breaking news
Adilabad District Latest News
-
రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తాచాటాలి
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటా లని డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీ డల అధికారి పార్థసారథి క్రీడాకారులకు సూచించా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎస్జీఎఫ్ఐ జిల్లాస్థాయి సుబ్రతో ముఖర్జీ ఫుట్బాల్ ఎంపిక పోటీలను గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఐకమత్యంతో ఆడి రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజేతలుగా నిలువాలని ఆకాంక్షించా రు. ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆడే రామేశ్వర్ మాట్లాడుతూ.. అండర్–15 ఫైనల్లో జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హైస్కూల్ జట్టు 3–2 గోల్స్ తేడాతో తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన జట్టుపై విజయం సాధించినట్లు వివరించారు. అండర్–17 ఫైనల్లో ఇచ్చోడ జెడ్పీఎస్ ఎస్ జట్టుపై 1–2 గోల్స్ తేడాతో ఇచ్చోడ గిరిజన బాలుర గురుకుల పాఠశాల జట్టు విజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ జట్లు ఈనెల 25, 26 తేదీ ల్లో సరూర్నగర్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సుబ్రతో ముఖర్జీ ఫుట్బాల్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. పోటీల కన్వీనర్ కోటోజీ చంద్రశేఖర్, డాక్టర్ ఎండీ ఖాసీం, బ్యాడ్మింటన్ కోచ్ కభీర్ దాస్, పీడీలు వినోద్రెడ్డి, పోచన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
యూనివర్సిటీని సాధించాలి
ఆదిలాబాద్టౌన్: యూనివర్సిటీ ఏర్పాటుకు ఉ ద్యమించాలని యూనివర్సిటీ సాధన సమితి సభ్యుడు డాక్టర్ ఉదారి నారాయణ సూచించా రు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్ర మం నిర్వహించగా ఆయన మాట్లాడారు. జి ల్లాలో యూనివర్సిటీ లేక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. యూ నివర్సిటీ ఏర్పడితే కలిగే ప్రయోజనాలు వివరించారు. సమితి సభ్యురాలు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ చిట్యాల సుహాసినిరెడ్డి, భాస్కర్, ప్రిన్సి పల్ అతీఖ్ బేగం, కోటయ్య, చంద్రకాంత్, అనిత, రేఖ, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ఆదిలాబాద్రూరల్: మండలంలోని చాందా (టీ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 11వ జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. పోటీలను పాఠశాల హెచ్ఎం పండరీనాథ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. మహేందర్ జోషి, అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రెటరీ రాజేశ్, యూటీఎఫ్ సెక్రెటరీ లచ్చారాం, వెయిట్ లిటిల్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రెటరీ వీజీఎస్ జ్యోతిష్యరన్, భాస్కర్, అఖిలేశ్, ప్రమోద్, సాయికిరణ్, సత్యనారాయణ, రాకేశ్, సౌమ్య, మా జిద్, హరీశ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కొత్త’ పోస్టులు
కైలాస్నగర్: జిల్లా పాలనలో రెవెన్యూదీ కీలకపా త్ర. భూ సంబంధిత సమస్యలతోపాటు కుల, ఆదా య ధ్రువీకరణ పత్రాల జారీ, సంక్షేమ పథకాల అ మలుకు సంబంధించిన క్షేత్రస్థాయి విచారణ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన గురుతర బాధ్యత ఈ శాఖదే. ఇంతటి కీలకమైన రెవెన్యూ సేవలను ప్ర జలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో మూడు మండలాలను ఇటీవల ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి బోథ్ మండలంలోని సొనాలను, జైనథ్ మండలంలోని భోరజ్ ను, ఆదిలాబాద్రూరల్, బేల, జైనథ్ మండలాలో ్ల ని పలు గ్రామాలను కలిసి సాత్నాలను ప్రత్యేక మండలాలుగా ఏర్పాటు చేసింది. ఈ మండలాలన్నీ ఈ ఏడాది ఫిబ్రవరి 5నుంచి అమలులోకి రాగా తహసీల్దార్ కార్యాలయాల్లో సేవలు ప్రారంభమయ్యా యి. ప్రత్యేకంగా మండలాలు ఏర్పడినప్పటికీ వాటి కి ఇప్పటివరకు కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో పూర్వ మండలాల్లోని అధికారులు, సి బ్బందిని సర్దుబాటు చేసి ఆర్నెళ్లుగా పాలన సాగిస్తున్నారు. ఈక్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులను దూరం చేయడంతోపాటు ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటికి ప్రత్యేక పోస్టులు మంజూరు చేసింది. మూడు మండలాలకు 38.. మూడు కొత్త మండలాల పరిధిలో 38 పోస్టులు కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జా రీ చేసింది. వాటిని భర్తీ చేస్తే ప్రజలకు రెవెన్యూ సే వలు మరింత సులభతరం కానున్నాయి. కొత్తగా ముగ్గురు తహసీల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసీ ల్దార్లతో పాటు అదనంగా 32 వివిధ కేటగిరీల పో స్టులు మంజూరయ్యాయి. వీటిని ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారా.. లేక పరీక్షలు నిర్వహించి కొత్తవారిని నియమిస్తారా.. లేదా ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉన్న వారితో తాత్కాలికంగా సర్దుబాటు చేస్తారా? అనేది ప్రస్తుతం ఆ శాఖతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త మండలాలకు పూర్తిస్థాయిలో అధికారులు అందుబాటులోకి రానుండటంపై ఆయా మండలవాసుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. -
గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
కైలాస్నగర్: జిల్లాలో గణేశ్ నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఈ నెల 27 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినా యక చవితి ఉత్సవ శాంతియుత సమన్వయ కమి టీ సమావేశాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ని ర్వహించారు. కమిటీ సభ్యుల నుంచి తొలుత అభిప్రాయాలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ.. ప్రజలు శాంతియుతంగా, సామరస్యంతో ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. శో భాయాత్ర పొడవునా ఎలాంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జనం, మిలాద్–ఉన్–నబీ వేడుక వెంటవెంటనే వస్తున్నాయని భద్రతాపరంగా ఎ లాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేశ్ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్శాఖ 8712481799, వైద్యారోగ్యశాఖ 9491103108 నంబర్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ సలోని, ఆర్డీవో స్రవంతి, డీఎస్పీ జీవన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రేపు అధికారికంగా ‘పొలాల’ వేడుకలు ఏడాది పాటు రైతన్నలకు పంట సాగులో అండగా నిలిచే బసవన్నలను పూజించే పొలాల అమావాస్య వేడుకలను ఈ నెల 23న అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజార్షి షా ఓ ప్రకటనలో తెలిపా రు. తాంసి మండల కేంద్రంలో నిర్వహించనున్న వే డుకల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
పంట నష్టపోయిన రైతులకు పరిహారం
బేల: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం మంజూరు చేస్తామని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. గురువారం పెన్గంగ పరీవాహక ప్రాంతాలైన మండలంలోని గూడ, మణియార్పూర్ రెవెన్యూ గ్రామాల శివారుల్లో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పత్తి, సోయా, కంది తదితర పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దెబ్బతిన్న పంటలను త్వరలోనే వ్యవసాయాధికారులు పరిశీలిస్తారని, స ర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారని చెప్పా రు. రైతులు అధైర్య పడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల తెలిపారని పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు గిమ్మ సంతోష్రావు, సామ రూపేశ్రెడ్డి, నాక్లే రాందాస్, గావుండే ఘణేశ్యాం, ఠాక్రే సాగర్, విపిన్, అవినాష్, సూర్యభాన్, కరీం తదితరులున్నారు. -
మట్టి మేలు తలపెట్టి..!
మంచిర్యాలఅర్బన్: సంప్రదాయంగా వస్తున్న పండుగలను ప్రస్తుతం జరుపుకునే విధానంలో చేస్తున్న పొరపాట్లు పర్యావరణానికి ఎన్నో అనర్థాలు తెచ్చి పెడుతున్నాయి. వినాయక చవితి రోజు చేస్తున్న పొరపాట్లు చీకట్లు మిగుల్చుతున్నాయి. కానీ.. వినాయక చవితి అనగానే ఆకర్షణ, హంగు, ఆడంబరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కొన్నేళ్లుగా రంగుల వినాయకులకు తీసిపోకుండా వివిధ రూపాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా మట్టి గణపయ్యలను చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణానికి అనుకూలంగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కులవృత్తులు కాపాడుతూ.. ఉపాధినిస్తూకనుమరుగవుతున్న కులవృత్తిని కాపాడాలనే సదుద్దేశంతో మట్టి వినాయకుల తయారీతో పాటు ఎంతోమందికి ఉపాధినిస్తున్నారు. నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన నాగపూరి రాజేంద్రప్రసాద్ మంచిర్యాలలోని సున్నబట్టివాడలో నివాసం ఉంటున్నారు. ఎంబీఏ, ఎంకాం పూర్తి చేసిన ఆయన కులవృత్తితోపాటు పర్యావరణ పరిరక్షణకు ఆలోచన చేశారు. 2015లో ఏడు మట్టి విగ్రహలు తయారీ చేసి విక్రయించారు. 2018లో 52 మట్టి ప్రతిమలను రూపొందించి పర్యావరణ హితానికి నడుం బిగించారు. ప్రస్తుతం శ్రీగణేష్ క్లే వర్క్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 80 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. మున్ముందు దీపావళికి ఉపయోగించే ప్రతిమలు, ఇంట్లో వినియోగించే మట్టిపాత్రలు, కుండలు ఇలా అన్ని రకాలు తయారీ చేయాలని నిర్ణయించారు. మట్టివిగ్రహాలతో ఆదాయం భళా..పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల తయారీ సరఫరా టెండర్ దక్కించుకున్నారు. 40వేల వినాయకులు సరఫరా చేయనున్నారు. మరోవైపు రెండో అన్నవరంగా పేరొందిన గూడేం సత్యనారాయణ టెంపుల్లో ఏర్పాటు చేసే మట్టి వినాయకుడు ఇక్కడే తయారు చేశారు. ఆదిలాబాద్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2వేల మట్టి వినాయకుడు ఆర్డర్ ఇచ్చింది. ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల ఎత్తులో మట్టి వినాయకులు తయారు చేశారు. వినాయకుల తయారీలో కర్ర, మట్టి, గడ్డితో తడి సున్నం, వాటర్ కలర్లు విని యోగించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ప్ర భుత్వం పర్యావరణంతోపాటు కులవృత్తులను ప్రో త్సహించటానికి ప్రభుత్వ స్థలం లీజుకు ఇస్తే మరింత మందికి ఉపాధినిస్తానని రాజేంద్రప్రసాద్ తెలిపారు. తాతల కాలం నుంచి..తాతల నుంచి వచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని మట్టి వినాయకులు తయారీ చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు మంచిర్యాలకు చెందిన తాళ్లపల్లి తిరుపతి. ఇంటర్ పూర్తి చేసి కులవృత్తి మట్టికుండల తయారీలో తర్ఫీదు పొందాడు. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికుల సహకారంతో ఏటా 2వేల విగ్రహాలకు పైన మట్టి విగ్రహాలు తయారు చేసి ఆర్డర్పై ఇస్తుంటాడు. మూ డు కుటుంబాలు మట్టి వినాయకుల తయారీలో పాలు పంచుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. చిన్న విగ్రహాలను చూడముచ్చటగా తీర్చిదిద్ది మార్కెట్లో విక్రయిస్తుంటా రు. మట్టికి సులువుగా కరిగే గుణం ఉంటుంద ని, విగ్రహాల తయారీలో చెరువు మట్టి వినయోగంతో పూడిక సమస్య తొలగిపోతందుని అందుకే మట్టికి ప్రాధాన్యం ఇస్తున్నామని తిరుపతి తెలిపారు. వినాయక చవితి పర్యావరణానికి పూర్తిగా మేలు చేసే పండుగని, మట్టితో పూజించాలని సూచించారు. -
గాడి తప్పుతున్న విద్యాశాఖ
ఆదిలాబాద్టౌన్: విద్యాశాఖ గాడి తప్పుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల ప ట్టింపులేమి వెరసీ ఆ శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏడేళ్లుగా రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వం ఇటీవల ఐఏ ఎస్ అధికారికి ఇన్చార్జి డీఈవో బాధ్యతలు అప్పగించింది. ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా విధులు నిర్వహిస్తున్న ఖుష్బూగుప్తాకు ఇప్పటికే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి అదనపు బాధ్యతలు సైతం ఉన్నాయి. నాలుగు కీలక బాధ్యతలు ఉండడంతో విద్యాశాఖపై ఫోకస్ పెట్ట డం లేదని తెలుస్తోంది. ఈనెల 5న బాధ్యతలు స్వీకరించగా, ఇప్పటివరకు కనీసం కార్యాలయాన్ని సైతం సందర్శించకపోవడం గమనార్హం. ఏడేళ్లుగా ఇన్చార్జీలే.. 2018 నుంచి జిల్లాకు ఇన్చార్జి డీఈవోలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయి. సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేద నే విమర్శలున్నాయి. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, కొందరు గురువులు వి ద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించడం, తోటి ఉపాధ్యాయులతో గొడవలు పడటం, ఇష్టానుసారంగా విధులకు హాజరుకావడం, పాఠశాల నిధులు కాజేయడం, కార్యాలయ ఉద్యోగులు పలువురు అక్రమాలకు పాల్పడటం వంటివి చోటు చేసుకుంటున్నాయి. పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. 2018లో రెగ్యులర్ డీఈవోగా జనార్దన్ ఉండగా, ఆయనను సరెండ్ చేశారు. ఆ తర్వాత డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవిందర్ రెడ్డి, నిర్మల్ ఏడీగా పనిచేసిన ప్రణీత ఇన్చార్జి డీఈవోలుగా వ్యవహరించారు. వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇన్చార్జి డీఈవోగా పనిచేశారు. ఈనెల 1న ఆయనను విధులను తప్పించి ఐటీడీఏ పీవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఉట్నూర్లోనే బా ధ్యతలు స్వీకరించిన సదరు అధికారి ఇప్పటివరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయాన్ని సందర్శించకపోవడం గమనార్హం. ఉట్నూర్కే ఫైల్స్.. జిల్లా విద్యాశాఖకు సంబంధించిన ఫైల్స్ను ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు ఉట్నూర్కు తీసుకెళ్తున్నా రు. ఐటీడీఏ పీవోగా ఉన్న ఇన్చార్జి డీఈవో అక్కడే ఉండడంతో వారి వద్దకే ఫైళ్లను తీసుకెళ్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే విద్యాశాఖ నుంచి విడుదలయ్యే ప్రకటనలు, ఇతర ఉత్తర్వులు, ఫైళ్లపై సంతకాల కోసం తరచూ వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. -
ర్యాగింగ్ చట్టరీత్యా నేరం
ఆదిలాబాద్టౌన్: ర్యాగింగ్కు పాల్పడటం చట్టరీత్యా నేరమని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. రిమ్స్లో యాంటీ ర్యాగింగ్పై మెడికోలకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె హాజరై మాట్లాడారు. ర్యాగింగ్కు పాల్పడితే ఎంబీబీఎస్ సీటు కోల్పోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదవుతాయని, అలాగే జైలు, జరిమానాలు త ప్పవన్నారు. సీనియర్లు జూనియర్ల పట్ల స్నేహభావంతో మెలగాలని సూచించారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే హెల్ప్లైన్ నంబర్ 1800 180 5522 కు సమాచారం అందించాలన్నారు. అలాగే రిమ్స్ డైరెక్టర్తో పాటు మెంట ర్కు సైతం సమాచారం అందించవచ్చని పే ర్కొన్నారు. అంతకుముందు ఎన్ఆర్సీతో పా టు రిమ్స్లోని పలు వార్డులను పరిశీలించారు. ఆమె వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు విద్యావిల్సన్, సరో జ, రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ దీపక్ పుష్కర్, నరేందర్ బండారి, కరుణాకర్, రఘునాథ్రావు, మెడికోలు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ దాడులు
పెంబి: మండలంలోని ఇటిక్యాల్, ఇటిక్యాల్ తాండ, పెంబి తాండ, తాటిగూడ గ్రామాల్లో బుధవారం ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించి నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ గంగారెడ్డి, ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్ అభిషేకర్ తెలిపారు. వారి వద్ద నుండి 20 లీటర్ల నాటుసారా, 200 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సిబ్బంది వెంకటేష్, సాయి, రాజేందర్, రవీందర్, నిరోషా, రవి, అశ్వక్, జమీర్, విజయ, తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే తాగునీటి సమస్య పరిష్కారం
నార్నూర్: మండలంలోని సుంగాపూర్ గ్రామంలో అందరి సహకారంతోనే తాగునీటి సమస్య పరిష్కారమైందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పంచాయతీ పరిధిలోని గొండుగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన బావితో పాటు పైపులైన్, వాటర్ ట్యాంకులను ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తాతో కలిసి బుధవారం ప్రారంభించారు. నీటి సమస్య శాశ్వత పరి ష్కారం కోసం ఐటీడీఏ ద్వారా కొంత నిధులు, కలెక్టర్గా తాను కొంత నిధులు సమకూర్చి పనులు చేపట్టినట్లు తెలిపారు. అటవీశాఖ అనుమతితో పని సులభమైందన్నారు. అనంతరం గ్రామస్తులతో కలి సి భోజనం చేశారు. చిత్తగూడ సమీపంలో భారీ వర్షానికి దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. వెంటనే మరమ్మతు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నార్నూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. కలెక్టర్ వెంట డీఎఫ్వో బాజిరావ్ పాటిల్, ఉట్నూర్ సబ్కలెక్టర్ యువరాజ్ మర్మాట్, రాయి సెంటర్ జిల్లా సార్మేడి మెస్రం దుర్గు పటే ల్, డీఈఈ శ్రీనివాస్, ఐటీడీఏ డీఈఈ శివప్రసాద్, తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో గంగాసింగ్, ఎంఈవో అనిత, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు దాదిరావు, తదితరులు పాల్గొన్నారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఇంద్రవెల్లి: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షిషా హెచ్చరించారు. బుధవారంమండలకేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణా లను తనిఖీ చేశారు. ఎరువుల గోదాంలను పరిశీ లించారు. రైతులతో మాట్లాడి ఎరువులు సకాలంలో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, వ్యవసాయ అధికారి రాథోడ్ గణేశ్ తదితరులున్నారు.వరద నష్టంపై తక్షణ సర్వేకైలాస్నగర్: వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు తక్షణ సర్వే నిర్వహించి నష్టం అంచనాలతో కూడిన నివేదికలు పక్కాగా సమర్పించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేపట్టి త్వరితగతిన రాకపోకలు పునరుద్ధరించాలన్నారు. సర్వే సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోపాటు శాశ్వత పరి ష్కారానికి మండల,జీపీల వారిగానివేదికలు అందించాలని తెలిపారు. ఈ సర్వేపై సూపర్ చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఐటీడీఏ పీవో ఖుష్బుగుప్తా, అదన పు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రైతులందరికీ పంట బీమా కల్పించాలి
ఆదిలాబాద్: రైతులందరికీ పంట బీమా కల్పించా లని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంటలకు బీమా ఉంటేనే రైతులు ధీమాగా వ్యవసా యం చేసే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత రైతులకు రూ.10వేల చొప్పున పరిహారం ఇస్తే ఎటూ సరిపోదన్నారు. నష్టపోయిన రైతులందరికీ విత్తనాలు సబ్సిడీపై అందించాలన్నారు. అలాగే కోతకు గురైన భూములను చదును చేసుకునేందు కు ఎన్ఆర్ఈజీఎస్ను అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు బ్రహ్మానంద్, జోగు రవి, మటోలియా, సంతోష్, రాకేష్, దయాకర్, శ్రీనివాస్ తదితరులున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నేరడిగొండ: అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసున్న ఘ టన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుమారి గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న (37) మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఏడాది క్రితం తిరిగి వచ్చాక తనకున్న అర ఎకరంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలు తీసుకుని పత్తి సాగు చేపట్టాడు. అయితే గతేడాది సరైన దిగుబడి రాలేదు. ఈ సారి మళ్లీ పత్తి సాగు చేయగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట పూర్తిగా నీట మునిగింది. గతంలో దుబాయ్ వెళ్లేందుకు, వచ్చాక సాగు కోసం చేసిన అప్పు (ప్రైవేట్లో) మొత్తం రూ.5లక్షల వరకు చేరింది. ఈ క్రమంలో అది ఎలా తీర్చాలో తెలియ క మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సుమలత ఫిర్యాదు మే రకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపా రు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు. -
విగ్రహాల తయారీలో నిమగ్నం
కాగజ్నగర్టౌన్: వినాయక చవితి సమీపిస్తుండడంతో కాగజ్నగర్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో మట్టి విగ్రహాల తయారీ ఊపందుకుంది. పట్టణంలోని పెట్రోల్పంప్ ఏరియా, మార్కెట్, మండలంలోని నజ్రుల్నగర్, రాంనగర్, విలేజ్నెం 5, చింతగూడ గ్రామాల్లో మట్టి వినాయకుల తయారీలో కళాకారులు నిమగ్నమయ్యారు. చిన్ననాటి నుంచే ఆసక్తి చిన్ననాటి నుంచే విగ్రహాల తయారీపై ఆసక్తితో చిన్నచిన్న గణపతులను తయారు చేసి ఇంట్లో పూజించేవాళ్ళం. 23 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నా. భక్తులను ఆకర్షించేలా వివిధ డిజైన్లలో, హనుమంతుడిపై వినాయకుడు, రామసేతు వినాయకుడులాంటి రూపాల్లో బంకమట్టి, సహజ సిద్ధమైన రంగులతో 5 నుంచి 20 ఫీట్ల వరకు విగ్రహాలు తయారు చేస్తున్నా. ఈ ఏడాది ఇందిరా మార్కెట్ భారీ వినాయక విగ్రహాన్ని తయారు చేస్తున్నా. – గౌత్రే విక్రమ్, కళాకారుడు, కాగజ్నగర్ పర్యావరణ పరిరక్షణకు.. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను తయారు చేస్తున్నా. వినాయకుడి విగ్రహాలతో పాటు దుర్గాదేవి విగ్రహాలను కూడా తయారు చేస్తా. పదోతరగతి తర్వాత మట్టి విగ్రహాలను ఇంట్లో తయారు చేసేవాడిని. ఇప్పుడు 12 ఫీట్ల వరకు వినాయ విగ్రహాలను తయారు చేస్తున్నా. పట్టణంలోని త్రినేత్ర శివాలయంలో వినాయక విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్టిస్తాం – ములుకుట్ల జశ్వంత్, ఆదర్శనగర్, కళాకారుడు -
వరదపై ఫోకస్
సాక్షి,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో సాధారణంగా భారీ వర్షాలు కురిసినప్పుడు మురికి వాడల్లో వరద ప్రభావం కనిపించేది. అయితే అక్కడ సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడమే కారణం. ఇప్పుడు మా త్రం పలు కొత్త కాలనీల్లోనూ ఇళ్లు నీట మునగడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రధానంగా రెండు దశాబ్దాలుగా కొత్త లేఅవుట్లలో విస్తృతంగా భవనాల నిర్మాణాలు అవుతున్నాయి. అటువంటి చోటే వరదలు చుట్టుముట్టడం విస్తుగొలుపుతోంది. అలాంటిదే సుభాష్నగర్. దీంతోపాటు మణిపూర్ కా లనీ, ఖోజా కాలనీ, గ్రీన్సిటీ, జీఎస్ ఎస్టేట్.. ఇలా పలు భవంతులు ఉన్న కాలనీల్లో మొదటి అంతస్తు పూర్తిగా మునిగేలా వరదలు రావడం గమనార్హం.కబ్జాల నేపథ్యంలోనే..జిల్లా కేంద్రంలోని పలు చెరువులు, వాగుల సమీ పంలో బఫర్ జోన్లో నిర్మాణాల నిషేధం ఉన్నప్పటికీ ఇష్టారీతిన స్థలాలను కబ్జా చేశారు. భవనాలను నిర్మించారు. డూప్లెక్స్ల నిర్మాణాలు కూడా ఉన్నా యి. భారీ వర్షం కురిసినప్పుడు ఈ బఫర్ జోన్లో వరదలు ముంచెత్తుతున్నాయి. గతంలో కురిసిన భారీ వర్షానికి గ్రీన్ సిటీని వరదలు ముంచెత్తాయి. తాజాగా కురిసిన వర్షాలతో దీంతోపాటు ఇతర కొత్త కాలనీల్లోనూ ఇదే తరహా వరదలు చుట్టుముట్టడం వెనుక కబ్జాలే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా డ్రెయినేజీ వ్యవస్థను ఇష్టారీతిన కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో వర ద నీరు పారేందుకు కూడా సరైన వ్యవస్థ లేక ఇళ్లలోకి చేరుతోంది. ఈ వరదలను అంచనా వేసి కబ్జాలను తొలగిస్తేనే రానున్న రోజుల్లో ఇలాంటి ముప్పు తలెత్తదన్న అభిప్రాయం పట్టణవాసుల్లో వ్యక్తమవుతుంది.నేటి నుంచి సర్వే..పట్టణంలోని కాలనీల్లో ఈ వరదలెందుకు వచ్చా యి.. కారణం ఏమిటి.. డ్రెయినేజీలు లేవా.. ఉంటే ఎందుకు పొంగాయి.. లేనిపక్షంలో డ్రెయినేజీలు క బ్జాకు గురయ్యాయా.. పూడిక తియ్యలేదా.. వీటిని కబ్జా చేసి నిర్మాణాలు కట్టారా.. దీనిపై ప్రభుత్వం సర్వేకు ఆదేశించింది. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా బృందాలుగా ఏర్పాటు చేసి గురువారం నుంచి సర్వే చేయనున్నారు. ఆ నివేదికను కలెక్టర్కు అందజేయనున్నారు. దీంతో ఇప్పుడు ఆయా కాలనీల్లో వరదలకు కారణమేమి టనే చర్చ మొదలైంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వస్తా యా.. హైడ్రా వంటి సంస్థలను రంగంలోకి దించుతారా.. లేనిపక్షంలో కబ్జాల విషయంలో ఎలాంటి చర్యలకు దిగుతారోననే దానిపై చర్చగా సాగుతోంది.నీట మునిగిన కాలనీలు..జిల్లా కేంద్రంలో ఖానాపూర్, అంబేద్కర్నగర్, సుభాష్నగర్, కోలిపుర, తాటిగూడ, చిల్కూరి లక్ష్మినగర్, జీఎస్ ఎస్టేట్, అనుకుంట పార్ట్, ఖోజా కాలనీ, కుమ్మరికుంట, గాంధీనగర్, మహాలక్ష్మివాడ ఇటీవల నీట మునిగాయి. -
పార్వతి తనయా
పర్యావరణహితాయ.. ఆదిలాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాలకు గణనాథుని ప్రతిమలు సిద్ధమవుతున్నాయి. జిల్లా కేంద్రం వ్యాప్తంగా మట్టి ప్రతిమలు రూపుదిద్దుకుంటున్నాయి. ఎంతోమంది కళాకారులకు ఉపాధి అందిస్తున్నాయి. వైవిధ్యమైన రూపాల్లో పార్వతి తనయున్ని పర్యావరణహితంగా ప్రతిష్టించేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మట్టి వినాయక ప్రతిమలను నిలబెట్టేందుకు యువత, ఉత్సవ సమితి సభ్యులు ప్రాధాన్యతనిస్తుండడం విశేషం. పీఓపీ విగ్రహాలు తక్కువ సమయంలో పూర్తవుతాయి. మట్టి ప్రతిమల తయారీకి 10 నుంచి 20 రోజులు పడుతుంది. అయినప్పటికీ నిర్వాహకులు వైవిధ్యమైన రూపాల్లో మట్టి వినాయకున్ని కొలువుదీర్చేందుకు ఆర్డర్లు ఇస్తుండడం గమనార్హం. దీంతో కళాకారులకు చేతినిండా పని దొరుకుతోంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణ సైతం సాధ్యమవుతుండడంతో పర్యావరణ ప్రేమికుల నుంచి సైతం హర్షం వ్యక్తం అవుతుంది. -
ఫొటోలతో జ్ఞాపకాలు పదిలం
ఆదిలాబాద్: ఫొటోలతో జ్ఞాపకాలు పదిలంగా నిలి చిపోతాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జిల్లా ఫోటో, వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా ఫొటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేశ్, విజ య్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్, హరికృష్ణ, ఉపాధ్యక్షుడు ప్రవీణ్, అనిల్, మురళీధర్, సంతోష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
● ‘మహాలక్ష్మి, గృహజ్యోతి’ నమోదుకు అర్హుల ఆసక్తి ● సందడిగా ప్రజాపాలన ప్రత్యేక కేంద్రం
‘సంక్షేమ’ లబ్ధికి ఆరాటంకై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటికోసం గతంలో ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసి ఉండి ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారంతా ఆరాటపడుతున్నారు. ఇలాంటి వారి వివరాల సేకరణ కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. ఇటీవల వరుస సెలవులు రావడంతో దరఖాస్తుదారులు మంగళవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రేషన్ కార్డులు పొందిన వారంతా సంక్షేమ పథకాల అమలు కోసం క్యూ కట్టారు. వారికి ఇబ్బందులు కలగకుండా బల్దియా అధికారులు అదనపు సిబ్బందిని నియమించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు సూచించారు. -
ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్టౌన్: దివ్యాంగులు ఉపకరణాల ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ క ల్యాణ మండపంలో ఆలింకో, విద్యాశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించేందుకు మంగళవారం నిర్ధారణ శిబిరం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ఆలింకో సంస్థ 18ఏళ్లలోపు దివ్యాంగుల కు అవసరమైన పరికరాలు ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సంస్థ ప్ర తినిధులు దివ్యాంగుల నుంచి కొలతలు తీసుకున్నారు. అవసరమైన పరికరాలు త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. ఇందులో ఆదిలా బాద్అర్బన్ ఎంఈవో సోమయ్య, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు రఘురమణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
దగ్గు.. జ్వరం.. నొప్పులు
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో రోగాలు ముసురుకుంటున్నాయి.ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సీజ నల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దగ్గు, జ్వరం, ఒళ్లు, కీళ్ల నొప్పులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ ఇంటికి వెళ్లి నా ఒకరిద్దరు జ్వర పీడితులే కనిపిస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా బాధపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్తోపాటు ప్రైవేట్, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్సీలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. రిమ్స్లో మంగళవారం ఓపీ విభాగంలో 2400 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పిడి యా ట్రిక్ వార్డులో సరిపడా బెడ్లు లేక ఒక్కో పడకపై ఇద్దరేసి చొప్పున ఉంచి చికిత్స అందించారు. కిక్కిరిసిపోయిన పిడియాట్రిక్ వార్డు.. రిమ్స్లోని పిడియాట్రిక్ వార్డు చిన్నారులతో కిక్కిరిసిపోయింది. ఇటీవల బెడ్లన్నీ ఖాళీగా ఉండగా, వారం నుంచి నిండిపోయి కనిపిస్తున్నాయి. ఈ వా ర్డులో 70 బెడ్లు ఉండగా, 90 మంది వరకు చికిత్స పొందుతున్నారు. డెంగీ లక్షణాలు, టైఫాయిడ్, వైర ల్ జ్వరాలతో బాధపడుతున్నారు. సరిపడా బెడ్లు లేకపోవడంతో వైద్యులు ఒక్కో పడకపై ఇద్దరేసి చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. జ్వరాలతో విలవిల.. జిల్లాలో సీజనల్వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇటీ వల కురిసిన వర్షాలతో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో దోమలు, ఈగలు, కలు షిత నీటి కారణంగా జనం రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా టైఫాయిడ్, వైరల్ జ్వ రాలున్నాయి. జిల్లాలో ఈ నెలలో 19 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 50నమోదయ్యాయి. రిమ్స్తోపాటు ప్రైవేట్ ఆస్పత్రులూ రోగులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఇదే అదునుగా కొంత మంది అందినకాడికి దండుకుంటున్నారు. అవసరం లేకు న్నా వైద్యులు టెస్టుల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. పారిశుధ్య నిర్వహణ లోపంతోనే... ఇటీవల కురిసిన వర్షాలతో ఆయా ప్రాంతాల్లో పరి సరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.గుంతలు, మురుగుకాలువలతో పాటు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంటుంది. దీంతో అందులో ఈగలు, దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి. ఫలితంగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఓపీ పెరిగింది.. రిమ్స్లో ఓపీ పెరిగింది. మంగళవారం 2400 మంది జ్వరాలతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యసేవలు పొందారు. పిల్లల వార్డులో 90 మంది ఇన్పేషెంట్లుగా ఉన్నారు. ఈ వార్డులో అదనంగా మరో 20 బెడ్లు ఏర్పాటు చేశాం. అలాగే 200 మంది చిన్నారులు ఓపీ ద్వారా చికిత్స పొందారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాం. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ శుభ్రత పాటించాలి.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రతిఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలి. నిల్వ నీటిలో ఈగలు, దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతాయి. వాటి నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. జ్వరాల బారిన పడిన వారు సమీపంలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో -
పారదర్శక నివేదిక అందించాలి
కై లాస్నగర్: వరదలతో నష్టపోయిన బాధితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా సమగ్ర సమాచా రంతో కూడిన పారదర్శక నివేదిక అందించాలని జి ల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించా రు. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టం, సహా యక చర్యలపై జిల్లా కేంద్రంలోని పెన్గంగ గెస్ట్హౌస్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వా రీగా జరిగిన నష్టంపై అధికారులను అడిగి వివరా లు తెలుసుకున్నారు. పంటనష్టం, మూగజీవాలు, ధ్వంసమైన ఇళ్ల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. నష్టాలను క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలించాలని, ఇందుకు అవసరమైతే ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలన్నా రు. ఏమైనా పొరపాట్లు జరిగితే సంబంధిత అధి కారులను బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. న ష్టంపై శాఖల వారీగా సమీక్షించి పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి, నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లుపడ్డ చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్పై అసంతృప్తి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చాలా వరకు పెండింగ్లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలు ప్రారంభించకపోవడంపై అధికారులు చెప్పి న సమాధానాలపై ఆయన విబేధించారు. మంజూరై ఇళ్ల నిర్మాణం చేపట్టని వారితో ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్థిక స్థోమత లేకనే చేపట్టకపోతే బ్యాంకులు, ఎస్హెచ్జీల ద్వారా రుణాలు ఇప్పించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ రాజర్షిషా ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదిలాబాద్, బోథ్, ఖానా పూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు గెస్ట్హౌస్కు చేరుకున్న మంత్రికి కలెక్టర్, ఎస్పీలు పూలమొక్కలు అందజేసి స్వాగతం పలి కారు. పోలీసుల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం ఈ ఏడాది మే 27న జైనథ్ మండలం లక్ష్మింపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు తర్నం వాగు దాటుతూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు. బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.5లక్షల చెక్కును మృతుడి భార్య జ్యోతికి మంత్రి అందజేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో వరద ప్రభావానికి కూలిపోయిన ఇళ్లు, భారీగా ప్రవహించిన నాలాను మంత్రి పరిశీలించారు. 11 మంది బాధితులకు రూ.4వేల నగదు, 10 కిలోల సన్నబియ్యం చొప్పున మంత్రి అందజేశారు. -
మహనీయుడు పాపన్నగౌడ్
ఆదిలాబాద్రూరల్: బహుజనుల సంక్షేమం కోసం పాటుపడిన మహనీయుడు సర్వాయి పాపన్నగౌడ్ అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాపన్నగౌడ్ సేవలను కొని యాడారు. గౌడ కులస్తులకు చేయూత అందించాల నే లక్ష్యంతో వన మహోత్సవంలో భాగంగా ప్ర భుత్వ స్థలాల్లో పెద్ద ఎత్తున ఈత మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అలాగే రాజీ వ్ యువ వికాసం పథకం కింద రూ.50వేల రుణంను వంద శాతం సబ్సిడీపై అందించేలా చర్యలు తీ సుకుంటున్నామని అన్నారు. ముందుగా గౌడ కులస్తులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా రు. ఇందులో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీని వాస్, డీఎస్పీ జీవన్రెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, గౌడ కులస్తులు రమేశ్గౌడ్, ది నేష్గౌడ్, సంతోష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
పంట నష్టంపై ఆరా..
