ఓటీటీకి సూర్య హిట్ సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్..! | Kollywood Hero Suriya Karuppu Movie OTT Date Announced | Sakshi
Sakshi News home page

Karuppu Movie: ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్..!

Jun 8 2026 2:40 PM | Updated on Jun 8 2026 2:59 PM

Kollywood Hero Suriya Karuppu Movie OTT Date Announced

సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీకి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్‌గా త్రిష కనిపించింది. ఆర్థిక సమస్యలతో ఒక రోజు ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టేసింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూన్ 12 నుంచో ఓటీటీ ప్రియులను అలరించనుంది. రిలీజైన నెల రోజుల్లోపే స్టార్ హీరో మూవీ ఓటీటీకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

కరుప్పు కథేంటంటే..

మీను అనే అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుంది. చికిత్స కోసం లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను అమ్మాలని చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తారు. నాంపల్లిలో రైలు దిగి..సికింద్రాబాద్‌ వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా..దొంగలు వచ్చి ఆ నగలను ఎత్తుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరుసటి రోజు దొంగలను పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాటిని తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెప్పడంతో మీను, ఆమె తండ్రి కోర్టుకు వెళ్తారు.

ఈ కేసునే టేకాప్‌ చేసిన లాయర్‌ బేబీ కృష్ణ(ఆర్‌.జే బాలాజీ)..వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు. మీను తండ్రికి ఓపిక నశించి.. చేసేదేం లేక  కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య)ను వేడుకుంటాడు. న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. మనిషిగా భూమికి మీదకు వచ్చిన వీరభద్రుడు స్వామి.. మీనుకి న్యాయం చేశాడా? అవినీతి కంపులో మునిగిపోయి బేబీ కృష్ణకు, ఇతర లాయర్లకు ఆయన ఎలాంటి బుద్ది చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement