-
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా
మరో హిట్ సినిమా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓ పక్క థియేటర్లలో ఇంకా ఆడుతూనే ఉంది. ఇప్పుడు డిజిటల్గా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ.. ఓ విషయం మాత్రం నెటిజన్లకు షాకిస్తోంది. అది చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?'టిల్లు స్క్వేర్' సినిమాతో పాటు మార్చి 29న థియేటర్లలో రిలీజైన హాలీవుడ్ మూవీ 'గాడ్జిల్లా x కాంగ్: ద న్యూ ఎంపైర్'. గాడ్జిల్లా-కాంగ్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. వచ్చి చాలా రోజులవుతున్నప్పటికీ ఇప్పటికీ చాలా థియేటర్లలో ఆడుతోంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)బుక్ మై షో ఓటీటీలోకి తీసుకొచ్చారు గానీ ఉచితంగా మాత్రం స్ట్రీమింగ్ అందుబాటులో లేదు. ఈ సినిమా రెంట్ విధానంలో 4k క్వాలిటీతో చూడాలంటే రూ.549 చెల్లించాలి. పూర్తిగా కొని చూడాలంటే మాత్రం రూ.799 చెల్లించాలని క్లారిటీ ఇచ్చారు. ఇంగ్లీష్తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది.ఇక బుక్ మై షో ఓటీటీలో సోమవారం అందుబాటులోకి రాగా.. అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్లో మంగళవారం నుంచి రెంట్ విధానంలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా రూ.15 కోట్ల డాలర్ల బడ్జెట్ పెట్టగా.. రూ.52.4 కోట్ల డాలర్ల వసూళ్లు ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చాయి. దాదాపు మూడురెట్లు అనమాట.(ఇదీ చదవండి: స్టేజీపై నటిస్తూ కన్నుమూసిన ప్రముఖ నటుడు) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అయితే ఓటింగ్ ఎఫెక్ట్ వల్లనో ఏమో గానీ గత కొన్ని వారాల నుంచి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజ్ కాలేదు. ఈ వారం కూడా లెక్కప్రకారం విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ కావాలి. కానీ మే 31కి వాయిదా పడింది. దీంతో 'రాజు యాదవ్' అనే చిన్న మూవీ మాత్రమే రిలీజ్ అవుతోంది. 'అపరిచితుడు' సినిమా రీ రిలీజ్ అవుతోంది. ఇవి తప్పితే థియేటర్లు కళకళలాడే మూవీస్ అయితే ఏం లేవు. ఓటీటీలో మాత్రం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)ఓటీటీల్లోకి వస్తున్న వాటిలో 22కి పైగా సినిమాలు- వెబ్ సిరీసులు ఉన్నాయి. అయితే వీటిలో చోరుడు, గ్లాడ్జిల్లా X కాంగ్ అనే డబ్బింగ్ సినిమాలతో పాటు జర హట్కే జర బచ్కే, బస్తర్ అనే హిందీ సినిమాలు మాత్రమే ఉన్నంతలో కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మిగతా వాటి టాక్ రిలీజైతే గానీ తెలియదు. మరి ఓవరాల్గా ఏయే మూవీస్ ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లిస్టు (మే 13 నుంచి 19 వరకు)నెట్ఫ్లిక్స్ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ & స్కాండల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 15బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - మే 16మేడమ్ వెబ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 16పవర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 17ద 8 షో (కొరియన్ సిరీస్) - మే 17థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17 అమెజాన్ ప్రైమ్ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 1699 (ఇంగ్లీష్ సిరీస్) - మే 17హాట్స్టార్క్రాష్ (కొరియన్ సిరీస్) - మే 13చోరుడు (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 14అంకుల్ సంషిక్ (కొరియన్ సిరీస్) - మే 15బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) - మే 17 జీ5బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) - మే 17తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) - మే 17జియో సినిమాడిమోన్ స్లేయర్ (జపనీస్ సిరీస్) - మే 13C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - మే 14జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) - మే 17 బుక్ మై షోగాడ్జిల్లా X కాంగ్: ద న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 13 (ఆల్రెడీ స్ట్రీమింగ్) సోనీ లివ్లంపన్ (మరాఠీ సిరీస్) - మే 16ఆపిల్ ప్లస్ టీవీద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 17ఎమ్ఎక్స్ ప్లేయర్ఎల్లా (హిందీ సినిమా) - మే 17(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా) -
ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా
ఓ సినిమా థియేటర్లలో రిలీజైన రెండు మూడు వారాలకే ఓటీటీలోకి వస్తున్న రోజులివి. అలాంటిది ఈ మూవీ మాత్రం ఏకంగా ఏడాది తర్వాత ఇప్పుడు అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇప్పుడు అని కొన్నాళ్ల ముందు హడావుడి చేశారు. కానీ ఇన్నాళ్లకు స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో రిలీజ్ కానుంది?(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్)విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన సినిమా 'జర హట్కే జర బచ్కే'. రొమాంటిక్ కామెడీ బ్యాక్డ్రాప్తో తీసిన ఈ చిత్రం.. గతేడాది జూన్ లో థియేటర్లలో రిలీజైంది. ఇందులో 'తేరే వాస్తులే' అనే పాట అప్పట్లో తెగ పాపులర్ అయింది. రీల్స్ తెగ చేశారు. ఇక ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని జియో సినిమా దక్కించుకోగా... స్ట్రీమింగ్ మాత్రం ఇప్పుడు ఏడాది తర్వాత చేస్తోంది. మే 17 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. కపిల్ (విక్కీ కౌశల్), సౌమ్య (సారా) పెళ్లయిన కొత్త జంట. మిడిల్ క్లాస్ కుటుంబం కావడంతో వీళ్లకు బెడ్ రూమ్ ఇచ్చి, హాల్లో తల్లిదండ్రులు పడుకుంటూ ఉంటారు. అయితే భర్తతో సరదాగా గడుపుదామంటే అత్తమామ ఇంట్లోనే ఉన్నారని, కొత్తిల్లు తీసుకుందామని సౌమ్య అనుకుంటుంది. ఆవాస్ యోజన పథకం కోసం అప్లికేషన్ పెట్టడానికి వెళ్లి, అక్కడి అధికారితో కపిల్ గొడవపడతాడు. ఈ క్రమంలోనే విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: భయంకరమైన వ్యాధి.. అందరూ నన్ను దూరం పెట్టారు: హీరోయిన్)Sah-parivaar shaadi ki thi, ab sah-parivaar divorce bhi hoga! Toh aap sab #DivorceMeinZaroorAana 💔#ZaraHatkeZaraBachke streaming May 17 onwards, exclusively on JioCinema Premium. #ZHZBOnJioCinema #JioCinemaPremium@vickykaushal09 @SaraAliKhan pic.twitter.com/Vy4K5tLJDy— JioCinema (@JioCinema) May 12, 2024 -
The Marvels Movie Review: ది మార్వెల్స్ రివ్యూ.. 2 వేల కోట్ల లేడి సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే?
