్లో బంగారం నిల్వలు, రుణాల లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాధారణ ఆడిట్లతో పాటు ఈ ఘటనల తర్వాత ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖాతా దా రులు సైతం కుదవపెట్టిన బంగారం, రుణాలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడికక్కడ రుణాలపై క్షుణ్నంగా పరిశీలనలు చేస్తూ తమసంస్థల పరిధిలో ఉన్న సిబ్బందిపైనా కఠిన పర్యవేక్షణ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇటీవల జరిగిన ఘటనలు -
ఆరోగ్యంగా ఉంటేనే శిక్షణలో రాణింపు
ఆదిలాబాద్: ఎన్సీసీ కేడెట్లు ఆరోగ్యంగా ఉంటేనే శిక్షణలో రాణించడం సాధ్యపడుతుందని కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ వీపీ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీటీసీలో కొనసాగుతున్న ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం నాలుగో రోజుకు చేరుకుంది. కేడెట్లకు ఆరోగ్యం, పరిశుభ్రతపై వైద్యులతో శనివారం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రషీద్ అన్సారీ, వైద్యులు సంతోష్ ఆదిత్య, ఆమీ, తేజస్విని ఆరోగ్యం, ఎన్సీసీ అధికారులు అశోక్, రజిత, లక్ష్మణ్, భూమన్న, మధురావ్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల పై పట్టింపు కరువు
ఆదిలాబాద్టౌన్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవ డం లేదని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణకుమారి అన్నారు. ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా నాలుగో మహాసభలను పట్టణంలోని యాద వ సంఘ భవనంలో శనివారం నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలు, సాధించుకున్న హక్కులు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అహర్నిశలు పనిచేస్తున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించ డం సరి కాదన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రాజీ మార్గంతో కేసుల సత్వర పరిష్కారం
ఆదిలాబాద్టౌన్: రాజీ మార్గం ద్వారానే కేసుల స త్వర పరిష్కారం సాధ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారానికి అవకాశముందన్నారు. సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. రాజీ పడే కేేసులను, సంబంధిత సంస్థలు, వ్యక్తులతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అనంతరం పలు కేసులను అప్పటికప్పుడు పరిష్కరిస్తూ తీర్పు ప్రతులను ఇరుపక్షాలకు అందజేశారు. ఇందులో డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, జడ్జిలు కుమార్ వివేక్, శివరాం ప్రసాద్, హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్, డీఎస్పీ జీవన్రెడ్డి, పీపీలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. బోథ్లో..బోథ్: మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో శనివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహించా రు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజీమార్గమే రాజ మార్గమని అన్నారు. అనంతరం నూతన కోర్టు భవనాన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. బోథ్ జూని యర్ సివిల్ జడ్జి కె.సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్లో 34 క్రిమినల్ కేసులు, ఒక సి విల్ తగాదా, నేరం ఒప్పుకోవడం ద్వారా 22, ఎకై ్స జ్ కేసులు 60, క్రిమినల్, ఎస్టీసీ కేసులు 429 పరి ష్కారమైనట్లు తెలిపారు. అలాగే ఇచ్చోడ, బోథ్ ఎస్బీఐలకు సంబంధించి 32 కేసులు పరిష్కరించడంతో పాటు రూ.46 లక్షలు రికవరీ అయినట్లు పే ర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీపీ శ్రీధర్, లోక్ అదాలత్ బెంచ్ మెంబెర్స్ హరీశ్, గంగసాగర్, న్యాయవాదులు అంగద్ కేంద్రే, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. జిల్లాలో 15,357 కేసులు పరిష్కారం ఆదిలాబాద్టౌన్: జిల్లాలో జాతీయ లోక్ అదా లత్ ద్వారా 15,357 కేసులు పరిష్కారమయ్యా యి. అలాగే రాష్ట్రస్థాయిలో జిల్లాకు 20వ స్థా నం లభించింది. పరిష్కారమైన వాటిలో 18 సివిల్, 3,480 క్రిమినల్, 11,759 ప్రిలిటిగేషన్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. -
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్: జోనల్ స్థాయి పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరచాలని ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆడే రామేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన జోనల్స్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. అండర్–14, 17 విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల వేదిక ఇంకా ఖరారు కాలేదని, అయినప్పటికీ క్రీడాకారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు రాష్ట్రపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వం స్పందించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి దినపత్రిక ఎడిటర్, బ్యూరో ఇన్చార్జి, విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దాడులను ఉపేక్షించొద్దు. దీని వెనుక రాజకీయ నాయకులు ఎవరున్నా విచారణ చేపట్టి శిక్షించాలి. ఏపీలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు. – దుర్గం దినకర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న మీడియా గొంతు నొక్కడం సరికాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రిక ఎడిటర్పై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికం. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిచడం సరికాదు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో కీలకం. – భగత్ మహేందర్, అడ్వకేట్ మీడియా గొంతు నొక్కడం సరికాదు -
స్వేచ్ఛను హరించడమే..
ఆదిలాబాద్టౌన్: రాజ్యాంగం కల్పించిన హక్కును చంద్రబాబు ప్రభుత్వం కాలరాయడం సరికాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మీడియాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను ప్రచురిస్తే ఎడిటర్పై కేసులు పెట్టడం సరికాదు. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – వెంకటేశ్, జేఏసీ కోకన్వీనర్ ఆసిఫాబాద్అర్బన్: మీడియా స్వేచ్ఛకు ఆటంకం కలిగించొద్దు. గతంలో ఏ ప్రభుత్వం కూడా మీడియాపై అణచివేతకు పాల్పడిన ఘటనలు లేవు. తప్పుడు వార్తలు రాస్తే వివరణ అడగాలి. అంతేగాని దౌర్జన్యానికి దిగడం సరికాదు. మీడియాకు స్వేచ్ఛకు భంగం కలిగించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. సాక్షి పత్రిక ఎడిటర్పై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. – రాపర్తి రవీందర్, ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.. -
మె..‘నో’!
విద్యార్థినులు తినకుండా పక్కన పెట్టిన పులిహోర (ఫైల్)నార్నూర్లోని కేజీబీవీలో ఇటీవల పురుగుల అన్నం పెట్టడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగిన విష యం తెలిసిందే. కాగా, ఇక్కడ పనిచేస్తున్న ప్రత్యేకాధికారి 2022లో ఆదిలాబాద్రూరల్ కేజీబీవీలో పనిచేశారు. ఆ సమయంలో ఫుడ్పాయిజన్ కావడంతో 105 మంది అస్వస్థతకు గురయ్యారు. అప్పట్లో ఆమెను ఏడాది పాటు విధుల నుంచి తప్పించారు. ప్రస్తుతం ఆమే ఇక్కడ పనిచేస్తుండగా.. మళ్లీ పురుగుల అన్నం ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇక నేరడిగొండ కేజీబీవీ, తాంసి మండలంలోని ఘోట్కూరి పాఠశాల, భీంపూర్ కేజీబీవీలోనూ గతంలో ఫుడ్పాయిజన్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. -
ప్రజా రవాణా సంస్థలను కాపాడాలి
ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా గల ప్రజా రవాణా సంస్థలను కాపాడాలంటూ ఎస్డబ్ల్యూఎఫ్ ఆ ధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ డిపో కార్యదర్శి ఆశన్న మాట్లాడుతూ.. విద్యుత్ బస్సుల విధానంలో మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా సంస్థలే ఎలకి్ట్రక్ బస్సులు కొనుగోలు చేసేలా నిధులు సమకూర్చాలన్నారు. ఈమేరకు ఆర్టీసీకి సబ్సిడీ మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో దేవేందర్, వెంకటేశ్, సునీల్, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
రక్షణలో ఆదర్శంగా నిలవాలి
శ్రీరాంపూర్: రక్షణలో ఆదర్శంగా నిలవాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. 55వ రక్షణ పక్షోత్సవాల్లో ద్వితీయ బహుమతి సాధించిన ఆర్కే న్యూటెక్ గని ఉద్యోగులను ఆయన అభినందించారు. శుక్రవారం గనిపై నిర్వహించిన ఈ అభినందనలో ఆయన మాట్లాడారు. గని ఉద్యోగులు రక్షణలో ముందున్నారని, ఇతర గనులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. జాతీయస్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా సాధించడం మరో మైలు రాయిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, గ్రూప్ ఏజెంట్ కే.రాజేందర్, గని మేనేజర్ కురుపాటి శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, రక్షణ అధికారి కొట్టే రమేష్, సీనియర్ సంక్షేమ అధికారి పాల్ సృజన్ పాల్గొన్నారు. -
‘సాత్నాల’ పరవళ్లు..
దిగువకు వెళ్తున్న వరదనీరు సాత్నాల: మండలంలోని సాత్నాల ప్రాజెక్టుకు శుక్రవారం 2,100 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ఈ మేరకు రెండు గేట్లు ఓపెన్ చేసి 2,380 క్యూసెక్కులను దిగువకు వదిలినట్లు జేఈ దీపక్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.24 టీఎంసీ కాగా, ప్రస్తుతం 1.046 టీఎంసీగా ఉన్నట్లు వెల్లడించారు. ఉరకలేస్తున్న వరద నీరు దూకిన ‘మత్తడి’ తాంసి: మండలంలోని వడ్డాడి సమీపంలో గల మత్తడివాగు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది. శుక్రవారం ఇన్ఫ్లో 1494 క్యూసెక్కులు ఉండగా ఒక గేటు ఎత్తి అంతే మొత్తంలో ఔట్ఫ్లో దిగువకు వదిలినట్లు ఏఈ హరీశ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు. ప్రస్తుతం 277 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉండేలా స్థిరీకరిస్తున్నట్లు వెల్లడించారు. -
పరిశీలించిన నిపుణుల బృందం..
కూలిన భవనాన్ని హైదరాబాద్కు చెందిన ర్యాప్కాన్ కన్సల్టెంట్ ప్రతినిధి పి.కామేశ్, ఈఎం సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధి దయాకర్రావు, జేఎన్టీయూ ప్రొఫెసర్ శ్రీనివాస్తో కూడిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం ఆర్అండ్బీ శాఖ ఆదిలాబాద్ ఈఈ నర్సయ్య, డీఈ రమేశ్లతో కలిసి పరిశీలించింది. భవనం కూలడానికి కారణమేంటి,నాణ్యత, కూలిన శిథిలాలు తొలగించడమా లేక పూర్తిగా భవనాన్ని నేలమట్టం చేయడ మా అనేదానిపై ఆరా తీసింది. అనంతరం కలెక్టర్తో సమావేశమై నివేదిక అందజేశారు. కూలి న విభాగాన్ని మినహాయిస్తే మిగతా భవనాన్ని వాడుకోవచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఆర్అండ్బీ సీఈ భవనాన్ని పరిశీలించా కే తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా వెల్లడించా రు. భవన నాణ్యత పటిష్టత తెలుసుకునేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నామని, నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
దంచి కొట్టిన వానలు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ఈ ఏడాది వర్షాలు దంచి కొట్టాయి. వానాకాలం ఉండే నాలుగు నెలలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 995.8మి.మీ.లు. అయితే ఈసీజన్ ముగి సేందుకు మరో పక్షం రోజుల గడువు ఉండగా జిల్లాలో ఇప్పటికే 1,215.3 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 33 శాతం అధికం. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రోజూ వ ర్షాలు కురుస్తున్నాయి.ఆగస్టులో భారీవర్షాలను చవి చూసిన జిల్లా సెప్టెంబర్లోనూ అదే తీరు కొనసాగుతుంది. ఆగస్టులో ఏకంగా 462 మి.మీ.ల వర్షం కురిసింది. ఇది సాధారణంతో పోల్చితే 56 శాతం అధికం. ప్రస్తుతం సెప్టెంబర్ తొలిపక్ష ంలో ఇప్పటి వరకు 263.8 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. నెలాఖరు వరకు ఎంత కురుస్తుందో చెప్పలేం. ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో జిల్లా తడిసి ము ద్దవుతోంది.వాగులు,వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. భీంపూర్,బేల,ఇంద్రవెల్లి,ఆదిలా బాద్రూరల్,ఆదిలాబాద్ అర్బన్, మావల, తాంసి, తలమడుగు, బజార్హత్నూర్,సిరికొండ, ఉట్నూ ర్, సాత్నాల, భోరజ్ మండలాల్లో 20 నుంచి 40 శా తం వరకు అధిక వర్షపా తం నమోదైంది. గాది గూడ, నార్నూర్, బోథ్, నేరడిగొండ, సొనా ల మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది.అత్యధిక వర్షపాతం నమోదైన మండలాలు..(మి.మీ.లలో) మండలం సాధారణం కురిసింది వ్యత్యాసం(అత్యధికం)గుడిహత్నూర్ 889.7 1486.6 67శాతం ఇచ్చోడ 942.8 1542.6 64శాతం జైనథ్ 937.4 1520.4 62శాతం సంవత్సరాల వారీగా వర్షపాతం వివరాలు (మి.మీ.లలో) జూన్ నుంచి సెప్టెంబర్ వరకు.. సంవత్సరం కురిసిన వర్షం2021–22 1,481 2022–23 1,481.3 2023–24 1,070 2024–25 1,215.3 (ఈనెల 12 వరకు..) -
అజ్ఞాతంలోనే ముగిసిన వెంకటి ప్రస్థానం
బెల్లంపల్లి/బెల్లంపల్లిరూరల్: విప్లవ సిద్ధాంతానికి ఆకర్షితుడైన బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జాడి వెంకటి అలియాస్ భిమల్ అలియాస్ సురేష్(56) విప్లవ ప్రస్థానం అజ్ఞాతంలోనే ముగిసింది. గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబండ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన పది మంది మావోయిస్టుల్లో వెంకటి ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు శుక్రవారం ధ్రువీకరించారు. 30ఏళ్లుగా దండకారణ్యం కేంద్రంగా విప్లవ కార్యకలాపాలు సాగించాడు. 1996 ప్రాంతంలో అజ్ఞాతంలోకి వెళ్లి ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ ప్రింటింగ్ ప్రెస్, ఇతర కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఆయుధాల సామగ్రిని వివిధ ప్రాంతాల నుంచి రవాణా చేయడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచాడు. మావోయిస్టు పార్టీ టెక్నికల్ టీమ్ ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. తెలంగాణలో కార్యకలాపాలు సాగించకపోవడం, హింసాత్మక కార్యకలాపాల్లో వెంకటి భాగస్వామ్యం అంతంత మాత్రం కావడంతో ఆయన పేరు స్థానిక పోలీసు రికార్డుల కెక్కలేదు. 15ఏళ్ల క్రితం ఝార్ఖండ్ రాష్ట్రం రూర్కేలాలో ఓసారి పోలీసులకు పట్టుబడ్డాడు. మూడేళ్ల జైలు జీవితం తర్వాత విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకే వెళ్లాడు. ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు. ఎన్కౌంటర్లో మృతితో రహస్య జీవితం ముగిసింది. వెంకటిపై ఆయా రాష్ట్రాల్లో రూ.10లక్షల రికార్డు ఉంది. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పీపుల్స్వార్ సానుభూతి పరుడిగా... బెల్లంపల్లి బస్తీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(అద్దాలబడి)లో వెంకటి పదో తరగతి వరకు చదివాడు. 1985లో తన గ్రామానికి చెందిన పుష్పను ప్రేమించి శివాలయంలో పెళ్లి చేసుకున్నాడు. గ్రామ సుంకరిగా పని చేస్తూనే వ్యవసాయం చేసేవాడు. పీపుల్స్వార్, సికాస సానుభూతి పరుడిగా ఉన్న అతడిపై పోలీసులు ప్రత్యేక నిఘాతో వేధింపులకు గురి చేశారనే ప్రచారం ఉంది. దీంతో ఏడాదిపాటు బెల్లంపల్లి అంబేడ్కర్నగర్లో మకాం పెట్టాడు. అయినా పోలీసుల వేధింపులు ఆగకపోవడంతో భార్య పుష్పతో కలిసి దండకారణ్యంలోకి వెళ్లాడు. ఆమె టెక్నికల్ టీంలోనే సభ్యురాలిగా ఉన్నట్లు సమాచారం. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు జాడి పోశమ్మ, ఆశయ్య దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. ఇద్దరు కుమార్తెలు రామక్క, సుజాత, కుమారుడు వెంకటి ఉన్నారు. వీరిలో రామక్క కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో, తల్లిదండ్రులు 15ఏళ్ల క్రితం వృద్ధాప్యంతో చనిపోయారు. తల్లిదండ్రులు మృతిచెందిన సమయంలోనూ అంత్యక్రియలకు రాలేదు. తల్లిదండ్రులు నివాసం ఉన్న ఇల్లు శిథిలావస్థకు చేరి కూలిపోయింది. ఆశయ్య సింగరేణి కంపెనీలో కార్మికుడిగా పనిచేశాడు. -
గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
గుడిహత్నూర్: ఆదిలాబాద్ను గంజాయి రహిత జి ల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ అఖి ల్ మహజన్ అన్నారు. మండలంలోని తోషం గ్రా మ శివారులో పట్టుకున్న గంజాయి మొక్కలకు సంబంధించి శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీసీఎస్, ఇచ్చోడ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి తోషం శివారులో మర్సకోల దేవురావు అనే రైతు చేనులో పత్తిలో అంతర పంటగా సాగు చేస్తున్న 627 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. వీటి విలువ మార్కెట్లో సుమారు రూ.62.70 లక్షలు ఉంటుందని వెల్లడించారు. గంజాయి సాగు, విక్రయాలపై పోలీసులకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు వారికి రివార్డు అందజేస్తామన్నారు. అనంతరం ఆయన స్థానిక ఠాణాలో రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, సీసీఎస్ సీఐ పి.చంద్రశేఖర్, ఇచ్చోడ సీఐ రాజు, ఎస్సై శ్రీకాంత్, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. నార్నూర్లో ఒకరి అరెస్టు.. నార్నూర్: గంజాయి సాగు చేస్తున్న ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గాదిగూడ మండలం పర్సువాడ పంచాయతీ పరిధిలోని సారుగూడకు చెందిన మార్సుకోల జంగు తన పొలంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. ఈమేరకు గురువారం సాయంత్రం దాడులు జరిపి 16 మొక్కలను గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
ఇంద్రవెల్లి: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అ న్నారు. ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆస్పత్రి పరిధిలోని ముత్నూర్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సీ జనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాల్లో రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆశ కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పద్మ, సముద్ర తదితరులున్నారు. నార్నూర్ ఆసుపత్రి తనిఖీ..నార్నూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన సేవలందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించా రు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట డీడీవో రాంబాబు, వైద్యులు జితేందర్రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ చరణ్దాస్ తదితరులున్నారు. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని న్యాయవాదులు, ఉద్యమ సంఘాల నాయకులు తెలిపారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగడం, ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. ప్రజల పక్షాన పని చేసే జర్నల
బెల్లంపల్లి: ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం పత్రిక రంగం. పత్రికల్లో నిరాధారణమైన, అసత్యమైన వార్తా కథనాలు వస్తే వివరణ కోరవచ్చు. సదరు పత్రిక బాధ్యతాయుతంగా వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యలు, అణిచివేత విధానాలకు పాల్పడడం, అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్పై అక్రమ కేసులు పెట్టడం సరైన విధానం కాదు. ఏదైనా సరే చట్టానికి లోపాడి వ్యవహరించాలి. కానీ వేధింపులకు గురి చేసే ధోరణి ఏమాత్రం మంచిది కాదు. పత్రిక స్వేచ్ఛను కాలరాయలనుకోవడం అవివేకం అవుతుంది. – అంకెం శివకుమార్, బెల్లంపల్లి బార్అసోసియేషన్ అధ్యక్షుడు పత్రికా స్వేచ్ఛను కాలరాయొద్దు -
ప్రతీ దరఖాస్తుపై శ్రద్ధ వహించాలి
కై లాస్నగర్: సీఎం పైలట్ ప్రజావాణిలో అందించే ప్రతీ దరఖాస్తును నిర్ణీత గడవులోపు పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్నూర్, ఉట్నూర్, ఆదిలాబాద్ రూరల్, జైన థ్ మండలాలకు సంబంధించిన దరఖాస్తుల అప్పీళ్లపై శుక్రవారం విచారణ నిర్వహించారు. రెవెన్యూశాఖలో 15, వ్యవసాయ శాఖలో 11, మిషన్ భగీరథలో ఐదు, విద్యుత్శాఖలో ఐదు, డీఆర్డీఏ పింఛన్ కు సంబంధించి 3 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా వాటిపై విచారణ చేపట్టారు. దరఖాస్తుదారులు, ఆయా శాఖల అధికారుల సమక్షంలో పెండింగ్కు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారా నికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలస్థాయిలో పరిష్కారం కాని దరఖాస్తులను జిల్లా స్థాయిలో విచారించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్ పాల్గొన్నారు. నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలి అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, క మ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు, పాఠశాలల మరుగుదొడ్లు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీఎం జన్మాన్ కింద 25 చిల్డ్రన్ హోమ్లు, 51 కొత్త అంగన్వాడీ కేంద్రాలను ఈజీఎస్ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొ డ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించాలి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, వాటిని పరిరక్షిస్తూ ముందుకెళ్లాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రపంచ ఆదివాసీ ది నోత్సవ ప్రత్యేక సంచికను శుక్రవారం ఆవిష్కరించారు. ఇందులో ఆదివాసీ సంఘం రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి సచిన్, జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, నాగో రావ్, తనుష్, సక్కు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్బీఐలో గోల్డ్ లోన్ మోసం
నిర్మల్ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బీఐలో ఇటీవల క్యాషియర్ భారీగా ఆభరణాలు అప్పగించాడు. రెండు రోజుల క్రితమే పోలీసులు రికవరీ చేశారు. తాజాగా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో గోల్డ్లోన్ మోసం జరిగింది. ఈ మోసం శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్(జి)కి చెందిన ప్రశాంత్ అనే యువకుడు స్థానిక ఎస్బీఐలో గోల్డ్లోన్ అప్రైజల్గా పనిచేస్తున్నాడు. ప్యూరిటీ తక్కువగా ఉన్న బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి 12 మంది స్నేహితులు, ఇతరుల పేర్ల మీద రుణాలు ఇప్పించాడు. ఇందుకు వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. శుక్రవారం బ్యాంకుకు వచ్చిన ఆడిట్ అధికారులు గోల్డ్లోన్ వివరాలను పరిశీలించగా తక్కువ ప్యూరిటీ ఉన్న ఆభరణాలు తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనతో బ్యాంకు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆభరణాల తనఖాపై తీసుకున్న మొత్తం విలువ రూ.23 లక్షల వరకు ఉంటుందని బ్యాంకు మేనేజర్ ఎస్.రవి తెలిపారు. 12 మందిని పిలిపించి విచారించగా వారిలో నలుగురు తీసుకున్న రుణం చెల్లించారు. మిగతా 8 మందికి శనివారం వరకు గడువు ఇచ్చినట్లు మేనేజర్ తెలిపారు. -
అంగన్వాడీ కార్యకర్తపై కులవివక్ష
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండలం చిన్న బెండార గ్రామంలో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న ఇగురపు లక్ష్మిపై గ్రామస్తులు కుల వివక్ష చూపుతున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం చిన్న బెండార గ్రామాన్ని సందర్శించి విచారణ జరిపారు. ఐదేళ్ల క్రితం చిన్న బెండారకు అంగన్వాడీ టీచర్ ఇగురపు లక్ష్మి అనే దళిత మహిళ బదిలీపై వచ్చిందన్నారు. అప్పటి నుంచి అడపాదడపా ఆమైపె స్థానికులు కొందరు కుల వివక్ష చూపుతున్నా పట్టించుకోకుండా విధులు నిర్వర్తిస్తుందని తెలిపారు. పి ల్లల కోసం వండిన అన్నం కూడా తినకుండా బహిష్కరిస్తున్నారని తెలిపారు. గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించి సహపంక్తి భోజన కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నివేదికను కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడు, అట్రాసిటీ కమిటీ సభ్యుడు రేగుంట కేశవ్రావు, భారతీయ బౌద్ద మహాసభ జిల్లా అధ్యక్షుడు, అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ సబ్యుడు అశోక్ మహోల్కర్, నాయకులు గోపాల్నాయక్, ఇగురపు గణేష్, శ్యాంరావు, పొన్నాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో ఉన్న అటవీ సిబ్బందిపై దాడి
దండేపల్లి: మండలంలోని లింగాపూర్ అటవీ బీట్లో అటవీ, బేస్క్యాంపు సిబ్బందిపై దమ్మన్నపేట, మామిడిగూడ గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు శుక్రవారం దాడి చేశారని తాళ్లపేట ఎఫ్ఆర్వో సుష్మారావ్ తెలిపారు. పక్కా ప్రణాళికతో కారంచల్లి కర్రలతో దాడి చేశారని, దీంతో భయభ్రాంతులకు గురైన తమ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారని పేర్కొన్నారు. దాడికి గురైన వారిలో ఎఫ్ఎస్వో బాలకృష్ణ, బీట్ ఆఫీసర్ పరమేశ్వర్, బేస్క్యాంపు వాచ్మెన్ రాజేందర్ ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దండేపల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
బాలుడి అప్పగింత
కాగజ్నగర్టౌన్: ఇంటి నుంచి పారిపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి జిల్లాకు వచ్చిన మైనర్ బాలుడిని జిల్లా బాలల సంరక్షణ అధికారి బొల్ల మహేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైల్వే పోలీసులు కాగజ్నగర్ స్టేషన్లో ఓ రైలులో బాలుడిని గుర్తించి విచారించారు. సికింద్రాబాద్లోని పార్శిగుట్ట ప్రాంతం నుంచి అతడు వచ్చినట్లు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని బాల రక్షభవన్కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలుడి తండ్రిని పిలిపించి అప్పగించారు. డీసీపీవో మహేశ్ మాట్లాడుతూ పిల్లల పై నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్ ఉన్నారు. -
పత్రికా స్వేచ్ఛపై ‘కూటమి’ కుట్ర
పాతమంచిర్యాల: ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ భయానక పరిస్థితులు సృష్టిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ప్రశ్నించే గొంతుకలపై భౌతికదాడులతోపాటు పోలీసు కేసులతో తీవ్ర అణచివేతకు గురి చేస్తోంది. సాక్షి దినపత్రికకు చెందిన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, మంగళగిరి, రాజమండ్రి, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఎడిషన్ కేంద్రాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు దిగి ఆస్తులు ధ్వంసం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సాక్షి జర్నలిస్టులు ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఒక్కచోట కూడా కేసులు నమోదు చేయలేదు. అధికారంలో ఉన్న పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో చేస్తున్న జాప్యం, మోసాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్మికులు, మహిళలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల పక్షాన వార్తల రూపంలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతో పాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల ఇళ్లలో తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ పత్రికాస్వేచ్ఛను హరిస్తూ, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతులను నొక్కేస్తున్న అప్రజాస్వామిక చర్యలను జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు సర్వత్రా వ్యతిరేకిస్తున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
నానో యూరియా వినియోగించాలి..
యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను కూడా రైతులు వినియోగించాలి. దీనిపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం మొక్కల ఎదుగుదలకు యూరియా, పొటాషియం కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా పూత, కాత దశలో పంట ఎదుగుదలకు తోడ్పడుతుంది. – డాక్టర్ మోహన్దాస్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం, ఆదిలాబాద్ స్టాక్ వచ్చేది ఉంది.. జిల్లాలో యూరియా కొరత లేదు. ప్రస్తుతం స్టాక్ వచ్చేది ఉంది. రైతులు అవసరం మేర తీసుకుంటే సమస్య ఏర్పడే పరిస్థితి ఉండదు. అంతకుమించి అదనంగా అడగడంతోనే సమస్యలు వస్తున్నాయి. అయినప్పటికీ జిల్లాకు స్టాక్ వచ్చేది ఉంది. – శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
బోథ్: ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం బోథ్ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రూ.4.15 కోట్లతో నిర్మించిన వసతి గృహాన్ని ఎంపీ నగేష్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని పరిచయ ఫంక్షన్ హాల్లో వివిధ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బోథ్ను రెవెన్యూ డివిజన్ చేయాలని, పొచ్చెర క్రాస్రోడ్డు నుంచి బోథ్ వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయాలని, కుంటాల, పొచ్చెర, గాయత్రి, కనకాయి జలపాతాలను అభివృద్ధి చేయాలని మంత్రిని కోరారు. మంత్రి మాట్లాడుతూ సమస్యలపై తాను హామీలు ఇవ్వలేనని.. ప్రయత్నం మాత్రం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, సలోని చాబ్రా, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆర్డీవో స్రవంతి, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పేదల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యం సాత్నాల: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భోరజ్ మండలం పిప్పర్వాడలో ఇందిరమ్మ మోడల్ ఇంటిని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం ఇంద్రవెల్లి: తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ విఠల్తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, డీసీసీబీ చైర్మన్ అడ్డీ భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ మంత్రులు వేణుగోపాలాచారి, ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖడే ఉత్తం, తదితరులు పాల్గొన్నారు. బాధిత రైతాంగానికి న్యాయం చేస్తా కై లాస్నగర్: భారీ వర్షాలతో పంట నష్టపోయిన బాధిత రైతాంగానికి నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో వరద నష్టంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 12,775 మంది రైతులకు సంబంధించి 17,490 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. రోడ్లు, వంతెనల మరమ్మతులు, కొత్త వాటి నిర్మాణాలకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సమావేశంలో ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో భారీ వర్షం
కై లాస్నగర్/సాత్నాల: ఆదిలాబాద్ జి ల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి గురువా రం వేకువజామున ఐదు గంటల వర కు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 1043.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల నీ టిని విడుదల చేయడంతో తర్నం వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా అక్కడి తాత్కాలిక వంతె పై నుంచి రాకపోకలను నిలిపివేశారు. అత్యధికంగా బేల మండలంలో 57 మిల్లీమీటర్లు, నార్నూర్లో 46, ఆదిలాబాద్లో 42, గాదిగూడలో 36.3, జైనథ్లో 15, ఉట్నూర్లో 11.5, భోరజ్లో 7.5, ఆది లాబాద్ రూరల్లో 4.5, సిరికొండలో 2, మావల, సోనాలలో .5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
దేశభక్తిని పెంపొందించే వేదిక ఎన్సీసీ
ఆదిలాబాద్: ఎన్సీసీ యువతలో దేశభక్తిని పెంపొందించే వేదిక అని ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విక్రమ్ ప్రతాప్సింగ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 32 తెలంగాణ బెటాలియన్ 3వ వార్షిక శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఈ శిక్షణ ద్వారా ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. డిప్యూటీ లెఫ్టినెంట్ కల్నల్ అరవింద్ కుమార్ కిచ్చార్ మాట్లాడుతూ ఈ శిబిరంలో ప్రతిరోజు పీటీ, డ్రిల్, ఫైరింగ్, ఆప్టికల్ గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు లెఫ్టినెంట్ గాలి అశోక్, లెఫ్టినెంట్ రజిత, లెఫ్టినెంట్ పుట్ట లక్ష్మణ్, లెఫ్టినెంట్ బెల్లం భూమన్న, మధు రావు, రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
జీపీవోలకు పోస్టింగ్
కైలాస్నగర్: గ్రామ పాలనాధికారులు వచ్చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న 83 మందికి కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సెలింగ్కు 82మంది హాజరుకాగా ఒక రు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 183 రెవెన్యూ క్లస్టర్ల వివరాలను ప్రొజెక్టర్ ద్వారా ప్రకటిస్తూ మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ఎంచుకున్న క్లస్టర్లకు పోస్టింగ్ కల్పించారు. సొంత నియోజకవర్గం, మండలంలో కాకుండా ఇతర క్లస్టర్కు 81 మందికి పోస్టింగ్ కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఆర్డర్లు అందుకు న్న వారు గురువారం సంబంధిత తహసీల్దార్కు రిపోర్టు చేసి కేటాయించిన క్లస్టర్ పరిధిలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఏసీబీ కేసులు ఎదుర్కొన్న వారి కి పోస్టింగ్ ఇవ్వవద్దని సీసీఎల్ఏ నుంచి అందిన ఆదేశాల మేరకు ఒకరికి ఆర్డర్స్ నిలుపుదల చేశారు. మరోకరు కౌన్సెలింగ్కు హాజరు కాలేదు. దీంతో 81 మంది విధుల్లో చేరనున్నారు. ఈ ప్రక్రి య పూర్తి కావడంతో మరో 101 క్లస్టర్లకు ఇన్చార్జీ లను నియమించడంపై అధికారులు కసరత్తు చేపట్టనున్నారు. వారం వ్యవధిలోనే వారికి కూడా బాధ్యతలు అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కలెక్టరేట్ ఏవో వర్ణ, ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శైలజ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘పరిషత్’ ఓటర్లు @ 4,49,981
కై లాస్నగర్: జిల్లా, మండల పరిషత్ ఓటర్ల లెక్క తే లింది. ప్రాదేశిక ఎన్నికల కసరత్తులో భాగంగా ప్ర భుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల తుది జాబితాను జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి విడుదల చేశారు. జిల్లా పరిషత్తో పా టు ఎంపీడీవో కార్యాలయాల నోటీసుబోర్డులపై ప్ర దర్శించారు. జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధి లో 4,49,981 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించా రు. ఇందులో పురుషులు 2,19,652 మంది, మహిళలు 2,30,313, ఇతరులు మరో 16 మంది ఉన్నా రు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు 10,661 మంది అధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్యకనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్ల సౌకర్యార్థం అదనంగా రెండు కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగానే పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. రెండు కేంద్రాలు పెంపు ఓటర్ల సంఖ్యకనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముసాయిదా ప్రకారం జిల్లా వ్యా ప్తంగా 875 పోలింగ్ కేంద్రాలు ఉండగా రెండింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. బోథ్ మండలం కరత్వాడ జీపీ పరిధిలోని జిడిపల్లిలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, మావల మండలం బట్టిసావర్గాంవ్లో మరో కేంద్రం ఏర్పాటు చేశారు. -
యూరియా.. తిప్పలు
ఇచ్చోడ/ఉట్నూర్రూరల్: ఈ ఏడాది రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. సహకార సంఘాలకు ఎరువు స్టాక్ వచ్చిందని తెలిస్తే చాలు వేకువజామునే అక్కడికి చేరుకుంటున్నా రు. గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్నారు. ఇచ్చోడ, ఉట్నూర్ మండల కేంద్రాల్లోని సహకార సంఘ కార్యాలయాల ఎదుట బుధవారం ఉదయం నుంచే బారులు తీరి దర్శనమిచ్చా రు. ఇచ్చోడలో 444 బ్యాగులు రాగా చాలామంది ఎరువు లభించక నిరాశతో వెనుదిరిగారు. యూరియా కొరతను నిరసిస్తూ ముఖరా(కే) లో మాజీ సర్పంచ్ మీనాక్షి ఆధ్వర్యంలో భిక్షాటన చేసి వినూత్న నిరసన తెలిపారు. ఉట్నూర్లోని పీఏసీఎస్ కార్యాలయానికి ఉదయాన్నే సుమారు 200 మంది రైతులు తరలిరాగా రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. -
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
ఆదిలాబాద్రూరల్: స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించా లని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్రూరల్ పోలీసు స్టేషన్ను బుధవారం తనిఖీ చేశా రు. రికార్డులు పరిశీలించారు. ఆవరణలో ఉన్న వాహనాలకు సంబంధించిన కేసుల వివరాలు అడి గి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టే దిశగా వారానికి కనీసం రెండుసార్లు పర్యటించాలన్నారు. సాయంత్రం సమయంలో డ్రంకెన్ డ్రైవ్ చేపట్టి ప్రమాదాలను నివారించా లని సూచించారు. అలాగే రాత్రి గస్తీ పెంచాలన్నా రు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ పెండింగ్ లేకుండా చూడాలన్నారు. రానున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, రూరల్ సీఐ కె.ఫణిదర్, ఎస్సై వి.విష్ణువర్ధన్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
వీరనారి చాకలి ఐలమ్మ
ఆదిలాబాద్రూరల్: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని ఆదిలాబా ద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం అధికారికంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి వద్ద గల ఐలమ్మ విగ్రహానికి అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రజక సంఘం నాయకులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. తెలంగాణ సాయిధ పోరాటంలో ఐలమ్మ పోరాటపటిమను కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు చిక్కాల దత్తు, సంతోష్, వినో ద్, భరత్, బీజేపీ నాయకులు ఆదినాథ్, లాలా మున్నా, రఘుపతి, సచిన్,నిఖిల్ పాల్గొన్నారు. -
‘ఏ టూ జడ్’పై 8 రోజుల సస్పెన్షన్
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు ఇ ష్టారీతిన వ్యవహరిస్తున్న తీరు పై ‘సాక్షి’లో ప్రచురితమైన వ రుస కథనాలకు డ్రగ్ ఇన్స్పెక్టర్ చర్యలు చేపట్టారు. ‘మెడికల్ మాయాజాలం’ శీర్షికన ఈనెల 8న ప్రత్యేక కథనం ప్రచురితమైంది. స్పందించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత ఏ టూ జడ్ మెడికల్ షాపును తనిఖీ చేసి నోటీసు జారీ చేశారు. ఆ శాఖ ఏడీకి ఈ విషయంపై నివేదిక అందజేశారు. దీంతో ఆయన ఎనిమిది రోజుల పాటు మెడికల్ షాప్ పై సస్పెన్షన్ విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డ్రగ్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. అలాగే ఒకరికి బదులు మరొకరు నిర్వహణ చేపట్టినా షాపు లైసెన్స్ రద్దు చేస్తామని పేర్కొన్నారు. -
ప్రతిభ వెలికితీయాలి
ఆదిలాబాద్టౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అ న్నారు. జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్లో బుధవారం జిల్లాస్థాయి టీఎల్ఎం మేళా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. టీఎల్ఎం ద్వారా విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ భూమన్న, డీఎస్డీవో శ్రీనివాస్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి తిరుపతి, రఘురమణ, డీసీఈబీ కార్యదర్శి గజేందర్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికఆదిలాబాద్రూరల్: జిల్లాస్థాయి మేళాలో మావల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల–2 ఉపాధ్యాయురా లు కవిత ప్రదర్శించిన ప్రదర్శన రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు అధికారులు వెల్లడించారు. ఈమేరకు మండల విద్యాధికారి సరోజ, ప్రధానోపాధ్యాయుడు విద్యాసాగర్ రెడ్డి అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ అవార్డు దక్కాలని ఆకాంక్షించారు. డిజిటల్ క్రాప్ సర్వే పరిశీలన పంటల వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. ఆది లాబాద్రూరల్ మండలంలోని యాపల్గూడలో డిజిటల్ క్రాప్ సర్వే తీరును బుధవారం పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
చెరువుకు చేరని చేప
కై లాస్నగర్: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది జిల్లాలోని మత్స్యకారుల పరిస్థితి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జ లకళ సంతరించుకున్నాయి. వాటిలో చేపపిల్లలను వదిలేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయి. అయితే సీడ్ సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం వారిని నిరాశకు గురిచేస్తోంది. ముచ్చటగా మూడోసారైనా టెండర్లు ఖరా రై మీనం త్వరగా చెరువుకు చేరుతుందా.. లేక మళ్లీ వాయిదా తప్పదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వంద శాతం పంపిణీకి నిర్ణయం మత్స్యకారుల ఉపాధికి అండగా నిలవాలని భావించిన ప్రభుత్వం ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో ఉచితంగా చేపపిల్లలను వదులుతుంది. చెరువుల్లో 35 నుంచి 45 మిల్లీమీటర్ల సైజ్తో కూడిన కట్ల, రవ్, బంగారుతీగ చేపలను వదలనుండగా, సాత్నాల, మత్తడివాగు వంటి ప్రాజెక్టుల్లో 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజుతో కూడిన కట్ల, రవ్, మృగాల వంటి చేపలను వదులుతున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 87లక్షల చేప పిల్లలను వదిలేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేయగా వివిధ కారణాలతో ప్రభుత్వం అందులో సగం 43లక్షలు మాత్రమే వదిలింది. లక్ష్యం తగ్గిపోవడంతో పూర్తిస్థాయి చెరువుల్లో కాకుండా కేవలం 126 చెరువుల్లో మాత్రమే వదిలారు. టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడం, ఆలస్యంగా సీడ్ వదలడంతో చేప పిల్లలు చనిపోయి కేవలం 30 శాతం మాత్రమే పంపిణీ జరిగినట్లుగా మత్స్యకారులు చెబుతున్నారు. అయితే ఈఏడాది అలాంటి పరిస్థితికి తావివ్వకుండా 1.16 కోట్ల చేప పిల్లలను వదలాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేయగా ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపింది. ముందుకు రాని కాంట్రాక్టర్లు.. ఆయా జలాశయాల్లో వదిలేందుకు అవసరమైన చేపపిల్లల సీడ్ సరఫరా చేసేందుకోసం ప్రభుత్వం ఏటా మే నెలలో టెండర్లు నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది ఇప్పటికి రెండుసార్లు టెండర్లను ఆహ్వానించగా ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. మొదటి సారి కేవలం ఒకే ఒక బిడ్ దాఖలైంది. రెండోసారి కాంట్రాక్టర్ల నుంచి స్పందన కొరవడంది. ఒక్కరుకు కూడా ముందుకు రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మరోసారి టెండర్ల నిర్వహణకు ఆదేశించింది. ఈమేరకు అధికారులు ఆ దిశగా కసరత్తు చేపట్టారు. టెండర్ దాఖలకు ఈనెల 12 వరకు గడువు విధించారు. అయితే గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతోనే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేపల ఎదుగుదలపై ప్రభావం సహజంగా ఆగస్టులో చేప పిల్లలను చెరువుల్లో వది లితే అవి మార్చి నాటికి ఎదిగి విక్రయించేందుకు అనుకూలంగా ఉంటాయని మత్స్యకారులు చెబు తున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ వచ్చినా టెండర్ల ప్ర క్రియ ఖరారు కాలేదని, అక్టోబర్, నవంబర్లో వదిలితే వేసవి వరకు అవి ఎదగవని, తద్వారా నష్ట మే వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా టెండర్ల ప్రక్రియ వేగవంతం చేసి త్వరితగతిన చెరువుల్లోకి మీనం చేర్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జిల్లాలో.. మత్స్యపారిశ్రామిక సంఘాలు : 107 ఆయా సంఘాల్లోని సభ్యులు : 5,040 మంది మొత్తం చెరువులు : 224 ప్రాజెక్టులు : 2(సాత్నాల, మత్తడివాగు) చేప పిల్లల పంపిణీ లక్ష్యం : 1.16కోట్లు 35–40 ఎంఎం సైజ్ : 83 లక్షలు 90–100 ఎంఎం సైజ్ : 33లక్షలు కాంట్రాక్టర్లు ముందుకొస్తేనే జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో ప్రభుత్వం ఈ ఏడాది వందశాతం చేపపిల్లల సీడ్ పంపిణీకి అనుమతి ఇచ్చింది. దీంతో కోటి 16లక్షల సీడ్ సరఫరా కోసం టెండర్లు ఆహ్వానించాం. ఇప్పటికి రెండు సార్లు పిలువగా ఒకే బిడ్ దాఖలైంది. తాజాగా మూడోసారి ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 12వరకు దాఖలు చేయవచ్చు. టెండర్లు ఖరారైన వెంటనే సీడ్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. – భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి -
రిమ్స్లో ‘క్యాన్సర్ డే కేర్’ సేవలు
ఆదిలాబాద్టౌన్: రిమ్స్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని డైరెక్టర్ జైసింగ్ రా థోడ్ అన్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ డే కేర్ సెంటర్ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ క్యాన్స ర్ బాధితులకు రిమ్స్లో కిమో థెరపీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. బాధితులు సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ చందు, దీపక్ పుష్కర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
ఆదిలాబాద్రూరల్: వినియోగదారులకు నాణ్య మైన విద్యుత్ అందించాలని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్ పర్సన్ ఎరుకల నారాయణ అన్నారు. మావల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో మావల, ఆదిలాబాద్ రూరల్, టౌన్త్రీ ఏడీఈ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక మంగళవారం నిర్వహించారు. ముందుగా డివిజనల్ పరిధిలోని డీఈ, ఏఈ, ఏవోలతో ఆయ న సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. విద్యుత్ కనెక్షన్లు అందించడంలో జాప్యం, సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన పలు వురు అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, పలువురు విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పరిష్కరించాలని ఆయన అధి కారులను ఆదేశించారు. కార్యక్రమంలో వేదిక సభ్యులు రామకృష్ణ, కిషన్, రాజగౌడ్, సీఈ కేఆర్ చౌహన్, డీఈ ఈదన్న, ఏవోలు, ఏఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
ఉట్నూర్రూరల్: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని, ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నేరాల నియంత్రలో భాగంగా ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో 50 సీసీ కెమెరాలతో పాటు ఉట్నూర్ పోలీస్స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఏఎస్పీ కాజల్ సింగ్లతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఐటీడీఏ పీవో సహకారంతో ఉట్నూర్లో 37, ఇంద్రవెల్లిలో 13 సీసీ కెమెరాలను ప్రధానమైన కూడళ్లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిని కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక సిబ్బంది 24 గంటలు పర్యవేక్షిస్తారని తెలిపారు. దీంతో ఉట్నూర్, ఇంద్రవెల్లి ప్రాంతాలు ఇక నిఘా నీడలో ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్, నార్నూర్ సీఐ ప్రభాకర్, ఎస్సైలు ప్రవీణ్, అఖిల్, మనోహర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వాగు దాటి.. పరామర్శించి
భీంపూర్: మండలంలోని భగవాన్పూర్ గ్రామంలో నవజాత శిశువు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈమేరకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశానుసారం డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, పంచాయతీరాజ్ డీఈఈ శివరాం నాయక్ మంగళవారం గ్రామంలో పర్యటించారు. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో కాలినడకన వెళ్లారు. వాగు దాటి గ్రామానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీలో చికిత్స పొందుతున్న నవజాత శిశువు తల్లి ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. వారి వెంట మండల వైద్యాధికారి నిఖిల్రాజ్, ఆరోగ్య విస్తీర్ణాధికారి జ్ఞానేశ్వర్, పర్యవేక్షకులు రూహిదాస్, మేఘ, ఎంఎల్హెచ్పీ మాయావతి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
పోరాట ఫలితమే సీసీఐపై కదలిక
ఆదిలాబాద్టౌన్: సీసీఐ పునఃప్రారంభించాలని మూడేళ్లుగా సీసీఐ సాధన కమిటీ నిర్విరామంగా పోరాటం చేసిందని సాధన కమిటీ కన్వీనర్ దర్శనా ల మల్లేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోరాట ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల్లో కదలిక వచ్చిందన్నారు. సానుకూల నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఢిల్లీకి వెళ్లి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసినట్లు తెలిపారు. సీసీఐని ప్రభుత్వ సంస్థగానే కొనసాగించాలని, కేంద్రం ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నా రు. త్వరలోనే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిని కలవనున్నట్లు తెలిపారు. ఇందులో ఇజ్జగిరి నారా యణ, రమేశ్, దత్తాత్రి, వెంకటనారాయణ, జగన్సింగ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
ఆదిలాబాద్టౌన్: న్యాయవాదులపై దాడులు పునరావృతం కాకుండా రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్ డిమాండ్ చేశారు. ఓ కేసు విషయంలో ఎన్బీడబ్ల్యూ నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఆదిలాబాద్ న్యాయవాదులు కౌషిక్ సింగ్, మనోజ్పై నిందితులు దాడి చేయడాన్ని ఖండించారు. ఈమేరకు మంగళవారం విధులు బహిష్కరించి జిల్లా కోర్టు ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీ కాంత్, ప్రవీణ్రెడ్డి, మహేందర్, సద్దాం, భా వన సింగ్, మహేశ్, విశ్వనాథ్ పాల్గొన్నారు. -
కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం
కైలాస్నగర్: తన రచనల ద్వారా ప్రజా హక్కుల కోసం ఉద్యమించిన పోరాటయోధుడు కాళోజీ నారాయణరావు అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాకవి కాళోజీ జయంతిని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అధికా రికంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అధికారులు, ఉద్యోగులతో కలిసి ఆయన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. తెలంగాణ మాండలికానికి కాళోజీ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, జిల్లా సహకార అధికారి మోహన్, సీపీవో వెంకటరమణ, కలెక్టరేట్ ఏవో వర్ణ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఆడిట్ అధికారికి పదోన్నతి
కై లాస్నగర్: జిల్లా సహకార శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్, ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న జే.నర్సయ్యకు స్పెషల్ క్యాడర్ డిప్యూటీ రిజిస్ట్రార్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆయ న్ను నిర్మల్ జిల్లా సహకారశాఖ అధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను జిల్లా సహకార అధికారి బి.మోహన్, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నవీన్ కుమార్, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు ముజఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నాందేడ్ రైల్వే డివిజనల్ మేనేజర్ ప్రదీప్ కామ్లేకు తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్ విన్నవించారు. సోమవారం ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. పిట్లైన్ పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు నిర్మాణం పూర్తి కాలేదన్నారు. అలాగే రైల్వేఅండర్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీటిపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. ఆయన వెంట అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రాఘవేంద్రనాథ్ యాదవ్, అధ్యక్షుడు సంతోష్, సుభా ష్ జాదవ్, అమర్ జార్జ్ తదితరులున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
ఆదిలాబాద్టౌన్: ఫిర్యాదుల విభాగం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ అఖి ల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. 17 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. ఎస్పీకి సన్మానం జిల్లాలో గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టిన ఎస్పీ అఖిల్ మహాజన్ను బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో స త్కరించారు. కృషిమిత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు రాణాప్రతాప్ సింగ్, బ్రహ్మ సతీశ్, భావన, ఆసిఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ టీచర్ల సర్దుబాటు
ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ మరోసారి చర్యలు చేపట్టింది. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో అవసరానికి మించి పనిచేస్తున్న టీచర్లను గుర్తించింది. అయితే ఇప్పటికే మొదటి విడత సర్దుబాటు ప్రక్రియలో 131 మందిని అవసరం ఉన్న పాఠశాలలకు కేటాయించారు. ఇటీవల 76 మందికి పదోన్నతులు లభించా యి. దీంతో స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టుల ఖాళీ లు ఏర్పడ్డాయి. ఈనెల 4న ప్రభుత్వం మరోసారి సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తొలివిడతలో గందరగోళం నేపథ్యంలో ఈ సారి ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రత్యేక కమిటీలతో పాటు ఇద్దరు మండల విద్యాధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. ఇప్పటికే ప్రక్రియ తుది దశకు రాగా, నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు.జిల్లాలో ఇదీ పరిస్థితి..జిల్లాలో మొత్తం 739 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 400 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని సర్దుబాటు ద్వారా తాత్కాలికంగా భర్తీ చేసేందుకు విద్యా శాఖ జూలైలో మొదటి విడతలో 131 మందిని సర్దుబాటు చేశారు. మొదట 141 మందిని సర్దుబాటు చేయగా, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, పది మందిని అదే పాఠశాలలో కొనసాగించారు. అయితే ఆయా ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య లేకున్నా ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీలు చేయించుకున్నారు. ప్రస్తుతం అదే పాఠశాలలో కొనసాగుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇటీవల పదోన్నతుల ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో 101 మందికి ప్రమోషన్ లభించగా, 76 మంది మాత్రమే విధుల్లో చేరారు. 25 మంది చేరలేదు. దీంతో పాఠశాలల్లో మళ్లీ ఖాళీలు ఏర్పడ్డాయి. తాజాగా 35 మంది ఉపాధ్యాయులను వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద అవసరం ఉన్న పాఠశాలలకు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు. పాఠశాలలోని కాంప్లెక్స్, మండల పరిధిలో, పక్క మండలాలకు సర్దుబాటు చేయనున్నారు. ఇటీవల పదోన్నతి పొందిన వారిలో జిల్లాలో 15 మంది పీజీహెచ్ఎంలు, 61 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు.ప్రాథమిక విద్యపై ప్రభావం..జిల్లాలో 250 ఎస్జీటీ, 104 స్కూల్ అసిస్టెంట్, 16 పీజీహెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉండగా, మిగతావి వృత్తి విద్యా, ఇతర టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని ఉన్నత పాఠశాలలు, అవసరం ఉన్న ప్రాథమిక పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు. దీంతో ప్రాథమిక విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది. ఇప్పటికే 50 శాతం మంది విద్యార్థులు చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడంలో వెనకబడ్డారు. ఉపాధ్యాయుల సర్దుబాటు కాకుండా విద్యా వలంటీర్లను నియమించాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వివరాలు..ప్రాథమిక 500ప్రాథమికోన్నత 119ఉన్నత 120విద్యార్థులు 65,000ఉపాధ్యాయులు 2,667తొలివిడతలో సర్దుబాటైన టీచర్లు 131పకడ్బందీగా ప్రక్రియ..ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్దుబాటు ప్రక్రియ చేపడుతున్నాం. దాదాపు 35 మంది టీచర్లను అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇద్దరు ఎంఈవో ల పర్యవేక్షణలో ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. మొదటి విడతలో 131 మందిని ఆయా పాఠశాలలకు కేటాయించాం. ఇటీవల జరిగిన పదోన్నతుల్లో జిల్లాలో 76 మందికి ప్రమోషన్లు లభించాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాం.– వేణుగోపాల్గౌడ్, విద్యాశాఖ ఏడీ -
పునరావాసం కల్పించండి
1989లో అప్పటి సీఎం ఎన్టీఆర్ మాకు ఇళ్లు కట్టించారు. పదేళ్ల తర్వాత మా కాలనీని ఆనుకుని చెరువు కట్ట నిర్మించారు. ప్రారంభంలో ఇబ్బంది లేకున్నా పదేళ్లుగా అవస్థలు తప్పడం లేదు. కట్టబలహీనంగా మారడంతో వర్షాకాలంలో భయభయంగా గడుపుతున్నాం. మమ్ములను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఇంటిస్థలాలు మంజూరు చేసి పునరావాసం కల్పించేలా చూడాలని విన్నవించుకుంటున్నాం. – జవహర్నగర్ కాలనీవాసులు, జజార్హత్నూర్ వేతనాలందక తిప్పలైతంది..మేమంతా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులుగా సేవలందిస్తున్నాం. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నాం. అవి కూడా మూడు నెలలుగా చెల్లించడం లేదు. కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారింది. వేతనాలు త్వరగా మంజూరయ్యేలా చూడాలని కోరుతున్నాం. – స్వచ్ఛ కార్మికులు, ఆదిలాబాద్ -
చేయూత పింఛన్ పెంచాలి
కై లాస్నగర్: చేయూత పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఎ మ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రధానద్వారం ఎదుట నిరసన తె లిపిన ఆయా సంఘాల నాయకులు, దివ్యాంగులు పోలీసులను నెట్టుకుని కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. మళ్లీ అడ్డుకోవడంతో కార్యాలయ ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీడబ్ల్యూవో మిల్కా వారి వద్దకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే పింఛన్ పెంచుతామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది గడిచినా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తీక్, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రేంరాజ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘పోడు’ పట్టాలివ్వాలని సీపీఎం ధర్నాగిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు ప ట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ట్రెయినీ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి రాఘవులు,నాయకులు స్వామి, గంగారం పాల్గొన్నారు. కొనసాగుతున్న 104 ఉద్యోగుల ఆందోళన..తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 104 సేవల ఒప్పంద ఉద్యోగులు చేపట్టిన ఆందో ళన 7వ రోజుకు చేరింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఐదు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చె ల్లించాలన్నారు. అనంతరం ట్రెయినీ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.మల్లేశ్ పాల్గొన్నారు. -
ఐటీఐ గురువులకు రాష్ట్రస్థాయి అవార్డులు
ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలోని ఐటీఐ కళాశాలకు చెందిన పలువురు ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. సోమవారం హై దరాబాద్లోని రెడిల్స్లో ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆదిలా బాద్ ఐటీఐ ప్రిన్సిపాల్ పద్మ శ్రీనివాస్, ఉట్నూ ర్ ఐటీఐ ప్రిన్సిపాల్ రొడ్డ శ్రీనివాస్ ఉత్తమ ప్రి న్సిపాల్ అవార్డులు అందుకున్నారు. అలాగే ఉ త్తమ ట్రైనర్లుగా ఉట్నూర్కు చెందిన పులి రాంచందర్, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లుగా మధుసూదన్, జగదీష్ అవార్డులు పొందారు. వీరికి రాష్ట్ర ఉపాధి కార్మిక శిక్షణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ అవార్డులను ప్రదానం చేశారు. -
‘సీసీఐ’పై ఆశలు
కేంద్రం సానుకూలం.. ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం. ఫ్యాక్టరీ పునరుద్ధరణ ద్వారా ఈ ప్రాంత అభివృద్ధితో పా టు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశముంది. ఈ క్రమంలోనే పరిశ్రమను తిరిగి తెరిపించేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది.రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన వాటర్, ఎల క్ట్రిసిటి, ప్రాపర్టీ ట్యాక్స్ వంటివి రూ.15కోట్లు బకాయిపడ్డాయి. వాటి ని విడుదల చేయాల ని ఇటీవల మంత్రిశ్రీధర్బాబుతో మాట్లాడి కోరడం జరిగింది. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కూడా సానుకూలత వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర భాగస్వామ్యంతో ఫ్యాక్టరీని తిరిగితెరిపిస్తాం. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ అన్ని అంశాలను దృష్టికి తీసుకెళ్లా.. జిల్లా కేంద్రంలో మూతప డ్డ సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి సానుకూలంగా ఉంది. సీసీఐ చైర్మన్ వి షయాన్ని స్పష్టంగా తెలిపారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఉన్న సానుకూలత, వనరులు, కలిగే ప్రయోజనాలను చైర్మన్తో పాటు ప్రభు త్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. త్వరలోనే మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు, అధికారులను కలిసి చర్చిస్తాం. – ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ కై లాస్నగర్: జిల్లా కేంద్రంలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి సీసీఐ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాజాగా ఆ సంస్థ సీఎండీ సంజయ్ బంగా హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్బాబు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. పరిశ్రమ పునరుద్ధరణ ఆవశ్యకత, అందుబాటులో ఉన్న వనరులు, చేకూరే ఉపాధి వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. పరిశ్రమ పునరుద్ధరణకు అవసరమైన డీపీఆర్ సిద్ధం చేసి, త్వరలోనే ఢిల్లీ స్థాయిలో మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలు జిల్లావాసుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలోనే... 27 ఏళ్ల క్రితం మూతపడ్డ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించడం, ఆ దిశగా వరుస సమీక్షలు నిర్వహిస్తుండడంతో ఈ ప్రాంతవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఫ్యాక్టరీ పునరుద్ధరణ ప్రతిపాదనలను పరిశీలించారు. పాత యంత్రాలు శిథిలావస్థకు చేరినందున అధునాతన యంత్రాలతో ప్లాంట్ పునరుద్ధరించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇందుకు సుమారు రూ.2వేల కోట్ల వ రకు వ్యయం అవసరమవుతుందని యాజమాన్యం వెల్లడించినట్లుగా తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల భాగస్వామ్యంతో ముందుకు సాగాలా.. లేక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలా.. అలా కానిపక్షంలో పీపీపీ విధానంలో ముందుకు వెళ్లాలనే మూడు అంశాలపై ఇందులో చర్చించినట్లుగా సమాచారం. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మంత్రి శ్రీధర్బాబు తెలి పినట్లుగా తెలిసింది. పరిశ్రమ రీ ఓపెన్ అయితే ప్ర త్యక్షంగా సుమారు 3వేల మందికి పరోక్షంగా మరో ఐదారువేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. మరో వందేళ్ల పాటు అవసరమైన సున్నపురాయి నిల్వలు స్థానికంగా అందుబాటులో ఉన్నందున కేంద్రం ఆధ్వర్యంలోనే పునరుద్ధరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
కై లాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాల ని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిష్కరించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి 68 అర్జీలు అందినట్లు అధికారులు వెల్ల డించారు. వాటిలో కొందరి నివేదిన.. -
పెండింగ్ వేతనాలు ఇప్పించండి
మేమంతా జిల్లాలోని వివిధ తహసీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నాం. మాకు ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. వాటిని త్వరగా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. – రెవెన్యూ శాఖ కంప్యూటర్ ఆపరేటర్లు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయండిమేమంతా 40 ఏళ్లుగా గ్రామంలో కూలీనాలి చేసుకుంటూ నివసిస్తున్నాం. మాకు ఇంటి స్థలం తప్ప ఎలాంటి వ్యవసాయ భూములు కానీ, ఇండ్లు కానీ లేవు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నాం. – కినార్పల్లి గ్రామస్తులు, బజార్హత్నూర్ -
డ్రగ్స్ ముఠా వెనుక కాంగ్రెస్ హస్తం
కాగజ్నగర్రూరల్: డ్రగ్స్ ముఠా వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉండటంతోనే చూసీచూడనట్లు వదిలేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. హైదరాబాద్లోని చర్లపల్లిలో రూ.12వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఓ కంపెనీలో పట్టుబడటం దారుణమని, దీనికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగజ్నగర్ మండలం కోసినిలోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్ర పోలీసులు నెల రోజులపాటు కాపుకాసి అన్ని ఆధారాలతో దాడులు చేసి డ్రగ్స్ పట్టుకున్నారని, తెలంగాణ పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. డ్రగ్స్ మొక్క ఎక్కడ ఉన్నా గద్దలా పీకేస్తామని, దీని కోసం ఈగల్ అనే ఈ కొత్త డిపార్ట్మెంట్ ప్రారంభిస్తామని చెప్పిన సీఎం చర్లపల్లిలో డ్రగ్స్ ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. ఎస్పీ ఎం కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలి సిర్పూర్ పేపరుమిల్లులో కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల మిల్లు ప్రమాదంలో ఎన్నం భాస్కర్ అనే కాంట్రాక్టు కార్మికుడు గాయపడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. మిల్లు నుంచి వచ్చే విషవాయువులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సమావేశంలో నాయకులు శ్యాంరావు, కొంగ సత్యనారాయణ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్
లక్ష్మణచాంద: పోగొట్టుకున్న ఆభరణాలు, నగదును బాధితురాలికి అప్పగించి ఆటోడ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి..కడెం మండల కేంద్రానికి చెందిన కొంక సుజాత ఖానాపూర్లో ఆరోగ్యమిత్రగా విధులు నిర్వహిస్తోంది. ఆమె కుమార్తె వివాహానికి 16 తులాల బంగారు ఆభరణాలు నిర్మల్లో చేయించింది. శనివారం కుమారుడితో కలిసి బంగారు ఆభరణాలు తీసుకుని బైక్ పక్కన బ్యాగులో ఉంచి మధ్యాహ్నం కడెంకు బయల్దేరారు. ఈక్రమంలో బ్యాగు ఎక్కడో పడిపోయింది. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లక్ష్మణచాంద మండలం రాచాపూర్కు చెందిన ఆటోడ్రైవర్ తక్కల సాయికుమార్ నిర్మల్ నుంచి లక్ష్మణచాంద వెళ్తున్నాడు. నిర్మల్రూరల్ మండలం కొండాపూర్ ఫ్లై ఓవర్ సమీపంలో 61వ జాతీయ రహదారిపై బ్యాగు పడి ఉండడాన్ని గమనించి ఇంటికి తీసుకెళ్లాడు. సోషల్ మీడియాలో చూసిన సాయికుమార్ ఆదివారం బాధితురాలి వివరాలు తెలుసుకున్నాడు. రాచాపూర్లో 16 తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఆమెకు అందించారు. బ్యాగు అందించి నిజాయితీ చాటిన సాయికుమార్ను సుజాత కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు. -
మాజీ ఎమ్మెల్యే దివాకర్రావుపై ఫిర్యాదు
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో శనివారం వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుపై అసత్య ఆరోపణలు చేసిన మాజీ ఎ మ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుపై చర్యలు తీసుకోవాలని హిందుత్వవాదులు, ఛత్రపతి శివా జీ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడారు. గణేశ్ నిమజ్జనాన్ని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించగా, వేదికపైకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అసత్యపు మాటలతో రాజకీయ వేదికగా మార్చి, విద్వేషాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు అనుచరులపై మంచిర్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మూడు ఆలయాల్లో చోరీఖానాపూర్: పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంతోపాటు తర్లపాడ్లోని ఓంకారేశ్వర, అగ్గిమల్లన్న ఆలయాల్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. వీరబ్రహ్మేద్ర స్వామి ఆలయంలో 6 సీసీ కెమెరాలు, డీవీఆర్, 4 గ్రాముల పు స్తెలు, ఓంకారేశ్వర ఆలయంలో సీసీ కెమెరాతో పాటు హుండీలో నగదు, కానుకలు, అగ్గిమల్లన్న ఆలయంలో హుండీని పగులగొట్టి నగదు, కానుకలను దొంగలు ఎత్తుకెళ్లారు. పట్టణంలో ని శివాజీనగర్ కాలనీకి చెందిన సూదం శ్రీని వాస్ బైక్ను దొంగిలించారు. ఆలయకమిటీ సభ్యుల ఫిర్యాదులపై కేసులు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. -
అంబులెన్స్లో ప్రసవం
ఇచ్చోడ: బజార్హత్నూర్ మండలం సోనేరావుగూడ గ్రామానికి చెందిన జయమాల అనే గర్భి ణి అంబులెన్స్లో ప్రసవించింది. ఆదివారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో భర్త చరణ్దాస్ అంబులెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని ఆమెను ఇచ్చోడ పీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్ను రోడ్డు పక్కన నిలిపి ఈఎంటీ శశికాంత్ ఆమెకు ప్రసవం చేయగా ఆడ్డపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను ఇచ్చోడ పీహెచ్సీకి తరలించారు. ఈఎంటీ శశికాంత్, పైలెట్ జైసింగ్లకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
నిండుకుండలా ‘ఎల్లంపల్లి’
ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్ట్లతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో ఎల్లంపల్లి జలాశయం నిండుకుండలా మారింది. ఆదివారం ప్రాజెక్ట్ నీటిమట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్కు గాను 147.58 మీటర్లకు 148, 20.175 టీఎంసీలకు గాను 20.175 టీఎంసీలతో ఉంది. ఇన్ఫ్లో కింద 1,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అవుట్ ఫ్లో కింద హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 315 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. 2 గేట్లు తెరిచి 1,185 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిపెడుతున్నారు. – మంచిర్యాలరూరల్(హాజీపూర్) -
నేటి నుంచి రాష్ట్రస్థాయి ఖేల్కూద్ పోటీలు
ఆదిలాబాద్టౌన్: సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఖేల్కూద్ పోటీలు ఈనెల 8,9,10 తేదీల్లో నిర్వహించనున్నట్లు సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంత శైక్షనిక్ ప్రముఖ్ చక్రవర్తుల కృష్ణ ఆచార్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంస్కృతికి నిలయాలుగా భావించే శిశు మందిరాల్లో చదువుతో పాటు విద్యార్థులకు బోధనేతర అంశాల్లో తర్ఫీదు ఇచ్చేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి ఖేల్కూద్ పోటీల్లో భాగంగా పరుగుపందెం, హైజంప్, లాంగ్జంప్, జావెలిన్త్రోతో పాటు ఇతర పోటీలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 450 మంది విద్యార్థులు పాల్గొననున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై ప్రారంభిస్తారని వివరించారు. -
మంత్రి ‘అడ్లూరి’ని కలిసిన సుగుణ
ఉట్నూర్రూరల్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ కోరారు. ఈమేరకు రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కలిసి వినతి పత్రం సమర్పించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీల వేతనాలు వెంటనే మంజూరు చేయాలని, భారీ వర్షాలతో నష్టపోయిన రహదారుల మరమ్మతులకు నిధుల మంజూరు చేయాలని, జైనూర్ ప్రభుత్వ ఆస్పత్రిని 40 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని మంత్రికి విన్నవించినట్లు తెలిపారు. ఈమేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆమె పేర్కొన్నారు. మంత్రిని కలిసిన టీపీటీఎఫ్ నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీపీటీఎఫ్ నాయకులు ఆదివారం మంత్రి లక్ష్మణ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగ్రావు, నాయకులు రమేశ్, రామచంద్రం, గోవర్ధన్, వెంకటేశ్వరరావు, జ్ఞానేశ్వర్, సుధాకర్ తదితరులున్నారు. -
