breaking news
OTT
-
ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీలోకి ఎప్పుడు?
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు థియేటర్లలోకి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ ' సినిమాలు వచ్చేశాయి. పేరుకే హిందీ అయినప్పటికీ 'ధురంధర్'కి మన దగ్గర కూడా ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది. మరోవైపు పవన్ చిత్రానికి అభిమానులు తప్పితే సగటు ఆడియెన్స్ కాస్త దూరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. సరే ఈ సంగతులు కాసేపు పక్కనబెడితే ఇంతకీ ఈ మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ సంగతేంటి? ఎప్పుడు అందుబాటులోకి రావొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుప్రీత చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)ముందుగా 'ధురంధర్ 2' విషయానికొస్తే తొలి భాగం డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్కి విక్రయించారు. ఇప్పుడు రిలీజైన సీక్వెల్ని మాత్రం నిర్మాణ సంస్థల్లో ఒకటైన జియో స్టూడియోస్కి చెందిన హాట్స్టార్కి ఇచ్చేశారు. మొదటి పార్ట్లానే ఈసారి కూడా థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అవుతుంది. అంటే మే చివరి వారంలోనే 'ధురంధర్ 2' డిజిటల్గా అందుబాటులోకి వస్తుంది. అయితే దీన్ని థియేటర్లలోనే చూడాలని చాలామంది అంటున్నారు.మరోవైపు 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయానికొస్తే డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్కి అమ్మేశారు. అయితే ఇది ఐదు వారాల తర్వాత ఓటీటీలోకి రానుందని నిర్మాత చెప్పుకొచ్చారు. అంటే ఏప్రిల్ చివరి వారంలో పవన్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంటుంది. సోషల్ మీడియాలో వినిపించినట్లు ఇది 'తెరి' రీమేక్ అయితే కాదనే క్లారిటీ వచ్చింది. కాకపోతే రొటీన్ కమర్షియల్ పోలీస్ టెంప్లేట్ స్టోరీతోనే దీన్ని తెరకెక్కించారు. టాక్ అయితే నెగిటివ్గానే వస్తోంది. వీకెండ్ అయ్యేసరికి అసలు సంగతి ఏంటనేది తెలుస్తుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?) -
ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. ఉగాది, రంజాన్ సెలవులు కలిసి రావడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. దానికి తోడు థియేటర్లలోకి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ధురంధర్ 2కి అద్భుతమైన టాక్ రాగా.. 'ఉస్తాద్..'కి నెగిటివ్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ కావట్లేదు. ఉన్నంతలో సీతా పయనం అనే చిత్రంతో పాటు 'బోర్డర్ 2' అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు వీటికి తోడు ఓ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్కి సిద్ధమైపోయింది.(ఇదీ చదవండి: అనుష్క పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన టీమ్)తెలుగులో సహాయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖావాణి కూతురు సుప్రీత.. సోషల్ మీడియాలో బాగా ఫేమస్. ఇప్పుడిప్పుడే ఒకటి అరా సినిమాలు చేస్తోంది. అలానే ఈమె ఓ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం 'అమరావతికి ఆహ్వానం'. శివ కంఠమనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణన్ తదితరులు మిగతా లీడ్ రోల్స్ చేశారు. ఇందులో హారర్ ఎలిమెంట్స్ పర్లేదనిపించినప్పటికీ, కొన్నిచోట్ల ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్ అయిందని అంటున్నారు. గత నెల 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఈ శుక్రవారం(మార్చి 20) నుంచి ఆహా ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.'అమరావతికి ఆహ్వానం' విషయానికొస్తే.. ఈశ్వర్ (శివ కంఠమనేని) సస్పెండ్ అయిన సీఐ. ఇతడి భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). ఈమె చెల్లెళ్లు భార్గవి(సుప్రీత), విజ్జు. భార్గవి ఓ యూట్యూబర్. దెయ్యంతో డే అండ్ నైట్ అనే కాన్సెప్ట్తో వీడియోలు చేస్తుంటుంది. అలా పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో సెలబ్రిటీ అయిపోతుంది. సడన్గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని, లైవ్లో నిరూపిస్తానని, వీడియో షూట్ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని ఈమెకు చెప్తాడు. దీంతో భార్గవి.. తన కుటుంబంతో అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడ వీళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?) -
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా
తెలుగు, తమిళ, కన్నడలో చాలా సినిమాలు చేసిన నటుడు అర్జున్ సర్జా.. ప్రస్తుతం వేగం తగ్గించేశాడు. కొన్నాళ్ల క్రితం కూతురు ఐశ్వర్యని హీరోయిన్గా పెట్టి ఓ మూవీ మొదలుపెట్టాడు. తెలుగు హీరో విశ్వక్ సేన్ని హీరోగా తీసుకున్నాడు. అనుకోని కారణాలతో విశ్వక్.. ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాడు. తర్వాత మరో హీరోతో చిత్రాన్ని పూర్తి చేశారు. గత నెలలోనే థియేటర్లలోకి కూడా తీసుకొచ్చేశారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)నటుడు అర్జున్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'సీతా పయనం'. ఇతడి కుమార్తె ఐశ్వర్య హీరోయిన్. కన్నడ నటుడు ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్.. ఈ చిత్రంలో హీరో. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఉగాది కానుకగా ఈ గురువారం (మార్చి 19) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.'సీతా పయనం' విషయానికొస్తే.. సీత (ఐశ్వర్య)చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. దీంతో తండ్రి(సత్యరాజ్)లోనే తల్లిని చూసుకుంటూ ఉంటుంది. తాను లేకపోతే తండ్రి ఏమైపోతడోనని పెళ్లి కూడా చేసుకోదు. ఓసారి ఒంటరిగా కారులో హైదరాబాద్కి ప్రయాణమవుతుంది. దారి మధ్యలో అభి(నిరంజన్) లిఫ్ట్ అడిగితే.. కండీషన్స్ పెట్టి ఊరి దగ్గర దించేస్తుంది. అయితే ఈ ఇద్దరూ కలిసి చేసిన ప్రయాణంలో ఎవరెవరు ఎదురయ్యారు? సీత.. మళ్లీ అభిని ఎందుకు కలవాల్సి వచ్చింది? ఈ ప్రయాణం సీత జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా) -
ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 17 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వీక్లో పెద్ద సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. బాలీవుడ్ నుంచి దురంధర్-2, టాలీవుడ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే దురంధర్ బాక్సాఫీస్ను షేర్ చేయగా సీక్వెల్గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికొస్తే టాలీవుడ్లో మాత్రమే కాస్తా బజ్ ఉంది. అంతకుమించి ఈ మూవీపై పెద్ద అంచనాల్లేవు.ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే చాలా సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేయనున్నాయి. వీటిలో టాలీవుడ్ నుంచి సీతాపయనం, జటాధర, బాలీవుడ్ మూవీ బోర్డర్-2 స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే జటాధర ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తాజాగా జీ5లో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు చిరాయ, ల్యాండ్ లార్డ్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..రేడియోయాక్టివ్ ఎమర్జన్సీ(వెబ్ సిరీస్)- మార్చి 18ప్యూరియస్ సీజన్-2- (వెబ్ సిరీస్)- మార్చి 18పీకీ బ్లైండర్స్ ది ఇమ్మార్షల్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- మార్చి 20బోర్డర్-2(హిందీ మూవీ)- మార్చి 20ది రైజ్ ఆఫ్ ది రెడ్హాట్ చిల్లి పెప్పర్స్(డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20 ఏ డిఫరెంట్ మ్యాన్ (హాలీవుడ్ సినిమా)- మార్చి 20అమెజాన్ ప్రైమ్..ఇన్విసిబుల్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 18ది హౌస్మెయిడ్(హాలీవుడ్ మూవీ)- మార్చి 19డెడ్ లాక్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 20 అమోర్ యానిమల్ (వెబ్ సిరీస్): మార్చి 20జీ5..ల్యాండ్ లార్డ్(డబ్బింగ్ సినిమా)- మార్చి 19కాసర్గడ్ ఎంబసీ(డబ్బింగ్ మూవీ)- మార్చి 20జటాధర(తెలుగు సినిమా)- మార్చి 20జియో హాట్స్టార్..చిరైయా(హిందీ మూవీ)- మార్చి 20యాపిల్ టీవీ..ఇమ్పర్ఫెక్ట్ ఉమెన్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ).. మార్చి 18సోనీ లివ్..జజ్ సిటీ(బెంగాలీ మూవీ)- మార్చి 19సన్ నెక్ట్స్..సీతా పయనం (తెలుగు సినిమా)- మార్చి 20 -
ఆస్కార్ గెలిచిన సినిమాలు.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?
సినీప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది. మార్చి 16న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు వేదికగా నిలిచింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమా ఏకంగా ఆరు అవార్డుల(ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు, కాస్టింగ్, అడాప్టెడ్ స్క్రీన్ప్లే ఎడిటింగ్ విభిగాల్లో)ను కైవసం చేసుకుంది. తర్వాత నాలుగు (ఉత్తమ నటుడు, స్క్రీన్ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్) పురస్కారాలతో సిన్నర్స్ రెండో స్థానంలో ఉంది. మరి ఆస్కార్ (Oscars 2026) గెల్చుకున్న సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయో చూసేద్దాం..వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ : జియో హాట్స్టార్సిన్నర్స్ : జియో హాట్స్టార్ఫ్రాంకెన్స్టీన్ : నెట్ఫ్లిక్స్F1 : యాపిల్ టీవీఅవతార్: ఫైర్ అండ్ యాష్ : ఇంకా ఓటీటీలో విడుదల కాలేదు.వెపన్స్: జియో హాట్స్టార్కెపాప్ డిమాన్ హంటర్స్ : ఈ యానిమేటెడ్ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది.సెంటిమెంటల్ వాల్యూ : అద్దె ప్రాతిపదికన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో అందుబాటులో ఉంది.హామ్నెట్ : యాపిల్ టీవీలో అద్దెకి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.ఆస్కార్ 2026: విజేతల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓటీటీలో దూసుకెళ్తోన్న ఓజీ హీరోయిన్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.ప్రస్తుతం ఈ మూవీపై పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కోలీవుడ్ ప్రమఖులు ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం ట్వీట్ చేశారు. మనసుకు నచ్చే అద్భుతమైన కథనం, దృశ్యాలు, ప్రియాంక మోహన్ పాత్రలోని అమాయకత్వం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ప్రియాంక మోహన్ చాలా అద్భుతంగా నటించారని అన్నారు. డైరెక్టర్తో పాటు చిత్రబృందానికి అభినందనలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేశారు.నంబర్వన్గా ట్రెండింగ్..ఈనెల 12న స్ట్రీమింగ్ వచ్చేసిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నంబర్వన్గా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. #MadeInKorea… Such a Warm, feel-good storytelling with lovely visuals. The small-town innocence of @priyankaamohan’s character stands out.. she delivered a beautiful performance… @Rakarthik_dir keeps it simple and engaging! Congratulations to the entire team 🫶 @NetflixIndia… pic.twitter.com/a3jKrMKep1— Naga Vamsi (@vamsi84) March 15, 2026 -
‘ఆస్కార్ 2026’ లైవ్..భారత్లో ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్కార్ (Oscar Awards 2026) అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఉన్న డాల్బీ థియేటర్ ఈ వేడుకకు వేదికైంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ రోజు(మార్చి 15) సాయంత్రం ఈ వేడుక జరుగుతుంది.టైమ్ జోన్ వ్యత్యాసం కారణంగా, ఇండియాలో మనం మార్చి 16 (సోమవారం) ఉదయం చూడాల్సి ఉంటుంది. రెడ్ కార్పెట్ ఈవెంట్ సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ప్రధాన అవార్డుల వేడుక ఉదయం 4:30 గంటలకు మొదలవుతుంది.లైవ్ ఎక్కడ చూడొచ్చు?టీవీలో లేదా మొబైల్లో ఆస్కార్ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఓటీటీ విషయానికొస్తే.. జియోస్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. టెలివిజన్ ప్రసారం విషయానికి వస్తే... ఈ అవార్డుల వేడుకను స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, కలర్స్ ఇన్ఫినిటీ ఛానళ్లలో ప్రసారం చేయనున్నారు. ఒకవేళ మీరు ఉదయాన్నే లైవ్ మిస్ అయితే, అదే రోజు (సోమవారం) రాత్రి 9 గంటలకు కు ఈ ఛానెల్లలో మళ్లీ ప్రసారం చేస్తారు.హోస్ట్ ఎవరు?ప్రముఖ కమెడియన్ కోనన్ ఓ'బ్రియన్ (Conan O'Brien) ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇండియా నుంచి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ ఏడాది అవార్డు ప్రజెంటర్లలో ఒకరుగా పాల్గొంటున్నారు.ఇండియాకు నిరాశే..98వ ఆస్కార్ అవార్డ్సులో భారత్కు నిరాశే ఎదురైంది. మనదేశం నుంచి ఒక్క చిత్రం కూడా అవార్డు రేసులో నిలవలేదు. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం తరపున హిందీ చిత్రం ‘హోమ్బౌండ్’ను పంపింది. కానీ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ఇక ఈ సారి ఉత్తమ నటుడు విభాగంలో అవార్డు కోసం తిమోతి చాలమేట్, లియోనార్డ్ డికాప్రియో, ఈథన్ హాక్, మైఖేల్ బి జోర్డాన్, వాగ్నర్ మౌరా పోటీ పడుతున్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం 10 చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నాయి. -
ఓటీటీలో బోర్డర్-2 సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
బాలీవుడ్ హిట్ ప్రాంఛైజీ చిత్రం బోర్డర్-2 ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సన్నీ డియోల్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలోకి వచ్చింది. 1997లో రిలీజై భారీ హిట్ అందుకున్న బోర్డర్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించారు. ఇందులో వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. 1971 ఇండో-పాక్ యుద్ధం తీవ్రతను, భారత సాయుధ దళాల వీరత్వాన్ని ఈ సినిమా చూపిస్తుంది. అందరిలో దేశభక్తిని రగిల్చేలా ఈ చిత్రం ఉంటుంది.బోర్డర్ 2(Border 2) మూవీ మార్చి 20 నుంచి నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే, హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సుమారు రూ. 275 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 485 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. బోర్డర్ ఫ్రాంచైజీని కొనసాగిస్తూ మరో చిత్రాన్ని కూడా మేకర్స్ ప్రకటించారు.పార్ట్-1 మాదిరే ‘బోర్డర్ 2’ కూడా దేశభక్తిని పెంచేలా ఉంటుంది. భారత్ను దొంగదెబ్బ కొట్టేందుకు పాకిస్థాన్ 1971లో ఎలాంటి కుట్రలు చేసిందో ఈ చిత్రంలో చూడొచ్చు. భారత్పై భూ, జల, వాయు మార్గాల ద్వారా కశ్మీర్, పంజాబ్, గుజరాత్ సరిహద్దుల ద్వారా భారీ దాడులకు దిగుతుంది. అయితే, భారత ప్రభుత్వం దీనిని ముందే గ్రహించి సైనికులను యుద్ధ రంగంలోకి దింపుతుంది. పాక్ సైన్యాన్ని ఎలా మట్టికరిపించారో ఇందులో చూపించారు. -
ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. ప్రేక్షకులకు ట్విస్ట్
ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ్లో కూడా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో సంతోష్ శోభన్ (Santosh Sobhan), మానస వారణాసి (Manasa Varanasi) జంటగా నటించారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. అయితే, ఈ మూవీ విడుదల తర్వాత చిత్ర యూనిట్తో ప్రభాస్ ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల మంచి బజ్ క్రియేట్ అయింది. ఆపై కథలో కూడా విషయం ఉండటంతో బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది.‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో కపుల్ ఫ్రెండ్లీ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం వర్షన్లలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేసింది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే అధనంగా రూ. 279 రెంట్ చెల్లించాల్సి వస్తుంది. ఈ మూవీ కోసం రూ. 3 కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే, బాక్సాఫీస్ వద్ద సుమారుగా రూ. 14 కోట్లకు పైగానే రాబట్టినట్లు తెలుస్తోంది. స్టోరీ నెమ్మదిగా సాగినప్పటికీ కథ బాగుందని ప్రేక్షకులు రివ్యూ ఇచ్చారు.కథేంటంటే..నెల్లూరుకు చెందిన శివ..ఓ బడ్డింగ్ ఆర్కిటెక్ట్. ఉద్యోగం కోసం చెన్నై వస్తాడు. ఏళ్లు గడిచినా ఆయనకు సరైన ప్రాజెక్టు దొరకదు. దీంతో డైలీ ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేస్తుంటాడు. అలా మిత్ర(మానన వారణాసి) అనే అమ్మాయి బైక్ రైడ్లో పరిచయం అవుతుంది. చిత్తూరుకు చెందిన మిత్ర.. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం చెన్నై వస్తుంది. శివలాగే ఆమె కూడా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. ఓ కారణంగా ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురురించి.. లివింగ్ రిలేషన్ని కొనసాగిస్తారు. కొన్నాళ్లకు ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో వీరిద్దరి జీవితంలో ఊహించని పరిణామం ఎదురవుతుంది. అదేంటి? శివ, మిత్ర ఒకే ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. మిత్ర రాకతో శివ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరకు వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. -
నెట్ఫ్లిక్స్తో హైదరాబాద్కు హాలీవుడ్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు హాలీవుడ్ను రప్పించాలనే తన కల నెట్ఫ్లిక్స్ ద్వారా నిజం కాబోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీల పెట్టుబడులను హైదరాబాద్కు రప్పించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారానికి చిరునామాగా ఉన్న తెలంగాణకు వచ్చే పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్కు చెందిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో గురువారం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినిమారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటుండగా, బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఇక్కడ నుంచే వచ్చాయి. ప్రపంచ సంస్థలకు వేదికగా నిలుస్తున్న హైదరాబాద్ అన్ని రకాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తుంది. నెట్ఫ్లిక్స్ విస్తరణకు అవసరమైన అన్ని సదుపాయాలు, సహకారాన్ని మా ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చూపే అద్భుత అవకాశం వినోదరంగంలో పేరొందిన నెట్ఫ్లిక్స్, ఐలైన్ ద్వారా లభిస్తుంది. క్రీడా రంగంలో మౌలిక వసతుల కల్పన, క్రీడా విశ్వ విద్యాలయాల ఏర్పాటు వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలో క్రీడల ప్రసార రంగంలోనూ అడుగుపెడుతున్న నెట్ఫ్లిక్స్ నుంచి సహకారాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో నెటిఫ్లిక్స్ ఆఫీసు నిర్మాణానికి అవసరమైన భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీసును ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలి’అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఐలైన్ స్టూడియో కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్బాబు, దిల్రాజు, రానా, సంజయ్జాజు, జెఫ్షాపిరో తదితరులు తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం: మంత్రి దుద్దిళ్ల యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్ను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ‘హైదరాబాద్కు నెట్ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్లో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవుతుంది. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్లైన్లో నగరం నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుంది. ప్రపంచస్థాయి నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణల వాతావరణంతోపాటు స్థానిక యువత కు భవిష్యత్తు నైపుణ్యాలు ఐలైన్ స్టూడియో ద్వారా అందుబాటులోకి వస్తాయి. పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నెట్ఫ్లిక్స్ భాగస్వామిగా మారాలి’అని శ్రీధర్బాబు చెప్పారు. ఆవిష్కరణలకు కేంద్రం: సంజయ్‘వేగంగా విస్తరిస్తున్న మీడియా, వినోద రంగ మౌలిక సదుపాయాలతో.. ప్రతిభకూ, ఆవిష్కరణలకూ శక్తిమంతమైన కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. సాంకేతిక ఆవిష్కరణలను కథన కళారీతులతో మేళవిస్తూ దక్షిణాసియాలో ముఖ్యమైన కేంద్రంగా ఐలైన్ స్టూడియోస్ సేవలందిస్తుంది. అలాగే దృశ్య శ్రవణ, వినోద రంగాల్లో సరికొత్త అవకాశాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 15వేల పాఠశాలలు, కాలేజీల్లో 500 కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ల ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించింది. తద్వారా సృజనాత్మక రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. భారత సృజనాత్మక సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) త్వరలోనే హైదరాబాద్లో ప్రాంతీయ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించనున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా హైదరాబాద్లో ఐలైన్ స్టూడియోస్ 32వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. ఇందులో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, జనరేటివ్ వర్చువల్ ఎఫెక్ట్స్ కోసం ఆధునిక సాంకేతికత ఉంటుంది, ఈ స్టూడియో లాస్ ఏంజెలిస్, వాంకోవర్, సియోల్, లండన్లో స్థాపించిన నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో సినీ నటుడు రానా దగ్గుబాటి, ఐలైన్ స్టూడియోస్ సీఈఓ జెఫ్ షాపిరో, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. -
ఓటీటీని షేక్ చేసేలా విజయ్ సేతుపతి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
రియలిస్టిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే దర్శకుడు మణికందన్.. కాకా ముట్టై, కడైసి వివసాయి వంటి సినిమాలతో జాతీయ అవార్డ్స్ అందుకున్న ఆయన ‘కాట్టాన్’ (ముత్తు అలియాస్ కాట్టాన్) అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. మార్చి 27న జియోహాట్స్టార్లో విడుదల కానుంది. తమిళ్తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో హీరోగా విజయ్ సేతుపతి నటిస్తున్నడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.జియో హాట్స్టార్(JioHotstar) స్పెషల్ సిరీస్గా మార్చి 27, 2026న కాట్టాన్ (Kaattaan) ప్రీమియర్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ను విజయ్ సేతుపతి తన సొంత ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మించగా.., రాజేష్ మురుగేశన్ సంగీతం సమకూర్చారు. విజయ్ సేతుపతి - మణికందన్ కాంబినేషన్లో ఇప్పటికే ఆండవన్ కట్టలై, కడైసి వివసాయి వంటి బ్లాక్బస్టర్ సినిమాలు వచ్చాయి. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా వీరి కాంబినేషన్లో వెబ్ సిరీస్ రానున్నడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ రా అండ్ రస్టిక్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని మేకర్స్ ప్రకటించారు. ఇందులో విజయ్ సేతుపతి పాత్ర గతంలో ఎన్నడూ చూడని అత్యంత ఉగ్ర రూపంలో కనిపిస్తారని టాక్. ఇందులో హింస తీవ్రత కాస్త ఎక్కువగానే ఉండనుందని తెలుస్తోంది. -
నెట్ఫ్లిక్స్తో నా కల నిజం కాబోతుంది: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్రబింధువుగా హైదరాబాద్లో కార్యకలాపాలు ఆ సంస్థ కొనసాగించనుంది. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను మీడియా ద్వారా పంచుకున్నారు.సినిమాలపై తనకు కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా అన్నారు. 'నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయి. బాహుబలి,కల్కి,ఆర్ఆర్ఆర్ ,అరుంధతి వంటి అత్యనున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయి. చెన్నైలో ఉన్న సినిమాను ఎన్టీఆర్ ,అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్కు తీసుకు వచ్చారు. ఇప్పుడు కాలంతో పాటు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే . మా దృష్టి హాలివుడ్పైనే అని నేను గతంలోనే చెప్పాను. నెట్ఫ్లిక్స్తో నా కల నిజం కాబోతుంది. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు మా పూర్తి సహకారం ఉంటుంది ..ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నాం ..నెట్ఫ్లిక్స్ వ్యాపార విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణలో పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారానికి అనుకూలత ప్రదేశమని సీఎం అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ బోలెడన్ని సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్.. గతేడాది అర డజను మూవీస్ చేసింది. వాటిలో దాదాపు మూడు నాలుగు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. కొత్త ఏడాదిలోనూ ఓ థ్రిల్లర్తో వచ్చింది. ఇప్పుడా సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ')అనుపమ లీడ్ రోల్ చేసిన తమిళ థ్రిల్లర్ మూవీ 'లాక్ డౌన్'. లెక్క ప్రకారం గతేడాది డిసెంబరులో దీన్ని థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఎందుకనో వాయిదాల మీద వాయిదాలు పడింది. ఎట్టకేలకు ఈ జనవరి 30న రిలీజైంది. కానీ ఫ్లాప్ అయింది. లాక్డౌన్ అనేది ముగిసిన కాన్సెప్ట్. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చూపించాలనుకున్నారు. అస్సలు వర్కౌట్ కాలేదు. ఇప్పుడీ చిత్రం సైలెంట్గా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.'లాక్డౌన్' విషయానికొస్తే.. చదువు పూర్తి చేసిన అనిత(అనుపమ పరమేశ్వరన్) ఉద్యోగం ప్రయత్నాల్లో ఉంటుంది. ఓ రోజు స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొంది. తర్వాత కొన్నాళ్లకు ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. దీనిని ఇంట్లో వాళ్ల నుంచి దాచేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ రావడంతో వైద్య సహాయం అందక ఇబ్బంది పడుతుంది. మరోవైపు ఆదాయం కోల్పోయిన కుటుంబం, ఊరికి వెళ్లలేక చిక్కుకున్న కార్మికుడు, ప్రాణాలని లెక్కచేయకుండా పనిచేసే వైద్యులు, ఒంటరితనంతో బాధపడే యువత, విరహ వేదలో ఉన్న ప్రేమ జంటలు కూడా ఈ లాక్ డౌన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటాయి. చివరకు అనిత జీవితం ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీలో తెలుగు రొమాంటిక్ సినిమా.. అధికారిక ప్రకటన
గత నెలలో వాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి వచ్చి హిట్ అయిన తెలుగు సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)ఏ మాత్రం అంచనాల్లేకుండా గత నెలలో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నట్లు క్లిక్ కాలేదు. ఓ వారం తర్వాత ప్రభాస్తో మూవీ టీమ్ ఓ ఇంటర్వ్యూ చేసింది. తర్వాత నుంచి వసూళ్లు కాస్త పికప్ అయ్యాయి. ఓవరాల్గా డీసెంట్ నంబర్లతో థియేట్రికల్ రన్ ముగించుకుంది. గత నెల 14న థియేటర్లలోకి రాగా ఈ శుక్రవారం(మార్చి 13) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'కపుల్ ఫ్రెండ్లీ' విషయానికొస్తే.. శివ(సంతోష్ శోభన్)ది నెల్లూరు. ఉద్యోగ అవకాశాల కోసం చెన్నై వెళ్తాడు. కానీ ఎంతకీ జాబ్ దొరక్క పార్ట్ టైమ్ బైక్ రైడర్గా పనిచేస్తుంటాడు. ఇందులో భాగంగానే ఓ రోజు మిత్ర(మానస వారణాసి) పరిచయమవుతుంది. ఆమెది శివ లాంటి కథే. దీంతో ఇంట్లో వాళ్లకు జాబ్ చేస్తున్నానని అబద్ధాలు చెబుతూ చెన్నైలో బతికేస్తుంటుంది. అనుకోని పరిస్థితుల్లో మిత్ర కూడా శివతో కలిసి ఉండాల్సి వస్తుంది. మరి పెళ్లికి ముందే కలిసున్న శివ-మిత్ర జీవితాలు చివరకు ఎలా మారాయి? ఈ ప్రేమకథ సుఖాంతమైందా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తారకరత్న చివరి గుండె చప్పుడు విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో) -
ఓటీటీకి మలయాళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అక్కడ సూపర్ హిట్ అయినా సినిమాలను డబ్ చేసి అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో మలయాళ హిట్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన మూవీ పెన్నుమ్ పోరాట్టమ్.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 13 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.ఈ సినిమాకు రాజేశ్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాజేశ్ మాధవన్, రైనా రాధాకృష్ణన్, సుభాష్ చంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కేరళలోని ఓ గ్రామం చుట్టూ తిరిగే కథాంశంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ గ్రామంలోని రూల్స్ను ఓ యువతి, ఓ కుక్క ఎలా బ్రేక్ చేశారనే కోణంలో సెటైరికల్గా తెరకెక్కించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Watch Pennum Porattum on Netflix, out 13 March, in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada#PennumPorattumOnNetflix@dawn1720 @ArunCThampi22 @stkframes @binugeorgealex@akhilvishnu_vs— Netflix India South (@Netflix_INSouth) March 10, 2026 -
డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. వాటిలో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', విశ్వక్ సేన్ 'ఫంకీ', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' తదితర మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు జుటోపియా 2, ద తాజ్ స్టోరీ, పూకీ చిత్రాలు కూడా చూడొచ్చనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే ఇప్పుడో తెలుగు సినిమా.. నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. హరర్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: వడివేలుని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా)ప్రశాంత్, అనుశ్రీ అనే కొత్తవాళ్లు హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'రవం'(Ravam Movie). శ్రీరామ్ మన్నార్ దర్శకత్వం వహించాడు. రీసెంట్గానే ఇది ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. సబ్స్క్రిప్షన్ లేకపోయినా సరే ఈ మూవీ చూడొచ్చు. 'రవం' విషయానికొస్తే.. ఓ ఈఎన్టీ డాక్టర్ భూషణ్, తన రీసెర్చ్ నిరూపించుకోవడం కోసం ఆత్మల మీద డాక్యుమెంటరీ తీయమని, తర్వాత నేను మీ సినిమాని నిర్మిస్తానని యువ దర్శకుడు మౌళికి చెప్తాడు. దీంతో మౌళి తన ప్రియురాలు పూజ, స్నేహితుడు రవితో కలిసి పింజర్లపల్లి అనే ఓ మారుమూల పల్లెటూరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే స్టోరీ లైన్.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా.. తెలుగు రివ్యూ) -
మహేశ్ బాబు మెచ్చిన సినిమా.. 8 నెలల తర్వాత ఓటీటీకి..!