జిల్లాలో వర్షాల నేపథ్యంలో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈమేరకు ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై ఆరా తీశారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్తా..: ఎమ్మెల్యే శంకర్సాత్నాల: భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించాల ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. భోరజ్ మండలంలోని కేదార్పూర్, అకోలి, గిమ్మ, కొరటా, మాండగాడా, పూసాయి, పిప్పర్వాడ గ్రా మాల్లో ఆయన పర్యటించారు. ఎడ్ల బండిపై వాగులు దాటుతూ నీట ము నిగిన పంట చేలను పరిశీ లించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓ వైపు సాత్నాల, మరో వైపు పెన్గంగ ఉధృతి కారణంగా జిల్లాలో దాదా పు 12వేల ఎకరాల మేర పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. అలాగే ఎరువులు సైతం తడిసి ముద్దయ్యాయని, దీంతో రైతులు నష్టపోయారన్నారు. జిల్లాలో పంట నష్టం వి వరాలను త్వరలోనే కేంద్ర మంత్రులకు తెలియజేస్తానన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రాథో డ్ రాజేశ్వరి, ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి, ఏవో అష్రఫ్, బీజేపీ నాయకులు తదితరులున్నారు. -
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
కై లాస్నగర్: జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణం, ఇచ్చోడ, జైనథ్, గుడిహత్నూర్ మండలాలకు చెంది న మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ స మితి సభ్యులతో సోమవారం స్థానిక తానిషా గా ర్డెన్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మండపాల ని ర్వహణ కమిటీ సభ్యులు ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా బందోబస్తు, నిమజ్జన ఏర్పాట్లు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశముంటుందన్నారు. గ్రామాల్లో సాధ్యమైనంతవరకు ఒకే వినాయకుడిని ప్రతిష్టించి ఐక్యత చాటాలన్నారు. గతంలో ఏర్పా టు చేసిన మండపాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయన్నారు. ఆయా కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ కమిటీ అధ్యక్షుడు ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్నారు. 24 గంటల పాటు ముగ్గురు వలంటీర్లు విగ్రహంతో పాటు మండపంలో ఉండాలని సూచించారు. అలాగే మండపంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలాంటి లక్కీ డ్రా నిర్వహించకూడదని, బలవంతపు చందాలు చేపట్టరాదని పేర్కొన్నారు. డీజేలకు అనుమతులు ఇవ్వమన్నారు. అత్యవసరమైతే డయల్ 100 కు సమాచారమివ్వాలని సూచించారు. అనంతరం కరపత్రాలు విడుదల చేశారు. ఇందులో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీఐలు బి. సునీల్కుమార్, కె. నాగరాజు, కె.ఫణిదర్, డి.సాయినాథ్, బండారి రాజు, ఎస్సైలు, సిబ్బంది, హిందు ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు హన్మాండ్లు తది తరులు పాల్గొన్నారు. -
సైక్లింగ్తో ప్రయోజనాలు
ఆదిలాబాద్: సైక్లింగ్తో ఎన్నో ప్రయోజనాలు న్నాయని ఎన్సీసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ అరవింద్ కిచ్చర్ తెలిపారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘సన్ డేస్ ఆన్ సైకిల్’ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కెడెట్లతోపాటు ప్రతి ఒక్కరూ సైక్లింగ్ చే యడం అలవాటు చేసుకోవాలని సూచించా రు. సైకిల్ ర్యాలీ స్టేడియం నుంచి ప్రారంభమై కుమురంభీం చౌక్, ప్రొఫెసర్ జయశంకర్ చౌక్ మీదుగా స్టేడియం వరకు సాగింది. సుబేదార్లు జగదీప్సింగ్, సునీల్కుమార్, హవల్దార్లు నరేశ్కుమార్, బ్రిజేశ్ కుమార్, అసోసియేట్ ఆఫీస ర్లు భూమన్న, చంద్రకాంత్, కెడెట్లు ఉన్నారు. -
పంటనష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన
ఆదిలాబాద్రూరల్/సాత్నాల/బజార్హత్నూర్/ ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ రూరల్ మండలంలో శని వారం భారీ వర్షం కురవగా వరదనీటితో కొట్టుకుపోయిన తీన్నాలా ప్రాజెక్ట్ రిటర్నింగ్ వాల్ను ఆది వారం కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ లఖిల్ మహాజన్ పరిశీలించారు. తీన్నాలా ప్రాజెక్ట్తో తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, గతంలోనూ వరదనీటితో పంటలు మునిగి తీవ్రనష్టం వాటిల్లిందని కలెక్టర్, ఎస్పీకి రైతులు తెలిపారు. వెంటనే పరిహారం అందేలా చూడాలని కోరారు. కాగా, వెంటనే తెగిపోయిన రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్ట్ పరీవా హక ప్రాంతంలో వరదనీటికి దెబ్బతిన్న పంటలను సర్వే చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నీట మునిగిన పంటలను ఎలా కాపాడుకో వాలో బాధిత రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా మండలంలోని పలు ప్రాంతాలను పరిశీ లించారు. సాత్నాల మండలం రేణిగూడా, దుబ్బ గూడా ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యటించారు. కోతకు గురైన రోడ్లు, దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. రైతులు ఎమ్మెల్యేతో తమ ఆవేదన పంచుకున్నారు. అధైర్య పడవద్దని అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు భరోసా కల్పించారు. బజార్హత్నూర్ మండలంలోని కడెం వాగు పరీవాహక ప్రాంతంలో నీటమునిగిన పంటలను బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ పరిశీలించారు. అధికా రులు వెంటనే సర్వే చేయాలని కోరారు. ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం మంజూరుకు అసెంబ్లీలో పోరాడతానని హామీ ఇచ్చారు. -
జైనథ్, సాత్నాల, భోరజ్ మండలాల్లో..
జైనథ్/సాత్నాల: జైనథ్ మండల కేంద్రానికి స మీపంలోగల వాగు ఉప్పొంగి ప్రవహించగా ఇరువైపులా సుమారు 90 ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. సాత్నాల మండలంలో సుమారు 250 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు ఏవో కైలాస్ జాదవ్ తెలిపారు. మాంగూ ర్లా, మామిడి గూడా, సుందరగిరి, సైద్పూర్ గ్రా మాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. భోరజ్ మండలంలో సుమారు 300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ఏవో అష్రఫ్ తెలి పారు. పెన్గంగ పరీవాహక ప్రాంతాలైన పెండల్వాడ, అకొలి, డోలారా, కామాయి గ్రామాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 220 ఎకరాల్లో పత్తి, 60 ఎకరాల్లో సోయా, 40 ఎకరాల్లో కంది నీట మునిగినట్లు సమాచారం. దీంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరుతున్నారు. -
నిరంతరం అప్రమత్తంగా ఉండండి
కైలాస్నగర్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆదిలా బాద్, నిర్మల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. శాఖలవారీగా తీసుకోవాల్సిన చర్య ల గురించి వివరించారు. ఆయా జిల్లాలోని రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వివరా లపై ఆరా తీశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని సూచించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడితే వెంటనే పూడ్చివేయాలని, రోడ్ల మరమ్మతులు యు ద్ధప్రాతిపదికన చేపట్టాలని తెలిపారు. ఎగువన కు రుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చో ట్ల వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించా రు. ఆర్డబ్ల్యూఎస్, హెల్త్ అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని తెలిపారు. పొంగు తున్న వాగులు దాటే ప్రయత్నం చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. -
ఫీవర్ సర్వే నిర్వహించాలి
కై లాస్నగర్: వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇంటింటా ఫీవ ర్ సర్వే నిర్వహించి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని వి కలాంగుల కాలనీ, జీఎస్ ఎస్టేట్ ప్రాంతాల ను ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించా రు. వరదలతో నష్టపోయిన ఇళ్లను పరిశీలించి బాఽధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాలనీల్లో నిర్వహించిన వైద్యశిబిరాల ను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అ ధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజ లకు అందుబాటులో ఉండాలని, అవసరమైన సమాచారం ఇస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవా లని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఆర్ఐ యజువేందర్రెడ్డి ఉన్నారు. -
వర్షం తెచ్చిన నష్టం
ఇచ్చోడ: రెండురోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా భారీగా పంటనష్టం జరిగింది. చేతి కివచ్చిన పంటలు నీటమునిగి అన్నదాతలు ఆందో ళనకు గురవుతున్నారు. చేతికివచ్చిన పంటలు కళ్లెదుటే వరదనీటిలో కొట్టుకుపోతుంటే కలత చెందా రు. జిల్లా వ్యాప్తంగా పత్తి, సోయా, మొక్కజొన్న త దితర పంటలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 11వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. రక్షేతస్థాయిలో ఏఈవోలు పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించి సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలతో జిల్లా వ్యవసాయాధికారి, ఏఈవోలు పంట పొలాల్లోకి వెళ్లి నష్టం వివరాలు సేకరిస్తున్నా రు. శనివారం భారీగా కురిసిన వర్షంతో సర్వే అంతంతా మాత్రమే జరగగా, ఆదివారం నుంచి ఏఈ వోలు పూర్తిస్థాయిలో సర్వేలో నిమగ్నమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో అధికం లోతట్టు ప్రాంతాల్లో అ్యధికంగా పంటనష్టం జరి గినట్లు తెలుస్తోంది. సిరికొండ మండలం చిక్మాన్ వాగు పొంగిపొర్లడంతో రాంపూర్, లఖంపూర్, సిరికొండ, కొండపూర్, ధర్మసాగర్, చిమన్గూడ, పోచంపెల్లి గ్రామాల్లో అత్యధికంగా పంటనష్టం జరిగినట్లు సమాచారం. ఇచ్చోడ మండలంలో గుండాల ప్రాజెక్ట్లో నీటి సామర్థ్యం ఎక్కువ కావడంతో నారాయణ్పూర్ వాగు పొంగి పొర్లడంతో సిరిచెల్మ, గుండాల గ్రామాల్లో పంటలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. భీంపూర్ మండలంలో అంతర్గమ దన్నుర్, పిప్పల్కోటి, నిపాని గ్రామాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో వడ్డాడి, హస్నపూర్, పొన్నరి గ్రామాల్లో పంటలు కొట్టుకుపోయాయి. బజార్హత్నూర్ మండలం కడెం వాగు పరీవాహక గ్రామాలైన చింతలసాంగ్వి, బోస్రా, జల్లుగూడ, జాతర్ల, సుంగుగూడ, బజార్హత్నూర్ గ్రామాల్లోనూ పంటనష్టం జరిగింది. జిల్లాలో నమోదైన వర్షపాతం శనివారం ఉదయం 8.30నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు అధి కారులు వెల్లడించారు. భీంపూర్లో 75.4 మిల్లి మీ టర్లు, జైనథ్లో 79.0, బేలలో 60.08, గుడిహత్నూర్లో 128.8, ఆదిలాబాద్ (రూరల్)లో 77.8, ఆది లాబాద్ (అర్బన్)లో 99.0, మావలలో 111.2, తాంసిలో 136.6, తలమడుగులో 138.0, బజార్హత్నూర్లో 60.6, బోథ్లో 47.6, నేరడిగొండలో 57.0, ఇచ్చోడలో 110.8, సిరికొండలో 130.2, ఇంద్రవెల్లిలో 119.2, గాదిగూడలో 48.0, నార్నూర్లో 60.2, ఉట్నూర్ మండలంలో 43.8 మిల్లీ మీటర్లుగా నమోదైనట్లు పేర్కొన్నారు. పంటనష్టం సర్వేకు ఆదేశాలు జారీ చేశాం జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయికి వెళ్లి పంట నష్టంపై సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఏఈవోలు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి సర్వే చేస్తారు. జిల్లాలో 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశాం. – శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
గిరిజనేతరుల చేతిలో వేల ఎకరాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అటవీ భూములు సా గు చేస్తున్న వేలాది గిరిజనేతరులు తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బీసీ, ఎస్సీలు అటవీ భూముల ఆధారంగానే జీవి స్తూ సాగు చేసుకుంటున్నారు. గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్(అటవీ హక్కుల గుర్తింపు) కింద ప ట్టాలు ఇచ్చారు. కానీ గిరిజనేతరులకు అవకాశం లే దు. దీంతో ఏటా సీజన్లో ఆ భూముల్లో విత్తనాలు వేసే సమయంలో ఆక్రమణదారులు, అటవీ అధికా రుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల తిరిగి స్వాధీనం చేసుకుని మొక్కలు నా టుతున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులను అటవీ అధికారులు సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు పాదయాత్ర చేపట్టగా, మధ్యలోనే పోలీసులు అడ్డుకుని తీసుకొచ్చారు. బీసీ, ఎస్సీలు అధికం అటవీ భూములను గిరిజనులతోపాటు బీసీ, ఎస్సీ ఇతర వర్గాలు వేలాది మంది సాగు చేస్తున్నారు. వీరికి సైతం పట్టాలు ఇవ్వాలని డిమాండ్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం పక్కన పెట్టింది. మూడేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 1.50లక్షల మంది గిరిజన రైతులకు 4.05లక్షల ఎకరాల్లో హక్కులు కల్పించారు. చట్టం ప్రకారం గిరిజనులకు మాత్రమే హక్కులు ఉన్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాల్లోనూ గిరిజనేతరులు సాగులో ఉన్నారు. రిజర్వు ఫారెస్టుతోపాటు పులుల సంరక్షణ కేంద్రమైన కవ్వాల్ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా 1.29లక్షల ఎకరాలు ఆక్రమణలో ఉంది. గిరిజనేతరులతోపాటు కొన్ని చోట్ల గిరిజనులు సైతం కొత్తగా ఆక్రమణలకు పాల్పడుతుండడంతో అడవుల సంరక్షణ మరింత ఇబ్బందిగా మారిందని అధికారులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే.. నిజాం కాలం నుంచే అటవీ ఆక్రమణలు ఉన్నప్పటికీ గత 20ఏళ్లలో ఈ ఆక్రమణలు తీవ్రంగా పెరిగాయి. పత్తి సాగు మొదలైనప్పటి నుంచి గిరిజనులతోపాటు గిరిజనేతరులు సైతం పెద్ద ఎత్తున చెట్లను నరికి సాగులోకి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది సిబ్బంది అవినీతితో ఇష్టారీతిన ఆక్రమణలు జరిగాయి. మరికొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల నిర్లక్ష్యం, తదితర కారణాలతోనూ రిజర్వు ఫారెస్టుల్లో సాగు మొదలైంది. ఆ భూములే తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే సామాజిక సమస్యగా మారింది. దిందాలో ఒక్కొక్కొరు 40ఎకరాల వరకు.. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బందెపల్లి, దిందాలో పరిధిలో ఒక్కో కుటుంబం ఎకరం నుంచి 42ఎకరాల వరకు ఆక్రమించారు. ఇందులో పది నుంచి 30ఎకరాల వరకు సాగులో ఉన్నారు. ఇక్కడ 530ఎకరాల్లో గిరిజనులకు పట్టాలు ఇచ్చారు. రిజర్వు ఫారెస్టులో 2600ఎకరాలు ఆక్రమణలో ఉంది. అయితే 600ఎకరాలను సాగుదారులకు వదిలేశారు. మిగతాది గిరిజనేతరుల నుంచి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా వివాదం రాజుకుంటోంది. -
ప్రయాణికులను కాపాడిన సీఐ
ఖానాపురం: వరద నీటిలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని వరంగల్ జిల్లా దుగ్గొండి సీఐ సాయిరమణ కాపాడారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన బాస లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ, రితిక, రితిన్ భద్రాచలానికి కారులో వెళ్తున్నారు. ఖానాపురం మండలంలోని చిలుకమ్మనగర్–కొత్తగూడ మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో చిక్కుకుపోయారు. వెంటనే లక్ష్మీనారాయణ పోలీసులకు సమాచారం అందించారు. డీజీ కంట్రోల్ కార్యాలయం నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో సీఐ సాయిరమణ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు చిలుకమ్మనగర్కు చేరుకుని గ్రామస్తుల సహకారంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సదరు కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
సౌర వెలుగులు
కై లాస్నగర్: ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోవాలని భావిస్తోంది. ఆదిశగా చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ క్రమంలో దృష్టి సారించిన యంత్రాంగం జిల్లాలోని ఆయా ప్రభుత్వ భవనాలు, వాటికి వినియోగిస్తున్న విద్యుత్ కనెక్షన్ల వివరాల సేకరణలో నిమగ్నమైంది. ఈ నెల 19లోగా పూర్తిస్థాయి సమాచారం సేకరించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించనున్నారు. తదుపరి ఆదేశాలకు అనుగుణంగా ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించేలా.. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. దీంతో బిల్లులు భారీగా వస్తున్నాయి. సరిపడా నిధులు లేని కారణంగా పలు శాఖలు కరెంట్ బిల్లులు సైతం చెల్లించలేని పరిస్థితి. రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇది ప్రభుత్వానికి తీవ్ర భారమవుతోంది. దీనిపై దృష్టి సారించిన సర్కారు జిల్లాలోని ఆసుపత్రులు, అంగన్వాడీలు, పాఠశాలలు, పంచాయతీ, ఇతర కార్యాలయాల భవనాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. టీజీ రెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. సమాచార సేకరణలో అధికారులు .. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యంత్రాంగం ప్రభుత్వ కార్యాలయాల భవనాల గుర్తింపునకు కసరత్తు చేపట్టింది. ఇటీవల అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాజర్షి షా భవనాల వివరాలు అందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్యదర్శులు వివరాలు సేకరిస్తుండగా , మున్సిపల్ పరిధిలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. భవనంపై కప్పు విస్తీర్ణం.. విద్యుత్ కనెక్షన్ కేటగిరీ.., నెల వారీగా వినియోగం వంటి సమాచారం సేకరిస్తున్నారు. విద్యుత్ వినియోగం తక్కువగా ఉండే చోట ఎల్టీ, ఎక్కువగా ఉన్న భవన సముదాయాలపై హెచ్టీ సర్వీస్లతో కూడిన ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. కలెక్టరేట్, రిమ్స్, ఉట్నూర్లోని జిల్లా ఆసుపత్రి వంటి విశాల భవనాలపై 100 కిలోవాట్లకు పైబడి సామర్థ్యంతో కూడిన ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ప్రతిపాదలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా విద్యుత్ ఆదాతో పాటు, పర్యావరణ పరిరక్షణకు ప్రయోజకనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వివరాలు సేకరిస్తున్నాం ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం తదనుగుణంగా వివరాలు పంపించా లని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాల వివరాలు సేకరిస్తున్నాం. ఎన్ని కిలోవాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేయాలనేది లెక్కిస్తున్నాం. వాటి ప్రతిపాదనలను సిద్ధం చేసి కలెక్టర్కు నివేదిక అందజేస్తాం. – శ్రీమన్నానారాయణ, రెడ్కో జిల్లా మేనేజర్ -
క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి
పలువురిని కాపాడిన రెస్క్యూటీమ్ 7జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రాష్ట్రస్థాయి బేస్బాల్ చాంపియన్షిప్ పోటీలను రాష్ట్ర బేస్బాల్ సంఘం అధ్యక్షుడు చల్లా హరిశంకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. సాత్నాల: భారీ వర్షాలతో సాత్నాల ప్రాజెక్టుకు వరద ఒక్కసారిగా పెరి గింది. 40వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా .. నాలుగు గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ దీపక్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 1.24 టీఎంసీ కాగా ప్రస్తుతం 1.046 టీఎంసీగా ఉన్నట్లు పేర్నొన్నారు. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాంసి: మత్తడివాగు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరగడంతో శనివారం ఉదయం ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇన్ఫ్లో 39,116 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 42,860 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా 277.20 మీటర్ల వద్ద స్థిరంగా ఉండేలా ఔట్ఫ్లో కొనసాగిస్తున్నట్లు ఏఈ హరీశ్ కుమార్ తెలిపారు. -
శ్రీకృష్ణా నమోనమః
ఇస్కాన్ ఆలయంలో దర్శనమిస్తున్న శ్రీ రాధాకృష్ణులు కృష్ణుని వేషధారణలో.. ఆదిలాబాద్: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ రాధాకృష్ణా ఆలయం,శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం, శ్రీ మురళీకృష్ణా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. తల్లిదండ్రులు తమ చిన్నారులను రాధాకృష్ణులు, గోపికలుగా అలంకరించి ము రిసిపోయారు. అశోక్రోడ్లో ఉట్టికొట్టే కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. కుమార్పేట కాలనీకి చెందిన సార్వజనిక్ యూత్ సభ్యులు విజేతలుగా నిలిచారు. -
ముగిసిన తీజ్ వేడుకలు
ఇంద్రవెల్లి: మండలకేంద్రంతోపాటు హర్కపూర్, బిక్కుతండా, ఈశ్వర్నగర్ తదితర తండాల్లో తీజ్ ముగింపు వేడుకలను శనివారం నిర్వహించారు. రాఖీపౌర్ణమి నుంచి ప్రారంభమైన తీజ్ వేడుకల్లో పెళ్లి కాని యువతులు గ్రామపెద్ద ఇంట్లో వెదురుబుట్టల్లో గోధుమ నారు నాటారు. 9 రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి గోధుమ నారుకు నీరు పో శారు. గోకులాష్టమి సందర్భంగా తీజ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువతులు, మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం గ్రామపొలిమేరలో వాగులో తీజ్లను వదిలి ఉత్సవాలు ముగించారు. గ్రామపెద్దలు చవాన్ ఉమాజీనాయక్, జాదవ్ దుదిరాం, రాథోడ్ శేవంతబాయి రోహిదాస్, జాదవ్ మీరాబాయి, సేవాలాల్ ధర్మ ప్రచారక్ ప్రేమ్ మహారాజ్, గంగారం రాథోడ్, సంతోష్ రాథోడ్ తదితరులు ఉన్నారు. -
గొలుసు దొంగ అరెస్ట్
లోకేశ్వరం: మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం భైంసాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ అవినాష్కుమార్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. లోకేశ్వరం మండలంలోని వాస్తాపూర్ గ్రామానికి చెందిన మేకల యమున తన రెండు ఎద్దులను గురువారం అబ్దుల్లాపూర్ వెళ్లేదారిలో మేపుతోంది. ఒంటరిగా ఉన్న ఆమెతో దొంగ మాయమాటలు చెప్పి మెడలో రెండు తులాల బంగారు గొలుసును చోరీ చేసి బైక్పై పారిపోయాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్కపూర్, అబ్దుల్లాపూర్ సీసీ పుటేజీలను పరిశీలించారు. ముధోల్ మండలంలోని ఆష్టా గ్రామానికి చెందిన పిప్పెర విజయ్గా గుర్తించి శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న రెండు తులాల బంగారు గొలుసుతోపాటు బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న లోకేశ్వరం ఎస్సై ఆశోక్, కానిస్టేబుల్ శ్రీనివాస్, సాయిప్రశాంత్, లక్ష్మణ్లను ఏఎస్పీ అభినందించారు. -
● జిల్లాలో కుండపోత వాన ● ఉప్పొంగిన వాగులు, వంకలు ● జలమయమైన లోతట్టుప్రాంతాలు ● నీటమునిగిన పంటలు, కాలనీలు ● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ● స్తంభించిన జనజీవనం
వాగులో కొట్టుకుపోతున్న వాహనం కైలాస్నగర్: జిల్లాలో వర్షం దంచికొట్టింది. శనివా రం వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు కుండపోతగా కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లా యి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల కాలనీలు నీట మునగగా.. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరడంతో జలకళ సంతరించుకున్నా యి. లోలెవల్ వంతెనలపై వరద ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలి చిపోయా యి. పలుచోట్ల పంట చేలు ముంపునకు గురయ్యా యి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పలు కాలనీలు జలమయం జిల్లాకేంద్రంలోని సుభాష్నగర్, దుర్గానగర్, గ్రీన్సిటీ, కృష్ణానగర్లోని లోలెవల్ వంతెనలు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జీఎస్ ఎస్టేట్లోకి వర్షపునీరు చేరి చిన్నపాటి చెరువును తలపించింది. భాగ్యనగర్, మహాలక్ష్మివాడ కాలనీల్లోకి వర్షపునీరు చెరడంతో సామగ్రి అంతా తడిసిపోయింది. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుర్గానగర్ వాగు ఉ ప్పొంగి ప్రవహించడంతో కోజాకాలనీలో ఓ కారు వరదలో కొట్టుకుపోయింది. తాంసి మండలంలో ని హస్నాపూర్, బోథ్ మండలంలోని సాయినగర్ కాలనీ, బేలలోని పాతబస్తీ, ఇందిరానగర్కాలనీలను వరద ముంచెత్తింది. -
తాంసీలో అత్యధికం.. గాదిగూడలో అత్యల్పం
వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ సీజన్లో ఇదే భారీ వర్షం. శనివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఒక్క రోజే జిల్లాలో 2078.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తాంసి మండలంలో 170.6 మి.మీ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఇక తలమడుగులో 162.4, మావలలో 154.2, గుడిహత్నూర్లో 145.2, సిరికొండలో 144.4, ఆది లాబాద్ అర్బన్లో 142.0, ఇంద్రవెల్లిలో 135.2, జైనథ్లో 132.6, ఆదిలాబాద్ రూరల్లో 126.0, ఇచ్చోడలో 123.2, నేరడిగొండలో 91, బజార్హత్నూర్లో 89.2, భీంపూర్లో 88.8 మి.మీ, బోథ్లో 85.6, నార్నూర్లో 84.8, బేలలో 78.4, ఉట్నూర్లో 64.2, గాదిగూడలో 60.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
అత్యవసరమా.. డయల్ చేయండి
కై లాస్నగర్: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ సాయం అందించేందు కోసం టోల్ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ కంట్రోల్రూం నంబర్ 1800 425 1939, ఆదిలాబాద్ మున్సిపల్లోని కంట్రోల్ రూం నంబర్ 94921 64153 ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ కంట్రోల్ రూంలో ఒక్కో షిఫ్ట్లో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు తక్షణ సాయం, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నంబర్లను సంప్రదించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. వర్షం తగ్గే వరకు తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వ సహాయ కేంద్రాల నుంచి అందించే సమాచారం, సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. -
గర్భిణుల తరలింపు
వేమనపల్లి: భారీ వర్షాలు దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో శనివారం వేమనపల్లి పీహెచ్సీ వైద్యాధికారి రాజేష్ ఆధ్వర్యంలో లోతట్టు గ్రామాల్లోని గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కళ్లెంపల్లి, జాజులపేట, సుంపుటం గ్రామాలకు చెందిన కుడిమెత భారతి, శకుంతల, కుబిడె రోజును వేమనపల్లి పీహెచ్సీ నుంచి అంబులెన్స్లో చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వరద తీవ్రత పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా తరలిస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. ఇన్చార్జి హెల్త్ సూపర్వైజర్ రాంశెట్టి బాపు, ఏఎన్ఎం మంజుల, రాజ్యలక్ష్మి, ఈఎంటీ జనార్దన్, పైలెట్ సంపత్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉరేసుకుని ఆత్మహత్యకుంటాల: మండలంలోని లింబా(బి) గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గాండ్ల సాయినాథ్ (40) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. సాయినాథ్కు గత 20 ఏళ్ల క్రితం రజితతో వివాహమైంది. ఇప్పటివరకు సంతానం కాలేదు. దివ్యాంగుడు కాగా, మద్యానికి బానిసయ్యాడు. శనివారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మతిస్థిమితం లేని వృద్ధుడు..సిర్పూర్(టి): మండలంలోని నవేగాం గ్రామానికి చెందిన రాంటెంకి రుషి(60) శుక్రవారం పెన్గంగ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై కమలాకర్ కథనం ప్రకారం.. రుషి గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతుండేవాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. దహెగాం మండలకేంద్రం శివారులో పత్తి చేనులో అతని బట్టలు దొరకగా శనివారం ఉదయం పెన్గంగ నదిలో మృతదేహం ఆచూకీ లభ్యమైంది. పెద్దనాన్న కుమార్తె యశోదాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అడవిపంది దాడిలో వ్యక్తి మృతిభీమిని: అడవిపంది దాడిలో వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కన్నెపల్లి ఎస్సై భాస్కర్రావు, స్థానికులు తెలిపిన వివరాలు.. భీమిని మండలం వెంకటపూర్కు చెందిన దాగామ రామయ్య (70) కన్నెపల్లి మండలం సుర్జాపూర్ శివారులో శనివారం పత్తి చేనుకు వెళ్లి వస్తున్నాడు. ఈక్రమంలో అడవి పంది దాడిలో అతడు గాయపడ్డాడు. పక్క చేనులో ఉన్న రైతులు గట్టిగా కేకలు వేయగా అది పరిగెత్తింది. రామయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. అక్కడి నుంచి వెళ్లిన అడవి పంది గురుండ్ల చిరంజీవి, మేకల బాపులపై దాడి చేసి గాయపర్చింది. మృతుడి కుమారుడు రాజేశం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరు మైనర్లపై కేసు ముధోల్: మండలంలోని గురుకుల పాఠశాల కు చెందిన ఇద్దరు మైనర్ విద్యార్థులపై శనివా రం కేసు నమోదైనట్లు ఎస్సై బిట్లా పెర్సిస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 8వ తరగతి, టెన్త్, ఇంటర్ విద్యార్థులు శుక్రవారం రా త్రి సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల పోటీలు ఉండగా మైక్ విషయంలో గొడవపడ్డారు. ఇద్దరు మైక్ దాచిపెట్టగా ఈక్రమంలో గొడవ జరిగింది. ఇద్దరిని కొట్టడంతో గాయాలయ్యా యి. విషయం తెలుసుకున్న ఎస్సై అక్కడికి చేరుకున్నారు. బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
చోరీ కేసులో ముఠా నాయకుడి అరెస్టు
ఆదిలాబాద్రూరల్: మావల పోలీస్స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ముఠా నాయకుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. చౌహాన్ రవి, సుఖ్దేవ్, షోహెల్, మైకల్వర్ సాయినాథ్, అమ్ము, కరణ్లు ముఠాగా ఏర్పడి రాష్ట్రంతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. ఇందులో సాయినాథ్ను ఈనెల 12న పీటీ వారెంట్పై హాజరుపర్చగా, ఈనెల 14న సుఖ్దేవ్, పరారీలో ఉఉన్న ప్రధాన నిందితుడు చౌహన్ రవిని శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు షోహెల్, అమ్ము, కరణ్లు పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ వారి నుంచి రూ. 9,500 నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చౌహన్ రవిపై వివిధ పోలీస్ స్టేషన్లల్లో 25 క్రిమినల్ కేసులు, సఖ్దేవ్పై రాష్ట్ర వ్యాప్తంగా 22కు పైగా కేసులు నమోదై ఉన్నాయన్నారు. దొంగలను పట్టుకున్న మావల సీఐ కర్రె స్వామి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. సమావేశంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి
ఆదిలాబాద్: క్రీడాకారులంతా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని రాష్ట్ర బేస్బాల్ సంఘం అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో తెలంగాణ 5వ సీనియర్ రాష్ట్రస్థాయి బేస్బాల్ చాంపియన్షిప్ (మహిళలు–పురుషులు) పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటిని సమానంగా స్వీకరించాలన్నారు. క్రీడాభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. పది రోజుల పాటు శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని వివరించారు. పోటీల్లో రాష్ట్ర జట్టు విజేతగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.శ్వేత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించినవారికి గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం శుభపరిణామన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 700 క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి డా.కృష్ణ, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి జ్యోతి, ఉపాధ్యక్షుడు లోక ప్రవీణ్రెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, వ్యాయామ ఉపాధ్యాయులు దయానందరెడ్డి, హరిచరణ్, రామ్కుమార్, జిల్లాల నుంచి కార్యదర్శులు, కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు పురుషుల విభాగంలో ఆదిలాబాద్ కరీంనగర్ జట్టుపై 6–1తో, హైదరాబాద్ నిర్మల్ జట్టుపై 7–1తో, మహబూబ్నగర్ సిద్దిపేట జట్టుపై 7–2తో విజేతలుగా నిలిచాయి. మహిళల విభాగంలో నిజామాబాద్ జట్టు సిద్దిపేటపై 9–0తో, కరీంనగర్ జట్టు మహబూబాబాద్ జట్టుపై 6–5తో, నల్గొండ జట్టు ఆసిఫాబాద్ జట్టుపై 7–4తో విజేతలుగా నిలిచాయి. -
ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో నీటి నిల్వఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్లోకి భారీగా వరద పోటెత్తింది. శనివారం 1.04 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు ప్రస్తుతం 1083 అడుగులు ఉంది. 80.5 టీఎంసీలకుగాను 53.62 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువ, మిషన్ భగీరథకు వదులుతున్నారు. గోదావరిలో భారీగా వరద నీరు చేరే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు సూచించారు. పశువుల, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయొద్దని పేర్కొన్నారు. – మామడ -
బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీలు
రెబ్బెన: గోలేటిలో ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహించే అంతర్ జిల్లాల బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి పేర్కొన్నారు. గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా పురుషులు, మహిళల క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. సుమారు 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులకు ఈనెల 17 నుంచి 21 వరకు సింగరేణి క్రీడామైదానంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో ప్రతిభ చూపినవారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి మారం శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్రెడ్డి, భాస్కర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు చందర్ ఏఐటీయూసీ నాయకులు జగ్గయ్య, క్రీడాకారుడు నరేశ్ పాల్గొన్నారు. శిక్షణ శిబిరానికి ఎంపిక ఉమ్మడి జిల్లా పురుషుల జట్టుకు కె.సిద్దార్థ్, ఎం.తిరుపతి, పి.పవన్కుమార్, కె. తరుణ్, జి.గోపాల్, పి.శ్రీకాంత్, సాయి చరణ్, టి.దిలీప్కుమార్, పి.దేవరాజ్, ఎం.సూర్యకుమార్, ప్రేంకుమార్, సీహెచ్ గోపాలకృష్ణ, సీహెచ్ వరణ్ ఎంపికయ్యారు. మహిళల జట్టుకు ఏ.స్వప్న, కె.అంజలి, డి.శ్రావణి, జి.అనూష, కె.శ్రీస్పూర్తి కారుణ్య, టి.ప్రజ్వల శ్రీ, పి.వర్షిణి, సుజాత, సాయిదీక్ష, సంజన, అర్చన, వైష్ణవి, హారిక ఎంపికయ్యారు. -
కడెం వరదలో వ్యక్తి గల్లంతు
కడెం/దస్తురాబాద్: చేపల వేటకు వెళ్లి కడెం వరదలో చిక్కుకుని ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కడెం మండలం కన్నాపూర్కు చెందిన తిప్పిరెడ్డి గంగాధర్ (45) శనివారం కడెం గేట్లు ఎత్తడంతో కుమారుడు, మరో వ్యక్తితో కలిసి ప్రాజెక్ట్ గేట్ల దిగువన వెళ్లాడు. రెండు గేట్లు మూసివేయడంతో నీటి ప్రవాహం తగ్గిందని కర్రలతో చేపలు వేటాడేందుకు వెళ్లాడు. అరగంట తర్వాత ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు సైరన్ మోగించి మరో రెండు గేట్లు ఎత్తారు. సమీపంలో వందలాది మంది కేకలు వేసిన గంగాధర్ ఫోన్ చూస్తుండగా ఒక్కసారిగా చుట్టూ నీళ్లు చేరాయి. బయటకు రాలేక, కొద్ది దూరంలో బండపై నిల్చోని కాపాడండి అంటూ కేకలు వేశాడు. వరద ప్రవాహం పెరగడంతో అందరు చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయాడు. 3 కి.మీ మేర మునుగుతూ, తేలుతూ ఈదుతున్నాడు. పాండ్వపూర్ సమీపంలో కడెం వంతెనను దాటి వెళ్లడం అక్కడే ఉన్నవారు, కానిస్టేబుళ్లు నాగరాజు, వంశీ గమనించారు. చెట్లపొదల పక్క నుంచి కొట్టుకుపోతున్న అతన్ని కాపాడేందుకు పరిగెత్తి ప్రయత్నించారు. సుమారు 3 కి.మీ మేర బురదలో వెళ్లిన ఫలితం దక్కలేదు. అదేవిధంగా దస్తురాబాద్ మండలం భూత్కూర్ పంచాయతీ రాంపూర్ గోదావరి తీర ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేపట్టింది. ఎస్సై సాయికుమార్, తహసీల్దార్ విశ్వంబర్ అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ దొరకకపోవడం, రాత్రి కావడం, వరద ప్రవాహం పెరగడంతో గాలింపును నిలిపివేశారు. కడెం ప్రాజెక్ట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ఎఫ్ బృందం స్పందిస్తే వరదల్లో గంగాధర్ను బయటకు తీసుకువచ్చేవారని స్థానికులు వాపోయారు. గంగాధర్కు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి నిమిత్తం బిస్కెట్లు, కేక్లు, చాక్లెట్లు తదితర బేకరీ ఐటెమ్స్ను షాపులకు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. కేకలు వేశాం కడెం గేట్లు దూరాన ఉన్న మేము బయటకు రావాలని కేకలు వేశాం. అతను గమనించలేదు. నేను పోతున్నా అంటూ గట్టిగా ఆరిచాడు. 20 నిమిషాల వ్యవధిలో వరదలో కొట్టుకుపోయాడు. – వినయ్, ప్రత్యక్ష సాక్షి -
గిరిజనుల అభివృద్ధికి నిరంతర కృషి
ఉట్నూర్రూరల్: గిరిజనుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ముందుగా పీవో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఐటీడీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం, అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. 934 ప్రాథమిక పాఠశాలల్లో 12,017 మంది విద్యార్థులు చదువుతుండగా 1,449 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నట్లు తెలిపారు. 133 ఆశ్రమ పాఠశాలల్లో 31,749 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పెంచిన చార్జీల ప్రకారం నూతన ఆహార మెనూ అమలు చేస్తూ నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు చెప్పా రు. ఉమ్మడి జిల్లాలో నాలుగు మినీ బాలికల గురుకులాలు, నాలుగు ఏకలవ్య పాఠశాలలు (కో–ఎడ్యుకేషన్), ఎనిమిది అప్గ్రేటెడ్ బాలికల జూని యర్ కళాశాలలు, నాలుగు అప్గ్రేటెడ్ జూనియర్ కళాశాలలు, ఒక బాలుర జూనియర్ కళాశాల, ఒక బాలికల జూనియర్ కళాశాల, రెండు మహిళా డిగ్రీ కళాశాలలు, ఒక పురుషుల డిగ్రీ కళాశాల ఉన్నట్లు తెలిపారు. గురుకులాల్లో 11,114 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 32 పీహెచ్సీలు, 186 ఆరోగ్య ఉప కేంద్రాలు, ఎనిమిది సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా వీటి ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ సెంటర్ ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 42 మందికి చికిత్స అందించినట్లు తెలిపారు. భూ బదలాయింపు చట్టం కింద ఈ సంవత్సరం 25 కేసులు నమోదు చేసి 12 పరిష్కరించినట్లు పేర్కొన్నారు. మిగతా 13 కేసులు విచారణలో ఉన్నట్లు తెలిపారు. జీసీసీ ద్వారా ఉమ్మడి జిల్లాలో గిరిజన సహకార సంస్థ, ఐటీడీఏ ఆధ్వర్యంలో 17 పెట్రోల్ పంపులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా, మంజూరైన 11 పెట్రోల్ పంపులను ప్రారంభించి నిరుద్యోగ గిరిజన యువతీయువకులకు ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. మగతా ఆరు పంపులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏవో దామోదరస్వామి, ఏడీఎంహెచ్వో మనోహర్, పీహెచ్వో సందీప్, పీవీటీజీ ఏపీవో మనోహర్, డీపీవో ప్రవీణ్, అధికారులు, సిబ్బంది, ఆశ్రమ, గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘హమాలీల సమస్యలు పరిష్కరిస్తా’
బెల్లంపల్లి: హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లిలోని అగర్వాల్ భవన్లో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హమాలీ సంఘం నాయకులను సీఎం రేవంత్రెడ్డి వద్దకు తీసుకువెళ్లి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం మాట్లాడుతూ.. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అసంఘటిత కార్మికు ల మాదిరిగానే ఫీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాల ని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వర్తింపజేయాల ని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు బజారు ఏరియా ప్రాంతం నుంచి పుర వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గెల్లి రాజలింగు, నియోజకవర్గ అధ్యక్షులు, హమాలీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
నిందితుడి ఆచూకీ తెలిపితే నజరానా
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలో ఈనెల 8న ఓ వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి భారీ నగదు బహుమతి ఇస్తామని డీఎస్పీ జీవన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం వన్టౌన్, టూటౌన్ సీఐలు సునీల్కుమార్, నాగరాజుతో కలిసి ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడి ఆమె మృతి కారణమైన నిందితుడు స్థానిక రైల్వేస్టేషన్ గుండా పర్లి వైద్యనాథ్ ట్రైన్లో పరారైన విషయం సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడి ఎత్తు దాదాపు 5.4 అడుగులు ఉంటుందని, మరాఠీ భాష మాట్లాడే వ్యక్తిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుడి వివరాలు తెలిస్తే ఆదిలాబాద్ డీఎస్పీని 87126 59914, ఆదిలాబాద్ వన్టౌన్ సీఐని 87126 59918, టూ టౌన్ సీఐని 8712659920, సీసీఎస్ ఇన్స్పెక్టర్ను 87126 59965 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సమాచారం తెలిపినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహారాష్ట్ర, తెలంగాణలలో గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు. రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, సిబ్బంది ఉన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వ్యాన్
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల సమీపంలోగల మసీదు ఎదురుగా నిర్మల్–ఖానాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని శుక్రవారం వేకువజామున నిర్మల్ నుంచి మెట్పల్లి వైపు అరటిపండ్ల లోడుతో వేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో గద్దె కూలి స్తంభం కిందపడింది. డీసీఎం వాహనం ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
రాజీవ్ సద్భావన యాత్రకు వీడ్కోలు
కై లాస్నగర్: రాజీవ్ సద్భావన యాత్ర ఆదిలాబాద్ జిల్లాలో ముగిసింది. రాజీవ్ జ్యోతి యాత్ర చైర్మన్ ఆర్.దొరై ఆధ్వర్యంలో ఈ నెల 9న తమిళనాడులోని పెరంబుదూర్లో మొదలైన యాత్ర ఈనెల 19న దేశ రాజధానిలోని న్యూఢిల్లీలోని రాజీవ్గాంధీ సమాధి వీర్ భూమికి చేరుకుంటుంది. ఈ యాత్ర గురువారం రాత్రి ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో యాత్రీకులు రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం క్యాంపు ఆఫీస్ ఆవరణలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పా ల్గొన్నారు. వారికి మాజీ ఎంపీ సోయం బాపూరా వు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు జ్యోతిని దర్శించుకుని వీడ్కోలు పలికారు. 33 ఏళ్లుగా యాత్ర కొనసాగించడం అభినందనీయమని సోయం బాపూరావు కొనియడారు. నాయకులు పాల్గొన్నారు. -
యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్: జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని యూనివర్సిటీ సాధన సమితి సభ్యులు శుక్రవారం కలిసి విన్నవించారు. పంద్రాగస్టు వేడుకలకు హాజరైన ఆయనకు జిల్లా కేంద్రంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతవాసుల ఆకాంక్ష మేరకు జిల్లాలో విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన జిల్లాలో ఎక్కడ యూనివర్సిటీ కావాలని అడగగా, జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఖానాపూ ర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం జిల్లా కేంద్రంలోనే అనువుగా ఉంటుందని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమితి కన్వీనర్ పురుషోత్తంరెడ్డి తెలిపారు. ఈ విషయమై సలహాదారు కలెక్టర్ ను ఆరా తీయగా, విషయం తన దృష్టిలో ఉందని పేర్కొన్నారని సమితి సభ్యులు తెలిపారు. ఇందులో సమితి కోకన్వీనర్ తొగరి భాస్కర్, సవీన్రెడ్డి, డాక్టర్ నరేందర్రెడ్డి, సతీ్శ్ సతీశ్రెడ్డి, ఆదినారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ యువతి మృతి
నిర్మల్ రూరల్: మండలంలోని చిట్యాల గ్రామం వద్ద రాఖీ పండుగ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అర్చన (18) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లికి చెందిన మహేశ్ వరుసకు చెల్లెళ్లయిన అర్చన, ఆద్యతో కలిసి జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న అర్చన చెల్లెలు అక్షయతో రాఖీ కట్టుకునేందుకు బైక్పై బయలుదేరారు. చిట్యాల వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో మహేశ్, ఆద్యకు స్వల్ప గాయాలు కాగా.. అర్చనకు తీవ్రగాయాలయ్యాయి. అర్చన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అర్చన ఇంటర్ పూర్తి చేసి ఇటీవలే హైదరాబాద్లో బీటెక్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందింది. మరో వారంరోజుల్లో కాలేజీలో జాయిన్ కావాల్సి ఉండగా రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించడంతో కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. కాగా, ప్రమాదానికి కారణమైన వాహనం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలానికి చెందిన ఓ వ్యక్తిదిగా రూరల్ పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. వాహనాన్ని స్వాధీనం చేసుకుని రవాణాశాఖ అధికారికి అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మంచిర్యాలరూరల్(హాజీపూర్): పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపూర్కు చెందిన కుక్కల రాకేశ్ (21) ఇద్దరు స్నేహితులతో కలిసి నిజామాబాద్కు వెళ్లి తిరిగి రామకృష్ణాపూర్కు కారులో వస్తుండగా హాజీపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వేంపల్లి శివారులోగల కల్వర్టును అతివేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాకేశ్కు తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి వివాహం కాలేదు. అతని తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పాటాగూడలో తొలిసారి ఎగిరిన జెండాకెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని పాటాగూడ గ్రామంలో తొలిసారి జాతీయ జెండా రెపరెపలాడింది. ఇది మారుమూల గ్రామం కావడంతో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. జోడేఘాట్కు వెళ్లే ప్రధాన రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో ఉంటుంది. అప్పుడప్పుడు ప్రైవేట్ వాహనాలు వెళ్తుంటాయి. అవి కూడా వెళ్లని పక్షంలో వారికి కాలినడకే శరణ్యం. ఆ గ్రామంలో ఇప్పటివరకు బడి, అంగన్వాడీ కేంద్రం లేదు. దీంతో ఇప్పటివరకు జెండా ఎగురవేయలేదు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా చొరవతో ఇటీవల గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాల ప్రారంభించారు. ఇందులో 14 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శుక్రవారం పాఠశాలలో సీఆర్టీ చంద్రకళ త్రివర్ణపతాకం ఎగురవేశారు. దీంతో గిరిజనులు హర్షం వ్యక్తంజేశారు. -
భార్యతో గొడవపడ్డందుకు చితకబాదిన ఎస్సై!
వేమనపల్లి: భార్యతో గొడవపడ్డందుకు తనను ఎస్సై చితకబాదాడని మండలంలోని సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య ఆరోపించాడు. ఈ మేరకు ఎస్సైపై ఆరే కుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశంతో కలిసి సీపీ, డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సుంపుటం గ్రామానికి చెందిన అల్గం కిష్టయ్య నాలుగేళ్ల క్రితం నీల్వాయి కొత్త కాలనీకి చెందిన భారత ప్రమీలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ప్రమీల పుట్టింటికి వెళ్లడం, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన అనంతరం తిరిగి కాపురానికి రావడం జరుగుతుండేది. 20 రోజుల క్రితం అనారోగ్యంతో ప్రమీల పుట్టింటికి వెళ్లింది. దీంతో కిష్టయ్య గత ఆదివారం ఆమె వద్దకు వెళ్లి కాపురానికి రావాలని గొడవ పడ్డాడు. దీంతో ప్రమీలతోపాటు ఆమె తల్లిదండ్రులు నీల్వాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై సురేశ్ భార్యాభర్తలకు కౌన్సిలింగ్ చేశాడు. అయితే గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశ్ ద్వారా రూ.10వేలు ఇవ్వాలని ఎస్సై తనను డిమాండ్ చేసినట్లు కిష్టయ్య ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన భార్య, అత్తమామలు, మరికొందరి ముందే ఎస్సై తనను రోకలిబండతో తీవ్రంగా కొట్టాడని కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ విషయమై మూడురోజుల క్రితం రూరల్ సీఐ బన్సీలాల్, ఏసీపీ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. శుక్రవారం రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీకి పోస్టు ద్వారా ఫిర్యాదు కాపీ పంపించినట్లు పేర్కొన్నాడు. ఎస్సై సురేశ్తో తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
జిల్లా పోలీసులకు సేవా పతకాలు
ఆదిలాబాద్టౌన్: జిల్లాకు చెందిన ఇద్దరు కాని స్టేబుళ్లకు రాష్ట్ర సేవా పతకాలు లభించాయి. టీజీ ఎఫ్టీఎఫ్ హెడ్క్వార్టర్స్ హైదరాబాద్లో పనిచేస్తున్న వీరు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా, డీజీ అనిల్ కుమార్ చేతుల మీదుగా ఈ పతకాలు అందుకున్నారు. జైనథ్ మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ కాయకార్ సంజయ్, ఆదిలాబాద్ పట్టణంలోని మోచిగల్లికి చెందిన గటిక రాజు పతకాలు అందుకోవడంపై పలువురు వారికి అభినందనలు తెలిపారు.సేవా పతకాలు అందుకుంటున్న కానిస్టేబుళ్లు -
అసెంబ్లీలో ప్రస్తావించాలి
నేరడిగొండ: జిల్లాలో విశ్వ విద్యాలయం ఏర్పా టు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు ఎన్హెచ్ఆర్సీ జిల్లా చైర్మన్ రాథోడ్ సందీప్ విన్నవించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికా రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో నేరడిగొండ మండల చైర్మన్ నర్సింగ్ దాస్, వైస్ చైర్మన్ సతీష్, కోఆర్డినేటర్ కృష్ణ, విలేజ్ కమ్యూనిటీ మెంబర్స్ కృష్ణ, సంతోష్ తదితరులున్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నార్నూర్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారి కుడ్మేత మనోహర్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఏఎన్సీ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులకు మె రుగైన వైద్యం అందించాలని, గ్రామాలకు వెళ్లి వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎ ప్పటికప్పుడు ఆశ కార్యకర్తల ద్వారా తెలుసుకోవాలని పేర్కొన్నారు. విధులను నిర్లక్ష్యం చే స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీహెచ్సీ డీడీవో డాక్టర్ జితేందర్రెడ్డి, హెచ్ఈ తులసీ దాస్ రాథోడ్, చౌహాన్ నాందేవ్, హెల్త్ సూపర్వైజర్ చరణ్దాస్ చౌహాన్ తదితరులున్నారు. -
క్రమశిక్షణతో ట్రైనింగ్ పొందాలి
ఆదిలాబాద్రూరల్: ఎన్సీసీ కెడెట్లు దేశ సమైక్యతకు క్రమశిక్షణతో ట్రైనింగ్ పొందాలని కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ వీపీ సింగ్ సూ చించారు. గురువారం జిల్లా కేంద్రంలోని తె లంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళా శాల (పురుషులు) ఎన్సీసీ యూనిట్ను సందర్శించారు. ఆయనకు ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ, ఎన్సీసీ లెఫ్ట్నెంట్ పుట్ట లక్ష్మణ్, ఎన్సీసీ కె డెట్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం వీపీ సింగ్ కళాశాల యూనిట్ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తంజేశారు. సామాజిక బాధ్యత పెంచుకోవాలని కెడెట్లకు సూచించారు. ఎన్సీసీ కెడెట్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మద్యానికి దూరం.. చారిగాం
అదో మారుమూల కుగ్రామం. ఆ గ్రామంలో అందరి జీవనాధారం వ్యవసాయమే. ప్రతీరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. మహాత్మాగాంధీ సూచనలు నమ్మిన కాగజ్నగర్ మండలంలోని చారిగాం గ్రామస్తులు మద్యపాన నిషేధాన్ని పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చారిగాం గ్రామం ఉంది. ఈ గ్రామంలో 234 మంది జనాభా, 112 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారంతా మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉంటున్నారు. గ్రామంలో గుడుంబా తయారీ, బెల్టుషాపుల ఏర్పాటు చేయవద్దని మూడున్నర దశాబ్ధాల క్రితమే పెద్దలు తీర్మాణించారు. ఇప్పటికీ అవే ఆచారాలను పాటిస్తున్నారు. గ్రామంలో అన్నీ వ్యవసాయ కుటుంబాలే. ప్రధానంగా కూ రగాయాలు సాగుచేసి పట్టణంలోని మార్కెట్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. 35 ఏళ్లుగా గ్రామస్తులు మ ద్యపాన నిషేధం పాటిస్తున్నారు. స్థానిక యువత బయట తాగినట్లు తెలిస్తే ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి వారిచే మాలధారణ చేయిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనతో కలిగే లాభాలను వివరిస్తూ మరోసారి మద్యం జోలికి వెళ్లకుండా వారికి అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఎలాంటి గొడవలు, అల్లర్లకు తావులేకుండా మంచి నడవడికతో ఉంటున్నారు. -
అభివృద్ధి చెందిన దేశంగా మారాలి
మన దేశం దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతోంది. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతిఒక్కరూ క్షేత్రస్థాయిలో శ్రమించాలి. ప్రభుత్వాలూ ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయాలి. ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేస్తే ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా తప్పనిసరిగా మారుతుంది. – జీ శ్రీజ శక్తివంతంగా తయారు కావాలి ఎన్నో సంస్కృతి, సంప్రదాయాలున్నా మన ఐక్యతే దేశానికి పెద్దబలం. భిన్నాభిప్రాయాలున్నా సోదరభావంతో మెలుగుతున్నాం. ఏ దేశం బలప్రయోగం, బలవంతపు ఒత్తిడులు ఇండియాపై పడకుండా ప్రభుత్వం పటిష్ట విదేశాంగ విధానం అమలు చేయాలి. ప్రపంచ యవనికపై దేశం శక్తివంతంగా ఎదగాలి. – కూర ఐశ్వర్య రవాణా సౌకర్యం మెరుగుపర్చాలి రవాణా రంగం అభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉంటుంది. రవాణా రంగం ఎంతగా ప్రగతి సాధిస్తే అంత ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు, జల, వాయు మార్గాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలి. వీటితో ఎగుమతులు, దిగుమతులు పెరిగి విదేశీ ద్రవ్యం పోగుపడుతుంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలి. – పీ చైత్ర -
సొసైటీ పాలకవర్గాల గడువు పొడిగింపు
● ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం కై లాస్నగర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్)ల పాలకవర్గాల గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గురువారంతో వీటి కాల పరిమితి ముగియగా మరో ఆరు నెలల పాటు సొసైటీ, డీసీసీబీ చైర్మన్ల పదవీకాలం పొడిగిస్తూ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సొసైటీ చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ అడ్డి భోజారెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ఆయనను కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. -
రాజకీయంలో నిబద్ధత పెరగాలి
భారత రాజ్యాంగం ఎంతో ఉన్నతమైంది. ఎన్నో ఆకాంక్షలు, అ భివృద్ధి, ప్రణాళికలు, అందరి హక్కులు, బాధ్యతలకు సమ ప్రాధాన్యతనిస్తూ రూపొందించబడింది. రా జ్యాంగం నిబంధనలకు అనుగుణంగా రాజకీ య నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నిబద్ధతతో మెలగాలి. – ఎ.స్రవంతి ఆర్థికంగా అగ్రస్థానంలో నిలవాలి ఆర్థికాభివృద్ధిలో దే శం వేగంగా ముందుకు సాగుతోంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఫలితంగా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. 2047 వరకు మన దేశం ఆర్థికంగా అగ్రస్థానంలో నిలవాలి. పేదరిక నిర్మూలనకు విప్లవాత్మక చర్యలు చేపట్టాలి. – వై.వైష్ణవి దేశభక్తిని మనసులో నింపుకోవాలి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కొందరు సోషల్ మీడియాలో దేశభక్తిని చాటుతుంటారు. సాధారణ రోజుల్లోనూ ఇది కనిపించాలి. మన సంస్కృతి, విలువలను కాపాడుకుంటూ గొప్పగా ప్రవర్తించాలి. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశ ప్రగతికి పాటుపడాలి. దేశభక్తిని మనసులో నింపుకోవాలి. – డీ అనుదీప్తి సాంకేతికత వైపు సాగాలి రోజురోజుకూ పెరిగిపోతున్న టెక్నాలజీ దేశాభి వృద్ధికి తోడ్పడాలి. అవసరమైన టెక్నాలజీని వి నియోగించుకుని నిరుద్యోగ యువత ఆర్థిక స్వావలంభన దిశగా ముందుకుసాగాలి. విద్యతోనే అన్నిరంగాల్లో ముందుకు సాగవచ్చు. అందరికీ ఉన్నతవిద్య అందించేంలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. – కే సింధు -
ముందస్తు చర్యలు చేపట్టాలి
కై లాస్నగర్: భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చ ర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. గురువారం హై దరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ని ర్వహించి పలు సూచనలు చేశారు. సహాయక చర్య ల కోసం జిల్లాకు రూ.కోటి విడుదల చేసినట్లు తెలి పారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి, సెలవుపై వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలని సూచించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్ట ర్ శ్యామలాదేవి, వివిధ శాఖల అధికారులున్నారు. అత్యవసర సాయం అందించాలి ఆదిలాబాద్రూరల్: జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు ఎస్డీఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉండేందుకు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. వనమహోత్సవంలో భాగంగా మండలంలోని యాపల్గూడలోగల రెండో పోలీస్ బెటాలియన్ ఆవరణలో 600 మామి డి మధుబన్ మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై బెటాలియన్ సిబ్బందికి అవగాహ న కల్పించారు. అనంతరం బెటాలియన్ సిబ్బందితో కలిసి శిక్షణ పొందిన వంద మంది అత్యవసర సందర్భాల్లో ప్రజలకు సహాయం చేయడం కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన డెమో తిలకించారు. అ నంతరం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ద్వారా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ తదితర అంశాలపై శిక్షణ పొందిన సిబ్బందిచే డెమో కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, బెటాలియన్ కమాండెంట్ నితిక పంత్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ పాల్గొన్నారు. -
శిశువు మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
బెల్లంపల్లి: వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన గర్భిణి సువర్ణకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త కరణ్ బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలీవరీ చేస్తామని చెప్పి చేర్చుకున్నారు. అదే రోజురాత్రి మగశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ చనిపోయినట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడని ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. మంచిర్యాలకు రెఫర్ చేయకుండా వైద్యులు అశ్రద్ధ చేసి తమ బిడ్డ మృతి చెందడానికి కారకులయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరగా మగశిశువు స్టిల్బర్త్తో పుట్టాడని, తల్లిగర్భంలో ఉన్నప్పుడు మలం తినడంతో మృతి చెందినట్లు తెలిపారు. -
ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది
మా తాతల కాలం నుంచి గ్రామంలో ఎవరూ మద్యం సేవించరు. అదే ఆచారం ఇప్పటి వరకూ కొనసాగుతోంది. గ్రా మంలో అందరం కలిసి మెలిసి ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఇక్కడే అందరం కలిసి ప రిష్కరించుకుంటాం. ఆంజనేయ స్వామి గు డిలో పూజలు నిర్వహిస్తాం. అందరం కలిసి పండుగలు ఆనందంగా జరుపుకుంటాం. – మొర్ల పోచయ్య, చారిగాం స్నేహభావంతో ఉంటాం గ్రామంలోని యువకులమంతా కలిసి మెలిసి స్నేహభావంతో ఉంటా ం. గ్రామంలో ఏమైనా సమస్య ఉంటే యువకులమంతా ఒకేచోట చేరి పరిష్కరించుకుంటాం. గ్రామంలో ఎవరూ మద్యం సేవించరు. బెల్టుషాపులు పెట్టరు. ఇదే ఆచారాన్ని అందరం పాటిస్తాం. – మొర్ల శంకర్, చారిగాం -
పట్టణం.. త్రివర్ణ శోభితం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం భారీ తిరంగా ర్యాలీ నిర్వహించగా ప్రధాన వీధులు త్రివర్ణ శోభితమయ్యాయి. విద్యార్థుల దేశభక్తి నినాదాలతో చౌరస్తాలు మార్మోగాయి. ర్యాలీని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విజయం అద్వితీయమని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశం నాయకత్వం వహించేలా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పయనిస్తోందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతానికి సూచికగా ప్రతీ గ్రామంలో తిరంగా ర్యాలీ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు వేదవ్యాస్, దినేశ్ మటోలియా, ముకుందరా వు, మహేందర్, కృష్ణయాదవ్, మురళీధర్, ఆదిత్య ఖండేశ్కర్ తదితరులు పాల్గొన్నారు. -
అధిక తేమ పంటలకు చేటు
చెన్నూర్రూరల్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పంటచేలల్లో నీరు నిలిచింది. నీరు ఎక్కువైతే తేమ ఏర్పడి పంటలకు నష్టం వాటిల్లనుంది. అధిక తేమతో పంటలు నష్టపోకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసా ద్ సూచిస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... వర్షాలకు పత్తి చేనులో నీరు నిలిస్తే వెంటనే కాలువలు తీసి నీటిని బయటకు పంపించాలి. వర్షాలు తగ్గిన వెంటనే భూమిలో తేమను తగ్గించు కోవడానికి అంతర సేద్యం చేయాలి. బురద పదనులో ఎకరాకు 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. అలాగే ఎకరానికి సీ ఓసీ 3 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒకరోజు తర్వాత కిలో స్వర్ణపాల్ను 150 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. పంటను వేరుకుళ్లు తెగులు ఆశిస్తే 3 గ్రాముల ఆక్సిక్లోరైడ్ లేదా ఒక గ్రాము కార్బండిజమ్ను లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లలో తడపాలి. మొక్కజొన్న అధిక తేమను తట్టుకోలేదు. సాధ్యమైనంత త్వరగా అంతరకృషి చేసుకోవాలి. ఎకరాకు 25 కిలోల యూ రియా, 10 కిలోల పొటాష్ ఎరువును మొక్కల మొదళ్ల దగ్గర వేసుకోవాలి. కాండం తొలిచే పురుగు ఉంటే కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఎకరానికి 3 కిలోలు ఆకు సుడుల్లో వేయాలి. పెసర, మినుము పైర్లకు అధిక తేమతో పేనుబంక, లద్దె పురుగు ఆశించే అవకాశం ఉంది. ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరప పంట మిరప చేనులో నీరు నిలిస్తే వెంటనే నీటిని కాలు వల ద్వారా తొలగించాలి. నారుకుళ్లు తెగులు ఆశిస్తే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా రెండు గ్రాముల రిడోమిల్ లీటరు నీటికి కలిపి వారంలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే అధిక తేమ నుంచి పంటలను కాపాడుకోవచ్చు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
గుడిహత్నూర్: మండల కేంద్రంలోని ఉట్నూర్ వెళ్లే రహదారిపై గురువారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందినట్లు సీఐ బండారి రాజు, ఏఎస్సై రంగారావు తెలిపారు. జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన ఇంగ్వే శ్రీధర్ (24) ఓ ప్రముఖ దినపత్రిక ప్రతులను కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తరలించడానికి వ్యానులో బయలు దేరాడు. మండల కేంద్రానికి సమీపంలోకి రాగానే ఓ చెట్టును ఢీ కొట్టడంతో తీవ్రగాయాలై వాహనంలోనే మృతి చెందాడు. వ్యానులో అతనితో పాటు ఉన్న మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘పంద్రాగస్టు’కు అంతా సిద్ధం
కైలాస్నగర్: పంద్రాగస్టు వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. పోలీసు ల కవాతు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు వీలుగా మైదానాన్ని చదును చేసి రంగురంగుల ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రాంతంతో పాటు ముఖ్య అతి థులు ఆసీనులయ్యే వేదికను సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రభు త్వ శాఖల అధికారులు, జర్నలిస్టులు కూర్చునేందు కు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్ర భుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని తె లియజేసేలా స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు గాను శాఖ ల వారీగా టెంట్లు వేశారు. వేడుకలు తిలకించేందు కు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ శాఖల ప్రగతి తీరు తెన్నులను తెలిపే శకటాలను ప్రదర్శించనున్నారు. ఉదయం 9.30గంటలకు జరిగే వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఉత్తమ సే వలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్టాళ్లను తిలకించి వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేయనున్నారు. జిల్లాకు చేరుకున్న ముఖ్య అతిథి పంద్రాగస్టు వేడుకల ముఖ్య అతిథి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ గురువారం జి ల్లా కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక పెన్గంగా గెస్ట్హౌస్కు రాగా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మ హాజన్ స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. -
బుచ్చిబాబు టోర్నీకి వైస్కెప్టెన్గా హిమతేజ
ఆదిలాబాద్: దేశవాళి క్రికెట్లో సత్తా చాటుతున్న జిల్లాకు చెందిన కొడిమెల హిమతేజ ప్రతిష్టాత్మక బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ టోర్నీకి జట్టును ప్రకటించింది. రాహుల్ సింగ్ నాయకత్వం వహించనుండగా వైస్ కెప్టెన్గా హిమతేజ వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీ చైన్నె వేదికగా ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లా నుంచి రంజీలో మెరిసిన ఈ యువ క్రికెటర్ తాజాగా వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడంపై శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తదితరులు అభినందించారు. -
● ఇళ్ల నిర్మాణాలపై యంత్రాంగం దృష్టి ● పనులు ప్రారంభించకుంటే రద్దు ● వారి స్థానంలో మరొకరికి అవకాశం ● వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు
కెలాస్నగర్: పేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టింది. తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి మంజూరు చేస్తుంది. అయితే ప్రొసీడింగ్ అందుకున్న చాలా మంది నెలలు గడుస్తున్నా పనులు షురూ చేయడం లేదు. అలాంటి వారిపై యంత్రాంగం దృష్టి సారించింది. నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచిస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రారంభించకుంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేస్తోంది. అలాగే వారి స్థానంలో అర్హులైన వారికి మంజూరు చేయాలని భావిస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొదటి, రెండు విడతల్లో కలిపి 9,093 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఇప్పటి వరకు 2024 ఇళ్ల పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పనులు ప్రారంభించకుంటే అవి రద్దయ్యే అవకాశముంది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఏడాది జనవరి 26న మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలే అత్యధికంగా ప్రారంభానికి నోచుకోవడం గమనార్హం. నిర్మాణాలకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడం, సామగ్రి ధరలు పెరగడం, ఎస్హెచ్జీల నుంచి సకాలంలో రుణాలు మంజూరు కాకపోవడం వంటి కారణాలతో పలువురు ఇళ్ల నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. రెండో విడతదీ అదే పరిస్థితి. దీంతో నిర్మాణాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రొసీడింగ్ అందుకుని 45 రోజుల్లోగా నిర్మాణాలు ప్రారంభించకుంటే ఆ ఇళ్లను రద్దు చేయాలని యంత్రాంగం భావిస్తోంది. ఉద్దేశపూర్వకంగా నిర్మాణం చేపట్టనటువంటి వారి ఇళ్లను రద్దు చేసి వారి స్థానంలో మరొకరికి మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలుత వారికి నోటీసులు జారీ చేసి ఇళ్లను రద్దు చేస్తారు. అయితే పూరి గుడిసెల్లో నివసించేవారు, అత్యంత పేదలకు ఈ నిర్ణయం నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులతో ఇటీవల సమీక్షించిన ఆయన వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికీ పనులు ప్రారంభించని వారికి నోటీసులు జారీ చేసి, 45 రోజుల్లోగా షురూ చేయకుంటే వాటిని రద్దు చేయాలని ఆదేశించారు. అలాగే ఇళ్ల మంజూరు పేరిట ఎవరైనా వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. తద్వారా పారదర్శకత ఏర్పడి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కలెక్టర్ తాజా నిర్ణయాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి ఏ మేరకు పుంజుకుంటుందనేది వేచి చూడాల్సిందే. హస్నాపూర్లో మంగళవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ రాజర్షి షాజిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తీరిది.. మంజూరైనవి : 9,093 మార్కవుట్ ఇచ్చినవి : 7,069 బెస్మెంట్ వరకు చేరినవి : 2,959 రూప్ లెవల్కు చేరినవి : 255 రూప్ పూర్తయినవి : 90 నిర్మాణాల వేగవంతంపై దృష్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగవంతంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పనులు ప్రారంభించకుంటే వారి స్థానంలో మరొకరికి ఇంటిని మంజూరు చేస్తాం. అయితే వారిని ఎల్–1 స్టేజ్లో పెడుతాం. మళ్లీ ఆసక్తి చూపితే మంజూరు చేస్తాం. పేదలకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది. ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఎవరైనా వసూళ్లకు పాల్పడినట్లు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – జి.జితేందర్రెడ్డి, జెడ్పీ సీఈవో -
మళ్లీ పొడిగింపేనా?
పీఏసీఎస్ పాలకవర్గాల గడువు నేటితో ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఆరునెలల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. .. నిందితుడి అరెస్ట్ ఉద్యోగాల పెరిట నిరుద్యోగులను మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపా రు. హెడ్క్వార్టర్స్లో వివరాలు వెల్లడించారు. గురువారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాత్నాల: భారీ వర్షం కారణంగా సాత్నా ల ప్రాజెక్టుకు వరద పెరిగింది. ఈ మేరకు బుధవారం ఒక గేట్ ఎత్తి నీటిని దిగువకు వదిలినట్లు జేఈ దీపక్ తెలిపారు. ప్రాజె క్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 1.24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.046 టీఎంసీలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఇన్ఫ్లో 1000 క్యూసెక్కులు ఉండగా.. అంతే మొత్తంలో అవుట్ఫ్లో కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్, ఎస్పీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం సందర్శించారు. నీటి మట్టాన్ని పరిశీ లించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. వారి వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, ఇతర అధి కారులు ఉన్నారు. తాంసి: మండలంలోని మత్త డి వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో బుధవారం వేకువజామున ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 757 క్యూసెక్కులు ఉండగా..1,240 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉన్నట్లు ఏఈ హరీశ్కుమార్ తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 277.5 మీటర్లు కాగా ప్రస్తుతం 277.40 మీటర్ల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక నీటి నిల్వ సామర్థ్యం 0.571 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.451 టీఎంసీగా ఉన్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షం గవర్నర్ను కలిసిన ఎంపీ నగేశ్ఆదిలాబాద్: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్వర్మను ఎంపీ గోడం నగేశ్ మంగళవారం ఆయన కార్యాలయంలో కలిశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించి, పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై గవర్నర్తో చ ర్చించారు.అలాగే ఆదిలాబాద్ పార్లమెంట్ పరి ధిలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని కో రారు. ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించి వర్షాకాలం ముగిసిన తర్వాత పర్యటిస్తానని మాట ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.అలాగే గిరిజన ఉద్యోగ సంఘం నాయకులు గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందించారు. ● సిరికొండ మండలంలోని చిక్మాన్ వాగు రాంపూర్ లోలెవెల్ వంతెనపై నుంచి పొంగి ప్రవహించింది. వాగు దాటకుండా రెవెన్యూ, పోలీస్, పంచాయతీ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించారు. జిల్లా పంచాయతీ అధికారి రమేశ్, డీఎల్పీవో ఫణిందర్ పరిశీలించారు. సిరికొండ : రాంపూర్ లోలెవెల్ వంతెనపై వరద ఉధృతి ● కరుణించిన వరుణుడు ● 20 రోజుల తర్వాత వర్షం ● ప్రాజెక్టులకు జల కళ ● అన్నదాతల్లో హర్షం న్యూస్రీల్‘సాత్నాల’ గేట్ ఓపెన్మత్తడివాగు.. పరవళ్లు -
మళ్లీ పొడిగింపేనా?
● ఫిబ్రవరిలో ఆరు నెలలు పెంచిన ప్రభుత్వం ● నేటితో ముగియనున్న సొసైటీ పాలకవర్గాల గడువు ● జాతీయ పతాకావిష్కరణపై చైర్మన్ల ధీమాఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వివరాలుకై లాస్నగర్/నిర్మల్చైన్గేట్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 14న ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీటి గడువు ముగిసినప్పటికీ డీసీసీబీ చైర్మన్ల విజ్ఞప్తి మేరకు ఆరునెలల పాటు అదనంగా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు సైతం గురువారంతో ముగియనుంది. ప్రస్తుతం వీటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో సొసైటీ పాలకవర్గాల గడువు పెంపు మరోసారి అనివార్యం కానుంది. ప్రత్యేకాధికారులను కూడా నియమించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పంద్రాగస్టు వేడుకల్లో తామే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామని సొసైటీ చైర్మన్లు ధీమా వ్యక్తం చేస్తుండటంతో పాలకవర్గాల గడువు మరోసారి పొడిగింపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండోసారి పదవీకాలం పొడిగింపు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)కు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించింది. సొసైటీ పరిధిలో ఎన్నికై న చైర్మన్లతో అదే నెల 25న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎన్నికలు నిర్వహించారు. వీరితో పాటు పలువురు డైరెక్టర్లను సైతం ఎన్నుకున్నారు. కాగా ఈ సొసైటీలకు ఎన్నికలు జరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీతో ఐదేళ్ల గడువు పూర్తయ్యింది. దీంతో వాటి కాలపరిమితి ముగియడంతో రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లంతా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ పదవీకాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆరునెలల పాటు పదవీకాలాన్ని పొడిగించింది. తాజాగా ఈ గడువు నేటితో ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో మరోసారి తమ పదవీకాలాన్ని పొడిగించాలని డీసీసీబీ చైర్మన్లతో పాటు సొసైటీ చైర్మన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో మరోసారి మూడు లేదా అరునెలల పాటు పదవీకాలం పొడిగిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవీ కాలం ముగియడంతో 15వ తేదీన జరిగే పంద్రాగస్టు వేడుకల్లో చైర్మన్ల హోదాలో జాతీయ పతాకావిష్కరణ చేసే అవకాశం ఉండదు. అయితే ప్రభుత్వం ఎలాగైనా తమ పదవీకాలాన్ని పొడిగిస్తుందనే ధీమాలో ఉన్న సొసైటీ చైర్మన్లు తామే మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.సహకార సంఘాలు : 77 డీసీసీబీ : 01 డీసీఎంఎస్ : 01 సొసైటీల పరిధిలోని సభ్యులు : 55 వేలు అన్నదాతకు వెన్నుదన్నుగా ... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 55 వేలకు పైగా రైతులు ఉన్నారు. వారికి వ్యవసాయ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలను క్షేత్రస్థాయిలో అందజేస్తూ సొసైటీలు వారికి అండగా నిలుస్తున్నాయి. పలు సొసైటీలు ధాన్యం కొనుగోళ్లను సైతం చేపడుతున్నాయి. ఈ సొసైటీలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. అవకాశముంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగియనుంది. ఇటీవలే ఆరు నెలల పాటు సొసైటీల గడువును ప్రభుత్వం పొడిగించింది. మరోసారి సైతం పదవీకాలాన్ని పొడిగించేందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది. – బి.మోహన్, జిల్లా సహకార శాఖ అధికారి, ఆదిలాబాద్ -
చిన్నారిపై వీధికుక్క దాడి
లక్ష్మణచాంద: మండలంలోని ధర్మారంలో బాలు ని పై వీధికుక్క దాడి చే యడంతో గాయాలయ్యా యి. గ్రామానికి చెందిన మల్లెల శ్రీకాంత్–శిరీష దంపతుల కుమారుడు కౌశిక్ మంగళవారం ఇంటిముందు ఆడుకుంటుండగా వీధికుక్క వచ్చి దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు బాలుడిని నిర్మల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలుఆదిలాబాద్రూరల్: భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్రావు బుధవారం తీర్పునిచ్చినట్లు మావల సీఐ కర్రె స్వామి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టల్వాడకు చెందిన జాదవ్ ఆనంద్రావు మద్యం సేవించి ఇంటికి వచ్చి తరచూ భార్యతో గొడవపడేవాడు. ఇదేక్రమంలో తలపై సుత్తెతో కొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దంపతుల కుమారుడు మహేష్ 18 డిసెంబర్ 2024న పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై విష్ణువర్ధన్ కేసు నమోదు చేశారు. కోర్టు డ్యూటీ అధికారి సంతోష్ 10 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు వెల్లడించారు. -
కడెం కెనాల్లో పడి ఒకరు మృతి
దండేపల్లి: మద్యం మత్తులో కడెం కెనాల్లో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సేదం నర్సయ్య (48) కూలీ పని నిమిత్తం దండేపల్లి మండలంలోని కుంటలగూడకట్టకు చెందిన తన బంధువైన బొబ్బిలి బక్కవ్వ ఇంటికి వచ్చాడు. మంగళవారం మద్యం సేవించి కడెం కెనాల్ సమీపంలో ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఆతరువాత కొద్దిసేపటికి అతను కనిపించక పోవడంతో బంధువులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆచూకీ కోసం వెతుకుతుండగా బుధవారం కుంటలగూడకట్ట సమీపంలోని కడెం కెనాల్ లో చెట్లపొదలకు తట్టుకుని మృతదేహం దొరికింది. మద్యం మత్తులో ప్రమాద వశాత్తు కెనాల్లో జారిపడడంతో ఈతరాక నీటిలో మునిగి మృతి చెందాడని మృతుని బంధువు భూమేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
ఆర్జీయూకేటీలో నషా ముక్త్ భారత్ అభియాన్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో బుధవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేయాలని కళాశాల వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఎస్సై శ్రీనివాస్ విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. మా దక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతున్నట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమంగా రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తామని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామి అవుతామని ప్రతిజ్ఞ చేయించారు. -
పాసైంది నలుగురే..!