పాముకాటుకు యువరైతు మృతి
నేరడిగొండ: అడవి పందు ల బారి నుంచి పంట కాపాడుకునేందుకు కాపలా వెళ్లిన యువ రైతు పా ముకాటుకు గురై మృతి చెందాడు. మండలంలోని గాజిలి గ్రామంలో ఈ ఘ టన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అనసూయ–వెంకట్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలో పదెకరాల వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెండో కుమారుడు యువ రైతు చిక్రం లింగు (20) బుధవారం రాత్రి వారి పంట కాపలా కోసం అక్కడికి వెళ్లాడు. గురువారం ఉదయం ఇంటికి రాకపోయేసరికి కుటుంబీకులు వెళ్లి చూడగా లింగు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానిక వైద్యుడికి చూపించగా, మెరుగైన వైద్యం కోసం 108లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. శనివారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
సెపక్తక్రా ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ఎంపిక
రెబ్బెన: మండలంలోని గోలేటి టౌన్షిప్లో సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఆదివారం సెపక్తక్రా ఉమ్మడి జిల్లా సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చి ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికై నవారు ఈనెల 20 నుంచి 22 వరకు మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో పాలిటెక్నిక్ కళాశాలలో జరగబోయే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొంటారని అసోషియేషన్ ఉమ్మడి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుమ్మరి మల్లేశ్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్రెడ్డి, క్రీడాకారులు నరేశ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు.. సెపక్తక్రా ఉమ్మడి జిల్లా సీనియర్ పురుషుల జట్టుకు ఆడే రాజేందర్, ఆర్.వెంకటేశ్, చందు, రాజశేఖర్, రాందాస్, మహిళల జట్టుకు టి.అనూష, కె.స్ఫూర్తి కారుణ్య, జె.నేహశ్రీ, అభినవ రమ్య, కె. శ్రీవల్లి ఎంపికయ్యారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులను అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, సెపక్తక్రా అసోషియేషన్ సంయుక్త కార్యదర్శి శిరీష, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె.భాస్కర్, ఆర్.రామకృష్ణ, జి.శ్రీధర్, పి.సాంబయ్య అభినందించారు. -
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం
ఆదిలాబాద్టౌన్/సాత్నాల: జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని ఆయా వినాయక మండపాల నుంచి ప్రత్యేక రథాల్లో శనివారం ప్రారంభమైన గణనాథుల శోభా యాత్ర ఆదివారం వరకు కొనసాగింది. అర్ధరాత్రి తర్వాత నుంచి క్రమంగా భోరజ్ మండలంలోని పెన్గంగకు చేరువయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ల ద్వారా వినాయకులను నిమజ్జనం చేశారు. ఈ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించడంతో ప్రక్రియ సజావుగా ముగిసినట్లు తెలిపారు. 412 విగ్రహాల నిమజ్జనం అయినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఆయన వెంట ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, పోలీసు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు. గట్టి బందోబస్తు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కింది స్థాయి సిబ్బంది నుంచి ఎస్పీ వరకు తనిఖీలు చేపట్టారు. శాంతియుతంగా సాగేలా చర్యలు తీసుకున్నారు. క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఎస్సై, సీఐ స్థాయి అధికారులకు విధులను కేటాయించారు. అలాగే పెన్గంగ వద్ద ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి దగ్గరుండి ప్రక్రియను పర్యవేక్షించారు. వీరితో పాటు రెవెన్యూ, వైద్య, ఫైర్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు విధులు నిర్వర్తించారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జరిగిన శోభయాత్రలను ఎస్పీ అఖిల్ మహాజన్ దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 11 రోజుల పాటు పోలీసులు విధులు నిర్వహించి ప్రశాంత వాతావరణంలో వేడుకలు సాగేలా కృషి చేశారని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు, హిందూ సంఘాల నాయకులకు అభినందనలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సంస్కృతి ఏటా కొనసాగాలని ఆకాంక్షించారు. పోలీసు సిబ్బంది సివిల్, రిజర్వు, హోంగార్డు సిబ్బంది, స్పెషల్ పార్టీ, క్యూఆర్టీ సిబ్బందిని అభినందించారు. 150 మంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని సేవలు అందించినట్లు తెలిపారు. ఆదిలాబాద్తో పాటు బోథ్, ఉట్నూర్, ఇచ్చోడలో ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా విజయవంతంగా వేడుకలు పూర్తయినట్లు చెప్పారు. -
బాల్బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక
రెబ్బెన: రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుల్బం చక్రపాణి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్–14 బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీలకు సుమారు 30 మంది బాలికలు, 20 మంది బాలుర హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులకు పోటీలు నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఈనెల 13 నుంచి 14 వరకు జనగామ జిల్లా కూనురులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్రెడ్డి, సీనియర్ క్రీడాకారులు నరేశ్ పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఉమ్మడి జిల్లా బాల్బ్యాడ్మింటన్ బాలిక జట్టుకు ఎం.సహాస్ర, టి.ప్రజ్వల శ్రీ, పి.శ్రావ్య,ఎస్.సాయిశ్రీ వర్షిణి, డి.వేరోనికా, జి.హన్నా, పి.సిరి, బి.రాజేశ్వరి, పి.పవిత్ర, ఎండీ అల్వీన, ఎస్.రిషిత, డి.నందిని, ఎస్.విజయస్పూర్తి, ఎండీ జేబా, బాలుర జట్టుకు వరుణ్, నిఖిల్, ఎం.కృష్ణ లోకనందు, సీహెచ్ అఖిల్, బి.రాఘవ, బి.ఆంజనేయులు, కె.స్ట్టీఫెన్, జె.అశ్విన్, ఎం.తిరుపతి, సీహె చ్ అరవింద్, డి.విష్ణువర్ధన్, ఎం.త్రిచూర్ కృష్ణ ఎంపికయ్యారు. -
లోకం ఉన్నంత కాలం కవిత్వం
ఆదిలాబాద్టౌన్: లోకం ఉన్నత కాలం కవి త్వం ఉంటుందని కవి బూర వెంకటేశ్వర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉదారి నాగదాసు స్మారక కవితా పురస్కార ప్రదాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. తన తండ్రి పేరిట ఉదారి నారా యణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కవయిత్రి తోట నిర్మలరాణికి అవార్డు అందజేశారు. పలువురు కవులు కవిత్వాలను విని పించారు. కార్యక్రమంలో సుమనస్పతి రెడ్డి, వసంత్రావు దేశ్పాండే, మన్నె ఏలియా, ఉదా రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెలకు పాలనాధికారులు
కై లాస్నగర్: పల్లెలకు పాలనాధికారులు రాబోతున్నారు. భూభారతి చట్టం అమల్లో భాగంగా రెవెన్యూశాఖ వ్యవహారాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందు కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారుల (జీపీవో) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. ఈమేరకు వారు నిర్వహించాల్సిన విధులకు సంబంధించిన జాబ్చార్టును సైతం స్పష్టం చేసింది. ఈ నెల 5న హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా జిల్లాకు సంబంధించి 83 మంది జీపీవోలు నియామక ఉత్తర్వులు అందుకున్నారు. వీరికి కలెక్టర్ కౌ న్సెలింగ్ నిర్వహించి త్వరలోనే క్లస్టర్ల వారీగా కేటాయించనున్నారు. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ రద్దుతో రెవెన్యూశాఖకు దూరమైన అధికారులు తి రిగి గ్రామాల్లో అందుబాటులోకి రానున్నారు. దీంతో భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. క్లస్టర్కు ఒక జీపీవో.. జిల్లాలో మొత్తం 508 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఇందులో 2, 3 గ్రామాలను కలిపి గతంలోనే 183 రెవెన్యూ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. తొలుత గ్రామానికో జీపీవో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆప్షన్లను స్వీకరించింది. అయితే చాలా మంది ఆసక్తి చూపలేదు. ఆప్షన్లు ఇచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా అందులోనూ చాలా మంది ఫెయిలయ్యారు. దీంతో సరిపడా అందుబాటులో లేకపోవడంతో క్లస్టర్కు ఒక జీపీవోను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో రెండు విడతల్లో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన 83 మందికి ఇటీవల సీఎం చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందజేశారు. సర్దుబాటులో భాగంగా నిర్మల్ జిల్లాలో 10 మంది అదనంగా ఉండగా వారిని ఆదిలాబాద్కు కేటాయించారు. వారిని పరిగణలోకి తీసుకుంటే మొత్తం 93 మంది అందుబాటులోకి రానున్నారు. వీరికి సొంత నియోజకవర్గం, పనిచేస్తున్న మండలంలో కాకుండా ఇతర మండలాల్లోని క్లస్టర్లలో పోస్టింగ్ కేటాయించనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి బాధ్యతలు అప్పగించనున్నారు. వీరిని మినహాయిస్తే జిల్లాలో మరో 90 క్లస్టర్లు ఖాళీగా ఉండనున్నాయి. వారికి ఇన్చార్జి బాధ్యతలు మిగతా 93 క్లస్టర్లకు సంబంధించి గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని గుర్తించి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించనున్నట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు అర్హులైన వారి వివరాలను మండలాల వారీగా రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. తదుపరి ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. భూభారతి అమల్లో కీలకపాత్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టం కింద అందిన దరఖాస్తుల పరిష్కారంలో జీపీవోలు కీలకపాత్ర పోషించనున్నారు. గతంలో రెవెన్యూశాఖలో పనిచేసిన అనుభవం ఉండటంతో దరఖాస్తుల విచారణలో వీరు ప్రధాన పాత్ర పోషించనున్నారు. గ్రామాల్లో తలెత్తె భూ వివాదాలను స్థానికంగానే పరిష్కరించడంలో వీరి పాత్ర కీలకం కానుంది. -
పక్కాగా సాగు లెక్క
ఇచ్చోడ: జిల్లాలో రైతులు పండిస్తున్న పంటల సా గు లెక్క పక్కాగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్రాప్ బుకింగ్ కోసం వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఏఈవోలకు మొబైల్ ఫోన్లలో యాప్ను ఇన్స్టాల్ చేసింది. క్షేత్రస్థాయిలో ఏఈవోలు పర్యటించి సర్వే నంబర్, రైతుల వారీగా ఫొటోలను చిత్రీకరించి పంటల వివరాలు నమోదు చేయాలి. ఈ నెలాఖరు వ రకు సర్వే పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏఈ వోలు డిజిటల్ క్రాప్ బుకింగ్ కోసం పొలం బాట పడుతున్నారు. క్లస్టర్ పరిధిలో ఒక్కో ఏఈవో 5 వేల ఎకరాల్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మూడు వేలు డిజిటల్.. రెండు వేలు ఆన్ఫోన్ ప్రతీ ఏఈవో క్లస్టర్ వారీగా క్షేత్రస్థాయిలో పర్యటించి డిజిటల్ క్రాప్ బుకింగ్ యాప్ ద్వారా మూడు వేల ఎకరాల్లో వివరాలు నమోదు చేయాలి. మరో రెండు వేల ఎకరాల వివరాలను రైతుల ద్వారా అడిగి ఆన్ఫోన్ ద్వారా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మారుమూల గ్రామాల్లో సాంకేతికత సమస్యల దృష్ట్యా ఆన్ఫోన్ నమోదుకు ప్రభుత్వం వెసులుబాట కల్పించింది. పంటల నమోదు షురూ ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. సర్వేనంబర్లు, రైతుల వారీగా సాగు చేస్తున్న పంటల ఫొటోలు తీసి యాప్లో ఆప్లోడ్ చేస్తున్నారు. రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నాడో వంటి వివరాలను అందులో పొందుపరుస్తున్నారు. పంట విక్రయాల్లో పారదర్శకత... డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా పంటల విక్రయ సమయంలో పారదర్శకత ఏర్పడనుంది. పత్తి, సోయా, కంది, మొక్కజొన్న తదితర పంటలకు ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రైతుకు మద్దతు ధర అందుతుంది.అయితే ప్రైవేట్తో పోల్చితే ఈ ధరలో వ్యత్యాసం ఉండడంతో కొనుగోళ్లలో గోల్మాల్కు అవకాశం ఉంటుంది. దళారులు పంట దిగుబడులను రైతుల నుంచి తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. ఆ పంటలను కొంతమంది సాగు చేయని రైతుల పేరిట విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా పంట ఏ మేరకు సాగవుతుందో రైతుల వారీగా పూర్తి వివరాలుంటాయి. తద్వారా అక్రమాలకు చెక్ పడనుంది. విక్రయాల్లో పారదర్శకత ఏర్పడనుంది. గడువులోపు పూర్తి చేస్తాం జిల్లాలో డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియను గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఏఈవోల మొబైల్ ఫోన్లలో ఇప్పటికే యాప్ను ఇన్స్టాల్ చేశాం. వారు క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేస్తున్నారు. – శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయాధికారిజిల్లాలో.. మండలాలు : 20 మొత్తం రైతులు : 1.65లక్షలు క్లస్టర్లు : 101 సాగుభూమి(ఎకరాల్లో) : 5లక్షల 77వేలు -
గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత
మూసివేసిన కాల్వ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన ద్వారం‘గూడెం’ వద్ద..మూసివేసిన శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం దిలావర్పూర్లో.. దిలావర్పూర్: మండలంలోని ప్రధాన ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం మూసివేశారు. స్థానిక ఏకనాథుని, రేణుక ఎల్లమ్మ, నవాంజనేయ, శ్రీమాతా న్నపూర్ణ పాపహరేశ్వర, కాల్వ పరిసర అటవీ ప్రాంతంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను అర్చకులు మూసివేశారు. సోమవారం సంప్రోక్షణ అ నంతరం భక్తులకు దర్శనం కలుగజేస్తామని ఆలయ వర్గాలు వెల్లడించాయి. జైనథ్లో జైనథ్: మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి ఆదివారం ఉదయం 10:30 గంటలకు మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 4:00 గంటలకు తెరవనున్నారు. గ్రహ సంప్రోక్షణ, అనంతరం స్వామివారికి హారతి కార్యక్రమం తర్వాత 6 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని ఈవో చంద్రశేఖర్ తెలిపారు. దండేపల్లి: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ప్రధాన ఆలయంతోపాటు, అనుబంధ ఆలయాలను మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు. -
కొలిక్కి వచ్చినట్లేనా..
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ–2 బ్రాంచిలో కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 20 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.10 కోట్ల నగదు కోంభకోణ కేసును పక్షం రోజుల్లో రామగుండం సీపీ నేతృత్వంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చెన్నూర్ సీఐ దేవేందర్రావు 90 శాతం పురోగతి సాధించినట్లు తెలిసింది. పోలీసులు సుమారు 19 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు తెలిసింది. ఈనెల 3 నుంచి 6 తేదీ వరకు గణేశ్ నిమజ్జనంలో పోలీసు అధికారులు బిజీబిజీగా ఉన్నారు. సోమవారం పనిదినాలు కావడంతో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో బంగారు అభరణాలు రికవరీ చేసే అవకాశం ఉందని సమాచారం. రికవరీ బంగారం కోర్టు ద్వారానే.. పోలీసులు పూర్తిస్థాయిలో రికవరీ చేసిన బంగారు ఆభరణాలను కోర్టులో అప్పగిస్తారని తెలిసింది. బ్యాంక్ లీగల్ అడ్వయిజర్ బ్యాంక్లో మాయమైన ఆభరణాల వివరాలను కోర్టుకు అప్పగించి స్వాధీనం చేసుకుంటారని సమాచారం. ఇదంతా పక్షం రోజులు పడుతుందని తెలిసింది. కోర్టు ద్వారా బ్యాంక్ స్వాధీనం చేసుకున్న తర్వాత బాధితుల వారీగా నగలు పరిశీలించాల్సి ఉంటుంది. 20 కిలోల బంగారు ఆభరణాలు కావడంతో 402 మంది బాఽధితులకు సంబంధించినవి వేరు చేయాలంటే రెండు నెలలు పట్టే అవకాశం ఉందని బ్యాంక్ అధికారులు అంటున్నారు. నేడు బ్యాంక్ ఎదుట ఆందోళన? ఎస్బీఐలో గోల్డ్ రికవరీ అయిన తర్వాత ఆభరణా లు ఎప్పుడిస్తారనే అనుమానం బాధితులను వెంటాడుతుంది. పూర్తిస్థాయిలో అధికారులు తమకు ఎప్పుడిస్తారనే సమాచారం లేక సోమవారం బ్యాంక్ ఎదుట ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని పలువురు బాధితులు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. -
పాపికొండలను తలపిస్తున్న ‘కడెం’
కడెం: కడెం ప్రాజెక్ట్ అందాలు బాగున్నాయని, పాపికొండలను తలపిస్తుందని హైకోర్టు జడ్జి సృజన అన్నారు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కడెం వచ్చారు. బృందావన్ రిసార్ట్స్లో విడిది అనంతరం ఆదివారం ఉదయం కడెం ప్రాజెక్ట్ను సందర్శించారు. ఆయకట్టు, వరద గేట్లు, నీటిమట్టం తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మిషన్ భగీరథ ఇంటెక్వెల్ను పరిశీలించారు. ప్రాజెక్ట్లో కుటుంబ సభ్యులతో కలిసి బోటింగ్ చేశారు. ఆమె వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, ఆర్ఐ శారద, రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ సిబ్బంది ఉన్నారు. -
ఎస్జీఎఫ్ క్రీడలు విజయవంతం చేయండి
ఇచ్చోడ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా త్వరలో నిర్వహించే ఎస్జీఎఫ్ క్రీడలను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ఆడే రామేశ్వర్ కోరారు. మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో క్రీడాజట్ల ఎంపిక పోటీల నిర్వహణపై చర్చించారు. 43 క్రీడాంశాల్లో 14, 17 ఏళ్ల విభాగం బాలుర, బాలికల జోనల్ వేదికలు ఖరారు చేసినట్లు తెలిపారు. జట్ల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయ, క్రీడా సంఘాలు, పీడీ, పీఈటీలు, సహకారంతో పోటీలు విజయవంతం చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. సమావేశంలో మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు ఎండీ యాకుబ్, రవీందర్గౌడ్, వెంకటేశ్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా వ్యాయమ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె,పార్ధసారఽథి, బుక్యా రమేశ్, కె.భోజన్న, సాయికుమార్, మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని డీవైఎస్వో జక్కు ల శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజ రై మాట్లాడారు. వాలీబాల్, క్రికెట్, క్యారం, చెస్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ క్రీ డాంశాల్లో పోటీలు నిర్వహించగా సుమారు 100 మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 16 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. వీ రంతా హైదరాబాద్లోని వివిధ మైదానాల్లో నిర్వహించనున్న పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. -
ఇవీ ప్రత్యేకం...
జిల్లా కేంద్రంలోని కుమార్పేట్ కాలనీలో కుమార్ జనతా గణేశ్మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన 54 అడుగుల మహా వినాయకుని నిమజ్జ నం నిలుచున్న చోటే జరగడం ప్రత్యే కం. గతేడాది నుంచి ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేస్తుండడం విశేషం. ఈ క్రతువును వీక్షించడానికి భక్తజనం భారీగా తరలివచ్చారు. అలాగే శిశు మందిర్లో ప్రతిష్టించిన పార్వతీ తనయుణ్ణి సాంప్రదాయ భక్తి గీతాలు, మేళతాళాలు నడుమ యు వత, చిన్నారులు నృత్యాలతో నిమజ్జనానికి తరలించారు. రిమ్స్ మహాగణపతి ఆలయంలో ప్ర తిష్టించిన శివపుత్రుణ్ణి ఎడ్ల బండిలో నిమజ్జనా నికి తరలించడం విశేషం. డప్పు చప్పుళ్లకు ల యబద్ధంగా స్టెప్పులేస్తూ ఆలయ కమిటీ ప్రతిని ధులు శోభాయాత్రలో భాగస్వాములయ్యారు. -
బైబై గణేశా..
ఆదిలాబాద్: చవితి రోజు ఊరూరా, వాడవాడనా కొలువుదీరిన విఘ్నేశ్వరుడు 11 రోజులపాటు భక్తు ల విశేష పూజలు అందుకున్నాడు. ఇంటింటా సందడి చేసిన గణనాయకుడు శనివారం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన మహోత్సవం వైభవోపేతంగా సాగింది. జిల్లా కేంద్రంలో శోభాయాత్ర సందడి ఆకట్టుకుంది. భక్తి గీతాలు, భజన సంకీర్తనలు, మేళ తాళాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఆధ్యంతం భక్తులను పులకింపజేసింది. గణపతి బప్పా మోరియా.. బైబై గణేశా మార్మోగగా.. వెళ్లిరావయ్య గణనాథ అంటూ భక్తి పారవశ్యంతో వీడ్కోలు పలికారు. శిశు మందిర్తో షురూ.. జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ శ్రీ సరస్వతి శిశుమందిర్లో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విఘ్ననాయకునికి ప్రత్యేక పూ జల అనంతరం శోభాయాత్ర ప్రారంభమవ్వడం ఆనవాయితీ. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు ఆ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ఆరంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా సాగేలా అధికార యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. హైదరాబాద్ తర్వాత జిల్లా కేంద్రంలోనే వినాయక ఆగమన, నిమజ్జన ఉత్సవాలు వైభవంగా సాగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. -
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: న్యాయవాదుల సమస్యల పరి ష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కె.సుజన అన్నారు. జిల్లా కోర్టుకు శనివారం విచ్చేసిన ఆమెను బార్ అసొసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో అమాయాక ప్రజలు ఎక్కువగా ఉంటారని వారికి సత్వర న్యాయం అందించేలా న్యాయవాదులు పూర్తి సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర రావు, న్యాయమూర్తులు డాక్టర్ శివరాం ప్రసాద్, కుమార్ వివేక్, లక్ష్మికుమారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్, ప్రధాన కార్యదర్శి శర్మ, న్యాయవాదులు పాల్గొన్నారు. జైనథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు జైనథ్: మండలకేంద్రంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వా మి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి సృజన కు టుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారి వెంట జిల్లా జడ్జి ప్రభాకరరావు, ఆలయ కమిటీ చైర్మన్ రూకేశ్రెడ్డి, తహసీల్దార్ నారాయణ, తదితరులున్నారు. -
కనులపండువగా శోభాయాత్ర..
