breaking news
Adilabad District Latest News
-
సమష్టిగా సాగుదాం..
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో సమష్టిగా ముందుకు సాగి ఆదిలాబాద్ బల్దియా పీఠాన్ని కై వసం చేసుకుందామని కాంగ్రెస్ ముఖ్య నేతలు అభిప్రాయ పడ్డారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వారు మంగళవారం గండ్రత్ సుజాత నివాసంలో సమావేశం అయ్యారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడే వారికి, ప్రజల్లో బలమున్న వారికే టికెట్లు కేటాయించాలని అభిప్రాయ పడ్డారు. కాగా, ముఖ్య నేతలంతా విభేదాలు వీడి సమావేశం కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, నాయకులు సాజిద్ఖాన్, భోజారెడ్డి, సంజీవ్రెడ్డి పాల్గొన్నారు. -
కోడ్ కూసింది.. ఫ్లెక్సీ తొలగింది
మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో మోడల్ కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు బల్దియా సిబ్బంది రంగంలోకి దిగారు. పట్టణంలోని ప్రధానచౌక్లతో పాటు పలు కాలనీల్లో ఆయా రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలు, హోర్డింగ్లను తొలగించి వేశారు. కూడళ్లలో గల దివంగత రాజకీయ నాయకుల విగ్రహాలను ముసుగుతో కప్పివేశారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన హీలియం బెలూన్పై సీఎం, డిప్యూటీ సీఎం చిత్రాలు ఉండడంతో ఆ బెలూన్ను సైతం తొలగించేశారు. – కై లాస్నగర్/సాక్షి ఫొటోగ్రాఫర్,ఆదిలాబాద్ -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఆదిలాబాద్టౌన్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో సమావేశ మందిరంలో వైద్య సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. వారు మందులు వాడుతున్నారా.. లేదా అనే విషయాన్ని పరిశీలించాలని అన్నారు. ఎవరైనా లక్ష్యాలను సాధించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, ఎన్హెచ్ఎం డీపీవో దేవిదాస్, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ఆదిలాబాద్టౌన్: వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం సమ్మె చేప ట్టారు.యూనైటెడ్ ఫోరం ఆఫ్బ్యాంకింగ్ యూ నియన్ పిలుపు మేరకు శివాజీ చౌక్లోని ఎస్బీ ఐ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రీజినల్ కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ, 2023లో సమ్మె చేపట్టిన సమయంలో ప్రభుత్వం ఐదు రోజుల పని దినాలను అంగీకరించిందని అన్నారు. ప్రస్తుతం ఆ ఫైల్ కేంద్రం వద్ద ఉందని, మూడేళ్లుగా అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒకరోజు సమ్మె చేపట్టినట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కా కపోతే పూర్తిగా విధులు బహిష్కరిస్తామని స్ప ష్టం చేశారు. కార్యక్రమంలో బ్యాంకు యూని యన్ నాయకులు వినయ్కుమార్, రమేశ్, ప్రవీణ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, అడెల్లు, సుదర్శన్, అంకిత్ జాదవ్, పరమేశ్వర్, నాగరాజు, హరికిషన్, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల షెడ్యూల్
సాక్షి,ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల నగారా మో గింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చే సింది. గతంలో మాదిరే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో వీటన్నింటిని పూర్తి చేయనున్నారు. వార్డుల్లో కౌన్సిలర్లను ఎన్నుకున్న తర్వాత వారి ద్వారా ఫిబ్రవరి 16న చైర్ ప ర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు. మొత్తం 20 రోజుల్లో ప్రక్రియ ముగియనుంది. బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ఘట్టం మొదలు కానుంది. దీంతో ఒక్కసారిగా మున్సిపల్లో రాజకీయం వేడెక్కింది. టీటీడీసీలో నామినేషన్ల స్వీకరణ.. జిల్లా కేంద్రంలోని సాంకేతిక శిక్షణ, అభివృద్ధి కేంద్రం (టీటీడీసీ)లో ఆయా వార్డుల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం అఽ దికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతీ మూ డు వార్డులకు ఒక ఆర్వో చొప్పున 17 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలులో ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి కోసం హెల్ప్ డె స్క్ అందుబాటులో ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కూడా టీ టీడీసీలోనే నిర్వహించనున్నా రు. మరోవైపు సిబ్బందికి ఇ ప్పటికే శిక్షణ నిర్వహించారు. ‘కోడ్’ అమల్లోకి.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతోనే మోడల్ కోడ్ అమలులోకి వచ్చినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇది పట్టణ పరిధికి వర్తిస్తుంది. మున్సిపల్ యాక్ట్ 2019, బీఎన్ఎస్ ప్రకారం ఎన్నికల నిబంధనలు అమలు చేస్తున్నారు. ఎవరైనా రూ.50వేల నగదు వరకు తీసుకెళ్లవచ్చని, అంతకుమించి ఉంటే దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కోడ్ రాకతో పట్టణ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు బ్రేక్ పడనుంది. అలాగే సంక్షేమ పథకాల అమలు సైతం నిలిచిపోనుంది.నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ షురూ జనవరి 28 (బుధవారం) నామినేషన్ల స్వీకరణకు తుది గడువు జనవరి 30 (శుక్రవారం) పరిశీలన జనవరి 31 (శనివారం) స్క్రూటినీ తర్వాత అర్హులైన అభ్యర్థుల ప్రకటన జనవరి 31 (శనివారం) అభ్యంతరాల స్వీకరణ ఫిబ్రవరి 1 సాయంత్రం 5 వరకు పరిష్కారం ఫిబ్రవరి 2 సాయంత్రం 5 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 వరకు బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 తర్వాత పోలింగ్ ఫిబ్రవరి 11 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ (ఎక్కడైనా అవసరం పడితే) ఫిబ్రవరి 12 ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటల నుంచి..రిజర్వేషన్ వివరాలు..మొత్తం వార్డులు : 49 ఎస్టీ : 03 ఎస్సీ : 06 బీసీ : 15 మహిళ (జనరల్) : 13 అన్ రిజర్వుడ్ : 12 పోలింగ్ సంబంధిత వివరాలు.. బ్యాలెట్ బాక్సులు : 312 (అదనంగా 20 శాతం కలుపుకొని) రిటర్నింగ్ ఆఫీసర్లు : 20 (అదనంగా 20 శాతం కలుపుకొని) అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు : 96 (అదనంగా 20 శాతం కలుపుకొని) జోనల్ ఆఫీసర్లు : 15 ఫ్లయింగ్ స్క్వాడ్ : 12 ఎస్ఎస్టీఎస్ : 12 ప్రిసైడింగ్ ఆఫీసర్లు : 220 (అదనంగా 20 శాతం కలుపుకొని) ఓపీవోలు : 792 (అదనంగా 20 శాతం కలుపుకొని) పోలీస్ సిబ్బంది : 250 (అధికారులు కలుపుకొని) ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో.. మొత్తం ఓటర్లు 1,43,655 పురుషులు 69,813 మహిళలు 73,816 ఇతరులు 06 -
రంజాన్ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్నగర్: రంజాన్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి వివిధ శాఖల అధికారులు, మత పెద్దలతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. మసీదుల వద్ద వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, ఈద్గాల పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరాచాలన్నారు. తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని ఆదేశించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కలీమ్, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మసీదుల కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు. -
సైబర్ బాధితులకు అండగా పోలీసులు
ఆదిలాబాద్టౌన్: సైబర్ బాధితులకు జిల్లా పోలీసులు అండగా నిలుస్తున్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 2024 మార్చిలో సైబర్క్రైం బారినపడి రూ.2.45 లక్షల డబ్బులు పోగొట్టుకోగా, నిందితుడి ఖాతా ఫ్రీజ్ చేసి రూ.20వేలను కోర్టు అనుమతితో చెక్కు రూపంలో మంగళవారం బాధితుడికి తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సైబర్ క్రైమ్కు గురైన వారు సకాలంలో ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. పట్టణానికి చెందిన మహబూబ్ ఖాన్ సియాసత్ 2024 మార్చిలో తన మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నారని, ఆ మొబైల్ ఆధారంగా సైబర్ నిందితులు ఆయన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా గత నవంబర్ 2025 వరకు మొత్తం రూ.2.45 లక్షలు దుర్వినియోగం చేశారని తెలిపారు. సొంత అవసరాల నిమిత్తం బ్యాంకుకు వెళ్లినప్పుడు ఖాతా నుంచి డబ్బులు మాయమైన విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. బ్యాంకు అధికారుల సూచన మేరకు ఇది సైబర్ నేరమని గుర్తించి వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేశారని, దీంతో చివరగా మోసపోయిన మొత్తంలో రూ.20వేలను నిందితుడి ఖాతాలో ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సైబర్క్రైమ్ ఆర్ఎస్సై గోపీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి
ఉట్నూర్రూరల్: గిరిజనుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీవో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అర్హులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ ఆశ్రమాలు, గురుకులాల విద్యార్థులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. ఎకో టూరిజం శాఖ పరిధిలో కుంటాల, ఉట్నూర్ కోట, అడ ప్రాజెక్టు వద్ద అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం కేబీ కాంప్లెక్స్ క్రీడా మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు పలు సినీ, దేశభక్తి గీతాలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఐటీడీఏ పరిధి లో ఉద్యోగులకు బెస్ట్ అప్రిషియేషన్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏడుగురు దొంగల అరెస్ట్
బోథ్: మండలంలోని కౌఠ (బి) గ్రామ శివారులో వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు దొంగలను అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ డి.గురుస్వామి తెలిపారు. పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో పత్తి చేనుల్లో చోరీలకు పాల్పడుతున్న సుంకరి చిలకయ్య, ఎస్కే నాసిర్, మామిడి శ్రీనివాస్, అశోక్, రాజారాప దత్తు, ఎస్కే షాపితో పాటు దొంగ సరుకు కొనుగోలు చేసిన అల్లం చెందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 30 కిలోల పత్తి, సోలార్ ప్యానెల్, బ్యాటరీలతో పాటు చోరీకి ఉపయోగించిన బొలెరో మ్యాక్స్ వాహనం, రూ.9,600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రైతుల ఫిర్యాదు మేరకు ఐదు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. -
నలుగురికి ఎకై ్సజ్ ఎస్సైలుగా పదోన్నతి
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నలుగురికి ఎకై ్సజ్ ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎం.రాజేశ్వర్, ఆదిలాబాద్ డీపీఈఓ కా ర్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అరుణ్ కుమార్, నిర్మల్ జిల్లా ఎకై ్సజ్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న బి.ముత్యం, కుమురంభీం ఆసిఫాబాద్ డీపీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న డి.రా జశేఖర్కు ఎకై ్సజ్ ఎస్సైలుగా పదోన్నతులు లభించాయి. పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య ఆసిఫాబాద్రూరల్: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ వరప్రసాద్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని సింగరావుపేట్ గ్రామానికి చెందిన పోచయ్య (55) ఈ నెల 23న మధ్యాహ్నం ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో ముందుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. పత్తి దిగుబడి తగ్గిందనే దిగులుతోనే పురుగుల మందు తాగినట్లు భార్య కనకలక్ష్మి ఇచ్చిన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం ప్రతిజ్ఞ దిలావర్పూర్: మండలంలోని గుండంపల్లిని గ్రామస్తులు సోమవారం ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సంధర్భంగా సర్పంచ్ తక్కల రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధానికి ప్రతిజ్ఞ చేశారు. గతంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసి ప్లాస్టిక్, పేపర్ రహితానికి నాంది పలికామని సర్పంచ్ తెలిపారు. ఇదే బాటలో పేపర్ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాస్లు, క్యారీ బ్యాగులను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రపతి పతకానికి ఎంపిక మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్ పి.వెంకటరాములు రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 2026 సంవత్సరానికిగానూ భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాబితాలో వెంకటరాములు చోటు దక్కించుకున్నారు. అసాధారణ సేవలకు గుర్తింపుగా లభించిన ఈ అత్యున్నత పురస్కారంపై బెటాలియన్ అధికారులు, సిబ్బంది వెంకటరాములును ప్రత్యేకంగా అభినందించారు. -
బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ
బెల్లంపల్లి: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ సీఈఆర్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో బెల్లంపల్లి స్కైజిమ్కు చెందిన పలువురు బాడీ బిల్డర్లు పతకాలు సాధించారు. ఆదిలాబాద్ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో బెల్లంపల్లి స్కైజిమ్కు చెందిన జి.లక్ష్మణ్ (75 కిలోలు), జె.మొగిలి (80 కిలోలు), డి.ప్రశాంత్ (85 కిలోలు) ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. మాస్టర్స్ విభాగంలో పి.కృష్ణస్వామి (55 కిలోలు), తృతీయ బహుమతి, ఎం.రోహిత్ (60 కిలోలు) తృతీయ బహుమతి, జూనియర్స్ విభాగంలో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. జూనియర్స్ విభాగంలో మీర్జా హుమాయున్, ఎం.మహేష్, కె.నగేష్ ఐదోస్థానంలో నిలిచిట్లు స్కైజిమ్ నిర్వాహకులు పి.సదానందం, బాలకృష్ణ, చంద్రశేఖర్ తెలిపారు. -
ఆర్జీయూకేటీలో గణతంత్ర వేడుకలు
బాసర: బాసరలోని ఆర్జీయుకేటీలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు ఇచ్చిందన్నారు. యువత రాజ్యాంగ విలువలను ఆచరించడమే నిజమైన దేశసేవ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతికత, సామాజిక బాధ్యతలు అలవర్చుకోవాలని సూచించారు. పీయూసీ స్టడీ అవర్స్.. విద్యార్థుల ’పీయూసీ స్టడీ అవర్స్’ కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించి ప్రపంచ రికార్డు నెలకొల్పిందన్నారు. రాత్రిపూట 3,238 మంది పీయూసీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ విజయాన్ని సాధించారన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ, విద్యార్థులు దేశభక్తి, సామాజిక స్పృహతో దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. -
ఢిల్లీ వేడుకల్లో ఆదివాసీ నృత్య ప్రదర్శన
ఇచ్చోడ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆదివాసీ కళాకారుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివాసీ కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ ఆధ్వర్యంలో కళాకారులు రవ్వ చిట్టిబాబు, హరీష్, వినోద్, రమేశ్, సాయి, జయరాజు, ముత్తయ్య, నాగబాబు, కుమారి బేబీ, భద్రమ్మ, జ్యోతి, స్వప్న, శైలజ, అనిత, నాగమణి, ఇందు, సుస్మిత పాల్గొని ఆదివాసీ నృత్యం ప్రదర్శించారు. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ సుందర భాస్కర్ రవీంద్ర కుమార్ ఆహ్వానం మేరకు ఢిల్లీలో నృత్య ప్రదర్శన ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
సైగలతో నృత్యం చేసి..పియానో వాయించి
పియానో వాయిస్తున్న జంగుబాయిసైగలతో నృత్యం చేస్తున్న విద్యార్థులుఉట్నూర్రూరల్: వైకల్యం దేనికీ అడ్డుకాదని..పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని వికాసం దివ్యాంగుల ప్రత్యేక బాలబడి విద్యార్థులు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కేబీ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో డ్యాన్స్ ఉపాధ్యాయురాలు చేతులతో చేస్తున్న సైగలను చూసి నృత్య ప్రదర్శన చేశారు. మూడోతరగతి విద్యార్థిని జంగుబాయి వందేమాతరం గేయానికి పియానో వాయించి అందరినీ ఆకట్టుకుంది. సదరు విద్యార్థులను ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అభినందించారు. -
లీకేజీలే.. సమస్య
మున్సి ‘పల్స్’కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలో ప్రస్తుతం తాగునీటి ఇబ్బంది అంతగా లేనప్పటికీ లీకేజీలే ప్రధాన సమస్య. పైపులైన్లు, వాల్వ్ల వద్ద నిత్యం ఎక్కడో ఓ చోట లీకేజీలు ఏర్పడుతున్నాయి. సకాలంలో గుర్తించి మరమ్మతులు చేపట్టకపోవడంతో వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతుంది. అలాగే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక ఇళ్లలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నల్లాలకు ఆనాఫ్ బిరడాలు లేకపోవడంతోనూ నీరు వృథా అవుతుంది. పట్టణంలోని గాంధీనగర్, ఇందిరమ్మ కాలనీలోని కొంత భాగాలకు ఇప్పటికీ మిషన్ భగీరథ పైపులైన్లు పూర్తిస్థాయిలో చేరలేదు. విలీనమైన ఎంప్లాయీస్కాలనీ, తిరుమలనగర్, కృష్ణానగర్, అటెండెర్స్ కాలనీల్లో అసలు పైపులైన్లే వేయలేదు. దీంతో ఆయా వార్డుల్లోని ప్రజలు బోర్వెల్స్, చేతిపంపులపైనే ఆధారపడాల్సిన దుస్థితి. పట్టణంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అమృత్–2.0లో భాగంగా రూ.200 కోట్లు మంజూరు చేసినా ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వచ్చే వేసవిలోనూ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. మౌలిక వసతుల్లో కీలకమైన తాగునీటి సరఫరాలో తలెత్తే ఇబ్బందులు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతను మార్చనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.పట్టణంలో తాగునీటి సరఫరా వివరాలు మొత్తం పైపులైన్ : 424 (కిలోమీటర్లు) రిజర్వాయర్లు : 11 నిల్వ సంపు : 01 ప్రతిరోజు నీటి సరఫరా జరిగే వార్డులు : 25 రోజు విడిచిరోజు నీటి సరఫరా జరిగే వార్డులు : 24ఏడాదిగా నత్తనడకన సాగుతున్న అమృత్ రిజర్వాయర్ నిర్మాణ పనులు -
28 నుంచి క్రీడా సంబరాలు
కై లాస్నగర్: బోథ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఈనెల 28 నుంచి 30 వరకు ప్రేరణ పేరిట నిర్వహించనున్న జిల్లా స్థాయి క్రీడా సాంస్కృతిక సంబరాల పోస్టర్, లోగోను జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు, కలెక్టర్ రాజర్షిషా సోమవారం ఆవిష్కరించారు. పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా, సృజనాత్మక శక్తి వెలికితీసేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏడుగురు పోలీసులకు ‘అతిఉత్కృష్ట’ పతకాలుఆదిలాబాద్టౌన్: జిల్లా పో లీ సు శాఖలో పనిచేస్తున్న ఏ డుగురు పోలీసులకు రాష్ట్ర పోలీ సు శాఖ అతిఉత్కృష్ట సేవా ప తకాలు ప్రకటించింది. 2025 సంవత్సరంలో వారు అందించిన సేవలకు గాను ఈ పురస్కారాలు వరించాయి. జిల్లా కేంద్రంలోని పరేడ్ మై దానంలో సోమవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సదరు పోలీసులకు జిల్లా జడ్జి ప్ర భాకరరావు, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ చే తుల మీదుగా పతకాలు అందజేశారు. సేవా ప తకం అందుకున్న వారిలో ఆర్.ధారాసింగ్, గంగాసింగ్, సంజీవ్ కుమార్, సుధాకర్ రెడ్డి, జె. అర్జున్,శివాజీ, బి.శివన్న ఉన్నారు. సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలికై లాస్నగర్: సేంద్రియ విధానంలో సాగయ్యే ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలని కలెక్టర్ రా జర్షిషా అన్నారు. పట్టణంలోని కలెక్టర్చౌక్లో గల నేచరల్స్ కేంద్రంలో ఏర్పాటు చేసిన చెరు కు రసం మిషన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి, నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీల ధర్నాకు మద్దతుఆదిలాబాద్టౌన్: హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మంగళవారం చేపట్టనున్న ఎమ్మెల్సీల ధర్నాకు మద్దతు తెలుపుతున్నట్లు టీపీయూఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునిల్ కుమార్, వలభోజు గోపీకృష్ణ ప్రకటనలో తెలిపారు.విశ్రాంత ఉపాధ్యాయుల, ఉద్యో గుల పెండింగ్ బిల్లులు, పీఆర్సీ అమలు కోసం ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్కా కొముర య్య, అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. -
‘ప్రత్యేక’ పాలనకు ఏడాది
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రత్యేకాధికారి పాలన అమల్లోకి వచ్చి నేటితో సరిగ్గా ఏడాది. పాలకవర్గ గడువు గతేడాది జనవరి 26న ముగిసింది. ఎన్నికల ప్రక్రియ జరగకపోవడంతో ప్రత్యేకాధికారి పాలన అనివార్యమైంది. దీంతో గ్రేడ్–1 స్థాయి కలిగిన జిల్లాలోని ఏకై క మున్సిపాలిటీకి అప్పటి ఐటీడీఏ పీవో, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తాను ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా నియమించింది. అదే నెల 27న బాధ్యతలు స్వీకరించిన ఆమె సెప్టెంబర్ 18 వరకు స్పెషలాఫీసర్గా కొనసాగారు. ఏడు నెలల 21 రోజుల పాటు బల్దియా ప్రత్యేకాధికారిగా విధులు నిర్వహించినప్పటికీ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించకపోవడం గమనార్హం. బాధ్యతలు సైతం ఉట్నూర్లోనే స్వీకరించారు. అధికారులతో ఎలాంటి సమీక్షలు కూడా నిర్వహించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే సదరు అధికారి సెలవుపై వెళ్లడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న ఎస్.రాజేశ్వర్ను ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా నియమించింది. గతేడాది సెప్టెంబర్ 19న ఆయన స్పెషలాఫీసర్గా బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మున్సిపల్ కార్యాలయాన్ని రెగ్యులర్గా సందర్శిస్తున్నారు. అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ బల్దియాపై ఇంకా పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగానే బల్దియా వీధి దీపాల నిర్వహణ టెండర్లలో అక్రమాలు చోటు చేసుకుని రీటెండర్ నిర్వహణ వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై పర్యవేక్షణ కొరవడి గాడి తప్పినట్లుగా పట్టణవాసులు చర్చించుకుంటున్నారు. త్వరలోనే ఎన్నికల నగారా మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికకు త్వరలోనే నగారా మోగనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అవసరమైన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఎంపిక, బ్యాలెట్ బాక్స్లు వంటి వాటి ప్రక్రియ పూర్తి చేశారు. అలాగే స్థానికుడైన కమిషనర్ సీవీఎన్.రాజుకు స్థానచలనం కల్పించిన ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్త కమిషనర్ను నియమించింది. ఇదిలా ఉంటే త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలోపు ప్రక్రియను సైతం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చర్చ సాగుతోంది. ఇదే జరిగితే త్వరలోనే మున్సిపల్ నూతన పాలకవర్గం కొలువుదీరే అవకాశముంది. -
బీఆర్ఎస్కు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రాజీనామా
● ఏఐఎఫ్బీలో చేరిన రంగినేని మనిషాఆదిలాబాద్టౌన్: బీఆర్ఎస్కు రాజీనామా చేసినట్లు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనిషా పవన్రావ్ తెలిపారు. పట్టణంలోని ప్రింట్ మీడియా ప్రెస్క్లబ్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్లో గౌరవం లేని కారణంగా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)లో చేరినట్లు తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తనతో పాటు తన కుటుంబ సభ్యులు స్వార్థ రాజకీయాలకు బలైనట్లు పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆఖరి నిమిషం వరకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని నమ్మించి అవమానపర్చినప్పటికీ పార్టీలో కొనసాగినట్లు పేర్కొన్నారు. తా ను 2014 నుంచి 2019 వరకు మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశానని, పదవీ కాలంలో పార్టీ పెద్దలు కూడా అనేక ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ త రఫున మళ్లీ పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
కై లాస్నగర్: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని, దానిని తప్పనిసరిగా వినియోగించుకో వాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్సీసీ కేడెట్స్, విద్యార్థులతో స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి జెడ్పీ సమావేశ మందిరం వరకు ఓటరు చైతన్య ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జెడ్పీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రలోభాలకు గురై ఓటు వేస్తే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే నైతిక హక్కును కోల్పోతారన్నారు. అనంతరం సీనియర్, నూతన ఓటర్లను శాలువాలతో సత్కరించారు. ఫొటోలతో కూడిన ఎపిక్ కార్డులు అందజేశారు. అలాగే పలువురు అధికారులకు ప్ర శంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, డీఎస్పీ జీవన్రెడ్డి, డీఐఈవో జాదవ్ గణేశ్ పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలి ఉట్నూర్రూరల్: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విని యోగించుకోవాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలోని కుమురంభీం కాంప్లెక్స్ నుంచి పాత బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్ర జాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. ఇందులో తహసీల్దార్ ప్రవీణ్, సీఐ ప్రసాద్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. -
‘బీజేపీతోనే పట్టణాభివృద్ధి’
ఆదిలాబాద్: బీజేపీతోనే పట్టణ అభివృద్ధి సా ధ్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, వివేకానంద కాలనీ, అగ్రజా టౌన్షిప్లలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలు సుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడు తూ, రాజకీయాలకతీతంగా ఆదిలాబాద్ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అన్నివిధాలుగా కృషి చేస్తున్నామన్నారు. పట్టణ పరిధి లో ఇప్పటికే కోట్ల నిధులతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయ ని తెలిపారు. మున్సిపాలిటీలో బీజేపీ విజ యం సాధిస్తే మరిన్ని ప్రగతి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు స్వామిరెడ్డి, తిరుమలేష్, అడెల్లు, కాళి దాస్, సాయి, గోపి తదితరులున్నారు. -
వేతన వెతలు తీరేలా..
సాక్షి,ఆదిలాబాద్: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఇక వేతన ఇక్కట్లు తొలగిపోనున్నట్ల తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి వారి బ్యాంకు ఖాతాలకే నేరుగా వేతనాలు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రెగ్యులర్ ఉద్యోగుల వివరాలు ఉండే ఇంటిగ్రేడేట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం(ఐఎంఎఫ్ఎస్) పోర్టల్లో వీరి వివరాల నమోదు ప్రక్రియ ఇటీవల చేపట్టింది. ఒకవేళ ఇది అమలైతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ శాఖల్లో హెచ్వోడీలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఆ ఏజెన్సీలు పాల్పడుతున్న అక్రమాలకు చెక్ పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆయా శా ఖల హెచ్వోడీలు, ఏజెన్సీలు అందించే వేతనాల్లో కోత విధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతే కా కుండా వేతనాలు సైతం మూడు నుంచి ఆరు నెలల వరకు పెండింగ్లో పెట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా ఉద్యోగులు ఏళ్లుగా పోరా టం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో వారు చేపట్టిన ఆందోళనలతో ప్రభుత్వం ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారి పూర్తి వివరాలను ఇటీవల ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేసింది. తద్వారా ఈ ఉద్యోగులకు డైరెక్ట్గా వారి అకౌంట్లో ప్రతి నెల జీతం జమ చేసేలా చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. వెలుగులోకి పలు అక్రమాలు.. ప్రధానంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఆయా ఏజెన్సీలు ప్రతినెలా వారికి చెల్లించాల్సిన వేతనాల్లో భారీగా కోత పెట్టి ఇస్తున్నారనే ఆరోపణ లు ముందు నుంచి ఉన్నాయి. అంతే కాకుండా వారి కి సంబంధించి పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకపోవడంతో భద్రత లేకుండా పోతుందని ఆ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ఏజెన్సీలు జీఎస్టీ కూ డా చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండీ కొడుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. ఇటీవల ఐఎఫ్ఎంఎస్లో వివరాలు నమోదు చేసినప్పుడు ఔట్సోర్సింగ్ ప్రక్రియలో ఒకే వ్యక్తి పలు పోస్టుల్లో ఉన్నట్టుగా రాష్ట్ర పరిధిలో తేలింది. జిల్లాలోనూ ఓ వ్యక్తి నాలుగు పోస్టుల్లో చెలామణి అయినట్లు వెల్ల డెంది. ఐఎఫ్ఎంఎస్లో ఆధార్, ఫోన్నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలను నమోదు చేయడంతో ఇ లాంటివి వెలుగులోకి వచ్చాయి. అసలు ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వారు ఎవరు, ప్ర స్తుతం పనిచేస్తున్నాడా.. లేదా.. తొలగించిన పక్షంలో ఆ వివరాలు ప్రభుత్వ శాఖలకు అందజేస్తున్నారా.. మళ్లీ ఆ పోస్టులో అనుమతి తీసుకొనే వేరొకరిని నియమిస్తున్నారా.. ఇలాంటి అనేక అక్రమాలు ఈ ప్రక్రియలో ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఒక ఉద్యోగి వెళ్లిపోతే ఆ స్థానంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమ పద్ధతుల్లో వేరొకరిని నియమించడం వంటివి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలలో నిత్యం జరిగే తంతు. దీంతోనే ప్రభుత్వం ఈ వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.జిల్లాలోని ఉద్యోగుల వివరాలు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 2,000 కాంట్రాక్ట్ ఉద్యోగులు సుమారు 1000 -
ఎండీఎం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్టౌన్: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐతో పాటు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. త్వరలో నిర్వహించే మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములు, అనిత, సునిత, రుకుంబాయి, రాంబాయి తదితరులు పాల్గొన్నారు. -
● మున్సిపల్లో నిర్వహణ అస్తవ్యస్తం ● పలుకాలనీల్లో కనిపించని డ్రెయినేజీలు ● పత్తాలేని ‘అండర్గ్రౌండ్’ నిర్మాణం ● మొక్కుబడిగా ఇంటింటి చెత్త సేకరణ
కై లాస్నగర్: ప్రజలు ఆరోగ్యంగా జీవించాలంటే పారిశుద్ధ్య నిర్వహణ ఎంతో కీలకం. గ్రేడ్–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇది గాడి తప్పుతోంది. విలీన కాలనీలతో పాటు పలు పాత వార్డుల్లోనూ డ్రెయినేజీల నిర్మాణం జరుగకపోవడంతో మురుగునీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో ఆయా కాలనీల్లో దుర్గంధం వెదజల్లుతోంది. ప్రధానంగా వర్షాకాలంలో దోమల బెడద అధికమై ప్రజలు రోగాల బారిన పడాల్సి వస్తోంది. పారిశుద్ధ్య కార్మికులుగా నియామకమైన పలువురిని శుభ్రత పనుల్లో కాకుండా ఇతర చోట్ల నియమించారు. దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఏర్పడి ఆయా పనులపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్రెయినేజీల్లోని పూడిక తొలగింపు సకాలంలో జరగకపోగా, ఇంటింటి చెత్త సేకరణ సైతం సక్రమంగా చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెగ్యులర్గా చెత్తబండ్లు రాకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపంతో పలు కాలనీల్లో అనధికార చెత్తడంపులు దర్శనమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద కోట్లాది రూపాయలను అండర్గ్రౌండ్ డ్రెయినేజీ కోసం మంజూరు చేయగా ఆ పనుల జాడ లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో పారిశుద్ధ్య నిర్వహణ అంశం సైతం ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. మున్సి ‘పల్స్’ -
చట్టాలపై అవగాహన అవసరం
ఆదిలాబాద్: బాలికల రక్షణ కోసం చేసిన చ ట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా జడ్జి ప్రభాకరరావు అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఐపీ స్టేడియంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. బాలికల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. వారి కోసం చట్టాలతో పాటు ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేశాయన్నారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, న్యాయమూర్తులు లక్ష్మీకుమారి, హుస్సేన్, తేజస్విని, దివ్యవాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్, పీపీలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో మానసిక ప్రశాంతత క్రీడలతో మానసిక ప్రశాంతత చేకూరుతుంద ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకరరావు అన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మా ట్లాడారు. పనిఒత్తిడిని దూరం చేసేందుకు క్రీడ లు ఎంతగానో దోహదపడతాయన్నారు.ఇందు లో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
తొందరపాటుతోనే ప్రమాదాలు
నేను 1991లో ఉద్యోగంలో జాయిన్అయ్యా. ఇన్ని సంవత్సరాలుగా ప్రమాదాలు లేకుండా నడపడానికి ప్రధాన కారణం వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవడమే. ఈ రోజుల్లో వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాల ని ప్రతి ఒక్కరూ వేగంగా వెళ్తున్నారు. ఈ తొందరపాటుతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని బస్సు ను నడిపితే ప్రయాణికులంతా సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకుంటారు. ఇదే విషయాన్ని ఆలోచనలో పెట్టుకొని నేను డ్రైవింగ్ చేస్తాను. – జి. గబ్బర్సింగ్, ఉట్నూర్ డిపో తల్లి ఒడిలా భావిస్తా..2016లో ఉద్యోగంలో చేరాను. ఆర్టీసీ ప్ర యాణం సుఖప్రదం– సురక్షితం అనే సంస్థ నినాదాన్ని పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నా. క్రమశిక్షణగా, ఏకాగ్రతతో నడిపితే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు. బస్సు స్టీరింగ్ పట్టింది మొదలు నేను చేసే ఉద్యోగాన్ని బతుకుదెరువుగా కాకుండా, బాధ్యతగా అనుకుంటాను. బస్సును తల్లి ఒడిలా భావించి, ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకి చేర్చడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. – భాస్కర్, ఆసిఫాబాద్ డిపో -
జిల్లా జైలు సూపరింటెండెంట్గా గోపిరెడ్డి బాధ్యతలు
ఆదిలాబాద్టౌన్: జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్కుమార్ నిజామాబాద్కు బదిలీ అ య్యారు. ఆయన స్థానంలో వరంగల్ జిల్లా జైలర్గా పని చేస్తున్న పందిరి గోపిరెడ్డిని ఆదిలాబాద్కు ని యమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. బదిలీ అయిన, విధుల్లో చేరి న అధికారులను జైలు ఉద్యోగులు, సిబ్బంది సత్కరించారు. కాగా నాలుగున్నరేళ్ల పాటు ఇ క్కడ పనిచేసిన అశోక్కుమార్ జిల్లా జైలులో అ నేక సంస్కరణలు అమలు చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. ఖైదీల ఆదాయం పెంపుతో పా టు వారిలో సత్ప్రవర్తన అలవర్చుకునేలా ప్ర త్యేక శ్రద్ధ వహించారు. విద్యు త్ ఆదా చేసేలా ప్రత్యేకంగా సోలార్ ప్యానెల్ ప్రాజెక్ట్, వాహనాల వాషింగ్ యూనిట్, పెట్రోల్ బంక్ వంటివి ఏర్పాటు చేయించారు. ఇలా అనేక కార్యక్రమాలను అమలు చేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. -
గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్కు ‘తొడసం’
ఆదిలాబాద్రూరల్: గోండి, కొలామి భాషల పరిరక్షణకు కృషి చేస్తున్న మావల మండలం వాఘపూర్ గ్రామానికి చెందిన గిరిజన ఉపాధ్యాయుడు తొడ సం కై లాస్కు రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు ల భించింది. తాజాగా ఆయన కృషికి గాను గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్కు ఎంపికయ్యారు. అంతేకా కుండా ఢిల్లీలో ఈ నెల 26న ఎర్రకోటలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ప్రసా ర భారతి నుంచి ఆహ్వానం అందింది. అయితేహైద రాబాద్లో జరిగే వేడుకల్లో తన తరఫున తన కుమారుడు సృజన్రామ్ అవార్డును అందుకోనున్నారు. అంతరించిపోతున్న భాష పరిరక్షణకు కృషి అంతరించిపోతున్న గోండి, కొలామి భాషల పరిరక్షణకు కై లాస్ తనవంతు కృషి చేస్తున్నాడు. ఏఐ ఉపయోగించి రోబోటిక్ టెక్నాలజీ కంప్యూటర్ ద్వారా యాంకర్ను తయారు చేసి గోండి భాషలో వార్తలు చదివించడంతో పాటు గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబాడా భాషల్లో వందలాది పాటలను రాసి ఏఐలో పొందుపరిచాడు. ఆది వాసీలకు మహాభారత గ్రంథాన్ని అందించాలనే ఉద్దేశంతో తెలుగు లిపి ద్వారా గోండి భాషలో అనువాదించాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన ప్రవత్తి సంగీతం. ఆదివాసీ భాషలను కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ సర్కారు బడుల్లో కష్టపడి చదివి ఉపాధ్యాయ కొ లువును సాధించాడు. విద్యార్థులతో పాటు ఆదివా సీ గిరిజన యువతను ప్రోత్సహిస్తున్నాడు. గతంలో మన్కీబాత్లో ప్రధాని మోదీ కై లాస్ను ప్రశంసించిన విషయం తెలిసిందే. -
రిమ్స్లో ‘ఎన్ఎంసీ’ తనిఖీలు
ఆదిలాబాద్టౌన్: రిమ్స్ మెడికల్ కళాశాలలో నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) బృందం సభ్యులు శనివారం తనిఖీలు చేపట్టారు. కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు 120 నుంచి 150కి పెంచాలని రిమ్స్ అధికారులు ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కౌన్సిల్ సభ్యులు నాగమోహన్, చంద్రశేఖర్ తనిఖీలు నిర్వహించారు. ల్యాబ్తో పాటు ఆయా వార్డులు, బ్లడ్ బ్యాంక్, సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్ విభాగాలు, ఎస్ఎన్సీయూ, లేబర్ రూం, ఓపీ, ఐపీ విభా గాలను పరిశీలించారు. అనంతరం రిమ్స్లో పనిచేస్తున్న వైద్యుల హాజరుపై ఆరా తీశారు. వీరి వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ సూపరింటెండెంట్లు దీపక్, నరేందర్ బండారి, ఎన్ఎంసీ నోడల్ అధికారి ప్రశాంత్రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు విద్యా విల్సన్, సరోజ, అసిస్టెంట్ డైరెక్టర్లు సిరాజ్ అలీ, వేణుగోపాల్ రెడ్డి తదితరులున్నారు. -
బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
కైలాస్నగర్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలా బాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసే లా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పార్టీ పా ర్లమెంట్ ఇన్చార్జి, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్రెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రజాసేవాభవన్లో శని వారం పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావే శం నిర్వహించారు. ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా పరిశీలకులు తాహెర్ బిన్ హందాన్తో కలిసి సమావేశం నిర్వహించిన ఆయన ఎన్నికల్లో అనుసరించాల్సిన కా ర్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ వారితో మమేకం కా వాలన్నారు. గెలిచే అభ్యర్థులకే పార్టీ టికెట్లు దక్కుతాయని స్పష్టం చేశారు. ఎవరికి టికెట్ వచ్చిన సమన్వయంతో బాధ్యతతో పనిచేయాలన్నారు. అంతకు ముందు జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, బోథ్ అసెంబ్లీ ఇన్చార్జి ఆడే గజేందర్, ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక హబ్గా ఆదిలాబాద్ కై లాస్నగర్: ఆదిలాబాద్ను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్ది, తద్వారా స్థానిక యువతకు భారీ గా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అన్నారు. జిల్లాలో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేస్తామ ని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం ఆయన జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టర్ రాజర్షి షాతో సమావేశమయ్యారు. జిల్లాను పారిశ్రామికపరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ఈమేరకు అవసరమైన భూమిని గుర్తించాలన్నారు. పారిశ్రామికవేత్తల ను ప్రోత్సహించేలా, ఇండస్ట్రీయల్ పార్కుకు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ అనుమతులను సత్వరమే మంజూరు చేయాలన్నదే ముఖ్య మంత్రి ఉద్దేశమని తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ పూలమొక్క అందజేసి కలెక్టర్ స్వాగతం పలికారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ తదితరులున్నారు. -
అంతర్గతం.. అధ్వానం
మున్సి ‘పల్స్’కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ గ్రేడ్–1 స్థాయికి ఎదిగినా వసతుల పరంగా ఇంకా వెనుకబడే ఉంది. పాలకులు మారుతున్నారే తప్ప వార్డుల్లో సౌకర్యాలు మాత్రం ఇప్పటికీ అంతంతే. రహదారుల విషయానికి వస్తే ప్రధాన రోడ్లను బీటీ, సీసీగా మార్చినప్పటికీ అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగానే ఉంది. పట్టణంలోని పలు కాలనీల్లో పూర్తిస్థాయిలో రోడ్ల నిర్మాణాలు జరగలేదు. ఆర్ఆర్ నగర్, కృష్ణానగర్, గాంధీనగర్, రణదీవేనగర్, భగత్సింగ్నగర్తో పాటు విలీన కాలనీలైన అటెండర్స్కాలనీ, తిరుమలనగర్, ఎంప్లాయీస్ కాలనీ, టైలర్స్కాలనీ, గ్రీన్సిటీ, సంజయ్నగర్, న్యూ హౌసింగ్బోర్డు వంటి అనేక కాలనీల్లో ఇప్పటికీ మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. ఎత్తు, పల్లాలతో కూడిన దారిపై స్థానికులకు తిప్పలు తప్పడం లేదు. త్వరలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచే అభ్యర్థులకు ఈ అంశం సవాలుగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మున్సిపల్ పరిధిలో రహదారుల విస్తీర్ణం (కిలోమీటర్లలో) పట్టణంలో మొత్తం రోడ్లు 546.77 బీటీ 43.52 సీసీ 313.80 గ్రావెల్ 189.45 -
ఆ చేతిలో స్టీరింగ్.. సురక్షితం
రోడ్డు ప్రమాదాలు నిత్య కృత్యమైన ఈ రోజుల్లో దశాబ్దాలుగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్న వీరు మాత్రం ప్రమాదాలకు దూరంగా ఉంటున్నారు. లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. డ్రైవింగ్ అంటే ఉద్యోగం మాత్రమే కాదని, బాధ్యతాయుతమైన కర్తవ్యం అని పునఃనిర్వచిస్తున్నారు. ఉద్యోగంలో చేరింది మొదలు, ఇప్పటివరకు ఒక్క ప్రమాదం కూడా జరగకుండా అప్రమత్తంగా వాహనాన్ని నడిపి డ్రైవర్లందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అలాంటి వారిలో కొందరిపై ఓ లుక్కెద్దామా మరి. – ఆదిలాబాద్ -
మనస్సును నియంత్రించుకోవాలి..
నేను 1994లో ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమాదరహితంగా బస్సును నడుపుతున్నాను. డ్యూటీలోకి ఎక్కిన తర్వాత డ్రైవింగ్పై మాత్రమే దృష్టి సారించాలి. అప్పుడే వాహనం మన పూర్తి నియంత్రణలో ఉంటుంది. భావోద్వేగా లు లేకుండా, ఓపికతో మన మనస్సును నియంత్రించుకోవాలి. మూడు దశాబ్దాల నా విధి నిర్వహణలో నేను నేర్చుకున్న విషయం ఇదే. ఈ లక్షణమే నాకు మంచి డ్రైవర్ అనే గుర్తింపునిచ్చింది. – ఎండి. యూసుఫ్, మంచిర్యాల డిపో అన్నింటినీ గమనించాలి..నేను ఉద్యోగంలో చేరి 31 ఏళ్లు దాటింది. డ్యూటీ ఎక్కగానే ముందుగా బస్సు కు సంబంధించిన అన్ని భాగాలు సరిగా ఉన్నాయో లేవో సరి చూసుకుంటాను. స్టీరింగ్ మీదికి వచ్చిన తర్వాత మరోసారి కండిషన్ చెక్ చేసుకుంటాను. రోడ్డు పైకి వెళ్లగానే మన వా హనాన్ని కాకుండా చుట్టూ ఉన్న అన్ని వాహనాల వేగం కదలికలను గమనిస్తూ ఉండాలి. అదే సమయంలో భద్రతా నియమాలు పాటించాలి. అప్పు డే ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇతర వాహనదారులు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. – జి. మణి, మంచిర్యాల డిపో -
ఆర్టీసీ భద్రతకు మారుపేరు
● ఆర్ఎం భవానిప్రసాద్ఆదిలాబాద్: ఆర్టీసీ భద్రతకు మారుపేరని రీజినల్ మేనేజర్ ఎస్.భవానీప్రసాద్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో గ్యారేజీలో శుక్రవారం ఏర్పాటు చేసిన డ్రైవర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, మానవ తప్పిదాలతోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆదిలాబాద్ రీ జియన్ రాష్ట్రంలోని అన్ని రీజియన్ల కంటే ఆదాయంలో ముందు స్థానంలో ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంవీఐ హరిందర్ కుమార్, డిప్యూటీ ఆర్ఎంలు రామయ్య, శ్రీహర్ష, అధికారులు రమేశ్, జి బ్లా, పండరి, హరిప్రసాద్, రాజశేఖర్, శ్రీనివాస్, రా జేందర్, రాజశేఖర్, శ్రీకర్ పాల్గొన్నారు. -
బాసరలో భక్తుల అస్వస్థత
బాసర : వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ క్షేత్ర దర్శన క్యూలైన్లో నిలబడిన ఓ భక్తుడు అస్వస్థతక గురయ్యాడు. వెంటనే స్పందించిన హోంగార్డులు అతడిని సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. మంచిర్యాలకు చెందిన సిద్ధం తిరుపతి కుటుంబ సభ్యులతో కలిసి బాసర అమ్మవారి దర్శనానికి వచ్చారు. క్యూలైన్లో నిల్చున్నప్పుడు ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో హోమ్ గార్డులు ఇంద్రకరణ్డ్డి, గణేశ్, నారాయణ తక్షణం స్పందించి తిరుపతికి సీపీఆర్ చేశారు. ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడే ఉన్న వైద్యులు వచ్చి పరిశీలించారు. అనంతరం 108లో ఆసుపత్రికి తరలించారు. స్పృహ తప్పిన భక్తురాలు.. ఇక అమ్మవారి దర్శనానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ భక్తురాలు క్యూలైన్లోనే కళ్లుతిరిగి పడిపోయారు. సుమారు 3 గంటలు క్యూలో నిలబడి స్పహ తప్పారు. సీసీ సాయిలు, కానిస్టేబుల్ రాము ఆలయ ఈవో అంజనా దేవికి సమాచారం ఇచ్చా రు. 108 అంబులెన్స్లో చికిత్సకు తీసుకెళ్లారు. బాసర మండలం మైలాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు అవస్థకు గురయ్యారు. ఏఎస్సైలు సాయికిరణ్, గణేశ్, సాయికుమార్, ఆర్ఎస్సైలు స్పందించి 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. -
సరస్వతీ నమస్తుభ్యం
బాసర: జ్ఞానసరస్వతీదేవి పుట్టిన రోజు అయిన మా ఘ శుద్ధ పంచమిని వసంత పంచమిగా నిర్వహిస్తా రు. శుక్రవారం వసంత పంచమి కావడంతో నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి వేలమంది అమ్మవారి దర్శనం, చిన్నారుల అక్షరాభ్యాస పూజల కోసం వచ్చారు. గురువారం అర్ధరాత్రి దాటిన వెంటనే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో స్నానఘట్టాలు నిండిపోయాయి. దర్శనానికి 4 గంటల సమయం..వెకువజామున 2 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీ రారు. అమ్మవారి దర్శనానికి 4 గంటల సమ యం పట్టింది. ఇక చాలా మంది భక్తులు బాసరకు పాదయాత్రగా వచ్చారు. వీరిని సిబ్బంది ప్రత్యేకంగా మండపాలకు మళ్లించారు. గంగమ్మతల్లి, సూర్యేశ్వరస్వామి, కాళీమాత వ్యాసగుహవద్దకూడా భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక అలంకరణవసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతీ దేవి ఆలయాన్ని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తె ల్ల్లవారుజామున 1:30 నుంచే జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవారులకు అభిషేకం, మంగళ వాయిద్య, సుప్రభాత, కుంకుమార్చనలు జరిగాయి. వైదిక బృందం అంకురార్పణ చేసింది. అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ పట్టు వస్త్రాలుదేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దర్శనం తర్వాత ఆలయ అధికారులు ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తుందని, గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్ల మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుందని తెలిపారు. నిర్మల్, ముధోల్ ఎమ్మెల్యేలు, భైంసా సబ్ కలెక్టర్, ఈవోలు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రాముఖులు..నిర్మల్ జిల్లా జడ్జి శ్రీవాణి, నిర్మల్, ముధోల్ ఎమ్మెల్యేలు మహేశ్వర్డ్డి, రామారావు పటేల్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, భైంసా సబ్కలెక్టర్ అజ్మీర్ సంకేత్ కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. పటిష్ట పోలీస్ బందోబస్తువసంత పంచమి నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సీ జానకీషర్మిల తెలిపారు. ఏఎస్పీలు రాజేశ్మీనా, సాయికిరణ్పాటు 8 మంది సీఐలు, 22 మంది ఎస్సైలు, ముగ్గురు మహిళా ఎస్సైలు, 15 మంది ఏఎస్సైలు, 340 మంది పోలీసులు, మంది మహిళా సిబ్బంది, 64 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. ఆదాయం రూ.56.38 లక్షలుబాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. వివిధ ఆర్జిత సేవల టికెట్ల విక్రయంతో మొత్తం రూ.56,38,275 వచ్చింది. 6,325 చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించినట్లు ఈవో అంజనాదేవి తెలిపారు. టికెట్లవారీగా ఆదాయ వివరాలు.. సేవ రకం ధర విక్రయించిన ఆదాయం అక్షరాభ్యాస పూజ 1,000 3,850 38,50,000 అక్షరాభ్యాస పూజ 150 2,475 3,71,250 ప్రత్యేక దర్శనం 100 5,770 5,77,000 లడ్డూ ప్రసాదం 25 23,771 5,94,275 పులిహోర ప్రసాదం 20 12,300 2,46,000 -
దత్తత కేసులో అరెస్టు
లక్సెట్టిపేట: చిన్నారి అక్రమ దత్తత కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రమణామూర్తి, ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామంలో తిరుపతి, కళావతి దంపతులకు సంతానం లేదు. మంచిర్యాలలోని తీగల్పహడ్కు చెందిన విజయలక్ష్మి, సూరారం గ్రామానికి చెందిన స్వరూపలు తొమ్మిది నెలల క్రితం ఓ చిన్నారిని అక్రమంగా తీసుకువచ్చి ఆ దంపతులకు ఇచ్చారు. ఈ విషయమై ఫిర్యాదు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పిల్లలు లేని దంపతుల నుంచి విజయలక్ష్మి, స్వరూప డబ్బులు వసూళ్లు చేసి చిన్నారిని అప్పగించినట్లు విచారణలో వెల్లడైంది. దత్తత నిబంధనలు పాటించకపోవడంతో దంపతులపై కేసు నమోదు చేశారు. చిన్నారిని అక్రమంగా తీసుకువచ్చిన విజయలక్ష్మి స్వరూపను శుక్రవారం రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. ఇద్దరిని పట్టుకోవడం కృషిచేసిన పోలీసులు శ్రీకాంత్, మల్లేశ్, సత్యనారాయణ, మురళి, ప్రవళికను అభినందించారు. -
ఘనంగా ‘బేతల్’
ఇంద్రవెల్లి: ఈనెల 18న మహాపూజతో కేస్లాపూర్లో నాగోబా జాతరను ప్రారంభించిన మెస్రం వంశీయులు శుక్రవారం గోవడ్ వద్ద బేతల్ అనంతరం సంప్రదాయ పూజలు ముగించారు. ముందుగా వంశపెద్దలు సంప్రదాయ వాయిద్యాల మధ్య గోవడ్కు చేరుకున్నారు. మహిళలు, భేటింగ్ అయిన కొత్త కోడళ్లు వారి ఆశీర్వదం తీసుకున్నారు. పర్ధాన్ కితకు చెందిన వారికి కానుకలు అందించారు. అనంతరం వంశ పెద్దలు ప్రదర్శించిన బేతల్ నృత్యాలు ఆకట్టుకున్నాయి. సతీదేవత ఆలయం ద్వారా కానుకల రూపంలో ఈ సారి రూ.1,01,780 వచ్చినట్లు ఆలయ పీఠాధిపతి వెంకట్రావ్ తెలిపారు. మహాపూజకు తీసుకొచ్చిన కొత్త కుండలను కితల వారీగా మెస్రం వంశీయులకు పంపిణీ చేశారు. సంప్రదాయ పూజలు ముగించిన వంశీయులు రాత్రి ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ ఆలయానికి బయలుదేరారు. ఈ నెల 25న అక్కడి ఆలయంలో పూజలు చేసి జాతర ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో వంశ పెద్దలు బాదిరావ్పటేల్, కోసు కటోడ, కోసేరావ్, దాదారావ్, తిరుపతి, తదితరులున్నారు. కొనసాగుతున్న జాతర కేస్లాపూర్లో నాగోబా జాతర కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శుక్రవారం గంటల తరబడి క్యూలో నిల్చొని నాగోబాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకొని మెస్రం వంశీయులు తమ చిన్నారులకు ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసం చేయించారు. ఈనెల 25 వరకు అధికారికంగా జాతర కొనసాగుతుందని ఈవో ముక్త రవి తెలిపారు. -
కలెక్టర్ కుమార్తెకు అక్షరాభ్యాసం
నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ వేకువజామునే కుటుంబ సమేతంగా సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు కలెక్టర్కు ప్రత్యేక స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానికి ముందు కలెక్టర్ తన కుమార్తెకు ఆలయ మండపంలో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం కలెక్టర్ ఆలయ క్యూలైన్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి, దర్శన ఏర్పాట్లపై ఆరా తీశారు. చిన్న పిల్లలతో వచ్చే భక్తులకు పాలు, తాగునీరు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. -
ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి
కాగజ్నగర్రూరల్: మండలంలోని భట్టుపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన రామగోని భవాని(13) మృతి చెందింది. రూరల్ ఎస్సై సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం భవాని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి తరలించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి పంపించారు. ప రీక్షించిన వైద్యులు మెదడుకు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కాగా, భవాని తండ్రి సారంగం గతంలోనే ఓ ప్రమాదంలో మృతిచెందాడు. ఆమె తల్లి రూప కూలీ పని చేస్తూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. పెద్దకూతురు భవాని స్థానిక జెడ్పీఎస్ఎస్లో 8వ తరగతి చదువుతుండగా, చిన్న కూతురు వైష్ణవి ఐదో తరగతి చదువుతోంది. భవాని మృతితో భట్టుపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతురాలి బాబాయి సంతోష్గౌడ్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ గూర్లె భీంరావుపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
ఆక్సిటోసిన్ ఇంజక్షన్ల పట్టివేత
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలో తరలిస్తున్న నిషే ధిత ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను టూటౌన్ పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు అక్రమంగా రవాణా చేయగా, పోలీసులకు వచ్చిన సమాచారంతో స్థానిక బస్టాండ్ వద్ద పార్శిల్ ద్వారా వచ్చిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో109ఆక్సిటోసిన్ ఇంజక్షన్ వాయి ల్స్ ఉన్నట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. బిహార్కు చెందిన వ్యక్తి తలమడుగు మండలంలోని దేవా పూర్ సమీపంలోని ఓ డెయిరీఫామ్లో పనిచేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి వీటిని తెప్పించి నట్లు అనుమానిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యా క్సిన్లపై రాష్ట్రంలో నిషేధం ఉండగా, పశువుల పాల శాతం పెంపు కోసం వీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇంజక్షన్లతో పశువుల ప్రాణాలతో పాటు వాటి పాలు తాగే ప్రజల ప్రాణాలకు సైతం హాని కలుగుతుందని వివరించారు. స్వాధీనం చేసుకున్న ఇంజక్షన్లను డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలతకు అప్పగించినట్లు పే ర్కొన్నారు. ఆమె వాటి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. నిర్ధారణ అయితే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
సరస్వతీ నమస్తుభ్యం
వసంత పంచమి సందర్భంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఘనంగా ‘బేతల్’ ఈనెల 18న మహాపూజతో నాగోబా జాతరను ప్రారంభించిన మెస్రం వంశీయులు శుక్రవారం బేతల్తో సంప్రదాయ పూజలు ముగించారు. శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026మున్సిపల్ కమిషనర్గా బాధ్యతల స్వీకరణకైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్గా జి.రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా తగు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. సాత్నాల: మండలంలోని జున్నపాని నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో గల జామిని పాఠశాలకు కాలినడకన వెళ్తున్న విద్యార్థులు ఆదిలాబాద్టౌన్: పేద విద్యార్థులు చదువుకోసం పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. కొన్ని గ్రామాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు లేకపోవడం, చాలాచోట్ల ఉన్నత పాఠశాలలు లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తూ విద్యనభ్యసిస్తున్నారు. ఇందుకోసం వారు చేస్తున్న ప్రయాణం నరకయాతనగా మారుతోంది. మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో విద్యార్థులకు కాలినడకే దిక్కవుతోంది. మరికొంత మంది ఆటోలు, జీపులు, సైకిళ్లపై ఇబ్బందుల నడుమ వెళ్తున్నారు. పలు ప్రాంతాల్లో బస్సులు నడిచినా ఫుల్లుగా నిండి ఉండటం, స్టాపుల్లో ఆపకపోవడంతో చిన్నారులు పాఠశాలకు ఆలస్యంగా చేరుకుంటున్నారు. అలాగే ఫుట్బోర్డు ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. శుక్రవారం ‘సాక్షి’ ఆయా గ్రామాల్లో పాఠశాలకు వెళ్లే విద్యార్థులను పరిశీలించగా.. వారి అవస్థలు దర్శనమిచ్చాయి. ఇదీ పరిస్థితి.. విద్యార్థులకు తప్పని తిప్పలుసర్కారు బడికి వెళ్లేందుకు విద్యార్థులకు తిప్పలు తప్పట్లేదు. కిలోమీటర్ల దూరమైనా కాలినడకే దిక్కవుతోంది. చిట్టి పాదాలు కందిపోతున్నా కనికరించే వారే కరువవుతున్నారు. రోడ్లున్నా కొన్నిరూట్లలో సరిపడా బస్సులు రాని పరిస్థితి. దీంతో కిక్కిరిసి వెళ్లాల్సిన దుస్థితి. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితికి అద్దం పడుతున్న చిత్రాలివి. -
పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి
ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 49 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, నాయకులు క్రాంతి, రాజు, మాధవరావు, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. -
వెయిట్ అండ్ సీ!
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌసింగ్బోర్డుకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు తన సతీమణిని వార్డు నుంచి బరిలోకి దించుతానని, ఆమెకు చైర్పర్సన్ పదవీ ఇస్తామని పార్టీ ఒప్పుకుంటే మిగతా కౌన్సిలర్ల ఖర్చు మొత్తం భరిస్తామని ఓ ముఖ్య నేతను రెండు రోజుల క్రితం సంప్రదించారు. అయితే ఆ నేత నుంచి ఇప్పటివరకు సమాధానం రాలేదు. దీంతో ఆ ముఖ్యనేత మనోగతం ఎలా ఉందోననే చర్చ ఆ పార్టీలో సాగుతుంది. ఇది ఓ పార్టీకి సంబంధించిన వ్యవహారమైనప్పటికీ ఆదిలాబాద్ మున్సిపల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల నుంచి చైర్పర్సన్ స్థానాన్ని పలువురు ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ మహిళ జనరల్ కావడంతో ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్టీ పరంగా పలువురు ఈ పదవీని ఆశిస్తున్నారు. కొద్ది రోజుల కిందటి వరకు చైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో ఉంటుందా అనే చర్చ సాగింది. దీంతో పలువురు బడాబాబులు బరిలోకి దిగుతామనే సంకేతాలు ఇచ్చారు. తీరా పరోక్ష పద్ధతిలోనే ఎన్నిక ఉంటుందని తేలిపోవడం, మరోవైపు మహిళా రిజర్వేషన్ ఖరారు కావడంతో వారంతా వెనక్కి తగ్గారు. అయినప్పటికీ ప్రధాన పార్టీలు చైర్ పర్సన్ అవకాశం ఇస్తే ఆ పార్టీకి సంబంధించి పోటీ చేసే ప్రతీ కౌన్సిలర్ ఖర్చు భరిస్తామనే ఆఫర్లతో ముఖ్య నేతలను ఆశ్రయిస్తున్నారు. మనోగతం ఏంటో.. ఇలా పలువురు ఆ హామీ విషయంలో ముఖ్య నేతలను ఆశ్రయిస్తుండగా, వారు మాత్రం తమ మనోగతం వెల్లడించడం లేదు. వెయిట్ అండ్ సీ అనే ధోరణీలో ముందుకు సాగుతుండడంతో ఆంతర్యం ఏమై ఉంటుందా అనే చర్చా పార్టీల్లో సాగుతుంది. ప్రధానంగా బీజేపీలో ఓ ముఖ్య నేత కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలోకి దించుతారనే ప్రచారం సాగుతుంది. దీంతోనే ఎవరైనా ఆఫర్తో ముందుకొస్తే ఎలాంటి హామీ ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్లో ఓ ముఖ్య నేత సతీమణిని బరిలోకి దించుతారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. అయితే ఇప్పుడే ప్రజల్లోకి ఆ విషయాన్ని వెల్లడించకుండా జాగ్రత్త వహిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆ విషయంలో పబ్లిక్గా వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ముఖ్య నేతలకు అతి దగ్గరగా ఉండే కొంత మంది నాయకుల వద్దే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టుగా సమాచారం. నోటిఫికేషన్పై ఆరా.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఆయా పార్టీల కార్యకర్తలు ఆరా తీస్తుండటం కనిపిస్తుంది. ఇప్పటికే వార్డులు, చైర్పర్సన్ రిజర్వేషన్ సైతం ఖరారు కావడంతో ప్రస్తుతం ఆ అంశం చుట్టే రాజకీయ చర్చా సాగుతుంది. గతంలో బీఆర్ఎస్ నుంచి చైర్ పర్సన్గా వ్యవహరించిన ఓ నేత ఈసారి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తన సొంత టీమ్తో అన్ని వార్డుల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీజేపీలో మాత్రం ముఖ్య నేతల కుటుంబ సభ్యులను తప్పనిసరి బరిలోకి దించడం ద్వారా చైర్ పర్సన్ పదవీపై ఫోకస్ పెట్టారనే ప్రచారం సాగుతుంది. -
‘సీసీఐ భూములను అమ్ముకునే ఆలోచన’
ఆదిలాబాద్టౌన్: కాంగ్రెస్, బీజేపీ నాయకులు జిల్లా అభివృద్ధిని విస్మరించి సీసీఐ భూములను అమ్ముకునే ఆలోచన చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ పట్టణ స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే శంకర్ ఎయిర్పోర్టు నిర్మాణం అంటూ మోసపూరిత ప్రకటనలు చేయడం ఆపి పర్మిషన్ లెటర్ చూపించాలని సవాలు విసిరిరారు. సీసీఐ భూములను అమ్ముకోవడంపై ఉన్న చిత్తశుద్ధి పట్టణ అభివృద్ధిపై లేదన్నారు. అనంతరం పలువురు పార్టీలో చేరగా వారికి ఆయన కండువాలు కప్పి స్వాగతించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు మనోహర్, ప్రహ్లాద్, సోజిదొద్దీన్, శివ తదితరులు పాల్గొన్నారు. -
‘అట్రాసిటీ’ విచారణ వేగవంతం చేయాలి
కై లాస్నగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. మండలాల వారీగా నమోదైన కేసులు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసు నమోదైన వెంటనే దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారాన్ని జాప్యం లేకుండా వారి ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, కేసుల విచారణలో ఎలాంటి జాప్యం లేకుండా చూస్తున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత కుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఆర్డీవో స్రవంతి, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ నిర్వహణను జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షిషా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ పాత, కొత్త కమిషనర్లు సీవీఎన్ రాజు, జి.రాజు తదితరులు ఉన్నారు. అభివృద్ధి పనులపై సమీక్ష.. కొరటా–చనాఖా ప్రాజెక్ట్ భూసేకరణ, రైల్వే ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణాలపై సంబంధిత అధికా రులతో కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ రాజర్షిషా సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందులో ఇరిగేషన్ ఈఈ విఠల్, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, విద్యుత్ శాఖ ఎస్ఈ జాదవ్ శేష్రావు, సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.కై లాస్నగర్: జిల్లాలో క్షయ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీబీ నియంత్రణపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతేడాది జిల్లాలో 31,232 నాట్ పరీక్షలు నిర్వహించగా 1,689 పాజిటివ్గా నిర్ధారణ జరిగిందన్నారు. ఇందులో 1,326 మందికి చికిత్స అందించినట్లు తెలిపారు. అలాగే పౌష్టికాహారం నిమిత్తం 7,500 ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 13 గ్రామ పంచాయతీలను ‘టీబీ రహిత గ్రామాలు‘గా ప్రకటించామన్నారు. రెండు వారాల దగ్గు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం వ్యాధి జయించిన పలువురిని శాలువాతో సన్మానించారు. అలాగే వ్యాధి నిర్మూలనకు కృషి చేసిన అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, సిబ్బందికి నిక్షయ్ మిత్ర ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, క్షయ నివారణ అధికారి సుమలత, డీఐవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీశాఖతోనే ఇబ్బందులు
అటవీశాఖ అనుమతులివ్వక ఇందిరమ్మ ఇళ్లు, రోడ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. ప్రతిపక్షంతో కాదు.. అటవీశాఖతోనే పోరాటం చేయాల్సి వస్తోంది. రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. దండారీ డబ్బులు రూ.1.50 కోట్లు విడుదల చేయాలి. ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులివ్వాలి. ప్రజాప్రభుత్వం ఏర్పాటులో ఆదివాసీల పాత్ర కీలకం. పోడు భూములకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. – వెడ్మ బొజ్జు పటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే అటవీ సమస్యలు పరిష్కరించాలి గిరిజన ప్రాంతంలో అటవీశాఖ అధికారులతో ఆదివాసీ గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ, పీఎం ఆవాస్ యోజన కింద మంజూరైన ఇండ్లు ఆగిపోయాయి. రోడ్లకు అనుమతులు లేక పనులు అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. రోడ్డు సౌకర్యం లేక గర్భిణులు అవస్థలు పడుతున్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే దర్బార్ సమస్యలు పరిష్కరిస్తాం దర్బార్లో తెలిపిన సమస్యలు పరిష్కరిస్తాం. త్వ రలోనే రుణాలు అందించేలా చర్యలు చేపడతా ం. ఉట్నూర్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పా ఠశాల ఏర్పాటుకు డిప్యూటీ సీఎం శంకుస్థాప న చేశారు. పోడు భూముల పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలో 16,405 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.156 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఆదిలాబాద్ జిల్లా పదో స్థానంలో ఉంది. – రాజర్షి షా, కలెక్టర్ -
డిప్యూటీ సీఎం వస్తారని..
శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026డిప్యూటీ సీఎంను కలిసిన ‘కంది’కై లాస్నగర్: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వి క్రమార్కను కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవ ర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి బుధవారం రా త్రి ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ భవనంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. నియోజకవర్గ స్థితిగతులు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధత గురించి చర్చించారు. ఆదిలాబాద్టౌన్/ఇంద్రవెల్లి: గిరిజనుల సంస్కృతి గొప్పదని, గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా జాతరలో భాగంగా గురువారం గిరిజన దర్బార్ నిర్వహించగా మంత్రి హాజరయ్యారు. నాగోబా ఆ లయ కమిటీ సభ్యులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గిరిజన దర్బార్లో ప్రసంగించారు. గత ప్రభుత్వం నాగోబా ఆలయాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. సమ్మక్క–సారలమ్మ జాతరల అభివృద్ధికి రూ.250 కో ట్లు కేటాయించి శాశ్వ త నిర్మాణాలు చేపట్టిందని పేర్కొన్నారు. నా గోబా ఆలయాభివృద్ధికి రూ.22 కోట్లు త్వ రలో విడుదల చేస్తామని హా మీ ఇచ్చారు. అటవీ పరిధిలోని గిరిజను సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. చట్టాలను గౌరవించాలని, అటవీశాఖ అధికారులు చిన్నపాటి పొరపాటు చేసినా వారి ఉద్యోగాలకు ముప్పు వస్తుందని తెలిపారు. ఏడుగురు నాగోబా ఆలయ పూజారులకు ధూపదీప నైవేద్యం కింద వేతనాలు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తొమ్మిది మందికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఐ టీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎస్పీ అఖిల్ మ హాజన్, అదనపు ఎస్పీలు కాజల్సింగ్, మౌనిక, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆయా శాఖ ల అధికారులు, గిరిజన సంఘాల నా యకులు, నాగోబా ఆలయ కమిటీ చైర్మ న్ మెస్రం ఆనంద్రావు, ఆలయ పీఠాధి పతి మెస్రం వెంకట్రావు, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారాం, మెస్రం వంశ పెద్దలు మెస్రం కోసేరావు, హన్మంత్రావు, దాదారావు, మెస్రం వంశ ఉద్యోగులు మెస్రం శేఖర్బాబు, మెస్రం దేవ్రావు, మనోహర్, సోనేరావు తదితరులున్నారు. దర్బార్లో వినతుల వెల్లువ గిరిజన దర్బార్లో తొమ్మిది తెగల గిరిజనులు ఆయా సమస్యలపై మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ రాజర్షిషాకు వినతిపత్రాలు అందజేశారు. ప్రధానంగా అటవీశా ఖ అధికారులపైనే ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రోడ్ల నిర్మాణాలకు అనుమతులివ్వడం లేదని తెలిపారు. పాదయాత్రగా వచ్చి న గిరిజనులు దర్బార్ ఎదుట నిరసన తెలుపగా ఖా నాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వారిని సముదాయించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ తోపాటుపలు ఆదివాసీ సంఘాల నాయకులు మా ట్లాడుతూ.. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొ లగించే అంశంపై సుప్రీం కోర్టుకు నిరా ధారమైన అఫిడవిట్ అందించారని ఆరో పించారు. గిరిజన శాఖ ప్రిన్సిపల్ సెక్రట రీ సభ్యసాచి ఘోష్ను ఆ ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గిరి జన యూనివర్సిటీని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యే క డీఎస్సీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని, జిల్లా కేంద్రంలో ఉంటున్నవారికి సర్వే నంబర్ 72లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు నాగోబా జాతరకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఎటుచూసినా జాతర ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. గిరిజన దర్బార్ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గుస్సాడీ నృత్యాలు, చిన్నారుల ఆటాపాటలు అలరించాయి. భద్రాచలం నుంచి వచ్చిన గిరి జనులు కొమ్ము నృత్యం చేశారు. మహారాష్ట్ర, మ ధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివా సీ గిరిజనులు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టు కున్నాయి. వైద్యశిబిరం నిర్వహించి అవసరమైనవారికి చికిత్స, మందులు అందించారు. నూతన నియామకంబోథ్: తెలంగాణ మన స మాఖ్య పార్టీ జిల్లా ఇన్చా ర్జిగా నల్ల చంద్రకాంత్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అశోక్ నియామక ఉ త్తర్వులు జారీ చేశారు. తన పై నమ్మకంతో పదవి కట్టబెట్టిన జాతీయ అ ధ్యక్షుడు అశోక్కు చంద్రకాంత్రెడ్డి ఈ సందర్భంగా కతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రతీ గ్రామానికి చేరవేసి పటిష్టానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. నేడు నాగోబాకు కవిత పూజలుకై లాస్నగర్: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నిర్వహిస్తున్న నాగోబా జాతరకు మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం హాజరుకానున్నారు. ఆలయ కమి టీ ఆహ్వానం మేరకు ఆమె రానున్నట్లు జాగృతి నాయకులు రంగినేని శ్రీనివాస్, అసపు ప్రమోద్ తెలిపారు. నాగోబాను దర్శించుకుని ఆలయంలో పూజలు చేస్తారని పేర్కొన్నారు. గిరిజన దర్బార్కు ఉప ముఖ్య మంత్రి మల్లుభట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరవుతారని ప్రచారం జరిగింది. బుధవారం రాత్రి కేస్లాపూర్కు చేరుకున్న ఉపముఖ్యమంత్రి నాగోబాను దర్శించుకున్నారు. గురువారం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. దర్బార్కు హాజరవుతారని అందరూ భావించినా ఆయన ఆసిఫాబాద్ పర్యటనకు వెళ్లిపోయారు. మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి కూడా వస్తారని అనుకున్నా ఒక్క అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాత్రమే హాజరయ్యారు. -
ఇంటివద్దకే మేడారం ప్రసాదం
ఆదిలాబాద్: మేడారం మహాజాతరకు వెళ్లలేని భక్తులకు కార్గో ద్వారా ఇంటివద్దకే ప్రసాదం పంపించనున్నట్లు ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. https:// Tgsrtclogictics. co. in ద్వారా లేదా కార్గో కౌంటర్లలో రూ.299 చెల్లించి బుక్ చేసుకోవా లని సూచించారు. పూర్తి వివరాలకు 91542 98531, 9154298553, 9154298533 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో లాజిస్టిక్స్ (కార్గో) రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సాయన్న, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అన్సారీ, డీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
లెక్క చెప్పాల్సిందే..
కైలాస్నగర్: జిల్లాలో ఇటీవల మూడు విడతల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఖర్చు వివరాలు విధిగా ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు గతేడాది డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో నిర్వహించారు. నిబంధనల మేరకు పోటీ చేసిన సమయం నుంచి 45రోజుల్లోగా ఎంపీడీవో కార్యాలయంలో వివరాలు ఇవ్వాల్సి ఉండగా చాలామంది అభ్యర్థులు ఇంకా ఇవ్వలేదు. సమీపిస్తున్న గడువు జిల్లాలో 473 గ్రామపంచాయతీలకు సర్పంచులు గా 833 మంది, 3,870 వార్డులకు 6,258 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. తొలివిడత ఎన్నికల్లో పో టీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయం వివరాలు అందించే గడువు ఈనెల 24తో ముగియనుంది. రెండో విడత అభ్యర్థులు ఈనెల 27, మూడో విడత అభ్యర్థులు ఈనెల 30లోపు అందించాల్సి ఉంది. ఐదువేల లోపు జనాభా ఉన్న గ్రామపంచా యతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50లక్షలు, వా ర్డు అభ్యర్థులు రూ.30వేలు, ఐదువేల జనాభాకు మించి ఉంటే సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50లక్షలు, వార్డు అభ్యర్థులు రూ.50వేల వరకు మాత్రమే ప్ర చార ఖర్చు చేయాల్సి ఉంది. నిర్ణీత గడువు సమీపిస్తున్నా జిల్లాలోని చాలామంది అభ్యర్థులు వివరా లు అందజేయలేదు. గడువులోపు ఇవ్వకుంటే పదవిలో ఉన్నవారు అనర్హతకు గురికానున్నారు. ఓట మి పాలైన అభ్యర్థులు భవిష్యత్లో మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశముండదు. తప్పకుండా వివరాలివ్వాలి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి తన ప్రచార వ్యయ వివరాలు అందించాలి. గడువు సమీపిస్తున్నందున బ్యాంక్ ఖాతాల ఆధారంగా వివరాలు ఎంపీడీవోకు ఇవ్వాలి. లేకుంటే భవిష్యత్లో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయే అవకాశముంది. – జీ రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ ముందుకుసాగుతుందని ఆదిలాబా ద్ జిల్లా పరిశీలకుడు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పేర్కొన్నారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆశావహుల జాబితాను పరిశీలించి హైకమాండ్ ఆదేశానుసారం మూడు దశల్లో సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 26వరకు సర్వే నివేదిక వస్తుందని, సర్వే ఆధారంగా గెలిచే సత్తా ఉన్న వారికే పార్టీ బీ ఫాంలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మున్సిపల్ పీఠం కై వసం చేసుకోవడమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీతోనే తమకు పోటీ ఉంటుందని తెలిపారు. 250 మందికి పైగా పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, అర్చన రామ్కుమార్, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, నాయకులు లోక ప్రవీణ్రెడ్డి, గుడిపల్లి నగేశ్, మునిగెల నర్సింగ్, సుఖేందర్, ఎంఏ షకీల్, డేరా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్నగర్: ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకల ఏర్పాట్లు, బోథ్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో నిర్వహించనున్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ పరేడ్ మైదా నంలో వేదిక నిర్మాణం, టెంట్లు, సీటింగ్, పబ్లిక్ అ డ్రస్ సిస్టమ్, ఇతర ఏర్పాట్లు పక్కగా ఉండాలని తె లిపారు. స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, వి ద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించా రు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉ ద్యోగుల జాబితాను పారదర్శకంగా రూపొందించి, ప్రశంసాపత్రాల పంపిణీకి సిద్ధం చేయాలని సూ చించారు. ప్రగతి నివేదికలను శాఖలవారీగా అధికా రులు శుక్రవారంలోపు డీపీఆర్వో కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. బోథ్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో పర్యాటక శాఖ స్పాన్సర్ షిప్తో నిర్వహించనున్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్ట ర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, ము న్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తదితరులున్నారు. -
● ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ● దేవ్గూడలో విస్తృత పర్యటన
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంఉట్నూర్రూరల్: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం మండలంలోని దేవ్గూడ గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం, ప్రీ స్కూల్ విద్యా సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, నిధుల విడుదల, మౌలిక వసతుల కల్పన విషయాల్లో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేబీ కాంప్లెక్స్లో భట్టికి పలువురు వినతిపత్రాలు అందజేశా రు. ఆయన వెంట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్, జీసీసీ చైర్మన్ తిరుపతి కోట్నాక్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
‘బల్దియాపై జెండా ఎగురవేస్తాం’
ఆదిలాబాద్టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ధీమా వ్యక్తం చేశారు. గురువారం జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ కమిటీ సమావేశంలో మున్సిపల్ ఎన్నిక ల నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హ యాంలోనే పట్టణాభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు హా మీల అమలులో విఫలమయ్యాయని ఆరోపించారు. ‘బాకీ కార్డు’తో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తూప్రచారం నిర్వహించాలని సూచించారు. ఏడాదికి ఐదువేల ఉద్యోగాల హామీ ఏమైందని ఆదిలా బాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ క్యాలెండర్ ఆవిష్కరించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్, పార్టీ పట్టణాధ్యక్షుడు అజయ్, నాయకులు యాసం నర్సింగరావు, సాజిదొద్దీన్, ప్రహ్లాద్, రమేశ్, స్వరూపారాణి, పర్వీన్ తదితరులున్నారు. -
ముగిసిన కబడ్డీ పోటీలు
కై లాస్నగర్(బేల): బేల మండలంలోని సదల్పూర్ భైరందేవ్ జాతర పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారం పాటు నిర్వహించిన కబడ్డీ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఆలయ ప్రాంగణంలో రాత్రి నిర్వహించిన ముగింపు పోటీల అనంతరం విజేత జట్లకు బహుమతి ప్రదానం చేశారు. సోన్కాస్ జట్టు (ప్రథమ), పోహర్ గ్రామ జట్టు(ద్వితీయ), సదల్పూర్ జట్టు తృతీయ, మెహన్రావుగూడ (నాలుగో) బహుమతులు కై వసం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొరంగే శ్యామ్రావు, సామ రూపేశ్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు సిడాం కుషాల్రావు, సర్పంచులు మంగేష్, గంభీర్, అవినాష్, శంకర్, బాపురావు, జంగు, జితేందర్, కన్యరాజు, నయన్, సతీష్, రవీందర్ పాల్గొన్నారు. -
ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి
ఉట్నూర్రూరల్/బోథ్: ఆదివాసీల సమస్యల పరి ష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన బుధవారం మండలానికి విచ్చేశారు. దంతన్పల్లి, కొలంగూడతో పాటు కు మ్మరితండాలో పర్యటించారు. దంతన్పల్లిలో లింగంపెల్లి తారమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇప్పటివరకు జిల్లాకు రూ.150 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. అనంతరం కొలంగూడకు చేరుకున్నారు. కుమురం సూరు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, గిరిజనుల ఆత్మగౌరవం కోసం పాటుపడిన సూరు త్యాగాలను కొనియాడారు. గిరిజనులకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆర్వోఎఫ్ఆర్ పట్టాల సమస్యను సమగ్రంగా పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా సౌర జలగిరి వికాస పథకం ద్వారా గిరిజన భూములకు సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని వివరించారు. నాణ్యమైన విద్యే లక్ష్యం మండలంలోని కుమ్మరితండాలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ట్రైకా ర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తేజవత్తో కలిసి బు ధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆదివాసీ పిల్లలకు నాణ్యమైన, అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అనంతరం రూ.13కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు భూమి పూజ చేశారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నగదు బదిలీ ద్వారా ఇప్పటివరకు రూ.1,21,874 కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. చికుమాన్, పులిమడుగు త్రివేణి సంగమం ప్రాజెక్టుల ను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అ నంతరం గిరిజన దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్ టాప్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యుత్శాఖ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, అనిల్ జాద వ్, కలెక్టర్ రాజర్షి షా,ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అలాగే బోథ్ మండలంలో ని పట్నాపూర్లో నిర్మించతలపెట్టిన విద్యుత్ సబ్స్టేషన్కు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. నేడు దర్బార్.. ఏర్పాట్లు పూర్తి ఇంద్రవెల్లి: నాగోబా జాతరలో భాగంగా నేడు నిర్వహించే దర్బార్కు అధికారులు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశారు. ఆదివాసీల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజావాణి నిర్వహణతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుచేశారు. దర్బార్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు హాజరుకానున్నారు. -
పోడియంల తొలగింపు
కై లాస్నగర్: రిజిస్ట్రేషన్ల శాఖలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు సంస్కరణలను అమలు చేస్తోంది. రిజిస్ట్రేషన్లకు ఈ సైన్ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా కొనసాగుతున్న రాచరిక పోకడలకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఇందుకోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కోర్టుల తరహాలో ఉన్న పోడియం(గద్దె)లను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర కమిషనర్ రాజీవ్గాంధీ హనుమంత్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. వాటికి అనుగుణంగా ఆదిలాబాద్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలోని జాయింట్–1, జాయింట్– 2 సబ్రిజిస్ట్రార్లకు ఉన్న పోడియంను తొలగించారు. బారికేడ్ల మాదిరిగా ఉన్న వాటిని తీసివేశారు. కార్యాలయ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహించేలా సాధారణ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా బోథ్లో ఇటీవలే నూతన భవనం నిర్మించగా అక్కడ పోడియం వంటివి ఏర్పాటు చేయలేదు. సబ్ రిజిస్ట్రార్లు ఉద్యోగులతో కలిసి సమానంగా విధులు నిర్వహించడం ద్వారా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడి పనులు సకాలంలో పూర్తి చేసేందుకు అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే అవినీతి, అక్రమాలకు సైతం అడ్డుకట్ట పడనుందనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లుగా ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
‘ఉపాధి’ పథకం పేరు మార్పు సరికాదు
కై లాస్నగర్: అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేదలకు లబ్ధి చేకూర్చే మ హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్ముని పేరు తొలగించడం సరి కాదని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్ర పంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్మాగాంధీ పేరు ఈ పథకానికి ఉండటం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని, ఆయన పేరు తొలగింపు ద్వారా కలిగిన లాభమేంటని ప్రశ్నించారు. ఈనెల 26న ప్రతీ గ్రామ పంచా యతీలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. తీర్మాన ప్ర తులను రాష్ట్రపతికి పంపిస్తామని వెల్లడించా రు. అనంతరం కరపత్రాలు విడుదల చేశారు. ఇందులో పార్టీ నాయకులు సుజాత, సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి, శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు -
ఉత్సాహంగా సీఎం కప్ టోర్నీ
ఆదిలాబాద్: క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సీఎం కప్ పోటీలను ప్రారంభించింది. ఈ ఏడాది రెండో ఎడిషన్ పోటీలను నిర్వహిస్తోంది. ఈనెల 17నుంచి గ్రామ పంచాయతీ స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఐదు స్థాయిల్లో.. ఈ పోటీలను ఐదు స్థాయిల్లో నిర్వహిస్తున్నారు. గ్రా మపంచాయతీ, మండల/మున్సిపాలిటీ, నియోజ కవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో జరగనున్నాయి. పంచాయతీ స్థాయిలో ఈనెల 17 నుంచి 26 వరకు, మండల, మున్సిపాలిటీ స్థాయిలో ఈనెల 28 నుంచి 31వరకు పోటీలు నిర్వహించనున్నారు. ఇక నియోజకవర్గ స్థాయి పోటీలు ఫిబ్రవరి 3 నుంచి 5వరకు, జిల్లా స్థాయి పోటీలు 9 నుంచి 12వరకు జరగనుండగా, ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను 20 నుంచి 23వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీలను ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా నిర్వహిస్తారు. తేదీల వారీగా మండలాల్లో.. ఈనెల 28న ఆదిలాబాద్రూరల్, భోరజ్, జైనథ్, బేల, సాత్నాల మండలాల్లో, 29న ఆదిలాబాద్ ము న్సిపాలిటీ, తాంసి, తలమడుగు, భీంపూర్, గాది గూడ మండలాల్లో పోటీలు ఉండనున్నాయి. 30న మావల, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో, 31న ఇచ్చోడ, సిరికొండ, నేరడిగొండ, బోథ్, బజార్హత్నూర్, సొనాల మండలాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడాంశాల్లో.. పంచాయతీ స్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా పోటీలు నిర్వహిస్తున్నా రు. మండల, మున్సిపల్, నియోజకవర్గ స్థాయిలో గ్రామస్థాయితోపాటు చెస్, కరాటే పోటీలు అదనంగా ఉంటాయి. జిల్లాస్థాయిలో వీటితో పాటు బ్యా డ్మింటన్, బేస్బాల్, బాస్కెట్ బాల్, రెజ్లింగ్, సాఫ్ట్బాల్, నెట్బాల్, వుషూ, జూడో, బాల్ బాడ్మింటన్, సైక్లింగ్, స్విమ్మింగ్, తైక్వాండో, క్యారమ్, హాకీ, బా క్సింగ్, కిక్ బాక్సింగ్, పారాగేమ్స్లలో పోటీలు ఉంటాయి. రాష్ట్రస్థాయిలో జిల్లా స్థాయిలోని క్రీడలతో పాటు జిమ్నాస్టిక్స్, పవర్ లిఫ్టింగ్, స్కె టింగ్, ఆర్చ రీ, ఆత్యాపాత్య,బిలియర్డ్స్అండ్ స్నూకర్, కనోయింగ్, కయాకింగ్,ఫెన్సింగ్, లాన్టెన్నీస్,మల్లఖంబం, పికిల్బాల్ వంటి క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయి. అర్హులు వీరే.. సబ్ జూనియర్ స్థాయి నుంచి జూనియర్, సీనియర్ విభాగాల్లో బాల బాలికలు, మహిళలు, పురుషులు పాల్గొనేందుకు అవకాశం ఉంది. అండర్–14 నుంచి అండర్–23 వరకు, సీనియర్ స్థాయిలో పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ విధానం.. ఆసక్తి, అర్హత గల క్రీడాకారులు సీఎం కప్ పోటీల్లో పాల్గొనేందుకు సీఎం కప్ మొబైల్ యాప్ ద్వారా, https:// satg. telangana. gov. in/ cmcup వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పకడ్బందీగా పోటీల నిర్వహణ పోటీలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే గ్రామస్థాయిలో క్రీడా పోటీలు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఈ సారి సుమారు 14వేల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈసారి పారా అథ్లెట్లకు సైతం పోటీలు నిర్వహించనున్నాం. – జక్కుల శ్రీనివాస్, డీవైఎస్వో -
మున్సిపల్ కమిషనర్గా జి.రాజు
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్గా జి.రాజు నియామకమయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న, జిల్లావాసులైన కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి గ్రేడ్–2 మున్సిపాలిటీ కమిషనర్గా పనిచేస్తున్న జి.రాజును ఆదిలాబాద్కు బదిలీ చేసింది. ఇక్కడ పనిచేసిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సీవీఎన్ రాజును పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రెటరీగా స్థానచలనం కల్పించింది. ఈ మేరకు మున్సిపల్ డైరెక్టర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో నూతన కమిషనర్ గురువారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లుగా బల్దియా వర్గాలు తెలిపాయి. -
హక్కుల సాధన కోసం పోరాడాలి
ఆదిలాబాద్టౌన్: ఉద్యోగులు సంఘటితంగా ఉంటూ హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాల ని టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఎ.నవీన్ కుమార్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సందిల బలరామ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బజరంగ్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఫెడరేషన్లోని ప్రతీ కార్యదర్శి టీఎన్జీవో సభ్యత్వం తీసుకొని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరంలో విలీనం అయ్యారు. అనంతరం జిల్లా ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జె.సంజీవరావు, ప్రధాన కార్యదర్శిగా కె.అరుణ్రెడ్డి, కోశాధికారిగా అనిల్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా డి.నాగభూషణ్, రాందాస్, బి.వినోద్, వైస్ ప్రెసిడెంట్గా సూర్యప్రకాశ్, జాయింట్ సెక్రెటరీగా గంగన్న, ఉమెన్ జాయింట్ సెక్రెటరీగా నస్సేమ, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా సత్యనారాయణతో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్, ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేందర్, సునీల్ రెడ్డి, రాఘవేంద్ర, దుర్గయ్య, నాగభూషణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
డిఫెన్సివ్ డ్రైవింగ్తో ప్రమాదాల నివారణ
ఆదిలాబాద్టౌన్: డిఫెన్సివ్ డ్రైవింగ్తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు బుధవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని సూచించారు. పట్టణానికి చెందిన సుమారు 300 మంది ఆటో, టాక్సీ, లారీడ్రైవర్లకు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు సుమన్, ప్రశాంతి పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఇందులో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు బి.సునీల్ కుమార్, కె.నాగరాజు, బి.ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఇంగ్లిష్ ప్రాక్టికల్
ఆదిలాబాద్టౌన్: ఇంటర్మీడియెట్ ఇంగ్ల్లిష్ ప్రాక్టికల్ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 75 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన పరీక్షను డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ పరిశీలించారు. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందని తెలిపారు. అలాగే ఈనెల 23న మానవ నైతిక విలువ పరీక్ష ఉంటుందని వివరించారు. 24న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్య పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. రేపు కళాశాలల్లో పేరెంట్స్ మీటింగ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈనెల 23న పేరెంట్ టీచర్స్ మీటింగ్ (ఎంపీటీఎం) నిర్వహించాలని డీఐఈవో జాదవ్ గణేశ్కుమార్ ప్రకటనలో తెలి పారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు తప్పనిసరిగా సమావేశం నిర్వహించాలని ఆయా ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కావాలని కోరారు. -
నేడు, రేపు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
కై లాస్నగర్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 21, 22 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30గంటలకు జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి బయలుదేరి సాయంత్రం 4గంటలకు ఉట్నూర్ మండలం దంతన్పల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడుతారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.35గంటలకు పులిమడుగు గ్రామానికి చేరుకుంటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నారు. అక్కడి నుంచి కుమ్మరితండాకు చేరుకుని గ్రామస్తులతో సమావేశమవుతారు. అనంతరం ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్కు చేరుకుని సాయంత్రం 6నుంచి 7గంటల వరకు విద్యుత్శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ నెల 22న ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నిర్వహించనున్న గిరిజన దర్బార్లో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొననున్నారు. -
నాగోబాను దర్శించుకున్న మంత్రి సీతక్క
సోయా క్వింటాలుకు.. ఎంఎస్పీ, ప్రైవేట్ ధరలు (మంగళవారం).. ప్రభుత్వ మద్దతు ధర: రూ.5,328 ప్రైవేట్: రూ.5,400నాగోబా జాతరలో భాగంగా పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మంగళవారం రాత్రి కేస్లాపూర్ చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, సౌకర్యాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. అనంతరం మంత్రిని మెస్రం వంశీయులు శాలువాతో సత్కరించారు. ఇందులో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు జాదవ్ నరేశ్, ఆత్రం సుగుణ, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావు,సర్పంచ్ మెస్రం తుకారాం, ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు, మెస్రం వంశీయులు తదితరులున్నారు – ఇంద్రవెల్లిసోయా వివరాలు.. వానాకాలం దిగుబడి అంచనా: సుమారు 54వేల టన్నులు మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది:15,500 టన్నులు ప్రైవేట్లో విక్రయించింది: సుమారు 35వేల టన్నులు -
మరోసారి గుర్తింపు సర్వే
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా దుకాణాలు, ఇళ్లు కోల్పోయే వారి గుర్తింపునకు అధికారులు మంగళవారం సర్వే చేపట్టారు. గతంలోనే సర్వే నిర్వహించి బ్రిడ్జి నిర్మాణంలో కోల్పోయే ఇళ్లు, దుకాణాలకు మార్కౌట్ కూడా ఇచ్చారు. అయితే పలువురి దుకాణాలు అప్పటి సర్వేలో తప్పిపోయినట్లుగా బాధితులు అధికారులకు నివేదించారు. దీంతో ఆర్అండ్బీ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ అధికారులు స్థానిక ఆర్టీవో కార్యాలయ సమీపంలో ఆర్వోబీ నిర్మాణంలో కోల్పోయే దుకాణాల గుర్తింపునకు మరోసారి సర్వే చేశారు. హద్దులు ఏర్పాటు చేశారు. ఆర్యూబీ, ఆర్వోబీ నిర్మాణంలో భాగంగా ఆస్తులు కోల్పోయే వారికి వారం రోజుల్లో పరిహారం అందనున్నట్లుగా ఆర్అండ్బీ డీఈ ప్రవీణ్ కుమార్ తెలిపారు. -
దారికాచిన మృత్యువు..!