● పరీక్ష రాసింది 129 మంది ● విడుదలైన లైసెన్స్డ్ సర్వేయర్ ఫలితాలు ● ఫెయిలైనా అప్రెంటిస్షిప్ యథాతథం కై లాస్నగర్: లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష ఫలితాలను హైదరాబాద్కు చెందిన జేఎన్టీయూ బుధవారం ప్రకటించింది. జిల్లాలో 155 మంది సర్వేయర్ శిక్షణ పొందారు. వారికి గత నెల 26, 27, 28 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా 129 మంది హాజరయ్యారు. ఇందులో కేవలం నలుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గుడిహత్నూర్కు చెందిన జాదవ్ కిర్తీ (71, 63,77)మార్కులు సాధించగా, ఆదిలాబాద్కు చెందిన రంగసాయి కిరణ్ (65,77,73), ఇంద్రవెల్లికి చెందిన మేస్రం రాజు (66, 76, 83), తలమడుగుకు చెందిన తమ్మల సాయిప్రీతం(61,64,82)మార్కులను సాధించి ఉత్తీర్ణులయ్యారు. మిగతా 125 మంది ఫెయిలయ్యారు. ప్రాక్టికల్స్లో అందరూ ఉత్తీర్ణులైనప్పటికీ థియరీ, ప్లాటింగ్ పరీక్షల్లో రాణించలేకపోయారు. ఫలితాలను అభ్యర్థుల వాట్సాప్ నంబర్లకు పంపించారు. అయితే ఈ నెల 6నుంచి అందిస్తున్న అప్రెంటిస్షిప్ యథాతధంగా కొనసాగుతుందని జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ తెలిపారు. ఫెయిలైన వారికి వచ్చే నెల 13, 14 తేదీల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈమేరకు షెడ్యూల్ను తెలంగాణ అకా డమీ ఫర్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ జా యింట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అందులో ఉత్తీర్ణులయ్యే వారిని కొనసాగించే అవకాశమున్నట్లుగా ఆయన వెల్లడించారు. కాగా పరీక్షల తీరుపై అభ్యర్థులు ఇది వరకే ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి నిర్వహించాలంటూ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు భా వించినట్లుగానే ఫలితాల్లో కేవలం నలుగురే ఉత్తీర్ణులు కావడం గమనార్హం. అయితే గతంలో జరిగిన పొరపాట్లకు అవకాశం లేకుండా ఈ సారి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
ఉద్యోగాల పేరిట మోసగించిన నిందితుడి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: ఎస్కే మైక్రోఫైనాన్స్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇంద్రవెల్లి మండలంలోని శంకర్గూడకు చెందిన జవాడే కృష్ణ అలియాస్ జాదవ్ కృష్ణ ఎన్ఆర్ఐ అంటూ సామాజిక సేవ పేరుతో పరిచయాలు పెంచుకొని మైక్రో ఫైనాన్స్, ప్రభుత్వ ఆస్పత్రులు, అంగన్వాడీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. 2024 డిసెంబర్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్లో మైక్రో ఫైనాన్స్ పేరుతో కార్యాలయాలను ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా 300 మంది నుంచి రూ.20 వేల చొప్పున మెంబర్షిప్ చేయించాడు. రెండు కార్యాలయాల్లో ఐదుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నిరుద్యోగుల నుంచి రూ.69 లక్షలు వసూలు చేశాడు. ఆరునెలల పాటు కనిపించకపోవడంతో జూలైలో నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శంకర్గూడలో రూ.9 లక్షల నగదు, రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇంట్లోనే దాచిపెట్టి రూ.15 లక్షలతో పరారయ్యాడు. నిందితుడిని భోరజ్ చెక్పోస్టు వద్ద అరెస్ట్ చేసి రూ.9లక్షల నగదుతో పాటు 10.7 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఐదు సెల్ ఫోన్లు, ఒక ఖరీదైన వాచ్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి విడతల వారీగా వసూలు చేసి మోసం చేసిన డబ్బుల్లో రూ.6లక్షలు ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్ యజమానికి ఇచ్చాడని, మరో రూ.6లక్షలు మహరాష్ట్రలోని నాగ్పూర్లో భవన యజమానికి, రూ.3.5 లక్షలు ఆదిలాబాద్, ఉట్నూర్ కార్యాలయాల నిర్వహణకు, రూ.2.1 లక్షలు నిందితుడి తమ్ముడి అవసరాల నిమిత్తం ఇచ్చినట్లు తెలిపారు. మిగితా డబ్బులు జల్సాల కోసం, తప్పించుకోవడానికి ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నిందితుడు కరోన సమయంలో ముంబాయ్లో ఫేక్ రెమిడి ఇంజక్షన్లను విక్రయించాడని, నాగ్పూర్లో రుణాల పేరిట అక్కడి ప్రజలను మోసం చేశాడని తెలిపారు. నిందితుడిపై ఉట్నూర్లో 3, ఇంద్రవెల్లిలో 3, నార్నూర్లో 2, మావల పోలీసు స్టేషన్లో 3, ఆదిలాబాద్ వన్టౌన్లో 2, జైనథ్లో 3 చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఉట్నూర్ సీఐ ఎం.ప్రసాద్, ఐటీకోర్ ఎస్సై గోపీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీ వ్రంగా గాయపడిన వెన్నెల నారాయణ (51) చికి త్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు ఆదిలాబాద్ మండలంలోని యాపల్గూడకు చెందిన నారాయణ మంగళవారం ఉదయం తన మోటార్ సైకిల్పై అడెల్లి పోచమ్మ దర్శనానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో స్థానిక శర్మ దాబా వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్సులో రిమ్స్కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారి రాజు, ఏఎస్సై రంగారావు తెలిపారు. ఆగి ఉన్న లారీని ఢీకొని సింగరేణి కార్మికుడు..రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రిలోని గాంధీనగర్కు చెందిన సాయి వెంకటేష్ (28) అనే సింగరేణి కార్మికుడు మృతి చెందాడు .శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే–7 గనిలో జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వెంకటేష్ బైక్పై మంచిర్యాల నుండి మందమర్రి వైపు వెళ్తుండగా బొక్కలగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుని తండ్రి బానేష్ గతంలోనే అనారోగ్యంతో మృతి చెందగా తల్లి అన్నపూర్ణ అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. గూడ్స్ రైలు ఢీకొని ఒకరు..సిర్పూర్(టి): ఆరెగూడ సమీపంలో డౌన్లైన్పై ఆపోజిషన్ డైరెక్షన్లో రైల్వే కాంట్రాక్ట్ లేబర్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గూడ్స్ రైలు రివర్స్లో వచ్చి ఢీకొనడంతో షేక్ జంషేద్ (44) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం 5.40 గంటలకు షేక్ జంషేద్, ప్రవీణ్, పర్వేస్ నైట్ పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రవీణ్కు చేయి విరగడంతో హైదరాబాద్కు తరలించారు. కాగజ్నగర్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ కె.సురేష్ గౌడ్ విచారణ జరిపారు. షేక్ జంషేద్ మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒకరిపై వేధింపుల కేసుజైనథ్: అదనపు కట్నం కోసం వేధించిన ఒకరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై గౌతమ్ పవర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన రంగ బాలరాజు గౌడ్ కుమార్తె స్రవంతికి అంకోలి గ్రామానికి చెందిన బాలాజీతో 2018లో వివాహమైంది. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో రెండు సంవత్సరాల క్రితం స్రవంతి పుట్టింటికి వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. వారం రోజుల క్రితం బాలాజీ జైనథ్కు వచ్చి చంపుతానని బెదిరించడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
ఇంటిస్థలం కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు
ఆదిలాబాద్రూరల్: మావల శివారు ప్రాంతంలోని సర్వేనంబర్ 170లో నకిలీ ఇంటి పత్రాలు సృష్టించి ఆ స్థలాన్ని కబ్జా చేసిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. బుధవారం మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన స్వామికి 2013 బీపీఎల్ కింద ప్రభుత్వం 905 నంబర్ గల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో బాధితుడు స్వామి గుడిసె వేసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం 2015లో అనుమతులు సైతం తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా ఇంటి నిర్మాణం చేపట్టలేకపోయాడు. రహెమాన్ఖాన్ ఆ స్థలంలో ఉన్న గుడిసెను తొలగించి వెంకటమ్మకు రూ. 2.30 లక్షలకు విక్రయించాడు. వెంకటమ్మ ఆ స్థలాన్ని కిష్టన్నకు రూ.3.50 లక్షలకు విక్రయించింది. బాధితుడు స్వామిని బెదిరింపులకు గురిచేయడంతో ఎస్పీ అఖిల్ మహాజన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో సుంకరి సంతోష్, రహిమాన్ ఖాన్, తాటి లక్ష్మణ్, కిష్టన్న, పవన్ నాయక్, సుంకరి వెంకటమ్మ, శరత్, వంశీకృష్ణపై కేసు నమోదు చేశా రు. ఇందులో నలుగురిని అరెస్టు చేయగా కిష్టన్న పవన్ నాయక్, సుంకరి వెంకటమ్మ, శరత్ పరారీలో ఉన్నారు. సమావేశంలో మావల సీఐ కర్రె స్వామి, ఎస్సై రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గంజాయి సేవిస్తున్న ముగ్గురిపై.. నెన్నెల: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. కొందరు యువకులు బొప్పారం అడవిలో గంజాయి సేవిస్తున్నారని అందిన సమాచారం మేరకు వెంటనే దాడి చేయగా మంచిర్యాల గద్దెరాగడికి చెందిన ఐటీఐ విద్యార్థి పాల్తెపు ప్రణయ్ దొరికిపోయాడు. అతడిని సోదా చేయగా 1.5 గ్రాముల గంజాయి లభించింది. గంజాయితో పాటు పల్సర్ బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీస్స్టేషన్కు తరలించి వివరాలు సేకరించారు. ప్రణయ్తో పాటు పారిపోయిన నెన్నెల మండలం గన్పూర్ గ్రామానికి చెందిన పోతురాజుల అకాశ్, గొల్లపల్లికి చెందిన సల్లూరి పెత్రుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ప్లాట్ ఇస్తానని మోసం చేసిన ఒకరిపై..ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ యజమాని సయ్యద్ షాహిద్పై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కె.నాగరాజు తెలిపారు. 2008లో నార్నూర్కు చెందిన ఎక్బాల్ ఖాన్ షాహిద్ వద్ద రూ.50 వేలకు ఆదిలాబాద్ పట్టణంలో ఓ ప్లాట్ కొనుగోలు చేశాడు. రూ.20వేలు అడ్వాన్స్ ఇవ్వగా రూ.30 వేలు కిస్తులుగా చెల్లించాడు. ఆ తర్వాత ప్లాట్ ఇవ్వకుండా 2016లో మరో వ్యక్తికి విక్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
‘నవోదయ’లో ప్రవేశానికి గడువు పొడిగింపు
కాగజ్నగర్టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికిగానూ ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న అర్హత పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27 వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ బు ధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనికోరారు. ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుకు సత్కారంఆసిఫాబాద్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2025 కోసం బుధవారం హైదరాబాద్లోని పాఠశాల విద్యాసంచాలకుల కార్యాలయంలో జాతీయ స్వతంత్య్ర జ్యూరీ నిర్వహించారు. కుమురంభీం జిల్లా నుంచి జన్కాపూర్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు ధర్మపురి వెంకటేశ్వర్లు ముఖాముఖిలో పాల్గొన్నారు. రాష్ట్ర నుంచి 160 మంది దరఖాస్తు చేసుకోగా ఆరుగురిని ఎంపిక చేశారు. ఇందులో వెంకటేశ్వర్లు ఒకరు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు పాఠశాల విద్యాప్రగతిని, విద్యార్థుల ప్రగతిలో వినూత్న సేవలను వివరించారు. అనంతరం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఉపాధ్యాయుడిని శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు మదన్మోహన్, ఆర్జేడీ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఐచర్ ఢీకొని వ్యక్తి మృతి
● న్యాయం చేయాలని రహదారిపై బైఠాయించిన కుటుంబ సభ్యులుతానూరు: భైంసా–నాందేడ్ రహదారిపై బెల్తరోడా ఎక్స్రోడ్డు వద్ద బుధవారం ఐచర్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. మహలింగి గ్రామానికి చెందిన బన్సోడే ప్రభుదాస్ (35) భార్య లక్ష్మి, కుమారుడు అరుతో కలిసి భైంసాకు వెళ్లాడు. బుధవారం స్వగ్రామానికి వెళ్లేందుకు బెల్తరోడా ఎక్స్రోడ్డు వద్ద బస్సు దిగారు. భార్య, కుమారుడిని అక్కడే కూర్చోబెట్టి మక్కబుట్టా తీసుకువచ్చేందుకు రోడ్డు దాటుతుండగా భైంసా నుంచి నాందేడ్ వైపు అతివేగంగా వెళ్తున్న ఐచర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం ఆపకుండా వెళ్తుండడంతో స్థానికులు వెంబడించి మహారాష్ట్ర సరిహద్దులోని రాఠి గ్రామ శివారులో పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై షేక్ జుబేర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. న్యాయం చేయాలని రహదారిపై బైఠాయింపు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు రహదారిపై బైఠాయించారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం చోటు చేసుకుందని, పరిహారం అందేవరకూ ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. -
అప్పుల బాధతో లారీ డ్రైవర్ ఆత్మహత్య
కాసిపేట: అప్పులబాధతో లారీ డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చో టు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కాసిపేట పోలీస్స్టేషన్ పరి ధిలోని సోమగూడెం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహమ్మద్ రంజాన్(41) ఇటీవల లారీని కొనుగోలు చేయడంతో అప్పులపాలయ్యాడు. ఈనెల 12న శ్రీరాంపూర్లో ఆర్టీసీ బస్సుతో యాక్సిడెంట్ అయిందని కుటుంబ సభ్యులతో చెప్పి బాధపడ్డాడు. ఇప్పటికే అప్పుల పాలైన తాను యాక్సిడెంట్తో మరింత అప్పులు పెరుగుతుండడంతో మానసికంగా కుంగిపోయి బుధవారం ఉదయం తన ఇంటిముందు రేకులకు లుంగీతో ఉరేసుకున్నాడు. మృతుని కుమారుడు హసన్బాబా ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరు..నేరడిగొండ: మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన సోలాంకి శ్రీకాంత్ (26) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చే సుకున్నట్లు ఎస్సై ఇమ్రాన్ తెలిపారు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఫాస్టాగ్ తరహాలో టైగర్ జోన్ ఎంట్రీ ఫీజుకడెం: టోల్గేట్ మాదిరిగా ఫాస్టాగ్ తరహాలో చెక్పోస్ట్ల వద్ద సెస్ వసూలు చేసేందుకు అట వీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కవ్వాల్ టైగర్ జోన్ గుండా ప్రయాణించే వాహనాలకు చెక్ పోస్ట్ల వద్ద ఎన్విరాల్మెంట్ సెస్ వసూలు చేస్తున్నా రు. గతంలో టైగర్జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతులు లేవు. ఇటీవలే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. పాండ్వపూర్ లోని చెక్పోస్ట్ వద్ద టైగర్జోన్లోకి ఎంట్రీ అయ్యే వాహనాలు ఇప్పటి వరకు సిబ్బంది సెస్ వసూలు చేసేవారు. ఫాస్టాగ్ తరహాలో ఏర్పాటు చేయబోతున్న చెక్పోస్ట్తో వాహనదారులు వెంటవెంటనే వెళ్లేందుకు వీలుంది. -
● ఆర్టీసీకి కలిసి వచ్చిన వరుస సెలవులు ● ‘పౌర్ణమి’ రోజున రూ.2.89 కోట్ల ఆదాయం ● రీజియన్ వ్యాప్తంగా రూ.9.26 కోట్ల ఆమ్దాని
బస్సు ఎక్కేందుకు పోటీపడుతున్న ప్రయాణికులు ఆదిలాబాద్: వరుస సెలవులు, పండుగలు ప్రజా రవాణా సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఈనెల 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీపౌర్ణమి, 10న ఆదివారం కలిసి రావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల 7నుంచి 11వరకు రీజియన్ వ్యాప్తంగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 101 నమోదవడం రద్దీ తీరుకు నిదర్శనం. ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆరు డిపోల పరిధిలో ఐదు రోజుల వ్యవధిలో ప్రతీ కిలోమీటర్కు రూ.66.48 ఆదాయం వచ్చింది. మొత్తం 639 బస్సులు 13,93,000 కిలోమీటర్లు తిరిగి 18.84 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. జూలై నెలలో ఒక్క సాధారణ రోజు ఇన్కమ్ రూ.1.85 కోట్లుగా ఉంది. అయితే రాఖీ పండుగ ఒక్కరోజే రీజియన్ వ్యాప్తంగా రూ.2.89 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. గతేడాది ఈ పండుగకు రూ.1.57 కోట్ల ఆదాయం రాగా ఈ సారి అదనంగా మరో రూ.1.32 కోట్లను ఆర్జించి ఆర్టీసీ రికార్డు సృష్టించింది. మొత్తంగా ఐదు రోజుల్లో రీజియన్ పరిధిలో రూ.9.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా నిర్మల్ డిపో రూ. 2.49 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో నిర్మల్ డిపో.. ఐదు రోజుల్లో నిర్మల్ డిపో రూ.2.49 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది రూ.1.25 కోట్లతో సరిపెట్టుకోగా, ఈసారి రెట్టింపు సమకూర్చుకోవడం విశేషం. గతంలో రూ.కోటి 80 వేల ఆదాయంతో నిలిచిన ఆదిలాబాద్ ఈసారి పుంజుకుని రూ.2.15 కోట్లకు చేరుకుంది. ముందస్తు ప్రణాళికతో.. వరుసగా రెండు పండుగలు, ఆదివారం కూడా తోడవడంతో రద్దీని ముందే పసిగట్టిన ఆర్టీసీ అధి కారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగారు. ఉమ్మడి జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. తదనుగుణంగా యాజమాన్యం ప్రత్యేక బస్సులను నడిపింది. ముఖ్యంగా హైదరాబాద్కు 118 స్పెషల్ సర్వీస్లను ఏర్పాటు చేశారు. రద్దీకి అనుగుణంగా 7, 8 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాలకు 46 బస్సులు ఏర్పాటు చేయగా, 10 నుంచి 12వ తేదీ వరకు రీజియన్ నుంచి హైదరాబాద్కు 72 బస్సులను ఆపరేట్ చేశారు. అంతేకాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్డెస్క్లను అందుబాటులో ఉంచారు. అలాగే ఉద్యోగుల ఇబ్బందులను సైతం పరిగణలోనికి తీసుకొని ఈ సారి వారికి ప్రత్యేక భోజన వసతి ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడంతోపాటు ఆర్టీసీకి ఆమ్దాని వచ్చింది. ‘మహాలక్ష్మి’లే అధికం..తమ సోదరులకు రాఖీ కట్టేందుకు దూర ప్రయాణమైనా మహిళలు ఆర్టీసీలో ప్రయాణించడం సంస్థకు లాభించింది. ఐదు రోజుల వ్యవధిలో మొత్తం 18.84 లక్షల మంది ప్రయాణించగా, అందులో 12.60 లక్షల మంది ‘మహాలక్ష్మి’లే ఉన్నారు. అత్యధికంగా పౌర్ణమి రోజున 4.27 ల క్షల మంది ప్రయాణించగా, ఇందులో 2.93 ల క్షల మంది మహాలక్ష్మి లబ్ధిదారులున్నారు. ఇక ఆ క్యూపెన్సీ రేషియో విషయానికి వస్తే ఉట్నూరు డిపో పరిధిలో అత్యధికంగా 109 ఉండగా, ని ర్మల్ 106, భైంసా 102, ఆదిలాబాద్ 101, మంచిర్యాల 97,ఆసిఫాబాద్ 95గా నమోదయ్యాయి. రీజియన్ పరిధిలో ఇలా.. (ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు) డిపో బస్సులు ఆదాయం ప్రయాణించిన (రూ.కోట్లలో) కి.మీ.(లక్షల్లో) ఆదిలాబాద్ 3.22 2.15 భైంసా 1.47 0.90 నిర్మల్ 3.47 2.49 ఉట్నూర్ 0.77 0.53 ఆసిఫాబాద్ 1.69 1.06 మంచిర్యాల 3.31 2.13 రీజియన్ 13.93 9.26 ప్రయాణికులను సురక్షితంగా చేర్చాం.. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులను ఆపరేట్ చేశాం. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాం. ఉద్యోగులు ఎంతగానో కృషి చేశారు. ఆదాయం సైతం గతంతో పోలిస్తే ఘననీయంగా పెరిగింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం. – ఎస్. భవానీప్రసాద్, ఆర్ఎం, ఆదిలాబాద్ -
ప్రణాళికాబద్ధంగా చదవాలి
● ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా ఆదిలాబాద్టౌన్: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. పట్టణంలోని రణదీవెనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు ఓ ప్రైవేట్ పాఠశాల సౌజన్యంతో బెల్టులు, ఐడెంటిటీ కార్డులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ట్రెయినీ కలెక్టర్ హాజరై మాట్లాడారు. కష్టపడి చదివితే విజయం సొంతమవుతుందన్నా రు. అలాగే ఆరోగ్యంపై దృష్టి సారించాలనానరు. ఇందులో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ పార్కు అందుబాటులోకి తీసుకురావాలి జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలోని సైన్స్ పార్కును అందుబాటులోకి తీసుకురావాలని ట్రె యినీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. మంగళవా రం సైన్స్ పార్కును పరిశీలించారు. పిచ్చిమొక్కలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. సై న్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం భవిత రిసోర్స్ సెంటర్ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డైట్ ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, జిల్లా సైన్స్ అధి కారి భాస్కర్, కిరణ్, పుష్పవేణి, తదితరులున్నారు. -
అక్రమ లేఅవుట్లలో హద్దురాళ్ల తొలగింపు
కైలాస్నగర్: జిల్లాకేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్ల ఏర్పాటుతో పాటు అనుమతులు లేకుండా ప్లాట్లను విక్రయిస్తూ రియల్లర్లు సొమ్ము చేసుకుంటున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు న్నాయి. అయితే కలెక్టర్ రాజర్షి షా విషయాన్ని గుర్తించి చర్యలకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలోని బంగారుగూడ సమీపంలో రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా రెండు లేఅవుట్లను ఏర్పాటు చేశారు. ప్రజలను ఆకర్షించేలా రంగురంగుల జెండాలను పాతారు. అధికారి క పర్యటనలో భాగంగా ఆ మార్గంలో పయనించిన కలెక్టర్ విషయాన్ని గమనించారు. వాటిపై చర్యలకు ఆదేశించారు. వెంటనే మేల్కొన్న టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పొక్లెయిన్తో లేఅవుట్లలో పాతిన హద్దురాళ్లు, జెండాలను తొలగింపజేశారు. కాగా, ఈ చర్యల విషయాన్ని బయటకు రానీయకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు గోప్యత పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తొడసం కై లాస్కు సన్మానం
ఉట్నూర్రూరల్: రాష్ట్రపతి ఆహ్వానం అందుకున్న తొడసం కై లాస్ను ఆదివాసీ బిరుదుగోండి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాంజీగోండ్ భవన్లో మంగళవారం సన్మానించారు. గోండిభాషలో మహాభారత్ గ్రంథాన్ని రచించి ఏఐ ద్వారా అనేక పాటలు సృష్టించిన తొడసం కై లాస్ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి విందుకు ఆహ్వానించినట్లు వారు పేర్కొన్నారు. ఆర్చరీ (విలువిద్య)లో అనేక మందికి శిక్షణనిచ్చి, ఇటీవల పురస్కారం అందుకున్న చించుఘాట్ గ్రామానికి చెందిన కాత్లే మారుతిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మర్సుకోలా తిరుపతి, ప్రధాన కార్యదర్శి తొడసం శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు పెందూర్ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. -
కుడి.. ఎడమైతే!
● నేడు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే ● అందరిలో ప్రత్యేకతగా.. ● ఉమ్మడి జిల్లాలోనూ ఎడమచేతివాటం వ్యక్తులు ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు నిర్మల్ జిల్లాలోని గుండంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సిలారి మధు, విద్యార్థులు. ఉపాధ్యాయుడితో పాటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న దాదాపు పదిమంది విద్యార్థులు ఎడమ చేతివాటం కలిగి ఉన్నారు. పాఠ్యాంశ బోధనలోనూ ఎడమవైపు చేతిద్వారానే అనువుగా ఉంటుందని చెబుతున్నారు. మిగతా వారితో పోల్చితే ఎడమచేతివాటం కలిగిన విద్యార్థులు విద్య, విద్యేతర విషయాల్లో చురుగ్గా ఉన్నారని వారు పేర్కొంటున్నారు.నిర్మల్ఖిల్లా: కుడిఎడమైతే పొరపాటు లేదోయ్...అన్నాడో సినీ కవి.. అంటే వ్యక్తిలోని భిన్నత్వాన్ని బట్టి ప్రత్యేకతను ఆపాదిస్తాం. ఎడమ చేతివాటం అనేది జన్యు ప్రభావ ఫలితంగా ఏర్పడిందని వైద్య పరిశోధనలు సైతం రుజువు చేస్తున్నాయి. సమాజంలోని మనుషులలో ప్రతిఒక్కరూ భిన్నమైన గుణాన్ని కలిగి ఉంటారు. అందులో కొందర్ని మాత్రం ప్రత్యేకతను బట్టి సులభంగా గుర్తిస్తాం. చిన్ననాటి నుంచే జన్యు ప్రభావ ఫలితంగానే కుడి, ఎడమ చేతివాటాలు సంభవిస్తాయని సైన్స్ చెబుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎడమ చేతి వాటం కలిగినవారు పలువురు ఉన్నారు. నేడు ప్రపంచ ఎడమ చేతివాటం వ్యక్తుల దినోత్సవం (వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే)గా జరుపుకుంటున్న నేపథ్యంలో సాక్షి కథనం. ప్రోత్సహిస్తేనే మంచిది.. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్య వయస్సులో పిల్లలు వస్తువులను పట్టుకోవడం మొదలుపెడతారు. ఈ సమయంలోనే కుడి, ఎడమ చేతివా టాలను గుర్తించవచ్చు. ఎడమ చేతి వాటాన్ని తల్లిదండ్రులు ఒక చెడు అలవాటుగా భావించి మాన్పించేందుకు ప్రయత్నం చేస్తారు. అలా చేయడం వల్ల ఇతర సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఐటీడీఏ అక్రమాలపై విచారణ జరిపించాలి
ఉట్నూర్రూరల్: ఉట్నూర్ ఐటీడీఏలో జరుగుతున్న అవినీతి, అక్రమాలతో పాటు ఎస్టీ రి జర్వేషన్ ఉల్లంఘనలపై జాతీయ ఎస్టీ కమిషనర్ హుస్సేన్నాయక్ను కలిసి ఫిర్యాదు చేసిన ట్లు ఏజెన్సీడీఎస్సీ సాధన కమిటీ ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లా సభ్యుడు జాదవ్ సుమేష్ తెలి పారు. ఏజెన్సీ ప్రాంత గిరిజన నిరుద్యోగులకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి వందశాతం ఎస్టీ రి జర్వేషన్ అమలు చేయాలని, జీవో నంబర్ 3 పునరుద్ధరించి అన్ని హక్కులు గిరిజనులకే క ల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఆయన వెంట దేవురావ్, కుమార్ పాల్గొన్నారు. -
మస్తిష్క నియంత్రణ అమరిక ఫలితంగానే...
గర్భస్థదశలో శిశువు ఉన్నప్పుడు ఏర్పడిన జన్యు ప్రభావంతోనే ఎడమచేతివాటంగా జన్మిస్తారు. కొందరిలో వంశపారంపర్యంగా, పరిసర కారకాల ప్రభావంతో కూడా ఏర్పడుతుంది. వారు ప్రతీపనిని ఎడమచేతితో చేసేందుకు ప్రయత్నిస్తారు. మస్తిష్కనియంత్రణ అమరిక ఫలితంగా కూడా ఎడమ చేతివాటం ఏర్పడుతుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. వీరు అందరిలోకన్నా భిన్నత్వాన్ని, మేధాశక్తిని అధికంగా కలిగి ఉంటారని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సమాజంలో ప్రత్యేక నైపుణ్యాలతో పేరు ప్రతిష్టలు పొందిన వారిలో చాలామంది ఎడమచేతివాటం వారే. – అప్పాల చక్రధారి, సీనియర్ పిల్లల వైద్యనిపుణులు, నిర్మల్ -
కాలినడకన వెళ్లి..చికిత్స అందించి
నార్నూర్: ఏజెన్సీలో కొలాం గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించింది. సదరు వైద్యసిబ్బంది మంగళవారం మండలంలోని కొత్తపల్లి (హెచ్) కొలాంగూడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీంపూర్ బొజ్జుగూడ (కొలాంగూడ) గ్రామానికి కాలినడకన వెళ్లి ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి చికిత్స అందించారు. 15 రోజులకు ఒకసారి కొలాం గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలు అందిస్తామని స్టాఫ్నర్స్ జంగుబాయి తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆమె వెంట ఎల్టీ గంగాదేవి, పారామెడికల్ అసిస్టెంట్ సావిత్రిబాయి, ఆశ కార్యకర్త లక్ష్మీబాయి, తదితరులు ఉన్నారు. -
అధికారికంగా పొలాల పండుగ
● ఈ నెల 23న తాంసిలో నిర్వహణ ● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ తాంసి: జిల్లాలో రైతులు సంప్రదాయంగా భావించే పొలాల అమావాస్య పండుగను ఈ సారి అధికారికంగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 23న పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లను అధికారులు, గ్రామస్తులతో కలిసి కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పరిశీలించారు. స్థానిక వాగు, మందిరం స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పొలాల అమావాస్యకు సంబంధించిన లఘు చిత్రాన్ని ఎంపీడీవో కార్యాలయంలో వీక్షించారు. పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఏటా పొలాల పండుగను రైతులు ఘనంగా నిర్వహించుకుంటారని, ఈ సారి రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చేలా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. గ్రామస్తులు ఐక్యతగా ఉంటూ ఏర్పాట్లలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారు ప్రొఫెసర్ తిరుమల్రావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి రవి, డీఆర్టీవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, మండల ప్రత్యేకాధికారి వెంకటరమణ, ఎంపీడీవో మోహన్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణ, గ్రామపెద్దలు పాల్గొన్నారు. పొన్నారిలో ఇళ్ల నిర్మాణాలు పరిశీలన..మండలంలోని పొన్నారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక కోసం రూ.7వేలు చెల్లిస్తున్నామని వారు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకను అధిక ధరకు విక్రయిస్తుంటే ఏం చేస్తున్నారని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అవసరమైన వారికి కూపన్లు అందించి సరఫరా జరిగేలా చూడాలని ఎంపీడీవో మోహన్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మికి సూచించారు. ఆయన వెంట హౌసింగ్ ఏఈ నజీర్, పంచాయతీ కార్యదర్శి గంగన్న, గ్రామస్తులు ఉన్నారు. -
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
తాంసి: మద్యం మత్తులో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పొన్నారిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గుమ్ముల నరేశ్ (31) కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. ఈక్రమంలో కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ పోషణకు గ్రామంలో పలువురి వద్ద అప్పులు సైతం చేశాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గ్రామ శివారులో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ టి.ప్రభాకర్ మృతదేహన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టెబుల్ తెలిపారు. జీవితంపై విరక్తితో ఒకరు..భైంసారూరల్: జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కుంబి గ్రామానికి చెందిన ఉప్పులవార్ మాధవరావు (49) గ్రామంలో గొర్రెల కాపరిగా పనిచూస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉరేసుకుని ఒకరు..కాగజ్నగర్టౌన్: పట్టణంలోని ఓ లాడ్జిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన నరేందర్(40)కు పదిహేనేళ్ల క్రితం వాంకిడి మండలానికి చెందిన సంతోషితో వివాహమైంది. ఏడాదిక్రితం అతని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మానసికంగా బాధపడుతూ ఊర్లు తిరుగుతుండేవాడు. ఈక్రమంలో కాగజ్నగర్కు వచ్చి లాడ్జిలో బస చేశాడు. మంగళవారం గదిలో ఫ్యాన్కు తాడుతో ఉరేసుకున్నాడు. మృతుని సోదరుడు భూంపల్లి ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని జీఎస్ ఎస్టేట్లో నివాసముంటున్న ఆనంద్ త్రిపాఠి ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు ఈ నెల 6న ఇంటికి తాళం వేసి మధ్యప్రదేశ్కు వెళ్లాడు. సోమవారం సాయంత్రం అతని స్నేహితుడు శివకుమార్ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా కిటికి తలుపులు తెరిచి ఉండడం గమనించాడు. లోపలికి వెళ్లిచూడగా తాళం పగులగొట్టి ఉండడంతో విషయాన్ని స్నేహితుడికి సమాచారం అందించాడు. లాకర్లో ఉన్న రూ.10వేల నగదు, రిస్ట్ వాచ్, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు పేర్కొన్నాడు. శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. జఠాశంకర ఆలయంలో..ముధోల్: మండల కేంద్రంలోని జఠాశంకర ఆలయంలో మంగళవారం చోరీ జరిగినట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని దొంగ ఆలయంలో ఉన్న హుండీ పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్ళాడు. ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఆలయానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. -
సింగరేణిని పరిరక్షించుకోవాలి
● ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ప్రసాద్ శ్రీరాంపూర్: సింగరేణిని పరిరక్షించుకోవాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ ప్రసాద్ అ న్నారు. మంగళవారం నస్పూర్ కాలనీలోని శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, సంస్థ పరిరక్షణకు సేవ్ వర్కర్స్...సేవ్ సింగరేణి కార్యక్రమంలో భాగంగా ఈనెల 14న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా, 22న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీ స్ను ముట్టడించనున్నట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం తీసుకుంటున్న పలు నిర్ణయాలు కా ర్మికులకు ఇబ్బందిగా మారాయన్నారు. పర్మినెంట్ ఉద్యోగులను తగ్గించడం, కారుణ్య ఉద్యోగాల కల్పనలో ఇబ్బందులకు గురి చేయడం, 3,600 మందిని విజిలెన్సు కేసుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. కంపెనీలో కార్మికుల సంఖ్యను కుదించినట్లు అధి కారులను ఎందుకు తగ్గించడం లేదన్నారు.సమావేశంలో ఆ యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపల్లి సమ్మయ్య, జెట్టి శంకర్రావు, ఉపాధ్యక్షులు గరి గే స్వామి, కలవేన శ్యాం, ప్రధాన కార్యదర్శి ఏ నుగు రవీందర్రెడ్డి, నాయకులు జీవన్జోయల్, తి రుపతి రాజు, అశోక్, మెండె వెంకటి పాల్గొన్నారు. -
కొలాం గిరిజనుల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలోని కొలాం గిరిజనుల విద్యాభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏటీడీవో క్రాంతికుమార్ అన్నారు. మంగళవారం కొలాం హబిటేషన్ గ్రామాలైనా కొత్తపల్లి–హెచ్ కొలాంగూడ, భీంపూర్ కొలాంగూడ, బొజ్జుగూడలలో నూతనంగా ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలాం గిరిజన పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. సీఆర్టీలను నియమించి విద్యాబోధన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పీఎం జన్మన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం బలిరాం, ఎస్సీఆర్పీ రాజబాబు, విజయ్కుమార్, సీఆర్టీ రోహిదాస్ చౌహాన్, రామేశ్వర్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు. -
అశ్లీల వీడియోలు పోస్ట్ చేసిన ఇద్దరిపై కేసు
రామకృష్ణాపూర్: అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరిపై కేసు న మోదు చేసినట్లు మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మంగళవారం పో లీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లలో అశ్లీల వీడియోలు పోస్ట్ చేసినట్లు నేషనల్ సెంటర్ ఫర్ మి స్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ఎన్సీఎంఈసీ) సంస్థ వారు గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్కు సమాచారం ఇచ్చారు. వారు ఆ కేసును తమకు అప్పగించడంతో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. -
ఎన్ఆర్ఐ కృష్ణపై కేసు నమోదు
ఇంద్రవెల్లి: రిమ్స్లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసగించిన మండలంలోని శంకర్గూడకు చెందిన ఎన్ఆర్ఐ, డిజిటల్ మైక్రో ఫైనాన్స్ చైర్మన్ జవాడే కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన డిగ్రీ విద్యార్థి తుంగపిండి ఉదయ్కుమార్కు కృష్ణతో పరిచయం ఏర్పడింది. మే నెలలో వారింటికి వెళ్లి రిమ్స్లో ఏఎన్ఎం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మీ అమ్మకి ఇప్పిస్తానని చెప్పడంతో జూన్ 3న ఉదయ్కుమార్ తన తల్లితో కలిసి ఆదిలాబాద్లోని రామ్నగర్లో ఉన్న డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి రూ.2.30 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం పలుమార్లు కార్యాలయానికి వెళ్లగా అక్కడ కృష్ణ కనిపించలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు మంగళవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎసై తెలిపారు. వినాయక మండపం కూల్చివేతబెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 21 వార్డు బూడిదగడ్డ బస్తీలో నిర్మిస్తున్న వినాయక మండపాన్ని మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ కృష్ణ , వన్టౌన్ ఎస్హెచ్వో శ్రీనివాసరావు పరిశీలించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అనుమతి లేకుండా మండపం నిర్మించడం సరికాదని నిర్వాహకులకు సూచించారు. కడెం ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేతకడెం: ఎగువన కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్కు మంగళవారం రాత్రి 4,812 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరడంతో ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు రెండు వరద గేట్లను ఎత్తి 12,833 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696.775 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. యూరియా కోసం రైతుల వెతలుతాండూర్: ఖరీఫ్ సీజన్లో వివిధ రకాల పంటలు సాగుచేసిన మండల రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటల సాగు అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా కాకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. మండల సహకార సంఘానికి ప్రస్తుతం 12 టన్నుల (260 బస్తాలు) యూరియా మాత్రమే సరఫరా అయ్యింది. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో అన్నదాతలు గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంద్రవెల్లి: మండల కేంద్రంలోని పీఏసీఎస్, హక రైతు సేవ కేంద్రం, ఫర్టిలైజర్ దుకాణాల్లో గత 10 రోజులుగా యూరియా కొరత ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు మానేసి దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. కొన్నిషాపుల్లో యూరియా ఉన్న అవసరంలేని మందులతో లింకులుపెట్టి వాటిని అంటగడుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి యూరియా కొరతలేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్: జిల్లా బేస్బాల్ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలని బేస్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. ఇంది రా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి బేస్బాల్ ఎంపిక పోటీలను ఆయ న ప్రారంభించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వీరికి బుధవారం నుంచి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. స్థానిక ఐపీ స్టేడియంలోనే ఈనెల 16నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జ్యోతి, అజయ్, గౌతమ్, నాగరాణి పాల్గొన్నారు. -
గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ పంజాబీ దాబా వద్ద మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుబడినట్లు టాస్క్ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. రెబ్బెన మండలం ఖైర్గాంకు చెందిన గన్నా శ్రవణ్కుమార్, మహారాష్ట్రలోని రాజూరకు చెందిన అరున్ రామారావు ముమారే వద్ద నుంచి 60 గ్రాముల (10 ప్యాకిట్లు) గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు సంజీవ్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీ ఇప్పట్లో లేనట్టే..!