వినాయక నిమజ్జన శోభాయాత్ర వినాయక్ చౌక్ నుంచి జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్, అశోక్ రో డ్,దేవిచంద్ చౌక్, గాంధీచౌక్, అంబేద్కర్చౌక్, శివా జీ చౌక్, ఠాకూర్ హోటల్, రైల్వేస్టేషన్ రోడ్డు మీదుగా ముందుకు సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథాలలో రంగురంగుల విద్యుత్ దీప కాంతుల నడుమ వైవిధ్య రూపాల్లో కొలువుదీరి దేదీప్యమానంగా వెలుగుతున్న గణాధీషులను వరుస క్రమంలో చాందా టీ వాగు, ఎన్హెచ్ 44 మీదుగా పెన్ గంగ వరకు చేర్చారు. అక్కడే వినాయకునికి నిమజ్జనోత్సవ పూజా కార్యక్రమం చేపట్టి వినాయకా.. సెలవిక అంటూ నిమజ్జన క్రతువును ముగించారు. -
బిల్లుల ‘పంచాయతీ’
సాక్షి,ఆదిలాబాద్: పంచాయతీ కార్యదర్శులకు ప్రస్తుతం బిల్లుల రంది పట్టుకుంది. సర్పంచ్ల పదవీకాలం 2024 ఫిబ్రవరిలో ముగిసింది. ప్రత్యేకాధికారుల పాలన అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. రాష్ట్ర సర్కారు నుంచి కూడా ఎలాంటి నిధులు విడుదల కావడంలేదు. దీంతో పంచాయతీల్లో అత్యవసర పనుల కోసం కార్యదర్శులు తమ జేబుల్లోంచి డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి. అయితే ఆ బిల్లులు తర్వాత వస్తాయి అనే నిశ్చింత వారిలో కనిపించడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. గత జూలైలో జిల్లా వ్యాప్తంగా పలువురు కార్యదర్శులు బదిలీ అయ్యారు. ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఆయా పంచాయతీల్లో వారు వెచ్చించిన డబ్బులకు సంబంధించి బిల్లులు సమర్పించారు. అయితే ఇప్పుడు వారిని ఓ సమస్య వెంటాడుతుంది. ఆ బిల్లులు పంచాయతీ పేరిట వస్తాయి. ఒకవేళ కొత్త పాలకవర్గాలు ఏర్పడితే, ఈ బిల్లులకు ఆ సర్పంచ్ అనుకూలంగా వ్యవహరిస్తాడా.. లేని పక్షంలో తమ పరిస్థితి ఏంటి అనే సందిగ్ధం వారిని వెంటాడుతుంది. పాత సర్పంచ్లవే పెండింగ్లో.. గతంలో సర్పంచ్లుగా పనిచేసిన వారికి సంబంధించి పంచాయతీల్లో పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అంతే కాకుండా ప్రత్యేకాధికారుల పాలన ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యదర్శులు తమ జేబు నుంచి ఖర్చు చేసిన అనేక వ్యయాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, ట్రాక్టర్ల నిర్వహణ, డీజిల్ బిల్లులు వంటివి ప్రతి రోజు ఏదో విధంగా వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం, ఇటు పను ల విషయంలో ప్రజలు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉండటంతో కార్యదర్శులు తప్పనిసరి పరిస్థితుల్లో సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 473 గ్రామ పంచాయతీలున్నాయి. గత ఫిబ్రవరి నుంచి జూలై వరకు ప్రధానంగా వేసవి ఉండటంతో కార్యదర్శులు తాగునీటి పనుల కోసం అధికంగా వెచ్చించారు. చిన్న పంచాయతీల్లో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు, పెద్ద పంచాయతీల్లో రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు అప్పుడున్న సెక్రెటరీలు తమ జేబుల్లోంచి ఖర్చు చేశారు. అయితే బదిలీల తర్వాత ఇప్పటి వరకు 14 నెలల్లో చిన్న పంచాయతీల్లో రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు , పెద్ద పంచాయతీల్లో రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు వెచ్చించినట్లు కార్యదర్శులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల విషయంలో చర్చ జరుగుతుండటం, ఒక వేళ కొత్త పాలకవర్గాలు ఏర్పడితే తమకు సంబంధించి పాత, కొత్త బిల్లులు ఏ విధంగా చేతికందుతాయోననే రంది వారిని వెంటాడుతుంది. ఇంద్రవెల్లి మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించిన కార్యదర్శి గతేడాది జూలైలో ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఓ పంచాయతీకి బదిలీ అయ్యాడు. పాత పంచాయతీలో వివిధ పనుల కోసం రూ.లక్ష 30వేలు తన జేబు నుంచి ఖర్చు చేశాడు. ఇప్పటికే ఏడాది దాటింది. బిల్లులు మాత్రం రాలేదు. ప్రస్తుతం తాను పనిచేస్తున్న చోట కూడా రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అయితే పాత బిల్లులు పంచాయతీ పేరిట వస్తుండగా.. ఆ డబ్బులు తన చేతికి అందేదెలా అనే సందిగ్ధం అతడిలో కనిపిస్తోంది. ఇతనొక్కడే కాదు.. బదిలీ అయిన వందలాది మంది కార్యదర్శులదీ ఇదే పరిస్థితి. -
‘సమస్యలు పరిష్కరిస్తా..’
ఆదిలాబాద్టౌన్: ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో టస్మా ఆధ్వర్యంలో శనివారం గురుపూజో త్సవం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరితో కలిసి ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పలువురు ప్రైవేట్ ఉపాధ్యాయులను సత్కరించి మెమెంటోలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు సైతం ప్రభుత్వ పథకాలకు అర్హులేనన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారమే ఫీజులు తీసుకోవాలని యాజ మాన్యాలకు సూచించారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పవన్రావు. కార్యదర్శి ఆధినాథ్, కోశాధికారి దేవేందర్ పటాస్కర్, అడ్వైజర్ పురుషోత్తం, కరస్పాండెంట్లు రమణ, స్వామి, హమీద్, రామకృష్ణ, షబ్బీర్ తదిత రులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న టీచర్లు
ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో జిల్లాకు చెందిన గురువులు ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ సూరజ్సింగ్ సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం స్వీకరించారు. అనంతరం సీఎంతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆదిలాబాద్లోని తెలంగా ణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల–బోథ్ ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ కూడా ఉత్తమ ప్రిన్సిపల్గా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి, డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతు ల మీదుగా అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాల అ ధ్యాపకుల సమష్టి కృషి, అంకితభావంతోనే పురస్కారాలు వచ్చినట్లు తెలిపారు. -
ఈ విధానం సాధ్యం కాదు
పీడీపీఎస్ విధానంలో వ్యాపారులే పత్తి కొనుగోలు చేయాలి. రూల్స్ ప్రకారం ఆదిలాబాద్ మార్కెట్కు పెద్దమొత్తంలో వచ్చే మొత్తం పత్తిని వ్యాపారులే కొనుగోలు చేయాలంటే సాధ్యం కాదు. రైతులు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలని అడుగుతారు. మార్కెట్లో అమ్మిన తర్వాత ధర వ్యత్యాసాన్ని పరిశీలించి ప్రభుత్వం ఆ నష్టాన్ని చెల్లిస్తుంది. అప్పటివరకు రైతులు ఆగే పరిస్థితి ఉండదు. – రాజు చింతవార్, జిన్నింగ్ వ్యాపారి పాత పద్ధతిలోనే కొనుగోళ్లుపీడీపీఎస్ విధానంపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఈ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి పలుసార్లు చర్చలు జరిగాయి. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ విధానం అమలుపై ఎలాంటి స్పష్టత లేదు. గతంలో లాగే.. పాత పద్ధతిలో క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తాం. – గజానన్, మార్కెటింగ్ శాఖ అధికారి, ఆదిలాబాద్ -
ఘనంగా ఓనం ఉత్సవాలు
ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బెల్లూరి అయ్యప్ప ఆలయంలో శు క్రవారం ఓనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యా రు. ఈ సందర్భంగా అయ్యప్ప నామస్మరణ మార్మోగింది. ఎంపీ గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు సంతోష్ శర్మ, మహేశ్, ఆలయ కమిటీ సభ్యులు వీరికి పూర్ణకుంభంతో స్వాగ తం పలికారు. ముందుగా వీరు ఆలయంలో అ య్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేశా రు. ఓనం విశిష్టతను వివరించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుంబోజీ సూర్యకాంత్, దాముక రవీందర్, మహేశ్, అన్నోజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గడువు తీరిన మందుల విక్రేతపై చర్య తీసుకోవాలి
ఆదిలాబాద్టౌన్: గడువు తీరిన మందులు విక్రయించిన మెడిక ల్ షాపు నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని ప ట్టణానికి చెందిన సయ్యద్ సాబీర్ డ్రగ్ ఇన్స్పెక్టర్కు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ సాబీర్ పట్టణంలోని కలెక్టరేట్ చౌక్లో గల ‘న్యూ ఏ టూ జెడ్’ ఫార్మసీలో గురువారం ఎల్డోక్స్రిన్ టాబ్లెట్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి బాటిల్ను పరిశీలించగా గత జనవరిలోనే గడువు ముగిసినట్లు గుర్తించాడు. దీనిని సదరు మెడికల్ షాపు యజమా ని దృష్టికి తీసుకువెళ్లగా, అతడు దానిని లాక్కునే ప్ర యత్నం చేసి వాగ్వాదానికి దిగినట్లు బాధితుడు ఆరోపించాడు. కాలం చెల్లిన మందులు విక్రయించడంతోపాటు తనతో అమర్యాదగా ప్రవర్తించిన మె డికల్ షాపు నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని సయ్యద్ సాబీర్ డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశాడు. మెడికల్ షాప్ సీజ్ చేయాలని కోరాడు. -
● ఇప్పటివరకు జారీ కాని గైడ్లైన్స్ ● అమలైతే రైతులకు ప్రయోజనమే.. ● జిన్నింగ్ వ్యాపారుల నిరాసక్తత ● పాత విధానమేనన్న అధికారులు!
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ధర వ్యత్యాస చెల్లింపు పథకం (పీడీపీఎస్) అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఆదిలాబాద్ మార్కెట్లో దీన్ని ప్రయోగాత్మకంగా ఈ సీజన్ నుంచే అమలు చేయనున్నట్లు స్వ యంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నా గేశ్వర్రావు గతంలో ప్రకటించారు. అయితే.. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి విధివిధానాలు ఖరారు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. దీంతో ఈ పథకం అమలవుతుందో.. లేదో.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం అమలు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోననే సందిగ్ధం రైతులు, వ్యాపారులు, మార్కెటింగ్ అధికారుల్లో నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధంగా లేమని కేంద్రానికి స్పష్టం చేసింది. దీంతో జిల్లాలో పీడీపీఎస్ అమలు ప్రశ్నార్థకం కాగా, ఎక్కడ అమలవుతుందోనని ఆందోళన చెందుతున్న ఆయా వర్గాలకు ఊరట లభించనట్లయింది. ఇదీ.. పథకం ఉద్దేశం ధర వ్యత్యాస చెల్లింపు పథకం (పీడీపీఎస్)ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం ప్రకా రం భారత పత్తి సంస్థ (సీసీఐ) మార్కెట్లో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయదు. వ్యాపారులు మా త్రమే రైతుల పత్తి కొనుగోలు చేస్తారు. ప్రధానంగా మార్కెట్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే రైతులకు తక్కువ ధర లభించిన పక్షంలో ఆ వ్యత్యాసాన్ని కేంద్రం భరిస్తుంది. సీసీఐ ద్వారా ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. మార్కెట్లో ఎంఎస్పీ కంటే తక్కువ ధర ఉన్నప్పుడు రైతులకు ఆ వ్యత్యాసాన్ని చెల్లించడం ద్వారా వారికి నష్టం కలగకుండా చూడాలన్నదే ప్రభుత్వ భావన. కానీ.. జిల్లాలో అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. కేంద్రంతో పలుసార్లు చర్చలుఈ విధానంపై గత సీజన్ చివరలోనే చర్చ మొదలైంది. అదే సమయంలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఆదిలాబాద్ మార్కెట్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్లీ పలుసార్లు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్చలకు పిలిచింది. గత జూన్ 19న న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్లో ఈ విషయంపై సమావేశం నిర్వహించారు. పీడీపీఎస్ అమలులో ఎదురయ్యే ఇబ్బందులు, సవాళ్లపై చర్చించారు. నీతి ఆయోగ్, సీసీఐ ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల వ్యవసాయ, మార్కెటింగ్శాఖల అధికారులు, కాటన్ అసోసియేషన్ సభ్యులు, ఎంపిక చేసిన రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా నుంచి ఓ జిన్నింగ్ మిల్లు వ్యాపారి, రైతు సంఘం నాయకుడు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. -
వినాయకా.. సెలవిక
ఆదిలాబాద్: జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్స వాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మి ది రోజుల పాటు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. గురువారం మొదలైన నిమజ్జనోత్సవం శుక్రవారం ఉద యం వరకు కొనసాగింది. పెన్గంగ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం, భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మికత సంతరించుకుంది. బజార్హత్నూర్: మండల కేంద్రంలోని సూర్య గణేశ్, శివాజీ మార్కెట్, శ్రీహనుమాన్, పోచమ్మ, మైసమ్మ, రామ్సేన్, గాంధీనగర్ యూత్ల ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండళ్ల వద్ద శుక్రవారం గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జన శోభాయాత్ర నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. యువకులు బ్యాండ్ మేళా, భాజాభజంత్రీల మధ్య నృత్యాలు చేస్తూ శోభాయాత్రగా వెళ్లారు. అనంతరం గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇంద్రవెల్లి: మండలకేంద్రంతో పాటు మండలంలో ని గొండ్గూడ, పర్ధాన్గూడ, మిలింద్నగర్, ము త్నూర్ గ్రామాల్లో శుక్రవారం రాత్రి నిమజ్జనోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయా మండళ్ల వద్ద వినాయకుడికి ప్రత్యేక పూజలు ని ర్వహించగా భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యా రు. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం సంప్రదాయ వాయిద్యాలతో గణేశ్ విగ్రహాల శోభా యాత్ర నిర్వహించి అనంతరం నిమజ్జనం చేశారు. -
ఆదివాసీల సొంతింటి కల నెరవేరుస్తాం
కైలాస్నగర్: ఆదివాసీల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో శు క్రవారం పీఎం జన్మన్ పథకం కింద ఆదిలాబాద్ రూరల్ మండలంలోని 359 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఏ ఒక్క ఆదివాసీ పక్కా ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం పీఎం జన్మన్ కింద ఇళ్లు మంజూరు చేస్తోందని చెప్పారు. కార్యక్ర మంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాల య సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, జెడ్పీ సీఈ వో జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బేల మండల కేంద్రంలో.. బేల: మండలకేంద్రంలోని గణేశ్ గార్డెన్స్లో పీఎం జన్మన్ పథకం కింద బేల, సాత్నాల మండలాల కు చెందిన 1,008మంది పీవీటీజీ ఆదివాసీ లబ్ధిదా రులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పంపిణీ చేశారు. డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, హౌసింగ్ పీడీ బసవేశ్వరయ్య, జైనథ్ ఏఎంసీ చైర్మన్ అల్లూరి అశోక్రెడ్డి, వైస్ చైర్మన్ సవాపురే విలాస్, ఎంపీడీవోలు మహేందర్కుమార్, వెంకట్రాజు, తహసీల్దార్ రఘునాథ్రావు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయం ఇంద్రవెల్లి: పేదల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యే యమని, తాజాగా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం పేద, మధ్య తరగతి కుటుంబాలకు నేరుగా లాభం జరుగుతుందని ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని హర్షిస్తూ మండలకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో పన్నుల భారంతో సామాన్యులు చాలా ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ తగ్గింపు అమలులోకి రానుండగా ఇది దసరా, బతుకమ్మ, దీపావళి పండుగలకు పేదలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన బహుమానమని తెలిపా రు. కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, నాయకులు కేంద్రే బాలాజీ, ఆరెల్లి రాజలింగు, ఆర్క ఖమ్ము, శివకుమార్ జైస్వాల్, తుకారాం, హనుమంత్రావ్, రాజేశ్వర్, రాజువర్ధన్, దిలీప్, రాధిక, జైరాం తదితరులున్నారు. -
గణపతికి కలెక్టర్, ఎస్పీ పూజలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ప్రాంగణంలో ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామన్స్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ప్రతి ష్ఠించిన వినాయకునికి శుక్రవారం కలెక్టర్ రా జర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూ జలు నిర్వహించారు. నిమజ్జనోత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించా రు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య కూడా గణేశుడిని దర్శించుకుని పూజలు చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు గంట వినోద్, ప్రతినిధులు దత్తాత్రి, రవి, సారంగపాణి, విఠల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం
ఆదిలాబాద్: వినాయక చవితి నుంచి భక్తుల విశేష పూజలందుకున్న గణేశుడు గంగమ్మ ఒడికి చేరేవేళ ఆసన్నమైంది. శనివారం నిర్వహించనున్న నిమజ్జనోత్సవానికి మున్సిపల్, పోలీస్ శాఖలు ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమా రు 2వేల విగ్రహాలు ప్రతిష్ఠించగా ఇప్పటికే 3, 5, 7, 9 రోజుల్లో 1,550 ప్రతిమలను నిమజ్జనం చేశారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 450 గణపతి విగ్రహాలు నిమజ్జనానికి తరలాయి. శిశుమందిర్ నుంచి శోభాయాత్ర.. జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్లో హిందూ స మాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద ఉదయం 10గంటలకు ప్రత్యే క పూజలు నిర్వహించి ఎంపీ, కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు శోభాయాత్రను లాంఛనంగా ప్రారంభిస్తా రు. దశాబ్దాలుగా ఇక్కడ ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. భక్తులు భక్తి గీతాలు, భజన కీర్తనలు, సాంస్కృతిక నృత్యాల మధ్య ఇక్కడి నుంచే శోభాయాత్ర ప్రారంభమవుతుంది. పోలీస్శాఖ నిరంతర నిఘా వేడుకలు శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలో 600 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 350 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎనిమిది క్లస్టర్లు, ఎనిమిది సెక్టార్లుగా విభజించి సిబ్బందికి విధులు కేటాయించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 23 పికెట్స్ ఏర్పాటు చేసి అధికారులతో పాటు స్ట్రైకింగ్ ఫోర్సు, 15మంది సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. ప్రధాన రోడ్లలో రూఫ్ టాప్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 15 మంది కెమెరా సిబ్బందిని నియమించనున్నారు. మొత్తంగా జిల్లా కేంద్రంలో 15 మంది సీఐలు, నలుగురు డీఎస్పీలు, ఇద్దరు ఏఎస్పీలు ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రం సమీపంలోని చాందా టీ వాగు, పెన్ గంగా వద్ద మహిళా సిబ్బందిని నియమించారు. ఇదే విషయమై తన కార్యాలయంలో ఎస్పీ శుక్రవారం డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్రెడ్డి, సీఐలు, ఎస్సైలు తదితరులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. శోభాయాత్ర ఇలా.. పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా శోభాయాత్ర సాగుతుంది. వినాయక్ చౌక్ నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర ఓల్డ్ బస్టాండ్, అశోక్రోడ్, దేవిచంద్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీచౌక్, ఠాకూర్ హోటల్ మీదుగా సాగనుంది. పాత జాతీయ రహదారిపై నుంచి చాందా వంతెనతో పాటు, అది దాటి నేషనల్ హైవే–44 మీదుగా పెన్ గంగాకు చేరుకోనుంది. ఈ మేరకు ఈ రూట్లో ఇప్పటికే ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా పూర్తయింది. ఇటీవల కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ రూట్ మ్యాప్ పరిశీలించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో.. పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇదివరకే రహదారుల మరమ్మతు పనులు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి కల్పించనున్నారు. తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. గణపతి విగ్రహాల నిమజ్జనం జరిగే చాందా టీ, పెన్ గంగా వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. లైటింగ్ సిస్టం ఏర్పాటు సిద్ధం చేశారు. ఈ రెండు చోట్ల గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. -
సమస్యలు సృష్టిస్తే చర్యలు
జిల్లా కేంద్రంలో నిమజ్జనోత్సవ శోభాయాత్రకు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. చివరి విగ్రహం నిమజ్జనం పూర్తయ్యేదాకా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. సమస్యలు సృష్టించే వారిని వీడియోగ్రఫీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటాం. డ్రోన్ కెమెరాలతో పట్టణంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించే ఆకతాయిలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తాం. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
ఆంగ్లంలో బోధిస్తూ.. పుస్తకాలు రాయిస్తూ..
