Hyderabad
-
బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. ‘చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కు’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్ట్పై ఏపీతో కుమక్కు అయ్యారని మాజీ మంత్రి హరీష్ మండిపడ్డారు. కాళ్లేశ్వరం కమిషన్ విచారణపై శనివారం హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) చెప్పిన విషయాలను ప్రసావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చాం. అర్థికశాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనటం సరైంది కాదుఆర్థికశాఖకు సంబంధం లేకుండా ఉండదు. ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటీలో నేను, ఈటల,తుమ్మల ఉన్నాం. సబ్ కమిటీ రిపోర్ట్పై నాతో పాటు ఈటల, తుమ్మల కూడా సంతకం చేశారు. తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి కదా.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై కూడా త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను.గోదావరి బనకచర్ల ప్రాజక్ట్ వలన తెలంగాణకు జరుగనున్న నష్టంపై కూడా ప్రజెంటేషన్ ఉంటుంది. బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీతో కుమక్కు అయ్యాడు. నా దగ్గర మరొక డాక్యుమెంట్ ఉంది. కమీషన్ దగ్గర అది బయట పెడతా. వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ రాత పూర్వకంగా ఇస్తాను’ అని హరీష్ రావు చిట్ చాట్లో తెలిపారు. -
ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ.. ఉక్కపోతతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. వర్షం పడటంతో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణంతో ఉపశమనం పొందారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, ఖైరతాబాద్, అబిడ్స్, పంజాగుట్టలో భారీ వర్షం కురుస్తోంది.తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. పలు మండలాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం దంచికొట్టింది. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించింది. -
రియల్ఎస్టేట్ మోసాలకు ‘రెరా’ రెడ్ లైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల కొనుగోలుదారుల ప్రయోజనాలే ముఖ్యమని.. ప్రమోటర్లు, డెవలపర్లు, రియల్టర్లు కొనుగోలుదారులను మోసగించే చర్యలను సహించేది లేదని రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్ సత్యనారాయణ స్పష్టం చేశారు. రెరా నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ సంస్థలకు రూ.42 కోట్ల జరిమానాలు విధించినట్లు చెప్పారు. కొనుగోలుదారుల ఫిర్యాదులు, పత్రికల్లో వస్తున్న కొన్ని వాణిజ్య ప్రకటనల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.2023 జూన్లో రెరాకు పూర్తిస్థాయిలో చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించిన తర్వాత ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సత్యనారాయణ వివరించారు. 500 చదరపు అడుగులకు పైబడిన లేదా కనీసం తొమ్మిది.. అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు, ప్లాట్లు నిర్మించే ప్రతి ప్రాజెక్టు ‘రెరా’కింద రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలని తెలిపారు. అనుమతుల సమయంలో హెచ్ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్ఎంసీ, పురపాలక సంఘాలు, సంస్థలు కూడా విధిగా ‘రెరా’రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రమోటర్లు, డెవలపర్లకు సూచిస్తున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. రెరాలో ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి? ఈ ఏడాది మే చివరి నాటికి ‘రెరా’లో 9,641 ప్రాజెక్టులు నమోదయ్యాయి. 4,237 వ్యక్తులు/సంస్థలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు నమోదు చేసుకున్నారు.రెరా ప్రధాన బాధ్యతలేంటి? ప్రమోటర్లు, డెవలపర్లు కొనుగోలుదారులకు జవాబుదారీగా ఉండేలా చేయడం, న్యాయబద్ధంగా వ్యవహరించేలా చూడడం, పారదర్శకత నెలకొల్పి మోసాలను నివారించడం, ఒప్పందం ప్రకారం కొనుగోలుదారులకు సకాలంలో ప్రాపర్టీలను పూర్తిచేసి అందించేలా చూడడం, ఒప్పందాలు సరిగా అమలయ్యేందుకు నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం రెరా ప్రధాన బాధ్యతలు. ప్రజల నుంచి రెరాకు ప్రధానంగా ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి? ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడం లేదని, ఒప్పందం మేరకు నిర్ణీత గడువులోగా ఫ్లాట్లను అప్పగించటంలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. సకాలంలో ప్రాజెక్టులు మొదలుపెట్టకపోవటం, లేఅవుట్ నిబంధనలకు అనుగుణంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో అభివృద్ధి చేయకపోవడం, అ సంపూర్తిగా ఉన్న ఫ్లాట్లను రిజిస్టర్ చేయడం, నిధు లను మళ్లించడం, కొనుగోలుదారుల నుంచి వసూ లు చేసిన డబ్బును దుర్వినియోగం చేయడం, అగ్రిమెంట్లలో పేర్కొన్న మేరకు వసతులు కల్పించకపోవడం, ఒకే ప్లాట్/ఫ్లాట్ను ఇద్దరు ముగ్గురికి విక్రయించడం, వినియోగదారుల నుంచి డబ్బు వసూ లు చేసి కనిపించకుండా పోవటం, రెరాలో రిజిస్టర్ చేసుకోని ఏజెంట్లు ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడంపై ప్రధానంగా ఫిర్యాదులు వస్తున్నాయి.రెరా అనుమతి లేకుండానే ప్రకటనలు వస్తున్నాయి. వాటికి చెక్పెట్టే విధానం ఉందా? రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్టులపై సుమోటోగా కేసులు నమోదుచేస్తున్నాం. ప్రమోటర్ల అధికారిక వెబ్సైట్లను పరిశీలించి రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్టులను గుర్తించి షోకాజ్ నోటీసులు ఇస్తున్నాం. రెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిస్తే.. 040–29394972కు ఫోన్ చేసిగానీ, 9000006301 నంబర్కు వాట్సాప్ ద్వారా గానీ, rera&maud@telangana.gov.in, secy&rera&maud@telangana.gov.in వెబ్సైట్లలోగానీ ఫిర్యాదు చేయవచ్చు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ప్రీ లాంచింగ్ కార్యక్రమాలు చేపట్టడం రెరా చట్టరీత్యా నేరం. రిజిస్టర్ చేసుకోని సంస్థల ప్రకటనలను నియంత్రించేందుకు రెరా త్వరలోనే అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకోబోతోంది. ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు అందాయి? అందులో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? చర్యల తరువాత సంస్థల తీరు మారిందా? మీ నిర్ణయాలపై అప్పిలేట్కు వెళ్లిన కేసులెన్ని? 2,198 ఫిర్యాదులు అందాయి. వాటిలో 1,278 ఫి ర్యాదులను పరిష్కరించాం. 862 ప్రాజెక్టులపై జరిమానాలు విధించాం. 42 కేసుల్లో అప్పీల్కు వెళ్లారు.ఇప్పటివరకు ఎంత జరిమానా విధించారు? అందులో సంస్థలు ఎంత చెల్లించాయి? నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు రూ.41,04,09,425 జరిమానా విధించాం. అందులో రూ.15,76,82,170 వసూలు అయ్యింది. వసూలు కాని జరిమానాను రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తారా? 92 కేసుల్లో రెవెన్యూ రికవరీ చట్టం కింద జరినామాలు వసూలు చేయాలని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను కోరాం. అందులో 3 కేసుల్లో ఆర్ఆర్ యాక్ట్ కింద జరిమానాలు వసూలు చేశారు. మిగతావి కూడా త్వరలో వసూలు చేస్తాం.రియల్ ఎస్టేట్ మోసాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ మోసాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. నరెడ్కో, క్రెడాయ్, తెలంగాణ బిల్డర్స్ ఫోరం, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్, వినియోగదారుల సంఘాల సహకారంతో రియల్ మోసాలను అరికట్టే చర్యలు చేపట్టాం. రెరా అమలులో ఇతర రాష్ట్రాలు ఏవిధంగా ముందుకెళ్తున్నాయి? మన రాష్ట్రంలో రెరా పర్మనెంట్ అథారిటీని ప్రారంభించి రెండేళ్లు అవుతోంది. ఇతర రాష్ట్రాల్లో అంతకంటే ముందునుంచే ఉన్నా యి. అయినా వాటితో సమానంగా మన దగ్గర రిజిస్ట్రేషన్లు జరిగాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలో రెరాను 2017లోనే ప్రారంభించారు. మన రాష్ట్రంలో రెరా చైర్మన్గా నన్ను, సభ్యులుగా శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణను 2023 జూలైలో నియమిస్తే.. సిబ్బందిని 2024 నవంబర్లో కేటాయించారు. సభ్యులు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణలతో కలిసి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. -
హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 10 లోపు కేబినెట్ విస్తరణ చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్లో ఎస్సీ, బీసీ, ఓసీలకు అవకాశం ఇవ్వనుంది. ఓసి నుంచి సుదర్శన్ రెడ్డి ,బీసీ నుంచి వాకిటి శ్రీహరి ,ఎస్సీ నుంచి గడ్డం ప్రసాద్లకు మంత్రి వర్గంలోకి తీసుకోనుండగా.. ప్రస్తుతం స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. గత కొంత కాలంగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఊహాగాలు ఊపందుకున్నాయి. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా..ఇందులో నాలుగు స్థానాలను భర్తీ చేయనుందనే చర్చ జరిగింది. మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే మరొకరికి అవకాశం కల్పించాల్సి ఉంది. ఇక మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారిలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు ఉన్నారు. ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
స్పా ముసుగులో వ్యభిచారం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనూష కలిసి..
అమీర్పేట: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మూడు స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. బీకే గూడలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో సీసీఎస్ యాంటీ ట్రాఫికింగ్ వింగ్ పోలీసులు శుక్రవారం దాడులు చేశారు.యూసుఫ్గూడకు చెందిన స్పా సెంటర్ నిర్వాహకురాలు నడిమింటి అనూష, కార్మికనగర్కు చెందిన విటుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వినయ్బాబుతో పాటు ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. అదే విధంగా అమీర్పేట విఠల్ చాంబర్స్లోని 2వ అంతస్తులో గ్లోరీ ఫిజియోథెరపీ హాస్పిటాలిటీ కేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. బోరబండకు చెందిన స్పా సెంటర్ యజమాని టి.కళ్యాణి, ఐడీపీఎల్ చింతల్కు చెందిన అశోక్కుమార్, మియాపూర్ నివాసి సాంబశివరెడ్డితో పాటు నలుగురు మహిళలను అరెస్టు చేశారు.అమీర్పేట గురుద్వారా సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో ఎన్.ఎస్.బ్యూటీ సెలూన్ ఆండ్ స్పా సెంటర్లో ఎస్ఆర్నగర్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆదిలాబాద్కు చెందిన నిర్వాహకురాలు సుధ, వెస్ట్ గోదావరికి చెందిన విటుడు సాగిరాజు దినేష్ వర్మ, వరంగల్కు చెందిన గౌతమ్, కుత్బుల్లాపూర్ నివాసి రవికుమార్, బంజారాహిల్స్కు చెందిన చవన్ సురేందదర్, గుంటూరుకు చెందిన పిన్ని ప్రవీణ్ కుమార్, వెస్ట్ బెంగాల్కు చెందిన ఒక యువతిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసులను ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు. -
భర్తతో గొడవలు.. డెలివరీ బాయ్ అంటూ ఫోన్.. చివరకు హోటల్ రూమ్లో..
సాక్షి, సనత్నగర్: భర్తతో మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటున్న వివాహితను బలవంతంగా హోటల్కు పిలిపించాడు. మత్తు మందు కలిపిన పండ్ల రసం ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం లైంగిక దాడి చేయడమే కాకుండా ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట ప్రాంతానికి చెందిన మహిళ (37)కు 2013లో వివాహం కాగా, భర్తతో కలిసి మహారాష్ట్రలో నివాసం ఉండేది. భర్తతో మనస్పర్థల కారణంగా గొడవ పడి ఐదు నెలల క్రితం బేగంపేటలోని తన తల్లి ఇంటికి వచ్చి ఉంటోంది. కాగా జనవరిలో నిజాముద్దీన్ అనే వ్యక్తి మహిళకు ఫోన్ చేసి డెలివరీ బాయ్నని చెప్పగా, తాను ఎటువంటి ఆర్డర్ చేయలేదని ఫోన్ పెట్టేసింది. అప్పటి నుంచి నిజాముద్దీన్ తరచూ మహిళకు ఫోన్ చేస్తూ, సందేశాలు పంపుతూ బయటకు రమ్మని తీవ్రంగా ఒత్తిడి చేశాడు. చివరకు అతని వేధింపుల తట్టుకోలేక బాధితురాలు ఓ రోజు నగరంలోని పబ్లిక్ గార్డెన్స్లో కలిసింది.ఈ క్రమంలో భర్తతో గొడవలు ఉన్నందున అతడికి విడాకులు ఇవ్వాలని, తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. విడాకుల కోసం దరఖాస్తు చేసేందుకు ఆమె ఆధార్కార్డు తీసుకున్నాడు. అనంతరం ఓ న్యాయవాదిని కలిసేందుకని గుడిమల్కాపూర్ సమీపంలోని ఓ హోటల్కు తీసుకుపోయాడు. హోటల్లో బాధితురాలికి మత్తు కలిపిన పండ్ల రసం ఇచ్చాడు. బాధితురాలు స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత న్యాయవాది రాలేదని ఆమెను పంపించేశాడు.కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఫొటోలు, వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన మహిళ ఏప్రిల్లో లక్ష రూపాయలు అతనికి ఇచ్చింది. మళ్లీ కొన్ని రోజులకు ఫోన్ చేసి తనను కలవాలని, లేకుంటే ఫొటోలు, వీడియోలు అందరికీ పంపుతానని హెచ్చరించాడు. ఆమె అంగీకరించలేదు. ఓ రోజు స్నేహితురాలితో కలిసి వస్తుండగా బాధితురాలిని కారులో బలవంతంగా తీసుకుపోయాడు. ఓ హోటల్కు తీసుకెళ్లి మరోసారి లైంగిక దాడి చేశాడు. దీంతో బాధితురాలు గురువారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు నిజాముద్దీన్పై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతాన్ని బట్టి గుడిమల్కాపూర్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. -
మండే ఎండ.. విపరీతంగా ఉక్కపోత
సాక్షి, హైదరాబాద్: ముందస్తుగా మురిపించిన నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో ప్రస్తుతం కాస్త నెమ్మదించాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్ను జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు పరిగణిస్తారు. కానీ ఈసారి వారం రోజుల ముందే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తొలి నాలుగు రోజులు అత్యంత చురుకుగా కదిలాయి. దీంతో పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీవర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు సైతం నమోదయ్యాయి. కానీ వాస్తవ సీజన్ ప్రారంభం(జూన్ 1వ తేదీ) నుంచి రుతుపవనాల కదలికలు కాస్త మందగించాయి.దీంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకొని ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణంగా రోహిణి కార్తె చివర్లో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ప్రస్తుతం పొద్దంతా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతూ తీవ్రమైన ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాయంత్రానికి వాతావరణం కాస్త చల్లబడినా వర్షాలు మాత్రం కురవటంలేదు. ఈ నెల తొలి వారంరోజుల్లో 26 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా.. అందులో సగం కూడా కురవలేదు.రెండోవారం తర్వాతే..: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా లేవు. మరో నాలుగైదు రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. జూన్ రెండోవారం తర్వాతే వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, తుఫాన్ల ప్రభావంతోనే నైరుతి సీజన్ వర్షాలు ఎక్కువ కురుస్తాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు బంగాళాఖాతంలో అలాంటి పరిస్థితులు ఏర్పడలేదు.ప్రస్తుతానికి వాతావరణ శాఖ సైతం ఎలాంటి అంచనాలను విడుదల చేయలేదు. శుక్రవారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదయ్యాయి. అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 40 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత హనుమకొండలో 23ల డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. -
ఎప్పుడేం జరుగుతుందో?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ లోపల, వెలుపల చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలతో పార్టీ కేడర్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు విచారణ సంస్థల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో విచారణ తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయనే కోణంలో కేడర్లో చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ జాగృతి’ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకొని శనివారం హైదరాబాద్కు చేరుకోనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీటన్నింటిపై ఎలా స్పందిస్తారనే చర్చ నడుస్తోంది.కేసీఆర్ విచారణ నేపథ్యంలో పార్టీ కార్యాచరణ ఏమిటో?కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిషన్ ఎదుట విచారణకు ఈ నెల 9న హరీశ్రావు, 11న కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ విషయంలో కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇచ్చినా పార్టీ ఇప్పటివరకు స్పందించక పోవడాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించిన నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్ఎస్ చేపట్టే కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కవిత ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలపడం తెలిసిందే. ఈ నెల 11న కూడా తెలంగాణ జాగృతి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం.‘ఫార్ములా–ఈ’పై విచారణకు కేటీఆర్‘ఫార్ములా–ఈ’ కారు రేసు అంశంలో గతంలో విచారణకు హాజరైన కేటీఆర్కు ఈ నెల 5న రావాల్సిందిగా ఏసీబీ మరోసారి నోటీసు జారీ చేయగా అమెరికా పర్యటన ముగించుకొని వచ్చాక హాజరవుతానని పేర్కొనడం తెలిసిందే. శనివారం హైదరాబాద్ చేరుకోనున్న కేటీఆర్ ఈ నెల 3వ వారంలో ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. పార్టీ అధినేత కేసీఆర్, మరో కీలక నేత హరీష్రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే సమయంలోనే కేటీఆర్కు కూడా నోటీసులు రావడం వెనుక కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.‘కవిత ఎపిసోడ్’పైనా పార్టీలో ఉత్కంఠఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ లీక్ కావడం కలకలం సృష్టించింది. గత నెల 23న అమెరికా నుంచి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్టులో కేసీఆర్కు తాను లేఖ రాసిన విషయాన్ని అంగీకరిస్తూనే ‘కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అలాగే గత నెల 29న కేటీఆర్ను లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పార్టీ జెండా, కండువాలు లేకుండా ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద ధర్నా కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ కేడర్లో వ్యక్తమవుతోంది. అయితే కేటీఆర్ తాజా పరిణామాల జోలికి వెళ్లకుండా కేవలం సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు వంటి అంశాలపైనే దృష్టి సారించే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. -
ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ఆర్థిక సంవత్సరం భారీ ద్రవ్యలోటుతో ప్రారంభమైంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో తొలి మాసమైన 2025, ఏప్రిల్ నెలలో రూ.4,023.11 కోట్ల ద్రవ్యలోటు నమోదైనట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రూ.1,020 కోట్ల ద్రవ్య మిగులుతో ప్రారంభం కావడం గమనార్హం.ఈ ఏడాది ఏప్రిల్లో పన్ను రాబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయని కాగ్ నివేదిక చెబుతోంది. ఆ నెలలో రూ.10,916.68 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ నెలలో పన్నుల రూపంలో రూ.11.464.17 కోట్లు వచ్చాయి. అయితే, ఈ ఏడాది అప్పులతో కలిపి ఏప్రిల్లో రూ.16,473.99 కోట్లు వచ్చాయి. ఇందులో అప్పు రూ. 5,230.99 కోట్లు. ఖర్చులు అనివార్యంఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెలలో రెవెన్యూ ఖర్చు రూ.15,262 కోట్లుగా నమోదైంది. ఇందులో గత అప్పులకు వడ్డీల చెల్లింపులు రూ.2,260 కోట్లు, వేతనాలకు రూ.3,968 కోట్లు, పింఛన్ల రూపంలో రూ.1,569 కోట్లు, సబ్సిడీల కింద రూ.4,187 కోట్లు, రెవెన్యూ పద్దు కింద రూ.3,275 కోట్లు ఖర్చయ్యాయి. మూలధన వ్యయం కింద రూ.1,204 కోట్లు కలిపి మొత్తం ఖర్చు రూ.16,466.63 కోట్లుగా నమోదైంది. -
బనకచర్లపై కేంద్రం కీలక హామీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదులపై స్పందించి కేంద్రం కీలక హామీ ఇచ్చింది. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఎలాంటి అనుమతులు, నిధులు ఇవ్వరాదని కోరుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి గత జనవరి 22న రాసిన లేఖకు స్పందిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గత నెల 28న మరో లేఖ రాశారు. ‘ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు ఏపీ నుంచి ఇంకా కేంద్రానికి అందలేదు.అందిన తర్వాత సంబంధిత నియమ నిబంధనలు, ట్రిబ్యునల్ తీర్పులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలతోపాటు ఏపీ పునర్విభజన చట్టంలోని వివిధ నిబంధనల కింద ఆ ప్రతిపాదనలను మా శాఖ పరిధిలోని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పరిశీలించాకే తగిన నిర్ణయం తీసుకుంటాం’అని ఈ లేఖలో సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ శుక్రవారం సచివాలయంలో విలేకరులతో నిర్వహించిన ఇష్టాగోష్టి సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టుకు కేంద్రం ఎలాంటి ఆర్థిక సహాయం చేయరాదని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి సైతం లేఖ రాసినట్టు గుర్తు చేశారు. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ ద్రోహం సాగునీటి విషయంలో తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. నీళ్ల విషయంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం, ద్రోహం జరిగిందని స్పష్టం చేశారు. 2014 జూన్ 2 నాటికి శ్రీశైలం జలాశయం నుంచి మొత్తం 47,850 క్యూసెక్కులను మాత్రమే తరలించుకునే సామర్థ్యాన్ని ఏపీ కలిగి ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో 2023 డిసెంబర్ నాటికి 1,11,400 క్యూసెక్కులకు ఏపీ పెంచుకుందని ఆరోపించారు. ఈ కాలంలో రోజుకు నీటి తరలింపు సామర్థ్యం 4.1 టీఎంసీల నుంచి 9.6 టీఎంసీలకు పెరిగిందన్నారు.రాష్ట్ర విభజనకు ముందు 10 ఏళ్లలో శ్రీశైలం జలాశయం నుంచి 727.15 టీఎంసీలను ఏపీ తరలించుకోగా, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 12,01 టీంఎసీలను తరలించుకుందని లెక్కలు బయటపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.64 వేల కోట్ల వృథా ఖర్చులను కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులపై చేసి ఉంటే మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లోని ప్రాజెక్టుల కింద 25,64,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేదన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై ఏపీ, తెలంగాణ మధ్య నీటి విభజనపై కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం తీసుకునే వరకు ఇదే తాత్కాలిక సర్దుబాటు కొనసాగుతుందని చెప్పి వచ్చారని ఆరోపించారు.గత ప్రభుత్వం రాతపూర్వకంగా ఈ తాత్కాలిక కోటాకు అంగీకరించడంతో దాన్ని తెలంగాణకు వ్యతిరేకంగా వాడుకోవడానికి ఏపీ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్–2లో దాఖలు చేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే ఏపీలోని ముచ్చుమర్రి లిఫ్టు సామర్థ్యం 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యం 44వేల క్యూసెక్కుల నుంచి 92,592 క్యూసెక్కులకు పెరిగిందని చెప్పారు. బీఆర్ఎస్ సహకారంతోనే నాటి ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలను తరలించుకోవడానికి రాయలసీమ లిఫ్టును చేపట్టిందన్నారు.ఈ ప్రాజెక్టు టెండర్లను అడ్డుకోవాల్సింది పోయి సజావుగా జరిగేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని, ఇందుకోసం టెండర్లకు ముందు జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని కేంద్రానికి లేఖ రాసిందన్నారు. బీఆర్ఎస్ వారు తమ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, గోబెల్స్కు వారసులు కావడంతో వారి పేర్లను ‘గోబెల్స్ రావు’గా మార్చాలని ఎద్దేవా చేశారు. -
నాటి కేబినెట్ ఆమోదంతోనే
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరిగాయని నాటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ బరాజ్ల ఏర్పాటుపై చేసిన సిఫారసులపై నాటి ఆ శాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, తనతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం జరిపి ఆమోదించిందని గుర్తుచేసుకున్నారు.ఆ తర్వాత మంత్రివర్గం ఆమోదించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లోని కార్యాలయంలో ఈటల రాజేందర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. పలు కీలక ప్రశ్నలు సంధించింది. కేవలం 20 నిమిషాలపాటు ఆయన్ను కమిషన్ విచారించింది. ఆయనతోపాటు వచ్చిన కొందరు బీజేపీ నేతలు, అనుచరులను కమిషన్ కోర్టు హాల్లో కూర్చోవడానికి అంగీకరించింది. ప్రాంతం మార్పుపై నిర్ణయం సీఎందే.. ఎవరి ఆలోచన ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణం చేపట్టారని కమిషన్ తొలుత ప్రశ్నించగా ఈటల సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘రూ. 38 వేల కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు కింద తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఆ రాష్ట్రంలో ముంపు నివారణకు బరాజ్ ఎత్తును 150 నుంచి 148 మీటర్లకు తగ్గించాలని కోరింది. వన్యప్రాణుల అభయారణ్యం ఉండటంతోపాటు అక్కడ నీటిలభ్యత సైతం లేదని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పేర్కొంది. ప్రాజెక్టు కింద 16.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితోపాటు పట్టణ తాగునీటికి 30 టీఎంసీలు, గ్రామీణ తాగునీటికి 15 టీఎంసీలు, పరిశ్రమలకు 10 టీఎంసీల నీళ్లు అవసరం.తుమ్మిడిహెట్టి వద్ద అంత నీటి లభ్యత లేకపోవడంతోనే అక్కడి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్ను మార్చాం. నాటి సీఎం (కేసీఆర్) నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక కమిటీ నివేదికపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం జరిపి బరాజ్ల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి అంచనా వ్యయం అప్పట్లో రూ. 63 వేల కోట్లు. సాగునీటి కోసం వేర్వేరు ప్రాంతాల రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను తీర్చడానికి అంచనా వ్యయాన్ని రూ. 83 వేల కోట్లకు పెంచడం జరిగింది. ఆ తర్వాత అంచనా వ్యయం పెరుగుతూ పొయింది. ఇప్పుడు ఎంతో తెలియదు’అని ఈటల పేర్కొన్నారు. బరాజ్ల లొకేషన్లను సూచించింది ఎవరు? ప్రాజెక్టుల రీఇంజనీరింగ్పై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై సంతకాలు చేశారా? అని మళ్లీ కమిషన్ ప్రశ్నించగా అవునని ఈటల బదులిచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల లొకేషన్లను నిపుణుల కమిటీ సూచించిందా? అని కమిషన్ ప్రశ్నించగా గోదావరిపై వేర్వేరు చోట్ల అధ్యయనం జరిపి చివరకు ఆ మూడు లొకేషన్లను నిపుణుల కమిటీ అంగీకరించిందని ఈటల బదులిచ్చారు. ఆ లోకేషన్ల వద్ద బరాజ్లను నిర్మించాలన్న నిర్ణయం ప్రభుత్వానిది కాదా? అని కమిషన్ మళ్లీ అడగ్గా ఆర్థిక శాఖతో సంబంధం లేకపోవడంతో సమాధానం ఇవ్వలేనని ఈటల పేర్కొన్నారు. డీపీఆర్ తయారీ కోసం వ్యాప్కోస్ సంస్థకు రూ. 5.94 లక్షలు చెల్లించాలని 2015 ఏప్రిల్ 13న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందా? అని కమిషన్ అడగ్గా తనకు గుర్తు లేదన్నారు. ‘కాళేశ్వరం’తో ఆశించిన ఆదాయం రాలేదు... కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు లేకపోవడంతో రుణాల సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)ను ఏర్పాటు చేయాలని నాడు నిర్ణయించామని ఈటల రాజేందర్ మరో ప్రశ్నకు బదులిచ్చారు. కేఐపీసీఎల్ ఆర్థిక శాఖ పరిధిలోకి రాదని.. నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ బి.హరిరామ్ దీనికి అధిపతిగా వ్యవహరించారని గుర్తుచేశారు. అన్ని శాఖల రుణాలకు ఇచ్చినట్లే కేఐపీసీఎల్ రుణాలకు సైతం ఆర్థిక శాఖ పూచీకత్తు ఇచ్చిందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంతోనే రుణాలను తిరిగి చెల్లించాలని విజయ బ్యాంకు రాసిన లేఖను కమిషన్ ప్రస్తావించగా.. ప్రాజెక్టు ద్వారా తాగు, పరిశ్రమల అవసరాలకు నీటి సరఫరాతో వచ్చే ఆదాయంతో రుణాలు తిరిగి చెల్లిస్తామని కాగితాల్లో చూపినా వాస్తవికంగా అంత ఆదాయం వసూలు కాలేదని ఈటల వివరణ ఇచ్చారు. బడ్జెటేతర రుణాలతో బరాజ్లను నిర్మించారా? అని కమిషన్ అడగ్గా ఆ వ్యవహారాలతో ఆర్థిక శాఖకు సంబంధం లేదని బదులిచ్చారు. నీటిపారుదలశాఖతోపాటు కేఐపీసీఎల్లు ఈ వ్యవహారాలు చూశాయన్నారు. బరాజ్ల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదా? అని కమిషన్ ప్రశ్నించగా దీనితో ఆర్థిక శాఖకు సంబంధం లేదన్నారు. నీటిపారుదల శాఖలోని అకౌంట్స్ విభాగం ఈ వ్యవహారాలు పర్యవేక్షిందన్నారు. -
పదేళ్లు పగ్గాలివ్వండి
సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు పాలించే అధికారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. తెలంగాణను అన్నివిధాలా అభివృద్ధి చేసి తీరుతామని ఆయన చెప్పారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతానని ఆనాడు తొడగొట్టి చెప్పి పట్టు పట్టినం.. పడగొట్టినం. ఇవాళ ముఖ్యమంత్రిగా మీ ముందున్నా. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో రూ. 1,051.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రధానంగా రూ. 574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం, రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, రూ. 183 కోట్లతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధ్యక్షతన తిర్మలాపురంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.దేశంలో ఎవరూ చేయని విధంగా కులగణన ద్వారా బీసీల లెక్క తేల్చి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కులగణన చేసే అనివార్యతను కల్పించామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి దశాబ్దాల కలను నెరవేర్చామని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు లాంటీ సీనియర్ నేత ఎస్సీ వర్గీకరణపై తనను అభినందించారని సీఎం చెప్పారు.గత ప్రభుత్వం గంధమల్ల, మూసీ కాలువల ఆధునీకరణ, ఎస్ఎల్బీసీ, డిండి వంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ నిలదీశారు. గంధమల్లకు నీళ్లు ఎలా ఇస్తారని కొందరు అడుగుతున్నారని.. నిధులిచి్చన తమకు గంధమల్లకు నీళ్లు ఎలా ఇవ్వాలో తెలియదా? అని సీఎం బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. గోదావరి జలాలను అందించడానికి ఎస్సారెస్పీ, మిడ్ మానేరు కట్టింది కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదా అని ఆయన అడిగారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలను కోటీశ్వరులను చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలకు రూ. 21 వేల కోట్ల మేర బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణను ఆడబిడ్డల చేతిలో పెట్టామన్నారు. ప్రజాపాలనలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాసంక్షేమమే «ధ్యేయంగా పనిచేస్తున్నామని రేవంత్ వివరించారు. తిరుమల తరహాలో త్వరలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా? ‘బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు. గతేడాది నవంబర్ 8న పాదయాత్ర చేసి మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరతామని మాట ఇచ్చా. ఎవరు అడ్డుపడినా మూసీ నదిని పునరుజ్జీవం చేసి తీరుతాం. ప్రధాని మోదీ సబర్మతి, యమునా నదుల ప్రక్షాళన, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చుగానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?’అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. వాసాలమర్రిని బాగుచేస్తా.. కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్కు రోడ్డు వేసుకోవడానికి వాసాలమర్రి ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘ఆనాడు వాసాలమర్రికి వచ్చి ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండు ఇచ్చి ఆసుపత్రిపాలు చేసిండు. వాసాలమర్రిలో ఇళ్లు కూలగొట్టి శ్మశానంగా మార్చిండు. ఆయన ఆగం చేసినా వాసాలమర్రి గ్రామ పరిస్థితిని బాగు చేస్తా’అని సీఎం రేవంత్ చెప్పారు. ఇందుకోసం గ్రామ పరిస్థితిని అధ్యయనం చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డికి సూచించారు. ఆలేరును అభివృద్ధి చేస్తా.. బలహీనవర్గాల బిడ్డ బీర్ల ఐలయ్యను ఎమ్మెల్యేగా గెలిపించిన ఆలేరు ప్రజలకు అండగా ఉంటానని సీఎం రేవంత్ అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తామని అందరికీ మాట ఇస్తున్నా అని చెప్పారు. అడగకున్నా ఐలయ్యకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చానని సీఎం చెప్పారు. దెయ్యాల రాష్ట్ర సమితిగా పిలవండి బీఆర్ఎస్ను ఇకపై దెయ్యాల రాష్ట్ర సమితి (డీఆర్ఎస్)గా పిలవాలని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ ఇంటి బిడ్డనే బయటపెట్టినా ఆ దెయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ రాష్ట్రం పొలిమేరల వరకు తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన ఆగమాగం అయితుండు. కోర్టుకు వచ్చి జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తుండు’అని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు లాంటి వ్యక్తులే కోర్టుకు హాజరయ్యారని రేవంత్ గుర్తుచేశారు. ఉద్యోగులకు అండగా ఉంటాం.. రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వం విడతలవారీగా వేతనాలు ఇచి్చందని.. కానీ ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచన్గా జీతాలు ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు ఇచి్చన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు రూ. వెయ్యి కోట్లకు శంకుస్థాపన చరిత్రాత్మకం: మంత్రి ఉత్తమ్ ఆలేరు నియోజకవర్గానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే 80 శాతం జనానికి సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. గత ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసి దొడ్డు బియ్యం ఇచి్చందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న గంధమల్ల చెరువుకు జీవం పోసేందుకు రూ. 574.56 కోట్లతో 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నామన్నారు. ఎవరు అడ్డుపడినా గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేసి 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి కోమటిరెడ్డి పేదలందరికీ రూ. 5 లక్షల చొప్పున ఖర్చు చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రూ. 210 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చేలా పైపాప్లైన్ పనులను ప్రారంభించామన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఈ పైప్లైన్లను మూడు నెలల్లో పూర్తి చేసి భగీరథ నీళ్లు అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, సోనియా గాంధీ కలలు కన్న తెలంగాణాను, రాహుల్ గాంధీ ఆలోచనలను నిజం చేస్తున్న నాయకుడు రేవంత్రెడ్డి అని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కొనియాడారు. ఆలేరు నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, శంకర్నాయక్, శ్రీపాల్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తన విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఆ నివేదికతో అసలు దోషులెవరో బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నాను. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పని చేశా. రీ డిజైన్ కోసం కేసీఆర్ వేసిన సబ్ కమిటీలో మేం ఉన్నాం. 2016లో తుమ్మడిహట్టి అంచనా రూ.16,500 కోట్లు. ఆ తర్వాత 2015లో ఆ అంచనా రూ.38 వేల కోట్లకు పెరిగింది....తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. తుమ్మడిహట్టితో నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయి. మూడు బ్యారేజి CWC రిపోర్ట్, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో బ్యారేజీలు కట్టారు. సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగా కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయ్యింది. అయితే..రైతుల డిమాండ్ మేరకు రూ. 82వేల కోట్లకు పోయింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని నన్ను అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్కి ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పాను... మా బతుకు నిబద్ధతో ఉంది. నేనేమీ చేయలేదు. నాకేమీ తెలియదు. అంతా వాళ్లే చేశారు. కేసీఆర్, హరీష్ రావు ఆ ఇద్దరి దగ్గరే సమాచారం అంతా ఉంది. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే సంబంధం ఉంటుంది. ఫైనాన్స్ శాఖకు అన్ని వివరాలు తెలియవు. ప్రాజెక్ట్ రీ డిజైన్ కోసం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు. అందులో మేం(హరీష్, తుమ్మల పేర్లు) ఉన్నాం. నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెప్తా. కొందరు బట్టకాల్చి మీదేసినంత మాత్రాన నాకేమీ కాదు.మూడు బ్యారేజీల వ్యయం రూ. 10వేల కోట్ల లూపే ఉండొచ్చు. ప్రభుత్వం విచారణ కమిషన్ రిపోర్టులను బయటపెట్టాలి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను త్వరగా బయటపెట్టాలి. నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం బయటపెట్టాలి. ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వానిది. ఆ నిర్ణయం తీసుకుంది కేసీఆర్...ఆయనే బాస్. కొన్ని వందలసార్లు తన మానస పుత్రిక అని చెప్పారు ’’ అని ఈటల మీడియా చిట్చాట్లో అన్నారు.ఇదీ చదవండి: 40 నిమిషాలు.. ఈటలకు 19 ప్రశ్నలు -
తార్నాక జంక్షన్ క్లోజ్
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రయోగాత్మకంగా తెరిచిన తార్నాక జంక్షన్ను ఇక మూసివేయనున్నారు. అక్కడి వాస్తవ పరిస్థితులతో పాటు ఇతక కారణాల నేపథ్యంలో ప్రస్తుతం ఆ చౌరస్తా అటు పోలీసులు, ఇటు వాహనచోదకులకు చుక్కలు చూపిస్తోంది. బుధవారం ‘జంక్షన్లో ‘జామ్’జాటం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ గురువారం ఆ ప్రాంతానికి వెళ్లారు. క్షేత్రస్థాయిలో అనేక అంశాలను అధ్యయనం చేశారు. దీంతోపాటు వివిధ మార్గాల్లో అధ్యయనం చేసిన అధికారులు శుక్రవారం నుంచి తార్నాక జంక్షన్ను మూసేయాలని, పాత పద్ధతిలోనే వాహనాల రాకపోకలు పునరుద్ధరించాలని నిర్ణయించారు. -
ఇంకుడు గుంతలు..కళ్లకు గంతలు!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో భవన (ఇళ్ల) నిర్మాణంలో భాగంగా ఇంకుడుగుంతలు తవ్వుతున్న వారే కొందరు. వారిలోనూ చాలామంది కేవలం ఓసీ (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) పొందేందుకు మాత్రం తూతూమంత్రంగా ఇంకుడుగుంతలున్నట్లు చూపుతున్నప్పటికీ, అనంతరం చాలామంది వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. దీంతో ఉన్న ఇంకుడు గుంతలు సైతం కాగితాల్లో తప్ప వాటితో ఎటువంటి మేలూ జరగడం లేదు. వర్షపు నీరు భూమి లోపలికి వెళ్లడం లేదు. దీనికంతటికీ కారణం అధికారుల అశ్రద్ధ, పర్యవేక్షణ లేకపోవడమే. గత ఐదేళ్లలో జీహెచ్ంసీ 69,575 భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా, అందులో ఇంకుడు గుంతలు నిర్మించింది 23,239 భవనాల్లోనే. అంటే 33.40 శాతమే. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడేందుకు, మరోవైపు వర్షాలొచ్చినప్పుడు నాలాలు పొంగిపొర్లి రోడ్లు, కాలనీలు మునిగిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలంలో నిర్మించే అన్ని ఇళ్లకు ఇంకుడుగుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేసింది. ఓసీల కోసమే.. ● వాల్టా చట్టం మేరకు 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలంలో భవనాలకు ఓసీ జారీ చేసేముందు నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి, ఇంకుడుగుంత ఉంటేనే ఓసీ ఇవ్వాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో ఓసీ ఇవ్వొద్దని పేర్కొంది. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024–25)లో జీహెచ్ఎంసీ 11,509 భవన నిర్మాణాలకు అనుమతులు జా రీ చేయగా, వాటిలో 4,578 భవన నిర్మాణదారులు మాత్రమే ఇంకుడు గుంతలు నిర్మించారు. ● వారిలో 2,036 మంది ఓసీలు పొందారు. అలా గడచిన ఐదేళ్లలో 1,0001 మంది మాత్రమే ఓసీలు పొందారు. నీటి వనరులు, భూమి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం వాల్టా చట్టాన్ని తెచ్చినప్పటికీ, అమలులో అటు అధికారులు, ఇటు ప్రజలు శ్రద్ధ చూపడం లేదు. 200 చదరపు మీటర్ల కంటే తక్కువ స్థలం, ఏడు మీటర్ల లోపు భవనాలకు ఓసీల అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు. ఇతరులకు అమ్ముకోవాలనుకున్నప్పుడు, లేక బ్యాంకు రుణం అవసరమైప్పుడు చూపించేందుకు మాత్రమే ఓసీలు తీసుకుంటున్నవారూ ఉన్నారు. గత ఐదేళ్లలో జీహెచ్ఎంసీలో ఇళ్ల నిర్మాణాలు, ఇంకుడు గుంతలు ఇలా.. ఆర్థిక భవన ఓసీలు ఇంకుడు సంవత్సరం అనుమతులు జారీ గుంతలు 2020–21 12,306 1,216 5,378 2021–22 17,604 1,606 3,284 2022–23 14,665 2,560 4,881 2023–24 13,491 2,683 5,218 2024–25 11,509 2,036 4,578 మొత్తం 69,575 10,001 23,239 ఓసీలు పొందే వరకే పరిమితం.. ఆ తర్వాత పట్టించుకోని వైనం ఐదేళ్లలో తవ్వినవి 33 శాతమే 69 వేలకుగాను 23వేల ఇళ్లలోనే.. వాటికి సైతం కొరవడిన నిర్వహణ బల్దియాలో భూగర్భజలాలు పెరిగేదెలా? -
నాలాల కబ్జాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
సాక్షి, సిటీబ్యూరో: నాలాల కబ్జాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టి సారించారు. సోమవారం ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై గురువారం క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. తొలుత హస్మత్పేట్ పికెట్ నాలా, ప్యాట్నీ సెంటర్ వద్ద హస్మత్పేట్, పికెట్ నాలాలు కుంచించుకుపోవడంతో మహేంద్ర హిల్స్, పికెట్, జేబీఎస్, బాలంరాయి, విమాన్నగర్ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయని స్థానికులు ఆధారాలతో చూపించారు. నాలా కబ్జాలకు గురికావడంతో వేలాది ఇళ్లు ప్రతిసారీ మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కంటోన్మెంట్ అధికారులకు గతంలో ఫిర్యాదు చేశామని తెలిపారు. నగరంలోని నాలాలపై కిర్లోస్కర్ కమిటీ, ఓయెంట్స్ కమిటీ నివేదికలతో పాటు సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చీకోటి గార్డెన్స్లోనూ.. ప్రకాష్నగర్ మెట్రోతో పాటు చీకోటి గార్డెన్స్ ప్రాంతాలు 3 సెం.మీ వర్షం కురిస్తే నీట మునుగుతున్నాయి. ఇక్కడ అర మీటర్ల వెడల్పు వరద కాల్వ కొన్ని చోట్ల 4.5 మీటర్ల మేర కబ్జా అయ్యిందని స్థానికులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కొన్ని చోట్ల ఎవరికి నచ్చినట్లు వారు నాలాను డైవర్ట్ చేశారని పేర్కొన్నారు. దీంతో సమీప ప్రాంతాలు, అపార్ట్మెంట్లు చిన్నపాటి వర్షానికే నీట మునుగుతున్నాయన్నారు. అధికారులతో చర్చించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. -
చేప ప్రసాదం పంపిణీకి సిద్ధమవుతున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్
అబిడ్స్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రసాద పంపిణీకి అన్ని శాఖల వారీగా ఏర్పాట్లు వేగిరమయ్యాయి. ఈ నెల 8న ఉదయం నుంచి 9వ తేదీ ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణి చేయనున్నారు. పోలీస్, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, వాటర్ బోర్డు, విద్యుత్, రెవెన్యూ, రవాణా, మత్స్య తదితర ప్రభుత్వ శాఖలతో అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించి చేప ప్రసాదం పంపిణీకి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బారికేడ్లు, షెడ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. భారీ బందోబస్తు: ఏసీపీ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు అబిడ్స్ డివిజన్ ఏసీపీ పి.ప్రవీణ్కుమార్ వెల్లడించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా చేడతామన్నారు. అబిడ్స్, బేగంబజార్ పోలీస్స్టేషన్ల సిబ్బందితో పాటు సెంట్రల్జోన్ సిబ్బంది, ఇతర అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల సహాయం కూడా తీసుకుంటామన్నారు. వాటర్ బోర్డు ఆధ్వర్యంలో దాదాపు 5 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు జీఎం జాన్ షరీఫ్ తెలిపారు. -
భూ బేరం! టార్గెట్ రూ.5,000 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మరోసారి భూ బేరానికి సన్నద్ధమవుతోంది. గతంలో వివిధ ప్రాంతాల్లో విక్రయించగా మిగిలిపోయిన స్థలాలను మరోసారి అమ్మకానికి పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పాత లే అవుట్లలో ఉన్న స్థలాలను విక్రయించడంతో పాటు కొత్త లే అవుట్లను సైతం సిద్ధం చేస్తున్నారు. నగరంలో చేపట్టనున్న పలు ప్రాజెక్టుల కోసం సుమారు రూ.5,000 కోట్లు ఆర్జించడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ ఆన్లైన్ బిడ్డింగ్కు ప్రణాళికలను రూపొందిస్తోంది. గతంలో భారీ స్పందన లభించిన ప్రాంతాల్లో.. ● సికింద్రాబాద్ నుంచి డెయిరీఫాం వరకు, శామీర్పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్లకు ప్రతిపాదనలు రూపొందించిన సంగతి తెలిసిందే. ప్యారడైజ్ నుంచి డెయిరీఫాం వరకు టెండర్లను సైతం కేటాయించారు.శామీర్పేట్ రూట్లో ఆస్తుల సేకరణ తుది దశకు చేరింది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి కనీసం రూ.3000 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. అలాగే రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సైతం రెండు దశల్లో రూ.2500 కోట్ల వరకు వ్యయం కానుంది. ● హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో భాగంగా మెగా మాస్టర్ప్లాన్– 2050, సికింద్రాబాద్ స్కైవాక్, హుస్సేన్సాగర్ సుందరీకరణ, పార్కులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారుల విస్తరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని భూముల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో కొనుగోలుదార్ల నుంచి భారీ స్పందన లభించిన ప్రాంతాల్లో మిగిలిపోయిన ప్లాట్లను మొదట విక్రయించి ఆ తర్వాత రెండు, మూడు దశల్లో వివిధ ప్రాంతాల్లోని స్థలాలను విక్రయించనున్నారు. మొదటి దశలో.. కోకాపేట్ నియోపొలిస్, ఇన్ముల్నర్వ, ఉప్పల్ భగాయత్, తుర్కయంజాల్లో గతంలో పెద్ద ఎత్తున స్పందన లభించింది. అప్పటి ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం లభించింది. ఉప్పల్ భగాయత్లో రెండు దశల్లో ప్లాట్లను విక్రయించారు. కోకాపేట్లో ఎన్నారైలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ సంస్థలు, రియల్టర్లు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ప్రస్తుతం ఈ నాలుగు ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములపై వారికి 60 శాతం ప్లాట్లను కేటాయించగా హెచ్ఎండీఏకు 40 శాతం ప్లాట్లు లభించాయి. వాటిలో మరో 385 ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండు, మూడో దశల్లో.. మొదటి దశలో కొనుగోలుదారులు, వివిధ వర్గాల నుంచి లభించే స్పందన మేరకు ఆన్లైన్ బిడ్డింగ్ కొనసాగించనున్నారు. ఈ క్రమంలో బుద్వేల్, ప్రతాపసింగారం, బహదూర్పల్లి, హకీంపేట్, షేక్పేట్లలోని హుడాహైట్స్, కంది, కుత్బుల్లాపూర్, పెద్దకంజర్ల, ఫసల్వాడి తదితర ప్రాంతాల్లో లే అవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను విక్రయించనున్నారు. దశలవారీగా విక్రయించేందుకు హెచ్ఎండీఏ లే అవుట్లు.. ఏరియా మొత్తం హెచ్ఎండీఏ విక్రయించినవి ప్రస్తుతం ఉన్నవి ఎకరాల్లో ప్లాట్లులేమూరు 83.47 164 - 164 తొర్రూరు 117.375 885 392 493 కుర్మల్గూడ 16.75 145 86 59 బాచుపల్లి 27.36 206 204 2 మేడిపల్లి 53.21 208 91 117 (కొన్ని ప్లాట్లు కోర్టు కేసుల్లో ఉన్నాయి.) మోకిల 165.37 908 189 719 (కొన్ని స్థలాల రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉంది.) బుద్వేల్ 182.10 17 12 4 ప్రతాప సింగారం 126.12 24 - 24 బహదూర్పల్లి 40.00 221 152 69 హుడా హైట్స్ 12.45 37 - 37 కంది 47.14 341 - 341వివిధ ప్రాంతాల్లో ఆన్లైన్బిడ్డింగ్కు సిద్ధంగా ఉన్న ప్లాట్లు ఏరియా మొత్తం హెచ్ఎండీఏ విక్రయించినవి ప్రస్తుతం ఉన్నవి ఎకరాల్లో ప్లాట్లు కోకాపేట్ 533.01 20 14 5 (ఒకప్లాట్ రంగారెడ్డి కలెక్టరేట్కు తిరిగి ఇచ్చారు) ఇన్ముల్నర్వ 92.69 327 – – ఉప్పల్ భగాయత్ 56.39 64 23 41తుర్కయంజాల్ 9.00 34 22 12 మొత్తం హెచ్ఎండీఏ ప్లాట్లు : 1141, రైతులకు కేటాయించినవి : 696, ఇప్పటి వరకు విక్రయించినవి : 59, అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి : 385 ఆదాయ సముపార్జనకు హెచ్ఎండీఏ ప్రణాళికలు ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ఫీల్డ్ రోడ్డు తదితర ప్రాజెక్టుల కోసం.. మొదటి దశలో కోకాపేట్, ఇన్ముల్నర్వ, ఉప్పల్, తుర్కయంజాల్ ప్లాట్ల బిడ్డింగ్ నాలుగు ప్రాంతాల్లో 385 ప్లాట్లు విక్రయానికి సిద్ధం రెండు, మూడు దశల్లో మరో 10 ప్రాంతాల్లో స్థలాల వేలం -
‘ఔట్ సోర్సింగ్’పై వేటు
9 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 8 మంది హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు సాక్షి, సిటీబ్యూరో: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీలో పాత్ర ఉందని గుర్తించిన జీహెచ్ఎంసీ 9 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 8 మంది హెల్త్ అసిస్టెంట్లపై వేటు వేసింది. విధుల నుంచి వారిని తొలగించింది. జీహెచ్ఎంసీలోని 14 సర్కిళ్ల పరిధిలో ఈ అక్రమా లు జరిగినట్లు గుర్తించి వారిని తొలగించారు. బుధవారం జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశం జరిగేంత వరకు వారిని తొలగించినట్లు వెల్లడి కాలేదు. నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల బాధ్యులను గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని, 9 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 8 మంది హెల్త్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు సభకు సమాధానమిచ్చారు. ఔట్సోర్సింగ్వారిపై తప్ప అధికారులపై చర్యలు తీసుకోరా? అనే సభ్యుల ప్రశ్నకు బదులిస్తూ పోలీసు కేసులు నమోదయ్యాయని, విచారణ జరుగుతోందని, దోషులుగా తేలినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరిపై అభియోగాలు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాప్రా, ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్, గోషామహల్, ఖైరతాబాద్, ఆర్సీపురం–పటాన్చెరు, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్లలోని కంప్యూటర్ ఆపరేటర్లను, మలక్పేట, సంతోష్నగర్, చార్మినార్, ఫలక్నుమా, రాజేంద్రనగర్, గోషామహల్, ఆర్సీపురం–పటాన్చెరు, కుత్బుల్లాపూర్ సర్కిళ్లలోని హెల్త్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించారు. అధికారుల పాత్ర లేకుండా సాధ్యమా ? ఈ నేపథ్యంలో అధికారుల ప్రమేయం లేకుండా కేవలం ఔట్సోర్సింగ్పై పనిచేసే వారే బర్త్, డెత్ సర్టిఫికెట్లను జారీ చేశారా? అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. నకిలీ సర్టిఫికెట్లకు వారిని బాధ్యులుగా పేర్కొంటూ, కేవలం వారిపైనే వేటు వేయడంతో జీహెచ్ఎంసీ తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతోకాలంగా ఈ ‘దందా’ జరుగుతున్నా, దాదాపు రెండున్నరేళ్లక్రితమే అవకతవకలు దృష్టికి రావడంతో అప్పట్లో జారీ అయిన సర్టిఫికెట్లను రద్దు చేశామని చెబుతున్నప్పటికీ, ఇంతవరకు ఇంకా ఎందుకు నకిలీ సర్టిఫికెట్ల జారీని కట్టడి చేయలేకపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో వీరి పాత్ర ఉందని.. -
తెలుగు టీచర్లు కావలెను!