వారంతా ఊరు పెద్దలు.. తమ ఊరి పిలగాడిని పట్నం ఆస్పత్రిలో పరామర్శించారు. సాయంత్రం తిరుగు పయనమయ్యారు. కాసేపట్లో గమ్యం చేరాల్సిన వారిని అర్ధరాత్రి మృత్యువు దారి కాచి కబళించింది. చివరి ప్రయణంలో విగతజీవులైన నలుగురిని చూసి ఆ ఊరంతా కన్నీరు పెట్టింది. మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులుభైంసాటౌన్/కుభీర్: నిర్మల్ జిల్లా భైంసా పట్ట ణ శివారులో సోమవారం అర్ధరాత్రి ఘోర రో డ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘట న లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం.. కుభీర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన బాలుడు సిద్ధార్థ్ అనా రోగ్యంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడిని పరామర్శించేందు కు కుప్టి సర్పంచ్ పోతుగంటి గంగారాం, ఉపసర్పంచ్ గుండోల్ల శ్రీనివాస్(చిన్ను), భోస్లే భోజరాం పటేల్, కొడిమెల రాజ న్న, బోయిడి బాబన్న, సిందే ఆనంద్రావు, కుభీర్కు చెందిన బొప్ప వికాస్ కారులో సోమవారం ఉదయం హైదరాబాద్ బయల్దేరారు. బాలుడిని పరామర్శించారు. అతడి తల్లిదండ్రులకు ధైర్యం చె ప్పారు. సాయంత్రం స్వగ్రామానికి బయల్దేరా రు. అర్ధరాత్రి తర్వాత భైంసా–నిర్మల్ జాతీయ రహదారి మీదుగా భైంసా పట్టణ శివారులోని సాత్పూల్ వంతెన వద్దకు చేరుకున్నారు. 20 నిమిషాలయితే ఇంటికి.. మరో 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే గ్రామానికి చేరుకునేవారు. కానీ ఇరుకుగా ఉన్న సాత్పూల్ వంతెనపై ఎదురుగా లారీ ఓ పెద్ద ఐరన్ డోమ్తో నిర్మల్ వైపు నుంచి భైంసా వైపు వెళ్తోంది. చీకట్లో ఐరన్ డోమ్ కనిపించకపోవడంతో వీరి కారు వేగంగా వెళ్లింది. డోమ్ కారుకు తాకి.. కుడివైపు భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో డ్రైవర్ బొప్ప వికాస్(25)తోపాటు వెనుక సీట్లో ఉన్న భోస్లే భోజరాం పటేల్(40), కొడిమెల రాజన్న(58), బోయిడి బాబన్న(70) అక్కడికక్కడే మృతిచెందారు. ఐరన్ డోమ్కు ఎలాంటి సూచిక ఏర్పాటు చేయకుండా వెళ్లడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వంతెనపై వీధి దీపాలు కూడా వెలగకపోండం మరో కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. హుటాహుటిన సహాయక చర్యలు.. ప్రమాదం జరిగిన వెంటనే భైంసా ఏఎస్పీ రా జేశ్మీనా, పట్టణ సీఐ సాయికుమార్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తిగా నుజ్జునుజ్జయిన కారు నుంచి మృతదేహాలను వెలికి తీయించారు. ట్రాఫిక్ క్లియర్ చే శారు. స్థానికులు సైతం సహాయకచర్యల్లో పా ల్గొన్నారు. మృతదేహాలను భైంసాలోని ప్రభు త్వ ఏరియాస్పత్రికి తరలించారు. సర్పంచ్ గంగారాంకు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు.. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కు టుంబ సభ్యులు, కుప్టిగ్రామస్తులు హుటాహుటి న భైంసా ఏరియా ఆస్పత్రికి చేరుకున్నా రు. ఆస్పత్రిఆవరణలో వారి రోదనలు మిన్నంటా యి. ముధోల్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్ర మాదానికి కారణాలను అడిగితెలుసుకున్నారు. ఎస్పీ జానకీషర్మిల మంగళవారం ఉదయం భైంసాకు చేరుకుని ప్రమాదస్థలిని పరిశీలించా రు. సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసు, ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. మృత్యుంజయులు.. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కారులో ప్రయాణిస్తున్న సిందే ఆనంద్రావు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ముందు సీట్లో కూర్చున్న ఆనంద్రావు ఎయిర్బ్యాగ్ ఓపెన్ కావడంతో సురక్షితంగా బయటపడ్డారు. వెనుక సీటులో ఎడమవైపు కూర్చున్న శ్రీనివాస్కు కూడా ఎలాంటి గాయాలు కాలేదు. కన్నీరు పెట్టిన కుప్టి ఒకే గ్రామానికి చెందిన నలుగురు పెద్ద మనుషులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుప్టిలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి తరలించి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రకు ఊరంతా కదిలి వచ్చి కడసారి వీడ్కోలు పలికింది. ముగ్గురూ ఊరి పెద్దలు.. కుప్టి గ్రామానికి చెందిన భోజరాం పటేల్తో పాటు కొడిమెల రాజన్న, బోయిడి బాబన్న, సిందే ఆనంద్రావు గ్రామంలో పెద్ద మనుషులుగా వ్యవహరిస్తుంటారు. అనుకోని ప్రమాదం ముగ్గురినీ కబళించింది. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. భోజరాంపటేల్ గ్రామంలోనే ఉంటూ భైంసా పట్టణంలో వ్యాపారం చేసేవాడు. ఇతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కొడిమెల రాజన్న, బోయిడి బాబన్న గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఘోర రోడ్డు ప్రమాదం తమ ఇంటి పెద్దలలను బలిగొనడంతో ఆ కుటుంబాల రోదన వర్ణనాతీతం. ఇక తాజాగా సర్పంచ్గా ఎన్నికై న గంగారాం పేద కుటుంబానికి చెందినవారు. ఇటీవల గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో గ్రామపెద్దలు ముందుండి అతన్ని గెలిపించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేశారు.పెళ్లి కావాల్సిన ఇంట.. కుభీర్కు చెందిన బొప్ప చంద్రబాయి– నాగలింగం దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడు వినోద్ ఆర్మీలో పని చేస్తుండగా, మూడో కుమారుడు వివేక్ డిగ్రీ చదువుతున్నాడు. రెండో కుమారుడైన వికాస్మిషన్ భగీరథలో వాహనం డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఖాళీ సమయంలో తన సొంతకారును అద్దెకు నడుపుతున్నాడు. సోమవారం కుప్టి గ్రామస్తులతో హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి వస్తుండగా రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో చావు మేళం మోగింది. పచ్చని పందిరితో కళకళలాడాల్సిన చోట విషాదం అలుముకుంది. -
రహదారి భద్రత అందరి బాధ్యత
ఆదిలాబాద్టౌన్: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని జిల్లా జడ్జి ఎం.ప్రభాకర్ రావు అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమాన్ని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. రహదారి భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు.ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలను 20 శాతం వరకు తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తోందన్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ప్రతీ వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా అదనపు సెషన్స్ జడ్జి రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఏఎస్పీ పి.మౌనిక, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్, పీపీ సంజయ్ వైరాగరి, డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఐఎంఏ ఆదిలాబాద్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం
ఆదిలాబాద్టౌన్: మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో మైనర్ డ్రైవింగ్ చేసిన వారి తల్లిదండ్రులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా మైనర్ల తల్లిదండ్రులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే 260 మైనర్ డ్రైవింగ్ చేసిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొదటి తప్పుగా భావించి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టా మని, పునరావృతం అయితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సీఐలు సునిల్ కుమార్, నాగరాజు, ప్రణయ్కుమార్, ఫణిందర్ తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రత పాటించాలి ఆదిలాబాద్రూరల్: ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని బుర్కి గ్రామంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గ్రామస్తులకు దుప్పట్లు పంపిణీ చేసి మా ట్లాడారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. ఆదివాసీ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి, రూరల్ సీఐ ఫణిందర్, ఎస్సై విష్ణు వర్ధన్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు ఎం రాజేశ్వర్రెడ్డి, సర్పంచ్ నగేష్, గ్రామ పటేల్ సోనేరావు, సిబ్బంది తదితరులున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలి ఆదిలాబాద్టౌన్: ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కార చర్యలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. మొత్తం 38 ఫిర్యాదులు అందగా, వాటిపై ఎస్పీ తక్షణమే స్పందించి సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, పాల్గొన్నారు. -
● వేడెక్కిన ‘పుర’ రాజకీయం ● టికెట్ ప్రయత్నాల్లో ఆశావహులు ● గెలుపు గుర్రాలపై ప్రధాన పార్టీల దృష్టి
కై లాస్నగర్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కావడంతో బల్దియా రాజకీ యం ఒక్కసారిగా వేడెక్కింది. రిజర్వేషన్ అనుకూలించిన అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని అనధికారికంగా ప్రచారం సైతం షురూ చేశారు. పార్టీల సింబల్ ఆధారంగా ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన రాజకీయ పార్టీల తరఫున టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల ఎంపికపై దృష్టి సారించాయి. ఆయా వార్డుల్లో ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ ప్రజాబలం, సేవాగుణం, గెలి చే అవకాశాలున్న వారి ఎంపికకు కసరత్తు చేస్తున్నా యి. దీంతో షెడ్యూల్కు ముందే పుర రాజకీయం కాక పుట్టిస్తోంది. సతి లేకుంటే పతి.. ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లు పలువురు మాజీ కౌన్సిలర్లకు నిరాశ మిగిల్చాయి. రిజర్వేషన్లు తారుమారు కావడంతో కొందరికి పోటీకి అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి వారిలో పలువురు పక్క వార్డుల నుంచి బరిలో దిగాలని భావిస్తున్నా రు. అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ప డ్డారు. మరి కొన్నిచోట్ల మహిళలకు రిజర్వు కావడంతో తమ సతులను పోటీ చేయించాలని పతులు యోచిస్తున్నారు. సామాజికవర్గం పరంగా రిజర్వేష న్ అనుకూలించక సతి, పతి ఇద్దరూ పోటీ చేసే అవకాశం లేనటువంటి వారు నిరాశలో మునిగిపోయా రు. ఆయావార్డుల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆ శావహులు అలాంటి మాజీ కౌన్సిలర్లను ఆశ్రయిస్తున్నారు. వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి తమకు అండగా నిలువాలని కోరుతూ వారిని ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు. రాజకీయ పార్టీల దృష్టి మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్తో పాటు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. హస్తం పార్టీలో ఎన్నికల జోష్ నెలకొంది. రెండు రోజులుగా ఆశావహుల నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలు దరఖాస్తులు స్వీకరించారు. నేటితో గడువు ముగియనుండగా ఇప్పటికే సుమారు 200మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1:2 నిష్పత్తితో కూడిన జాబితాను అధిష్టానానికి పంపించనున్నారు. వారిపై పార్టీ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించనుంది. అలాగే బీజేపీ ఇటీవల ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించి శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చింది. దీంతో పలువురు ఆశావహులు పార్టీ కార్యాలయంలో తమ దరఖాస్తులు అందజేస్తున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఎన్నికలపై ప్రత్యేక దృషి సారించింది. ఆ పార్టీ తరఫున పోటీచేయాలని భావిస్తున్న వారు నేరుగా జిల్లా అధ్యక్షుడిని కలిసి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా మూడు పార్టీలు ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికే కీలకమైనందున గెలుపు గుర్రాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నాయి. ప్రజాబలం, ప్రజలతో మమేకమయ్యే తత్వం, సేవాభావం వంటి అంశాలతో పాటు ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి. మరోవైపు పార్టీ టికెట్ దక్కితే ఒకే లేదంటే మరో పార్టీలోకి చేరడం, అదీ కుదరకుంటే ఇండిపెండెంట్గానైనా బరిలో నిలువాలని పలువురు భావిస్తున్నారు. ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్న ఆశావహులు ఇప్పటికే వార్డుల్లో తమ పార్టీ ముఖ్యనేతలతో పాటు తమ ఫొటోతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. మద్దుతు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో పాటు వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం వంటి సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతూ ఫలానా వార్డు అభ్యర్థిని తానేనని చెప్పుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇది వరకు తాము చేసిన సామాజిక సేవ కార్యక్రమాలు, కాలనీల్లో చేపట్టిన పనులను అందులో పోస్ట్ చేస్తున్నారు. ఇలా నోటిఫికేషన్కు ముందే ఎన్నికల అనధికార ప్రచారం కొనసాగిస్తున్నారు. -
‘యూనివర్సిటీపై మాట మార్చడం సరికాదు’
కై లాస్నగర్: యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్రెడ్డి మాట మార్చడం సరికాదని నిరుద్యోగ యువత జేఏసీ, ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ అధ్యక్షుడు సోమేష్ ఆరోపించారు. జి ల్లాలోని ఇంద్రవెల్లి కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో సోమవారం ఆ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం మళ్లీ బాసరలో ఏర్పాటు చేస్తామంటూ మాట మా ర్చడం సరికాదన్నారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘ముఖ్యమంత్రి వ్యాఖ్యలు నిరంకుశత్వానికి నిదర్శనం’
ఆదిలాబాద్టౌన్: బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చమంటూ పిలుపునివ్వడం సీఎం నిరంకుశత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ము ఖ్యమంత్రి ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అని, ఆ పార్టీని చెరిపేయ డం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. అలాగే కొరటా–చనాఖా ప్రాజెక్ట్కు జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధుల పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇందులో పార్టీ పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు పాల్గొన్నారు. -
● ప్రజావాణికి 98 దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా
సమస్యల వెల్లువకై లాస్నగర్: భూ సమస్యలు పరిష్కరించాలని కొందరు.. పింఛన్లు మంజూరు చేయాలని మరికొందరు.. ఇందిరమ్మ ఇళ్లు అందించాలని ఇంకొందరూ ఇలా పలు సమస్యలతో తరలివచ్చిన బాధితులు కలెక్టర్ రాజర్షి షా ఎదుట తమ గోడు వినిపించారు. పరిష్కరించాలని వేడుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉంచొద్దని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 98 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన. -
‘ఇందిరమ్మ’ చీరలు వచ్చేశాయ్
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని మహిళలకు ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు అందించనుంది. ఇది వర కు గ్రామీణ ప్రాంతాల వారికి అందించగా తాజాగా పట్టణ ప్రాంతంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఎస్హెచ్జీ సభ్యులు 26,897 మందితో పాటు 18 ఏళ్లు నిండిన మహిళలతో కలిపి పట్టణానికి 57,509 చీరలు అవసరమైనట్లుగా అధికారులు గుర్తించారు. ఇందులో 9 మీ టర్ల గోచి చీరలు 2,793, ఆరు మీటర్ల చీరలు 54,716 అవసరం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు 44,563 చీరలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వాటిని వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాంలో భద్రపరిచారు. నేటి నుంచి 87 రేషన్షాపులతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీ కేంద్రాల్లో వీటిని పంపిణీ చేయనున్నట్లుగా మెప్మా అధికారులు శ్రీనివాస్, భాగ్యలక్ష్మి తెలిపారు. ఈమేరకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. -
300 క్యూసెక్కులు విడుదల
సాత్నాల: భోరజ్ మండలం హత్తిఘాట్ వద్ద నిర్మించిన కొరటా–చనాఖా పంప్హౌస్ నుంచి అధికారులు సోమవారం 300 క్యూసెక్కుల నీ టిని విడుదల చేశారు. ఈనెల 16న పంప్హౌస్ వద్ద నీటిని విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా జా గ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించి న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు నీటి విడుదల ఉంటుందని, సమస్యలు తలెత్తితే పరిష్కరిస్తామని అధి కారులుపేర్కొంటున్నారు. రైతులు నీటిని పొ దుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉమామహేశ్వరరావు, ఏఈ ప్రభు, విద్యుత్ శాఖ అధికారులు నాగేశ్వరరావు, లక్ష్మణ్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
మున్సి‘పోల్’కు కాంగ్రెస్ ఇన్చార్జీలు
కై లాస్నగర్: త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని బల్దియాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పలువురికి బాధ్యతలు అప్పగించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డిని ఇన్చార్జిగా నియమించింది. ఆది లాబాద్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల పరిధిలో గల ము న్సిపాలిటీ ఎన్నికల వ్యవహారాలన్నీ ఆయన పర్యవేక్షణ లోనే జరగనున్నాయి. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మంచిర్యాల కార్పొరేషన్తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీల బాధ్యతలను ఆయన పర్యవేక్షించనున్నా రు. ఎన్నికలయ్యేంత వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలు, నాయకులను సంసిద్ధుల ను చేయాల్సిందిగా అధిష్టానం వారికి బాధ్యతలు అప్పగించింది. మంత్రి జూపల్లి ఇప్పటికే తూర్పు ప్రాంతంలో పర్యటిస్తూ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. సుదర్శన్ రెడ్డి త్వరలోనే జిల్లాలో పర్యటించే అవకాశమున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, గెలుపు దిశగా అనుసరించాల్సి న కార్యాచరణ వంటి అంశాలన్నింటినీ వారు ఆయా జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగనున్నారు. -
వేళాయె
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. వన్యప్రాణుల లెక్కింపునకుఆదిలాబాద్టౌన్: జిల్లాలోని అడవుల్లో వన్యప్రాణుల సర్వేకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా అటవీ జంతువుల గణన చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవా రం నుంచి జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభం కా నుంది. అవసరమైన సిబ్బందితో పాటు స్వచ్ఛందంగా గణన చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వ లంటీర్లు పాల్గొననున్నారు. వీరికి అటవీ అ ధికారులు శిక్షణ కల్పించారు. మాంసహార, శా ఖాహార జంతువుల గణన వేర్వేరుగా చేపట్టనున్నారు. సర్వే ఆరు రో జుల పాటు కొనసాగనుంది. వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో న మోదు చేస్తారు. జిల్లా అటవీ శాఖ అధికారితో పాటు ఎఫ్డీవోలు, ఎఫ్ఆర్వోలు సర్వేను పర్యవేక్షిస్తారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో సిబ్బందికి సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సర్వే తీరుతెన్నులను ఆ దిలాబాద్ ఎఫ్డీవో చిన్న విశ్వనాథ్ బూసిరెడ్డి, ఉ ట్నూర్ ఎఫ్డీవో అరవింద్, ఎఫ్ఆర్వోలు గులా బ్సింగ్, సంతోష్,ముఖ్తార్అహ్మద్ వివరించారు. సిబ్బందితో పాటు వలంటీర్లు.. ప్రస్తుతం ఈ సర్వేలో ఎఫ్బీవోలు, వాచర్లతో పాటు అటవీ జంతువులపై అవగాహన కలిగిన 90 మంది వలంటీర్లు పాల్గొననున్నారు. ఈనెల 20, 21, 22 తేదీల్లో శాఖాహార జంతువుల గణన, 23, 24, 25 తేదీల్లో మాంసాహార జంతువుల గణన చేపట్టనున్నారు. 171 బీట్ల పరిధిలో 9 రేంజ్లు ఉన్నాయి. 120 మంది బీట్ ఆఫీసర్లు, వాచర్లుసర్వేలో పాల్గొననున్నారు. ట్రాన్స్ సెక్ట్ సర్వే రెండు కిలోమీటర్ల నడ క, ట్రైల్సర్వేనడక 5 కిలోమీటర్ల పాటు చేపడతారు. ప్రత్యేక యాప్లో నమోదు.. జంతు గణనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూ పొందించింది. సేకరించిన డేటాను అందులో ఎప్పటికప్పుడు ఫొటోలతో సహా అప్లోడ్ చేస్తారు. ‘మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్– ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకోలాజికల్ స్టేటస్’ యాప్లో జియో ట్యా గింగ్ చేస్తారు. ఎదురుపడే జంతువులు, అవశేషాలు, పాదముద్రలు, మల విసర్జన పదార్థాలు, చెట్లౖ పె కాలిగోర్ల గుర్తులు, వెంట్రుకలు వంటివి అందులో అప్లోడ్ చేస్తా రు. ఏ అవశేషం ఏ జంతువుది, ఆహారశైలీ, ఆరో గ్య పరిస్థితి వంటి అంశాలను జాతీయ వన్యప్రాణి సంస్థ లెక్కలు వేసి జంతు గణన పూర్తయిన అనంతరం అధికారికంగా ప్రకటిస్తారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం, శాతం : 1,82,630 హెక్టార్లు(44 శాతం) సర్వే చేపట్టనున్న బీట్లు :171 పాల్గొననున్న బీట్ ఆఫీసర్లు: 120, వలంటీర్లు: 90నేటి నుంచి గణన.. జిల్లాలోని అడవుల్లో మంగళవారం నుంచి ఈ గణన చేపట్టనున్నారు. ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, కృష్ణ జింకలు, మనుబోతులు, నక్కలు, అడవి కుక్కలు, అడవి పందులు తదితర వన్యప్రాణులను లెక్కిస్తారు. ప్రతి నాలుగేళ్లకోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అటవీ శాఖ ఆధ్యర్యంలో ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ) పేరుతో మాంసాహార, శాఖాహార జంతువుల గణనను చేపడతారు. -
ప్రయోగ పరీక్షలకు వేళాయె
మంచిర్యాలఅర్బన్: ఇంటర్ విద్యార్థులు వార్షిక పరీక్షలకు ముందు నిర్వహించే ప్రయోగ పరీక్షలకు అంతా సిద్ధమైంది. ఈనెల 21,22న నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షలు మొదలుకానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు విడతలుగా నిఘా కెమెరా నీడన నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం వేళ పరీక్షలు జరుగనున్నాయి. 21న ప్రథమ సంవత్సర విద్యార్థులకు పరీక్ష ఉంటుంది. 22న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆంగ్ల ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ జనరల్, వృత్తి విద్యాకోర్సుల విద్యార్థులు తప్పసరిగా పరీక్ష రాయాల్సి ఉంటుంది. సైన్స్, వృత్తి విద్యాకోర్సులు చదువుతున్నవారు ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారికి ఫిబ్రవరి 2 నుంచి ఈ పరీక్షలు ఉంటాయి. పరీక్ష ఇలా.. ఆంగ్ల సబ్జెక్టు 100 మార్కుల పేపర్లో 20 మార్కులు ప్రయోగ పరీక్ష, 80 మార్కులు థియరీ కేటాయించారు. రెండేళ్ల క్రితం నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షకు సంబంధించిన ఆంగ్ల రికార్డులు సైతం విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. 24 ఎథిక్స్ పరీక్ష నిర్వహించనున్నారు. 100 మార్కులకు గాను 60 మార్కులు రాత పరీక్ష, 40 మార్కులకు రికార్డు, ప్రాజెక్టు సంబంధించిన నోట్స్లను పరీక్ష కేంద్రంలో అప్పగించాల్సి ఉంటుంది. ప్రథమ సంవత్సరం చదివే విద్యార్థులు ఇందులో అర్హత సాధిస్తేనే వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫలితం ప్రకటిస్తారు. 22న పరీక్షపై గందరగోళం ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించే జాతీయస్థాయి పరీక్ష (జేఈఈ మెయిన్స్) పరీక్ష, ఆంగ్ల పరీక్షలు 22న రెండు ఉండటంతో గందరగోళం నెలకొంది. ఈనెల 21, 22, 23, 24, 28న పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు ఆంగ్లపరీక్ష, జేఈఈ మెయిన్స్ ఒకే రోజు ఉండటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇబ్బంది లేకున్నా 22న జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలా హాజరుకావాలో తెలియడం లేదు. ఆంగ్ల పరీక్షలు ఉంటాయా.. మరో తేదీకి వాయిదా వేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. పరీక్షలకు హాజరుకావాలి ఆంగ్లప్రయోగ, పర్యావరణ విద్య పరీక్షకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలి. పరీక్షలు రాయకుంటే థియరీలో ఉత్తీర్ణులైన ఫలితం వెలువడదు. 22న జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆంగ్ల పరీక్ష నిర్వహణపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. – అంజయ్య, డీఐఈవో, మంచిర్యాల ఇంటర్ కళాశాలల వివరాలు జిల్లాలు ప్రభుత్వ ఫస్టియర్ సెకండియర్ మంచిర్యాల 10 1,974 1,676 నిర్మల్ 13 2,592 2,252 కుమురం భీం 11 2,575 2,048 -
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని కొత్త కుమ్మర్వాడకు చెందిన ఇందారపు ప్రభాకర్(38) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. నవాబ్పేటలో ఒకరు కడెం: మండలంలోని నవబ్పేట్ గ్రామానికి చెందిన చింతకుంట మహేశ్(28) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై పి.సాయికిరణ్, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మహేశ్కు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చెందిన సాదరికతో 2024 డిసెంబర్లో వివాహమైంది. సంక్రాంతి రోజున భర్తతో గొడవపడి సాదరిక పుట్టింటికి వెళ్లింది. ఇటీవల పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో బావమరుదులు కొట్టడం, అత్తమామలు, భార్య తిట్టడంతో మనస్తాపం చెందాడు. ఈ నెల 17న రాత్రి ఇంట్లో సూసైడ్ నోటు రాసిపెట్టి ఉ రేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఆటోలు సీజ్ ఆదిలాబాద్టౌన్: పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను తరలిస్తూ నిబంధనలు పాటించని 12 ఆటోలను సీజ్ చేసి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మివాడ, ఇందిరానగర్, ఖుర్షీద్నగర్, నెహ్రూచౌక్లలో ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహన యజమానులపై చర్యలు చేపట్టారు. సాత్నాల: భోరజ్ మండలం తర్నం గ్రామంలో దీప క్ అగర్వాల్కు చెందిన పంట పొలంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. రైతు పంట పొలంలో ఉంచిన 100 పైపులకు నిప్పుంటుకొని కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రూ.75 వేలు విలువ చేసే పైపులు దగ్ధమయ్యాయి. స్తంభం కింద పైపులు ఉండటంతో షార్ట్ సర్క్యూట్ సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు
ఆదిలాబాద్: 11వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ (సబ్ జూనియర్) పోటీల ఓవరాల్ చాంపియన్గా ములుగు జిల్లా నిలిచింది. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం నిర్వహించిన పోటీలను ఎంపీ నగేశ్, కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రారంభించారు. 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ నగేశ్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి పిల్లల్లో ఆటలపై మక్కువ పెరిగేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలన్నారు. జిల్లాలో ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. తన స్వగ్రామంలోనే ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేశానన్నారు. అదేవిధంగా స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తానని, హాకీ టర్ఫ్ కోర్టు ఏర్పాటయ్యేలా దృష్టి సారిస్తున్నానని తెలిపా రు. కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ప్రతిభ దాగి ఉందని, ఇలాంటి పోటీలు వారి నైపుణ్యాన్ని వెలికితీస్తాయన్నారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని క్రీడాకారులకు బహుమతులు అందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి, డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, డీటీఎస్ఓ పార్థసారథి, నాయకులు శ్రీకాంత్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్, కంది శ్రీనివాస్రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు సారంగపాణి, వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్, వీజీఎస్ రాకేశ్ పాల్గొన్నారు. విజేతలు వీరే..అండర్–8 బాలుర విభాగంలో 10 పాయింట్లతో జగిత్యాల, బాలికల విభాగంలో 8 పాయింట్లతో కామారెడ్డి విజేతలుగా నిలిచాయి. అండర్–10 బాలుర విభాగంలో 6 పాయింట్లతో సంయుక్తంగా ములుగు, మంచిర్యాల జిల్లాలు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో 8 పాయింట్లతో ములుగు, మహబూబాబాద్ జిల్లాలు సంయుక్త విజేతలుగా సత్తా చాటాయి. అండర్–12 బాలుర విభాగంలో 7 పాయింట్లతో ఆదిలాబాద్, బాలికల విభాగంలో 8 పాయింట్లతో నారాయణపేట చాంపియన్షిప్ సాధించాయి. అండర్–14 బాలుర విభాగంలో 8 పాయింట్లతో వనపర్తి, బాలికల విభాగంలో 10 పాయింట్లతో హన్మకొండ గెలుపొందాయి. ఇక 19 పాయింట్లతో అన్ని విభాగాల్లో కలిసి ములుగు ఓవరాల్ చాంపియన్ షిప్ కై వసం చేసుకుంది. -
స్వగ్రామానికి చేరిన మృతదేహాలు
లక్సెట్టిపేట: తమిళనాడులోని కన్యాకుమారి వద్ద ఈనెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు పాలకుర్తి సత్యనారాయణ, రమాదేవి మృతిచెందారు. వారి మృతదేహాలు శనివారం రాత్రి పట్టణంలో బీట్ బజార్లోని స్వగృహానికి తీసుకువచ్చారు. ఆదివారం బీట్బజార్ నుంచి గోదావరి శ్మశానవాటిక వరకు నిర్వహించిన అంతిమయాత్రలో కుటుంబీకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార సంఘ నాయకులు పాల్గొన్నారు. డప్పుచప్పుళ్లతో సుమారు 600 మంది వచ్చారు. ఇద్దరు కూతుళ్లు పాడె మోశారు. ఇద్దరు అల్లుళ్లు మృతదేహాలకు తలకొరివి పెట్టారు. వ్యాపార సంఘం ఆధ్వర్యంలో దుకాణాలు బంద్ పాటించారు. -
పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల పెండింగ్ డిమాండ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఐఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ బి.జనక్ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన నస్పూర్ కాలనీలోని శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 13న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో జరగాల్సిన అనివార్య కారణాలతో వాయిదా పడిందన్నారు. త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇందులో సింగరేణి ప్రధాన డిమాండ్లపై చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కంపెనీకి పూర్తిస్థాయి సీఎండీ నియమించాలని, సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని, వారికి కోలిండియాలో ఇస్తున్నట్లు పెర్క్స్పై ఆదాయ పన్ను కంపెనే చెల్లించాలన్నారు. మారుపేర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతామన్నారు. ప్రతీనెల కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించి 95 శాతం మెడికల్ ఇన్వాలిడేషన్ అమలు చేయాలన్నారు. హైదరాబాద్తోపాటు రీజియన్ల వారీగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్నారు. గనులు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. సమావేశంలో యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, ఉపాధ్యక్షులు జట్టి శంకర్రావు, ప్రధాన కార్యదర్శులు ఏనుగు రవీందర్రెడ్డి, జీవన్ జోయల్, నాయకులు నరేందర్, తిరుపతి రాజు, భీంరావు, మనోజ్, పేరం రమేశ్, రాపర్తి శ్రీనివాస్, శీలం చిన్నయ్య, చందు పాల్గొన్నారు. -
భక్తుల కొంగుబంగారం..బాలేశ్వరుడు
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాకేంద్రంలోని సమీప పవిత్ర పెద్దవాగు నది తీరాన గల భక్తుల కొంగు బంగారం బాలేశ్వరస్వామి విరాజిల్లుతోంది. రథోత్సవాన్ని పురస్కరించుకొని నేటి నుంచి ఆలయంలో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 25న రథోత్సవం నిర్వహించనున్నారు. సుమారు 50వేల మంది హాజరుకానున్నారు. మున్సిపాలిటీ, ఆలయ కమిటీ, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణానికి చెందిన రావుల ఫ్యామిలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 12 అడుగుల శివలింగం పనులు చకచకా సాగుతున్నాయి. పోలీసు ఆధ్వర్యంలో బందోబస్తుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ చరిత్ర.. నాలుగు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని గోండు రాజులు పాలిస్తున్న కాలంలో పెద్దవాగు ఒడ్డున ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో ఓ రైతు చేనులో నాగలి పట్టి దున్నతుండగా ఏదో తగిలింది. తవ్వి చూడగా శివలింగం బయటపడినట్లు తెలుస్తోంది. దాన్ని అక్కడే ప్రతిష్ఠించారు. గోండురాజులు రాతితో ఆలయాన్ని నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. నేటికి శివలింగంపై నాగలి తగలడం వల్ల ఏర్పడిన గాటు గమనించవచ్చు. అప్పటి నుంచి పూజలు చేస్తుంటారు. రాంచందర్రావ్(పైకాజీ) ఆలయ ప్రహరీ నిర్మించి శ్రీకారం చుట్టగా, నది ప్రవాహానికి కోతకు గురైంది. పిల్లర్లు వేసి కప్పు భాగాన్ని మరింత పెంచి, చుట్టూ ప్రహరీ నిర్మించారు. తర్వాత దండనాయకుడు నారాయణరావ్ (రమేశ్బాబు) కొన్నేళ్లుగా నిర్వహణలో ఉంది. పట్టణ ప్రముఖుడు టీఆర్ బాబురావ్ ఆలయ ఈ శాన్యంలో హనుమంతుడి విగ్రహానికి మందిరం నిర్మించి భక్తుల సౌకర్యార్థం మెట్టు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మించారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచేకాక మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ నుంచి భక్తులు తరలివస్తారు. ప్రతీరోజు పూజా కార్యక్రమాలు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీగణపతి హోమం, శ్రీ చండీ సప్తశతి హవనం, నవగ్రహ, అరుణ హోమాలు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, కుంకుమార్చనలు, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, ఉత్సవమూర్తుల రథోత్సవ (రథసప్తమి) జాతర కొనసాగనుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి. -
కార్మిక హక్కుల సాధనే ధ్యేయం
మందమర్రిరూరల్: సింగరేణి సంస్ధ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధనే తమ ధ్యేయమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. పట్టణంలోని సీఈఆర్ క్లబ్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన సీఐటీయూ రాష్ట్ర 17వ మహాసభలకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి, వేజ్బోర్డు మెంబర్ నరసింహా రావు తదితరులతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో సంస్థకు నష్టం వాటిల్లుతుందన్నారు. నాలుగు కోడ్లతో అన్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా పలు తీర్మానాలు చేశారు. తెలంగాణలో కొత్త గనులు సింగరేణికే కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని అంతవరకు హైపవర్ కమిటీ వేతనాలతోపాటు, పెర్క్స్పై ఇన్కంటాక్స్ సంస్థనే చెల్లించాలన్నారు. అంతకుముందు యూనియన్లో పనిచేసి అమరులైన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు భూపాల్, గౌరవాధ్యక్షుడు రాజారావు, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నాగరాజ్గోపాల్, మందమర్రి బ్రాంచి అధ్యక్షుడు వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, నాయకులు రామస్వామి, ప్రవీణ్, ఏరియాల బాధ్యులు పాల్గొన్నారు. -
ఎక్కడి పనులు అక్కడే!
