Hyderabad
-
‘‘బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి’’
హైదరాబాద్: బీఆర్ఎస్ మహిళా నేతలు బుధవారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ను కలిశారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని డీజీపీకి వినతిపత్రం అందించారు. పోక్సో కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రజలకు పోలీసులపై నమ్మకం, విశ్వాసం ఉండాలంటే.. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: సీపీఎం బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. మే 14న రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీపీఎం పిలుపునిస్తుందని ఆయన తెలిపారు. పోక్సో కేసు నమోదైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దారుణమని చెప్పారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ ప్రభావంతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. బండి సంజయ్ తన కుమారుడిని వెంటనే సరెండర్ చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీ వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
సిట్కు బండి భగీరథ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: సిట్కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ లేఖ రాశారు. ఎల్లుండి(శుక్రవారం) విచారణకు హాజరవుతానన్న బండి భగీరథ్.. కీలక ఆధారాలతో వస్తానని తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. విచారణకు హాజరై అవసరమైన సమాచారం, పత్రాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా.. అయితే చాలా తక్కువ సమయం ఇచ్చిన కారణంగా ఇవాళ(మే 13) హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు...వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా విచారణకు రావడం సాధ్యం కాదన్న భగీరథ్.. అవసరమైన డాక్యుమెంట్లు, వివరాలు సేకరించడానికి రెండు రోజుల గడువు ఇవ్వాలని పోలీసులను కోరారు. తనపై, తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు తప్పుడువంటూ లేఖలో భగీరథ్ ప్రస్తావించారు. నిష్పాక్షిక దర్యాప్తు కోసం రెండు రోజుల సమయం మంజూరు చేయాలంటూ సిట్కు విజ్ఞప్తి చేశారు.కాగా, ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో కేసు విచారణకు ఇవాళ బండి భగీరథ్ గైర్హాజరయ్యారు. ఈ కేసులో నిందితుడైన బండి భగీరథ ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎల్లుండి హాజరవుతానంటూ సిట్కు భగీరథ్ లేఖ రాశారుకుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్కు తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. -
లిఫ్ట్లో చిక్కుకుని తల్లడిల్లిన పసిపాప.. ఊపిరి ఆగిపోయింది..
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో హృదయాలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. గౌలిదొడ్డిలో ఉన్న ‘మహి వుమెన్ పీజీ’లో ఐదేళ్ల చిన్నారిని లిఫ్ట్ బలిదీసుకుంది. ఆడుకుంటూ అమాయకంగా గ్రిల్స్ ఉన్న లిఫ్ట్లోకి వెళ్లిన చిన్నారి బిస్తు సేఫ్ (5) అందులోనే చిక్కుకుపోయింది. ఆ తర్వాత నొప్పితో తల్లడిల్లిపోయింది. ఆ పసిపాప బయటపడలేకపోవడంతో చివరకు ఆమె ఊపిరి ఆగిపోయింది. జార్ఖండ్కు చెందిన బిస్తు సేఫ్ తన తాత, అమ్మమ్మలతో కలిసి ఆ హాస్టల్లో ఉంటోంది. కళ్లముందే ఆ చిన్నారి ప్రాణం పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్షణాల వ్యవధిలో ఆమె జీవితం ఆగిపోవడం.. కుటుంబానికి తట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది. పసిపాప నవ్వులతో మార్మోగాల్సిన ఆ ప్రదేశం ఇప్పుడు విషాదంతో నిండిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక అమాయక ప్రాణం ఇలా లిఫ్ట్లో ఇరుక్కుపోవడం భద్రతా ప్రమాణాలపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, ప్రతి లిఫ్ట్కి సరైన భద్రతా చర్యలు తీసుకోవడం అత్యవసరం. -
పోక్సో కేసు.. సిట్ విచారణకు బండి భగీరథ్ డుమ్మా
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసు విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ గైర్హాజరయ్యాడు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ బుధవారం మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరీంనగర్లో బండి సాయి భగీరథ మేన మామ డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణకు మంగళవారం పేట పేట్బషీరా బాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన భగీరథ్ హాజరు కాలేదు. దీంతో బండి భగీరథ్ చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందిపోక్సోకేసు విచారణకు హాజరు కాకపోతే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS, 2023) చట్టాల ప్రకారం, పోక్సో కేసులో సిట్ విచారణకు హాజరు కాకపోతే నిందితులెవరైనా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో అరెస్టు వారెంట్ జారీ చేయడం, మధ్యంతర బెయిల్ రద్దు కావడం, పరారీలో ఉన్నవాడిగా గుర్తించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం, కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. సిట్ విచారణకు హాజరు కాకపోతే మరిన్ని చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుత్బుల్లాపూర్ లోని సుచిత్రలో నివసించే 17 ఏళ్ల బాలికపై భగీరథ అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేశాడని ఈనెల 8న ఆ బాలిక కుటుంబసభ్యులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు నమోదైన నాటి నుంచి నిందితుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడు.బండి భగీరథపై అదనపు సెక్షన్లు నమోదు..కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణాధికారిగా సిట్ ఏర్పాటు చేశారు. బండి భగీరథపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్యువల్ అఫెన్సెస్ (పోక్సో)లోని సెక్షన్ 11 ఆర్/డబ్ల్యూ 12, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 74, 75 కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లను పరిశీలించిన డీసీపీ రితిరాజ్ మంగళవారం బాధితురాలిని మరోసారి విచారించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడు భగీరథపై అదనపు సెక్షన్లను జోడించారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసిన లైంగిక చర్యలకు సంబంధించిన సెక్షన్లను సూచించే పోక్సో-2012 చట్టంలోని సెక్షన్ 5(ఐ)ను జోడించారు. -
హనుమకే అరటి దండ దక్కితే!