సీబీఎస్ఈ నిబంధనతో వెతుకులాటలో పాఠశాలలుసాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులకు మాతృభాషలోనే బోధించాలన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయం పలు పాఠశాలలను గందరగోళానికి గురి చేస్తోంది. ఈ నిబంధన కూడా 2025–26 విద్యా సంవత్సరం నుంచే అమలులోకి రానుంది. ఇందుకోసం పాఠశాలలు పెద్ద ఎత్తున తెలుగు ఉపాధ్యాయులను నియమించాల్సి వస్తోంది. నగరంలోని పలు పాఠశాలల ప్రిన్సిపాళ్లు చెబుతున్న ప్రకారం.. 40 శాతానికి పైగా ఉపాధ్యాయులు తెలుగు తెలిసినవారు కాకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.కొరతే.. సమస్య..జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రకారం, కొత్త నిబంధనలో భాగంగా విద్యార్థులకు రెండో తరగతి వరకు తమ మాతృభాషలో లేదా రాష్ట్ర భాషలో బోధన అందించాలి. ‘ఇది అమలు చేయడంలో ప్రధాన సమస్య ఉపాధ్యాయుల కొరతే. తెలుగు బోధనకు ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి వస్తుంది లేదా సబ్జెక్ట్ అనువదించేందుకు కొత్త ఉపాధ్యాయులను నియమించాలి’ అని కొంపల్లిలోని ఓ పాఠశాల డైరెక్టర్ అన్నారు. ‘టాప్ స్కూళ్లలో కనాకష్టంగా 10% ఉపాధ్యాయులే తెలుగులో బోధించగలరు’ అని చెప్పారాయన.గట్టి సవాలే..తెలుగు బోధన మీడియంగా ఉండటం గట్టి సవాలేనని హైదరాబాద్ సాహోదయ స్కూల్స్ కాంప్లెక్స్లో సభ్యులుగా ఉన్న పలు సీబీఎస్ఈ పాఠశాలల ప్రిన్సిపాళ్లు కూడా అంటున్నారు. రామంతాపూర్లోని ఓ పేరొందిన స్కూల్కి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ‘తెలంగాణ నుంచే కాక ఇతర రాష్ట్రాల్లోనూ తరచూ ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్స్పై వస్తూ ఉంటారు. వారిలో చాలామంది ఇంగ్లిష్ మీడియంలో చదివినవారు కాబట్టి వారికి తెలుగుపై పట్టు ఉండడం లేదు’ అని అన్నారు. అదే పరిస్థితి విద్యార్ధులకు కూడా ఎదురవుతుందని, వారు కూడా రాష్ట్రాలతో పాటు స్కూళ్లు మారుతూ ఉంటారని.. దీంతో ఈ నిబంధన అమలు కష్టసాధ్యమని ఆయన గుర్తు చేశారు.మేలు కూడా..సమస్యలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ నిబంధన మేలు చేస్తుందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్టేట్ సిలబస్ అమలు చేస్తున్న పలు పాఠశాలల యాజమాన్యాలకు ఇది మంచి మార్పుగా అనిపిస్తోంది ‘మన దగ్గర చాలా మంది టీచర్లకు తెలుగు తెలుసు తెలుగు మీడియం వల్ల విద్యార్థులకు మెరుగైన పునాది పడుతుంది. తద్వారా ఉన్నత తరగతులలో సులభంగా విషయాలు అర్థం చేసుకుంటారు’ అని రాష్ట్ర గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం కార్యదర్శి శేఖర్ రావు అంటున్నారు.ఈ విధానం మంచిదే.. కానీ..మాతృభాషలో నేర్చుకుంటే కాన్సెప్ట్స్ బాగా అర్థమవడానికి నేర్చుకున్నది ప్రాసెస్ చేసుకోవడానికి మేధాశక్తి పెరిగేందుకు వీలుంటుంది. అది చిన్న వయసులో జరగడం చాలా ఉపయుక్తం. దీనివల్ల మనం సంస్కృతీ సంప్రదాయాలను బాగా ప్రమోట్ చేయగలుగుతాం. మాతృభాషలో నేర్చుకోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పిల్లలు ఉపాధ్యాయులతో బాగా ఇంటరాక్ట్ కాగలుగుతారు. ఈ లాభాలున్నప్పటికీ.. ప్రస్తుతం దీనిని అమలు చేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా టీచర్లకు శిక్షణ, అలాగే రీసోర్సెస్ సమకూర్చుకోవాలి. మరోవైపు ప్రస్తుత గ్లోబల్ మార్కెట్ను చూసుకుంటే ఆంగ్ల భాషా నైపుణ్యం చాలా అవసరం. ఈ నిర్ణయం అమలుతో ఆంగ్లభాష నేర్చుకోవడం ఆలస్యం కావచ్చు. ఇలాంటి కొన్ని కీలక సవాళ్లను మనం సరిగా పరిష్కరించుకోగలిగితే.. ఈ విధానం విజయవంతంగా అమలు చేయవచ్చు.– తనూజ, ప్రిన్సిపాల్, పల్లవి మోడల్ స్కూల్ -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించనుంది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని.. అందుకే రెండు మూడు నెలలకోసారి కాకుండా కేబినెట్ను నెలకు రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా సమీక్షలు జరపనున్నారు.మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా రెండు వారాలకోసారి మంత్రి వర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రతి నెలలో మొదటి, మూడో శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 17 సార్లు కేబినేట్ భేటీలు జరిగాయి. -
ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి హరీశ్రావు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచి డాక్టర్లు బులెటిన్ విడుదల చేస్తారని హరీశ్రావు చెప్పారు. అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని గోపీనాథ్ క్షేమంగా బయటకు వస్తారన్నారు. బోరబండకు చెందిన తన అనుచరుడు సర్దార్ ఆత్మహత్యతో గోపీనాథ్ ఒత్తిడికి లోనయ్యారని కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వెల్లడించారు.కుడి భుజంగా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం, కారణమైన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అస్వస్థతకు లోనైనట్లు కుంటుంబ సభ్యులు తెలిపారన్నారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తిరిగి క్షేమంగా వస్తారని చెప్పారు. ఏఐజీ ఆస్పత్రి కి ఎమ్మెల్యే కృష్ణారావు, వివేకానంద, ముఠాగోపాల్, గూడెం మహిపాల్రెడ్డి, నామా నాగేశ్వర్రావు, మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి తదితరులు వెళ్లారు. -
కాళేశ్వరం కమిషన్: 40 నిమిషాలు.. ఈటలకు 19 ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆర్కే భవన్లో జరిగిన ఓపెన్ కోర్టులో ఈటలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మొత్తం 40 నిమిషాల్లో 19 ప్రశ్నలను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఈటలకు వేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన మంత్రి(ఆర్థిక శాఖ)గా పని చేసిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ఈటలపై కమిషన్ ఈ ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. కమిషన్ ముందు 113వ సాక్షిగా హాజరైన వ్యక్తి ఈటల రాజేందర్. తొలుత.. ఓపెన్ కోర్టులో ఈటల రాజేందర్తో అంతా నిజమే చెప్తానని కమిషన్ ప్రమాణం చేయించింది. బ్యారేజీ నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్లపైనే కమిషన్ ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు?: కాళేశ్వరం కమిషన్మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు?: కాళేశ్వరం కమిషన్టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. కేబినెట్ నిర్ణయం తీసుకుంది: ఈటలకేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టాం: ఈటలకేంద్ర జలసంఘం, మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలతో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాం: ఈటలమహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 నుంచి 148 కుదించాం: ఈటలమూడు బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు?: కాళేశ్వరం కమిషన్కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. తర్వాతే నిర్మాణం జరిగింది: ఈటలరీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు?: కాళేశ్వరం కమిషన్మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు: ఈటలహరీష్ రావు చైర్మన్గా.. సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాం: ఈటలఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగింది: ఈటలరీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా? : కాళేశ్వరం కమిషన్రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసింది: : ఈటలబ్యారేజీ నిర్మాణ ప్రదేశాలు ఎందుకు మార్చారు?: కాళేశ్వరం కమిషన్టెక్నికల్ డిటైల్స్ మీద మాకు అవగాహన ఉండదు.. అంతా నిపుణులే చూసుకున్నారు: ఈటల నిర్మాణ వ్యయం ఎంత అయ్యింది?: కాళేశ్వరం కమిషన్తొలుత రూ. 63 వేల కోట్లతో అనుకున్నాం. తర్వాత అది రూ.83 వేల కోట్లకు పెరిగింది. ఇప్పుడు ఎంత ఖర్చు అయ్యిందో నాకు తెలియదు: ఈటలబ్యారేజీ నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా?: కాళేశ్వరం కమిషన్ఫైన్సాన్స్ ఖాశాఖకు అన్ని వివరాలు తెలియవు. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే తెలిసి ఉంటుంది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి: ఈటల ఇలా మొత్తం 19 ప్రశ్నలు వేసింది. ‘‘నేనేం చేయలేదు. నాకేమీ తెలియదు. అంతా వాళ్లే చేశారు. వాళ్లకే అన్నీ తెలుసు’’ అని నాటి ఇరిగేషన్ శాఖను ప్రస్తావిస్తూ ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఆధారాలను ఈటల కమిషన్కు చూపించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పని చేసిన అధికారులను మాత్రమే ఇప్పటిదాకా విచారించింది జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్(kaleshwaram Commission). ఇక ఇప్పుడు రాజకీయ నేతల వంతు వచ్చింది. ఈ మేరకు.. ఈటలను తొలుత విచారించింది. మరోవైపు.. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకూ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 5వ తేదీన జరగాల్సిన కేసీఆర్ విచారణ ఆయన విజ్ఞప్తి మేరకు 11వ తేదీకి వాయిదా పడింది. జూన్ 9వ తేదీన హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కానున్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేపలు!
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తూంకుంట మున్సిపల్ సిబ్బంది శామీర్పేట్: తూంకుంట మున్సిపల్ సిబ్బంది లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాలివీ... తూంకుంట మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన శామీర్పేట వార్డులో విధులు నిర్వహిస్తున్న బిల్ కలెక్టర్ రాంరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్లు రూ. 20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శామీర్పేట వార్డు పరిధిలో ఓ వ్యక్తి రెండు ఇళ్లను కొనుగోలు చేసి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాదిన్నరగా మ్యుటేషన్ కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. శామీర్పేట వార్డు ఆఫీసులో పని చేసే బిల్ కలెక్టర్ రాంరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్లు లంచం డిమాండ్ చేశారని, దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. లంచం డబ్బులు తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నామన్నారు. ఈ కేసులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక స్థలం.. డబుల్ రిజిస్ట్రేషన్.. ప్లాట్ విక్రయించి వ్యక్తి అరెస్టు దుండిగల్: ఒకే స్థలాన్ని రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు... మల్లంపేట ప్రాంతానికి చెందిన జె.అశోక్ కుమార్ అలియాస్ సారా అశోక్ స్థానికంగా ఉన్న 195, 196వ సర్వే నెంబర్లలోని 9.39 గుంటల్లో గతంలో వెంచర్ వేశాడు. మౌలాలికి చెందిన అన్వర్ ఖాతూన్ అనే మహిళ బాచుపల్లికి చెందిన మోహన్రెడ్డి సహకారంతో 1986 సంవత్సరంలో సదరు వెంచర్లో ప్లాట్ను కొనుగోలు చేసింది. కొన్నాళ్ల వరకు ఖాతూన్తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ప్లాట్ వద్దకు రాలేదు. ఇది గమనించిన అశోక్ సదరు ప్లాట్ను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నాడు. అందులో భాగంగా 2004 సంవత్సరంలో అశోక్ సదరు స్థలాన్ని మోహన్రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. 2023లో ఖాతూన్ ఆమె కుటుంబ సభ్యులు ప్లాట్ వద్దకు రావడంతో మోసం వెలుగుచూసింది. మోహన్రెడ్డి పేరుపై ప్లాట్ను మార్చినట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన అశోక్కుమార్ను నిందితుడిగా గుర్తించారు. గురువారం అశోక్కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో అశోక్కుమార్తో పాటు ఇతరుల పాత్ర ఏమైనా ఉందా.. ఇలాంటి దొంగ రిజిస్ట్రేషన్లు ఇంకేమైనా చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
టికెట్ అడిగారని ‘ట్రాక్స్’పై పగ!
రైలు నుంచి దించినందుకు విధ్వంసాలకు కుట్ర సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడులోనూ రైలు పట్టాలపై రాళ్లు, రాడ్లు, కర్రలు పెట్టి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో (ఆర్పీఎఫ్) సహా జాతీయ దర్యాప్తు సంస్థనూ (ఎన్ఐఏ) పరుగులు పెట్టించిన నకిలీ బాబా చిక్కాడు. ఇతగాడిని తెలంగాణ ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేయగా... చైన్నె అధికారులు పీటీ వారెంట్పై అక్కడకు తరలించారు. ● ఉత్తరాఖండ్కు చెందిన విజయ్కుమార్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. బతుకుతెరువు కోసం ఒడిస్సాలో స్థిరపడిన ఇతగాడు కుటుంబాన్ని వదిలేసి హఠాత్తుగా బాబా అవతారం ఎత్తాడు. తన పేరును ఓంగా మార్చుకుని దేశ సంచారం మొదలుపెట్టాడు. భిక్షాటన చేసుకుంటూ జీవించడం, కనిపించిన రైలు ఎక్కడం, నచ్చిన చోట దిగడం, ప్లాట్ఫామ్స్పై దొరికినవి తినడం ఇవే దినచర్యలుగా కొన్నేళ్లు బతికేశాడు. ● రైళ్లు, రైల్వే ప్లాట్ఫామ్స్పై ఇలాంటి బాబాలు, భిక్షాటన చేసే వాళ్లు, హిజ్రాల బెడద పెరిగిపోతున్నాయంటూ ప్రయాణికుల నుంచి రైల్వే అధికారులకు వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న ఇలాంటి వాళ్లను ఉపేక్షించవద్దని రైల్వే ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ● అప్పటి నుంచి టీసీలు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు ఇలాంటి వాళ్లు ఎక్కడ కనిపించినా టికెట్ తనిఖీ చేయడం, లేకపోతే దింపేయడం లాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైలులో ఒడిస్సా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓం బాబాను టిక్కెట్ లేని కారణంగా టీసీ మార్గమధ్యంలో దింపేశారు. ఈ విషయంలోనే ఓం బాబా హర్ట్ అయ్యాడు. దీంతో ఏకంగా రైల్వేల పైనే కక్ష పెంచుకున్నాడు. ● నగరంలోని కాచిగూడ–బుద్వేల్ మధ్య రైలు పట్టాలపై పెద్ద కర్రలు, రాళ్లు పెట్టాడు. వీటిని గుర్తించిన గ్యాంగ్మెన్లు తొలగించి, ఆర్పీఎఫ్కు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు నిందితుడిని పట్టుకునేందుకు మఫ్టీలో రంగంలోకి దిగడంతో పాటు గ్యాంగ్మెన్లను అప్రమత్తం చేశారు. ● కాటేదాన్ ప్రాంతంలో రైలు పట్టాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓంను గుర్తించిన ఆర్పీఎఫ్ అతడిని అదుపులోకి తీసుకుంది. ● విచారణ నేపథ్యంలో ఈ నేరాలు తానే చేసినట్లు అతడు అంగీకరించడంతో అరెస్టు చేసి జైలుకు పంపారు. ● నగరంలో ఈ పని చేసి, అరెస్టు కావడానికి మధ్యలో చైన్నె వెళ్లిన ఓం అక్కడా ఇలాంటి పనే చేశాడు. విల్లివాక్కం, అంబత్తూరు, ఆవడి, అరక్కోణంలలో రైలు పట్టాలపై వస్తువులు పెట్టడంతో ఐదు కేసులు నమోదయ్యాయి. ● ఈ ఏడాది ఏప్రిల్ 26 ఉదయం 9.30 గంటలకు అవడి రైల్వే యార్డ్ వద్ద సిగ్నల్ ఆపరేషన్ విఫలమైంది. రైల్వే సిబ్బంది వెంటనే ట్రాక్ను పరిశీలించగా ఐరన్న్ పెండ్రాల్ క్లిప్లు తొలగించినట్లు గుర్తించారు. క్లిప్లు, రెండు అంగుళాల ఇనుప ముక్కలను ట్రాక్పై ఉంచినట్లు తేల్చారు. ● మరుసటి రోజు రాత్రి 7 గంటలకు అరక్కోణం రైల్వే స్టేషన్ సమీపంలోని ఆరు పాయింట్ల వద్ద బ్యాలస్ట్, ఇనుప ముక్కలు కనిపించాయి. అదే రోజు రాత్రి 11.47 గంటలకు అంబత్తూరు రైల్వే స్టేషన్లో ఐదు చోట్ల బ్యాలస్ట్లు ఉంచినట్లు ఆర్పీఎఫ్కి సందేశం వచ్చింది. ● రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై బ్యాలస్ట్ను తొలగించి, ట్రాక్పై రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఇక్కడి అధికారుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో చైన్నె ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ● దీంతో ఓంపై అక్కడి కోర్టు నుంచి ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ తీసుకొచ్చిన అధికారులు చైన్నె తరలించారు. ● తమిళనాడులో ఇతడు చేసిన పనితో ఎన్ఐఏ కూడా ఉలిక్కిపడింది. దీని వెనుక ఉగ్రకోణం ఉందని అనుమానించి రంగంలోకి దిగింది. చివరకు ఇది ఓ దొంగ బాబా పనిగా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్కు చెందిన ఓ నకిలీ బాబా వ్యవహారం హైదరాబాద్తో పాటు తమిళనాడులోనూ కేసులు అరెస్టు చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు వారెంట్పై తీసుకువెళ్లిన చైన్నె ఆర్పీఎఫ్ బృందాలు -
సిందూర్ సాహసోపేత చర్య: లక్ష్మణ్
సాక్షి, సిటీబ్యూరో: ఆపరేషన్ సిందూర్ ఎంతో సాహసోపేత చర్య అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ 11 ఏళ్ల పాలన, విజయాలు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, యోగా దివస్ అజెండాలతో బీజేపీ గోల్కొండ జిల్లా నేతలతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... మోదీ దేశ పౌరుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో పోల్చితే దేశంలో ఐఐటీలు, ఐఐఎం, ఎయిమ్స్ సంఖ్య రెట్టింపయ్యాయని, మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయన్నారు. 52 కోట్ల మందికి ముద్ర రుణాలు ఇచ్చామన్నారు. మేకిన్ ఇండియా సత్ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. పార్టీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఉమామహేంద్ర మాట్లాడుతూ... నాయకులు, కార్యర్తలు కేంద్ర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. 21న యోగా దివస్ నిర్వహించుకుందామని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సురేఖ, ప్రేమ్ సింగ్ రాథోడ్, అట్లూరి రామకృష్ణ, ఉమా రాణి, కోలా దీపక్, తదితరులు పాల్గొన్నారు. -
14న మెడికల్ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన తెలంగాణలోని మెడికల్ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేష్ పేర్కొన్నారు. గురువారం మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక పోస్టర్ను మెడికల్ కౌన్సిల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రక్తదానం చేసేందుకు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైద్య విద్యార్థులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మెడికల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు సన్నీ డేవిస్ తదతరులు పాల్గొన్నారు. పోస్టర్ను ఆవిష్కరిస్తున్న దృశ్యం -
సూట్కేస్లో మహిళ శవం.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
నిజాంపేట్: బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ‘సూట్కేస్లో మహిళ శవం’ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వివరాలివీ... నేపాల్కు చెందిన తార బెహార(33), విజయ్తోఫా(30)లు నేపాల్లోని పక్కపక్క గ్రామాల వారు. తార బెహార్కు ఇదివరకే వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విడిపోయి జీవనం సాగిస్తోంది. ● ఇదిలా ఉండగా తార బెహార, విజయ్తోఫాల మధ్య పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరు ఏప్రిల్ 4న జూబ్లీహిల్స్లోని విజయ్ తోఫా తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. అక్కడి నుంచి 45 రోజుల క్రితం బౌరంపేట్లోని ఇందిరమ్మ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. విజయ్ తోఫా స్థానికంగా ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మాస్టర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తార బెహార్ గర్భం దాల్చింది. గర్భం విషయంలో వారి మధ్య గొడవ జరుగుతోంది. గర్భం తీసేసుకుంటానని తార బెహార్... వద్దంటూ విజయ్ తోఫా వాదిస్తుండటంతో ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవ మే 22న తీవ్ర స్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విజయ్ తోఫా... తార బేహార్ను ఇంట్లోనే ఉరి వేసి చంపేశాడు. శవాన్ని ఓ పెద్ద సూట్కేసులో కుక్కి అర్ధరాత్రి ఇందిరమ్మ కాలనీకి అనుకుని ఉన్న నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి పడేశాడు. 26వ తేదీన ఇంటిని ఖాళీ చేసి జూబ్లీహిల్స్లోని తన కుటుంబం వద్దకు వెళ్లాడు. ● కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్యాగ్ స్కాడ్ను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. డాగ్లు ఇందిరమ్మ కాలనీ వైపు వెళ్లడంతో దర్యాప్తును ఆ దిశగా చేపట్టారు. గండిమైసమ్మ నుంచి బాచుపల్లి, మియాపూర్ నుంచి బాచుపల్లి వైపు ప్రధాన రోడ్డుపై ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ● శవం పూర్తిగా కుళ్లిపోవడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేవలం గాజులు, కలర్ఫుల్ డ్రెస్ల ఆధారంగా పోలీసులు మృతురాలు ఇతర రాష్ట్రానికి చెందినదిగా భావించారు. ఈ క్రమంలో ఆమె నేపాల్వాసిగా నిర్ధారణ అయ్యింది. గోల్డెన్ కలర్ హ్యాండిలే ఆధారంగా... మృతదేహాన్ని సూట్ కేసులో తీసుకురావడంతో పోలీసులు సూట్కేస్ దిశగా సైతం విచారణ చేపట్టారు. అక్కడ లభించిన సూట్కేసు ఖరీదైనది.. అందులో కొత్తగా ఉంది. హ్యాండిల్ కొత్తగా ఉండటంతో పోలీసులు ప్రగతినగర్, మియాపూర్, నిజాంపేట్ కూకట్పల్లి తదితర ప్రాంతాల్లోని లెదర్ బ్యాగ్లు, సూట్కేసుల షాపుల్లో విచారణ ప్రారంభించాడు. పదిహేను రోజుల క్రితం పెద్ద సూట్ కేసులు ఎవరెవరు కొన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చివరకు బాచపల్లి చౌరస్తాలోని ఓ లెదర్ షాపులో ఈ నెల 23న విజయ్ తోఫా పెద్ద సూట్ కేసు కొన్నట్లు సీసీ ఫుటేజీ లభించింది. ర్యాపిడోతో ‘బుక్’అయ్యాడు... సూట్కేస్ను కొన్న విజయ్ తోఫా ర్యాపిడో బైక్ బుక్ చేశాడు. ఆ ర్యాపిడో బైక్ ఆధారంగా పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా అతడు ఇందిరమ్మ కాలనీకి చేరుకున్నట్లు తెలిసింది. ర్యాపిడో నుంచి సమాచారం తీసుకుని నేరస్తుడి నెంబర్ను ట్రేస్ చేశారు. అప్పటికే అతని సెల్ ఫోన్ స్విచ్ఛాప్లో ఉంది. ఈ క్రమంలో సాంకేతిక అంశాలతో గంటల వ్యవ్యధిలో కనుకుని జూబ్లీహిల్స్లో విజయ్ తోఫా కుటుంబం ఉందని నిర్ధారించుకున్నారు. నిఘా పెట్టి విజయ్ తోఫాను గురువారం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గర్భం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చివరకు హత్య అర్ధరాత్రి శవాన్ని ఎత్తుకుని 2 కిలో మీటర్లు నడిచి పొదల్లో పడేసిన వైనం పోలీసుల అదుపులో నిందితుడు -
సికింద్రాబాద్లో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా కూల్చివేతలు జరిగాయి. శుక్రవారం వేకువజాము నుంచే బేగంపేట ప్యాట్నీ పరిధిలోని నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగించారు. కంట్మోనెంట్ బోర్డు పరిధిలో తొలిసారి హైడ్రా కూల్చివేతలు జరగడం ఇక్కడ విశేషం.హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ గురువారమే రసూల్పురా నాలాను పరిశీలించారు. ఆపై కూల్చివేతలకు వారు ఆదేశించడంతో సిబ్బంది రంగంలోకి దిగారు. హైడ్రా (Hydra) అధికారులు కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి అక్రమ కట్టడాలను కూల్చివేశారు.. తాజా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) మీడియాతో మాట్లాడారు. నగరంలోని నాలాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారాయన. వచ్చే 4 నెలల పాటు ఈ అంశంపైనే దృష్టి పెడుతున్నట్లు, వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను తొలగిస్తామని.. పేదల నిర్మాణాల అంశాన్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ చెప్పారు. హైడ్రా (HYDRA) అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ 🚜💥అనే ప్రత్యేక సంస్థ. ఇది హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను తొలగించడం, చెరువులను రక్షించడం, నగరాన్ని వరదల నుంచి కాపాడడం వంటి పనులు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఇప్పటికే వందల సంఖ్యలో కట్టడాలను కూల్చేసింది. మరోవైపు ఇది రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయ్యింది. -
ఎల్ఆర్ఎస్ ఇప్పట్లో తేలేనా?
సాక్షి, హైదరాబాద్: అనధికార లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. లక్షలాది మంది తమ ప్లాట్లు అనధికార లేఅవుట్లలో ఉన్నాయని తెలిసినా, క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ కింద గత ప్రభుత్వ హయాంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. 2020 నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పించింది. దాదాపు మూడు నెలలుగా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. క్రమబద్ధీకరణకు యోగ్యమైనవిగా అధికారులు నిర్ణయించిన వాటిలో ఇప్పటివరకు కనీసం 25 శాతం ప్లాట్ల దరఖాస్తులకు క్రమబద్ధీకరణ ఫీజులు చెల్లించకపోవడం గమనార్హం. 2020లో మొత్తం 25,67 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అందులో 20,11 లక్షల దరఖాస్తులు ప్లాట్ల క్రమబద్ధీకరణకు అర్హత ఉన్నవిగా తేల్చిన అధికారులు.. ఆ మేరకు సంబంధిత ప్లాట్ల యజమానులకు సమాచారం ఇచ్చారు. మీరు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఫీజులు చెల్లిస్తే.. ఈ ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. తద్వారా కనీసం రూ.పదివేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని భావించింది. అయితే ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. ఫీజు చెల్లింపు గడువును మూడుసార్లు పొడిగించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన 2020 కటాఫ్ ఏడాది తర్వాత ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం తాజాగా ఈ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత మరో 46,255 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి. వీటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. క్రమబద్ధీకరణకు యోగ్యమైన 20.11 లక్షల దరఖాస్తుల్లో ఫీజులు చెల్లించిన వారు కేవలం 5,77 లక్షలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 15 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నవారు ఫీజుల రూపంలో డబ్బులు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. డబ్బు చెల్లించిన తర్వాత.. జరిమానా రూపంలో డబ్బు చెల్లించిన 5.77 లక్షలలో ఇప్పటి వరకు క్రమబద్ధీకరణ చేసినవి 1,77,435 వరకు ఉన్నాయి. ఫీజుల చెల్లించి, మిగిలిన పత్రాలు సరిగా జతచేయని వారిని నుంచి అవసరమైన పత్రాల కోసం అధికారులు వారికి మళ్లీ సమాచారం ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు కూడా చేపడుతున్నారు. అనధికార లేఅవుట్లు, ప్లాట్లు అధికంగా ఉన్న జిల్లాలు, అక్కడ నుంచి వచ్చిన దరఖాస్తులు, చెల్లించిన ఫీజులు చూస్తే.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనే అత్యధికంగా అనధికార లేఅవుట్లు ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు ఫీజుల రూపంలో ప్రజలు చెల్లించిన మొత్తాల్లో రంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో, రెండోస్థానం మేడ్చల్, మూడోస్థానంలో హెచ్ఎండీఏ నాలుగో స్థానంలో జీహెచ్ఎంసీ, ఐదోస్థానంలో వరంగల్ అర్బన్, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. పురపాలక శాఖలోని అధికారుల పాత్ర లేకుండా వేల లేఅవుట్లు, ప్లాట్లు రావడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అత్యల్పంగా ఆదాయం సమకూరిన జిల్లా ములుగు అయితే..అత్యధిక ఆదాయం వచ్చిన జిల్లా రంగారెడ్డి. మరోసారి పొడిగింపు.. ప్రజలకు తమ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయించుకోవడానికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పురపాలక శాఖ అధికారులు ప్రభుత్వానికి ఫైల్ పంపినట్టు చెబుతున్నారు. గతవారంలో పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి, సీఎంఓలో పురపాలక వ్యవహారాల చూసే మాణిక్రాజ్లు లేని కారణంగా పొడిగింపు ఉత్తర్వులు రాలేదని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పొడిగింపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలిసింది. -
హైదరాబాద్లో రఫేల్ ఫ్యూజిలేజ్ల తయారీ
సాక్షి, హైదరాబాద్: ఫ్రాన్స్కు చెందిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్లు హైదరాబాద్లో తయారు కానున్నాయి. ఇందుకోసం రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. భారత్తోపాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఫ్యూజిలేజ్ను తయారు చేసేందుకు టాటా సంస్థ హైదరాబాద్లో ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఫ్రాన్స్ వెలుపల తొలిసారి రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్లు హైదరాబాద్ లోనే తయారు కానుండటం విశేషం. రెక్కలు, తోక మినహా విమానంలోని ఇతర భాగాన్ని ఫ్యూజిలేజ్ అంటారు. ఇందులో ప్రయాణికులు, సరుకులు, ఇతర పరికరాల రవాణా కోసం ఏర్పాట్లు ఉంటాయి. ఈ ఒప్పందంతో భారత వైమానిక తయారీ రంగం సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. హైదరాబాద్ యూనిట్లో ఫ్యూజిలేజ్లోని ముందు, వెనుక, పక్క భాగాలు తయారవుతాయి. 2028 నాటికి తొలి ఫ్యూజిలేజ్ ఉత్పత్తిఒప్పందం మేరకు 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రఫేల్ యుద్ధ విమానం తొలి ఫ్యూజిలేజ్ హైదరాబాద్ యూనిట్ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ ప్రతి నెలా రెండు ఫ్యూజిలేజ్లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘రఫేల్ ఫ్యూజిలేజ్లు తొలిసారి ఫ్రాన్స్ బయట ఉత్పత్తి కానున్నాయి. భారత్లో మా సప్లై చైన్ను బలోపేతం చేయడంలో ఈ ఒప్పందాన్ని కీలకమైనదిగా భావిస్తున్నాం’అని డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. ‘డసాల్ట్ ఏవియేషన్తో ఒప్పందం భారతదేశ ఏరోస్పేస్ రంగం ప్రయాణంలో ముఖ్యమైన ముందడుగు. ఈ ఒప్పందం ఆధునిక, దృఢమైన ఏరోస్పేస్ తయారీ పర్యావరణ వ్యవస్థ స్థాపనలో గొప్ప పురోగతికి ప్రతిబింబంగా నిలుస్తుంది’అని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సుకరణ్ సింగ్ అన్నారు. -
దొరికిన ఉద్యోగం చేసుకోవడమే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యువతలో విద్యపట్ల ఆసక్తి పెరుగుతున్నప్పటికీ నాణ్యమైన ఉద్యోగాలు సమస్యగా మారాయి. హైదరాబాద్ వంటి నగరాల్లోని పేరొందిన కళాశాలల్లో చదివినప్పటికీ కొందరికే నాణ్యమైన, పైస్థాయి ఉద్యోగాలు లభిస్తున్నాయి. క్యాంపస్ కొలువుల పేరుతో చిన్న, పెద్ద కంపెనీలు ఇచ్చే అరకొర వేతనాలకే రాష్ట్రంలో యువతరం ఉద్యోగాలు చేస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది. యువత జీవితాలు, ఉపాధి, కుటుంబ జీవనంపై యంగ్ లైవ్స్ సర్వే రౌండ్–7 (2023–24) నివేదిక ముఖ్యమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది.తెలంగాణలో 2023 ఆగస్టు నుంచి 2024 జనవరి మధ్య 22 ఏళ్ల వయసు్కలు, 29 ఏళ్ల వయస్కుల విద్య, ఉపాధి, కుటుంబ జీవనంలోని మార్పులను నివేదిక విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో బాల్య వివాహాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ ఉపాధి నాణ్యత, లింగ అసమానతలు, చెల్లింపుల్లేని గృహపనుల భారం మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సవాళ్లను అధిగమించి సమాన ఉపాధి అవకాశాలు, మెరుగైన విద్య, సామాజిక భద్రత కల్పన ద్వారా లింగ సమానత్వం, మంచి ఉద్యోగాల లక్ష్యాలను సాధించడంపై యువత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నివేదిక సూచిస్తోంది. విద్య నుంచి ఉపాధి వైపు.. ఈ సర్వే ప్రకారం 22 ఏళ్ల వయసు్కల్లో విద్య నుంచి ఉపాధి వైపు పరివర్తన ఆలస్యంగా జరుగుతున్నట్లు తేలింది. 2023లో 53% మంది 22 ఏళ్ల వారు పూర్తి సమయం పనిచేస్తుండగా 2016లో అదే వయసు వారు 62% మంది పనిచేశారు. అదేవిధంగా 20% మంది 22 ఏళ్ల వారు విద్య, ఉపాధి కలిపి చేస్తుండగా 29 ఏళ్ల వారిలో ఇది 12% మాత్రమే. ఈ ఆలస్యం విద్యపై పెరిగిన శ్రద్ధను సూచిస్తోంది. అయితే ఉపాధి అవకాశాల్లో సవాళ్లు పెరిగినట్లు సర్వేలో తేలింది. నాణ్యత లేని ఉద్యోగాలు, లింగ వివక్ష 29 ఏళ్ల వయసు వారిలో 78% మంది నాణ్యతలేని ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అంటే రాతపూర్వక ఒప్పందం లేని, ఎక్కువ గంటలు పని చేయాల్సిన ఉద్యోగాలు అన్నమాట. అలాగే ఉద్యోగాల్లో పురుషులు (96%) మహిళలు (60%) మధ్య లింగ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. 22 ఏళ్ల వయసు వారిలో 10% మంది మాత్రమే రాతపూర్వక ఒప్పందాలు ఉన్న ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ 40% మంది 48 గంటల కంటే ఎక్కువ పనిచేస్తున్నట్లు తేలింది. 22 ఏళ్ల పురుషులు సగటున 2.7 గంటలు ఎక్కువ పనిచేస్తుండగా మహిళలు 4.3 గంటలు ఎక్కువగా చెల్లింపులేని గృహ పనులకు సమయం కేటాయిస్తున్నారు.అలాగే 22 ఏళ్ల వయసు్కలకు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి ఎక్కువగా లభిస్తున్నట్లు తేలింది. 2016 నాటికి 22 ఏళ్ల వయసులో ఉన్న వారు గ్రామీణ ప్రాంతాల్లోని 98 శాతం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ ఉపాధి రంగాలవైపే దృష్టిసారించినట్లు సర్వే పేర్కొంది. అదే 2023లో 22 ఏళ్ల వయసువారు వ్యవసాయం, అనుబంధ రంగాలలో 64 శాతం మందే ఉన్నట్లు తేలింది. బాల్య వివాహాలు తగ్గుదల: 2023లో 22 ఏళ్ల మహిళల్లో 16% మంది 18 ఏళ్ల లోపు వివాహం చేసుకోగా 2016లో ఇది 32 శాతంగా ఉండేది. 19 ఏళ్లలోపు తల్లులైన వారు 2023లో 22 ఉండగా 2016లో అది 29 శాతంఉంది. అయితే తల్లి విద్యాస్థాయి తక్కువగా ఉన్నవారు, ఆర్థికంగా వెనుకబడిన వారిలో బాల్య వివాహాలు, మాతృత్వం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
లక్ష్యానికి మించి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసింది. పంట దిగుబడి పెరిగిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష్యానికి మించి పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొన్నది. పెరిగిన వరి పంట విస్తీర్ణం నేపథ్యంలో యాసంగిలో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా గురువారం నాటికి ఏకంగా 71.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.మరో 3–4 కొనుగోలు కేంద్రాల్లో లక్షకుపైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటా కావడానికి సిద్ధంగా ఉంది. ఈ లెక్కన కొనుగోళ్ల ప్రక్రియ ముగిసేలోగా మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల సంస్థ తెలిపింది. గతేడాది యాసంగి సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో సుమారు 25 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని అధికంగా సేకరించే అవకాశం ఉంది. సన్నధాన్యం 22.20 ఎల్ఎంటీ రాష్ట్రంలో ఇప్పటివరకు కొనుగోలు చేసిన 71.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో సన్నరకం ధాన్యం 22.20 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. సన్న ధాన్యానికి క్వింటాల్కు రూ. 500 చొప్పున ప్రోత్సాహక బోనస్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో గత వానాకాలం సీజన్ నుంచే సన్నాల సాగు పెరిగింది. ఎన్నడూ లేనివిధంగా యాసంగిలో భారీ ఎత్తున సన్నాల సాగు జరిగింది.అయితే నిజామాబాద్, నల్లగొండ, కామారెడ్డి, సూర్యాపేట, పెద్దపల్లి, సిద్దిపేట, జగిత్యాల తదితర జిల్లాల్లో పండించిన సన్నాలను ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చే బోనస్ ధరను కూడా ఇచ్చి పెద్ద ఎత్తున కొనడంతో పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు సన్న వడ్లు రాలేదు. కనీసం 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్న ధాన్యం సేకరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఈ సీజన్ పూర్తయ్యేలోగా 23 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. 12.08 లక్షల రైతుల నుంచి.. రాష్ట్రంలో కొనుగోలు చేసిన 71.39 లక్షల ధాన్యాన్ని 12.09 రైతుల నుంచి సేకరించారు. ఇందులో దొడ్డు రకం ధాన్యం 49.20 మెట్రిక్ టన్నులను 8.42 లక్షల మంది రైతుల నుంచి సేకరించారు. 22.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యాన్ని 3.66 లక్షల మంది రైతుల నుంచి కొన్నారు. ఈ మొత్తం ధాన్యం విలువ రూ. 16,547 కోట్లుకాగా, ఇప్పటివరకు రూ. 14,740 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. మరో 1,807 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. నిజామాబాద్ ఫస్ట్.. ఆదిలాబాద్ లాస్ట్ యాసంగి ధాన్యం సేకరణలో ఎప్పటిలాగే నిజామాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి రూ. 1,870 కోట్ల విలువైన 8.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరించింది. 5.96 లక్షల మెట్రిక్ టన్నులతో రెండో స్థానంలో నల్లగొండ జిల్లా నిలవగా 4.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంతో జగిత్యాల మూడో స్థానంలో ఉంది. అతితక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 144 మంది రైతుల నుంచి 645 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. సాగునీరు లేకపోవడంతోపాటు కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటల సాగు ఆదిలాబాద్లో ఎక్కువ వల్ల వరి పండించే రైతులు తక్కువ. -
నేడు హైదరాబాద్కు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గత నెల 27న విదేశీ పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. శుక్రవారం హైదరాబాద్కు చేరుకోనున్నారు. ‘ఫార్ములా–ఈ’రేస్కు సంబంధించి మే 28న విచారణకు రావాల్సిందిగా కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వగా, తాను విదేశీ పర్యటన అనంతరం హాజరవుతానంటూ ఆయన లేఖ రాసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ నెల మూడో వారంలో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. కాగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో కేటీఆర్ తన అమెరికా పర్యటనను కుదించుకున్నారు. ఆయన భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం బయల్దేరతారు. గోపీనాథ్ కుటుంబసభ్యులతో పాటు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. -
డిపోర్టేషన్కు ‘నై’జీరియన్లు!
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాలైన వీసాలపై వచ్చి ..సైబర్ నేరాలు, డ్రగ్స్ దందాతో దడ పుట్టిస్తున్న నల్లజాతీయులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో వీరిని జైలుకు పంపడం కంటే..డిపోర్టేషన్ ద్వారా తిప్పిపంపడమే ఉత్తమని పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిని కూడా తప్పించుకోవడానికి ఆ కేటుగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వారిలో నైజీరియన్లే ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వివిధ రకాలైన వీసాలపై వచ్చి తిష్ట నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు, మొరాకో వంటి దేశాల నుంచి అనేకమంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్ వస్తున్నారు. వీరిలో కొందరు వీసా, పాస్పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. అనేక మంది డ్రగ్స్ దందాలు, సైబర్ నేరాలు చేస్తున్నారు. గతంలో ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ తదితరాల కింద కేసు నమోదు చేసేవారు. కోర్టులో దీని విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్ చేయడానికి ఆస్కారం ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో బెయిల్పై బయటకు వచ్చే ఆ విదేశీయులు జైల్లో ఏర్పడిన పరిచయాలతో మరింత రెచ్చిపోవడం ప్రారంభించారు. పోలీసుల్ని ముప్పతిప్పలు పెడుతూ... ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సాయంతో నల్లజాతీయులను డిపోర్టేషన్ చేయడం మొదలెట్టారు. అయితే ఈ డిపోర్టేషన్ను తప్పించుకోవడానికి నల్లజాతీయులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తమ వివరాలు చెప్పకపోతే ఎంబసీ నుంచి క్లియరెన్స్ రాదని తెలుసుకున్నారు. దీంతో అసలు వివరాలు చెప్పకుండా డిటెన్షన్ సెంటర్లోనే ఉండిపోతామంటున్నారు. సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు ఈ వివరాలు సేకరిస్తే, స్థానికంగా ఉన్న తమ అనుచరుల ద్వారా మరో కథ నడిపిస్తున్నారు. ఇక్కడే ఉంటున్న ఆ దేశీయురాలితో వివాహమైనట్టు, ఆమెను వేధిస్తున్నట్టు కేసులు పెట్టించుకుంటున్నారు. ఇలా నమోదైన కేసుల విచారణ పూర్తయ్యే వరకు వారిని డిపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉండట్లేదు. ఈ వ్యవహారాలన్నింటినీ నైజీరియన్లు వ్యవస్థీకృతంగా నడిపిస్తున్నారు. ఈ వివరాలను గుర్తిస్తున్న పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆ కేసుల్ని మూసేయించి డిపోర్ట్ చేస్తున్నారు. ‘అవతారం’మార్చుకొని మళ్లీ అడుగు... డిపోర్టేషన్ ద్వారా తమ దేశానికి వెళ్లిపోతున్న నైజీరియన్లు అక్కడ నుంచి ఘనా, ఐవరీకోస్ట్, సూడాన్లకు చేరుకుంటున్నారు. అక్కడ ఉన్న భారీ నెట్వర్క్ వీరికి ఆ దేశాల పౌరసత్వం, గుర్తింపులు ఇప్పిస్తోంది. వీటి ద్వారా పాస్పోర్ట్ పొందుతున్న నైజీరియన్లు ఆ మూడు దేశాలకు చెందిన వారుగా మళ్లీ ఇక్కడకు వస్తున్నారు. ఆపై ఈ నల్లజాతీయులు తమ గుర్తింపుల్ని దాచేస్తున్నారు. నకిలీ పేర్లు, వివరాలతో ఫోర్జరీ పాస్పోర్టు, వీసాలు తయారు చేసుకుంటున్నారు. పట్టుబడుతున్న వారిలో దాదాపు 70 శాతం మంది వద్ద ఇవే లభిస్తున్నాయి. ఈ కారణంగానే వీరి వివరాలు కాదు కదా అసలు పేరు తెలుసుకోవడం కూడా కష్టసాధ్యంగా మారుతోంది. వీరిని కట్టడి చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. -
పేదలను కొట్టి పెద్దలకు భూములు
సాక్షి, హైదరాబాద్: బీద రైతుల కడుపుకొట్టి వారి భూములను బడా పారిశ్రామికవేత్తలకు కారు చౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తనకు నచ్చిన బడాబాబుల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ భూములను బలవంతంగా సేకరించే బాధ్యతను సీఎం భుజాన వేసుకున్నారని ఆరోపించారు. దీంతో రైతులపై తరచూ ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి చెందిన బౌన్సర్లు, పోలీసులు రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషమని ‘ఎక్స్’లో గురువారం పోస్టు పెట్టారు. పాలమూరు బిడ్డనని పదేపదే చెప్పుకునే సీఎం.. తన సొంత జిల్లాలో ఘటన జరిగినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు పెద్ద ధన్వాడతోపాటు మొత్తం 12 గ్రామాల రైతులపై దాడి చేసి, 40 మందిపై కేసులు నమోదుచేశారని, 12 మందిని రిమాండ్కు పంపారని తెలిపారు. రైతులపై దాడి చేయించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమాని, బౌన్సర్లపై కేసులు ఎందుకు పెట్టలేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద ధన్వాడ తరహా ఘటనలు ఏడాదిగా రాష్ట్రంలో అనేకచోట్ల జరుగుతున్నాయని విమర్శించారు. పెద్ద ధన్వాడ ఘటనలో అరెస్టు చేసిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం హరితహారంమాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే తెలంగాణలో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందని హరీశ్రావు అన్నారు. -
నేడు పీసీ ఘోష్ కమిషన్ ముందుకు ఈటల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను ప్రశ్నించనుంది. ఏడాది కాలంగా విచారణ జరుపుతున్న కమిషన్ ఎదుట ఓ ముఖ్య నేత హాజరై వాంగ్మూలనం ఇవ్వనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలి దఫా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేసినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలు జరిగాయి.బరాజ్ల నిర్మాణం సైతం అప్పుడే ప్రారంభమై పూర్తయ్యింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని తీసుకున్న నిర్ణయంతో పాటు ప్యాకేజీలవారీగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు ఆర్థిక అనుమతులు, ఆ తర్వాత పనుల అంచనాల సవరణకు అనుమతి, రుణ సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) స్థాపనకు అనుమతుల జారీలో నాడు ఆర్థిక శాఖ కీలకంగా వ్యవహరించింది. ఈ నిర్ణయాల్లో ఈటల రాజేందర్ పాత్రపై ఆయన్ను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది.ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కమిటీలకు ఈటల నేతృత్వం వహించగా, మరికొన్ని కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించింది. ఈ వ్యవహారాల్లో ఆయ న పాత్రపై కమిషన్ ప్రశ్నించనుంది. కమిషన్ ఎదుట ఈటల ఇవ్వనున్న వాంగ్మూలం కీలకంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, కమిషన్ ఈ నెల 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ను, 11న మాజీ సీఎం కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావాలని కోరింది. వారికి ఇప్పటికే సమన్లు పంపించింది. వాస్తవానికి ఈ నెల 5నే కేసీఆర్ను ప్రశ్నించేందుకు కమిషన్ సమన్లు పంపగా, ఆయన అనారోగ్య కారణాలు చూపి మరి కొంత సమయం కోరారు. దీంతో 11వ తేదీన రావాలని కోరింది. -
బడిబాట పట్టేనా!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ నెల 19 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అన్ని జిల్లాలకు పంపింది. అన్ని స్థాయిల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించింది. ప్రభుత్వ టీచర్లలో బోధనా సామర్థ్యం పెంచేందుకు ఈసారి శిక్షణ కూడా ఇచ్చారు. బడిబాట షెడ్యూల్ ఇదీ..6వ తేదీ: స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వా మ్యం చేస్తూ గ్రామసభలు నిర్వహించాలి. 7వ తేదీ: టీచర్లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బడి ఈడు పిల్లలను గుర్తించాలి. 8, 9, 10 తేదీల్లో: అంగన్వాడీ కేంద్రాల సందర్శన. డ్రాపౌట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడంతోపాటు ప్రత్యేక అవస రాలున్న పిల్లలను గుర్తించి, అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి. 11వ తేదీ: అప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష.12వ తేదీ: అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టి న పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలి. అదే రోజు వి ద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలి. 13వ తేదీ: ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులను ఆహ్వానించి వారి సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ నిర్వహించాలి.16వ తేదీ: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (లిప్) దినోత్సవం నిర్వహించాలి. అన్ని తరగతి గదుల్లో సబ్జెక్టులవారీగా అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించాలి. పిల్లలు రూపొందించిన వివిధ చార్టులతో గదులను అలంకరించాలి. చదవడం, గణిత అంశాలపై ఎఫ్ఎల్ఎన్ క్విజ్ పోటీలు నిర్వహించాలి. 17వ తేదీ: ఇంటిగ్రేటెడ్ విద్య. బాలిక విద్యా దినోత్సవం నిర్వహించాలి. బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి. 18వ తేదీ: తల్లిదండ్రులను, గ్రామస్తులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలైజేషన్, ఇతర అధునిక సౌకర్యాలను చూపించాలి. మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలి.19వ తేదీ: బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించాలి. తగ్గుతున్న ప్రవేశాలుప్రభుత్వ స్కూళ్లలో గత పదేళ్లలో విద్యార్థుల ప్రవేశాలు 32 శాతం తగ్గాయి. 2014–15లో 24.85 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చేరితే, 2024–25లో ఈ సంఖ్య 16.68 లక్షలకు తగ్గింది. అదే కాలంలో ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు 31.17 లక్షల నుంచి 36.73 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పడిపోవడం కూడా ప్రవేశాలు తగ్గటానికి కారణంగా భావిస్తున్నారు. కాగా, బడిబాటపై చాలామంది టీచర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తూతూమంత్రంగానే పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఏం పని?