గతేడాది బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా దేశ్ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయనని అమిర్ ఖాన్ అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా యూట్యూబ్లోనే విడుదల చేశారు. రెంట్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. కానీ ఈ బిగ్ డీల్ను అమిర్ ఖాన్ తిరస్కరించారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్ స్పష్టం చేశారు.అయితే తాజాగా అమిర్ ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సోనీ లివ్ వేదికగా అందుబాటులోకి రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు.మహేశ్ బాబు ప్రశంసలు...ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్బాబు ప్రశంసలు కురిపించాడు. సితారే జమీన్ పర్.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
ఓటీటీలో క్రేజీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా.. తెలుగు రివ్యూ
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు సంగతి పక్కనబెడితే ఓటీటీల్లోనూ నేరుగా కొన్ని మూవీస్ స్ట్రీమింగ్లోకి వస్తుంటాయి. అలా గత వీకెండ్ వచ్చిన హాలీవుడ్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'వార్ మెషీన్'. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ దృష్టిలో పడింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఇది నిశ్చితార్థం కాదు.. షాకిచ్చిన హీరో బెల్లంకొండ.. కాబోయే భార్య ఫొటోలు)కథేంటి?అది అఫ్ఘానిస్తాన్లోని ఓ ప్రాంతం. పాడపోయిన తన తమ్ముడి ఆర్మీ కాన్వాయ్ బాగు చేసేందుకు అమెరికన్ ఆర్మీకి చెందిన స్టాఫ్ సార్జెంట్ (అలెన్ రిచ్సన్) వస్తాడు. సరిగ్గా అప్పుడే తాలిబన్లు వీరిపై దాడి చేస్తారు. దీని నుంచి సార్జెంట్ మాత్రమే ప్రాణాలతో బయటపడతాడు. తర్వాత అమెరికన్ ఆర్మీలోని అత్యంత కష్టమైన రేంజర్ కావాలనుకుంటాడు. నాలుగుసార్లు తిరస్కరణకు గురైనా సరే చివరకు ట్రైనింగ్కి ఎంపికవుతాడు. శిక్షణలో భాగంగా చివరి దశకు చేరుకుంటాడు. చిట్టచివరి పరీక్షలో పాసైతే చాలు అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటనలు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి? సార్జెంట్.. ఏలియన్ షిప్తో ఎందుకు తలపడాల్సి వచ్చింది? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు గానీ దీన్ని థియేటర్లో విడుదల చేసుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అలాంటి అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే 100 నిమిషాలున్న ఈ మూవీ.. మొదటి సీన్ నుంచి చివరవరకు అసలు గ్యాప్ అనేది లేకుండా అదరగొట్టేసింది. ఓవైపు యాక్షన్ చూపిస్తూనే.. మరోవైపు ఏలియన్ షిప్ చేస్తున్న దాడి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనే పాయింట్ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.అసలు అమెరికన్ ఆర్మీ ఎలా ఉంటుంది? ఆర్మీలోని రేంజర్ కావాలంటే ఎలాంటి పరీక్షలు పెడతారు? ఎంతలా కష్టపడాల్సి వస్తుందనే విషయాల్ని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. హీరోతో సహా మిగతా పాత్రధారులు ఎవరూ కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అయినా సరే చివరివరకు ఆపకుండా చూసేంత ఎంగేజింగ్గా మూవీని తెరకెక్కించారు.సింపుల్గా తేల్చేయొచ్చు అనుకునే పరిస్థితుల్లో ఊహించని విధంగా ఏలియన్ షిప్ దాడి చేసి.. కనిపించిన వాళ్లని కనిపించినట్లు చంపేస్తుంటే.. హీరో తను బయటపడటంతో పాటు మరో వ్యక్తిని ఎలా రక్షించాడు. చివరకు బతికి బట్టకట్టడంతో పాటు రేంజర్ అయ్యాడా లేదా అనేది తెలియాలంటే ఫుల్ మూవీ చూసేయాల్సిందే.మిలటరీ కాన్సెప్ట్, యాక్షన్-సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ అంటే ఆసక్తి ఉంటే మాత్రం దీనిపై లుక్కేయండి. కచ్చితంగా నచ్చేస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ప్రధాన పాత్ర చేసిన రిచ్సన్ తనదైన యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఓటీటీలో ఏదైనా ఓ మంచి యాక్షన్ మూవీ చూద్దానుకుంటే మాత్రం ఇదో బెస్ట్ ఆప్షన్.- చందు డొంకాన(ఇదీ చదవండి: పనిచేసినా రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన) -
రణ్వీర్ సింగ్ దురంధర్-2.. ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఫిక్స్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం హిందీలోనే రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ ఖరారైంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్రైలర్లోనే వెల్లడించారు. థియేటర్లలో రిలీజైన తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. కాగా.. ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.పోటీ నుంచి తప్పుకున్న టాక్సిక్..ఈ మూవీతో మార్చి 19న యశ్ హీరోగా వస్తోన్న టాక్సిస్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే బాక్సాఫీస్ పోటీ నుంచి యశ్ తప్పుకున్నారు. గీతు మోహన్దాస్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్టర్ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్
వచ్చేవారం ఉగాది కానుకగా 'ధురంధర్ 2', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ఈ వారం బాక్సాఫీస్ని ఖాళీగానే వదిలేశారు. రావాల్సిన 'బ్యాండ్ మేళం' కూడా వాయిదా పడింది. దీంతో కొత్త మూవీసేం రావట్లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం స్టార్ హీరోలు చేసిన తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి. మొత్తంగా 15 వరకు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్!)ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', విశ్వక్ సేన్ 'ఫంకీ', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు జూటోపియా 2, ద తాజ్ స్టోరీ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 9 నుంచి 15 వరకు)నెట్ఫ్లిక్స్వన్ పీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 10మేడిన్ కొరియా (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 12వర్జిన్ రివర్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 12ఫంకీ (తెలుగు సినిమా) - మార్చి 12అమెజాన్ ప్రైమ్ఆస్పిరెంట్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మార్చి 13లోకల్ టైమ్స్ (తమిళ సిరీస్) - మార్చి 13హాట్స్టార్రిసార్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 13ద సొసైటీ సీజన్ 2 (హిందీ రియాలిటీ సిరీస్) - మార్చి 09జూటోపియా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 13ద ఫ్యామిలీ మెక్ములెన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15జీ5పూకీ (తమిళ సినిమా) - మార్చి 13భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు మూవీ) - మార్చి 13అంధ ప్యార్ 2.0 (రియాలిటీ షో) - మార్చి 14లయన్స్ గేట్ ప్లేద తాజ్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 13ఎమ్ఎక్స్ ప్లేయర్సంకల్ప్ (హిందీ సిరీస్) - మార్చి 11సన్ నెక్స్ట్నాంగళ్ (తమిళ సినిమా) - మార్చి 13ఫ్రైడే (తమిళ మూవీ) - మార్చి 13(ఇదీ చదవండి: నటుడు పార్తిబన్ పరువు తీసేసిన త్రిష.. ట్వీట్ వైరల్) -
ఓటీటీలో 'ది తాజ్ స్టోరీ'.. వివాదస్పద సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్
బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ నటించిన చిత్రం ‘ది తాజ్ స్టోరీ’. సుమారు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి ఈ చిత్రం రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. అక్టోబర్ 31, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం వివాదాస్పదంగా నిలిచింది. సురేశ్ ఝూ ఈ మూవీని నిర్మించగా.. దర్శకుడు తుషార్ అమ్రిష్ గోయెల్ తెరకెక్కించారు. జాకీర్ హుస్సేన్, అమృత ఖాన్విల్కర్, స్నేహ వాఘ్, నమిత్ దాస్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు.ది తాజ్ స్టోరీ మూవీ లయన్స్గేట్ ప్లే(Lionsgate Play)లో ప్రసారం కానుంది. మార్చి 13 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. తాజ్మహల్ను నిర్మించింది నిజంగా షాజహానా..? లేకపోతే దాని వెనుక ఏదైనా తెలియని రహస్యం ఉందా..? అనే పరిశోధన ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. సినిమా పోస్టర్ విడుదల సమయంలో తీవ్రమైన వివాదం కొనసాగింది. తాజ్ మహల్ నుంచి శివుని విగ్రహం బయటకు వస్తున్న దృశ్యంతో విడుదలైన పోస్టర్ అనేక చర్చలకు దారితీసింది. విష్ణు దాస్ అనే టూర్ గైడ్ తాజ్ మహల్ వెనుక దాగిఉన్న నిజమైన చరిత్రను వెలికితీసే ప్రయాణమే ఈ చిత్రం.తాజ్ మహల్ ఒక పురాతన శివాలయం ("తేజో మహాలయ") అని, దీనిని షాజహాన్ ఆక్రమించి సమాధిగా మార్చాడని చరిత్రకారుడు పి.ఎన్. ఓక్ వాదించిన వివాదాస్పద సిద్ధాంతం. ఇది శివాలయమని, 4వ శతాబ్దంలో రాజా పరమార్ధి దేవ్ నిర్మించారని, 17వ శతాబ్దంలో షాజహాన్ దీనిని మార్చారని కొందరు నమ్ముతారు, కానీ పురాతత్వ శాఖ దీనిని నిరాకరించింది. ఇదే పాయింట్తో సినిమా ఉందని వాదనలు రావడంతో చరిత్రకారులు, న్యాయవాదులు ఈ విషయంపై కోర్టులో పోరాటానికి దారితీసింది. -
హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్.. భారీగా అవకాశాలు
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో అతిపెద్ద కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్రబింధువు కానుంది. ఇక్కడ ప్రపంచస్థాయి వీఎఫ్ఎక్స్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్ హౌజ్ను ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధి కూడా కల్పించనుంది. ‘నెట్ఫ్లిక్స్ స్టూడియోస్’ హైదరాబాద్కు రావడంతో టాలీవుడ్ పరిశ్రమలో కొత్త శకం మొదలు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. నెట్ఫ్లిక్స్ భారత్లో అడుగు పెట్టి పదేళ్లు పూర్తి అయింది.ఈ నేపథ్యంలోనే కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనుంది. అయితే, ఇప్పటికే ముంబై నుంచి నెట్ఫ్లిక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్లో రెండో కార్యాలయం అవుతుంది. ఇక నుంచి హైదరాబాద్లోనే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (ఏవీజీసీ) రంగం మరింత మరింత బలోపేతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రతిభ ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ సేవలను కూడా ఇక నుంచి హైదరాబాద్ నుంచే కొనసాగనున్నాయి. -
ఓటీటీలో ఫంకీ సినిమా.. స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది
టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ నటించిన కొత్త సినిమా ఫంకీ ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఫిబ్రవరి 13న విడుదలైన ఈ చిత్రం ఆశించినంత రేంజ్లో మెప్పించలేదు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన ఈ సినిమా వాలెంటైన్ వీక్ స్పెషల్గా విడుదలైంది. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో ఎస్.నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఫంకీ చిత్రాన్ని నిర్మించారు. నరేష్, ఈశ్వరీ రావు, సంపత్ రాజ్, జై కృష్ణ, వీటీవీ గణేశ్ తదితరలు నటించారు.ఫంకీ సినిమా నెట్ఫ్లిక్స్ (Netflix)లో విడుదల కానుంది. మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ కానుందని అప్కమింగ్ సినిమాల జాబితాలో ఆ సంస్థ ఫంకీని చేర్చింది. ప్రస్తుతానికి తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ‘జాతి రత్నాలు’తో ఊహించని విజయాన్ని అందుకున్న దర్శకుడు కేవీ అనుదీప్ ఈ మూవీని తెరకెక్కించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుమారు 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 10 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.కథేంటంటే.. కోమల్ (విశ్వక్ సేన్) ఓ నూతన సినీ దర్శకుడు. ‘మంచి ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థలో ‘ఫంకీ’ అనే సినిమాను తెరకెక్కించే అవకాశం వస్తుంది. రూ. 4 కోట్ల బడ్జెట్లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్(నరేశ్) హామీ ఇచ్చి.. రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. అయినా కూడా సినిమా పూర్తికాదు. బడ్జెట్ భారీగా పెరిగిపోయిందనే టెన్షన్తో నిర్మాత సుదర్శన్ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఆయన కూతురు చిత్ర(కయాదు లోహర్) తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బాధ్యతల నుంచి తప్పించడంతో కోమల్ ఏం చేశాడు? రూ. కోటి బడ్జెట్లో మిగిలిన సినిమాను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని కోమల్ నిలబెట్టుకున్నాడా లేదా? కోమల్తో చిత్ర ఎలా ప్రేమలో పడింది? ఈ కథలో జీకే (సంపత్ రాజ్) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. కాళ్లు పట్టుకుని క్షమాపణలు
మాస్క్ మ్యాన్.. బిగ్బాస్ కంటే ముందే ఈ పేరు బాగా ఫేమస్ అయింది. బిగ్బాస్ 9లో అడుగుపెట్టాలంటే అగ్నిపరీక్ష దాటాలని సామాన్యుల కోసం ఓ షో ఏర్పాటు చేశారు. అందులో మాస్క్ మ్యాన్ పాల్గొన్నాడు. తన పేరు హరిత హరీశ్ అని తెలిపాడు. భార్యపై ఉన్న ప్రేమతో ఇల్లాలి పేరునే తన పేరులో చేర్చుకున్నట్లు తెలిపాడు. అది విని భార్యంటే ప్రేమ, గౌరవం బాగానే ఉందని అందరూ అనుకున్నారు.కోపమొస్తే కొట్టేస్తావా?కానీ, అంతలోనే ఒకసారి భార్యపై చేయి చేసుకున్నానని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఎంత కోపం వస్తే మాత్రం కొట్టేస్తావా? ఆడదానిపై చేయెత్తుతావా? అని తిట్టిపోశారు. అలా నెగెటివిటీతోనే బిగ్బాస్ 9వ సీజన్లో సామాన్యుడిగా అడుగుపెట్టాడు. తన ముక్కుసూటితనం, మొండితనం, కోపం వల్ల ఎక్కువమందిని ఆకర్షించలేకపోయాడు.కాళ్లు పట్టుకుని క్షమాపణలుఅయితే ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి వస్తున్నాడు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో భార్య హరితతో కలిసి హరీశ్ పాల్గొన్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో మాస్క్ మ్యాన్ మాట్లాడుతూ.. మగాడు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాడని చెప్పి ఆడవారిపై చేయత్తడం చాలా తప్పు అంటూ భార్య కాళ్లు నమస్కరించాడు. అలా అప్పటి వివాదానికి ఇలా ఫుల్స్టాప్ పెట్టాడు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కపుల్ రియాలిటీ షో మార్చి 15న ప్రారంభం అవుతోంది. ఇది మా టీవీతో పాటు హాట్స్టార్లో ప్రసారం కానుంది. చదవండి: తండ్రి మరణించిన పదేళ్లకు ఆయన కల నెరవేర్చిన కూతురు -
ఫ్రైడే ఓటీటీ సినిమాల సందడి.. ఒక్క రోజే ఏకంగా 12 చిత్రాలు..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో శ్రీ విష్ణు మృత్యుంజయ్, వరలక్ష్మీ శరత్కుమార్ సరస్వతి లాంటి సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. వీటితో పాటు చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి లాంటి చిన్న సినిమాలు థియేటర్లకు వచ్చేస్తున్నాయి. అయితే వీటిపై పెద్దగా బజ్ లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే విత్ లవ్, గాంధీ టాక్స్ అనే డబ్బింగ్ మూవీస్ సందడి చేయనున్నాయి. వీటితో పలు వెబ్ సిరీస్లు, చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. అంతేకాకుండా మరికొన్ని సినిమాలు సడన్గా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ ఫ్రైడే ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06 హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - మార్చి 06 వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 06బాయ్ ఫ్రెండ్ ఆన్ డిమాండ్(హాలీవుడ్ సిరీస్)- మార్చి 06 స్టిల్ షైనింగ్(కొరియన్ వెబ్ సిరీస్)- మార్చి 06జియో హాట్స్టార్ విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) - మార్చి 06 టెడ్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మార్చి 06సోనీ లివ్ లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) - మార్చి 06సన్ నెక్స్ట్ డియర్ రథి (తమిళ సినిమా) - మార్చి 06 గ్రానీ (తమిళ మూవీ) - మార్చి 06జీ5 గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06 జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) - మార్చి 06 -
ఓటీటీలో జెన్జీ లవ్స్టోరీ.. స్ట్రీమింగ్పై ప్రకటన
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ హీరోగా నటించిన చిత్రం 'బూకి'.. ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని విజయ్ ఆంటోనీ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ధనుషా హీరోయిన్గా నటించగా సునీల్, లక్ష్మి మంచు కీలకపాత్రల్లో మెప్పించారు.రొమాంటిక్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బూకి' (Bookie) చిత్రం.. మార్చి 13న జీ5 (Zee 5) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళ్ వర్షన్లో అందుబాటులో ఉండనుందని ప్రకటించింది. అయితే, తెలుగు వర్షన్ కూడా అదేరోజున విడుదల కావచ్చని సమాచారం. ‘మార్గన్’ సినిమాతో నటుడిగా అజయ్ ధీషన్ మంచి గుర్తింపు తెచ్చకున్న విషయం తెలిసిందే. జెన్జీ లవ్స్టోరీ అంటూ కొందరు ఈ మూవీని ప్రశంసించినా.. మరికొందరు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదని తెలిపారు. మరి ఓటీటీలో ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి. -
OTT: నేటి తరం తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది
నాడు రాత్రిపూట మేడ మీద మన తాతలు, అవ్వలు చెప్పిన కథలు ఎంతో వినసొంపుగా ఉండేవి. అప్పట్లో విన్న ఆ కథల ముందు ఎంతటి సినిమాలైనా దిగదుడుపే. ఇప్పుటి తరానికి ఆ అదృష్టం లేదు. కాని నేటి దర్శకులు మాత్రం అప్పటి పెద్ద వారు చెప్పిన కథలలాగే తమ సినిమాలను తీర్చిదిద్ది ఇప్పటి తరం ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే కోవకు చెందినది ఆహా వేదికగా స్ట్రీమ్ అవుతున్న హిలేరియస్ డ్రామా అయిన హాట్ స్పాట్ 2మచ్ సినిమా. ఈ సినిమా తప్పనిసరిగా నేటి తరాన్ని ఉద్దేశించినది. అందుకే వారి పరిభాషలో అర్థవంతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు విఘ్నేష్ కార్తీక్. నిజానికి హాట్ స్పాట్ సిరీస్ లో వచ్చిన రెండో భాగమిది. కాని మొదటిదానికి ఈ భాగానికి అస్సలు సంబంధం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఈ హాట్ స్పాట్ 2మచ్ సినిమా మూడు కథల సమాహారం. అభిమానం, పరువుల తో పాటు ప్రేమవంటి మూడు ప్రధానమైన అంశాలతో కూడిన కథలతో మన ముందుకొచ్చిన సినిమానే ఈ హాట్ స్పాట్ 2మచ్.అంతులేని అభిమానం ఎంతటి దారుణానికి దారి తీస్తుందో ఆపై వ్యక్తిగత స్వేచ్ఛ కుటుంబ పరువుకు ఎంత భారమవుతుందో అలాగే చిగురించని స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఇబ్బంది పెడుతుందో కూడా దర్శకుడు ఎంతో అందంగా ఈ సినిమాలో మలిచాడు. ప్రతి కథ ముగిసే ముందు వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసి స్ఫూర్తినిస్తాయి. మరీ ముఖ్యంగా మూడో కథ ఎక్కువ కల్పితంలా అనిపించినా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు మాత్రం మతి పోగొడుతుంది. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. ఈ సినిమా ఇప్పటి, రేపటి తరం తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమిది. అలా అని సినిమా మొత్తం సందేశాలతో ఉండదు. నేటి, నాటి తరానికి వినోదమనే మసాలతో పసందైన సందేశాన్ని రుచికరమైన విందు రూపంలో వడ్డించాడు దర్శకుడు. మరింకెందుకాలస్యం హ్యావ్ ది డెలీసియస్ ఫన్ ఫీస్ట్ ఫర్ ది వీకెండ్-హరికృష్ణ ఇంటూరు -
ఓజీ హీరోయిన్ ఓటీటీ మూవీ.. ఎమోషనల్గా ట్రైలర్
మొబైల్ ఫోన్ వినియోగం పెరిగాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. అలాగే ఓటీటీలు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ అంతా ఎంచక్కా ఉన్నచోటునే చూసే అవకాశం లభించింది. అలా చాలామంది కొరియన్ సినిమాలు, సిరీస్లకు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా కొందరమ్మాయిలైతే బానిసలైపోయారు!ఓటీటీ సినిమాదీంతో ఈ కొరియన్ కాన్సెప్ట్తో ఓ మూవీ తీశారు. ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ వదిలారు. అందులో ఓ అమ్మాయికి చిన్నప్పటినుంచి కొరియా అంటే చాలా ఇష్టం. కనీసం ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలన్నది తన కోరిక. అనుకున్నట్లుగా పెద్దయ్యాక ఎలాగోలా కొరియా వెళ్తుంది. కానీ అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అదే ట్రైలర్లో చూపించారు.మనసు చెప్పేది వినండిమనకు నచ్చిన పనిచేయడం కోసం ఎంతదూరమైనా వెళ్లొచ్చు. నీవల్ల కాదు అంటారు. తెలియనివారు మనపై ప్రేమ చూపిస్తారు.. బాగా తెలిసినవారు మనల్ని బాధపెడతారు. ఎంత ఏడ్చినా, ఎంత నవ్వినా.. మనల్ని చీరప్ చేసి మేమున్నామంటూ మనకోసం నలుగురు వస్తారు. ఈ అనుభవాల్ని మీకు ఎదురవ్వాలంటే మీ మనసు చెప్పేది వినండి అని హీరోయిన్ చెప్పే డైలాగ్ బాగుంది. మేడ్ ఇన్ కొరియా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 12న విడుదల కానుంది. చదవండి: ఆస్తుల్లేవ్.. అద్దె ఇంట్లో ఉంటున్నా: వరలక్ష్మి -
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి పలు తెలుగు సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. ఓం శాంతి శాంతి శాంతిః, దేవగుడి, వంచన తదితర చిత్రాలు ఇప్పటికే స్ట్రీమింగ్లోకి రాగా.. మరికొన్ని మూవీస్ వీకెండ్లో అందుబాటులోకి రానున్నాయి. వాటిలో గాంధీ టాక్స్, కృష్ణ సదా సహాయతే, విత్ లవ్, తన్వి ది గ్రేట్ తదితర సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు థ్రిల్లర్ చేరింది. దాదాపు ఏడాది తర్వాత ఇది స్ట్రీమింగ్లోకి వస్తోంది. ఇంతకీ అదేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోహీరోయిన్లు నిర్మాతలు వస్తూనే ఉంటారు. అలా తీసిన ఓ సినిమా 'అనగనగా ఆస్ట్రేలియాలో'. జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్ హీరోహీరోయిన్లుగా నటించగా.. తారకరామ దర్శకత్వం వహించారు. పేరుకు తగ్గట్లే పూర్తిగా ఆస్ట్రేలియాలోనే తీసిన ఈ మూవీ గతేడాది మార్చి 21న థియేటర్లలోకి వచ్చింది. అందరూ కొత్త నటీనటులే కావడంతో ఇదొకటి రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడీ చిత్రం ఆహా ఓటీటీలోకి శుక్రవారం (మార్చి 06) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'అనగనగా ఆస్ట్రేలియాలో' విషయానికొస్తే.. హీరో (జ్యోతినాథ్) ఆస్ట్రేలియాలో క్యాబ్ డ్రైవర్గా చేస్తుంటాడు. హీరోయిన్(సాన్య భట్నాగర్) అక్కడే చదువుకుంటూ ఉంటుంది. మరోవైపు భారత్లో ఓ రాజకీయ నేత తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నప్పుడు.. ఆస్ట్రేలియా నుంచి ఒకరు ఫోన్ చేసి మీ రహస్యం నా దగ్గరుందని చెప్పి భయపెడతాడు. దీని పని తేల్చాలని సదరు నాయకుడు.. ఓ కిల్లర్కి అప్పజెబుతాడు. ఓ రోజు అనుకోకుండా ఆ రహస్యం హీరోయిన్ చేతిలో పడుతుంది. దీంతో కిల్లర్, రాజకీయ నాయకుడు.. ఈ అమ్మాయి వెంట పడతారు. తర్వాత ఏమైంది? మరి హీరోహీరోయిన్ ప్రేమకథ సంగతేంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్కి ముందు భారీ మార్పులు?) -
అందరూ మర్చిపోయిన టైంలో 'అన్నగారు' ఓటీటీలోకి
తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్లే ఇతడి సినిమాలు రెండు భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. అయితే గత చిత్రం మాత్రం కేవలం తమిళం వరకే పరిమితమైంది. దానికి చాలానే కారణాలున్నాయి. ఈ మూవీ అటు థియేటర్లలో రిలీజైంది. ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్లోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ మళ్లీ ఎందుకు ఓటీటీలో విడుదల చేస్తున్నారు? ఏమైంది?(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)దాదాపు రెండు మూడేళ్లుగా సెట్స్పై ఉన్నకార్తీ సినిమా 'వా వాతియర్'. లెక్ ప్రకారం గతేడాది డిసెంబరు 5నే రిలీజ్ కావాలి. కానీ ఓ ఫైనాన్సియర్.. ఈ చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై కోర్టులో కేసు వేయడంతో వాయిదా పడింది. ఆయనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తేనే మూవీ రిలీజ్ ఉంటుందని, లేదంటే అప్పటివరకు కష్టమే అని కోర్టు చెప్పింది. దీంతో తప్పని పరిస్థితుల్లో డబ్బులు కట్టారు. అప్పటికే డిసెంబరు దాటిపోయింది. సంక్రాంతికి రావాల్సిన 'జన నాయగణ్' వాయిదా పడేసరికి ఆదరబాదరాగా జనవరి 14న తమిళనాడులోని థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. కానీ తొలి ఆటకే ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది.కట్ చేస్తే రెండు వారాలు తిరిగేసరికల్లా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి కూడా 'వా వాతియర్' సినిమా స్ట్రీమింగ్లోకి వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే తమిళ వెర్షన్ కోసం సిద్ధం చేసిన ప్రింట్నే తెలుగు వెర్షన్ కోసమూ రిలీజ్ చేశారు. దీంతో తెరపై బొమ్మ ఎమ్జీఆర్ కనిపిస్తుంటే.. డైలాగ్స్లో మాత్రం ఎన్టీఆర్ అని వినిపించేది. దీంతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫొటోలతో ఉన్న ప్రింట్ని లేటెస్ట్గా ఈ శుక్రవారం(మార్చి 06) నుంచి స్ట్రీమింగ్లోకి తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే అందరూ దాదాపుగా ఈ మూవీ గురించి మర్చిపోయిన టైంలో దీన్ని తీసుకురావడం వల్ల ఉపయోగం అయితే ఉండకపోవచ్చనే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'కి లైన్ క్లియర్.. 'టాక్సిక్' వాయిదా)PSA: Anna Gari Aagamanam 📢#AnnagaruVostaruOnPrime, New Movie, March 6 @Karthi_Offl @IamKrithiShetty #NalanKumarasamy @Music_Santhosh @StudioGreen2 @gnanavelraja007 #Rajkiran #Sathyaraj #Anandaraj @GMSundar_ #Karunakaran pic.twitter.com/kWxcY2tCCv— prime video IN (@PrimeVideoIN) March 3, 2026 -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ప్రతివారం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా ఓం శాంతి శాంతి శాంతిః, విత్ లవ్, గాంధీ టాక్స్, తన్వి ది గ్రేట్, లాలో కృష్ణ సదా సహాయతే తదితర మూవీస్ స్ట్రీమింగ్లోకి రానున్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ రెండు చిత్రాలు ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్గా స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో అందుబాటులోకి వచ్చాయి?(ఇదీ చదవండి: యంగ్ హీరోలని డామినేట్ చేసిన డీ గ్లామర్ బామ్మ సినిమా)'వంచన' అనే కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. 2024 నవంబరు 8న థియేటర్లలోకి వచ్చింది. ఉమా మహేశ్ హీరోగా నటించి దర్శకత్వం కూడా వహించాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలోకి మంగళవారం నుంచి స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఈ మూవీ విషయానికొస్తే.. ఓ చర్చి ఫాదర్ దారుణ హత్యకు గురవుతాడు. దీంతో అనుమానితుడిగా ఉన్న అతడి డ్రైవర్ని అరెస్ట్ చేస్తారు. అయితే సదరు డ్రైవర్ నిర్దోషి అని నమ్మిన క్రిమినల్ లాయర్ కృష్ణ.. ఈ కేసుని వాదించేందుకు సిద్ధమవుతాడు. దర్యాప్తులో భాగంగా లాయర్ కృష్ణకు ఎదురైన సవాళ్లేంటి? హంతకుడు ఎవరు? అనేదే మిగతా స్టోరీ.అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'దేవగుడి'. జనవరి 30న థియేటర్లలోకి వచ్చింది. చిన్న సినిమా కావడంతో జనాలు దీన్ని పట్టించుకోలేదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు. ఇది కూడా ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలోనే అందుబాటులోకి వచ్చింది. 'దేవగుడి' విషయానికొస్తే.. వీరారెడ్డి(రఘు కుంచె) ఓ ఫ్యాక్షన్ లీడర్. తన అనుచరుల్లో ఒకరి కొడుకు అయిన ధర్మ(అభినవ్ శౌర్య), తన కొడుకుతో స్నేహంగా ఉండటాన్ని తట్టుకోలేడు. ధర్మతో తన కూతురు శ్వేత(అనుశ్రీ) ప్రేమలో ఉందని తెలిసి అతడిని ఊరి నుంచి గెంటేస్తాడు. తర్వాత కొన్నాళ్లకు వీరారెడ్డి అనారోగ్యానికి గురవడంతో అతడిని శత్రువులు చంపేస్తారు. మరోవైపు శ్వేత కనిపించకుండా పోతుంది. శ్వేతని ఎవరు కిడ్నాప్ చేశారు? ధర్మ-ఈమె ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ) -
ఓటీటీలో 'తన్వి ది గ్రేట్' సినిమా.. సడెన్గా స్ట్రీమింగ్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించి, నటించిన 'తన్వి ది గ్రేట్' (2025) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది విడుదలైన ఈ చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించిన విషయం తెలిసిందే. ఆటిజంతో బాధపడుతున్నప్పటికీ ఆర్మీలో చేరాలనే ఒక యువతి కల జీవితమే ఈ సినిమా.. ఇందులో శుభంగి దత్తా ప్రధాన పాత్ర పోషించంది. జాకీష్రాఫ్, అరవిందస్వామి, బొమన్ ఇరానీ, పల్లవి జోషి, నాజర్ వంటి స్టార్స్ ఈ మూవీలో నటించారు.‘తన్వి ది గ్రేట్’ (Tanvi The Great) మూవీ సడెన్గా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇరవై రెండేళ్ల తర్వాత అనుపమ్ ఖేర్ మళ్లీ మెగాఫోన్ పట్టారు. గతంలో ‘ఓం జై జగదీష్’ (2002) చిత్రానికి దర్శకత్వం వహించిన అనుపమ్ ఖేర్.. గతేడాది ‘తన్వీ ది గ్రేట్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించబడింది. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆటిజం అనే అడ్డంకిని అధిగమించి ఆర్మీలో చేరాలనే కలను ఎలా నెరవేర్చిందన్నదే ఈ కథ ప్రధాన కథాంశం.ఈ చిత్రాన్ని ఎన్ఎఫ్డీసీతో కలిసి అనుపమ్ స్టూడియోస్ నిర్మించింది. -
ఒక్కరోజు ముందే ఓటీటీలో 'ఓం శాంతి శాంతి శాంతిః' స్ట్రీమింగ్
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 30న విడుదలైన ఈ సినిమా మేకర్స్ అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే, ఓటీటీ ఫ్యాన్స్ను ఈ మూవీ మెప్పిస్తుందని అంచనా వేస్తున్నారు. 2022లో విడుదలైన మలయాళ హిట్ సినిమా జయ జయ జయ జయహే రీమేక్గా తెలుగులో ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ సజీవ్ తెరకెక్కించారు.‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ ఆహా తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 4న స్ట్రీమింగ్కు రావాల్సిన ఈ మూవీ గోల్డ్ సబ్స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే అందుబాటులోకి వచ్చేసింది. సహనం కోల్పోయిన తర్వాత ఒక ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో ఈ మూవీతో ఈషా రెబ్బా చూపించింది. కథేంటంటే..శాంతి(ఈషా రెబ్బా) చిన్నప్పటి నుంచే తనకు నచ్చినట్లు ఉండాలని అనుకునే అమ్మాయి. మంచి చదువు, ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కంటూ పెరుగుతుంది. ఇంటర్ తర్వాత పట్నం వెళ్లి చదువుకోవాలని కోరుకుంటుంది. కానీ, తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో ఇంటికి దగ్గరలో ఉన్న ఒక కాలేజీలో డిగ్రీలో చేరుతుంది. తను చదువుకే కాలేజీలో జరిగిన ఒక సంఘటన వల్ల చదువు ఆపేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతలో తల్లిదండ్రులు శాంతికి పెళ్లి సంబంధం చూస్తారు. కానీ, తను మాత్రం బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని అనుకుంటుంది.అయితే, ఆమెను పెళ్లి చేసుకునేందుకు నాయుడు (తరుణ్ భాస్కర్) వస్తాడు. పెళ్లి తర్వాత చదివిస్తానని మాట ఇస్తాడు. దీంతో ఆమె సంతోషంగా పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత నాయుడులోని పురుషాహంకారం బయటకు వస్తుంది. చీటికిమాటికి శాంతిపై చేయి చేసుకుంటాడు. దీంతో శాంతి కన్నీళ్లు పెట్టుకుని తన తల్లిదండ్రులతో చెబితే సర్దుకుపోవాలని సూచిస్తారు. ఒకరోజు రాయుడిపై శాంతి తిరగబడుతుంది. చేయిచేసుకున్న భర్తను శాంతి చితకబాదుతుంది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటి జంట మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి..? విడాకులు తీసుకుందామంటే ఎలాంటి చిక్కులు వచ్చాయి..? ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న శాంతి తన మనసు ఎందుకు మార్చుకుంది..? అనేది తెలియాలంటే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా చూడాల్సిందే. -
ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
2026లో రెండు నెలలు పూర్తయిపోయాయి. మార్చి వచ్చేసింది. అలానే కొత్తవారం కూడా మొదలైంది. ఈ వీకెండ్ థియేటర్లలోకి మృత్యుంజయ్, సరస్వతి, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 13కి పైగా కొత్త మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. ఓం శాంతి శాంతి శాంతిః లాంటి తెలుగు చిత్రంతో పాటు విత్ లవ్, గాంధీ టాక్స్ అనే డబ్బింగ్ మూవీస్ ఇదే వీకెండ్ అందుబాటులోకి వస్తాయి. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఓటీటీలోకి వస్తుందేమో చూడాలి. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రాలేదు. బహుశా ఈ వారం రావొచ్చేమో చూడాలి? ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 02 నుంచి 08 వరకు)నెట్ఫ్లిక్స్విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - మార్చి 06వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 06అమెజాన్ ప్రైమ్తన్వి ద గ్రేట్ (హిందీ మూవీ) - మార్చి 03యంగ్ షెర్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04సుబేదార్ (హిందీ సినిమా) - మార్చి 05హాట్స్టార్విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) - మార్చి 06ఆహాఓం శాంతి శాంతి శాంతిః (తెలుగు సినిమా) - మార్చి 04సోనీ లివ్లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) - మార్చి 06సన్ నెక్స్ట్డియర్ రథి (తమిళ సినిమా) - మార్చి 06గ్రానీ (తమిళ మూవీ) - మార్చి 06జీ5గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) - మార్చి 06(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్) -
ఓటీటీలో హిట్ సినిమా.. విత్ లవ్ రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకుడిగా, హీరోగా తొలి సినిమాలకే హిట్టు కొట్టి సెన్సేషన్ అయ్యాడు అభిషన్ జీవింత్. ఇతడు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో డైరెక్టర్గా పరిచయమయ్యాడు. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం ఏకంగా రూ.90 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. నెక్స్ట్ సినిమా ఎవరితో అనుకుంటున్న తరుణంలో ఈ యంగ్ డైరెక్టర్ హీరోగా మారాడు. విత్ లవ్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు.ఓటీటీలో విత్ లవ్అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించాడు. సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా వ్యవహరించింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా విత్ లవ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లోకి వచ్చేస్తుంది. మార్చి 6 నుంచి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి మరి.కథేంటంటే?సత్య (అభిషన్ జీవింత్) ఆర్కిటెక్ట్.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అలా ఒకరోజు అక్క బలవంతంతో కాఫీ షాప్లో ఓ అమ్మాయిని చూసేందుకు వెళ్తాడు. ఆ అమ్మాయే మోనీషా (అనస్వర రాజన్). మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్లో చదివామని, ఇద్దరూ సీనియర్- జూనియర్ అని తెలుస్తుంది. తమ చిన్నతనంలో ఎవర్నైతే ప్రేమించారో వారిని ఒకసారి కలవాలనుకుంటారు. మరి తర్వాతేం జరిగింది? వాళ్లని కలిశారా? ఈ పెళ్లి చూపులు ఏమయ్యాయి? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే! #WithLove will be streaming from March 6 on NETFLIX. pic.twitter.com/IoSzc2TXwW— Christopher Kanagaraj (@Chrissuccess) March 1, 2026 చదవండి: దుబాయ్లో చిక్కుకున్నా.. నన్ను భారత్కు తీసుకురండి: బాలీవుడ్ నటి -
మూగజీవాల ఎమోషన్స్ చూపించే లక్కీ.. ఓటీటీ మూవీ రివ్యూ
టైటిల్.. లక్కీ ది సూపర్ స్టార్ఓటీటీ.. జియో హాట్స్టార్నటీనటులు.. జీవీ ప్రకాశ్ కుమార్, అనస్వర రాజన్, మేఘన సుమేష్, దేవదర్శిని ఇలంగో కుమరవేల్, ఉదయ్ మహేష్, సుబ్బు తదితరులుదర్శకుడు.. ఉదయ్ మహేశ్ఓటీటీలు వచ్చాక సినిమాలు తెగ చూసేస్తున్నారు. కంటెంట్ నచ్చితే చాలు ఆ చిత్రాలను రిపీటెడ్గా చూసే ఆడియన్స్ ఉన్నారు. ఓటీటీ చిత్రాలు అంతలా సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఇటీవలే డైరెక్ట్గా ఓటీటీలో విడుదలైన లక్కీ మూవీ.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ లక్కీ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.లక్కీ కథేంటంటే..జీవీ ప్రకాశ్కుమార్ మేనకోడలు ఆటిజంతో బాధపడుతూ ఉంటుంది. ఈ సమస్యపై డాక్టర్ను సంప్రదించగా మరో పిల్లాడిని కనండి అంటూ దంపతులకు ఉచిత సలహా ఇస్తాడు. అయితే తన మేనకోడలి ఆటిజంతో బాధపడటం చూసి జీవీ ప్రకాశ్ పాపకోసం ఏదో ఒకటి చేయాలని తపనతో ఉంటాడు. అలా ఓ రోజు రోడ్డుపై ఆపదలో ఉన్న ఓ కుక్కపిల్ల కనిపిస్తుంది. ఆ సమయంలో కుక్కపిల్లను రక్షించిన జీవీ ప్రకాశ్.. తన తీసుకెళ్లి తన మేనకోడలికి ఇస్తాడు. ఆ తర్వాత ఆటిజంతో బాధపడుతున్న పాప లైఫ్ మారిపోతుంది. కానీ ఓ గొడవ కారణంగా కుక్కపిల్ల కిడ్నాప్కు గురవుతుంది. ఆ తర్వాత ఏ జరిగింది? అసలు కుక్కపిల్లను జీవీ ప్రకాశ్ తిరిగి తీసుకొచ్చాడా? మళ్లీ తన మేడకోడలిని మామూలుగా మార్చాడా? అన్నదే అసలు కథ.ఎలా ఉందంటే.. లక్కీ ఈ టైటిల్ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది అదృష్టమే. అలా అదృష్టం కలిసొచ్చి తల్లి చెంతకు కుక్కపిల్ల చెరిన కథే ఈ లక్కీ. ఈ కథ ప్రారంభంలోనే డైరెక్టర్ విజన్ ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. ఈ కథలో ఫుల్ ఎమోషన్ ఉండబోతుందని ప్రేక్షకులకు ముందే హింట్ ఇచ్చేశాడు. తన బిడ్డకు ఆపద వస్తే మనుషులు ఎంత బాధపడతారో.. అలాగే మూగజీవాలు కూడా అంతకంటే ఎక్కువగా బాధపడతాయనేదే ఈ లక్కీ మూవీ కాన్సెప్ట్.వీధి కుక్కతో కథను మొదలెట్టిన డైరెక్టర్ చివరికీ వరకు అదే క్యారెక్టర్తో ప్రేక్షకుడిని ముందుకు తీసుకెళ్లాడు. మనుషులు, మూగజీవాలకు ఎమోషన్స్ ఓకేలా ఉంటాయని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఒకవైపు తన బిడ్డ ఆటిజం బాధను చూడలేక తల్లిదండ్రులు.. తన బిడ్డ ఏమైపోయిందోనని ఎదురు చూసే వీధి కుక్క ఎమోషన్స్ చూపించిన విధానం ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది.ఇక సెకండాఫ్లో తప్పిపోయిన లక్కీ (కుక్క పిల్ల) చుట్టే తిరుగుతుంది. జీవీ ప్రకాశ్తో గొడవ కారణంగా ఆ కుక్కపిల్ల ఒక రాజకీయ నాయకుడి చేతికి చిక్కుతుంది. లక్కీ వల్లనే తనకు పొలిటికల్గా కలిసొచ్చిందని నమ్మిన అతను ఆ కుక్కపిల్లను పెంచుకుంటాడు. ఆ తర్వాత కుక్కపిల్ల కోసం అనస్వర రాజన్తో కలిసి జీవీ ప్రకాశ్ ప్లాన్స్ వేయడం.. అవీ కాస్తా మిస్ఫైర్ కావడం చాలా ఫన్నీగా అనిపిస్తాయి. కేవలం ఓ కుక్కపిల్ల కోసం ఇంతలా చేస్తారా అన్న ఫీలింగ్ ఆడియన్స్కు కలుగుతుంది. మనిషి స్వార్థం దేనికైనా తెగిస్తుందనే మేసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. మధ్యలో మూగజీవాల ఫీలింగ్స్ను బయటికి చూపించి ప్రేక్షకుడిని ఆలోచించేలా చేశాడు. ఓవరాల్గా చూస్తే మనిషికి.. మూగజీవాలకు మధ్య ఎమోషనల్ డ్రామానే ఈ లక్కీ. ఈ వీకెండ్లో పిల్లలు, ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ లక్కీ. ఎవరెలా చేశారంటే..జీవీ ప్రకాశ్ వన్ మ్యాన్ షో చేశాడు. తన పాత్రలో అదరగొట్టేశాడు. ఛాంపియన్ బ్యూటీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. మేఘన సుమేష్, దేవదర్శిని ఇలంగో కుమరవేల్, ఉదయ్ మహేష్, సుబ్బు తమ పాత్రలో పరిధిలో మెప్పించారు. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా హనీ, అక్యూజ్జ్, హాట్ స్పాట్ 2 తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు తమిళ, మలయాళ మూవీస్ కూడా స్ట్రీమింగ్లోకి వచ్చాయి. డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు, రోస్లిన్ లాంటి తెలుగు వెబ్ సిరీస్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అలానే విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్'.. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడీ ఈ లిస్టులోకి మరో తెలుగు సినిమా కూడా వచ్చి చేరింది.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి 'గాంధీ టాక్స్'.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'స్కూల్ లైఫ్' పేరుతో తీసిన తెలుగు మూవీ.. గతేడాది నవంబరు 28న అంటే మూడు నెలల క్రితం థియేటర్లలోకి వచ్చింది. సుమన్, ఆమని తదితరులు ఇందులో కీలక పాత్రలు చేశారు. కాకపోతే పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడం.. కంటెంట్ కూడా అంతంత మాత్రమే ఉండేసరికి ఇదొకటి బిగ్ స్క్రీన్పైకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ.. అమెజాన్ ప్రైమ్లో అద్దె విధానంలో అందుబాటులో ఉంది.'స్కూల్ లైఫ్' విషయానికొస్తే.. 1990ల్లో రాయలసీమలోని ఓ పల్లెటూరి నేపథ్యంగా సాగుతుంది. స్కూల్ లవ్ స్టోరీతో మొదలై.. అక్కడి ప్రాంత ప్రజల మధ్య కులం, కుటుంబ గౌరవం, పగ తదితర అంశాలు ఎలాంటి పాత్ర పోషించాయి. ప్రేమతో మొదలై పగతో ఎలా ముగిసింది అనేదే ఈ సినిమా స్టోరీ. పులివెందుల మహేశ్ అనే కుర్రాడు.. హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు.(ఇదీ చదవండి: రష్మిక రీల్ బ్రదర్ హీరోగా సినిమా.. ట్రైలర్ రిలీజ్) -
మరో ఓటీటీలోకి 'గాంధీ టాక్స్'.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం పాన్ ఇండియా, భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. ఇలాంటి టైంలో మూకీ చిత్రం తీశారంటే సాహసమనే చెప్పొచ్చు. తాజాగా అది జరిగింది కూడా. విజయ్ సేతుపతి, అదితీ రావు హైదరీ, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో 'గాంధీ టాక్స్' అనే మూవీ తీశారు. గత నెలలో థియేటర్లలోకి కూడా తీసుకొచ్చారు. తాజాగా ఈ చిత్ర తెలుగు స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.(ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్బాస్' భామ డ్యాన్సులు)శుక్రవారం (ఫిబ్రవరి 27) నుంచి ఈ సినిమా.. అమెజాన్ ప్రైమ్లోకి సైలెంట్గా స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. కాకపోతే ప్రస్తుతం అద్దె విధానంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు జీ5 ఓటీటీలోకి మార్చి 06 నుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ అవుతాయని క్లారిటీ ఇచ్చారు. ఇది మూకీ సినిమానే కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఎవరైనా చూడొచ్చు. భావాన్ని అర్థం చేసుకోవచ్చు.'గాంధీ టాక్స్' విషయానికొస్తే.. ముంబైలోని ధారావిలో ఉండే పేదకుర్రాడు మహాదేవ్ విష్ణు(విజయ్ సేతుపతి). మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం ప్రయత్నించగా రూ.50 వేలు లంచం అడుగుతారు. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగుపడాలన్నా, ప్రేమించిన అమ్మాయి(అదితీ రావు హైదరీ) దక్కాలన్నా ఈ జాబ్ కీలకం. దీంతో ఆ డబ్బు కోసం ఓ తప్పుడు పనికి సిద్ధపడతాడు. ఇదే ముంబైలో బోస్మన్ (అరవింద స్వామి)ది మరో కథ. బిజినెస్మ్యాన్ అయినప్పటికీ ఘోరమైన నష్టాలొచ్చి రోడ్డున పడతాడు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఓ ఆలోచన చేస్తాడు. ఇంతకీ అదేంటి? విష్ణు, బోస్మన్ జీవితాలని డబ్బు ఎలా కలిపింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి గుజరాతీ హిట్ సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్) -
ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్
ఇప్పుడంతా ఓటీటీ జమానా. ఓ భాషలో అద్భుతమైన సక్సెస్ చేసుకున్న ఏ సినిమా అయినా సరే ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసేయొచ్చు. అలా గతేడాది గుజరాతీలో తీసిన ఓ డివోషనల్ మూవీ.. బంపర్ బ్లాక్బస్టర్ అయింది. రూ.50 లక్షల బడ్జెట్తో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్ అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఎట్టకేలకు స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి మూకీ సినిమా)గుజరాతీ సినీ ఇండస్ట్రీలో తొలి రూ.100 కోట్ల వసూళ్లు అందుకున్న సినిమా 'లాలో-కృష్ణ సదా సహాయతే'. గతేడాది అక్టోబరు 10న రిలీజ్ కాగా.. నవంబరు 28న దేశవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. లాంగ్ రన్లో కళ్లు చెదిరే కలెక్షన్ అందుకుంది. ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి అద్భుతం సృష్టించింది. దీనికి కారణం కథలోని బలం.2019లో గుజరాతీలో రిలీజైన 'చాల్ జీవీ లాయియే' చిత్రం రూ.50 కోట్ల వసూళ్లు సాధించగా.. 'లాలో' సినిమా దాన్ని అధిగమించేసింది. రూ.100 కోట్ల ఘనత సాధించిన తొలి గుజరాతీ మూవీగా నిలిచింది. కృష్ణుడి లీలలు చూపించే బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. అంకిత్ సఖియా దర్శకుడు. రీవా రచ్, శ్రుహద్ గోస్వామి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడీ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో మార్చి 06 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీ, గుజరాతీ భాషల్లోనే చూడొచ్చు.'లాలో-కృష్ణ సదా సహాయతే' విషయానికొస్తే.. లాలో పాత్రధారి ఓ ఆటో డ్రైవర్. గతంలో జరిగిన సంఘటనల వల్ల ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. తాగుడుకు బానిసవుతాడు. ఓసారి అనుకోకుండా ఒక ఫామ్హౌస్లో చిక్కుకుపోతాడు. ఆ ఏకాంతంలో అతడికి కృష్ణుడి లీలలు ఆవిష్కృతమవుతాయి. ఆ ఆధ్యాత్మిక చింతనలో ముక్తి మార్గంవైపు నడుస్తాడు. గతం తాలూకు బాధలు, తన మనసులోని అలజడిని దాటుకుని కొత్త ఆశలతో ముందుకెళ్లడం మొదలపెడతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘D/o ప్రసాదరావు కనుబడుటలేదు’ వెబ్ సిరీస్ రివ్యూ) -
మీనా, వినీత్ నటించిన థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ వచ్చేసింది
ప్రముఖ నటి మీనా, నటుడు వినీత్ కీలక పాత్రల్లో నటించిన రోస్లిన్(Roslin) వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్గా దర్శకుడు సుమేష్ నందకుమార్ తెరకెక్కించారు. ‘దృశ్యం’ మూవీ దర్శకుడు జీతూ జోసెఫ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా సుమేష్ పనిచేశారు. అందుకే ఈ సిరీస్పై అంచనాలు పెరిగాయి.రోస్లిన్(Roslin) వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27న జియోహాట్స్టార్లో విడుదలైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ,మలయాళం, మరాఠీ, బెంగాళీలో స్ట్రీమింగ్ అవుతుంది. రోస్లిన్ టైటిల్ పాత్రలో సంజన దిపు అనే అమ్మాయి నటించింది. మలయాళ హిట్ సినిమా మూథోన్తో మెప్పించిన సంజన.. మలయాళ పరిశ్రమలో గుర్తింపు పొందింది. నటుడు వినీత్ చాలా కాలం తర్వాత ఒక వెబ్ సిరీస్ కోసం కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. -
ట్రంప్ వ్యూహం.. వార్నర్ బ్రదర్స్, నెట్ఫ్లిక్స్ బిగ్ డీల్కు బ్రేక్..