హైదరాబాద్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నగరంలోని రామాలయాలు, అంజన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. కూకట్పల్లిలో హనుమంతుడిని ప్రత్యేకంగా అరటి పండ్ల దండలతో ఇలా అలంకరించారు. – కూకట్పల్లిఅధికారులే అడ్డంపడితే..!ఆ రహదారులు.. అధి‘కారు’లకు అడ్డాగా మారాయి. ఇతర వాహనదారులకు ఆటంకంగా ఉన్నాయి. గీతానగర్లోని మల్కాజిగిరి సర్కిల్, జోనల్ కార్యాలయాలున్న భవనం ముందున్న రహదారులు పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. – మల్కాజిగిరి గాం«దీలో అగ్గి పుడితే..సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో అసిస్టెంట్ డిస్టిక్ట్ ఫైర్ ఆఫీసర్ భాను ప్రతాప్ నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన ఫైర్సేఫ్టీ అవేర్నెస్, మాక్ ఎవాక్యుయేషన్ డ్రిల్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి, ఫైర్స్టేషన్ ఆఫీసర్లు మహ్మద్ షౌకత్ అలీ, రమే‹Ù, భిక్షపతి పాల్గొన్నారు. – గాం«దీఆస్పత్రి -
మమత ఎక్కడ..? ఇద్దరు పిల్లలతో అదృశ్యం
పటాన్చెరు టౌన్: తల్లీ ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మల్లన్న దేవస్థానం సమీపంలోని ఎండీఆర్ హోమ్స్లో నివాసం ఉండే నాగిరెడ్డి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతడి భార్య మమత (28), కుమారుడు శివరాం రెడ్డి, కూతురు బృందన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కాగా వారి కోసం తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. శివ్వంపేట(నర్సాపూర్): తల్లీ, కూతురు అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గోమారం గ్రామానికి చెందిన ఎరుకలి మమత, పెంటయ్య దంపతులకు సంసార విషయంలో వారం నుంచి గొడవలు జరుగుతున్నాయి. సోమవారం పెంటయ్య ధాన్యం బస్తాలు తీసుకుని కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లగా, భార్య మమత, కూతురు అఖిల కూరగాయలు విక్రయించేందుకు మార్కెట్కు వెళ్తున్నామని చెప్పి రాత్రి వరకు ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన పెంటయ్య బంధువులు, స్నేహితుల ఇండ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. -
చికెన్ కిలో ధర రూ.400..!
జోగిపేట(అందోల్): కోడి ధర కొండెక్కింది. ఈ నెల 1న కిలో రూ.259గా ఉన్న ధర ఆదివారం రూ.360కి పెరిగింది. పది రోజుల్లోనే కిలోపై రూ.100 పెరగడం గమనార్హం. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల పెరుగుదల అదనపు భారంగా మారుతోంది. వేసవి కావడంతో ఎండలకు కోళ్లు చనిపోతున్నాయని, వాటి బరువు కూడా తగ్గిపోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరలను చూసి కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ ధరలు మరో 15 నుంచి 20 రోజుల పాటు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తగ్గిన ఉత్పత్తి ఎండలకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపడం లేదు. అధికంగా కంపెనీల యజమానులే షెడ్లలో కోళ్లను పెంచి, వారు నిర్ణయించిన ధరకే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణమని చెప్పొచ్చు. స్కిన్లెస్ కిలో రూ.360కి, లైవ్ కోడి రూ.210, స్కిన్తో రూ. 320కి అమ్ముతున్నారు.పెళ్లిళ్ల సీజన్తో డిమాండ్ పెళ్లిళ్ల సీజన్తో చికెన్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అంతే కాకుండా ఎండ త్రీవత కారణంగా కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. డిమాండ్ మేర ఉత్పత్తి లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగాయి. రెండు వారాల నుంచి కోళ్ల, చికెన్ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.360కి విక్రయిస్తున్నాం. ధరలు పెరగడంతో కొంతమేరకు విక్రయాలు తగ్గాయి. – ఎండీ. జావీద్, విక్రయదారుడు, జోగిపేట -
సిటీలో దారుణం.. నేపాలీ పని మనుషులతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జవహర్నగర్లో నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ గ్యాంగ్.. ఓనర్ దంపతుల చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, రూ.30వేల నగదు చోరీ చేశారు. వరుస ఘటన నేపథ్యంలో పని మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనని పలువురు చెబుతున్నారు.వివరాల మేరకు.. జవహర్నగర్లోని కౌకుర్లో మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గల్ప్ ఎన్క్లేవ్లో దంపతులు చేతులు, కాళ్లు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ విజయలక్ష్మీ దంపతులకు మత్తు మందు ఇచ్చి దోపీడి చేశారు. కాగా, నేపాలీ గ్యాంగ్ 13 రోజుల క్రితమే వారి ఇంట్లో పని మనుషులుగా చేరారు. అయితే, నేపాలీ మహిళ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటామని డాక్టర్ దంపతులను కోరడంతో వారు అందుకు అంగీకరించారు. ఈ క్రమంలో పని మనుషుల బంధువుల పేరుతో మరో ముగ్గురు నేపాలీలు ఇంట్లోకి వచ్చారు. అనంతరం.. ఇంట్లో పనిచేస్తున్న వారితో పాటు మరో ఐదుగురు కలిసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ దంపతులకు మత్తు మందు ఇవ్వడంతో వారు నిద్రలోకి వెళ్లారు. దీంతో, ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, రూ.30వేల నగదు చోరీ చేశారు. దోపిడీ సమయంలో సదరు ముఠా.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసింది. ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేసి పరారీ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో నిందితులు కూడా నేపాలీలు కావడం తెలిసిన విషయమే. ఈ హత్య కేసులో కీలక సూత్రధారి కల్పన అలియాస్ ధర్మ (30) నేపాలీ గ్యాంగ్ స్కెచ్లో భాగంగానేహైదరాబాద్కు వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన కాల్డేటాను విశ్లేషించిన పోలీసులకు బెంగళూరులోని ఆమె భర్తగా పేర్కొంటున్న వ్యక్తితో ఎక్కువగా మాట్లాడిందని, అతడితో పాటు మరికొంతమంది వ్యక్తులతో సైతం ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. వారందరిపై పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో కల్పనను ఉద్యోగంలో నియమించిన వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.కల్పన తల్లిదండ్రులు పూణేలో నివాసం ఉంటారని గుర్తించిన పోలీసులు వారిని సైతం ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. నేపాల్ సరిహద్దులు దాటేందుకు యూపీలోని మూడు ప్రాంతాల్లో అవకాశం ఉండగా, అక్కడకు ఇప్పటికే చేరుకున్న పోలీసులు వారికోసం కాపు కాస్తున్నారు. కాగా తనూజరంజన్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన వైద్యులు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. నేపాల్లో ఉంటూనే భారత్లో వందలాదిమంది నేపాలీ వ్యక్తులను పావులుగా వాడుకుంటూ చోరీలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు విదేశీ వ్యవహారాలశాఖ సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం దిశగా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి గ్రేటర్లో ఎంఎంటీఎస్ రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఉచిత సేవలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వేకు ఏటా రూ.10 కోట్లు అందజేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదనపైన దక్షిణమధ్య రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినప్పటికీ రైల్వేబోర్డు ఆమోదిస్తే తప్ప తాము ఈ సదుపాయాన్ని కల్పించలేమని, రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేబోర్డు మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదరాల్సి ఉంటుందని చెబుతున్నారు. రైల్వే బోర్డుకు సమాచారం లేదు! ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు సుమారు 75 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. 35 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం కొంత మేరకు తగ్గవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరణాత్మకంగానే ఉన్నప్పటికీ రైల్వేబోర్డుకు ఇంకా సమాచారం అందజేయలేదు. ఇప్పటికిప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేసినా రైల్వేబోర్డు పరిశీలించి నిర్ణయం తీసుకొనేందుకు కొంత సమయం పట్టవచ్చు. పైగా ఎంవోయూ కూడా కుదుర్చుకోవలసి ఉంటుంది. జూన్ 2 లోపు ఇదంతా సాధ్యం కాకపోవచ్చుననిపిస్తోంది..’అని దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పైగా ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్రం నుంచి రావలసిన రూ.460 కోట్లకు పైగా బకాయీలపైనా స్పష్టత రావలసి ఉందని ఆయన అన్నారు. రెండోదశ నిధులే ఇవ్వలేదు..! హైదరాబాద్లో లోకల్ ట్రైన్ సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో ఎంఎంటీఎస్ ప్రాజెక్టును 2003లో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు, రైల్వేశాఖ 1/3 వంతు చొప్పున భరించాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు మొదటి దశ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. 2013లో ఇదే ఒప్పందం ఆధారంగా రెండోదశను ప్రారంభించారు. కానీ ప్రభుత్వం తన వాటా నిధులను పూర్తిగా చెల్లించలేదు. దీంతో ఈ ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే సొంతంగా పూర్తి చేయవలసి వచ్చింది. ప్రస్తుతం ఘటకేసర్ నుంచి రాయగిరి వరకు చేపట్టిన యాదాద్రి ఎంఎంటీఎస్ పనులను కూడా దక్షిణ మధ్య రైల్వే సొంత నిధులతో చేపట్టింది. ఇదిలావుండగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తెరపైకి తేవడంతో..ఇప్పటివరకు రెండో దశ నిధులను చెల్లించకపోవడాన్ని రైల్వే అధికారులు ప్రధానంగా ఎత్తిచూపుతున్నారు. సమయ పాలన మెరుగుపరచాలి ఎంఎంటీఎస్ రైళ్లలో సమయ పాలన మెరుగుపడి, సర్వీసులు పెంచితేనే ప్రయాణికులకు ఉచిత సదుపాయం సద్వినియోగమవుతుందని హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ (హుమ్టా) అధికారులు భావిస్తున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు చొప్పున అందుబాటులో ఉండాలని, అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లకు సిటీబస్ కనెక్టివిటీ కల్పించాలని సూచిస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ బస్ సేవలను సమన్వయం చేయడంపై సంస్థ ప్రణాళికలను రూపొందించింది. -
తెలంగాణకు 23 ఆంధ్రప్రదేశ్కు 10 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో కనీస నిల్వమట్టానికి (ఎండీడీఎల్) ఎగువన మిగిలి ఉన్న 5.27 టీఎంసీల జలాలను పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. నాగార్జునసాగర్ జలాశయంలో ఎండీడీఎల్కి ఎగువన 28.21 టీఎంసీల నిల్వలు మిగిలి ఉండగా, ఏపీ తాగునీటి అవసరాలకు కుడి కాల్వ ద్వారా 10 టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించింది. మిగిలిన 18.21 టీఎంసీలను సాగర్ ఎడమ కాల్వ ద్వారా తెలంగాణకు విడుదల చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 23.48 టీఎంసీల జలాలను త్రిసభ్య కమిటీ కేటాయించింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కంబోజ్ అధ్యక్షతన మంగళవారం జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. వేసవి తాగునీటి అసవరాల కోసం ఇరు రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులపై ఈ భేటీలో చర్చించారు. వేసవి అవసరాలకు విన్నపాలు: మే 31 నాటికి ఉండనున్న తమ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి కాల్వకు 10 టీఎంసీల జలాలను విడుదల చేయాలని గతంలో కృష్ణా బోర్డుకు ఏపీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు, హైదరాబాద్ నగరం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 13 టీఎంసీలు.. మొత్తంగా 18 టీఎంసీల జలాలను జూలై చివరి నాటికి వాడుకుంటామని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కాగా ఏపీ విజ్ఞప్తిపై మంగళవారం నాటి భేటీలో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో 1112.66 టీఎంసీల కృష్ణా జలాలు లభ్యతలోకి ఉండగా, ఏపీ ఇప్పటికే ఏకంగా 771.25 టీఎంసీలు (74.23శాతం) వాడుకుందని కమిటీ దృష్టికి తెచ్చింది. అయితే వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ పరస్పరం సహకరించుకోవాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సూచించడంతో ఈ మేరకు కేటాయింపులకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. -
4 కోట్లు వసూలు చేసి రూ. కోటి ఇవ్వండి