సాక్షి, హైదరాబాద్: అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ తిరుగుతున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గురువారం నాగర్కర్నూలు, మహబూబ్నగర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం గాం«దీభవన్లో జరిగింది. పార్టీ నిర్మాణం, ప్రభుత్వ పథకాల ప్రచారంపై విశ్లేషణ వంటి అంశాలపై చర్చించారు. అయితే స్థానిక అంశాలపైనే మూడు నియోజకవర్గాల నాయకులు మాట్లాడినట్టు తెలిసింది.⇒ నాగర్కర్నూల్ సమావేశంలో ఎంపీ మల్లు రవిని లక్ష్యంగా చేసుకొని మాజీ ఎమ్మెల్యే సంపత్, ఆయన వర్గం నాయకులు మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. పదేళ్లు కష్టపడిన మమ్మల్ని పక్కన బెట్టి ఇతరులకు ప్రియార్టీ ఇస్తారా అని సంపత్ వర్గం మల్లు రవిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ⇒ మహబూబ్గర్ పార్లమెంట్ సమావేశంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ప్రతినిధులుగా తాము చెప్పే విషయాలు అధికారులు వినడం లేదని మీనాక్షికి చెప్పినట్టు సమాచారం. వరంగల్ పార్లమెంటు సమావేశంలో స్థానిక అంశాలను ఇన్చార్జ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు నియోజకవర్గాల నాయకులకు దిశానిర్దేశం చేశారు. గాందీభవన్లో మూడు నియోజకవర్గాలకు విడివిడిగా జరిగిన సమావేశాల్లో ఆమె మాట్లా డుతూ పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుందని, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో అనుకూలంగా మలచుకోవాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. సమావేశాల్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మూడు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగనుంది. -
40 శాతం వైకల్యమున్నామెజారిటీ కేటగిరీల్లో అర్హత
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమంలో భాగంగా తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ (టీవీసీసీ) ద్వారా పంపిణీ చేసే పరికరాలకు సంబంధించి విధివిధానాలు ఖరారయ్యాయి. ఈ పరికరాల పంపిణీలో గత ప్రభుత్వం నిబంధనలు జారీ చేసిన ప్పటికీ... క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వినతులు, సలహాలు, సూచనలకు అనుగుణంగా టీవీసీసీ పాలకమండలి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ నేపథ్యంలో టీవీసీసీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తూ ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ జీవో 89 జారీ చేశారు. ఈ నేప థ్యంలో గురువారం టీవీసీసీ చై ర్మన్ ముత్తినేని వీరయ్య ఉత్త ర్వుల కాపీలను విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఆయన మలక్పేటలోని టీవీసీసీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీ డియాతో మాట్లాడారు. వినతు లను పరిగణించి పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు లబ్ధి జరిగే విధంగా మార్పులు చేస్తూ చర్యలు తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బెంచ్మా ర్క్ డిజేబిలిటీ ఉన్న ప్రతి దివ్యాంగుడికి తాజా నిబంధనలు వర్తిస్తాయని, గతంలో 80% వైకల్యం ఉన్న వాళ్లకు మాత్రమే అర్హత కల్పించగా... ప్రస్తుత ప్రజాప్రభుత్వం కుదించిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి ఉదార నిర్ణయం తీసుకోలేదని వీరయ్య వ్యాఖ్యానించారు. 40 శాతం వైకల్యం ఉంటే...తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు, వృత్తివిద్యా కోర్సులు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్టాప్లు, విద్యార్థి నేస్తం కార్యక్రమం ద్వారా ట్యాబ్లు, లూయిస్ బ్రెయిలె అండ్ హెలెన్ కిల్లర్ గిఫ్ట్గా 5జీ స్మార్ట్ ఫోన్లు, లెప్రసి బాధిత దివ్యాంగులకు మైక్రో సెల్యూలర్ రబ్బర్ (ఎంసీఆర్), అంధ విద్యార్థులకు బ్రెయిలీ కిట్లు, కుర్చీకే పరిమితమైన దివ్యాంగులకు ఇన్నోవేటివ్ బ్యాటరీ వీల్ చైర్స్, స్వయం ఉపాధి కింద వ్యాపారం చేసుకునే దివ్యాంగులకు బ్యాటరీ వెహికల్స్ అందిస్తున్నారు. వీటిలో మెజార్టీ కేటగిరీల్లో కేవలం 40 శాతం వైకల్యం ఉన్నా అర్హత సాధిస్తారని టీవీసీసీ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. -
ఉద్యోగులకు 2 డీఏలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 డీఏలు (కరువు భత్యం) చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డీఏలలో ఒక డీఏను తక్షణమే చెల్లించాలని నిర్ణయించింది. నాటి నుంచి ఇప్పటివరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను 28 వాయిదాల్లో చెల్లించనుంది. ఇక మరో డీఏను 6 నెలల తర్వాత చెల్లించనుంది. వచ్చే ఏప్రిల్లో దీనిపై ప్రకటన చేయనుంది. ఉద్యోగులకు 5 పెండింగ్ డీఏలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి రెండు డీఏలపైనే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అపరిష్కృత సమస్యలపై విస్తృతంగా చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి నేతృత్వం వహించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి సచివాలయంలో విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘ చర్చ.. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను డిప్యూటీ సీఎం భట్టి కేబినెట్కు నివేదించారు. ఉద్యోగుల డిమాండ్లపై మే 6న ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికను సమర్పించింది. ఉద్యోగుల 57 డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం.. అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదించి మిగిలిన వాటిని పరిశీలనకు స్వీకరించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను ఇకపై ప్రతి నెలా క్రమపద్ధతిలో చెల్లించాలని నిర్ణయించింది. ప్రతి నెలా రూ. 700 కోట్లకు తగ్గకుండా బిల్లులు చెల్లించనుంది. ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి ఉద్యోగి నుంచి నెలకు రూ. 500 వసూలు చేయడంతోపాటు సమాన మొత్తాన్ని ప్రభుత్వ వాటాగా ట్రస్ట్కు చెల్లించనుంది. ట్రస్ట్ చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరించనుండగా ఇతర అధికారులు, ఉద్యోగుల ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ట్రస్ట్ ద్వారా వైద్య సదుపాయం కల్పించనున్నారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి ఏటా సెప్టెంబర్లో శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) సమావేశం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక జిల్లా, రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్వ్యాలిడేషన్ కమిటీ ఏర్పాటు చేయాలన్న మరో కీలక డిమాండ్ను మంత్రివర్గం ఆమోదించింది. జాయింట్ స్టేట్ కౌన్సిల్, అసోసియేషన్లను గుర్తించేందుకు ఒప్పుకుంది. ౖజీవో 317లో ఇంకా కొన్ని కేటగిరీలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ప్రస్తుతం పూర్తిగా సెక్రటరియేట్ సర్వీసెస్ ఉద్యోగులే పనిచేస్తుండగా ఇకపై 12.5 శాతం నాన్ సెక్రటరియేట్ సరీ్వసెస్ కోటాను అమలు చేయాలనే మరో డిమాండ్ను మంత్రివర్గం ఆమోదించింది. పదవీవిరమణ పొందిన ఉద్యోగులను మళ్లీ నియమించరాదనే మరో డిమాండ్ను మంత్రివర్గం ఆమోదించింది. గ్రామ కార్యదర్శి పోస్టులను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల సందర్భంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను సొంత జిల్లాలకు తిరిగి పంపించేందుకు అంగీకరించింది. జిల్లా పరిషత్లో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాల పూర్తితోపాటు నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు డిమాండ్లకు సైతం సమ్మతి తెలిపింది. అంగన్వాడీల పదవీవిరమణ ప్రయోజనాలను రూ. 2 లక్షలకు పెంచింది. ఉద్యోగుల అద్దె వాహనాల పెండింగ్ బిల్లుల చెల్లింపుతోపాటు వాహనాల అద్దెల పెంపునకు ఆమోదం తెలిపింది. మరికొన్ని నిర్ణయాలు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. – స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)కు రూ. 10 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమల్లోకి తెచ్చింది. బీమా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం భారం కాకుండా ప్రభుత్వమే నేరుగా బాధితులకు రూ. 10 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 385 మంది మరణించగా రూ. 38.5 కోట్ల చెల్లింపులకు మంత్రివర్గం ఆమోదించింది. – హైబ్రీడ్ యాన్యూటీ మోడ్ (హామ్) కింద రాష్ట్రంలోని అన్ని (పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ) రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి దశ కింద 7,947 కి.మీ. పంచాయతీరాజ్, 5,190 కి.మీ. ఆర్ అండ్ బీ రోడ్లు కలిపి మొత్తం 13,137 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయనుంది. పంచాయతీరాజ్ రోడ్లకు రూ. 16,780 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్లకు రూ. 16,414 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. వచ్చే రెండున్నరేళ్లలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయనుండగా 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకే ప్రభుత్వం అప్పగించనుంది. పార్లమెంట్ స్థానాన్ని ఒక యూనిట్గా లేదా ఉమ్మడి జిల్లాలవారీగా ఒక్కో జిల్లాను ఒక్కో ప్యాకేజీగా విభజించి రోడ్ల అభివృద్ధి చేయాలని నిర్ణయం. – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ. 19,579 కోట్లతో అంచనాలతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. కారిడార్–1లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కి.మీ., కారిడార్–2లో భాగంగా జూబ్లీ బస్స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కి.మీ., కారిడార్–3లో భాగంగా జూబ్లీ బస్స్టేషన్ నుంచి శామీర్పేట్ వరకు 22 కి.మీ. కలిపి మొత్తం 86.1 కి.మీ. కారిడార్ను నిర్మించనుంది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి పొంగులేటి కోరారు. – రాష్ట్రంలో సన్న ధాన్యం పండించే రైతులకు ప్రోత్సాహాన్ని కొనసాగించాలని.. ప్రజలకు మేలు చేసే కార్యాక్రమాలకు గ్రీన్ చానల్లో చెల్లింపులు జరపాలని నిర్ణయించింది. – ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 12 ఎకరాల కేటాయింపును మంత్రివర్గం ఆమోదించింది. -
రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: గంజాయి కేసులో ఎక్సైజ్ కానిస్టేబుల్ గులం సుల్తాన్ అహ్మద్ను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్ నగర్లో పోలీసులు తనిఖీల్లో గంజాయితో ఓ యువకుడు పట్టుబట్టాడు. అతని వద్ద నుంచి 1.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తనకు గంజాయి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇచ్చినట్టు ఆ యువకుడు తెలిపాడు. ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన గంజాయిని ఆ యువకుడికి సుల్తాన్ ఇచ్చాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సుల్తాన్ అహ్మద్, యువకుడు అంజాద్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్కు తరలించారు. -
Malkajgiri: మిగిలేది మూడే!
మేడ్చల్: హైదరాబాద్ మహనగర విస్తరణలో భాగంగా మేడ్చల్ జిల్లాలో స్థానిక సంస్థలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. మేడ్చల్ జిల్లా దేశంలోనే విభిన్న జిల్లాగా ఉండేది. ప్రస్తుతం మారుతున్న సమీకరణాలతో జిల్లా స్వరూపం మొత్తంగా మారనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ మహానగర విస్తరణ చేయాలనే ఆలోచనలు చేయడంతో హైదరాబాద్కు శివారులో ఉన్న మేడ్చల్–మల్కాజ్గిరిజిల్లా రూపురేఖలు మారుతున్నాయి.3 మినహా.. అంతా జీహెచ్ఎంసీనే.. ప్రభుత్వం మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న మూడు నూతన మున్సిపాలిటీలను నూతనంగా ఏర్పాటు చేసి, 61 గ్రామాల్లో మిగిలిన గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేశాయి. తాజాగా ప్రభుత్వం నూతన మున్సిపాలిటీలలో వార్డుల విభజనపై దృష్టి పెట్టగా.. విలీన గ్రామాలపై ఎలాంటి విభజన చేయడం లేదు. మున్సిపాలిటీలలో గ్రామాలు ఇప్పటికే విలీనంకావడంతో వార్డు సంఖ్య మారాల్సి ఉండగా.. కేవలం మూడు చింతలపల్లి, ఎల్లంపేట, అలియాబాద్లలో మత్రమే వార్డుల విభజన చేస్తున్నారు. మిగతా 7 మున్సిపాలిటీలలో ఎలాంటి వార్డుల విభజన చేయడం లేదు. నూతన మున్సిపాలిటీల్లో మాత్రమే వార్డు కుదింపు చేస్తూ.. మిగతా మున్సిపాలిటీలలో చేయకపోవడంతో 3 మున్సిపాలిటీలు మినహా అన్ని జీహెచ్ఎంసీలో విలీనం అవుతున్నట్లు స్పష్టమౌతుంది.గతంలో అన్ని పాలనలు.. మేడ్చల్ జిల్లా పదేళ్ల క్రితం ఏర్పడిన సమయంలో జిల్లాలో 61 గ్రామపంచాయతీలు, 5 మండల పరిషత్లు, జిల్లా పరిషత్, 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 9మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడం, నూతనంగా 3 మున్సిపాటీలను ఏర్పాటు చేయడంతో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు కనుమరుగయ్యాయి. దీంతో మేడ్చల్ అర్బన్ జిల్లాగా మారిపోయింది. 12 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు.. నియోజకవర్గంలో మేడ్చల్, తూంకుంట, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఎల్లంపేట్, మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలు జవహర్నగర్, బోడుప్పల్, పిర్జాదిగూడ, కార్పొరేషన్లు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలు, నిజాంపేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో 12 మున్సిపాలిటీలు 4 మున్సిపల్ కార్పొరేషన్లు ప్రస్తుతానికి ఉన్నాయి.చదవండి: హైదరాబాద్ కోర్ సిటీలో ఇవి అత్యంత ఇబ్బందికరం..పట్టణాల స్థాయికి.. మేడ్చల్, తూంకుంట, ఘట్కేసర్, మున్సిపాలిటీలు మాత్రమే నగరానికి కొద్ది దూరంగా ఉండగా.. మిగతా మున్సిపాలిటీలు రాజధాని నగరంలో అంతర్భాగంగా ఉన్నాయి. పట్టణ వాతావరణంలోనే ఉన్నాయి. పోచారం, కొంపల్లి, దుండిగల్ గుండ్లపోచంపల్లి, నాగారం, దమ్మాయిగూడ పూర్తిగా పట్టణాలుగా ఉన్నాయి. బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్, జవహర్నగర్లు నగర స్థాయికి ఎప్పుడో వెళ్లిపోయాయి. భవిష్యత్తులో మేడ్చల్ కేవలం అర్బన్ జిల్లాగానే ఉండిపోనుంది. కేవలం రెవెన్యూ మండలాలకే పరిమితం కానుంది. -
పదో తరగతి మూల్యాంకనంపై విచారణకు ఆదేశించాలి: ఆదిమూలపు సురేష్
సాక్షి, హైదరాబాద్: ఏపీలో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై తక్షణం సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ నిర్వాకంపై ఆశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లోకేష్తో సహా బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ప్రభుత్వపరంగా విద్యాసంస్థల్లో ఇచ్చే అడ్మీషన్లను వాయిదా వేయాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో తీవ్రస్థాయిలో తప్పులు జరిగాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిలోకం భగ్గుమంటోంది. అస్తవ్యస్తంగా పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం చేయించారు. విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన పదో తరగతి పరీక్షలను, జవాబు పత్రాల మూల్యాంకనంను లేనిపోని గొప్పలకు పోయి, అడ్డగోలుగా, నిర్లక్ష్యంగా నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఫలితాలను వెలువరిస్తామంటూ చేసిన హడావుడికి ఎందరో విద్యార్దులు నష్టపోయారు.పరీక్షల నిర్వహణ నుంచి మూల్యాంకనం వరకు విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వారం రోజుల్లోనే మూల్యాంకనాన్ని పూర్తి చేయాలంటూ టీచర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రధానంగా సోషల్ స్టడీస్ జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం అయిదు రోజుల్లో పూర్తి చేశారనే విషయం బయటపడింది. ఏప్రిల్ 1న పరీక్షలు పూర్తయితే, ఏప్రిల్ 23న ఫలితాలను వెలువరించారు. అంటే దాదాపు 21 రోజులు తీసుకున్నారు. 2022-23 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం 17 రోజుల్లోనే సమర్థంగా పరీక్షా ఫలితాలను విడుదల చేసింది.కార్పోరేట్ విద్యాంస్థలకు లబ్ధి చేకూర్చడానికే..కూటమి ప్రభుత్వంలోని విద్యాశాఖ కార్పోరేట్ ఇంటర్ కాలేజీలకు కొమ్ము కాయడానికే ఈ హడావుడి చేసింది. జేఇఇ, నీట్ కోర్సులకు ఎక్కువ రోజులు కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనికోసం ముందుగానే పదో తరగతి ఫలితాలను వెలువరించాలనే ఒత్తిడికి విద్యాశాఖ తలొగ్గింది. ముందుగానే విద్యార్ధులను జాయిన్ చేసుకోవడం ద్వారా తమ విద్యా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసుకోవాలని కార్పోరేట్ సంస్థలు భావించాయి. విద్యార్ధుల అడ్మీషన్లతో సొమ్ములు దండుకోవడం కోసం కార్పోరేట్ విద్యా సంస్థల తొందరపాటుకు అనుగుణంగా ఏపీలోని విద్యాశాఖ పనిచేసిందనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకోసం వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడింది. ఇంత జరుగుతున్న విద్యాశాఖా మంత్రి నోరు మెదపడం లేదు.స్వయంగా తన శాఖలోనే ఇంత అవతకవతకలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11వేల మందికి పైగా విద్యార్ధుల ఉత్తీర్ణతా మార్కులు మారాయి. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కోసం దాదాపు 60 వేల మంది దరఖాస్తు చేసుకుంటే, దానిలో 11 వేల మందికి పైగా విద్యార్దుల మార్కుల్లో తేడాలు కనిపించాయి. అంటే 30 శాతం పైచిలుకు జవాబుపత్రాల్లో తేడాలు కనిపించడం ఆందోళనకరం. ఇవి కేవలం దరఖాస్తు చేసుకున్న వారివే అయితే, ఇక దరఖాస్తు చేసుకోని వారు ఎంత మంది ఉంటారు? 20 మార్కులు వచ్చిన వారికి రీవాల్యుయేషన్లో 90 మార్కులు వచ్చాయి. అయిదు సబ్జెక్ట్లో పాస్ అయి, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వారికి రీవాల్యుయేషన్లో అత్యధిక మార్కులు వచ్చాయి. నెల్లూరుజిల్లాకు చెందిన సాయికుందన అనే విద్యార్ధినికి రీవాల్యుయేషన్ కు మందు 30 మార్కులు వస్తే, తరువాత 93 మార్కులు వచ్చాయి. దీనికి విద్యాశాఖ మంత్రి ఏం సమాధానం చెబుతారు? టీచర్లపై చర్యలతో చేతులు దులుపుకుంటున్నారుఈ వ్యవహారానికి టీచర్లను బాధ్యులను చేసి, చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. దీనిపై కనీసం ఒక సమగ్ర విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించకపోవడం దారుణం. ఇటువంటి తప్పుల వల్ల పదోతరగతి విద్యార్ధులు నష్టపోకుండా కోరిన ప్రతి విద్యార్ధి జవాబుపత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలి. దరఖాస్తు చేసుకోని వారికి కూడా గడువును పొడిగించాలి. తుది ఫలితాలు వచ్చే వరకు పాలిటెక్నిక్, రెసిడెన్షియల్, ట్రిపుల్ ఐటీల అడ్మిషన్లను వాయిదా వేయాలి. దీనికి బాధ్యులైన విద్యాశాఖ మంత్రితో సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలి. రీవెరిఫికేషన్, రీ వాల్యుయేషన్ ఫీజ్ను విద్యార్ధులకు రీఫండ్ చేయాలి.ఈ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నిస్తుంటే, విద్యాశాఖ మంత్రి ఈ సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుల తడకగా ఉన్న ఒక నోట్ను జారీ చేశాడు. పరీక్షల నిర్వహణ సరిగా లేదని నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. మార్చి 7వ తేదీన పరీక్షకు అరగంటకు ముందు ప్రశ్నాపత్రం లీకయ్యిందని నాగార్జన యూనివర్సిటీ అధికారులు గుర్తించి, అదే పరీక్షను మార్చి 12వ తేదీన తిరిగి నిర్వహించారు. ఇది మీశాఖ అసమర్థత కాదా?మేం తెచ్చిన సంస్కరణలను నీరుగారుస్తున్నారు..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యారంగంలో అనే సంస్కరణలను తీసుకువచ్చాం. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, బైజూస్ ట్యాబ్లు, టోఫెల్ శిక్షణ ఇలా అనే కార్యక్రమాలను కక్షకట్టి నీరుగార్చారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ఐబీ గురించి నేడు ఎల్లో మీడియాలో వ్యంగ్యంగా ప్రకటనలు చేస్తున్నారు. ఐబీ అమలు రిపోర్ట్ కోసం అయిదు కోట్లు ఖర్చు పెట్టారు, ఐబీని తీసుకువచ్చినట్లు కలలు కంటున్నారని మాట్లాడుతున్నారు. పలు ఇంగ్లీష్ జాతీయ పత్రికల్లో ఏపీ ప్రభుత్వం స్విట్జర్ల్యాండ్ ఇంటర్నేషనల్ బ్యాకలరీయేట్ ఆర్గనైజేషన్తో ఎంఓయు చేసుకుందనే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించిన విషయం వాస్తవం కాదా?దానికి సంబంధించి ఆనాడు పలు జాతీయ దినపత్రికలు ప్రచురించిన వార్తలను కూడా మీ ముందు ఉంచుతున్నాం. దీని గురించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అవగాహన లేదు. ఐబీ సిలబస్ ద్వారా విద్యార్ధుల విద్య, వ్యక్తిగత, సామాజిక నైపుణ్యాలను పెంపొందించవచ్చనే విషయం వారికి తెలియదు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఐబీ కరిక్యులమ్ ఉపయోగపడుతుంది. వైఎస్ జగన్ ప్రపంచ స్థాయిలో ఏపీ విద్యార్ధులు రాణించాలనే మంచి ఉద్దేశంతో ఈ కరిక్యులమ్ను ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురావాలనే గొప్ప ఆలోచనతో ముందుడుగు వేశారు.దీని కోసం 2024-25లో ఉపాధ్యాయుల సామర్థ్యం, నైపుణ్యం పెంచే కార్యక్రమం, 2025-26లో ఒకటో తరగతి నుంచి విద్యార్ధులకు ఐబీ కరిక్యులమ్ అమలు చేస్తూ ప్రతి విద్యా సంవత్సరంలో ఒక్క తరగతి చొప్పున దానిని వర్తింప చేస్తూ పోవాలని ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి పన్నెండో తరగతికి ఐబీ కరిక్యులమ్ను అమలు చేయడంను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలోని 150 దేశాల్లోని 5000 స్కూళ్ళలో ఈ సిలబస్ను అమలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ కరిక్యులమ్ అమలు లేదు. ఇలా గొప్ప విప్లవాత్మక మార్పులను మేం తీసుకువస్తే, నేడు కూటమి పార్టీలు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు తీవ్ర అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు(గురువారం) తీవ్ర అస్వస్థతకు గురైన మాగంటి గోపీనాథ్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు ఏఐజీ ఆస్పత్రికి చేరుకుని మాగంటి గోపీనాథ్ను పరామర్శించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు.. హుటాహుటీనా ఆస్పత్రికి చేరుకుని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం గోపీనాథ్కు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.నిలకడగానే ఆరోగ్యం: దాసోజు శ్రవణ్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పై గోపీనాథ్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారన్నారు. 48 గంటలు గడిస్తే గానీ గోపీనాథ్ ఆరోగ్యంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు శ్రవణ్. -
మంత్రి కొండా సురేఖకు అస్వస్థత
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ అస్వస్థత గురయ్యారు. తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముందు కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెక్రటరియేట్లోని కేబినెట్ హాలులో ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్రటరియేట్ సిబ్బంది.. వెంటనే పరిశీలించి వైద్యం అందించారు. అయితే ఆమె లోబీపీ వల్ల పడిపోయినట్లు నిర్దారించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఈరోజు(గురువారం) మధ్యాహ్న ప్రాంతంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలపై చర్చతో పాటు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై సమీక్షించనున్నారు. కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఏ నివేదికపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చతో పాటు.. వేములవాడలో కోడెలు మృతిపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. -
తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేబినెట్ సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. వర్షాకాలం నేపథ్యంలో జూన్ -జులై లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏ మేరకు సురక్షితం అన్నదానిపై కేబినెట్ చర్చించింది.ఇప్పటికే ఆలస్యం అయిందని.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కొందరు మంత్రులు కోరగా, వర్షాకాలం నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని మరి కొందరు మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళా సంఘాల బీమా నిధుల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. -
Hyderabad: సూట్కేసులో యువతి మృతదేహం
నిజాంపేట్: ఓ యువతిని హత్య చేసి సూట్కేసులో తీసుకువచ్చి బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో పడేసిన సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బుధవారం బాచుపల్లిలోని జీతేపీర్ దర్గా ఎదురుగా ఉన్న జీపీఆర్ లే అవుట్ విజయదుర్గ ఓనర్స్ అసోషియేషన్ కాలనీలో పొదల మధ్యలో ఓ సూట్కేసు నుంచి గత రెండు రోజుల నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాచుపల్లి ఇన్స్పెక్టర్ ఉపేందర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అందులో యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తుపట్టలేని విధంగా ఉంది. బాలానగర్ డీసీపీ సురేశ్కుమార్, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఐదు నుంచి పది రోజుల క్రితం ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తే కీలకం.. యువతి హత్య పోలీసులకు సవాల్గా మారింది. ఎక్కడో చంపేసి సూట్కేసులో మృతదేహాన్ని తీసుకువచ్చి ఇక్కడ పడేయడం, అందులో మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో పోలీసులకు దర్యాప్తు కీలకంగా మారింది. రంగంలోకి ఐదు పోలీసు బృందాలను దింపి సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. అదే విధంగా వివిధ పోలీస్స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన వారి వివరాలతో పోల్చి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడి నుంచి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాజులు, డ్రెస్లే ఆధారాలు.... మృతి చెందిన యువతి ఒంటిపై ఉన్న గాజులు, డ్రెస్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భార్యా భర్తల గొడవల కారణంగా ఏమైనా ఈ హత్య జరిగిందా? లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఒంటిపై మెరున్ కలర్ పంజాబీ డ్రెస్ ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళనా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తతో విడాకులు.. సింగర్కు క్యాబ్ డ్రైవర్ వేధింపులు!
హైదరాబాద్: భర్తతో విడాకులు తీసుకున్న ఓ ఫిమేల్ సింగర్ను క్యాబ్ డ్రైవర్ వేధింపులకు గురిచేశాడు. అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసి కుటుంబ సభ్యులకు పంపుతానని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళితే..బేగంపేట ప్రకాష్నగర్కు చెందిన గాయనికి 2012లో వివాహం జరగ్గా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా 2024లో విడాకులు తీసుకుంది. అయితే సింగర్ విడాకులు తీసుకున్న విషయం తెలుసుకున్న బల్కంపేటకు చెందిన క్యాబ్ డ్రైవర్ ఉమామహేష్ గతంలో 2006లో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను ఆమెకు పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
RCB: హైదరాబాద్లో తప్పిన ముప్పు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం సన్మానం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కొందరు చనిపోగా, అనేక మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోనూ ఇలాంటి ముప్పు తప్పింది. బుధవారం రాత్రి ఆర్సీబీ (RCB) జట్టు ఐపీఎల్ కప్పు గెలిచిన వెంటనే ట్యాంక్బండ్, తెలుగు తల్లి చౌరస్తా, అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్లతో పాటు అనేక ప్రాంతాలు క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. ద్విచక్ర వాహనాలపై ఫీట్లు చేస్తూ యువకులు కేరింతలు కొట్టారు. రహదారులపై పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు.ఎన్డీఆర్ మార్గ్, సచివాలయం, తెలుగుతల్లి చౌరస్తా ప్రాంతాల్లో కొందరు రెచ్చిపోయారు. అక్కడ ఆగిన వాహనాల పైకి ఎక్కి హంగామా చేశారు. ద్విచక్ర వాహనాల హారన్లు మోగిస్తూ, మితిమీరిన వేగంతో నడిపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు (Police) వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఉన్నతాధికారులు అదనపు బలగాలను ఆ ప్రాంతాలకు పంపారు. వీళ్లు అక్కడ ఉన్న యువకుల్ని చెదరగొట్టి పరిస్థితుల్ని చక్కదిద్దారు. చదవండి: ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా -
ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యతని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి సమస్యకూ తప్పకుండా పరిష్కారం కనుగొంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆయన అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తదితరులు ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై అందరితో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారని.. ఇందులో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ‘కొన్నేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో అన్నీ ఒకేసారి చేయలేకపోయాం. ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలనేదే ప్రభుత్వ ఆలోచన’అని భట్టి ఉద్యోగ సంఘాలకు వివరించారు. గత ప్రభుత్వ పాలనతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని.. అయినా ఉద్యోగులకు సాధ్యమైన మేర మేలు చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టామని భట్టి చెప్పారు. ఇప్పటికే ప్రతినెలా మొదటి తారీఖున జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థికపరమైన కసరత్తు చేస్తున్నామని.. ప్రభుత్వ ఆదాయం.. ఖర్చు, చేయాల్సిన పనులను బేరీజు వేసుకుంటూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం ముందుకు వెళ్తున్నారని భట్టి వివరించారు. ఉద్యోగుల కుటుంబాల్లో పెళ్లిళ్లు, ఆసుపత్రుల ఖర్చులకు సంబంధించిన సమస్యలపై ఇప్పటికే కేబినెట్ సహచరులం అంతర్గతంగా పలుమార్లు చర్చించుకున్నామని.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న అంశంపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదన్నారు. గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో త్రిసభ్య కమిటీ నివేదిక, ఆర్థిక శాఖ, ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదిక రూపొందించి నివేదిక ఇస్తామన్నారు. ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్, సభ్యులు లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. ఇంకా జాప్యమే!
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ ఇంకా విడుదల కాని కారణంగా ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. మే 11వ తేదీనే సెట్ ఫలితాలు విడుదల చేశారు. సాధారణంగా ఈఏపీసెట్ ఫలితాలు విడుదలైన వెంటనే షెడ్యూల్ ప్రకటిస్తారు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ముందే కౌన్సెలింగ్ చేపడతామని, క్లాసులు కూడా త్వరగా ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి ఆరునెలల క్రితమే చెప్పింది. కానీ సెట్ ఫలితాలు విడుదలై నెల కావొస్తున్నా ఇంతవరకూ కౌన్సెలింగ్పై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జాప్యానికి వారు అనేక కారణాలు చెబుతున్నారు. ఈ నెల రెండో వారం వరకూ షెడ్యూల్ మాత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రానురాను ప్రక్రియ ఆలస్యమవుతున్న కారణంగా ఇంజనీరింగ్లో చేరాలనుకునే విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు యాజమాన్య కోటాలో చేరాలనుకునే వారు ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ఏఐసీటీఈనే కారణమా? కాలేజీల్లో సీట్లు, బ్రాంచ్లకు సంబంధించి ప్రతీ కాలేజీకి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి అవసరం. ఏటా ఏప్రిల్ నెలాఖరు, లేదా మే మొదటివారంలోనే ఈ గుర్తింపు ఇస్తుంది. తమతో సంప్రదించిన తర్వాతే సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని అన్ని రాష్ట్రాలూ ఏఐసీటీఈకి లేఖలు రాశాయి. అనుమతి ఇచ్చినా, రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాలు కొత్త సీట్లు, బ్రాంచ్కు అనుబంధ గుర్తింపు నిరాకరిస్తున్నాయి. ఇది న్యాయ వివాదానికీ కారణమవుతోంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని ఈసారి ఏఐసీటీఈ ఆచితూచి అడుగులేస్తోంది. ఈ కారణంగానే అనుమతి ఇవ్వడానికి ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 13లోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఏఐసీటీఈ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఉంటాయనే దానిపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. గత ఏడాది దాదాపు 12 వేల సీట్ల పెంపునకు కాలేజీలు ముందుకొచ్చాయి. 3 వేల సీట్లు పెంచినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. ఖరారు కాని ఫీజులు ఇంజనీరింగ్ ఫీజులు ఖరారవ్వకపోవడమూ కౌన్సెలింగ్కు అడ్డంకిగా మారింది. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ప్రతీ మూడేళ్లకోసారి ఇంజనీరింగ్ ఫీజులను సమీక్షిస్తుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది. ప్రైవేట్ కాలేజీలు సమర్పించిన గడిచిన మూడేళ్ల వార్షిక నివేదికలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. కాలేజీలు కృత్రిమంగా జమా ఖర్చుల నివేదికలు ఇచ్చాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి తెలిపింది. సర్కార్ నుంచి ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. కౌన్సెలింగ్ చేపట్టే సమయంలో ఏ కాలేజీలో ఎంత ఫీజు అనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజులపై స్పష్టత లేని కారణంగా కౌన్సెలింగ్ సాఫ్ట్వేర్లో వివరాలు ఫీడ్ చేయలేమని అధికారులు అంటున్నారు. ముందుకు సాగని అనుబంధ గుర్తింపు కౌన్సెలింగ్ నాటికి వర్సిటీలు సీట్లు, బ్రాంచ్లు ఖరారు చేసి, అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఈ జాబితాను సాంకేతిక విధ్యావిభాగానికి పంపాలి. వీటి ఆధారంగానే సాఫ్ట్వేర్ రూపొందిస్తారు. విద్యార్థులు కన్వీనర్ కోటాకు ఆప్షన్లు ఇవ్వడానికి వీలుంటుంది. ఇప్పటికే కాలేజీల తనిఖీలు పూర్తి చేసిన జేఎన్టీయూహెచ్.. కొన్నింటిపై అభ్యంతరాలు లేవనెత్తింది. ల్యాబ్లు, ఫ్యాకల్టీ సరిగా లేదని పేర్కొంది. వీటిని సరిచేసుకునేందుకు గడువు కూడా ఇచ్చింది. మరోవైపు కొత్త సీట్ల పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఇవన్నీ అఫ్లియేషన్ల ప్రక్రియను ముందుకు కదలనివ్వడం లేదు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు పెట్టింది. అయినా రాష్ట్ర కౌన్సెలింగ్ ముందుకు కదిలేట్టు లేదు. ప్రైవేట్ కాలేజీల హడావిడి రాష్ట్ర కౌన్సెలింగ్ ఆలస్యమవ్వడం, విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో సీట్లపై ఆరా తీయడంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో గుబులు మొదలైంది. దాదాపు 35 వేల సీట్లు యాజమాన్య కోటా కింద భర్తీ అవుతాయి. కన్వీనర్ సీట్ల భర్తీ తర్వాతే మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ చేయాలి. దీంతో కాలేజీలు ముందే సీట్ల రిజర్వేషన్పై ఆరాట పడుతున్నాయి. పీఆర్వోలు, కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని సీట్లు అనధికారికంగా భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
మొబైల్ మహారాణులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం స్మార్ట్గా దూసుకెళుతోంది. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువగా ఉందని కాంప్రహెన్సివ్ మాడ్యులార్ సర్వే– టెలికం 2025లో వెల్లడైంది. కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ ఈ ఏడాదే ఈ సర్వే నిర్వహించింది. ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు, యూపీఐల ద్వారా నగదు చెల్లింపులు తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతున్నాయని సర్వేలో తేలింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రాష్ట్రంలో పురుషులకంటే మహిళలే మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారు. సొంతంగా మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నవారిలో కూడా మహిళలే ముందుండటం విశేషం. సర్వేలోని ముఖ్యాంశాలు.. » ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 2,395 గ్రామీణ, 1,987 పట్టణ ప్రాంతాల్లో 34,950 కుటుంబాల్లోని 1,42,065 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. » 15–29 ఏళ్ల మధ్య వయసు్కల్లో 97.1 శాతం మంది సర్వే జరిపిన రోజు కంటే ముందు మూడు నెలల కాలంలో మొబైల్ ఫోన్ వినియోగించారు. ఇందులో 98 శాతం మంది పురుషులు, 96 శాతం మంది మహిళలు ఉన్నారు. 2022–23లో 96.4 శాతం మంది పురుషులు, 91.8 శాతం మంది మహిళలు మొబైల్ ఫోన్ వాడినట్టు వెల్లడైంది. » తెలంగాణలో 98.3 శాతం మంది పురుషులు, 98.6 శాతం మంది మహిళలు మొబైల్ ఫోన్ వాడుతున్నారని తేలింది. రాష్ట్ర సగటు 98.4 శాతంగా నమోదైంది. మిజోరం, అండమాన్ నికోబార్, చండీగఢ్, లక్షద్వీప్లో 100 శాతం మంది మొబైళ్లు వాడుతున్నారు. అయితే, వాడుతున్న వారితో పోలిస్తే సొంతంగా మొబైల్ ఫోన్ ఉన్న వారి సంఖ్య తగ్గింది. తెలంగాణలో 87.7 శాతం మంది పురుషులు, 78.3 శాతం మంది మహిళలకు సొంతంగా ఫోన్లు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. » దేశవ్యాప్తంగా 70 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. తెలంగాణలో 72.2 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇందులో 79.9 శాతం మంది పురుషులు, 64.9 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇంటర్నెట్ వినియోగంలో దేశంలో చండీగఢ్ (94.6 శాతం), మిజోరం (92.7 శాతం)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. » తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 51.9%, పట్టణ ప్రాంతాల్లో 77.3 శాతం మంది ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. అంటే సగటున 63.5 శాతం మంది ఆన్లైన్ బ్యాంకింగ్ వాడుతున్నారు. ఇందులో దేశసగటు 48.9 మాత్రమే ఉంది. » తెలంగాణలో 26.4% (18.9 శాతం మంది గ్రామీణ, 32.3 శాతం పట్టణ) మంది యూపీ ఐల ద్వారా నగదు చెల్లింపులుజరుపుతుండగా, దేశవ్యాప్తంగా ఇది18 శాతం ఉంది. -
కొత్త రేషన్ కార్డుల దందా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల దందా బాహాటంగా కొనసాగుతోంది. సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుండడంతో పేదలు పెద్ద ఎత్తున మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెల్ల రేషన్కార్డు (ఆహార భద్రత)తో ముడిపడి ఉండడంతో ప్రాధాన్యం పెరిగినట్లయింది. దీంతో పేద కుటుంబాలు మీ సేవ కేంద్రాలను ఆశ్రయించి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థా విచారణ మాత్రం ముందు సాగడం లేదు. దరఖాస్తుదారుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, ఆపరేటర్లు దళారులుగా అవతారమెత్తి కనీసం కొంత ఖర్చు (రూ.3000 నుంచి 5,000 వరకు) భరించేందుకు సిద్ధమైతే పక్షం రోజుల్లో క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేయించి కార్డు చేతిలో పెడతామని పేదలను నమ్మిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌర సరఫరాల సిబ్బంది సైతం మధ్యవర్తుల ద్వారా వ చ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించి రేషన్ కార్డుకు అర్హులుగా సిఫార్సులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిఫార్సులు లేని దరఖాస్తులు పెండింగ్లో పెట్టడం గమనార్హం. 2.66 లక్షలకుపైగా దరఖాస్తులు గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో రెండు నెలలుగా కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా సుమారు 2.66 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పదేళ్లలో పెద్దగా రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో కొత్త కార్డుల కోసం తాకిడి పెరిగినట్లయింది. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన కోడళ్లు, కొత్తగా జన్మించిన పిల్లలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న మొత్తం దరఖాస్తుల్లో ఇప్పటి వరకు క్షేత్రస్థాయి విచారణ పూర్తయి పదిశాతం మించి కార్డులు కూడా మంజూరుకు నోచుకోనట్లు తెలుస్తోంది. మెజార్టీ దరఖాస్తులు పెండింగ్లో మగ్గుతుండగా, సిఫార్సు దరఖాస్తులు మాత్రం స్పీడ్గా విచారణకు నోచుకొని మంజూరు అవుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తుల పరిస్థితి సైతం.. ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల ఆధారంగా సర్వేలో విచారణ పూర్తయిన వాటికి కూడా మధ్యవర్తుల సిఫార్సులు లేకుండా మోక్షం లభించడం లేదు. విచారణ పూర్తయిన దరఖాస్తులకు సిఫార్సు ఉంటే మాత్రం కార్డులు ఠంచన్గా మంజూరవుతున్న సంఘటనలు అనేకం. మిగితావి పెండింగ్లో మగ్గుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో నిర్వహించిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 5.73 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. సమగ్ర సర్వే ద్వారా మొత్తం 22 లక్షల కుటుంబాల వివరాలు సేకరించారు. అందులో రేషన్ కార్డులు లేని సుమారు 83 వేల కుటుంబాలను గుర్తించారు. వాటిపై నిబంధల ప్రకారం విచారణ నిర్వహించి 70 శాతం కుటుంబాలుగా అర్హులు అని తేల్చారు. పారదర్శకత కోసం వార్డు సభల్లో లబ్దిదారుల జాబితాను ప్రకటించిన తర్వాతే కార్డుల మంజూరుకు సిఫార్సు చేయాలని జీహెచ్ఎంసీ భావించినప్పటికీ.. తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వార్డు సభలు వాయిదా పడి ప్రక్రియ ముందుకు సాగలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో లేని శివారు ప్రాంతాల దరఖాస్తుదారుల్లో అర్హుల జాబితా ప్రకటించారు. వాటి మంజూరుకు కూడా మధ్యవర్తుల సిఫార్సు తప్పడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. -
రూ. 2.2 కోట్లు కొట్టేసారు!
సాక్షి, సిటీబ్యూరో: ఉగ్రవాద సంబంధిత కేసు పేరుతో నగరానికి చెందిన విశ్రాంత వైద్యురాలిని ఫోన్లో బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి రూ.2.2 కోట్లు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీకి చెందిన వైద్యురాలికి గత నెల 27న ఫోన్కాల్ వచ్చిoది. లక్నో నుంచి మాట్లాడుతున్న ఐపీఎస్ అధికారి ప్రేమ్ కుమార్గా అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తమ పరిధిలో నమోదైన ఉగ్రవాద సంబంధ మనీలాండరింగ్ కేసులో వైద్యురాలి ప్రమేయం వెలుగులోకి వచ్చినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఆ కేసులో నిందితురాలిగా చేరుస్తున్నామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆమె ఈ షాక్ నుంచి కోలుకోకముందే వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. అప్పుడు మాట్లాడిన సైబర్ నేరగాడు తాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ సదానంద్ అంటూ పరిచయం చేసుకున్నాడు. తాము కొందరు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశామని, వారి నుంచి స్వాదీనం చేసుకున్న వాటిలో ఏటీఎం కార్డులతో పాటు కొన్ని ఫొటోలు ఉన్నాయని చెప్పాడు. ఆ ఫొటోల్లో 17 ఆర్మీ అధికారులవి అయితే.. ఒకటి మాత్రం సదరు వైద్యురాలిదని పేర్కొన్నాడు. ఇది ఉగ్రవాద సంబంధిత కేసు కావడంతో విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాలని స్పష్టం చేశాడు. వెరిఫికేషన్ చేయాలంటూ.. ఏటీఎం కార్డుల్లో కొన్ని మీ పేరుతో తెరిచిన ఖాతాలతో లింకై ఉన్నాయని, వాటి ద్వారా పెద్ద ఎత్తున జరిగిన మనీలాండరింగ్తో ఉగ్రవాదులకు నిధులు అందాయని భయపెట్టాడు. తాను ఏ తప్పు చేయలేదని, ఆ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఉగ్రవాదులతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలు ఎన్ఐఏ డైరెక్టర్గా చెప్పుకున్న వ్యక్తితో వాపోయారు. ఆ విషయం ఖరారు కావాలంటూ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందని, దీనికోసం తాము చెప్పిన ఖాతాల్లోకి నిర్ణీత మొత్తం బదిలీ చేయాలని సూచించాడు. ఈ నగదు పూర్తిగా రిఫండబుల్ అని చెప్పిన కేటుగాడు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తిరిగి బదిలీ చేసేస్తామని చెప్పాడు. ఆమెను పూర్తిగా నమ్మించడానికి ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు జడ్జ్ పేరుతో నకిలీ లేఖ కూడా సృష్టించి పంపారు. దీంతో నేరగాళ్ల వలలో పడిపోయిన వైద్యురాలు గత నెల 29 నుంచి 31వ తేదీ మధ్య వారు సూచించిన ఖాతాల్లోకి ఏకంగా రూ.2.2 కోట్లు బదిలీ చేశారు. తన బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తంతో పాటు ఫిక్సిడ్ డిపాజిట్లు విత్డ్రా చేసి, తెలిసిన వారి నుంచి కొంత తీసుకుని ఇలా బదిలీ చేశారు. ఆ మొత్తం రిఫండ్ రాకçపోవడంతో పాటు వారి ఫోన్ నెంబర్లు పని చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బా«ధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నేరగాళ్లు వాడిన ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్కాలనీ: ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో కలుషితాహారం తిని ఒకరు మృతి చెందడంతోపాటు 92 మంది అస్వస్థతకు గురైన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ఉదయం ఆసుపత్రిని సందర్శించారు. సంఘటనకు గల కారణాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనితను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన రోగులను పరామర్శించిన ఆయన, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కాగా, ఆసుపత్రికి కలుషిత ఆహార పదార్థాలను సరఫరా చేసిన డైట్ కాంట్రాక్టర్ జైపాల్రెడ్డిని తొలగించాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. అస్వస్థతకు గురైన వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అధికారులు అస్వస్థతకు గురైన వారిలో 18 మందిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉస్మానియాలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఈ నెల రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అందించిన ఒక స్వీట్ వల్లే ఇది జరిగిందని వైద్య సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఇతర ఆహార పదార్థాలతోపాటు వాటి శాంపిల్స్ కూడా పరీక్షలకు పంపించామని మంత్రి తెలిపారు. పరీక్షల అనంతరం వచ్చిన నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నిజనిర్ధారణకోసం డీఎంఈతో కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే బోరబండ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రిలో ఇలాంటి సంఘటన జరగడం, ఓ రోగి చనిపోవడం బాధాకరమని ఎంపీ అనిల్కుమార్యాదవ్ అన్నారు. మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కలుషిత ఆహారం వల్లే ఘటన.. రోగుల అస్వస్థతకు ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. డీఎంఈ డాక్టర్ రాజేంద్రకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనితలు విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మజను ఆ విధులనుంచి తప్పించి.. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే ఆమె స్థానంలో ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ బి.శంకర్కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది. -
యూరియాపై చేతులెత్తేసినట్టేనా..?