ఇంద్రవెల్లి: మండలంలోని ఏమాయికుంట ఎంపీయూపీఎస్లో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న బుక గంగయ్య విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్లో రాణించేలా బోధిస్తున్నారు. ఐదోతరగతి విద్యార్థులతో ఇంగ్లిష్లో మాట్లాడిస్తున్నారు. వారితో పుస్తకాలు రాయించి ఆవిష్కరిస్తున్నారు. నీతి కథలు రాసి దిశానిర్దేశం చేస్తున్నారు. ‘మా బడికి రండి’ అంటూ బడీడు పిల్లలను పాఠశాలకు రప్పించడానికి కృషి చేస్తున్నారు. ఏమాయికుంట పాఠశాలలో 98 మంది విద్యార్థులుండగా వారి సంఖ్యను 140 మందికి పెంచారు. పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. లయన్స్ క్లబ్ సహకారంతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిస్తున్నా రు. కూరగాయలు పండించి వాటితోనే మధ్యాహ్న భో జనం వండిస్తున్నారు. విద్యార్థులకు శుద్ధజలం అందించేందుకు, ప్లేట్లు పంపిణీ చేయించడానికి తనవంతు కృషి చేశారు. ఇన్ని చేసిన గంగయ్య సేవలను గుర్తించిన విద్యాశాఖ అధికారులు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు. నేడు సీఎం రేవంత్రెడ్డి చేతు ల మీదుగా గంగయ్య అవార్డు అందుకోబోతున్నారు. -
ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు
ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. గురువారం జి ల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉ పాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని శా లువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్కు పునాది వేయాలని, వారికి రోల్మోడల్గా నిలువాలని సూచించారు. పాఠశాలల్లో ఏఐ ద్వారా నాణ్యమైన విద్యాబోధన అందుతుందని తెలిపారు. కొందరు ఉపాధ్యాయులు వా గులు, వంకలూ లెక్కచేయకుండా పాఠశాలలకు వెళ్లి విద్యాబోధన చేయడం అభినందనీయమని పే ర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాని కి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చే స్తున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్ర, మండల విద్యాధికారి సోమయ్య, సెక్టోరియల్ అధికారులు ఉదయశ్రీ, రఘురమణ, ఉష్కం తిరుపతి, కందుల గజేందర్, శ్రీహరిబాబు, గడ్డం శశికళ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొమ్ము కృష్ణకుమార్, అశోక్, సోగల సుదర్శన్, శ్రీనివాస్, గడుగు నరేందర్, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
ఇద్దరిని కాపాడి..వాగులో గల్లంతైన ఒకరు
నార్నూర్: ఇటీవల కురుస్తున్న వర్షాలు జనజీవనం అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో మండలంలోని మల్లెంగి వాగు పొంగింది. అదే గ్రామానికి చెందిన మొత్తం 9 మంది రైతులు వ్యవసాయ పనుల కోసం వాగు అవతల ఒడ్డుకు ఉదయం చేరుకున్నారు. దినమంత పనిచేసి సాయంత్రం 5 గంటలకు తిరిగి ఇంటికి వెళ్లేందుకు బయల్దేరారు. గ్రామ సమీపంలోని వాగులో నీటి ప్రవాహం తక్కువ ఉండడంతో జాడే శంకర్ (42)తోపాటు, మరో ఇద్దరు రైతులు జాదవ్ మిట్టు, జాదవ్ మిథున్లతో కలిసి వాగు దాటే సాహసం చేశారు. అప్పటికే వాగులో భారీగా వరద నీరు ఒకే సారి రావడంతో ఉధృతి పెరిగింది. పరిస్థితిని గమనించిన శంకర్ ఇద్దరు రైతులను ఒడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడారు. ఆయన బయటి వచ్చే క్రమంలో వరద ఉధృతికి గల్లంతయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో మృతదేహం కిలోమీటరు దూరంలో వాగులో లభించిందని ఎస్సై అఖిల్ తెలిపారు. మృతుడికి భార్య జాడే సరిత, ఇద్దరు కూమారులు ఉన్నారు. -
బోధనోపకరణాలతో..
నిర్మల్రూరల్: సోన్ మండలం కడ్తాల్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎం రాజులదేవి రమేశ్బాబు తక్కు వ ఖర్చుతో తయారుచేసిన బోధన ఉపకరణాలతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. రాతియుగపు పనిము ట్లు, సవరం, పడవ కరెన్సీ, అక్షర మాస్కులు, అక్షర కార్డులు, గుండె, మూత్రపిండాలు ఇలా రకరకాల బోధనోపకరణాలను తయారు చేసి బోధన చేస్తున్నాడు. పాఠ్యాంశంలోని విషయాలు క్షేత్ర పర్యటనల ద్వారా వారికి ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో జంక్ ఫుడ్ మాన్పించడానికి ప్రతి 2 నెలలకోసారి ఫుడ్ ఫెస్టివల్ను తల్లిదండ్రులతో కలిసి నిర్వహిస్తున్నారు. అప్పటి డీఈవో రామారావు ఆయన్ను అభినందించారు. విద్య రంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను 2016లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2013లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. -
వ్యర్థాలతో బొమ్మలు తయారు చేసి..
లోకేశ్వరం: సేవాలాల్తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎల్మల ప్రవీణ్కుమార్.. విద్యార్థులకు బొమ్మలతో విద్యాబోధన చేస్తున్నారు. కథనాలు, నాటికలు, పాఠ్యాంశాలు, క్లిష్టమైన గణిత భావనలను పప్పెట్ ద్వార బోధనతో వారిలో ఆసక్తి రేకిస్తున్నారు. వ్యర్థాలతో(ఉపయోగం లేని) బొమ్మలను విద్యార్థులతో తయారు చేయించి బోధన అందిస్తున్నారు. విద్యార్థులు స్వర మార్పులను గ్రహించి ఉపాధ్యాయున్ని అనుకరించి ఆటలు, కథల నాటికలో పాల్గొంటున్నారు. పప్పెట్ సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ అండ్ ట్రెయినింగ్ (సీసీఆర్టీ) న్యూఢిల్లీలో శిక్షణ పొంది వచ్చి విద్యార్థులకు వాటి ద్వారా బోధిస్తున్నారు. -
కాలువలో పడి బాలుడి మృతి
నిర్మల్రూరల్: మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన బత్తుల జయరాజ్ (12) ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..బుధవారం మధ్యాహ్నం తల్లి బత్తుల లతీకతో కలిసి తోటకు కూలీ పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం అందరితో కలిసి భోజనం చేసిన తర్వాత పక్కనే ఉన్న కెనాల్లో ఆడుకోవడానికి వెళ్లాడు. ఆ సమయంలో భారీ వర్షం పడడంతో ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు. చాలాసేపటి తర్వాత గమనించిన తల్లి, గ్రామస్తులు జయరాజు కోసం వెతకగా కాలువలో ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సై, సిబ్బంది కాలువలో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. జయరాజ్ తండ్రి గత కరోనాలో మృతిచెందగా, తల్లి కూలీ చేసుకుంటూ బతుకుతోంది. కాగా జయరాజుకు మానసిక స్థితి సరిగాలేదని, ఇంట్లోనే ఉంటాడని రూరల్ ఎస్సై పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
గణపతిపూజలో మహరాజ్
నేరడిగొండ: మండలంలోని ఇస్పూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన గణపతి పూజకు భాష్చంద్, సూరజ్ మహరాజ్లు హాజరయ్యా రు. బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు. అ నంతరం గ్రామస్తులతో కలిసి గణపతి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్జాదవ్ను శాలువాతో సన్మానించారు. వినాయకుడి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే రాజురా గ్రామంలోగల గణనాథుడిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయనను గ్రామస్తులు సన్మానించారు. -
చంటిబిడ్డతో వాగు దాటి ఆస్పత్రికి..
ఇంద్రవెల్లి: మండలంలోని మామిడిగూడ గ్రామానికి చెందిన పెందోర్ ఈశ్వరి ఐదు నెలల బాలింత చంటిబిడ్డతో ఎత్తుకుని వాగు దాటి ఆస్పత్రికి తీసుకెళ్లింది. గ్రామానికి చెందిన పెందోర్ ఈశ్వరిబాయి చంటిబిడ్డకి రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. భారీ వర్షం కారణంగా వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయింది. గురువారం వాగులో వరదనీరు కొంత తగ్గడంతో తల్లి ఆర్క గంగుబాయితో కలిసి సంకలో చంటి పాపను ఎత్తుకుని ప్రాణాలను తెగించి వాగు దాటింది. అక్కడి నుంచి కాలినడన ఆంధ్మామిడిగూడ వరకు వచ్చి ఆటోలో మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం అందించారు. వాగు వద్ద బ్రిడ్జి లేక ప్రతిఏటా వర్షాకాలంలో అత్యవసర సమయంలో ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు తెలిపారు. అధికారులు దృష్టిసారించి మంజూరైన నిధులతో మామిడిగూడ వాగు వద్ద బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు. -
భార్య జ్ఞాపకార్థం.. బడి కోసం..!
భైంసాటౌన్: భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. అయితే కొద్దికాలానికి భార్య మృతి చెందడంతో, ఆమె జ్ఞాపకార్థం ప్రభుత్వ బడుల బాగే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆయనే భైంసాకు చెందిన హెచ్ఎం రాచేవాడ్ గంగాప్రసాద్. ఈయన భార్య పద్మావతి ఎస్ఏ(ఇంగ్లిష్)గా పనిచేస్తూ 2015లో మృతిచెందారు. దీంతో ఆమె జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం సొంతంగా ఖర్చు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గంగాప్రసాద్ తొలుత తానూర్లో ఎస్జీటీగా, అక్కడి నుంచి ముధోల్లో ఎస్ఏగా, ఆపై మాటేగాం, చుచుంద్లో పనిచేశారు. ముధోల్లో పనిచేసిన సమయంలో అక్కడ 9 ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూళ్లుగా, చుచుంద్, మిర్జాపూర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలను సైతం అప్గ్రేడ్ చేయించారు. ప్రస్తుతం భైంసాలోని జెడ్పీ బాలికల పాఠశాల హెచ్ఎంగా చేస్తుండగా, తెలుగు మీడియం పాఠశాల భవనం పూర్తి శిథిలావస్థకు చేరడంతోపాటు విద్యార్థులకు వసతులు లేవు. సొంత ఖర్చుతో భవనానికి మరమ్మతు, ప్రార్థన కోసం స్టేజీ, కోతుల బెడద నివారణకు ఇనుప జాలి, విద్యార్థినులు, ఉపాధ్యాయుల కోసం మూత్రశాలలు, మరుగుదొడ్లు, 16 కంప్యూటర్లు, ఫ్యాన్లు, విద్యుత్ మరమ్మతులు చేయించారు. ఇందుకుగాను రూ.6.5లక్షలు వెచ్చించారు. ప్రభుత్వ బడిని కాపాడాలి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. నా భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలే. ఆమె జ్ఞాపకార్థం ప్రభుత్వ బడుల బాగు కోసం నా వంతు కృషి చేస్తున్నాను. – ఆర్.గంగాప్రసాద్, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, భైంసా -
పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ..
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపల్గా పనిచేస్తున్న సూరజ్సింగ్ రాష్ట్ర ఉత్తమ లెక్చరర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన ఇంద్రవెల్లి మండలంలోని అందునాయక్తండాకు చెందినవారు. 2002 నుంచి 2012 వరకు కాంట్రాక్ట్ లెక్చరర్గా పని చేశారు. 2013 సెప్టెంబర్ 13న ఏపీపీఎస్సీ ద్వారా రెగ్యులర్ లెక్చరర్గా నియమితులయ్యారు. మొదట ఇచ్చోడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ లెక్చరర్గా పని చేశారు. ఆ తర్వాత గుడిహత్నూర్లో, ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నారు. ఈయన పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2009 నుంచి 2012 వరకు 230 మంది అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వగా 148 మంది డీఎస్సీలో హిందీ పండితులుగా నియమితులయ్యారు. చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకున్న ఆయన శిష్యురాలు శీతల్ను ప్రోత్సహించి హిందీ పండిత్గా ఉద్యోగం సాధించేలా ప్రోత్సహించారు. రాష్ట్రస్థాయిలో ఈమె మూడో ర్యాంక్ సాధించారు. శీతల్ కూడా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం విశేషం. క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన బోధన చేయడంతో సూరజ్సింగ్ను ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ లెక్చరర్ అవార్డుకు ఎంపిక చేసింది. నేడు హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. -
ఒక విద్యార్థి నుంచి 30 మందికి..
నిర్మల్: మండలంలోని మల్లాపూర్కు అనుబంధ గ్రామమైన మా చాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయురాలు లక్ష్మి 2024 అక్టోబర్ 16న జాయిన్ అయింది. ఆ సమయంలో ఒక విద్యార్థి ఉన్నారు. బడి మూతపడటం ఖాయమనే సమయంలో విద్యార్థుల సంఖ్యను 30 మందికి చేర్చారు. ఆటపాటల ద్వారా బోధన, నేలపై పిల్లలతోపాటు కూర్చొని బోధించడటం లక్ష్మి ప్రత్యేకత. భీమేశ్ దాత సాయంతో రూ.40 వేలతో పాఠశాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించింది. సొంత నిధులు రూ.25 వేల వెచ్చించి ఫర్నిచర్, కుర్చీలు, గ్రీన్నెట్, కిచెన్ గార్డెన్, ఆట వస్తువులు సమకూర్చింది. – లక్ష్మి, ఎస్జీటీ, మాచాపూర్ ప్రాథమిక పాఠశాల -
నిమజ్జనోత్సవ ఏర్పాట్లు ముమ్మరం
కై లాస్నగర్: ఈ నెల 6న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రకు బల్ది యా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూట్మ్యాప్ ప్రకారం పట్టణంలోని 49వార్డుల పరిధిలోని వి నాయక విగ్రహాల శోభాయాత్ర నిర్వహించనున్న ప్రాంతాలు, ప్రధాన చౌక్లలో రోడ్లపై గుంతలను మొరం, స్టోన్డస్ట్తో పూడ్చివేస్తున్నారు. అడ్డు వచ్చే చెట్ల కొమ్మలు తొలగిస్తున్నారు. వేలాడే విద్యుత్ తీగలను సరి చేస్తున్నారు. ప్రత్యేక హైమాస్ట్ లైట్లు ఏ ర్పాటు చేస్తున్నారు. మజీద్ల వద్ద బారికేడ్లు ఏ ర్పాటు చేసి కవర్లతో కప్పేస్తున్నారు. శోభాయాత్ర తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం తాత్కాలిక టా య్లెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రసాద వితరణతో పాటు తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయనున్నా రు. నిమజ్జనం చేసే పెన్గంగా, చాందా వాగు వద్ద 10మంది చొప్పున గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రత్యేకంగా నీటిపై తేలియాడే తె ప్పలు అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా మ త్స్యశాఖ అధికారి భాస్కర్ నాయక్ తెలిపారు. పెన్గంగా వద్ద ప్రత్యేక క్రేన్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు. -
బోర్బుపై బొమ్మలు వేసి..
లక్ష్మణచాంద: మండలంలోని పీచర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలు శ్వేత..బోధనోపకరణాలు వినియోగించి విద్య బోధించడం భోధనలో ప్రత్యేకత. విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా విద్య బోధిస్తున్నారు. వారంలో బోధించిన విషయాలపై ప్రతీ శనివారం పిల్లలు ఇంటికి చేరిన తరువాత వారి పోషకుల మొబైల్ ఫోన్లో టెస్ట్ మోజ్ అనే యాప్ ద్వారా ఆన్లైన్లో పిల్లలకు పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి అరగంటపాటు చిన్నచిన్న కథలను బోర్డుపై బొమ్మలు వేసి బోధిస్తున్నారు. క్రీడల్లో శిక్షణ నిర్మల్రూరల్: ఖానాపూర్ మండలం సత్తెనపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఇమ్రాన్.. విద్యార్థులకు ఆటపోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల సమయం తర్వాత గంటపాటు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. యోగా, వెయిట్ లిఫ్టింగ్ తదితర ఆటలను బ్యాచ్లవారీగా నేర్పుతున్నారు. ఇటీవల ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాఠశాల నుంచి 9 పతకాలు సాధించారు. ఢిల్లీలో జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 67 కిలోల విభాగంలో శివ సాయి పాల్గొన్నారు. ఇదే విద్యార్థి బాసర ట్రిపుల్ ఐటీ లో స్పోర్ట్స్ కోటాలో సీటు సాధించాడు. ఇమ్రాన్ వివిధ రాష్ట్ర అంతర్జాతీయ క్రీడాకారులను పాఠశాలకు ఆహ్వానించి వారితో విద్యార్థులకు వివిధ ఆటల్లో తర్ఫీదునిస్తున్నాడు. బొమ్మలను గీస్తూ.. బోధన చేస్తూ.. తాంసి: విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యేలా పాఠశాల గోడలపై రంగురంగుల బొమ్మలు గీస్తూ బోధిస్తూ తాంసి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు కవిత ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె గతేడాది క్రితం ఇక్కడు బదిలీపై వచ్చారు. విద్యార్థులను ఆకట్టుకునేలా పాఠాలు బోధిస్తూనే తన కళా నైపుణ్యంతో తరగతి గదులతోపాటు, ప్రహరీలపై వివిధ బొమ్మలు వేశారు. గ్రామస్తుల సహకారంతో రంగుల కొనుగోలు చేయగా విద్యార్థులకు జ్ఞానం, ఆహ్లాదం కలిగించేలా బొమ్మలను స్వయంగా వేశారు. -
దిగుబడిపై దిగాలు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ఆగస్టులో కురిసిన వర్షాలు పత్తి రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. పూర్తిగా పంట నష్టపోయిన పలువురు రైతులు దిగాలు చెందుతున్నారు. వ్యవసాయ శాఖ సర్వే నిర్వహించి నష్టం అంచనా వేసింది. ప్రభుత్వానికి నివేదిక పంపనుంది. దెబ్బతిన్న పంటలు కాస్తయినా మెరుగవుతాయని ఆశించిన రైతులు చేల వద్దకు వెళ్లి బావురమంటున్నారు. చేను అడుగుభాగంలో రాలిన పత్తి పిందెలను చూసి ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో.. రాదో.. అని మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం కనికరం చూపి పరిహారం మంజూరు చేసి ఆదుకుంటుందని ఆశిస్తున్నారు. ఇది జిల్లాలోని వర్షాలకు పంట దెబ్బతిన్న పత్తి రైతుల ప్రస్తుత దయనీయ స్థితి. ఇవీ శాస్త్రవేత్తల సూచనలు వర్షాలు తగ్గిన తర్వాత చేలలో నిలిచిన నీటిని బయటకు వెళ్లేలా కాలువలు తీయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎకరాకు కాపర్ఆక్సిక్లోరైడ్ (సీవోసీ) 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్కల అడుగు భాగంలో పిచికారీ చేయాలని చెబుతున్నా రు. 19:19:19 ఐదు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచిస్తున్నారు. 35కిలోల యూరియా, 10కిలోల పొటాష్ కలిపి చల్లాలని బాధిత రైతులకు వివరిస్తున్నారు. వానాకాలంలో సాగు వివరాలు సాగు విస్తీర్ణం 5.85లక్షల ఎకరాలు పత్తి విస్తీర్ణం 4.40లక్షల ఎకరాలు -
బోధనతోపాటు సేవల్లోనూ రాణిస్తూ..
సాత్నాల: భోరజ్ మండలం పిప్పర్వాడ జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయురాలు శశికళ పాఠ్యాంశాల బోధనతోపాటు విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నారు. చిత్రలేఖనం, కవిత్వం, కథా రచన, సైన్స్ మోడల్స్, వేదికపై ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం లాంటి అంశాల్లో మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆమె మార్గదర్శకత్వంలో పలువురు విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలు, రాష్ట్ర సైన్స్ ఫెయిర్లో బహుమతులు గెలుచుకున్నారు. 130మంది విద్యార్థులున్న పాఠశాలలో అదనంగా మరో 45 మందిని చేర్పించారు. పాఠశాలలో వంటగదిని సొంత ఖర్చులతో నిర్మించారు. ఉదయం విద్యార్థులకు రాగి జావ అందిస్తారు. మధ్యా హ్న భోజనం కోసం విద్యార్థులకు దాతల ద్వా రా ప్లేట్లు ఇప్పించారు. కంప్యూటర్ బోధనకు అవసరమైన సామగ్రిని దాతల సాయంతో స మకూర్చారు. బడిలో మొక్కల పెంపకం, కూరగాయల సాగు చేపట్టారు. ఏడేళ్లుగా 100శాతం ఫలితాలు సాధిస్తుండడంతో ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా ఎంపికై నేడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు. 2020లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పురస్కారం, 2022లో స్వచ్ఛ విద్యాలయం కింద జిల్లా స్థాయిలో అవార్డు అందుకున్నారు. -
జిల్లాను వీడని వరుణుడు
కై లాస్నగర్: జిల్లాను వరుణుడు వీడటం లేదు. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు అన్ని మండలాల్లో ఎడతెరిపిలేకుండా కురిసింది. విద్యార్థులు, ఉద్యోగులు పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ పనులకు అటంకం ఏర్పడింది. పలు చోట్ల వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువులు అలుగు దూకాయి. జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్ట్ల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. బుధవారం అత్యధికంగా ఉట్నూర్ మండలంలో 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఇంద్రవెల్లిలో 51.5, ఆదిలాబాద్ అర్బన్లో 48.3, తాంసిలో 45.5, భోరజ్లో 44.5, మావల, బేల మండలాల్లో 43.5, గుడిహత్నూర్లో 40.5, భీంపూర్లో 39.5, జైనథ్, నార్నూర్లో 38.8, సాత్నాలలో 33.8, సిరికొండలో 33.3, తలమడుగులో 26.3, ఇచ్చోడలో 23.3, బేలలో 22.3, బజార్హత్నూర్లో 11.8, తలమడుగు, గాదిగూడలో 10.8, సొనాలలో 7.0, బోథ్లో 3.5. నేరడిగొండలో అత్యల్పంగా 2.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. -
బాధిత రైతులందరినీ ఆదుకోవాలి
కై లాస్నగర్: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలపై వ్యవసాయాధికారులతో సమగ్ర సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకో వాలని మాజీ మంత్రి జోగు రామన్న విజ్ఞప్తి చేశా రు. ఈమేరకు కలెక్టర్ రాజర్షి షాను బుధవారం రాత్రి కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందజేశా రు. పంట నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా బ్యాంకర్లు రుణాలు అందించేలా చూడాలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ భూములను సాగు చేస్తున్న ఆదివాసీ రైతులకు తెలంగా ణ గ్రామీణ బ్యాంకు మినహా ఇతర బ్యాంకులు రుణాలివ్వడం లేదన్నారు. ఈమేరకు చొరవ చూ పాలని కోరారు. ఆయన వెంట పార్టీ నాయకులు అజయ్, గణేష్, జగదీష్, తదితరులున్నారు. -
రైతులను ఆదుకోవాలి..
భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. గతనెల 16, 18 తేదీల్లో వర్షాలు కురిస్తే వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా సర్వే పూర్తి చేయలేకపోతున్నారు. నామ్కే వాస్తే కాకుండా ప్రతీ పంట క్షేత్రానికి వెళ్లి నష్టం అంచనా వేయాలి. పంట దెబ్బతిన్న రైతుకు ఎకరానికి రూ.25వేలు, భూమి కోతకు గురైన రైతుకు రూ.35వేల చొప్పున పరిహారం చెల్లించాలి. మంత్రులు ఇచ్చిన హామీ మేరకు త్వరగా పరిహారం అందించాలి. – సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అద్యక్షుడు ప్రభుత్వానికి నివేదిస్తాం.. జిల్లాలో భారీ వర్షాల కారణంగా 18వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు సర్వేలో తేలింది. వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తాం. జిల్లాలో 12,338 మంది రైతులు పంటలు నష్టపోయారు. అత్యధికంగా పత్తి 14వేల ఎకరాల్లో, సోయాబీన్ 3,155 ఎకరాల్లో నష్టం వాటిల్లింది.– శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
వానలోనూ.. క్యూలోనే
ఓ వైపు వర్షం.. మరో వైపు యురియా కొరత రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. పంటలను కాపాడుకోవడానికి అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. బుధవారం భారీ వర్షంలోనూ రైతులు యూరియా కోసం ఇలా మండల కేంద్రంలోని సహకార సంఘ కార్యాలయం ఎదుట ఉదయం 6 నుంచే క్యూ కట్టారు. మహిళలు సైతం గంటల తరబడి నిరీక్షించారు. అయితే ఒక్కొక్కరికి రెండు బ్యాగులు మాత్రమే ఇవ్వడంతో ఆందోళనకు దిగారు. కనీసం ఎకరానికి ఒక బ్యాగు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, సాయంత్రం వరకు క్యూలో ఉన్నా యూరియా దొరకడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. – నార్నూర్ -
ౖపైపెకి గంగమ్మ
ఇది నార్నూర్ మండలం మాన్కపూర్ పంచాయతీ శివారులోని రైతు కర్మాన్కర్ విఠల్ చేనులోని వ్యవసాయ బావి. ఇటీవల కురిసిన వర్షాలతో ఇలా పూర్తిగా నిండిపోయింది. భూ ఉపరితలానికి సమాంతరంగా జలాలు పైకి వచ్చాయి. నీటిని చేతితో మనిషి సులువుగా తాకేందుకు వీలుగా ఉంది. జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి మండలాల్లోని పలు బావులు ఇలాగే నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి.సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో అధిక వర్షాలు కురువడంతో భూగర్భజలాలు ౖపైపెకి వచ్చాయి. ప్రస్తుతం 1.71 మీటర్ల లోతుల్లోనే జలాల లభ్యత ఉంది. గత మే నుంచి ఇప్పటివరకు 10.12 మీటర్ల మేర పెరగడం గమనార్హం. ప్రధానంగా జిల్లాలో గతనెలలో భారీ వర్షాలు కురిశాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 2 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 847.5 మి.మీ.లు కాగా, 1043.6 మి.మీ.ల వర్షం కురిసింది. ఇది 23 శాతం అధికం. ఈ వర్షాలతో జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా తయారయ్యాయి. ఇక్కడ పాయింట్ లోతులోనే.. జిల్లాలోని కొన్ని మండలాల్లో పాయింట్ లోతులోనే భూగర్భజలాల లభ్యత ఉండటం గమనార్హం. గాదిగూడ మండలం అర్జునిలో 0.01 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు లభిస్తున్నాయి. భోరజ్లో 0.10, జైనథ్, నార్నూర్లలో 0.20, ఇచ్చోడలో 0.50, ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్లో 0.75 మీటర్లలోనే ఉన్నాయి. ఈ రెండు చోట్ల మినహాయిస్తే జిల్లాలోని మిగతా అన్నిచోట్ల తక్కువ మీటర్ల లోతులోనే జలాల లభ్యత ఉండటం గమనార్హం. భూ ఉపరితలం నుంచి జలాల లభ్యత (మీటర్ల లోతులో).. మే : 11.83 జూన్ : 9.05 జూలై : 4.00 ఆగస్టు : 1.71తక్కువ లోతులోనే లభ్యత.. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో భూగర్భజల మట్టం భారీగా పెరిగింది. గాదిగూడ మండలం అర్జునిలో పాయింట్ లోతులోనే జలాలు లభిస్తుండగా, బేల మండలం చాంద్పల్లిలో అధికంగా 6.25 మీటర్లు, భీంపూర్ మండలం అర్లిలో 4.85 మీటర్ల లోతులో లభ్యత ఉంది. – శ్రీవల్లి, ఏడీ, భూగర్భజల శాఖ, ఆదిలాబాద్ -
ఎన్సీసీతో దేశభక్తి పెంపు
ఆదిలాబాద్: ఎన్సీసీతో దేశభక్తి పెంపొందుతుందని అఫీషియేట్ గ్రూప్ కమాండింగ్ ఆఫీ సర్ కల్నల్ రాజేశ్కపూర్ అన్నారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న ఎన్సీసీ వార్షిక సంయుక్త శిబిరాన్ని బుధవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఎన్సీసీలో చేరాలని సూచించారు. శిక్షణలో భాగంగా ఆయా అంశాలపై దృష్టి సారించి నైపుణ్యాలు పెంపొందించుకో వాలన్నారు. ఇందులో సీఓ విక్రమ్ ప్రతాప్ సింగ్, ఏవో అరవింద్ కిచ్చార్, జగ్ రామ్, అశోక్, ప్రశాంత్, రజిత, రాజేశ్వరి, ఆనంద్రావు, పూర్ణచందర్, శ్రీనివాస్, వినోద్ కుమార్, భూమన్న తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
ఉట్నూర్రూరల్: పేదల పెన్నిధి, సంక్షేమ పథకాల ప్రదాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో అందించిన సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. వైఎస్సార్ వర్ధంతిని ఉట్నూర్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహానేత చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. పేదల కోసం ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన మహానేత అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సునిల్ జాదవ్, మాజీ సర్పంచ్ ప్రతిభ, విశాల్, గోవింద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
● నిండిన ప్రాజెక్టులు, చెరువులు ● ఆగస్టులో అధిక వర్షపాతం ● ఏకంగా 56 శాతం అధికం
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో గడిచిన నెలలో వర్షాలు దంచి కొట్టాయి. ఆగస్టులో ఏకంగా 56 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్, జూలై వరకు సాధారణానికే పరిమితమైన విషయం విదితమే. గడిచిన నెలలో కురిసిన వర్షాలతో ప్రస్తుతం జిల్లా వర్షపా తం ఏకంగా అధిక స్థితికి చేరువైంది. జిల్లా వార్షిక వర్షపాతం 1154.9 మి.మీ.లు. వానాకాలం వరకు 995.8 మి.మీ.లు సాధారణ వర్షపాతం. అయితే ఇప్పటివరకు 23 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులు తుండడంతో జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నా యి. సెప్టెంబర్లోనూ ఇదే కొనసాగితే వర్షపాతం అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. 12 మండలాల్లో అధికం.. ఆగస్టులో కురిసిన వర్షాలతో జిల్లాలో వర్షపాతం గ ణనీయంగా పెరిగింది. 12 మండలాల్లో అధికంగా, తొమ్మిది మండలాల్లో సాధారణ స్థితి నమోదైంది. ఇదిలా ఉంటే ఆగస్టు మూడో వారం నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరుణుడు ఇక శాంతించాలని రైతులు కోరుకుంటున్నారు. ప్రాజెక్టులు, చెరువులకు జల కళ జూలై చివరి వరకు సాధారణ వర్షపాతం ఉండడంతో జలాశయాలు పూర్తిస్థాయిలో నిండలేదు. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని రెండు ప్రా జెక్టులు సాత్నాల, మత్తడి వాగు నిండు కుండలా తయారయ్యా యి. ఆయా ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక జిల్లాలోని సుమారు 300 చెరువులు పూర్తిగా నిండాయి. పలుచోట్ల అలుగు పారాయి. భూగర్భ జలాలు సైతం గణనీయంగా పెరిగాయి. మండలాల వారీగా.. (జూన్ 1 నుంచి సెప్టెంబర్ 2వరకు) మండలం సాధారణం కురిసింది స్థితి భీంపూర్ 732.1 871.4 సాధారణం జైనథ్ 869.6 1251.3 అధికం బేల 840.7 1063.8 అధికం గాదిగూడ 829.0 790.5 సాధారణం నార్నూర్ 852.4 964.3 సాధారణం ఇంద్రవెల్లి 977.5 1157.7 సాధారణం గుడిహత్నూర్ 832.1 1299.0 అధికం ఆదిలాబాద్రూరల్ 865.6 1072.3 అధికం ఆదిలాబాద్అర్బన్ 849.6 1116.3 అధికం మావల 823.9 1079.5 అధికం తాంసి 786.3 983.4 అధికం తలమడుగు 789.3 974.1 అధికం బజార్హత్నూర్ 864.9 1120.2 అధికం బోథ్ 815.7 837.8 సాధారణం నేరడిగొండ 817.0 837.8 సాధారణం ఇచ్చోడ 874.5 1369.7 అధికం సిరికొండ 909.4 1164.5 అధికం ఉట్నూర్ 925.4 1038.5 సాధారణం సొనాల 815.7 767.8 సాధారణం సాత్నాల 858.2 1139.4 అధికం భోరజ్ 868.0 1001.4 సాధారణంఅలుగు పారుతున్న కరత్వాడ చెరువునెలల వారీగా (మి.మీ.లలో) నెల సాధారణం కురిసింది వ్యత్యాసం స్థితి జూన్ 209.4 215 3 శాతం అధికం సాధారణం జూలై 323.3 274.5 –15 శాతం తక్కువ సాధారణం ఆగస్టు 295.3 462 56 శాతం అధికం అధికం సెప్టెంబర్ 167.8 –– –– –– -
‘పోక్సో’పై అవగాహన అవసరం
ఆదిలాబాద్టౌన్: పోక్సో చట్టంపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా జడ్జి ప్రభాకరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోక్సో చట్టంతో పాటు బాలల హక్కులపై ఉపాధ్యాయులు, లెక్చరర్లకు మంగళవారం ఓరియంటేషన్ నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2012లో పోక్సో చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. నేర ని రూపణ అయితే నిందితుడికి మూడేళ్ల జైలుతో పాటు ఉరి శిక్ష సైతం విధించే అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ పి ల్లలకు విద్యా సంస్థల్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, యూనిసెఫ్ రిసోర్స్ పర్సన్ డేవిడ్, కామారెడ్డి డీసీపీవో స్రవంతి, డీఐఈవో గణేశ్, జిల్లా సంక్షేమ అధి కారి మిల్కా, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి తిరుపతి, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
లెక్క తేల్చేలా..
కై లాస్నగర్: సాగునీటి వనరుల లెక్క తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏడో చిన్ననీటి పారుదల వనరుల గణనకు శ్రీకారం చుట్టింది. సర్వే నిర్వహణకు గాను ప్రణాళికశాఖ మండల, డివిజినల్ స్టాటిస్టికల్ ఆఫీసర్లకు జిల్లాస్థాయిలో ఇది వరకే శిక్షణ పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో గణనకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రణాళిక శాఖలో గతంలో పనిచేసిన కంప్యూటర్ సూపర్వైజర్లను ఎన్యూమరేటర్లుగా ఎంపిక చేశారు. ఆగస్టు 30 వరకే ఈ గణన పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ భారీ వర్షాల నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే ఈ గణనను ప్రారంభించనున్నారు. అక్టోబర్ 30 వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. తద్వారా జిల్లాలో సాగునీటి వనరులతో పాటు వాటి కింద సాగవుతున్న ఆయకట్టు విస్తీర్ణం లెక్క తేలనుంది. అలాగే భూగర్భజలాల సంరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కేంద్రం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయనుంది. ఉద్దేశమేంటంటే.. భూగర్భజలాల వినియోగం ఏ స్థాయిలో ఉంది.. నీటి మట్టం తగ్గుతుందా, పెరుగుతుందా.. అనేదాన్ని అంచనా వేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఐదేళ్లకోసారి చిన్ననీటి వనరుల గణనను చేపడుతుంది. ఇది వరకు 2018–19లో ఈ ప్రక్రియను మ్యానువల్గా చేపట్టారు. నిర్ణీత ప్రొఫార్మాతో కూడిన మాడ్యూల్స్ను సిబ్బందికి అందజేశారు. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను అందులో నమోదు చేసి కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరిచారు. తాజాగా ఈ ఏడాది మళ్లీ సర్వే చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. తదనుగుణంగా ప్రణాళిక శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. సాగునీటి వనరుల గుర్తింపు.. వ్యవసాయ సాగుకు ఉపయోగపడే బోరుబావులు, తవ్వకం బావులు, నీటికుంటలు, వాగులు, చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, చెక్డ్యాంలు వంటి చిన్ననీటి వనరులన్నింటిని గుర్తించనున్నారు. ఇందుకోసం జిల్లాలోని 509 రెవెన్యూ గ్రామాలకు గాను ఉపాధి హామీలో పనిచేసే 200 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రణాళికశాఖకు చెందిన 30 మంది కంప్యూటర్ సూపర్వైజర్లు కలిపి ఎన్యూమరేటర్లుగా ఎంపిక చేశారు. ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామాలను కేటాయించనున్నారు. ఈ వివరాల నమోదు కోసం కేంద్రం ఎంఐ సెన్సెస్ అనే ప్రత్యేక యాప్ రూపొందించింది. ఎన్యూమరేటర్లకు యూజర్ ఐడీ, పాస్వర్డ్లను కేటాయించారు. ఆ ప్రకారం వారు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆయా వనరులను గుర్తించనున్నారు. వాటి ఫొటో క్యాప్చర్ చేసి, లాంగ్ట్యూడ్, ల్యాటిట్యూడ్తో పాటు వాటిని ఏ సంవత్సరంలో తవ్వారు, నిర్మించారు.. అందుకు ఎంత వ్యయమైంది.. ప్రస్తుతం ఉపయోగంలో ఉందా.. లేకుంటే ఎన్నేళ్లుగా లేదు.. వాటి ద్వారా ఎన్ని ఎకరాల భూమి సాగువుతుంది.. నీటి మట్టం ఎంత ఉంది అనే వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేయనున్నారు. అందులో గతంలో గుర్తించిన వనరుల సమాచారం సైతం ఉండనుంది. ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే మార్చనున్నారు. ఈ ప్రక్రియను మండల స్థాయిలో మండల స్టాటిస్టికల్ ఆఫీసర్, డివిజన్ స్థాయిలో డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ సూపర్వైజర్లుగా పర్యవేక్షించనున్నారు. ఒక్కో గ్రామంలోని నీటి వనరుల గణనకు గాను ఎన్యూమరేటర్కు రూ.1,750 చొప్పున కేంద్రం పారితోషకం చెల్లించనుంది. మండల, డివిజన్ స్టాటిస్టికల్ ఆఫీసర్లకు ఇది వరకే శిక్షణ సైతం అందించారు. పక్కాగా నిర్వహిస్తాం.. జిల్లాలోని సాగునీటి వనరుల స్థితిగతులు, వాటి కింద సాగు విస్తీర్ణం గుర్తించేందుకు గాను కేంద్రం 7వ చిన్ననీటి వనరుల గణనను చేపడుతుంది. అక్టోబర్ 30వరకు గణన పూర్తి చేయాలని ఆదేశించింది. జిల్లాలో ఈ ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తాం. జిల్లా స్థాయిలో ఉద్యోగులకు ఇది వరకే శిక్షణ ఇచ్చాం. మండల స్థాయిలో త్వరలోనే ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చి వర్షాలు తగ్గిన వెంటనే గణనను ప్రారంభిస్తాం.– బి.వెంకటరమణ, ప్రణాళికశాఖ జాయింట్ డైరెక్టర్, ఆదిలాబాద్ జిల్లాలో గత గణనలో గుర్తించిన నీటి వనరుల వివరాలు బోర్వెల్స్ : 23,161 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు : 575 చెరువులు : 464 తవ్వకపు బావులు : 7,615 -
పల్లె ఓటర్లు @ 4,49,981
కై లాస్నగర్: పల్లెపోరుకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. త్వరలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సంబంధిత ఓటరు జాబితా ప్రక్షాళనకు ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన వారిని చేర్చడంతో పాటు వార్డులు, గ్రామాల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేలా చూడాలని ఆదేశించింది. తదనుగుణంగా కసరత్తు చేసిన అధికారులు తుది జా బితా ఖరారు చేశారు. జిల్లావ్యాప్తంగా 4,49,981 మంది పల్లె ఓట ర్లున్నట్లు గుర్తించారు. ఇందులో పురుషులు 2,19,652 మంది, మ హిళలు 2,30,313 మంది ఉన్నా రు. ఇతరులు మరో 16 మంది ఉ న్నారు. ఈ జాబితా ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు ఉంటా యని అధికారులు స్పష్టం చేశారు. మహిళా ఓటర్లే అధికం.. జిల్లాలో 20 గ్రామీణ మండలాలు ఉండగా వాటి పరిధిలో 473 గ్రామ పంచాయతీలున్నాయి. ఓటర్ల తుది జాబితా తయారీకి ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఓటర్ల నమోదుతో పాటు మార్పులు, చేర్పులపై అభ్యంతరాలను స్వీకరించింది. కొత్తగా కేవలం రెండు ఓట్లు నమోదు కాగా మార్పులు, చేర్పులపై 1400 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 10,661 మంది అధికంగా ఉన్నారు. వీరే పంచాయతీ పోరులో నిలిచే అభ్యర్థుల తలరాతను మార్చనున్నారు. మండలాల వారీగా పంచాయతీ ఓటర్ల వివరాలు మండలం పురుషులు మహిళలు ఇతరులు ఆదిలాబాద్రూరల్ 13,858 14,674 00 బజార్హత్నూర్ 11,687 12,141 01 బేల 13,825 13,762 00 భీంపూర్ 9,312 10,166 00 భోరజ్ 7,302 7,656 00 బోథ్ 13,022 14,236 01 ఇచ్చోడ 17,131 18,114 00 గాదిగూడ 7,695 8,104 00 గుడిహత్నూర్ 12,361 12,929 00 ఇంద్రవెల్లి 16,033 16,416 03 జైనథ్ 9,741 10,253 00 మావల 2,103 2,283 00 నార్నూర్ 11,606 11,775 04 నేరడిగొండ 11,517 12,352 00 సాత్నాల 5,241 5,421 00 సిరికొండ 6,431 6,714 00 సొనాల 5,293 5,511 00 తలమడుగు 13,481 14,376 00 తాంసి 6,515 7,267 00 ఉట్నూర్ 25,472 26163 07 -
నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా చర్యలు
కై లాస్నగర్/సాత్నాల: ఈనెల 4, 6 తేదీల్లో నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి శోభాయాత్ర కొనసాగే మార్గాల ను మంగళవారం పరిశీలించారు. పట్టణంలోని ప్ర ధాన చౌక్లతో పాటు భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే భోరజ్ మండలం పెన్గంగ వరకు గల మార్గాన్ని పరిశీలించి ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ఘాట్ల వద్ద శుభ్రత, వాహనాల రాకపోకలపై అధికారుల కు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పట్టణంలో రోడ్లు గుంతలమయమైన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్లకు ఇరువైపులా అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను సవరించాలన్నారు.పెన్గంగ బ్రిడ్జ వద్ద సరిపడా క్రేన్లు, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు గజ ఈతగాళ్లు, అంబు లెన్స్ అందుబాటులో ఉంచాలని సంబంధిత అధి కారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. వారి వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీ ఎన్. రాజు, ట్రాన్స్కో ఎస్ఈ జేఆర్ చౌహాన్, తహసీల్దార్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్లో ప్రతిష్టించిన గణనాథునికి కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో సెకండ్ బెటాలియన్ కమాండెంట్ నీతిక పంత్, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ కక్షతోనే కేసీఆర్పై కుట్ర
ఆదిలాబాద్టౌన్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి కుమురంభీం చౌక్ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా రామ న్న మాట్లాడుతూ.. తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ను రూపకల్పన చేశారని తెలిపారు. అయితే మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగిపోవడాన్ని సాకుగా చూపు తూ లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రాజెక్టును అభాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్కు ప్రతిష్ట దక్కుతుందనే అక్కసుతో రాజకీయ కక్షసాధింపు చర్యలకుపాల్పడుతున్నారని విమర్శించారు. ఇందులో పార్టీ నాయకులు మెట్టు ప్రహ్లాద్, దాసరి రమేశ్, సాజిదొద్దీన్, రాజ న్న, ప్రేమల, పవన్ నాయక్, సలీమ్ పాషా, వసంత్, కరుణ, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
బడులకు రేటింగ్
ఆదిలాబాద్టౌన్: పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి దేశవ్యాప్తంగా బడులకు రేటింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో నిర్వహణకు సంబంధించి ఆన్లైన్లో ఫొటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 20 పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు రూ. లక్ష నగదు ప్రోత్సాహకంతో పాటు సంబంధిత ఉపాధ్యాయులను మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న విహార కేంద్రాల సందర్శనకు తీసుకెళ్లనున్నారు. అయితే ప్రభుత్వం ఇదివరకు స్వచ్ఛత పురస్కారాలు అందజేసిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం నిలిచిపోగా, మళ్లీ జాతీయస్థాయిలో పాఠశాలలకు రేటింగ్ పేరుతో పురస్కారాలు అందించనున్నారు. కార్యక్రమ తీరుతెన్నులు.. జిల్లాలో ప్రభుత్వ, లోకల్బాడీ, ప్రైవేట్, కేజీబీవీ లు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ తదితర పాఠశాలలు ఉన్నాయి. ఈ స్కూళ్ల యాజమాన్యాలు స్వచ్ఛ ఏవమ్ హరిత్ స్కూల్ రేటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 30 వరకు గడువు ఉంది. పాఠశాలల్లోని తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత, తదితర పాఠశాల నిర్వహణపై ఆన్లైన్లో ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్లో కమిటీ బృందం తనిఖీ చేపడుతుంది. 3–స్టార్ వచ్చిన పాఠశాలలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తా రు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన ఆరు పాఠశాలలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో 4–స్టార్ వచ్చిన వాటిని జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. దేశంలోని ఉత్తమంగా ఉన్న 200 పాఠశాలలకు స్వచ్ఛ ఏవమ్ హరిత్ పురస్కారం అందజేస్తారు. రూ.లక్ష నగదుతో పాటు ఉపాధ్యాయులను విహార యాత్రకు తీసుకెళ్తారు. అయితే 35 నుంచి 50 పాయింట్లు ఉన్న పాఠశాలలకు 2–స్టార్, 51 నుంచి 74 పాయింట్లు గల పాఠశాలలకు 3–స్టార్, 75 నుంచి 89 పాయింట్లు ఉన్న స్కూళ్లకు 4–స్టార్, 90 నుంచి 100 పాయింట్లు ఉన్న బడులకు 5–స్టార్ కేటాయిస్తారు. పురస్కారంతో బాగుపడనున్న స్కూళ్లు.. స్వచ్ఛ ఏవమ్ హరిత్ పురస్కారంతో సర్కారు పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత నెలకొననుంది. మరుగుదొడ్ల నిర్వహణ బాగుపడనుంది. ఆయా బ డుల్లో స్వచ్ఛ వాతావరణం నెలకొల్పడానికి దోహద పడుతుంది. అయితే ప్రస్తుతం చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. నీటిసదుపాయం ఉన్నప్పటికీ వాటిని విని యోగించడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటడం, పరిసరాల శుభ్రత, పచ్చదనం కోసం దోహదపడనుంది. జాతీయస్థాయిలో ఎంపికై తే జిల్లాతో పాటు పాఠశాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 30 వరకు దరఖాస్తు గడువు.. ‘స్వచ్ఛ ఏవమ్ హరిత్ స్కూల్ రేటింగ్’ కింద పాఠశాలలను జాతీయస్థాయిలో ఎంపిక చేస్తారు. ఈనెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎంఈవోలు, మండలానికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున సోమవారం డైట్ కళాశాలలో శిక్షణ కల్పించాం. జాతీయ స్థాయిలో ఎంపికై న పాఠశాలకు రూ.లక్ష ప్రోత్సాహం అందజేస్తారు. ఈ నిధులను పాఠశాల అభివృద్ధికి ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ఉపాధ్యాయుడిని విహార యాత్రకు తీసుకెళ్తారు. అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – ఉష్కం తిరుపతి, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి జిల్లాలో.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు : 1,471 విద్యార్థులు : 1,46,880 ప్రభుత్వ ఉపాధ్యాయులు : 2,667 -
మంచిర్యాలలో పెరగనున్న స్లాబ్ రేట్..