హాలీవుడ్ అంటేనే కళ్లు చెదిరే యాక్షన్ సీన్లతో దుమ్మురేపుతారు. అందులోనూ మార్వెల్ యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకుల అంచనాలు ఏ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రాంచైజ్లో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. ఇప్పటికే మార్వెల్స్ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్, కెప్టన్ మార్వెల్,ది అవెంజర్స్,బ్లాక్ పాంథర్ లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి.ఈ క్రమంలో నవంబర్ 10 2023న విడుదలైన 'ది మార్వెల్స్' తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందేబాటులో ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డీస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ముగ్గురు లేడి సూపర్ హీరోల కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాను రూ.2250 కోట్లతో నిర్మించారు. 2019లో వచ్చిన కెప్టెన్ మార్వెల్ సినిమాకు సీక్వెల్గా 'ది మార్వెల్స్'ఈ సినిమా వచ్చింది. ఇందులో బ్రీ లార్సన్ ప్రధాన పాత్రలో లీడ్ చేస్తే.. ఇమాన్ వెల్లని, టియోనా పార్రిస్లు లేడి సూపర్ హీరోలుగా చేశారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకురాలు నియో డకోస్టా తెరకెక్కించిన చిత్రమిది. యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..మార్వెల్కు చెందిన ఈ ముగ్గురు సూపర్ హీరోయిన్స్ విశ్వ రక్షణ కోసం పోరాడుతుంటారు. క్రీ అనే గ్రహం అంతరించిపోతున్న సమయంలో ఆ గ్రహాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని విలన్ పాత్రలో ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్) పోరాడుతుంటాడు. ఇతర గ్రహాల్లో ఉన్న వనరులను తన గ్రహానికి తెచ్చుకునే పనిలే ఉంటాడు. అందుకోసం ఒక క్వాంటమ్ బ్యాండ్ సాయంతో ఈ పనిచేస్తుంటాడు. ఇలాంటి సమయంలో క్వాంటమ్ బ్యాండ్ నుంచి వచ్చే మాగ్నెటిక్ పవర్ వల్ల అనేక శక్తులతో కెప్టెన్ మార్వెల్ కారోల్ డార్విన్ (బ్రీ లార్సన్), కెప్టెన్ మోనికా ర్యాంబో (టియోనా పార్రిస్), కమలా ఖాన్ అలియాస్ మిస్ మార్వెల్ (ఇమాన్ వెల్లని) ఎంట్రీ ఇస్తారు. ఈ ముగ్గురిని టీం అప్ చేసే ‘నిక్ఫ్యూరి’ పాత్రలో సామ్యూల్ జాక్సన్ కనిపిస్తారు. తన శక్తులను లాక్కున్న క్రీ గ్రహం నుంచి వాటిని తిరిగి సాధించి తనపై ప్రతీకారం తీర్చుకుంటుంది మార్వెల్. కానీ కొన్ని కారణాల వల్ల క్రీ శక్తుల నుంచి విశ్వాన్ని కాపాడే బాధ్యతను తనపై వేసుకుంటుంది. ఇందులో కెప్టన్ మార్వెల్కి వెలుతురును స్వాధీనం చేసుకునే శక్తి ఉంటుంది. దాన్ని స్వయంగా చూసే శక్తి మోనికా రాంబోకి ఉంటుంది. వెలుతురునే ఒక వస్తువుగా మార్చే శక్తి మిస్ మార్వెల్కి ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ముగ్గురు తమ పవర్స్ ఉపయోగించిన ప్రతిసారి ఒకరి స్థానంలో మరొకరు ఉంటారు.ఈ ముగ్గురు కలిసి ‘ది మార్వెల్స్’గా మారడం.. ఆపై విశ్వాన్ని నాశనం చేస్తున్న ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్)పై ఎలాంటి యుద్ధం చేస్తారనేది ఈ కథ. ఎలా ఉందంటేమార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమా వస్తుందంటే చాలా అంచనాలు ఉంటాయి. అందుకోసం రూ. 2250 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. ముగ్గురు లేడి సూపర్ హీరోల భారీ యాక్షన్ సీన్స్ మెప్పించినప్పటికీ కథలో కాస్త ఆసక్తిని తగ్గిస్తుంది. ఇప్పటికే ఇలాంటి కథలు రావడంతో అంతగా ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. 2022లో వచ్చిన మిసెస్ మార్వెల్ క్లైమాక్స్ సీన్తో ది మార్వెల్స్ స్టార్ట్ అవుతుంది. డార్బెన్ను పవర్ ఫుల్ విలన్గా మొదట్లో చూపించిన దర్శకులు.. క్లైమాక్స్ వచ్చేసరికి అంతలా మెప్పించలేకపోయారు. ఎడ్లాండా అనే కొత్త గ్రహాన్ని ది మార్వెల్స్లో చూపించారు. అది బాగానే ఉన్నప్పటికీ వార సంస్కృతిని చూపించిన విధానం అంతగా మెప్పించదు. ఇందులో ప్రదానంగా కెప్టెన్ మార్వెల్ ఫ్యాన్గా ఇమాన్ వెల్లని తన నటనతో దుమ్మురేపింది. సినిమా స్థాయికి తగ్గట్టుగానే గ్రాఫిక్స్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు హైలెట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి మరో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. మార్వెల్స్ చిత్రాలను ఇష్టపడే వారందరినీ 'ది మార్వెల్స్' తప్పకుండా మెప్పిస్తుంది. హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. -
ఓటీటీలో ఆవేశం.. ఆ సీన్పై చర్చ!