సాక్షి, హైదరాబాద్: యూరియా కోసం అన్నదాతలు దుకాణాల ముందు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. వానకాలం సీజన్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యూరియాను సరఫరా చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వమే ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో రైతులు దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో యూరియా కేటాయింపులు పెంచాలన్న రాష్ట్ర విజ్ఞప్తిని పట్టించుకోని కేంద్రం.. గత సీజన్లో మాదిరిగానే 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది. ఈ మేరకు నెలవారీ సరఫరా ప్రణాళికను రాష్ట్రానికి పంపించింది. దాని ప్రకారం ఏప్రిల్ నుంచే కోటాను పంపించాలి. గత సంవత్సరం సీజన్ ప్రారంభానికి ముందే 5 లక్షల టన్నుల యూరియాను పంపింది. అదే తరహాలో ఈ ఏడాది కూడా సీజన్ ఆరంభానికి ముందే 5 ఎల్ఎంటీ యూరియాను నిల్వ ఉంచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన ప్రయత్నం ఫలించలేదు. జూన్ నాటికి రాష్ట్రానికి 5 ఎల్ఎంటీ యూరియా రావాల్సి ఉండగా, ఇప్పటివరకు వచ్చింది 2.19 ఎల్ఎంటీ మాత్రమే. మే, జూన్ నెలల్లో 3.70 ఎల్ఎంటీ రావాలి. కానీ, 1.14 ఎల్ఎంటీ కోత పడుతోందని అధికారులు తెలిపారు. మంత్రి లేఖ రాసినా స్పందన కరువు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశంతో రాష్ట్రంలో యూరియా కొరతపై గత నెల 19న వ్యవసాయశాఖ అదనపు సంచాలకుడు విజయ్కుమార్ ఢిల్లీకి వెళ్లి ఉన్నతాధికారులతో చర్చించారు. జూన్లో కంపెనీలవారీ కేటాయింపులు జరిగే సమయంలో మే 26న మరోసారి ఢిల్లీకి వెళ్లి చర్చలు జరిపారు. గత రెండు నెలల కేటాయింపులలో ఎక్కువభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా ఉండటం, అది సరైన సమయానికి రాకపోవడంతో సమస్య తలెత్తుతోంది. దీంతో జూన్ కోటాలో అయినా స్వదేశీ యూరియా సరఫరా చేయాలని మంత్రి తుమ్మల లేఖల ద్వారా కేంద్రాన్ని కోరారు. కేంద్రం జూన్లో కేటాయించిన 1.70 ఎల్ఎంటీలో 67 శాతం ఇంపోర్టెడ్ యూరియానే కేటాయించింది. గత రెండు నెలల కేటాయింపులలో తక్కువగా సరఫరా చేసిన 1.14 ఎల్ఎంటీపై కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రెండుమూడు రోజుల్లో వ్యవసాయ శాఖ డైరెక్టర్ను ఢిల్లీకి పంపిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావటంతో జూన్ వరకు కేటాయించిన మొత్తాన్ని నిర్ణీత సమయంలో సరఫరా చేయాలని కేంద్రానికి తుమ్మల మూడోసారి లేఖ రాశారు. ఆర్ఎఫ్సీఎల్లో నిలిచిన ఉత్పత్తిరామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో వార్షిక మరమ్మతుల కారణంగా మే 6 నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది. హీట్ ట్రాన్స్ఫర్ రిఫార్మర్, అమ్మోనియా పైప్లైన్లు, ఇతర యంత్రాల నిర్వహణ కోసం ఈ రిపేర్లు చేపట్టారు. జూన్ రెండో వారంలో ఉత్పత్తి పున:ప్రారంభమయ్యే అవకాశం ఉంది.గత ఏడాది ఆర్ఎఫ్సీఎల్లో 11.94 ఎల్ఎంటీ యూరియా ఉత్పత్తి అయితే, రాష్ట్రానికి 4.68 ఎల్ఎంటీ సరఫరా చేసింది. మిగతాది నేషనల్ పూల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసింది. ఈసారి ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి అయ్యే యూరియాను ఎక్కువగా తమకే ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ ఇంకా స్పందన రాలేదు. -
ఉత్పత్తికి ముందే మండుతున్న 'ఇథనాల్'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్ల ఏర్పాటుపై ప్రజల నిరసన జ్వాలలు చల్లారడం లేదు. గతంలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజలు తిరగబడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేసింది. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలోనూ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను అడ్డుకునేందుకు స్థానికులు దాడులకు దిగారు. ఇథనాల్ ఫ్యాక్టరీల ద్వారా వాయు, జల కాలుష్యం ఏర్పడి తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నారాయణపేట జిల్లా చిత్తనూరులోనూ ఇథనాల్ యూనిట్ ఏర్పాటుపై నిరసనలు వ్యక్తమైనా, నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించింది. నారాయణపేట జిల్లా హిందూపూర్, జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న ప్రైవేటు సంస్థలు.. ప్రజల నిరసనల నేపథ్యంలో పనులు చేపట్టేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ లక్ష్యం 43 కోట్ల లీటర్లు విదేశాల నుంచి శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో ‘నేషనల్ బయో ఫ్యూయల్ పాలసీ’ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా ‘ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్’కింద 2025–26 నాటికి మొలాసిస్ లేదా ధాన్యం నుంచి 1,080 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించింది. తెలంగాణకు 43 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ లెక్కన తెలంగాణలో రోజుకు 5,256 కిలో లీటర్ల (కేఎల్పీడీ) ఇథనాల్ ఉత్పత్తి కావాలి. ఇథనాల్ తయారీ యూనిట్లు ఏర్పాటుచేసే సంస్థలకు ‘ఇథనాల్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్’కింద కేంద్రం వడ్డీలో రాయితీ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో 31 సంస్థలు ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాగా, 2018–2022 మధ్య 28 సంస్థలకు అనుమతులు వచ్చాయి. అయితే, అనుమతి పొందిన సంస్థల్లో ఎన్ని నిర్మాణ పనులు ప్రారంభించాయనే సమాచారం తమ వద్ద లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. గతంలో ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం (ఐడీఆర్ యాక్ట్) ప్రకారం ఇథనాల్ తయారీ కేంద్ర జాబితాలో చేరింది. దీనిని గతంలో 16 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆమోదించినా తెలంగాణ, ఆంధప్రదేశ్ దూరంగా ఉన్నాయి. అయితే, ఇథనాల్ తయారీని ఉమ్మడి జాబితాలో చేర్చి రాష్ట్రాలకు పర్యవేక్షక బాధ్యత అప్పగించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. అయినా రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్ల అనుమతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. లైసెన్స్, రవాణా, మార్కెటింగ్, భూ కేటాయింపులు వంటి అంశాలతో తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ధాన్యం ఆధారిత ఇథనాల్పైనే వ్యతిరేకత రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమలు చెరకును గానుగ అడించడం ద్వారా వచ్చే మొలాసిస్తో ఇథనాల్ తయారు చేస్తున్నాయి. గాయత్రి (45 కేఎల్పీడీ), గణపతి (30 కేఎల్పీడీ), మధుకాన్ (60 కేఎల్పీడీ), కృష్ణవేణి (120 కేఎల్పీడీ) ఇథనాల్ను తయారు చేస్తున్నాయి. చెరకు ఫ్యాక్టరీకి రాని సీజన్లో ధాన్యం ఆధారిత మొలాసిస్ ద్వారా కూడా ఈ ఫ్యాక్టరీల్లో ఇథనాల్ తయారు అవుతోంది. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ కింద ఏర్పాటయ్యే యూనిట్లు వరి, మొక్కజొన్న, జొన్న తదితర ధాన్యాల నుంచి మొలాసిస్ను తయారు చేసే ప్రక్రియలో నీటి వినియోగం, దుర్వాసన, కాలుష్య వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రకమైన పరిశ్రమలపైనే స్థానికుల్లో వ్యతిరేకత వస్తోంది. ప్రజలకు సరైన అవగాహన లేనందునే వ్యతిరేకత వస్తోందని పారిశ్రామికవర్గాలు చెప్తున్నాయి. అనుమతులు రద్దు చేయాలి పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల వెనుక అధికార పార్టీ అండదండలున్నాయి. రైతుల ఆవేదనను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలి. రైతులపై పోలీసు కేసులు, అరెస్టులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – డాక్టర్ ఆంజనేయగౌడ్, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ 12 గ్రామాలకు ఇబ్బంది పచ్చని పంట పొలాల నడుమ కాలుష్య చిచ్చును పెట్లే ఫ్యాక్టరీ వద్దంటున్నా పనులు చేపడుతున్నారు. గతంలో అధికారులకు ఎన్నోమార్లు వినతులు ఇవ్వడంతో పాటు నెలల తరబడి ఆందోళన చేస్తున్నాం. 12 గ్రామాల ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఫ్యాక్టరీ నిర్మించాలనే ప్రతిపాదన విరమించుకోవాలి. – విజయ్కుమార్, రాజోళి, గద్వాల జిల్లా -
పార్టీ పరిశీలకులు గ్రామాలకు వెళ్లాలి
సాక్షి, హైదరాబాద్: పార్టీ పరిశీలకులుగా నియమితులైన నేతలందరూ గ్రామాలకు వెళ్లాలని, కార్యకర్తలకు భరోసా కల్పించే దిశలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. బుధవారం గాం«దీభవన్లో ఆమె ‘జై భీమ్.. జై బాపూ.. జై సంవిధాన్’కార్యక్రమ సమన్వయకర్తలు, పీసీసీ పరిశీలకులతో సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పరిశీలకులతో భేటీ తర్వాత ఆమె వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం గురించి ఆమె.. నేతలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో పరిశీలకులు బాధ్యతగా పనిచేయాలని, మండల కమిటీలను ఎంపిక చేసే ప్రక్రియను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి మండలంలోని 5 గ్రామాలను యూనిట్గా చేసి కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రతి యూనిట్కు ఒకరు చొప్పున మండల కమిటీలోకి తీసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల్లో నామినేటెడ్ పోస్టులకు అర్హులెవరన్న దానిని గుర్తించాలని సూచించారు. జై బాపూ, జై భీమ్.. కార్యక్రమం తెలంగాణలో బాగా జరుగుతోందని, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని చెప్పిన ఆమె, సమన్వయకర్తలకు రాహుల్ గాంధీ పక్షాన ప్రశంసలు తెలియజేశారు. ఫోన్ చేసి మాట్లాడిన మీనాక్షి సమావేశంలో భాగంగా ప్రతి జిల్లాలో పార్టీ కమిటీల నియామకం ఎంత వరకు వచ్చిందన్న అంశాన్ని మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. పరిశీలకులు సమర్పించిన నివేదికలు చూసిన ఆమె, బాగా పనిచేసిన నేతలకు అభినందనలు తెలిపారు. కమిటీల నియామకంలో తాత్సారం చేస్తున్నారన్న నివేదికల మేరకు మహబూబ్నగర్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నల్లగొండకు చెందిన ఓ ఎమ్మెల్సీకి ఆమె నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ కమిటీల నియామకాలను వాయిదా వేయవద్దని వారికి సూచించారు. మంత్రితో ముఖాముఖి కాగా, బుధవారం గాం«దీభవన్లో ‘మంత్రితో ముఖాముఖి’కార్యక్రమం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దాదాపు మూడు గంటల పాటు గాం«దీభవన్లో ఉండి ప్రజల నుంచి వారి సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తం 100కు పైగా వినతిపత్రాలు వచ్చాయని, తక్షణమే పరిష్కరించగలిగిన వాటిపై అధికారులతో అప్పటికప్పుడే మాట్లాడి పరిష్కరించారని, మిగిలినవి ఆయా శాఖలకు పంపామని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్కార్డులు, కరెంటు బిల్లులు, ఇతర సంక్షేమ పథకాల కోసం ప్రజలు దరఖాస్తులిచ్చారని తెలిపారు. కాగా, మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ కూడా మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్.. కేసీఆర్కు నోటీసులిస్తారా?
సాక్షి, హైదరాబాద్/కవాడిగూడ: తెలంగాణ సస్యశ్యామలం కావాలని 16 టీఎంసీల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును 141 టీఎంసీలకు పెంచినందుకా మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే యావత్ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచి్చనట్టేనని ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్తో నోటీసులు జారీ చేయించిన కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ కాదు..అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని విమర్శించారు. కమిషన్పై మాకు నమ్మకం ఉందని, కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసం లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జాగృతి కార్యకర్తలు, పలు సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగించారు. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, కేసీఆర్ను బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోందని, 90 శాతం పంప్హౌస్ల పనులు చేసిన కాంట్రాక్టర్ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్హౌస్లు నిర్మించిన మెఘా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు జలదోపిడీ చేసినా బీజేపీ ప్రశ్నించడం లేదు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడీ చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదని, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదని మండిపడ్డారు. బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని, తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. -
నదుల్లో ఇసుక 'తోడే'ళ్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. చాలా రీచ్ల వద్ద సీసీ కెమెరాలు లేవు. ఉన్నతస్థాయి పర్యవేక్షణ లేదు. దీంతో ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. ఒక్క రోజులోనే లక్షల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. ఆ మేరకు సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారిక ఇసుక రీచ్లకు ఆన్లైన్ ఆర్డర్ కాపీ తీసుకుని వచ్చే లారీలో అదనంగా ఇసుక నింపి అక్రమ వసూళ్లకు పాల్పడటం ఒక రకమైన దోపీడీ అయితే, అసలు ఆర్డర్ కాపీయే లేకుండా ఈ రీచ్ల నుంచి ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అనధికారిక రీచ్ల నుంచి తరలిపోయే ఇసుకకు లెక్కాపత్రమే ఉండక పోవడం గమనార్హం. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండగా.. పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది లేకపోవడంతో ఇసుక అక్రమ దందా జోరుగా సాగిపోతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధుల అండదండలు, కనుసన్న ల్లోనే ఈ దందా సాగుతోందనే ఆరోపణలున్నాయి. మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తమ వంతు పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఆ నాలుగు నదుల్లో.. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 32 ఇసుక రీచ్లు అధికారికంగా నడుస్తుండగా, అనధికారికంగా 52 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. గోదావరి, మంజీరా, కృష్ణా, తుంగభద్ర నదుల్లో అధికారిక ఇసుక క్వారీలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 12, ఉమ్మడి వరంగల్లో 9, కరీంనగర్లో 6 ఉండగా, ఖమ్మం, మంచిర్యాల, నారాయణపేట, మహబూబ్నగర్, నల్లగొండల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇసుక కావాల్సిన వారు క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.650 చొప్పున ఆన్లైన్లో చెల్లిస్తే ఆ మేరకు ప్రభుత్వం ఆర్డర్ కాపీ (ఓఆర్డీ) ఇస్తుంది. ఈ ఆర్డర్ కాపీ తీసుకుని రీచ్కు వెళితే కాంట్రాక్టర్ సిబ్బంది జేసీబీల ద్వారా లారీలో ఇసుకను నింపుతారు. ఈ విధంగా యంత్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేసినందుకు గాను ప్రభుత్వం కాంట్రాక్టర్కు క్యూబిక్ మీటర్కు రూ.110 చొప్పున చెల్లిస్తోంది. ఒకవేళ గిరిజన సొసైటీల నిర్వహణలో రీచ్లు ఉన్నట్టైతే వాటికి క్యూబిక్ మీటర్కు రూ.250 చొప్పున ఇస్తోంది. ఈ క్రమంలో రీచ్ల వద్ద మైనింగ్ (టీజీఎండీసీ), రెవెన్యూ శాఖలకు సంబంధించిన సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి ఉండాలి. అన్లైన్లో బుకింగ్ చేసిన ప్రకారమే ఇసుక నింపుతున్నారా? అక్రమాలకు పాల్పడుతున్నారా? అనేది చూడాలి. ప్రతి వాహనాన్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలి. కానీ అలా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ఓఆర్డీ అసలే లేకుండా, ఒక్కో ఆర్డర్పై నాలుగైదు లారీల్లో.. చాలా క్వారీల్లో సిబ్బంది ఎటువంటి ఓఆర్డీలు లేకుండానే లారీకి రూ.50 వేలు తీసుకుని ఇసుక నింపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఒక్కరి పేరు మీద పర్మిట్ తీసుకుని, దానిపైనే నాలుగు, ఐదు లారీలల్లో ఇసుక సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కాగా అలా నింపిన లారీలను ఎలాంటి ఆటంకం లేకుండా గమ్యస్థానం చేరేలా స్థానిక నేతల అండదండలతో మైనింగ్, రవాణా, పోలీస్ తదితర శాఖల అధికారులను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి ఇలాకాలో ఇసుకాసురులు! ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తోంది. వెంకటాపూర్, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం తదితర మండలాల్లోని గోదావరి రీచ్ల నుంచి సాగుతున్న ఇసుక దందాకు సదరు మంత్రి అనుచరులు కొందరి అండదండలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇసుక దందాను నిలువరించేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ప్రయత్నించక పోవడం, అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ ప్రచారం నిజమేననే వాదన విన్పిస్తోంది. పై స్థాయి ప్రజా ప్రతినిధుల అండదండలు ఉండబట్టే.. కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా గోదావరిలోకి రోడ్లు వేసి మరీ ఇసుక తోడుతున్నారని, మామూళ్లు తీసుకుంటూ అధికారులు పట్టీపట్టనట్లు ఉంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తే తమపైనే అక్రమ కేసులు బనాయిస్తారని స్థానికులు భయపడుతుండటం గమనార్హం. అనధికారిక రీచ్లలో ఏం జరుగుతోంది? అనధికారిక రీచ్లు పూర్తిగా చట్ట విరుద్ధం. చాలావరకు గతంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి విరమించుకున్న ప్రాంతాల్లోనే ఈ దందా సాగుతోంది. దీనిని నియంత్రించాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ములుగు టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారి విష్ణువర్ధన్, భూపాలపల్లి పీవో శ్రీకాంత్ నుంచి ‘సాక్షి’ ఫోన్ ద్వారా వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. ఉచితం పేరిట యధేచ్చగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక సరఫరాకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాల (ఇందిరమ్మ) కింద ఇళ్లు నిర్మించునే వారు కేవలం రూ.1400 చెల్లిస్తే అతడికి రిజిస్టర్డ్ ట్రాక్టర్ యజమాని ఇంటికి వచ్చి ట్రాక్టర్ ఇసుక పోసి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధానంతో పేదలైన లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుక లభిస్తుండగా, మరోవైపు స్థానిక ట్రాక్టర్ యజమానులకు ఉపాధి దొరుకుతోంది. అయితే ఈ విధానాన్ని అనుకూలంగా మలచుకుని ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కొందరు ప్రజాప్రతినిధుల అండదండలతో గ్రామాల్లో ఉన్న చోటా మోటా నేతలు స్థానిక వాగులను తోడేస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో ఇసుకను డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆ ఇసుకను లారీల్లో ఇతర జిల్లాలకు, హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రతిరోజూ ఒక్కో జిల్లాలో ట్రాక్టర్ల ద్వారా 500 నుంచి 800 ట్రిప్పుల ఇసుకను ‘ఉచితం’ పేరిట తోడుతూ ఇష్టారాజ్యంగా అమ్మేసుకుంటున్నారే ఆరోపణలున్నాయి. ఇలా రోజుకు రూ.50 కోట్లకు పైగా విలువైన ఇసుక పక్కదారి పడుతున్నట్టు అంచనా. కాగా కొన్ని జిల్లాల్లో ఈ అక్రమ దందాను గ్రామ కమిటీలు వేలం ద్వారా కూడా నిర్వహిస్తుండటం గమనార్హం. హైదరాబాద్కు ఇలా.. అక్రమంగా తోడేస్తున్న ఇసుక చాలావరకు హైదరాబాద్కు, ఇతర ముఖ్య నగరాలకు వస్తోంది. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో ప్రభుత్వం ఇసుకను తక్కువ ధరకు అందించడానికి ‘తెలంగాణ ఇసుక బజార్’లను ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి అబ్దుల్లాపూర్ మెట్, వట్టినాగులపల్లి, బౌరంపేట, ఆదిభట్లలో నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించారు. త్వరలో శామీర్పేట్, ఘట్కేసర్ ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని టీజీఎండీసీ ప్రకటించింది. బ్లాక్ మార్కెట్లో ఇసుక ధరలు విపరీతంగా పెరిగి.. ప్రైవేట్ వ్యాపారులు టన్ను ఇసుకను రూ.2,000 నుండి రూ.3,000 వరకు విక్రయిస్తున్న నేపథ్యంలో.. ఈ దందాను అరికట్టడానికి ఈ బజార్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ బజార్ల ద్వారా అందుబాటులో ఉండేది. వాస్తవ అవసరాలతో పోల్చుకుంటే నామమాత్రమేనని బహిరంగ రహస్యం.ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏలికేశ్వరం ఇసుక రీచ్. బుధవారం ఇక్కడి నుంచి 7,356 టన్నుల ఇసుక తరలించేందుకు 228 ఆన్లైన్ ఆర్డర్లు బుక్ అయ్యాయి. అంటే 228 లారీల ద్వారా ఈ ఇసుకను తీసుకెళ్తారన్న మాట. లారీ సైజును బట్టి ఒక్కో దానిలో 16 టన్నుల నుంచి 35 టన్నుల వరకు లోడ్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం రీచ్ వద్ద సీసీ కెమెరాలు లేవు. మైనింగ్ విభాగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఒక్కో లారీలో నాలుగు నుంచి ఆరు బకెట్ల (జేసీబీ ఒక్కసారి తోడే ఇసుక) ఇసుక అక్రమంగా తరలిపోతున్నట్టు సమాచారం. ఇందుకోసం బకెట్కు రూ.1,500 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో లారీలో సగటున మూడు బకెట్లు వేశారనుకుంటే మూడు బకెట్లకు రూ.4,500 చొప్పున 228 లారీలకు గాను రూ.10.26 లక్షలు దోచుకుంటున్నారన్న మాట. టన్నుల కొద్దీ అక్రమాలు... రాష్ట్రంలోని 32 అధికారిక రీచ్ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం..ఆర్డర్ కాపీ మేరకు.. ఆరు టైర్ల లారీలో 7–8 క్యూబిక్ మీటర్లు (11.5– 12.5 టన్నులు), 10 టైర్ల వాహనంలో 12 క్యూబిక్ మీటర్లు (19.5 టన్నులు), 12 టైర్ల లారీలో 16 క్యూ.మీ. (26 టన్నులు), 14 టైర్ల వాహనంలో 20 క్యూ.మీ. (32 టన్నులు) మాత్రమే నింపాలి. కానీ సామర్థ్యానికి మించి, అలాగే బుక్ చేసుకున్న దాని కంటే అధికంగా సగటున 3 బకెట్ల వరకు ఇసుక అదనంగా నింపుతున్నారు. బకెట్కు రూ.1,500 చొప్పున వసూలు చేస్తున్నారు. కొన్ని రీచ్ల వద్ద ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది.. లారీల్లో అదనంగా ఇసుకను నింపుకోవాలని, అందుకు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇసుక లోడింగ్ సమయంలో ఒక్కో లారీకి (బకెట్ డబ్బులు కాకుండా) రూ.1,000–1,500 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. -
కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసులు అరెస్ట్ అయ్యారు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గుణ శేఖర్ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుణశేఖర్తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫీడ్రిన్ డ్రగ్ను కానిస్టేబుల్ గుణశేఖర్కు ఎవరు సప్లై చేస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.ఎఫీడ్రిన్లో కొకైన్ కలిపి డ్రగ్స్ విక్రయాలపై కూకట్పల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రిమాండ్లో ఉన్న ఐదుగురు నిందితులను కస్టడీకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టనున్నారు. -
స్నాతకోత్సాహం
జేఎన్టీయూలో అలరించిన వేడుకలుకేపీహెచ్బీకాలనీ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) 13వ స్నాతకోత్సవం మంగళవారం ఆద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. యూనివర్సిటీ చాన్స్లర్ హోదాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వీసీ కిషన్ కుమార్ రెడ్డి, రెక్టార్ విజయ్కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. గతానికి భిన్నంగా స్నాతకోత్సవ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు సంప్రదాయ వస్త్రధారణతో అలరించారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల కేరింతలు, అభినందనలు తెలిపేందుకు వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల నడుమ స్నాతకోత్సవం పండగ వాతావరణాన్ని తలపించింది. విజ్ఞానాన్ని సమాజానికి అందించాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విజ్ఞానాన్ని సంపాదించడమే కాదు దాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించడమే నిజమైన విద్య అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. జేఎన్టీయూ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. విద్యార్థుల విజయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. విద్యార్థులు సృజనాత్మకత, నైతిక విలువలతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం వివిధ విభాగాల్లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రదానం చేశారు ఎంతో ఆనందంగా ఉంది.. గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. 5 గోల్డ్ మెడల్స్ రావటంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. –నవ్యశ్రీ, ఈసీఈ విభాగం నా కల సాకారమైంది సివిల్ ఇంజినీరింగ్లో 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మా నాన్న ఉపాధ్యాయుడు. ఎంతోమంది విద్యార్థులకు చదువు గొప్పతనం గురించి చెబుతుంటారు. నా తల్లిదండ్రుల కృషి చాలా ఉంది. – పి.సుప్రియ, సివిల్ ఇంజినీరింగ్ -
ఔటర్.. ఔరా!
ఓఆర్ఆర్ చుట్టూ అభివృద్ధికి సర్కారు అడుగులు సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరానికి మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రాలతో అనుసంధానంగా ఉంటూ ఇతర నగరాలకు వెళ్లేందుకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మితమైన ఔటర్ చుట్టూ ఐటీ, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం శరవేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ చుట్టూ 158 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారి ప్రాంతాలలో సెజ్ తరహాలో కంపెనీలకు స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో సంస్థలకు చేరువలో నివాసాలు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. దీంతో నగరాభివృద్ధి విస్తరించడంతో పాటు వాక్ టు వర్క్ విధానంలో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. కనిష్టంగా వెయ్యి ఎకరాలు.. ఔటర్ చుట్టూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఔటర్కు సమీపంలోని కొన్ని ప్రాంతాలు, విమానాశ్రయానికి దగ్గరగా ఉండే మరికొన్ని ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించారు. శేరిలింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో ఒక్కోచోట వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా భూములను సేకరించాలన్న అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మరోవైపు గతంలో ఏవైనా సంస్థలకు స్థలాలు ఇచ్చి అవి ఇంకా కార్యకలాపాలు ప్రారంభించకపోతే వాటిని వెనక్కి తీసుకునే మార్గాలను కూడా అధికారులు అన్వేషిస్తున్నారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. వాక్ టు వర్క్ తరహాలో.. ఔటర్ చుట్టూ రానున్న పరిశ్రమలు వాక్ టు వర్క్ విధానంలో ఉండాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. కంపెనీలకు చేరువలోనే నివాసాలు ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) తరహాలో ఒకేచోట 300 ఎకరాల భూములు సేకరించాలని, పరిశ్రమలు, ఐటీ సంస్థలకు సమీపంలో ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేస్తే అక్కడ నివాసం ఉండేందుకు వీలుంటుందని రెవెన్యూ అధికారుల భావిస్తున్నారు. ఇందుకోసం 300 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించాలని నిర్ణయించారు. రోడ్లు, తాగునీరు, మురుగు నీటి వ్యవస్థలను అందుబాటులో ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. అభివృద్ధి విస్తరణ.. ఇప్పటికే ఫాక్స్కాన్ సంస్థ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో యాపిల్ ఫోన్ విడిభాగాల తయారీ ప్లాంట్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఎలక్ట్రానిక్ సిటీ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రెండు పరిశ్రమలతో పాటు షాబాద్ మండలంలో విద్యుత్ బస్సుల తయారీ, టెక్స్టైల్స్ పరిశ్రమలు ఇప్పటికే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ, పరిశ్రమల హబ్లలో పరిశ్రమలు, ఐటీ సంస్థలతో పాటు వాటికి సమీపంలో విద్యా సంస్థలు, వినోద కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, రెస్టారెంట్లను ప్రారంభిస్తే అభివృద్ధి మరింత విస్తరించే అవకాశముంది. ఐటీ, పరిశ్రమలకు స్థలాల కేటాయింపునకు కసరత్తు òÜgŒæ ™èlÆý‡àÌZ HÆ>µr$ ^ólĶæ*ÌS° °Æý‡~Ķæ$… కంపెనీలు, నివాసాలు ఒకేచోట ఉండేలా ప్రణాళికలు -
మహా దారిలో..
ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్లు ● జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం ● మొదటి దశలో 10 రహదారులకు హెచ్ఎండీఏ ప్రణాళికలుసాక్షి, సిటీబ్యూరో: ఔటర్రింగ్ రోడ్డు నుంచి కొత్తగా నిర్మించనున్న రీజినల్ రింగ్రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల పనులకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సన్నాహాలు చేపట్టింది. రావిర్యాల నుంచి ఆమన్గల్ మార్గంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ తరహాలోనే మరో 10 ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఔటర్ నుంచి రీజినల్ రింగ్రోడ్డుకు జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేస్తూ వీటిని నిర్మించనున్నారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ప్రజలు సాఫీగా రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా విశాలమైన రహదారులు అందుబాటులో ఉంటాయని హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఉత్తర, దక్షిణ భాగాలుగా రెండు దశల్లో నిర్మించనున్న సుమారు 350 కిలోమీటర్ల మేర అనుసంధానం చేసే విధంగా గ్రీన్ఫీల్డ్ రోడ్లను దశలవారీగా నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇరువైపులా టౌన్షిప్లు ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఆధునిక సదుపాయాలతో టౌన్షిప్లు నిర్మించనున్నారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో రైతుల నుంచి భూములు సేకరించి లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్కు అనుగుణంగా లే అవుట్లను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. వీటిని గ్రీన్ఫీల్డ్ రోడ్లకు ఇరువైపులా నిర్మించనున్నారు. ప్రజలు నివాస సముదాయాల నుంచి తేలిగ్గా గ్రీన్ఫీల్డ్కు చేరుకొనే సదుపాయం ఉంటుంది. ప్రతి లే అవుట్ను అన్నిమౌలిక సదుపాయాలతో డిజైన్ చేసేందుకు ప్రతిపాదించారు. రైతుల నుంచి భూములు సేకరించి ఏర్పాటు చేసే లేఅవుట్లలో 60 శాతం భూమిని తిరిగి వారికే అందజేయనున్నారు. మిగతా 40 శాతం భూమిని హెచ్ఎండీఏ తీసుకోనుంది. ప్రస్తుతం ప్రతిపాదించిన రావిర్యాల– ఆమన్గల్ మార్గంలో మొదటి దశలో రేడియల్ రోడ్డుకు ఇరువైపులా కి.మీ పరిధిలో 21 లక్షల చదరపు మీటర్ల (518.92 ఎకరాలు) విస్తీర్ణంలో టౌన్షిప్ను, రెండో దశలో 500 మీటర్ల పరిధిలో మరొకదానిని అభివృద్ధి చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. త్వరలో రతన్టాటా గ్రీర్ఫీల్డ్ రోడ్డు పనులు.. ఫ్యూచర్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఓఆర్ఆర్ రావిర్యాల ఇంటర్చేంజ్ నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న 41.50 కి.మీ. గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులను హైకోర్టు స్టే ఎత్తివేసిన వెంటనే ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ అనుబంధ హెచ్జీసీఎల్ సంస్థ సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం రూ.1,665 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా.రెండోదశలో మీర్ఖాన్పేట్ నుంచి ట్రిపుల్ ఆర్ వద్ద అమన్గల్ వరకు రూ.2,365 కోట్ల వ్యయంతో 22.3 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఇవీ ప్రత్యేకతలు.. ● గ్రీన్ఫీల్డ్ రోడ్లు 100 మీటర్ల వెడల్పుతో కూడిన యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేలు. ఆరు లైన్ల ప్రధాన రహదారి (3+3 లేన్) ● భవిష్యత్తులో 8 లైన్లకు (4+4) విస్తరించే అవకాశం ఉంటుంది. ● రావిర్యాల–ఆమన్గల్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు మధ్యలోనే మెట్రో కారిడార్ కోసం 20 మీటర్ల భూమిని కేటాయిస్తారు.ఈ మార్గంలో ఎట్గ్రేడ్ (భూమార్గంలో)గా మెట్రో కారిడార్ రానుంది. ● గ్రీన్ఫీల్డ్ రోడ్లకు రెండు వైపులా 3–లైన్ల సర్వీస్ రోడ్లు ఉంటాయి. 2 మీటర్ల చొప్పున గ్రీన్బెల్ట్ను (పచ్చదనం) ఏర్పాటు చేస్తారు. ● రెండు వైపులా 3 మీటర్ల సైకిల్ ట్రాక్, 2 మీటర్ల వెడల్పుతో ఫుట్పాత్, మరో 2 మీటర్ల యూటిలిటీ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. -
తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టెట్-2025 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు రెండు సెక్షన్స్లో పరీక్షలు జరగనున్నాయి.ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.పరీక్షల నిర్వహణ తేదీలు, సెషన్లు, సబ్జెక్టులు, జిల్లాల వివరాలతో పాఠశాల విద్యాశాఖ పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. కాగా, ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ దరఖాస్తులను స్వీకరించారు. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఈసారి టెట్కు 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
హైదరాబాద్లో దారుణం.. ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృతదేహం
సాక్షి, మేడ్చల్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు.మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్తో ఉన్న మృతురాలికి 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలనగర్ జోన్ డీఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. మృతురాలి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
వాక్వే పనులను వేగవంతం చేయాలి
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బంజారాహిల్స్: కేబీఆర్ పార్క్లో వాక్వే పనులను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కేబీఆర్ పార్క్ వాక్వే పనులను పరిశీలించారు. లైసెన్స్ తీసుకున్న పెట్ డాగ్స్ను మాత్రమే పార్క్లోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్ సిటీ ద్వారా చేపట్టే ఫ్లైవర్లు, అండర్పాసులు కోర్టు ఆదేశాల మేరకు నిర్మిస్తున్నారా? అంటూ ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులను వివరణ అడిగారు. సెన్సిటివ్ జోన్ పరిధిలోనే పనులు చేపట్టినట్లు ప్రాజె క్టు ఇంజినీర్లు కమిషనర్కు వివరించారు. ఆయన వెంట అడిషనల్ కమిషనర్ సుభద్రా దేవి, డీసీ సమ్మయ్య, ప్రాజెక్టు ఎస్ఈ శ్రీలక్ష్మి, ఈఈ నాయక్, డిప్యూటీ ఈఈ హరీష్, సర్కిల్ ఈఈ విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యశాఖకు ‘గోషామహల్ స్టేడియం’
ఉస్మా‘నయా’ ఆస్పత్రి కోసం 31 ఎకరాల 39 గుంటలు సాక్షి, సిటీబ్యూరో: అఫ్జల్గంజ్లోని ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్లో శివకుమార్ లాల్ పోలీ సు స్టేడియం ప్రాంతానికి తరలించాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తు సైతం ప్రారంభమైంది. మొత్తం 43 ఎకరాల 37 గంటల ఈ స్టేడియం స్థలం నుంచి 31 ఎకరాల 39 గుంటలు ఆస్పత్రికి, 11 ఎకరాల 38 గుంటలు పోలీసు అవసరాలకు కేటాయించారు. కొత్త ఉస్మా నియా ఆస్పత్రికి కేటాయించిన స్థలాన్ని నగర పోలీ సు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం వైద్యశాఖకు అప్పగించారు. మిలిగిన స్థలంలో పోలీసు నిర్మాణాలను త్వరలో ప్రారంభించనున్నారు. అదనంగా మరో రెండు ఎకరాలు.. ప్రస్తుతం గోషామహల్లోని పోలీసుస్టేడియం ప్రాంగణంలో ఓ పక్క స్టేడియం, సిటీ సెక్యూరిటీ వింగ్ కార్యాలయం, డాగ్ స్క్వాడ్, అశ్విక దళంతో పాటు శిథిలమైన కొన్ని పోలీసు క్వార్టర్స్ కూడా ఉన్నాయి. వీటికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అమరుల స్తూపం ఉండగా దాన్నే పోలీసు అధికారులు గ్రౌండ్గా వినియోగిస్తున్నారు. ఈ స్తూపానికి ఏమాత్రం నష్టం వాటిల్లకుండా, సముచిత ప్రాధాన్యం ఇస్తూ స్డేడియంతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టనున్నారు. దీనికోసం సర్కారు రూ.55 కోట్లు మంజూరు చేసింది. అశ్వికదళం కోసం తాత్కాలికంగా నిర్మించిన 24 షెడ్లను ఆనంద్ మంగళవారం ప్రారంభించారు. తాత్కాలిక ప్రాతిపదికన డాగ్ స్క్వాడ్ను బేగంపేటలోని పోలీసు క్వార్టర్స్లోకి పంపారు. ఈ స్థలానికి అదనంగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (టీటీఐ) వద్ద మరో రెండు ఎకరాలు నగర పోలీసు విభాగానికి కేటాయించింది. ఇక్కడ కెన్నెల్ వింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ వాహనాలు శిథిలం కాకుండా.. నగరంలోని ఏడు జోన్లకు సంబంధించిన పోలీసులు వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ప్రస్తుతం ఈ స్టేడియంలోనే ఉంచుతున్నారు. వీటికి ఎలాంటి రక్షణ లేకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడిసి శిథిలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త నిర్మాణాల్లో భాగంగా ఈ వాహనాల కోసం ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. పక్కనే మరో నాలుగు అంతస్తుల్లో సీఎస్డబ్ల్యూ, సీటీసీలతో పాటు ట్రైనింగ్ సెంటర్ నిర్మిస్తారు. మిగిలిన ప్రాంతంలో స్టేడియం, గ్రౌండ్స్ ఉండనున్నాయి. ఉస్మానియా ఆస్పత్రి కోసం ప్రభుత్వం గోషామహల్ స్టేడియం ప్రాంగణం నుంచి 25 ఎకరాలు తీసుకుంటున్న నేపథ్యంలో.. దీనికి ప్రతిగా ఆరాంఘర్ ప్రాంతంలో 12 ఎకరాలను పోలీసు విభాగానికి కేటాయించింది. ఈ స్థలంలో రాష్ట్ర స్థాయి బ్యారెక్స్, ప్లేగ్రౌండ్, డ్రిల్ ఏరియా నిర్మించాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. రహదారులు సైతం విస్తరణకు ప్రతిపాదనలు.. ఎన్నికలతో పాటు బోనాలు, గణేష్ ఉత్సవాలతో పాటు ఇతర కీలక బందోబస్తుల కోసం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే బలగాల కోసం ఈ బ్యారెక్స్ వినియోగించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న వీటిలో ఉన్నతాధికారుల కోసమూ కొన్నింటిని కేటాయించనున్నారు. గోషామహల్ స్టేడియం ప్రాంతంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ చుట్టు పక్కల ఉన్న రహదారులపైనా ప్రభుత్వ విభాగాలు దృష్టి పెట్టాయి. ప్రస్తుతం అది వాణిజ్య ప్రాంతం కావడంతో పాటు రోడ్లన్నీ ఇరుకుగా ఉంటాయి. ఆస్పత్రి నిర్మాణం ప్రారంభంతోనే ఈ రోడ్ల విస్తరణకూ చర్యలు చేపట్టనున్నారు. ఆస్పత్రి చుట్టూ 30, 60, 100 అడుగుల వెడల్పుతో రోడ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనికోసం ఇప్పటికే అధికారులు సర్వే సైతం ప్రారంభించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న రోడ్ల స్థితిగతులు, కొత్త వాటి కోసం సేకరించాల్సిన ఆస్తులు, కూల్చివేతలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారని సమాచారం. అప్పగించిన పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మిగతా 11 ఎకరాల 38 గుంటల్లో పోలీసు నిర్మాణాలు స్వాధీనం చేసుకున్న వాహనాలకు ప్రత్యేక భవనం వివరాలు వెల్లడించిన సిటీ కొత్వాల్ -
మళ్లీ పోలీస్ చేతికి జేమ్స్ స్ట్రీట్ భవనం
బన్సీలాల్పేట్: హెచ్ఎండీఏ మరమ్మతులు చేపట్టిన జేమ్స్ స్ట్రీట్ భవనాన్ని పోలీస్ శాఖకు అప్పగించారని, త్వరలోనే రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ ఇక్కడికి వస్తుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని రాంగోపాల్పేట్ పురాతన పోలీసు స్టేషన్ను మంగళవారం ఉత్తర మండలం డీసీపీ రష్మి పెరుమాల్, నగర ట్రాఫిక్ డీసీసీ రాహుల్ హెడ్గే తదితరులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడారు. రాంగోపాల్పేట్ పాత పోలీసు స్టేషన్కు హెచ్ఎండీఏ మరమ్మతులు నిర్వహించి బ్రహ్మాండంగా తయారు చేశారన్నారు. సదరు స్టేషన్ను తిరిగి తమకు అప్పగించడం జరిగిందని తెలిపారు. త్వరలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. జేమ్స్ స్ట్రీట్ భవనం 1870 సంవత్సరంలో నిర్మించారు. అప్పటి నుంచి 2016 వరకు సుదీర్ఘకాలం రామ్గోపాల్పేట్ పోలీసు స్టేషన్ ఇక్కడే కొనసాగింది. ఆ తర్వాత మరమ్మతుల కోసం తొమ్మిదేళ్ల క్రితం హెచ్ఎండీఏ స్వాధీనం చేసుకుని..ఇప్పుడు అప్పగిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో రాంగోపాల్పేట్ పోలీసు స్టేషన్కు సంబంధించిన వస్తువులను తిరిగి ఇక్కడి తీసుకవచ్చి పోలీసు కార్యకలాపాలు సాగించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే పురాణి హవేలిలోని సిటీ పొలీసు కమిషనర్ కార్యాలయం మరమ్మతులు పూర్తి కావచ్చాయని, త్వరలో ఈ భవనాన్ని ప్రారంభించి అక్కడి నుంచీ నగర పోలీసు కార్యకలాపాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. బీజేపీ కార్పొరేటర్లతో కిషన్రెడ్డి సమావేశంసాక్షి, సిటీబ్యూరో: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై ఆయన వారితో చర్చించారు. బస్తీ పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ఆయన ప్రస్తావించారు. వర్షాకాల సన్నద్ధతపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కార్పొరేటర్లకు సూచించారు. అలాగే గుల్జార్హౌస్ అగ్నిప్రమాద ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంపైన కూడా ప్రశ్నించాలని సూచించారు. గ్రేటర్ సమస్యలపై బల్దియా మీటింగ్లో అంశాల వారీగా ఏయే కార్పొరేటర్లు ఏం మాట్లాడాలనే దానిపై కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.● రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ త్వరలో అక్కడికి తరలింపు ● సందర్శించిన సీపీ సీవీ ఆనంద్ -
సమన్వయంతో సమస్యలు నివారించండి
సాక్షి, సిటీబ్యూరో: వర్షాలు పడినప్పుడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాలుగు విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత సీజన్ను దృష్టిలో ఉంచుకొని వర్షాలు, వరదలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షాకాల సన్నద్ధతపై ఆయా విభాగాల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నగరంలో అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనుల్ని వీలైనంతగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఇప్పటికే గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్వద్ద రెయిన్వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనుల పురోగతి గురించి ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. హార్వెస్టింగ్ వెల్స్లోకి చేరే వర్షపు నీటిని ఆటోమేటిక్ పంపులతో బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్(సీఆర్యూ)లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ అధికారులు శేషాద్రి, మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండీఏ, తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. వర్షాకాల సన్నద్ధతపై అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండాలి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో.. -
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో విదేశాలకు..
శంషాబాద్: అమెరికా నుంచి డిపోర్ట్ అయిన విద్యార్థి సర్టిఫికెట్ నకిలీదిగా తేలడంతో హైదరాబాద్లోని ఓ నకిలీ సర్టిఫికెట్ విక్రయిస్తున్న కన్సెల్టెన్సీ గుట్టు రట్టైంది. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్గౌడ్ తెలిపిన మేరకు..నల్గొండ జిల్లా పారేపల్లిగూడెం గ్రామానికి చెందిన పకీరు గోపాల్రెడ్డి 2018లో మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించి ఏడాదిన్నర కిందట అమెరికాలోని వెబ్స్టర్ వర్సిటీలో 28 వేల డాలర్ల ఫీజు చెల్లించి ఉన్నత చదువులో ప్రవేశం పొందాడు. 15 నెలలు చదివిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి ఐదు నెలలు ఇక్కడే ఉన్నాడు. నాలుగురోజుల కిందట అమెరికా వెళ్లిన అతడిని అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు యునివర్సిటీలో ఇన్యాక్టివ్ విద్యార్థిగా గుర్తించి స్వదేశానికి తిప్పిపంపారు. దీంతో తిరిగి వచ్చే క్రమంలో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అతడి వీసాతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు పరిశీలించగా నకిలీ సర్టిఫికెట్ గుట్టు బయటపడింది. దీంతో అతన్ని ఆర్జీఐఏ ఔట్పోస్టు పోలీసులకు అప్పగించారు. పదిహేను మందికి పైగా.. నకిలీ సర్టిఫికెట్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోపాల్రెడ్డిని విచారించగా బీఎన్రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో ఉన్న ధనలక్ష్మీ ఒవర్సీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో రూ.80 వేలకు డిగ్రీ సర్టిఫికెట్ కొనుగోలు చేసినట్లు చెప్పాడు. సీఐ బాలరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ సిద్దేశ్వర్ పోలీసుల బృందం ధనలక్ష్మీ ఒవర్సీస్ సంస్థపై దాడులు చేశారు. సంస్థ నిర్వాహకుడు కాతోజు అశోక్ను అరెస్ట్ చేయడంతో పాటు అక్కడ ఉన్న మధురై కామరాజ్, ఉస్మానియా వర్సిటీలకు చెందిన 17 నకిలీ డిగ్రీ, ప్రొవిజినల్ మార్కుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన విద్యార్హత లేకుండా విదేశీ విద్యనభ్యసించాలనుకునే వారు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తూ నకిలీ సర్టిఫికెట్ అందజేస్తున్నట్లు గుర్తించారు. పదిహేనుమందికిపైగా నకిలీ సర్టిఫికెట్లతో విదేశీ విద్యకు వెళ్లినట్లు విచారణలో అశోక్ వెల్లడించాడు. కేరళకు చెందిన వ్యక్తికి ఒక్కో సర్టిఫికెట్కు రూ.30 వేలు ఇస్తే..అతడే సర్టిఫికెట్లు తయారుచేసి పంపిస్తున్నట్లు తెలిపాడు. అశోక్ నుంచి నకిలీ సర్టిఫికెట్లతో పాటు వివిధ బ్యాంకులకు చెందిన నకిలీ స్టాంపులు, నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్రెడ్డి, అశోక్లను రిమాండ్కు తరలించగా కేరళకు చెందిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.ఓ కన్సల్టెన్సీ నిర్వాకం అమెరికా నుంచి తిరిగొచ్చిన విద్యార్థి సర్టిఫికెట్ పరిశీలనలో బయటపడ్డ వైనం కేరళలో తయారీ..హైదరాబాద్లో విక్రయం ఇద్దరి అరెస్ట్..ఒకరి పరారీ -
వేర్వురుగా రెయిన్ వాటర్, సీవరేజ్ లైన్లు
జలమండలి ఎండీ సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని సీవరేజ్, వాననీటి కాలువ అనుసంధానం పాయింట్లను గుర్తించి రెండు లైన్లను వేర్వేరుగా నిర్మించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, జలమండలి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సోమవారం మలక్పేట్లోని నల్గొండ చౌరస్తాలో సీవరేజ్ మరమ్మతు పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. రెండు దశాబ్దాల క్రితం నాటి సీవరేజ్ లైను శిథిలమైపోవడంతో అవుట్లెట్ లేక వర్షం కురిసిన సమయాల్లో సీవరేజ్ రహదారిపై పొంగుతున్నట్టు గుర్తించారు. సీవరేజ్ లైన్లు ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. మలక్పేట్ ఆర్యూబీ వరకు సీవరేజ్ లైన్ల నిర్మాణం చేపట్టడానికి అధికారులతో చర్చించారు. కొత్త సీవరేజ్ లైన్ల వల్ల తాత్కాలికంగా మురుగు సమస్య తలెత్తకుండా ఉంటుందని అన్నారు. అలాగే సమీపంలోని భవనాలనుంచి ఉత్పన్నమయ్యే సీవరేజ్ను ఎక్కడికక్కడే కాకుండా ఒకే అవుట్లెట్ వద్ద అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే సమీపంలోని అన్ని సీవరేజ్ లైన్లను, మ్యాన్ హోళ్లను డీసిల్టింగ్ చేసి మురుగు పొంగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారంకోసం ఇరు శాఖల అధికారులు సర్వే నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, సీజీఎం నాగేందర్, జీఎం ఇతర అధికారులు, హైడ్రా అధికారులు పాల్గొన్నారు. -
‘నేతన్నకు భరోసా’కు మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: ‘నేతన్నకు భరోసా’ పథకానికి ఈ నెల 2న మార్గదర్శకాలను జారీ చేసినట్లు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఇందుకోసం రూ.48 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా.. జియో ట్యాగ్ చేసిన మగ్గాలపై పనిచేస్తున్న వారికి వేతన ప్రోత్సాహకం కింద.. గరిష్టంగా ఏటా నేత కార్మికులకు రూ.18,000, అనుబంధ కార్మికులకు రూ.6,000 అందించనున్నట్లు తెలిపారు. ఇందువల్ల దాదాపు 40,000 మంది చేనేత, అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని వివరించారు.చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా రూపొందించిన యూనిక్ లోగోను జత చేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండి జియో ట్యాగ్ చేసిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు, ప్రీలూమ్, ప్రిపరేటరీ పనులైన.. డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ తదితర అనుబంధ పనులు చేసే కార్మికులు, వార్షికాదాయంలో చేనేత వృత్తి ద్వారా కనీసం 50 శాతం ఆర్జిస్తున్న వారు అర్హులని పేర్కొన్నారు.ఈ పథకం కింద జియో ట్యాగ్ చేసిన మగ్గాల ద్వారా కనీసం 50 శాతం కంటే ఎక్కువ వార్పులు పూర్తి చేసిన వారికి నేరుగా వేతన ప్రోత్సాహకం కింద.. ఏటా రెండు విడతలుగా (ఏప్రిల్ నుండి సెప్టెంబర్, అక్టోబర్ నుండి మార్చి) బ్యాంకు ఖాతాలోకి నేత కార్మికునికి రూ.9,000, అనుబంధ కార్మికునికి రూ.3,000 జమ చేయనున్నట్లు వివరించారు. కాగా, మొదటి విడతలో 50 శాతం వార్పులు పూర్తి చేయని వారు, రెండో విడతలో పూర్తి చేసినట్లయితే మొత్తం ప్రోత్సాహకాన్ని.. సంవత్సరాంతంలో చేనేత, అనుబంధ కార్మికులకు అందించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. -
‘పుర’ వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 30 మునిసిపల్ వార్డుల విభజనకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో 18 కొత్త మునిసిపాలిటీలు కాగా, మిగతావి పాత కార్పొ రేషన్లు, మునిసిపాలిటీలు. మునిసిపల్ పరిపాలన విభాగం ఆధ్వర్యంలో వార్డుల విభజన ప్రక్రియ మంగళవారం నుంచి జూన్ 21 వరకు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించింది.ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ రెండు ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే ఉన్న మునిసిపాలిటీల్లో కొత్త ప్రాంతాల కలయికతోపాటు, కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేపట్టనున్నారు. కాగా ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న 13 మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పునర్విభజన జోలికి వెళ్లలేదు. ఓఆర్ఆర్ లోపలి కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను కలిపి కొత్తగా మూడు కార్పొరేషన్లుగా మార్చాలని యోచిస్తున్న నేపథ్యంలో వాటి జోలికి వెళ్లలేదు. 21లోపు వార్డుల విభజన: 18 కొత్త మునిసిపాలిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లోనే చ ట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా ముని సిపాలిటీలకు వార్డుల సంఖ్యను పురపాలక శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆయా మునిసిపాలిటీల్లో వార్డుల విభజన పూర్తి చేయాలి. ప్రస్తుతం ఉన్న ఐదు కార్పొరేషన్లు, ఏడు మునిసిపాలిటీల్లోనూ వార్డుల సంఖ్య పెంచాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈ నెల 21వ తేదీలోపు పూర్తి చేయాలి. -
ప్రపంచ సుందరి పోటీల ఖర్చు రూ.30 కోట్లే
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు వెచ్చిస్తే..స్పాన్సర్షిప్ రూపంలో రూ.21 కోట్ల ఆదాయం సమకూరిందని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మరో రూ.10 కోట్లకు సంబంధించి స్పాన్సర్షిప్ ఒప్పందాలు పెండింగ్లో ఉన్నాయని, ఆ మొత్తం కూడా సమకూరితే ప్రభుత్వానికి నయాపైసా కూడా ఖర్చు లేకుండా ఈ అంతర్జాతీయ స్థాయి పోటీలను నిర్వహించినట్టవుతుందని చెప్పారు. మిస్ వరల్డ్ సంస్థ అవసరాలకు రూ.3 కోట్లు ఇచ్చామని, అవి కూడా ఖర్చులో భాగంగానే చూపామని వెల్లడించారు. మంగళవా రం ఆయన సచివాలయంలో మరో మంత్రి పొన్నం ప్రభాక ర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఈ పోటీల రూపంలో ప్రపంచ మీడియాను తెలంగాణకు రప్పించటం ద్వారా ఇక్కడి పర్యాటక ప్రాంతాలపై ప్రపంచస్థాయిలో విస్తృత చర్చకు వీలు కల్పించామని, ఫలితంగా తెలంగాణ పర్యాట కానికి రూ.10 వేల కోట్ల విలువైన ప్రచారం లభించి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంలో దీని ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. పర్యాటకం, హస్తకళ లు, చేనేత ఉత్పత్తులకు మంచి ప్రమోషన్ వచ్చిందని, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రపంచానికి పరిచయం చేశామని, ఆ వేడుకల నిర్వహణ, ఆతి థ్యం పట్ల పోటీదారులు, మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.పరిస్థితి ఇలా ఉంటే, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు అయ్యాయంటూ కేటీఆర్, హరీశ్రావు తదితరులు ఆరోపిస్తున్నారని, అంత ఖర్చు ఎలా అయ్యిందో ఆధారాలు చూపాలని, తనను తెలంగాణభవ న్కు రమ్మన్నా, అబిడ్స్ చౌరస్తాకు రమ్మన్నా చర్చకు వస్తాన ని, నిరూపించలేకపోతే అంత ఖర్చు కాలేదని ఒప్పుకొని ముక్కు నేలకురాయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో టూరిజం ప్రమోషన్ కార్యక్రమాలకు రూ.115 కోట్లకు పైగా ఖర్చు చేశారని, దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో తెలపాలని, ఇప్పుడు తాము ఇంత పెద్ద ఈవెంట్ను దాదాపు ఖర్చు లేకుండా నిర్వహించగలిగామని వెల్లడించారు.చౌమొహల్లా ప్యాలెస్ డిన్నర్లో ఒక్కో ప్లేట్ భోజనం ఖరీదు రూ.లక్ష అని, సుందరీమణులకు 30 తులాలు చొప్పున బంగారం ఇచ్చారని తప్పుడు వార్తలు రాయించారన్నారు. చౌమొహల్లా ప్యాలెస్ డిన్నర్కు ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తెప్పించామని, ఒక్కో ప్లేట్ ఖర్చు రూ.8,200 మాత్రమే అయ్యిందని చెప్పారు. ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న ఘనత కేసీఆర్ దేనని అన్నారు. పోటీదారులకు పిసరు కూడా బంగారం ఇవ్వలేదని పేర్కొన్నారు. తనపట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారంటూ మిస్ ఇంగ్లండ్ మిల్లామ్యాగీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆమె ఆరోపణలే నిజమైతే మిగతా 108 మంది పోటీదారులు చివరి వరకు సంతృప్తిగా, సంతోషంగా ఎలా ఉండగలిగారని ప్రశ్నించారు.తాము మళ్లీ హైదరాబాద్కు వస్తామని, తమ జీవితంలో హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంటుందని వారు చెప్పారని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీలు విజయవంతం కావటంతో ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. వారి పార్టీల్లోని సమస్యలపై ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నా రని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి, పర్యాటకశాఖ డైరెక్టర్ హన్మంతు జండగే, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ కె.లక్ష్మి పాల్గొన్నారు. -
మహిళా నిరసనకారుల కోసం మహిళా పోలీసులతో స్వాట్
సాక్షి, హైదరాబాద్: నిరసనలు..ధర్నాలు..ఆందోళనల్లో పాల్గొనే మహిళలను అదుపులోకి తీసుకునే సమయంలో వారి ఆత్మగౌర వానికి భంగం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీ సులు స్వాట్ (స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకొని, పోలీస్స్టేషన్లకు తరలించే సందర్భాల్లో తరచూ అపశ్రుతులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఈ బృందాలను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం గోషామహల్ పోలీస్ స్టేడియంలో ప్రారంభించారు.ఆ సందర్భంలో పుట్టిన ఆలోచన...హైదరాబాద్లోని సుల్తాన్బజార్లో ఉన్న డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు గత ఏడాది డిసెంబర్లో నిరసన తెలిపారు. వీరిని ముందస్తు అరెస్టు చేయడానికి అవసరమైన స్థాయిలో మహిళాపోలీసులు లేకపోవడం, ఉన్న వారికీ నైపుణ్యం లేకపోవడంతో ఆ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. పోలీసులు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు విభాగం మహిళా నిరసనకారుల్ని అదుపులోకి తీసుకోవడానికి మహిళా పోలీసులతో కూడిన వింగ్ ఉండాలని నిర్ణయించింది. దీంతో నగర సాయుధ విభాగం (సీఏఆర్) హెడ్క్వార్టర్స్కు చెందిన 2024 బ్యాచ్ కానిస్టేబుళ్లతో స్వాట్ టీమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఒక్కో ప్లటూన్లో 21 మంది చొప్పున రెండింటికి రూపం ఇవ్వడానికి సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.బైక్ స్టంట్తో అబ్బురపరిచిన పూజ...ప్రదర్శన సందర్భంగా స్వాట్ సభ్యురాలు పి.పూజ బైక్ స్టంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈమె కడుపుపై ఓ చెక్క పెట్టిన శిక్షకులు దాని మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్లారు. దీనికోసం తాను ఎలాంటి ప్రాక్టీసు చేయలేదని, కేవలం డెమో నిర్వహించి నేరుగా వచ్చానని వివరించారు. జాతీయస్థాయిలో వాలీబాల్ ప్లేయర్ అయిన పూజ.. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లోనూ పాల్గొన్నారు. వాలీబాల్లో గోల్డ్, ఆర్మ్ రెజ్లింగ్లో బ్రాంజ్ మెడల్స్ గెల్చుకున్నారు.ఎలాంటి దుస్తులు ధరించినా నేర్పుగా నిరసన తెలుపుతున్న మహిళలందరూ ఒకే విధమైన దుస్తులు ధరించరు. చీర, చుడీదార్, జీన్స్ ఇలా ఏ రకమైన వస్త్రాలు ధరించిన వారిని ఎలా అదుపులోకి తీసుకోవాలి అనే దానిపై ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చారు. ఒకే చోట గుంపుగా ఉన్న ఆందోళనకారుల్నీ సోలార్ లాక్, ప్రామిస్ లాక్ అనే టెక్నిక్స్ వాడుతూ ఎలా లిఫ్ట్ చేయాలన్నది నేర్చుకున్నాం. – జె.ఉమరెండు రకాల మార్షల్ ఆర్ట్స్ శిక్షణస్వాట్ ట్రైనింగ్లో భాగంగా జిమ్ వ్యాయామంతోపాటు రెండు రకాలైన మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. కరాటేలో కట్టాస్, పంచెస్, సెల్ఫ్ డిఫెన్స్, కిక్స్... క్రావ్మగాలో రియల్ ఫైట్, ఏడు మూవ్మెంట్స్లో ఎదుటి వ్యక్తిని నేలకూల్చడం తదితర అంశాల్లో అవగాహన కల్పించారు. – టి.శిల్పవర్ధన్గోషామహల్ పోలీస్ స్టేడియంలో స్వాట్ బృందాల ప్రదర్శన తొలి దశలో 35 మందిని స్వాట్ కోసం ఎంపిక చేశారు. వీరికి పోలీసులతోపాటు మార్షల్ ఆర్ట్స్, మాబ్ కంట్రోల్ ఎక్స్పర్ట్స్తో 45 రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. మహిళలతోపాటు పురుష నిరసనకారుల్ని అదుపు చేయడం, వారిని అదుపులోకి తీసుకోవడం, ఎలాంటి ఆయుధం లేకుండా శత్రువుతో పోరాడటం, నిరసనల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం తదితర అంశాల్లో తర్ఫీదు ఇచ్చారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో స్వాట్ బృందాలు తాము నేర్చుకున్న అంశాలను ప్రదర్శించాయి. సీఏఆర్ హెడ్క్వార్టర్స్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి నేతృత్వంలో పని చేయనున్న ఈ బృందాలకు ఆర్ఎస్సై మౌనిక పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు. త్వరలోనే మరో ఏడుగురిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. -
ఏపీ కేంద్రంగా ప్ర‘మాదక’ర దందా!