వార్నర్ బ్రదర్స్, నెట్ఫ్లిక్స్ మధ్య కుదిరిన భారీ డీల్కు బ్రేక్ పడింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్ను కొనుగోలు చేసేందుకు కొద్దిరోజుల క్రితం ఆసక్తి చూపిన నెట్ఫ్లిక్స్ (Netflix).. ఇప్పుడు వెనక్కు తగ్గింది. ఈ నిర్ణయంతో మీడియా దిగ్గజంగా ఎదగాలనుకున్న నెట్ఫ్లిక్స్ ఆశలకు గండి పడింది.నెట్ఫ్లిక్స్- వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మధ్య కుదిరిన డీల్కు అంతరాయం కలిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం రచించారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న పారామౌంట్ స్కైడ్యాన్స్ రంగంలోకి రానుందని వార్తలు వస్తున్నాయి. వార్నర్ బ్రదర్స్ను చేజిక్కించుకునేందుకు 108.4 బిలియన్ డాలర్ల బిడ్ను పారామౌంట్ వేసింది. ఈ బిడ్ వెనక ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ ఉన్నట్లు అక్కడి మీడియా కథనం రాసింది.వార్నర్ బ్రదర్స్ సంస్థతో నెట్ఫ్లిక్స్ కుదుర్చుకున్న 72 బిలియన్ డాలర్ల ( రూ.6.48 లక్షల కోట్లు) ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ ట్రంప్ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన హ్యూహం వల్లే ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన డీల్ బ్రేక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వార్నర్ బ్రదర్స్ను సులువుగా పారామౌంట్ స్కైడ్యాన్స్ సంస్థ దక్కించుకునే ఛాన్స్ ఉంది. -
ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒక్కరోజే ఏకంగా 11 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం రాగానే కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ ఫిబ్రవరిలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఈ చివరి వారంలో బాక్సాఫీస్ సందడి చేసేందుకు విష్ణు విన్యాసం అంటూ వచ్చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈ మూవీపైనే ఆడియన్స్లో కాస్తా బజ్ క్రియేట్ అయింది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా 'ఉత్తుత్త హీరోలు', 'సన్నాఫ్' చిత్రాలు రిలీజ్ కానున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్ థ్రిల్లర్ మూవీ హనీ భయపెట్టేందుకు వచ్చేస్తోంది. దీంతో పాటు తెలుగు సినిమా డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, అక్యూజ్డ్ అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు సైతం ఈ ఫ్రైడే ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 27అమెజాన్ ప్రైమ్హనీ(తెలుగు సినిమా)- ఫిబ్రవరి 27జియో హాట్స్టార్ రోస్లిన్ (తెలుగు వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 27 బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28 బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28జీ5 డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27 తడయమ్ (తమిళ సిరీస్) - ఫిబ్రవరి 27 క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) - ఫిబ్రవరి 27అబార్ ప్రోలోయ్- సీజన్-2(బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 27 అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) - ఫిబ్రవరి 28ఆహా సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ షో) - ఫిబ్రవరి 27సన్ నెక్స్ట్ హనీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 27 నీలి హక్కీ (కన్నడ మూవీ) - ఫిబ్రవరి 27ఆపిల్ టీవీ ప్లస్ మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 27 -
మరో ఓటీటీకి టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ హనీ. ఈసినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఓవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 6న విడుదలైన థియేటర్లలో ఫర్వాలేదనిపించింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈనెల 27 నుంచి సన్ నెక్ట్స్లో ప్రసారం కానుందని వెల్లడించారు.తాజాగా మరో ఓటీటీలోనూ హనీ సందడి చేయనుందని నవీన్చంద్ర తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. దీంతో ఓకే రోజు రెండు ఓటీటీల్లో హనీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కాగా.. క్షుద్రపూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్తో పాటు డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో దివ్యా పిళ్లై, దివి, రాజా రవ్రీంద కీలక పాత్రలలో కనిపించారు. Hi Nenu Mee Naveen Chandra..Ela Unnaru? naaku Telusu Meeru Naa Nundi Maro Exciting & Thrilling Movie Kosam Waiting Ani.. Andhuke Ippatidhaka Meeru Experience Cheyani Movie Ni Meeku Chupinchabothunam..27th Feb Nundi..Mee Amazon Prime Lo..Get Ready 🔴 🐈⬛ #HoneyMovie Will Stream… pic.twitter.com/qBjf3CgjS9— Actor Naveen Chandra (@Naveenc212) February 25, 2026 -
తమిళ బోల్డ్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇతర భాషల చిత్రాలు కూడా స్ట్రీమింగ్లోకి వస్తుంటాయి. అలా గతవారం ఓటీటీలోకి వచ్చిన తమిళ బోల్డ్ మూవీ 'హాట్స్పాట్ 2 మచ్'. ఏకంగా ఆరు ఓటీటీల్లో ఒకేసారి అందుబాటులోకి వచ్చింది. అయితే అన్నింటిలోనూ ఒరిజివల్ వెర్షన్ మాత్రమే రిలీజైంది. తాజాగా ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కోసం డబ్బింగ్ రూపంలోనూ తీసుకురానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!)2024లో తొలి పార్ట్ రిలీజ్ కాగా ఈ ఏడాది థియేటర్లలో సీక్వెల్ రిలీజ్ చేశారు. ప్రియాభవనీ శంకర్ లీడ్ రోల్ చేసింది. మొత్తంగా మూడు బోల్డ్ స్టోరీలని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ వార్స్, డ్రస్సింగ్ సెన్స్, నిజమైన ప్రేమ అనే కాన్సెప్ట్స్ని షాకిచ్చే స్టైల్లో ప్రెజెంట్ చేశారు. తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు శుక్రవారం(ఫిబ్రవరి 27) నుంచి ఆహా ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.'హాట్స్పాట్ 2' విషయానికొస్తే.. శిల్ప(ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ఓ నిర్మాత దగ్గరకు స్టోరీ నెరేషన్ ఇవ్వడానికి వస్తుంది. మూడు కథలు చెబుతుంది. వీటిలో మొదటిది హీరోలని పిచ్చిగా అభిమానించే ఓ ఇద్దరు కుర్రాళ్ల గురించి కాగా.. రెండోది డ్రస్సింగ్ సెన్స్ గురించి.. మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. అసలు శిల్ప ఎవరు? ఈ నిర్మాత దగ్గరకే ఎందుకొచ్చింది? ఈ స్టోరీలు చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా 'హాట్స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)Three bold stories.One aspiring director.And a hidden agenda you won’t see coming. 👀#Hotspot2Telugu premieres from Feb 27 on aha. pic.twitter.com/znsJyTJLse— ahavideoin (@ahavideoIN) February 24, 2026 -
'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్
ఓటీటీ కల్చర్ పెరిగిన తర్వాత కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్లు చూసేవాళ్లు, ఇష్టపడే వాళ్ల సంఖ్య బాగానే ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు.. వీటిపట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ కొరియన్ కాన్సెప్ట్ మూవీలో 'ఓజీ' ఫేమ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ లీడ్ రోల్ చేసింది. ఇప్పుడీ చిత్ర స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో తీసిన తమిళ సినిమా 'మేడిన్ కొరియా'. దీన్ని ఓటీటీ కోసమే రూపొందించారు. ఆర్ఏ కార్తీక్ దర్శకత్వం వహించాడు. గత నెలలో ఈ చిత్ర గురించి ప్రకటన రాగా ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే నెల 12 నుంచి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.చిన్నప్పటి నుంచి కొరియా అంటే ఇష్టం పెంచుకున్న ఓ అమ్మాయి.. పెరిగి పెద్దయిన తర్వాత అనుకున్నట్లే కొరియా వెళ్తుంది. ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది? చివరకు ఏం తెలుసుకుంది అనేదే స్టోరీలా అనిపిస్తుంది. గత నెలలో టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తే కాన్సెప్ట్పై ఇంకాస్త క్లారిటీ రావొచ్చు.ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రానున్నాయి. వాటిలో నవీన్ చంద్ర 'హనీ', అక్యూజ్డ్ అనే డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. అలానే డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, రోస్లిన్ అనే వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవి కాకుండా మరేవైనా సర్ప్రైజ్ చిత్రాలు కూడా అందుబాటులోకి రావొచ్చేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ) -
అలియా భట్ 'ఆల్ఫా'.. రూ. 215 కోట్ల ఢీల్ వద్దంటూ..
అలియా భట్. శార్వరీ వాఘ్ నటించిన స్పై థ్రిల్లర్ చిత్రం 'ఆల్ఫా'. దర్శకుడు శివ్ రావేల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, మొదట డిసెంబర్ 25, 2025న రిలీజ్ అనుకున్నారు. తర్వాత ఏప్రిల్ 17, 2026కి వాయిదా వేశారు.'ఆల్ఫా' సినిమాను థియేటర్లో కాకుండా డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకోసం రూ. 215 కోట్లు నెట్ఫ్లిక్స్ ఆఫర్ చేసినట్లు తెలిసిందే. అయితే, దానిని యశ్రాజ్ ఫిల్మ్స్ తిరస్కరించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ చిత్రం థియేటర్లలోనే విడుదల అవుతుందని తాజాగా ఆ సంస్ధ ధృవీకరించింది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించే సినిమాలన్నీ కూడా థియేటర్ స్లేట్లోని ఉంటాయని పేర్కొంది. ఎట్టిపరిస్థితిల్లోనూ నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో తమ భారీ చిత్రాలను ఉంచదని, ప్రేక్షకులకు సినిమాటిక్ అనుభవాలను అందించడంలో ప్రాముఖ్యతను ఇస్తామని యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతినిధి పేర్కొన్నారు. -
ఓటీటీకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'. ఈ చిత్రం తాజాగా బాప్టా అవార్డుల్లో సత్తా చాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. గతేడాది సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జియో హాట్స్టార్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మూవీ గతంలో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్లోనూ సత్తా చాటింది. అంతేకాకుండా ఈ ఏడాది జరగనున్న ఆస్కార్ అవార్డులకు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 13 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే వంటి కీలక విభాగాలలో నామినేట్ అయింది. View this post on Instagram A post shared by JioHotstar International (@jiohotstarinternational) -
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. అధికారిక ప్రకటన
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. దాదాపు ప్రతి భాషకు చెందిన సినిమాలని డబ్బింగ్ రూపంలో తెలుగులో రిలీజ్ చేసేస్తున్నారు. అలాంటిది ఈ కాలంలోనూ రీమేక్ చేస్తున్నారంటే సాహసమనే చెప్పొచ్చు. ఆ సాహసం చేసి తీసిన చిత్రమే 'ఓం శాంతి శాంతి శాంతిః'. థియేటర్లలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. పోస్టర్ కూడా వదిలారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)దర్శకుడు తరుణ్ భాస్కర్ అప్పుడప్పుడు నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. అలా హీరోగా చేసిన మూవీ 'ఓం శాంతి శాంతి శాంతిః'. ఈషా రెబ్బా హీరోయిన్. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. 2022లో మలయాళంలో వచ్చిన 'జయ జయ జయహే' చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ చిత్రాన్నే తెలుగు డబ్బింగ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా సరే ఈ సినిమా నిర్మాతలు సాహసం చేశారు. కానీ అది బెడిసికొట్టింది.ఒరిజినల్ సినిమా నుంచి సీన్ టూ సీన్ దింపేశారు. కాస్త నేటివిటీ మార్చినప్పటికీ మరీ స్టార్ కాస్టింగ్ లేకపోవడంతో జనాలు దీన్ని చూసేందుకు పెద్దగా థియేటర్లలోకి రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు మార్చి 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. గోల్డ్ సబ్స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే అందుబాటులోకి రానుంది.'ఓం శాంతి శాంతి శాంతిః' విషయానికొస్తే.. మంచిగా చదువుకుని ఉద్యోగం చేయాలనుకునే మధ్యతరగతి అమ్మాయి ప్రశాంతి(ఈషా రెబ్బా). కాలేజీలో జరిగిన ఓ సంఘటన వల్ల చదువు ఆపేసి ఈమెని ఓంకార్ నాయుడు(తరుణ్ భాస్కర్) అనే చేపల వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వివాహం తర్వాత కూడా చదువుకోవచ్చనే ఆలోచనతో కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కానీ అత్తారింట్లో ఊహించనివి జరుగుతాయి. భర్త తన అహంకారాన్ని, కోపాన్ని ఈమెపై చూపిస్తుంటాడు. ప్రతిసారీ చెంపపగలగొట్టేస్తుంటాడు. ఓ రోజు కోపం పట్టలేక ప్రశాంతి, భర్తకు ఎదురుతిరుగుతుంది. భర్తని కుక్కని కొట్టినట్లు కొడుతుంది. తర్వాత ఏమైంది? భార్యభర్తలిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 8 ఏళ్ల తర్వాత గడ్డం తీసేసిన 'కేజీఎఫ్' యష్.. ఇలా ఉన్నాడేంటి?) -
అసలు అన్న అని పిలవను.. రాజీవ్ కనకాల నాకు బావ!
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన గాయత్రి భార్గవి.. తర్వాత తెలుగులోనూ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. లేటెస్ట్గా ఈమె.. 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు' అనే వెబ్ సిరీస్ చేసింది. జీ5 ఓటీటీలో ఇది ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ప్రీమియర్ ఈవెంట్ జరగ్గా, ఇందులో మాట్లాడిన నటి గాయత్రి భార్గవి.. నటుడు రాజీవ్ కనకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈయనే నాకు తొలి క్రష్ అని అప్పటి సంగతులని గుర్తుచేసుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'ఈ అమ్మాయి టీవీకి పనికొస్తుందని అప్రూవ్ చేసింది రాజీవ్ కనకాల ద్వారానే. నాకు బాగా గుర్తు. ఓసారి రాజీవ్, బెన్నం ఓ బైక్పై.. నా కాలేజీకి వచ్చారు. నా ఫొటో, నన్ను చూసి వెళ్లిపోయారు. కట్ చేస్తే కొన్నాళ్లకు ఓ యాడ్లో నటించే అవకాశం దక్కింది. అప్పటినుంచి రాజీవ్ నాకు తెలుసు. ఈయనే నాకు ఫస్ట్ క్రష్. మేం దూరదర్శన్ లో రకరకాల ప్రోగ్రామ్స్ చూసిన రాజీవ్.. మా అందరికీ మొదటి క్రష్. అందుకే సుమ అక్క, రాజీవ్ బావగారు అంటాం. అసలు అన్న గిన్న అని మేం పిలవం' అని గాయత్రి భార్గవి చెప్పుకొచ్చింది.అయితే గాయత్రి భార్గవి చెబుతున్నప్పుడు రాజీవ్ కనకాల తెగ సిగ్గుపడిపోయాడు. పక్కనే ఉన్న ఉదయభానుతో సహా అక్కడున్న వాళ్లందరూ నవ్వేశారు. ఇక సిరీస్ విషయానికొస్తే.. థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. నటి వాసంతిక టైటిల్ రోల్ చేసింది. రాజీవ్ కనకాల.. ఈమెకు తండ్రిగా నటించాడు. కనిపించకుండా పోయిన కూతురిని వెతికేందుకు తండ్రి ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరకు ఏమైందనే కాన్సెప్ట్తో ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకప్పటి యాంకర్ ఉదయభాను.. పోలీస్ పాత్ర చేయడం విశేషం.(ఇదీ చదవండి: నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య) -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
2026 మొన్నే వచ్చినట్లుంది. కానీ అప్పుడే ఫిబ్రవరి చివరకొచ్చేసింది. ఈ వారం థియేటర్లలోకి శ్రీ విష్ణు నుంచి 'విష్ణు విన్యాసం' అనే కామెడీ సినిమా రానుంది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా 'ఉత్తుత్త హీరోలు', 'సన్నాఫ్' చిత్రాలు రిలీజ్ కానున్నాయి. హిందీలో 'ద కేరళ స్టోరీ 2' ఈ వీకెండ్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ చిత్రాలే ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. నవీన్ చంద్ర 'హనీ', 'అక్యూజ్డ్' అనే డబ్బింగ్ మూవీతో పాటు డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, రోస్లిన్ అనే వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఇదే వీకెండ్ రిలీజయ్యే అవకాశముంది. ఇవి కాకుండా ఏమైనా సర్ప్రైజు స్ట్రీమింగ్స్ ఉంటాయేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వస్తుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు)నెట్ఫ్లిక్స్అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 27అమెజాన్ ప్రైమ్ద సీఈఓ క్లబ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 23పాల్ మెక్కర్ట్నే (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 25ద బ్లఫ్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 25ఇక్కీస్ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 26హాట్స్టార్ప్యారడైజ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 23వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 26సంగ్ మర్మర్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 26రోస్లిన్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28జీ5డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27తడయమ్ (తమిళ సిరీస్) - ఫిబ్రవరి 27క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) - ఫిబ్రవరి 27అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) - ఫిబ్రవరి 28ఆహాసర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలటీ షో) - ఫిబ్రవరి 27సన్ నెక్స్ట్హనీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 27నీలి హక్కీ (కన్నడ మూవీ) - ఫిబ్రవరి 27ఎమ్ఎక్స్ ప్లేయర్సైకో సయ్యాన్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 25ఆపిల్ టీవీ ప్లస్మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 27(ఇదీ చదవండి: 'రంగస్థలం' సినిమా.. కనీసం రాష్ట్ర అవార్డ్ కూడా ఇవ్వలేదు) -
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీ సినిమాలు అనగానే అయితే రొమాంటిక్ లేదా థ్రిల్లర్స్ ఉంటాయిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు డిఫరెంట్ స్టోరీలతో తీసిన మూవీస్ కూడా వస్తుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్లోకి వచ్చిన తమిళ బోల్డ్ మూవీ 'హాట్స్పాట్ 2 మచ్'. 2024లో వచ్చిన తొలి పార్ట్ అందరికీ షాక్ ఇవ్వగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్ కూడా అదే రేంజులో ఆశ్చర్యపరిచింది. విఘ్నేశ్ కార్తిక్ దర్శకుడు కాగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.. లెస్బియన్ పాత్ర చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ సినిమా.. 'చథా పచ్చ' తెలుగు రివ్యూ)కథేంటి?తొలి భాగంలో ఓ నిర్మాతకు స్టోరీ చెప్పడానికి వచ్చిన మహమ్మద్ షరీఫ్(విఘ్నేశ్ రాజా).. స్టోరీలన్నీ చెప్పి చివరకు నిర్మాత కుమార్తెనే(బ్రిగిడ సాగా) పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే శిల్ప(ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ఇదే నిర్మాత దగ్గరకు స్టోరీ నెరేషన్ కోసం వస్తుంది. ఓ మూడు కథలు చెబుతుంది. వీటిలో ఒకటి హీరోలని పిచ్చిగా అభిమానించే ఓ ఇద్దరు కుర్రాళ్ల గురించి కాగా.. రెండోది డ్రస్సింగ్ సెన్స్ గురించి.. మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. అసలు శిల్ప, ఈ నిర్మాతకే స్టోరీ చెప్పడం వెనక ఓ ఉద్దేశం ఉంటుంది. ఇంతకీ అదేంటి? శిల్ప ఎవరు? షరీఫ్తో ఈమెకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సినిమా అంటే ఇలానే ఉండాలి. ఇలానే తీయాలి అని కొన్ని లెక్కలు ఉంటాయి. వాటిని బ్రేక్ చేస్తూ అప్పుడప్పుడు కొందరు దర్శకులు ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే 'హాట్స్పాట్'. 2024లో వచ్చిన ఈ సినిమాలో చిత్రవిచిత్రమైన అంశాల్ని చూపించగా.. ఈసారి సీక్వెల్లో మాత్రం సమాజంలోని హాట్ టాపిక్ లాంటి మూడు అంశాలని తీసుకుని వాటిని కన్విన్సింగ్గా చెప్పగలిగాడు. మెప్పించాడు కూడా.తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలని అభిమానించడం అనేది చాలా సాధారణమైన విషయం. అలా విపరీతమైన ఫ్యానిజం చూపించే ఇద్దరు కుర్రాళ్లకు.. ఓ అజ్ఞాత వ్యక్తి ఎలాంటి గుణపాఠం చెప్పాడు. వాళ్లకు ఎలా కళ్లు తెరిపించాడు అనేది తొలి స్టోరీగా చూపించారు. ఇందులో చెప్పిన పాయింట్స్ గానీ, చూపించిన అంశాలు గానీ పచ్చి నిజాలే. యువత తమ సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా హీరోలకు ఎలా బానిసత్వం చేస్తున్నారు? వాళ్ల సినిమాల రిలీజ్ టైంలో ఎలా కొట్టుకుచస్తున్నారనేది చూపించారు. చివరలో ఇచ్చిన ట్విస్ట్ అయితే ఆలోచన రేకెత్తించడంతో పాటు ఇలా ఉన్నారేంట్రా బాబు అనిపించేలా చేస్తుంది.రీసెంట్ టైంలో డ్రస్సింగ్ సెన్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం నటుడు శివాజీ.. స్టేజీపై హీరోయిన్ల డ్రస్సింగ్ స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయంలో చాలామంది శివాజీని తప్పుపట్టారు. మరికొందరు ఇతడిని సమర్థించారు. అసలు డ్రస్సింగ్ అంటే ఏంటి? ఈ కాలం ఆడపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు? అనేది చూపించారు. ఇంటికొచ్చిన అతిథుల ముందు కూడా పొట్టిబట్టలేసుకుని కౌంటర్స్ వేసే ఓ కూతురికి.. వయసైన తండ్రి లాగిపెట్టి కొట్టేలా ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు అనేది పాయింట్ స్ట్రెయిట్గా చెప్పారు. ఇది చూస్తే కచ్చితంగా చాలామంది అమ్మాయిల ఆలోచనలో మార్పు వచ్చే అవకాశముంటుంది.ఇక మూడోది టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ. 2026లోనూ స్వచ్ఛమైన ప్రేమ కావాలనుకునే ఓ కుర్రాడికి అనుకోకుండా ఫోన్ కాల్ ద్వారా 2050లో ఉండే ఓ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. రోజూ ఫోన్లో మాట్లాడుతూ తెలియకుండానే ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ ఆమెకు ఇతడికి ఓ షాకింగ్ కనెక్షన్ ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్టుకి తొలుత ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చి స్టోరీని సుఖాంతం చేశారు. ఏదేమైనా ఈ మూడు స్టోరీలు ప్రస్తుతం సమాజంలో చాలామంది చూస్తున్న చేదు నిజాలే. కానీ కామెడీగా బోల్డ్ టచ్ ఇస్తూ చెప్పడం బాగుంది.పైన చెప్పిన మూడు కథలతో పాటు ప్రియా భవానీ శంకర్ చేసిన శిల్ప పాత్రకు ఓ స్టోరీ ఉంటుంది. అదేంటనేది ఇందులో పెద్దగా రివీల్ చేయలేదు. త్వరలో వచ్చే మూడో భాగంలో పూర్తిస్థాయిలో చూపిస్తారేమో?నటీనటుల విషయానికొస్తే.. ప్రియాభవానీ శంకర్, భవానీ శ్రీ, తంబి రామయ్య, ఎమ్ఎస్ భాస్కర్, బ్రిగిడ సాగా.. ఇలా ఎవరికి వాళ్లు తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్గానూ బాగుంది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పేరుకే బోల్డ్ సినిమా గానీ అసభ్యకర సన్నివేశాల్లాంటివి లేవు. వీలైతే ఒంటరిగానే చూడండి. కచ్చితంగా నచ్చుతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: సమంత నుంచి సర్ప్రైజ్.. పోస్ట్ వైరల్) -
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్.. పాతిరాత్రి రివ్యూ
మంజుమ్మల్ బాయ్స్, కూలీ సినిమాలతో టాలీవుడ్లోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సౌబిన్ షాహిర్. అతడు గతేడాది పోలీస్గా నటించిన థ్రిల్లర్ మూవీ పాతిరాత్రి. రతీనా పీటీ దర్శకత్వం వహించిన ఈ మలయాళ మూవీ 2025 అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి జీ5లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం...కథేంటి?పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ అనగానే కేసుల్ని పోలీసులు ఎలా చేధిస్తారనేది చూపిస్తారు. అయితే ఈ మూవీలో మాత్రం కాస్త విభిన్నంగా తమకు సంబంధం లేని కేసులో ఇరుక్కున్న పోలీసులు దాన్నుంచి ఎలా బయటపడ్డారన్నది చూపించారు. అదే సమయంలో తమ తప్పు లేదని నిరూపిస్తూనే కేసును చేధిస్తారు. పాతిరాత్రి అంటే అర్ధ రాత్రి అని అర్థం. ఆ కటిక చీకటిలో ఏం జరిగిందనేదే సినిమా. ఎలా ఉంది?ఓపెనింగ్ షాట్తో సినిమాలో ఏదో విశేషం ఉండబోతుందని హింట్ ఇచ్చారు. తీరా చూస్తే మరీ అంత హైప్ ఇచ్చే మూమెంట్స్ ఏవీ ఉండవు. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా, కొంత బోరింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ నుంచి కాస్త ఆసక్తి పుంజుకుంటుంది. సెకండాఫ్లో స్పీడ్ పెరుగుతుంది. ప్రముఖ జర్నలిస్టు మరణం కేసులో కానిస్టేబుల్ హరీశ్ (సౌబిన్ షాహిర్), ఎస్ఐ జాన్సీ (నవ్య నాయర్) సస్పెండ్ అవుతారు.అక్కడి నుంచి వారు కేసులో అసలు హంతకులెవరో నిరూపించే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఈ క్రమంలో వెలుగుచూసే నిజాలు కొంత ఆశ్చర్యంగా అనిపించినా, విచారణ మాత్రం మరీ అంత ఆసక్తికరంగా సాగదు. అయితే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు పాతిరాత్రిని ఒకసారి చూసేయొచ్చు. ప్రస్తుతం జీ5లో ఉన్న ఈ సినిమా మలయాళ ఆడియోతో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉన్నాయి. (Paathirathri Movie Review) -
లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్
హీరోయిన్ రష్మిక.. రాబోయే ఓ కొత్త సినిమాలో స్వలింగ సంపర్కరాలిగా నటించనుందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమా కాదా అనేది సదరు మూవీ రిలీజైతే కానీ తెలియదు. అయితే దీనికంటే ముందే ఇప్పుడు ఇదే తరహా కాన్సెప్ట్తో తీసిన ఓ హిందీ చిత్రం.. నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇదివరకే స్ట్రీమింగ్ తేదీ ప్రకటించగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది బయటపెట్టేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ సినిమా.. 'చథా పచ్చ తెలుగు రివ్యూ)ప్రముఖ నటి కొంకనా సేన్, 'లాపతా లేడీస్' ఫేమ్ ప్రతిభ రత్న ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'అక్యూజ్డ్'. నెట్ఫ్లిక్స్ సొంతంగా నిర్మించిన ఈ చిత్రం.. సదరు ఓటీటీలోకే వచ్చే శుక్రవారం(ఫిబ్రవరి 27) నుంచి స్ట్రీమింగ్లోకి రానుంది. ఇందులో లీడ్ పెయిర్.. లెస్బియన్ కపుల్ పాత్రల్లో నటించడం విశేషం. ఇదో హాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది.విదేశాల్లో జీవించే ప్రధాన పాత్రధారుల్లో ఒకరు(కొంకనా సేన్).. ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తుంటుంది. అయితే ఈమెపై షాకింగ్ ఆరోపణలు వస్తాయి. ఆస్పత్రిలోని చాలామంది లైంగికంగా వేధిస్తుందని రూమర్స్ బయటకొస్తాయి. దీంతో ఈమె రిలేషన్లోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. చివరకు ఏమైంది? నిజంగానే సదరు డాక్టర్ అలాంటిదేనా? అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ఈ తరహా కాన్సెప్ట్.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ల్లో కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ సినిమాని భారతీయ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి? ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. 4 నెలలకు స్ట్రీమింగ్) -
ఓటీటీ 'మహాశయులకు విజ్ఞప్తి'.. ఆలస్యానికి కారణం ఇదేనా?
ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలన్నీ కూడా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. ది రాజాసాబ్ (జియోహాట్స్టార్), మన శంకర వరప్రసాద్గారు (జీ5), నారీ నారీ నడుమ మురారి (అమెజాన్), అనగనగా ఒకరాజు (నెట్ఫ్లిక్స్)లో స్ట్రీమింగ్ అవుతున్నాయి, అయితే, రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి( Bhartha Mahasayulaku Wignyapthi) మూవీ మాత్రం ఓటీటీ విడుదల విషయంలో జాప్యం ఏర్పడుతుంది. ఈ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ, స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా ప్రకటించకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అయితే, ఓటీటీ ఆలస్యానికి కారణాలు ఏంటి అనేది సోషల్మీడియాలో వైరల్ అవుతుంది.భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ థియేటర్ రన్ తర్వాత స్ట్రీమింగ్ హక్కులను ZEE5 పొందింది. అయితే, ఈ మూవీ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై మౌనం పాటిస్తోంది. ఇది ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు. డిజిటల్ ప్రీమియర్ ఆలస్యం వెనుక ఉన్న కారణాన్ని పేర్కొంటూ తాజాగా ఆన్లైన్లో ఒక ఆసక్తికరమైన రూమర్ వైరల్ అవుతుంది. దీని ప్రకారం, ఇతర భాషాలకు సంబంధించిన డబ్బింగ్ వెర్షన్ పనులు పూర్తి కాలేదట. ముందుగా మేకర్స్ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోందని, అందుకే OTT అరంగేట్రం చేసేందుకు మరింత సమయం తీసుకుంటుందని తెలుస్తోంది.ZEE5 సాధారణంగా బహుళ భాషలలో ప్రముఖ చిత్రాలను ఒకేసారి విడుదల చేస్తుంది. ఇటీవల, చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు ఏడు భాషలలో విడుదలైన విషయం తెలిసిందే. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ మూవీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. -
ఓటీటీలో డార్క్ థ్రిల్లర్ మూవీ.. 20రోజుల్లోనే స్ట్రీమింగ్
పలాసా, శ్రీదేవి సోడా సెంటర్, మట్కా తర్వాత కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘హనీ’. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ మూవీ నెలలోపే ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ఓవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఇందులో దివ్యా పిళ్లై, దివి, రాజా రవ్రీంద కీలక పాత్రలలో కనిపించారు.హనీ చిత్రం సన్నెక్ట్స్ (SUN NXT)లో ఫిబ్రవరి 27న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్ వర్షన్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా పోస్టర్ను విడుదల చేశారు. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ మూవీ విడుదల కానుందని సమాచారం. క్షుద్రపూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్తో పాటు డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కించారు. కథా నేపథ్యం బాగున్నప్పటికీ ద్వితీయార్ధం పెద్దగా మెప్పించలేదనే విమర్శలు వచ్చాయి. ఆనంద్ పాత్రలో నవీన్ చంద్ర నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు దక్కాయి.కథేంటంటే..ఆనంద్(నవీన్ చంద్ర)కు మూఢనమ్మకాల పిచ్చి. ఆ నమ్మకాల కారణంగా అతని ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అయినా కూడా క్షుద్ర పూజలు, అఘోర విశ్వాసాలను వదలడు. భార్య లలిత (దివ్య పిళ్లై), కూతురు మీరా(జయన్ని) భయబ్రాంతులకు గురవుతున్నా.. ఆయన క్షుద్ర పూజలు చేస్తూనే ఉంటాడు. ఊరికి దూరంగా ఓ బంగ్లాకి తన ఫ్యామిలీని తరలిస్తాడు. అక్కడ క్షుద్ర పూజలు చేస్తే..తన కోరిక నెరవేరుతుందని, అందుకుగాను కూతురు మీరా తన మాట వినాలని చెబుతాడు. మొదట లలిత.. భర్త నిర్ణయాన్ని తిరస్కరించినా.. కొన్ని పరిస్థితుల కారణంగా తర్వాత ఆమె కూడా ఒప్పుకుంటుంది. కూతురు మీరాతో ఆనంద్ ఏ పని చేయించాడు? అతని క్షుద్రపూజలు నిజంగానే ఫలించాయా? ఆనంద్ కారణంగా తల్లి-కూతుళ్లు ఎదుర్కొన్న భయంకర అనుభవాలు ఏంటి? ఈ కథలో రవణ(దివి), సారంగపాణి(రాజా రవీంద్ర) పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీల్లో కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని ప్రతివారం తెలుగు ఆడియెన్స్ ఓ లుక్కేస్తూనే ఉంటారు. అందుకు తగ్గట్లే ఆయా భాషల మూవీస్.. డబ్బింగ్ రూపంలో అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ మలయాళ యాక్షన్ కామెడీ సినిమా కూడా స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. 90స్ కిడ్స్కి ఎంతో ఇష్టమైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈకి లోకల్ టచ్ ఇచ్చిన తీసిన చిత్రమే 'చథా పచ్చ'. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సావియో (అర్జున్ అశోకన్), వెట్రి(రోషన్ మ్యాథ్యూ), థామస్ (ఇషాన్ సౌకత్).. కొచ్చిలో పెరిగిన అన్నదమ్ములు. ఒకే తల్లి కడుపున పుట్టనప్పటికీ కలిసిమెలసి ఉంటారు. వీళ్లు ముగ్గురు.. చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ షో చూస్తూ పెరుగుతారు. వాల్టర్ దగ్గర కుస్తీ కూడా నేర్చుకుంటారు. కానీ థామస్ అలియాస్ లిటిల్.. తల్లితో కలిసి ఢిల్లీ వెళ్లిపోవాల్సి వస్తుంది. సావియో, వెట్రి మాత్రం కొచ్చిలోనే ఉండిపోతారు. కొన్నేళ్ల తర్వాత సోదరులని వెతుక్కుంటూ లిటిల్, సొంతూరికి వస్తాడు. కుస్తీ క్లబ్ మొదలుపెడదామని సావియోకు చెబుతాడు. దీంతో కొంతమందితో కలిసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సైల్ ఫైటింగ్ క్లబ్ ప్రారంభిస్తారు. తర్వాత ఏమైంది? జైలు నుంచి వెట్రి బయటకొచ్చాడా? అసలు వాల్టర్ ఎవరు? చెరియన్(వైశాఖ్ నాయర్)తో సావియోకి శత్రుత్వం ఏంటనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ(WWE) షోకి ఇప్పుడు పెద్దగా క్రేజ్ లేదు గానీ 90స్ కిడ్స్ని అడిగితే దాని గురించి కథలు కథలుగా చెబుతారు. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు.. స్కూల్కి వెళ్లేముందు, వచ్చిన తర్వాత ఈ షోని తెగ చూసేవారు. ఇందులో చూపించిన స్టంట్స్ని నిజజీవితంలోనూ చేసి గాయాలపాలయ్యేవారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తీసుకుని తీసిన సినిమానే 'చథా పచ్చ'. ఈ టైటిల్కి తెలుగులో చావోరేవో(డూ ఆర్ డై) అని అర్థం.స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో ఇప్పటివరకు మలయాళంలో కావొచ్చు తెలుగులో కావొచ్చు చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో తీసుకున్న నేపథ్యం కాస్త డిఫరెంట్గా ఉంటుంది. కథ పరంగా చూస్తే మాత్రం చాలా సింపుల్. ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ల మధ్య పొరపొచ్చలు. చివరకు కలిసిపోవడం ఇంతే. కానీ దీనికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్ టచ్ ఇవ్వడం ఆసక్తికరంగా అనిపించింది. దాదాపు రెండు గంటల పాటు బాగానే ఎంటర్టైన్ చేసింది.డబ్బింగ్ పరంగా బాగానే ఉన్నప్పటికీ ప్రధాన పాత్రల పేర్లు.. తెలుగు ప్రేక్షకులకు సరిగా అర్థం కావు. దీన్ని వదిలిస్తే సినిమా మాత్రం వేరే లెవల్ ఎంటర్టైనింగ్గా ఉంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ టచ్ అని మొత్తం ఫైట్స్ పెట్టేయకుండా ఎమోషన్ కూడా ఎంత కావాలో అంత పెట్టారు. స్టోరీ కూడా చాలా ఆర్గానిక్గా వెళ్తుంది. ఎక్కడా కూడా కృత్రిమంగా అనిపించదు. కాకపోతే డబ్బింగ్ పాటలు అస్సలు సెట్ కాలేదు. వాటిని లైట్ తీసుకుని మూవీ చూస్తే మాత్రం బాగుంది.ఎవరెలా చేశారంటే?అన్నదమ్ములుగా చేసిన అర్జున్ అశోకన్, ఇషాన్ సౌకత్, రోషన్ మ్యాథ్యూ అద్భుతంగా చేశారు. కలర్ఫుల్ డ్రస్ల్లో భలే సెట్ అయ్యారు. నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేసిన వైశాఖ్ నాయర్ కూడా తనదైన కామెడీ, సీరియస్ యాక్టింగ్తో మెప్పించాడు. మిగతా పాత్రలు చేసిన యాక్టర్స్ కూడా తమ వంతు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. అద్వైత్ నాయర్ డైరెక్షన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. యాక్షన్ టచ్ ఉన్న కామెడీ మూవీ చూద్దామనుకుంటే నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీపై లుక్కేయండి. ఎలాంటి అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. మీరు 90స్ కిడ్స్ అయితే ఫైట్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.- చందు డొంకాన -
హెబ్బా పటేల్ హారర్ మూవీ.. ఇక్కడ కూడా స్ట్రీమింగ్
త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే ఇతర దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇప్పుడు భారత్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు శ్రీనివాస్ మన్నె తెరకెక్కించిన ఈ మూవీని కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో పి హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. గతేడాది డిసెంబరు 12న విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో త్రిగుణ్, హెబ్బా పటేల్తో పాటు అఖిల్ రాజ్, సిరి హనుమంతు కూడా నటించారు.‘ఈషా’ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి కలిసి ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేశారు. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి సినిమాల తర్వాత ‘ఈషా’ అనే హారర్ చిత్రాన్ని బాక్సాఫీస్ ముందుకు తీసుకు రావడంతో బజ్ క్రియేట్ అయింది. నేటి సమాజంలో దెయ్యాలు, ఆత్మలనేవి ఉన్నాయని నమ్మే వాళ్లు ఎంతమంది ఉన్నారో.. లేవని చెప్పే వాళ్లూ అంతేమంది ఉన్నారు. ఇదే కాన్సెప్ట్తో సినిమాను తెరకెక్కించారు.కథేంటి?కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవు అని నమ్ముతుంటారు. పెద్దయ్యాక టీమ్గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ. -
ఈ శుక్రవారం ఓటీటీ చిత్రాలు.. ఒక్కరోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఫ్రైడే వచ్చిందంటే చాలు కొత్త సినిమాలపై ఆడియన్స్లో ఆసక్తి ఓ రేంజ్లో ఉంటోంది. ఈ శుక్రవారం తెలుగులో సుహాస్ హీరోగా వస్తోన్న హే బల్వంత్, నవాబ్ కేఫ్ లాంటి చిన్న చిత్రాలు సందడి చేయనున్నాయి. వీటిలో హే బల్వంత్పైనే ఆడియన్స్ కొంతమేర బజ్ ఉంది. నవాబ్ కేఫ్పై కూడా ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం దాదాపు 13 సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. వీటిలో తెలుగు హారర్ థ్రిల్లర్ ఈషా మూవీతో పాటు కన్నడ, మలయాళ, తమిళ మూవీస్ సందడి చేయనున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ మూవీ కెన్నడీతో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి మీకిష్టమైన సినిమాలు చూసేయండి.నెట్ఫ్లిక్స్స్ట్రిప్ లా (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20పవనే(కొరియన్ మూవీ)- ఫిబ్రవరి 20 ఫైర్ బ్రేక్(స్పానిష్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 20 అమెజాన్ ప్రైమ్ ఈషా(తెలుగు హారర్ థ్రిల్లర్)- ఫిబ్రవరి 20తీర్థరూప తాండేయవారిగే-(కన్నడ సినిమా) — ఫిబ్రవరి 20హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 20జియో హాట్స్టార్ లక్కీ: ద సూపర్స్టార్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 20ఆహా హాట్స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 20జీ5 రాక్షస(కన్నడ క్రైమ్ థ్రిల్లర్)- ఫిబ్రవరి 20 పాతిరాత్రి(మలయాళ థ్రిల్లర్)- ఫిబ్రవరి 20 కెన్నడీ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 20సన్ నెక్ట్స్..అమోజ్ అలెగ్జాండర్-(మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్)- ఫిబ్రవరి 20ఒండిమునియుమ్ నల్లపడనుమ్- (తమిళ సినిమా)- ఫిబ్రవరి 20లయన్స్ గేట్ ప్లే హీటెడ్ రైవల్రీ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20ఆపిల్ టీవీ ప్లస్ద లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20 -
థ్రిల్లర్ సిరీస్లో సముద్రఖని.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక చిన్నాపెద్ద తేడా లేకుండా నటీనటులందరూ అందులోనూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. తాజాగా సముద్రఖని తొలిసారి ఓ ఓటీటీ వెబ్సిరీస్లో బాగమయ్యాడు. ఆ సిరీస్ పేరు తడయం (క్లూ అని అర్థం). సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఫిబ్రవరి 27న ప్రసారం కానుంది.ట్రైలర్ రిలీజ్తాజాగా ట్రైలర్ వదిలారు. అందులో ఒక పాలవాడు రోజూలాగే అందరికీ పాలు పోసేందుకు బయలుదేరతాడు. అయితే ఓ ఇంటికి వచ్చాక మాత్రం ఎంత పిలిచినా ఎవరూ బయటకు రారు. దాంతో అతడే అమ్మా అని పిలుస్తూ లోపలకు వెళ్తాడు. తీరా అక్కడ రక్తపుమడుగు చూసి భయభ్రాంతులకు లోనవుతాడు. ఈ సన్నివేశంతోనే ట్రైలర్ మొదలైంది. వరుస హత్యలను చేధించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ఐ అదియమాన్గా సముద్రఖనిని చూపించారు.ఓటీటీలో తడయంఇది ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ముగించేద్దాం అని తెలుగు నటుడు నవీన్ చంద్ర వాయిస్తో డైలాగ్ వచ్చింది. మరి ఈ సిరీస్లో నవీన్ ఉన్నాడా? లేదా? అన్నది తడయం ఓటీటీలోకి వచ్చాకే తెలియనుంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. నవీన్ కుమార్ పలనివేల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు విబిన్ భాస్కర్ సంగీతం అందించాడు.A story that unfolds frame by frame🔍Samuthirakani's 1st ever web-series #Thadayam Premieres on 27th Feb On ZEE5!@thondankani @SshivadaOffcl @cocktailcinemas @dirNavin_offl#Thadayam #ThadayamOnZEE5 #TamilZEE5Original #ZEE5Tamil #TamilZEE5 pic.twitter.com/xYfK9xg6s4— ZEE5 Tamil (@ZEE5Tamil) February 19, 2026 -
బేబి గర్ల్ రివ్యూ: మూడురోజుల పసికందు ఎక్కడ?
నిజ జీవితంలో ఎవరికైనా, ఏదైనా సమస్య వస్తే పరిష్కారం కోసం పరితపిస్తుంటారు. కాని సినిమాల్లో మాత్రం మనం చూసే సమస్యకు ముందే పరిష్కారం ఎంచుకోని ఉంటాడు దర్శకుడు. సినిమాలో ఆ పరిష్కార సన్నివేశం వచ్చేంతవరకు చూసే ప్రేక్షకులలో ఉత్కంఠ అలాగే ఉంటుంది. ప్రేక్షకుడు సినిమా కథలో చూపించే సమస్యపై ఎంత ప్రేరేపితమవుతాడో అంతగా ఆ సినిమా విజయవంతమవుతుంది. అదే దృక్పథంతో వచ్చిన తాజా సినిమా బేబిగర్ల్. ఇదో మళయాళ సినిమా. బాబి సంజయ్ అందించిన కథను అరుణ్ వర్మ తెరకెక్కించారు. వర్ధమాన మళయాళ నటులు నవీన్ పోలీ ప్రధాన పాత్రను పోషించి మెప్పించారు. ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న అంశం వాస్తవ ఘటనల ఆధారంగా ఎంచుకున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఈ సినిమాని ప్రేక్షకులు అమితంగా ఆరాధిస్తున్నారు. అంతగా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. ఈ సినిమా కథంతా ఓ మూడు రోజుల పసికందు చుట్టూనే నడుస్తుంది. కేరళ రాష్ట్రం తిరువనంతపురం ప్రాంతంలో ఓ ఆసుపత్రి నుండి మూడురోజుల పసికందు అనుకోకుండా మాయమవుతుంది. ఇప్పుడిప్పుడే ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ తో అణువణువు జల్లెడపట్టేలా ఎదిగిన టెక్నాలజీ ఈ మూడు రోజుల పసికందు ఎటు పోయిందో మాత్రం కనిపెట్టలేదు. పాప మాయమైన రోజున డ్యూటీలో ఉన్న అటెండెర్ సనల్ మాథ్యూ లేట్ గా రావడంపైనే అందరికీ అనుమానం కలుగుతుంది. దాంతో సనల్ తాను చేయని తప్పుకు చాలా బాధ పడతాడు. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది చేసే విచారణ నత్తనడకన సాగడంతో సనల్ తానే స్వయాన పాప కోసం వెతుకుతూ ఉంటాడు. సనల్ చేసిన వెతుకులాటలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వస్తాయి. అంతేకాదు సినిమా మొత్తంలో అటు పోలీసులకు గాని, ఇటు ఆసుపత్రి యాజమాన్యానికి కాని కనిపించని ఆ పసికందును సనల్ తిరిగి కనుక్కోని తన మీద వేసిన నిందను పోగొట్టుకుంటాడా లేదా అన్నది మాత్రం సోనీలివ్ లో స్ట్రీమ్ అవుతున్న బేబి గర్ల్ సినిమాలోనే చూడాల్సిందే. ఇది ఓ మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. వీకెండ్ వాచబుల్. ఇంకెందుకాలస్యం మీరు కూడా సోనీలివ్ కి ట్యూన్ చేసి ఆ బేబి గర్ల్ ని కనిపెట్టడానికి సనల్ కు సాయపడండి.-హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలో బోల్డ్ అండ్ ఫన్ మూవీ స్ట్రీమింగ్
బోల్డ్ అండ్ ఫన్ కాన్సెప్ట్తో బాలీవుడ్లో విడుదలైన మూవీ ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ (Tu Meri Main Tera Main Tera Tu Meri).. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఇక నుంచి ఉచితంగానే ఊడొచ్చు. తాజాగా రెంటల్ విధానాన్ని తొలగించారు. డిసెంబర్ 25, 2025న విడుదలైన ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions), నమః పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సినిమాపై కొంతమేరకు పాజిటీవ్ రివ్యూలు వచ్చినప్పటికీ ధురంధర్ మూవీతో పోటీపడలేక బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చింది.‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ మూవీ అమెజాన్ ప్రైమ్లో ( Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని చూడాలంటే రూ. 279 అధనంగా చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ మెత్తాన్ని తాజాగా రద్దు చేశారు. ఇక నుంచి ఈ మూవీని ఉచితంగానే ఓటీటీలో చూడొచ్చని పేర్కొంది. ‘పతి పత్ని ఔర్ వోహ్’ (Pati Patni Aur Woh) తర్వాత కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే కలిసి ఈ మూవీలో నటించారు. దీంతో దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. కానీ, అంచనాలను అందుకోలేకపోయింది. సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 40 కోట్ల మేరకే రాబట్టినట్లు తెలుస్తోంది. -
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ప్రకటన
రాజీవ్ కనకాల, ఉదయబాను, ప్రధాన పాత్రధారులుగా నటించిన 'డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు' వెబ్ సిరీస్ విడుదలపై ప్రకటన వచ్చింది. ఎమోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ గతేడాదిలోనే స్ట్రీమింగ్ కావల్సి ఉంది. అయితే, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. దర్శకుడు పోలూరు కృష్ణ తెరకెక్కించిన ఈ సిరీస్ ‘జీ 5’(Zee 5)లో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రెక్కీ, విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ వంటి సక్సెస్ఫుల్ సిరీస్లను అందించిన సౌతిండియన్ స్ర్కీన్స్ దీన్ని రూపొందించింది.తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఈ వెబ్ సిరీస్(D/O Prasad Rao Kanabadutaledhu )ను తెరకెక్కించారు. నటి వసంతిక ఇందులో రాజీవ్ కనకాల కూతురు స్వాతి పాత్రలో నటించింది. ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్తో పాటు ఎన్నో సస్పెన్స్ పాయింట్స్ను దర్శకుడు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తండ్రి ఆశయాలకు ఎంతో కష్టపడి ఉద్యోగంలో చేరిన కూతురు ఊహించని రీతిలో అదృశ్యమవుతుంది. ఈ మిస్సింగ్ కేసును ఛేదించేందుకు పోలీసు అధికారిణి (ఉదయభాను) రంగంలోకి దిగుతుంది. స్వాతిని కడ్నాప్ చేసింది ఎవరు..? ఆమెను టార్గెట్ చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి..? అనేది తెరపై చూడాల్సిందే. -
నెట్ఫ్లిక్స్ సినిమాల పండగ.. నేరుగా స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే..!
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే తీరు పూర్తిగా మారిపోయింది. నెల రోజుల్లోపే కొత్త సినిమాలు సందడి చేస్తుండడంతో ఆడియన్స్ ఇంట్లోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందించడంలో ఓటీటీలు సైతం పోటీ పడుతున్నాయి.తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ ఏడాదిలో ఇండియా స్ట్రీమింగ్ సినిమాల జాబితాను ప్రకటించింది. 2026లో నేరుగా ఓటీటికీ వచ్చే చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ల జాబితాను వెల్లడించింది. వీటిలో తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి.తెలుగు సినిమాలు..తక్షకుడు (మూవీ)సూపర్ సుబ్బు (తెలుగు వెబ్ సిరీస్)హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లు..హమ్ హిందుస్థానీ(మూవీ)హలో బచ్చో..(మూవీ)ఇక్కా..(మూవీ)టోస్టర్..(మూవీ)మా బెహన్..(మూవీ)గాంధారి..(మూవీ)కర్తవ్య..(మూవీ)బాలీవుడ్ వెబ్ సిరీస్లుఫ్యామిలీ బిజినెస్..(వెబ్ సిరీస్)తలాశ్: ఎ మదర్స్ సెర్చ్..(వెబ్ సిరీస్)మిస్ మ్యాచ్డ్ : సీజన్4..(వెబ్ సిరీస్)ముజాఫర్ కేఫ్..(వెబ్ సిరీస్)లస్ట్ స్టోరీస్ సీజన్ 3..(వెబ్ సిరీస్)చుంబక్..(వెబ్ సిరీస్)ఖుస్కోర్ పండిట్..(వెబ్ సిరీస్) మామ్లా లీగల్ హై -సీజన్2..(వెబ్ సిరీస్)గ్లోరీ.. (వెబ్ సిరీస్)ఆపరేషన్ సఫేద్ సాగర్..(వెబ్ సిరీస్)కోలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు..మేడ్ ఇన్ కొరియా (మూవీ)లవ్ (తమిళ వెబ్ సిరీస్)లెగసీ (తమిళ వెబ్ సిరీస్)టాక్ షోగ్రేట్ ఇండియన్ కపిల్ షో- సీజన్-5 -
ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. 4 నెలలకు స్ట్రీమింగ్
మలయాళ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సౌబిన్ షాహిర్.. గతేడాది వచ్చిన 'కూలీ'తో మిగతా దక్షిణాది ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక మూవీ చేస్తూనే ఉంటాడు. అలా ఇతడి పోలీస్ కానిస్టేబుల్గా చేసిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. దాదాపు నాలుగు నెలల తర్వాత స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి వస్తుంది?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)2000-10 మధ్య హీరోయిన్గా ఫేమస్ అయిన నవ్య నాయర్ తర్వాత అప్పుడో ఇప్పుడో అన్నట్లు ఒకటి రెండు సినిమాలు చేస్తూ వస్తోంది. ఈమె, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలు చేసిన మలయాళ సినిమా 'పాతిరాత్రి'. ఈ టైటిల్కి అర్థరాత్రి అని అర్థం. గతేడాది అక్టోబరు 17న థియేటర్లలో రిలీజైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం చాన్నాళ్ల తర్వాత అంటే ఈ శుక్రవారం(ఫిబ్రవరి 20) నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.'పాతిరాత్రి' విషయానికొస్తే.. ఝాన్సీ కురియన్(నవ్వ నాయర్) ఎస్సై. హరీష్(సౌబిన్ షాహిర్) ఓ కానిస్టేబుల్. ఓ రోజు రాత్రి గస్తీలో ఉన్నప్పుడు ఓ అనుమానాస్పద వ్యక్తిని వెంబడిస్తారు. తర్వాత అతడు అదృశ్యమవుతాడు. తర్వాత రోజు అతడి మృతదేహం దొరుకుతుంది. దీంతో పోలీసులిద్దరూ నిందితులు అవుతారు. తర్వాత ఏమైంది? ఇంతకీ ఆ వ్యక్తిని హత్య చేసింది ఎవరు? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్) -
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
ఈ వారం ఓటీటీల్లో చెప్పుకోదగ్గ తెలుగు రిలీజులు అయితే లేవు. ఉన్నవి కూడా డబ్బింగ్, హిందీ చిత్రాలే. అలాంటిది ఇప్పుడు సడన్గా ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీలో అందుబాటులోకి ఉంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్)గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన హారర్ సినిమా 'ఈషా'. త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రలు చేశారు. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. అయితే ఎప్పటికప్పుడు హారర్ మూవీస్ చూసేవాళ్లకు ఇదేమంత గొప్పగా అనిపించలేదు. కొందరికి మాత్రం నచ్చింది. ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఇప్పుడీ చిత్రం దాదాపు రెండు నెలలకు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లోకి వచ్చింది. కాకపోతే ప్రస్తుతానికి విదేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశంలో ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.'ఈషా' విషయానికొస్తే.. కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్ముతుంటారు. ఓ బృందంగా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఓసారి ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి తెలుసుకుంటారు. అతడి బాగోతం బయటపెట్టాలని, అక్కడికే వెళ్లి బాబాని కలుస్తారు. మాటల సందర్భంలో ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్) -
టాలీవుడ్ డైరెక్టర్ సినిమా.. మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలో స్ట్రీమింగ్
ఓటీటీల్లో సినిమాలు సడన్గా ఎంట్రీ ఇస్తుంటాయి. ఈ రోజుల్లో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో ముందుగానే డీల్స్ ఉండడంతో స్ట్రీమింగ్ చేసేస్తుంటారు. మరికొన్ని చిత్రాలు ఒకే ఫ్లాట్ఫామ్ కాకుండా రెండు, మూడింటిలోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా మూవీ విడుదలైన కొన్ని నెలలు, ఏడాదిలోపు రావడం చూస్తుంటాం. కానీ తాజాగా ఓ చిత్రం రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా?బాలీవుడ్ మూవీ 8 ఏఎమ్ మెట్రో 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సయామీ ఖేర్, గుల్షన్ దేవయ్య, కల్పిక గణేశ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. 2023 మే 19న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది.తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ చిత్రం మరో ఓటీటీకి రావడం విశేషం. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ రాజ్ రాచకొండ దర్శకత్వం వహించారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన అందమైన జీవితం అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతమందించారు. -
తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా అప్పుడప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు కూడా వస్తుంటాయి. అలా 2024లో తమిళ వచ్చిన చిత్రం 'హాట్ స్పాట్'. మాట్లాడటానికే భయపడే కొన్ని కాన్సెప్ట్లని ఇందులో చూపించారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత డబ్బింగ్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా షాకయ్యారు. దీనికి 'హాట్స్పాట్ 2 మచ్' అని సీక్వెల్ తీయగా.. ఇది మాత్రం ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ఏకంగా ఆరు ఓటీటీల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? వేటిలోకి రానుంది?(ఇదీ చదవండి: ఏంటి ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా అని తారక్ నాతో..)సీక్వెల్లో ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రధారి కాగా.. బ్రిగిడ, భవానీ శ్రీ, తంబి రామయ్య తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. తొలి భాగాన్ని తీసిన విఘ్నేశ్ రాజా దీనికి కూడా దర్శకత్వం వహించాడు. గత నెల 23న థియేటర్లలోకి రాగా ఈ శుక్రవారం(ఫిబ్రవరి 20) నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రకటించారు. కాకపోతే అమెజాన్ ప్రైమ్, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా, లయన్స్ గేట్ ప్లే, షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీ యాప్స్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇదివరకు కొన్ని చిత్రాలు రెండు లేదా మూడింటిలోకి వచ్చాయి గానీ ఇలా ఒకేసారి ఆరింటిలో రానుండటం మాత్రం కచ్చితంగా విచిత్రమే.హాట్స్పాట్ 2 మచ్ విషయానికొస్తే.. సినిమా హీరోల పట్ల అభిమానం పిచ్చిగా మారిపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఒకదానిలో చూపించగా.. స్వలింగ సంపర్కుల వివాహం గురించి జరిగే చర్చ మరోదానిలో.. ఓ వ్యక్తి తనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు, సమాజం చూసే చూపు తదితర అంశాలతో మూడో స్టోరీతో తీశారు. ఈ మూడింటికి ఎలాంటి ముగింపు ఇచ్చారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్) -
ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్
వాలంటైన్స్ డే వీకెండ్ కూడా అయిపోయింది. మరో కొత్తవారం వచ్చేసింది. ఈ వీకెండ్.. థియేటర్లలోకి 'హే భగవాన్', 'నవాబ్ కేఫ్', 'త్రిశంకు' అనే తెలుగు మూవీస్ రాబోతున్నాయి. అలానే మృణాల్ ఠాకుర్ 'దో దివానే సెహర్ మైన్', తాప్సీ 'అస్సీ' అనే హిందీ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. ప్రస్తుతానికైతే వీటిలో దేనిపై పెద్దగా బజ్ అయితే లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ ఓ మేరకు ఆసక్తి ఉన్న సినిమాలు మాత్రమే రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతానికైతే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం లేవు. చథా పచ్చ, హాట్ స్పాట్ 2 మచ్, లక్కీ ద సూపర్స్టార్, కెన్నడీ లాంటి డబ్బింగ్-హిందీ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇవి కాకుండా వీకెండ్ వచ్చేసరికి మరేవైనా సడన్ సర్ప్రైజ్ ఇవ్వొచ్చేమో చూడాలి? సంక్రాంతి చిత్రాల్లో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' స్ట్రీమింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ వారం సడన్ ఎంట్రీ ఇస్తుందేమో? ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 16-22 వరకు)నెట్ఫ్లిక్స్మై పెంగ్విన్ ఫ్రెండ్ (హిందీ డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 16ద లెటర్ ఆఫ్ ద డే (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 16స్కిన్ కేర్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 16వైట్ బర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 16చథా పచ్చ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 19ద నైట్ ఏజెంట్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 19స్ట్రిప్ లా (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20అమెజాన్ ప్రైమ్హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 2056 డేస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 18హాట్స్టార్లక్కీ: ద సూపర్స్టార్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 20ఆహాహాట్స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 20జీ5కెన్నడీ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 20ఆపిల్ టీవీ ప్లస్ద లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 19లయన్స్ గేట్ ప్లేహీటెడ్ రైవల్రీ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా) -
మూడు ఓటీటీలలో యూత్ఫుల్ సినిమా స్ట్రీమింగ్
యూత్ను బాగా ఆకట్టుకున్న చిత్రం పతంగ్.. ఇప్పుడు ఏకంగా 3 ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది. వంశీ పూజిత్. ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైంది. దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి తెరకెక్కించిన ఈ మూవీని డి.సురేశ్బాబు సమర్పణలో సురేశ్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఇందులో గౌతమ్ మేనన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు.ట్రయాంగిల్ ప్రేమకథ కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, 'పతంగ్' మూవీని దర్శకుడు తెరకెక్కించిన తీరు బాగుంటుంది. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఏకంగా మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. జనవరి 30న సన్ నెక్స్ట్ (SUN NXT)ఓటీటీలో విడుదలైన పతంగ్.. ప్రస్తుతం అమెజాన్(Amazon Prime), ఆహా(Aha) తెలుగు ఓటీటీలలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.కథేంటి..?హైదరాబాద్లోని ఓ బస్తీకి చెందిన విజయ్ కృష్ణ అలియాస్ విస్కీ(వంశీ పూజిత్), అదే ప్రాంతంలో ఉండే అరుణ్(ప్రణవ్ కౌశిక్) అనే డబ్బున్న కుర్రాడితో ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు. చిన్ననాటి నుంచి వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) వస్తుంది. ఈమె ఏ విషయంలోనూ సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. తర్వాత అరుణ్ని ఇష్టపడుతుంది. దీంతో ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్ మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యని దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్ల పోటీ. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా స్టోరీ. -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ప్రతి వీకెండ్ ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అలా మన శంకరవరప్రసాద్, అనగనగా ఒక రాజు, వనవీర తదితర తెలుగు మూవీస్ స్ట్రీమింగ్లోకి వచ్చాయి. అలానే తలైవర్ తంబి తలైమయిల్, ద కంజూరింగ్, బ్యాండ్ వాలే లాంటి డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా డిజిటల్ ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైపోయాయి. పెద్దగా హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇంతకీ అవేంటి? వేటిలో ఉన్నాయి?సాయిచరణ్, ఉషశ్రీ హీరోహీరోయిన్లుగా చేసిన తెలుగు సినిమా 'ఇట్స్ ఓకే గురు'. గత డిసెంబరు 12న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు కాకపోవడంతో ఇదెప్పుడు వచ్చివెళ్లిందనే విషయం కూడా తెలీదు. ఇప్పడీ చిత్రం అమెజాన్ ప్రైమ్లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్న ఓ వ్యక్తి.. జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎలా వెళ్లాడు? ఈ ఎదుగులలో ప్రేమ ఎలాంటి పాత్ర పోషించింది అనేదే మూవీ స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)ఇక డిసెంబరులోనే థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'పతంగ్'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఆహా లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ అంతా పతంగుల పోటీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ప్రేమకథ సినిమాలు ఏమైనా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. కాన్సెప్ట్ కూడా పర్లేదు బాగానే ఉందనిపించేలా ఉంటుంది.గతేడాది తమిళంలో వచ్చిన హిట్ అయిన సినిమా 'గెవి'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి కూడా వచ్చేసింది. అటవీ ప్రాంతంలోని ఓ ఊరిలో కొండచరియలు విరిగిపడటం, సరైన ఆస్పత్రి సౌకర్యాలు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. దీంతో అక్కడి ప్రజలు.. పోలీసులు, రాజకీయ నాయకులపై తిరగబడతారు. ఉద్యమం చేస్తారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. షీలా, జాక్విలిన్ లిడియా ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. దయాలన్ దర్శకుడు.(ఇదీ చదవండి: సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం) -
ఓటీటీ రివ్యూ: మలయాళ ఆణిముత్యం.. గుండె లోతుల్లో నిలిచిపోయే సినిమా
మలయాళ సినిమాలు అనగానే చాలామందికి థ్రిల్లర్సే గుర్తొస్తాయి. కానీ అంతకు మించినవి చాలానే ఉన్నాయి. అలాంటి ఓ మూవీనే 'కుంబలంగి నైట్స్'. కేరళలోని ఓ మత్స్యకార పల్లెలో జరిగే స్టోరీ ఇది. చూస్తున్నంతసేపు జీవితం కళ్లముందు కనిపిస్తుంది. గుండెని మెలిపెట్టేస్తుంది. ప్రేమలో పడేలా చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో ఆణిముత్యం. అంతకంటే పెద్ద పదమే ఉన్నా దానితోనూ పోల్చొచ్చు. అంతటి అద్భుతమైన ఈ మూవీ సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కేరళలోని కుంబలంగి గ్రామం. ఊరి చివరన ఓ సగం కట్టిన ఇల్లు. అందులో షాజీ, బోనీ, బాబీ, ఫ్రాంకీ అనే నలుగురు అన్నదమ్ములు. ఒకరంటే ఒకరికి పడదు. ఎవరూ ఏ పని చేయరు. ఇంట్లో ఆడవాళ్లు లేకపోతే ఎలా ఉంటుందో వీళ్ల జీవితం అలానే తయారవుతుంది. పెద్దవాడైన షాజీ(సౌబిన్ షాహిర్).. తన స్నేహితుడు ఓ రోజు చనిపోవడంతో బిడ్డతల్లి అయిన అతడి భార్యకు తన ఇంట్లో ఆశ్రయమిస్తాడు. రెండో వాడైన బోనీ(శ్రీనాథ్ బసి) ఓ విదేశీయురాలితో ప్రేమలో పడతాడు. మూడో వాడైన బాబీ(షేన్ నిగమ్).. అదే ఊరికి చెందిన బేబీ(అన్నా బెన్)ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతాడు. ఇలా అన్నదమ్ముల జీవితాల్లోకి వచ్చిన మహిళల కారణంగా ఈ కుటుంబంలో ఎలాంటి మార్పులొచ్చాయి? అన్నదమ్ములు చివరకు ఎలా ఒక్కటయ్యారు? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఏదో ఓ విషయంలో అసంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ 'కుంబలంగి నైట్స్' చూసిన తర్వాక కంప్లీట్ మూవీ చూశాం అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు అద్భుతమైన దృశ్యకావ్యంలా అనిపిస్తుంది. మనం కూడా కుంబలంగి అనే ఊరిలో వాళ్లతో పాటు ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. మూవీ చూస్తున్నంతసేపు నవ్వుతాం, ప్రేమిస్తాం, ఏడుస్తాం, బాధపడతాం, భావోద్వేగానికి గురవుతాం. అంతలా మిమ్మల్ని కన్నీళ్లు పెట్టిస్తుంది.సినిమా ఫస్టాప్ అంతా కూడా పాత్రలు, వాటి స్వభావాలే చూపిస్తారు. సెకండాఫ్కి వచ్చేసరికి అసలు కథ మొదలవుతుంది. పాత్రల మధ్య సంఘర్షణ పీక్ స్టేజీకి వెళ్తుంది. అన్నదమ్ములంతా ఒక్కడవడంతో ముగుస్తుంది. అయితే ఈ మూవీలో స్టోరీగా చూస్తే.. ఏముందా అనిపిస్తుంది. కానీ కథనం(స్క్రీన్ ప్లే) చూస్తే మాత్రం వావ్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సాధారణ సన్నివేశాలకు కూడా ముగింపు ఇచ్చిన తీరు కట్టిపడేసేలా ఉంటుంది.స్టోరీ మధ్యలో వచ్చే షమ్మి పాత్ర అయితే హైలైట్. చాలా ఇళ్లలో పురుషాధిక్యత చూపించే మగాళ్లకు ఇది ప్రతీక. వెకిలిగా నవ్వుతూ అందరిని చులకనగా చూసే ఈ పాత్రని సైకోలా చూపించారు. తన పంతం నెగ్గించుకోవడానికి ఇంట్లోని మహిళల్ని కట్టిపడేసి, బాబీ అన్నదమ్ములతో కలబడతాడు. వాళ్లందరూ షమ్మిని బంధించి.. ఆడవాళ్లని విడిపిస్తారు. అయితే షమ్మికున్న మానసిక జాడ్యం ఆ పాత్రదా? సమాజంలో కొనసాగుతున్న పురుషాహంకారాన్ని ప్రతిబింబిస్తుందా? అనేది అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత.షమ్మి.. తనని తాను మగాడు అనుకుంటాడు. తను చెప్పిందే అందరూ వినాలి అన్నట్లు పవర్తిస్తుంటాడు. ఇతడికి పూర్తి వ్యతిరేకంగా షజీ పాత్ర ఉంటుంది. ఆడదిక్కు లేని ఇంటి బాధ్యతల్ని తన భుజానేసుకుని, తమ్ముళ్లకు తల్లి లేని లోటు రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఎలాంటి అహంకారం ఉండదు. తప్పు జరిగిందని తెలిసి ఆడదాన్ని కాళ్లమీద పడతాడు. తన వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకునేందుకు చేయాల్సిందంతా చేస్తాడు. కానీ ఎప్పుడూ నేను మగాడిని అనే అహంకారం ప్రదర్శించడు. తనలో బాధని బయటపెట్టలేక కనీసం ఏడుపు కూడా రాకపోయేసరికి.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని తమ్ముడిని అడుగుతాడు. చివరకు సైకియాట్రిస్ట్ దగ్గరకెళ్లి తనివితీరా ఏడ్చి బాధనంతా పోగట్టుకుంటాడు. తెరపై షజీ పాత్ర కన్నీళ్లు పెట్టుకోవడం ఏమో గానీ మన కళ్లు కూడా చెమ్మగిల్లుతాయి.ఈ సినిమాలో కథ బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఇంకా బాగుంటుంది. సంగీతం హృద్యంగా ఉంటుంది. క్లైమాక్స్ కడుపు నింపేస్తుంది. కేరళ అందాల దగ్గర నుంచి చేపల పట్టడం వరకు అన్నీ నచ్చేస్తాయి. అర్జెంట్గా మనం కూడా కుంబలంగి గ్రామానికి వెళ్లిపోవాలి అనిపించేంతలా నచ్చేస్తుంది. అలానే షజీగా చేసన సౌబిన్ షాహిర్, బోనీగా చేసిన శ్రీనాథ్ బసి, బాబీగా చేసిన షేన్ నిగమ్, ఫ్రాంకీగా చేసిన మ్యాథ్యూ థామస్, బేబీగా చేసిన అన్నా బెన్.. ఇలా ప్రతి పాత్ర మనకు కొన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది. వీళ్లందరి కంటే షమ్మిగా చేసిన ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ పిచ్చిపిచ్చిగా నచ్చేయడం గ్యారంటీ.ఏదైనా సినిమా చూస్తే బలంగా గుర్తుండిపోవాలి. మానవ సంబంధాలు ప్రతిబింబించేలా ఉండాలి. ప్రేమకున్న గొప్పతనం తెలియాలంటే మాత్రం ఈ మలయాళ ఆణిముత్యాన్ని అస్సలు మిస్ చేయొద్దు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో, యూట్యూబ్లో ఇది అందుబాటులో ఉంది. మలయాళ భాషలో మాత్రమే ఉందని చూడటం మానేయొద్దు. ఓ మంచి మూవీ మిస్ అవుతారు. కుటుంబంతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన -
థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలోకి వచ్చిన కొన్నిరోజులకే చాలా సినిమాలు స్ట్రీమింగ్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అలానే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ స్టైల్లో ఉండే ఓ యాక్షన్ మూవీ.. డిజిటల్గా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా తేదీని ప్రకటించేశారు. కాకపోతే మరీ బిగ్ స్క్రీన్పైకి వచ్చిన ఆరు రోజులకే స్ట్రీమింగ్ కానుండటం ఇక్కడ విశేషం.(ఇదీ చదవండి: కాబోయే భార్యకు ముద్దుపేరు.. అల్లు శిరీష్ వాలంటైన్స్ డే వీడియో)మలయాళంలో గత నెల 22న రిలీజైన సినిమా 'చథా పచ్చ'. రెజ్లింగ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. అర్జున్ అశోకన్, రోషన్ మ్యాథ్యూ, ఇషాన్ సౌకత్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. అద్వైత్ నాయర్ దర్శకుడు. తొలుత తెలుగులోనే జనవరిలోనే విడుదల చేయాలనుకున్నారు గానీ వాయిదా వేశారు. నిన్ననే అంటే ఫిబ్రవరి 13న థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇంతలోనే ఇప్పుడు ఓటీటీ డేట్ ప్రకటించారు. వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 19) నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'చథా పచ్చ' విషయానికొస్తే.. ముగ్గురు అన్నదమ్ములు సవి(అర్జున్ అశోకన్), లిటిల్ (ఇషాన్ షౌకత్), వెట్రి(రోషన్) తమ చిన్నప్పటి నుంచి టీవీల్లో రెజ్లింగ్, కుస్తీ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లాంటివి చూస్తూ పెరుగుతారు. కొన్ని కారణాల వల్ల వీళ్లు విడిపోతారు. లిటిల్, సవి.. కొచ్చిలో కాస్ట్యూమ్ రెజ్లింగ్ ప్రారంభించే పనిలో ఉంటారు. వీళ్లకు వెట్రి ఎందుకు దూరంగా ఉన్నాడు. లిటిల్, సవి మొదలుపెట్టిన రెజ్లింగ్ పోటీ సక్సెస్ అయిందా? ఈ ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్గా ఇన్స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్) -
ఓటీటీలో మనశంకర వరప్రసాద్గారు.. 24 గంటల్లోనే రికార్డ్
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5 వేదికగా బుల్లితెర ప్రియులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ క్రేజీ రికార్డ్ను సొంతం చేసుకుంది. ఓటీటీకి వచ్చిన 24 గంటల్లోనే 200 మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ జీ5 సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. థియేటర్లలోనే కాదు..ఓటీటీలోనూ మనశంకర వరప్రసాద్గారు దూసుకెళ్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ
టాలీవుడ్ సంగతి కాస్త పక్కనబెడితే తమిళంలో ఈసారి సంక్రాంతికి ఊహించన విషయాలు చాలా జరిగాయి. దళపతి విజయ్ 'జన నాయగణ్' మూవీ.. సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. శివకార్తికేయన్ 'పరాశక్తి' మెప్పించలేకపోయింది. కార్తీ 'వా వాతియర్' అట్టర్ ఫ్లాప్ అయింది. చివరి నిమిషంలో హడావుడిగా పండగ బరిలో నిలిచిన హీరో జీవా నటించిన 'తలైవర్ తంబి తలైమయిల్' అనే కామెడీ సినిమా హిట్ అయిపోయింది. ఇది ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?జీవారత్నం(జీవా) ఓ పల్లెటూరికి సర్పంచ్. అందరికీ చేదోడు వాదోడులా ఉంటాడు. ఓ రోజు తన ఊరికి చెందిన ఇళవరసు(ఇళవరసు) కూతురు సౌజన్య(ప్రార్థన నాథన్) పెళ్లి దగ్గరుండి జరిపించే బాధ్యతని తీసుకుంటాడు. ఉదయమే శుభకార్యం అనగా పక్కింట్లో ఓ ముసలాడు చనిపోతాడు. ఓవైపు పెళ్లిసందడి, మరోవైపు చావు విషాదం. ఈ రెండిళ్ల మధ్య ఎలాంటి గందరగోళం ఏర్పడింది? జీవా ఈ సమస్యని ఎలా పరిష్కరించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సింపుల్ కాన్సెప్ట్, పరిస్థితులకు తగ్గట్లు వచ్చే కామెడీతో మలయాళంలో ఎక్కువగా సినిమాలు తీస్తుంటారు. దాదాపు ఇదే టెంప్లేట్తో వచ్చిన తమిళ మూవీ 'తలైవర్ తంబి తలైమయిల్'. ఓ పల్లెటూరు, ఓ సర్పంచ్, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ, ఓ పెళ్లి, ఓ చావు.. వీటన్నింటి నుంచి పుట్టుకొచ్చే కామెడీతో ఈ సినిమా తీశారు.పల్లెటూళ్లలో పంతాలు పట్టింపులు లాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే గొడవ కాస్త.. ఊరిలో విధ్వంసానికి ఎలా కారణమైంది అనే విషయాన్ని చాలా సరదాగా, కామెడీగా ఇందులో చూపించారు. రెండు గంటల్లోపే ఉండే ఈ మూవీ అక్కడక్కడ బోర్ కొట్టినప్పటికీ.. ఓవరాల్గా పర్లేదు బానే ఉందనిపించేలా సాగుతుంది.మూవీ ప్రారంభ సన్నివేశంలో ఓ వ్యక్తిని పిచ్చోడు అని ఊరి మొత్తం అంటుంది. జీవా కూడా మనసులో అలానే అనుకుంటాడు. కానీ చివరకొచ్చేసరికి అతడు తప్పితే ఊరంతా పిచ్చోళ్లే అనే విషయాన్ని జీవా అర్థం చేసుకుంటాడు. ఇదే అంశాన్ని చూపించిన విధానం బాగుంది. పాత్రలన్నీ కూడా ఎక్కడా అతిగా ప్రవర్తించవు. పరిస్థితులకు తగ్గట్లే అలా అలా వెళ్లిపోతాయి.ఓ సర్పంచ్, ఇద్దరు వయసైన వ్యక్తులు, ఓ ముసలాడు, ఓ పెళ్లి కూతురు, ఓ పెళ్లి కొడుకు.. చివరకు ఊరిలోని వాటర్ ట్యాంక్ని కూడా కథలో భాగం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సర్పంచ్ పాత్రలో జీవా ఆకట్టుకోగా.. ఇళవరసు, తంబి రామయ్య కూడా మెప్పించాడు. పెళ్లి కూతురిగా ప్రార్థన నాథన్ క్యూట్గా చేసింది. మిగతా పాత్రధారులు తమకిచ్చిన రోల్స్కి న్యాయం చేశారు.టెక్నికల్ అంశాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరదాగా సాగిపోయింది. నితీశ్ సహదేవ్ దర్శకుడిగా మెప్పించాడు. తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. ఈ వీకెండ్ ఏదైనా సరదాగా సాగిపోయే ఓ కామెడీ సినిమా చూద్దామనుకుంటే 'తలైవర్ తంబి తలైమయిల్'పై ఓ లుక్కేయొచ్చు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. ఎలాంటి అభ్యంతరకర సీన్స్ లేవు.- చందు డొంకాన -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
రీసెంట్ టైంలో తెలుగులో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలు చాలానే వస్తున్నాయి. అలాంటి వాటిలో 'వనవీర' కూడా ఒకటి. రామాయణంలోని కిష్కింధకాండ ఎపిసోడ్తో ముడిపడేలా దీన్ని తెరకెక్కించారు. థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ అవుతోందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 'చికిరి చికిరి' బ్యాట్ స్టెప్ రామ్చరణ్దా?)అవినాష్ అనే కొత్త కుర్రాడు.. హీరో కమ్ దర్శకుడిగా చేసిన సినిమా 'వనవీర'. తొలుత దీన్ని వానర పేరుతో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెన్సార్ అభ్యంతరం వల్ల టైటిల్ మార్చారు. న్యూఇయర్ సందర్భంగా గత నెల 1వ తేదీన థియేటర్లలోకి తీసుకొచ్చారు. అదే రోజున చాలా తెలుగు చిత్రాలు రావడంతో దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ కాగా నందు విలన్గా చేశాడు.వనవీర విషయానికొస్తే.. వనపురానికి చెందిన మిడిల్ క్లాస్ కుర్రాడు రఘు(అవినాశ్). ఐఐటీ చదివినా ఊళ్లో ఖాళీగానే తిరుగుతుంటాడు. తండ్రి ప్రేమగా కొనిచ్చిన బైక్ అంటే చాలా ఇష్టం. దానిపై మరొకరు చేయి వేస్తే సహించడు. అలాంటిది తప్పని పరిస్థితుల్లో ఓసారి దేవా(నందు) రాజకీయ ర్యాలీ కోసం ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత బైక్ తన చేతికి రాకపోవడంతో రఘు.. తిరిగి దాన్ని తెచ్చుకునేందుకు దేవా ఇంటికి వెళ్తాడు. తర్వాత ఏమైంది? అసలు దేవాతో రఘుకి ఉన్న గొడవేంటి? ఈ కథకు రామాయణంలోని వానర జాతికి ఉన్న సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రామ్చరణ్ కవలల బారసాల.. ఏం పేర్లు పెట్టారంటే?) -
‘దల్ దల్’ రివ్యూ.. గుండె ధైర్యం ఉంటేనే ఈ సిరీస్ చూడండి!