ఫహద్ ఫాజిల్.. అప్పుడే హీరోగా చేస్తాడు.. అంతలోనే విలన్గా నటిస్తాడు. ప్రాధాన్యతను బట్టి ఏ పాత్రలో అయినా దూరేస్తాడు. ఇటీవల అతడు హీరోగా నటించిన మలయాళ మూవీ ఆవేశం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఓటీటీలో ఆవేశంబాక్సాఫీస్ దగ్గర హిట్టందుకున్న మూవీ ఓటీటీలోకి రావడంతో సినీప్రియులు ఆత్రుతగా ఆవేశం సినిమా చూసేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సినిమాలోని ఓ సీన్ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. హిందీ భాషను కావాలని పక్కన పడేశారని కామెంట్లు చేస్తున్నారు.ఫైట్ సీన్లో వార్నింగ్ఇంతకీ ఏమైందంటే.. ఓ ఫైట్ సీన్లో రంగ(ఫహద్ ఫాజిల్) తన కాలేజీలోని సీనియర్లు అజు, బిబి, షాంతన్కు వార్నింగ్ ఇస్తుంటాడు. మలయాళం, కన్నడ భాషల్లో వార్నింగ్ ఇస్తాడు. హిందీలో కూడా ఇద్దామనుకునేసరికి హిందీలో అవసరం లేదులే అంటూ రంగ రైట్ హ్యాండ్ అంబాన్ (సాజిన్ గోపు) అతడిని వారిస్తాడు. హిందీ అక్కర్లేదా?అందరికీ చెప్పింది అర్థమైందిగా.. ఇక వెళ్లిపోండి అని ఆదేశిస్తాడు. హిందీలో అవసరం లేదా? అని హీరో అడిగితే అంబాన్ వద్దని బదులిస్తాడు. ఇది చూసిన కొందరు అధికార భాష హిందీని గౌరవించాలి కదా అని అభిప్రాయపడగా.. అయినా ప్రాంతీయ భాషా చిత్రంలో హిందీ అవసరం ఏముందిలే అని మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.చదవండి: ఓ మంచి దెయ్యం టీజర్ చూశారా? -
నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ
హారర్ సినిమాలకు ఓటీటీలో మంచి గిరాకీ ఉంటుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఇలా ఎంటరవ్వగానే అలా ట్రెండయిపోతాయి. థియేటర్లలో పెద్దగా కలెక్షన్స్ రాబట్టని చిత్రాలు కూడా మినిమమ్ గ్యారెంటీ వ్యూస్ రాబడతాయి. తాజాగా ఓ తెలుగు హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.గత నెలలో రిలీజ్తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ గీతాంజలి అనే హిట్ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కింది. కోన వెంకట్ కథ అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, రవిశంకర్, సత్య, బ్రహ్మాజీ, అలీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. సడన్గా ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది.కథ విషయానికి వస్తే..దర్శకుడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అవుతాయి. మరో ఛాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్లో తిరుగుతుంటాడు. సరిగ్గా అప్పుడే ఊటీకి చెందిన వ్యాపారవేత్త విష్ణు (రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా (శ్రీకాంత్ అయ్యంగార్) శ్రీనివాస్కు ఫోన్ చేసి తనతో సినిమా నిర్మిస్తానని చెపుతాడు. హీరోయిన్గా ఊటీలో కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అయితే షూటింగ్ అంతా సంగీత్ మహల్లోనే పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. అక్కడున్న దెయ్యాలతో శ్రీను టీమ్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడే షూటింగ్ చేయాలని ఎందుకు కండీషన్ పెట్టాడు? గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా? ఎందుకు? వచ్చింది? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! చదవండి: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా
కోలీవుడ్లో విజయ్ ఆంటోని సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రంలో నటించారు. మృణాళిని రవి ఇందులో హీరోయిన్గా నటించింది. విజయ్ ఆంటోని స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. ఏప్రిల్ 11న తెలుగులో కూడా విడుదలైన లవ్ గురు ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని తెలుగులో విడుదల చేసింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో కూడా విజయ్ అంటోని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ లవ్ గురు సినిమా మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. సినిమా విడుదలైన నెలలోపే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే తాజాగా తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ ప్రేక్షకులను మెప్పించిన లవ్ గురు చిత్రాన్ని ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయండి.లవ్ గురు కథేంటి..?అరవింద్ పాత్రలో విజయ్ ఆంటోని మెప్పించాడు. 35ఏళ్ల వయసొచ్చినా ప్రేమ, పెళ్లికి నోచుకోలేకపోయానే అనే బాధ అతనిలో ఉంటుంది. సింగిల్ జీవితానికి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్న అరవింద్ ఓ చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. దీనిని గ్రహించిన కుటుంబ సభ్యులు వారిద్దరికీ పెళ్లి చేస్తారు. కానీ, పెళ్లైన మరుసటి రోజే లీలాకు తనతో పెళ్లి ఇష్టం లేదన్న సంగతి అరవింద్కు అర్థమవుతుంది. ఈ పెళ్లి ఆమెకు ఎందుకు ఇష్టం లేదు..? లీలా కోరిక ఏంటి..? ఆమె మనసును గెలుచుకునేందుకు అరవింద్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు వంటి సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. -
రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
శృంగార సన్నివేశాలు చేసేసిన తర్వాత వాటి గురించి మాట్లాడటానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఈ మధ్య మాత్రం పలువురు హీరోయిన్లు ఆయా సీన్స్ గురించి ఓపెన్గా మాట్లాడుతున్నారు. మొన్నామధ్య సోనాక్షి సిన్హా, దివ్య పిళ్లై ఇలా మాట్లాడారు. ఇప్పుడు యువ హీరోయిన్ శృతి శర్మ కూడా రొమాంటిక్ సీన్స్ వల్ల వచ్చిన కష్టనష్టాల్ని బయటపెట్టింది.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.. రీసెంట్గా 'హీరామండి' సిరీస్తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. స్వాత్రంత్ర్యం రాకముందు పాకిస్థాన్లోని హీరామండి అనే వేశ్యవాటికని స్ఫూర్తిగా తీసుకుని ఈ సిరీస్ తీశాడు. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీ రావ్ హైదరీ తదితరులు నటించారు. 