బంజారాహిల్స్: మాజీ ప్రియుడి కిడ్నాప్ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సుమారు నాలుగుకోట్ల రూపాయలు వసూలు చేసి, రూ.కోటి తనకు ఇచ్చి మిగతా మొత్తాన్ని పంచుకోవాలని నిందితులకు యువతి ఆఫర్ చేసింది. అయితే చివరికి ఆ ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు ఈ కేసును ఛేదించి యువతితోపాటు ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... కొత్తగూడెంకు చెందిన పాయం మౌనిక(25) హైదరాబాద్లో నర్సు గా పనిచేస్తోంది. ఆమెకు హయత్నగర్కు చెందిన మోకురాల నిఖిల్(26)తో ఓ పబ్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 9 నెలల సహజీవనం అనంతరం తనను మోసం చేశాడంటూ నిఖిల్పై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. నిఖిల్పై కేసు నమోదు కాగా, బెయిల్పై విడుదలయ్యాడు. నిఖిల్ వద్ద రూ.9 కోట్లు ఉన్నాయని, అందులో సగం వసూలు చేసి రూ.కోటి తనకు ఇచ్చి మిగతా మొత్తాన్ని పంచుకోండని పరిచయస్తులైన రౌడీషీటర్లకు ఆమె ఆశ చూపింది. నిఖిల్తోపాటు అతడి స్నేహితులు మహేశ్, సాయిశ్రీకాంత్లను కిడ్నాప్ చేయించి రూ.రూ.13.60 లక్షలు వసూలు చేసింది. సాయిశ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మౌనికతోపాటు అంబర్పేట రౌడీషీటర్ అన్వర్ఖాన్(60), కాప్రాకు చెందిన సుంకరి ప్రసాద్రెడ్డి(56), జవహర్నగర్కు చెందిన మారెనేని రాజు(48), ఖమ్మంకు చెందిన కనకం సుధీర్, పోల్కంపల్లి నాగరాజు, అల్వాల్కు చెందిన జాన్లను పట్టుకున్నారు. ఖమ్మంకు చెందిన కనకం మహేశ్, బంజారాహిల్స్ ఎన్బీటీనగర్కు చెందిన చందు పరారీలో ఉన్నారు. ● మాజీ ప్రియుడి కిడ్నాప్ కేసులో నిందితులకు యువతి ఆఫర్ ● ప్రధాన నిందితురాలు సహా ఏడుగురి అరెస్టు.. పరారీలో ఇద్దరు -
కంపోస్ట్ తయారీపై అవగాహన
సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’కింద 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జీహెచ్ఎంసీ, ఎంఎంసీల్లో రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు కంపోస్ట్ తయారీపై అవగాహన సదస్సులు నిర్వహించారు. గృహస్థాయిలో కంపోస్టింగ్ను ప్రోత్సహించడం తద్వారా పర్యావరణ పరిస్థితులను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ము ఖ్యోద్దేశమని సంబంధిత యూబీడీ విభాగం అధికారులు పేర్కొన్నారు. వ్యర్థ పదార్థాల విభజన, కంపోస్ట్ బిన్ల వాడకం, నిర్వహణ పద్ధతులు, కంపోస్ట్ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాలకు హాజరైన వారి నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. తమ కాలనీలోకంపోస్టింగ్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. విజయనగర్ కాలనీ: పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మాసబ్ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చంద్రశేఖర్ తెలిపారు. మాసబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం ఉదయం 11 నుంచి 1.30 వరకు పరీక్ష ఉంటుందన్నారు. ● బండి భగరీథ్ను అరెస్టు చేయాలి ● బీఆర్ఎస్ మహిళా నేతల డిమాండ్ వెంగళరావునగర్: ఎప్పుడూ న్యాయం, ధర్మం అంటూ మాట్లాడే కేంద్రమంత్రి బండి సంజయ్ ఇప్పుడు ఒక ఆడపిల్ల విషయంలో ఎందుకు కొడుక్కి వత్తాసు పలుకుతున్నారని బీఆర్ఎస్ మహిళా సంఘం నేతలు ప్రశ్నించారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంజయ్ కుమారుడు భగీరథపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంగళవారం బీఆర్ఎస్కు చెందిన మాజీ జడ్పీ చైర్మన్లు తుల ఉమ, చారులత, జూబ్లీహిల్స్ ఇన్చార్జి మాగంటి సునీత, తదితరులు డిమాండ్ చేశారు. మంగళవారం మధురానగర్లోని తెలంగాణ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. భగీఽరథ్పై పోక్సో కేసు నమోదైనప్పటికీ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకుని బాధిత బాలికకు న్యాయం చేయాలని, చట్టం ముందు అందరూ సమానులనే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 16 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ ఇతర డిగ్రీ రెగ్యులర్ కోర్సుల 4, 6 సెమిస్టర్ పరీక్షలతోపాటు 1 నుంచి 6 వరకు బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు. -
ప్రజారోగ్య పరిరక్షణలో నర్సులే కీలకం
● అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నాంపల్లి: ప్రజారోగ్య పరిరక్షణలో నర్సుల పాత్ర కీలకమని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆసుపత్రిలో మంగళవారం జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రోగులకు వైద్యసేవలతోపాటు మనోధైర్యాన్ని ఇస్తూ మానవత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నారని కొనియాడారు. 1,500 మంది అవుట్ పేషంట్స్, 2 వేల మంది ఇన్ పేషంట్స్ ఉన్న ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ ఎక్కడా అలసిపోకుండా సేవలు అందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. అనంతరం పలువురు నర్సులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, డీఎంహెచ్ఓ వెంకట్, నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్కుమార్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ కె.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సార్.. థ్యాంక్స్
● రేవంత్ చిత్రపటానికి 2008 డీఎస్సీ అభ్యర్థుల క్షీరాభిషేకం లక్డికాపూల్: అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2008 డీఎస్సీ అభ్యర్థులు 1,175 మందిని ఉపాధ్యాయులుగా నియమించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్కు 2008 డీఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు. 17 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగాలిచ్చి ఆదుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞత లు తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోస్టింగ్స్ ఇచ్చారని, అయితే కొత్త జిల్లాల ప్రాతిపదికల పోస్టింగ్ మార్చాలని సీఎం ప్రజావాణి ఇన్చార్జ్ డాక్టర్ జి.చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. సీఎం ప్రజావాణికి 393 దరఖాస్తులు లక్డీకాపూల్: మహా త్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన 221వ సీఎం ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 393 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 190, రెవెన్యూ శాఖకు సంబంధించి 39, ఇందిరమ్మ ఇండ్ల కోసం 97, ప్రవాసి ప్రజావాణికి 02, ఇతర శాఖలకు సంబంధించి 65 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇన్చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమంలో ఏసీపీ ఉమేందర్, ఎన్ఆర్ఐ సలహామండలి చైర్మన్ బీఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