● జిల్లా అధ్యక్షుడి నియామకం మరింత ఆలస్యం ● అన్నిరకాల కమిటీలు కూడా.. ● ‘స్థానిక’ ఎన్నికల తర్వాతేననే ప్రచారం ● ‘హస్తం’ శ్రేణుల్లో నిరాశ సాక్షి,ఆదిలాబాద్: ‘త్వరలో పార్టీ పదవుల కేటా యింపు ఉంటుంది.. జెండా మోసిన కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుంది.. బూత్ స్థాయి నుంచి అన్నిరకాల కమిటీల బలోపేతానికి చర్యలు తీ సుకుంటాం.. వాటికి పునర్ వైభవం తీసుకురావడమే మా ముందున్న లక్ష్యం.. జిల్లా అధ్యక్షుడిని ని యమిస్తాం..’ఇది కాంగ్రెస్పార్టీ పరిశీలకులు, ఉమ్మ డి జిల్లా ఇన్చార్జీలు పార్టీ సమావేశాల్లో కార్యకర్తలను ఉద్దేశించి అన్న మాటలు. దీంతో ఇక పార్టీకి మంచి రోజులు రానున్నాయన్న సంతోషం కార్యకర్తల్లో కనిపించింది. మళ్లీ ఏమైందో ఏమో గానీ ఈ విషయంలో స్తబ్ధత నెలకొంది. జిల్లా అధ్యక్షుడి ని యామకం ఇప్పట్లో లేనట్టేననే సంకేతాలు పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. కమిటీల నియామకంపై కూడా స్పష్టత లేదు. దీంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. గత ఏప్రిల్, మే నెలల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వివిధ కమిటీల నియామకం కోసం మండల, పట్టణ సమావేశాలను విస్తతంగా నిర్వహించారు. ఆ ప్రక్రియ పూర్తి చేసి ఆయా కమిటీలకు గాను ఒక్కో దానికి ఐదేసి పేర్ల చొప్పున దరఖాస్తులు కూడా స్వీకరించారు. శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది.ఇక పార్టీకి సంబంధించి గ్రామ, మండల, వార్డు, పట్టణ,బ్లాక్ కమిటీలను పూర్తి చేస్తా రని భావించారు. అయితే అధిష్టానం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు,డీసీసీ అధ్యక్షుల నియామకంలో ఆసక్తి చూపడం లేదని పార్టీలో ప్రచారం సాగుతుంది. ఇలా అయితే ఎలా.. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించడం లేదు. ప్రధానంగా పార్టీ పరంగా ఎలాంటి కమిటీలు లేకపోవడం, జిల్లాకు దిక్సూచిగా ఉండాల్సిన అధ్యక్షుడి పదవి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి ఖాళీగా ఉండటంపై కార్యకర్తల్లో నిరాశ నెలకొంది. నియోజకవర్గ ఇన్చార్జీల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు సాగుతుండడంతో కొంతైనా ప్రభుత్వ పథకాలపై ప్రచారం జరుగుతుందనే అభిప్రా యం ఉంది. అయితే అన్ని స్థాయిల్లో కమిటీల నియామకం జరిగితేనే పార్టీ బలపడుతుందని, అలాగే కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తుందనే టాక్ వినిపిస్తుంది. అయితే అధిష్టానం ఈ విషయంలో వెనుకడుగు వేయడం గమనార్హం. గ్రూపు తగాదాల నేపథ్యంలోనే.. పార్టీలో గ్రూపు తగాదాల నేపథ్యంలోనే అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జిల్లా అధ్యక్షులు, కమిటీల నియామకంలో మళ్లీ వెనుకంజ వేస్తుందన్న ప్రచారం సాగుతుంది. ప్రతీ నియోజకవర్గంలో నాయకుల మధ్య గ్రూపు తగాదాలు ఉండడంతో ఈ పరిస్థితి ఉందని అభిప్రాయ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కమిటీలు నియమించి, జిల్లా అధ్యక్షుడిని ఖరారు చేస్తే గ్రూపు తగాదాలు మరింత పెరుగుతాయా అనే సందేహం అధిష్టానంలో ఉందని, దీంతోనే రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయానికి ముందడుగు పడడం లేదని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే మిగతా జిల్లాల్లో గతంలో అధ్యక్షులుగా పనిచేసిన వారు ఉండడంతో కనీసం మాజీ జిల్లా అధ్యక్షులు అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఆదిలాబాద్లో మాత్రం ఈ పదవి ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో అసలు దిశానిర్దేశం చేసే నాయకత్వం కరువైంది. ఈ నేపథ్యంలోనే జిల్లా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అధ్యక్షుడి నియామకంలో నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయ పడుతున్నారు.పీఏసీ సమావేశం తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ పార్టీ అధ్యక్షుల నియామకం జరగలేదు. త్వరలో హైదరాబాద్ లో పీఏసీ సమావేశం ఉంది. అందులో ఏదైన ని ర్ణయం జరగవచ్చు.అప్పటివరకు ఏమీచెప్పలేం.– తాహెర్బిన్ హందాన్, పార్టీ జిల్లా పరిశీలకులు -
వేధింపులతో మహిళ మృతి
తలమడుగు: వేధింపులతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాధిక తెలిపిన వివరాల మేరకు తలమడుగు మండలంలోని కజర్ల గ్రామానికి చెందిన మొట్టె మానస(25)కు అదే గ్రామానికి చెందిన గంపల ప్రశాంత్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ప్రశాంత్ ఆర్మీలో ఉద్యోగం చేస్తుండడంతో మానసను జమ్మూకశ్మీర్కు తీసుకెళ్లాడు. అక్కడ భర్త, అత్తామామలు శారీరకంగా, మానసికంగా వేధించడంతో ఆరోగ్యం క్షిణించింది. దీంతో మహిళ కుటుంబ సభ్యులు కజ్జర్లకు తీసుకువచ్చి ఆదిలాబాద్లోని రిమ్స్లో చేర్పించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి పూర్ణచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు..మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడ సమీపంలో రహదారిపై ఈ నెల11న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయికుంటకు చెందిన రామటెంకి రాజవ్వ (84) మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. వృద్ధురాలు సోమవారం చున్నంబట్టి వాడ సమీపంలో రోడ్డు దాటుతుండగా మంచిర్యాల వైపు నుంచి శ్రీరాంపూర్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. రాజవ్వకు తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి కూతురు మల్లక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బ్యాంక్ సిబ్బందిపై దాడి!ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్ షాపు యజమాని బ్యాంక్ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. మంగళవారం బ్యాంక్ రుణానికి సంబంధించి రికవరీ కోసం వెళ్లగా బ్యాంక్ ఉద్యోగులు, షాపు యజమానికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో షాపు యజమాని కత్తెరతో దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుడిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ను వివరణ కోరగా.. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. అదుపుతప్పి వ్యాన్ బోల్తాబెల్లంపల్లి: బెల్లంపల్లి శివారులోని నేషనల్హైవే బైపాస్ రోడ్డుపై మంగళవారం తెల్లవారు జా మున సరుకుల లోడ్తో వెళ్తున్న వ్యాన్ 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో రోడ్డుపక్కన బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డా డు. ఆ సమయంలో వెనుక నుంచి వాహనాలే వీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
వర్సిటీ ఏర్పాటు చేయాల్సిందే..
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో యూనివర్సిటీ ఏర్పా టు చేయాల్సిందేనని యూనివర్సిటీ సాధన సమి తి జిల్లా కన్వీనర్ బద్దం పురుషోత్తంరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో విద్యార్థులకు వర్సిటీ ఆవశ్యకతపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సమష్టిగా పోరాడితే విశ్వవి ద్యాలయ ఏర్పాటు సాధ్యపడుతుందన్నారు. ఈ మేరకు విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. జిల్లావ్యాప్తంగా అన్ని కళాశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భారీసభ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో వర్సిటీ సాధన స మితి కోకన్వీనర్ తొగరి భాస్కర్, సభ్యులు శ్రీ కాంత్ రెడ్డి, అఫ్సర్ఖాన్, డాక్టర్ ప్రపుల్వఝే, సతీశ్రెడ్డి, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు. -
● గల్ఫ్ దేశాలకు వెళ్లి జిల్లా యువత అష్టకష్టాలు ● పర్యాటకవీసాలపై నైపుణ్యరహిత పనుల్లో చేరిక ● చట్టాలపై అవగాహన లేక చేయని నేరానికి జైలుకు ● క్షేమసమాచారం తెలియక బాధిత కుటుంబసభ్యుల ఆందోళన
ఉపాధివేటలో ఆగిన గుండె ● ఉజ్బెకిస్తాన్లో వలస కార్మికుడి మృతి నిర్మల్ఖిల్లా: ఉపాధివేటలో విదేశాలకు పయనమైన జిల్లాకు చెందిన యువకుడి గుండె అక్కడే ఆగింది. దస్తూరాబాద్ మండలం మున్యాల్ గ్రామ పంచాయతీ పరిధి కొత్తపెద్దూర్ గ్రామానికి చెందిన సంగ సురేశ్ (33) ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గల్ఫ్ దేశం వెళ్లేందుకు సురేశ్ కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన సబ్ ఏజెంట్ను సంప్రదించి రూ.2.50 లక్షలు ముట్టజెప్పాడు. సదరు సబ్ఏజెంటు మొదట 9 రోజులు ఢిల్లీలో ఉంచి అక్కడి నుంచి టూరిస్ట్ వీసా మీద ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంటుకు పంపాడు. అక్కడ క్లీనింగ్ పని కోసం 15 రోజులు శిక్షణ పొందాడు. అనంతరం డ్యూ టీలో చేరిన నాల్గొవ రోజు (గత నెల 21) గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో సురేశ్ మృతి చెందినట్లు కంపెనీప్రతినిధులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కాగా అక్కడి ఏజెంట్ మృతదేహాన్ని కార్గోలో పంపడానికి డబ్బు ఖర్చువుతుందని, ఢిల్లీ వరకు మాత్రమే పంపగలమ ని రోజుకో మాట చెబుతూ కాలయాపన చేస్తున్నట్లు కుటుంబసభ్యులు వాపోతున్నారు. కలెక్టర్, రాష్ట్ర ఎన్ఆర్ఐ సభ్యులకు వినతి.. తాజాగా సోమవారం మృతుడి భార్య సంగ మమత, ఇద్దరు పిల్లలు, మామ జింక భూమన్నలతో కలిసివచ్చి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు సమస్య విన్నవించా రు. స్పందించిన కలెక్టర్ వివరాలు తీసుకొని మృతదేహం త్వరగా ఇండియా పంపేలా చ ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అ నంతరం రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ స భ్యుడు స్వదేశ్ పర్కిపండ్లకు వివరాలతో కూ డిన పత్రాలు అందించి మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించాలని వేడుకున్నారు. ఏజెంట్కు కట్టిన నగదు తిరిగి ఇప్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవించారు. నిర్మల్ఖిల్లా: ఉన్న ఊరిలో పనులు లేక కుటుంబాలను పోషించుకునేందుకు గ్రామీణ పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులు దేశం కాని దేశం వెళ్లి అష్టకష్టాలు పడుతున్నారు. కంపెనీ వీసాలు దొరక్క విజిట్ వీసాలపై వెళ్లిన వారి బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఉపాధి వేటలో ఎలాగైనా గల్ఫ్ దేశం వెళ్లాలన్న యువకుల బలమైన కాంక్షను ఆసరాగా చేసుకున్న నకిలీ ఏజెంట్లు తాత్కాలిక, పర్యాటక వీసాలను అంటగట్టి రూ.లక్షలు దోచేస్తున్నారు. అలా వెళ్లిన జిల్లా వలస కార్మికులు నైపుణ్య రహిత పనుల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. గల్ఫ్ దేశాల చట్టాల ప్రకారం వీసా లేకుండా పనిచేయడం నేరం కావడంతో అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో వారి జాడ, క్షేమ సమాచారం స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియక తల్లడిల్లుతున్నారు. జిల్లాలో ఇలాంటి కేసులు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఏజెంట్ల వలలో చిక్కి.. కంపెనీ ఉద్యోగాల పేరిట అధిక వేతనాల ఆశ చూపుతూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ ఏజెంట్లు గ్రామీణ మధ్యతరగతి యువతకు ఎరవేస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఉన్నతంగా స్థిరపడిన వా రిని చూసి యువత తామూ అలాగే ఎదగొచ్చని ఆశపడుతూ అప్పుచేసి రూ.లక్షలు ముట్ట చెబుతున్నా రు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత మోసపోతున్నా రు. గత ఆరు నెలల కాలంలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన జిల్లాకు చెందిన పలువురు యువకులు అక్కడి పోలీసులకు చిక్కడంతో ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. నైపుణ్య రహిత పనుల్లోనే.. విదేశాలకు వెళ్లాలన్న తపనతో రూ.లక్షలు వెచ్చించి అక్కడ నైపుణ్య రహిత పనులైన భవన నిర్మాణ రంగం, ఆఫీస్ బాయ్, క్లీనింగ్ తదితర పనులు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి చట్టాల పట్ల అవగాహన లేకపోవడం, ఉన్నతచదువులు లే కపోవడం, నైపుణ్య రంగాల్లో అనుభవం లేకపోవ డం కూడా ఇందుకు మరో కారణంగా గల్ఫ్ సంక్షేమ సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు తప్పనిసరిగా వివిధ వృత్తి పనుల్లో అనుభవం కలిగి ఉండాలని, అలాంటి పనుల నిమిత్తమే రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారావిదేశాలకు ఉపాధి కోసం వెళ్లాలని సూచిస్తున్నారు.ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనలు.. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన పన్నాల శ్రీనివాస్ సౌదీ అరేబియా దేశం వెళ్లి గత మేలో పనిలో చేరాడు. అక్కడి యజమాని తన వ్యవసాయ క్షేత్రానికి పంపగా ఒకసారి భార్య పిల్లలకు ఫోన్ చేశాడు. అనంతరం అతని నుంచి ఇప్పటివరకు ఎటువంటి క్షేమ సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సోన్ మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన కిస్టాపురం లక్ష్మన్న సబ్ ఏజెంట్ ద్వా రా రూ.2లక్షలు వెచ్చించి దుబాయ్కి లేబర్ సప్లయ్ కంపెనీ వీసా ద్వారా వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సరైన వేతనం కూడా లేకపోవడంతో స్వదేశానికి రప్పించే ఏర్పాటు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన గొర్రె రాజేందర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆయన వేతన ఖాతాలో అక్రమ నగదు బదిలీ కాగా కేసులో ఇరుక్కున్నాడు. స్వదేశానికి తిరిగి రాలేక అక్కడి పోలీసుల అదుపులో ఉన్నాడు. తమ కొడుకుని ఎలాగైనా ఇండియాకు రప్పించాలని తండ్రి గంగన్న, కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందిన సాయినాథ్, సారంగాపూర్ మండలం దేవితండాకు చెందిన జాదవ్ మధుకర్ గల్ఫ్ దేశాల్లో వివిధ రకాల కేసుల్లో ఇరుక్కొని అష్టకష్టాలు పడుతున్నారు. కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన గొర్రెకర్ శ్రీనివాస్ దుబాయ్లో సైబర్ నేరం కేసులో కటకటాలపాలవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి నకిలీ ఏజెంట్లను నమ్మి విజిట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లొద్దు. వృత్తిపరమైన శిక్షణతో కూడిన పనులకు మాత్రమే వెళ్లాలి. రిజిస్టర్డ్ ఏజెంట్లు, కంపెనీల ద్వారా వీసా రుసుము చెల్లించిన తర్వాతనే పయనమవ్వాలి. ప్రవాసీ భారత బీమా యోజన ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. గల్ఫ్ దేశాల నియమ, నిబంధనలు, చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి. – మంద భీమ్రెడ్డి, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ ప్రతినిధి, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్చైర్మన్ -
రెండేళ్లయినా బిల్లులు రావట్లేదు..
సార్.. మేమంతా పీవీటీజీ ఆదిమ గిరిజనులం. ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో 2023లో సీసీడీపీ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేసింది. చేతిలో డబ్బుల్లేకపోయినా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందనే భరోసాతో అప్పు చేసి మరి ఇండ్లను కట్టుకున్నాం. నిర్మాణాలు పూర్తయి రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు మంజూరు చేయడం లేదు. మా పరిస్థితి అర్థం చేసుకుని త్వరితగతిన బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – ఆదివాసీ లబ్ధ్దిదారులు, ఉట్నూర్ -
తిమ్మిని బమ్మి చేసి..
ఇది ఉట్నూర్ మండలం కుమ్మరితాండలో ఓ డొమెస్టిక్ కొత్త లైన్ కోసం వేసిన ట్రాన్స్ఫార్మర్. పది రోజుల క్రితం బిగించారు. అయితే ఇక్కడ లాజిక్ ఉంది. వాస్తవానికి 25 కేవీ లోడ్ ట్రాన్స్ఫార్మర్ బిగించాలి. అయితే ఇదే మండలంలోని ఉమ్రి గ్రామంలో ఓవర్లోడ్ కారణంగా తొలగించిన 15 కేవీ ట్రాన్స్ఫార్మర్ను బిగించేశారు. అలాగని ఈ వర్క్ సాంక్షన్ జరిగి అగ్రిమెంట్ ప్రకారం జరుగుతుందా అంటే.. అదేమిలేదు. మొత్తం పని పూర్తయిన తర్వాత ఇప్పుడు సాంక్షన్, అగ్రిమెంట్ పనులు చేపట్టడంలో చోద్యమేమిటో.ఇది ఉట్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామంలోనిది. ఒక వర్క్కు సంబంధించి ఈ 25కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఇటీవల బిగించారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ వర్క్ ఇంకా మంజూరు కాకపోవడంతో ఇదే గ్రామంలో మంజూరైన ఇతర పనులకు సంబంధించి మరో కాంట్రాక్టర్ నుంచి ఓ ట్రాన్స్ఫార్మర్ను తీసుకొని ఇలా పెట్టేశారు. సాధారణంగా ఏ పనికోసమైతే ఆ ట్రాన్స్ఫార్మర్ను వాడాలో దానికి సంబంధించి ఎక్యూప్మెంట్ నంబర్ నమోదై ఉంటుంది. ఇప్పుడు ఈ బిగించిన ట్రాన్స్ఫార్మర్ వివరాలు విచారణ చేస్తే అది మరొక పనికోసం మంజూరు చేసినదని ఇట్టే తెలిసిపోతుంది. -
నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలి
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్లో ఉంచవద్దని ఎన్పీడీసీఎల్ వరంగల్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో విద్యు త్ శాఖ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆదేశించారు. 33కేవీ ట్రి ప్పింగ్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని విద్యుత్ స్తంభాలకు సెప్టెంబర్ 30లో గా నంబరింగ్ పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఈ అశోక్ కుమార్, డీఈలు ఈదన్న, ప్రభాకర్, సుభాష్, ఏడీ లక్ష్మణ్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 43 అర్జీలు
ఆదిలాబాద్టౌన్: ప్రజాసమస్యలపై పోలీసు అధి కారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పరి ష్కారం చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 43 మంది తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందజేశారు. ఆయన వాటిని స్వీకరించి ఫోన్ ద్వారా సంబంధితాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. దూరప్రాంతాల వారు వాట్సాప్ ద్వారా తమ సమస్యలను 8712659973నంబర్పై తెలియజేయవచ్చ ని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
● విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొందరు గురువులు ● జిల్లాలో ఇటీవల వెలుగులోకి పలు ఘటనలు ● పలువురిపై పోక్సో కేసులు ● ఆందోళనలో తల్లిదండ్రులు
మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఆదిలాబాద్టౌన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సిన గురువుల్లో కొంతమంది తప్పడుగులు వేస్తున్నారు. వెకిలి చేష్టలతో కీచకులుగా మారుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించి వారి భవితకు బాటలు వేయాల్సిన వారు దారి తప్పుతున్నారు. తండ్రి లాంటి వయస్సులో ఉన్నవారు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పవిత్రమైన వృత్తికి మచ్చ తెచ్చిపెడుతున్నారు. ఇటీవల జిల్లాలో వెలుగు చూసిన పలు సంఘటనలే ఇందుకు నిదర్శనం. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొంత మంది పిల్లలు తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లబోసుకుంటుండగా, మరికొందరు ఎవరికి చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. కొంత మంది గురువుల ఈ చేష్టలతో మిగతా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విద్యార్థులు షీటీమ్, పోలీసులను సంప్రదించడంతో నిందితులపై పోక్సో కేసులు నమోదై కటకటాల పాలవుతున్నారు. జిల్లాలో ఘటనలు.. ● మావలలోని జెడ్పీఎస్ఎస్లో ఓ ఉపాధ్యాయుడిపై ఇటీవల పోక్సో కేసు నమోదైంది. విద్యార్థినులు షీటీమ్కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమో దు చేశారు. దీంతో ఆయన జైలు పాలయ్యాడు. ● ఇంద్రవెల్లి మండలంలోని ఓ పాఠశాల ఉపాధ్యాయుడిపై విద్యార్థినులు షీటీమ్కు ఫిర్యాదు చేశా రు. ఆతర్వాత స్థానిక పోలీసు స్టేషన్లో కేసు న మోదైంది. ఇటీవల పోక్సోకేసు నమోదుతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ● తాంసి మండల కేంద్రంలోని ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు షీటీమ్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇటీవల సదరు ఉపాధ్యాయుడిని విద్యాశాఖాధికారులు సస్పెండ్ చేశారు. ● ఉట్నూర్లో పనిచేసే ఎస్జీటీ ఓ విద్యార్థినిపై ఇటీవల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసు స్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ● ఉట్నూర్ మండలం లక్కారం పాఠశాలలో ఓ ఉ పాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవ ర్తించడంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ● మావలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ ప్రిన్సి పాల్ విద్యార్థిని వేధించడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇటీవల ఆ ఉపాధ్యాయుడికి జైలు శిక్ష సైతం పడింది. ● తాంసి మండలంలోని ఘోట్కురి పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు, వాగాపూర్లో పని చేసే మరో ఉపాధ్యాయుడు గతంలో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో వారిపై సస్పెన్షన్ వేటువేశారు. వేరేపాఠశాలకు బదిలీ చేశారు. ● జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్లో పనిచేసే ఇద్దరు కోచ్లు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో వారిపై వేటు పడింది. విధుల నుంచి తొలగించారు. ఇటీవల ఓ కోచ్పై వన్టౌన్లో పోక్సో కేసు నమోదైంది. న్యూస్రీల్అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు టీచర్లు పోక్సో కేసుపై అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థినులను బ్యాడ్ టచ్ చేయవద్దు. శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తే పోక్సో కేసు నమోదు చేస్తాం. అసభ్యంగా ప్రవర్తించే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. – ఎల్.జీవన్రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ బడిలో కీచకపర్వం.. విద్యార్థులకు చదువు, సంస్కారం నేర్పాల్సిన పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మంచి, చెడు చెప్పాల్సిన వారే సమాజంలో తలదించుకునే పనులు చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో వరుసగా విద్యార్థినులపై గురువుల అఘాయిత్యాలు పెరగడంతో పోక్సో కేసులు నమోదవుతున్నాయి. టీచర్లు ఇలాంటి పనులు చేయడం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. -
వర్సిటీ ఏర్పాటు చేయాల్సిందే..
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో యూనివర్సిటీ ఏర్పా టు చేయాల్సిందేనని యూనివర్సిటీ సాధన సమి తి జిల్లా కన్వీనర్ బద్దం పురుషోత్తంరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో విద్యార్థులకు వర్సిటీ ఆవశ్యకతపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సమష్టిగా పోరాడితే విశ్వవి ద్యాలయ ఏర్పాటు సాధ్యపడుతుందన్నారు. ఈ మేరకు విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. జిల్లావ్యాప్తంగా అన్ని కళాశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భారీసభ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో వర్సిటీ సాధన స మితి కోకన్వీనర్ తొగరి భాస్కర్, సభ్యులు శ్రీ కాంత్ రెడ్డి, అఫ్సర్ఖాన్, డాక్టర్ ప్రపుల్వఝే, సతీశ్రెడ్డి, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
మామడ: ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1079.80 అడుగుల నీటి మట్టం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.49 టీఎంసీలుగా ఉంది. కాగా సరస్వతీ కాలువ కింద సాగు చేసిన పంటల కోసం 800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బాసర గోదావరిలో భక్తుల మొక్కులుబాసర: వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నూతనంగా నీరు ప్రవహిస్తుండడంతో శ్రావణమాసం పురస్కరించుకొని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదారమ్మకు దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో వరద నీరు భారీగా వస్తోంది. ‘కార్మికుల శ్రమను దోచుకుంటున్న సంఘాలు’మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, టీబీజీకేఎస్ సంఘాలు యాజమాన్యంతో కుమ్మకై ్క సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. ఆదాయ పన్ను రద్దు, సొంతింటి కల, ప్రైవేటీకరణ అడ్డుకుని కొత్తగనులు ఏర్పాటు, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి వాగ్దానాలు ఇచ్చి గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు, నాయకులు సీతారామయ్య, జనక్ప్రసాద్లు కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ అవినీతి వాటాలతో తోడుదొంగలుగా మారారని విమర్శించారు. డిమాండ్ల సాధనలో సింగరేణి కార్మికవర్గం, కాంట్రాక్ట్ కార్మికులు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
ఆ విత్తనాలు మొలకెత్తలే..
ఈ సీజన్లో నాకున్న 4.31 ఎకరాల్లో సోయాబిన్ సాగు చేశా. అగ్రికల్చర్ రిసెర్చ్ సెంటర్ ఆదిలాబాద్ వారి నుంచి రూ.1600 నగదు చెల్లించి జేఎస్ 335 రకం ఐదు సంచుల విత్తనాలను కొనుగోలు చేశాను. వాటికి లాట్ నంబర్ లేకుండానే నాకు రశీదు ఇచ్చారు. ప్రభుత్వ విత్తనాలని నమ్మితే అవి మొలకెత్తనేలేదు. స్థానిక ఏఈఓ, తలమడుగు ఏవోలను కలిసి లిఖితపూర్వకంగా సమస్యను వివరించినా వారు పట్టించుకోవడం లేదు. పంట నష్టపోయిన నాకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – గోనెల నర్సింలు, రుయ్యాడి, తలమడుగు -
ఆ విత్తనాలు మొలకెత్తలే..
ఈ సీజన్లో నాకున్న 4.31 ఎకరాల్లో సోయాబిన్ సాగు చేశా. అగ్రికల్చర్ రిసెర్చ్ సెంటర్ ఆదిలాబాద్ వారి నుంచి రూ.1600 నగదు చెల్లించి జేఎస్ 335 రకం ఐదు సంచుల విత్తనాలను కొనుగోలు చేశాను. వాటికి లాట్ నంబర్ లేకుండానే నాకు రశీదు ఇచ్చారు. ప్రభుత్వ విత్తనాలని నమ్మితే అవి మొలకెత్తనేలేదు. స్థానిక ఏఈఓ, తలమడుగు ఏవోలను కలిసి లిఖితపూర్వకంగా సమస్యను వివరించినా వారు పట్టించుకోవడం లేదు. పంట నష్టపోయిన నాకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – గోనెల నర్సింలు, రుయ్యాడి, తలమడుగు -
భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఎత్తివేత
జన్నారం: జన్నారం గుండా పగటిపూట భారీ వాహనాల రాకపోకల నిషేధం ఎత్తివేస్తున్నట్లు వైల్డ్లైఫ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ఏలుసింగ్ ఆదేశాలు జారీ చేసినట్లు మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలోని ఎఫ్డీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్నారం మీదుగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు భారీ వాహనాలు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా గతంలో మాదిరి భారీ వాహనాలకు రూ.150 పర్యావరణ శిస్తు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాహనాల అనుమతి తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో రేంజ్ అధికారులు సుష్మారావు, శ్రీధరచారి, దయాకర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘దేశీదారు’ పట్టివేత
ఆదిలాబాద్టౌన్: అక్రమంగా తరలిస్తున్న 530 దేశీదారు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. సోమవారం ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్రూరల్ మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన అలిశెట్టి అభిలాష్ అనే వ్యక్తి రూ.24వేల విలువ గల మద్యం సీసాలను మహారాష్ట్ర నుంచి ద్విచక్ర వాహనంపై తరలిస్తున్నాడు. కొరట గ్రామ శివారులో ఎకై ్సజ్ అఽ దికారుల రాకను గమనించి బైక్తో పాటు మ ద్యం సీసాలను వదిలి పరారయ్యాడు. అభిలా ష్పై కేసు నమోదు చేశామని, త్వరలో నిందితుడిని జైలుకు పంపిస్తామన్నారు. సిబ్బంది తానాజీ, ధీరజ్, హన్మంతు పాల్గొన్నారు. -
విద్యార్థిని ఆత్మహత్య
జైపూర్: అనారోగ్య సమస్యలతో, హాస్టల్లో ఉండలేక ఇంటికి వచ్చిన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేలాల గ్రామానికి చెందిన దామెరకుంట శ్రావణి –రవి దంపతులకు వైష్ణవి, లక్ష్మీప్రసన్న ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు లక్ష్మీప్రసన్న(13) జైపూర్ కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. ఆమె కొద్ది రోజులుగా పంటినొప్పి, చెవి నొప్పితో బాధపడుతోంది. ఆమెకు చికిత్స చేయించేందుకు నెల క్రితం తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చి ఆసుపత్రిలో చూపించారు. అనారోగ్య సమస్యలకు తోడు చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం రాత్రి ఇనుపరాడ్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ వెల్లడించారు. ‘దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి’ ఉట్నూర్రూరల్: ప్రజావాణిలో అందించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో పీవో దరఖాస్తులు స్వీకరించారు. బేల మండలం నుంచి హరిత, ఇంద్రవెల్లి మండలం జాలంతండాకు చెందిన కుమ్మర రేణుక, గాదిగూడ మండలంలోని జరీ గ్రామానికి చెందిన కుడిమేత అశ్విని, ఆత్రం భగవంతురావు ఇంద్రవెల్లి మండలం మర్కాగూడకు చెందిన సంగీత తదితరులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్జీలు సమర్పించారు. పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్ఆదిలాబాద్రూరల్: 20 ఆటోల చోరీల్లో నిందితుడిగా ఉన్న జైనూర్కు చెందిన సయ్యద్ అలీ అనే వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆటో చోరీలకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులు ఉండగా, అందులో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరిలో సయ్యద్ అలీ అనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. -
‘కార్మిక సమస్యలపై పోరాడుతాం’
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని బీఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన సీసీసీ కార్నర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగులతో చేయించాల్సిన బొగ్గు ఉత్పత్తిని కూడా కాంట్రాక్టర్లతో చేయిస్తున్నారన్నారు. బొగ్గు ఉత్పత్తి 50 శాతం పర్మినెంట్ ఉద్యోగులు, సంస్థ ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాలు ప్రకటించి కార్మికులకు వాటా చెల్లించాలన్నారు. యూనియన్ రాష్ట్ర నాయకులు మండ రామాకాంత్, పులి రాజిరెడ్డి, అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, శ్రీరాంపూర్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు సత్తయ్య, కార్యదర్శి రాజేందర్, నాయకులు కమలాకర్, కిరణ్కుమార్, మహేందర్, నాగేశ్వర్ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రుణం చెల్లించినా జమ కాలే..
మేమంతా సరోజినిదేవి గ్రామ సమాఖ్య పరిధిలోని మహాత్మాగాంధీ గ్రామ స్వయం సహాయక సంఘ సభ్యులం. సీ్త్రనిధి ద్వారా తీసుకున్న రూ.2లక్షల రుణాలను మూడేళ్లలో పూర్తిగా చెల్లించాం. 2020లో కొత్త రుణం కోసం బ్యాంకుకు వెళ్లగా పాత రుణం పూర్తిగా చెల్లించలేదని అధికారులు తెలిపారు. మేం కట్టిన రశీదులు చూపించగా ఆ డబ్బులు మరో సంఘం ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. దీనిపై ఐకేపీ సీసీ, సీఏలను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా ఆ రుణంపై వడ్డీ పెరుగుతోంది. విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలి. – ఎస్హెచ్జీ సభ్యులు, ఖోడద్, తలమడుగు -
యూట్యూబర్ పేరిట మోసం
కౌటాల: యూట్యూబ్ స్టార్ హర్షసాయి అనుచరుడని ఆన్లైన్లో మోసాలకు పాల్పడిన మొహమ్మద్ తౌఫిక్ఖాన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు కౌటాల సీఐ సంతోష్కుమార్ తెలిపారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో కేసు వివరాలు వె ల్లడించారు. హర్యానాలోని మేవార్ జిల్లా లోహికాకాల గ్రామానికి చెందిన మొహమ్మద్ తౌపిక్ ఖాన్ అదే రాష్ట్రానికి చెందిన సహచరులు ముబారక్ ఖాన్, వసీమ్ఖాన్, అహ్మద్ ఖాన్, ఇమ్రాన్లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. యూట్యూబర్ హర్షసాయి పేరుతో నకిలీ నంబర్లు, వాట్సాప్ వాడుతూ ప్రజలకు ఆర్థికసాయం, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫోన్ పే, ఇతర ఆన్లైన్ మధ్యమాల ద్వారా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. గత మేలో జిల్లాలోని బెజ్జూర్ మండలం సలుగుపల్లి గ్రామానికి చెందిన ఆత్రం సాయిని నమ్మించి రూ. 28వేలు వసూలు చేశారు. అనంతరం అతని ఫోన్ నంబర్ కలవకపోవడంతో మోసపోయానని గుర్తించి సాయి బెజ్జూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు పై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని హర్యానాలో పట్టుకున్నారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందుతుడి వద్ద నుంచి సెల్ఫోన్, సిమ్లు, ఆన్లైన్ లావాదేవిల రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో శ్రమించిన ఎస్సైలు సర్తజ్పాషా, తేజస్విని, కానిస్టేబుల్ వినోద్, సందీప్ను సీఐ అభినందించారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 43 అర్జీలు
ఆదిలాబాద్టౌన్: ప్రజాసమస్యలపై పోలీసు అధి కారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పరి ష్కారం చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 43 మంది తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందజేశారు. ఆయన వాటిని స్వీకరించి ఫోన్ ద్వారా సంబంధితాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. దూరప్రాంతాల వారు వాట్సాప్ ద్వారా తమ సమస్యలను 8712659973నంబర్పై తెలియజేయవచ్చ ని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
వాగు దాటి.. వైద్యం అందించి
నార్నూర్: వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులపై వంతెనలు లేని గ్రామాల వాసులు ప్రమాదకరంగా వాగులు దాటాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాగా సోమవారం గాదిగూడ మండలంలోని ఆర్జుని గ్రామ పంచాయతీ పరిధి మారుగూడ గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. గ్రామానికి వెళ్లే మార్గం మధ్యలో పెద్దవాగు ఉండగా వైద్య సేవలు అందించేందుకు ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది హెచ్ఈ రవీందర్ రాథోడ్, ఏఎన్ఎం సులోచన, అరవింద్, గంగాధర్లు ప్రమాదకరంగా వాగు దాటారు. దాదాపు కిలోమీటరు కాలినడకన వెళ్లి వైద్యశిబిరం నిర్వహించారు. వారి వెంట ఉపాధ్యాయులు మెస్రం శేఖర్, జాదవ్ జ్యోతి, శ్యావ్రావు తదితరులు ఉన్నారు. -
ట్రిపుల్ఐటీలో ఉత్తమ విద్య
● ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ బాసర: ఆర్జీయూకేటీ అందించే ఉత్తమ విద్య, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక వనరులను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. బాసర క్యాంపస్లో నూతన విద్యార్థుల తల్లిదండ్రులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అకడమిక్ జ్ఞానంతో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధించేందుకు కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు ప్రతీరోజు కనీసం 5 నిమిషాలు పిల్లలతో మాట్లాడి, వారి విద్యాప్రగతి, మానసిక స్థితి, లక్ష్యాలపై చర్చించాలని సూచించారు. అసోసియేట్ డీన్స్ డా. విటల్, డా. నాగరాజు, డాక్టర్ మహేశ్, శ్రీనివాస్, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. మెటా గేట్ అకాడమీతో ఒప్పందం ఆర్జీయూకేటీలోని మెటలర్జీ –మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం, హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మెటా గేట్ అకాడమీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ సమక్షంలో ఓఎస్డీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ మురళీధర్షన్, మెటా గేట్ అకాడమీ డైరెక్టర్ శ్రీ ఎన్. గురుప్రసాద్ సంతకాలు చేశారు. ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు గేట్ ఉచిత శిక్షణ అందించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. మెటలర్జీ విభాగాధిపతి శ్రీ కిరణ్ కుమార్, అసోసియేట్ డీన్లు డాక్టర్ మహేశ్, డాక్టర్ విట్టల్, అధ్యాపకులు డాక్టర్ ఆర్.అజయ్, వి.అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు
కై లాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని అక్కడే ఉన్న అధికారులకు అందజేస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి 78 అర్జీలు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈ వారం బాధితుల్లో కొందరి నివేదన.. కలెక్టర్కు రాఖీ కట్టిన అధికారులు రక్షాబంధన్ పురస్కరించుకుని అదనపు కలెక్టర్ శ్యామలదేవితో పాటు పలువురు జిల్లా మహిళా అధికారులు కలెక్టర్ రాజర్షి షాకు రాఖీలు కట్టారు. అలాగే బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో కలెక్టర్తో పాటు ప్రజావాణికి హాజరైన అధికారులందరికీ రాఖీలు కట్టి మిఠాయిలు పంచారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన రాఖీలను అంగన్వాడీ కేంద్రం చిన్నారులు కలెక్టర్కు కట్టారు. కలెక్టర్ రాజర్షి షా ప్రజావాణికి 78 దరఖాస్తులు -
నులిపురుగుల నివారణకు కృషి
ఆదిలాబాద్టౌన్: నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. సోమవారం నులిపురుగుల నివారణ దినో త్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అర్బన్ కేజీ బీవీలో విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 1నుంచి 19 ఏళ్లలోపు ఉన్నవారికి ఆల్బెండజోల్ మాత్రలను వైద్యశాఖ ఆధ్వర్యంలో అందించనున్నట్లు తెలిపా రు. అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, కళాశాలల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారు 2లక్షల 6వేల 127 మంది ఉన్నట్లు తెలిపారు. ఏదైనా కారణాలతో మాత్రలు వేసుకోని వారికి ఈనెల 18న తప్పకుండా వేయించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. ఇందులో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, డీఐవో వైసీ శ్రీనివాస్, కేజీబీవీ ప్రత్యేక అధికారి దీప్తి, సీఆర్టీలు, విద్యార్థినులు పాల్గొన్నారు. పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు కై లాస్నగర్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజ ర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తనచాంబర్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించి ఆయా శాఖలు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యా మలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అన్నదాతకు ‘సంకటహరణ’
● నానో ఎరువులు ప్రోత్సహించేలా ఇఫ్కో చర్యలు ● ఎరువుల కొనుగోలుతో ఉచిత బీమా ● రైతులందరికీ ప్రయోజనం రైతులకు ప్రయోజనకరం సహకార సంఘాల ద్వారా ఇఫ్కో సంస్థ నానో యూరియా ప్లస్, నానో డీఏపీలను రైతులకు విక్రయిస్తుంది. వీటి ద్వారా రైతులకు ఎన్నో లాభాలున్నాయి. పైగా ఎరువులు కొనుగోలు చేస్తే ఆ సంస్థ ఉచిత ప్రమా ద బీమా అందిస్తోంది. ఇది రైతులందరికీ ప్రయోజనకరం. సద్వినియోగం చేసు కోవాలి. – అంజిత్కుమార్, ఏవో దండేపల్లిదండేపల్లి: అన్నదాతకు ఎవుసం భారంగా మారుతోంది. ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గుతున్నాయి. మరోవైపు చేతికి వచ్చిన పంటకు మద్ద తు ధర అందడం లేదు. ఎరువులు, కూలీల ధరలు పెరుగుతున్నంతగా పంటల మద్దతు ధర పెరగడం లేదు. అయినా రైతుకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు. ఇలాంటి పరిస్థితిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనే క పథకాలు ప్రవేశపెట్టాయి. బోనస్ చెల్లిస్తున్నాయి. పెట్టుబడి సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో–ఆపరేటివ్ లిమి టెడ్(ఇఫ్కో)తన నానోఫ్లస్యూరియా,నానో డీఏపీ ఎరువులను ప్రోత్సహించేందుకు రైతులకు ఉచిత బీమా కల్పిస్తోంది. ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ‘సంకటహరణ’ ప్రమాద బీమా పథకాన్ని ఉచి తంగా అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కే వలం ఇఫ్కోఎరువుల కొనుగోలుద్వారా బీమా పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం సంభవించినా బీమా వర్తిస్తుంది. ఈ మేరకు ఇఫ్కో ప్రతినిధులు, వ్యవసాయాధికారులు నానో యూరియా ప్లస్, నానో డీఏపీ వాడకంతో పాటు బీమా పథకంపై అవగాహన కల్పిస్తున్నారు బీమా అర్హతలు.. సహకార సంఘాల ద్వారా రైతులు ఇఫ్కో సంస్థ అందించే నానోప్లస్ యూరియా, నానో డీఏపీ ఎరువులు కొనుగోలు చేయవచ్చు. వయో పరిమితి లే కుండా ప్రతీ రైతుకు బీమా వర్తిస్తుంది. ప్రతీ నానో ఎరువు బాటిల్ కొనుగోలుపై రూ.10 వేల బీమా కవరేజ్ లభిస్తుంది, గరిష్టంగా రూ.2 లక్షల వరకు బీమా పరిమితి ఉంటుంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే 100శాతం, రెండు అవయవాలు కోల్పోతే 50 శాతం, ఒక అవయవం కోల్పోతే 25 శాతం పరి హారం అందుతుంది. ఎరువులు కొనుగోలు చేసిన నాటి నుంచి 12 నెలలు చెల్లుబాటు అవుతుంది. కొనుగోలు సమయంలో జాగ్రత్తలు.. ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు రశీదుపై కొనుగోలు తేదీ, కొనుగోలుదారుని పేరు, తండ్రి లే దా భర్త పేరు, చిరునామా, కొనుగోలు చేసిన ఇఫ్కో ఎరువుల సంఖ్య, నామినీ పేరు, కొనుగోలుదారుని సంతకం లేదా వేలిముద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రమాదం జరిగిన సందర్భంలో బీ మా పరిహారం పొందడానికి అసలు రశీదు తప్పని సరి. దీంతోపాటు విక్రయాల రిజిస్టర్ జిరాక్స్, పోలీ స్స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ, డాక్టర్ చికిత్స నివేదిక, పోస్ట్మార్టం నివేదిక, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఈ క్లెయిం పత్రాలు ప్రమా దం జరిగిన తేదీ నుంచి రెండు నెలల్లోగా సికింద్రాబాద్లోని ఇఫ్కో బీమా కంపెనీకి పంపించాలి.ఉమ్మడి జిల్లాలో రైతులు, సాగు విస్తీర్ణం, వినియోగించే ఎరువుల వివరాలు.. జిల్లా రైతుల సంఖ్య సాగు విస్తీర్ణం యూరియా డీఏపీ (ఎకరాల్లో..) (మెట్రిక్ టన్నుల్లో) (మెట్రిక్ టన్నుల్లో) మంచిర్యాల 1.64 లక్షలు 3.31 లక్షలు 43 వేలు 13 వేలు నిర్మల్ 1.90 లక్షలు 4.40 లక్షలు 35 వేలు 10 వేలు ఆసిఫాబాద్ 1.32 లక్షలు 4.45 లక్షలు 60 వేలు 12 వేలు ఆదిలాబాద్ 1.65 లక్షలు 5.85 లక్షలు 35 వేలు 13 వేలు -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి●
● తెలియని లింక్లు వినియోగించొద్దు ● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. తెలియని వారికి ఓటీపీ చెప్పవద్దని, అలాగే తెలియని లింక్లు, అప్లికేషన్లు సెల్ఫోన్లలో వినియోగించవద్దన్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ బారినపడ్డ వారు వెంటనే 1930కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో ఈ వారంలో 21 సైబర్ ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. బాధితులు గంటలోపు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాబట్టే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజినెస్ ఆఫర్లు, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్లు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో యువత మోసపోతున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఆన్లైన్ వర్క్, వర్క్ఫ్రం హోం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కష్టపడి చదివి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించాలని, వ్యాపారం, వ్యవసాయం నిర్వహిస్తూ ఎదగాలని సూచించారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి రూ.15లక్షలు మోసపోయాడని, భీంపూర్కు చెందిన మరో వ్యక్తి రూ.15వేలు, టూటౌన్ పరిధిలో ఒకరు రూ.62వేలు, బోథ్కు చెందిన యువకుడు రూ.26,750.. ఇలా అనేక మంది నష్టపోయారని తెలిపారు. ఆదివాసీల సమస్యలపై నిరంతర పోరాటం●● రాజ్గోండ్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్ ఆదిలాబాద్రూరల్: ఆదివాసీ సమస్యలపై రా జ్గోండ్ సేవాసమితి నిరంతరం పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్ అ న్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడా రు. ఆదివాసీ జాతికి రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమన్నారు. ఇప్పటికీ ఆదివాసీలపై అటవీ అఽ దికారుల దాడులు కొనసాగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు ఆపకపోతే జా తీయస్థాయిలో వారిపై కేసులు పెట్టిస్తామన్నా రు. అలాగే దేశ వ్యాప్తంగా ఆదివాసీలు ఏకమై హక్కులపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సిడాం అర్జు, సెడ్మాకి ఆనంద్రావ్, తదితరులు ఉన్నారు. ఆకట్టుకుంటున్న ‘దూరబంతి’భీంపూర్: మండలంలోని గుబిడి గ్రామానికి వె ళ్లే అటవీ ప్రాంతంలో దూర బంతులు అటుగా వెళ్లేవారిని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురి సిన వర్షాలకు ఈ ప్రాంతమంతా పచ్చదనంతో పాటు పూలతో కనువిందు చేస్తున్నాయి. -
బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు పోరాటం
ఆదిలాబాద్టౌన్: బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రా మన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు 42శాతం రిజ ర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందంటూ చే తులు దులుపుకోవడం సరికాదన్నారు. అధికా రంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు బిల్లుకు చట్టబ ద్ధత తెస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలో అన్ని బీసీ సంఘాలతో కాంగ్రెస్ ఇచ్చి న మోసపూరిత హామీలపై నిలదీస్తామని పే ర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు గోవర్ధన్, మనోహర్, మెట్టు ప్రహ్లాద్, జగదీష్, రాజన్న, స్వామి,లక్ష్మణ్, విఠల్, అశోక్,నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లకు టీఎల్ఎం మేళా
● ఈనెల 18లోపు మండల, 20లోపు జిల్లాస్థాయిల్లో ఏర్పాటు ● ఉత్తర్వులు జారీ చేసిన ‘సమగ్ర శిక్ష’ ఆదిలాబాద్టౌన్: విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో టీచర్లు ఏవిధంగా పాఠాలు బోధిస్తున్నారో అనే అంశాలపై అభ్యసన సామగ్రి (టీచింగ్ లర్నింగ్ మెటీరియల్) మేళా నిర్వహించేందుకు వి ద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇది విద్యార్థులు నేర్చుకునే ప్రక్రియను సులభతరం చేయడానికి ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనా సామగ్రిని ప్రదర్శించే కార్యక్రమం. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో తక్కువ ఖర్చుతో సులభంగా తయారు చేయగల బోధనా ఉపకరణాలను ప్రదర్శిస్తారు. ఈ మేళాలో ఉపాధ్యాయులు తమ సృజనాత్మకత, నైపుణ్యాలను చాటుతారు. అలాగే ఉపాధ్యాయులు కొత్త ఆలోచనలు నేర్చుకోవడానికి, పంచుకోవడాని కి అవకాశం ఉంటుంది. ఆదివారం తెలంగాణ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు టీఎల్ఎం మేళాలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతీ పాఠశాల నుంచి విద్యార్థులకు బోధించే టీఎల్ఎంను మేళాలో ప్రదర్శించాలి. ఈనెల 18లోగా మండల స్థాయిలో 20లోగా జిల్లాస్థాయిలో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ మండలం నుంచి 10 ఉత్తమ ప్ర దర్శనలు జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వాటిని రాష్ట్రస్థాయికి పంపించనున్నారు. గత విద్యా సంవత్సరం నుంచి ఈ టీఎల్ఎం మేళాను విద్యా శాఖ నిర్వహిస్తుంది. జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. ఈ మేళాతో సర్కారు బడుల్లో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు దోహద పడనుంది. కాగా సోమవారం ఈ టీఎల్ఎం మేళా నిర్వహణకు సంబంధించి జూమ్ మీటింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. తక్కువ ఖర్చుతో బోధన సామగ్రి ఉపాధ్యాయులు తక్కువ ఖర్చుతో తయారు చేసిన బోధన సామగ్రితో మేళాలో ప్రదర్శనలు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థులు తయారు చేసిన నమూనాలు చార్ట్లు, గేమ్స్, పటా లు, వివిధ అంశాలకు సంబంధించి మేళాలో ప్రదర్శించాలి. భాషా, అక్షరమాల, పదాల ద్వారా ఏర్ప డే చిత్రాలు, గణితం, కొలతలు, పర్యావరణం, జంతువులు, పక్షులు, సైన్స్కు సంబంధించిన అంశాల ను ఇందులో ప్రదర్శించనున్నారు. ఈ మేళాతో ఆ యా పాఠశాలల ఉపాధ్యాయులు ఏవిధంగా విద్యాబోధన చేస్తున్నారనే అంశాలు తెలియనున్నాయి. కొత్త అంశాలను ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలల్లో అమలు చేసే అవకాశం ఉంది. అయితే జిల్లా స్థాయిలో నిర్వహించే మేళా కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మేళా నిర్వహణ, భోజనం ఖర్చులను సమకూర్చనుంది. -
యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో యూనివర్సిటీ ఏ ర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ తెలిపినట్లు యూనివర్సిటీ సాధన సమితి కన్వీనర్ బద్దం పురుషోత్తంరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. జిల్లాలో యూనివర్సిటీ ఆవశ్యకతను ఎంపీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, వర్సిటీ సాధన పోరాటానికి మద్దతు తెలిపి పార్లమెంట్లో గళం వినిపించాలని కోరి నట్లు తెలిపారు. ఈ మేరకు ఎంపీ సానుకూలంగా స్పందించారని, పూర్తి మద్దతు ఉంటుందని తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఇక్కడ కనిపిస్తున్నది బజార్హత్నూర్ మండలం దేగామ గ్రామంలో ఉన్న ఆయుర్వేద వైద్యశాల. నాలుగేళ్లుగా వైద్యుడి నియామకం లేక ఆస్పత్రి ఇలా మూతపడి దర్శనిమిస్తోంది. ఫలితంగా ఈ ప్రాంత ప్రజలకు ఆయుర్వేద సేవలు అందకుండా పోయాయి. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగ
ఇచ్చోడ: ఆయుష్ వైద్యం జిల్లా ప్రజలకు అందని దాక్షగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఆయుర్వేద, హోమిమోపతి(ఎన్ఆర్హెచ్ఎం) ఆసుపత్రులు 15 ఉన్నాయి. వీటిలో ఆరు ఆస్పత్రుల్లో మాత్రమే వై ద్యులు ఉండగా తొమ్మిదిచోట్ల వైద్యులు, సిబ్బంది లేక మూతపడ్డాయి. ఏళ్లుగా వైద్యుల పోస్టులు భర్తీ కావడం లేదు. ఓ పక్క అల్లోపతి వైద్యం ఖరీదు కా వడం, తరచూ మాత్రలు వాడే వారు సైడ్ఎఫెక్ట్కు గురవుతుండడంతో పలువురు ఆయుర్వేద, హోమి యోపతి వైద్యం వైపు మళ్లుతున్నారు. ఈ వైద్యంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. అయితే జిల్లా వ్యాప్తంగా మెజార్టీ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు ఆయుష్ సేవలు అంతంత మాత్రమే అందుతున్నాయి. ఏళ్ల నుంచి డాక్టర్లు లేరు.. జిల్లా వ్యాప్తంగా ఆయుర్వేద, హోమియోపతి ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు. సొనాల ఆస్పత్రిలో వైద్యుడు, సిబ్బంది పోస్టులు రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. అలాగే నార్నూర్లో వైద్యుడి పోస్టు ఏడేళ్లుగా ఖాళీగా ఉంది. ఇక బేల, జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, ఝరి, ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్, తాంసి, నేరడిగొండ మండలకేంద్రాలతో పాటు వాంకిడిలో ఉన్న ఆస్పత్రులకు సైతం వైద్యులు కరువయ్యారు. వైద్యులు, సిబ్బంది కరువు మూతపడుతున్న ఆయుర్వేద ఆస్పత్రులు ఆయుర్వేద, హోమియోపతి సేవలకు బ్రేక్జిల్లాలో.. హోమియోపతి, ఆయుర్వేద ఆస్పత్రులు 15 ప్రస్తుతం సేవలందిస్తున్న వైద్యుల సంఖ్య 6 ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు 9ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యపోస్టుల భర్తీ కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం ఖాళీలు ఉన్న చోట కొంత మందికి ఆదనపు బాధ్యతలు అప్పగించాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – ప్రీతల్ రాథోడ్, డీపీఎం -
● ఆగని రైతుల బలవన్మరణాలు ● పెట్టుబడి పెరిగి.. దిగుబడి తగ్గి ● ఈ ఏడాది ఇప్పటికే 17 ఆత్మహత్యలు ● రోడ్డున పడుతున్న బాధిత కుటుంబాలు
జిల్లాలో ఈ ఏడాది రైతుల ఆత్మహత్యల వివరాలు.. ● జనవరి 4న తలమడుగు మండలంలోని ఝరి గ్రామానికి చెందిన గడ్డం పోతారెడ్డి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● జనవరి 11న ఇంద్రవెల్లి మండలం పిప్పిరికి చెందిన కినక శంకర్ రుణమాఫీ రెన్యూవల్ కాకపోవడం, సాగుకు తెచ్చిన అప్పులు పెరగడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ● జనవరి 18న సాత్నాల మండలంలోని రేణుగూడకు చెందిన రైతు దేవ్రావు బ్యాంక్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● జనవరి 19న ఉట్నూర్లోని సేవదాస్నగర్కు చెందిన రాథోడ్ గోకుల్ కౌలు రైతు పంట దిగుబడి లేక కౌలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ● జనవరి 23న బేల మండలంలోని శంషాబాద్కు చెందిన కోడే గోవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ● జనవరి 25న బజార్హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్కు చెందిన మైల నర్సయ్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంది పంటను అడవి పందులు ధ్వంసం చేయడం, అప్పులు పెరగడంతో తనువు చాలించుకున్నాడు. ● ఫిబ్రవరి 18న సాత్నాల మండలంలోని పార్డి(కె)కు చెందిన రైతు బోడ గిరి రాజు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మూడెకరాల్లో జొన్న సాగు చేయగా నీరందక పంట ఎండిపోయింది. అప్పులు పెరగడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● నేరడిగొండ మండలంలోని వడూర్కు చెందిన ఈదాపు పోశెట్టి–ఈదారపు ఇందిర భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మార్చి 5న భర్త చనిపోగా, 7న భార్య చనిపోయింది. పంటకు తెచ్చిన అప్పులు పెరగడంతో అఘాయిత్యానికి పాల్పడ్డారు. ● తలమడుగు మండలంలోని సుంకిడికి చెందిన రైతు కుమ్మరి లింగన్న మార్చిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ● మార్చి28న బజార్హత్నూర్ మండలంలోని దేగామకు చెందిన మేకు విఠల్ పత్తి పంట దిగుబడి రాక, రుణమాఫీ కాక, మాడిగేజ్ లోన్, పంట రుణాలు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● ఏప్రిల్ 12న గుడిహత్నూర్ మండలం గురుజ గ్రామానికి చెందిన కుమ్ర గోవింద్ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● మే 19న సాత్నాల మండలం సుందగిరికి చెందిన కొక్కుల లస్మన్న పత్తి, సోయా పంటల దిగుబడి రాక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● జూన్ 3న ఉట్నూర్ మండలం శంభుగూడకు చెందిన షెడ్మకి పులాజీరామ్ అనే రైతు ప్రైవేట్ అప్పులు, బ్యాంకు రుణాలు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● జూన్ 27న తాంసి మండలం జామిడికి చెందిన మునేశ్వర్ అరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● జూలై 20న తలమడుగు మండలం కుచులాపూర్కు చెందిన సంతోష్ యాదవ్ రుణమాఫీ కాకపోవడం, పంటదిగుబడి రాకపోవడం, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● ఆగస్టు 5న బజార్హత్నూర్కు చెందిన రైతు పడిపెల్లి విలాస్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కారణాలెన్నో.. రైతులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతినడం, ప్రభుత్వాల నుంచి పరిహారం అందకపోవడం, ఆశించిన దిగుబడి రాకపోవడం, పంట కోసం తెచ్చిన అప్పులు తీరకపోవడం, మెట్ట ప్రాంతాల్లో నీటి వసతులు లేకపోవడం, మార్కెట్లో దళారులు, వ్యాపారులు మోసం చేయడం వంటివి ఉంటున్నాయి. అలాగే పంటలు పండినా గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రైవేట్ దళారుల నుంచి తీసుకున్న అప్పులకు ఇబ్బందులు పెట్టడం, నకిలీ ఎరువులు, విత్తనాలతో పంటలు పండకపోవడం తదితర కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవో 194 అమలు చేయాలి.. ఆత్మహత్యలతో సమస్య పరిష్కారం కాదు. బతికి సాధించాలి. ప్రభుత్వం జీవో నం.194 అమలు చేయాలి. మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.6లక్షల పరిహారం చెల్లించాలి. మరణించిన రైతు కుటుంబంలో ఒకరికి రూ.5వేల పింఛన్ ఇవ్వాలి. వారి పిల్లలకు ఉచితంగా చదువులు, వైద్యం అందించాలి. డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలి. ప్రభుత్వ చిరు ధాన్యాలను ప్రోత్సహించాలి. ఆత్మహత్యలు చేసుకోకుండా అవగాహన కల్పించాలి. – బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు -
ఆదివాసీ యువతకు ఉపాధి కల్పించాలి
● టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ కైలాస్నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆది వాసీల కు రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేస్తూ ఏజెన్సీలో గిరిజన యువతకు ఉపాధి అవకా శాలు కల్పించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని టీఏజీఎస్, టీఏవీఎస్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను వనవాసీలుగా చిత్రీ కరించేందుకు చూస్తుందన్నారు. ఆదివాసీలు వనవాసీలు కాదని, ఈ దేశ మూలవాసులు అనే విషయాన్ని గ్రహించాలన్నారు. అలాగే ఆదివాసీ లను అడవికి దూరం చేసే విధానాలు మానుకోవాలన్నా రు.ఏజెన్సీలో జీవో3ను పునరుద్ధరించాలని, 1/70, పిసా, చట్టాలను పక్కాగా అమలు చేయాలని డి మాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.కార్యక్రమంలో జన విజ్ఞాన వేది క రాష్ట్ర కార్యదర్శి నూతల రవీందర్ రెడ్డి, వ్యవసా య కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, టీఏవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం తనుష్, నాయకులు ఉయిక విష్ణు, మడవి నాగోరా వ్, కొట్నాక్ పుష్పలత, కొట్నాక్ సక్కు, కుమ్ర భీంరావు, నర్మద, మానిక్రావు పాల్గొన్నారు. -
‘సంక్షేమ’ తిప్పలు!
● ప్రభుత్వ పథకాల కోసం పాత మండలాలకే.. ● కొత్త మండలాల్లో అందుబాటులోకి రాని సేవలు ● జిల్లాలోని 46 గ్రామాల ప్రజలకు అవస్థలు కై లాస్నగర్: తెల్లరేషన్ కార్డు కలిగిన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం ద్వారా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగిన వారికి రూ.500కే సిలిండర్, 200 యూని ట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి గృహజ్యోతి కింద ఉచిత కరెంట్ అందిస్తోంది. ఈ పథకాలకు అర్హులైనప్పటికీ రేషన్కార్డులు లేకపోవడంతో జిల్లాలో చాలామంది పేదలు ఇన్ని రోజులు సంక్షేమ లబ్ధికి దూరమయ్యారు. ప్రభుత్వం ఇటీవల కొత్త కార్డులు జారీ చేయడంతో వీరికి అవకాశం లభించింది. దీంతో కార్డులు పొందిన వారు తమ మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను ఆశ్రయించి వివరాలు నమోదు చేయించుకుంటున్నారు. అయితే కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో మాత్రం ఈ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎంపీడీవో కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ ఆయా పథకాల లబ్ధి కోసం పాత మండలానికే పయనమవ్వాల్సిన పరిస్థితి. దీంతో పేదలకు వ్యయ, ప్రయాసలు తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మూడు మండలాల్లో ఇదే పరిస్థితి.. జిల్లాలో ఇటీవల సాత్నాల, భోరజ్, సొనాల మండలాలు కొత్తగా ఏర్పడిన విషయం విదితమే. సొనాల మండలంలో 12 గ్రామాలు ఉండగా, సాత్నాలలో 17, భోరజ్లో 17 గ్రామాలు కలిపి మూడు మండలాల పరిధిలో 46 గ్రామాలు ఉన్నాయి. ఈ మండలాల్లో ప్రభుత్వ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయా గ్రామాల్లోని కొత్తగా రేషన్ కార్డులు కలిగిన అర్హులైన వారంతా తిరిగి తమ పాత మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. సాత్నాల మండల వాసులు ఆదిలాబాద్ రూరల్, బేల, జైనథ్కు వెళ్లాల్సి రాగా.. భోరజ్ మండల వాసులు జైనథ్కు, సొనాల మండలవాసులు బోథ్ మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. అయితే కొత్త మండలాల్లో ఎంపీడీవోలు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్నప్పటికీ ప్రజాపాలన కేంద్రాల నిర్వహణకు అవసరమైన లాగిన్లను ప్రభుత్వం ఇంకా కేటాయించలేదు. దీంతో అక్కడ దరఖాస్తులను స్వీకరించే అవకాశం లేకుండా పోయింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికే ... ప్రభుత్వం గతంలో నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికే రాయితీ పథకాలను ప్రభుత్వం వర్తింపజేస్తోంది. కొత్తగా రేషన్కార్డులు పొందిన వారు ప్రజాపాలన రశీదుతో పాటు ఉచిత విద్యుత్ కోసమైతే విద్యుత్ బిల్లు, కుటుంబీకుల ఆధార్ జిరాక్స్ ప్రతులను అందజేయాల్సి ఉంటుంది. అలాగే రూ.500 సిలిండర్ పథకం కోసమైతే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీ నమోదు చేసుకుని ఉండాలి. వీటి కోసం ప్రస్తుతం ఆయా మండలాల వాసులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వానికి పంపించాం కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లాగిన్లు కేటాయించినప్పటికీ ప్రజాపాలన కేంద్రాల లాగిన్లను ఇంకా ఇవ్వలేదు. వాటి కోసం ప్రభుత్వానికి సీజీజీ ద్వారా ప్రతిపాదనలు పంపించాం. వాటిని కేటాయించేలా ఫాలోఅప్ చేస్తున్నాం. త్వరలోనే ఆయా మండలాలకు లాగిన్లు కేటాయించే అవకాశముంది. అప్పటి వరకు అర్హులైన వారికి పాత మండలాల్లోనే ఆయా సేవలను అందిస్తున్నాం. – జి.జితేందర్ రెడ్డి, జెడ్పీసీఈవో -
సీఎం దృష్టికి తీసుకెళ్లాను..
యూనివర్సిటీ ఏర్పాటు డిమాండ్ జిల్లావాసుల్లో సుదీర్ఘకాలం నుంచి వ్యక్తమవుతుంది. అది న్యాయబద్దమైంది కూడా. ఇదే అంశాన్ని నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. జిల్లాలో విశ్వవిద్యాలయ ఆవశ్యకతను సీఎంకు వివరించాను. ప్రజల డిమాండ్, జిల్లా అవసరాలకు అనుగుణంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిందే. ఇందుకోసం నా వంతుగా అన్నివిధాలా కృషి చేస్తా. జిల్లాకు న్యాయం జరిగేలా చూస్తాను. – వెడ్మ బొజ్జుపటేల్, ఎమ్మెల్యే, ఖానాపూర్ -
ఆదివాసీ మహిళకు ప్రశంస
బోథ్: మండలంలోని బాబెర గ్రామానికి చెంది న స్వచ్ఛగృహి అవార్డుగ్రహీత ఆదివాసీ మ హి ళ ఆత్రం సుశీల ఉత్తమ ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన కార్యక్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో అవార్డులు పొందిన వా రిని సన్మానించారు. కార్యక్రమానికి జిల్లా నుంచి సుశీలకు ఆహ్వానం అందింది. శనివారం భోపాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గతంలో ఈమె గవర్నర్ చేతుల మీదుగా స్వచ్ఛగృహి అవార్డు అందుకున్నారు. -
రాఖీ కట్టి.. శుభాకాంక్షలు చెప్పి
ఎమ్మెల్యే శంకర్కు రాఖీ కడుతూ..తమ్ముడికి రాఖీ కడుతున్న అక్క ఎంపీ గొడం నగేశ్కు రాఖీ కడుతున్న సోదరీమణి..సోదర, సోదరీమణుల మధ్య ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ వేడుకలను జిల్లా వాసులు శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. రాఖీలు కట్టిన అక్కాచెల్లెళ్లకు అండగా ఉంటామని సోదరులు అభయమిచ్చారు. ఎంపీ గోడం నగేశ్కు స్వగ్రామమైన జాతర్లలోని నివాసంలో ఆయన సోదరీమణులు కృష్ణకళ, కమలబాయిలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో ఆయన సోదరీమణులు రాఖీలు కట్టారు. నేరడిగొండలో ఎమ్మెల్యే అనిల్జాదవ్ నివాసంలో ఆయన సోదరీమణులు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. – ఆదిలాబాద్/బజార్హత్నూర్ -
కుమురంభీం స్ఫూర్తితో పని చేయాలి
ఆదిలాబాద్రూరల్: జల్, జంగల్, జమీన్ కోసం పో రాటం చేసిన కుమురంభీంను స్ఫూర్తిగా తీసుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీలు పని చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను హీరా సుకా ఆది వాసీ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హీరా సుకా దేవస్థానం వద్ద శనివారం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నా రు. కుమురంభీం, రాంజీగోండ్, బీర్సాముండా వి గ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఆదివాసీలతో కలిసి సంప్రదాయ థింసా నృత్యం చేశారు. రక్షాబంధన్ సందర్భంగా ఆదివాసీ మహిళలు కలెక్టర్, ఎస్పీలకు రాఖీలు కట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు సి డాం రాంకిషన్, నాయకులు కుర్సేంగే తానాజీ, షె డ్మకి గోద్రు, గోడం లక్ష్మణ్, మెస్రం శంకర్, కుర్సేంగే యాదవ్రావ్, సుభాష్, మనోహర్, ప్రకాశ్, వనితబాయి, గీత, అనుసూయ, సంగీత పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం -
● యూనివర్సిటీ సాధనకు అన్ని విధాలా ప్రయత్నిస్తాం ● జిల్లాలో ఉన్నత విద్యావకాశాల కల్పనకు కృషి చేస్తాం ● జిల్లావాసులకు భరోసానిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు
జిల్లాలో విశ్వవిద్యాలయ సాధన కోసం ఈ ప్రాంతవాసులు గొంతెత్తి నినదిస్తున్నారు. ‘సాక్షి’ డిబెట్తో ఏర్పడిన యూనివర్సిటీ సాధన సమితి ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణతో ముందడుగు వేసింది. ఉద్యమబాట పట్టింది. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఇప్పటి వరకు జరిగిన నష్టంపై విద్యార్థులు, నిరుద్యోగులకు అవగా హన కల్పిస్తోంది. వర్సిటీ ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతోంది. విద్యావంతులు, మేధావులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతుండగా.. ప్రజాప్రతినిధులు సైతం అండగా ఉంటామంటున్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో తాము భాగస్వాములమవుతామని పేర్కొంటున్నారు. వర్సిటీ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. – కై లాస్నగర్/బజార్హత్నూర్ -
జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు ఏ చిన్న పనికైనా 300 కిలోమీటర్ల దూరంలో గల వరంగల్కు వెళ్లి రావాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థులకు సమయం వృథాతో పాటు దూరభారం అవుతుంది. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే అధిక సంఖ్యలో గిరి జనులు, గిరిజనేతర విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించే అవకాశం ఉంటుంది. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తాను. అలాగే జిల్లాలో నవోదయ ఏర్పాటుకు కూడా ప్రయత్నం చేస్తున్నాను. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ -
అడవి బిడ్డలు.. సంస్కృతి రక్షకులు
● సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ● యాస.. భాష పరిరక్షణకు చర్యలు ● భావితరాలకు అందించే యత్నం ● నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంఇంద్రవెల్లి/ఉట్నూర్రూరల్: సంస్కృతి, సంప్రదాయాలకు ఆదివాసీ గిరిజనులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొండ, కోనల నడుమ ప్రకృతితో మమేకమవుతున్నారు. ప్రకృతిని దైవంగా భావించి జీవనం సాగిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార, వ్యవహారాలను పాటిస్తూ వాటిని భావితరాలకు అందిస్తున్నారు. ఏ పని చేసినా, ఈ కార్యం తలపెట్టినా ముందుగా ప్రకృతి దేవతలకు పూజలు చేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. వనదేవతలకు పూజలు చేశాకే సాగు పనులు ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలాం, తోటి, నాయక్పోడ్, గోండు, పర్ధాన్, అంధ్, లంబాడీ తెగలుగా ఉన్న ఆదివాసీ గిరిజనులు ప్రతీ పండుగ, కుల దేవతల పూజలు, పెళ్లి వేడుకలు ఇలా ఏవైనా వారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా వైభవంగా నిర్వహిస్తారు. ఆదివాసీ తెగలు.. పండుగలుగోండు, కొలాం, పర్ధాన్, తోటి ఆదివాసీ తెగలవారు కుల దేవతలతోపాటు ప్రకృతి దేవతలను ఆరాధిస్తారు. ఏ పూజ చేసినా.. తరతరాలుగా గ్రామస్తులంతా సామూహికంగా చేసే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆషాఢ మాసం ప్రారంభంలో అకాడి (వన దేవత) పూజలతో మొదలుకుని నాలుగు నెలలపాటు యేత్మసుర్ దేవతలను ఆరాధిస్తారు. శ్రావణ మాసానికి ముందు గావ్ సాత్ పేరుతో పోచమ్మ తల్లికి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో నెలపాటు గ్రామ దేవతలు శివ బోడి, నొవోంగ్ పూజలను ఘనంగా నిర్వహిస్తారు. దీపావళి సందర్భంగా యేత్మసుర్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుస్సాడీ వేషధారణలతో వారంపాటు సంప్రదాయ వాయిద్యాల మధ్య డండారీ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. వైశాఖ, పుష్య మాసాల్లో సంవత్సరానికి రెండుసార్లు కులదేవతలైన జంగుబాయి, పెర్సాపేన్, భీందేవుడి పూజలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. పుష్యమాసంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన, రాష్ట్రంలో రెండో పండుగైన నాగోబా మహాపూజ, నాగోబా జాతరను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెస్రం వంశీయులు ఘనంగా నిర్వహిస్తారు. అంద్ సమాజ్ ఆదివాసీలు తమ కులగురువు శ్రీశ్రీ సంత్ సద్గురు పులాజీబాబాను ఆరాధిస్తారు. వారివారి గ్రామాల్లో నిర్మించిన ధ్యాన్ మందిరాల్లో ప్రతీ సంవత్సరం వార్షికోత్సవ పూజలు చేస్తారు. నాగుల పంచమి మరుసటిరోజు శీరల్ దేవత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అంధ్ ఆదివాసీ సమాజ్ వారి వివాహాలు పులాజీబాబా ధ్యాన్ మందిరాల్లో సామూహికంగా జరిపిస్తారు. నాయక్పోడ్ ఆదివాసీ భీమన్న దేవుడిని ఆరాధ్యదైవంగా కొలిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లంబాడా గిరిజనులు కులగురువు సంత్ సేవలాల్ మహరాజ్ను ఆరాధించడంతో పాటు ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి తరువాత వారంపాటు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. ప్రతిరోజూ గ్రామాల్లోని ఆలయాల్లో సేవాలాల్, జగదాంబదేవిని ఆరాధిస్తారు. యాస.. భాషకు డిజిటల్ రూపం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు మాట్లాడే యాస.. భాష.. సంస్కృతిని డిజిటల్ రూపంలో భద్రపర్చడానికి బోలి చేతో (భాష–చైతన్యం) ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చెరిగిపోకుండా భావితరాలకు అందించడానికి గోండి, కొలామీ భాషలో వికీపీడియా, విక్షనరీలను అంతర్జాలంలో భద్రపర్చి భావితరాలకు భాష, సాహిత్య సంపదను అందించడానికి కార్యశాల నిర్వహిస్తూ ఆదివాసీ యువకులను ప్రోత్సహిస్తోంది. – ఆత్రం మోతీరాం, బోలిచేతో ఫౌండేషన్ బోర్డు సభ్యుడువాయిద్యాలు.. ప్రత్యేకతలుగోండులు పెర్స్పెన్ పండుగలో దండారీ డప్పు ల దరువులతో తుడుం వాయిద్యాన్ని నిర్వహిస్తుంటారు. కొలాంలు పోలకమ్మ పండుగ, భీమయ్యక్ ఉత్సవం (సట్టి దెయ్యాల్), దండారీ, దసరా పండుగల్లో మోగిస్తుండగా, గోండులు జంగుబాయి, పెర్స్పెన్, దండారీ ఉత్సవాల్లో తుడుంను డోలుకు సహ వాయిద్యంగా మోగిస్తుంటారు. అలాగే డెంసా నృత్యాలు చేస్తుంటారు. ఆదివాసీ లకు ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతి, సంప్రదాయాలు వారసత్వంగా వస్తున్నాయి. తుడుంను పురుషవాద్యంగా భావిస్తారు. ఈ సంగీత వాద్యాన్ని పూజా కార్యక్రమంలో ఉంచి పూజిస్తారు. ఆదివాసీల చైతన్యానికి ‘తుడుం’ ఒక సంకేతంగా నిలిచింది. ఆదివాసీ ఉద్యమాల్లో ర్యాలీ, ధర్నా లాంటి నిరసన కార్యక్రమాల్లో ‘తుడుం’ మోగిస్తుంటారు. గోండి పూజారులైన ప్రధాన్లు, తోటి తమ తెగ ఆచారాన్ని పాటిస్తూ జరిపే మత క్రతువులు, కర్మకాంఢలు, వివాహాలు, చావుల సందర్భంలో దీనిని వాయిస్తారు. గోండి సంప్రదాయాలు, గౌరవానికి ఇది సంకేతం. కిక్రితో పాటు ‘పెప్రే’ అనే రెండు సన్నాయి వాయిద్యాలు, డక్కి అనే చర్మవాయిద్యం అన్నీ కలిసి సామూహికంగా వాయిస్తారు. డోలు లేని ఆదివాసీ ఊరు ఉండదు. డోలు వాయిద్యానికి ప్రత్యేకమైన జానపద గేయాలు, నృత్యాలు ఉంటాయి. హోలీ, వివాహ వేడుకలకు డోలు నృత్యాలతో కళాకారులు అలరిస్తుంటారు. ఆదివాసీ వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాల సందర్భంగా దీనిని వాయిస్తారు. డోలును వివాహ వేడుకల సందర్భంగా రాత్రి వేళ నృత్యాలు చేయడానికి వినియోగిస్తుంటారు. ఒక్కో సందర్భంలో ఒక గ్రామంతో మరో గ్రామం మధ్య పాటల పోటీలు జరుగుతుంటాయి. డోలు వాయిస్తూ పురుషులు సీ్త్ర వేషధారణలో, ఒకరు జోకర్గా నృత్యాలు చేస్తుంటారు. -
ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఒకరి మృతి
భైంసారూరల్: భైంసా–నిర్మల్ జాతీయ రహదారి మాటేగాం సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ద్విచక్రవాహనంతో ఢీకొని యశ్వంత్ (21) అనే యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పేండ్పెల్లి గ్రామానికి చెందిన యశ్వంత్, కుంసర గ్రామానికి చెందిన విలాస్ శుక్రవారం భైంసాకు వచ్చారు. పనులు ముగించుకుని భైంసా నుంచి ద్విచక్రవాహనంపై పేండ్పెల్లికి వెళ్తున్నారు. మాటేగాం గ్రామ సమీపంలో రోడ్డుపై ట్రాక్టర్ ట్రాలీ ఫంక్షర్ కావడంతో అక్కడే నిలిపి ఉంచారు. రోడ్డుపై ఉన్న ట్రాలీని వీరు ద్విచక్రవాహనంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయాలపాలైన క్షతగాత్రులను 108లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా పేండ్పెల్లికి చెందిన యశ్వంత్ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కుభీర్: మండలంలోని పార్డి (బీ) గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగశివుని తండాకు చెందిన పవార్ సచిన్ అనే యువకుడు మృతి చెందాడు. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సచిన్ తన బైక్పై సాయంత్రం కుభీర్ సంతకు వస్తుండగా పార్డి(బీ) సమీపంలో పంది తగిలి క్రిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం అతడిని భైంసాకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తరలిస్తుండగా మృతి చెందాడు. అతడి భార్య సిమ్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కూతురు, తల్లితండ్రులు ఉన్నారు. గడ్డి మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య భైంసారూరల్: మండలంలోని బడ్గాం గ్రామానికి చెందిన షానే మరీబా (84) అనే వృద్ధుడు గడ్డి మందు తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. షానే మరీబా భార్య ఏడాది క్రితం మృతి చెందింది. అప్పటినుంచి కుమారుడి వద్ద ఉంటున్నాడు. ఒంటరి తనం భరించలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే భైంసా ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడు పరమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పుల బాధతో మహిళ.. కాసిపేట: మండలంలోని దేవాపూర్ ప్రసన్నాంజనేయనగర్కు చెందిన గంగాధరి వాణి(44) అనే మహిళ అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం దేవాపూర్కు చెందిన శంకర్తో వాణి వివాహం జరిగింది. కొంతకాలంగా శంకర్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో వాణి టైలరింగ్ పని చేస్తూ ఇంటి భారాన్ని మోసింది. తనకు వచ్చే డబ్బులు సరిపోకపోవడం, అప్పులు ఉండడంతో మనోవేదనకు గురై ఈనెల 6న మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. గమనించిన భర్త వెంటనే గ్రామంలోని కంపెనీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పరిస్థితి విషమించగా కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తుండగా రాత్రి మృతిచెందింది. మృతురాలికి 11 ఏళ్ల కొడుకు విజ్ఞతేజ్ ఉన్నాడు. మృతురాలి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
స్వర్ణ ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత
సారంగపూర్: మహారాష్ట్రలో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు స్వర్ణ ప్రాజెక్ట్లోకి భారీగా వరదనీరు చేరడంతో అధికారులు మూడో గేటు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు (1.484 టీఎంసీలు) కాగా, ఉదయం 6గంటల వరకు ఏకంగా 80వేల క్యూసెక్కులు రావడంతో 1,182.5 అడుగులకు చేరింది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ మూడో గేటు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు నీటిని వదిలారు. ప్రస్తుతం 1,182.5 అడుగుల వద్ద నీటిమట్టం స్థిరంగా ఉంచామని ఏఈ మధుపాల్ తెలిపారు. -
బాలికల గురుకులంలో చొరబడిన నలుగురి అరెస్ట్
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లిలోని ప్రభు త్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకు ల విద్యాలయంలో బుధవారం అర్థరాత్రి అక్రమంగా చొరబడి విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేసిన నలుగురిని శుక్రవారం తాళ్లగురిజాల పోలీసులు అరెస్ట్ చేశారు. తాళ్లగురిజాల ఎస్సై రా మకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బె ల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రా మానికి చెందిన దుగుట సంజయ్, కో నూరి కిరణ్, కన్నెపల్లి మండలం చర్లపల్లి, ఎల్లారం గ్రామాలకు చెందిన గొల్లపల్లి కిరణ్, కొజ్జన కిరణ్ మద్యం మత్తులో బాలికల గురుకుల విద్యాలయంలో అక్రమంగా చొరబడ్డారు. కేకలు వేస్తూ, బూతులు తిడుతూ విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కోనూరి కిరణ్ పట్టుబడగా ముగ్గురు పారిపోయారు. అక్రమంగా విద్యాలయంలో చొరబడిన ఘటనపై విద్యాలయ ప్రిన్సిపాల్ నిరుపమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మద్యం, గంజాయి మత్తులో యువత ఇష్టారీతిన వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళ అనుమానాస్పదంగా తిరిగి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. రాత్రి వేళ గస్తీ, భద్రతను ముమ్మరం చేసినట్లు తెలిపారు. -
పోడు కోసం పోరు
తాండూర్: దశాబ్దాలుగా పోడు భూములు సాగుచేసుకుంటున్న తమకు వాటిపై హక్కులు కల్పించాలని రైతులు పోరుబాట పట్టారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన సుమారు 40మంది రైతులు మూడురోజుల క్రితం చేపట్టిన పాదయాత్ర గురువారం రాత్రి తాండూర్కు చేరుకుంది. మండలంలోని రేపల్లెవాడ సమీపంలోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సేద తీరిన అనంతరం శుక్రవారం తెల్లవారుజామున రైతులు తమ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా గ్రామ శివారులోని సుమారు 1,200 ఎకరాలను సాగు చేసుకుంటూ 600 కుటుంబాలవాళ్లం జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అటవీశాఖ అధికారులు వాటిని సాగు చేసుకోకుండా అడ్డుకున్నారని వాపోయారు. తమకు న్యాయం చేసి భూ హక్కు పత్రాలు ఇచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి సీఎం రేవంత్రెడ్డి, అటవీశాఖ మంత్రి, అధికారులకు తమ గోడు చెప్పుకొంటామని వారు పేర్కొన్నారు. -
గోండి, కొలామి భాష పరిరక్షణలో..
ఆదిలాబాద్ రూరల్: మావల మండలం వా ఘాపూర్ గ్రామానికి చెందిన గిరిజన ఉపాధ్యాయుడు తొడసం కై లాస్ గోండి, కొలామి భాషల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి రోబోటిక్ టెక్నాలజీ కంప్యూటర్ ద్వారా యాంకర్ను తయారు చేసి గోండి భాషలో వార్తలు చదివిస్తున్నారు. గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబా డా భాషల్లో వందలాది పాటలు రాసి ఏఐ లో పొందుపర్చారు. మహాభారత గ్రంథాన్ని తెలుగు లిపితో గోండి భాషలో అనువదించారు. 18 పర్వాలు నాలుగు నెలలపాటు అనువదించి వంద పుస్తకాలు ప్రచురితం చేశారు. మన్కీబాత్లో పీఎం మోదీ కై లాస్ను ప్రశంసించారు. అప్పటి కలెక్టర్లు దివ్యదేవరాజన్, దేవసేన, ప్రస్తుత కలెక్టర్ రాజర్షిషా కై లాస్ను అభినందించారు. -
ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి
ఆదిలాబాద్టౌన్: ఈ నెల 11న జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవం సందర్భంగా 1నుంచి 19 ఏళ్లవారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ సూచించారు. గురువారం డీఎంహెచ్వో కార్యాలయం నుంచి మెడికల్ ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నులిపురుగులతో విద్యార్థుల్లో ఎదుగుదల లోపిస్తుందని, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. డీఐవో డాక్టర్ వైసీ శ్రీనివాస్, జిల్లా మలేరియా నివారణాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నులిపురుగుల నిర్మూలనే ధ్యేయం నులిపురుగుల నిర్మూలనే ధ్యేయమని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పుత్లీబౌళి పట్టణ ఆరోగ్యకేంద్రంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యసిబ్బందితో సమావేశమై మాట్లాడారు. ఈ నెల 11న జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1నుంచి 19 ఏళ్లవారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
బియ్యం దుర్వినియోగం కానివ్వొద్దు
కైలాస్నగర్: పేదలు పస్తులుండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రూ.కోట్ల రాయితీ భరించి పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం మావల, ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్ మండలాల లబ్ధిదారులకు ఆహారభద్రత కార్డులు పంపిణీ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెవె న్యూ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, డీసీఎస్వో వాజీద్అలీతో కలిసి లబ్ధిదా రులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలోని అ ట్టడుగువర్గాలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అర్హులకే లబ్ధి చేకూర్చాలని సూచించారు. డబ్బులు డిమాండ్ చేసే దళా రులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని అధి కారులను ఆదేశించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. రేషన్ షాపుల్లో పంపిణీ చేసే పోషకాలతో కూడిన సన్నబియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. సన్నబియ్యం విక్రయించే లబ్ధిదారుల రేషన్కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ ని రంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కా ర్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్లు శ్రీనివా స్, గోవింద్, వేణుగోపాల్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ బాబుసింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
● కలెక్టర్ రాజర్షి షా ● కొత్త రేషన్కార్డుల పంపిణీ తలమడుగు: అర్హులందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫ లాలు అందించనున్నట్లు కలెక్టర్ రాజార్షి షా పేర్కొన్నారు. గురువారం మండలంలోని సుంకిడి గ్రామ రైతువేదికలో తాంసి, తలమడుగు మండలాల లబ్ధి దారులకు కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. అ నంతరం వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సుంకిడి జిల్లా పరిషత్ పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని, సుంకిడిలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ ఆత్మ చైర్మన్ అశోక్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి జరుగుతోందని చెబుతుండగా బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ అంశంపై ఎమ్మెల్యే, డీసీసీబీ చై ర్మన్ ఆడ్డి బోజారెడ్డి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే అనిల్జాదవ్ జోక్యం చేసుకుని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను సము దాయించగా గొడవ సద్దుమణిగింది. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, తాంసి, తలమడుగు తహసీల్దా ర్లు లక్ష్మి, రాజ్మోహన్, ఎంపీడీవో శంకర్, ఝరి పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు వెంకటేశ్, శ్రీనివాస్రెడ్డి, కిరణ్కుమార్, కేదారేశ్వర్రెడ్డి, ప్రకాశ్, వామన్ తదితరులు పాల్గొన్నారు. అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి ఆదిలాబాద్టౌన్: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ప్ర భుత్వ డైట్ కళాశాలలో గురువారం ఉల్లాస్ నవభా రత్ సాక్షరత జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలవారు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి నిరక్షరాస్యుల వివరాలు సేకరించాలని సూచించారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన ఆర్పీలు వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని తెలిపా రు. జిల్లాలో 1,192 మంది వలంటీర్లు చదువు చె ప్పేందుకు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పే ర్కొన్నారు. వీరు 26,312 మందికి చదువు నేర్పించాల్సి ఉందని తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత శా తం 66 ఉందని, వంద శాతానికి చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. వయోజనవిద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాల వి ద్యార్థులు జనగాం వేదికగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జావెలిన్త్రో పోటీల్లో సత్తా చాటారు. కిడ్స్ విభాగంలో ప్రతిభ కనబరిచిన వీ దీక్షిత బంగారు, ఎం.హన్మంతు రజత పతకాలు సా ధించినట్లు కోచ్ రమేశ్ తెలిపారు. వీరిని డీవైఎస్వో శ్రీనివాస్ అభినందించారు. బజార్హత్నూర్: ఈ నెల 5, 6 తేదీల్లో భైంసా పట్టణంలోని క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఖోఖో అండర్–11 విభాగంలో మండల కేంద్రంలోని సరస్వతీ శి శుమందిర్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతి భ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. క్రీడాకారులను గురువారం ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ, పాఠశాల ప్రబంధకారిణి స భ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిఆదిలాబాద్టౌన్: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ సూచించారు. గురువారం డీఎంహెచ్వో కార్యాలయంలో కీటకజనిత వ్యా ధుల నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. బ్రీడింగ్ చెక్కర్స్ ఆయా కాలనీల్లో పర్యవేక్షించాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా చూడాలని సూచించారు. నీటి నిల్వతో డెంగీ, మలేరియా ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా మలేరియా నివారణాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘రాఖీ’ సందడి
ఆదిలాబాద్: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ సందడి జిల్లాలో మొదలైంది. ఈ నెల 9వ రాఖీ పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతం కొనుగోలు దారులతో కిక్కిరిసిపోతోంది. దస్నాపూర్, కలెక్టరేట్ చౌక్, వినాయక చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, రైతు బజార్ ఏరియా, రద్దీగా ఉండే వి విధ ప్రాంతాల్లోనూ రాఖీ దుకాణాలు వెలిశాయి. వి విధ డిజైన్లలో రూ.10 నుంచి రూ.500 ధర కలిగిన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ దూది బొండాలతో పాటు లాకెట్, రుద్రాక్ష, ము త్యాలు, రంగుల రాళ్లు, జరీ రాఖీలు ఎక్కువగా అ మ్ముడుపోతున్నాయి. చిన్నారులు మెచ్చేలా కార్టూన్ పాత్రలతో కూడిన రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా ని లుస్తున్నాయి. కాగా, పలువురు వెండి, బంగారు రాఖీల కోసం స్వర్ణకారులకు ఆర్డర్లు ఇస్తున్నారు. -
వర్షాభావమే..
సాక్షి, ఆదిలాబాద్: వరుణుడు ముఖం చాటేశాడు. ఈ నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా యి. అసలుకే వర్షాలు లేక ఎదుగుతున్న, పూత, కాత కాస్తున్న పంటలను చూసి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి వసతి ఉన్నవారు ఏదో రకంగా పంటలకు తడులు అందిస్తున్నారు. నీటి వసతిలేని రైతులు బిక్కచూపులు చూస్తున్నారు. సరైన సమయంలో పంటలకు నీటి తడులు అందక దిగుబడులపై దిగులు చెందుతున్నారు. లోటు దిశగా.. జిల్లాలో ఈ వానాకాలం సరైన వర్షాలు కురవలేదు. జూన్ రెండో వారంలోనే మంచి వర్షాలు కురిశాయి. మిగతా మూడు వారాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. జూలై మొదటి, రెండో వారంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. అయితే మూ డు, నాలుగో వారాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టులోనైతే ఇప్పటికీ తీవ్ర వర్షాభావమే కనిపిస్తోంది. మొత్తంగా ఈ వానాకాలం మొదలైన జూన్ నుంచి ఇప్పటివరకు 36 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. ఇందులో భారీ వర్షాలు అసలే లేవు. దీంతో ఇప్పటికీ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదు. మండలాల వారీగా పరిస్థితి జిల్లాలో 13 మండలాల్లో సాధారణ వర్షపాతం న మోదు కాగా, ఎనిమిది మండలాల్లో వర్షాభావ పరి స్థితులు నెలకొన్నాయి. భీంపూర్, జైనథ్, బేల, నా ర్నూర్, భోరజ్, తాంసి, తలమడుగు, బజార్హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఆదిలాబాద్రూర ల్, ఆదిలాబాద్అర్బన్, సాత్నాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. సొనాల, నేరడిగొండ, బోథ్, గాదిగూడ, ఉట్నూర్, మావల, సిరికొండ, ఇంద్రవెల్లిలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ముఖం చాటేసిన వర్షాలు పూత, కాత దశలో సోయా పంట స్ప్రింక్లర్లతో నీటిని అందిస్తున్న వైనం ఆందోళనలో నీటి వసతిలేని రైతులు జిల్లాలో వర్షపాతం వివరాలు (జూన్ 1నుంచి ఆగస్టు 7 వరకు) సాధారణం 618.1 మి.మీ.లు కురిసింది 499.7 మి.మీ.లు వ్యత్యాసం 19 శాతం తక్కువ ఈ రైతు పేరు సోమ ప్రవీణ్రెడ్డి. తాంసి శివారులో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తొమ్మిదెకరాల్లో పత్తి, అంతర పంటగా కంది, మూడెకరాల్లో సోయాబీన్ సాగు చేశాడు. పత్తి పంట ఎదిగే దశలో ఉండగా సోయా పూత, కాత దశకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో సోయా పంటకు నీటి తడులు అందించాల్సి ఉండగా వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో బోర్ల ద్వారా స్ప్రింక్లర్లకు పనిచెప్పాడు. ఈ విధానంలో మూడెకరాల్లోని సోయా పంటకు నీటిని అందిస్తున్నాడు.