అది సినిమా అయినా, జీవితం అయినా వాటిలో కొన్ని ఘటనలను చూడాలన్నా, వినాలన్నా దమ్ముండాలి. ప్రేక్షకులందరూ ఒకేలా ఉండరు. కొన్ని సన్నివేశాలను, ఘటనలను చూడాలంటే కొందరికి ధైర్యం తప్పనిసరి. ఆ కోవలోకి చెందినదే దల్ దల్ వెబ్ సిరీస్. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ ఏడు భాగాల వెబ్ సిరీస్ చూసే ప్రేక్షకుడికి చమటలు తెప్పిస్తుందనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా హింస ను చూడలేనివారు ఈ సిరీస్ గురించి మర్చిపోవడమే మేలు. అంతలా ఈ సిరీస్ లో ఏముందో ఓ సారి చూద్దాం.అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ దల్ దల్ సిరీస్ మొత్తం ఓ సీరియల్ కిల్లర్ కేసు చుట్టూనే తిరుగుతుంది. అతి చిన్న వయస్సులో ముంబై నగరానికి డీసిపి అయిన రీటా ఫెరారియాకి ఆ కేసు ఓ సవాలుగా మారుతుంది. ఇంతకీ కేసు ఏంటంటే నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలు కూడా ఒకే పంథాలో ఓ సీరియల్ కిల్లర్ చేస్తూ ఉంటాడు. కిల్లర్ పోలీసులకు ఏమాత్రం క్లూ కూడా వదలకుండా చాలా పకడ్బందీగా హత్యలు చేస్తుంటాడు. హత్య గావించబడ్డ బాధితులు అతి దారుణంగా హింసించి హత్య చేయబడుతుంటారు. ఈ విషయం పై మీడియా పోలీసులపై ఒత్తిడి పెంచుతుంది. అందులోనూ అనితా ఆచార్య అనే జర్నలిస్టు ఏకంగా డీసిపి అయిన రీటాని టార్గెట్ చేస్తూ కార్నర్ చేస్తూ ఉంటుంది. విచారణలో భాగంగా రీటా నేరస్తుడిని కనుక్కునే ప్రయత్నంలో తాను ఆ కేసునుండి తప్పుకోవాల్సి వస్తుంది. నిజానికి కిల్లర్ వేసిన ప్లాన్ వల్లనే ఇలా జరుగుతుంది. ఇంతలో పోలీస్ స్టాఫ్ లో ఒకరిని మళ్ళీ సిరీయల్ కిల్లర్ చంపుతాడు. మరి దాదాపుగా నేరస్తుడిని కనుక్కున్న రీటా ఏం చేస్తుంది అన్న విషయం మాత్రం దల్ దల్ చూసే తెలుసుకోవాలి. ఈ సిరీస్ ఓ సైకలాజికల్ త్రిల్లర్, అందులోనూ హింసా నేపధ్యమున్న సిరీస్. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ప్రధాన పాత్రధారి రీటా భూమికను పోషించిన భూమి పెడ్నేకర్ సిరీస్ ఆద్యంతం చాలా సీరియస్ గా కనిపించడం, దానితో పాటు సన్నివేశాలలో వచ్చే దారుణమైన హింసాత్మక ఘటనలను తప్పిస్తే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులతో ఇదో థ్రిల్లింగ్ సీరిస్ . గుర్తుపెట్టుకోండి ఈ దల్ దల్ గుండె నిబ్బరం కలవాళ్ళు మాత్రమే చూడండి. -
ఓటీటీల్లో సినిమాల పండగ.. ఒక్క రోజే 13 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. గతవారంలో థియేటర్లలో చిన్న సినిమాలు రిలీజైనా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ వారంలో విశ్వక్ సేన్ ఫంకీ మూవీ ఆడియన్స్లో ఆసక్తి పెంచుతోంది. దీంతో పాటు అమరావతికి ఆహ్వానం, నీలవే, కపుల్ ఫ్రెండ్లీ లాంచి చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ సందడి చేస్తున్నాయి. ఈ ఫ్రైడే మరిన్ని చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. తెలుగు సినిమాలు లేకపోయినా పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు, హాలీవుడ్ మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే దాదాపు 13 చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం ఓటీటీ సినిమాలునెట్ఫ్లిక్స్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13 మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ సిరీస్) - ఫిబ్రవరి 13 ద ఆర్ట్ ఆఫ్ సారా (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 13అమెజాన్ ప్రైమ్.. బ్యాండ్వాలే( హిందీ వెబ్ సిరీస్)-ఫిబ్రవరి 13 లవ్ మీ లవ్ మీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 13జియో హాట్స్టార్..ద కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 13జీ5భానుప్రియ భూతర్ హోటల్(బెంగాలీ హారర్ మూవీ)- ఫిబ్రవరి 13పాతిరాత్రి(మలయాళ సినిమా)- ఫిబ్రవరి 13ఉత్తర్(మరాఠీ సినిమా)- ఫిబ్రవరి 13సన్ నెక్స్ట్ సూర్య: పవర్ ఆఫ్ లవ్ (కన్నడ చిత్రం) - ఫిబ్రవరి 13 మాయబిమ్బుమ్(తమిళ సినిమా)-ఫిబ్రవరి 13ఆపిల్ టీవీ ప్లస్ ఎటర్నటీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13ది లయన్స్ గేట్ ప్లే..ది రఫ్నెక్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 13 -
రష్మిక-విజయ్ పెళ్లి వేడుక.. కోట్ల రూపాయల డీల్కు నో..!
టాలీవుడ్లో గత కొంత కాలంగా వీరి పెళ్లి చుట్టే చర్చ నడుస్తోంది. ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత ఆ ఇద్దరు స్టార్స్ పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ జంట మరెవరో కాదు.. టాలీవుడ్లో మోస్ట్ వైరల్ ప్రేమజంట రష్మిక- విజయ్ దేవరకొండ. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలోనే జరనుందని వచ్చినా డేట్ విషయంలో క్లారిటీ లేదు. మొదట ఫిబ్రవరి 2న జరగనుందని వార్తలొచ్చనా అలా జరగలేదు. తాజాగా ఈనెల 26న ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో విజయ్- రష్మిక పెళ్లికి సంబంధించిన మరో న్యూస్ తెగ వైరలవుతోంది. వీరి పెళ్లి వీడియోను ఏ ఓటీటీకి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్తో ముందుకొచ్చనట్లు సమాచారం. అయితే తమ వ్యక్తిగత జీవితంలో బిజినెస్ చేసే ఉద్దేశం లేదని ఓటీటీ విజ్ఞప్తిని తిరస్కరించనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వెడ్డింగ్ వీడియో విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే విజయ్- రష్మిక జాగ్రత్త పడుతున్నట్లు టాక్. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేడుకతో వ్యాపారం చేయడం విజయ్కి అస్సలు ఇష్టం లేదని సమాచారం. అందుకే కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఓటీటీ డీల్ను వీరు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్గా ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా వీరిద్దరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
ఓటీటీలో 'జీవా' హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
తమిళ నటుడు జీవా నటించిన తలైవర్ తంబి తలైమైయిల్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న కేవలం తమిళ్లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. కోలీవుడ్లో ఈ ఏడాది పొంగల్ సినిమాల్లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. దర్శకుడు నితీష్ సహదేవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జీవాకు జోడీగా ప్రార్థన నటించింది. మలయాళంలో 'ఫెలిమి' అనే బ్లాక్బస్టర్ హిట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నితీష్.. తమిళంలో దర్శకత్వం వహించిన మొదటి సినిమా తలైవర్ తంబి తలైమైయిల్ (Thalaivar Thambi Thalaimaiyil) కావడం విశేషం.జీవా హిట్ సినిమా తలైవర్ తంబి తలైమైయిల్ (Thalaivar Thambi Thalaimaiyil) నెట్ఫ్లిక్స్(Netflix)లో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండానే విడుదల చేయడంతో ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. థియేటర్లో కేవలం తమిళ్ వర్షన్ మాత్రమే రిలీజ్ చేసిన మేకర్స్ ఓటీటీలో మాత్రం తెలుగు, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్కు తీసుకురావడం విశేషం. రూ. 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. -
ఓటీటీలోకి వచ్చేసిన ధర్మేంద్ర చివరి సినిమా
బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర.. మూడు నెలల క్రితం అంటే గతేడాది నవంబరు చివరలో చనిపోయారు. తర్వాత నెలకు ఈయన నటించిన చివరి సినిమా థియేటర్లలోకి వచ్చింది. సర్వత్రా ప్రశంసలు అందుకున్న ఆ మూవీ.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త నంద హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఇక్కీస్'. న్యూఇయర్ సందర్భంగా జనవరి 01న థియేటర్లలోకి వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులోనే ధర్మేంద్ర కీలక పాత్ర పోషించారు. జైదీప్ అహ్లవత్ కూడా మంచి రోల్ చేశాడు. 1971 భారత్-పాక్ యుద్ధంలో అమరుడైన అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. రెండు వారాల తర్వాత ఉచితంగా అందుబాటులోకి రానుంది.'ఇక్కీస్' విషయానికొస్తే.. బ్రిగేడియర్ ఎంఎల్ ఖేత్రపాల్(ధర్మేంద్ర) ఆర్మీ మాజీ ఉద్యోగి. పాకిస్తాన్లోని తన ఫ్రెండ్స్ని కలిసేందుకు లాహోర్ వెళ్తారు. అక్కడ ఉన్నన్నీ రోజులు ఈయన బాధ్యతని ఆర్మీ మాజీ ఆఫీసర్ నిస్సార్ అహ్మద్(జైదీప్ అహ్లావత్)పై పడుతుంది. పాకిస్తాన్లో తన జ్ఞాపకాలని నెమరవేసుకునేందుకు పలు ప్రాంతాలకు వెళ్లిన ఖేత్రపాల్.. తన కొడుకు అరుణ్ ఖేత్రపాల్ చనిపోయిన ప్రదేశానికి కూడా వెళ్తాడు. ఇంతకీ 1971 భారత్-పాక్ యుద్ధంలో 21 ఏళ్ల సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్(అగస్త్య నంద) చేసిన సాహసమేంటి? యుద్ధభూమిలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? అనేదే మిగతా స్టోరీ. -
డబుల్ థమాకా.. గతంలో బాలయ్య, నాని.. ఇప్పుడు శ్రీవిష్ణు
గతంలో ఒకసారి నందమూరి బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ , బంగారు బుల్లోడు చిత్రాలకు.. మరోసారి హీరో నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జండాపై కపిరాజు చిత్రాలకు ఇలాంటి సమస్యనే ఎదురైంది. తమ సినిమాల విడుదల విషయం తమ చేతిలో లేకపోవడం. ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి రావడం. ఇప్పుడు శ్రీవిష్ణుకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ఈ నెల చివర్లో ఓ ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. తను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. బాలయ్య రెండు చిత్రాలు ఒకేరోజు (1993 సెప్టెంబర్ 3) విడులైయ్యాయి. అలాగే నాని నటించిన రెండు చిత్రాలు 2015 మార్చి 21న విడుదలయ్యాయి.అయితే ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ తీసుకుంది. కానీ స్లాట్ ఈ నెలలోనే ఇచ్చింది. అయితే అదే శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమాను మరో ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఆ సంస్థ కూడా ఇదే నెలకు డేట్ ఇచ్చింది. ఈ విషయంపై చర్చలు జరిగాయి కానీ నో యూజ్. ఇద్దరూ ఒకే తేదీపై పట్టుబడటంతో నిర్మాతలు, హీరో శ్రీవిష్ణు కూడా ఏం చేయలేని పరిస్థితి. రెండు సినిమాలు తనవే కావడంతో, రెండింటినీ సమానంగా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత శ్రీవిష్ణుపై పడింది. ఇప్పటికే మృత్యుంజయ్ టీజర్ విడుదలైంది. మరో రెండు రోజుల్లో విష్ణు విన్యాసం టీజర్ కూడా రానుంది. ఆ వారం ఈ రెండు సినిమాలు తప్ప మరే పెద్ద రిలీజ్ లేకపోవడం శ్రీవిష్ణు అదృష్టమే. రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. అయితే ఏదో ఒకటి ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ కంటెంట్ బలంగా ఉంటే మాత్రం రెండూ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి శ్రీవిష్ణుకు ఒకవైపు ఎంబ్రాసింగ్, మరోవైపు ఎక్సైటింగ్ కూడా. ఎందుకంటే ఒకేసారి రెండు సినిమాలు తనవే అని చెప్పుకోవడం అరుదైన విషయం. చూడాలి మరి చివరికి ఏమౌతుందో. విష్ణు విన్యాసం టీజర్ రిలీజైతే ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ సినిమాలకు కష్టకాలం?
టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాలు వరుసగా రెడీ అవుతున్నాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు నిర్మాతలకు తలనొప్పిగా మారాయి. ఒకవైపు ఓటిటి సంస్థలు ఇలాంటి సినిమాలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు కుదిరే పరిస్థితి లేదు. గతంలో వచ్చిన పలు విఎఫ్ఎక్స్ చిత్రాలు నాసిరకమైన గ్రాఫిక్స్ కారణంగా ప్రేక్షకుల నిరాకరణకు గురైన విషయం తెలిసిందే. ఆ అనుభవం వల్లే ఇప్పుడు ఓటిటి సంస్థలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. సినిమా ఫైనల్ వెర్షన్ చూపిస్తేనే రేటు నిర్ణయిస్తామని ఓటిటిలు స్పష్టంగా చెబుతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర, నిఖిల్ స్వయంభు, నాగ్ చైతన్య వృషకర్మ వంటి భారీ విఎఫ్ఎక్స్ ప్రాజెక్టులు ఓటిటి డీల్స్ కోసం వెయిటింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పటికే పూర్తయిన సినిమాలు మాత్రం సులభంగానే అమ్ముడవుతున్నాయి. కానీ ఇంకా మేకింగ్ దశలో ఉన్నవాటికి ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు ముందుకు సాగట్లేదు. ఇలాంటి వాటిలో పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ కాంబినేషన్లు కూడా ఉన్నాయి. కానీ నిర్మాతలు మాత్రం కొత్తగా విఎఫ్ఎక్స్ సినిమాలు ప్లాన్ చేయడంలో ముందుకు వెనుకకు ఆలోచిస్తున్నారు. ఓటిటి మార్కెట్ బలహీనంగా ఉండటం వల్ల రిస్క్ ఎక్కువగా కనిపిస్తోంది. -
ఓటీటీ ట్రెండింగ్లో ఎప్స్టీన్ వెబ్ సిరీస్
గత కొన్నిరోజులుగా ఎప్స్టీన్ అనే వ్యక్తి పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దానికి చాలానే కారణాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ఈయన.. అగ్రరాజ్యాన్ని కుదిపేసిన భారీ సెక్స్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి. 1980-90ల్లో పేద, మధ్య తరగతి బాలికలకు, అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి..ఫ్లోరిడా,న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణ. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి, మరో యువతిని ఆ బంగ్లాకు తీసుకొస్తే మరికొంత కమీషన్ ఇస్తానని ఆశ చూపేవాడు. ఇది అప్పట్లో బయటపడింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)2005లో ఎప్స్టీన్ని అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైలులో ఉంచారు. 2019లో మీటూ ఉద్యమం సమయంలో మరోసారి ఆరోపణలు వచ్చేసరికి అరెస్ట్ చేశారు. అదే ఏడాది ఆగస్టులో.. జైలులోనే అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అది ఆత్మహత్య అని పోలీసులు తేల్చినప్పటికీ.. ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. అయితే ఎప్స్టీన్ మరణించిన ఏడాది తర్వాత ఇతడి జీవితం ఆధారంగా 'జెఫ్రీ ఎప్స్టీన్ : ఫిల్తీ రిచ్' పేరుతో నెట్ఫ్లిక్స్లో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. 4 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్కి లిసా బ్రయంట్ దర్శకత్వం వహించారు.తాజాగా ఎప్స్టీన్ ఫైల్స్ మరోసారి వైరల్ అవుతుండటంతో ఆరేళ్ల క్రితం రిలీజైన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఇందులో టీచర్ స్థాయి నుంచి ఫైనాన్షియర్గా ఎప్స్టీన్ ఎలా ఎదిగాడు? లైంగిక నేరాలకు ఎలా పాల్పడ్డాడు? నిందితుని చేతిలో మోసపోయిన వారి వ్యథలు ఏంటి? చివరకు జైలులోనే ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల ఏంటనేది చూపించారు.అయితే ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, ట్రంప్, బిల్ గేట్స్ తదితరుల పేర్లు ఉండటం పెద్ద చర్చకు దారి తీసింది.(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. వీడియో పోస్ట్ చేసిన ఉపాసన) -
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్తో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. నెట్ఫ్లిక్స్ రూపొందించిన అక్యూజ్డ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.ఈ క్రైమ్ థ్రిల్లర్ను ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఈ సినిమాకి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో వస్తోన్న ఈ చిత్రంలో కొంకణాసేన్ శర్మ కీలక పాత్రలో నటించారు. గతంలో ఆమె లైఫ్ ఇన్ ఏ మెట్రో, వేకప్ సిద్, ‘మెట్రో ఇన్ దినో’ లాంటి సినిమాల్లో నటించారు. Meera's living her dream life. Will a secret turn it into a nightmare?Watch Accused, starring Konkona Sensharma and Pratibha Rannta, out 27 Feb, only on Netflix. #AccusedOnNetflix pic.twitter.com/J1Nuk2x3f1— Netflix India (@NetflixIndia) February 9, 2026 -
‘ధురంధర్’ ని ఎగబడి చూస్తున్న పాక్ ప్రజలు.. అక్కడ నెం. 1
ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసిన ‘ధురంధర్’..ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 7.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. భారతీయులు మాత్రమే కాదు పాకిస్తాన్ ప్రజలు కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. నెట్ఫ్లిక్లో పాక్ ప్రజలు చూస్తున్న టాప్ 10 సినిమాల్లో దురంధర్ మొదటి స్థానంలో ఉంది.గతేడాది డిసెంబర్ 5న ఈ చిత్రం థియేటర్స్లో విడుదలైంది. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. అయితే పాకిస్తాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. అయినా కూడా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో రణ్వీర్ హీరోగా నటించగా.. విలన్గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుంది. ధురంధర్ 2 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
వాలంటైన్స్ వీక్ వచ్చేసింది. గతవారం చాలానే తెలుగు సినిమాలు, థియేటర్లలోకి వచ్చాయి కానీ ఒక్కటి నిలబడలేదు. ఈ వీకెండ్.. విశ్వక్ సేన్ 'ఫంకీ'తో పాటు 'కపుల్ ఫ్రెండ్లీ', 1+1 ఆఫర్ అనే తెలుగు మూవీస్ రాబోతున్నాయి. అలానే సీతాపయనం, బూకి అనే డబ్బింగ్ చిత్రాలతో పాటు లవ్ స్టోరి, మనసంతా నువ్వే లాంటివి రీ రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 16 వరకు కొత్త చిత్రాలు స్ట్రీమింగ్కి రెడీ అయిపోయాయి.ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతి హిట్స్ అయిన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' ఈ వీకెండ్ అందుబాటులోకి రాబోతున్నాయి. వీటితో పాటు బేబీ గర్ల్ అనే మలయాళ డబ్బింగ్ మూవీ, ద కంజూరింగ్, ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్ అనే హాలీవుడ్ డబ్బింగ్స్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 09 నుంచి 15 వరకు)నెట్ఫ్లిక్స్అనగనగా ఒక రాజు (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 11కొహ్రా సీజన్ 2 (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 11లీడ్ చిల్డ్రన్ (పోలిష్ సిరీస్) - ఫిబ్రవరి 11లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 11తలైవర్ తంబి తలైమయిల్ (తమిళ మూవీ) - ఫిబ్రవరి 12జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ సిరీస్) - ఫిబ్రవరి 13ద ఆర్ట్ ఆఫ్ సారా (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 13అమెజాన్ ప్రైమ్క్రాస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- ఫిబ్రవరి 1హాట్స్టార్ప్రిడేటర్: బ్యాడ్ల్యాండ్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఫిబ్రవరి 12ద కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 13జీ5మన శంకరవరప్రసాద్ గారు (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 11సన్ నెక్స్ట్సూర్య: పవర్ ఆఫ్ లవ్ (కన్నడ చిత్రం) - ఫిబ్రవరి 13సోనీ లివ్బేబీ గర్ల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 12ఆపిల్ టీవీ ప్లస్ఎటర్నటీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్అమర్ విశ్వాస్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 11 -
మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీకి వస్తున్నాడు..
-
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా రాజాసాబ్, పరాశక్తి, నీలకంఠ తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. వీటితో పాటు మరో రెండు తెలుగు మూవీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలు ఇప్పుడు ఎందులో చూడొచ్చు? అసలు వాటి సంగతేంటి? అనేది చూద్దాం.తెలుగులో పలు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్.. 'మాతృ' అనే సినిమా చేశాడు. గతేడాది ఆగస్టులో రిలీజైంది. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎవరికీ తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'మాతృ' విషయానికొస్తే.. ఓ నగరంలో అమ్మాయిలు, అబ్బాయిలు కిడ్నాప్కి గురవుతుంటారు. దీని వెనక ఎవరున్నారా అని పోలీసులు తెగ వెతుకుతుంటారు. అయితే ఈ కిడ్నాప్లకి ఓ ప్రొఫెసర్కి సంబంధముంటుంది. అమ్మ అనే పిలుపు వినగానే ఆ ప్రొఫెసర్ ఎందుకు అదోలా మారిపోతున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఇకపోతే గతేడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'వైభవం'. రుత్విక్ హీరో కాగా సాత్విక్ దర్శకుడు. అందరూ కొత్తవాళ్లు కావడంతో ఇదో మూవీ ఉందనే సంగతి కూడా తెలియనంతగా ఉండిపోయింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. వైభవ్ అనే కుర్రాడు తన ఉద్యోగం వదులుకొని సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు.. తన బాల్య మిత్రులు తనకు తిరిగి కనిపిస్తారు. తన స్నేహితుడికి వచ్చిన ఒక పెద్ద సమస్యని వైభవ్, అతడి మిత్రులు తమదైన శైలిలో ఎలా ఎదుర్కున్నారు అనేది స్టోరీ. -
ఓటీటీలో దురంధర్.. పాక్, బంగ్లాతో సహా ఏకంగా 22 దేశాల్లో..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ చిత్రాల జాబితాలో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.టాప్లో ట్రెండింగ్..థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. గతంలో పలు అరబ్ దేశాలు ఈ మూవీపై నిషేధం విధించాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు సౌదీ, యూఏఈ సహా ఏకంగా 22 దేశాల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే దురంధర్ దెబ్బ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.తాజాగా నెట్ఫ్లిక్స్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దురంధర్ ప్రభంజనం 22 దేశాల్లో కొనసాగుతోందని ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. ఇండియాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్డమ్, మొరాకో, మారిషస్, నైజీరియా, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, జోర్డాన్, కువైట్, లెబనాన్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాప్లో కొనసాగుతోంది. దురంధర్ ఓటీటీకి వచ్చేసిన కేవలం 48 గంటల్లోనే గ్లోబల్గా టాప్-10లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం 32 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న దేశాల్లో దురంధర్ టాప్లో కొనసాగడం విశేషం.కాగా.. ధురంధర్లో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారి పాత్రలో కనిపించారు. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. Taking 22 countries by storm 🔥 Dhurandhar trends at #1 globally!#DhurandharOnNetflix pic.twitter.com/fZeVoSqqcw— Netflix India (@NetflixIndia) February 4, 2026 -
ఓటీటీలో స్వలింగ సంపర్కుల స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఒక సినిమాకు అవార్డ్ వచ్చిందంటే అందులో కంటెంటే ప్రధాన కారణం. చిన్న సినిమాలైనా కంటెంట్ బాగుంటే అవార్డులు వచ్చేస్తుంటాయి. అలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డ్ అందుకున్న తొలి మరాఠీ సినిమా సబర్ బొండా. ఈ మూవీని క్యాక్టస్ పియర్స్ అనే పేరుతో తెరకెక్కించారు. ఈ మూవీ గతేడాది సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైంది ఆ తర్వాత అమెరికాలో జరిగిన సన్డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సబర్ బొండా అనే పేరుతో ఈ సినిమా ప్రదర్శించారు. అంతేకాకుండా ఈ సినిమాని గోథెన్బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మరాఠీ చిత్రంలో భూషణ్ మనోజ్, సురాజ్ సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రోహన్ పరశురామ్ దర్శకత్వం వహించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కుల కథగా ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీని టాలీవుడ్ హీరో రానాకు చెందిన స్పిరిట్ మీడియా సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. Between rituals of loss and moments of connection, a new sense of belonging emergesWatch Sabar Bonda (Cactus Pears), Sundance Film Festival award winner, now on Netflix#SabarBondaOnNetflix @LotusVisualPro @bhushaan_manoj @suraaj_suman pic.twitter.com/egLzFRgDmv— Netflix India (@NetflixIndia) February 6, 2026 -
ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్ ప్రకటన
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) మూవీ నెట్ఫ్లిక్స్(Netflix)లో విడుదల కానుంది. ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుందని యాప్లో ఆ ఓటీటీ సంస్థ పేర్కొంది. నవీన్ పొలిశెట్టి కామెడి పంచ్లకు ఫిదా అయిన ప్రేక్షకులు మరోసారి ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరి 13న ఓటీటీలోకి ఈ మూవీ రానుందంటూ పెద్ద ఎత్తున సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, అంతకంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.కథేంటంటే..గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్ పొలిశెట్టి)కి ‘జమీందారు’ అనే ట్యాగ్ తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్) బాగా రిచ్ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్ పొన్నప్ప)తో నవీన్కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. -
హిందీ వాళ్లపై కోపం లేదు.. 'పరాశక్తి' తెలుగు ట్రైలర్
సంక్రాంతి కానుకగా శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’ తమిళ్లో మాత్రమే విడుదలైంది. తెలుగులో థియేటర్స్ కొరత కారణంగా కనీసం ట్రైలర్ కూడా ఆ సమయంలో రిలీజ్ చేయలేదు. అయితే, కోలీవుడ్లో థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత డైరెక్ట్గా తెలుగు వర్షన్ను కూడా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు ట్రైలర్ను జీ5 వేదికగా పంచుకున్నారు. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇదే మూవీతో శ్రీలీల తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.పరాశక్తి(Parasakthi) సినిమా ఫిబ్రవరి 7న జీ5(ZEE5) ఓటీటీలోకి రానుంది. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వర్షన్ కూడా విడుదల కానుంది. ఇదే విషయాన్ని తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో పేర్కొన్నారు. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు జరిగాయనేది ఇందులో చూపించారు. -
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం శ్రీ చిదంబరం గారు, సుమతీ శతకం, యూఫోరియా, బరాబర్ ప్రేమిస్తా లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో సుమతీ శతకం, యూఫోరియా లాంటి సినిమాలపై కాస్తా బజ్ ఉంది. పెద్ద సినిమాలేవీ ఈ ఫ్రైడే బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో సినీ ప్రియులు కాస్తా నిరాశకు గురవుతున్నారు.ఇక ఈ శుక్రవారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే సంక్రాంతి మూవీ సందడి చేయనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఈ ఫ్రైడ్ ఓటీటీకి వస్తోంది. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ మూవీ రాణించలేకపోయింది. ఈ మూవీతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06 సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06 ట్రాన్స్ఫార్మర్స్ వన్(యానిమేటేడ్ మూవీ)- ఫిబ్రవరి 06 యో బెస్టీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 06అమెజాన్ ప్రైమ్ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06 ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06 వయోలెంట్ ఎండ్స్(హాలీవుడ్ మూవీ)-ఫిబ్రవరి 06జియో హాట్స్టార్ ది రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06జీ5 షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06 పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 07సన్ నెక్స్ట్ నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06సోనీ లివ్ జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06టెంట్ కోట్టాకోంబుసివీ(తమిళ సినిమా)- ఫిబ్రవరి 06హెచ్బీవో మ్యాక్స్బాయ్స్ గో టూ జూపిటర్(యానిమేషన్ చిత్రం)- ఫిబ్రవరి 06ముబీ..లా గ్రేజియా(హాలీవుడ్)- ఫిబ్రవరి 06హులు..స్పిట్స్విల్లే(హాలీవుడ్)- ఫిబ్రవరి 06 -
ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ మూవీ సర్వం మాయ అభిమానుల ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో మలయాళ చిత్రాల కోసం ఓటీటీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఇక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో మరో మలయాళ థ్రిల్లర్ మూవీ అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.నివిన్ పౌలీ హీరోగా నటించిన చిత్రం బేబీ గర్ల్. ఈ సినిమా థియేటర్లలో రిలీజై మలయాళ ఫ్యాన్స్ను అలరించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 12 నుంచి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రానికి అరుణ్ వర్మ దర్శకత్వం వహించారు. కాహా.. ఆస్పత్రి నుంచి ఓ చిన్నారి ఎలా అదృశ్యమైందన్న పాయింట్తో ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీలో లిజోమోల్, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించారు. A missing baby girl. An attendant on the run. A truth darker than the crime.Nivin Pauly, Lijomol, and Sangeeth Pratap headline this high-tension thriller.Watch #BabyGirl, streaming from 12th February, only on Sony LIV.@NivinOfficial pic.twitter.com/WnyS2vnXHG— Sony LIV (@SonyLIV) February 5, 2026 -
ఓటీటీలో 'ది రాజాసాబ్'.. ఫ్యాన్స్కు జియో హాట్స్టార్ గుడ్న్యూస్
ప్రభాస్, మారుతి కాంబినేషన్ సినిమా ది రాజాసాబ్.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే అధికారికంగా జియో హాట్స్టార్ ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను విడుదల చేశారు. అయితే, ఎక్స్టెండెడ్ కట్ను OTTలో విడుదల చేయనున్నట్లు జియో హాట్స్టార్ ప్రకటించింది. ప్రభాస్ ఓల్డ్ గెటప్లో ఉన్న పలు సీన్స్ను కలుపుతున్నట్లు తెలిపింది. ట్రైలర్లలో ప్రభాస్ ఓల్డ్ గెటప్ను చూపించ మేకర్స్ సినిమాలో అది కనిపించకపోవడంతో చాలా మంది సినిమాని ఆస్వాదించలేకపోయారు. ఆ తర్వాత తక్కువ నిడివితో ఉన్న కొన్ని సీన్స్ను థియేటర్ రన్లో కలిపారు. ఇప్పుడు ఓటీటీ కోసం మరికొన్ని సన్నివేశాలు కలిపేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.'రాజాసాబ్' విషయానికొస్తే.. దేవనగర సంస్థాన ఒకప్పటి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్).. ప్రస్తుతం తన మనవడు రాజు(ప్రభాస్)తో చాలా సాధారణ జీవితం గడుపుతుంటుంది. వయసు కారణంగా ఈమెకు మతిమరుపు సమస్య ఉంటుంది. కానీ తన భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తన కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా తీసుకురమ్మని మనవడికి చెబుతుంది. కానీ కనకరాజు.. రాజుని నర్సాపుర్లోని రాజ మహల్కి రప్పించుకుంటాడు. మార్మిక విద్యలెన్నో తెలిసిన కనకరాజుని రాజు అలియాస్ రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? కనకరాజు గతమేమిటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు
జాగ్రత్త... ఈ సినిమాలో దెయ్యం ఉంది, ఇదో హారర్ సినిమా. అయినా కంగారుపడకుండా సరదాగా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా సర్వం మాయ. హారర్ సినిమా అంటే దెయ్యం, అస్థిపంజరం, స్మశానం... ఇవే ఇప్పటి ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే తరుణంలో దర్శకుడు అఖిల్ సత్యన్ ఓ మాయ చేసి ఈ సర్వం మాయ హారర్ సినిమాలోని దెయ్యాన్ని చూసే ప్రేక్షకులు కూడా ఇష్టపడేట్టు చేశాడు. నిజానికి ఇది ఓ గొప్ప ప్రయోగమనే చెప్పాలి. ఆ ప్రయోగంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. సర్వం మాయ (Sarvam Maya movie) ఓ మళయాళ సినిమా. ఈ సినిమాలో కథానాయకుడైన ప్రబేందు స్వతహాగా నాస్తికడైనా కుల వృత్తి ప్రకారం అర్చకాలు, పూజా పునస్కారాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రబేందు మంచి గిటారిస్టు కూడా. ప్రబేందు తన బంధువైన రూపేష్ బలవంతం చేయడంతో అనుకోకుండా ఓ రోజు దెయ్యం వదిలించే పూజను ఒప్పుకుంటాడు. ఆ పూజలో తాను వదిలించిన దెయ్యం తననే పట్టుకుంటుంది. ఇక అక్కడ నుండి కథ రసరంజకంగా సాగుతుంది. దెయ్యం అంటే ఆషామాషి దెయ్యం కాదు. ఆ దెయ్యాన్ని చూస్తే ప్రేక్షకులు కూడా తమకూ అలాంటి దెయ్యం కనిపిస్తే బాగుండునని అనుకోక మానరు. అన్నట్టు ఆ దెయ్యానికి ఓ పేరు కూడా ఉంటుంది అదే డెలలూ. ఈ కథలో ప్రబేందును కలిసిన ఆ డెలలూ చేసే అల్లరి, చిలిపితనం ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ డెలలూ తాను ఎవరినో, ఎందుకు చనిపోయి దెయ్యం అయిందో అన్న సమాధానం కోసం వెతుకుతూ ప్రబేందుని పట్టుకుంటుంది. మరి ఆ డెలలూ ఆచూకీ కనిపెట్టడంలో ప్రబేందు డెలలూకి సాయపడతాడా, అలాగే ఆ డెలలూ వల్ల ప్రబేందుకి కలిగిన ఇబ్బందులు ఏంటి అనేవి మాత్రం హాట్ స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న సర్వం మాయ చూడాల్సిందే. ఈ సినిమా కాస్త నెమ్మదిగా ప్రారంభమైనా దెయ్యం వచ్చినప్పటి నుండి మహా సరదాగా సాగిపోతుంది. కాకపోతే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజన్లో పడేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా మొత్తం డెలలూ కోసం ఓసారి చూడాల్సిందే. ఇంకెందుకాలస్యం వీకెండ్ హాట్ స్టార్ ట్యూన్ చేసి డెలలూతో జత కట్టండి. -
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్
సంక్రాంతి సందర్భంగా శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’ కోలీవుడ్లో విడుదలైంది. తెలుగులో థియేటర్స్ కొరత కారణంగా ఇక్కడ రిలీజ్ కాలేదు. అయితే, డైరెక్ట్గా తెలుగు వర్షన్ను ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. సినిమా విషయంలో పలు విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా రూ. 100 కోట్లకు పైగానే రాబట్టింది.పరాశక్తి(Parasakthi) సినిమా జనవరి 7న జీ5(ZEE5) ఓటీటీలోకి రానుంది. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వర్షన్ కూడా విడుదల కానుంది. టాలీవుడ్లో శివకార్తికేయన్కు భారీ క్రేజ్ ఉండటంతో పరాశక్తి చిత్రాన్ని చూసేందుకు తెలుగు ఫ్యాన్స్ ఆసక్తి కనపరుస్తున్నారు. ఇదే సినిమాతో నటి శ్రీలీల హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయం అయిన విషయం తెలిసిందే.1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఆ గొడవల సమయంలో ఇద్దరు సోదరులు, చెజియాన్, చిన్నదురై జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయనేది కథ యొక్క ముఖ్యాంశం. ఇందులో బాలీవుడ్ నటి సంధ్య మృదుల్ ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ప్రీ-క్లైమాక్స్ లో రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్, డాలీ ధనంజయ కీలకమైన అతిధి పాత్రలో కనిపిస్తారు. -
'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్
దర్శకుడు రాజమౌళి సినిమాలకు పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో హడావుడి చేయడం ఆయన స్టైల్. తాజాగా వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ తర్వాత కేవలం రెండు ఫ్లెక్సీలు వారణాసిలో కట్టడం ద్వారా సోషల్ మీడియాలో భారీ చర్చ రేపారు. విడుదల ఇంకా ఏడాది దూరంలో ఉన్నప్పటికీ, ఇప్పటికే ఓటీటీ అమ్మకాలపై మార్కెటింగ్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ చిన్నది కాదు. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. సినిమాకు మాక్సిమమ్ రాబడి ఓటీటీ రైట్స్ ద్వారానే వస్తుంది. వరల్డ్ వైడ్ రైట్స్ రూపంలో అమ్మకం జరిగాలి. దానికి నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలే ఆ స్థాయి డీల్ క్లోజ్ చేయగలవు. లేదా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో జియో, హాట్స్టార్ వంటి సంస్థలు ముందుకు రావచ్చు. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ డౌన్లో ఉంది. ఏడాది క్రితం అయితే భారీ రేటు సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ రిలీజ్ సమయంలోనే డీల్ క్లోజ్ కావాల్సింది. కానీ అది జరగలేదు. నెలలు గడిచిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటించారు. అంతేకాక రాజమౌళి ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఓటీటీ డీల్ కోసం జరుగుతోందని అనుకోవాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో వారణాసి ఓటీటీ రైట్స్ 600 కోట్లకు పైగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ నటించిన స్పిరిట్ ఓటీటీ డీల్ 170 కోట్లుగా టాక్ ఉంది. అది కూడా పాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్ట్. కానీ పాన్ వరల్డ్ స్థాయికి చేరలేదు. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా క్రేజ్ వేరే. రాజమౌళి సినిమాల స్పాన్ వేరే అయినప్పటికీ లెక్కలు వేసుకుంటే 340–440 కోట్ల మధ్యే డీల్ సాధ్యపడొచ్చని అంచనా.650 కోట్ల రేంజ్లో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. అవి కేవలం క్రేజ్ కోసం పుట్టినవే. నిజంగా అలాంటి హెవీ డీల్ జరిగితే, అమౌంట్ బయటకు రాకపోయినా, డీల్ ఫైనల్ అయిన వార్త మాత్రం ముందుగానే బయటకు వచ్చేది. డీల్ క్లోజ్ అయితే సినిమా చకచకా ఫినిష్ చేయడంపై టీమ్ దృష్టి పెట్టేది. ప్రస్తుతం వారణాసి ఓటీటీ రైట్స్ 600–650 కోట్ల రేంజ్లో క్లోజ్ అయ్యాయని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇది సోషల్ మీడియా హైప్ మాత్రమే. వాస్తవానికి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో 400 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయితే అదే పెద్ద డీల్ అని చెప్పొచ్చు. -
ఓటీటీకి మనశంకర వరప్రసాద్గారు... అఫీషియల్ డేట్ వచ్చేసింది
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది.బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను జీ5 సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. అయినప్పటికీ ఫిబ్రవరి 11 నుంచే ఓటీటీకి రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా జీ5 తమ ఫ్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల జాబితాను రివీల్ చేసింది. ఇందులో మనశంకర వరప్రసాద్గారు ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్కు రానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో టాలీవుడ్ సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. -
ఓటీటీకి వచ్చేసిన సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ది రాజాసాబ్తో పాటు చిరంజీవి మనశంకర వరప్రసాగద్గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో ప్రభాస్ మూవీ అంత మెప్పించలేపోయింది. మిగిలిన నాలుగు చిత్రాలు ఆడియన్స్ను అలరించాయి.అంతేకాకుండా చివర్లో విడుదలైన శర్వానంద్ మూవీ నారీ నారీ నడుమ మురారి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.love met chaos and chose to arrive on your screens 👀#NaariNaariNadumaMurariOnPrime, Watch Now https://t.co/JCx7tvOlqr@ImSharwanand @AnilSunkara1 @iamsamyuktha_ @sakshivaidya99 @RamAbbaraju @ItsActorNaresh @Composer_Vishal @dopyuvraj @gnanashekarvs @ramjowrites @brahmakadali… pic.twitter.com/KxGZsv5EGZ— prime video IN (@PrimeVideoIN) February 3, 2026 -
2026పై నెట్ఫ్లిక్స్ దండయాత్ర.. ఇన్ని సినిమాలు, సిరీస్లా?