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' హీరోయిన్ శృతి శర్మ కూడా ఈ సిరీస్లో సైమా అనే పాత్ర చేసింది. నటిగా తన అనుభవాల్ని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త)'ఈ సిరీస్లో రజత్ కౌల్తో కొన్ని రొమాంటిక్ సీన్స్ చేశాను. ఇందులో ఇద్దరం చాలా సహజంగా నటించాం. ఇలాంటి సన్నివేశాలు ఇప్పటివరకు చేయలేదు. అయితే ఇవి చేస్తున్నప్పుడు నా శరీరంపై దద్దుర్లు వచ్చాయి. దుమ్ము, ధూళి ఉన్నప్పటికీ ఓ రోజంతా కష్టపడి ఈ సీన్స్ పూర్తి చేశాం. ప్రతిదీ ఫెర్ఫెక్ట్గా వచ్చేవరకు షూటింగ్ జరిగింది. అందుకే వెబ్ సిరీసులో ఈ సీన్లు చాలా అద్భుతంగా అనిపించాయి' అని శృతి శర్మ చెప్పింది.అయితే సైమా పాత్ర చేయడం పట్ల సంతోషంగానే ఉన్నానని, భన్సాలీ ఊహించుకున్న రోల్ కోసం బాగానే కష్టపడ్డానని శృతి శర్మ చెప్పింది. ఇకపోతే నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ 'హీరామండి' వెబ్ సిరీస్లో ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. అయితే కంటెంట్ కాస్త ల్యాగ్ ఉండటంతో తెలుగోళ్లకు పెద్దగా నచ్చలేదు కానీ హిందీ ఆడియెన్స్ మాత్రం బాగానే చూస్తున్నారు.(ఇదీ చదవండి:పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?) -
డైరెక్ట్గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిట్. ఈ సినిమాను ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్పై సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించగా..విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజగా ఈ మూవీ ట్రైలర్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ను విశ్వక్ సేన్ అభినందించారు.చిత్ర ట్రైలర్ చూస్తుంటే.. మొదట ఓ అమ్మాయి మర్డర్ కేసు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆ కేసును ఎలా చేధించారనే సస్పెన్స్ కోణంలో ఈ సినిమా ఉండబోతోంది. ట్రైలర్ చివర్లో పోలీసాఫీసర్గా అరవింద్ కృష్ణ చెప్పడం హైలెట్గా నిలిచింది. ఈ చిత్రంలో నటాషా దోషి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు వరికుప్పల యాదగిరి సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇవాల్టి నుంచే ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) -
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
సమ్మర్ అంటే విద్యార్థులకు సెలవుల కాలం.. అప్పటిదాకా పుస్తకాలతో కుస్తీపట్టినవారంతా ఎంచక్కా ఇంట్లో రిలాక్స్ అవుతూ ఉంటారు. వచ్చే నెలలో మళ్లీ బడి, కాలేజీ బాట పట్టాల్సిందే కాబట్టి ఈ ఒక్క నెలను ఫుల్గా ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు. మండుతున్న ఎండల కారణంగా ప్రతిసారి ఫ్యామిలీతో కలిసి థియేటర్కు వెళ్లే పరిస్థితి లేదు. పైగా కొత్త, పాత తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు ఓటీటీలో విడుదలవుతూ కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయిి. మరి ఈ ఫ్రైడే(మే 9) ఓటీటీలో సందడి చేసే సినిమాలేవో చూసేద్దాం..అమెజాన్ ప్రైమ్👉 ఆవేశం👉 మ్యాక్స్టన్ హాల్ (సిరీస్)👉 ద గోట్ (సిరీస్)(పై మూడూ నేటి నుంచే స్ట్రీమింగ్ అవుతున్నాయి)నెట్ఫ్లిక్స్👉 మదర్ ఆఫ్ ద బ్రైడ్ - స్ట్రీమింగ్ అవుతోంది👉 థాంక్యూ నెక్స్ట్ (సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది👉 లివింగ్ విత్ లియోపార్డ్స్ - మే 10👉 బ్లడ్ ఆఫ్ జీయస్ (సీజన్ 2) - మే 10👉 కుకింగ్ అప్ మర్డర్: అన్కవరింగ్ ద స్టోరీ ఆఫ్ సీజర్ రోమన్ (డాక్యు సిరీస్) - మే 10👉 ద అల్టిమేటమ్: సౌతాఫ్రికా (రియాలిటీ షో) - మే 10జీ5👉 8ఏఎమ్ మెట్రో - మే 10👉 పాష్ బాలిష్ (సిరీస్) - మే 10 సోనీ లివ్👉 అన్దేకి సీజన్ 3 (సిరీస్) - మే 10లయన్స్ గేట్ ప్లే👉 ద మార్ష్ కింగ్స్ డాటర్ (సినిమా) - మే 10జియో సినిమా👉 మర్డర్ ఇన్ మహిమ్ (సిరీస్) - మే 10👉 ప్రెట్టీ లిటిల్ లయర్స్: సమ్మర్ స్కూల్ - మే 10సన్ నెక్స్ట్👉 ఫ్యూచర్ పొండాటి - మే 10హుళు👉 బయోస్పియర్ - మే 10హోయ్చోయ్👉 చాల్చిత్ర ఏఖాన్ - మే 10చదవండి: తల దించుకున్నా, అందుకే పెళ్లి విషయం దాచా!: యాంకర్ రవి -
ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ స్టార్ నటుడు, పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆవేశం. గతనెల 11న మలయాళంలో రిలీజైన చిత్రం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మలయాళంలో హిట్ అయిన తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం.. త్వరలోనే తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.భారీ ధరకు ఓటీటీ డీల్సూపర్ హిట్ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. రూ.35 కోట్లను చెల్లించి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా అత్యధిక మొత్తం పొందిన మలయాళ చిత్రంగా ఆవేశం రికార్డు దక్కించుకుంది. కాగా.. ఈ సినిమాను రూ.30 కోట్లతో తెరకెక్కించారు. college, gangsters, mayhem, and a whole lot of unexpected! 🤪#AaveshamOnPrime, watch nowhttps://t.co/6L4qK9PLeR pic.twitter.com/rAIbvGXE9S— prime video IN (@PrimeVideoIN) May 8, 2024 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
‘ది కేరళ స్టోరీ’తో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది అదాశర్మ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో హార్ట్ అటాక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించినా.. అదా శర్మను మాత్రం స్టార్ హీరోయిన్గా చేయలేకపోయింది. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు లేడి ఓరియెంటెండ్ చిత్రాల్లో నటించినా.. ఫేమ్ రాలేదు. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘ది కేరళ స్టోరీ’తో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాదిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో పాటు అదా శర్మను పాన్ ఇండియా హీరోయిన్గా మార్చేసింది. అదే జోష్లో ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సుదీప్తోసేన్తోనే ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ అనే సినిమా చేసింది. ఈ ఏడాది మార్చి 15న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకొని అట్టర్ ప్లాప్గా నిలిచింది. అయితే విడుదలకు ముందు ఈ మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో కేవలం మావోయిస్టుల హింసనే ఎక్కువ చూపించారని, సంచలనం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే విమర్శలు వచ్చాయి. విడుదల తర్వాత ప్లాప్ టాక్ రావడంతో ఎవరూ ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మే 17 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ 5 సంస్థ ఎక్స్(ట్విటర్) వేదికగా తెలియజేస్తూ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఇందులో అదాశర్మ మావోయిస్టులను అణచివేయడానికి నియమితురాలైన ఐపీఎస్ అధికారి నీరజా మాధవన్గా నటించింది. An internal war that has the country divided into two fractions. Watch the gruesome story of Naxal violence.#Bastar premieres 17th May, only on #ZEE5. Available in Hindi and Telugu. #BastarOnZEE5 pic.twitter.com/IUFXrNnkqq— ZEE5 (@ZEE5India) May 8, 2024 -
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. మే 1 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం 1920 నుంచి 1940 ల మధ్య కాలంలో లాహోర్లో రెడ్లైట్ ప్రాంతంగా పేరున్న హీరామండిలోని వేశ్యల జీవితాల నేపథ్యంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు భన్సాలీ. (చదవండి: హీరామండి రివ్యూ)మనీషా కోయిరాలా , అదితిరావ్ హైదరీ, సోనాక్షి సిన్హా , ఫర్ధీన్ ఖాన్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ప్రతి ఒక్కరు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సోనాక్షి సిన్హా పోషించిన ఫరీదాన్ పాత్ర వెబ్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ పాత్ర పోషించినందుకుగాను సోనాక్షిపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే కొంతమంది మాత్రం ఆమె పాత్రను తప్పుపట్టారు. దానికి కారణం ఆమె మరో మహిళతో కలిసి శృంగారంలో పాల్గొనడమే. ఆ ఇంటిమేట్ సీన్స్, దానికి గల కారణం సరిగ్గా చూపించలేదంటూ కొంతమంది విమర్శించారు. తాజాగా దీనిపై సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. ఫరీదాన్ అనే పాత్ర స్వలింగ సంపర్కురాలు అని.. అందుకే ఆమె మరో మహిళతో రొమాన్స్ చేసిందని చెప్పుకొచ్చింది. ‘భన్సాలీ నాకు కథ చెప్పినప్పుడే ఫరీదాన్ పాత్ర గురించి పూర్తిగా వివరించాడు. కథ విని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇందులో నేను స్కలింగ సంపర్కురాలు పాత్ర పోషించాను. అందుకే అలాంటి సీన్స్ ఉన్నాయి’ అని సోనాక్షి చెప్పుకొచ్చింది.అలాగే ఇందులో నటుడు ఇంద్రేష్ మాలిక్తో కలిసి సోనాక్షి ఇంటిమేట్ సీన్స్లో నటించింది. ఈ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అసౌకర్యానికి గురయ్యాయని, సోనాక్షినే తనకు ధైర్యం చెప్పి,సపోర్ట్ చేసిందని ఓ ఇంటర్వ్యూలో ఇంద్రేష్ చెప్పాడు. -
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓవైపు సంగీత దర్శకుడిగా, మరోవైపు హీరోగా రాణిస్తున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. అతడు ఇటీవల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కల్వన్. దీన్ని తెలుగులో చోరుడు పేరిట రిలీజ్ చేయాలని భావించారు. ఈ మేరకు గతేడాది ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా వదిలారు. ఇవానా, భారతీరాజా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశే సంగీతం అందించాడు. ఓటీటీ రిలీజ్ డేట్ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తెలుగులో రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మే 14 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తున్నట్లు హాట్స్టార్ ప్రకటించింది. అలాగే ఇతర దేశాల్లో ఉన్నవారికోసం సింప్లీ సౌత్, టెన్కోట్టా వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనూ ఈ మూవీ మే 10 నుంచి అందుబాటులోకి రానుంది.ఈ విషయాన్ని వెల్లడిస్తూ టీజర్ కూడా వదిలారు. కల్వన్ సినిమా విషయానికి వస్తే పీవీ శంకర్ దర్శకరచయితగా వ్యవహరించడంతో పాటు సినిమాటోగ్రాఫర్గానూ పని చేశాడు. ఢిల్లీ బాబు నిర్మించిన ఈ చిత్రానికి సాన్ లోకేశ్ ఎడిటర్గా వ్యవహరించాడు.Tamil film #Kalvan @disneyplusHSTam / @Tentkotta / @SimplySouthApp 🎬💥 pic.twitter.com/PbSz2PXu9E— Tamilmemes3.0 (@tamilmemes30) May 7, 2024 -
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలే వేసవికాలం.. బయటచూస్తే మండుటెండలు భయపెట్టేస్తున్నాయి. స్కూళ్లకు సైతం సెలవులు రావడంతో పిల్లలు సైతం ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూసేందుకు ఓటీటీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అలాంటి సినీ ప్రియుల కోసం ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్ను అందిస్తున్నాయి.తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ జానర్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ క్రమంలోనే మర్డర్ ఇన్ మహిమ్ అనే పేరుతో మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అలరించేందుకు సిద్ధమైంది. విజయ్ రాజ్, అషుతోశ్ రాణా, శివానీ రఘువంశీ ఈ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.ఈనెల 10 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ఏకంగా ఆరు భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఇది కేవలం జియో సినిమా ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే అందుబాటులోకి రానుంది. Bas teen din mein milenge saare sawalon ke jawab🔪Murder In Mahim streaming 10th May onwards, exclusively on JioCinema Premium.Subscribe to JioCinema Premium at Rs. 29 per month. Exclusive content. Ad-free. Any device. Up to 4K. pic.twitter.com/kL5cnFp8Uy— JioCinema (@JioCinema) May 7, 2024 -
ఓటీటీలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రిలీజ్
అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ్ హీరోలుగా నటాషాదోషి ప్రధాన పాత్ర పోషించిన కొత్త చిత్రం 'యస్. ఐ. టి'. ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) పేరుతో జీ5లో స్ట్రీమింగ్ కానుంది.యంగ్ ఇండియా సినిమాతో హీరోగా పరిచయమైన అరవింద్ కృష్ణ ఇప్పటికే ఇట్స్ మై లవ్ స్టోరీ, రుషి వంటి చిన్న చిత్రాల్లో మెప్పించాడు. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కూడా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో మెరిశాడు. తాజాగా 'యస్. ఐ. టి' (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) చిత్రం ద్వారా వస్తున్నాడు. వి.బి.ఆర్. (VBR) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందింది. మే 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. -
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
గతేడాదిలో 'సలార్'తో ట్రెండింగ్లోకి వచ్చిన శ్రియా రెడ్డి తాజాగా 'తలైమై సేయలగం' వెబ్ సిరీస్తో రానుంది. తమిళంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్లో కాంతార ఫేమ్ కిషోర్ మరో లీడ్రోల్లో నటిస్తోన్నాడు. జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ సిరీస్ను రిలీజ్ చేస్తున్నారు.తలైమై సేయలగం పేరుతో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్ డ్రామా సిరీస్ను భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో శ్రియారెడ్డితో పాటు కస్తూరి, భరత్, రమ్య నంబీశీన్, దర్శన గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ వసంత బాలన్ ఈ పొలిటికల్ మ్యాజిక్ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ గురించి కీలక సమాచారాన్ని మేకర్స్ ప్రకటించారు. మే 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోందని తెలిపారు.రీసెంట్గా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన రాధిక శరత్కుమార్ ఈ వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు నుంచి బీజేపీ అభ్యర్థిగా లోకసభ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రాడాన్ మీడియా వర్క్స్ పతాకంపై ఆమె నిర్మిస్తుంది. ఈ సిరీస్కు గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. -
ఓటీటీలోకి రియల్ లైఫ్ ట్రాజెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సరైన సినిమాల్లేక బాక్సాఫీస్ డల్ అయిపోయింది. అల్లరి నరేశ్ 'ఆ ఒక్కటి అడక్కు' మూవీపై గంపెడాశలు పెట్టుకుని గతవారం థియేటర్లలో రిలీజ్ చేశాడు. పెద్దగా లాభం లేకుండా పోయింది. దీంతో ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడింది. ప్రస్తుతానికైతే ఓటీటీలో 'మంజుమ్మల్ బాయ్స్' మూవీ బాగానే ఆకట్టుకుంటోంది. త్వరలో 'ఆవేశం' స్ట్రీమింగ్ కానుండగా.. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో రియల్ లైఫ్ సినిమా వచ్చేందుకు రెడీ అయిపోయింది.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఎందుకంటే 'సలార్'లో రాజమన్నార్ అనే విలన్ పాత్రలో మెప్పించాడు. ఇతడు మెయిన్ రోల్లో నటించిన 'ద గోట్ లైఫ్' అనే సినిమా మార్చి చివర్లో రిలీజైంది. పనికోసం దుబాయి వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడ ఎలా చిక్కుకుపోయాడు? అక్కడి నుంచి స్వదేశానికి ఎలా తిరిగొచ్చాడు? అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీశారు. మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగులో మాత్రం సీరియస్ కాన్సెప్ట్ కావడంతో మనోళ్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.ఇకపోతే 'ద గోట్ లైఫ్' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైందని తెలుస్తోంది. మే 26 నుంచి హాట్స్టార్లో అందుబాటులోకి రానుందని అంటున్నారు. మరోవైపు చెప్పిన టైమ్ కంటే ముందే మే 10నే ఓటీటీలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమా తీయడానికి దాదాపు 16 ఏళ్లు పట్టింది. ఆరేళ్ల క్రితం షూటింగ్ మొదలుపెట్టి, పలు కష్టాలతో పూర్తి చేశారు. ఈ ఏడాది రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్) -
హమ్మయ్యా.. బ్లాక్ బస్టర్ సిరీస్ మూడో సీజన్ మొదలైంది
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్ల కంటే ఓటీటీల్లో మూవీస్-వెబ్ సిరీసులు చూసేవాళ్లే ఎక్కువయ్యారు. అందుకు తగ్గట్లే ఆయా సంస్థలు సరికొత్త సిరీసులు తీసుకొస్తున్నాయి. అలానే కొన్ని హిట్ సిరీస్లకు తర్వాత భాగాల్ని కూడా మొదలుపెడుతున్నాయి. అలా ఓటీటీలో సెన్షేషన్ సృష్టించిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది.దేశభక్తి అనేది ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. ఇప్పటికే వందలాది సినిమాలు వచ్చాయి. పదుల సంఖ్యలో సిరీసులు వస్తున్నాయి. అయితే దేశభక్తి ప్లస్ ఓ మధ్య తరగతి వ్యక్తి నేపథ్యంగా తీసిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్.. ఈ జానర్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్లో మనోజ్ భాజ్పాయ్-ప్రియమణి జంటగా నటించారు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రిపీట్స్లో చూశారు. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. తొలి భాగమంతా కానప్పటికీ మంచి స్పందన దక్కించుకుంది. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు.అయితే రెండో సీజన్ వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ అప్డేట్ లేకపోయేసరికి చాలామంది దీని గురించి మర్చిపోయారు. సరిగ్గా ఇలాంటి టైంలో మూడో సీజన్ షూటింగ్ మొదలైందని డైరెక్టర్స్ ప్రకటించారు. లొకేషన్ నుంచి ఓ పిక్ కూడా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది దీని రిలీజ్ ఉంటుంది.(ఇదీ చదవండి: ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