పోలీసు వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంది. కూటమి సర్కారు వచ్చి ఏడాదవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మద్యం, గంజాయి దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సర్కారే బెల్టుషాపులను ప్రోత్సహిస్తోంది. పర్మిట్ రూంలకు ఇష్టానుసారం అనుమతులిచ్చేస్తోంది. దీనికితోడు ఇప్పుడు డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో రూ.కోటి విలువైన కొకైన్ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉండడం కూటమి ప్రభుత్వం, పోలీసుశాఖ వైఫల్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత తీసుకోవాల్సిన కూటమి సర్కారు ప్రతిపక్ష ఎంపీపై ఎదురుదాడికి దిగడం నిజంగా సిగ్గుచేటు.. హాస్యాస్పదం.. జీడిమెట్ల(హైదరాబాద్)/తిరుపతిక్రైమ్: తిరుపతి నుంచి హైదరాబాద్కు కొకైన్, ఎఫిడ్రిన్ వంటి మత్తు పదార్థాలు తీసుకువచ్చి అమ్మేందుకు యత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను బాలానగర్ ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు గుణశేఖర్ పరారీలో ఉన్నాడు.వీరి వద్ద రూ.కోటి విలువచేసే 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్ షాపూర్నగర్లోని డీసీపీ కార్యాలయంలో ఇన్చార్జి డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఎస్వోటీ డీసీపీ డి.శ్రీనివాస్ తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నేహితుడి చేత డ్రగ్స్ తరలింపు తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు ఉన్నం సురేంద్రకు డబ్బు ఆశచూపి మే 29న 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ ఇచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్కు పంపించాడు. గుణశేఖర్ చెప్పినట్లుగానే సురేంద్ర కొకైన్ తీసుకుని గుంటూరు మీదుగా నగరంలోని కూకట్పల్లికి చేరుకున్నాడు. ఇక్కడ సురేంద్ర తన మనుషులైన బాపట్ల జిల్లాకు చెందిన దోతిరెడ్డి హరిబాబురెడ్డి, దేవరాజు యేసుబాబులను హైదరాబాద్ రప్పించాడు. అదేవిధంగా చేగూడి మెర్సి మార్గరెట్, షేక్ మస్తాన్ వలీలను సైతం పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కూకట్పల్లిలోని జయనగర్లో కలుసుకున్నారు. జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని.. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని భావించి ఆ రోజే కొకైన్ అమ్మేందుకు పథకం వేశారు. ఈ మేరకు ఐదుగురు కూకట్పల్లి భాగ్యనగర్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కొకైన్ లభించింది. వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించి విచారించగా అసలు బండారం బయటపెట్టారు. అసలు డ్రగ్స్ వీరికి ఎక్కడ నుంచి వచ్చిoదనే విషయం తెలియలేదు. ప్రధాన నిందితుడు గుణశేఖర్ పోలీసులకు పట్టుబడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ రవికుమార్, ఇన్స్పెక్టర్ రాజేశ్, బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సై కట్కం గౌతం పాల్గొన్నారు. పోలీస్శాఖ ఆరా గుణశేఖర్ తిరుపతిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇతను పంపిన మనుషులు డ్రగ్స్తో హైదరాబాద్లో పట్టుబడడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఘటనపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తోంది. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మాట్లాడగా.. గుణశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పారు. పోలీస్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇలా చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కానిస్టేబుల్ గుణశేఖర్కు తిరుపతి ఎంపీ గురుమూర్తికి సంబంధాలు అంటగట్టే యత్నాలు జరుగుతుండడం అందరినీ విస్తుగొలుపుతోంది. కొన్ని నెలల క్రితం గుణశేఖర్ ఎంపీ వద్ద కొద్ది రోజులు గన్మేన్గా ఉద్యోగం నిర్వహించాడు. దానిని సాకుగా తీసుకుని ఈ కేసును ఎంపీకి అంటగట్టాలని కూటమి నేతలు యత్నించడం కుట్రపూరితమే. -
రేపు కేబినెట్.. పలు కీలక అంశాల చర్చ
సాక్షి, హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక, జాతీయ డ్యామ్ల భద్రతా ప్రాధికార సంస్థ(ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. భారీస్థాయిలో ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలతోపాటు రికవరీ చేయాలని కమిషన్ సూచించిన విషయం విదితమే. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఆదర్శ రైతులను నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు వేదికలకు ఆదర్శ రైతులను ఇన్చార్జ్లుగా నియమించి, భూసార పరీక్షల నిర్వహణ కిట్లు వారి అ«దీనంలో ఉంచడం, వ్యవసాయ అంశాలపై రైతులతో అవసరమైనప్పుడల్లా సమావేశాలు నిర్వహించి వారికి సూచనలు ఇచ్చే విధంగా వీరిని నియమిస్తారంటున్నారు. ఆదర్శ రైతులకు గౌరవ వేతనం మాత్రం ఇవ్వడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఇటీవల మంత్రులు జిల్లాల్లో పర్యటించిన సమయంలో వచ్చిన అభిప్రాయాలపై చర్చిస్తారు. పథకం ఎంపికలో ఎలాంటి పారదర్శకత కొనసాగించాలన్న దానిపై చర్చించడంతోపాటు, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై మంత్రివర్గ స్పష్టత ఇవ్వనున్నట్టు తెలిసింది. ఉద్యోగులు ఆందోళన బాటలో ఉన్న సమయంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్ నేతృత్వంలో లోకేశ్కుమార్, కృష్ణభాస్కర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ కమిటీ గతవారంలోనే తన నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందించింది. ఈ నివేదికపై చర్చించి ఆర్థికపరమైన భారం పడే అంశాలను ప్రస్తుతానికి పక్కనపెట్టి, ఆర్థికేతర అంశాలను ఆమోదించేలా చర్చించనున్నట్టు తెలిసింది. అయితే ఐదు కరువు భత్యాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒక డీఏ అయినా క్లియర్ చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. వానాకాలం పంటల అంశం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్న తీరుపై కూడా చర్చించే అవకాశముంది. వాస్తవంగా జూన్ 2వ తేదీన కనీసం వంద ఇళ్లను ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేసినా, అందుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చోటుచేసుకోని విషయం విదితమే. -
పోషకలోపం.. ఊబకాయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 22 ఏళ్ల యువతలో ఒకవైపు స్థూలకాయం పెరుగుతుండగా మరోవైపు పోషకాహార లోపం కూడా తీవ్రంగా కనిపిస్తోంది. దీన్ని నిపుణులు ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్’గా పేర్కొంటున్నారు. తెలంగాణ యువత ఆరోగ్య పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నట్లు ‘యంగ్ లైవ్స్’రౌండ్–7 సర్వే (2023–24) ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం 22 ఏళ్ల యువతలో 19 శాతం మంది అధిక బరువు/ఒబేసిటీతో ఉండగా 29 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 2016తో పోలిస్తే స్థూలకాయం రెండింతలైంది. అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో స్థూలకాయం ఎక్కువగా (18.8%) కనిపిస్తోంది. పురుషుల్లో ఇది 14 శాతంగా ఉంది. మధుమేహం, గుండెజబ్బుల వంటి ప్రమాదాలకు దీన్ని కేంద్రంగా నిపుణులు గుర్తించారు. ఇప్పటికే 22.7% మహిళలు హై కార్డియోవ్యాసు్కలర్ రిస్్కలో ఉన్నారని హెచ్చరిస్తున్నారు. ఇంతకంటే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా తెలంగాణలో 29 శాతంగా ఉన్నట్లు సర్వే తేల్చింది. అందులో గ్రామీణ యువతలో తక్కువ బరువు ఉన్నవారి శాతం 30.9% కాగా.. పట్టణాల్లో ఇది 23.8% శాతంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో, తల్లులు తక్కువ చదువుకున్న కుటుంబాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది.మానసిక ఒత్తిడిలోయువత తెలంగాణలో వివిధ కారణాల వల్ల యువతలో 2023 నాటికి 71.3 శాతం మోస్తరు స్థాయి ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలో వెల్లడైంది. పెద్దల్లో ఇది 68 శాతంగా ఉంది. వారిలో పురుషులు 66.7 శాతంగా ఉంటే మహిళలు 75.9 శాతంగా ఉన్నారు. ఇక 22.6% మందిలో మితమైన ఆందోళన, 17.47% మందిలో మితమైన డిప్రెషన్ లక్షణాలు బయటపడ్డాయి. మహిళలకంటే పురుషులు తక్కువ మానసిక సమస్యలకు గురవుతున్నట్లు గణాంకాల ద్వారా తేలింది. పట్టణ యువతలో వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. కోవిడ్ తరువాత భావోద్రేకం లక్షణాలు 1.5 శాతం పెరిగినట్లు సర్వే తేల్చింది. కరోనా తర్వాత ఆరోగ్యంగా ఉండాలనే అభిలాష ప్రజల్లో పెరిగిందని.. గతంలో 23 శాతం మందే ఐదు రకాల ఆహార పదార్థాలు తీసుకోగా ఇప్పుడు వారి సంఖ్య 37 శాతానికి చేరినట్లు పేర్కొంది. అక్కడలా.. ఇక్కడిలా..సామాజిక, ఆర్థిక స్థితిగతులు కూడా వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు సర్వేలో తేలింది. సామాజికంగా దిగువస్థాయి వర్గాల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉండగా ఆరోగ్యంపై సరైన అవగాహన, వైద్యం లేకపోవడం వల్ల ఈ సమస్య ఏటా ఎక్కువవుతోంది. అదే సమయంలో ధనవంతుల ఇళ్లలో ఊబకాయ సమస్య ఎక్కువగా ఉంటుండగా పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య చాలా తక్కువ అని తేలింది. 2016లో ధనవంతుల ఇంటి యువతలో స్థూలకాయం 30.6% ఉండగా.. పేదల్లో ఇది 14.0% మాత్రమే. అలాగే పేదల్లో తక్కువ బరువుతో 36.1 శాతం మంది ఉండగా ధనవంతుల్లో అది 21.5 శాతంగా ఉంది. విద్యా స్థాయిల తేడాల వల్ల కూడా.. తల్లుల విద్యాస్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, వారి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉన్నాయని సర్వే స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు తల్లికి పదేళ్లకుపైగా చదువు ఉంటే వారి పిల్లల్లో తక్కువ బరువు కలిగి ఉన్న వారు 24.1% ఉండగా స్థూలకాయం 27.6% వరకు ఉంది. విద్య, ఆర్థిక స్థితి, మహిళా సంక్షేమం ఇవన్నీ పోషకాహారం, పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం పాఠశాల స్థాయిలో పోషకాహారం, ఆరోగ్య విద్య, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే పేద కుటుంబాలకు ప్రత్యేక ఆహార భద్రత కార్యక్రమాలు మరింత బలపరచాల్సిన అవసరం ఉంది. -
పత్రికల గొంతు నొక్కే ఉత్తర్వు చెల్లదు
సాక్షి, హైదరాబాద్: పత్రికల గొంతు నొక్కేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం చెల్లదని హైకోర్టు అభిప్రాయపడింది. జాతీయ భద్రతతోపాటు ఇతర కొన్ని ప్రమాదకర సందర్భాల్లో మాత్రమే గ్యాగ్ ఆర్డర్ జారీ చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. 2022లో ఓ వెబ్సైట్, యూట్యూబ్ చానల్పై ట్రయల్ కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వును కొట్టేసింది. తమకు వ్యతిరేకంగా అవమానకరమైన, అపవాదు తీసుకొచ్చేలా ఓ వెబ్సైట్లో వీడియోలు, చిత్రాలు, నివేదికలు, ప్రచురణలు, వ్యంగ్య చిత్రాలు ప్రచురించడాన్ని, ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కూకట్పల్లి కోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు మేఘాకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. 2022 డిసెంబర్ 2న కూకట్పల్లి కోర్టు ఇచ్చిన ఈ గ్యాగ్ అర్డర్ను సవాల్ చేస్తూ వెబ్సైట్, యూట్యూబ్ నిర్వాహకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకొనేలా ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని కోరారు. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ), 19 (1) (జీ)లను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ టి.వినోద్కుమార్, జస్టిస్ పి. శ్రీసుధ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ట్రయల్ కోర్టు జారీ చేసిన అభ్యంతరకరమైన ఉత్తర్వును కొట్టేస్తున్నామని స్పష్టం చేసింది. -
తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు అండగా నిలుస్తామని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భరోసా ఇచ్చారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చిన విద్యార్థులు స్థానిక చట్టాలపై అవగాహన లేకుండా ఏవైనా తప్పులు చేస్తే వారికి బీఆర్ఎస్ అమెరికా విభాగం తరఫున న్యాయ సహాయం చేస్తామని చెప్పారు. అమెరికాకు వర్థిన విద్యార్థులు ఏదైనా కారణంతో స్వదేశానికి తిరిగి వస్తే ఆ విద్యార్థితో పాటు వారి కుటుంబం కూడా ఎంతో ఆవేదనకు గురవుతుందని, ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థుల్లో మనోధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ విద్యార్థులు కూడా స్థానిక చట్టాలతో పాటు అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుని మసలుకోవాలని సూచించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్– డాలస్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులతో కేటీఆర్ మాట్లాడారు. యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. గతంలో భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు, చదువు కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు పడేవారని కేటీఆర్ గుర్తు చేశారు. వేగంగా మారిన ప్రపంచ పరిణామాలతో అనేక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో అమెరికాలో అవకాశాలు కూడా పెరిగాయని అన్నారు. ర్యాంకులు, గ్రేడ్ల కోసం కాకుండా జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సమాజంలో ప్రపంచంలో మంచి మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక ఐటీ మరింత అభివృద్ధి మంగళవారం డాలస్లో అక్కడి ఐటీ కంపెనీల యాజ మాన్య ప్రతినిధులతో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ పరిశ్రమను మరింత విస్తృతంగా అభివృద్ధి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఐటీ రంగంలో తెచ్చిన విప్లవాత్మక విధానాల వల్లే హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రభుత్వాలు, ఐటీ కంపెనీలు కలిసి పని చేస్తేనే ఏఐ రంగంలో దేశ యువత పోటీ పడగలుగుతుందన్నారు. అమెరికాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు భారత్లో ఖండాంతర సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశముందని చెప్పారు. దీంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీ రంగంవిస్తరించి ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు. తమ తొమ్మిదేళ్ల పాలనలో ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి నగరాల్లోనూ ఐటీ హబ్లు నిర్మించామని తెలిపారు. అమెరికాలోని యువత భారత్లో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని కోరారు. కేసీఆర్ జీవితం స్ఫూర్తిగా... సాహసోపేత నిర్ణయాల ద్వారానే కలలు సాకారం అవుతాయనేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితమే సాక్ష్యమని కేటీఆర్ అన్నారు. నలభై ఏళ్ల వయసులోనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి అవహేళనలు ఎదురైనా 14 ఏళ్లు నిరంతర పోరాటంతో ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని చెప్పారు. అమెరికాలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తిరిగి భారత్కు వచ్చి కంపెనీలు ప్రారంభించాలని, ఆవిష్కరణల యుగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని విద్యార్థులను కోరారు. భారత్లో సవాళ్లతో పాటు అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. మేధో వలస భారత్కు పెను సవాలుగా మారిందంటూ, ప్రవాస భారతీయ విద్యార్థులు దేశ, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్.. 70 మందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ కారణంగా 70 మందికి పైగా రోగులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు మానసిక రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనురాగ్ దుర్సెట్టి ఆసుపత్రిని సందర్శించారు.ఫుడ్ పాయిజన్ కారణంగా కరణ్ అనే మానసిక రోగి ప్రాణాలు కోల్పోయారు. 70 మందిలో 68 మంది పరిస్థితి నిలకడగా ఉంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘటనపై ఆరా తీశారు. ఉస్మానియానికి వచ్చిన వైద్య బృందం 68 మంది రోగులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. -
కోర్ సిటీలో ఇవి అత్యంత ఇబ్బందికరం..
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్ విభాగం అధికారులు హైదరాబాద్ సిటీలో ఉన్న కీలక వాటర్ లాగింగ్ ఏరియాలపై దృష్టి పెట్టారు. ఏఏ ప్రాంతాల్లో, ఏ స్థాయిలో వర్షానికి, ఎన్ని నీళ్లు నిలుస్తున్నాయి? అనే అంశాన్ని గడిచిన కొన్నాళ్లుగా అధ్యయనం చేశారు. దీని ఆధారంగా జాబితాను రూపొందించారు. ఈ నివేదికను జీహెచ్ఎంసీకి పంపిన ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో మరమ్మతులు చేయిస్తున్నారు. తొలి దశలో బేగంపేట, సైఫాబాద్ల్లో ఉన్న మూడు వాటర్ లాగింగ్ ఏరియాల రూపురేఖలు మారుస్తున్నారు. ఇప్పటికే ఓ ప్రాంతంలో పని పూర్తయిందని, మిగిలిన రెండు చోట్లా ఉన్న సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామని ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ‘సాక్షి’కి తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరోఆ ప్రాంతాలు అత్యంత ఇబ్బందికరం... జీహెచ్ఎంసీ (GHMC) గణాంకాల ప్రకారం ‘గ్రేటర్’లో దాదాపు 150 వాటర్ లాగింగ్ ఏరియాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారుల పైనే ఉండటంతో ఓ మాదిరి వర్షానికీ రోడ్లు మునిగిపోయి ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. డ్రైనేజీ, వరద కాల్వలు అన్నిచోట్లా లేకపోవడం, ఉన్నవీ ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడంతో ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ట్రాఫిక్ జామ్స్ సైతం నగర వ్యాప్తంగా ఒకేలా ఉండట్లేదు. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్స్ ఆ ప్రాంతానికే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని చోట్ల చుట్టుపక్కల ఏరియాల పైనా ప్రభావం చూపుతున్నారు. వాటర్ లాగింగ్ ఏరియాల్లో ఇలాంటి సమస్యాత్మకమైనవి గుర్తించిన ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రాధాన్యత క్రమంలో జీహెచ్ఎంసీ సహకారంతో అక్కడి సమస్యలు పరిష్కరిస్తున్నారు. కోర్ సిటీలో ఇవి అత్యంత ఇబ్బందికరం...నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మూడు వాటర్ లాగింగ్ ఏరియాలు అత్యంత ఇబ్బందికరంగా మారాయి. వీటివల్ల ఆ ప్రాంతంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లోనూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నారు. అత్యంత కీలకమైన రహదారుల్లో ఒకటైన బేగంపేట పరిధిలోని అమీర్పేట–సికింద్రాబాద్ మధ్య ఉన్న చీకోటి గార్డెన్స్తో పాటు సైఫాబాద్ పరిధిలోని ఓల్డ్ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, లక్డీకాపూల్ బస్టాండ్ వద్ద ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాలు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాయి. చీకోటీ గార్డెన్స్ వద్ద ప్రభావంతో పంజాగుట్ట, సోమాజీగూడ వరకు, మిగిలిన రెండు చోట్ల వాటర్ లాగింగ్ ప్రభావంతో ఖైరతాబాద్, నిరంకారి, అయోధ్య జంక్షన్, మాసబ్ట్యాంక్, రవీంధ్రభారతి తదితర ప్రాంతాల వరకు ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ఇవి క్లియర్ కావడానికి ఒక్కోసారి గంటలు పడుతుండటంతో సాధారణ వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యారో సహకారంతో చీకోటి గార్డెన్స్ వద్ద... ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు జీహెచ్ఎంసీ సహకారంతో ఆయా సమస్యలకు కారణాలు అధ్యయనం చేశారు. మురుగు, వరదనీటిని కూకట్పల్లి నాలాలోకి తీసుకువెళ్లే డ్రైనేజీ చీకోటి గార్డెన్స్ వద్ద అంతకు ముందు ప్రాంతాల కంటే చిన్నగా ఉండటంతో పాటు వర్షం కురిసినప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎస్), బేగంపేటలోని ఓల్డ్ ఎయిర్పోర్టు నుంచి భారీగా వరదనీరు రావడం కారణంగా గుర్తించారు. దీనికి పరిష్కారం కోసం అన్వేషించిన అధికారులు అక్కడ ఉన్న సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (క్యారో) సహకారం తీసుకున్నారు. వారి అనుమతితో అందులో ఉన్న ఓ చెరువును అభివృద్ధి చేసి హెచ్పీఎస్, ఓల్డ్ ఎయిర్పోర్టు నుంచి వచ్చే నీటిని డైవర్షన్ కెనాల్స్ ద్వారా అందులోకి మళ్లిస్తున్నారు. ఓ గేటు ఏర్పాటు చేయడం ద్వారా చెరువు నిండిపోతే... వంతుల వారీగా నీటిని బయటకు వదులి చీకోటీ గార్డెన్స్ డ్రైనేజీపై ఒత్తిడి తగ్గిస్తున్నారు. దీంతో అది పొంగిక వాటర్ లాగింగ్ తగ్గింది.జీహెచ్ఎంసీ సహకారంతో ముందుకు వాటర్ లాగింగ్ ఏరియాల వద్ద సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. తొలి దశలో కోర్ సిటీలోని మూడు ప్రాంతాలను ఎంచుకున్నాం. జీహెచ్ఎంసీ సహకారంతో అక్కడి సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం. చీకోటి గార్డెన్స్ వద్ద సమస్య పరిష్కారమైంది. మిగిలిన రెండు చోట్లా పైప్ లైన్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది. వర్షాలు ప్రారంభమయ్యే లోపు ఈ రెండు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి అవసరమైన పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నాం. – డి.జోయల్ డెవిస్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
యాక్సిడెంట్తో బయటపడ్డ అక్రమ నీటి దందా!
సాక్షి, సిటీబ్యూరో: నాగోలు ఠాణా పరిధిలోని జైపురికాలనీ చౌరస్తాలో ఆదివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం గ్రేటర్ హైదరాబాద్లో సాగుతున్న అక్రమ నీటి వ్యాపారాన్ని బయటపెట్టింది. బోర్ల ద్వారా జరుగుతున్న నీటి దందాను వెలుగులోకి తెచ్చింది. నగరంతో పాటు మూసీ తీరం వెంట అక్రమ నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులూ లేకుండా భారీగా బోర్లు వేస్తున్న కొందరు ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్నారు. వాటర్–ల్యాండ్–ట్రీ యాక్ట్ను (వాల్టా చట్టం) అడ్డంగా ఉల్లంఘిస్తున్నా.. ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా ప్రతి రోజూ రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నా సంబంధిత విభాగాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ అక్రమ నీటి వ్యాపారం ఫలితంగా అనేక కాలనీల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. పట్టుమని పది సంస్థలూ లేవు... గృహావసరాల కోసం బోరు వేయాలన్నా కచ్చితంగా స్థానిక తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఇలా వేసిన బోరు నీటిని కేవలం గృహ, వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కనీసం ఒక్క ట్యాంకర్ కూడా విక్రయించడానికి ఆస్కారం లేదు. ప్లాంట్ ఏర్పాటు చేసి, అనుమతి పొందితే శుద్ధి చేసిన తాగు నీరు విక్రయించవచ్చు. ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్మాలంటే కచ్చితంగా భూగర్భ జల శాఖ వద్ద అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం ఇలా అనుమతి తీసుకున్న వ్యక్తులు, సంస్థలు కనీసం పది కూడా లేకపోవడం గమనార్హం. భూగర్భ జలాలు పరిమితంగా ఉన్న చోట ఇలా బోర్ల ద్వారా విక్రయానికి అనుమతి లభించదు. ప్రస్తుతం నగరంలో మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా వందల అడుగుల బోర్లు వేసి ఆ నీటిని విక్రయిస్తున్న వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు. పగటి కంటే రాత్రివేళ ఎక్కువగా... సాధారణ రోజుల్లో ఈ అక్రమ నీటి దందా పగటి వేళలో కంటే రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతుంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు అక్రమ వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా 24 గంటలూ నీటిని తరలిస్తూనే ఉంటున్నారు. భారీ పరిణామంలో బోర్లు వేసిన ఈ అక్రమార్కులు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జనరేటర్లు వినియోగించి మరీ నీటిని తోడేస్తున్నారు. కనీసం ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా రూ.లక్షల్లో వ్యాపారం చేసేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ను దాని పరిమాణాన్ని బట్టి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నారు. రోజుకు కొన్ని వందల ట్యాంకర్ల నీరు ఇలా ట్యాంకర్ల ద్వారా నీటికి ప్రముఖ హోటళ్లు, లాడ్జిలు, అపార్ట్మెంట్స్, హాస్టళ్లకు అమ్మేస్తున్నారు. వినియోగం ఎంత శ్రేయస్కరం...? ఈ అక్రమ నీటి వ్యాపారం వెనుక ఆరోగ్యానికి చేటు కలిగించే కోణమూ ఉందని తెలుస్తోంది. ట్యాంకర్లలో నీటిని నింపే బోర్లలో కొన్ని మూసీ తీరంలో ఉన్నాయి. ఫలితంగా వీటి నుంచి వచ్చే నీళ్లల్లో మూసీలోని రసాయన వ్యర్థాలకు సంబంధించిన ఆనవాళ్లూ ఉంటున్నాయని తెలుస్తోంది. ఈ నీటిని ఖరీదు చేస్తున్న హోటళ్లు, లాడ్జిల నిర్వాహకులు, అపార్ట్మెంట్స్ వాసుల్లో కొందరికి ఈ విషయం తెలిసినా తప్పక ఖరీదు చేస్తున్నారు. ఈ నీటిని తాగడానికి వాడకపోయినా ఇతర అవసరాలకు, హోటల్, లాడ్జిల్లో సరఫరాకి వాడేస్తున్నారు. మరికొందరికి ఈ ట్యాంకర్ డ్రైవర్లు విషయం చెప్పకుండా విక్రయించేస్తున్నారని సమాచారం. వేసవి కాలంలో ఉండే నీటి డిమాండ్ను ఈ బోర్ల నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. అక్రమ దందాలకు మచ్చుతునకలు: ఉప్పల్ మండలంలో మూసీ తీరం వెంట అనేక చోట్ల ఈ అక్రమ నీటి వ్యాపారం జరుగుతోంది. అంబర్పేట శ్మశాన వాటికను కూతవేటు దూ రంలోనూ బోర్ల ద్వారా నీటిని తోడేసి ట్యాంకర్ల ద్వారా విక్రయించే దందా నడుస్తోంది. న్యూ మార్కెట్ మెట్రోస్టేషన్ సమీపంలో, ఛే నంబర్ ఫ్లైఓవర్ మార్గంలో, శ్రీనగర్ కాలనీలో జోరుగా సాగుతోంది.చదవండి: ఇక సర్వే నంబర్లు మార్చుకోవచ్చు పట్టించుకోని సంబంధిత విభాగాలు...అక్రమ నీటి దందాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఈ బోర్ల ద్వారా జరుగుతున్న దందా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదనే విమర్శలు ఉన్నాయి. యథేచ్ఛగా సాగుతున్న ఈ దందా కారణంగా రాజధానిలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జాలాలు అడుగంటి పోతున్నాయి. ట్యాంకర్ డ్రైవర్ల నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కారణంగా వాహనచోదకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఇవి తిరిగే మార్గాల్లో రహదారులు సైతం ఛిద్రం అవుతున్నాయి. ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి నీటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ‘అనుమతులు లేకుండా బోర్లు వేయడం నేరం. ట్యాంకర్ల ద్వారా అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు ఉంటాయి. అలాంటి బోర్లు, వాహనాలు సీజ్ చేస్తాం’ అని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. -
తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. సర్కార్ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం నాలుగు యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంతో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది. సాక్షి మీడియాతో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో కోవిడ్ నియంత్రణలో ఉందని కోవిడ్ పాండమిక్ స్టేజ్ నుంచి ఎండ్మిక్ స్టేజ్కి వచ్చిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కోవిడ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కాదని ప్రకటించింది. ఇప్పుడు వైరస్ ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే చాలా మైల్డ్ లక్షణాలు ఉంటాయి. సాధారణంగా కొన్ని జాగ్రత్తలు ప్రజలు పాటించాల్సిందే. వృద్ధులు, కోమోర్బిడిటీస్ ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలి.. వేరియంట్ అనేది కాలంతో పాటు మారుతూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది ముఖ్యం. ఇప్పుడు మైల్డ్ లక్షణాలు ఉంటున్నాయి’’ అని రవీందర్ నాయక్ వివరించారు.ప్రజలు పానిక్ కావొద్దు. అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలకు మార్గదర్శకాలు, సూచనలు పంపిస్తున్నాం, కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాం. మన దగ్గర పరిస్థితి కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని రవీందర్ నాయక్ తెలిపారు. -
గాంధీ భవన్కు భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్కు భద్రతను పెంచారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ చర్యలకు దిగినట్లు.. అందుకు కేబినెట్ విస్తరణే కారణమన్నట్లు సమాచారం. ఆశించిన వారు పదవి దక్కకపోతే తమ వర్గీయులతో ఆందోళనకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. -
పట్టాలపై మృత్యుఘంటికలు
సాక్షి, హైదరాబాద్: పట్టాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. పట్టాలు దాటుతూ రైళ్లు ఢీకొని కొందరు, బలవన్మరణాలకు పాల్పడుతూ మరికొందరు పట్టాలపైనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ట్రాక్లకు రెండు వైపులా సరైన రక్షణ వ్యవస్థలు, కంచెలు లేకపోవడం వల్ల ప్రజలు యథేచ్చగా పట్టాలు దాటేస్తున్నారు. మరోవైపు ట్రైన్ తమను చేరే లోపు ట్రాక్ దాటేయొచ్చనే అతివిశ్వాసం కూడా నిండు ప్రాణాలను హరిస్తోంది. నగరంలోని ఎంఎంటీఎస్, సబర్బన్ ప్రాంతాల్లోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగించే ట్రాక్లకు రెండు వైపులా కాలనీలు, బస్తీలు ఉన్నాయి. రాత్రింబవళ్లు ఈ ట్రాక్లను దాటుతూ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దక్షిణమధ్య రైల్వేలోని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు, అధికారుల అంచనాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 450 ప్రమాదాలు నమోదయ్యాయి. ప్రతి రోజు సగటున మూడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నిజానికి రైల్వే భద్రతా చట్టాల ప్రకారం పట్టాలు దాటడం నేరం. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలనీలు, నివాస సముదాయాలకు సరైన రోడ్డు రవాణా సదుపాయాలు, పట్టాలు దాటవలసిన చోట ఫుట్ఓవర్ బ్రిడ్జి వంటి ఏర్పాట్లు లేకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పట్టాలు దాటాల్సి వస్తోందని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘పట్టాలను దాటుతూ ప్రమాదాల బారినపడాలని ఎవరూ కోరుకోవడం లేదు. కానీ ఇవి తమ దైనందిన జీవితంలో భాగమమయ్యాయి.’’ అని డబీర్పూరా ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఒక్క డబీర్పురా, ఉప్పుగూడ, మలక్పేట్, చాంద్రాయణగుట్ట వంటి ప్రాంతాలే కాదు. లింగంపల్లి నుంచి ఫలక్నుమా వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, మేడ్చల్, మల్కాజిగిరి, చర్లపల్లి, ఉందానగర్, బీహెచ్ఈఎల్, సికింద్రాబాద్ వంటి అనేక చోట్ల పట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మలుపులు...మృత్యు పిలుపులు ‘‘లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే క్రమంలో నేచర్క్యూర్ హాస్పిటల్, భరత్నగర్, హఫీజ్పేట్, తదితర చోట్ల ట్రాక్ మలుపులు ఉన్నాయి. ఈ రూట్లో ట్రైన్ దగ్గరకు వచ్చే వరకు గుర్తించడం కష్టం. ట్రైన్ వచ్చేలోపు దాటేయవచ్చునని భావిస్తారు. ట్రైన్ శబ్దాన్ని విని చాలా దూరంగా ఉందనుకుంటారు. కానీ కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే అది వందల మీటర్ల దూరం పరుగులు తీస్తుంది.’’ అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ఈ మలుపుల వద్దనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మరోవైపు ఆత్మహత్యలకు పాల్పడేందుకు ట్రాక్లను ఆశ్రయిస్తున్నారు. దూసుకొచ్చే రైళ్లకు ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.‘‘ ట్రైన్కు ఎదురుగా మనిషి ఉన్నట్లు గుర్తించి బ్రేక్ అప్లయ్ చేస్తాం, కానీ అది కనీసం కిలోమీటర్ దూరంలో ఆగుతుంది. అప్పటికే ఆ వ్యక్తిని రైలు ఢీకొంటుంది.’’ అని ఎంఎంటీఎస్ లొకోపైలెట్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 189 మంది ఇలా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సోషల్ మీడియా మేనియా.... సామాజిక మాధ్యమాల పిచ్చి కూడా నిండుప్రాణాలను బలితీసుకుంటోంది. ట్రాక్లపైన నించొని రకరకాల రీల్స్ చేస్తున్నారు. రైళ్లకు ఎదురెళుతూ వీడియోలు తీసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా వంటి వేదికల్లో తమ సాహసకృత్యాలను ప్రదర్శించుకుంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ యువత ఇలాంటి సోషల్ మీడియా మేనియాలో పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల ఓ యువకుడు సనత్నగర్ వద్ద పరుగులు తీస్తున్న ఎంఎంటీఎస్ పక్కన నించొని ఫొటోలు, వీడియోలు తీసుకొనేందుకు ప్రయతి్నంచి రైలు ఢీకొనడంతో చనిపోయాడు. ఫుట్బోర్డుపైన నిలుచుని గాలిలో ఊగుతూ వీడియోలు తీస్తూ దుస్సాహసాలకు పాల్పడుతున్నారు. ‘‘ తాము పట్టాల పక్కనే నించున్నాం. ప్రమాదం లేదనుకుంటారు. కానీ ట్రైన్ వెడల్పును అంచనా వేయలేరు.అలా ఢీకొని చాలా ప్రమాదాలు జరిగాయి.’’ అని ఆరీ్పఎఫ్ సిబ్బంది ఒకరు తెలిపారు.రైలు ఢీకొని అన్నదమ్ముల దుర్మరణంకాచిగూడ: రైలు ఢీకొని అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాకుత్పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ కమల్ కుటుంబంతో కలిసి సమీపంలోని రైలు పట్టాల వద్ద నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడైన మహ్మద్ షాబుద్దీన్ (26) ఎలక్ట్రికల్ షాపులో వర్కర్గా పని చేస్తుండగా, చిన్న కుమారుడు మహ్మద్ ఫైజల్ (21) వెల్డింగ్ వర్కర్గా పని చేస్తున్నాడు. సోమవారం అన్నదమ్ములిద్దరూ గడ్డికోసం పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచి్చన రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను స్వా«దీనం చేసుకున్న రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవరితోనూ పొత్తు ఉండదు
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అన్నట్లుగా ఎవరో మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు. సొంతంగానే మనుగడ సాగిస్తూ.. ఒంటరిగానే పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తుంది. వంద అసెంబ్లీ సీట్లతో గులాబీ జెండా ఎగురుతుంది’అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొ న్న అనంతరం జరిగిన సమావేశంలో హరీశ్రావు ప్రసంగించారు. ‘బీజేపీకి తెలంగాణ మీద మాట్లాడే హక్కు లేదు.పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు బనకచర్ల లింకు అక్రమ ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నది. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు శాపం కాబోతున్నా కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడటం లేదు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బనకచర్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లి నిలుపుదల చేస్తాం. కృష్ణా నదిలో నీళ్లు ఆపకుండా, గురువు చంద్రబాబుకు దాసోహం అయిన సీఎం ఇప్పుడు గోదావరి నీళ్ల విషయంలోనూ అదే చేస్తున్నారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెట్టినా, ఢిల్లీలో ధర్నా చేసినా కలసి వచ్చేందుకు సిద్ధం, బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి ఏదైనా చేస్తాం’అని హరీశ్ అన్నారు. ఆ ఫుటేజీ బయట పెట్టాలి..‘సీఎంకు దగ్గరగా ఉండే ఒక ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్, ఐఏఎస్ అధికారి.. మిస్ ఇంగ్లండ్ పట్ల అనుచితంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయట పెట్టి, వారిపై కేసులు నమోదు చేయాలి. తెలంగాణను కేసీఆర్ ప్రపంచ పటంలో నిలబెడితే, రేవంత్ తెలంగాణకు తలవంపులు తెచ్చారు’అని హరీశ్ ధ్వజమెత్తారు. రేవంత్ పాలనలో ఆదాయం నేలచూపులు..‘రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని దిక్కుమాలిన ప్రచారం చేసే వాళ్లు దివానా గాళ్లు. ఆరు గ్యారంటీల పేరిట హామీలు ఇచ్చి, తాను తీసుకున్న గోతిలో రేవంత్ తానే పడిపోయారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆదాయం ఆకాశం వైపు చూస్తే, రేవంత్ పాలనలో నేల వైపు చూస్తున్నది. ఎన్నడూ జై తెలంగాణ అనని రేవంత్రెడ్డి.. తెలంగాణ ద్రోహి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్కు లేదు’అని హరీశ్ విమర్శించారు.దుర్మార్గుల చేతుల్లోకి తెలంగాణరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసి గందర గోళానికి గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నా యన్నారు. తెలంగాణ రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లోకి వెళ్లిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాలు కలిచివేశాయని, ఓ దశలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి అనుకున్నట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తదితరులు ప్రసంగించారు. మధుసూదనాచారి, హరీశ్రావు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే జయశంకర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. తర్వాత జాతీయ పతాకాన్ని మధుసూదనాచారి ఆవిష్కరించారు. -
కాళేశ్వరంపై విష ప్రచారం ఆపాలి
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టు.. కూలేశ్వరం అయ్యిందని కొంతమంది మూర్ఖులు తెలిసీతెలియక మాట్లాడుతు న్నారు. అది 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జల అక్షయపాత్ర. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంతోనే పునరుజ్జీవనం పొందింది. త్రీ గోర్జెస్ డ్యామ్ను నిర్మించేందుకు చైనాకు 16 ఏళ్లు పట్టింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలో నాలుగేళ్లలోనే నిర్మించిన ఘనత కేసీఆర్ది. 371 పిల్లర్లు కలిగిన మూడు బరాజ్లలో రెండు పిల్లర్లకు నష్టం జరిగితే మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందనే విష ప్రచారాన్ని ఆపి.. కాళేశ్వరం ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలి’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులు పూర్తయితే కేసీఆర్కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ పనులు చేపట్టడం లేదన్నారు. డాలస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2023 నాటికి రెండు పంటలకు కలిపి 2.29 కోట్ల ఎకరాలకు నీళ్లు అందించి పంజాబ్, హరియాణాలను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను కేసీఆర్ అగ్రస్థానంలో నిలిపారన్నారు. పదేళ్లలో తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదని, మితిమీరి అప్పులు చేయలేదని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చేయకూడని అప్పు, చేయకూడని తప్పులేవీ చేయలేదని కేటీఆర్ అన్నారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...అవకాశాల అక్షయపాత్ర తెలంగాణ‘తెలంగాణను పదేళ్ల పాలనలో అవకాశాల అక్షయ పాత్రగా తీర్చిదిద్దాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల స్ఫూర్తి డాలస్లో నూ కనిపిస్తోంది. ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్వి స్తుంది. అమెరికన్ డ్రీమ్ తరహాలో కేసీఆర్ తెలంగాణ స్వ ప్నాన్ని మహాత్ముడు, అంబేడ్కర్, మార్టిన్ లూథర్కింగ్ స్ఫూ ర్తితో ముందుకు సాగి సాకారం చేశారు. మళ్లీ మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తాం. కేసీఆర్ సీఎం అవుతారు. తెలంగాణను ప్రేమించడంలో వెనుకబడంఅధికారాన్ని బాధ్యతగా భావిస్తూ ఉద్యమ స్ఫూర్తితో ప్రభు త్వాన్ని నడిపి విడిపోతే విఫల రాష్ట్రం అవుతుందని హేళన చేసిన చోటనే విజయకేతనం ఎగరవేశాం. గేలి చేసిన నోళ్లతో నే మాకు కూడా మీలాంటి నాయకులు ఉంటే బాగుంటుంద నిపించాం. స్వరాష్ట్రాన్ని నంబర్వన్గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా కేసీఆర్ నాయకత్వంలో వదులుకోలేదు. ఉద్యమంలో తెలంగాణ ఎన్నారైలు పోషించిన పాత్ర అద్వి తీయం. పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా ఏనా డూ బతుకమ్మ, బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని మర్చిపోలే దు. అమెరికాలో మన విద్యార్థులకు వస్తున్న ఇబ్బందులను తొలగించేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేసి అండగా నిలబడతామని కేసీఆర్ దూతగా మీకు మాట ఇస్తున్నా.ఘనంగా రజతోత్సవ సభడాలస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలకు వేలాదిమంది హాజరయ్యారు. విదేశాల్లో బహిరంగ సభ నిర్వహణ ద్వారా బీఆర్ఎస్ కొత్త సాంప్రదాయానికి తెరలేపింది. సభాప్రాంగణ సామర్థ్యం 7 వేల కెపాసిటీకాగా, ఫైర్కోడ్ యాక్టివేట్ కావడంతో సుమారు ఐదు వేల మంది సభా ప్రాంగణం బయటే ఉండిపోయారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో సభలు నిర్వహించే ప్రాంగణాల్లోకి నిర్ణీత సంఖ్యను దాటి జనం వస్తే ఫైర్కోడ్ యాక్టివేట్ అవుతుంది. కాగా అమెరికా నలుమూలల నుంచి ఈ సభకు ప్రవాస తెలంగాణవాసులు, ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. ఈ సభా వేదికగా, బీఆర్ఎస్, తెలంగాణ విజయగాథను కేటీఆర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శన, ధూంధాంకు నేతృత్వం వహించారు. -
2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా తెలంగాణ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దడంలో తెలంగాణ అగ్రభాగాన నిలువనుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్–2047 నినాదంతో పదేళ్లలో రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్ది, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. దేశంలోనే గాక ప్రపంచంలోనే తెలంగాణను నంబర్ వన్గా నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నంలో ప్రజలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్లోని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అమర వీరులకు ఘన నివాళులు అరి్పంచారు. తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి చేస్తున్న కృషిని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అన్ని వ్యవస్థలనూ చక్కదిద్దుతున్నాం.. ‘రాష్ట్రం వచ్చి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కట్టు బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు. అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మేము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతున్నాం. ప్రజా ఆలోచనలే ఆచరణగా ముందుకు సాగుతున్నాం. నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ఆర్సీ సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. ఇందిరా మహిళా శక్తి మిషన్ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాం. మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. బస్సులకు మహిళలను యజమానులుగా మార్చే కా ర్యక్రమాలను చేపట్టాం. ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఇప్పటికే 150 బస్సులను అందజేశాం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్, ఇందిరమ్మ ఇళ్లులాంటి పథకాలు అమలు చేస్తున్నాం. రైతన్న సంక్షేమానికి పెద్దపీట రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. కేవలం 8 నెలల్లో 25,35,964 మందికి రూ.20,617 కోట్లు మాఫీ చేశాం. వారికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నాం. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి–2025 చట్టాన్ని తీసుకువచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాం. యువతే మన భవిష్యత్తు.. యువతే మన భవిష్యత్తు అనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించాం. డీఎస్సీ ప్రకటించి 10 వేల మందికి పైగా టీచర్లను నియమించాం. సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ స్కూల్ విధానం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాం. అన్నివర్గాల విద్యార్థులు ఒకేదగ్గర ఉండేందుకు వీలుగా తొలిదశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టాం. కులగణనతో దేశానికి ఆదర్శంగా.. కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం. తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టేందుకు సిద్ధమైంది. ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్ధత కల్పించాం. నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు ఇళ్లు లేని నిరుపేదలు ఇంటిని నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. పేదల ఆకలి తీర్చడమే కాదు.. వారు ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం. తెలంగాణలో 3 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ సెట్టర్. తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. దావోస్, సింగపూర్, జపాన్ లాంటి దేశాల్లో పర్యటించి ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్సీఎల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలు హైదరాబాద్లో తమ సంస్థలను విస్తరిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్లో ఇదొక తొలి మెట్టు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ మూసీని పునరుజ్జీవింప చేయడంతో పాటు బాపూఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా దాదాపు రూ.18 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రూ.24 వేల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘భారత్ సమ్మిట్’కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం. దేశ సమగ్రత కోసం రాజకీయాలకు అతీతంగా..ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం కల్పించాం. 100కు పైగా దేశాల నుంచి పోటీల్లో పాల్గొన్నారు. వారంతా తెలంగాణ చారిత్రక కట్టడాలను, టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించి తెలంగాణ చారిత్రక వైభవాన్ని ‘తెలంగాణ.. జరూర్ ఆనా’అంటూ ప్రపంచం నలుదిశలా చాటారు. పహల్గాం దాడి నేపథ్యంలో మన సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. కవులు, కళాకారులకు రూ.కోటి చొప్పున పురస్కారంతెలంగాణ ఆవిర్భావ వేడుకలను పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, జపాన్లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. వివిధ పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన పోలీసులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ జరిపిన కవాతు ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జానపద కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, తెలంగాణ ప్రజాపోరాటానికి స్ఫూర్తినిచ్చిన 9 మంది కవులు, కళాకారులకు సీఎం రేవంత్రెడ్డి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. 2024 డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా 9 మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు పురస్కారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు పురస్కారాలను చెక్కుల రూపంలో అందించిన సీఎం.. వారి సేవలను కొనియాడారు. అవార్డు అందుకున్న గద్దర్ సతీమణి.. దివంగత ప్రజాకవి గద్దర్ తరఫున ఆయన సతీమణి విమల, గూడ అంజయ్య తరఫున ఆయన సతీమణి హేమనళిని, బండి యాదగిరి తరఫున ఆయన కుటుంబసభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు. గోరటి వెంకన్న విదేశాల్లో ఉండడంతో ఆయన కుమార్తె సుప్రజ స్వీకరించారు. వీరితోపాటు అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, శిల్పి ఎక్కా యాదగిరి రావు, జర్నలిస్టు పాశం యాదగిరికి నగదు పురస్కారాలు అందజేశారు. బహు భాషా సాహితీవేత్త నలిమెల భాస్కర్కు కాళోజీ పురస్కారం అందించి గౌరవించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీస్ అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, మరో 11 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను సీఎం రేవంత్రెడ్డి అందజేశారు. -
నోటీస్ కాదు.. నన్ను సస్పెండ్ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పెదవి విరుస్తూ వస్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి తన అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రధానంగా నిన్న(ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్ షాపుకు రాజాసింగ్ దూరంగా ఉన్నారు. పలువురు నేతలు ఈ వర్క్ షాపుకు దూరం కాగా, అందులో రాజాసింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్కు పార్టీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతుందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధానంగా దీనిపై స్పందించిన రాజాసింగ్.. ‘ మీడియాలో ఒక వార్త నడుస్తుంది, రాజాసింగ్కు నోటీస్ ఇవ్వడానికి పార్టీ ప్లాన్ చేస్తోందనే చర్చ తెరపైకి వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే నోటీస్ కాదు.. ఏకంగా నన్ను సస్పెండ్ చేయండి’ అంటూ రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు రాజాసింగ్. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే అప్పుడు అందరి జాతకం బయటపెడతా. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగింది అనే నిజం చెప్పి అందరి జాతకం ప్రజలు ముందు పెడతా’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.ఇదిలా ఉంచితే, గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ గుర్రుగా ఉన్నారు. పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తన్నారు. కొన్ని రోజుల క్రితం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.. రాజాసింగ్ వద్దకు వెళ్లి రాజీ చేసే యత్నం చేశారు. పార్టీ అభివృద్ధి కలిసి నడవాలని రాజాసింగ్కు సూచించారు. ఆ సమయంలో బండి సంజయ్తో జరిగిన సఫలం అయినట్లు కనిపించినా తాజా ఎపిసోడ్తో రాజాసింగ్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు ఆయన తాజా వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కిషన్రెడ్డితో సఖ్యత లేదా?.. బీజేపీలో ఏం జరుగుతుంది?‘టైమ్ పాస్ మీటింగ్లతో అలసిపోయాం’ -
‘తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషియన్ ఆయనే’
హైదరాబాద్: తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది ఈటెల రాజేందరేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమర్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ను వదిలి పెట్టిన అంటున్న ఆయన.. 24 గంటలు బీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్న విషయం ఆ పార్టీ నాయకులే గుర్తించట్లేదని ఎద్దేవా చేశారు. ‘ లెఫ్ట్ వింగ్ లో ఉన్న ఈటెల రాజేందర్ పార్టీ అధ్యక్ష పదవికోసం రైట్ వింగ్ లోకి పోయాడు.. ఏ పదవి రావట్లేదని మా నాయకులపై ప్రస్టేషన్తో ఈటెల రాజేందర్ మాట్లాడొద్దు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే ఇవాళ ఆవిర్భావ సభలు జరుగుతున్నాయి..రేవంత్ రెడ్డి సన్నిహిత ఎంపీ ,కార్పొరేషన్ చైర్మన్ లు నన్ను ఇబ్బంది పెట్టారని ఇంగ్లాండ్ మిస్ మ్యాగీ అంటుంది అని హరీష్ రావు అంటుంన్నాడు..మీ దగ్గర వీడియో ఫుటేజ్ ఉంటే బయట పెట్టండి. ప్రభుత్వాన్ని బదనం చేయడానికి మిస్ ఇంగ్లాండ్ మ్యాగీతో అలా మాట్లాడించారేమో బీఆర్ఎస్ వాళ్లు. నిన్న కౌంటర్గా కేసులు కూడా పెట్టారు. నిన్న కౌంటర్ గా కేసులు కూడా పెట్టారు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని పదేండ్లు అనుభవించారు..అధికారుల లిస్ట్ రెడ్ బుక్లో నమోదు చేస్తా అనడం విడ్డూరంగా ఉంది. అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేయాలనే విషయంలో హరీష్ రావు రోల్ మోడల్. రేవంత్ రెడ్డి ఎక్కడనైనా ఉండి సమీక్ష చేస్తడు...ములుగు అడవుల్లోనైన సమీక్ష చేస్తడు. మీరు ప్రగతి భవన్ అని ప్రగతి లేని బిల్డింగ్ కడితే మేము అధికారంలోకి రాగానే గడీలు పగలగొట్టాం’ అని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. -
మేక మేతకోసం చెట్టెక్కిన అన్నదమ్ములు.. రైలు ఢీకొని ఇద్దరి మృతి
సాక్షి,హైదరాబాద్: యాకత్ పురాలో విషాదం చోటు చేసుకుంది. మేక మేత కోసం అన్నదమ్ములు షాబుద్దీన్, ఫైజాన్లు చెట్టెక్కారు. చెట్టు ఆకులు విరిచే ప్రయత్నం చేస్తుండగా ఊహించని దుర్ఘటన ఎదురైంది.చెట్టుకొమ్మలు విరగడంతో అన్నదమ్ములు షాబుద్దీన్,ఫైజాన్లు రైలు పట్టాల మీద పడ్డారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ ట్రైన్ ఆ ఇద్దరిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములిద్దరూ దుర్మరణానికి గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కాళేశ్వరం నోటీసులు.. కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యే విషయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. మాజీ మంత్రి హరీష్రావుతో పలు దఫాలుగా ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే ఆయన విచారణకు హాజరవుతారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో.. ఇప్పుడు విచారణకు మరింత గడువు కోరే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. జూన్ 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీన విచారణకు రాలేనని.. బదులుగా మరో తేదీని కేటాయించాలని ఆయన ఇప్పుడు కమిషన్కు బదులు ఇవ్వబోతున్నారట!. ఇతర కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని, కావాలంటే ఈ నెల 11వ తేదీన హాజరవుతానని ఆయన లేఖలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే ప్రాజెక్టు కోసం పని చేసిన ముఖ్య అధికారులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేసింది కూడా.ఇదీ చదవండి: అదే స్పూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి -
Telangana Formation Day: రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం
హైదరాబాద్, సాక్షి: దశాబ్దాల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని.. పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి (Anumula Revanth Reddy) అన్నారు. సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day Celebrations) పాల్గొని ఆయన ప్రసంగించారు.‘‘దశాబ్దాల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చి పదేళ్లు అయినా ఆకాంక్షలు నెరవేరలేదు. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం. ఇది సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు. తెలంగాణ సమాజానికి మహిళలే పునాది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది.ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశాం. రూ.2 లక్షల రైతురుణమాఫీ చేసి రుణవిముక్తులను చేశాం. రైతులు ఆత్మగౌరవంగా బతికేలా చేశాం. తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. రైతులు దళారుల బారిన పడకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8వేల కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చాం. భూభారతి చట్టం తీసుకొచ్చాం. ధరణి కొందరికి చుట్టమైతే.. భూభారతి ప్రజలకు రక్షణ. ఒలింపిక్స్లో మన దేశానికి అనుకున్నంత స్థాయిలో పథకాలు రాలేదు. మట్టిలో మాణిక్యాలను తయారు చేసేందుకు స్పోర్ట్స్ అకాడమీ తీసుకొచ్చాం. వచ్చే ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి బంగారు పతకం తేవడమే మా లక్ష్యం. పేదల ఆరోగ్యం మా ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం. ఇప్పటిదాకా 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాం. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు కల్పించాం. ప్రతి నియోజకవర్గానికి యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు శ్రీకారం చుట్టాం. సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్య మీద పెట్టేది ఖర్చు కాదు.. భవిష్యత్ పెట్టుబడి’’ అని సీఎం రేవంత్ ప్రసంగించారు.ప్రసంగానికి ముందు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రేవంత్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అంతకు ముందు..గన్ పార్క్లో అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ వేడుకలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు రాజ్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు. -
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కేసీఆర్, పార్టీ నేతల శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాం. అదే స్పూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారాయన. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హరీష్రావు ట్విట్టర్ వేదికగా.. దశాబ్దాల కాలపు కొట్లాటకు, నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు. సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం నేడు. ‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో.. కేసీఆర్ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు. .. సబ్బండ వర్గాలు ఏకమై గర్జించి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాట ఫలితం తెలంగాణ. స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువ లేనివి. వారికి జోహార్లు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల కాలపు కొట్లాటకు, నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు.సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం నేడు.‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో..కేసీఆర్ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు. సబ్బండ… pic.twitter.com/K83N9b19CV— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2025 -
ఆపరేషన్ కగార్ పేరుతో నరమేధం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశంలో ప్రజాస్వా మ్యాన్ని కాపాడుకొ నేందుకు లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశంలో ప్రస్తుతం ఫాసిస్టు పాలన సాగు తోందని విమర్శించారు. మావో యిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గ ఢ్లో నరమేధం కొనసాగిస్తున్నా రని ఆరోపించారు.మావోయిస్టు లు చర్చలకు సిద్ధమని ప్రకటించినా చలించని ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్టి కాయలు వేయగానే పాకిస్తాన్ ఉగ్రవాదులతో చర్చ లకు సిద్ధమయ్యారని విమర్శించారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు అంగీకరించిన మోదీ ప్రభు త్వం.. సొంత దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు సృష్టిస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మహేష్కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.ఆదివాసీలపై యుద్ధం ఆపాలి: కోదండరామ్ఎన్కౌంటర్ల పేరుతో నక్సలైట్లను చంపటం సరికా దని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివాసీలపై యుద్ధం ఆపాలని కోరారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. సమాజంలో శాంతిని కోరుకోవడం సరైనమార్గమని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి నమూనాలో భాగంగానే మావోయిస్టుల అణిచివేతకు దిగిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. శాంతి చర్చల కమిటీ ప్రతినిధి ప్రొ ఫెసర్ అన్వర్ ఖాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఐ నేతలు పద్మ, వేములపల్లి వెంకట రామయ్య, జీవన్కుమార్, అన్వేష్, కందిమల్ల ప్రతా ప్రెడ్డి, గాదగోని రవి తదితరులు పాల్గొన్నారు. -
స్లాట్ బుకింగ్ నేటి నుంచే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది. స్లాట్బుకింగ్తోపాటు కృత్రిమ మేధ (ఏఐ) సహకారంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో చాట్బాట్ ‘మేధ’సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి స్లాట్ బుకింగ్ విధానాన్ని ఇప్పటికే రెండు దశల్లో పైలట్ ప్రాజెక్టు పద్ధతిన అమలు చేశారు.తొలిదశలో ఏప్రిల్ 10 నుంచి 22 మధ్య, రెండో దశలో మే 12 నుంచి 25 దాకా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ విధానం ద్వారా ఇప్పటివరకు 45,191 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయని.. మాన్యువల్ విధానంతో పోలిస్తే సుమారు 3 వేల వరకు ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయని సమీక్షలో అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సులభతరమైన సేవలను పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అయితే స్లాట్ బుకింగ్తోపాటు ప్రతి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఐదు మాన్యువల్ రిజిస్ట్రేషన్లు చేసే విధానం కూడా కొనసాగనుంది. వాట్సాప్లోనే సమాధానాలు ఆస్తుల క్రయవిక్రయదారులు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ ద్వారా నేరుగా సందేహాలు నివృతి చేసుకొనేందుకు 82476 23578 అనే నంబర్కు వాట్సాప్లో సందేహాలు పంపితే వెంటనే సమాధానాలు వచ్చేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే సంబంధిత సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివరాలు, అందుబాటులో ఉండే సమయం, డీడ్లవారీగా రిజిస్ట్రేషన్ చార్జీలు, మార్కెట్ విలువలను కూడా నేరుగా క్రయవిక్రయదారుల సెల్ఫోన్లకు పంపేలా అధికారులు సాఫ్ట్వేర్ రూపొందించారు. ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లు కూడా..: మంత్రి పొంగులేటి సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ క్రయవిక్రయదారుల సమయాన్ని ఆదా చేయడంతోపాటు వారికి అవినీతిరహిత పారదర్శక సేవలందించడమే లక్ష్యంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. పైలట్ పద్ధతిలో ఈ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిలో 94 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినందున రాష్ట్రవ్యాప్తంగా స్లాట్ బుకింగ్ను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ విధానం అమలు దృష్ట్యా పనిభారం అధికంగా ఉన్న 9 కార్యాలయాల్లో సబ్రిజిస్ట్రార్ సహా అదనపు సిబ్బందిని నియమించామని చెప్పారు.ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (మధ్యాహ్న భోజన సమయంలో మినహా) ప్రజలు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని.. ప్రతి కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అత్యవసర సందర్భాల్లో నేరుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వీలుగా సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటల మధ్య 5 వాకిన్ రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తామన్నారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నందున ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని పొంగులేటి పేర్కొన్నారు. త్వరలోనే ఈ–ఆధార్.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేలా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ–ఆధార్ను కూడా తీసుకొస్తామని.. అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా త్వరలోనే డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ను అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. లేఅవుట్లవారీగా రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలు ఎరుపు రంగులో కనిపించేలా మాడ్యూల్ను రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. -
యువ వికాసం అర్హుల లెక్క తేలాకే..
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం(Rajiv Youth Development) మంజూరు పత్రాల జారీ వాయిదా పడింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తొలి రెండు కేటగిరీల వారికి యూనిట్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే అర్హులందరికీ మంజూరు పత్రాలు ఇచ్చేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఇందులో రాజీవ్ యువ వికాసంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఇతర కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆదివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటల సాగు సన్నద్ధత, ఉద్యోగుల సమస్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, జిల్లాల్లో మంత్రులు చేసిన పరిశీలన, రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.యువ వికాసానికి అనూహ్య స్పందన రాజీవ్ యువ వికాసం పథకానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో..మొత్తం నాలుగు కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వానికి అందిన ప్రతి దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే అర్హుల ఎంపిక జరపాలని, ఈ పథకం కింద అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో చోటు దక్కకుండా, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని మంత్రులు సూచించారు. క్షేత్రస్థాయిలో కూడా ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తుల విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి అత్యంత పారదర్శకంగా పరిశీలన జరపాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యాకే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు. సోమవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, ఇందుకు జిల్లాల్లో ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని మంత్రులకు సీఎం సూచించారు. క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి: సీఎం రాష్ట్రంలో ధాన్యం కొనుకోలుకు సంబంధించిన అంశాలపై మంత్రులు క్షేత్రస్థాయి పరిస్థితులను సీఎంకు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా మంత్రులు అభినందించారు. కాగా ధాన్యం కొనుగోళ్లపై సీఎం జిల్లాల వారీగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులతో పాటు ప్రభుత్వం తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడం.. రాష్ట్రానికి ముందస్తు రుతుపవనాలతో కలిగే ప్రయోజనాలు, నష్టాలపైనా చర్చించారు. ఈ సీజన్కు సంబంధించి పంటల సాగును వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాగాన్ని ఈ దిశగా అప్రమత్తం చేయాలని రేవంత్ చెప్పారు. ఆర్థికేతర అంశాలను పరిష్కరిద్దాం! రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక సమరి్పంచింది. ఈ నివేదికలోని ప్రధాన అంశాలను సీఎం రేవంత్రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. ఉద్యోగుల సమస్యల్లో ప్రధానంగా ఆర్థికేతర అంశాలను పరిష్కరిస్తే వారికి కొంతమేర ఊరటగా ఉంటుందని, ఉద్యోగ సంఘాల డిమాండ్ కూడా ఇదేనని భట్టి చెప్పారు.దీంతో ఆర్థికేతర అంశాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, దీనిపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుందామని మంత్రులకు సీఎం సూచించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపైనా, గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు, భూభారతి ద్వారా సమస్యల పరిష్కారం తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. రుతుపవనాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మంత్రులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. -
కరంగటం!
భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ గిరిజన భాషపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. సోమవారం జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఆహ్వానపత్రికలను తెలుగు, ఇంగ్లిష్ భాషలతో పాటు కోయ భాషలోనూ ముద్రించారు.‘వేడుకలకు ఆహ్వానం’.. అని అర్థం వచ్చేలా ‘కరంగటం’ పేరుతో పాటు.. లోపల కూడా కొన్ని కోయ పదాలతో ఆహ్వాన పత్రికను ముద్రించి పంపిణీ చేశారు. -
సీఎం రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా.. తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా వేర్వేరు ప్రకటనల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
కృత్రిమ రక్తం
రక్తం ప్రాణాధారం. ఏదైనా ప్రమాదం జరిగి లేదా శస్త్రచికిత్స వల్ల చాలా రక్తం పోయిన మనిషిని బతికించాలంటే ఆసుపత్రిలో ఆ వ్యక్తి బ్లడ్ గ్రూప్నకు సరిపోయే రక్తం ఉండాలి. ఒకవేళ లేకపోతే సరిపోయే బ్లడ్ గ్రూప్ ఉన్న ఆరోగ్యవంతుడైన మనిషి నుంచి రక్తాన్ని సేకరించి ఎక్కించాలి. ఆ రక్తం దొరక్క కొన్నిసార్లు ప్రాణాలే పోతుంటాయి. కానీ భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నివారించవచ్చు! ఎవరికైనా నిమిషాల్లో.. మనుషులే ఇవ్వాల్సిన అవసరం లేకుండా 24 గంటలూ రక్తం అందుబాటులో ఉండొచ్చు!! దీన్ని కృత్రిమ రక్తం అందామా లేక కృత్రిమ ప్రాణాధారం అందామా? ఏ పేరు పెట్టి పిలిచినా ఇదీ రక్తమే. ఈ దిశగా జపాన్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అవి విజయవంతమైతే కోట్లాది మంది ప్రాణాలు కాపాడొచ్చు.ప్రపంచంలోనే తొలిసారి 2018లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎస్టిమేషన్ ఆఫ్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఇన్ ఇండియా అనే నివేదిక విడుదల చేసింది. దేశంలో పెరుగుతున్న జనాభా, వారి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా దేశంలో రక్తమార్పిడుల వంటి వాటికి ఎంత రక్తం అవసరం అవుతుందో కనిపెట్టడం దీని ప్రధాన ఉద్దేశం. 2008 నాటి ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2007లో మన దేశంలో కోటి యూనిట్ల రక్తం కావాలని అంచనా వేసింది. కానీ, అప్పటికి మనదేశంలో అందుబాటులో ఉన్నది 40 లక్షల యూనిట్లే. 2018 లెక్కల ప్రకారం అవసరమైనది 2.65 కోట్ల యూనిట్లు. ఈ లెక్కన ప్రస్తుతం ఇది ఎంతకు చేరి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్క మనకే కాదు.. యావత్ ప్రపంచానికి కృత్రిమ రక్తం.. నిజంగా ప్రాణదాత.రక్తమార్పిడి చరిత్ర మొట్టమొదటి రక్తమార్పిడి 1665లో ఇంగ్లండ్లో జరిగింది. కొన్ని కుక్కల నుంచి రక్తాన్ని తీసి గాయపడిన కుక్కకు ఎక్కించి దాని ప్రాణాలు కాపాడారు. ఆ తరువాత 1818లో బ్రిటిష్ వైద్యుడు జేమ్స్ బ్లండెల్ మనుషుల్లో రక్తమార్పిడి విజయవంతంగా నిర్వహించారు. 19వ శతాబ్దంలో న్యూయార్క్లో థియోడర్ గెయిలార్డ్ థామస్ అనే స్త్రీల వైద్య నిపుణుడు (గైనకాలజిస్ట్) రక్తానికి బదులు ఆవు పాలను వాడాడు. 1875లో.. తన దగ్గరకు తీవ్ర రక్తస్రావంతో వచ్చిన మహిళకు 175 మిల్లీలీటర్ల ఆవుపాలు ఎక్కించాడు.వారంపాటు ఆమె జ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలతో ఇబ్బందిపడినా తరువాత అన్నీ సర్దుకున్నాయట. అలా థామస్ ఏడుసార్లు పాలు ఎక్కించాడట. ఆ ఫలితాలు ఎన్నో మెడికల్ జర్నళ్లలోనూ ప్రచురితమయ్యాయి. 1880 వరకు ఇలా రక్తానికి బదులు ఆవు, మేకపాలు ఎక్కించడం అమెరికా అంతటా జరిగిందని సైన్స్ మ్యాగజైన్ రాసింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ జపాన్తోపాటు అమెరికా, యూకే, చైనా వంటి దేశాలు కృత్రిమ రక్తంపై ఇప్పటికే చాలా పరిశోధనలు, ప్రయోగాలు చేశాయి.. చేస్తున్నాయి. పాడైపోయిన మానవ రక్తంతో.. మానవ రక్తానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ రక్తాన్ని జపాన్ పరిశోధకులు ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. జపాన్లోని నారా మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హిరోమీ సకాయి ఇందులో కీలకపాత్ర పోషించారు. ఆమె, ఆమె వైద్య బృందం సాధించిన ఈ ఘనతను వైద్య చరిత్రను మలుపుతిప్పే ఘటనగా నిపుణులు వరి్ణస్తున్నారు. ఈ ప్రక్రియకు వీళ్లు వాడింది.. పాడైపోయిన మానవ రక్తాన్నే. ఈ రక్తంలోని హిమోగ్లోబిన్ను వీళ్లు వేరుచేశారు. దాన్ని ఎలాంటి వైరస్లూ సోకేందుకు అవకాశం లేని ప్రత్యేక షెల్లో ఉంచి, అత్యంత జాగ్రత్తగా, కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా ఈ కృత్రిమ రక్తం తయారుచేశారు.ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వాలంటీర్లకు 100 నుంచి 400 మిల్లీలీటర్ల కృత్రిమ రక్తాన్ని ఎక్కించి పరీక్షిస్తున్నారు. ఈ ఆవిష్కరణకు మద్దతుగా జరుగుతున్న మరో ఆవిష్కరణలో భాగంగా ప్రాణవాయువును తీసుకెళ్లేందుకు వాహకాలను తయారుచేస్తున్నారు. చువో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ తెరియుకి కొమట్సు బృందం. ప్లాస్మాలోని అల్బుమిన్తో వీటిని రూపొందించారు. ఇవి రక్తపోటును నియంత్రించేందుకు, గుండెపోటు వంటివి రాకుండా చేసేందుకు సహాయపడతాయి. క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే 2030 నాటికి ఈ రక్తం అందుబాటులోకి వస్తుంది. రక్తం ఎప్పుడు కావాలంటే.. ఎముకల లోపల ఉండే మూలుగ నుంచి రక్తం తయారవుతుంది. సగటున మనిషి శరీరంలో దాదాపు 5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణం మన రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్. కొన్ని రకాల శస్త్రచికి త్సలు, ప్రమాదాలు, ప్రసవాలు, పోషకాహార లోపం వల్ల వచ్చే రక్తహీనత, బోన్ మేరో మార్పిడి, బోన్ మేరో ఫెయిల్యూర్, లుకేమియా, హీమోఫీలియా, డెంగ్యూ జ్వరం, తీవ్రమైన మలేరియా జ్వరం వంటి సందర్భాల్లో రక్తమార్పిడి అవసరమవుతుంది.2 ఏళ్లు.. ఊదా రంగు.. సాధారణంగా మన రక్తం 42 రోజుల వరకే నిల్వ ఉంటుంది. ఆలోపు వాడకపోతే వృథా అయిపోతుంది. కానీ ఈ కృత్రిమ రక్తం 2 ఏళ్లపాటు నిల్వ ఉంటుంది. అంటే.. వృథా అయ్యే అవకాశమే లేదన్నమాట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మనరక్తం ఎరుపు రంగులో ఉంటే ఇది ఊదా రంగులో ఉంటుంది. అలవాటు కావడానికి మనకు కాస్త సమయం పడుతుందేమో! అంతేకాదు, బ్లడ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరికీ ఈ రక్తాన్ని ఎక్కించే అవకాశం కూడా ఉందట. -
వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి
కవాడిగూడ (హైదరా బాద్): కేంద్ర ప్రభు త్వం ఇటీవల తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవా లని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025ని వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా, భారీ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా ఎంఐఎం శాసన సభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు అధ్యక్షుడు మౌలానా సయిపుల్లా రహమానీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, పర్సనల్లా బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ మత పెద్దలు ఈ ఉద్యమాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.దీనికి ఎంఐఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అదే విధంగా ముస్లిం సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. పర్సనల్లా బోర్డు అధ్యక్షుడు మౌలానా సయిపుల్లా రహమానీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ముస్లింల వ్యక్తిగత హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులు, ఆదివాసీలు, ముస్లిం మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. -
స్వేచ్ఛ ఉందని లక్ష్మణ రేఖ దాటొద్దు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది కదా అని నేతలెవరూ లక్ష్మణ రేఖ దాటొద్దని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామిక వాతావరణం ఉంటుందని.. పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాలుగు గోడల మధ్య అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నియమితులైన తర్వాత తొలిసారి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన మల్లు రవి నేరుగా గాంధీ భవన్కు వచ్చి అక్కడ మాజీ చైర్మన్ జి.చిన్నారెడ్డి నుంచి బా«ధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు కమిటీ సభ్యులు కూడా బాధ్యతలు తీసుకున్నారు.ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులెవరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదన్నారు. క్రమశిక్షణ గీత దాటకుండా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చూడాలని కోరారు. తాను మూడు సార్లు ఎంపీగా, ఓసారి ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించానని.. పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ పదవి రావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా పాలనసాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో పాలన కొనసాగుతోందని మల్లు రవి తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గత ప్రభుత్వాలు దోపిడీ చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయమే లక్ష్యంగా పలు పథకాలు, కార్యక్రమాలను చేపట్టిందని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏడాదిన్నరకాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆశయాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. -
రాష్ట్రంలో ఓ కుటుంబ డ్రామా నడుస్తోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పుడు ఓ కుటుంబ డ్రామా నడుస్తోందని, అధికారంలో ఉన్నప్పుడు దండుకున్న సొమ్మును పంచుకోవడంలో తలెత్తిన గొడవలే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు చేసి దోచుకున్న ఆస్తుల కోసం జరుగుతున్న గొడవల్లో మనం పాత్రధారులం కావాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచి్చన ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మచ్చలేని పాలన సాగిస్తోందన్నారు. మోదీ పాలనపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమన్నారు. విద్యుత్, ఎరువులు, రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమా? అని కాంగ్రెస్కు సవాలు విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. రాహుల్ గాం«దీకి దేశ చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. బీజేపీ జిల్లా, మండల పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. వర్క్షాప్కు పలువురు డుమ్మా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్షాప్కు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరయ్యారు. మొత్తం 11 మంది ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఆర్.కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రఘునందన్రావు హజరయ్యారు. ఎంపీ కె.లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు అర్వింద్, గోడెం నగేశ్ గైర్హాజరయ్యారు. -
4 నెలల్లో 11% తగ్గిన సైబర్ నేరాల ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆర్థిక సైబర్ నేరాల ఫిర్యాదులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం తగ్గినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ఫిర్యాదులు 28 శాతం పెరిగినట్లు ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిప్రకారం జనవరి–ఏప్రిల్ మధ్య సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు కోల్పోయే ఘటనలు 19 శాతం తగ్గినట్లు వివరించింది.సైబర్ బాధితులు పోగొట్టుకున్న సొమ్ము రికవరీ 2024లో 13 శాతంగా నమోదవగా ఈ ఏడాది అది 16 శాతానికి పెరిగినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. గతేడాది ఇదే కాలంలో 6,763 కేసులు నమోదవగా ఈ ఏడాది 7,575 కేసులు నమోదైనట్లు పేర్కొంది. 2024లో 230 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశామని.. ఈ ఏడాదిలో 626 మంది నేరగాళ్లను పట్టుకున్నామని బ్యూరో వివరించింది. 1930 కాల్ సెంటర్కు ఫిర్యాదు అందిన వెంటనే 3 నిమిషాల్లోనే నగదు ఫ్రీజింగ్కు సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. -
స్టేటస్పెట్టుకుంటే డబ్బులిస్తాం!
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ‘తక్కువ మొత్తం.. ఎక్కువ మంది నుంచి వసూలు’అనే సరికొత్త మోసతంత్రాన్ని తెరపైకి తెచ్చారు. నగరాల్లో సైబర్ మోసాలపై క్రమంగా అవగాహన పెరుగుతుండటంతో సైబర్ నేరగాళ్లు క్రమంగా ద్వితీయశ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. వాట్సాప్ వాడటం అన్ని ప్రాంతాల్లో పరిపాటిగా మారడంతో దాన్నే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తాము పంపిన ఫొటోలను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటే మీ బ్యాంకు ఖాతాల్లో కాసులు వచ్చిపడతాయని బురిడీ కొట్టిస్తున్నారు.వాట్సాప్ స్టేటస్గా పెట్టిన ఫొటోలను వ్యూ, లైక్, కామెంట్.. ఇలా ఒక్కో టాస్క్కు రూ. 2 చొప్పున మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా జరగాలంటే ముందుగా రిజి్రస్టేషన్ ఫీజు కింద రూ. 300 తాము చెప్పిన ఫోన్ నంబర్కు పంపాలని సూచిస్తున్నారు. వాటిని నమ్మి వాట్సాప్ స్టేటస్ టాస్క్ ముందుకొచ్చే వారి నుంచి ముందుగా రూ. 300 వసూలు చేయడమే కాకుండా మరో ఆరుగురిని చేరిస్తే కట్టిన రూ. 300 తిరిగి ఇస్తామని ఊదరగొడుతున్నారు. క్రమంగా మల్టీలెవల్ మార్కెటింగ్ తరహాలో చైన్ను ఏర్పాటు చేస్తూ అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తాండూరు ప్రాంతంలో ఈ తరహా సైబర్ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. మారింది. వేలాది మంది ఈ తరహాలో డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. - సాక్షి, హైదరాబాద్బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో..సైబర్ మోసగాళ్లు చెప్పే మాటలు నమ్మి బాధితులంతా రూ.300 చొప్పున వారు చెప్పే గూగుల్ పే, ఫోన్ పే నంబర్లకు చెల్లిస్తున్నారు. ఇందులో ఒకరిద్దరికి రూ. 300 తిరిగి ఇస్తున్న నేరగాళ్లు... ఎక్కువ మంది నుంచి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. వాట్సాప్ స్టేటస్ను నెలపాటు పెట్టుకోవడంతోపాటు ప్రతిరోజూ స్కీన్ర్ షాట్ పంపాలని నిబంధన విధించడం.. చివరకు నిబంధనలు పాటించనందున మళ్లీ మొదటి నుంచి చేయాలంటూ అమాయకులను మోసగిస్తున్నారు. ఈ తరహా మోసాలు ప్రధానంగా తాండూరు, వికారాబాద్ ప్రాంతంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే బాధితులంతా ఇంత చిన్నమొత్తానికి పోలీసులకు ఏం ఫిర్యాదు చేస్తాంలేనని వదిలేస్తుండటం సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. బాధితుల సంఖ్య పెరిగేకొద్దీ సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్న సొమ్ము రూ. లక్షల్లోకి చేరుతోంది.తెలిసిన వాళ్లు చెబితే డబ్బు కట్టాం మాకు తెలిసిన వ్యక్తి ద్వారా వాట్సాప్ స్టేటస్ పెడితే డబ్బులు వస్తాయని తెలిసి మేం కూడా రూ. 300 ఫీజు ఆన్లైన్లో కట్టి రుద్ర టెక్నాలజీ పేరిట వాట్సాప్ గ్రూప్లో చేరాం. ఆ తర్వాత 30 ఫొటోలు వచ్చాయి. రోజుకు ఒకటి చొప్పున వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాం. కానీ ఆ తర్వాత డబ్బులు తిరిగి రాలేదు. – సుదర్శన్రెడ్డి, తాండూరుఐదుగురిని చేర్పించి మోసపోయావికారాబాద్లో ఓ స్నేహితుడి ద్వారా రూ. 300 ఆన్లైన్లో పంపా. 30 రోజులపాటు ఫొటోలు పెట్టాక డబ్బులు అడిగితే టాస్క్ సరిగా చేయలేదన్నారు. గ్రూప్లో ఐదుగురిని చేరి్పస్తే వెంటనే డబ్బులు వస్తాయని ఆశపెట్టడంతో ఐదుగురిని చేరి్పంచా. అయినా నాతోపాటు ఆ ఐదుగురి డబ్బులు కూడా పోయాయి. – నీరటి నరేశ్కుమార్, కొత్తూరు -
3 నెలల రేషన్.. 6 సార్లు నిశాన్
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకొని జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ ఏకకాలంలో పంపిణీ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అవాంతరాల మధ్య అంతంతమాత్రంగా సాగింది. లబ్ధిదారుల నుంచి మూడు నెలలకు సంబంధించి ఆరుసార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి రావడం క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలకు దారితీసింది. ఒక్కో లబ్ధిదారు నుంచి వేలిముద్రల సేకరణ, వేర్వేరుగా బియ్యం కాంటా కోసం సుమారు అరగంట సమయం పట్టింది. దీంతో లబ్ధిదారులు గంటలకొద్దీ క్యూలలో నిరీక్షించాల్సి వచ్చింది. చాలా జిల్లాల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ–పీఓఎస్) పరికరాలు నెట్వర్క్ సమస్యలతో మొరాయించడంతో చేసేది లేక డీలర్లు దుకాణాలను మూసేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో లబ్ధిదారులు ఖాళీ సంచులతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. ఇంకొన్ని జిల్లాల్లో రేషన్ షాపులకు సన్నబియ్యం స్టాక్ చేరుకోకపోవడంతో పంపిణీ సాధ్యంకాలేదు. వెరసి.. తొలిరోజు ఎక్కడా 10 శాతం మించి సన్నబియ్యం పంపిణీ సాధ్యం కాలేదు. కేంద్రం.. రాష్ట్ర లెక్కల వల్లే.. రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల్లో 55 లక్షలు కేంద్రం ఇచ్చిన ఎన్ఎస్ఎఫ్ఏ కార్డులుకాగా.. 32 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కార్డులు. ఎన్ఎస్ఎఫ్ఏ కార్డుదారులకు కేంద్రం ఇచ్చే 5 కిలోల బియ్యానికి రాష్ట్రం అదనంగా కిలో బియ్యం కలిపి ఇస్తోంది. దీంతో ప్రతి నెలా లబ్ధిదారుల నుంచి రేషన్ డీలర్లు రెండుసార్లు వేలిముద్రలు సేకరిస్తున్నారు. తాజాగా మూడు నెలల రేషన్ను ఏకకాలంలో ఇవ్వాల్సి రావడంతో ఒక్కో లబ్దిదారు చేత డీలర్లు ఆరుసార్లు వేలిముద్ర వేయించాల్సి రావడం సాంకేతిక సమస్యలకు కారణమైంది. నేటి నుంచి పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తామన్న అధికారులు తొలిరోజు ఎదురైన సమస్యలను అధిగమించి సోమవారం నుంచి పూర్తిస్థాయిలో రేషన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 30 వరకు మూడు నెలల బియ్యం పంపిణీ కొనసాగుతుందని.. అందువల్ల లబ్ధిదారులు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు సాంకేతిక సమస్యలను నివారించేందుకు లబ్ధిదారులంతా వారికి కేటాయించిన తేదీల ప్రకారమే షాపులకు రావాలని రేషన్ డీలర్లు విజ్ఞప్తి చేశారు. -
కంకరలో వంకర పనులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గత పదేళ్లుగా అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతోంది. రాజకీయ పలుకుబడి ఉన్న ప్రజాప్రతినిధులు, బడా బాబులు మైనింగ్ దందాలో వందల కోట్లు కొట్టేస్తున్నారు. అడిగే నాథుడే లేకపోవడంతో ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టుగా సాగుతోంది. తవ్వకాలు జరిపిన పరిమాణానికి గాను నిర్దేశిత మొత్తంలో భూగర్భ గనుల శాఖకు చెల్లించాల్సిన సీనరేజీ చార్జీలు చెల్లించకుండా సర్కారు ఆదాయానికి గండి కొట్టడం ఇక్కడ పరిపాటైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మైనింగ్పై విచారణకు ఆదేశించింది. ఈ క్వారీల్లో ఏ మేరకు తవ్వకాలు జరిపారు.. ఎంత కొల్లగొట్టారనే దానిపై ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) సర్వే చేపట్టారు. ఈ సర్వేలోనే భారీ ఎత్తున అక్రమాలు వెలుగులోకి రావడం గమనార్హం. కాగా.. రూ.974 కోట్లు సీనరేజీ చార్జీలు,జరిమానా కింద చెల్లించాలంటూ, అక్రమార్కులకు గతం నుంచే పలు దఫాలుగా నోటీసులు జారీ అయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జిన్నారం, కంది, పటాన్చెరు మండలాల్లో.. భూగర్భ గనుల శాఖ నుంచి డిమాండ్ నోటీసులు జారీ అయిన క్వారీలు సంగారెడ్డి జిల్లాలోని కంది, జిన్నారం, పటాన్చెరు మండలాల పరిధిలో ఉన్నాయి. పటాన్చెరు మండలం లకడారంలోని సర్వే నంబర్ 738, 747, రుద్రారంలోని 132, లకడారం, రుద్రారంలోని 738/1, జిన్నారం మండలం ఖాజిపల్లిలోని 138, 139, 140, 143, 144, 155, 156, కంది మండలం ఆరుట్లలోని 134 సర్వే నంబర్లలో ఈ తవ్వకాలు కొనసాగినట్లు మైనింగ్ శాఖ జారీ చేసిన నోటీసులను బట్టి తెలుస్తోంది. ఈ సర్వే నంబర్లలో తవ్వకాలు సాగించిన మొత్తం 15 మంది వ్యక్తులు, కంపెనీలకు నోటీసులు జారీ అయ్యాయి. ఆయా కంపెనీలు, వ్యక్తులకు సంబంధించిన క్వారీలు హైదరాబాద్ మహానగరానికి అతిసమీపంలో ఉండటంతో ఇక్కడి నుంచి నగరానికి కంకర అక్రమ రవాణా చేసి వందల కోట్లు దండుకున్నారు. నగరంలో నిత్యం భారీ ఎత్తున జరుగుతున్న నిర్మాణ రంగానికి ఇక్కడి క్వారీల నుంచే కంకర సరఫరా జరుగుతోంది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా క్వారీల్లో తవ్వకాలు కొనసాగించారు. అడ్డూ అదుపు లేకుండా.. భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకున్న విస్తీర్ణానికి మించి.. నిర్ణీత సరిహద్దులు దాటి లీజుదారులు అక్రమంగా తవ్వకాలు సాగించారు. అలాగే ఈ అదనపు విస్తీర్ణానికి ఎలాంటి సీనరేజీ చెల్లించలేదు. కంకర తరలించేందుకు ట్రాన్సిట్ పర్మిట్లు తీసుకోవాల్సి ఉండగా, అలాంటివి ఏమీ లేకుండానే భారీ టిప్పర్లలో అక్రమ రవాణాకు పాల్పడ్డారు. ఇలా సీనరేజీని ఎగవేయడం, పర్మిట్లు తీసుకోకుండానే అక్రమ రవాణా చేయడం, తీసుకున్న అనుమతులకు మించి.. సరిహద్దులు దాటి తవ్వకాలు జరడం వంటి అతిక్రమణలకు గాను జరిమానాలు, ఎగవేసిన సీనరేజీ కలిపి మొత్తం రూ.974 కోట్లకు ఈ డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని నెలల క్రితమే.. అక్రమాలకు పాల్పడిన 8 క్వారీల లీజుదారులు జరిమానాలతో కలిపి రూ.575 కోట్లు చెల్లించాలని కొన్ని నెలల క్రితమే భూగర్భ గనుల శాఖ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం ఇలా డిమాండ్ నోటీసులు జారీ అయిన లీజుదారుల సంఖ్య 15కు చేరింది. వీరికి సంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. అక్రమార్కుల్లో ఓ ఎమ్మెల్యే సోదరుడి బినామీ! పటాన్చెరు మండలం లకడారంలోని క్వారీల్లో జరిగిన తవ్వకాలకు సంబంధించి రూ.341 కోట్లు చెల్లింపునకు ఓ లీజుదారుకు ఏడాది క్రితం నోటీసులు జారీ కావడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తర్వాత ఇతనికే చెందిన మరో క్వారీలో కూడా అక్రమాలు జరిగినట్లు ఈటీఎస్ సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. ఆరుట్ల గ్రామ శివారులో ఉన్న క్వారీలో అక్రమ తవ్వకాలకు గాను రూ.249.06 కోట్లు చెల్లించాలని మరో డిమాండ్ నోటీసు జారీ కావడం గమనార్హం. ఈ లీజుదారు జిల్లాలోని ఎమ్మెల్యే సోదరుడికి బినామీ అని సమాచారం.ఈటీఎస్ సర్వేతో వెలుగులోకి అక్రమాలు జిల్లాలోని అన్ని మైనింగ్ కార్యకలాపాలపై ఈటీఎస్ సర్వే జరిగింది. అనుమతులకు మించి, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగినట్లు తేలింది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడిన మొత్తం 15 క్వారీల లీజు దారులకు రూ.974 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీసులు జారీ చేశాం. అయతే ఈ నోటీసులు అందుకున్న లీజుదారులు అప్పిలేట్కు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. – రవిబాబు, భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, సంగారెడ్డి -
నేటి నుంచి గ్రామాలకే నాణ్యమైన విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 11 వేల గ్రామాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్త నాలు అందించే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ప్రొఫె సర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యా లయంతో కలిసి చేపడుతోంది. ‘గ్రామ గ్రామానికి వ్య వసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తన పంపిణీ’ అనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం లాంఛనంగా ప్రారంభించను న్నారు. జిల్లాల్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు 5 ప్రధాన పంటలకు సంబంధించిన (వరి, కంది, పెసర, మిను ములు, జొన్న) నాణ్యమైన విత్తనాల కిట్లను పంపిణీ చేస్తా రు. ఇప్ప టికే ఎంపిక చేసిన మిగతా అభ్యుదయ రైతు లకు జూన్ 3వ తేదీన ఆయా గ్రామలకు సంబంధించిన రైతు వేదికల నుంచి స్థానిక ఏఈఓ, ఏఓలు, వ్యవ సాయ విశ్వ విద్యాలయ నోడల్ అధికారుల పర్యవేక్షణ లో విత్తన కిట్లను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం క్రింద సుమారు 40,000 మంది అభ్యుదయ రైతులకు నా ణ్యమైన విత్తన కిట్లను పంపిణీ చేయనున్నారు.వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారు 10,250 క్వింటాళ్ల విత్త నాన్ని సిద్ధంగా ఉంచినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. మే 5వ తేదీ నుంచి జూన్ 13 వరకు వ్యవసాయ వర్సిటీ, రాష్ట్ర వ్యవసా య శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘రైతు ముంగిట శాస్త్ర వేత్తలు’కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 800 గ్రామాలలో 48,000 మంది రైతులకు విత్తన ప్రా ము ఖ్యతపై అవగాహన కల్పించినట్లు వెల్లడించారు.విత్తన స్వయం సమృద్ధే లక్ష్యం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విత్తన మార్పిడి రేటు (సీడ్ రీప్లేస్మెంట్ రేట్) 92 శాతంతో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. కొన్నేళ్లుగా విత్తన కంపనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి వివిధ పేర్లతో విత్త నాలను అధిక ధరలకు రైతులకు విక్రయిస్తు న్నాయి. అక్కడక్కడా నాణ్యత లోపించిన విత్తనాల ఫలితంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ప్రధాన పంటల నాణ్యమైన మూల విత్తనాన్ని ప్రతి గ్రామంలో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దాదాపు 40,000 విత్తన కిట్లను గ్రామాలలో పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు. ఈ విత్తనంతో అభ్యుదయ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో సాగుచేసి వచ్చే దిగుబడిని తిరిగి ఆయా గ్రామాలలోని రైతాంగానికి విత్తన రూపంలో సరఫరా చేయాలని ప్రభుత్వం సూచించింది. -
ఉత్తమ సేవలకు పోలీస్ పతకాలు
సాక్షి, హైదరాబాద్: అత్యుత్తమ సేవలందిస్తున్న పోలీస్, అగ్ని మాపక శాఖ సిబ్బందికి ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సేవా పతకాలు ప్రకటించింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి 625 మందికి, ఏసీబీలో 22 మందికి, అగ్నిమాపక శాఖలో 20 మందికి, టీజీఎస్పీఎఫ్లో 19 మందికి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఆరుగురికి పతకాలు అందించనుంది. పతక విజేతల పేర్లు, ఆయా విభాగాలవారీగా ఇస్తున్న పతకాల వివరాలతో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మహోన్నత సేవా పతకం సాధించిన వారికి రూ. 40 వేల నగదు పురస్కారం, ఉత్తమ సేవా పతకం పొందిన వారికి రూ. 30 వేల నగదు పురస్కారం, కఠిన సేవా పతకం సాధించిన వారికి రూ. 20 వేల నగదు పురస్కారం, తెలంగాణ సేవా పతకం పొందిన వారికి రూ. 20 వేల నగదు పురస్కారం, తెలంగాణ శౌర్య పతకం పొందిన వారికి రూ. 10 వేల నగదు పురస్కారంతోపాటు ప్రతినెలా రూ. 500 అందించనున్నారు. రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మక పోలీస్ పతకం అయిన తెలంగాణ పోలీస్ శౌర్య పతకం 9 మంది గ్రేహౌండ్స్ సిబ్బంది (ఆర్ఎస్సైలు సి.హెచ్. మహేశ్, జి. శోభన్, ఎ. రాకేశ్కుమార్, కానిస్టేబుళ్లు జి. వెంకటేశ్, కె. రమేశ్, ఎం. పాపియా నాయక్, ఎం. రవీందర్ సంజయ్, జె. నరేశ్, టి. వెంకటేశ్)కి లభించింది. అలాగే అగ్నిమాపక శాఖలోని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ టి. వెంకన్న, సాలార్జంగ్ మ్యూజియం ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్మన్ మిరాజ్ కరమతుల్లా బేగ్కు శౌర్య పతకాలు లభించాయి. ఫైర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ టి. మహేందర్రెడ్డికి మహోన్నత సేవా పతకం లభించింది. అలాగే ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 14 మంది ఎంపికయ్యారు. -
కారు కొనిపెట్టలేదని యువకుడి బలవన్మరణం
సిద్దిపేట జిల్లా, సాక్షి: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.తండ్రి బీఎండబ్ల్యూ కారు కొన్నివ్వ లేదని కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగదేవ్ పూర్ మండలం చర్లపల్లిలో చోటు చేసుకుంది. గత కొంత కాలం నుంచి తండ్రి బొమ్మ కనకయ్యను బీఎండబ్ల్యూ కారు కొనిపెట్టమని ఆయన కుమారుడు జానీ అడుగుతూ వస్తున్నాడు. అయితే, జానీ విజ్ఞప్తిని తండ్రి కనకయ్య సున్నితంగా తిరస్కరించాడు. స్విఫ్ట్ డిజైర్ కారుతో సరిపెట్టుకోమని సూచించాడు. తండ్రి తీరుతో కోపోద్రికుడైన జానీ ఇంట్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జానీ కొద్ది సేపటి క్రితం మృతి చెందినట్లు సమాచారం. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కిషన్రెడ్డితో సఖ్యత లేదా?.. బీజేపీలో ఏం జరుగుతుంది?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నివురుగప్పిన నిప్పులో ఉన్న వర్గ పోరు ఇప్పుడు బయటపడిందా?, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో కొంతమంది నేతలకు పొసగడం లేదా?, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చాయా? అంటే అవుననక తప్పదు.ఈ రోజు(ఆదివారం, జూన్ 1వ తేదీ) నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ వర్క్ షాపు చెప్పుకునేంత స్థాయిలో జరగలేదనేది అక్కడ హాజరైన నేతల తీరును బట్టే అర్థమవుతోంది. తప్పని సరిగా ఈ వర్క్ షాపుకు హాజరుకావాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఆదేశాలున్నా కొంతమంది నాయకులు వాటిని బేఖాతరు చేశారు. ‘ఆ మీటింగ్ కు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి?’ అన్న చందంగా వ్యవహరించారు. మెజార్టీ ప్రజాప్రతినిధులుకిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్ షాపుకు హాజరుకాకపోవడంతో పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. పైకి ఎటువంటి విభేదాలు లేవనే సంకేతాలిస్తున్నప్పటికీకిషన్రెడ్డి సారథ్యంలో జరిగిన కీలక సమావేశానికి అత్యధిక సంఖ్యలో ప్రజా ప్రతినిధులు హాజరుకాకపోవడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.ప్రధానంగా దీనికి ఎంపీలు ఈటెల, డీకే అరుణ, ఆర్ కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ లు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయానికొస్తే కీలకమైన నేతలు ఇందుకు హాజరు కాలేదు. పదకొండు మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు గాను మొత్తంగా నలుగురు మాత్రమే హాజరయ్యారు.ఎంపీల్లో లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో ఉండగా, ధర్మపురి అరవింద్, గోడం నగేశ్ లు వర్క్ షాపుకు దూరంగా ఉన్నారు. ఇక బండి సంజయ్ కరీంనగర్ పర్యటనలో ఉండగా, బీజెఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ పర్యటనలో ఉన్నారు. ఇలా పలువురు కీలక నేతలు దూరంగా ఉండటంతో పార్టీ భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన ఎలా జరుగుతుందనే అంశం బీజేపీలో చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి:‘ప్రజల వద్దకు వెళ్లాలి.. మోదీ పాలనను వివరించాలి’ -
ఇంట్లో ఇలాంటి మొక్కలే పెంచుతున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో స్వచ్ఛమైన గాలి కోసం మొక్కలను పెంచుకుంటున్నారు. దాంతో అందం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హోమ్ గార్డెనింగ్ మొక్కల ప్రత్యేకత ఏంటంటే.. వీటికయ్యే వ్యయం చాలా తక్కువ. నిర్వహణ కూడా తేలికే. పైగా అందంగా, అద్భుతమైన డిజైన్లతో అలంకారప్రాయంగా ఉంటాయి.ఇండోర్ గార్డెనింగ్పై ఆసక్తి ఉన్న వాళ్ల తొలి ప్రాధాన్యం స్నేక్ ప్లాంట్కే. నిర్వహణ అత్యంత సులువు. తక్కువ నీటి అవసరం ఉంటుంది. చీకటి ప్రదేశంలో, గది మూలల్లోనూ ఇది పెరుగుతుంది. తక్కువ కాంతిలో ఉంచినప్పటికీ.. స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేస్తుంది. నిలువుగా పెరుగుతుంది. మధ్యస్థ స్థాయిలో సూర్యరశ్మి లేదా పరోక్ష పద్ధతిలో సూర్యకాంతిలోనూ పెరగడం రబ్బర్ ప్లాంట్ ప్రత్యేకత. దీనికి ఆకులు పెద్ద సైజ్లో ఉంటాయి. అందువల్ల గాలి నుంచి వచ్చే వ్యర్థాలు, దుమ్ము, ధూళి కణాలను సులువుగా గ్రహిస్తాయి. ఈ మొక్క ఆకులను తరుచూ శుభ్రం చేస్తుండాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో ఒకే పరిమాణంలో నీటిని పోయాలి. లేకపోతే ఆకులు రాలిపోయే ప్రమాదం ఉంది.గార్డెనింగ్ ఔత్సాహికులు, అనుభవజ్ఞులకు మనీ ప్లాంట్ సరైన మొక్క. నిర్వహణ కోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అంత త్వరగా ఎండిపోదు. ఇంటి గాలిలోని బెంజెన్లు, ఫార్మాల్డిహైడ్ వంటి విష రసాయనాలను మనీ ప్లాంట్ గ్రహిస్తుంది. వీటిని కుండీల్లో, బుట్టల్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు లేదా నీటి గిన్నెలలో కూడా పెంచుకోవచ్చు. ఇవి నిలువుగా పెరుగుతుంటాయి. ఇంటి లోపల, ఆరుబయట, ప్రవేశ ద్వారం వద్ద వీటిని ఉంచుకోవచ్చు. ఏ మొక్కకైనా సరే అతిగా నీళ్లు పోయకూడదు. ఎంత పరిమాణంలో నీటిని పోయాలో తెలుసుకోవాలంటే అది ఉండే మట్టిని పరిశీలించాలి.కాలుష్య కారకాలను తొలగించడం, కార్బన్ మోనాక్సైడ్, అమ్మోనియా ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరెథైలీన్లను పీల్చుకోవటంలో, ఇండోర్లోని గాలిని శుభ్రం చేయడంలో పీస్ లిల్లీలు అద్భుతంగా పనిచేస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది పుష్పించే మొక్క కాదు. ఇది ఉష్ణమండల ప్రాంతాల నుంచి వస్తుంది. ఇది పెరగాలంటే నేల, తేమ అవసరం. దీనికి తరుచూ నీళ్లు పోస్తుండాలి. ఆకులు పడిపోతున్నాయంటే నీటి అవసరం ఉందన్న విషయం మీరు గ్రహించాలి.ఈ మొక్కలు ఆకుపచ్చ, ఎరుపు రంగులతో పాటు అనేక రకాలుగా వస్తాయి. చైనీస్ ఎవర్గ్రీన్ లేదా ఆగ్లోనెమాస్ బహుముఖ ప్రయోజనాలు ఉండే మొక్కలు. వీటి నిర్వహణ సులువు. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. వీటిని ఇంటీరియర్ డిజైనింగ్లో వినియోగించుకోవచ్చు. అధిక స్థాయిలో ఆక్సిజన్ను విడుదల చేయడంతో పాటు హానికారక రసాయనాలను పీల్చుకుంటాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో.. ఇంట్లో ఎక్కడైనా ఈ మొక్కలు పెరుగుతాయి. -
‘ప్రజల వద్దకు వెళ్లాలి.. మోదీ పాలనను వివరించాలి’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని ప్రజలకు నీతివంతమైన పాలన అందించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 11 ఏళ్లుగా మోదీ పాలన అనేది ఎంతో పారదర్శకతతో సాగుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాపులో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘ మనం ప్రజల వద్దకు వెళ్లాలి. 11 ఏళ్ల మోదీ పాలనను ప్రజలకు వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలి. నీతివంతమైన పాలన అందించాం. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. గత యూపీఏ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంభకోణాలు జరిగాయి.రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం ముందుకు పోతుంది. వన్ నేషన్ వన్ రేషన్ దేశంలో అమలు చేస్తున్నాం. ఉగ్రవాద రహిత దేశంగా చేసేందుకు మోదీ చర్యలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశామో అందరూ చూశారు. మోదీ ఆధ్వర్యంలో నయా దేశంగా భారత్13 వందల రైల్వే స్టేషన్ లను దేశంలో ఆధునీకరణ చేస్తున్నాం. వ్యాపార, వాణిజ్య, విద్యుత్ రంగుల్లో ఘనమైన అభివృద్ధి సాధించాం. దేశ అభివృద్ధి పై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ కు సవాల్బీజేపీ మహిళా పక్షపాతి పార్టీ. కుల మతాలకు అతీతంగా పని చేస్తున్న ప్రభుత్వం. బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి నక్కకు నాకలోకానికి ఉన్నత తేడా ఉంది. ఆర్మీలో స్వయం ప్రతిపతి సాధించాం. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్నాం. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిల్పాలన్నదే మోదీ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 10 లక్షల కోట్ల అప్పులు.. Brs, కాంగ్రెస్ రెండు కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయి.తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి వికేంద్రీకరణ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి కేంద్రీకృతం. ప్రజా సమస్యల పై చిత్తశుద్ధితో పని చేస్తున్న పార్టీ బీజేపీ. బీజేపీ తప్పా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ పార్టీ కాపాడలేదు’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. -
మొన్నటి కాంగ్రెస్ కమిటీల్లో నా పేరు లేదు అంటే..: విజయశాంతి
హైదరాబాద్: ఇటీవల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి కనబడుతోంది. తాము సీనియర్లమైనా తమకు ఈ కమిటీల్లో అవకాశం ఇవ్వలేదని లోలోన మదనపడుతున్నారు పలువురు కాంగ్రెస్ నాయకులు. ఇప్పటివరకూ దీనిపై నేరుగా ఏ కాంగ్రెస్ నేత నేరుగా విమ ర్శలు చేయకపోయినా ఈ కమిటీల్లో తమను ఎంపిక చేసి ఉండి ఉంటే బాగుంటుందనేది వారి అభిప్రాయంగా ఉంది. కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు అంశం తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా తనకు ఈ కమి టీల్లో ఏ పదవి ఇచ్చినా ఓకే అంటూ స్ప ష్టం చేశారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయశాంతి మీడియాతో చిట్ చాట్ లో.. ‘సరైన సమయంలో సరైన వ్యక్తులకు పదవులు వస్తాయి. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో అధిష్టానికి తెలుసు. మొన్నటి కమిటీలలో నా పేరు లేదు అంటే.. మరో కమిటీలో అవకాశం ఉంటుందేమో’ అనే ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ విజయశాంతి కూడా కమిటీలో తనను ఎంపిక చేసే ఉంటే బాగుండేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు.కాగా, రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీలతో పాటు డీలిమిటేషన్, పీసీసీ క్రమశిఓణ కమిటీలకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, అడ్వైజరి కమిటీలో 15 మందికి చోటు కల్పించారు. 16 మందితో ఏర్పాటయ్యే సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీలో మొత్తం ఏడు మంది సభ్యులను నియమించారు. ఇలా పలు కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది.పీఏసీ(పొలిటికల్ అఫైర్స్ కమిటీ)లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్రెడ్డిలు, ఇక అడ్వైజరీ కమిటీలో రేవంత్, జానారెడ్డి, మధుయాష్కీ, గీతారెడ్డిలు ఉండనున్నారు. డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా వంశీచందర్ రెడ్డి నియమించారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవి, 16 మందితో ఏర్పాటయ్యే సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా పి. వినయ్ కుమార్లను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. -
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు అడ్డాగా హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లోని వాణిజ్య స్థిరాస్తి రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) జోరు కొనసాగుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలు గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీపీ)లకు అడ్డాగా మారాయి. దేశంలోని 7 ప్రధాన నగరాలలో 2025 తొలి త్రైమాసికం(క్యూ1)లో 1.94 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగగా.. ఇందులో 43 శాతం వాటా జీసీసీలదేనని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.సౌత్ జోరు.. 2025 క్యూ1లో జీసీసీలు 83.5 లక్షల చ.అ. స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అదే 2024 క్యూ1లో జరిగిన 48.7 లక్షల చ.అ. జీసీసీ లావాదేవీలతో పోలిస్తే ఇది 72 శాతం అధికం. అత్యధికంగా దక్షిణాది నగరాలలో 64 శాతం వాటా 53.4 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో 19.5 లక్షల చ.అ. లీజులు జరిగాయి. జీసీసీ లావాదేవీల్లో అత్యధికంగా ఐటీ, ఐటీఈఎస్ రంగం వాటా 35 శాతం కాగా.. బీఎఫ్ఎస్ఐ రంగం 22 శాతం, తయారీ, పారిశ్రామిక రంగం వాటా 13 శాతంగా ఉంది. 100–110 బిలియన్ డాలర్లకు.. 2024 ముగింపు నాటికి ఏడు నగరాలలో మొత్తం 1,700 గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ సుమారు 52 బిలియన్ డాలర్లు. ఆయా జీసీసీలలో 17–18 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2030 నాటికి 2,200–2,300 జీసీసీ సెంటర్లకు చేరుతుందని అంచనా. వాటి మార్కెట్ విలువ 100–110 బిలియన్ డాలర్లకు చేరుతుంది. అలాగే ఆయా జీసీసీలలో ఉద్యోగుల సంఖ్య 24–28 లక్షలకు చేరుతుంది.జీసీసీ అంటే? జీసీసీలకు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు ఇక్కడ జీసీసీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందకొస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లుగా పేర్కొంటారు. -
సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత లేఖ