ఇప్పుడు ఓటీటీ జమానా నడుస్తోంది. ఏ సినిమాని థియేటర్లో చూడాలి? దేన్ని ఓటీటీలో చూడాలని ముందే ఫిక్సయిపోతున్నారు. చిన్న మూవీస్ని చాలా వరకు ఓటీటీల్లోనే చూసేందుకు బాగా అలవాటు పడిపోయారు. అందుకే తెలుగు చిన్న చిత్రాల పరిస్థితి దారణంగా తయారైంది. మరోవైపు ఆయా ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్ కంటెంట్తో రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే తెలుగులో, తమిళంలో పేరున్న చిత్రాల హక్కులు సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ సంస్థ.. ఈ ఏడాది దాదాపు 30 వరకు ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్లతో రాబోతుంది. ముంబైలో మంగళవారం సాయంత్రం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన ఈ సంస్థ.. 2026లో వచ్చే తమ అప్కమింగ్ ప్రాజెక్టుల గురించి బయటపెట్టింది.(ఇదీ చదవండి: మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై క్లారిటీ)ఆనంద్ దేవరకొండ 'తక్షకుడు', సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' లాంటి సినిమాలతో పాటు చాలానే మూవీస్, వెబ్ సిరీస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ డబ్బింగ్తో రాబోతున్నాయి. హిందీలో మీడియం రేంజ్ స్టార్స్ అందరూ కూడా వీటిలో నటించడం విశేషం. ఇంతకీ ఏ సినిమాలు, సిరీస్లు.. నెట్ఫ్లిక్స్లో ఈ ఏడాది రాబోతున్నాయంటే?తక్షకుడు (తెలుగు సినిమా) - ఆనంద్ దేవరకొండసూపర్ సుబ్బు (తెలుగు సిరీస్) - సందీప్ కిషన్మేడిన్ కొరియా (తమిళ సినిమా) - ప్రియాంక మోహన్లవ్ (తమిళ సిరీస్) - ఐశ్వర్య లక్ష్మి, అర్జున్ దాస్ఫ్యామిలీ బిజినెస్ (హిందీ సిరీస్) - అనిల్ కపూర్, విజయ్ వర్మహమ్ హిందుస్థానీ (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, ప్రతీక్ గాంధీహలో బచ్చోన్ (హిందీ సిరీస్) - వినీత్ కుమార్ సింగ్, గిరిజా ఓక్కొహ్రా సీజన్ 2 (హిందీ సిరీస్) - మోనా సింగ్, బరుణ్ సోబ్తితలాష్: ఏ మదర్స్ సెర్చ్(హిందీ సిరీస్) - పరిణీతి చోప్రాఇక్కా (హిందీ సినిమా) - సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నామిస్ మ్యాచ్డ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - ప్రజక్తా కోలీ, రోహిత్ షరాఫ్ముసాఫిర్ కేఫే (హిందీ సిరీస్) - విక్రాంత్ మస్సే, వేదికా పింటోలస్ట్ స్టోరీస్ 3 (హిందీ సిరీస్) - రాధిక ఆప్టే, కొంకన్ సేన్ శర్మటోస్టర్ (హిందీ మూవీ) - రాజ్ కుమార్ రావ్, సన్యా మల్హోత్రామా బెహన్ (హిందీ సినిమా) - మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రిచుంబక్ (హిందీ సిరీస్) - నీనా గుప్తాద గ్రేట్ ఇండియా కపిల్ షో సీజన్ 5 (కామెడీ షో) - కపిల్ శర్మమామ్లా లీగల్ హై సీజన్ 2 (హిందీ సిరీస్) - రవి కిషన్గాంధారి (హిందీ సినిమా) - తాప్సీ, ఇష్వాక్ సింగ్గ్లోరీ (హిందీ సిరీస్) - దివ్యేందు, పులకిత్ సామ్రాట్గోస్కోర్ పండిట్ (హిందీ సినిమా) - మనోజ్ బాజ్పాయ్, శ్రద్ధాదాస్లెగసీ (తమిళ సిరీస్) - మాధవన్, అభిషేక్ బెనర్జీకర్తవ్య (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, రషిక దుగల్ఆపరేషన్ సఫేద్ సాగర్ (హిందీ సిరీస్) - సిద్ధార్థ్లాకప్ (రియాలిటీ సిరీస్) - ఏక్తా కపూర్, శోభా కపూర్దిండోరా 2 (హిందీ సిరీస్) - భువన్ బామ్, రోహిత్హే దిల్ సున్ రహా హై (హిందీ సిరీస్) - కపిల్ శర్మదేశీ బ్లింగ్ (హిందీ రియాలిటీ షో) - కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాశ్అక్యూజ్డ్ (హిందీ సిరీస్) -కొంకన్ సేన్ శర్మ, ప్రతిభ రత్న(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్) -
నేరుగా ఓటీటీకి ఆనంద్ దేవరకొండ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
అనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తక్షకుడు. ఈ సినిమాకు వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మిడిల్క్లాస్ మెలొడీస్ సూపర్హిట్గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. టీజర్ చూస్తుంటే ఆనంద్ దేవరకొండ మునుపెన్నడు చేయని డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. 'వాడు ఇక్కడే ఉన్నాడు.. నా కళ్లముందే ఉన్నాడు.. కానీ కనిపెట్టలేకపోతున్నాను..' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.కాగా.. ఈ మూవీలో లపతా లేడీస్ ఫేమ్ నీతాన్షీ గోయెల్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. -
సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్గా తెలుగు హీరో.. టీజర్ రిలీజ్
శృంగారం లేదా సె*క్స్ ఎడ్యుకేషన్ అనే పదాలు వింటే చాలు చాలామంది అదేదో బూతులా చూస్తారు. అసలు ఈ పదాలు ఉచ్ఛరించడమే తప్పు అన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ ప్రస్తుత జనరేషన్లో వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది పలు రకాలుగా అవగాహన తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై తెలుగులో ఓ వెబ్ సిరీస్ తీశారు. దాని టీజర్ ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)'సూపర్ సుబ్బు' పేరుతో తీసిన ఈ సిరీస్లో సందీప్ కిషన్ లీడ్ రోల్ చేశాడు. నెట్ఫ్లిక్స్లో త్వరలో ఇది స్ట్రీమింగ్ కానుంది. ముంబైలో మంగళవారం ఓ ఈవెంట్ నిర్వహించిన సదరు ఓటీటీ సంస్థ.. అక్కడ దీని టీజర్ రిలీజ్ చేసిది. కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసింది. టీజర్ బట్టి చూస్తే.. సుబ్బు.. చిన్నప్పటి నుంచి చిలిపి కుర్రాడు. పెద్దయిన తర్వాత కూడా అలానే ప్రవర్తిస్తుంటాడు. పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడనుకుంటే ఏకంగా 60 మంది అమ్మాయిలు ఇతడిని రిజెక్ట్ చేస్తారు.మరోవైపు సుబ్బుకి టీచర్గా అవకాశమొస్తుంది. కాకపోతే ఓ పల్లెటూరిలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు వెళ్లిన పనిలో సక్సెస్ అయ్యాడా లేదా? అనేదే కాన్సెప్ట్లా అనిపిస్తుంది. ఈ సిరీస్లో సందీప్ కిషన్కి జోడీగా మిథిలా పాల్కర్ నటించింది. మురళీ శర్మ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు చేశారు. (ఇదీ చదవండి: నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ టాలెంట్.. వాళ్లకు శాపమవుతోంది!) -
బ్లాక్బస్టర్ సిరీస్.. ఇప్పుడు మళ్లీ యానిమేషన్లోనూ
ఓటీటీల్లో వెబ్ సిరీస్లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థింగ్స్' గురించి ప్రత్యేక పరిచయం చేయనక్కర్లేదు. 2016 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్.. ఐదు సీజన్లుగా వచ్చింది. నాలుగు సీజన్లకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ రెండు నెలల క్రితం రిలీజైన చివరిదైన ఐదో సీజన్కి మిశ్రమ స్పందన వచ్చింది. ఏదైతేనేం సిరీస్ని ముగించేశారు. అయితే ఇదే సిరీస్లోని పాత్రలని తీసుకుని యానిమేషన్ సిరీస్ రూపొందించారు. తాజాగా టీజర్ రిలీజ్ చేసి స్ట్రీమింగ్ ఎప్పుడో కూడా ప్రకటించేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)1984-89 మధ్య కాలంలో హాకిన్స్ అనే ఊరిలో జరిగిన వింత సంఘటనలు, వింత ప్రాణులని ఐదారుగురు పిల్లలు, మరికొందరు కుర్రాళ్లు కలిసి ఎలా ఎదుర్కొన్నారు? చివరకు వాటిని ఎలా అంతం చేశారు? అనే స్టోరీతో 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్ తీశారు. ఇప్పుడు యానిమేషన్ సిరీస్ విషయానికొచ్చేసరికి దాదాపు అదే కాన్సెప్ట్ తీసుకున్నారు. పాత్రలు పాతవే ఉన్నప్పటికీ.. వాటికి డబ్బింగ్ చెప్పిన యాక్టర్స్ మారిపోయారు. ఏప్రిల్ 23 నుంచి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. చూస్తుంటే.. మేకర్స్ ఈ సిరీస్ని ఇప్పట్లో వదిలేలా లేరుగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది) -
50 మంది సెలబ్రిటీలతో కొత్త రియాలిటీ షో..
మన దేశంలో రియాలిటీ షోలకున్న క్రేజే వేరు. సినిమాల్లో, టీవీలో, సోషల్ మీడియాలో కనిపించే సెలబ్రిటీలు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? తెలుసుకోవాలని అభిమానులు తెగ తహతహలాడుతుంటారు. అలాంటి వారికోసం ఎన్నో గేమ్ షోలు, రియాలిటీ షోలు పుట్టుకొచ్చాయి. తాజాగా ద 50 గేమ్ షో మొదలైంది. అసలు ఆ షో ఏంటి? దాని స్పెషాలింటీ ఏంటి? అన్నది ఓసారి చూసేద్దాం..50 మంది సెలబ్రిటీలుబిగ్బాస్ షోలో 20 మందికి అటుఇటుగా సెలబ్రిటీలను హౌస్లోకి పంపిస్తారు. వందరోజులపాటు టాస్కులు, గేమ్స్ ఇస్తారు. చివర్లో ఒకరిని విజేతగా ప్రకటించి రూ.50 లక్షల ప్రైజ్మనీ ఇస్తారు. ద 50 షో కూడా ఇంచుమించు ఇలాంటిదే! కాకపోతే ఇక్కడ సెలబ్రిటీలు పది మందో ఇరవైమందో కాదు, ఏకంగా 50 మంది ఉన్నారు. వీళ్లందర్నీ ఒక పెద్ద రాజభవనంలాంటి మహల్లో ఉంచుతారు. దీన్నే లయన్ హౌస్ అంటారు.ప్రైజ్మనీ ఎవరికంటే?సమయానుసారం టాస్కులు ఆడిస్తారు. ఎప్పుడుపడితే అప్పుడు ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడుపడితే అప్పుడు ఎందుకంటే ద 50 అనేది కేవలం యాభై రోజుల గేమ్ షో. మరి అన్నీ దాటుకుని చివరిదాకా వచ్చినవారికేమైనా ఉంటుందా? అంటే ఇప్పటికైతే అలాంటి ప్రైజ్మనీ ఏమీ ప్రకటించలేదు. కాకపోతే ఎవరు గెలుస్తారో గెస్ చేసిన అభిమాని/ ప్రేక్షకులకు మాత్రం ప్రైజ్మనీ దక్కుతుంది. అది కూడా అక్షరాలా రూ.50 లక్షల రూపాయలు.నో హోస్ట్లెస్ సింక్వాంటె (సింక్వాంటె అంటే 50 అని అర్థం) అనే ఫ్రెంచ్ షో ఆధారంగా 'ద 50' రియాలిటీ షోని డిజైన్ చేశారు. అయితే మాతృకలో ఉన్న అనేక నిబంధనలను ఇక్కడ కాస్త సడలించారు. ఈ షోకి హోస్ట్ అంటూ ఎవరూ ఉండరు. బిగ్బాస్లో ఎలాగైతే కనిపించని వ్యక్తి ఆదేశాలు ఇస్తాడో.. ఇక్కడ కూడా సింహం మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడిస్తాడు, ఛాలెంజ్లు విసురుతాడు, ఎలిమినేట్ చేస్తాడు. ఫిబ్రవరి 1న ఈ షో మొదలైంది. ఓటీటీ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్లో రోజూ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుండగా.. కలర్స్ టీవీలో రాత్రి 10.30కి ప్రసారమవుతోంది.కంటెస్టెంట్లు వీళ్లే..తేజస్వి మదివాడ (తెలుగమ్మాయి), కరణ్ పటేల్, ఊర్వశి ఢోలకియా, రజత్ దలాల్, మిస్టర్ ఫైజు, దివ్య అగర్వాల్, మోనాలిసా, విక్రాంత్ సింగ్ రాజ్పుత్, శినీ దోశి, రిది డోగ్రా, దుశ్యంత్ కుక్రేజా, శివ్ ఠాక్రే, నీలం గిరి, చాహత్ పాండే, హమీద్ బర్క్జీ, డింపాల్ సింగ్, మాక్స్టర్న్, సుమైరా షైఖ్, లవ్కేశ్ కటారియా, సివెత్ తోమర్, నేహాల్ చుదసమ, కృష్ణ ష్రాఫ్, సప్న చౌదరి, నిక్కీ తంబోలి, అర్బాజ్ పటేల్, వన్హాజ్ సింగ్, ప్రిన్స్ నరౌలా, యువికా చౌదరి, అర్చనా గౌతమ్, బేబికా ధుర్వె, జాన్వీ కిల్లెకర్, యంగ్ సామీ, అద్నాన్ షైఖ్, లక్షయ్ కౌశిక్, అర్చిత్ కౌశిక్, దిగ్విజయ్ రాతే, నటాలియా జన్జోజ్సెక్, ఖన్జాదీ, ఫైజ్ బలోచ్, రచిత్ రోజా, సిద్దార్థ్ భరద్వాజ్, డినో జేమ్స్, ఆర్య జదావో, సౌరభ్ గాడ్గె, మనీషా రాని, ఆరుశి చావ్లా, రిద్దిమా పండిట్, శ్రుతికా అర్జున్, భవ్య సింగ్, ఇమ్మోర్టల్ కాక.. పార్టిసిపెంట్లుగా లయన్ హౌస్లో అడుగుపెట్టారు. View this post on Instagram A post shared by JioHotstar Reality (@jiohotstarreality) చదవండి: ఎక్కువ పారితోషికం.. సినిమాను నాశనం చేస్తున్నారు: నటుడు -
ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?
రెండు నెలలుగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ధురంధర్' సినిమా.. రీసెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే రిలీజైంది. ఓటీటీలో మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ డబ్బింగ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి తెలుగు ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి ఎలాంటి స్పందన వస్తోంది? ఎవరు ఏమంటున్నారు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)ఇప్పటివరకు స్పై థ్రిల్లర్ సినిమాలు అనగానే దాదాపు ఒకే టైపులో ఉండేది. దాన్ని 'ధురంధర్' బ్రేక్ చేసింది. చాలా రియలస్టిక్గా, పూర్తిగా పాకిస్థాన్ బ్యాక్డ్రాప్లో తీయడం చాలామందికి సరికొత్త అనుభూతి కలిగించింది. రణ్వీర్ సింగ్ పోషించిన హమ్జా పాత్రనే హీరో కానీ అక్షయ్ ఖన్నా చేసిన రహమాన్ డకాయిట్ పాత్ర ఈ మూవీలో ప్రతిఒక్కరినీ డామినేట్ చేసింది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ పాత్రలు కూడా థియేటర్లలో చూసినప్పుడు బ్లాక్బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు ఓటీటీలో సినిమా చూసిన తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి.దక్షిణాదిలో పుష్ప, కేజీఎఫ్ లాంటి మాస్ ఎలివేషన్స్ మూవీస్ చాన్నాళ్ల క్రితమే వచ్చాయి. అద్భుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. వాటితో 'ధురంధర్'ని పోల్చలేం కాకపోతే ఈ చిత్రాన్ని చాలా రియలస్టిక్ యాక్షన్తో తీశారు. ఎక్కడా ఓవర్ డోస్ ఫైట్స్, ఎలివేషన్స్ లాంటివి ఉండవు. డ్రామా కూడా స్టోరీకి ఎంత అవసరమో అంతే ఉంటుంది. మూడున్నర గంటల మూవీ.. దాదాపు ఎనిమిది ఛాప్టర్లుగా తీశారు. కొందరికి ఈ నిడివి వల్ల ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. మరికొందరికి మాత్రం ఇందులో కొత్తగా ఏముంది? ఇలాంటి యాక్షన్ మూవీస్ ఇప్పటికే చాలా చూశాం కదా అని అంటున్నారు.(ఇదీ చదవండి: ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఇలా అనేసిందా?)దర్శకుడు ఆదిత్య ధర్.. కాందహార్ హైజాక్, పార్లమెంట్పై దాడి, ముంబై తాజ్ హోటల్పై ఉగ్రదాడి తదితర నిజజీవిత సంఘటనలని సినిమాలో భాగం చేసిన విధానం బాగుంది. కాకపోతే వీటి గురించి ఐడియా ఉంటే.. సినిమా నచ్చుతుంది. లేదంటే మాత్రం ఆ పోర్షన్స్ సరిగా అర్థం కాకపోయే అవకాశముంది. ఒకవేళ ఆ ఘటనల గురింతి తెలిస్తే మాత్రం 'ధురంధర్' మంచి కిక్ ఇస్తుంది.'ధురంధర్' తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఎక్కడా కృత్రిమంగా అనిపించలేదు. పాటలు హిందీ వెర్షన్వి ఉంచేసి మంచి పనిచేశారు. ఒకవేళ వాటిని డబ్బింగ్ చేసుంటే మాత్రం మొత్తం ఫీల్ మారిపోయి ఉండేది. కలర్ గ్రేడింగ్ విషయంలోనూ తొలుత నెట్ఫ్లిక్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. థియేటర్ ప్రింట్తో పోలిస్తే ఓటీటీలో కలర్ తేడాగా ఉందని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి. ఇదే విషయం నెట్ఫ్లిక్స్ వరకు చేరడంతో.. మార్పులు చేసింది. కలర్ గ్రేడింగ్తోపాటు సౌండ్ క్వాలిటీ కూడా పెంచింది.సినిమాలో సెట్ వర్క్ చూసి చాలామంది తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అసలు షూటింగ్ అంతా ఎక్కడా చేశారా అని మాట్లాడుకుంటున్నారు. అయితే థాయ్ల్యాండ్లోని కొన్ని ఎకరాల్లో కరాచీలోని లయరీ ఊరిని ఉన్నది ఉన్నట్లుగా దింపేశారు. సినిమాలో యాక్టింగ్, పాటలు, యాక్షన్ సీన్స్ ఎంత ప్లస్ అయ్యాయో.. లొకేషన్స్ కూడా అంతే ప్లస్ అయ్యాయి. ఇకపోతే 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు హిందీ మాత్రమే వచ్చింది. కానీ మార్చి 19న విడుదలయ్యే సీక్వెల్ మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ) -
ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్
సంక్రాంతి సినిమాల సందడి దాదాపుగా ముగిసింది. దీంతో ఈ వారం గుణశేఖర్ 'యుఫోరియా', 'బిగ్బాస్' అమర్దీప్ సుమతీ శతకం చిత్రాలతో పాటు 'శ్రీ చిదంబరం గారు', 'చాయ్ వాలా', 'బరాబర్ ప్రేమిస్తా', 'ఆపరేషన్ పద్మ', 'బ్లడ్ రోజెస్', 'హనీ' తదితర తెలుగు సినిమాలు.. అలానే 'విత్ లవ్' అనే డబ్బింగ్ బొమ్మ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ బోలెడన్ని హిట్ మూవీస్ రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ రాజాసాబ్, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ, శివకార్తికేయన్ పరాశక్తితో పాటు సైక్ సిద్ధార్థ, నీలకంఠ లాంటి తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 02 నుంచి 08 వరకు)అమెజాన్ ప్రైమ్నారీ నారీ నడుమ మురారి (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 04రిలేషన్షిప్ గోల్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 04ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06నెట్ఫ్లిక్స్క్యాష్ క్వీన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 05ద లింకన్ లాయర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 05క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06హాట్స్టార్రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06జీ5షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 07సన్ నెక్స్ట్నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06ఆహాసైక్ సిద్ధార్థ (తెలుగు మూవీ) - ఫిబ్రవరి 04సోనీ లివ్జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06(ఇదీ చదవండి: 'ఛాంపియన్' బ్యూటీ ఓటీటీ ఎంట్రీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీకి మరో సంక్రాంతి సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ నటుడు శివకార్తికేయన్కు తెలుగు ఆడియన్స్లోనూ మంచి గుర్తింపు ఉంది. తాను నటించిన లేటెస్ట్ మూవీ 'పరాశక్తి' చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. పీరియాడికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం జనవరి 10న థియేటర్లలో రిలీజైంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అభిమానలను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 7వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వారు ఓటీటీలో చూసేయండి.ఈ మూవీని 1964లో తమిళనాడులో ఓ ఊరిలో జరిగిన ఉద్యమం ఆధారంగా తెరకెక్కించారు. హిందీని జాతీయ భాషగా ప్రకటించిన తర్వాత మధురైలోని ఓ ఊరిలో విద్యార్థులకు, ఓ ఊరివాళ్లకు.. ఓ పోలీస్తో ఎలాంటి గొడవ జరిగింది? చివరకు ఏమైంది అనే పాయింట్తో మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో పలు అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉండటంతో సెన్సార్ బోర్డ్ భారీ కట్స్ చెప్పింది. ఏకంగా 20కి పైగా కట్స్ సూచించింది. సెన్సార్ వివాదం ముగిసిన తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశారు. #Parasakthi to stream from Feb 7 on Z5🍿💥 pic.twitter.com/Sc60QAOECs— Christopher Kanagaraj (@Chrissuccess) January 31, 2026 -
సీఎంను సామాన్యుడు కిడ్నాప్ చేస్తే?.. భ.. భ.. బ మూవీ రివ్యూ
టైటిల్: భ.. భ.. బ..(భయం .. భక్తి .. బహుమానం)విడుదల తేదీ: 2026-01-27నటీనటులు: దిలీప్, మోహన్లాల్, వినీత్ శ్రీనివాస్, ధ్యాన్ శ్రీనివాసన్, బైజు సంతోష్, శాండీ తదితరులుదర్శకుడు: ధనంజయ్ శంకర్నిర్మాణం సంస్థ: శ్రీ గోకులం మూవీస్సంగీతం: గోపీ సుందర్ఓటీటీ: జీ5ఓటీటీల్లో మలయాళ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటోంది. అందుకే అక్కడ హిట్ సినిమాలను తెలుగు ఆడియన్స్ కోసం డబ్ చేసి వదులుతున్నారు. ముఖ్యంగా మోహన్ లాల్కు టాలీవుడ్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్లే ఆయన కీలక పాత్రలో మెప్పించిన భా భా బ అనే మూవీని తెలుగులోనూ స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు. ఆ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..ఒక పిల్లవాడు తన చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోతాడు. తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో సీఎం కాన్వాయ్ వల్ల ఆలస్యమై ప్రాణాలు పోతాయి. అప్పటి నుంచే సీఎంపై కక్ష పెంచుకున్న పిల్లవాడు.. పెద్దయ్యాక తన రివేంజ్ తీర్చుకున్నాడా? ఎలాంటి ఆధారం లేని ఆ పిల్లవాడు సీఎంను ఏం కిడ్నాప్ చేశాడా? తన పగ తీర్చుకున్నాడా? అన్నదే భా.. భా.. భా.. కథ.ఎలా ఉందంటే..ఒక సీఎం కాన్వాయ్ వల్ల తన తండ్రి కోల్పోయిన రాడార్ (దిలీప్) తన రివేంజ్ కోసం ముఖ్యమంత్రి జోసెఫ్ (బైజు సంతోష్)నే కిడ్నాప్ చేస్తాడు. అయితే సీఎం కుమారుడైన నోబుల్ (వినీత్ శ్రీనివాసన్) ఎన్ఐఏ ఎజెంట్గా పనిచేస్తుంటాడు. తన తండ్రి కోసం కుమారుడే రంగంలోకి దిగుతాడు. అయితే ఈ కథను డైరెక్టర్ చిన్న పిల్లలతో ప్రారంభించాడు. రెండు చిన్న పిల్లల క్రికెట్ టీమ్ల మధ్య మాటలతో కథ బ్యాక్డ్రాప్లోకి తీసుకెళ్లాడు. ఆడియన్స్లో ఆసక్తి పెంచేందుకు అయితే సీఎం ఓ సభకు హాజరు కాగా.. రాడార్ చాలా సులువుగా కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత కథ చాలా ఫన్నీగా సాగుతుంది. రాడార్ ఎవరికీ దొరక్కుండా తప్పించుకునే సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. తన తండ్రి కిడ్నాప్ చేసిన వారిని పట్టుకునేందుకు నోబుల్ (వినీత్ శ్రీనివాసన్) విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.అయితే తన తండ్రిని కిడ్నాప్ చేసింది 'రాడార్' (దిలీప్) అనే విషయం నోబుల్కి తెలుస్తుంది. ఆ తర్వాత కథనం స్పీడ్గా వెళ్తుంది. అంతేకాకుండా రాడార్కి.. ఢిల్లీ బాల (మోహన్ లాల్)తో సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా తెలుస్తుంది. మోహన్ లాల్ ఎంట్రీతో కథ చాలా ఇంట్రెస్టింగ్ మారుతుంది. మోహన్ లాల్, రాడార్ కలిసి చేసే ఫైట్స్ ఆడియన్స్ను అలరిస్తాయి. క్లైమాక్స్ సీన్ అద్భుతంగా అనిపిస్తుంది. అడవుల్లో ఫైరింగ్ స్టంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. చివరి అరగంట మాత్రమే ఆడియన్స్ను కుర్చీలో కట్టిపడేలా చేస్తుంది. ఓ సామాన్యుడు తలచుకుంటే సీఎంను కూడా ముప్పు తిప్పలు పెట్టగలడు అనేది డైరెక్టర్ ఈ చిత్రంలో చూపించారు. కాన్సెప్ట్ బాగుంది కానీ.. అందుకు తగినట్లుగా క్యూరియాసిటీ పెంచడంతో డైరెక్టర్ ఫెయిలయ్యాడనే చెప్పాలి. ఎప్పటికప్పుడు అన్నీ రివీల్ చేస్తూ వెళ్లడం మైనస్. కథలో ట్విస్ట్లు లేకపోవడంతో ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్గా అనిపించదు.అంతేకాకుండా మోహన్ లాల్ స్థాయికి ఈ కథ సెట్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే ఓ స్టార్ హీరో సినిమా మధ్యలో ఎంట్రీ ఇవ్వడం అంతగా ఆసక్తిగా అనిపించకపోవచ్చు. స్టార్ ఇమేజ్కు తగినట్లుగా కథ లేకపోవడం ఇందులో పెద్ద మైనస్. దిలీప్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఇలాంటి కథను చేయడం ఆడియన్స్కు ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. ఈ వీకెండ్లో ఓ రివేంజ్ స్టోరీ చూడాలనుకుంటే భ.. భ.. బ ట్రై చేయొచ్చు. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో దిలీప్ పాత్రనే ఎక్కువ. మూవీ మొత్తం దిలీప్ తన నటనతో ఏ మాత్రం తగ్గకుండా చేశాడు. బైజు సంతోష్ సీఎం పాత్రలో ఒదిగిపోయారు. మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనలేదు. సినిమా మధ్యలో ఎంట్రీ ఇచ్చినా తన నటనతో మరోసారి ఆడియన్స్ను మెప్పించాడు. సంగీతం ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ పరంగా చూస్తే విజువల్స్ కథకు తగ్గట్టుగానే గ్రాండ్గా ఉన్నాయి. ఎడిటింగ్లో ఇంకాస్తా కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా
ప్రతివారం థియేటర్లలో అయినా సినిమాలు మిస్ అవుతాయేమో గానీ ఓటీటీల్లో మాత్రం తెలుగు, డబ్బింగ్ చిత్రాలు స్ట్రీమింగ్లోకి వస్తూనే ఉంటాయి. అలా వచ్చే వారం రాజాసాబ్, నారీ నారీ నడుమ మురారి లాంటి సంక్రాంతి మూవీస్.. డిజిటల్గా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు వీటితో పాటే మరో తెలుగు చిత్రం కూడా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఏంటా మూవీ?(ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)బాలనటుడిగా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మహేంద్రన్.. పెద్దయ్యాక 'మాస్టర్' తదితర తమిళ చిత్రాల్లోనూ నటించాడు. ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశాడు. అలా చేసిన ఓ మూవీ 'నీలకంఠ'. ఈ నెల 2వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న స్టార్స్ లేకపోవడంతో ఎప్పుడొచ్చి వెళ్లిందో అన్నంత వేగంగా మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సన్ నెక్స్ట్లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'నీలకంఠ' విషయానికొస్తే.. సరస్వతిపురం గ్రామం. ఊరిలో ఎవరూ తప్పు చేసినా గ్రామపెద్ద రాఘవయ్య(రాంకీ) కఠిన శిక్షలు విధిస్తుంటాడు. ఇదే ఊరికి చెందిన టైలర్ నాగభూషణం(కంచరపాలెం రాజు) కొడుకు.. పదో క్లాసు చదువుతున్న ఓ తప్పు చేస్తాడు. దీనికి శిక్షగా 15 ఏళ్లపాటు ఊరి దాటి వెళ్లొద్దని రాఘవయ్య ఆదేశిస్తాడు. ఈ కారణం వల్ల నీలకంఠ పెద్ద చదువులు చదవలేకపోతాడు. కబడ్డీ ప్లేయర్ అవుతాడు గానీ శిక్ష వల్ల మండల స్థాయి కబడ్డీ పోటీలకు వెళ్లలేకపోతాడు. మరోవైపు ఇదే ఊరి సర్పంచ్(పృథ్వీ) కూతురు సీత(యష్న ముతులూరి)తో నీలకంఠ ప్రేమలో ఉంటాడు. ఓ సందర్భంగా సీత తండ్రితోనే సర్పంచ్ అవుతానని, తర్వాత పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. చివరకు ఏమైందనేదే మిగతా కథ.(ఇదీ చదవండి: నమ్మలేని పనులన్నీ చేస్తున్న రాజమౌళి) -
'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?
ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్'కి ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. దీనిబట్టి జనాలు ఎంతలా చూశారో అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ పరంగా రొటీన్ అనే విమర్శలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఇది క్లిక్ అయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైందని, స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.నటుడిగా రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చిరంజీవి సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఆ లోటుని 'మన శంకరవరప్రసాద్' తీర్చేసినట్లే కనిపిస్తుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన నయనతార నటించగా.. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. అనిల్ రావిపూడి దర్శకుడు. జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతున్న ఈ మూవీని.. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజులు అటుఇటు అయినా సరే వచ్చే నెల రెండో వారం ఓటీటీ రిలీజ్ పక్కా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))'మన శంకరవరప్రసాద్' విషయానికొస్తే.. నేషనల్ సెక్యూరిటీ అధికారి శంకరవరప్రసాద్ (చిరంజీవి).. కేంద్రమంత్రి శర్మ రక్షణ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంటాడు. మంత్రి కూడా శంకర్ని కుటుంబ సభ్యుడిలా చూసుకుంటూ ఉంటాడు. శంకర్ గతంలో ప్రముఖ బిజినెస్మ్యాన్ జీవీఆర్ కుమార్తె శశిరేఖని పెళ్లి చేసుకుంటాడు. కానీ కొన్నాళ్లకు విడాకులు తీసుకుంటారు. దీంతో పిల్లల్ని చూసే ఛాన్స్ కూడా శంకర్కి ఉండదు. ఇది తెలుసుకున్న కేంద్రమంత్రి.. పిల్లలతో సమయం గడిపేలా వాళ్లు చదువుతున్న స్కూల్లో పీఈటీగా ఉద్యోగం ఇప్పిస్తాడు. కొన్నాళ్లకు శంకర్.. పిల్లలకు దగ్గరగానే ఉన్నాడని శశిరేఖకు తెలుస్తోంది. ఇదే టైంలో జీవీఆర్పై దాడి జరగుతుంది. దీంతో మాజీ భార్య ఇంటికే శంకర్.. సెక్యూరిటీ కోసం వస్తాడు. తర్వాత ఏమైంది? ఇంతకీ శంకర్-శశిరేఖ ఎందుకు విడిపోయారు? అనేదే మిగతా స్టోరీ.సంక్రాంతి సినిమాల ఓటీటీ డీటైల్స్ విషయానికొస్తే.. ప్రభాస్ 'రాజాసాబ్' చిత్రాన్ని ఫిబ్రవరి 6 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలానే శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' మూవీని ఫిబ్రవరి 4 నుంచే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేయనున్నారు. ఇది కూడా అనౌన్స్ చేశారు. (ఇదీ చదవండి: కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ) -
ఓటీటీలో తగ్గిన దురంధర్ రన్టైమ్.. అసలు కారణలేంటి?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఆదిత్య ధార్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానం సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబ్టటిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. ఈ సూపర్ హిట్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్ల వర్షన్ కంటే ఓటీటీలో 9 నిమిషాల నిడివి తగ్గడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఓటీటీకి వచ్చే సినిమాలు దాదాపు ఇంకా సన్నివేశాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా దురంధర్ మూవీని కట్ చేయడంపై అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకు ఆ తొమ్మిది నిమిషాలు ఎందుకు తొలగించారన్న దానిపై ఆడియన్స్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.రన్టైమ్ అసలు వెర్షన్ కంటే ఎందుకు తక్కువగా ఉందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభంలో 3 గంటల 34 నిమిషాలు ఉండగా.. నెట్ఫ్లిక్స్ వెర్షన్ 3 గంటల 25 నిమిషాలు మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సంభాషణలు, బూతులను మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కోసం అనవసరమైన సీన్స్ తొలగించి ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యంగా బలూచ్ నేపథ్యంలో తెరకెక్కించిన సంజయ్ దత్ సీన్స్పై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలను సవరించాలని చిత్రనిర్మాతను ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఆ తర్వాత కొత్త వర్షన్ జనవరి 1న థియేటర్లలోకి వచ్చింది. డిసెంబర్ 4, జనవరి 5 నాటి సెన్సార్ సర్టిఫికేట్ల ప్రకారం సవరించిన రన్టైమ్ సుమారు 209 నిమిషాలు(సుమారు 3 గంటల 29 నిమిషాలు). అందువల్లే నెట్ఫ్లిక్స్లోని వర్షన్ సుమారు మూడు నిమిషాలు తక్కువగా ఉంది. అంతేకాకుండా యాడ్స్ కూడా ఓటీటీలో కనిపించకపోవచ్చని.. ఇది కూడా రన్టైమ్ తగ్గడానికి కారణమని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఏదైనా సీన్స్ తొలగించారో లేదో అధికారికంగా ప్రకటించలేదు.నెట్ఫ్లిక్స్తో పాటు ఇతర ప్లాట్ఫారమ్కు ఒక సినిమాను కత్తిరించడానికి హక్కు లేదు. అయితే మేకర్స్ అనవసర సీన్స్ తొలగించినట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు నిర్మాతలు అందించిన వర్షన్ మాత్రమే ప్లే చేయాల్సి ఉంటుంది. ఓటీటీలు ప్రాథమికంగా కేవలం పంపిణీదారులుగా మాత్రమే పనిచేస్తాయి. అంతే తప్ప సినిమాలో ఏవైనా మార్పులు జరిగితే అవి కేవలం నిర్మాత వైపు నుంచే జరగాలి. లేదంటే కొన్నిసార్లు ప్లాట్ఫారమ్ అభ్యర్థన మేరకు మార్పులు చేసే అవకాశం ఉంది. కాగా.. డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురందర్' బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ స్పై థ్రిల్లర్లో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. 'ధురందర్' సీక్వెల్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. -
'నారీ నారీ నడుమ మురారి' ఓటీటీ డేట్ వచ్చేసింది
ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీపడి మరీ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం "నారీ నారీ నడుమ మురారి". శర్వానంద్ హీరోగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు. జనవరి 14న విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది.వచ్చే వారం ఓటీటీలో..అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 4 నుంచి ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో అధికారిక పోస్ట్ ద్వారా వెల్లడించింది. మరి థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయినవారు ఎంచక్కా వచ్చే వారం నారీ నారీ నడుమ మురారి చూసేయండి..శర్వా అలా అన్నాడో లేదో..నారీ నారీ నడుమ మురారి టీమ్.. జనవరి 23న సంక్రాంతి విన్నర్ బ్లాక్బస్టర్ ఈవెంట్ అంటూ సెలబ్రేషన్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ.. ఈ మూవీ ఇక్కడితో ఆగిపోదు, ఇంకో నాలుగువారాలు ఆడుతుందన్నాడు. థియేటర్ల సంఖ్య కూడా పెంచామని తెలిపాడు. శర్వానంద్ అలా అన్నాడో లేడో రెండు వారాల్లోనే మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుండటం గమనార్హం. ఒక్కసారి సినిమా ఓటీటీకి వచ్చాక థియేటర్లలో ఆడటం కష్టమే! View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
రీసెంట్ టైంలో మలయాళంలో సెన్సేషన్ సృష్టించిన సినిమా 'సర్వం మాయ'. హీరో నివీన్ పౌలీ.. దాదాపు పదేళ్ల తర్వాత ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. హిట్ కొట్టాడు. హారర్ కామెడీ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే రూ.150 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడీ చిత్రం హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ప్రభాస్ 'రాజాసాబ్'.. అధికారిక ప్రకటన)కథేంటి?ప్రభేందు(నివీన్ పౌలీ) బ్రహ్మణ కుర్రాడే కానీ దేవుడిని నమ్మడు. తండ్రి, అన్నలా పౌరోహిత్యం చేయడు. మంచి గిటారిస్ట్ అవ్వాలనేది గోల్. ఆ ప్రయత్నాల్లో ఉంటూ స్టేజీ షోలు చేస్తుంటాడు. అనుకోని కారణాల వల్ల సొంతూరికి వస్తాడు. ఖాళీగా ఉండటం ఎందుకని డబ్బుల కోసం బావ రూపేష్(అజు వర్గీస్)తో కలిసి పూజలు, హోమాలు చేస్తుంటాడు. ఓసారి ఒకరి ఇంట్లో పిల్లాడికి పట్టిన దెయ్యాన్నివదిలిస్తాడు. తర్వాత నుంచి ఆ ఆడ దెయ్యం(రియా షిబు).. ప్రభేందు వెంటపడుతుంది. ఇతడికి మాత్రమే కనిపిస్తూ, ఇతడితోనే మాట్లాడుతూ ఉంటుంది. సదరు దెయ్యానికి.. తాను ఎవరు? ఎలా చనిపోయాననే విషయాలేం గుర్తుండవు. దీంతో ఆ దెయ్యానికి డెలులు అని పేరు పెడతాడు. మరి డెలులు వల్ల ప్రభేందు జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? డెలులు గతమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మలయాళ సినిమాల్లో పెద్దగా కథేం ఉండదు. సింపుల్ ఎమోషన్స్, సున్నితమైన కామెడీతోనే అంతా నడిపించేస్తుంటారు. ఇది అలాంటి ఓ స్టోరీనే. సాధారణంగా దెయ్యాల్ని చూసి మనుషులు భయపడతారు కానీ ఇందులో దెయ్యమే.. మనుషుల్ని చూసి భయపడుతుంది. గతం మర్చిపోవడం వల్ల పేరు సహా ఏదీ గుర్తుండదు. ఎలాంటి పవర్స్ కూడా ఉండవు. హీరో కూడా అంతే. ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాడు. అలాంటి వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు ఎలా సాయం చేసుకున్నారు. ప్రభేందు తన భయాన్ని ఎలా అధిగమించాడు. డెలులు చివరకు ముక్తి పొందిందా లేదా అనేది మెయిన్ ప్లాట్.హారర్ కామెడీ సినిమానే అయినప్పటికీ ఎక్కడా భయపెట్టే సీన్స్ ఉండవు. బదులుగా ఆడ దెయ్యంతో ప్రేమలో పడతాం. ప్రేమ, బంధం, నమ్మకం లాంటి విషయాల గురించి పలు పాత్రలతో చెప్పించిన డైలాగ్స్, ఆయా సీన్స్ చాలామందికి కనెక్ట్ అవుతాయి. మూవీ చూస్తున్నంతసేపు చాలా హాయిగా ఉంటుంది. ఫస్టాప్ చకచకా సాగిపోతుంది. సెకండాఫ్ మాత్రం అక్కడక్కడే తిరిగినట్లు కాస్త సాగదీతగా అనిపిస్తుంది. కాకపోతే డెలులు దెయ్యం ఉన్న ప్రతి సీన్ క్యూట్ అండ్ స్వీట్గా భలే అనిపిస్తుంది. క్లైమాక్స్లో వచ్చే దెయ్యం ఫ్లాష్బ్యాక్ కూడా రొటీన్కి భిన్నంగానే ఉంటుంది. కాకపోతే ఇంత సింపుల్గా తేల్చేశారేంటా అనిపిస్తుంది.ప్రభేందుతో పాటు ట్రావెల్ అయ్యే డెలులు దెయ్యం.. చివరకు అతడితోనే ప్రేమలో పడటం, అదే టైంలో ప్రభేందు.. సాధ్య అనే అమ్మాయిని ప్రేమించడం. తద్వారా ప్రభేందు-డెలులు మధ్య గొడవ జరగడం.. ఈ క్రమంలో డెలులు గతం గుర్తొచ్చే సీన్స్ బాగుంటాయి. డెలులు నిజ జీవితంలోనూ ప్రభేందునే ప్రేమించిందా? అనే ప్రశ్నతో సినిమాని ముగించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.ప్రభేందుగా చేసిన నివీన్ పౌలీ సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. డెలులు దెయ్యంగా చేసిన రియా షిబు అయితే ప్రతిఒక్కరి ఫేవరెట్ అయిపోతుంది. అంత క్యూట్ యాక్టింగ్తో మెస్మరైజ్ చేసేసింది. మిగతా యాక్టర్స్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఏ ఒక్క క్యారెక్టర్ అనవసరంగా ఉందే అని ఎక్కడా అనిపించదు. చివరకు కుక్కని కూడా కథలో భాగం చేసిన తీరు అలరిస్తుంది. టెక్నికల్ విషయాలకొస్తే.. తెలుగు డబ్బింగ్ బాగున్నప్పటికీ పాటలకు రాసిన తెలుగు లిరిక్స్ అస్సలు సూట్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రాఫీ కూడా చూడముచ్చటగా ఉంది. కేరళ అందాలని బాగా క్యాప్చర్ చేశారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.దెయ్యం లేదా హారర్ సినిమాలు చూడాలంటే మీకు చచ్చేంత భయమా? అయినా పర్లేదు. ఎలాంటి భయం లేకుండా మీరు ఈ మూవీ చూసేయొచ్చు. చూస్తున్నంతసేపు దెయ్యమేంటి ఇంత అందంగా ఉంది? ఇలాంటిది మన జీవితంలోకి ఎందుకు ఎప్పుడూ రాలేదు? అని ఒక్కసారైనా అనిపిస్తుంది. ఈ వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం 'సర్వం మాయ' బెస్ట్ ఆప్షన్. కుటుంబంతోనూ కలిసి హాయిగా చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం) -
ఓటీటీలోకి ప్రభాస్ 'రాజాసాబ్'.. అధికారిక ప్రకటన
ఊహించని సర్ప్రైజ్. ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెలలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఫ్లాప్ అయింది. అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ ఆటు సరైన టాక్ తెచ్చుకోక.. కలెక్షన్స్ కూడా తెచ్చుకోలేక ఫెయిలైంది. దీంతో నెలలోపే స్ట్రీమింగ్లోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన ఆషికా సినిమా)పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన కమర్షియల్ మూవీ ఇది. హారర్ ఫాంటసీ కథతో దర్శకుడు మారుతి ఈ సినిమా తీశాడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లు కాగా సంజయ్ దత్, జరీనా వహాబ్ లాంటి సీనియర్లు ఇందులో కీలక పాత్రలు చేశారు. కంటెంట్ మరీ తీసికట్టుగా అర్థం కాని విధంగా ఉండటంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. హిందీకి మరికాస్త సమయం పట్టొచ్చు.'రాజాసాబ్' విషయానికొస్తే.. దేవనగర సంస్థాన ఒకప్పటి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్).. ప్రస్తుతం తన మనవడు రాజు(ప్రభాస్)తో చాలా సాధారణ జీవితం గడుపుతుంటుంది. వయసు కారణంగా ఈమెకు మతిమరుపు సమస్య ఉంటుంది. కానీ తన భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తన కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా తీసుకురమ్మని మనవడికి చెబుతుంది. కానీ కనకరాజు.. రాజుని నర్సాపుర్లోని రాజ మహల్కి రప్పించుకుంటాడు. మార్మిక విద్యలెన్నో తెలిసిన కనకరాజుని రాజు అలియాస్ రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? కనకరాజు గతమేమిటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం) -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన ఆషికా సినిమా
అమిగోస్, నా సామిరంగ, భర్త మహాశయులకు విజ్ఞప్తి తదితర సినిమాలతో హీరోయిన్గా తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఆషికా రంగనాథ్. స్వతహాగా ఈమె కన్నడ అమ్మాయి. అక్కడ చాలానే మూవీస్ చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఈ నెల ప్రారంభంలోనే సొంత భాషా చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. దాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడా సినిమా ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్)గత జన్మల ప్రేమకథ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెలుగులో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్తో తీసిన మూవీ 'గత వైభవం'. జనవరి 1న తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. కానీ కంటెంట్ పరంగా మరీ తీసికట్టుగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఇప్పుడీ మూవీ సడన్గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో ఆషికా, దుష్యంత్ ప్రధాన పాత్రలు చేయగా.. సునీ దర్శకత్వం వహించారు.'గత వైభవం' విషయానికొస్తే.. ఆధునిక(ఆషికా రంగనాథ్)కి పెయింటింగ్స్ వేయడం అలవాటు. తన ఊహల్లో వచ్చే ఓ వ్యక్తి చిత్రాన్ని గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సరిగ్గా అదే పోలికలతో ఉన్న పురాతన్ (దుష్యంత్) ఈమెకు ఎదురుపడతాడు. విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో నడిపే పురాతన్.. తొలుత ఆధునికకు తప్పుడు ఉద్దేశంతో దగ్గరవ్వాలని చూస్తాడు గానీ తన గత జన్మల గురించి ఆమె చెప్పే నిజాలు ఇతడిని షాక్కి గురిచేస్తాయి. ఆధునికకు అసలు గత జన్మల గురించి ఎలా తెలుసు? వందల ఏళ్లక్రితం వీళ్లిద్దరి మధ్య బంధమేంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం) -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో సినిమాల సందడి మొదలవుతుంది.ఈ వారంలో టాలీవుడ్ నుంచి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటించిన ఓం శాంతి శాంతి శాంతిః మూవీ సందడి చేయనుంది. ఈ మూవీపై మాత్రమే ఆడియన్స్లో బజ్ ఏర్పడింది. దీంతో పాటు ఒకట్రెండ్ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్ ఓటీటీకి రానుంది. దీంతో పాటు సర్వం మాయ లాంటి డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లు, హాలీవుడ్ చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 12 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ ధురంధర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30 మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 30 97 మినిట్స్(హాలీవుడ్)- జనవరి 30అమెజాన్ ప్రైమ్ దల్ దల్ (హిందీ సిరీస్) - జనవరి 30 క్రిస్టీ(హాలీవుడ్ మూవీ)-జనవరి 30 ది లాంగ్ వాక్(హాలీవుడ్ మూవీ)- జనవరి 30జియో హాట్స్టార్ సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30సన్ నెక్స్ట్ పతంగ్ (తెలుగు సినిమా) - జనవరి 30ఆపిల్ టీవీ ప్లస్ యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 30జీ5 దేవ్కెళ్ (మరాఠీ సిరీస్) - జనవరి 30మనోరమ మ్యాక్స్..గులాబ్ జామూన్(మలయాళ సినిమా)- జనవరి 30హులు..ఎల్లామెక్కే(హాలీవుడ్ సినిమా)- జనవరి 30 -
దురంధర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. అదొక్కటే నిరాశ
రణ్వీర్ సింగ్ నటించిన స్రై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'దురంధర్'. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-2 చిత్రాలను అధిగమించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈనెల 30 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మూవీ థియేట్రికల్ వెర్షన్ రన్టైమ్ 3 గంటలా 34 నిమిషాలు కాగా.. ఓటీటీలో దాదాపు 9 నిమిషాలు తగ్గించారు. ఓటీటీలో అన్కట్ వెర్షన్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగినా రన్టైమ్ తగ్గడం ఆడియన్స్ను నిరాశకు గురి చేస్తోంది.కాగా.. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఛావా, కాంతార-2 చిత్రాలను దాటేసింది. అంతేకాకుండా తాజాగా దేశీయంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఘనత సాధించింది. It’s official! 🔒🔥Dhurandhar drops on Netflix TONIGHT! pic.twitter.com/gsAGMURqj7— Fozzy (@fozzywrites) January 29, 2026 -
మరో ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రం డ్రైవ్. గతేడాది డిసెంబర్ 12న అఖండ-2తో పాటు ఈ మూవీ విడుదలైంది. చాలా కాలం తర్వాత తెలుగులో ఆది పినిశెట్టి నటించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై ఆనంద్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. దర్శకుడు జెనూస్ మొహమ్మద్ తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్గా చేసింది. అయితే ఈ సినిమా థియేటర్స్లో ప్రేక్షకులను ఈ మూవీ పెద్దగా మెప్పించలేకపోయింది.ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా అందుబాటులో ఉంది. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి రానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రం జనవరి 30 నుంచి ఆహాలో అందుబాటులో ఉంటుందని ట్వీట్ చేసింది. సైబర్ క్రైమ్స్, హ్యాకింగ్స్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించారు. Every secret has a price.And someone is always watching👀@AadhiOfficial @MadonnaSebast14 @RajaChembolu @kamalkamaraju @anishkuruvilla @jenusemohamed @AbinandhanR @osho_venkat @PrawinPudi #AnandaPrasad @BhavyaCreations pic.twitter.com/GFARaOuO0S— ahavideoin (@ahavideoIN) January 27, 2026 -
మలయాళ బ్లాక్బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ
రీసెంట్ టైంలో ఓటీటీ సంస్థలు.. ఏ భాషా చిత్రాలకైనా తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా భాషల్లో హిట్ అయిన మూవీస్కి తెలుగు వెర్షన్ అందుబాటులోకి తెస్తున్నాయి. రీసెంట్గా 'సిరై' అనే తమిళ చిత్రానికి ఇలానే చేశారు. ఇప్పుడు మలయాళంలో బ్లాక్బస్టర్ టాక్ అందుకున్న ఓ సినిమా స్ట్రీమింగ్లోకి వచ్చిన దాదాపు 10 రోజులకు తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'.. తెలుగులోనూ)మలయాళంలో ఒకప్పుడు సూపర్స్టార్గా చెలామణీ అయిన దిలీప్.. 2017లో హీరోయిన్ భావనపై అత్యాచారం చేయించాడనే ఆరోపణలతో మూడు నెలలు జైలు జీవితం గడిపాడు. ఈ సంఘటన తర్వాత నుంచి దిలీప్ పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. గత నెల అంటే 2025 డిసెంబరులో ఈ కేసు నుంచి దిలీప్కి పూర్తిగా రిలీఫ్ దక్కింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నుంచి దిలీప్ పేరు తొలగించారు. ఇది జరిగిన కొన్నిరోజులకే దిలీప్ కొత్త మూవీ 'భా భా భా' థియేటర్లలోకి వచ్చింది.కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా కీలక పాత్ర పోషించాడు. డిసెంబరు 18న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి టాక్ పాజిటివ్గానే వచ్చింది. ప్రేక్షకులు బాగానే ఆదరించారు. కొన్నిరోజుల క్రితం ఈ చిత్రం జీ5 ఓటీటీలోకి వచ్చింది. అప్పుడు మలయాళం మాత్రమే రాగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చినట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్) -
ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛాంపియన్, సర్వంమాయ, పతంగ్, అన్నగారు వస్తారు తదితర చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు 'ధురందర్' కూడా ఓటీటీలోకి రానుందనే టాక్ నడుస్తోంది. వీటికి తోడు హాలీవుడ్ క్రేజీ మూవీ 'అనకొండ' ఇప్పుడు సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి విషయం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: తమిళ బ్లాక్బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)1997లో తొలిసారి వెండితెరపై 'అనకొండ' సినిమా వచ్చింది. అప్పట్లో ఇలాంటి పాములతో మూవీస్ ఎవరూ తీయలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా జనాలు విరగబడి చూశారు. తెలుగులోనూ డబ్బింగ్ చేస్తే ఇక్కడ కూడా అద్భుతమైన హిట్గా నిలిచింది. దీని తర్వాత 2004లో ది హంట్ ఫర్ బ్లడ్ ఆర్కిడ్, 2008లో ఆఫ్ స్ప్రింగ్, 2009లో ట్రయల్ ఆఫ్ బ్లడ్, 2015లో లేక్ ప్లాసిడ్ అని మరో నాలుగు మూవీస్ కూడా వచ్చాయి. కమర్షియల్గా హిట్ అయ్యాయి గానీ కంటెంట్ పరంగా ఓకే ఓకే అనిపించుకున్నాయి.దాదాపు పదేళ్ల విరామం తర్వాత గత నెలలో 'అనకొండ' పేరుతో లేటెస్ట్ మూవీ ఒకటి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇది ప్రేక్షకుల్ని పెద్దగా అలరించలేకపోయింది. దీంతో నెలయ్యేసరికి అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్లోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఇంగ్లీష్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఎల్లుండి (జనరి 29) నుంచి మన దగ్గర కూడా తెలుగు, తమిళ డబ్బింగ్ రూపంలోనూ ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్) -
ఓటీటీలో కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా.. డైరెక్ట్గా స్ట్రీమింగ్
కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం 'అన్నగారు వస్తారు' డైరెక్ట్గా ఓటీటీలోకి రానుంది . ఇప్పటికే తమిళ్ వర్షన్లో ‘వా వాత్తియార్’ పేరుతో సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. అయితే, తెలుగులో థియేటర్స్ దొరకకపోవడంతో టాలీవుడ్లో విడుదల కాలేదు. దీంతో తెలుగు వర్షన్ను ఓటీటీలోనే డైరెక్ట్గా విడుదల చేస్తున్నారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించి ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్గా తమిళనాట ఎంట్రీ ఇచ్చింది. మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.జనవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా అన్నగారు వస్తారు (అన్నగారు వస్తారు) మూవీ విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. -
తమిళ బ్లాక్బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో
ఇప్పుడంతా ఓటీటీ జమానా. వివిధ భాషల సినిమాలని డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్లోకి తీసుకొస్తున్నారు. గత కొన్నేళ్లలో అలా దక్షిణాది భాషల మూవీస్కి తెలుగు ప్రేక్షకులు బాగా అలవాటు అయిపోయారు. ఇకపోతే గత వీకెండ్ రిలీజైన ఓ తమిళ బ్లాక్బస్టర్ చిత్రానికి ఇప్పుడు కాస్త ఆలస్యంగా తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఇది ఏ సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)విక్రమ్ ప్రభు, అక్షయ్ కుమార్, అనిష్మా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'సిరై'. తమిళంలో ఈ టైటిల్కి జైలు అని అర్థం. డిసెంబరులో థియేటర్లలోకి రిలీజైనప్పుడు అద్భుతమైన సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. మూడు రోజుల క్రితం జీ5 ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రమే తొలుత అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇంటెన్స్ పోలీస్ డ్రామా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేయొద్దు.'సిరై' విషయానికొస్తే.. శీను(విక్రమ్ ప్రభు) అనే పోలీస్, ఎక్కువగా ఎస్కార్ట్ డ్యూటీ చేస్తుంటాడు. ఎస్కార్ట్ అంటే ఖైదీని జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లడం అనమాట. వృత్తిలో సిన్సియర్ అయిన ఇతడు ఓ రోజు అబ్దుల్ రౌఫ్(అక్షయ్ కుమార్) అనే ఖైదీని గుంటూరు జైలు నుంచి కడప కోర్టు వరకు తీసుకెళ్లాల్సిన ఎస్కార్ట్ పనిపడుతుంది. మరి ఈ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి. అబ్దుల్ గతమేంటి? ఇతడు ప్రేమించిన కళ (అనిష్మా) చివరకు ఏమైంది? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు) -
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్
మరోవారం వచ్చేసింది. సంక్రాంతి సినిమాలు ఇంకా థియేటర్లలో జనాల్ని ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ వీకెండ్.. ఓం శాంతి శాంతి శాంతిః, త్రిముఖ, ప్రేమకడలి తదితర తెలుగు మూవీస్ బిగ్ స్క్రీన్పైకి రాబోతున్నాయి. విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్', 'తుంబాడ్' డైరెక్టర్ కొత్త చిత్రం 'మయసభ' కూడా ఈ వారాంతలోనే థియేటర్లలోకి రానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ అవనున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)ఈ వారం ఓటీటీ మూవీస్ విషయానికొస్తే.. ఛాంపియన్, సర్వం మాయ, పతంగ్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్బస్టర్ 'ధురంధర్' కూడా ఇదే వీకెండ్లో స్ట్రీమింగ్లోకి రానుందనే టాక్ ఉంది. ప్రస్తుతానికైతే ఇవే. సడన్ సర్ప్రైజులు ఏమైనా ఉండొచ్చేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు)నెట్ఫ్లిక్స్మైక్ ఎప్స్: డెల్యూషనల్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 27టేక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 27బ్రిడ్జర్టన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29ఛాంపియన్ (తెలుగు సినిమా) - జనవరి 29ధురంధర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30 (రూమర్ డేట్)మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 30అమెజాన్ ప్రైమ్ద రెకింగ్ క్రూ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 28దల్ దల్ (హిందీ సిరీస్) - జనవరి 30హాట్స్టార్గుస్తాక్ ఇష్క్ (హిందీ మూవీ) - జనవరి 27సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30సన్ నెక్స్ట్పతంగ్ (తెలుగు సినిమా) - జనవరి 30ఆపిల్ టీవీ ప్లస్స్క్రింకింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 28యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 30బుక్ మై షోద ఇంటర్న్షిప్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 28జీ5దేవ్కెళ్ (మరాఠీ సిరీస్) - జనవరి 30(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు) -
ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
చాన్నాళ్లుగా టాలీవుడ్లో ఉంటూ సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నందు.. రీసెంట్ టైంలోనూ దండోరా, వనవీర తదితర చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్, విలన్ తరహా పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు. వీటితో పాటు హీరోగానూ ఓ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అదే 'సైక్ సిద్ధార్థ'. థియేటర్లలో ఘోరమైన టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: పరోటా మాస్టర్కి గోల్డ్ చెయిన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్)పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ నెల 1వ తేదీన థియేటర్లలోకి వచ్చిన 'సైక్ సిద్ధార్థ'.. ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. హీరో నందు.. ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. ఒకటి రెండు సందర్భాల్లో ఎమోషనల్ కూడా అయిపోయాడు. ఈ సినిమాతో హీరోగా నిలబడతానని చెప్పాడు కూడా. కానీ రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇప్పుడు దీన్ని ఫిబ్రవరి 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేనున్నారు. గోల్డ్ యూజర్స్ ఒకరోజు ముందే చూడొచ్చు. ఇందులో నందు, యామినీ భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.'సైక్ సిద్ధార్థ' విషయానికొస్తే.. సిద్ధార్థ (శ్రీ నందు) అనుకోకుండా పరిచయమైన త్రిష(ప్రియాంక)తో ప్రేమలో పడతాడు. వీళ్లు మన్సూర్ (సుఖేష్రెడ్డి)తో కలిసి ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మొదలుపెడతారు. అందులో రూ.2 కోట్ల పెట్టుబడి సిద్ధార్థదే. కానీ మన్సూర్, త్రిష కలిసిపోయి.. సిద్ధార్థని దారుణంగా మోసం చేస్తారు. దీంతో అన్నీ పోగొట్టుకున్న సిద్ధార్థ.. చివరకు హైదరాబాద్లోని ఓ బస్తీలో చిన్న గది అద్దెకు తీసుకుని బతుకుతుంటాడు. సిద్ధార్థ ఉంటున్న బిల్డింగ్లోకి తన కొడుకుతో కలిసి శ్రావ్య (యామినీ భాస్కర్) అద్దెకు వస్తుంది. భర్త వేధింపులు తట్టుకోలేక వేరేగా వచ్చి బతుకుతూ ఉంటుంది. తర్వాత సిద్ధార్థ-శ్రావ్య ఎలా కలిశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు) -
సిరై రివ్యూ: ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే మూవీ
ప్రేమ గుడ్డిది. రంగు, ఆస్తి, కులమతాలు దానికి కనిపించవు. ఎప్పుడు ఏ రెండు మనసుల్ని కలుపుతుందో దానికే తెలీదు. కానీ, ఎన్నో అవాంతరాలు దాటుకుని ఆ ప్రేమ సుఖాంతం అవడం చాలా కష్టం. ఈ క్రమంలో అది పెట్టే పరీక్షలు, కష్టాలు అనుభవించినవారికే ఎరుక. సిరై సినిమాలో అదే చూపించారు. ఆ మూవీ రివ్యూ ఓసారి చూసేద్దాం...కథవిక్రమ్ ప్రభు పోలీస్ కానిస్టేబుల్గా నటించాడు. ఓరోజు ఖైదీ అబ్దుల్ (అక్షయ్ కుమార్)ను కోర్టు విచారణకు తీసుకెళ్లే డ్యూటీకి వెళ్తాడు. ఆ సమయంలో ఖైదీ తప్పించుకుంటాడు. దీంతో దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్తే అక్కడ ఖైదీ ఉంటాడు. కానీ అతడిని అప్పగించేందుకు ఆ స్టేషన్ హెడ్ ఒప్పుకోడు. పైగా విక్రమ్తో పాటు ఉన్న మరో ఇద్దరు కానిస్టేబుల్స్ తాగి ఉన్నాడని గుర్తిస్తాడు. మరి ఖైదీని వీళ్లు విచారణకు తీసుకెళ్లారా? డ్యూటీ సరిగా చేయనందుకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు. తప్పించుకున్న నేరస్తుడు మళ్లీ ఎందుకు లొంగిపోయాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?పోలీస్ డ్యూటీ అంటే ఆషామాషీ ఏం కాదు. ఏమాత్రం పొరపాటు జరిగినా వాళ్ల ఉద్యోగాలు ఊడిపోతాయి. దుండగులు కత్తులతో దాడిచేస్తే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపినా ఖైదీలా విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. అది చూసి మనకే జాలేస్తుంది. ఇక ఖైదీ అబ్దుల్.. చిన్నప్పటినుంచే అతడికో లవ్స్టోరీ ఉంది. స్కూల్డేస్ నుంచే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ మతాలు వేరు. మనసును కదిలిస్తుందిఅందులోనూ అతడికి తల్లి తప్ప తండ్రి లేడు. ఈ ప్రేమ వర్కవుట్ కాదని అర్థమై ప్రియురాలిని దూరంగా ఉండమని చెప్తాడు. కానీ, ఆమె మాత్రం అతడి చేయి వదలదు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన అతడి కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఇక్కడ వారి స్వచ్ఛమైన ప్రేమ మనసుల్ని కదిలిస్తుంది. అతడు జైలు నుంచి విడుదలవుతాడునుకున్న సమయంలో ఓ ట్విస్ట్ వస్తుంది. ఓటీటీలోఅప్పుడు ప్రేక్షకులు కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. దర్శకుడు సురేశ్ రాజకుమారి సిరై సినిమాలో సమాజంలో పెరుగుతోన్న మతవివక్షను, న్యాయస్థానంలో కేసుల విచారణలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని చూపించారు. స్వచ్ఛమైన ప్రేమకథతో మనసును హత్తుకున్నారు. యాక్టర్స్ అందరూ బాగా నటించారు. ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉన్నాయి. మిస్ అవకుండా చూసేయండి.. -
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ
ఎప్పుడూ పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవీస్ కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. కాకపోతే థియేటర్లలో రిలీజైనప్పుడు అవి ఎక్కువమంది దృష్టిలో పడకపోవడం వల్ల కనుమరుగైపోతుంటాయి. అలాంటి ఓ మూవీనే 'పతంగ్'. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ట్రెండింగ్లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)కొన్ని చిత్రాల్లో చెప్పుకోవడానికి పెద్దగా స్టోరీ ఏముండదు. 'పతంగ్' కోసం దర్శకుడు ప్రణీత్ ఎంచుకున్న ట్రయాంగిల్ ప్రేమకథ కూడా అలాంటి రొటీన్ లైనే. కాకపోతే దీనికి ఇచ్చిన ట్రీట్మెంట్, డైలాగ్స్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. ఆర్య, ప్రేమదేశం లాంటి ప్రేమకథని హైదరాబాద్ స్టైల్లో చెబితే ఎలా ఉంటుందో అదే ఈ మూవీ. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ యువతని ఆకట్టుకునేలా ఉంటాయి. యూత్ మూవీ అని బూతుల్లాంటివి ఏం పెట్టలేదు. కుటుంబంతో కలిసి నిరభ్యంతరగా సినిమా చూడొచ్చు. ఈ చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.'పతంగ్' విషయానికొస్తే.. హైదరాబాద్లోని ఓ బస్తీకి చెందిన విజయ్ కృష్ణ అలియాస్ విస్కీ(వంశీ పూజిత్), అదే ప్రాంతంలో ఉండే అరుణ్(ప్రణవ్ కౌశిక్) అనే డబ్బున్న కుర్రాడితో ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు. చిన్ననాటి నుంచి వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) వస్తుంది. ఈమె ఏ విషయంలోనూ సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. తర్వాత అరుణ్ని ఇష్టపడుతుంది. దీంతో ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్ మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యని దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్ల పోటీ. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ(ఓటీటీ)) -
ఓటీటీలోకి 'ఛాంపియన్'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
యంగ్ హీరో రోషన్ నటించిన 'ఛాంపియన్' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా ప్రకటన వచ్చేసింది. శ్రీకాంత్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోషన్.. గత ఏడాది డిసెంబర్ 25న ఈ మూవీతో తెరపైకి వచ్చాడు. ఈ సినిమాని ప్రదీప్ అద్వైతం తెరకెక్కించగా.. మహానటి, సీతారామం వంటి విజయాల తర్వాత స్వప్న దత్ నిర్మించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేదు.ఛాంపియన్ సినిమా జనవరి 29న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుందని ఆ సంస్థ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ కానుందని ఒక పోస్టర్ను షేర్ చేశారు. సుమారు రూ. 45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 17 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రోషన్కు జోడీగా అనస్వర రాజన్ నటించగా.. సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది తదితరులు కనిపించారు. సంగీతం మిక్కీ జే మేయర్ సినిమాకు ప్రదాన ఆకర్షణగా నిలిచింది.కథేంటి..?ఈ సినిమా కథంతా 1747-48 ప్రాంతంలో జరుగుతుంది. సికింద్రాబాద్లోని ఒక బేకరీలో పని చేసే మైఖేల్(రోషన్)కి ఫుట్బాల్ ఆట అంటే చాలా ఇష్టం. ఈ ఆటతోనే ఎప్పటికైనా ఇంగ్లాండ్ వెళ్లి..అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఓసారి ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం వస్తుంది. కానీ అతని తండ్రి చేసిన ఓ పని వల్ల వెళ్లలేకపోతాడు. దొంగమార్గాన ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటాడు. దాని కోసం కొన్ని తుపాకులను ఒక చోటుకి తరలించాల్సి వస్తుంది. ఆ పని చేసే క్రమంలో పోలీసుల కంటపడతారు. వారి నుంచి తప్పించుకొని అనుకోకుండా బైరాన్పల్లి అనే గ్రామానికి వస్తాడు. అదే ఊరికి చెందిన చంద్రకళ(అనస్వర రాజన్)తో పరిచయం.. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసిన తిరుగుబాటు రోషన్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? పోలీసు అధికారి బాబు దేశ్ముఖ్ (సంతోష్ ప్రతాప్)తో మైఖేల్ గొడవ ఏంటి? బైరాన్పల్లి ప్రజల కోసం మైఖేల్ చేసిన త్యాగమేంటి? అనేదే మిగతా కథ. -
శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ
శోభిత తెలుగమ్మాయే. కానీ దాదాపు పదేళ్ల కెరీర్లో రెండే తెలుగు సినిమాలు చేసింది. కానీ అక్కినేని కోడలు అయిన తర్వాత ఈమె ముందు కంటే బాగానే ఫేమస్ అయిపోయింది. నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె చేసిన సినిమా 'చీకటిలో'. థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పుడు రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? అక్కినేని కోడలు హిట్ కొట్టిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన)కథేంటి?క్రిమినాలజీ చదివిన సంధ్య(శోభిత).. ఓ న్యూస్ ఛానెల్లో క్రైమ్ వార్తలు చదివే యాంకర్గా పనిచేస్తుంటుంది. చేస్తున్న ఉద్యోగంపై పెద్దగా ఆసక్తి ఉండదు. సొంతంగా పాడ్కాస్ట్ ఛానెల్ ప్రారంభించాలనేది ఈమె గోల్. మరోవైపు అమర్ (విశ్వదేవ్ రాచకొండ)తో ప్రేమలో ఉంటుంది. పెళ్లికి కూడా వీళ్లిద్దరూ రెడీ అవుతుంటారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ రోజు సంధ్య సహొద్యోగి బాబీ(అదితీ మ్యఖల్) హత్యకు గురవుతుంది. ఇంతకీ ఈమెని చంపింది ఎవరు? 25 ఏళ్ల క్రితం గోదావరి జిల్లాల్లో జరిగిన వరస హత్యలకు.. బాబీ చావుకు ఏమైనా సంబంధం ఉందనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా అనగానే స్టోరీ ఏంటనేది ఓ అంచనా ఏర్పడుతుంది. 'చీకటిలో' కూడా దాదాపు అదే శైలిలో తీశారు. హత్యలు జరగడం, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇలా చాలా విషయాలు రొటీన్గానే అనిపిస్తాయి. జానర్ పరంగా చూస్తే మాత్రం ఇదో మాములు స్టోరీలానే అనిపిస్తుంది. కాకపోతే ఇందులో సామాజిక అంశాన్ని చూపించిన విధానం బాగుంది.అత్యాచారాలకు ముగింపు ఇవ్వాలంటే.. ధైర్యంగా బయటకు వచ్చి తమపై అత్యాచారం జరిగిందని చెప్పే గొంతుక కావాలి. బాధితులు ధైర్యంగా ముందడుగు వేయాలి. ఈ పాయింట్ పరంగా చూస్తే మాత్రం 'చీకటిలో' కాస్త భిన్నంగా అనిపిస్తుంది. అసలు విషయానికొస్తే.. శోభిత పరిచయం, హత్యలు జరగడం లాంటి అంశాలతో సినిమాని చాలా ఫ్లాట్గా మొదలుపెట్టారు. దాదాపు గంటవరకు అలానే వెళ్తుంది. శోభిత, పోలీసులతో కలిసి చేసే ఇన్వెస్టిగేషన్ అయితే ఏ మాత్రం ఆసక్తి కలిగించదు. ఇప్పటికే చాలా సినిమాల్లో ఇదంతా చూసేశాం అనే ఫీలింగ్ కలిగిస్తుంది.కానీ చివరి అరగంట మాత్రం బాగుంది. రెగ్యులర్గా థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లు కూడా సీరియల్ కిల్లర్ ఎవరనేది ఊహించడం కష్టం. ఎందుకంటే హీరోయిన్ చుట్టుపక్కనే అతడు ఉంటాడు. కానీ చివరివరకు అతడు ఎవరనేది తెలియనివ్వలేదు. అలానే చిన్నతనంలో జరిగే లైంగిక వేధింపులు, పెద్దయిన తర్వాత కూడా జీవితంపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అనే విషయాన్ని బాగానే చూపించారు. మహిళలపై అత్యాచారం, హత్యలు లాంటి సీన్స్ ఉన్నప్పటికీ దర్శకుడు వల్గారిటీ జోలికి పోలేదు. ఎక్కడ అసభ్యతగా అనిపించదు.ఇలా పాజిటివ్స్ పరంగా చాలా అంశాలు ఉన్నప్పటికీ నెగిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. క్లైమాక్స్, సీరియల్ కిల్లర్ ఎవరనేది రివీల్ చేసినప్పడు తప్పితే మిగతా విషయాల్లో అస్సలు థ్రిల్ అనిపించదు. శోభిత చేసే ఇన్వెస్టిగేషన్ అయితే మరీ లాజిక్లెస్గా ఉంటుంది. పోలీసులు బొమ్మల్లా ఉంటారు. ఈమెకు మాత్రం అన్ని ప్రూఫ్స్ దొరికిపోతుంటాయి. ఇది మాత్రం కన్విన్సింగ్గా అనిపించలేదు.ఎవరెలా చేశారు?చాన్నాళ్ల తర్వాత శోభిత చేసిన తెలుగు సినిమా ఇది. సంధ్య పాత్రలో పద్ధతిగా చుడీదార్, చీరల్లో కనిపించింది. సెటిల్డ్ యాక్టింగ్ చేసింది. పాత్రకు ఎంత కావాలో అంతే చేసింది. డబ్బింగ్ కూడా బాగుంది. విశ్వదేవ్ రాచకొండ, ఇషా చావ్లా, ఆమని, ఝాన్సీ, రవీంద్ర విజయ్ లాంటి మంచి యాక్టర్స్ ఉన్నప్పటికీ వీళ్లలో ఒక్కరికి కూడా ఆకట్టుకునే అవకాశం దొరకలేదు. మూవీ అంతా దాదాపు శోభిత చుట్టూనే తిరగడం దీనికి కారణం కావొచ్చు.టెక్నికల్ విషయాలకొస్తే.. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీకి తగ్గట్లు ఉంది. టైటిల్కి తగ్గట్లు సినిమా చాలావరకు చీకటిలోనే ఉంటుంది. అందుకు తగ్గట్లే సినిమాటగ్రఫీ ఉంది. దర్శకుడు చరణ్ కొప్పిశెట్టి ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ తప్పితే మిగతాది అంతా రొటీన్గా అనిపిస్తుంది. ఈ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే 'చీకటిలో' మరో మంచి థ్రిల్లర్ అయ్యిండేది. కుటుంబంతోనూ కలిసి ఈ సినిమా చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..!) -
ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక సంక్రాంతి సినిమాల సందడి కూడా దాదాపు ముగిసిపోయింది. ఇక ఈ వారంలో కొత్త సినిమాలేవీ రావడం లేదు. ఒకట్రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ వాటిపై పెద్దగా బజ్ లేదు. దీంతో ఈ వీకెండ్ కోసం సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.ఈ ఫ్రైడే థియేటర్లలో సినిమాలు రాకపోయినా.. ఓటీటీల్లో మాత్రం సందడి చేయనున్నాయి. ఈ శుక్రవారం శోభిత ధూళిపాల చీకటిలో, హెబ్బా పటేల్ మరియో.. టాలీవుడ్ ఆడియన్స్కు స్పెషల్గా అనిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి మస్తీ-4, గుస్తాక్ ఇష్క్, కన్నడ నుంచి 45 లాంటి సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. అంతేకాకుండా పలు తమిళ, మలయాళ డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్లు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్ స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23 తేరే ఇష్క్ మైన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23 ద బిగ్ ఫేక్ (ఇటాలియన్ సినిమా) - జనవరి 23 అమెజాన్ ప్రైమ్ చీకటిలో (తెలుగు సినిమా) - జనవరి 23 గుస్తాక్ ఇష్క్(హిందీ సినిమా)- జనవరి 23 ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25జియో హాట్స్టార్ మార్క్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 23 స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 23ఆహామరియో(తెలుగు సినిమా)- జనవరి 23జీ5 45 (కన్నడ సినిమా) - జనవరి 23 మస్తీ 4 (హిందీ మూవీ) - జనవరి 23 సిరాయ్ (తమిళ సినిమా) - జనవరి 23 కాళీపోట్కా (బెంగాలీ సిరీస్) - జనవరి 23సన్ నెక్ట్స్..షెషిప్పు(మలయాళ సినిమా)- జనవరి 23ముబీ లా గ్రేజియా (ఇటాలియన్ మూవీ) - జనవరి 23 -
ఓటీటీలో 'మోగ్లీ' సినిమా.. 3 భాషల్లో స్ట్రీమింగ్
యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో చిత్రం ‘మోగ్లీ’. గతేడాది డిసెంబరు 13న విడుదలైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. సాక్షి మడోల్కర్ హీరోయిన్గా నటించగా.. బండి సరోజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.మోగ్లీ(Mowgli) సినిమా ఇప్పటికే ఒక ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో(amazon prime video)లో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా ఇతర భాషలకు విస్తరించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. టాలీవుడ్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇతర భాషలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.కథేంటి..?మోగ్లీ (రోషన్ కనకాల) ఓ అనాథ. పార్వతీపురం గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో ఉంటూ.. ఎప్పటికైనా పోలీసు కావాలనే ఆశతో బతికేస్తుంటాడు. బతుకుదెరువు కోసం తన ప్రాణ స్నేహితుడు బంటి(వైవా హర్ష)తో కలిసి సినిమా షూటింగ్స్కి జూనియర్ ఆర్టిస్టులను అందిస్తూ..రిస్కీ సీన్లకు హీరో డూప్గా నటిస్తుంటాడు. అలా ఓ సినిమా షూటింగ్లో సైడ్ డ్యాన్సర్గా వచ్చిన జాస్మిత్(సాక్షి మడోల్కర్)తో ప్రేమలో పడతాడు. ఆమెకు వినికిడి లోపంతో పాటు మాటలు కూడా రావు. జాస్మిత్ కూడా మోగ్లీని ఇష్టపడుతుంది. అదే సమయంలో ఎస్సై క్రిప్టోఫర్ నోలన్(బండి సరోజ్ కుమార్).. జాస్మిత్పై మోజు పడతాడు. ఆమెను వాడుకోవాలని చూస్తాడు. అమ్మాయిల పిచ్చి ఉన్న ఎస్సై నోలన్ బారీ నుంచి జాస్మిత్ని మోగ్లీ ఎలా కాపాడుకున్నాడు? నోలన్ నుంచి మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? కర్మ సిద్ధాంతానికి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీకి దురంధర్.. ఆ డేట్ ఫిక్స్..!