బాసర: శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి జన్మదినం అయిన వసంత పంచమి వేడుకలు బాసరలో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈనెల 21 నుంచి 23 వరకు వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో అంజనాదేవి ప్రకటించారు. వేడుకలకు సీఎం రేవంత్రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతోపాట పలువురు అతిథులను ఆహ్వానించారు. ఇక వేడుకల సందర్భంగా అమ్మవారి దర్శనానికి తెలురు రాష్ట్రాలతోపాటు ఉత్తర భారత దేశం నుంచి కూడా వేల మంది భక్తులు తరలివస్తారు. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు జరగడంలేదు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పవని స్థానికులు చర్చించుకుంటున్నారు. అధికారులతో ఈవో సమీక్ష దేవస్థాన అధికారులు భక్తులకు అన్నివిధాలా సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని ఈవో అంజనాదేవి తెలిపారు. అధికారులతో సమీక్ష చేసి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆమేరకు పనులు జరగడం లేదు. క్యూలైన్ల ఏర్పాట్ల పనులు మాత్రం ఆదివారం మొదలయ్యాయి. గోదావరి తీరంలో వ్యర్థాలు.. అమ్మవారి పుట్టిన రోజు అయిన వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేల మంది తరలివస్తారు. అమ్మవారి దర్శనానికి ముందు సమీపంలోని గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తారు. అక్షరాభ్యాసం కోసం మూడు మండపాలు ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు. ఇక గోదావరి తీరంలో ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. పుష్కర ఘాట్ల వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు, మట్టి కుప్పలు, పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. నదిలో నీరు కూడా దుర్వాసన వస్తోంది. స్నానం చేసే భక్తులు లోపలికి వెళ్లకుండా ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నదిలో మురికి నీటినీ తొలగింపజేయాలని, ఘాట్లపై వ్యర్థాలు తొలగించాలని భక్తులు కోరుతున్నారు. గోదావరి రెండోఘాట్ వద్ద చెత్తాచెదారం వ్యర్థాలు -
‘అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం’
నేరడిగొండ: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. మండలంలోని గౌలిగూడ గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గౌలిగూడలో అర్హు లకు ఇళ్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామానికి రూ.1.50 కోట్లతో బీటీ రోడ్డు మంజూరు చేయించానని తెలిపారు. మైనార్టీలకు అన్ని విధాలా అండగా ఉంటాం ఇచ్చోడ: మైనార్టీలకు అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే అనిల్జాదవ్ తెలిపారు. మండల కేంద్రంలో హసన్ మదర్సా ఆవరణలో జరగనున్న జల్సా కార్యక్రమాన్ని పరిశీలించి మైనార్టీ మత పెద్దలతో మాట్లాడారు. సమస్యలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, నాయకులు గాడ్గే సుభా ష్, సర్పంచ్ జలైజాకు, మత పెద్దలు పాల్గొన్నారు. బోథ్: మండలంలోని కౌఠ బీ గ్రామంలో నిర్వహించిన గాంగేవార్ విశాల్ స్మారక తాలూకా స్థాయి క్రికెట్ పోటీల ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. విజేతగా నిలిచిన నేరడిగొండ క్రికెట్ క్లబ్ జట్టుకు ప్రథమ, రన్నరప్గా నిలిచిన పొచ్చర జై భీమ్ జట్టుకు ద్వితీయ బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ రమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణపై ఫోకస్
ఆదిలాబాద్టౌన్: అతివేగం.. మద్యం మత్తు.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రహదారులు నెత్తురోడుతుండగా విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. బాధిత కుటుంబాల్లో విషాదం అలుముకుంటోంది. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పోలీస్శాఖ జిల్లాలో ప్రమాదాల నివారణపై దృష్టి సారించింది. రవాణాశాఖ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, డీజీపీ ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 1నుంచి 31వరకు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులకు పూలు ఇచ్చి అభినందిస్తున్నారు. ప్రమాదాల నివారణకు.. సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి, రాంగ్రూట్ డ్రైవింగ్, హైవేలకు ఇరువైపులా వాహనాల పార్కింగ్, ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ లాంటి ఉల్లంఘనలే ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు డీజీపీ శివధర్రెడ్డి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాహనదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా పోలీస్శాఖ రోజు కో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం, ప్రథమ చికిత్స అందించడం, బ్లాక్ స్పాట్లను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టడం, స్పాట్లోనే ప్రాథమిక చికిత్స అందించడం కోసం చేపట్టిన ‘అరైవ్–అలైవ్’ సత్ఫలితాలనిస్తోంది. ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై దృష్టి జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బ్లాక్స్పాట్లను గుర్తించి రంబుల్స్టిక్స్, అతివేగంగా వెళ్లకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కువగా భోరజ్ చెక్పోస్టు, గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి, సీతాగోంది, నేరడిగొండ, గుడిహత్నూర్ ప్రాంతాల్లో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. కుప్టి, బోథ్ ఎక్స్రోడ్, ఉట్నూర్ ఎక్స్రోడ్ ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్తుండడంతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సేఫ్టీక్లబ్లు రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రమాద సమయంలో క్షతగాత్రులు మృత్యువాత పడకుండా పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా వెయ్యి ప్రాంతాల్లో పోలీసులు రోడ్ సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో క్లబ్లో ఐదుగురిని నియమించారు. ఐఎంఏ ద్వారా ఈ క్లబ్లకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందజేశారు. జాతీయ రహదారి, ఇతర రహదారులను ఆనుకుని ఉన్న గ్రామాల్లోని యువకులకు సీపీఆర్పై శిక్షణ ఇచ్చారు. ప్రమాదాలు జరిగినప్పుడు 108, డయల్ 100, అంబులెన్స్కు సమాచారం అందించడం, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆటో, జీపు డ్రైవర్లకు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకుండా, రాంగ్రూట్లో ప్రయాణించకుండా, ట్రా ఫిక్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లకు డిఫెన్స్ డ్రైవింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా స్పెషల్డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రెండోసారి మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఐదు మండలాల్లో డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించారు. జిల్లాలోని సిరికొండ, బజార్హత్నూర్, భీంపూర్, నార్నూర్, గాదిగూడ మండలాలకు చెందిన 350 మందికి డ్రైవింగ్ లైసెన్స్లు, 50 మందికి పర్మినెంట్ లైసెన్స్లు ఇప్పించేలా ఎస్పీ చొరవ చూపారు. భోరజ్ నుంచి బేల వైపు రోడ్డు సరిగా లేక హాట్స్పాట్లను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రమాదాలు, మృతుల వివరాలు సంవత్సరం ప్రమాదాలు మృతులు 2021 245 145 2022 234 137 2023 286 126 2024 349 127 2025 381 117 ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. రోడ్డుసేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేశాం. వాహనదారులకు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి భద్రత చర్యలు చేపడుతున్నాం. వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. సేల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
అరుదైన అతిథులొచ్చాయ్..!
బోథ్: సొనాల మండలంలోని గొల్లాపూర్ చెరువు అంతర్జాతీయ వలస పక్షులకు నిలయమైంది. అట వీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఇండియా సంయుక్తంగా నిర్వహించిన పక్షుల గణనలో సుమారు 300కు పైగా అరుదైన ‘బార్–హెడెడ్ గీసుల’ను అధికారులు గుర్తించారు. మధ్య ఆసియా, టిబెట్ లాంటి సు దూర ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి శీతాకాల విడిది కోసం ఈ పక్షులు ఏటా భారతదేశంలోని జలవనరులను ఆశ్రయిస్తుంటాయి. గొల్లాపూర్ చెరువులో ఇవి భారీ సంఖ్యలో కనిపించడం ఇక్కడి జీవ వైవిధ్యం, పర్యావరణ ఆరోగ్యానికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఎగిరే పక్షి జాతిగా గుర్తింపు పొందడం విశేషం. అత్యంత తక్కువ ఆక్సిజన్ ఉండే హిమాలయ పర్వత శ్రేణులనూ దాటి రాగలిగే అసాధారణ సామర్థ్యం వీటికి ఉందని ఎఫ్ఆర్వో ప్రణయ్ తెలిపారు. గొల్లాపూర్ చెరువులో నీటి నాణ్యత, సమృద్ధిగా ఆహారం లభి స్తుండటంతో ఇవి ఇక్కడ తలదాచుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ అరుదైన పక్షుల ఉనికి సొనాల మండలానికి గర్వకారణమని, వీటిని చూడటానికి పక్షి ప్రేమికులు ఆసక్తి చూపుతుండటంతో భవిష్యత్లో ఇక్కడ పక్షి పర్యాటకం అభివృద్ధి చెందే అవకాశముందని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. భద్రతపై ప్రత్యేక దృష్టి ఈ వలస పక్షుల భద్రతపై అటవీ అధికారులు ప్ర త్యేక దృష్టి సారించారు. అక్రమ వేట, నీటి కాలు ష్యం, శబ్ద కాలుష్యం లాంటి కారణాలతో పక్షులకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని తెలిపారు. వీటి ని కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు సూచించారు. స్థానికులు, రైతులు, యువత ఈ పక్షులను సంరక్షించడంలో భాగస్వాములు కా వాలని అధికారులు కోరారు. ఈ పక్షులకు ఇక్కడ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా మరిన్ని అరుదైన జాతులు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశముందని వారు చెబుతున్నారు. -
కొత్త కోడళ్ల భేటింగ్
భక్తులకు ఎలాంటి లోటు రానివ్వం నాగోబా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటు రానివ్వబోమని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ తెలిపారు. ఆదివారం నాగోబా ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. మెస్రం వంశీయులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. జాతర నిర్వహణ స్థలం, మెస్రం వంశీయులు బస చేసిన గోవడ్ స్థలాన్ని సందర్శించారు. భక్తులు తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదుల కోసం ఇబ్బంది పడకుండా చూడాలని, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్ మెస్రం తుకారాం, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్రావ్, దేవాదాయశాఖ ఈవో ముక్త రవి, ఇతర అధికారులున్నారు. కొత్తపుట్టల తయారీకి ఆవుపేడ, పవిత్ర కోనేరు జలంతో ఆలయంలోకి వస్తున్న మెస్రం వంశ మహిళలుఇంద్రవెల్లి: రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం నుంచి మెస్రం వంశీ యులు ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా సంప్రదాయ పూ జలు నిర్వహించారు. ముందుగా కేస్లాపూర్లో ని నాగోబా మురాడి నుంచి నాగోబా విగ్రహం, పూజ సామగ్రితో బయలుదేరారు. డోలు, తుడుం, కాలీకోమ్, పెప్రే వాయిస్తూ పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న మైసమ్మ దేవతకు పూజలు నిర్వహించి లోనికి ప్రవేశించారు. నాగోబా దర్శన అనంతరం సంప్రదాయ పూజలు నిర్వహించారు. కోనేరులో పవిత్రజలం సేకరించి.. సంప్రదాయ పూజల్లో భాగంగా మెస్రం వంశీయులు సిరికొండ కొత్త కుండలకు పూజలు చేశారు. అనంతరం 22కితల వారీగా మహిళలు, ఆడబిడ్డలు వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకుని కుండలు స్వీకరించారు. వంశ అల్లుళ్లు, ఆడబిడ్డలు కొత్త కుండలతో మర్రిచెట్టు వద్ద ఉన్న కోనేరుకు చేరుకున్నారు. కోనేరులో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకువచ్చారు. సంప్రదాయ పూజ సమయంలో పర్ధాన్ కితకు చెందిన మెస్రం వంశీయులు సంప్రదాయ వాయిద్యాలు వాయించగా ఆలయం పక్కనగల పాత మట్టి పుట్టలను వంశ అల్లుళ్లు తొలగించారు. ఆ మట్టితో ఆడబిడ్డలు తిరిగి కొత్త పుట్టలు తయారు చేశారు. పుట్ట మట్టిని ఉండలుగా సేకరించి నాగోబా ఆలయం పక్కనే గల సతి ఆలయం ఎదుట ఏడు వరుసలతో బౌల దేవతను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు నిర్వహించిన పూజలను ఐటీడీఏ పీవో యువరాజ్మర్మాట్ ఆసక్తిగా తిలకించా రు. పూజలు సాయంత్రం వరకు కొనసాగాయి. వైభవంగా మహాపూజ సంప్రదాయ పూజల అనంతరం రాత్రి 9నుంచి 10.30 గంటల వరకు పాదయాత్ర ద్వారా తీసుకువచ్చిన పవిత్ర గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. నాగోబాను అభిషేకించి మహాపూజ నిర్వహించారు. (ఈ సమయంలో మెస్రం వంశీయులు మినహా ఇతరులను అనుమతించలేదు) మహాపూ జ అనంతరం హాజరైన జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మహాపూజ హారతి స్వీకరించి నాగోబా జాతర ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. నాగోబా మహాపూజకు ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు, భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. దీంతో నాగోబా ఆలయ పరిసర ప్రాంతం జనసంద్రంగా మారింది. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు నాగోబా మహాపూజలో ఎంపీ గోడం నగేశ్, ఖానా పూర్, బోథ్ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, అనిల్జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, అదనపు ఎస్పీలు కాజల్సింగ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజామున 3గంటల వరకు భేటింగ్ (పరిచయం) నిర్వహించారు. ఇప్పటివరకు నాగోబా సన్నిధికి రాని సుమారు వందమందికి పైగా మెస్రం వంశ కొత్త కోడళ్లు తెల్లటి దుస్తులు ధరించి భేటింగ్కు హాజరయ్యారు. ముందుగా వంశ మహిళల సహకారంతో సతి దేవత, నాగోబా ఆలయంలో కొత్త కోడళ్లతో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కొత్త కోడళ్లు ఆలయం ఎదుట వరుసగా కూర్చున్న వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. భేటింగ్ ద్వారా కొత్తకోడళ్లు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లు భావించారు. కాగా, భేటింగ్ పూర్తి కావడంతో తమ జన్మ ధన్యమైందని కొత్తకోడళ్లు నాగోబాకు మొక్కుకున్నారు. -
పట్టణ సుందరీకరణకు చర్యలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధి లోని అటెండర్ కాలనీలో ఆదివారం పర్యటించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటెండర్ కాలనీ ఏర్పాటై 26 ఏళ్లవుతున్నా సరైన సదుపాయాలు లేక వానాకాలంలో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయించనున్నట్లు పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పట్టణాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రూ.300 కోట్ల నిధులతో మున్సిపాలిటీ అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. మరో రూ.600 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు. రాను న్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. ఆదిలాబా ద్ మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చా రు. నాయకులు ధోని జ్యోతి, అజయ్, గంగాధర్చారి, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు. -
టెట్ మినహాయించాలి
ఆదిలాబాద్టౌన్: సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్ కోరారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ.. సుప్రీం కోర్టు రెండేళ్లలో టీచర్లు టె ట్ ఉత్తీర్ణులు కావాలని తీర్పునిచ్చిందని తెలి పారు. వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో టెట్పై చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు 51శాతం ఫిట్మెంట్ అమలు చేయడంతో పాటు ఆరో గ్య కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, రవికుమార్, సంఘ బాధ్యులు బెజ్జంకి రవీంద్ర, నరేందర్, సత్యనారాయణ, మనోహర్, దేవిదాస్, శీతల్ చౌహాన్, జాదవ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు చనాక–కొరాట పంపు హౌస్ నుంచి నీటి విడుదల
సాత్నాల: చనాక–కొరాట పంపు హౌస్ నుంచి సోమవారం నీటిని విడుదల చేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రభు ఓ ప్రకటనలో తెలిపారు. భోరజ్ మండలం గూడ గ్రామం నుంచి బేల మండలం ఛాప్రాల గ్రామం వరకు లోయర్ పెన్గంగా పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం నీరు పంపుహౌస్ నుంచి ప్రధాన కాలువలో ఎత్తి పోయనున్నట్లు తెలిపారు. లోయర్ పెన్గంగా ప్రధాన కాలువ పరిసర ప్రాంతాల ప్రజలు ప్ర ధాన కాలువ వద్దకు పోవద్దని పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు నీటి పారుదల అధికారులను సమన్వయం చేసుకుని నీటిని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. యథావిధిగా బడి వేళలుఆదిలాబాద్టౌన్: జిల్లాలో చలి తీవ్రత కారణంగా గతనెల పాఠశాల పనివేళల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. చలి తీవ్రత తగ్గడంతో పనివేళలను యథావిధిగా కొనసాగించాల ని కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4.15గంటల వరకు బడులు నిర్వహించాలని ఆదేశించారు. -
తూకంలో మోసం చేస్తే చర్యలు
ఇంద్రవెల్లి: నాగోబా జాతరకు వచ్చిన భక్తులకు ఆహారపదార్థాల విక్రయంలో మోసం చేస్తే కఠి నచర్యలు తీసుకుంటామని జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారి ఎస్.విజయ్కుమార్ హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరలో ఏర్పా టు చేసిన దుకాణాలు, హోటళ్లను తనిఖీ చేసి కాంటాలు, బాట్లు పరిశీలించారు. పలువురు హోటళ్ల నిర్వాహకులు ఇష్టమొచ్చినట్లు ఎలాంటి పత్రాలు లేకుండా ఉపయోగిస్తున్న కాంటా లను గుర్తించి జరిమానా విధించారు. లీగల్ మె ట్రోలజీ అధికారులు అనుమతించిన కాంటాలతోనే వ్యాపారం చేయాలని సూచించారు. భక్తులను తూకంలో మోసం చేసినట్లు తెలిస్తే కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటామ ని, షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
‘ఖండాల’కు టీటీడీసీ గుర్తింపు
ఆదిలాబాద్రూరల్: మండలంలోని ఇంద్రవెల్లి అట వీ రేంజ్ పరిధిలో గల ఖండాల జలపాతానికి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఏటా మాదిరిగా టీటీడీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో ఈనెల 13 నుంచి ఇంటర్నేషనల్ కై ట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ‘100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ’ పోటీలో ఖండాల జలపాతానికి కన్సోలేషన్ బహుమతి దక్కింది. ఈమేరకు ఆ శాఖ ఎండీ వల్లూరి క్రాంతి చేతుల మీదుగా ఇంద్రవెల్లి ఎఫ్ఆర్వో సంతోష్ శుక్రవారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ, ఖండాలకు దక్కిన గుర్తింపు వెనుక అటవీశాఖ నిరంతర కృషి ఉందన్నారు. కాగా, టూరిజం శాఖ గుర్తింపుతో ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని పర్యాటకులు, స్థానికులు పేర్కొంటున్నారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
కైలాస్నగర్: కొరటా– చనాఖా బ్యారేజ్కు మా జీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి పేరు పె ట్టడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశా యి. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మంత్రుల ఫ్లేక్సీకి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్ జాదవ్ మాట్లాడుతూ, దివంగత మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భో జారెడ్డి, పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్, నాయకులు గండ్రత్ సుజాత, సాజి ద్ ఖాన్, సంజీవ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతరను విజయవంతం చేద్దాం
ఇంద్రవెల్లి: ఈనెల 18 నుంచి 25 వరకు నిర్వహించే నాగోబా జాతర విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్సింగ్ అన్నారు. నాగోబా ఆలయంతో పాటు జాతర నిర్వహణ స్థలాన్ని శనివారం పరిశీలించారు. నిబంధనల ప్రకారం దుకాణా లు ఏర్పాటు చేసుకోవాలని పలువురికి సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అడుగడుగునా సీసీ నిఘా ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న తదితరులున్నారు. -
నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభోత్సవమా?
ఆదిలాబాద్టౌన్: చనాఖా–కొరటా ప్రాజెక్టుకు రూ పాయి కేటాయించని సీఎం రేవంత్రెడ్డి పంప్హౌస్ను ప్రారంభించడం దారుణమని ముఖ్యమంత్రి రాకతో ప్రాజెక్టు కలుషితమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న విమర్శించారు. సీఎం రాకను నిరసిస్తూ ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిరసనకు వెళ్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అడ్డుకున్నారు. డీఎస్పీ జీవన్రెడ్డి ఉదయమే అక్కడికి చేరుకుని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రామన్నను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను సైతం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో, ప్రస్తుతం అలాగే ఉందన్నారు. రెండేళ్ల కాలంలో నిధులు కేటాయించని సీఎంకు పంప్ హౌస్ను ప్రారంభించే అర్హత లేదన్నారు. ఒక్క ఎకరానికి నీరు ఇవ్వని పంప్ హౌస్ను ప్రారంభించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఎన్ని రోజులు తమ వెంటపడ్డా ఏదో ఒక రోజు ప్రాజెక్టు వద్దకు వెళ్లి శుద్ధి చేస్తామని స్పష్టం చేశారు. పాలు పోసి.. శుద్ధి చేసి సాత్నాల: మాజీ మంత్రి రామన్న పిలుపు మేరకు కొరటా–చనాకా శుద్ధి కార్యక్రమంలో భాగంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు శనివారం బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. గుమ్మడికాయతో దిష్టి తీసి, అక్కడి జలాల్లో పాలు పోసి శుద్ధి చేశారు. ఇందులో ప్రభాకర్, కేశవ్, రూపేష్, గణేష్, ఆశన్న, దేవన్న తదితరులున్నారు. -
● బీసీలకు నాలుగు, జనరల్ రెండు, ఎస్సీ ఒకటి ● మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు కేటాయింపు ● ఉమ్మడి జిల్లాలో మహిళలకు అధిక అవకాశం ● పట్టణ పీఠాలు దక్కించుకునేందుకు వ్యూహాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పురపాలక సంఘ ఎ న్నికల రిజర్వేషన్లలో మహిళలకే పెద్దపీట దక్కింది. చైర్పర్సన్ స్థానాల్లో అధికంగా అతివలకే అవకాశం లభించింది. రాష్ట్రం యూనిట్గా చైర్పర్సన్, మేయ ర్ రిజర్వేషన్లలో సగానికి పైగా మహిళలకే దక్కా యి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కా ర్పొరేషన్తో సహా 11 మున్సిపాల్టీలు ఉండగా.. వీ టిలో సగం స్థానాలు మహిళలకే రిజర్వు అయ్యా యి. ఇక వార్డులు, డివిజన్లలోనూ మహిళలకు 50శా తం ప్రాతినిధ్యం ఉంది. జనరల్ స్థానాల్లోనూ మ హిళలు పోటీచేసే అవకాశం ఉంది. దీంతో మున్సి పాల్టీ పాలకవర్గాల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. రాజకీయ నాయకులు తమకు రిజర్వేషన్ కలిసి రాని చోట్ల తమ సతీమణులను పోటీలో నిలిపి పదవులు దక్కించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు. ఇక కొందరు భార్యలతో కుదరకపోతే తమ కుటుంబ సభ్యుల నుంచి మహిళలను పోటీలో దింపాలని చూస్తున్నారు. ఇప్పటికే టికెట్ల ఎంపి క కోసం ఆశావహులు దరఖాస్తులు, సర్వేలు, ప్రజ ల్లో బలంతో ఆర్థిక స్థితిగతులపై అంచనాలు వేశా రు. ఈ మేరకు వార్డులు, డివిజన్లలో ప్రాథమికంగా ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున జాబితా సిద్ధం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా పట్టణ ఎన్నికలు పట్టణాల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని పీఠాలు దక్కించుకునేలా వ్యూహాలు మొదలయ్యా యి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకునేలా ప్రణాళికలు వేశారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి పట్టణాల్లో జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలైన ఆదిలా బాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాలతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో పట్టు పెంచుకోవాలని సిద్ధమయ్యారు. 2020లో మున్సిపల్ ఎన్నికలు జరిగా యి. నాటి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంఐఎం మినహా అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ మున్సి పాల్టీలను కై వసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరుకు గండి పడి పది నియోజకవర్గాల్లో రెండు ఎమ్మెల్యేల స్థానాలకు పరిమితం కా గా.. నాలుగు బీజేపీ, నాలుగు కాంగ్రెస్ పార్టీ గెలు చుకున్నాయి. మరోవైపు లోక్సభ ఎన్నికల్లోనూ ఆది లాబాద్ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్ గెలుచుకోగా.. రాజకీయంగా మార్పులు వచ్చాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లోనూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు సర్పంచులను గెలిపించుకుని ప్రభావం చూపించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.మంచిర్యాల తొలి మేయర్ బీసీలకే.. ఉమ్మడి జిల్లాలో ఏకై క మున్సిపల్ కార్పొరేషన్ మంచిర్యాల. పట్టణం నుంచి అప్గ్రేడ్ అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల్లో కీలకమైన మేయర్ పీఠం రిజర్వేషన్లలో బీసీలనే వరించింది. బీసీ జనరల్ కేటగిరీ కావడంతో ఆ వర్గ నాయకుల్లో ఆసక్తిని పెంచింది. పోటీలో నిలిచే బీసీ నాయకులు మేయర్ పీఠంపై కన్నేశారు. నగరంలో మొత్తం 1.81లక్షల ఓట ర్లు ఉన్నారు. 60డివిజన్లతో ఓ అసెంబ్లీ నియోజకవర్గ పరిధితో సమంగా, పరిపాలనలోనూ ప్రత్యేక కనబర్చనుంది. దీంతో నగర ప్రథమ పౌరుడిగా రాజకీయంగా, ప్రొటోకాల్, అధికారిక హోదా విస్తృతంగా ఉండనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మేయర్ పీఠం దక్కించుకోవాలని పావులు కదుపుతున్నాయి. -
విధుల్లో నిర్లక్ష్యం వద్దు
ఆదిలాబాద్టౌన్: పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వ హించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల ని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో శనివారం నిర్వహించి న పరేడ్ను పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశా రు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నా రు. వ్యాయ మం చేస్తూ శారీరక ధృడత్వం కలిగి ఉండాలన్నారు. ప్రతీ శనివారం నిర్వహించే పరేడ్లో పాల్గొని పరిపూర్ణత చెందాలని సూచించారు. క్ర మశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కాగా ఈ ప రేడ్లో లాఠీడ్రిల్, ఆమ్స్ డ్రిల్, ట్రా ఫిక్ డ్రిల్ వంటి అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 50ఏళ్లు పై బడిన వారికి ప్రత్యేకంగా యోగా నిర్వహించనున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సీఐలు కె. నాగరాజు, ప్రేమ్ కుమార్, కె.ఫణిదర్, ప్రణయ్కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజ ర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణజిల్లా పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం విడుదల చేశారు. ఇందులో ఏఎస్పీ మౌనిక, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పి పోతారం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు. ప్రాచీన కళల పరిరక్షణ అందరి బాధ్యత ఆదిలాబాద్: ప్రాచీన కళల పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ప్రాంగణంలో మంథనం ఒక సంకల్పం కళా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మృన్మయ మట్టి కళాకృతుల ప్రదర్శనను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు కళలంటే ఎంతో మక్కువ అని తెలి పారు. నేటి తరానికి వారసత్వ కళలను పరిచయం చేయాలని వేదిక సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో వేదిక నిర్వాహకులు నిష్కాంతరావు దేశ్పాండే, సంజీవ్ రెడ్డి, నవల రచయిత వసంతరావు దేశ్పాండే, సాగర్, నితిన్, అనిరుధ్ పాల్గొన్నారు. -
తేలిన రిజర్వేషన్లు
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్, వార్డు స్థానాల రిజర్వేషన్లపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. చైర్పర్సన్ పీఠాన్ని రాష్ట్రం యూనిట్గా జనరల్ మహిళకు కేటాయిస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టికే.శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వార్డు స్థానాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా ఆధ్వర్యంలో ఖరారు చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సి పల్ అధికారులతో కలిసి శనివారం లక్కీడ్రా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయించగా బీసీ రిజర్వేషన్లను బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా ఖరారు చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాట కుండా చూశారు. ఇక మహిళలకు 50 శాతం స్థానాలను కేటాయిస్తూ లక్కీ డ్రా ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేశా రు. ఆశావహులు, ఆ యా రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ వార్డుల రిజర్వేషన్ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదు రు చూశారు. అనుకూలంగా వచ్చిన వారు సంతోషం వ్యక్తం చేశా రు. రాని వారు నిరాశతో వెనుదిరి గారు. గత కౌన్సిల్లో పని చేసి మరోసారి ఎన్నికల బరిలో నిలు ద్దామని భావించిన పలువురు రిజర్వేషన్ తారుమా రు కావడంతో పోటీకి అవకాశం లేకుండా పోయింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, రెవెన్యూ అధికారి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. హీటెక్కిన రాజకీయం రిజర్వేషన్ల ఖరారుతో మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆశావహులు పార్టీ టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అలాగే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అవుతున్నారు. మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలు వార్డు రిజర్వేషన్ వార్డు రిజర్వేషన్ 1 ఎస్సీ మహిళ 26 బీసీ జనరల్ 2 జనరల్ 27 జనరల్ 3 బీసీ మహిళ 28 జనరల్ 4 జనరల్ 29 జనరల్ మహిళ 5 జనరల్ మహిళ 30 జనరల్ 6 జనరల్ మహిళ 31 బీసీ మహిళ 7 బీసీ మహిళ 32 బీసీ మహిళ 8 ఎస్సీ జనరల్ 33 బీసీ జనరల్ 9 ఎస్టీ మహిళ 34 జనరల్ 10 బీసీ మహిళ 35 జనరల్ మహిళ 11 ఎస్సీ మహిళ 36 బీసీ మహిళ 12 ఎస్టీ జనరల్ 37 జనరల్ మహిళ 13 జనరల్ మహిళ 38 బీసీ మహిళ 14 ఎస్టీ జనరల్ 39 జనరల్ మహిళ 15 జనరల్ మహిళ 40 జనరల్ 16 జనరల్ మహిళ 41 జనరల్ మహిళ 17 ఎస్సీ జనరల్ 42 ఎస్సీ మహిళ 18 ఎస్సీ జనరల్ 43 బీసీ జనరల్ 19 జనరల్ 44 బీసీ జనరల్ 20 బీసీ జనరల్ 45 జనరల్ మహిళ 21 జనరల్ 46 బీసీ జనరల్ 22 జనరల్ 47 జనరల్ 23 జనరల్ 48 జనరల్ మహిళ 24 బీసీ జనరల్ 49 బీసీ జనరల్ 25 జనరల్ మహిళ -
సీఎంకు వినతుల వెల్లువ
ఆదిలాబాద్టౌన్: భోరజ్ మండలంలోని కొరటా–చనాఖా బ్యారేజ్ నీటి విడుదల కోసం శుక్రవారం జిల్లాకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి వినతులు వె ల్లువెత్తాయి. ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు పా యల్ శంకర్, అనిల్ జాదవ్లు ముఖ్యమంత్రిని క లిసి వినతి పత్రాలు అందజేశారు. నియోజకవర్గా ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బోథ్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి.. – అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే బోథ్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి. కుప్టి ప్రాజెక్ట్ టెండర్ పూర్తి చేయాలి. భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి, బజార్హత్నూర్ మండలంలోని దేగామ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు పరిహారం అందించాలి. ఇదివరకు మంజూరైన 28 చెరువులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలి. పిప్పిరి, తేజాపూర్, బుగ్గారం, సుంకిడి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులను ప్రారంభించాలి. బరంపూర్ నుంచి మోర్ఖండి, సిరిచెల్మ నుంచి పెంబి రోడ్లకు అటవీశాఖ అనుమతి ఇవ్వాలి. బోథ్లో ఫైర్స్టేషన్ ఏర్పాటు చేయాలి. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించాలి. మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేయాలి.. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో సాగునీరు, వ్యవసాయం, వి ద్య, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేయాలి. కొరటా–చనాఖా కాలువకు సంబంధించిన పంపి ణీ కాలువ, ఫీల్డ్ ఛానళ్ల నిర్మాణానికి భూసేకరణ చే పట్టాలి. ప్రాజెక్టు ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీటి ప్రయోజనం కల్పించాలి. పెండల్వాడ ట్యాంకుతో పాటు జైనథ్ ట్యాంక్ పునరుద్ధరణ చేపట్టాలి. రబీ సీజన్లో పండించే జొన్న పంటకు కనీస మద్దతు ధర చెల్లించి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. విద్యారంగ అభివృద్ధిలో భా గంగా జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలి. జైనథ్ మండలంలో డిగ్రీ కళాశాల ఏ ర్పాటు చేయాలి. నూతనంగా ఏర్పడిన సాత్నాల, భోరజ్ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు అ వసరమైన మండల సముదాయ భవనాలు నిర్మించాలి. సాత్నాల మండలం పార్డి(కె) వద్ద వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం ఇవ్వాలి. -
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
ఆదిలాబాద్టౌన్: సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 32 మంది ఎస్సైలు బందోబస్తులో పాల్గొన్నారు. వీరితో పాటు స్పెషల్ బ్రాంచ్ పార్టీ రెండు ప్లాట్ల టీజీఎస్పీ సిబ్బంది విధులు నిర్వర్తించారు. పార్కింగ్, హెలిప్యాడ్, కాన్వాయ్, పంప్హౌస్, చెక్పోస్టు వద్ద బాంబ్ డిస్పోజల్ టీమ్, ఇన్నర్, ఔటర్ కార్డెన్, పదిరకాల సెక్టార్లతో సిబ్బందిని విభజించి బందోబస్తు విధులు కేటాయించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీలు కాజల్సింగ్, సురేందర్ రావు, ఏఎస్పీ మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు జీవన్ రెడ్డి, శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
ఆదిలాబాద్టౌన్: ల్యాబ్టెక్నీషియన్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్న ల్యాబ్ టెక్నీషియన్లు శుక్రవారం డీఎంహెచ్వోను కలిసి విధుల్లో చేరారు. భీంపూర్(టి), హస్నాపూర్, బజార్హత్నూర్, అంకోలి, తాంసి, సైద్పూర్, ఝరి, గిమ్మ, డీఎంహెచ్వో కార్యాలయంలో ఖాళీగా ఉన్న ల్యాబ్టెక్నీషయన్ పోస్టులు భర్తీ అయినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ల్యాబ్టెక్నీషియన్లు డీఎంహెచ్వోను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ నిజామొద్దీన్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇలా వచ్చారు.. అలా వెళ్లారు
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన చడీచప్పుడు లేకుండా సాగింది. ఇలా వచ్చారు.. అలా వెళ్లారన్నట్టుగా కొనసాగింది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆయన హెలిక్యాప్టర్ ద్వారా నేరుగా భోరజ్ మండలం హత్తిఘాట్కు చేరుకున్నారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి ఉన్నారు. సీఎంకు ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు శంకర్, అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర అధికారులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు స్వాగతం పలికారు. అరగంట మాత్రమే ఆయన జిల్లాలో గడిపారు. కొరటా–చనాఖా పంప్హౌస్ వద్ద మీట నొక్కి పెన్గంగ జలాలను ప్రధాన కాలువలోకి వదిలారు. ఆ తర్వాత అందులో పారుతున్న గంగాజలాలకు పూజలు చేశారు. పూలు, చీరసారెలు అందులోకి వదిలారు. అనంతరం హత్తిఘాట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు తిరిగి చేరుకొని అక్కడి నుంచి నిర్మల్ బయల్దేరి వెళ్లారు. పెన్గంగ జలాలను ప్రధాన కాలువలోకి విడుదల చేసిన సందర్భంగా సీఎం మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు.. ఫొటో స్టాల్ సందర్శన.. హత్తిఘాట్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో నేరుగా హెలిక్యాప్టర్ నుంచి దిగిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి ప్రత్యేకంగా నిర్మించిన రోడ్డు మార్గం ద్వారా పంప్హౌస్ వద్దకు చేరుకున్నారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో స్టాల్ను సందర్శించారు. నీటి విడుదలకు సంబంధించిన వివరాలను కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులకు తెలియజేశారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు విజయవంతం చేయాలి
ఆదిలాబాద్: ఈనెల 18న పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలను విజయవంతం చేయాలని అథ్లెటిక్స్ అసొసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి కోరారు. గురువారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్ విడుదల చేశారు. అనంతరం స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొదటిసారిగా అథ్లెటిక్ స్టేట్ మీట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అండర్–8, 10, 12, 14 బాలబాలికలకు వివిధ రకాల పోటీలుంటాయని పేర్కొన్నారు. ఇందులో 33 జిల్లాల నుంచి 990 మంది క్రీడాకారులతో పాటు పీఈటీలు, పీడీలు, ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు. వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీటీఎస్వో పార్థసారథి, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాజేశ్, రాకేశ్, దయానంద్ పాల్గొన్నారు. -
ఈసారి కూడా నిరాశే!
ఇచ్చోడ: ఏళ్లుగా ఎదురుచూస్తున్న బోథ్ నియోజకవర్గ వాసులకు ఈ సారి కూడా నిరాశే మిగిలింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటనకు విచ్చేసిన సీఎం రేవంత్రెడ్డి నిర్మల్లో జరిగిన బహిరంగ సభలో కుప్టి ప్రాజెక్టు ఊసెత్తక పోవడంతో ఈ ప్రాంత రైతుల ఆశలు సన్నగిల్లాయి. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రికి బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేశ్జాదవ్ కుప్టి ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు. అనంతరం నిర్మల్ బహిరంగ సభలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ సైతం కుప్టి ప్రాజెక్ట్ విషయంలో సీఎం ప్రకటన చేయాలని కోరారు. దాదాపు గంటసేపు బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కుప్టి విషయం ప్రస్తవించక పోవడంతో ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి బోథ్లో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుప్టి ప్రాజెక్ట్కు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సీఎం హోదాలో మూడోసారి జిల్లాకు వచ్చిన ఆయన కుప్టి విషయం ప్రస్తవించకపోవడం గమనార్హం. -
అరెస్టులతో రైతు ఉద్యమాన్ని ఆపలేరు
ఆదిలాబాద్టౌన్/నేరడిగొండ: రైతుల పక్షాన బీఆర్ఎస్ చేపడుతున్న నిరసన, ఆందోళన కార్యక్రమాల ను అక్రమ అరెస్టులతో ఆపలేరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న స్పష్టం చేశారు. శుక్రవా రం సీఎం ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా పోలీసులు రామన్నను హౌస్ అరెస్ట్ చేశారు. తన నివాసంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నల్ల బ్యా డ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, కొరటా–చనాఖా ప్రాజెక్టును ట్రయల్ రన్ పేరుతో మరోసారి ప్రారంభిస్తూ రైతులను మోసం చేయడం తగదన్నారు. హౌస్ అ రెస్టు చేసిన రామన్నను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కలి శారు. అరెస్టును ఖండించారు. ఇందులో ప్రేమేందర్, ప్రహ్లాద్, అజయ్, దమ్మపాల్, గణేశ్, శ్రీను, రమేష్, అశోక్ స్వామి, భూమన్న తదితరులున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
ఖానాపూర్: మండలంలోని తర్లపాడ్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. నిర్మల్ మండలంలోని వెంకటాపూర్కు చెందిన బోయ పొశెట్టి కొన్నేళ్లుగా తర్లపాడ్లోని సోదరి పోశాని ఇంటివద్ద ఉంటున్నాడు. బుధవారం రాత్రి గ్రామంలోని రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా బైక్పై వచ్చిన అఫ్రోజ్ పోశెట్టిని ఢీకొట్టాడు. పోశెట్టికి తీవ్రంగా అఫ్రోజ్కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోశెట్టిని మెరుగైన వైద్యంకోసం నిర్మల్కు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్షాక్తో బాలునికి తీవ్రగాయాలుసాత్నాల: గాలిపటం ఎగరేస్తుండగా విద్యుత్ తీగలకు తాకడంతో షాక్కు గురై బాలునికి తీవ్రగాయాలైన సంఘటన భోరజ్ మండలం బాలాపూర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాలాపూర్ గ్రామానికి చెందిన మార్పెల్లి శ్రీనివాస్, విజయ దంపతుల కుమారుడు బాలయోగి ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం పక్కింటి డాబా మీద గాలిపటం ఎగరేస్తూ ఉల్లాసంగా ఉన్నాడు. గాలిపటం విద్యుత్ వైర్ల మధ్య ఇరుక్కోవడంతో మాంజాతో లాగడానికి ప్రయత్నిస్తుండగా తీగలకు తాకి షాక్కు గురయ్యాడు. గమనించిన స్థానికులు ముందుగా ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. శివాలయంలో మూడోసారి చోరీలోకేశ్వరం: మండల కేంద్రంలోని శివాలయంలో హుండీని గుర్తు తెలియని వ్యక్తులు పగుల గొట్టి నగదు ఎత్తుకెళ్లిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి హుండీని మిషన్తో కత్తిరించి అందులోని నగదు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్చ్యూయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గతంలో కూడా రెండు సార్లు ఇదే ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. చోరీల నివారణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మహిళ మృతదేహంపై ఆరా?ఆదిలాబాద్రూరల్: మావల పోలీస్స్టేషన్ పరిధిలో కొన్నిరోజుల క్రితం మహిళ అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. అయితే ఇటీవల మహారాష్ట్ర ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. దీంతో అదృశ్యమైన మహిళ, మహారాష్ట్ర ప్రాంతంలో లభించిన మృతదేహానికి ఏమైనా సంబంధం ఉందా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల పూజలు
ఇంద్రవెల్లి: నాగోబా మహాపూజకు అవసరమైన గంగాజలం కోసం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరి హస్తినమడుగు నుంచి సేకరించిన పవిత్ర గంగాజలంతో బయలుదేరిన మెస్రం వంశీయులు బుధవారం ఉదయం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ఎదుట ఉన్న మర్రిచెట్టుపై గంగాజలాన్ని భద్రపరిచారు. అనంతరం నైవేద్యం తయారుచేసి ఇంద్రాదేవికి సమర్పించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఎడ్లబండ్లపై వచ్చిన 22 కితల మెస్రం వంశీయులు ఇంద్రాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి కేస్లాపూర్ గ్రామ పొలిమేరలో గల మర్రిచెట్టు వద్ద బస చేశారు. మర్రిచెట్టు వద్ద మూడు రోజుల పాటు సంప్రదాయ పూజలతో పాటు మెస్రం వంశంలో మరణించిన పెద్దల పేర్లతో తూమ్ (కర్మఖాండ)పూజలు చేయనున్నారు. ఈ నెల 18న రాత్రి 10:30 గంటలకు నాగోబా ఆలయంలో మహాపూజ చేసి జాతర ప్రారంభిస్తామని, 22న దర్బార్ సమావేశం ఉంటుందని మెస్రం వంశీయులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో మెస్రం వంశ పెద్దలు మెస్రం హనుమంత్ కటోడ, మెస్రం కోసేరావ్, దాదారావ్, తిరుపతి, గణపతి, తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లిబాజా మోగాల్సిన ఇళ్లలో చావుకేకలు
కౌటాల(బెజ్జూర్): సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకుందామని చికెన్ కోసం బైక్పై వెళ్లిన మామ, అల్లుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కౌటాల మండలంలోని ముత్తంపేటకు చెందిన డోంగ్రే రాజశేఖర్ (21)కు బెజ్జూర్ మండలం కుంటాలమానెపల్లికి చెందిన యువతితో ఇటీవల వివాహం నిశ్చయించారు. ఈ వేసవిలో పెళ్లి జరగాల్సి ఉండగా ఈనెల 13న సంక్రాంతికి రాజశేఖర్ అత్తారింటికి వెళ్లాడు. బుధవారం అతని మామ బోర్కుట్ శంకర్ (48)తో కలిసి బైక్పై చికెన్ తెచ్చేందుకు సలగుపల్లి వెళ్లారు. తిరుగుప్రయాణంలో మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి వంతెనను ఢీకొనడంతో ఇద్దరూ పైనుంచి కిందపడిపోయారు. రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా శంకర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పండుగపూట మామాఅల్లుళ్ల మృతితో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మృతదేహాలకు సిర్పూర్(టి) ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు శంకర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బెజ్జూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మృత్యువే గెలిచింది..!
తాండూర్: కుమారుడి బంగారు భవిష్యత్ కోసం ఆ తల్లిదండ్రులు కన్న కలలు కల్లలయ్యాయి. బడికి వెళ్లమన్నందుకు ఆ బాలుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 24 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఈ విషాద ఘటన తాండూర్ మండలం నీలాయపల్లి గ్రామ పంచాయతీలోని ఒడ్డెర కాలనీలో చోటు చేసుకుంది. మాదారం ఎస్సై సౌజన్య తెలిపిన వివరాల మేరకు ఒడ్డెర కాలనీకి చెందిన దేవల్ల రాజేశ్, కోమలత దంపతుల కుమారుడు రుద్ర హనితేజ(15) తంగళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. డిసెంబర్ 21న పాఠశాలకు వెళ్లమని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
చైనా మాంజా విక్రయిస్తున్న ఒకరిపై కేసు
ఆదిలాబాద్టౌన్: చైనా మాంజా విక్రయిస్తున్న ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ టూటౌన్ ఇన్చార్జి సీఐ బి.సునీల్ కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాంసి బస్టాండ్ ఏరియాలో అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి వద్ద దాదాపు రూ.8వేల విలువ గల రెండు చైనా మాంజా చరకాలు, 14 ప్యాకెట్ల చైనా మాంజ లభించినట్లు పేర్కొన్నారు. అతనిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వివరించారు. మందమర్రిలో మరొకరిపై.. మందమర్రిరూరల్: పట్టణంలోని మార్కెట్ ఏరియాలో గల పతంగుల దుకాణంలో చైనా మాంజా విక్రయిస్తున్న నిర్వాహకుడు కొక్కుల మధుపై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంతోష్ తెలిపారు. బుధవారం దుకాణంలో తనిఖీ నిర్వహించగా మూడు బెండళ్ల చైనా మాంజా లభ్యమైనట్లు తెలిపారు. మాంజాను స్వాధీనం చేసుకుని నిందితుడిపై వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేసి పూచీకత్తుపై విడుదల చేశామన్నారు. -
నాగోబా జాతరకు ముమ్మర ఏర్పాట్లు
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొంది ఈ నెల 18న మహాపూజతో ప్రారంభం కానున్న నాగోబా జాతర ఏర్పాటు పనులను అధికారులు ముమ్మరం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా పనులను ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, ఏఈ భానుకుమార్ పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కేస్లాపూర్ నుంచి దస్నాపూర్ వరకు బీటీరోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నారు. కేస్లాపూర్ గ్రామానికి అనుబంధంగా ఉన్న మల్లాపూర్ బైపాస్ మట్టిరోడ్డుతో పాటు మెండపల్లి, హర్కపూర్ చౌక్ నుంచి మట్టిరోడ్లను పూర్తి చేశారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో దర్బార్ ఏర్పాటు పనులు ముమ్మరం చేశారు. జాతర సమీపిస్తుండడంతో వ్యాపారులు దుకాణ సముదాయాలు, రంగుల రాట్నాలు, సర్కస్లు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. -
రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాండూర్: మండలంలోని రేచిని రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు బెల్లంపల్లి రైల్వే హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య తెలిపారు. బుధవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి (45) రైల్వేట్రాక్ పక్కన తీవ్రమైన గాయాలతో పడిపోయాడు. స్థానికుల సమాచారంతో 108లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లభించలేదని, ఎరుపు రంగు బనియన్, ఆకుపచ్చ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మరి న్ని వివరాల కోసం 8712658601, 98491 98382 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. ఆత్మహత్యకు యత్నించిన లారీ డ్రైవర్..భీమారం: ఈ నెల 13న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన లారీ డ్రైవర్ బుధవారం మృతి చెందినట్లు జైపూర్ సీఐ నవీన్కుమార్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బానోత్ భీమానాయక్ (47)కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై మంగళవారం సాయంత్రం ఇంట్లోనే గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యంకోసం బుధవారం వరంగల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని తల్లి ఎంకూబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పలు రైళ్ల రాకపోకలు రద్దుబాసర: బాసర నుంచి నవీపేట్ మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనుల నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు నిజామాబాద్, నాందేడ్ మధ్య నడిచే 77645,77646 నంబరు గల రైళ్ల రాకపోకలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11409, 11410, 11413, 11414, 17687, 17688 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. 20811, 17641, 17057, 17606, 17661 నంబరుగల రైళ్లను రెగ్యులేషన్ కింద నడపనున్నట్లు రైల్వే డీవై, సీవో ఎం దిలీప్ కుమార్దాస్ తెలిపారు. పేకాడుతున్న ఐదుగురి అరెస్టుభీమిని: మండలంలోని మల్లీడి గ్రామ పంచా యతీ శివారులో బుధవారం పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి పే కాడుతున్న అన్నపురం సంజీవ్గౌడ్, సంగర్సు రమేశ్రావు, కోట విజయ్కుమార్, సంగర్సు రాంకిషన్రావు, చిలువేరు భాస్కర్గుప్తాను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పేకాట ముక్కలు, రూ.1,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో కానిస్టేబుళ్లు లక్ష్మ ణాచారి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎడ్లబండ్ల పోటీల్లో చెర్లపల్లి విజేత
చెన్నూర్రూరల్: ప్రతీ సంవత్సరం మాదిరిగానే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలంలోని లింగంపల్లి గ్రామంలో బుధవారం ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 30 ఎడ్లబండ్లు పందెంలో పాల్గొన్నాయి. బెల్లంపల్లి మండలం చెర్లపల్లికి చెందిన మాదాసు శివ ఎడ్లబండి మొదటి, లింగంపల్లి గ్రామానికి చెందిన జీళ్ల రవి ఎడ్లబండి ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. కాసిపేటకు చెందిన ఎడ్లబండి తృతీయ స్థానంలో నిలిచింది. ప్రథమ బహుమతి రూ.12వేలు, ద్వితీయ రూ.10వేలు, తృతీయ బహుమతి రూ.8వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అంగ రమేష్, ఉప సర్పంచ్ జీళ్ల తిరుపతి, కిష్టంపేట సర్పంచ్ రావుల తిరుమల, తిరుపతి, ఉప సర్పంచ్ మహేష్రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బొమ్మ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
● వైద్యుల నిర్లక్ష్యమంటూ బాధితుల ఆందోళన ● ఇద్దరు వైద్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు
గర్భస్థ శిశువు మృతిమంచిర్యాలక్రైం: గర్భస్థ శిశువు మృతిచెందిన ఘటన జిల్లా కేంద్రం మంచిర్యాలలో బుధవారం కలకలం రేపింది. బాధితులు ఆందోళనకు దిగడంతో ఇద్దరు వైద్యులపై కేసు నమోదైంది. బాధితుల కథనం ప్ర కారం.. నెన్నెల మండలం చిన్నవెంకటాపూర్ గ్రా మానికి చెందిన అంబటి వెంకటేష్ భార్య రమ్య పె ళ్లయిన ఐదేళ్లకు గర్భం దాల్చింది. మొదటి నెల నుంచి మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలి సూచనల మేరకు మందులు వాడుతోంది. ఈ నెల 14న సాధారణ ప్రసవానికి వైద్యురాలు సమ యం ఇచ్చింది. బుధవారం ఇంటి వద్ద నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యురాలు లేకపోవడంతో ఆమె సూచన మేరకు తన బంధువు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యురాలు పరీక్షించి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పరిశీలించి గర్భంలోనే శిశువు మృతిచెందిందని ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఆసుపత్రి ఎదుట ఆందోళన వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే గర్భస్థ శిశువు మృతిచెందిందని, ఆమైపె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే స్తూ మొదట వైద్యం పొందిన ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. స్థానిక సీఐ ప్రమోద్రావు జోక్యం చేసుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరు వైద్యులపై కేసు నమోదు చేశారు. మరో ఆస్పత్రిలో వ్యక్తి మృతి మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో మందమర్రి పట్టణంలోని గాంధీనగర్కు చెందిన వడ్లూరి శ్రీ నివాస్(53) బుధవారం మృతిచెందాడు. సీఐ ప్ర మోద్రావు, బాధితుల కథనం ప్రకారం.. కాలు దె బ్బతగిలి శ్రీనివాస్ ఈ నెల 10న ఆస్పత్రిలో చికిత్స పొందాడు. బుధవారం అస్వస్థతకు గురి కావడంతో రక్తం తక్కువగా ఉందంటూ చికిత్స అందిస్తున్నారు. గుండెపోటుతో మృతిచెందాడని వైద్యులు తెలిపారు. దీంతో వైద్యుడితో బంధువులు వాగ్వాదానికి దిగారు. పోలీస్లు ఇరువర్గాలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
ఆదివాసీల నిరసన దీక్ష విరమణ
కై లాస్నగర్: సాత్నాల మండలం దుబ్బగూడ కొలాం ఆదివాసీలు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షను బుధవారం విరమించారు. వారికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అటవీ అధికారులు అడ్డుకోవడంతో ఆందోళన చేపట్టారు. కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు తహసీల్దార్ రామారావు దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అటవీ అడ్డంకులు తొలగించి ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వారికి భరోసానిచ్చారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన కలెక్టర్కు ఈ సందర్భంగా ఆదివాసీలు కృతజ్ఞతలు తెలిపారు. -
రేపే సీఎం రాక
సాక్షి,ఆదిలాబాద్: సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. కొరటా–చనాఖా బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు బ్యారేజ్కు సమీపంలో ఉన్న పంప్హౌస్ వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్లో బయల్దేరుతారు. నేరుగా భోరజ్ మండలం హత్తిఘాట్ వద్దకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. దిగువ పెన్గంగపై నిర్మాణం.. దిగువ పెన్గంగపై తెలంగాణ(కొరటా) – మహారాష్ట్ర(చనాఖా) సరిహద్దున దీనిని నిర్మించారు. ఇక్కడి నుంచి 0.81 టీఎంసీ నీళ్లు ఎత్తిపోసే విధంగా బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. సమీపంలోని హత్తిఘాట్ గ్రామం వద్ద పంప్హౌస్ నిర్మించారు. ఈ పంప్హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయగా, పారేందుకు లోయర్ పెన్గంగ మెయిన్ కాలువ 42 కిలోమీటర్ల పరిధిలో నిర్మించడం జరిగింది. ఈ కాలువల ద్వారా నీరు జైనథ్, భోరజ్, బేల మండలాల్లోని ఆయకట్టుకు పారుతాయి. మెయిన్ కెనాల్ పనులు పూర్తయినప్పటికీ చేల వరకు నీళ్లు చేరేందుకు డిస్ట్రిబ్యూటరీ వర్క్ ఇంకా జరగాల్సి ఉంది. సీఎం పంప్హౌస్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఏర్పాట్లు పూర్తి.. హత్తిఘాట్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి సీఎం హెలిక్యాప్టర్లో నేరుగా ఇక్కడికే చేరుకుంటారు. పంప్హౌస్ వరకు వెళ్లేందుకు ప్రత్యేక రోడ్డు నిర్మాణం చేశారు. స్థలాభావం, భద్రత కారణాల దృష్ట్యా కేవలం పాస్ ఉన్నవారికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ హత్తిఘాట్ను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
సెర్ప్లో ‘ఎఫ్ఆర్ఎస్’
యాప్లోనే హాజరు నమోదు.. గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో పనిచేసే సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వం ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానాన్ని ఈనెల 1నుంచి అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ను రూపొందించింది. ప్రతీ ఉద్యోగి అందులోనే అటెండెన్స్ నమోదు చేసుకుంటున్నారు. లోకేషన్ షేర్ అవుతుంది కనుక వారు ఎక్కడ ఉన్నారనే విషయం తెలుస్తుంది. తద్వారా ఉద్యోగుల అనధికార గైర్హాజరు తగ్గి సేవలు మెరుగుపడుతున్నాయి. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో కై లాస్నగర్: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప రిధిలో పనిచేసే సెర్ప్ ఉద్యోగుల విధి నిర్వహణలో పారదర్శకతపై రాష్ట్ర ప్రభుత్వం ప్ర త్యేక దృష్టి సారించింది. కొంతమంది అధికా రులు, ఉద్యోగులు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే వెళ్లినట్లుగా, విధులకు రాకున్నా హాజరైనట్లుగా అటెండెన్స్ నమోదు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ఎఫ్ఆర్ఎస్) విధానం రూపొందించింది. ఈ నెల 1నుంచి జిల్లాలో అమల్లోకి తెచ్చింది. అధికారులు, ఉద్యోగుల పనితీరును నేరుగా రాష్ట్రస్థాయి నుంచి పర్యవేక్షించేలా ప్రత్యేక విభాగం సైతం ఏర్పాటు చేసింది. దీంతో ఇన్నాళ్లు కార్యాలయాలకే పరిమితమైన వారు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లాల్సి వస్తోంది. వ్యక్తిగతంగా హాజరు నమోదు.. జిల్లా పేదరిక నిర్మూలన సంస్థలో 170 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో ఆ ఫీస్ సబార్డినేట్ మినహా ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఉదయం10.30గంటలకు వ్యక్తిగతంగా తమ అటెండెన్స్ను ఈ యాప్లో న మోదు చేసుకుంటున్నారు. ఇప్పటికి ఎలాంటి చర్యలు లేనప్పటికీ రానున్న రోజుల్లో మూడుసార్లు 15 నిమిషాలు ఆలస్యంగా హాజరైతే ఒకరోజు సెలవుగా, మూడుసార్లు గైర్హాజరైతే ఒక రోజు వేతనం కోత విధించనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రస్థాయి నుంచే నేరుగా పర్యవేక్షణ.. ఉన్నతాధికారులు గతంలో మాదిరి ఉద్యోగు ల పనితీరు వ్యక్తిగతంగా పరిశీలించాల్సిన అవసరం లేదు. ఎఫ్ఆర్ఎస్ యాప్లో జిల్లాలో పనిచేసే అన్ని క్యాడర్ల ఉద్యోగుల వివరాలు నమోదై ఉంటాయి. వారు నమోదు చేసే అటెండెన్స్తో వారు ఉన్న లొకేషన్ అందులో షేర్ అవుతుంది. దీంతో ఏ అధికారి, ఉద్యోగి ఎక్కడ ఉండి పనిచేస్తున్నారనే దా న్ని ఉన్నతాధికారులు నేరుగా ఉన్న చోట నుంచే తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఉద్యోగుల పనితీరు, అటెండెన్స్ ప ర్యవేక్షించేందుకు గాను రాష్ట్రస్థాయిలో ప్రత్యే క విభాగం ఏర్పాటు చేశారు. దీంతో విధుల కు గైర్హాజరయ్యే, ఆలస్యంగా వచ్చే, విధుల కు రాకున్నా వచ్చినట్లుగా నమోదు చేసుకు నే ఉద్యోగులకు చెక్ పడినట్లయింది. తద్వారా ఉద్యోగుల పనితీరులో మార్పుతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే సేవలు మెరుగుపడుతున్నట్లుగా ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పనిచేస్తున్న సెర్ప్ అధికారులు, ఉద్యోగుల వివరాలు క్యాడర్ ఉద్యోగుల సంఖ్య అదనపు డీఆర్డీవో 01 ప్రాజెక్ట్ మేనేజర్ 09 అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ 26 కమ్యూనిటీ కోఆర్డినేటర్ 73 మండల సమాఖ్య సీసీ 47 పరిపాలన అసిస్టెంట్ 09 ఆఫీస్ సబార్డినేట్ 05 -
గాలిపటాల సందడి..
మరోవైపు గాలిపటాలతో చిన్నారులు, యువత సందడి ప్రారంభమైంది. చైనా మాంజాతో జిల్లాలో ఇటీవల పలువురు గాయపడ్డారు. ఈక్రమంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దీంతో ఎక్కువగా సాధారణ దారంతోనే గాలిపటాలు ఎగరేయడం కనిపించింది. సాధారణ దారంతో ఎగిరేస్తున్నాం.. ఈ పండుగ కోసం ఎదురుచూస్తుంటాం. పతంగి ఎగరేయడమంటే నాకేంతో ఇష్టం. స్నేహితులమంతా పోటీపడుతుంటాం. చైనా మాంజాతో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఈ సారి సాధారణ దారంతోనే ఎగరవేస్తున్నాం. – దుర్గాప్రసాద్, కోలిపుర -
సరదాల సంక్రాంతి వచ్చేసింది. మూడు రోజుల సంబ రాలు మొదలయ్యాయి. తొలిరోజున భోగి వేడుకలు మిన్నంటాయి. గాలి పటాలు నింగినంటగా.. అవనిపై రంగవల్లులు ఆవిష్కృతమయ్యాయి. డూడూ బసవన్నల రాకతో పల్లె పట్నం కోలాహలంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులతో ఇళ్లన్న
● నేడే సంక్రాంతి● ఘనంగా భోగి వేడుకలు ● ఊరూవాడా సందడిఆదిలాబాద్: సంక్రాంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున భోగి వేడుకలు ఘనంగా నిర్వహించుకోగా, గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమ జరుపుకోనున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి నిమి త్తం ఉన్న వారు సొంతూళ్లకు చేరుకున్నారు. ఇప్పటికే ప్రతీ ఇంట్లో పిండి వంటల తయారీ పూర్తయింది. భోగి నేపథ్యంలో యువతులు, మహిళలు వేకువజామునే ముంగిళ్లను రంగవల్లులతో అందంగా అలంకరించారు. ఉదయం చిన్నారులపై భోగిపండ్లు వేసి ఆశీర్వాదించారు. మరోవైపు గాలిపటాలతో యువత, పిల్లల సందడి చేశారు. ఘుమఘుమలాడుతున్న వంటిల్లు.. పంటలు చేతికందే సమయంలో వచ్చే ఈ పండుగ ను రైతులు ఘనంగా జరుపుకుంటారు. ఇంటింటా పిండి వంటలు తయారు చేసుకుంటారు. వంటిల్లు సకినాలు, గారెలు, అరిసెలు వంటి సాంప్రదాయ వంటకాలతో ఘుమఘుమ లాడుతుంటోంది. ద్వారకానగర్లో భోగిమంటల వేడుకల్లో పంజాబీలు అవనిపై.. హరివిల్లుయువతులు, మహిళలు ఉదయాన్నే ముంగిళ్లను ముగ్గులతో నింపి రంగులు వేసి తీర్చిదిద్దారు. సంప్రదాయ దుస్తులు ధరించి రంగవళ్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఉంచారు. అవనిపై హరివిల్లు మాదిరిగా వీధులు దర్శనిమచ్చాయి. -
రాజురాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
నేరడిగొండ: మండలంలోని తన స్వగ్రామం రాజురాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అనిల్జాదవ్ హామీ ఇచ్చారు. రాజు రాలో మంగళవారం పర్యటించారు. గడపగడపకూ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వాంకిడి నుంచి రాజురా వర కు డబుల్ రోడ్డు, గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, రింగ్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. మౌలిక వసతులు, అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు. -
ప్రకృతి ఫుడ్స్ సొసైటీ నెలకొల్పి..
గుడిహత్నూర్: రసాయనిక ఎరువుల వినియోగంతో విసిగిపోయిన మండలంలోని తోషం గ్రామానికి చెందిన పస్తాపురే రవీందర్ అనే రైతు ఎనిమిదేళ్ల క్రితం తక్కువ ఖర్చుతో పంటలు సాగు చేయాలని భావించాడు. 2017 లో సేంద్రియ విధానంలో కూరగాయల సాగుకు అంకురార్పణ చేశాడు. దశపత్రి కషాయం, నీమ్ఆస్త్రం, అగ్నిఆస్త్రం, పంచగవ్య, జీవామృతం వినియోగంతో మంచి ఫలి తాలొచ్చాయి. తనలాగా జిల్లాలో సేంద్రీయ సాగు చేస్తు న్న 93 మంది రైతులను ఏకం చేశాడు. మార్కెట్ సమస్యను అధిగమించాలని వీరితో అప్పటి కలెక్టర్ దివ్యదేవరాజ్ కలిశాడు. ఆ తర్వాత సేంద్రియ రైతులతో కలిసి ప్ర కృతి ఫుడ్స్ సొసైటీని నెలకొల్పాడు. దీంతో కలెక్టర్ వీరికి కలెక్టర్ చౌక్లో ఆదిలాబాద్ నాచురల్స్ పేరిట స్టోర్ కోసం స్థలాన్ని కేటాయించారు. నాటి నుంచి వీరంతా సేంద్రియ విధానంలో పండించిన కూరగాయలు ఇక్కడ అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నారు. దీంతో పాటు వీరు మహా రాష్ట్రలోని నాగ్పూర్ నాచురల్, నాసిక్లోని సహ్యాద్రి నాచురల్స్ జత కట్టారు. అవసరమైన కూరగాయలు, ఇతర సేంద్రీయ ఉత్పత్తులు అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం, అక్కడి వారికి అవసరమైనవి ఎగుమతి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పస్తాపురే కుటుంబ సభ్యులు రంజిత్, మనోజ్ కూడా సేంద్రియ సాగులో ముందుకుసాగుతున్నారు. కాగా, ప్రకృతి ఫుడ్ సొసైటీ సభ్యులు ఈ నెల 14న సేంద్రీయ విజ్ఞానయాత్రకు వెళ్లనున్నారు. యాత్రలో భాగంగా నాసిక్నాచరుల్స్, బారామతిలోని కిసాన్మేళా సందర్శించి సేంద్రియ విజ్ఞానాన్ని తెలుసుకోనున్నారు. -
పశుసంతతి పెంపులో శివదత్తగిరి మహరాజ్
తాంసి: అంతరించిపోతున్న పశుసంతతి పెంచడానికి మండలంలో ని నిపాని గ్రామానికి చెందిన శివదత్తగిరి మహరాజ్ కృషి చేస్తున్నాడు. గ్రామంలో 20ఏళ్ల క్రితం శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని గ్రామస్తుల సహకా రంతో నిర్మించి అక్కడే పశువుల పెంపకం చేపట్టాడు. గ్రామస్తుల ద్వారా ఆవులను కొనుగోలు చేసి సంరక్షణ చర్యలు చేపడుతున్నాడు. ప్రస్తుతం 20కి పైగా పశువులుండగా ఆలయ ప్రాంగణంలో నిర్మించి న ప్రత్యేక షెడ్లో వీటికి ఆవాసం క ల్పించాడు. కాపరిని నియమించి నిత్యం వాటికి దాణా, పచ్చిగడ్డి అందిస్తున్నాడు. ప్రత్యేకంగా కొనుగోలు చేసిన సాగు భూమిలో గడ్డిని పెంచుతున్నాడు. నిత్యం ఉదయం, సాయంత్రం పశువులను చూస్తే మానసిక సంతృప్తి కలుగుతోందని శివదత్తగారి మహరాజ్ చెబుతున్నాడు. తగ్గిపోతున్న పశువుల సంతతిని పెంచేందుకు ప్రతి ఒక్కరూ తమవంతుగా పశుపోషణ చేపట్టాలని కోరుతున్నాడు. -
ల్యాబ్ టెక్నిషియన్లకు పోస్టింగ్
ఆదిలాబాద్టౌన్: ఎట్టకేలకు గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రభుత్వం నియామక ఉత్తర్వులు అందజేసింది. మంగళవారం హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆవరణ లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహా, రాష్ట్ర రవాణాశాఖ, బీసీ సంక్షే మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేశారు. జిల్లా నుంచి 33 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిని 20 పీహెచ్సీల్లో భర్తీ చేశారు. అయితే, రిమ్స్ ఆస్పత్రిలో ల్యాబ్టెక్నీషియన్ పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం భర్తీ చేయలేదు. బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026పల్లెరోడ్లకు మహర్దశ తాంసి మండలంలోని పల్లెరోడ్లకు మహర్దశ పట్టనుంది. గిరిజన సంక్షేమశాఖ రూ.16కోట్లు మంజూరు చేయగా ఆరు గ్రామాల అనుసంధాన రోడ్లపై బీటీ వేయనున్నారు. టెక్నాలజీతో శాశ్వత పరిష్కారం జిల్లాలో రికార్డులు లేని ఎనిమిది గ్రామాలకు అత్యాధునిక టెక్నాలజీతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. చిచ్ధరి ఖానాపూర్ను సందర్శించారు. -
మెరుగైన వైద్యం అందాలి
సాత్నాల: గర్భిణులకు మెరుగైన వైద్యసేవలందించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ సూచించా రు. భోరజ్ మండలం గిమ్మ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. రికార్డులు, ఫార్మసీ, వ్యాక్సిన్ రూమ్, ల్యాబ్, లేబర్ రూమ్, ఇ న్పేషెంట్ వార్డులను పరిశీలించారు. సిబ్బంది సకా లంలో విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. మహిళలు గర్భం దాల్చిన నుంచి ప్రసవం వరకు వైద్యపరీక్షలు నిర్వహించి సేవలందించాలని, అధిక ప్రమాద గర్భిణులను ముందే గుర్తించి పెద్దాస్పత్రులకు పంపించాలని సూచించారు. ఆశ, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు సమన్వయంతో గ్రా మస్థాయిలో గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని నిరంత రం పర్యవేక్షించాలని, ప్రసవాలు ప్రభుత్వాస్పత్రిలో నే జరిగేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఆయన వెంట మండల వైద్యాధికారి సుచల, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రాంరెడ్డి, స్టాఫ్ నర్స్ సంస్కృతి, ఏఎన్ఎం నీరజ, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. -
భక్తులకు ఎలాంటి లోటు రానివ్వొద్దు
ఇంద్రవెల్లి: ఈ నెల 18నుంచి 25వరకు నిర్వహించనున్న నాగోబా జాతరలో మెస్రం వంశీయులు, భ క్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. మంగళవారం మండలంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్లో నిర్వహించిన జాతర నిర్వహణ రెండో స మీక్షకు హాజరై మాట్లాడారు. భక్తులకు సరిపడా ఆర్టీ సీ బస్సులు నడపాలని, జాతరలో వివిధ శాఖల అ ధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ నెల 22న నిర్వహించే దర్బార్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 80శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాతర ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిరంతరం 350 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జాతర వెబ్సైట్ను ప్రారంభించారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, సర్పంచ్ మెస్రం తుకారాం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
● వ్యవసాయంలో నేటికీ ఎద్దుల సాయం ● జిల్లాలో పెరిగిన ‘సేంద్రియ’ విధానం ● పశుపోషణపై పలువురు కర్షకుల ఆసక్తి ● విభిన్న రీతుల్లో ముందుకెళ్తున్న రైతులు ● ఆదర్శంగా నిలుస్తున్న అన్నదాతలెందరో..
హర్కపూర్తండాలో ఎడ్లతో దుక్కి చదును చేస్తున్న రైతు చవాన్ అంబాజీఅంబాజీకి దేవ్డియా, పావిడ్యానే పెద్ద దిక్కు ఇంద్రవెల్లి: మండలంలోని హర్కపూర్తండాకు చెందిన రైతు చవాన్ అంబాజీ నేటికీ ఎద్దుల సాయంతోనే వ్యవసాయం చేస్తున్నాడు. తన మూడెకరాల్లో రెండు సీజన్లలోనూ పత్తి, ఆయిల్పాం లాంటి పంటలు వేస్తూ అంతరపంటలుగా జొన్న, శనగ, కూరగాయలు సాగు చేస్తున్నాడు. సహజ పద్ధతిలో ఎద్దుల నాగలితో దుక్కి దున్ని సాగు ఖర్చులు తగ్గించుకుంటున్నాడు. తనకు సాగులో చేదోడువాదోడుగా నిలిచే ఎద్దులను దేవ్డియా, పావిడ్యా పేర్లతో ముద్దుగా పిలుచుకుంటాడు. వ్యవసాయ పనుల్లో ఎద్దుల వినియోగం ఘననీయంగా తగ్గిన ఈ రోజుల్లోనూ జిల్లాలో పలువురు రైతులు వాటినే నమ్ముకుని వ్యవసాయంలో ‘సాగు’తున్నారు. రసాయన ఎరువులకు స్వస్తి పలికి సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఇంకొందరు కర్షకులు. క్రమంగా పశుసంపద తగ్గుతుండడంతో వాటి పెంపకం చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పశుపోషకులు.. ఇక బసవన్నలతో వివిధ విన్యాసాలు చేస్తూ.. చేయిస్తూ.. కుటుంబాలను పోషించుకుంటున్నారు గంగిరెద్దులవారు. ఇలా పశువుల సాయంతో విభిన్న రీతుల్లో ముందుకు సాగుతూ.. తమదైన ముద్ర వేసుకుంటున్న పలువురిపై ప్రత్యేక కథనం.. -
ప్రకృతి సేద్యమే పరమావధిగా..
ఇచ్చోడ: మండలంలోని నవేగావ్ గ్రామానికి చెంది న రైతు రామేశ్వర్ పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చే స్తున్నాడు. రసాయనిక ఎరువుల వినియోగానికి స్వ స్తి పలికి సేంద్రియ పద్ధతిలో పసుపు, గోధుమ, కంది, శనగ పంటలు పండిస్తున్నాడు. సొంతంగా త యారు చేసుకుంటున్న ద్రవ జీవామృతం, ఘన జీ వామృతం, నిమ్మఆస్త్రం, అగ్నిఆస్త్రం, బ్రహ్మఆస్త్రం, పేడామృత ద్రావణాలను వినియోగిస్తూ సాగు చే స్తున్నాడు. సేంద్రియ విధానంలో పండించిన పంట లకు మంచి గిరాకీ ఉందని చెబుతున్నాడు. తాను పండించిన పంట ఉత్పత్తుల ద్వారా శనగ పప్పు, కంది పప్పు, గోధుమ పిండి, పసుపు స్వతహాగా త యారు చేస్తూ సామాజిక మాధ్యమాలను ప్రచారా నికి వాడుకుంటూ ఇంటి వద్దే విక్రయిస్తున్నట్లు పే ర్కొంటున్నాడు. ఎవరు ఆర్డర్ చేసిన ఇంటికే ఉత్పత్తులను పంపించడం రామేశ్వర్ ప్రత్యేకత. ఇందులో పదేళ్లుగా రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. -
నేరాల నియంత్రణకు నాకాబందీ
ఆదిలాబాద్టౌన్: నేరాల నియంత్రణకు సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో నా కాబందీ నిర్వహించినట్లు ఎస్పీ అఖిల్ మహా జన్ తెలిపారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన నాకా బందీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలా పాలు, అక్రమ రవాణాను అడ్డుకునే లక్ష్యంతో నాకాబందీ చేపట్టినట్లు తెలిపారు. 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో 28 చెక్పోస్టులు ఏర్పాటు చేసి జిల్లా సరిహద్దులు, మహారాష్ట్రతో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దులు, అంతర జిల్లా సరిహద్దులు, పట్టణ ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేపట్టిన ట్లు పేర్కొన్నారు. డ్రండెన్డ్రైవ్లో 37 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నంబర్ ప్లేట్లు లేని ఎనిమిది వాహనాలు, సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం పర్యటన అరగంటే..
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి ఇక్కడ కేవలం అరగంట మాత్రమే ఉండనున్నారు. ఈనెల 16న మధ్యాహ్నం 12గంటలకు హై దరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా జిల్లాలోని భో రజ్ మండలం హత్తిఘాట్కు నేరుగా రానున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆయన వెంట జిల్లాలో పర్యటించనున్నారు. కొరా ట–చనాక బ్యారేజ్కు కొద్ది దూరంలో హత్తిఘాట్ వద్ద నిర్మించిన పంప్హౌస్ నుంచి మోటార్లను ఆన్చేసి నీళ్లు మెయిన్ కాలువలోకి విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అక్కడే పూజ కార్యక్రమాల్లో పా ల్గొంటారు. ఎలాంటి బహిరంగ సభ ఏర్పాటు చే యలేదు. 12.30 గంటలకు ఆయన పర్యటన పూర్తవుతుంది. ఇక్కడి నుంచి నిర్మల్ జిల్లాకు బయల్దేరి వెళ్తారు. కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవా రం హత్తిఘాట్ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. హెలిప్యాడ్ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. జి ల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఆది లాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, సీనియర్ నేతలు గండ్రత్ సుజాత, సంజీవ్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య హత్తి ఘాట్ వద్ద పంప్హౌస్ను పరిశీలించారు. అయితే, హత్తిఘాట్ వద్ద పంప్హౌస్ నుంచి నీళ్లు విడుదల చేసే కార్యక్రమ కవరేజ్కు మీడియాకు స్థలాభావం, భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి నిరాకరించిన ట్లు సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయి. సెంటిమెంట్గా జిల్లా పర్యటన టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత రేవంత్రెడ్డి అప్పట్లో జిల్లాలోని ఇంద్రవెల్లిలో నిర్వహించిన బహిరంగ సభ హాజరయ్యారు. సభ సక్సెస్ కా వడంతో పార్టీలో ఉత్సాహం నింపింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా రేవంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. ఇలా జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. 2024 ఫిబ్రవరిలో మొదటిసారి సీఎం హోదాలో ఆయన ఇంద్రవెల్లికి వచ్చారు. నాగోబా కు ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా కేంద్రానికి ప్రధాన మంత్రి మోదీ వచ్చినప్పుడు సీఎం రేవంత్రెడ్డి కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక సర్పంచ్ ఎన్నికలకు ముందు గత డిసెంబర్లో ఆయన రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. నెల తర్వాత మళ్లీ ఆయన జిల్లాకు వస్తున్నారు. ఒకవిధంగా ఆయన తన పర్యటనను సెంటిమెంట్గా జిల్లా నుంచి కొనసాగిస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా, ఆదిలాబాద్కు మరోసారి రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పక డ్బందీ ఏర్పాట్లు చేయాలి సాత్నాల: ఈ నెల 16న సీఎం రేవంత్రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించా రు. మంగళవారం భోరజ్ మండలం హత్తిఘాట్ గ్రామంలోని చనాక–కొరాట బ్యారేజీ పంప్హౌస్ వద్ద చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం పర్యటన సాఫీగా సాగేలా అన్ని శాఖల అ ధికారులు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. భద్రత కా రణాల దృష్ట్యా గుర్తింపుకార్డులు, పాస్లున్నవారి నే అనుమతించనున్నట్లు తెలిపారు. అంతకుముందు కలెక్టర్, ఎస్పీ హెలిప్యాడ్ ప్రాంతాన్ని, పంప్హౌస్, ప్రధాన కాలువ, ప్రధాన కాలువ డె లివరీ సిస్టమ్ (డీసీ) వద్ద పూజాకార్యక్రమ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రా జేశ్వర్, ఆదిలాబాద్ ఆర్డీవో స్రవంతి, నీటి పారుదలశాఖ ఎస్ఈ విశ్వకళ్యాణ్, ఇంజినీర్లు, తహసీ ల్దార్లు రాజేశ్వరి, శ్రీనివాస్, అగ్నిమాపక, వైద్య, రెవెన్యూ ఇతర శాఖల అధికారులున్నారు. -
వ్యవసాయంపై ఆసక్తితో జాబ్ వదులుకుని..
ఉట్నూర్రూరల్: మండలంలోని లక్కా రం గ్రామానికి చెందిన రైతు జాడి లింగన్న–సుమలత దంపతులు సాగునే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్గా పని చేసిన లింగన్న వ్యవసాయంపై మక్కువతో పదేళ్ల క్రితం రైతుగా మారి సాగులో సత్తా చాటుతున్నాడు. నవోదయనగర్ సమీపంలోని తన రెండెకరా ల్లో ఆర్గానిక్ విధానంలోవంకాయ, బెండ, బీర, కాకర, సోర, కొత్తిమీర, మి ర్చి, చిక్కుడు తదితర కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నాడు. మార్కెట్లో విక్రయించి రోజుకు సుమారు రూ.వేయి సంపాదిస్తున్నాడు. ఏడాదికి రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఆదాయం గడిస్తున్నాడు. వేసవిలో నీటి కొరతను అధిగమించేందుకు డ్రిప్ సిస్టం ద్వారా తక్కువ నీటితో సాగు విస్తీర్ణం తగ్గించకుండా శభాష్ అనిపించుకుంటున్నాడు. తనకు వ్యవసాయంపై ఇష్టం ఉండడంతో ఎంత కష్టమైనా ఉపాధిగా మలుచుకున్నట్లు చెబుతున్నాడు. -
‘రేవంత్రెడ్డి పర్యటనను అడ్డుకుంటాం’
ఆదిలాబాద్టౌన్: సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటన ను అడ్డుకుంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు జోగు రామన్న పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ న్లైన్ క్రాప్ సర్వే పేరిట భూమి ఉన్న రైతులకు రై తుబంధు ఇవ్వకుండా మోసం చేస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సీఎం జిల్లా కు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఇప్పుడు కొరాటా–చనాక ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ఎన్నికల ప్ర చారంలో భాగమేనని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డికి రైతుల బాధలు పట్టవని, ఎన్నికలు దగ్గరపడగానే కానుకలు గుర్తుకు వస్తాయని ఆరోపించారు. నాయకులు యాసం నర్సింగరావు, గండ్రత్ రమేశ్, మెట్టు ప్రహ్లాద్, బట్టు సతీశ్, బుట్టి శివ, అడప తిరుపతి, రాఘవేంద్ర, మహేశ్, జాన్సన్ ఉన్నారు. -
వాతావరణం
ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చలి తగ్గుతుంది. అయ్యవారికి దండం పెట్టు..తలమడుగు: సంక్రాంతి నేపథ్యంలో గ్రామాల్లో గంగిరెద్దుల విన్యాసాలు మొదలయ్యాయి. వా టి యజమానులు ముస్తాబై గంగిరెద్దులను అ లంకరించి ఇళ్ల ముంగిటకు వస్తున్నారు. అయ్యవారికి దండం పెట్టు.. అంటూ వాటితో దండాలు పెట్టిస్తున్నారు. విన్యాసాల్లో యజమాని చె ప్పినట్లు బసవన్నలు తల ఆడించడం, ముందు కాళ్లతో దండం పెట్టడం, తల ఊపుతూ కాళ్లు, క డుపుతో గజ్జల శబ్ధం చేయడం లాంటి విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సుమారు మూడు క్వింటాళ్లున్న బసవన్న నాలుగు కాళ్లను దాని యజమాని పొట్టపై మోసే విన్యాసం కంటతడి పెట్టిస్తుంది. కూటి కోసం వారు పడే తి ప్పలు చూసి కానుకలు వేసి సాగనంపడం నేటి కీ జిల్లాలో కనిపిస్తుండడం విశేషం. కాగా, గంగిరెద్దులే తమకు జీవనాధారమని, వాటి ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్నామని గంగిరెద్దుల యజమాని రాము పేర్కొన్నాడు. -
‘ఇందిరమ్మ’ పనులు అడ్డుకోవద్దు
కై లాస్నగర్: ఆదివాసీల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అటవీశాఖ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. డీఎఫ్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ.. దుబ్బగూడ గ్రామానికి 11 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, గ్రామానికి చెందిన లేతుబాయి ఎకరం భూమిని దానం చేసినట్లు తెలిపారు. తహసీల్దార్ రెవెన్యూ భూమిగా నిర్ధారిస్తూ అఫిడవిట్ జారీ చేశారని పేర్కొన్నారు. అందులో నిర్మాణ పనులు ప్రారంభించగా, అటవీశాఖ అధికారులు అడ్డుపడటం సరికాదన్నారు. నిర్మాణాలు కొనసాగేలా చూడాలన్నారు. అనంతరం శిక్షణ ఐపీఎస్ చిన్నబూస్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో లంకా రాఘవులు, సాజిదొద్దీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ‘అనవసర రాద్ధాంతం సరికాదు’ సాత్నాల మండలం దుబ్బగూడలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట చేపట్టిన ఆందోళనకు సంబంధించిన స్థలం సాత్నాల రిజర్వు ఫారెస్ట్లోకి వస్తుందని డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్ ప్రకటనలో తెలిపారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా అటవీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాన్ని చూపించడం జరిగిందని తెలిపారు. దీనిపై ఒక కుటుంబం మాత్రమే అభ్యంతరం చెప్పి రిజర్వ్ ఫారెస్ట్ స్థలంలో ఇంటి నిర్మాణానికి యత్నిస్తుందని పేర్కొన్నారు. వారిపై అటవీ నేరం కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. అటవీ, పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేస్తూనే ఆదివాసీలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. -
1,43,655
కై లాస్నగర్: ఆదిలాబాద్ బల్దియా ఓటర్ల తుది జాబితాను మున్సిపల్ అధికారులు సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా వార్డుల వారీగా సిద్ధం చేసిన ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితాను సాయంత్రం 6 గంటల సమయంలో ప్రకటించారు. పట్టణంలోని 49 వార్డుల పరిధిలో 1,43,655 మంది ఓటర్లున్నట్లుగా లెక్క తేల్చారు. ఇందులో పురుష ఓటర్లు 69,813 మంది ఉండగా, మహిళలు 73,836 మంది ఉన్నారు. ఇతరులు మరో ఆరుగురున్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు 4,023 మంది అధికంగా ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో వీరే కీల కం కానున్నారు. ఈ జాబితాలను మున్సిపల్ కా ర్యాలయంతో పాటు కలెక్టరేట్, ఎన్నికల అఽ దికారి, ఆర్డీవో, అర్బన్ తహసీల్దార్ కార్యాలయా ల నోటీసు బోర్డులలో ప్రదర్శించనున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల తుది జాబితాను మంగళవారం విడుదల చేయనున్నారు. ఓటరు జాబితా విడుదల కావడంతో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్ర క్రియ షురూ కానుంది. దీనిపై రేపో, మాపో ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశమున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియపూర్తయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్విడుదల కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యంతరాలను సవరించి... ఈ నెల 1న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. చాలా వరకు తప్పులు దొర్లాయి. పలు వార్డుల్లోని ఓటర్లు ఇతర వార్డుల్లోకి తారుమారయ్యారు. గందరగోళ పరిస్థితి తలెత్తెంది. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏ ర్పాటు చేసి అభ్యంతరాలు స్వీకరించారు. మొ త్తం 308 అభ్యంతరాలు అందాయి. వాటన్నింటిపై వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక విచారణ చేయించి ఒక వార్డులోనిఓటర్లు అదే వార్డులో ఉండేలా శ్రద్ధ వహించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు వార్డునంబర్ ఓటర్లు వార్డునంబర్ ఓటర్లు 1 2,875 25 2,678 2 3,194 26 3,122 3 2,756 27 2,558 4 3,832 28 2,849 5 2,830 29 2,943 6 2,933 30 3,254 7 3,099 31 2,958 8 3,230 32 3,524 9 2,620 33 2,399 10 3,094 34 2,684 11 2,831 35 3,270 12 3,197 36 3,073 13 2,863 37 2,374 14 2,977 38 3,305 15 3,180 39 3,077 16 3,500 40 2,993 17 2,675 41 2,845 18 2,638 42 2,703 19 3,053 43 2,890 20 2,801 44 3,473 21 3,163 45 2,511 22 3,208 46 2,571 23 2,867 47 2,487 24 2,767 48 2,358 49 2573 -
‘ప్రణామ్’ సద్వినియోగం చేసుకోవాలి
కై లాస్నగర్: సమాజ నిర్మాణంలో వయోవృద్ధుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ సాధికారత శాఖ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ క్వార్టర్స్లైన్లో ఏర్పాటు చేసిన ప్రణామ్ డే కేర్ సెంటర్ను కలెక్టర్ రాజర్షి షాతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం డే కేర్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రణామ్ సేవలను వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందుగా వర్చువల్ విధానంలో సీఎం రేవంత్రెడ్డి ఈ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవిదాస్ దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా ఉండాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్కై లాస్నగర్: బాధితులకు న్యాయం చేకూర్చడమే పోలీస్శాఖ ప్రధాన బాధ్యత అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 33 మంది తమ సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. వాటిని స్వీకరించిన ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, కేసులు త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మౌనిక, సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిఆదిలాబాద్టౌన్: వాహనదారులంతా తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రోడ్డు భ ద్రత మాసోత్సవాల సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద ప్రారంభమైన ర్యాలీ వినాయక్ చౌక్, దేవిచంద్ చౌక్, బస్టాండ్, కలెక్టర్ చౌ రస్తా మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఎ స్పీ మాట్లాడుతూ, ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలను 20 శాతం తగ్గించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి. సురేందర్ రావు, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీఐలు బి.సునీల్ కుమార్, కర్ర స్వామి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి. వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్సైలు దేవేందర్, మహేందర్, టీజీఎస్పీ, ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరేయాలి’
కైలాస్నగర్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. అనంత రం సీఎం రేవంతన్న బస్తీబాట ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. మంగళవారం నుంచి పట్టణంలోని ఆయా వార్డుల్లో పాదయాత్ర చేయనున్నట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావ్, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు దిగంబరావ్ పాటిల్, సుఖేందర్ తదితరులు పాల్గొన్నారు. -
● ఈనెల 16న జిల్లాకు రేవంత్రెడ్డి ● కొరటా–చనాఖా పంప్హౌస్ నుంచి నీటి విడుదల ● మంత్రి ‘ఉత్తమ్’ సైతం హాజరు ● బ్యారేజీ, పంప్హౌస్, మెయిన్ కెనాల్ ఇప్పటికే పూర్తి ● ఉపకాలువల పనులు మాత్రం పెండింగ్
కొరటా–చనాఖా బ్యారేజ్సాక్షి,ఆదిలాబాద్: సీఎం ఆదిలాబాద్ పర్యాటన ఖరారైంది. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాకు విచ్చేయనున్నారు. కొరటా–చనాఖా బ్యారేజ్ నిర్మాణంలో భాగంగా మెజార్టీ పనులు ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పంప్హౌస్ల నుంచి నీటి విడుదల కార్యక్రమాన్ని సీఎం ఆ రోజున ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కూడా హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ కూడా విడుదలైంది. ముఖ్యమంత్రి ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి 12 గంటల వరకు భోరజ్ మండలం హత్తిఘాట్ వద్ద పంప్హౌస్ వద్దకు హెలిక్యాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. అక్కడ శిలాఫలకం ఆవిష్కరించి మెయిన్ కెనాల్ వద్ద పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బ్యారేజ్ తీరుతెన్నులు లోయర్ పెన్గంగపై తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దున నదీ భూభాగాన్ని కలుపుతూ కొరటా–చనాఖా బ్యారేజ్ నిర్మాణానికి రూ.1,227 కోట్ల అంచనా వ్యయంతో 2015–16లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన ఆమోదం ఇచ్చింది. 2016–17లో కాంట్రాక్ట్ సంస్థలతో ఒప్పందం పూర్తి చేసుకొని ఆదిలాబాద్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో, బోథ్ నియోజకవర్గంలోని ఒక మండలంలో మొత్తంగా 51వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పదేళ్ల కాలంలో సవరించిన అంచనా వ్యయం అంతకంతకూ పెరుగుతూ పోయింది. దీంట్లో బ్యారేజ్, పంప్హౌస్, ఎల్పీపీ మెయిన్ కెనాల్ పనులు పూర్తయ్యాయి. ఉపకాలువల పనులు పెండింగ్లో ఉన్నాయి. దీంతోపాటు పిప్పల్కోటి రిజర్వాయర్ పనులు కూడా చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం పంప్హౌస్ వద్ద నీటి విడుదల మాత్రమే చేయనున్నారు. మోటార్ల సామర్థ్యం ఇలా.. హత్తిఘాట్ వద్ద పంప్హౌస్ నిర్మించారు. ఆరు మోటార్లు బిగించారు. ఇందులో 5.5 మెగా వాట్లకు సంబంధించి మూడు, 12 మెగావాట్లకు సంబంధించి మరో మూడు మోటార్లను ఏర్పాటు చేశారు. భూపరిహారం అందజేత.. ఈ ప్రాజెక్ట్లో మెయిన్ కెనాల్ పనులు పూర్తి కాగా, చేల వరకు నీళ్లు అందించేందుకు ఉప కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మొత్తంగా వీటి కోసం 1700 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇందుకోసం రూ.175 కోట్లు పరిహారం అందజేయాలి. ఇందులో ప్రస్తుతం రూ.70 కోట్లు భూపరిహారం కింద రైతులకు అందజేయనున్నారు. బ్యారేజ్ స్వరూపం ఇలా.. తెలంగాణ వైపు కొరటా–మహారాష్ట్ర వైపు చనాఖా గ్రామాల మధ్య పెన్గంగ భూభాగంపై బ్యారేజ్, దానికి కొద్ది దూరంలో పంప్హౌస్, కాలువల నిర్మాణం జరిగాయి. డిస్ట్రిబ్యూటరీ, పిప్పల్కోటి రిజర్వాయర్ పనులు చేపడుతున్నారు.ప్రాజెక్ట్ వివరాలు.. అంచనా వ్యయం : రూ.1,891 కోట్లు పూర్తయిన పని విలువ : రూ.1,105 కోట్లు బ్యారేజ్ నిర్మాణానికి సవరించిన అంచనా విలువ : రూ.506 కోట్లు పని పురోగతి : పూర్తి లోయర్ పెన్గంగ ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్.. నిర్మించిన ప్రాంతం: భోరజ్, జైనథ్, బేల మండలాల్లో 42 కిలోమీటర్ల పరిధిలో సవరించిన అంచనా విలువ : రూ.299 కోట్లు పని పురోగతి : పూర్తి పంప్హౌజ్.. నిర్మించిన ప్రాంతం: భోరజ్ మండలం హత్తిఘాట్ సవరించిన అంచనా విలువ : రూ.209 కోట్లు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్.. నిర్మించే ప్రాంతం : జైనథ్, భోరజ్, బేల మండలాలు డిస్ట్రిబ్యూటరీ నంబర్లు : డి–14, డి–15, డి–16, డి–16ఏ, డి–17, డి–18, డి–19 పనుల పురోగతి : చేపట్టాల్సి ఉంది -
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
ఆదిలాబాద్టౌన్: వారంతా బాల్యమిత్రులు.. పదో తరగతి పూర్తయ్యాక ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ చదువులమ్మ ఒ డిలో కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆ లింగనాల నడుమ నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. ఆదిలాబాద్రూరల్ మండలంలోని భీంసారి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2006 బ్యాచ్కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆ త్మీయ సమ్మేళనం ఆదివారం జిల్లా కేంద్రంలోని పీ ఎస్ గార్డెన్లో నిర్వహించారు. 20 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులంతా ఒకే వేదికపై కలవడంతో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం నాటి ఉ పాధ్యాయులు హేమ, హిమజ, సంగీత, ఉషాన్న, మూర్తి, లచ్చరెడ్డి, శైలందర్ను శాలువాలతో సత్కరించారు. ఇందులో పూర్వ విద్యార్థులు దేవన్న, సంతోష్, ప్రమోద్, శివకుమార్, దశరథ్, స్వాతి, అరుణ, స్వప్న, మమత, తదితరులు పాల్గొన్నారు. -
జనసంద్రమైన ‘దీక్ష భూమి’
నార్నూర్: మండలంలోని కొత్తపల్లి(హెచ్) గ్రామంలో జాతీయ బంజారా దీక్ష భూమి ఆదివారం భక్త జనసంద్రమైంది. వివిధ రాష్ట్రాల నుంచి బంజా రాలు భారీగా తరలివచ్చారు. దీక్ష గురువు సద్గురు శ్రీ ప్రేమ్సింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో గురుకృపా (గురుమిలన్) దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజ చేసి భోగ్ బండారో నిర్వహించారు. ఆధ్యాత్మిక భావనతోనే సమాజం జాగృతం అవుతుందన్నారు. లంబాడా మహిళలు సంప్రదాయ నృత్యాలు, పాటలతో హోరెత్తించారు. ఎంపీ నగేశ్ దీక్ష భూమిని సందర్శించి ప్రేమ్ సింగ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీక్ష భూమి అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి కమిటీకి పూర్తి సహకారం అందిస్తానన్నారు. కాగా దీక్ష భూమి వద్ద మూడు రోజుల పాటు జాతర కొనసాగుతుంది. -
గేట్ కష్టాలకు చెక్ పడినట్లేనా..