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. జీహెచ్ ఎంసీలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారు.ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారుఆ సంస్థకు హైదరాబాద్ రెండు షోరూములు మాత్రమే ఉన్నాయి. ఆ షోరూమ్ల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారు. తెలంగాణ కాంట్రాక్టర్లు కర్నాటక షోరూమ్ల డీలర్ల నుంచి ఎంవోయూలు తెచ్చుకున్నా వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.ఇప్పటి వరకు జీహెచ్ ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారు.. ఇప్పుడు తొమ్మిది జోన్ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోంది. అధికారులు పేర్కొన్న స్పెసిఫికేషన్స్ కూడిన వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదు. గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో రెండు నుంచి మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించే వారు.అధికారులు ఒక సంస్థకు, రెండు కాంట్రాక్టు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి రూ.5.85 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి.. గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుంది. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్రెడ్డి తన శాఖలో జరుగుతోన్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలి’ అని డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొన్నారు. -
కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసు (ఓఎంసీ)లో ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి దోషిగా తేలిన తర్వాత ఆయనకు జైల్లో ఏమీ ప్రత్యేకతలు ఉండవని, ఆయన పిటిషన్ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కౌంటర్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్ష అమలును నిలిపివేయాల్సిన అవసరం లేదని చెప్పింది. శిక్షను నిలిపివేయకపోతే తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి ఎలాంటి నష్టం వస్తుందో గాలి జనార్దన్రెడ్డి స్పష్టంగా వివరించలేదని చెప్పింది. ఓఎంసీ కేసులో దోషులుగా తేలడంతో గాలి జనార్దన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్లకు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు మే 6న ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టు తీర్పు చట్టవిరుద్ధమని, దానిని కొట్టివేయాలని కోరారు. అలాగే తమకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై మేనెల 21న విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. గాలి జనార్దన్రెడ్డి సహా ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని పేర్కొంది. ఎమ్మెల్యేగా కొనసాగడం ప్రాథమిక హక్కు కాదని.. గాలి పిటిషన్కు విచారణార్హత లేదని చెప్పింది. ఈ పిటిషన్పై బుధవారం మరోసారి విచారణ జరిగే అవకాశం ఉంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. భారత్కు వస్తున్నా అంటూ ప్రభాకర్ రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్కు తిరిగి వస్తున్నారు. ఈ మేరకు జూన్ ఐదో తేదీన విచారణకు హాజరు అవుతానని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు.వివరాల ప్రకారం.. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో విచారణకు హాజరవుతానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చారు. వన్ టైమ్ ఎంట్రీ పాస్పోర్టు తనకు అందిన వెంటనే భారత్ వస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, పాస్పోర్టు అందిన మూడు రోజుల్లో ఆయన భారత్కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు దేశాన్ని వీడిన విషయం తెలిసిందే. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తల దాచుకున్నారు. ప్రభాకర్ భారత్కు వస్తున్న పనేపథ్యంలో ఆయనను విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. ప్రభాకర్ ఉరావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక, అంతకుముందు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పిటిషన్పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. మూడు రోజుల్లో స్వదేశానికి రావాలని.. విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఈమేరకు అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు బెయిల్ అంశంపై తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది -
డ్రెస్సులు మార్చుతూ చోరీలు చేస్తున్న మహిళ
సికింద్రాబాద్: దొంగతనం చేసే సమయంలో మూడు డ్రెస్సులు మార్చుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్జోన్ అదనపు డీసీపీ జే.నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ కే.శశాంక్రెడ్డి, ఇన్స్పెక్టర్ మధుసూదన్రెడ్డి తెలిపిన మేరకు.. పార్సిగుట్టకు చెందిన దుర్గ ఇంట్లో ఈనెల 23న 6.7 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.38 వేలు మాయమయ్యాయని బాధితురాలు వారాసీగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 500 సీసీ కెమెరాల పరిశీలనతో.... వారాసీగూడ పోలీసులు దుర్గ ఇంటి సమీపంలోని సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పార్శిగుట్ట నుంచి మచ్చ»ొల్లారం వరకు ఉన్న సుమారు 500 కెమెరాలను పరిశీలించారు. మొత్తం పుటేజీల్లో ఒక మహిళ ప్రయాణం కనిపించింది. అయితే సీసీ కెమెరాలు మారినకొద్దీ ఆమె ధరించిన దుస్తులు మారుతుండడంతో పోలీసులకు అనుమానం వచి్చంది. మచ్చొల్లారం ప్రాంతంలో వరుస సీసీ కెమెరాలు పరిశీలించే సరికి ఒకే మహిళ «మూడు రకాల దుస్తుల్లో కనిపించడంతో ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దొంగతనానికి పాల్పడింది మచ్చ»ొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డమీది విజయ (45)గా గుర్తించారు. విచారణలో మరో రెండు నేరాలుసీసీ పుటేజీలోని మహిళ పోలికల ఆధారంగా విజయను పట్టుకున్న పోలీసులు విచారింగా ఇదే తరహాలో దుస్తులు మార్చుతూ లోగడ మరో రెండు నేరాలకు పాల్పడినట్టు అంగీకరించింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్మెట్ పీఎస్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పీఎస్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్టు పేర్కొంది. సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు తాను ఒక్కో దొంగతనం చేయడం కోసం చీర, జీన్స్, నైటీ ఇలా మూడు రకాల దుస్తులు ధరించినట్టు పేర్కొంది. నిందితురాలి నుంచి బంగారు ఆభరణాలు, నగదును స్వా«దీనం చేసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. -
ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగల సత్తా ఉందని తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఘనంగా చాటిచెప్పింది. 72వ మిస్ వరల్డ్ అందాల పోటీల నిర్వహణ అవకాశాన్ని అనూహ్యంగా దక్కించుకోవడమే కాకుండా అట్టహాసంగా నిర్వహించి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మే 2 నుంచి నిర్వాహకులు, పోటీదారులు నగరానికి చేరుకోవడం మొదలు శనివారం హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లోపాలు లేకుండా మిస్ వరల్డ్ సంస్థతో కలిసి పోటీలను సంయుక్తంగా నిర్వహించింది. పోటీల నిర్వహణలో ఆద్యంతం తెలంగాణ సాంస్కృతిక కళా వైభవం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేసింది. పోటీల నిర్వహణకు రూ. 60 కోట్ల వరకు ఖర్చవగా ప్రపంచ సుందరీమణులు పర్యటించిన ప్రాంతాలతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల సుందరీకరణకు మరో రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేసింది. పర్యాటకానికి ఊతం.. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంతో మిస్ వరల్డ్–2025 పోటీలు మే 10న గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒక్కో స్థానిక సంప్రదాయ కళారూపాన్ని ప్రదర్శిస్తూ ఒక్కో ఖండానికి చెందిన పోటీదారులను పరిచయం చేయడం వీక్షకులను ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానాన్ని తెలియజెప్పేందుకు పోటీదారులతో ఏర్పాటు చేసిన ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శన ప్రపంచ దేశాల సుందరీమణులకు ఎంతగానో నచ్చింది. పోటీల ఇతివృత్త నినాదమైన ‘తెలంగాణ జరూర్ ఆనా’ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఇవన్నీ తెలంగాణ పర్యాటకానికి ఊతమిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముసిరిన వివాదం..మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ మే 16న అందాల పోటీ నుంచి తప్పుకోవ డం వివాదానికి దారితీసింది. మిస్ వరల్డ్ నిర్వాహకులపై ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించడం సంచలనం రేపింది. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం.. ము గ్గురు సీనియర్ మహిళా ఐపీఎస్లతో విచారణకు ఆదేశించింది. అయితే మి ల్లా మాగీ నిరాధార ఆరోపణలు చేసిందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా మోర్లీ స్పష్టం చేశారు. పోటీ ల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం గొప్పగా సహకరించిందని.. తదుపరి పోటీలను కూడా అవకాశం లభిస్తే హై దరాబాద్లోనే నిర్వహించాలని ఉందని ఆమె పేర్కొనడం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. -
గోశాలల విస్తీర్ణం 50 ఎకరాలకు తగ్గొద్దు
సాక్షి, హైదరాబాద్: గోవుల సంరక్షణ సులువుగా ఉండేలా గోశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గోశా లల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి దశలో భాగంగా పశువైద్య విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, వాటి అనుబంధ కళాశాలలు, దేవాలయాల భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. గోశాలల ఏర్పాటు కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని, నిర్ణీత గడువులోగా ఈ కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికలతో సిద్ధం కావాలని కోరారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. గోవులు స్వేచ్ఛగా తిరిగేలా ఉండాలిఇరుకు స్థలాల్లో బంధించినట్టుగా కాకుండా.. గోవులు మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా గోశాలల్లో మార్పులు తేవాలని సీఎం సూచించారు. గోశాలల నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. సమీక్షలో భాగంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను సూచించారు. ఈ గోశాల తుది డిజైన్ను నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం ఖరారు చేయనుంది. సమావేశంలో సీఎం కార్యాలయ అధికారులు శేషాద్రి, శ్రీనివాసరాజు, మాణిక్రాజ్, అజిత్రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశుపోషణ విభాగం డైరెక్టర్ బి.గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
16 ఏళ్లకే రొమ్ము కేన్సర్ బారిన పడ్డా..
సాక్షి, హైదరాబాద్: ‘నేను పుట్టింది థాయ్లాండ్లోని ఫుకెట్లో. అక్కడే ప్రాథమిక విద్య పూర్తయింది. బ్యాంకాక్లో ఉన్నత విద్యను అభ్యసించాను. అక్కడే నా ఫ్యాషన్ ప్రయాణం మొదలైంది. 16 ఏళ్లకే రొమ్ము కేన్సర్కు గురయ్యాను. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడంతో వ్యాధి నుంచి తప్పించుకున్నాను. కానీ ఆ సమయంలో నా శారీరక, మానసిక అవస్థ వర్ణనాతీతం. మహిళలను వేధించే ఈ సమస్యను దూరం చేయాలంటే ప్రజల్లో అవగాహన చాలా అవసరమని గుర్తించాను.వ్యాధిని ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమన్న విషయం ప్రతి మహిళకు చేరేలా ప్రచారం చేస్తున్నాను. ఇది సత్ఫలితాన్నిస్తోంది. నాకు మా అమ్మే స్ఫూర్తి. హైదరాబాద్ ఆతిథ్యాన్ని జీవితాంతం మరవలేను. ఇప్పుడు నా జీవితంలో హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఏర్పడింది. మిస్ వరల్డ్ విజేతగా నా బాధ్యత మరింత పెరిగింది’ అని మిస్ వరల్డ్ ఒపాల్ సుచాత చువాంగ్శ్రీ పేర్కొంది. -
సమ్మర్ స్పెషల్.. వేసవిలో వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: వేసవి సీజన్ కూల్గా గడిచిపోయింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదైనప్పటికీ వాతావరణంలో వేగంగా మార్పులు జరగడం... అకాల వర్షాలు... ముందస్తు రుతుపవనాలతో ప్రజలు వేసవి కాలాన్ని కూడా కూల్గా ఆస్వాదించారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్తోపాటు పరిసర జిల్లాల్లో ఈసారి ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువ రోజులు లేదు.మార్చి నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదు కాగా ఆ తర్వాత అడపాదడపా కురిసిన వర్షాలతో ఎక్కువ రోజులు వాతావరణం చల్లగానే ఉంది. మరోవైపు వేసవి సీజన్లో వర్షాలు విస్తరంగా కురిశాయి. సీజన్లో కురవాల్సిన సాధారణ వర్షాల కంటే 203 శాతం అధికంగా వర్షాలు కురవడం గమనార్హం. గతేడాది వేసవి సీజన్లో సాధారణం కంటే 160 శాతం అధిక వర్షాలు కురవగా ఈ సీజన్లో అంతకు రెట్టింపు వర్షాలు కురిశాయి.సాధారణానికి మించి..రాష్ట్రవ్యాప్తంగా వేసవి సీజన్లో నెలవారీగా కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ మోతాదులోనే వర్షాలు నమోదయ్యాయి. సాధారణంగా మార్చి నెల నుంచి మే నెలాఖరు వరకు వేసవి సీజన్గా పరిగణిస్తారు. ఈ మూడు నెలల కాలంలో రాష్ట్రంలో సగటున 55.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. అయితే గత నాలుగేళ్లుగా వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే సాధారణం, అంతకు మించి వర్షాలు నమోదవుతున్నాయి. 2022 వేసవి సీజన్లో సగటున 42.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా 2024 వేసవిలో 80.5 మిల్లీమీటర్లు వర్షం నమోదైంది. గతేడాది నైరుతి సీజన్లో మాత్రం వర్షపాతం గణాంకాలు ఆశాజనకంగా లేవు. సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ పలు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుత సీజన్లో వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈసారి వేసవి సీజన్లోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణం చల్లబడింది.మార్చిలో తక్కువగా..మేలో అత్యధికంగా...ఈ ఏడాది మార్చి నెలలో సాధారణం కంటే కాస్త తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ఏప్రిల్ నెలలో మాత్రం సాధారణం కంటే 80 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మే నెలలో 376 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. మే నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో వర్షాలు భారీగా నమోదయ్యాయి. మరోవైపు ముందస్తుగా రుతుపవనాల రాకతోనూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు మోస్తరు నుంచి భారీగా కురవడంతో వర్షపాతం గణాంకాలు అమాంతం పెరిగాయి. -
ఇండియా ఫస్ట్.. తెలంగాణ ఫస్ట్ మా నినాదం
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధే తమ అభిమతమని.. ఇండియా ఫస్ట్.. తెలంగాణ ఫస్ట్ అన్నదే తమ నినాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు సాధించడం ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించేందుకు సర్వశక్తులూ ఉపయోగిస్తామని చెప్పారు. ఇంగ్లండ్లోని వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రొగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ (పీడీఎస్ఎల్) నాలెడ్జ్ సెంటర్ను కేటీఆర్ శనివారం ప్రారంభించారు. పీడీఎస్ఎల్ కార్యకలాపాలను భారత్కు విస్తరించాలన్నారు. ఇంగ్లండ్లో యూనివర్సిటీ, ఇండస్త్రీల మధ్య పరస్పర సహకారం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు పరిశోధన, అభివృద్ధి సేవలను అందించే పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ తెలంగాణ టాలెంట్కు నిదర్శనమని కేటీఆర్ కొనియాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వ వినూత్న విధానాలతోనే..బీఆర్ఎస్ ప్రభుత్వ వినూత్న విధానాలతో పుణే, చెన్నై సరసన హైదరాబాద్ ఆటోమోటివ్ హబ్గా నిలిచిందని కేటీఆర్ చెప్పారు. తమ ప్రభుత్వ కాలంలోనే ఐటీ, లైఫ్ సైన్సెస్తోపాటు ఆటోమోటివ్ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటిందన్నారు. ఈ రంగంలో కేవలం పరిశోధన, అభివృద్ధికే పరిమితం కాకుండా తయారీ రంగంలోనూ తెలంగాణను నంబర్ వన్గా నిలిపేందుకు తమ ప్రభుత్వం తెచ్చిన విధానాలు ఉపయోగపడతాయని కేటీఆర్ అన్నారు. భారత్లో ఫార్ములా ఈ–రేసింగ్ చాంపియన్షిప్ను నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్న కేటీఆర్... పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు రాష్ట్రంలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు.ఐటీ ఎగుమతుల్లోనూ పురోగతితమ ప్రభుత్వ నిరంతర కృషితో అంతర్జాతీయ కంపెనీలకు కొత్త చిరునామాగా తెలంగాణ మారిందని కేటీఆర్ పేర్కొ న్నారు. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు తమ అతిపెద్ద కార్యాల యాలను హైదరాబాద్లో ప్రారంభించాయని గుర్తుచే శారు. తమ తొమ్మిదేళ్ల పాలనలో ఐటీ ఉద్యోగాలు, ఎగుమతులతోపాటు ఇతర రంగాల్లోనూ తెలంగాణ అద్భుతంగా పురోగతి సాధించిందని చెప్పారు. ఐటీ, అనుబంధ రంగాలతోపాటు ఆటోమొబైల్ వంటి ఇతర రంగాల్లోనూ భారత యువత ప్రతిభ, నిబద్ధతతో అద్భు తంగా రాణిస్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా యువ త, విద్యార్థులతోపాటు కంపెనీలు కూడా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్ ఎల్ డైరెక్టర్ క్రాంతి పుప్పాల పాల్గొన్నారు. -
నేర దర్యాప్తుపై ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, హైదరాబాద్: కేసుల దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ అనుసరిస్తున్న తీరు లోపభూయిష్టంగా ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది మొత్తం క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. దర్యాప్తు బృందం న్యాయంగా విచారణ చేయకపో తే అది పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగానే పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఏళ్లకేళ్లు విచారణతో న్యాయం అందించడంలో జాప్యం జరుగుతుందని చెప్పింది. ఇది న్యాయ వ్యవస్థపై పౌరుల విశ్వాసాన్ని ప్రభా వితం చేస్తుందని పేర్కొంది. అత్యాచారం కేసులో హైదరా బాద్లోని శామీర్పేట్ డీఆర్డీవో ఏఓ కల్నల్ రిషిశర్మకు ఫాస్ట్ట్రాక్ కోర్టు విధించిన జీవిత ఖైదును హైకోర్టు రద్దు చేసి, ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. తన తల్లికి సన్నిహి తుడైన రిషిశర్మ తనపై అత్యాచారం చేయటంతో తాను గర్భం దాల్చానన్న బాధితురాలి ఫిర్యాదుతో 2017లో ఆయ నపై కేసు నమోదైంది. విచారణ చేపట్టిన ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టు 2024లో రిషిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. బాధితురాలు గర్భవతి అని తెలిసిన మూడు నెలల తర్వాత ఈ కేసు నమోదైంది. ఫాస్ట్ట్రాక్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కల్నల్ శర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటి షన్పై జస్టిస్ పి.సామ్కోషి, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మా సనం విచారణ చేపట్టి, రిషిశర్మను నిర్దోషిగా ప్రకటించింది. అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలంసందేహాలే తప్ప అభియోగాలను నిరూపించడంలో ప్రాసి క్యూషన్ విఫలమైందని హైకోర్టు తెలిపింది. కీలక సాక్షుల సాక్ష్యాలలో, బాధితురాలి తల్లి ప్రయాణ తేదీలు, గమ్య స్థానాలకు సంబంధించి స్పష్టమైన వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొంది. 2017, ఏప్రిల్ 17న గర్భం విషయం తెలిస్తే, ఏప్రిల్ 25 వరకు ఫిర్యాదు చేయకపోవడానికి కారణాలు తెలుపలేదని ఆక్షేపించింది. కల్నల్ శర్మ 2005లోనే వేసెక్టమీ చేయించుకున్నారని సర్టిఫైడ్ సర్టిఫికెట్ నిరూపిస్తోందని, అలాంటప్పుడు అతడు మరోసారి తండ్రి ఎలా కాగలరని ప్రశ్నించింది. విచారణలో దర్యాప్తు అధికారుల భారీ వైఫ ల్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. జవాబుదారీ తనంతో పనిచేస్తే వ్యవస్థ రావాలని సూచించింది. పోలీసుల తీరు కారణంగా నిర్దోషిని శిక్షించి, దోషులను వదలివేయడం జరుగుతోందని అసహనం వ్యక్తంచేసింది. దర్యాప్తు నాణ్యత పర్యవేక్షణకు, పారదర్శకతను పెంపొందించడానికి స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనిపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించింది. రిషిశర్మ విడుదల చేయాలని ఆదేశించింది. -
కేసీఆర్కు నోటీసులు ఎందుకిచ్చారు?
బంజారాహిల్స్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఎందుకిచ్చారు? కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని బంజారాహిల్స్ రోడ్ నెం.14లో శనివారం ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గోదావరిలో 200 టీఎంసీల నీటి హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని తెలిపారు. ఏటా 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా? రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా ? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా? అది కాళేశ్వరం కమిషనా? కాంగ్రెస్ కమిషనా?’అని ప్రశ్నించారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశారని, సీఎం రేవంత్రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులర్పించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ అననివారికి, అమర వీరులకు నివాళులులర్పించని వారికి సీఎం కుర్చీలో కూర్చొనే అర్హత లేదని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం పేరు మార్చి అమరులు శ్రీకాంతాచారి, యాది రెడ్డి, కాళోజీ, పీవీ నరసింహారావులలో ఎవరిదో ఒకరి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బనకచర్లపై రేవంత్రెడ్డి ఎందుకు మాట్లాడరు?ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ నీటిని తరలించుకుపోయే ప్రణాళిక వేస్తుంటే సీఎం రేవంత్ కనీసం స్పందించడం లేదని కవిత విమర్శించారు. జూన్ 2న సీఎం ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లును డీప్ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే బీజేపీకి సెగ తాకే విధంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేవరకు పోరాటం చేస్తా మన్నారు. జాగృతిలో ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభా గాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విభా గాన్ని ఏర్పాటుచేసి ఆ వర్గాల కోసం ఉద్యమిస్తామని వెల్ల డించారు. కేసీఆర్కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే.. మరో కన్ను తెలంగాణ జాగృతి అని పేర్కొన్నారు. -
అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపాయి. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలతో కూడిన ప్రగతి నివేదికను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. పథకాలు.. కార్యక్రమాలు.. ప్రజాభవన్కు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పెట్టి ప్రజలందరికీ ప్రవేశం కల్పించినప్పటి నుంచి సంగారెడ్డి జిల్లాలో ఇటీవల సీఎం రేవంత్రెడ్డి మచ్నూర్ కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించే వరకు చేపట్టిన కార్యక్రమాలను ప్రగతి నివేదికలో ప్రభుత్వం పొందుపరిచింది. ప్రజావాణి, ప్రజాపాలన, హైదరాబాద్ రైజింగ్, మహాలక్ష్మి పథకం అమలు, చేయూత, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్గాంధీ సివిల్స్ అభయ హస్తం, రాజీవ్ యువవికాసం, పంట రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు, ఉచిత విద్యుత్, రైతు బీమా, ఇందిరమ్మ ఆత్మీమయ భరోసా, రైతు నేస్తం, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు, సన్నబియ్యం తదితర పథకాల అమలును నివేదికలో వివరించింది. వివిధ శాఖల్లో అమలు చేసిన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత ప్రభుత్వ అప్పులకు చేసిన చెల్లింపులను అందులో పేర్కొంది. అలాగే తెలంగాణ వేదికగా బయో ఆసియా, ఏఐ గ్లోబల్ సమ్మిట్, లీడర్షిప్ సమ్మిట్, కామన్వెల్త్ మీడియేషన్, ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు, సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు, ఆటోమోటివ్స్ ఫెస్టివల్, సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్, భారత్ సమ్మిట్ మొదలైనవి జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అభివృద్ధి ప్రణాళికలు కూడా.. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే–2024 కోసం చేపట్టిన చర్యలను నివేదికలో ప్రభుత్వం వివరించింది. బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీల వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తీరును వివరించడంతోపాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం చేసిన ప్రణాళికలను వెల్లడించింది. మెట్రో విస్తరణ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, హైడ్రా ఆవిర్భావం, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల గురించి తెలియజేసింది. కొత్త ఉద్యోగ నియామకాలను శాఖలవారీగా వెల్లడించింది. భూభారతితోపాటు స్పీడ్ పథకం కింద చేపట్టిన 19 ప్రాజెక్టులు, మూసీ పునరుద్ధరణ లాంటి కార్యక్రమాల అమలు గురించి వివరించింది. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది.సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 1,266 కోట్ల సాయం ప్రగతి నివేదికలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అందించిన సాయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సీఎంఆర్ఎఫ్ కార్యక్రమంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని.. ప్రజాప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 2.87 లక్షల మందికి ఈ నిధి ద్వారా రూ. 1,266 కోట్ల సాయం అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. -
ఇక సర్వే నంబర్లు మార్చుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: రికార్డులో ఒక సర్వేనంబర్ ఉంటుంది.. భూమి మరో సర్వే నంబర్లో ఉంటుంది.. పాసు పుస్తకంలో ఉండే సర్వే నంబర్కు, రైతు కబ్జాలో ఉన్న వాస్తవ సర్వే నంబర్కు పొంతనే ఉండదు. తెలంగాణలోని చాలా వ్యవసాయ భూముల పరిస్థితి ఇదే. ఇప్పుడీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ వ్యవస్థలో నూతన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రైతుకు ఇష్టమైతే పాస్ పుస్తకంలోని సర్వే నంబర్ను మార్చి కబ్జాలో ఉన్న వాస్తవ సర్వే నంబర్ను చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పాతదే అయినా.. పట్టించుకోలేదు: దశాబ్దాల తరబడి తెలంగాణలో భూముల సర్వే జరగని కారణంగా సర్వే నంబర్లు తప్పుగా నమోద యినా మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఏ సర్వే నంబర్ అయితే ఏముందిలే... ఉన్న భూమి రికార్డులో ఉంటే చాలంటూ రైతులు కూడా ఆ సమస్యను సీరియస్గా తీసుకోలేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ శాఖలో అనేక మార్పులు చేపడుతోంది. గ్రామ నక్షాలు లేని 413 గ్రామాలను గుర్తించిన ప్రభు త్వం.. 5 గ్రామాల్లో పైలట్ పద్ధతిలో భూముల రీసర్వేకు పూనుకుంది. ఈ రీసర్వేలో సర్వే నంబర్ల సమస్య వెలుగులోకి వచ్చింది. రీసర్వే జరు గుతున్న సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 32 మండలాల్లో భూభారతి చట్టాన్ని పైలట్గా అమలు చేస్తూ రైతుల భూసమ స్యలపై దరఖా స్తులు తీసుకుంటున్నారు. ఈ దరఖాస్తుల్లోనూ సర్వే నంబర్ల మార్పిడి విజ్ఞాపనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుకు ఇష్టమైతే తన పాసుపుస్తకంలోని సర్వే నంబర్ను మార్చాలని నిర్ణయించింది.అందరికీ తెలిసేలానే మార్పు..రికార్డుల్లో సర్వే నంబర్ల మార్పు కార్యక్రమాన్ని పద్ధతి ప్రకారం చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూమి ఓ సర్వే నంబర్లో ఉండి రికార్డుల్లో మరో సర్వే నంబర్ ఉంటే.. ఆ రెండు సర్వే నంబర్లలోని రైతుల్లో ఎవరైనా రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసు కోవాల్సి ఉంటుంది. అప్పుడు రెండు సర్వే నంబర్లలోని రైతులకు వారం రోజుల నోటీసును రెవెన్యూ యంత్రాంగం ఇస్తుంది. ఆ వారం రోజుల్లో అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తుంది. లేదంటే గ్రామసభ పెట్టి అక్కడే రైతుల నుంచి సంతకాలు తీసుకుని వారిద్దరి సర్వే నంబర్లలోని రికార్డులను మార్పు చేసి వాస్తవంగా కబ్జాలో ఉన్న సర్వే నంబర్ను పాస్బుక్లో చేరుస్తారు. ఈ సర్వే నంబర్ సమస్య ఒకే రైతుకు ఉంటే ఆ రైతుకు నోటీసు ఇచ్చి ఆ తర్వాత రికార్డు మారుస్తారు. అయితే, ఇక్కడ సర్వే నంబర్ను మాత్రమే మారుస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి విస్తీర్ణం మార్చబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. -
Miss World 2025: మిస్ వరల్డ్ చువాంగ్శ్రీ
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్–2025గా థాయ్లాండ్ భామ ఒపల్ సుచాత చువాంగ్శ్రీ(21) ఎంపికైంది. హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఉత్కంఠభరితంగా జరిగిన 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో ఆమె విజయం సాధించింది. ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిష్టినా పిష్కోవా ఆమెకు రూ. 6.5 కోట్ల విలువైన బ్లూ క్రౌన్ను అలంకరించింది. ఈ విజయంతో ఆమె దాదాపు రూ. 8.5 కోట్ల ప్రైజ్మనీతోపాటు లండన్లో ఏడాదిపాటు నివాసం, డిజైనర్ దుస్తులు, నగలు వంటి బహుమతులు, ఏడాదిపాటు ప్రపంచవ్యాప్తంగా ఉచిత విమాన ప్రయాణ సౌలభ్యం, స్టార్ హోటళ్లలో ఉచిత బస వసతి పొందనుంది. మొదటి రన్నరప్గా ఇథియోపియాకు చెందిన హాసెట్ డెరెజె అడ్మాస్సు, రెండో రన్నరప్గా పోలాండ్కు చెందిన మజా క్లాజ్డా, మూడో రన్నరప్గా మార్టినిక్కు చెందిన ఆరేలీ జోచిమ్ నిలిచింది. భారత సుందరి నందినీ గుప్తా టాప్–8 జాబితాలో కూడా చోటుదక్కించుకోలేకపోయింది. అందరూ వచ్చి.. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. సాయంత్రం ఐదున్నరకే కార్యక్రమాలు మొదలయ్యాయి. తొలుత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే 108 మంది భామలను రెడ్ కార్పెట్ మీదుగా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానించారు. అనంతరం వ్యాఖ్యాత సచిన్ కుంభర్ అమెరికా–కరేబియన్, ఆసియా–ఓసియానియా, ఆఫ్రికా, యూరప్.. ఇలా నాలుగు భాగాలుగా విభజించి దేశాలవారీగా పోటీదారులను పరిచయం చేశారు. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలేలో పోటీపడే టాప్–40 మందితో కూడిన బృందాన్ని పరిచయం చేశారు. ఒక్కో ఖండం నుంచి 10 మంది చొప్పున ఇందులో చేర్చారు. గత మూడు వారాలుగా జరిగిన ఐదు చాలెంజ్ల విజేతలైన 16 మందితోపాటు న్యాయ నిర్ణేతలు ఇచ్చిన మార్కుల ఆధారంగా మిగతా 24 మందిని వేదికపైకి ఆహ్వానించి మొత్తం 40 మందితో కూడిన బృందాన్ని సిద్ధం చేశారు. దీంతో పోటీ నుంచి వైదొలిగిన మిగతా వారు వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన స్థానాల్లో ఆసీనులయ్యారు. పోటీదారులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రొఫైల్.. వారి చాతుర్యం.. మాటతీరు ఆధారంగా కేటాయించిన మార్పుల ఆధారంగా ఒక్కో ఖండం నుంచి ఐదుగురు చొప్పున ఉండే టాప్–20 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. ఆ రౌండ్లో వైదొలిగిన వారు వెళ్లి వారి స్థానాల్లో కూర్చోగా తదుపరి రౌండ్లో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున టాప్–8 మందిని (ఆఫ్రికా: నమీబియా, ఇథియోపియా, యూరప్: పోలాండ్, ఉక్రెయిన్, ఆసియా–ఓíÙయానియా: ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, అమెరికా–కరీబియన్: బ్రెజిల్, మార్టినికా) షార్ట్ లిస్ట్ చేశారు. భారత సుందరి నందిని గుప్తా ఈ దశలోకి చేరుకోలేక నిష్క్రమించింది. ‘మీరే ఎందుకు ప్రపంచ సుందరి కావాలనుకుంటున్నారు?’ టాప్–8 మంది సుందరీమణుల్లోంచి టాప్–4 భామలను ఎంపిక చేసేందుకు న్యాయ నిర్ణయితలు అడిగిన ప్రశ్నలు కీలక భూమిక పోషించాయి. గతంలో వారు పొందిన మార్కులు.. ఈ ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాల ఆధారంగా అప్పటికప్పుడు ఇచ్చిన మార్కులు కలిపి విజేతను ఎంపిక చేశారు. తొలుత 8 మందిని ప్రజెంటర్ సచిన్ కుంభర్ అడిగిన ‘మీరే ప్రపంచ సుందరి ఎందుకు కావాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా తుది పోరుకు థాయ్లాండ్, ఇథియోపియా, పోలాండ్, మార్టినిక్ సుందరీమణులను ఎంపిక చేశారు. ఉత్కంఠభరితంగా తుది పోరు... నలుగురు మాత్రమే వేదికపై ఉండి తుది పోరుకు సిద్ధమైన తరుణంలో ఆ ప్రాంగణమంతా ఉద్విగ్నత నెలకొంది. న్యాయ నిర్ణేతలైన మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జూలియా మోర్లే, నటులు సోనూసూద్, రానా దగ్గుబాటి, నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని ఒక్కొక్కరికీ సంధించిన ప్రశ్నలకు పోటీదారులు ఇచ్చిన సమాధానాలు వారి స్థానాలను నిర్ణయించాయి. సోనూసూద్ అడిగిన ప్రశ్నకు అద్భుతంగా సమాధానమిచ్చిన థాయ్లాండ్ సుందరి ఒపల్ సుచాత చువాంగ్శ్రీ మిస్ వరల్డ్–2025గా ఎంపికైంది. సోనూసూద్కు మానవతావాది పురస్కారం కోవిడ్ సమయంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న నిరుపేద కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు ఉచిత రవాణా వసతి కల్పించిన సినీనటుడు సోనూసూద్కు మిస్ వరల్డ్ మానవతావాది’ పురస్కారాన్ని మిస్వరల్డ్ సంస్థ ప్రకటించింది. ఆయనకు రానా దగ్గుబాటి బంగారు గ్లోబ్ను అందించారు. -
మిస్ వరల్డ్ ఫినాలే నుంచి మిస్ ఇండియా ఔట్
సాక్షి, హైదరాబాద్: హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్-2025 పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో టాప్-8 నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించారు. టాప్-8 మందిలో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ నిలిచాయి.ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేశారు. నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావంటూ అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం చెప్పిన వారికి నిర్వాహకులు అవకాశం ఇస్తున్నారు. అభ్యర్థుల సమాధానాలకు జడ్జీలు మార్కులు వేస్తున్నారు.మిస్ వరల్డ్ టాప్ నలుగురు వీరే..అమెరికా ఖండం నుంచి మార్టినిక్ఆఫ్రికా నుంచి ఇథియోపియా యూరోప్ నుంచి పోలెండ్ఆసియా నుంచి థాయిలాండ్ -
‘సీఎం రేవంత్ ఇప్పటికైనా జై తెలంగాణ అని అనాలి’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మరోసారి మండిపడ్డారు. ఇప్పటివరకూ సీఎం రేవంత్.. జై తెలంగాణ అనే నినాదాన్నే పలకలేదని కవిత ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని నినదించాలి అని డిమాండ్ చేశారు కవిత. తెలంగాణ ప్రజలపై రేవంత్ అక్కసు ఎందుకని ప్రశ్నించారు కవిత. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడిన కవిత.. రేవంత్ తెలంగాణ నినాదాన్ని ఇప్పటివరకూ పలకలేదన్నారు.గోదావరి జలాలు శాశ్వతంగా తెలంగాణకు దూరం కాబోతున్నాయని కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్.. కాళేశ్వర కమిషనా.. లేక కాంగ్రెస్ కమిషనా అనే అనుమానం ఉందన్నారు.తెలంగాణ ప్రతి ఉద్యమంలో జాగృతి సంస్థ భాగమైందని, 18 ఏళ్ల క్రితమే జాగృతి సంస్థను స్థాపించామన్నారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థను ఏర్పాటు చేశామన్నారు కవిత. కవిత ఏమన్నారంటే..తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశారు. మన కర్మ ఇప్పుడు జై తెలంగాణ అనని సీఎం పరిపాలనలో ఉంది. జూన్2 న అయిన సీఎం జై తెలంగాణ అనాలి. అమర వీరులకు నివాళులు అర్పించాలి..అని డిమాండ్ చేస్తున్న. రాజీవ్ యువ వికాసం పేరుతో కార్యక్రమం ఉండకూడదు. రాజీవ్ తెలంగాణకు ఏం సంబంధం. తెలంగాణ వాదుల పేర్లు పెట్టాలి. తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంత చారి లాంటి వారి పేరు పెట్టాలి. గోదావరి కావేరీ లింక్ పేరుతో గోదావరి నీరు తెలంగాణ కు దూరం కాబోతున్నాయి. 200 TMC నీళ్ల హక్కు కోసం cm మాట్లాడారు. నీళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలి..Kcr కు ఎందుకు నోటీసు లు ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ లేక కాంగ్రెస్ కమిషనా?, జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జూన్ 4 న మహా ధర్నా చేపడుతున్నాం..కాంగ్రెస్ కాళేశ్వరం పై కుట్రలను ఎండగడుతున్నాం.. బిజెపి బీసీ బిల్లును డీ ఫ్రీజ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే జాగృతి తరుపున మళ్ళీ పోరాటం చేస్తాం. విద్యార్థులు, మహిళల కోసం, మైనార్టీల కోసం ఇచిన హామీల అమలు కోసం పోరాటం చేస్తాం. కెసిఆర్కి బీఆర్ఎస్ ఒక కన్న అయితే మరో కన్ను జాగృతి.. బిజెపికి 8 ఎంపీల ఉంటే ఒక్క అంశం గురించి మాట్లాడారు.. బిజెపికి కాంగ్రెస్కి జాగృతి సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తాం’ అని కవిత హెచ్చరించారు. -
మిస్వరల్డ్ 2025గా థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాత
Miss World 2025 Grand Finale Updates:👉మిస్వరల్డ్ 2025గా థాయ్లాండ్ సుందరిమిస్ వరల్డ్ 2025గా థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాతవిజేత ఓపల్ సుచాతకు బ్లూక్రౌన్ అలంకరించిన క్రిస్టినామిస్ వరల్డ్ 1వ రన్నరప్గా ఇథియోపియా సుందరి అడ్మాస్సుమిస్ వరల్డ్ 2వ రన్నరప్గా పోలాండ్ సుందరి మాజా క్లాజ్డ్మిస్ వరల్డ్ 3వ రన్నరప్గా మార్టినిక్ భామ అరోలి జోచిమ్👉మిస్ వరల్డ్ లో ఫైనల్ రౌండ్ ప్రారంభంజడ్జీలు అడిగే ప్రశ్నలకు కంటెస్టెంట్ల సమాధానాలువాటికి మార్కుల ఆధారంగా విజేత👉మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ (మానవతావాది) అవార్డు అందుకున్న సోనూ సూద్కోవిడ్ సమయంలో ఆయన చేసిన మానవతాచర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించిన మిస్ వరల్డ్ నిర్వాహకులురానా దగ్గుబాటి చేతుల మీదుగా జ్ఞాపిక అందజేతస్టేజ్ పైన వదల బొమ్మాళీ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహ పరిచిన సోనూ సూద్తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు చెప్పిన సోనూసూద్👉టాప్-8 లో చోటు దక్కించుకోలేకపోయిన ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తా ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేసిన నిర్వాహకులు👉మిస్ వరల్డ్ టాప్ నలుగురు వీరే..అమెరికా ఖండం నుంచి మార్టినిక్ఆఫ్రికా నుంచి ఇథియోపియాయూరోప్ నుంచి పోలెండ్ఆసియా నుంచి థాయిలాండ్👉మిస్ వరల్డ్ పోటీల నుంచి నిష్క్రమించిన మిస్ ఇండియా నందిని గుప్తాఆసియా నుంచి టాప్-2లో చేరిన థాయ్లాండ్నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావని అడిగిన ప్రశ్నతో 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశంఅభ్యర్థుల సమాధానాలకు జడ్జీల మార్కులు 👉మిస్ వరల్డ్ ఫినాలే నుంచి మిస్ ఇండియా ఎలిమినేట్ఎలిమినేటైన మిస్ ఇండియా నందిని గుప్తాటాప్-8లో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోఫియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్, థాయ్లాండ్లు 👉ఆసియా నుంచి టాప్ 5లో మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 20 లో ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తాకు చోటు👉మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా సుధా రెడ్డి నియామకంజ్ఞాపికను అందించిన మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీచాలా ఆనందంగా ఉందన్న సుధా రెడ్డిఅద్భుతమైన ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వానికి, టూరిజం శాఖకు కృతజ్ఞతలు తెలిపిన సుధా రెడ్డి👉జడ్జిలుగా..జూలియా మోర్లీ నటుడు సోనూ సూద్సుధా రెడ్డి రానా దగ్గుబాటిజయేష్ రంజన్ మనూషి చిల్లర్ నమ్రత శిరోద్కర్ డోనా వాళ్ష్కరినా టర్రెల్👉అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్కుటుంబ సమేతంగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్హాజరైన సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది. ఫినాలేకు రాష్ట్ర టూరిజం శాఖ, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భారీ ఏర్పాట్లు చేసింది. గ్రాండ్ ఫినాలేకి 3,500 మంది గెస్ట్లుగా హాజరయ్యారు. గ్రాండ్ ఫినాలేకి టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు వచ్చారు.2016 మిస్ వరల్డ్ విన్నర్ స్టేఫినీ డెల్ వాలే, సచిన్ కుంభర్.. ఫినాలే ఈవెంట్ను హోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ స్పెషల్ లైవ్ షో నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ న్యాయనిర్ణేతలుగా నటుడు సోను సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కరీనా టర్రెల్ వ్యవహరించారు. 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు.ఫినాలేలో మిస్ వరల్డ్ హ్యూమానిటరియన్ అవార్డును సోనుసూద్ అందుకోనున్నారు. మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ.. విన్నర్ను ప్రకటించనున్నారు. 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా.. విజేతకు 6.21 కోట్ల విలువ గల బ్లూ క్రౌన్ అలంకరించనున్నారు. విశ్వసుందరికి 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 40 మంది సుందరీమణులు ఫినాలేలో పోటీపడుతున్నారు. టాప్ 40లో ఇప్పటికే 16 బెర్త్లు ఖరారు కాగా, ఈ రోజు జరిగే క్వార్టర్స్ ఫైనల్స్లో 24 మందిని జూరీ మెంబర్లు ఎంపిక చేయనున్నారు.బ్యూటీ విత్ ఎ పర్సస్లో మిస్ ఇండోనేషియా, మిస్ వేల్స్, మిస్ ఉగాండ విజేతలుగా నిలిచారు. బ్యూటీ విత్ ఎ పర్సస్, టాలెంట్ ఈవెంట్ రెండింట్లోను మిస్ ఇండోనేషియా మోనిక కేజియా గెలిచారు. స్పోర్ట్స్ ఈవెంట్ లో విజేతగా మిస్ ఎస్తోనియా నిలిచారు. హెడ్-టు-హెడ్ రౌండ్లో మిస్ టర్కీ విన్ అయ్యారు. ఫ్యాషన్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండియా నందినీ గుప్తా టాప్ మోడల్గా నిలిచారు. -
హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నగరాలలో వీకెండ్ అంటే సంథింగ్ స్పెషల్.. నిద్ర లేచే సమయం నుంచి తినే తిండి, తిరిగే ప్రాంతం వరకూ.. ప్రతీది డిఫరెంట్గా ఉండాలనుకుంటారు. కరోనా తర్వాత నుంచి ఈ అభిరుచికి పర్యావరణం కూడా తోడైంది. దీంతో వారంలో కనీసం రెండు రోజులైనా పచ్చని ప్రకృతిలో సేదతీరాలని భావిస్తున్నారు. చుట్టూ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, రణగొణ ధ్వనులు, కాలుష్యం లేని ప్రాంతం.. ఇంటికి తిరిగొస్తూ వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు వెంట తెచ్చుకునే వీలూ ఉండాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే వీకెండ్ హోమ్స్ ఆదరణ పెరిగింది.ఈ ప్రాంతాల్లో డిమాండ్ కడ్తాల్, తలకొండపల్లి, షాద్నగర్, శంకర్పల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్ హోమ్స్కు డిమాండ్ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్ హోమ్స్ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు. కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే.. అందమైన వీకెండ్ హోమ్స్ను డిజైన్ చేయవచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువూ పర్యావరణ హితమైనవే ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కలపతో నిర్మాణం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఉంటుంది.ఎక్కడ చూసినా గ్రీనరీనే.. వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్లలో సాధ్యమైనంత స్థలాన్ని గ్రీనరీకే కేటాయిస్తారు. ఒకవేళ వీకెండ్ హోమ్స్ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకు తీసుకుంటుంది. వాటిని డెస్టినేషన్ వెండింగ్స్ కోసం వినియోగించి.. వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా ఇస్తుంది. వాటి నిర్వహణ బాధ్యత కంపెనీదే. ఒకవేళ కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకునేందుకు వీలుగా తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తారు. -
సెల్ఫోన్ టార్చ్తో ట్రీట్మెంట్పై హరీష్రావు ఫైర్
హైదరాబాద్, సాక్షి: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో(Zaheerabad Govt Hospital Incident) సెల్ ఫోన్ వెలుతురులో వైద్యం చేసిన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish rao) స్పందించారు. పాలన పడకేసిన రాష్ట్రంలో చివరకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారాయన.ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదు.. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో(Cell Phone Torch Treatment) చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఎక్స్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.రోజుకు 300కు పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా(Zaheerabad Area Hospital) ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా పాలన పడకేసిందని, పేదలకు వైద్యం అందకుండా పోతున్నది అన్నారాయన. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గారూ.. గాలిలో మెడలు కట్టడం మానేసి, కనీస సౌకర్యాలు కల్పించండి’’ అని రేవంత్ను ట్యాగ్ చేస్తూ హరీశ్రావు పోస్ట్ చేశారు.ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదు. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి.300 పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉన్నట్లు.ఏడాదిన్నరగా… pic.twitter.com/rm1o4SKaXS— Harish Rao Thanneeru (@BRSHarish) May 31, 2025 -
హైదరాబాద్లో ఇంటి సెంటిమెంట్..
ఓ వైపు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.. నలువైపులా విస్తరిస్తోంది.. అందుకు తగ్గట్టే నివాస భవనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ.. నగరవాసుల్లో సొంతింటి పట్ల ఆసక్తి ఇసుమంతైనా తగ్గలేదు. నా ఇల్లు అనే భావోద్వేగ బంధానికి, సెంటిమెంట్కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన ‘బియాండ్ బ్రిక్స్: ది పల్స్ ఆఫ్ హోం బయింగ్’ అనే అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. – సాక్షి, సిటీబ్యూరోరియల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నా సొంతింటి కల సాకారం చేసుకోవాలనే తపన మాత్రం నగరవాసుల్లో తగ్గడం లేదని తేల్చిన ఈ అధ్యయనం దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నగరాల్లో ప్రజలు సొంత ఇంటి గురించిన ఆలోచనా విధానాన్ని పరిశీలించారు. ఆ అధ్యయనం వెల్లడించిన విశేషాలివి..ఇల్లు కొనాల్సిందే..సొంతింటిని కోరుకుంటున్న నగరాల వ్యాప్తంగా చూస్తే, అత్యధిక శాతం మందికి అది సెంటిమెంట్గా మారిన నగరంగా చెన్నై తొలిస్థానంలో నిలిచింది. ఆ నగరంలో 86శాతం మంది సొంత ఇంటికి జైకొడుతున్నారు. ఆ తర్వాత స్థానాన్ని 85శాతంతో ముంబై దక్కించుకుంది. ఇక అహ్మదాబాద్వాసుల్లో 83శాతం మంది నా ఇల్లే నా స్వర్గం అంటుంటే.. ఆ తర్వాత స్థానంలో నిలిచిన మన హైదరాబాద్లో 81శాతం మంది ఇల్లు కొనాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. మన నగరం తర్వాత 80శాతంతో కోల్కతా, 74శాతంతో ఢిల్లీ, 73శాతంతో బెంగళూర్లు సొంతింటి కలలో తేలిపోతున్నాయి. సొంతిల్లు ఎందుకంటే.. సుదీర్ఘకాలం సురక్షితంగా భద్రంగా జీవించాలి అంటే సొంత ఇల్లు ఉండాల్సిందేనని నగరవాసులు భావిస్తున్నారు. సొంతిల్లు వైపు నడిపిస్తున్న తర్వాతి కారణాల్లో ఆర్థిక స్థిరత్వం.. అంటే ఇల్లు కొనడమేననే ఆలోచన బలంగా ఉండటం, 3వ కారణంగా సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న సొంత ఇల్లు అనే భావన.. వంటివి ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. రూ.50 లక్షలు పైబడిన ఆదాయం ఉన్న అధికాదాయ వర్గాల వారిలో 91శాతం మంది సొంతిల్లు కావాలంటుంటే, అత్యల్ప ఆదాయం ఉన్న వారిలోనూ 71శాతం మంది అదే కోరిక వ్యక్తం చేస్తున్నారు.ఇల్లు కావాలి.. అవి కూడా కావాలి..ఇల్లు కొనేటప్పుడు ప్రధానంగా ఏం చూస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా వైద్య సౌకర్యాలకే అత్యధికులు ప్రాధాన్యత ఇచ్చారు. ఆస్పత్రులకు సమీపంలో నివసించడానికే 58శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. షాపింగ్కు ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. తమ ఇల్లు మార్కెట్స్కు సమీపంలో ఉండాలని 53శాతం మంది ఆశిస్తుంటే, రవాణా సౌకర్యాలు బాగుండే చోటైతేనే రైటు అంటున్నవారు 40శాతం మంది. అంతేనా ఇరుగు పొరుగుతో కాలక్షేపం ఉండాల్సిందే అంటున్న 23శాతం మంది కమ్యూనిటీ క్లబ్లకు సమీపంలోని ఇంటిని ఇష్టపడుతున్నారు. సొంత ఇంటితో పాటే ఆరోగ్యమూ మా తోటే అంటున్న నగరవాసుల్లో 16శాతం మంది జిమ్ తదితర వ్యాయామ సౌకర్యాలు దగ్గరలో ఉన్న ఇంటిని కోరుకుంటున్నారు. నగరంలో అత్యధికులు సొంత ఇంటిని ఇప్పటికీ సెంటిమెంట్గా భావిస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుతం కనిపిస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలోని ఒడిదుడుకులు తాత్కాలికమేనని స్పష్టం అవుతోంది. సొంత ఇంటి కల నిజం చేసుకునేవారి కల సాకారం చేసే విధంగా అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు అందజేయగలిగితే.. సిటీ రియల్ రంగానికి భవిష్యత్తుకి దోకా ఉండదు. -
గచ్చిబౌలి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. 13 మందికి తీవ్ర గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గోపనపల్లి(Gopanpally) సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం(Road Accident) సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.ఇదీ చదవండి: భర్తకు మెసేజ్ పెట్టి బలవన్మరణం -
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులు
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిలలో రికార్డు స్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని సాధించింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు ఐదేళ్లలో హైదరాబాద్లో రికార్డు స్థాయిలో పెరిగాయని ఓ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైంది. – సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చ.అ.కు రూ.7,450గా ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాలలో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణం. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.దేశంలోని సగటు చూస్తే.. 2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో రూ.12,400గా ఉండగా.. 2024 నాటికి రూ.15,350కి పెరిగాయి.👉ఇది చదివారా? హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్..అందుబాటు గృహాలలో 15 శాతం ఏడు ప్రధాన నగరాలలో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో అత్యధికంగా ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగంలో ధరల వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది.మధ్యతరగతిలో 18 శాతం ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాలలో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్యతరగతి విభాగంలోని ఇళ్ల విలువలలో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్లోనే నమోదైంది. మన నగరంలో మిడ్సైజ్ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది. -
కుమార్తెను అమెరికా నుంచి రప్పించాలని తండ్రి వేడుకోలు
పంజగుట్ట(హైదరాబాద్): భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక, అమెరికాలో చిక్కుకున్న తన కుమార్తెను కాపాడాలని ఓ తండ్రి వేడుకుంటున్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు గులాం అఫ్జల్, న్యాయవాది విజయ్కుమార్ మాట్లాడుతూ... తన కూతురు ఫాతిమా హస్నాకు 2007లో గుల్బర్గాకు చెందిన డబీరుద్దీన్ అనే డాక్టర్తో వివాహం జరిగిందన్నారు. వివాహం అయిన తరువాత అమెరికాకు వెళ్లిపోయి అక్కడ 58 రోజులపాటు బాగానే ఉన్నారని తెలిపారు. తరువాత డబీరుద్దీన్ కేవలం అమెరికా వెళ్లేందుకే ఫాతిమాను వివాహం చేసుకున్నట్లు తెలియడంతో ఇద్దరి మధ్య తగాదాలు జరిగాయని తెలిపారు. దీంతో వెంటనే ఆమె భారతదేశానికి వచ్చి అతనిపై కేసులు వేసి చట్టపరంగా విడాకులు తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగ నిమిత్తం తిరిగి అమెరికాకు వెల్లిన ఫాతిమాను డబీరుద్దీన్ వేధింపులకు గురిచెయ్యడమే కాకుండా ఆమెపైనే తనను మోసం చేసి అమెరికాకు తీసుకువచ్చిందిని అమెరికాలో తప్పుడు కేసులు పెట్టాడని తెలిపారు. దీంతో అమెరికా చట్టం ప్రకారం ఆమెపై కేసు నమోదు చేసి డబీరుద్దీన్కే భరణం ఇవ్వాలని చెప్పడంతో గత 10 సంవత్సరాల నుంచి ఫాతిమా ఉద్యోగం చేసుకుంటూ భరణం ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెపై కేసులు ఉండటంతో ఇండియాకు రాలేని పరిస్థితి ఉందని అటు భరణం ఇవ్వలేక తన పింఛన్ డబ్బులు కూడా పంపించాల్సి వస్తుందని గులాం అఫ్జల్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తన కుమార్తెను భారత్కు రప్పించాలని, అలానే డబీరుద్దీన్పై కూడా ఇక్కడ తన కూతురు పెట్టిన కేసులు ఉన్నందున అతన్ని కూడా ఇండియాకు రప్పించాలని విజ్ఞప్తి చేశారు. -
ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు!
సాక్షి, స్పెషల్ డెస్క్: ముక్క లేనిదే ముద్ద దిగని కుటుంబాలు మన దేశంలో ఎన్నో. భారతీయులు ఆహారంపై ఏటా చేస్తున్న వ్యయంలో మాంసాహారం వాటా దశాబ్ద కాలంలో 8 నుంచి 10.8 శాతానికి ఎగబాకింది. కేంద్ర గణాంక శాఖ ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్–2025’ ప్రకారం.. ఈ పదేళ్లలో కూరగాయల స్థానాన్ని వెనక్కినెట్టి మాంసాహారం ఒక మెట్టు ఎక్కడం ఆసక్తికరమైన విషయం. దేశంలో మొత్తం వినియోగ వ్యయంలో తొలి స్థానం ఆహారానిదే. ఆహార పదార్థాలకు భారతీయ కుటుంబాలు ఏటా చేస్తున్న వ్యయంలో పాలు, పాల ఉత్పత్తులు; బ్రెడ్, తృణధాన్యాలు, పప్పులు; పండ్లు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. భారతీయుల ఆహారపు అలవాట్లు గత పదేళ్లలో చాలా మారాయి. కొత్త తరం.. కొత్తకొత్త ఆహార ఉత్పత్తులు తయారుచేసే సంస్థలు.. సరికొత్త వెరైటీలు.. ఇవన్నీ మన ఆహారపు అలవాట్లను ప్రభావితం చేశాయి. పదేళ్ల కిందట దేశంలో కూరగాయల వినియోగమే ఎక్కువగా ఉండేది. ఆ తరువాతి స్థానం మాంసాహారానిది. 2013–14లో 10.8 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉన్న కూరగాయలను అదే వాటాతో దశాబ్ద కాలంలో మాంసాహారం భర్తీ చేసింది. 10.6 శాతం వాటాతో కూరగాయలు 5వ స్థానానికి దిగొచ్చాయి.పెరిగిన ఆహార స్పృహకరోనా తరువాత ప్రజల్లో ఆహార స్పృ హ బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్లు.. ఇలా పోషకాలమీద అవగా హన పెంచుకుని, అవి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలవైపు మళ్లారు. అందుకే నేమో.. 2013–14తో పోలిస్తే 2023–24 నాటికి ఆహార పదార్థాలకు వెచ్చించిన మొత్తంలో పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, సముద్ర ఉత్పత్తులు, మాంసం, గుడ్ల వాటా గణనీయంగా పెరిగింది. అలాగే బ్రెడ్, తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు, నూనెలు, కొవ్వులు, చక్కెర, జామ్, చాకోలెట్స్, కన్ఫెక్షనరీకి చేస్తున్న ఖర్చులను జనం తగ్గించారు.ఖర్చుకు వెనుకాడడం లేదు..గతంతో పోలిస్తే ప్రజలు.. ఖర్చుకు ఏమా త్రం వెనుకాడడం లేదని గణాంకాలు చెబుతున్నా యి. దేశవ్యాప్తంగా మొత్తం కుటుంబాల విని యోగ వ్యయం 2023–24లో రూ.99,10,363 కోట్లకు చేరుకుంది. 2013–14లో ఇది రూ.55,93,183 కోట్లు మాత్రమే. గత దశాబ్దంలో సగటున 5.9% వార్షిక రేటుతో వృద్ధి నమోదు కావడం గమనార్హం. గృహాలు, గృహాలకు సేవలందించే లాభాపేక్షలేని సంస్థలు.. ఆహారం, దుస్తులు, గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, విద్య, వినోదం వంటి వస్తు, సేవలపై చేసే మొత్తం ఖర్చును ప్రైవేట్ తుది వినియోగ వ్యయం అంటారు. పదేళ్లలో ఈ వ్యయం 77 శాతం పెరిగిందంటే అతిశయోక్తి కాదు.రెస్టారెంట్లలో తాకిడి..మొత్తం కుటుంబాల వినియోగ వ్యయంలో 2013–14తో పోలిస్తే 2023–24 నాటికి ఆహారం, నాన్ ఆల్కహాల్ పానీయాల వాటా తగ్గినప్పటికీ ఈ విభాగం 26.4 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ఇంటి వంటకంటే... రెస్టారెంట్లు, హోటళ్లలో తినడాన్ని ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే, బయటి టిఫిన్లు, భోజనాల కోసం చేస్తున్న ఖర్చులు గతంతో పోలిస్తే పెరిగాయి. మొత్తం వినియోగ వ్యయంలో రవాణా ఖర్చుల వాటా 14.3 శాతం నుంచి దాదాపు 19 శాతానికి ఎగబాకడం విశేషం. ఆరోగ్యం, విద్యకు చేసిన వ్యయాల వాటా పెరిగింది. ఆల్కహాల్, పొగాకు, నార్కోటిక్స్ వ్యయాల వాటా 21.7 శాతం క్షీణించింది. కమ్యూనికేషన్, గృహాలంకరణకు చేసే ఖర్చులు ఎక్కువయ్యాయి. దుస్తులు, పాదరక్షల కోసం ఖర్చులు తగ్గించారు. -
మినీ సిలిండర్తో...
రాజేంద్రనగర్(హైదరాబాద్): తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తన భార్య తన నుంచి దూరమయ్యేందుకు కారణమని భావించిన ఓ యువకుడు మరో యువకుడిని మినీ సిలిండర్తో తలపై మోది హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మామిడి కిశోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రాంతానికి చెందిన సాయి కార్తీక్ (31), నవీన్ స్నేహితులు. ఇద్దరూ ఓ నెట్వర్క్ కంపెనీలో పని చేస్తూ అద్దె గదిలో ఉంటున్నారు. అదే ప్రాంతంలో సిద్ధార్థ్ రెడ్డి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. సిద్ధార్థ్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. సిద్ధార్థ్ రెడ్డి, సాయి కార్తీక్, నవీన్లకు స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం సాయి కార్తీక్ సిద్ధార్థ్ రెడ్డి నుంచి రూ. 8 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా కాలయాపన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ రెడ్డి భార్య గత నెలలో అతడితో గొడవ పడి వెళ్లిపోయింది. సాయి కార్తీక్ ఇందుకు కారణమని సిద్ధార్థ్ రెడ్డి భావించాడు. గురువారం రాత్రి ముగ్గురు కలిసి సాయి కార్తీక్ రూమ్లో మద్యం తాగారు. ఈ సందర్భంగా సాయి కార్తీక్, సిద్ధార్థ్ రెడ్డి మధ్య మాట మాట పెరిగింది. దీంతో నవీన్ జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి మళ్లీ వైన్స్ షాప్ వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి గదికి వచ్చి మద్యం తాగారు. అనంతరం మరోసారి సాయి కార్తీక్, సిద్ధార్థ్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్ సముదాయించేందుకు ప్రయతి్నంచగా సిద్ధార్థ్ రెడ్డి అతడిని బయటికి పంపించాడు. అర గంట తర్వాత నవీన్ రూమ్ గదికి వెళ్లి చూడగా సాయి కార్తీక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కనే కూర్చుని ఉన్న సిద్ధార్థ్ రెడ్డిని ఏం జరిగిందని ప్రశ్నించగా మినీ సిలిండర్తో కొట్టి చంపేశానని... నిన్ను కూడా చంపుతానని దాడి చేసేందుకు ప్రయతి్నంచగా నవీన్ బయటికి పరుగులు తీశాడు. బుద్వేల్ ప్రధాన రహదారిపైకి వచ్చి స్థానికులకు ఈ విషయం చెప్పాడు. దీంతో వారు అక్కడికి వెళ్లి సిద్దార్థ్ రెడ్డిని పట్టుకుని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహన్ని మార్చురీకి తరలించారు. సిద్ధార్థ్ రెడ్డిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్టాక్ మార్కెట్ పేరుతో ఘరానా మోసం..150 కోట్లతో పరార్
జీడిమెట్ల(హైదరాబాద్): పెట్టుబడి పెట్టిన సొమ్ముకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశచూపి ది పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థ టోకరా వేసింది. మూడు నెలలుగా రిటర్న్స్ ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు శుక్రవారం జీడిమెట్ల పీఎస్లో ఫిర్యాదు చేసేందుకు క్యూ కట్టారు. సదరు సంస్థ చేతిలో మోసపోయిన బాధితులు ఇప్పటికే 13 మంది ఫిర్యాదు చేయగా రూ.6.5కోట్ల మోసం జరిగినట్లు తెలిసింది.బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాధితులు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గిరినగర్కు చెందిన బాలాజీ, మెదక్ జిల్లా, అల్లాదుర్గ్ ప్రాంతానికి చెందిన స్వాతి మూడేళ్ల క్రితం చింతల్ గణేష్ నగర్లోని ఓ కాంప్లెక్స్లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలిస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. పెట్టుబడి పెట్టిన వారికి రూ.100 స్టాంప్ పెపర్లపై నోట్ రాసి ఇవ్వడంతో చాలా మంది వారిని నమ్మారు. కొందరు వీరి వద్ద పెట్టుబడి పెట్టగా వారు ఇచి్చన మొత్తానికి 20నెలల్లో రెట్టింపు డబ్బులు చెల్లించారు. చిన్న మొత్తాలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లు లాభం ఇస్తున్నారని నమ్మి డబ్బు పెద్ద మొత్తంలో పెట్టడమే గాక ఇతరులతో పెట్టించారు. సదరు సంస్థవారు ఇతరులతో పెట్టుబడులు పెట్టిస్తే వారికి 5శాతం కమీషన్ సైతం ఇచ్చేవారు. దీంతో వారు తమ వ్యాపారాన్ని విస్తరించి మూడే బ్రాచీలను ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు సైతం పెట్టుబడులు పెట్టారు. అయితే గత మూడు నెలలుగా సదరు సంస్థ ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆపేసింది. ఈ విషయమై పలువురు సంస్థ కార్యాలయానికి వచ్చి ప్రశ్నించగా ఈనెల షేర్ మార్కెట్ బాగాలేదు త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. శుక్రవారం డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో కొందరు ఇన్వెస్టర్లు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే ఆఫీసుకు తాళం వేసి ఉండటంతో నిర్వాహకులను ఫోన్ చేయగా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు డిపాజిట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితులు సంఖ్య పెరిగితే కేసును ఈవోడబ్ల్యూఎస్కు బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా 1500 మందికి పైగా సదరు సంస్థలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుసాక్షి,సిటీబ్యూరో: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లలో అర్హులైన డాక్టర్లు , అనుమతి పొందిన స్కానింగ్ మిషన్లు మాత్రమే ఉండాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలపై డేకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, ఇందుకోసం 15 ప్రత్యేక బందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.సికింద్రాబాద్ లోని న్యూ లైఫ్ ఆసుపత్రిలో అనుమతి లేని స్కానింగ్ మిషన్ ను గుర్తించి సీజ్ చేసి యాజమాన్యంపై సు నమోదు చేయాలని, సైదాబాద్లోని వివేకాసుపత్రిలో అనుమతి లేకుండా రెండు స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసినందుకు రూ.2లక్షలు జరిమానా విధించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన 26 స్కానింగ్ సెంటర్లకు రూ.50 వేల చొప్పున జరిమానా విధించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలన్నారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు జిల్లా ప్రోగ్రాం అధికారులు అన్ని స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షల సమాచారంపై టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 3366 ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ వెంకటి, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వందన, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు, జిల్లా మీడియా అధికారి జక్కుల రాములు, టి నరసింహ, అంజయ్య గౌడ్ పాల్గొన్నారు. -
ప్రపంచ సుందరి ఎవరో తేలేది నేడే
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి ఎవరో శనివారం తేలబోతోంది. హైదరాబాద్లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీల గ్రాండ్ ఫినాలె (ఫైనల్స్) శనివారం రాత్రి జరగబోతోంది. హైటెక్స్ వేదికగా సాగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 40 మంది పోటీలో నిలవబోతున్నారు. వారిలో ఒకరు ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి బ్లూ క్రౌన్ను సొంతం చేసుకోనున్నారు. ఈ పోటీలను ప్రత్యక్షంగా దాదాపు మూడున్నర వేల మంది తిలకించనుండగా, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించనున్నారు. మిస్ వరల్డ్ సంస్థ ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా పలువురు మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. విజేతగా నిలిచే కొత్త ప్రపంచ సుందరికి ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టీనా పిష్కోవా (చెక్ రిపబ్లిక్) దాదాపు రూ.6.21 కోట్ల విలువైన బ్లూ క్రౌన్ను అలంకరించనుంది. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకు గ్రాండ్ ఫినాలే కొనసాగనుంది. విజేతకు దాదాపు రూ.ఎనిమిదిన్నర కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 10 మందికి బెర్తులు ఖరారు తుది పోటీ 40 మంది మధ్య సాగనుంది. ప్రస్తుతం పోటీలోఉన్న 108 దేశాల సుందరీమణులను నాలుగు ఖండాల వారీగా విభజించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు చాలెంజ్ల ద్వారా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో 16 మంది ఎంపికయ్యారు. మిగతా 24 మందిని శనివారం జరిగే క్వార్టర్ ఫైనల్స్లో న్యాయనిర్ణేతలు ఎంపిక చేస్తారు. మొత్తం 40 మంది నుంచి వివిధ పద్ధతుల ద్వారా ఒక్కో ఖండం నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 20 మందిని షార్ట్ లిస్టు చేస్తారు. సెమీ ఫైనల్స్లో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 8 మందిని ఫైనల్స్కు ఎంపిక చేస్తారు. వీరినుంచి విజేతను, మొదటి, రెండు, మూడో రన్నరప్లను ప్రకటిస్తారు. అలరించనున్న బాలీవుడ్ తారలు మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్టులుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రపంచ సుందరి పోటీలకు ప్రధాన న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సినీ నటుడు సోనూసూద్కు ఈ సందర్భంగా మానవతావాది పురస్కారాన్ని మిస్ వరల్డ్ సంస్థ అందించనుంది. కోవిడ్ సహా వివిధ సందర్భాల్లో ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. సోనూసూద్ కాకుండా, ఇతర జ్యూరీలుగా సుధారెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, మిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ వ్యవహరించనున్నారు. వివిధ చాలెంజ్ల ద్వారా ఎంపికైన వారు వీరే.. స్పోర్ట్స్ చాలెంజ్: విజేత మిస్ ఎస్తోనియా ఎలిస్ రాండ్మా టాలెంట్ చాలెంజ్: విజేత మిస్ ఇండోనేసియా మొనికా కెజియా సెంబిరింగ్ హెడ్ టు హెడ్ చాలెంజ్: విజేతలు మిస్ వేల్స్, మిస్ తుర్కియే, మిస్ ట్రినిడాడ్–టొబాగో, మిస్ జాంబియా ఫైనల్ పోటీలో ఆసియా నుంచి తుర్కియే భామ ఇదిల్ బిల్గెన్, ఆఫ్రికా నుంచి ఫెయిత్ బ్వాల్వా, అమెరికా–కరీబియన్ దీవుల నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన అన్నా లిసే నాన్టన్, యూరప్ నుంచి వేల్స్ ముద్దుగుమ్మ విల్లీ మీ ఆడమ్స్ ఎంపికయ్యారు. టాప్ మోడల్ చాలెంజ్: విజేతలు: మిస్ ఇండియా, మిస్ నమీబియా, మిస్ మారి్టనిక్, మిస్ ఐర్లాండ్ రెండు రోజుల క్రితం జరిగిన మల్టీమీడియా చాలెంజ్లో ఆఫ్రికా నుంచి కామెరూన్ సుందరి ఇస్సీ ప్రిన్సెస్, అమెరికా నుంచి డొమినిక్ రిపబ్లిక్ నుంచి మాయ్రా డెల్గాడో, ఏషియా–ఓíÙయానియా నుంచి థాయ్లాండ్ ముద్దుగుమ్మ సుచతా చౌంగ్శ్రీ, యూరప్ నుంచి మోంటెనిగ్రో సుందరి ఆండ్రీ నికోలిక్లు విజయం సాధించారు. మిల్లా మాగీపై మిస్ వరల్డ్ సంస్థ చర్యలు: జయేశ్ రంజన్ పోటీల నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించి పోటీల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీపై మిస్ వరల్డ్ సంస్థ న్యాయపరంగా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. లండన్ కోర్టులో కేసు దాఖలు చేసిందని వెల్లడించారు. అక్కడి ప్రభుత్వం కూడా ఆమెపై చర్యలకు ఉపక్రమించిందని చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ జరిపినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు. 2న రాజ్భవన్కు కొత్త ప్రపంచ సుందరి హైటెక్స్లో జరిగే మిస్ వరల్డ్ తుది పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జయేశ్ రంజన్ తెలిపారు. శనివారం విజేతగా నిలిచి కొత్త ప్రపంచ సుందరిగా అవతరించే యువతి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో జరిగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి హాజరవుతుందని వెల్లడించారు. న్యూయార్క్ టైమ్స్కే్వర్పై తెలంగాణ సోయగం సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రఖ్యాత టైమ్స్సే్క్వర్పై తెలంగాణ సంస్కృతి తళుక్కున మెరిసింది. ’తెలంగాణ– జరూర్ ఆనా’ అంటూ హైదరాబాద్లో నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ –2025 పోటీల వీడియోను టైమ్స్స్క్వేర్పై ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉన్న ఆ వీడియో న్యూయార్క్ వాసులను ఎంతగానో ఆకట్టుకుంది. -
సర్కారు బడుల్లో టీచర్ల సర్దుబాటు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ సర్దుబాటు వ్యూహాన్ని అమలు చేస్తోంది. టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి తక్కువ టీచర్లు ఉన్న సమీప పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు అవకాశం కల్పించింది. తాత్కాలిక బదిలీలు/ డిప్యుటేషన్ పద్ధతిలో సర్దుబాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.గతేడాది 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయటంతో ప్రస్తుతం చాలా పాఠశాలల్లో సంతృప్తికర స్థాయిలో టీచర్ల సంఖ్య ఉంది. అయితే, కొన్నిచోట్ల విద్యార్థుల నిష్పత్తి కంటే ఎక్కువ మంది టీచర్లుండగా, మరికొన్ని చోట్ల సరిపడా లేరు. దీంతో ఆ స్కూళ్లలో అవసరాన్ని బట్టి విద్యావలంటీర్లను నియమిస్తూ వస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో విద్యావలంటీర్ల అవసరాన్ని తగ్గించి అందుబాటులో ఉన్న టీచర్ల సేవలు వినియోగించుకునేందుకు సర్దుబాటు అవకాశం కల్పించారు. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గిరిజన ప్రాంతాల నుంచి బదిలీలు వద్దు విద్యార్థులు–ఉపాధ్యాయుల నిష్పత్తి విధానంపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇచ్చిది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి ఒక పాఠశాలలో పదిలోపు విద్యార్థులుంటే ఒక టీచర్, 11 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61–90 మంది పిల్లలున్నచోట్ల ముగ్గురు, 91–120 మధ్య ఉంటే నలుగురు, 121–150 మంది ఉంటే ఐదుగురు, 151–200 మధ్య విద్యార్థులుంటే ఆరుగురు టీచర్లు ఉండాలి. ఈ దిశగా కసరత్తు చేయాలని విద్యాశాఖ సూచించింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్లను మైదాన ప్రాంతాలకు పంపొద్దని, అదే సమయంలో ఏజెన్సీల్లో తగినంత మంది టీచర్లు లేకపోతే మైదాన ప్రాంతాల నుంచి డిప్యుటేషన్పై పంపాలని కోరింది.విద్యార్థుల నిష్పత్తి కంటే ఎక్కువ మంది టీచర్లు ఉన్నచోట జూనియర్ టీచర్ను సర్ప్లస్ కేటగిరీలోకి చేర్చి అవసరమున్న సమీప పాఠశాలకు పంపించాలి. నిబంధనలకు అతీతంగా చేసే సర్దుబాట్లు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. డిప్యుటేషన్పై కొత్తగా సర్దుబాటు చేసిన పాఠశాలలో జూన్ 13వ తేదీ నుంచి టీచర్లు విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ డిప్యుటేషన్ విధులు నిర్వహించడానికే పరిమితమని, వాస్తవ పోస్టింగ్ ఉన్నచోటి నుంచే వేతనం పొందాల్సి ఉంటుందని వెల్లడించింది. సర్దుబాటు చేసిన టీచర్ల జాబితాను జూన్ 30వ తేదీ కల్లా జిల్లా కలెక్టర్లు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయానికి సమరి్పంచాలన్నారు. ఐదు స్థాయిల్లో సర్దుబాట్లు టీచర్ల సర్దుబాటులో ఐదు స్థాయిలను పాఠశాల విద్యాశాఖ నిర్దేశించింది. తొలుత గ్రామ పంచాయతీ స్థాయి, ఆ తర్వాత కాంప్లెక్స్ పరిధి, మండల పరిధి, సమీప మండల పరిధి, చివరగా జిల్లాలోని మండల పరిధికి డిప్యుటేషన్లను పరిమితం చేయాలని సూచించింది. ఈ సర్దుబాటు ప్రక్రియంతా జిల్లా కలెక్టర్ అనుమతితోనే నిర్వహించాల్సి ఉంటుంది. ⇒ ఉన్నత పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ తప్పకుండా ఉండాలి. ⇒ 220 మంది విద్యార్థులున్న హైస్కూల్లో కనీసం ఏడుగురు టీచర్లుండాలి. ⇒ 221–250 మధ్య విద్యార్థులుంటే 8 మంది టీచర్లు, 251–280 మంది ఉంటే 9 మంది టీచర్లుండాలి. ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ పెరగాలి. -
మూడోరోజూ కొనసాగిన కాంగ్రెస్ సమీక్షలు
సాక్షి హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షలు కొనసాగుతున్నాయి. మూడోరోజు శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో నల్లగొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల నేతలతో మాట్లాడారు. రెండు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడిన ఆమె ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ పరిస్థితి, రాజకీయ సమీకరణలు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.జనగామ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కొమ్మూరి ప్రతాపరెడ్డి ఓటమిపై మీనాక్షి ఆరా తీసినట్టు తెలిసింది. ‘మీరు ఎందుకు ఓడిపోయారు?’అని ప్రతాపరెడ్డిని మీనాక్షి ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీ నేతలే ఇందుకు కారణమని ఆయన చెప్పినట్లు సమాచారం. కాగా, మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.ఉదయం 11 గంటల నుంచి ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష అనంతరం ఆదివాసీ విభాగం సమావేశంలో వారు పాల్గొంటారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు బలరాం నాయక్, రఘురామ్ రెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నాయకులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారని తెలిపాయి. -
సరిపడా నీళ్లు లేవు.. ఉన్న పైపులకూ రంధ్రాలు పరికరాల్లేకే ప్రాణనష్టం!
పంజగుట్ట (హైదరాబాద్): హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందడానికి.. అగి్నమాపక సిబ్బంది వద్ద సరైన పరికరాలు లేకపోవడం, ఫైర్ సిబ్బంది సరిగా స్పందించక పోవడమే కారణమని ఈ ఘోర ప్రమాదంలో తన తల్లిదండ్రులు, కుమార్తె, ఇతర కుటుంబసభ్యులను పోగొట్టుకున్న సంతోష్గుప్తా (భవన యజమాని ప్రహ్లాద్ మోదీ కుమార్తె) ఆరోపించారు. ‘ఫైర్ ఇంజన్లో సరిపడా నీళ్లు లేవు. పైపులకు రంధ్రాలు ఉండడంతో మన ఇంట్లో ట్యాప్లో ఎలా వస్తాయో అలా నీళ్లు బయటకు వస్తున్నాయి. ఆక్సిజన్ మాస్్కలు లేవు. సిబ్బంది వద్ద కనీసం టార్చ్లైట్ కూడా లేదు. తలుపులు, గోడలు పగలగొట్టేందుకు ఎలాంటి పరికరాలు లేవు.దీంతో బాధితులను కాపాడేందుకు వారు ప్రయత్నించలేదు. ఉదయం 6:45కు ఫైర్ ఇంజన్లతో వచి్చనా 8:04 వరకు ఏం చెయ్యలేకపోయారు. ఈ సమయంలో లోపల ఉన్నవారు దట్టమైన పొగ కారణంగా బయటకు రాలేక, ఆ పొగ పీల్చుకోవడంతో మృతి చెందారు..’అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 18వ తేదీ ఉదయం జరిగిన ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుని బయటకు వచి్చన ప్రహ్లాద్ మోదీ ఇద్దరు కుమార్తెల్లో ఈమె ఒకరు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తన కుమారుడు నితీష్, సమీప బంధువు అతుల్ అగర్వాల్తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. నేను, నా సోదరి బయటికొచ్చాం..: ‘ఉదయం 5:55కు పొగ వాసన వస్తుండటంతో నిద్ర లేచా. కుటుంబ సభ్యులు కొందరిని అప్రమత్తం చేశా. పొగ ఎక్కడనుండి వస్తోందో చూసేందుకు నేను, నా సోదరి ఒకామె 6:05 సమయంలో కిందకు వెళ్లాం. నలుగురు పైకి వెళ్లారు. అప్పటికే మొదటి అంతస్తు నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి. తర్వాత పెద్ద శబ్దంతో పాటు ఆవరణలో మంటలు వచ్చాయి. ఉదయం 6:12కు అగ్నిమాపక సిబ్బందికి (101కు) ఫోన్ చేశాం. 6:16కు 100కు ఫోన్ చేసి బాధితులు ఎక్కువగా ఉన్నారని కనీసం 10 అంబులెన్సులు పంపించాలని కోరాం. మమ్మల్ని టార్చిలైట్ తెమ్మన్నారు.. ఉదయం 6:45కు ఒక ఫైర్ ఇంజన్, ఒక అంబులెన్స్ వచి్చంది. ఫైర్ ఇంజన్ పైపులకు రంధ్రాలు ఉండడంతో ప్రెజర్ రావడం లేదు. ఫైర్ సిబ్బంది పైపులను సరిచెయ్యలేకపోయారు. వారి వద్ద కనీసం టార్చ్లైట్ కూడా లేదు. మమ్మల్ని టార్చ్ తెమ్మని అడిగారు. కొందరు స్థానికులు లోనికి వెళ్లేందుకు ప్రయతి్నంచారు కానీ సిబ్బంది మాత్రం సరైన సమయంలో లోనికి వెళ్లలేకపోయారు. అంబులెన్సులో సౌకర్యాలు లేవు.. నితీష్తో పాటు స్థానికులు కొంతమంది 8:04 సమయంలో ధైర్యంగా లోనికి వెళ్లి కొంతమందిని బయటకు తీసుకువచ్చా రు. కానీ అప్పటికే వారు బాగా పొగ పీల్చడంతో అప స్మారక స్థితిలోకి వెళ్లారు. ఇక అంబులెన్సుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్క అంబులెన్సులో ఆక్సిజన్ లేదు. బయటకు తీసుకువచి్చన బాధితులకు సిబ్బంది కనీసం సీపీఆర్ కూడా చెయ్యలేదు..’అని సంతోష్ గుప్తా ఆరోపించారు. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. ‘అంబులెన్సు డ్రైవర్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళదాం అంటే ఒప్పుకోకుండా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడకు తీసుకువెళ్లిన ముగ్గురు అప్పటికి బతికే ఉన్నారు. కానీ ఉస్మానియా వైద్యులు ఎఫ్ఐఆర్ చూపించాలని, లేనిపక్షంలో పోలీస్ అధికారులు వచ్చి చెబితేనే చికిత్స చేస్తామని పట్టుబట్టి కూర్చున్నారు..’అని నితీష్ తెలిపారు. డాక్టర్ కాళ్లు పట్టుకున్నా తాను చికిత్స చెయ్యను అంటే చెయ్యను అన్నా రని చేసేది లేక 15 నిమిషాల తరువాత మలక్పేట యశోదా ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈలోగా బతికి ఉన్నవారు కూడా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.కమిటీ మమ్మల్ని సంప్రదించలేదురాష్ట్రపతి, ప్రధాని, సీఎంకు లేఖలు ఘోర అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినా, సదరు కమిటీ ఏదీ ఇప్పటివరకు తమను సంప్రదించలేదని బాధితులు తెలిపారు. ఫైర్ సిబ్బంది వద్ద సరైన పరికరాలు ఉండి ఉంటే, సుమారు గంటన్నర సమయం వృధా చేసి ఉండకపోతే, సరైన సిబ్బంది ఉండి ఉంటే.. అన్ని ప్రాణాలు పోయేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యావత్ ఉదంతంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ విభాగానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి సైతం లేఖలు రాసినట్లు వెల్లడించారు. -
గ్రేటర్లో వాహనాలు 85,22,284
గ్రేటర్లో ద్విచక్ర వాహనాలు టాప్గేర్లో పరుగులు తీస్తున్నాయి. ఏటా లక్షలాది వాహనాలు కొత్తగా వచి్చచేరుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాల్లో ఉద్యోగ, ఉపాధి పనులు, వ్యాపార కార్యకలాపాల్లో టూవీలర్ల వినియోగం అనూహ్యంగా పెరిగింది. ఆ తరువాత రెండోస్థానంలో వ్యక్తిగత కార్లే రయ్మంటూ దూసుకుపోతున్నాయి. రవాణాశాఖ తాజా గణాంకాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం అన్ని రకాల వాహనాల సంఖ్య 85,22,286కు చేరింది. ఇందులో ద్విచక్రవాహనాలు 62,85,582 ఉన్నాయి. మొత్తం వాహనాల్లో ఇంచుమించు మూడొంతులు ఇవే కావడం గమనార్హం. మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలు ఎక్కువగా వినియోగించే కార్లు 15,72,795కు చేరుకున్నాయి.మహానగర విస్తరణకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలు విస్తరించకపోవడం వల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం అనివార్యంగా మారింది. ఇదే సమయంలో సిటీబస్సుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. నాలుగేళ్ల క్రితం 3,580 బస్సులు అందుబాటులో ఉంటే ఇప్పుడు 2,500 మాత్రమే ఉన్నాయి. నిజానికి రవాణా రంగానికి చెందిన నిపుణుల అంచనాల మేరకు సుమారు 6,000 బస్సులు అందుబాటులోకి రావలసి ఉండగా అందుకు భిన్నంగా వాటి సంఖ్య తగ్గింది. మరోవైపు ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రోరైళ్లు పెరగలేదు. కోవిడ్ నుంచి ఎంఎంటీఎస్ల వినియోగం కూడా తగ్గింది. – సాక్షి, హైదరాబాద్హైస్పీడ్లో బైక్ఏటా 3 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. ప్రతి మనిíÙకి ఒక మొబైల్ ఫోన్ తప్పనిసరి అయినట్లుగానే బైక్ కూడా తప్పనిసరిగా మారింది. 18 ఏళ్లు దాటిన యువత మొదలుకొని 65 ఏళ్లు దాటిన వయోధికుల వరకు ద్విచక్ర వాహనాలపైనే ఆధారపడి ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు, ఆన్లైన్ కొనుగోళ్లు పెరగడంతో డెలివరీ వర్కర్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. బైక్ట్యాక్సీ సేవలూ పెరిగాయి. కార్ల విషయానికొస్తే.. ఏటా లక్షకు పైగా కొత్తవి రోడ్డెక్కుతున్నాయి. ఇంటిల్లిపాది కలిసి వెళ్లేందుకు కారు సౌకర్యవంతంగా ఉండటంతో వీటి కొనుగోళ్లు పెరుగుతున్నాయి.త్వరలో కోటి బండ్లువ్యక్తిగత వాహనాల వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న దృష్ట్యా మరో రెండు, మూడేళ్లలో గ్రేటర్లో వాహనాల సంఖ్య కోటికి చేరుకొనే అవకాశం ఉంది. ఏటా 5 లక్షల వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. కాగా, రహదారుల విస్తరణ లేకపోవడం వల్ల రోడ్లపై వాహనాల రద్దీ భారీగా పెరిగి గ్రిడ్లాక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.సొంత బండి ఆదాయమార్గమైందిప్రజారవాణా సదుపాయాలను బాగా పెంచి వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. కానీ ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనం కేవలం ప్రయాణ సాధనమే కాకుండా ఒక ఆదాయమార్గంగా మారింది. బండి ఉంటే చాలు ఏదో ఒక ఉపాధి లభిస్తుందనే భరోసా ఏర్పడింది. జీవితంలోని అన్ని రంగాల్లోకి ఆన్లైన్ మార్కెట్ విస్తరించింది. ఇది ఒక అనివార్యమైన పరిస్థితి. అందుకే మిగతా కేటగిరీలకు చెందిన వాటి కంటే బైక్లే ఏటా ఎక్కువగా నమోదవుతున్నాయి. – సి.రమేశ్, జేటీసీ, హైదరాబాద్ -
ఈ దఫా మొత్తం రేవంతే సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ దఫా పూర్తికాలం రేవంత్రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్కు రాహుల్గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారని.. కాంగ్రెస్ సీఎంలతో రాహుల్ నిత్యం హాట్లైన్లో అందుబాటులోనే ఉంటారని చెప్పారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘సీఎంకు రాహుల్గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని కొందరంటున్నారు.కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల రాహుల్గాం«దీని రేవంత్ కలవలేకపోవచ్చు. అంతమాత్రాన కొంపలేం అంటుకుపోవు. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఈ అంశానికి కలర్ పూయాల్సిన అవసరం లేదు. రాహుల్గాం«దీని అర్ధరాత్రి అయినా రేవంత్రెడ్డి కలవగలరు. అయినా, సీఎంలు, పీసీసీ అధ్యక్షులతో రాహుల్గాంధీ హాట్లైన్లో మాట్లాడుతుంటారు’అని చెప్పారు. తప్పుచేసి దొరికినా దబాయింపా? కాళేశ్వరం విషయంలో అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని పొంగులేటి విమర్శించారు. తాము తలుచుకుంటే కేసీఆర్ను మొదటి ముద్దాయిగా ఎప్పుడో విచారణకు పిలిపించేవారమని అన్నారు. తప్పు చేసి రెడ్హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా దబాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒక్క తప్పు చేస్తే వెంటనే శిక్ష వేయవచ్చని, కానీ కేసీఆర్ తప్పులు శిశుపాలుడి తరహాలో 99 వరకు వచ్చాయని.. ఇంకొక్కటి మాత్రమే మిగిలిందని అన్నారు.ఎనిమిదో వింతను కట్టానని చెప్పుకునే వ్యక్తి మేడిగడ్డ బరాజ్పై ఓ నివేదిక ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. కమిషన్ ముందుకు వచ్చి తాను శిల్పినని కేసీఆర్ పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారా? అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అవినీతిలో ఎంత పెద్దవారున్నా తీవ్ర కఠిన తీసుకుంటామని స్పష్టం చేశారు. 2.10 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రస్తుత దఫాలోనే రాష్ట్రంలో ఇళ్లులేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి స్పష్టంచేశారు. ‘ఈ పథకంలో భాగంగా తొలి విడత కింద 2.10 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేశాం. పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న గ్రామాల్లో 42 వేల ఇళ్లను మంజూరు చేస్తే, అందులో 24 వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. వాటికి రూ.135 కోట్లు చెల్లించాం. ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నాం. 33 గృహాలకు 15 – 20 రోజుల్లో గృహ ప్రవేశాలు జరుగుతాయి. ఇంకా 1.15 లక్షల మంది జాబితాను తయారు చేయాల్సి ఉంది. జూన్10 లోపు అది కూడా పూర్తి చేస్తాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట్ల 40 శాతం ఇండ్లకు వారి సిఫారసులు తీసుకుంటున్నాం. ఆ సిఫారసులను గెజిటెడ్ అధికారి పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు’అని మంత్రి తెలిపారు. అసైన్డ్ భూముల్లో పేదలకు పట్టాలు భూభారతి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన నాలుగు మండలాల్లో ఉన్న 625 ఎకరాల అసైన్డ్ భూముల్లో వ్యవసాయ యోగ్యమైనవాటికి పేదలకు పట్టాలు ఇస్తామని పొంగులేటి చెప్పారు. సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయగానే సాదా బైనామాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే 700 మంది ప్రభుత్వ సర్వేయర్లను నియమిస్తున్నామని వెల్లడించారు. ధరణి పోర్టల్ ఫోరెన్సిక్ ఆడిట్కు సంబంధించిన చర్చలు పూర్తికావచ్చాయని, మరో వారంలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులిచ్చి ఆగస్టు 15లోపు భూబకాసురుల చిట్టా తేలుస్తామని చెప్పారు. కవిత ఎపిసోడ్ టీకప్పులో తుఫాన్లాంటిది బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ టీకప్పులో తుఫాన్ లాంటిదని పొంగులేటి అన్నారు. ‘కొందరు ఆడమంటే మరికొందరు ఆడుతుంటారు. అది కుటుంబ పంచాయితీ. కవిత బీజేపీలోకి వెళ్తారని ఒకరు.. కాంగ్రెస్లోకి వస్తారని మరికొందరు అంటున్నారు. దెయ్యాలు, భూతాలు, దేవుళ్లంటూ మాట్లాడుతున్నారు. దెయ్యాలెవరో కవిత చెప్పొచ్చు కదా?’అని ప్రశ్నించారు. తన ఇంటికి ఈడీ అధికారులెవ్వరూ రాలేదని పొంగులేటి స్పష్టంచేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఒకరోజు ముందో.. వెనుకో జరుగుతుందని పేర్కొన్నారు.