రణ్వీర్ సింగ్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్ను షేక్ చేసింది. కేవలం హిందీలోనే రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దాదాపు రూ.130 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈనెల 30 నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్స్ వైరలవుతున్నాయి. అయితే స్ట్రీమింగ్ డేట్పై నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.అయితే ముందు నుంచే జనవరి 30 నుంచి స్ట్రీమింగ్కు రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవరాల్గా చూస్తే దురంధర్ ఈ నెలాఖర్లోనే ఓటీటీకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ దురంధర్ స్ట్రీమింగ్ కానుంది. The wait ends on January 30.Experience #Dhurandar on Netflix power, performance, and presence.#RanveerSingh #OTTRelease#Dhurundhar #Netflix pic.twitter.com/jpm66gvAhL— Abhi (@Abhi1879734) January 21, 2026 -
హెబ్బా పటేల్ రొమాంటిక్ థ్రిల్లర్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హెబ్బా పటేల్, అనిరుధ్ శ్రీవాత్సవ్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మారియో. ఈ చిత్రాన్ని కల్యాణ్ జీ గోగన దర్శకత్వంలో తెరకెక్కించారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రం.. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. కాగా.. నాటకం, తీస్ మార్ ఖాన్ లాంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ ఆడియన్స్ను మెప్పించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు హెబ్బా పటేల్ పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా.. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతమందించారు. A Red-Hot AlertGet ready for a turbo-charged, ramp ride that hits hard and burns hotter 💥#Mario from Jan 23 on #aha pic.twitter.com/VlxHQQXMwq— ahavideoin (@ahavideoIN) January 21, 2026 -
ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
తెలుగులో తక్కువ గానీ బాలీవుడ్ హీరోయిన్లు చాలామంది ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. భూమి పెడ్నేకర్ ఇప్పుడు అలా ఓ కొత్త మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్తో వచ్చేందుకు సిద్ధమైంది. 'దల్ దల్' పేరుతో తీసిన ఈ సిరీస్ ఈ నెల 30 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించింది.(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్)ఇందులో భూమి పెడ్నేకర్ పోలీస్ అధికారిగా నటించింది. ఈమె ఉంటున్న ఊరిలో వరస హత్యలు, అవి కూడా కాస్త వింతగా జరుగుతుంటాయి. ఇంతకీ వీటి వెనకున్నది ఎవరు? చిన్నతనంలో భూమి ఎదుర్కొన్న అనుభవాలేంటి? అనేదే సిరీస్ కాన్సెప్ట్లా అనిపిస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు) -
ఓటీటీలో దూసుకెళ్తున్న కృష్ణ బురుగులు ‘జిగ్రిస్’
కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రిస్’.ఈ చిత్రాన్ని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), సన్ నెక్స్ట్ (SunNXT)లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయినా..ఓటీటీలో మాత్రం సినిమా దూసుకెళ్తోంది. . రెండు మేజర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో నంబర్ 1, నంబర్ 2 పొజిషన్లలో ట్రెండ్ అవుతూ, ఈ చిత్రం ఒక రికార్డును నెలకొల్పింది. కేవలం ఒక్క భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీలో కేవలం నవ్వులే కాదు, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ కథను ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కృష్ణ బురుగుల తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో అందరినీ కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్లో కంటతడి పెట్టిస్తూ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన నటనలో ఎక్కడా అతి కనిపించదు, అంతా చాలా నేచురల్ గా ఉంటుంది. -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు
మరోవారం వచ్చేసింది. సంక్రాంతి రిలీజైన తెలుగు సినిమాల్లో చిరంజీవి, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ చిత్రాలు.. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. దీంతో ఎప్పటిలానే ఈ వారం కొత్త రిలీజులు ఏం లేవు. 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే తెలుగు మూవీని 23వ తేదీన రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు గానీ ప్రమోషన్స్ చేయట్లేదు. దీంతో వాయిదా కన్ఫర్మ్ అనిపిస్తుంది. మరోవైపు 'బోర్డర్ 2' అనే హిందీ చిత్రం ఇదే వీకెండ్ థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత మెగా హీరో హారర్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్)ఓటీటీల్లో అయితే 28 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. శోభిత ధూళిపాళ్ల 'చీకటిలో' మూవీ ఆసక్తికరంగా అనిపిస్తోంది. దీంతో పాటు తేరే ఇష్క్ మైన్, మార్క్ అనే డబ్బింగ్ చిత్రాలు.. 45, సిరాయ్ అనే పరభాష సినిమాలు ఉన్నంతలో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 19 నుంచి 25 వరకు)అమెజాన్ ప్రైమ్ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 19స్టీల్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21చీకటిలో (తెలుగు సినిమా) - జనవరి 23ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25నెట్ఫ్లిక్స్సండోకన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19జస్ట్ ఏ డ్యాష్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20రిజోలి & ఐల్స్ సీజన్ 1-7 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20సింగిల్స్ ఇన్ఫెర్నో సీజన్ 5 (కొరియన్ సిరీస్) - జనవరి 20స్టార్ సెర్చ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20కిడ్నాపెడ్: ఎలిజిబెత్ స్మార్ట్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 21క్వీర్ ఐ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా (జపనీస్ సినిమా) - జనవరి 22ఫైండింగ్ హెర్ ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22ఫ్రీ బెర్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23తేరే ఇష్క్ మైన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23ద బిగ్ ఫేక్ (ఇటాలియన్ సినిమా) - జనవరి 23హాట్స్టార్ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ సీజన్ 1 ఎపిసోడ్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 19హిమ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 19మార్క్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 23స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 23ఆహాసల్లియర్గళ్ (తమిళ మూవీ) - జనవరి 20శంబాల (తెలుగు సినిమా) - జనవరి 22జీ545 (కన్నడ సినిమా) - జనవరి 23మస్తీ 4 (హిందీ మూవీ) - జనవరి 23సిరాయ్ (తమిళ సినిమా) - జనవరి 23కాళీపోట్కా (బెంగాలీ సిరీస్) - జనవరి 23ఆపిల్ టీవీ ప్లస్డ్రాప్ ఆఫ్ గాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21ముబీలా గ్రేజియా (ఇటాలియన్ మూవీ) - జనవరి 23(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్ రెహమాన్) -
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
కొన్ని సినిమాలు పలాన నటుడు మాత్రమే చేయగలడని ప్రేక్షకులు అంటుంటారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సినిమా ఎంపికలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన ఎలాంటి మూవీ తీసిన సరే మరో నటుడుని ఆ పాత్రలో ఊహించుకోలేము. మమ్ముట్టి కెరీర్లో 400కి పైగా సినిమాలు చేసి, హీరో, విలన్, గ్రే షేడ్స్, బయోపిక్ పాత్రలు అన్నింటినీ సమర్థంగా పోషించారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటించిన 'కలాం కావల్' ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోనీ లివ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నిజ జీవిత సీరియల్ కిల్లర్ సయనైడ్ మోహన్ కేసు ఆధారంగా ఈ మూవీని దర్శకుడు జితిన్ కె.జోస్ తెరకెక్కించారు. ఈ సినిమాను చూడటం మొదలుపెడితే.. పూర్తి అయ్యేవరకు ఎవరూ ఆపరు. కథ ప్రారంభంలోనే హత్యలు చేసేది ఎవరు అనేది ప్రేక్షకులకు తెలిసిపోతుంది. కానీ.. పోలీసులకు తెలియదు. అయినప్పటికీ చాలా ఆసక్తిగా మూవీని నిర్మించారు.సైకో కిల్లర్ ఎలా ఉంటాడు.. వరుస హత్యలు ఎందుకు చేస్తాడు అనేది 'కలాం కావల్'లో చక్కగా చూపించాడు. ఒకరికి దోమను చంపితే సంతోషం.. మరోకరికి కోడిని కోసినప్పుడు అది గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు చూడటం సంతృప్తి. పాములో విషం ఉంటుందని తెలిసినా కూడా దానిని చంపే వరకు కొందరు ఊరుకోరు. ఇలా మన చుట్టూ ఉండే ప్రాణులను చంపడంలో కొందరిలో కనిపించే సంతోషం ఒక్కో స్థాయిలో ఉంటుంది. అయితే, కలాం కావల్ మూవీలో స్టాన్లీ దాస్ (మమ్ముట్టి)కి మాత్రం ఒంటరి మహిళలను చంపి సంతోషం పొందుతుంటాడు. వారిని ట్రాప్ చేసి తన కోరిక తీర్చుకుని చాలా సింపుల్గా చంపేస్తాడు. సినిమా ప్రారంభం నుంచే మొదలైన ఈ పరంపర.. చివరి వరకు కొనసాగుతుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా దర్శకుడు జితిన్ కె.జోస్ మెప్పించాడు.స్టాన్లీ దాస్ (మమ్ముట్టి) ఒంటరిగా ఉండే మహిళలను ట్రాప్ చేసి తన వలలో వేసుకుంటాడు. జీవితంలో విసిగిపోయిన వారికి కొత్త లైఫ్ ఇస్తానని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు వారితో గడిపి అదే రోజున హత్య చేస్తాడు. అయితే, ఒకరి ఫిర్యాదు వల్ల కథలో మలుపు తిరుగుతుంది. దీంతో ఈ కేసులోకి ఎస్సై జయకృష్ణన్ (వినాయకన్) ఎంట్రీ ఇస్తాడు. పోలీసులు ఎంత వేగంగా కేసును ధర్యాప్తు చేస్తున్నారో అంతే స్పీడ్గా స్టాన్లీ దాస్ ఆలోచన తీరు ఉంటుంది. అయితే, చాలా కూల్గా హత్యలు చేస్తాడు. అయితే, స్టాన్లీదాస్ ఎందుకు ఒంటరి మహిళలనే టార్గెట్ చేసి చంపేస్తున్నాడు.. కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతం వారినే ట్రాప్ చేయడానికి కారణం ఏంటి..? వరుసగా హత్యలు చేస్తూ పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడు..? ఫైనల్గా ఎస్సై జయకృష్ణన్ కేసును క్లోజ్ చేశాడా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.'కలాం కావల్' కథ 2000 సంవత్సరంలో జరిగినట్లు దర్శకుడు చూపుతాడు. దీంతో ఎక్కడా లాజిక్ మిస్ కాదు. నేటి తరం మాదిరి సీసీ కెమెరాలు వంటివి ఆరోజుల్లో లేవు. మొబైల్స్ కనెక్టివిటీ కూడా అప్పుడప్పుడే వినియోగంలోకి మొదలయ్యాయి. దీంతో సినిమాపై సానుకూలత కలిగేలా సీన్లు ఉంటాయి. మూవీ ప్రారంభంలోనే స్టాన్లీదాస్ ఒక మహిళను లోబరుచుకుని హత్య చేసే సీన్ ఉంటుంది. హంతకుడు ఎలాంటి వాడు అనేది అక్కడే ప్రేక్షకుడికి అర్థమయిపోతుంది. స్టాన్లీ చేస్తున్న హత్యలు వరుసగా జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో జయకృష్ణన్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంటుంది. టెక్నాలజీ లేని కాలంలో ఇలాంటి కేసులను పోలీసులు ఎలా చేధించేవారో చక్కగా చూపించారు.స్టాన్లీ దాస్ (మమ్ముట్టి) హంతకుడు మాత్రమే కాదు... ఇంటర్వెల్లో తన అసలు రూపం ఏంటి అనేది ఒక ట్విస్ట్తో దర్శకుడు షాకిచ్చాడు. జయకృష్ణన్తోనే ఉంటూ పోలీసుల ప్లాన్స్ ఏంటి అనేది తెలుసుకుని చాలా తెలివిగా తప్పించుకుంటాడు. పోలీసులు రెండు అడుగులు వేస్తే.. స్టాన్లీ పది అడుగులు వేస్తాడు. అయితే, ఫైనల్గా స్టాన్లీనే ఈ హత్యలకు కారణం అని జయకృష్ణన్ కనుగునే సీన్ మూవీకే ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. వరుస ట్విస్ట్లతో సాగే ఈ మూవీ మలయాళ ప్రేక్షకులను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో సైకో కిల్లర్ స్టాన్లీగా మమ్ముట్టి అదరగొట్టేశాడు. ‘జైలర్’లో వర్మగా తన నటనతో మెప్పించిన వినాయకన్ ఈ మూవీలో మరోస్థాయిలో గుర్తుండిపోయేలా నటించాడు. సోనీ లివ్లో ఈ మూవీని కుటుంబంతో పాటుగా చూడొచ్చు. ఎలాంటి అసభ్యత లేదు. వరుస హత్యలు ఉన్నా రక్తపు మరకలు కనిపించకుండా దర్శకుడు తెరకెక్కించారు. -
ఓటీటీలో 'ధనుష్' హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ప్రకటన
కోలీవుడ్ నటుడు ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘తేరే ఇష్క్ మే’.. తెలుగులో 'అమర కావ్యం' పేరుతో విడుదలైంది. అయితే, నవంబర్ 28న మొదట హిందీలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్ రన్ ముగిసిని తర్వాత ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ‘రాంఝాణా, అత్రంగి రే’ చిత్రాల తర్వాత ధనుష్, దర్శకుడు ఆనంద్. ఎల్. రాయ్ కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కింది. హిందీలో సూపర్హిట్ టాక్ తెచ్చకున్న ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది.ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.రొమాంటిక్ డ్రామా కథతో తెరకెక్కిన ‘తేరే ఇష్క్ మే’ (అమర కావ్యం) మూవీ ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో ఈ నెల 23న విడుదల కానుంది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో శంకర్ పాత్రలో ధనుష్ బాగా నటించారు. తన కోపం కారణంగా ఎప్పుడూ కాలేజ్లో గొడవలు పడుతూ ఉంటాడు. అయితే, కాలేజీ రోజుల్లోనే సాహీ (కృతి సనన్)తో ప్రేమలో పడుతాడు. అయితే, తన కోపం కారణంగా నిజాయితీగా ప్రేమించినప్పటికీ తన ప్రియురాలిని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో అతను ఏం చేశాడు..? సాహీ జీవితంపై శంకర్ ప్రభావం ఎలా చూపింది..? ఫైనల్గా ఈ జోడీ కలిసిందా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. -
ఓటీటీలో 'సుదీప్' యాక్షన్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కన్నడ స్టార్ హీరో 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మార్క్'. గతేడాదిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీ విడుదలైంది. అయితే, తాజాగా ఓటీటీ విడులపై అధికారికంగా ప్రకటించారు. ఇందులో ముఖ్య పాత్రల్లో నటుడు నవీన్ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్ తదితరులు నటించారు. క్రిస్మస్ సమయంలో తెలుగు సినిమాలు భారీ సంఖ్యలు విడుదలయ్యాయి. దీంతో ఈ మూవీకి తెలుగులో థియేటర్స్ కొరత ఏర్పడింది. దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించింది.మార్క్(Mark) సినిమా జనవరి 23న జియోహాట్స్టార్ (JioHotstar)లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్లలో తన నటన హైలైట్ అని రివ్యూలు వచ్చాయి. యాక్షన్ సన్నివేశాలు స్టైలిష్గా, ఎనర్జిటిక్గా ఉన్నాయన్నారు. కథ చాలా బలహీనంగా ఉండటం.. ఆపై ఊహించదగిన ట్విస్టులతో కాస్త నిరాశపరిచిందని విమర్శలు వచ్చాయి. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని మాత్రం మ్యాక్స్ ఆకట్టుకుంటాడని చెప్పొచ్చు. -
నెట్ఫ్లిక్స్లో ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది.. ఈ ఏడాది స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే!
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత పెద్ద సినిమా అయినా సరే థియేటర్స్లో రిలీజ్ అయిన నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మొన్నటి వరకు రిలీజ్కి ముందు సదరు సినిమా నిర్మాతలు ఓటీటీ సంస్థలతో డీల్ కుదుర్చుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఓటీటీ డీల్ను పూర్తి చేసుకుంటున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అలా తమతో డీల్ కుదుర్చుకొని.. ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాల జాబితాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) ప్రకటించింది. అందులో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ ‘పెద్ది’తో పాటు ‘ఛాంపియన్, ఫంకీ లాంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.2026లో నెట్ఫ్లిక్స్ వేదికగా అలరించే చిత్రాలివే..టైటిల్: ఉస్తాద్ భగత్ సింగ్నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీలదర్శకత్వం : హరీశ్ శంకర్టైటిల్: పెద్దినటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్దర్శకత్వం : బుచ్చిబాబుటైటిల్: ది ప్యారడైజ్నటీనటులు: నాని, సొనాలి కులకర్ణి, మోహన్ బాబుదర్శకత్వం: శ్రీకాంత్ ఓదెలటైటిల్: ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47నటీనటులు: వెంకటేశ్, శ్రీనిధి శెట్టిదర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్టైటిల్: ఆకాశంలో ఒక తారనటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లిదర్శకత్వం: పవన్ సాదినేనిటైటిల్: ఛాంపియన్నటీనటులు : రోషన్, అనస్వర రాజన్దర్శకత్వం: ప్రదీప్ అద్వైతంటైటిల్: ఫంకీనటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహార్దర్శకత్వం : అనుదీప్ కేవీటైటిల్: ‘రాకాస’సంగీత్ శోభన్, నయనసారికదర్శకత్వం: మాససా శర్మటైటిల్: బైకర్నటీనటులు : శర్వానంద్, రాజశేఖర్దర్శకత్వం : . అభిలాష్ రెడ్డిటైటిల్: వీడీ 14(వర్కింగ్ టైటిల్)నటీనటులు: విజయదేవరకొండ, రష్మికదర్శకత్వం : రాహుల్ సాంకృత్యన్ -
మల్టీస్టారర్ మూవీ.. నెలరోజుల్లోనే ఓటీటీలోకి..
కన్నడ స్టార్ హీరోలు శివరాజ్కుమార్, ఉపేంద్ర, రాజ్.బి శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 45. సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకత్వం వహించిన ఈ మూవీ కన్నడలో డిసెంబర్ 25న విడుదలైంది. అయితే తెలుగులో మాత్రం కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ చిత్రం నెలరోజుల్లోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. జీ5లో జనవరి 23న రిలీజ్ అవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.కథవినయ్ (రాజ్. బి శెట్టి) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఓ రోజు అనుకోకుండా అతడి బైక్ ఢీ కొట్టి రోసీ అనే కుక్క చనిపోతుంది. ఆ కుక్క రాయప్ప(ఉపేంద్ర) అనే డాన్కు చెందినది. ప్రాణంగా చూసుకునే కుక్క చావుకు కారణమైన వినయ్ను 45 రోజుల్లో చంపాలనుకుంటాడు. అప్పటినుంచి అతడి జీవితం అయోమయంగా మారుతుంది. ఆ సమయంలో వినయ్ జీవితంలోకి శివ (శివ రాజ్కుమార్) వస్తాడు. అసలు ఈ శివ ఎవరు? రాయప్ప వినయ్ను చంపేశాడా? చివరకు ఏం జరిగిందనేది తెలియాలంటే 45 సినిమాను ఓటీటీలో చూడాల్సిందే! 45 The Biggest Movie Of 202545 Streaming On Jan 23rd In Kannada Zee5#45TheMovie #KannadaZEE5 #45OnZEE5 #ZEE5Cinemas #ZEE5 pic.twitter.com/uUFZWCE04Y— ZEE5 Kannada (@ZEE5Kannada) January 16, 2026 చదవండి: ది రాజాసాబ్ కలెక్షన్స్.. ఫస్ట్ వీక్ ఎంతంటే? -
సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్మెంట్.. ఒక్కరోజే ఓటీటీకి 15 సినిమాలు
సంక్రాంతి పండుగ ముగిసింది. ఈ ఏడాది టాలీవుడ్లో ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ది రాజాసాబ్తో పాటు మనశంకరవరప్రసాద్గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు సందడి చేశాయి. ఇందులో కొన్ని మూవీస్ హిట్ కాగా.. మరికొన్ని ఫర్వాలేదనిపించాయి.అయితే ఈ పొంగల్ ముగిసిన వెంటనే ఓటీటీ ప్రియులకు పండగ వచ్చేసింది. థియేటర్లకు ఫ్యామిలీతో వెళ్లలేనివారికి ఓటీటీలు సిద్ధమైపోయాయి. ఈ ఫ్రైడే ఒక్క రోజే దాదాపు 15 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి, 120 బహదూర్, మస్తీ-4 చిత్రాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు మలయాళ డబ్బింగ్ సినిమాలు, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు అలరించేందుకు వచ్చాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. నెట్ఫ్లిక్స్ద రిప్-ట్రస్ట్ హ్యాజ్ ఏ ప్రైస్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 16క్యాన్ దిస్ లవ్ బీ ట్రాన్స్లేటేడ్- జనవరి 16బ్లాక్ ఫోన్-2(హాలీవుడ్ మూవీ)-జనవరి 16కిల్లర్ వాలే(హాలీవుడ్ మూవీ)-జనవరి 16ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ(హాలీవుడ్ మూవీ)- జనవరి 17 అమెజాన్ ప్రైమ్ వీడియో..120 బహదూర్(బాలీవుడ్ మూవీ)- జనవరి 16జియో హాట్స్టార్పోనీస్-పర్సన్ ఆఫ్ నో ఇంటరెస్ట్(హాలీవుడ్ మూవీ)- జనవరి 16సోనీ లివ్..కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 16జీ5గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ) - జనవరి 16భా భా భా (మలయాళ సినిమా) - జనవరి 16మస్తీ-4(హిందీ మూవీ)- జనవరి 16ఆపిల్ టీవీ ప్లస్హైజాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 16లయన్స్ గేట్ ప్లే..బ్యాండ్బుక్(కన్నడ సినిమా)- జనవరి 16షెల్- జనవరి 16హులు..ట్విన్ లెస్(హాలీవుడ్ మూవీ)- జనవరి 16 -
ఓటీటీకి టాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఆది సాయి కుమార్ హీరోగా చేసిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ శంబాల. డిసెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్ గ్రాండ్ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ఇటీవలే జనవరి 9న ఈ మూవీ హిందీలో కూడా విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. జనవరి 22 నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకుంది.శంబాల చిత్రాన్ని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఇందులో అర్చన అయ్యర్ హీరోయిన్గా కనిపించింది.ఈ చిత్రంలో స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది.కథేంటంటే... ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అదే రోజు ఆ ఊరికి చెందిన రైతు రాములు(రవి వర్మ) ఆవు నుంచి పాలుకు బదులుగా రక్తం వస్తుంది. దీంతో ఆ ఉల్కని ఊరి ప్రజలంతా బండ భూతం అని బయపడారు. ఆ రాయిని పరీక్షించేందుకు డిల్లీ నుంచి ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్(ఆది సాయికుమార్) వస్తాడు. చావులోనూ సైన్స్ ఉందనే నమ్మే వ్యక్తి విక్రమ్. అలాంటి వ్యక్తి శంబాలకు వచ్చిన తర్వాత వరుస హత్యలు జరుగుతుంటాయి. రాములుతో సహా పలువురు గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కొంతమందిని చంపి..వాళ్లు చనిపోతుంటారు.ఇదంతా బండ భూతం వల్లే జరుగుందని సర్పంచ్తో సమా ఊరంతా నమ్ముతుంది. విక్రమ్ మాత్రం ఆ చావులకు, ఉల్కకు సంబంధం లేదంటాడు. ఆ రాయిని పరీక్షించే క్రమంలో ఓ రహస్యం తెలుస్తుంది. అదేంటి? అసలు శంబాల గ్రామ చరిత్ర ఏంటి? ఆ గ్రామదేవత కథేంటి? ఊర్లో విక్రమ్కి తోడుగా నిలిచిన దేవి(అర్చన ఐయ్యర్) ఎవరు? వింత చావుల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనేది తెలియాలంటే శంబాల(Shambhala Review) చూడాల్సిందే. Step into a mystical world where myths come alive and destiny roars.#AadiShambhala Premieres 22nd Jan only on #aha(24hrs early access for aha gold users)@iamaadisaikumar @tweets_archana #RajasekharAnnabhimoju #MahidharReddy @ugandharmuni pic.twitter.com/bHke5Hmu5b— ahavideoin (@ahavideoIN) January 15, 2026 -
నేరుగా ఓటీటీలో విడుదలైన అనంత.. ఎక్కడంటే?
భక్తిరస కథాచిత్రాలు అరుదుగా ఉంటాయి. ఈ మధ్య విడుదలైన యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా అనంత అనే భక్తిరస కథాచిత్రం సంక్రాంతి సందర్భంగా మంగళవారం నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. ఇది పుట్టపర్తి సాయిబాబా దైవలీలల గురించి చెప్పే సినిమా.అనంత సినిమాఇంతకుముందు బాషా, అన్నామలై వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన సురేశ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను గిరీశ్ కృష్ణమూర్తి నిర్మించారు. జగపతిబాబు, సుహాసిని, వైజీ.మహేంద్రన్, నిగల్గళ్ రవి, తలైవాసల్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని, గీత రచయిత స్నేషన్ మాటలు, పాటలు అందించారు.జీవిత చరిత్ర కాదుఇది సాయిబాబా జీవిత చరిత్ర కాదని, ఆయన మహిమలతో కూడిన భక్తిరస కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. పూర్తి విశ్వాసంతో బాబాను నమ్మితే ఫలితాలెలా ఉంటాయన్నది చెప్పే సినిమాయే అనంత అన్నారు. ఇందులో అందరూ అద్భుతంగా నటించారన్నారు. దేవా సంగీతం సినిమాకు పెద్ద బలం అని తెలిపారు.ఓటీటీలో నేరుగా రిలీజ్సినిమా చూసిన పలువురు ప్రముఖులు థియేటర్లలో విడుదల చేయమని కోరారన్నారు. అయితే ఓటీటీ సంస్థ కమిట్ అవడంతో హాట్స్టార్కు స్ట్రీమింగ్ హక్కులు ఇచ్చామన్నారు. ఈ సినిమా మంగళవారం అంటే జనవరి 13 నుంచి ఓటీటీలో ప్రసారం అవుతోందని, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు.చదవండి: రజనీకాంత్ కోసమే జైలర్ 2లో నటించా: విజయ్ సేతుపతి -
కంటెంట్తగ్గింది గురూ!
సినిమా..భారతీయుల జీవితంలో ఒక భాగం. అతిపెద్ద వినోదం. అభిమాన తారలు, కథ, నటన, పాటలు, హిట్, ఫ్లాప్.. ఇలా సినిమా గురించి చర్చలేని కుటుంబమే లేదంటే అతిశయోక్తి కాదు. థియేటర్లో కిటకిటలాడే ప్రేక్షకులు, ఈలలు, చప్పట్లు, చెవులు చిల్లులుపడే శబ్దాల మధ్య మూవీ చూస్తే ఆ థ్రిల్లే వేరు. ఇదంతా గతం. ‘ఆ ఒక్కటి తగ్గింది పుష్ప’అని ఇప్పుడు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దేశ వ్యాప్తంగా 2019లో 146 కోట్ల మంది ప్రేక్షకులు వెండి తెర ముందు కూర్చుని సినిమాను ఆస్వాదించారు. 2024లో ఈ సంఖ్య 86 కోట్లకు వచ్చి చేరింది.అంటే అయిదేళ్లలో థియేటర్లకు వచ్చిన వీక్షకుల సంఖ్య 41% తగ్గిందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) నివేదిక వెల్లడించింది. 2025 జూన్–జూలైలో 14,688 మంది సినిమా ప్రేక్షకులపై ఈవై నిర్వహించిన సర్వే, అలాగే నిర్మాతలు, ఇతర భాగస్వాముల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం..140 కోట్లకుపైగా జనాభా ఉన్న మన దేశంలో ఏటా థియేటర్లకు వచ్చి మూవీని ఆస్వాదించేవారి సంఖ్య దాదాపు 15 కోట్లు మాత్రమే. – సాక్షి, స్పెషల్ డెస్క్కొద్ది రోజులకే ఓటీటీల్లో.. సినిమా కంటెంట్లో నాణ్యత తగ్గిందన్నది ప్రేక్షకుల మాట. అంతేకాదు మూవీస్ రిలీజైన కొద్ది రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి ఇవే ప్రధాన కారణాలు. కంటెంట్ నాణ్యత పడిపోయిందని 55% ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఆకట్టుకునే కథ, సంగీతం, స్పెషల్ ఎఫెక్ట్స్ మెరుగుపడాలని 70% మంది ఆశిస్తున్నారు.థియేటర్లకు పరుగు తీయాల్సిన అవసరం లేదని..విడుదలైన ఎనిమిది వారాలలోపు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు వస్తున్నాయని 81% మంది నమ్ముతున్నారు. థియేటర్లో రిలీజై ఓటీటీకి వచ్చేందుకు తక్కువ రోజులే ఉంటే సినిమా కోసం వేచి చూస్తామని మూడింట ఒకవంతు మంది చెబుతున్నారు. చేయి తిరిగిన రచయితలు, కథల కొరత ఉందని 78% నిర్మాతలు పేర్కొన్నారు. సగం మంది పైరసీతో.. భారత్లో మొత్తం స్క్రీన్ల సంఖ్య 2019లో 9,527 ఉండగా.. 2024 నాటికి స్వల్పంగా పెరిగి 9,927కి వచ్చి చేరింది. అంటే కేవలం 400 తెరలే కొత్తగా తోడయ్యాయి. 10 లక్షల మంది జనాభాకు స్క్రీన్లు 7.6 నుంచి 6.8కి తగ్గాయి. 10 లక్షల మందికి యునైటెడ్ స్టేట్స్లో 109, యూకేలో 66, చైనాలో 64 తెరలు ఉన్నాయి. భారత్లో 2018–24 నడుమ 1,000 దాకా సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగయ్యాయి.మల్టీప్లెక్సులు అయిదేళ్లలో పెట్టుబడులను 12% తగ్గించాయి. భారత్లోని దాదాపు 19,000 పిన్కోడ్స్కుగాను సుమారు 16,350 చోట్ల థియేటర్లే లేవు. సినీ పరిశ్రమను కోలుకోకుండా చేస్తున్న పైరసీ సైతం సమస్యను పెంచుతోంది. వీడియో కంటెంట్ యూజర్లలో 51% మంది పైరసీ సైట్లపై ఆధారపడుతున్నారు. వీరిలో నాలుగింట మూడొంతుల మంది 19 నుంచి 34 సంవత్సరాల వయస్సుగల వారు ఉండడం గమనార్హం. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో సినిమాలు విడుదలైన తర్వాత పైరసీ పెరుగుతోంది.ఒత్తిడిలో పరిశ్రమ..ప్రేక్షకుల సంఖ్య తగ్గడం, పరిమిత స్క్రీన్స్, వీక్షణ అలవాట్లలో వేగవంతమైన మార్పుల కారణంగా చలనచిత్ర ప్రదర్శన రంగం నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మన దేశంలో మొత్తం మీడియా, వినోద రంగం, విస్తృత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూనే ఉన్నప్పటికీ.. 2019 నాటి గరిష్ట స్థాయి నుంచి థియేటర్ల రెవెన్యూ తగ్గుతోంది. 2019–24 మధ్య భారతదేశ థియేటర్ల ఆదాయాలు 0.2% వార్షిక రేటుతో క్షీణించాయి. ఇదే సమయంలో మీడియా, వినోద రంగం 5.42%, జీడీపీ 6.6% వృద్ధి చెందాయి. సినిమా ఆదాయం 2019లో రూ.19,100 కోట్ల నుంచి 2024లో రూ.18,746 కోట్లకు పడిపోయింది. 2019లో రూ.100 కోట్లకుపైగా బాక్సాఫీస్ కలెక్షన్లు అందుకున్న సినిమాలు 17 ఉంటే.. 2024లో ఇవి 10కి పరిమితం అయ్యాయి. -
క్రైమ్ యాంకర్గా శోభిత.. చీకటిలో ట్రైలర్ చూశారా?
అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ చీకటిలో. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజవుతోంది. సోమవారం (జనవరి 12న) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో శోభిత క్రైమ్ యాంకర్ సంధ్యగా కనిపించింది. మొదట జర్నలిస్ట్గా పనిచేసినా.. తర్వాత జాబ్ నచ్చలేదని మానేసి పాడ్కాస్ట్ ప్రారంభించింది. ఆ పాడ్కాస్ట్కు చీకటిలో అన్న టైటిల్ ఖరారు చేసింది.క్రైమ్ యాంకర్గా శోభితసమాజంలో జరుగుతున్న నేరాల గురించి అందులో మాట్లాడింది. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు అంటూ ఓ సీరియల్ కిల్లర్ గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. దీంతో సదరు సీరియల్ కిల్లర్.. చిమ్మ చీకటిలో ఇంకో ప్రాణం గాల్లో కలిసిపోతుందని ముందుగానే వార్నింగ్ ఇస్తాడు. మరి అతడిని హీరోయిన్ పట్టుకుంటుందా? అదే సమయంలో అతడి బారి నుంచి తనను తాను రక్షించుకుంటుందా? అన్న విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!సినిమాచీకటిలో మూవీలో శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమా జనవరి 23న నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. చదవండి: పీరియడ్స్.. నీళ్లలో తడిచా.. బట్టలు మార్చుకుంటానంటే..: హీరోయిన్ -
సంక్రాంతి స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 12 సినిమాలు
మరోవారం వచ్చేసింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి హడావుడే కనిపిస్తోంది. అందుకు తగ్గట్లు థియేటర్లలోకి చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా వచ్చేసింది. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' రాబోతున్నాయి. వీటితో పాటు పలు తెలుగు చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. దండోరా, కాలంకావల్, గుర్రం పాపిరెడ్డి, బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి రేపుతుండగా.. స్ట్రేంజర్ థింగ్స్ 5 మేకింగ్ వీడియో, తస్కరీ సిరీస్లు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే మూవీస్ అందుబాటులోకి రానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 12 నుంచి 18వ వరకు)అమెజాన్ ప్రైమ్బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 12దండోరా (తెలుగు మూవీ) - జనవరి 14నెట్ఫ్లిక్స్స్ట్రేంజర్ థింగ్స్ 5 (మేకింగ్ వీడియో) - జనవరి 12తస్కరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 14సెవెన్ డయల్స్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 15ద రిప్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 16హాట్స్టార్ఇండస్ట్రీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12డౌన్ టౌన్ అబ్బే: ద గ్రాండ్ ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12సోనీ లివ్కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 16జీ5గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ) - జనవరి 16భా భా భా (మలయాళ సినిమా) - జనవరి 16ఆపిల్ టీవీ ప్లస్హైజాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 16 -
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో 'అడాల్సెన్స్'.. విన్నర్స్ ప్రకటన
ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుక ‘గోల్డెన్ గ్లోబ్స్ 2026’ ఘనంగా జరిగింది. 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో 'అడాల్సెన్స్' సిరీస్ సత్తా చాటింది. ప్రస్థుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ సిరీస్కు రెండు అవార్డ్స్ దక్కడం విశేషం. ఉత్తమ నటుడు, సహాయనటుడి విభాగాల్లో అవార్డ్స్ను సొంతం చేసుకుంది.'అడాల్సెన్స్' చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డ్స్ అందుకుని ఆదరణ పొందింది. అయితే, ఈ మూవీలో నటించిన స్టీఫెన్ గ్రాహం ఉత్తమ నటుడిగా తొలిసారి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ను సొంతం చేసుకున్నాడు. ఆపై సిరీస్లో తన నటనతో మెప్పించిన 13 ఏళ్ల ఓవెన్ కూపర్ ఉత్తమ సహాయనటుడిగా అతి చిన్న వయసులోనే అవార్డ్ అందుకున్నాడు. ఈ అవార్డ్ కార్యక్రమంలో భారత్ నుంచి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు.సినిమా రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిచ్చే ఉద్దేశంతో హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (హెచ్. ఎఫ్. పి. ఎ) వారు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నాంది పలికారు. 1944 నుంచి ఈ అవార్డు కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ప్రారంభంలో వారు నిర్వహిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను కూడా గుర్తించి వాటికి పురస్కారాలు ఇస్తుంటారు. ప్రస్తుతం హెచ్. ఎఫ్. పి. ఎ టీమ్లో సుమారు 60 దేశాలకు చెందిన 105 మంది సభ్యులున్నారు. వారందరూ ఓకే అనుకున్న తర్వాతే గోల్డెన్ గ్లోబ్స్ ఖరారు చేస్తారు. సినిమా రంగంతో పాటు టెలివిజన్ రంగంలో ప్రతిభ చూపిన వారికీ అవార్డులు ఇస్తుండటం విశేషం. గోల్డెన్ గ్లోబ్స్- 2026అవార్డ్ విజేతలు (సినిమా) -ఉత్తమ నటుడు : తిమోతీ చలమెట్ (మార్టీ సుప్రీం) - ఉత్తమ నటి : రోజీ బేర్నీ (ఇఫ్ ఐ హేడ్ లెగ్స్ ఐడిడ్ కిక్ యూ)- ఉత్తమ సహాయ నటుడు: స్టెల్లన్ స్కార్స్గార్డ్ (సిన్నర్స్)- ఉత్తమ సహాయ నటి: టెయానా టేలర్ (ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్)గోల్డెన్ గ్లోబ్స్- 2026అవార్డ్ విన్నర్స్ ( టెలివిజన్ సిరీస్)- ఉత్తమ టెలివిజన్ సిరీస్ (డ్రామా): ది వైట్ లోటస్- ఉత్తమ నటుడు : ఎరిన్ డోహెర్టీ (అడోలెసెన్స్)- ఉత్తమ సహాయ నటి : ఎరిన్ డోహెర్టీ (అడోలెసెన్స్)- ఉత్తమ సహాయ నటుడు : స్టీఫెన్ గ్రాహం (అడోలెసెన్స్) -
ఓటీటీలో '120 బహదూర్'.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నటించిన కొత్త సినిమా ‘120 బహదూర్’ ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ప్రస్తుతం అదనంగా రూ. 349 అద్దె చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీ చెల్లించకుండా సినిమా చూసే అవకాశం రానుంది. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రజనీష్ (రాజీ ఫేమ్) దర్శకత్వం వహించారు. పరమ వీర చక్ర అవార్డ్ అందుకున్న మేజర్ సైతాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ అక్తర్ మెప్పించారు. ఇందులో రాశీఖన్నా కీలక పాత్రలో నటించింది. గతేడాదిలో విడుదులైన ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది. కొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్ లేకుండా ప్రభుత్వాలు అనుమతులు కూడా ఇచ్చాయి.‘120 బహదూర్’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జనవరి 16నుంచి ఉచితంగా చూడొచ్చని ప్రకటించారు. భాగ్ మిల్కా భాగ్ తర్వాత ఫర్హాన్ అక్తర్ మరోసారి బయోపిక్ చేయడంతో భారీగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురుచూశారు. ఈ హిస్టారికల్ మూవీ అందరినీ మెప్పిస్తుంది. కానీ, హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, సబ్టైటిల్స్తో చూడొచ్చు.'120 బహదూర్' విషయానికొస్తే.. మేజర్ షైతాన్ సింగ్ భాటి(ఫర్హాన్ అక్తర్).. తన 120 మంది సైనికులతో ఇండియా-చైనా బోర్డర్లో ఎలాంటి యుద్ధం చేశాడు. మూడు వేల మంది చైనా సైనికుల్ని ఎలా నిలువరించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. యుద్ధ తరహా సినిమాలంటే ఇష్టముండే వాళ్లకు ఇది నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు రొటీన్గానే అనిపించొచ్చు. స్టోరీ తెలిసిందే అయినప్పటికీ.. విజువల్స్, యాక్టింగ్ పరంగా ప్రశంసలు దక్కాయి. -
షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్..
ఏదేమైనా థ్రిల్లర్ సినిమాలు తీయడంలో కొరియన్ దర్శకుల తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో టాప్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా వీళ్ల పేర్లు ఉంటాయనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రెగ్యులర్కి భిన్నంగా పార్క్ చాన్ వుక్ అనే దర్శకుడు తీసిన 'నో అదర్ ఛాయిస్' గురించి మాట్లాడుకుందాం. ఇది ఓ షాకింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్. ఇంతకీ ఇదెలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మాన్సు అనే వ్యక్తి, 25 ఏళ్లుగా ఓ పేపర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. భార్య, కొడుకుతో చాలా సింపుల్గా బతికేస్తుంటాడు. ఒకరోజు ఎలాంటి వార్నింగ్ లేకుండా మాన్సుని ఉద్యోగం నుంచి తీసేస్తారు. దీంతో కొత్త ఉద్యోగం కోసం మాన్సు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ఎక్కడా జాబ్ దొరకదు. అప్పుడే ఇతడు ఎవరూ ఊహించని ఆలోచన చేస్తాడు. తనతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థుల్ని చంపేస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుంది కదా అని భావిస్తాడు. మరి తర్వాత ఏం చేశాడు? చివరకు మాన్సుకి ఉద్యోగం దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. కరోనా లాక్ డౌన్ టైంలో చాలామందికి ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇప్పటికీ రంగంతో సంబంధం లేకుండా ఉద్యోగాలు పోతూనే ఉన్నాయి. ఎవరైనా ఉద్యోగం పోతే ఏం చేస్తారు? మరో జాబ్ చూసుకోవడం లేదా డబ్బులుంటే వ్యాపారం చేసుకుంటారు. కానీ తనతో పోటీలో ఉన్న వాళ్లని చంపేస్తే ఉద్యోగం తనకే దక్కుతుందని భావిస్తే.. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీశారు.నిరుద్యోగం ఒక మనిషిని ఎంత క్రూరంగా మారుస్తుంది. కార్పొరేట్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందో ఈ చిత్రంలో చాలా రా(RAW)గా చూపించారు. మరో దారిలేక ఓ సామాన్యుడు చేసే హింసాత్మక పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. పెట్టుబడీదారి వ్యవస్థకు చెంపదెబ్బ లాంటి మూవీ ఇది.అలానే సినిమా చూస్తున్నంతసేపు 'దృశ్యం' గుర్తొస్తుంది. ఎందుకంటే కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఓ తండ్రి ఏ స్థాయి వరకు వెళ్లాడు? ఈ క్రమంలో హత్యలు చేసేందుకు కూడా వెనుకాడకపోవడం, చివరకు పోలీసులకు దొరకకపోవడం లాంటివి చూసినప్పుడు 'దృశ్యం'తో పోలికలు కనిపిస్తాయి. కానీ రెండు వేర్వురు కాన్సెప్టులు.ప్రారంభంలో డార్క్ కామెడీ టోన్లో ఉంటుంది. కాసేపటికి థ్రిల్లర్ జోన్లోకి మారిపోతుంది. అక్కడి నుంచి ఒక్కొక్కరిని మాన్సు చంపుతుంటే టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఇది ముబీ ఓటీటీలో కొరియన్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. కుదిరితే ఒంటరిగానే చూడండి.-చందు డొంకాన