సంపులో పడి బాలిక మృతి
అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యుల ఆందోళనమియాపూర్: అపార్ట్మెంట్ నీటి సంపులో పడి ఓ బాలిక మృతి చెందింది. అయితే కుటుంబసభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లి మండలం మద్దిరాళ్ల తండాకు చెందిన గుగులోత్ చరణ్, రేణుక దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వలస వచ్చి మియాపూర్లోని గోకుల్ ఫ్లాట్స్లో చరణ్ కొంతకాలంగా వాచ్మేన్గా పనిచేస్తున్నాడు. ఎనిమిది రోజుల క్రితం శ్రీ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో వాచ్మేన్గా చేరాడు. అతడి రెండో కూతురు సారా(13) స్థానికంగా 8వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో బోర్ మోటార్ ఆన్ చేయాలని సారాకు చెప్పి చరణ్ బయటకు వెళ్లాడు. 8 గంటలకు తిరిగి వచ్చి చూడగా ఇంట్లో సారా కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. అనుమానంతో సంపు మూత తీసి చూడగా సారా అందులో పడి ఉంది. వెంటనే బాలికను నిజాంపేట్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంపును పరిశీలించారు. సంపు నిండిందా అని చూసేందుకు సారా వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆందోళన ... సారా మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు, బంధువులు శ్రీ రెసిడెన్సీ అపార్ట్మెంట్ ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. ప్రమాదవశాత్తు బాలిక సంపులో పడిపోతే గాయాలయ్యే అవకాశం ఉందని, కానీ బాలిక శరీరంపై అలాంటివేవీ లేవని పేర్కొన్నారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు ఉన్నా ఫుటేజీని తమకు చూపడంలేదని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎన్టీఏను రద్దు చేయాలని ఆందోళన
● విద్యానగర్ సర్కిల్లో బైఠాయించిన విద్యార్థి జేఏసీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం: నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను రద్దు చేయాలని మాజీమంత్రి వి.శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. సంతలో సరుకులాగా ప్రశ్నపత్రాలను విక్రయించడం వల్ల దిక్కుతోచనిస్థితిలో 28 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యానగర్ సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ప్రధానమంత్రి మోదీ వెంటనే స్పందించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైద్యవిద్య పరీక్షలను ఆయా రాష్ట్రాలకే అప్పగించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నందగోపాల్, సాయి, సతీష్, ప్రవీణ్, రాజశంకర్, హరిశంకర్, వినయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేయండి
● నిషేధిత భూముల రిజిస్ట్రేషన్పై మంత్రి సీరియస్ ● జూన్ నాటికి జవహర్నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లుఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశంలో అధికారులకు పొంగులేటి ఆదేశంసాక్షి, సిటీబ్యూరో: అల్వాల్ మండలంలోని సర్వే నంబర్లు 582, 583లో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న సంబంధిత సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ భూముల్లో సుమారు 40 ఏళ్లుగా నివసిస్తున్న వడ్డెర కులస్తులకు నోటీసులు జారీ చేస్తున్నారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి స్పందించారు. ఇటీవల జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఆదేశించారు. మంగళవారం హిమాయత్నగర్లోని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అంశాలపై జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి అధ్యక్షతన వహించి మాట్లాడారు. జవహర్నగర్లో 6,399 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేసి అల్వాల్, మల్కాజ్గిరి ప్రాంతాల పేదలకు లాటరీ విధానంలో కేటాయించాలని అధికారులకు సూచించారు. మల్కాజ్గిరి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించే అవకాశం ఉండగా కేవలం 1,622 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, ఆరికపూడి గాంధీ, వి.పి.గౌతమ్, కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. -
బంధువే దొంగ
24 గంటల్లో చోరీ కేసును ఛే దించిన పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోవడంతో పక్కదారి అబిడ్స్: గోషామహాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని షాహినాయత్గంజ్ ముల్తానిపురాలో చోరీ కేసులో బంధువే దొంగ అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనను 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి దొంగను అరెస్టు చేశారు. దాదాపు రూ.50 లక్షల విలువైన బంగారాన్ని, ఇతర సామగ్రిని, నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం గోషామహాల్ పోలీస్స్టేషన్లో గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముల్తానిపురాలోని 3వ అంతస్తులో నివాసం ఉంటున్న మహేష్ తన కుటుంబసభ్యులతో కలిసి ఐదురోజులుగా ఇంటికి తాళాలు వేసి బంధువుల పెండ్లి సన్నాహాలకు వెళ్తున్న విషయాన్ని మేనల్లుడు దొంతుల రాజేష్ కనిపెట్టాడు. రాజేశ్ కొంతకాలంగా కిరాణాషాప్ నిర్వహిస్తూ, ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటై నష్టాలకు గురయ్యాడు. ముల్తానిపురాలోనే మహేష్ ఇంటి సమీపంలో నివసిస్తున్న రాజేష్ ఆదివారం రాత్రి మహేష్ ఇంట్లోకి చొరబడ్డాడు. స్క్రూ డ్రైవర్తో తాళాలు తీసి లోపలికి వెళ్లిన మహేష్ బీరువాలోని దాదాపు 30 తులాల వివిధ రకాల బంగారు ఆభరణాలు, కిలోన్నరకుపైగా వెండి సామగ్రి, రూ.5 లక్షల నగదు, ఇతర సామగ్రిని దొంగిలించి దర్జాగా ఇంటికి వెళ్లాడు. దొంగిలించిన సొత్తును ఒక సంచిలో పెట్టి లోపలి గదిలో దాచిపెట్టాడు. ఎవరికి అనుమానం రాకుండా రోజుమాదిరిగా ఆటో నడపడానికి వెళ్లాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మహేష్కు తెలిసినవారు, బంధువులే దొంగతనం చేసి ఉండవచ్చని అనుమానించి సమీపంలోని రాజేష్ ఇంటికి వెళ్లారు. అప్పుడే ఇంటికి వచ్చిన అతడిని పోలీసులు ప్రశ్నించగా తడబడ్డాడు. పోలీసులు గట్టిగా నిలదీయడంతో దొంగతనం చేసినట్లు రాజేష్ ఒప్పుకున్నాడు. ఇంట్లో దాచిపెట్టిన బంగారు ఆభరణాలు, వెండి, నగదును పోలీసులకు అప్పగించాడు. రాజేష్ను పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. గోషామహాల్ ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్, ఎస్ఐ అజిత్ దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనాన్ని ఛేదించిన పోలీసులకు, ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్లకు డీసీపీ రివార్డ్స్ అందజేసి ప్రశంసించారు. -
ప్రాణాలు తీసిన ఓవర్టేక్
● ముందువెళ్తున్న లారీని ఢీకొన్న బైక్ ● ఇద్దరు యువకుల మృత్యువాత సనత్నగర్: ఓవర్టేక్ చేసే క్రమంలో ముందు వెళ్తున్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సనత్నగర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కోడూరుకు చెందిన సందీప్ (26) నగరంలోని మహేంద్రహిల్స్లో, ఇతని స్నేహితుడు కామారెడ్డికి చెందిన ధాత్రిక సాయి కౌశిక్ (24) రామంతాపూర్లో ఉంటున్నారు. వీరిద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్లో స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు కోసం బైక్పై వెళ్లారు. అనంతరం తిరిగి వస్తున్నారు. కౌశిక్ బైక్ నడుపుతుండగా సందీప్ వెనక కూర్చున్నాడు. భరత్నగర్ వద్ద బ్రిడ్జి దిగే క్రమంలో ముందు వెళ్తున్న లారీలను అతివేగంగా ఓవర్ టేక్ చేయబోవడంతో ప్రమాదం జరిగింది. లారీని ఢీకొనడంతో బైక్తో సహా ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సందీప్కౌశిక్ -
సైబర్ నేరగాళ్లకు సింహస్వప్నమే
మల్కాజిగిరిలో సైబర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ● విధివిధానాలపై కసరత్తు ● సమగ్ర సమాచార సేకరణ, కార్యకలాపాల నిర్వహణ కదలికలపై నిరంతర నిఘా సైబర్ నేరాలు, మోసాలు చేసి తప్పించుకోలేమన్న భయం కలిగిచడమే లక్ష్యంగా సీసీఐయూ కార్యకలాపాలు సాగిస్తుందని ఓ పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారి చెప్పారు. సైబర్ నేరస్తుల కదలికలు, నెట్వర్క్పై నిఘా పెట్టడం, ఆన్లైన్లో సైబర్ నేరస్తుల మూలాలను ట్రాక్ చేయడం, ఆర్థిక లావాదేవీలను ఛేదించడం, ఇతర అంతర్గత భద్రతా అంశాలపై కన్నేసి ఉంచుతారు. క్షేత్ర స్థాయిలో అజ్ఞాత వ్యక్తుల నెట్వర్క్లను ఛేదిస్తారు. కేసుల నమోదు నుంచి విచారణ, దర్యాప్తు విశ్లేషణ, అభియోగ పత్రాల దాఖలు వరకూ ప్రతి అంశంలోనూ సమర్థంగా ఉంటుంది. సమగ్ర సమాచారం సేకరణ, లోతైన విశ్లేషణ ఉంటుంది. బ్యాంక్లు, ఆర్ధిక సంస్థలు, టెలికం, ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఒకచోట చేర్చి, ఆర్థిక మోసాలపై తక్షణ చర్యలను సులభతరం చేస్తుంది. అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ డేటా పంచుకోవడానికి, విశ్లేషణలోనూ సీసీఐయూ కీలక పాత్ర పోషిస్తుంది. సాక్షి, సిటీబ్యూరో: సమాజానికి సైబర్ నేరాలు పెను ముప్పుగా మారాయి. రోజుకో కొత్త రకం మోసాలతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వీరి భరతం పట్టేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్లో సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సీసీఐయూ) ఏర్పాటు కానుంది. ఈ మేరకు విధి విధానాలు, మార్గదర్శకాలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో వామపక్ష, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఏర్పాటైన స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) తరహాలోనే.. సీసీఐయూ కార్యకలాపాలు సాగించనుంది. -
నిధులెత్తని మూసీ..
సాక్షి, సిటీబ్యూరో: మూసీ నది పునరుజ్జీవం పనులకు ప్రభుత్వం మూడేళ్లలో ప్రతి బడ్జెట్లో రూ.1,500 కోట్ల చొప్పున రూ.4,500 కోట్లు ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు రూ.392 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. నగరంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ సుందరీకరణలో ఫేజ్–1 అభివృద్ధి పనులకు రూ.5,812.4 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. 2024–25 రాష్ట్ర బడ్జెట్లో మూసీ ప్రాజెక్ట్కు ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించగా.. కేవలం రూ.11.25 కోట్లు, 2025–26 బడ్జెట్లో రూ.1,500 కోట్లకు.. రూ.6.21 కోట్ల నిధులను మాత్రమే వినియోగించారు. 2026–27 బడ్జెట్లో రూ.1,500 కోట్లను కేటాయించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రూ.375 కోట్లను విడుదల చేశారు. భూ సేకరణ ముమ్మరం.. ఫేజ్–1లో 21 కి.మీ. మేర మూసీ సుందరీకరణ చేపటనున్నారు. హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ., ఉస్మాన్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ. ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి. దీంతో ఆయా మార్గాల లో భూ సేకరణ కార్యకలాపాలను ఎంఆర్డీసీఎల్ అధికారులు ముమ్మరం చేశారు. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, గాంధీ సరోవర్ ప్రాంతాలలో బఫర్ జోన్లలోని పలువురు భూ యజమానులకు, సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ● ఇప్పటికే గండిపేట మండలంలోని హిమాయత్సాగర్, కిస్మత్పూర్, రాజేంద్రనగర్ మండలంలోని ప్రేమావతిపేట, బుద్వేల్, శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్), తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రయినింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (వాలంతరీ), ఎస్సీ/ఎస్టీ స్టడీ సర్కిల్ వంటి సంస్థలకు గతంలో కేటాయించిన సుమారు 734 ఎకరాల భూములను మూసీ ప్రాజెక్ట్కు బదిలీ చేశారు. కాగా.. మూసీ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) ఇంకా పూర్తి కాలేదు. అందుకే నిధుల కేటాయింపులు, వినియోగం ఆశించిన స్థాయి లో లేదని ఎంఆర్డీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పునరుజ్జీవానికి అరకొర కేటాయింపులు తొలి దశ పనుల అంచనా రూ.5,812 కోట్లు ఇప్పటికి విడుదలైంది రూ.392 కోట్లే -
అప్పుల జలధిలో..
రాబడి కంటే వ్యయం రెండింతలు సాక్షి, సిటీబ్యూరో జలమండలి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నీళ్ల లోతు కష్టాలతో మునిగిపోయింది. మహా నగరానికి తాగునీటి సరఫరా, మురుగు నీటి సేవలు అందిస్తున్న జలమండలి తీవ్రమైన ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. ఖర్చుకు, రాబడికి పొంతన లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి నెలా రూ.వందల కోట్ల నష్టంతో కాలం వెళ్లదీస్తున్న బోర్డు.. అప్పుల ఊబిలోంచి ఎలా బయట పడుతుందో.. అర్థం కాని పరిస్థితి నెలకొంది. జలమండలికి లభిస్తున్న ఆదాయం , చేస్తున్న ఖర్చుకు మధ్య రెండింతలు వ్యత్యాసం కనిపిస్తోంది. తాగునీటి సరఫరా, సీవరేజీ ఛార్జీలు, వాటర్ ట్యాంకర్ల ద్వారా నెలకు సగటున రూ.132 కోట్ల ఆదాయం వస్తుండగా.. నిర్వహణ వ్యయం మాత్రం రూ. 306 కోట్లు దాటుతోంది. అంటే నెలకు రూ.174 కోట్ల లోటు కనిపిస్తోంది. ఈ లెక్కన ఏడాదికి కేవలం నిర్వహణ రూపంలోనే దాదాపు రూ.2,088 కోట్ల భారీ నష్టాన్ని సంస్థ చవిచూస్తోంది. విద్యుత్ చార్జీల మోత.. నగరాభివద్ధిలో కీలకంగా ఉన్న జలమండలికి విద్యుత్ చార్జీలు పెనుభారంగా మారాయి. కృష్ణా, గోదావరి జలాలను వందల కిలోమీటర్ల దూరం నుంచి పంపింగ్ చేయడానికి నెలకు సుమారు రూ.190 కోట్ల వరకు కరెంట్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. సంస్థకు వచ్చే మొత్తం ఆదాయం (రూ. 132 కోట్లు) కంటే, కరెంట్ బిల్లులే రూ. 58 కోట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. కేవలం విద్యుత్ బకాయిలే కొండలా పేరుకుపోతున్నాయి. వడ్డీలు తడిసి మోపెడు తాగునీటి పథకాలు, సీవరేజీ అభివృద్ధి పనుల కోసం తీసుకున్న, తీసుకుంటున్న రుణాలు ఇప్పుడు జలమండలి మెడకు ఉరితాళ్లుగా మారాయి. అసలు కంటే వడ్డీలే భారీగా పెరిగిపోతున్నాయి. ఆదాయం లేక, ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందక.. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ రుణాల చెల్లింపులే సంస్థను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. ఉచిత సబ్సిడీ అరకొర నగర ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రవేశపెట్టిన నెలకు 20 కేఎల్ ఉచిత నీటి సరఫరా పథకం జలమండలిని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాంది. ఇటీవల బడ్జెట్లోఉచిత నీటి పథకం బకాయిలు, నిర్వహణ కోసం బోర్డు రూ. 849.63 కోట్లు ప్రతిపాదించగా, ప్రభుత్వం కేవలం రూ. 300 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే అవసరమైన దానిలో 40 శాతం కంటే తక్కువ నిధులు కేటాయించడంతో, మిగిలిన రూ. 550 కోట్ల భారాన్ని సంస్థ తన సొంత వనరుల నుంచే భరించాల్సి వస్తోంది.కేటాయింపుల ఆశలపై నీళ్లు ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో జలమండలికి తీవ్ర నిరాశే ఎదురైంది. రుణాల చెల్లింపు, పెండింగ్లో ఉన్న అభివద్ధి పనుల కోసం బోర్డు రూ. 8,533 కోట్లు ప్రతిపాదించగా, ప్రభుత్వం కేవలం రూ. 3,305 కోట్లు మాత్రమే కేటాయించింది. అడిగిన దాంట్లో సగం కూడా ఇవ్వకపోవడంతో ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. నిధుల కొరత వల్ల కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కడం గగనంగా మారింది. రుణాలతోనే అభివృద్ధి పనులు భారంగా 20 కేఎల్ ఉచిత నీటి సరఫరా తలకు మించిన భారంగా విద్యుత్ చార్జీలు నెలకు సగటున రూ.132 కోట్ల ఆదాయం నిర్వహణ వ్యయం రూ. 306 కోట్లు నెలకు రూ.174 కోట్ల లోటు రూ.2,088 కోట్ల భారీ నష్టం నీళ్లలోతు కష్టాల్లో జలమండలి -
సీఎం మెప్పు పొందేదెవరో?
వచ్చే నెలతో ముగియనున్న నిమ్స్ డైరెక్టర్ పదవీకాలం ● భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ● ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం సాక్షి, సిటీబ్యూరో: వైద్యరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ పదవికి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోంది. 2023 జూన్లో నిమ్స్ డైరెక్టర్గా పదవీబాధ్యతలు చేపట్టిన నగరి బీరప్ప మూడేళ్ల పదవీకాలం మరో నెలరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ పదవి కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా నిమ్స్లోని ముగ్గురు సీనియర్ వైద్యుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో కొన్ని కీలక విభాగాల అధిపతులు కూడా డైరెక్టర్ పోస్టు రేసులో ఉన్నామంటున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు సైతం మరోమారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. వైద్యం, పరిపాలనాపరంగా అనుభవం ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆ గౌరవం లభిస్తుంది. నిమ్స్ పాలక మండలి అధ్యక్షుడిగా వ్యవహరించే సీఎం ఆదేశాల మేరకే డైరెక్టర్ నియామకం ఉంటుంది. ఎంపిక విధానం ఎలా? నిమ్స్ డైరెక్టర్ పదవీ కాలం ముగిసే సమయానికి ప్రభుత్వం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో సీనియర్ వైద్య నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ముగ్గురు ఉంటారు. డైరెక్టర్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దరఖాస్తుదారులు కనీసం 25 ఏళ్లు వృత్తిపరమైన అనుభవం, పదేళ్లకుపైగా టీచింగ్, రీసెర్చ్ రంగాల్లో పనిచేసి, పరిపాలనా అనుభవం ఉండాలి. దరఖాస్తులను సెర్చ్ కమిటీ పరిశీలించి, ప్రతిభావంతులైనవారిలో మూడు నుంచి ఐదు మంది పేర్లను ప్రభుత్వానికి నివేదిస్తుంది. అందులో ఒకరిని సీఎం డైరెక్టర్గా ఎంపిక చేస్తారు. ఈ మేరకు జీవో విడులవుతుంది. ఎంపికై న వ్యక్తి మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. -
ఎన్టీఏకి ఇది 'కామన్'!