కై లాస్నగర్: జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు సుమారు 50కి పైగా గ్రామీణ ప్రాంతాల ప్ర జలకు ఇబ్బందికరంగా మారిన రైల్వేగేట్ కష్టాలు తొలగేలా సర్కారు చర్యలు చేపడుతోంది. తాంసి బస్టాండ్ వద్ద గల రైల్వేట్రాక్ (ఎల్సీ నంబర్ 30)పై రైల్వేఅండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)నిర్మాణ పనులు ఎట్టకేలకు సోమవారం షురూ కానున్నాయి.ఈ మా ర్గం గుండా రాకపోకలను ఆరునెలల పాటు దారి మళ్లిస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అయి తే గతేడాది మాదిరిగా పనులు ప్రారంభానికే పరి మితమవుతాయా లేక పూర్తయ్యేవరకు కొనసాగుతాయా అనేదానిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఆర్యూబీకి బదులుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, ఆ దిశగా చొరవ చూపితే మేలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గేట్ కష్టాలు తొలగినట్లైనా.. తాంసి బస్టాండ్ వద్ద గల రైల్వేట్రాక్ అవతల పట్ట ణంలోని పలు కాలనీలున్నాయి. అలాగే తాంసి, తలమడుగు, భీంపూర్తో పాటు మహారాష్ట్రలోని సుమారు 50కిపైగా గ్రామాల ప్రజలు ఈ మార్గం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో రైళ్లు వచ్చినప్పుడల్లా గేట్లు వేస్తుండటంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, ఫైరింజన్లు సైతం వెళ్లలేని దుస్థితి. ఇటీవల రైళ్ల సంఖ్య పెరగడంతో సమస్య మరింత జఠిలంగా తయారైంది. దీంతో ఇక్కడ ఆర్వోబీ నిర్మించాలనే డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తోంది. ప్రతీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ఇది అస్త్రంగా మారింది. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆర్యూబీ నిర్మించాలని నిర్ణయించింది. తాజాగా ఈ పనులు ప్రారంభం కానుండటంతో గేట్ కష్టాలు దూరమైనట్లేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాది జాప్యం తర్వాత.. కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం రైల్వే అండర్ బ్రిడ్జి ని మంజూరు చేసింది. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించింది. గతేడాది మేలో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేందుకు నిర్ణయించి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయలేదు. దీంతో భూ సేకరణ ప్రక్రియ పూర్తికాకపోవడంతో అక్కడి దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు పనులను అడ్డుకున్నారు. చేసేది లేక కాంట్రాక్టర్ వెనుదిరిగాడు. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరి గింది. అయితే కేంద్ర ప్రభుత్వమే వందశాతం నిధులు వెచ్చిస్తూ నిర్మాణాన్ని చేపట్టాలని ఇటీవల నిర్ణయించింది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేలు ఇటీవల మ రోసారి పనులకు భూమిపూజ చేశారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. తొలుత రైల్వేశాఖకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. కేంద్రం నిధులు విడుదల చేశాక , భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆర్అండ్బీ శాఖ పనులు చేపట్టనుంది. ఈ నిర్మాణానికి ఆరు నెలల పాటు గడువు విధించారు. రైల్వేకు సంబంధించిన పనులను హైదరాబాద్కు చెందిన మెహర్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకోగా, ఆర్అండ్బీ శాఖకు సంబంధించిన పనులను శ్రీసాయి తనిష్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల నేపథ్యంలో తాంసి బస్టాండ్ మార్గంలో వాహనాల రాకపోకలను ఆదివారం రాత్రి నుంచే నిలిపివేశారు. రెండు వైపులా సూచికలతో కూడిన ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయంగా మహాలక్ష్మివాడ, ఆర్టీవో కార్యాలయం వద్ద గల ఎల్సీ నంబర్ 31,29 లను వినియోగించుకోవాలని ట్రాఫిక్, మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. ఆరు నెలల పాటు ఈ మార్గంలో రాకపోకలు ఉండవని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఆర్యూబీ నిర్మిస్తే వర్షాకాలంలో నీరు నిలిచి తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశమున్నందున రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ మార్కెట్ ఉండటంతో పత్తి కొనుగోళ్ల సమయంలో అదనంగా ఇబ్బందులు కలుగుతాయని అభిప్రాయపడుతున్నారు. వందశాతం కేంద్ర నిధులతోనే ఆర్యూబీ, ఆర్వోబీలను వందశాతం కేంద్ర నిధులతోనే నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకోసం రూ.95 కోట్ల నిధులు సై తం కేటాయించింది. వారం రోజుల్లో విడుదల య్యే అవకాశముంది. నిధులు అందిన వెంటనే రెండింటి భూ సేకరణ ప్రక్రియను రెవెన్యూశాఖ సాయంతో పూర్తి చేస్తాం. అప్పటి వరకు రైల్వే పోర్షన్ పనులు జరుగనున్నాయి. నాణ్యతతో పనులు సాగేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. – ప్రవీణ్ కుమార్, ఆర్అండ్బీ డీఈఆర్యూబీ నిర్మాణ వివరాలు నిర్మాణ వ్యయం : రూ.20.08 కోట్లు భూసేకరణకు.. : రూ.20.81 కోట్లు మార్కెట్ యార్డువైపు : 184.792 మీటర్లు పంజాబ్ చౌక్వైపు : 107.442 మీటర్లు డ్రైన్ల నిర్మాణం : 1.40 మీటర్లు నిర్మాణ గడువు : ఆరు నెలలు -
ఆయన బోధనలతో ఇన్స్పైర్ అయ్యా..
● ఆ మహనీయుని ప్రేరణ.. తోడైన సంకల్పం ● ముందడుగు వేసి.. లక్ష్యాన్ని సాధించి ● గ్రూప్–1 ఆఫీసర్లుగా రాణిస్తున్న పలువురు ● నేడు యువజన దినోత్సవం‘లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి’ అనే వివేకానందుని సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత దేశానికి అవసరమంటూ ఆయన బోధనలతో చిన్నతనం నుంచే ప్రేరణ పొందారు. ఆ మహనీయుడు చూపిన మార్గంలో ముందుకు సాగి గ్రూప్–1 అధికారులుగా ఎంపికయ్యారు. వివిధ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేడు స్వామి వివేకానందుని జయంతి (యువజన దినోత్సవం) పురస్కరించుకుని వారిని పలకరించగా తమ విజయంలో ఆయన ప్రభావాన్ని చెప్పుకొచ్చారు. – కై లాస్నగర్సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026మాది సిద్దిపేట పట్టణంలోని కలకుంటకాలనీ. నాన్న మల్లయ్య బీసీ సంక్షేమశాఖలో కుక్గా పనిచేసి రిటైరయ్యాడు. అమ్మ పద్మ గృహిణి. ఎంఏ. బీఎడ్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివాను. బీసీ సంక్షేమశాఖలో వార్డెన్గా ఆరు నెలల పాటు పనిచేశాను. సివిల్ కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికై నప్పటికీ చేరలేదు. ప్రిపేరయ్యే సమయంలో ఒంటరిగా అనిపించేది. నిరుత్సాహానికి గురైన సమయంలో స్టడీ హాల్లో అతికించిన వివేకానందుడి కొటేషన్స్ను చదివేవాడిని. అవి నూతనోత్తేజాన్ని కలిగించేది. ప్రిపరేషన్ సీరియస్గా కొనసాగించేవాడిని. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది.. అలాగే నిరంతరం శ్రమించే నిన్ను చూసి ఓటమి భయపడుతుందనే వివేకానందుని బోధనలు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయి. గ్రూప్–1 అధికారిగా ఎదిగేందుకు తోడ్పడ్డాయి. యువత ఆయన బాటలో నడిచి సమాజానికి మేలు చేసేలా ఎదగాలి. – ఎర్రోళ్ల అంజనేయులు , ఎంపీడీఓ, బేల కేటీఆర్తో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, మాజీ మంత్రి జోగు రామన్న తదితరులునేరడిగొండ: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని బల్దియాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని పా ర్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలతో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ ల క్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కో నప్ప, దుర్గంచిన్నయ్య,బాల్క సుమన్ పాల్గొన్నారు. ఏఆర్ ద్వారా పాఠాలు వింటున్న విద్యార్థులుఆదివాసీల ఆత్మబంధువు మార్లవాయిలో హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన నాయకులు పాల్గొని నివాళులర్పించారు. -
జంతుగణనకు సన్నద్ధం
ఎన్టీసీఏ గైడ్లైన్స్ ప్రకారం వన్యప్రాణుల గణనకు అటవీశాఖ సన్నద్ధమైంది. కవ్వాల్ టైగర్జోన్లోని 576 అటవీ బీట్లలో ఈ గణన నిర్వహించనున్నారు.చిన్నతనంలోనే ప్రేరణ పొందా.. నాది నిర్మల్ జిల్లా ప్రియదర్శిని నగర్. నాన్న పరమేశ్వర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ సుజాత గృహిణి. నాన్న టీచర్ కావ డంతో ఆయన పనిచేసే పాఠశాల విద్యార్థులను ఏటా విహారయాత్రలకు తీసుకెళుతుండేవారు. నేను ఒకటో తరగతిలో ఉండగా కన్యాకుమారిలోని స్వామి వివేకానందుని మెమోరియల్కు తీసుకెళ్లారు. అప్పుడే ఆ మహనీయుని గురించి తెలిసింది. చిన్నతనం నుంచే డాడీ లైబ్రరీ నుంచి వివేకానందుని పాకెట్ బుక్లను తీసుకొచ్చి చదివించేవారు. దీంతో తెలియకుండానే నాపై ఆయన ప్రభావం పడింది. 2016లో డిగ్రీ పూర్తిచేశా. ఓయూలో ఎంసీజే చదువుతున్న సమయంలో 2017 ఆగస్టులో ఎఫ్ఆర్వో నోటిఫికేషన్ వచ్చింది. తొలి ప్రయత్నంలో నే ఉద్యోగం సాధించాను. అపారమైన విశ్వా సం.. అనంతమైన శక్తి విజయసాధనకు మా ర్గాలనే స్వామిజీ సూక్తి నన్ను ముందుకు నడిపించింది. – తొడిశెట్టి ప్రణయ్, ఎఫ్ఆర్వో, బోథ్ -
నా ప్యాడ్పైన ఆ మహనీయుని కొటేషన్స్..
మాది భోరజ్ మండలంలోని పిప్పర్వాడ. అమ్మానాన్న లక్ష్మి–రాజీవ్రెడ్డి. నేను 2017లో ఫైర్మెన్గా ఎంపికయ్యాను. 2018లో ఎకై ్సజ్ కానిస్టేబుల్, 2024లో గ్రూప్–4లో ఉద్యోగాలకు ఎంపికై నా చేరలేదు. గొప్పగా ఆలోచించాలి, గొప్పగా జీవించాలనే వివేకానందుని స్ఫూర్తితో ముందుకు సాగాను. ఈ క్రమంలోనే 2024లో గ్రూప్–1 అధికారిగా ఎంపికయ్యాను. ప్రస్తుతం జిల్లా ఖజనా శాఖలో అసిస్టెంట్ ట్రెజరరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. ‘నీ బలమే జీవనం.. నీ బలహీనతే నీ మరణమనే’ ఆ మహనీయుని సూక్తి మనలో అంతర్లీనంగా ఉన్న శక్తిని గుర్తించేందుకు తోడ్పడుతుంది. దాన్ని ఎవరైతే గుర్తించి బయటకు తీస్తారో తప్పకుండా విజయం సాధిస్తారు. సరైన మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ఆయన బోధనలు ఎంతో తోడ్పడుతాయి. ఉద్యోగ సన్నద్ధ సమయంలో స్టడీ హాల్, ప్యాడ్పైన ఆ మహనీయుని కొటేషన్స్ రాసుకునేవాడిని. ఆ స్ఫూర్తితోనే ఎస్సై మెయిన్స్ వరకు వచ్చి చేజారినా, జూనియర్ లెక్చరర్ 1:2 నిష్పత్తిలో తక్కువ మార్కులతో వెనుకబడినా నిరాఽశ చెందలేదు. పాజిటివ్ ధృక్పథంతో ముందుకు సాగాను కనుకే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాను. – సర్సన్ శఽశిధర్ రెడ్డి, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి, ఆదిలాబాద్ -
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాత్రి వేళలో చలితీవ్రత పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది.జాతీయస్థాయిలో జిల్లా విద్యార్థి ప్రతిభఆదిలాబాద్టౌన్/నార్నూర్: భారత రక్షణ మంత్రి త్వ, విద్యా మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన వీర్గాథ 5.0 పోటీల్లో జిల్లా విద్యార్థి మెరి శాడు. ఇటీవల నిర్వహించిన ఈ జాతీయస్థాయి ఆన్లైన్ పోటీల్లో పాల్గొన్న గాదిగూడ మండలంలో ని బుద్దమహార్ గూడకు చెందిన కాంబ్లే రిషాంక్ ప్రతిభ కనబరిచాడు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి పద్య విభాగంలో రాణించాడు. దేశవ్యాప్తంగా 50 మంది పాల్గొనగా, అందులో రాష్ట్రం నుంచి ముగ్గు రు ఉన్నారు. జిల్లా నుంచి పాల్గొని ‘ఓ వీర జవాన్’ అనే పద్యాన్ని రచించి పంపించాడు. త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి అజయ్ తెలిపారు. ఈ సందర్భంగా రిషాంక్ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. మారుమూల ప్రాంతం నుంచి.. బుద్దమహర్గూడ తెలంగాణ–మహారాష్ట్రసరిహద్దు లో ఉంటుంది. ఈ గ్రామంలో మహారాష్ట్ర పాఠశాలతో పాటు తెలంగాణ నుంచి ఎంపీపీఎస్ ఉంది. అయితే ఎక్కువ మంది తెలుగు మీడియం వైపే మ క్కువ చూపుతున్నారు. పాఠశాల భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. అలాంటి పాఠశాల నుంచి మట్టిలో మాణిక్యంలా మేరిశాడు రిశాంక్. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్టౌన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పా యల్ శంకర్ అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను ఆదివారం ఆవిష్కరించా రు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేసి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము కృష్ణకుమార్, నరసింహాస్వామి, సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసంఆదిలాబాద్రూరల్: క్రీడలు మానసికోల్లాసంతో పాటు దేహదారుడ్యానికి తోడ్పడుతాయని అదనపు కమాండెంట్ రాథోడ్ దేవిదాస్ అన్నా రు. బెటాలియన్ మైదానంలో ఇంటర్ కంపెనీ వార్షిక క్రీడా పోటీలను శనివారం ప్రారంభించారు. పలు కంపెనీలకు చెందిన సిబ్బంది ఉ త్సాహంగా పాల్గొని క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలతో సిబ్బందిలో ఐక్యత, స్నేహభావం పెంపొందుతుందనితెలిపారు. ఇందులో బెటా లియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు డీఎఫ్వో కార్యాలయం ఎదుట ధర్నాకై లాస్నగర్: సాత్నాల మండలంలోని దుబ్బ గూడ కొలాం ఆదివాసీల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ డీఎఫ్వో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు ప్రకటనలో తెలిపారు. అఖిల పక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆందోళనకు ఆయా సంఘాల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. -
అక్రమాల పుట్ట
సర్వే, భూ రికార్డులశాఖ తీరిది!సాక్షి,ఆదిలాబాద్: సర్వే భూరికార్డుల శాఖలో అక్రమాల పుట్ట పగులుతోంది. అధికారం అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా అదనపు సేత్వార్లు (సప్లిమెంటరీ సేత్వార్) జారీ చేయడం, అసలు హక్కుదారుల వివరాలు నామరూపాలు లేకుండా చేయడంలో ఈ శాఖ సర్వేయర్లు, అధికారులు రియల్టర్లతో కలిసి నడిపిన అక్రమ భూ దందా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది అక్టోబర్లో జిల్లా కేంద్రంలోని 65 సర్వే నంబర్లో కోట్ల విలువైన 2.10 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంలో సప్లిమెంటరీ సేత్వార్ జారీతోనే భూ అక్రమార్కులకు పని సులువైంది. ఈ వ్యవహారంపై బాధితులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేయడంతో బడా రియల్టర్లు, వ్యాపారులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ సర్వేయర్పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన విషయం విధితమే. తాజాగా మావల పరిధిలో జరిగిన మరో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. గతేడాదిలో.. గత అక్టోబర్లో 65 సర్వే నంబర్లో 2.10 ఎకరాల భూమాఫియాకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం కలిగించింది. ఈడీ ఆధీనంలో, ఎస్బీఐ మార్టిగేజ్లో ఉన్న భూమికి సంబంధించి రియల్టర్లు కుమ్ముకై ్క మొదట తహసీల్దార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఎలాగైనా ఈ భూమిని ఆక్రమించాలనే ఉద్దేశంతో సర్వే అధికారుల ద్వారా సప్లిమెంటరీ సేత్వార్ తీసుకున్నారు. ఇలా భూములకు సంబంధించి అసలు హక్కుదారుల వివరాలను నామరూపాలు లేకుండా చేసి అదనపు సేత్వార్ జారీ ద్వారా అక్రమార్కులకు రెవెన్యూ, సర్వే, భూరికార్డుల శాఖ అధికారులు వంతుపాడుతూ వస్తున్నారు. తద్వారా ఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్న ఈ శాఖలోని ఉద్యోగుల్లో కొంత మంది కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు లేకపోలేదు. తాజాగా మావలలో.. మావలలో కోట్ల విలువైన 16 గుంటల భూమికి సంబంధించి జరిగిన భూమాఫియాపై బాధితులు 2018లో పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారు. విచారణ ముందుకు సాగలేదు. తాజాగా ఆ బాధితులు మళ్లీ పోలీసులను ఆశ్రయించడం, జిల్లా పోలీసులు తిరిగి ఈ కేసుపై దృష్టి సారించడం సంచలనం కలిగిస్తోంది. మావల గ్రామ సర్వేనం.181/4లో అదనపు సేత్వార్ అక్రమంగా జారీ చేయడం, ఫోర్జరీ ఆరోపణలపై పోలీసులు మావల తహసీల్దార్ను కొన్ని వివరాలు ఇవ్వాలని వివరణ కోరడం సంచలనం కలిగిస్తుంది. భూమిపై హక్కును హరించివేశారు.. మావలలో కోట్ల విలువైన ఈ భూమికి సంబంధించి ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఆ భూమికి సంబంధించి అదనపు సేత్వార్ జారీ విధానంపై వివరాలు కోరుతూ మావల తహసీల్దార్ను వాటిని పంపించాలని కోరడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. సర్వే రికార్డులను మార్చివేసి కొంత మంది అధికారులతో కలిసి అక్రమంగా ఆ భూమిని పొందారని, తద్వారా ఆ భూమిపై తన హక్కును హరించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇది ఓ భూమికి సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ జిల్లాలో రెవెన్యూ, సర్వే భూరికార్డుల శాఖల అధికారులు ఇటు రిజిస్ట్రేషన్, అటు అదనపు సేత్వార్లు జారీతో ఎలా అక్రమాలకు పాల్పడుతున్నారు.. అసలు హక్కుదారుల వివరాలను నామరూపాలు లేకుండా చేసి రియల్టర్లకు ఎలా వంతు పాడుతున్నారనేది తేటతెల్లం అవుతుంది. అదనపు సేత్వార్ జారీ విధానంపై ఆరా.. అదనపు సేత్వార్ జారీలో జరుగుతున్న అక్రమాలపై పోలీసులు నిశితంగా దృష్టి సారించారు. ఈ సప్లిమెంటరీ సేత్వార్ జారీలో సర్వేయర్లు ఫీల్డ్ పరిశీలన నిర్వహించారా..? ప్రభావిత పట్టాదారులందరికి (పిటిషనర్తో సహా) నోటీసులు జారీ చేశారా..? అనే విషయాలపై స్పష్టతనివ్వాలని రెవెన్యూ అధికారులను పోలీసులు కోరడం జరిగింది. ఇదీ ఈ ఒక్క కేసు విషయంలోనే అనుకుంటే పొరపాటే. ఆదిలాబాద్ చుట్టుపక్కల అనేక భూములకు సంబంధించి సప్లిమెంటరీ సేత్వార్ల జారీలో జరిగిన అనేక మోసాలకు ఈ సేత్వార్ జారీ విధానంలో సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరించారా లేదా అనేది స్పష్టమవతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారులేమన్నారంటే.. -
చుట్టుపక్కల వారందరితో కలిసి..
ఉద్యోగ బాధ్యతలతో పాటు పిల్లలకు రుచికరమైన పిండి వంటలు చే యాల్సిందే. సాయంత్రం వేళలో మా స్నేహితురాళ్లతో కలిసి సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు, గవ్వలు, ముర్కులు తయారు చేశాం. సంక్రాంతి పండగొచ్చిందంటే వా రం పది రోజులు ఇళ్లంతా సందడిగా ఉంటుంది. – భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఉద్యోగి, బ్రాహ్మణవాడ సకినాలు ప్రత్యేకంసంక్రాంతి అంటేనే పిండివంటలు. నానబెట్టిన బియ్యం పిండితో సకినాలు చేస్తాం. అలాగే అరిసెలు, గారెలు, లడ్డూలు, ఇలా పిల్లలకు ఇష్టమైన అనేక రకాలను ఇంటిళ్లిపాది కలిసి తయారు చేస్తాం. పండుగ రోజు ఆనందంగా గడుపుతాం. – సరిత, రవీంద్రనగర్ -
రోజు ఒకరింట్లో పిండి వంటలు
మేము ముగ్గురం మంచి స్నేహితులం. ఏ పండుగనైనా మా కుటుంబాలతో కలిసి జరుపుకుంటాం. రెండు మూడు రోజుల నుంచి రోజూ ఒక్కరి ఇంటి వద్ద పిండి వంటకాలు తయారు చేస్తున్నాం. దాదాపు పూర్తయినట్లే. పండుగ పూర్తయ్యే వరకు పిల్లలు, పెద్దలంతా సందడి చేస్తూ సంతోషంగా గడుపుతాం. – సుమలత, మమత, యామిని, శాంతినగర్ కాలనీమూడు రోజులైతంది..ఇంట్లో మూడు రోజులుగా పిండి వంటలు తయారు చేస్తున్నాం. పిల్లలు ఇంట్లో చేసినవే ఇష్టంగా తింటారు. పెద్ద మొత్తంలో వంటకాలు చేయాల్సి ఉండడంతో కాలనీలోని మహిళలందరం కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటాం. – ముదికొండ కల్పన, తిర్పెల్లి