కోలీవుడ్ డైరెక్టర్ హరి- విశాల్ కాంబోలో వచ్చిన సినిమా 'రత్నం'. ఏప్రిల్ 26న విడుదలైన ఈ చిత్రం విశాల్ అభిమానులను మెప్పించింది. పలు ట్విస్ట్లతో పాటు భారీ ఫైట్స్తో మాస్ ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంది. అయితే, సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. కమర్షియల్ చిత్రాలను అందించడంలో దర్శకుడిగా హరికి మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి ఇప్పటికే భరణి, పూజా,సింగం సీక్వెల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ నటించింది. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ రోజు సినిమాకు పోటీగా మరే పెద్ద సినిమా విడుదల కాకపోవడంతో రత్నం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో రత్నం సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రత్నం సినిమా ఓటీటీలోకి రానుంది. మే 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని నెట్టింట వైరల్ అవుతుంది. కొద్దిరోజుల్లో చిత్ర మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. -
This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈ వీకెండ్ తర్వాత అంటే సోమవారం (మే 13) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు ఐపీఎల్ కూడా ఫుల్ స్వింగ్లో ఉంది. ఈ క్రమంలోనే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలోకి రావట్లేదు. ఉన్నంతలో 'కృష్ణమ్మ' అనే మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. మరోవైపు ఓటీటీలో కూడా 15కి పైగా మూవీస్-సిరీస్లు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్)ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ విషయానికొస్తే దాదాపు 16 సినిమాలు/సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చాలావరకు ఇంగ్లీష్-హిందీ సినిమాలు/వెబ్ సిరీసులే ఉన్నాయి. అయితే 'ఆవేశం' అనే డబ్బింగ్ మూవీతో పాటు '8 ఏఎమ్ మెట్రో' చిత్రం మాత్రమే ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓవరాల్గా ఓటీటీల్లో ఏ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (మే 06-12వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్ద రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ సినిమా) - మే 06బోడ్కిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09మదర్ ఆఫ్ ద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 09థ్యాంక్యూ నెక్స్ట్ (టర్కిష్ సిరీస్) - మే 09లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 10అమెజాన్ ప్రైమ్ఆవేశం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 09 (రూమర్ డేట్)మ్యాక్స్టన్ హాల్ (జర్మన్ సిరీస్) - మే 09ద గోట్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09 హాట్స్టార్ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 08జీ 58 ఏఎమ్ మెట్రో (హిందీ మూవీ) - మే 10పాష్ బాలిష్ (బెంగాలీ సిరీస్) - మే 10జియో సినిమామర్డర్ ఇన్ మహిమ్ (హిందీ సిరీస్) - మే 10సోనీ లివ్అన్ దేకి సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 10లయన్స్ గేట్ ప్లేద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 10సన్ నెక్స్ట్ఫ్యూచర్ పొండాటి (తమిళ సిరీస్) - మే 10ఆపిల్ ప్లస్ టీవీడార్క్ మేటర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?) -
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు చంపేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటే భయమేస్తోంది. ఇలాంటి టైంలో థియేటర్కి వెళ్లి చూడటం కంటే ఓటీటీలో మూవీస్ చూడటానికే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రస్తుతం 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)హీరోయిన్ అంజలి తెలుగమ్మాయి. అప్పట్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ ఓ మాదిరి సక్సెస్ మాత్రమే అందుకుంది. తన 50వ సినిమాగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చేసింది. ఈ మధ్యే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో జనాలు అంతంత మాత్రంగానే వెళ్లారు.థియేటర్లలోకి ఏప్రిల్ 11న వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాని ఇప్పుడు నెల తిరిగిసరికల్లా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుందని సమాచారం. హిట్ మూవీ కాదు కాబట్టి పెద్దగా హడావుడి లేకుండా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 2014లో వచ్చిన 'గీతాంజలి' మూవీకి దీన్ని సీక్వెల్గా తెరకెక్కించారు. కాకపోతే తొలి భాగంలా హిట్ కొట్టలేకపోయారు.(ఇదీ చదవండి: సమ్మర్ స్పెషల్.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్లు) -
ఓటీటీలో హీరామండి.. స్టార్ డైరెక్టర్ మేనకోడలిపై విమర్శలు!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మే 1 స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సిరీస్ ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ నటించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ నటించారు. అయితే ఈ సిరీస్లో మనీషా కొయిరాలా కూతురిగా మెప్పించిన షర్మిన్ సెగల్పై పాత్రపై విమర్శలొచ్చాయి. హీరామండిలో అలంజేబ్ పాత్రపై చాలామంది ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు.చాలా మంది ప్రేక్షకులు హీరామండిలోని నటనను ప్రశంసించగా, ఈ సిరీస్లో కొయిరాలా పాత్ర మల్లికా జాన్ కుమార్తె అలంజేబ్ పాత్రను పోషించిన షర్మిన్, ముఖ్యంగా ఆమె నటనకు విమర్శలను అందుకుంది. తన పాత్రలో ప్రతి సీన్లో ఓకే ఎక్స్ప్రెషన్తో కనిపించడంతో కొందరు ఆమెపై కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా తన ఇన్స్టా పోస్ట్కు కామెంట్ సెక్షన్ను నిలిపేసింది బాలీవుడ్ భామ. ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేయడం సంజయ్ చేసిన బిగ్ మిస్టేక్ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అలంజేబ్ పాత్రలో నటించిన షర్మిన్ సెగల్ స్వయాన సంజయ్ లీలా బన్సాలీకి మేనకోడలు కావడం విశేషం. ఆమె సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలాల్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. అంతే కాకుండా గోలియాన్కి రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కతియావాడి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. ఆ తర్వాత హారర్ కామెడీ 'అతిథి భూతో భవ సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Sharmin Segal Mehta (@sharminsegal) -
డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మరో ఓటీటీ సంస్థ!
ఇప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టతరంగా మారిందన్నది ప్రత్యేకంగా చె ప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చిన్న చి త్రాల నిర్మాతలకు ఓటీటీ ప్లాట్ఫామ్లు వరప్రసాదంగా మారాయనే చెప్పాలి. అలా ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ పెద్ద చి త్రాల స్ట్రీమింగ్లో బిజీగా ఉన్నాయి. కొత్తగా ఓటీటీ ప్లస్ పేరుతో కొత్త ప్లాట్ఫామ్ ప్రారంభమైంది. ప్ర ముఖ సినీ విమర్శకుడు, దర్శకుడు కేబుల్ శంకర్, ఎంఆర్ శీనివాసన్, సుధాకర్ కలిసి ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో జరిగిన దీని ప్రారంభోత్సవంలో జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత దర్శకుడు శీనూ రామస్వామి ముఖ్యఅతిథిగా హాజరైన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల యంగ్ డైరెక్టర్స్ జాన్ కిళడి(పైరీ), మణివర్మన్(ఒరునొడి), ఆర్.వెంకట్(కిడా), బాలాజీ వేణుగోపాల్ (లక్కీమేన్), కన్నుసామి(వట్టార్ వళక్కు), యశ్వంత్ కిశోర్ (కన్నగి), విఘ్నేశ్కార్తీక్( హార్ట్స్పార్ట్) శరత్ జ్యోతి, రచయిత వసంత్ బాలక్రిష్ణన్, జయచంద్ర హస్మీ (కూస్ ముణుసామివీరప్పన్(వెబ్సిరీస్)ను అభినందించి వారికి జ్ఞాపికలను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్ఫామ్ భవిష్యత్లో కొత్తగా వచ్చే వారికి వరప్రసాదం అవుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్థమాన దర్శకుల చిత్రాలను ప్రశంసించారు. వారిని తనతో గౌరవింపజేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్ఫామ్ నిర్వాహకుల్లో ఒకరైన కేబుల్ శంకర్ మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్ఫామ్ల అవసరం నానాటికీ పెరిగిపోతోందన్నారు. అలా ఈ ఓటీటీ ప్లస్ మరో 5 ఓటీటీ ప్లాట్ఫామ్లతో కలిసి పని చేస్తోందని చెప్పారు. మరిన్ని ఓటీటీ సంస్థలను ఒకే ప్లాట్ఫామ్గా చేయాలన్నదే తమ భావన అని పేర్కొన్నారు. రోజుకు ఒక్క రూపాయి చెల్లించి ఈ ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్సిరీస్, లఘు చిత్రాలు చూడవచ్చని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు కేబుల్ శంకర్ దర్శకత్వం వహించిన ఫెమినిస్ట్ అనే వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్ను, సెన్టెన్స్ అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. -
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మలయాళీ బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ చిత్రానికి తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయగా.. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. శనివారం(మే 5) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ మూవీ అందుబాటులో ఉంది. థియేటర్స్లో మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే ఈ చిత్రాన్ని చూడొచ్చు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు.ఇదీ మంజుమ్మల్ బాయ్స్ స్టోరీఈ సినిమా కథ 2006 ప్రాంతంలో జరుగుతుంది. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్(సౌబిన్ షాహిర్), సుభాష్(శీనాథ్ బాసి)తో పాటు మరికొంత మంది స్నేహితులు ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటారు. ఈ గ్యాంగ్కి మంజుమ్మల్ బాయ్స్ అని పేరు పెట్టుకుంటారు. వీరంతా కలిసి ఓసారి తమిళనాడులోని కొడైకెనాల్ టూర్కి వెళ్తారు. అక్కడ అన్ని ప్రదేశాలను చూసి.. చివరకు గుణ కేవ్స్కి వెళ్తారు.అది చాలా ప్రమాదకరమైన గుహ. ఆ గుహల్లో చాలా లోతైన లోయలుంటాయి. వాటిల్లో డెవిల్స్ కిచెన్ ఒకటి. అందులో పడ్డవారు తిరిగిన వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఆ ఏరియాకు టూరిస్టులు వెళ్లకుండా డెంజర్ బోర్డ్ పెట్టి నిషేధిస్తారు అటవి శాఖ అధికారు. కానీ మంజుమ్మల్ బాయ్స్ అధికారుల కళ్లుగప్పి నిషేధించిన ప్రాంతానికి వెళ్తారు. ఆ గుహంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ లోయలో పడిపోతాడు సుభాస్. ఆ తర్వాత ఏం జరిగింది? సుభాష్ని కాపాడటానికి తోటి స్నేహితులు ఏం చేశారు? వారికి పోలీసు శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి సహాయాన్ని అందించాయి? చివరకు సుభాష్ ప్రాణాలతో బయటకొచ్చాడా లేదా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement