కైలాస్నగర్: ప్రభుత్వం చేపట్టిన 99రోజుల ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చే యాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సూ చించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ము న్సిప ల్ కార్యాలయ సమావేశ మందిరంలో కార్యక్రమ విజయవంతంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి వార్డుల సందర్శన ప్రారంభమవుతుందని, వార్డుల్లోని సమస్యలు గుర్తించి వాటిని అ క్కడికక్కడే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. 49వార్డులకు సంబంధించిన పారిశుద్ధ్యం, వీధి దీపాలు, నీటి సమస్య, పెండింగ్ ఫైళ్లపై ప్రత్యే క దృష్టి సారించాలని, కాలనీలో నెలకొన్న సమస్యలపై పూర్తి నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు. వార్డు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదేశించారు. సమావేశంలో వైస్ చైర్మన్ రోహిత్, కమిషనర్ రాజు, ఆర్వో కళ్యాణ్, ఎంఈ అరుణ్కుమార్ తదితరులున్నారు.