సాక్షి,ఆదిలాబాద్: వైన్షాపుల టెండర్ నోటిఫికేషన్ కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏర్పాట్లపై ఎక్సైజ్ శా ఖ దృష్టి సారించింది. ఈ సారి ఉమ్మడి జిల్లాలో వైన్స్ల సంఖ్యలో మార్పు ఉండకపోవచ్చని తెలు స్తోంది. అయితే మంచిర్యాలలో స్లాబ్రేటు పెరగనుండగా.. అంతగా నడవని షాపులను మాత్రం రిలొకేషన్ చేయనున్నట్లు సమాచారం. రీ లొకేషనన్కు అవకాశం.. వైన్షాపునకు సంబంధించి జనాభా ప్రాతిపదికన స్లాబ్ రేటు అమలు చేస్తారు. ఈ ప్రకారం ఏటా ఆ విలువ కంటే పది రేట్లకు పైగా ఎక్కువ విక్రయాలు జరిగితే ఆ షాపును మంచి ఆదాయం ఉన్నట్లుగా పరిగణిస్తారు. అయితే జిల్లాలో కొన్ని వైన్స్ల ఆదా యం తక్కువగా ఉండటంతో వాటిని మరో చోటికి తరలించాలని ఎకై ్సజ్శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే జిల్లాలవారీగా రీలొ కేషన్ జాబితా రూపొందించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో.. ఎకై ్సజ్శాఖ ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో ఆదిలా బాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఇవి పని చేస్తాయి. జిల్లాల్లో డీపీఈవోలు అధికారులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం కొత్త ఎకై ్సజ్ పాలసీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే విధి విధానాలన్నింటినీ ఆ శాఖ పూర్తి చేసింది. ప్రభుత్వం ఎప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినా అందుకు రెడీగా ఉంది. అదే సంఖ్యలో వైన్స్లు.. ఉమ్మడి జిల్లా పరిధిలో గత ఎకై ్సజ్ పాలసీలో ఉన్న వైన్స్ల సంఖ్య ఈ సారి మారకపోవచ్చని తెలుస్తోంది. అయితే అంతగా నడవని వైన్స్లను రీలొకేషన్ పేరిట అదే జిల్లాలోని ఇతర ప్రాంతాలకు మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆదా యం లేని వైన్స్లను ఎకై ్సజ్ శాఖ గుర్తించినట్లు తెలుస్తోంది. టెండర్ నోటిఫికేషన్కు ముందు ప్రభుత్వం వీటిపై పరిశీలన జరపనుంది. వాటిని రీలొకేషన్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన పక్షంలో ఎక్కడికి మార్చాలి అనేదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా శాఖ అధికారులు రీలొకేషన్ కోసం పరిశీలన కూడా చేస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు రూ.1,700 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతాయి. ఉమ్మడి జిల్లాలో వైన్స్ల సంఖ్య.. జిల్లా వైన్స్ల సంఖ్య ఆదిలాబాద్ 40 నిర్మల్ 47 మంచిర్యాల 73 కుమురంభీం ఆసిఫాబాద్ 32 మొత్తం 192విధివిధానాలు ఖరారు కాలేదు.. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో విధివిధానాలు ఖరారు కావాల్సి ఉన్నాయి. ఆ తర్వాతే కొత్త ఎకై ్సజ్ పాలసీపై స్పష్టత వస్తుంది. రీలొకేషన్ విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే వెళ్లడం జరుగుతుంది. – కె.రఘురాం, డిప్యూటీ కమిషనర్, ఎకై ్సజ్ శాఖ, ఆదిలాబాద్ డివిజన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గత ఎక్సైజ్ పాలసీలో మూడు స్లాబ్ రేట్లు అమలులో ఉన్నాయి. రూ.60 లక్షలు, రూ.55 లక్షలు, రూ.50 లక్షలు జనాభా ప్రాతిపదికన ఇప్పటివరకు కొనసాగాయి. ప్రస్తుతం మంచిర్యాల కార్పొరేషన్ కావడంతో నూతన పాలసీలో అక్కడ స్లాబ్ రేటు రూ.65 లక్షల వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎకై ్సజ్ శాఖ విధివిధానాలు రూపొందించినట్లు సమాచారం. నిర్మల్, కుమురంభీం, ఆదిలాబాద్ జిల్లాల్లో పాత విధానాల్లోనే స్లాబ్ రేట్లు కొనసాగనున్నా యి. ఇదిలా ఉంటే గతంలో టెండర్ దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు ఉండగా, ప్రభుత్వం ఈ సారి రూ.3లక్షలకు పెంచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉండగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండగా, వాటి తర్వాతే వీటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఎకై ్సజ్ శాఖలో ప్రచారం సాగుతుంది. -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
కై లాస్నగర్: ప్రజావాణి అర్జీలు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు సాంత్వన చేకూర్చాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోనితో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు దరఖాస్తులను అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి 84 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన..రోడ్డు కష్టాలు తీర్చండి మా గ్రామానికి వెళ్లే రోడ్డు పొచ్చెర నుంచి అధ్వానంగా మారింది. రూ.17కోట్ల వ్యయంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కంకర వేసి మధ్యలోనే వదిలేశాడు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – కప్పర్ల గ్రామస్తులు, తాంసి గిట్టుబాటు కావడం లేదు.. మేము జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో విద్యార్థులకు ఆరేళ్లుగా భో జనం వండి వడ్డిస్తున్నాం. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.7.20 మాత్రమే చెల్లిస్తోంది. మాకు గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం ఇటీవల నూతన మెనూ ప్రకటించినా ధర మాత్రం పెంచలేదు. దీంతో ఇబ్బందులకు గురవుతున్నాం. నూతన మెనూ ప్రకారం రూ.9.40 చొప్పున చెల్లించాలని కోరుతున్నాం. – వసతి గృహాల కేటరింగ్ నిర్వాహకులు పరిహారం అందించండి ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరంతా మా ఇళ్లలోకి చేరింది. నిత్యావసర సరుకులతో పాటు ఇతర సామగ్రి పూర్తిగా తడిసి తీవ్రంగా నష్టపోయాం. అధికారులు సర్వే చేసి మా వివరాలు తీసుకున్నప్పటికీ ఎలాంటి పరిహారం అందలేదు. త్వరగా స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాం. – వరద బాధితులు, మహాలక్ష్మివాడ, ఆదిలాబాద్ మా ఇబ్బందులు గుర్తించండి మేమంతా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని పీహెచ్సీల పరిధిలో క్షేత్రసాయిలో పనిచేసే సీహెచ్వో, ఎంపీహెచ్ఈవో, పీహెచ్ఎన్, ఎంపీహెచ్ఎస్ ఉద్యోగులం. మాకు ఆధార్ బెస్డ్ అటెండెన్స్ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఒక్కో పీహెచ్సీ పరిధిలో 4నుంచి 5 సబ్సెంటర్లు ఉన్నాయి. పీహెచ్సీకి వెళ్లి అటెండె న్స్ నమోదు చేసి ఫీల్డ్కు వెళ్లాలంటే 40నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇది ఇబ్బందిగా మారుతుంది. మాకు ఆధార్ బేస్డ్ హాజరు నుంచి మినహా యించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు -
భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
ఆదిలాబాద్టౌన్: సైన్స్పై విజ్ఞానం పెంపొందించుకుని విద్యార్థులు భావితర శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా సైన్స్ అధికారి ఆరె భా స్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్లో గల సరస్వతి శిశుమందిర్లో విభాగ్ స్థాయి గణిత మేళా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, విద్యార్థులు సైన్స్లో రాణించేలా మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఇందులో విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి రఘురమణ, శిశుమందిర్ ప్రతినిధులు శ్రీనివాస్, బజరంగ్ అంగర్వాల్, హన్మాండ్లు, సుహాసినిరెడ్డి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆందోళన
కైలాస్నగర్: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధా నం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పెన్షన్ విద్రోహ దినంగా పాటించారు. నల్లబ్యాడ్జీలు ధరించి టీఎన్జీవోస్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. మెయిన్ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సంద అశోక్ మాట్లాడుతూ.. సీపీఎస్ అమలుతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఓపీఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మే నిఫెస్టోలో ప్రకటించిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో సెక్రెటరీ జనరల్ కె.శివకుమార్, కోచైర్మన్ కె.కిష్టన్న, జేఏసీ బాధ్యులు ఎ.నవీన్కుమార్, సోగాల సుదర్శన్, నవీన్ యాదవ్, బెజ్జంకి రవీంద్ర, లక్ష్మారెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్ ని ర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేశ్ మా ట్లాడుతూ ఏడేళ్ల క్రితం ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. గతంలో ఎకరాకు రూ.8లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ప్రస్తుతం భూమి విలువ పెరిగినందున పరిహారాన్ని రెట్టింపు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విషయాన్ని ప్రస్తావించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కిరణ్, మంజూల, స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
ఆదిలాబాద్టౌన్: ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వచ్చిన ప్రతీ ఫిర్యాదును స్వీకరిస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. స్థానిక పోలీ సు ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చి న 23 మంది ఎస్పీకి అర్జీలు సమర్పించారు. అనంతరం ఆయన సంబంధిత పోలీసు అధికా రులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా భూ సమస్యలు, కుటుంబ కలహాలు, కేసుల దర్యాప్తు, పురోగతి వంటివి ఉన్నాయి. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదు ల విభాగం అధికారి కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆకతాయిలపై షీటీం ప్రత్యేక దృష్టి మహిళల భద్రత కోసం షీటీం పనిచేస్తుందని, ఆకతాయిలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాత్రి సమయాల్లో ఆకతాయిలు మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. షీటీంలు రద్దీ ప్రదేశాల్లో సంచరిస్తూ మహిళలను వేధిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు పేర్కొన్నారు. యు వతులు, విద్యార్థినులు ఆపత్కాల సమయంలో 87126 59953 నంబర్పై షీటీంను సంప్రదించాలని సూచించారు. -
వేతనాలు చెల్లించాలని నిరసన
ఆదిలాబాద్టౌన్: రిమ్స్, సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం రిమ్స్ ఎదుట కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు నెలలుగా వేతనాలు అందక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే వేతన బకాయిల విడుదలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ కార్మికుల ఖాతాల్లో జమ చే యాలని డిమాండ్ చేశారు. అలాగే నూతన టెండర్లు పిలవాలని, కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించి అమలు చేయాలని పేర్కొన్నా రు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఇందులో సంఘం నాయకులు పొచ్చన్న, సుమన్, దశాంత్, కె.రమేశ్, రాజ మణి తదితరులు పాల్గొన్నారు. -
‘వేసవి’ పనులపై విచారణ
కైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో వేస వి నీటి ఎద్దడి నివారణకు రూ.37.73 లక్షలతో చేపట్టిన పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. సీజన్ ముగిసే క్ర మంలో పనులు చేపట్టడం, పారదర్శకత పాటించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు పనులు కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఇందులో భాగంగా రూ.18లక్షల స్ట్రీట్ వెండర్స్ షెడ్ల నిర్మాణ పనుల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్కు ఆ పనులు చేయకుండానే మరో టెండర్ అప్పగించడాన్ని అందులో ప్రస్తావించిన విష యం తెలిసిందే. ఈ పనుల్లో అక్రమాలపై కలెక్టర్ రాజర్షిషా ఇటీవల సీరియస్ అయ్యారు. విచా రణకు ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ ఏఈ రమేశ్ను విచారణ అధికారిగా నియమించారు. ఈ క్రమంలో ఏఈ సోమవారం మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగానికి చేరుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. పనుల ప్రగతి, అగ్రిమెంట్లు, ఎంబీ రికార్డులు వంటి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, మున్సిపల్ ఇంజినీర్ అందుబాటులో లేకపోవడంతో మరోసారి వచ్చి విచారణ చేస్తానని తెలిపారు. అనంతరం కలెక్టర్కు పూర్తిస్థాయి నివేదిక అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
జానపద సంబరాల్లో బాలకేంద్రం చిన్నారులు
ఆదిలాబాద్: హైదరాబాద్లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ప్ర పంచ జానపద దినోత్సవ సంబరాల్లో బాలకేంద్రం చిన్నారులు పాల్గొని ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భాషా సాంస్కృతిక శాఖ, సారిపెల్లి కొండలరావు ఫౌండేషన్, యువ కళావాహిని, రాష్ట్ర జానపద కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో చి న్నారులు ఎల్లమ్మ బోనాల పాటపై నర్తించి ఆకట్టుకున్నారు. వీరి ప్రదర్శనకు ముగ్ధులైన నిర్వాహకులు చిన్నారులు, బాలకేంద్రం శిక్షకుడు, సూపరింటెండెంట్ మిట్టు రవిని జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ.రమణాచారి, జానపద కళా కారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ శ్రీనివాస్గౌడ్, చుంచు లింగన్న, మహిళా విభాగం ప్రతినిధులు కవిత, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
‘స్వచ్ఛంద’ దందా
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అనధికార వ్యాపారానికి రంగం సిద్ధమవుతోంది. స్వచ్ఛంద సేవ ముసుగులో ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా షెడ్ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా ఆస్పత్రి ఆవరణలో ఎలాంటి వ్యాపార కార్యక్రమాలు నిర్వహించా లన్నా.. రిమ్స్ అధికారుల అనుమతి తప్పనిసరి. పోటీ ఉంటే టెండర్లు పిలిచి అర్హులైన వారికి కేటా యించాలి. అయితే ఇవేమి పాటించకుండా ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అక్రమంగా షెడ్ను ఏర్పా టు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఓ అధికారి మౌఖిక అనుమతితోనే తాను షెడ్ను ఏర్పాటు చేసినట్లు సదరు సంస్థ ప్రతినిధి ప్రచారం చేసుకుంటుండం గమనార్హం. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
ఎన్సీసీతో నాయకత్వ లక్షణాలు
ఆదిలాబాద్: ఎన్సీసీ శిక్షణతో విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవాడతాయని 32 తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ వీపీ సింగ్ అన్నారు. ఎన్సీసీ కేడెట్లకు ఆగస్టు 28న ప్రారంభమైన సంయుక్త వార్షిక శిక్షణ శిబిరం నాలుగో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆదివారం పోలీస్ శిక్షణ కేంద్రంతో పాటు, తలమడుగు మండలం సుంకిడిలో వారికి ఫైరింగ్పై శిక్షణ అందించారు. ఈ సందర్భంగా కల్నల్ మాట్లాడుతూ, శారీరక దృఢత్వం, వెపన్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, ఫైరింగ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ఈనెల 6వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇందులో రజిత, అశోక్, ప్రశాంత్, భూమన్న, ఆనందరావు, శ్రీనివాస్, వినోద్, స్వామి, రాజేశ్వరి, సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు. -
హాకీ అభివృద్ధికి కృషి
ఆదిలాబాద్: జిల్లాలో హాకీ క్రీడాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్రెడ్డి, కోరెడ్డి పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే చాలామంది హాకీ క్రీడాకారులు క్రీడా కోటాలో ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. ఎంపీ నగేశ్ సహకారంతో ఆస్ట్రో టర్ఫ్ మైదానం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అనంతరం సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ హాకీ జట్ల మధ్య స్నేహపూర్వక హాకీ పోటీలను నిర్వహించారు. అనంతరం క్రీడాకారులను అభినందించారు. ఇందులో అసోసియేషన్ కోశాధికారి డేవిడ్ రాజు, రవీందర్, అశోక్, శ్రీనివాస్, గోవింద్, శేఖర్, విజయ్, కిరణ్, అరుణ్, రామ్కుమార్, చిట్టి తదితరులు పాల్గొన్నారు. -
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
ఆదిలాబాద్టౌన్: నవరాత్రి ఉత్సవాలను ప్ర శాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పట్టణంలోని పలు గణపతి మండపాలను ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వజనిక్ గణేశ్మండలి, భుక్తాపూర్లోని శ్రీ సాయిరాజ్ గణేశ్మండలి, రిమ్స్లోని వినాయక మందిరం, ధోబి కాలనీ వద్ద గల గణపతి మండపాలను సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శోభాయాత్రను ప్రశాంత వాతా వ రణంలో పూర్తి చేసుకో వాలని సూచించారు. డీజే, లేజర్ లైట్లు, పేపర్లు చల్లే యంత్రాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఆయా మండపాల వద్ద గల పాయింట్ బుక్లను పరి శీలించారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్ కుమార్, కె.నాగరాజు, స్వామి, ఫణిధర్, పోలీస్ సిబ్బంది, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు హనుమండ్లు తదితరులున్నారు. -
నకిలీ దందా
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది. ఆదిలాబాద్టౌన్: బ్రాండెడ్ కంపెనీల వస్తువులను పోలిన నకిలీవి తయారు చేస్తూ కొందరు అందినకాడికి దండుకుంటున్నారు. తక్కువ ధరకు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి బ్రాండెడ్ కంపెనీ ధర కు ప్రజలకు అంటగడుతూ అక్రమ దందా సాగిస్తున్నారు. అదేలేబుల్ ఉండడంతో గుర్తుపట్టలేక జనం మోసపోతున్నారు. జిల్లాలో గతంలో నకిలీ చాయ్పత్తి, జండుబామ్, తదితర వస్తువులతో పాటు ఏటా నకిలీ విత్తనాలు, పురుగుల మందులు, ఇలా అనేక వస్తువులు విక్రయాలు జరుగుతున్నాయి. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలు స్తోంది. ఆదివారం ఇదే తరహా మోసానికి పాల్ప డిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘడి కంపెనీకి సంబంధించి నకిలీ డిటర్జంట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెచ్చిపోతున్న మోసగాళ్లు.. జిల్లాలో కొందరు వ్యాపారులు బ్రాండెడ్ పేర్లతో ఉన్న వాటిని నకిలీవి తయారు చేసి కిరాణ షాపులు, వారసంతలు, సూపర్ మార్కెట్లు, గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. ఆఫర్ పేరిట ఆకర్షిస్తుండడంతో ప్రజలు తక్కువ ధరకు వచ్చిందని కొనుగోలు చేస్తున్నారు. తీరా నకిలీ అని తేలడంతో లబోదిబోమంటున్నారు. గతంలో ఆదిలాబాద్ పట్టణంలో జెమిని చాయ్పత్తికి సంబంధించి నకిలీవి తయారు చేసిన ఘటనలో కేటుగాళ్లు పట్టుబడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి ప్యాకెట్పై ఉన్న ఎంఆర్పీకి, ఒక ప్యాకెట్ కొంటే మరో ప్యాకెట్ ఉచితం.. ఇలా విక్రయాలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఖరీఫ్ సీజన్లో నకిలీ విత్తనాలు తయారు చేసి రైతులకు విక్రయించడం ఏటా పరిపాటిగా మారింది. వీటిని కొనుగోలు చేసిన రైతులు అవి మొలకెత్తకపోవడంతో నష్టపోతున్నారు. ఈ సీజన్లో జిల్లా అధికారులు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కొరడా ఝుళిపించారు. పలువురిపై కేసులు నమోదు చేసి కటకటాలకు పంపించారు. బ్రాండెడ్ కంపెనీ పేరుతో.. బ్రాండెడ్ కంపెనీకి సంబంధించి నకిలీవి తయారు చేస్తూ కొందరు ఈ దందాకు పాల్పడుతున్నారు. ఆదిలాబాద్కు చెందిన రూపేష్ అగర్వాల్ మహా రాష్ట్రలోని అమరావతి నుంచి నకిలీ ఘడి డిటర్జంట్ తీసుకొచ్చాడు. ఈ సరుకును ఆదిలాబాద్, మహారా ష్ట్రలోని జివితి ప్రాంతంలో వ్యాపారులకు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టూటౌన్ పోలీసులకు సమాచారం అందగా తాంసి బస్టాండ్ వద్ద శనివారం దాడిచేసి బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో 60 బ్యాగుల్లో దాదాపు 15 క్వింటాళ్ల డిటర్జంట్ను సీజ్ చేశారు. నలుగురిపై కేసు నమోదు చేయగా, మహారాష్ట్రలోని చంద్రపూర్కు చెందిన శివాజీ ఎన్.జవాలే, జివితికి చెందిన రామ్రావు వన్కంటి ఇంగాలే, ఆదిలాబాద్ పట్టణంలోని రాణిసతీజి కాలనీకి చెందిన రూపేష్ అగర్వాల్ను అరెస్టు చేశారు. హమాలీవాడకు చెందిన అఫ్సర్ సలత్ పరారీలో ఉన్నాడు.పోలీసులకు సమాచారం అందించాలి ఎవరైనా నకిలీ వస్తువులు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఘడి నకిలీ డిటర్జంట్ను శనివారం మహారాష్ట్రకు తరలిస్తుండగా దాడిచేసి 15 క్వింటాళ్ల మేర సరుకును స్వాధీనం చేసుకున్నాం. ముగ్గురిని అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. – ఎల్.జీవన్రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