సాక్షి, హైదరాబాద్: నీట్ యూజీకి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యార్థులు ఇంటర్మీడియెట్లో చేరిన తొలి రోజు నుంచే నీట్లో ర్యాంకు సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్లో అడుగుపెట్టాలని అహర్నిశలు కృషి చేస్తుంటారు. కానీ నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో 22.79 లక్షలమంది విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. నీట్ యూజీ మాత్రమే కాకుండా ఇతర పరీక్షల విషయంలోనూ ఎన్టీఏ నిర్వహణ లోపాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల నిర్వహణలో ఎన్టీఏ వైఫల్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తు న్నాయి. రాజస్తాన్లోని సికార్ ప్రాంతంలో పేపర్ లీకైనట్లు, 600 మార్కులకు సరితూగే 120కి పైగా ప్రశ్నలు పరీక్షకు రెండు రోజుల ముందుగానే పలు కోచింగ్ సెంటర్లలో ప్రాక్టీస్ పేపర్ పేరిట ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం యాదృచ్ఛికమే అని, పేపర్ లీక్ కాలేదని తొలుత ప్రకటించిన ఎన్టీఏ.. కేవలం కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకుని నీట్–2026 పరీక్షను రద్దు చేసింది. పరీక్ష కొత్త తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ చెప్పింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించి, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధించినప్పటికీ ప్రశ్నపత్రం లీక్ కావడం ఎన్టీఏ వైఫల్యానికి పరాకాష్ట అని వైద్య కళాశాలల ప్రొఫెసర్లు విమర్శిస్తున్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిపోయి, నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు లేవా? ఎన్టీఏ పకడ్బందీ ఏర్పాట్లు చేయకపోవడంతోనే ప్రశ్నపత్రం లీకైందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ప్రశ్నపత్రాలను రూపొందించి పరీక్ష కేంద్రాలకు పంపించే ఎన్టీఏ వాటి పంపిణీ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. పటిష్ట భద్రతతో పేపర్లను సెంటర్లకు పంపిణీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవట్లేదని, దీంతో ఆయా రాష్ట్రాల్లో పర్యవేక్షణ అధికారుల తీరు కూడా అనుమానాస్పదంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్టీఏ నిర్లక్ష్యపూరిత వ్యవహార శైలికి నీట్ యూజీ–2024ని కూడా విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. ఆ ఏడాది నీట్ యూజీ నిర్వహణ సమయంలో బిహార్ రాజధాని పట్నాలో పేపర్ లీకైందని, సమాధానాలతో కూడిన ప్రశ్నపత్రాలను ముందుగానే అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ పట్నా సెంటర్ నుంచి పరీక్షకు హాజరైన 67 మంది అభ్యర్థులకు 720 మార్కులకుగాను 720 మార్కులు వచ్చాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, సదరు పరీక్ష సెంటర్లో నిర్వహణ పరమైన ఇబ్బందుల కారణంగా విద్యార్థులకు సమయాభావం ఏర్పడిందని, దీంతో వారికి గ్రేస్ మార్కులు ఇవ్వడంతో ఆ స్థాయిలో మార్కులు వచ్చాయని చెప్పింది. అయితే, దీనిపై సీబీఐ విచారణ జరిపి పేపర్ లీక్ వాస్తవమని తేల్చింది. కేవలం ఒక సెంటర్లో లీకైందనే కారణంతో లక్షల మంది విద్యార్థులను ఇబ్బందుల్లో పెట్టబోమని, పేపర్ లీకైన సెంటర్లలోని 1,563 మందికి మాత్రమే పరీక్ష రద్దు చేసి కొత్తగా పరీక్ష నిర్వహించాలని నాడు కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. విద్యా సంవత్సరంపై ప్రభావం నీట్ పరీక్ష రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారు? పేపర్ ఎలా ఉంటుంది? అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పరీక్షకు హాజరైన విద్యార్థులు మళ్లీ అదే పరీక్షకు హాజరు కావాలంటే మానసికంగా అలసటకు గురవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ రద్దు, పునర్నిర్వహణ కారణంగా వచ్చే విద్యా సంవత్సరంపైనా ప్రతికూల ప్రభావం పడనుంది. నీట్ పునర్నిర్వహణకు ఎన్టీఏకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని, ఆ తర్వాత ఫలితాల విడుదలకు మరో పది, పదిహేను రోజులు.. మొత్తంగా 40 రోజులు పడుతుందని నిపుణులు అంటున్నారు. అంటే జూన్ మూడో వారానికి గానీ నీట్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఇదే జరిగితే నీట్ ఆధారంగా నిర్వహించే మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ జాప్యం అవడం ఖాయం. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభం కూడా జాప్యమవుతుంది. ఇతర కోర్సుల ప్రవేశాలకు సందిగ్ధత: నీట్ పునర్నిర్వహణ వల్ల విద్యార్థులు ఇతర కోర్సుల్లో ప్రవేశాల విషయంలోనూ సందిగ్ధత నెలకొనే ప్రమాదం ఉంది. నీట్లో సరైన ఫలితం రాకుంటే బైపీసీ అర్హతతో డిగ్రీ లేదా ఇతర కోర్సులవైపు విద్యార్థులు దృష్టి సారిస్తారు. అయితే డిగ్రీ ప్రవేశాల విషయంలో ఇప్పటికే తెలంగాణలో ‘దోస్త్’షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 20 కల్లా మూడు దశల కౌన్సెలింగ్ పూర్తయి జూలై 1 నుంచి క్లాస్లు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఏపీలోనూ జూలై రెండో వారానికి డిగ్రీ ప్రవేశాలు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో నీట్ ఫలితాలు ఆలస్యమైతే అందులో నిరాశకు గురైన విద్యార్థులు డిగ్రీలో చేరే అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా బైపీసీ అర్హతతో ఎప్సెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు నిర్వహించే అగ్రికల్చర్, బీఫార్మసీ కోర్సుల షెడ్యూల్ కోణంలోనూ గందరగోళం తలెత్తే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులు 2024లో నీట్ లీకేజ్ నేపథ్యంలో పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన చర్యలపై నాడు కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీని నియమించింది. అదే సంవత్సరం అక్టోబర్లో నీట్ యూజీ నిర్వహణ తీరుతెన్నులను క్షుణ్నంగా పరిశీలించిన కమిటీ.. నీట్ యూజీని ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా లేదా హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని సిఫార్సు చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ సహా ఇతర నెట్వర్క్ సదుపాయాలు లేవనే కారణంతో దీన్ని అమలు చేయలేదు. అయితే ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తే ప్రశ్నపత్రాల లీకేజ్కు ఆస్కారం ఉండదని, విద్యార్థులు తాము పరీక్ష రాస్తున్న సమయంలోనే ప్రశ్నలను చూసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇతర పరీక్షల్లోనూ ఎన్టీఏ లోపాలు ⇒ నీట్ యూజీ–2024 ప్రశ్నపత్రం బిహార్ రాజధాని పట్నాలో లీకైంది. దీంతో పేపర్ లీకైన కేంద్రంలో పరీక్షను మళ్లీ నిర్వహించారు. ⇒ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, జేఆర్ఎఫ్లకు అర్హతగా నిర్వహించే యూజీసీ నెట్–2024 పరీక్ష కూడా పేపర్ లీక్ కారణంగా 2024 జూన్ 18న పరీక్ష జరిగిన మరుసటి రోజు రద్దు చేశారు. ⇒ సీఎస్ఐఆర్– యూజీసీ–నెట్– 2024ను కూడా పేపర్ లీకైందనే ఆందోళన నేపథ్యంలో రీషెడ్యూల్ చేసి నిర్వహించారు. ⇒ టీచింగ్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎన్సీఈటీ–2024ను నిర్వహణ పరమైన లోపాలతో నెలపాటు వాయిదా వేశారు. ⇒ జేఈఈ మెయిన్ 2026 ఏప్రిల్ సెషన్లో.. సరైన ప్రశ్నలు రూపొందించని కారణంతో 12 ప్రశ్నలు తొలగించారు. జేఈఈ – మెయిన్ 2025లో సైతం 19 ప్రశ్నలను తొలగించారు. ⇒ ఇలా 2018లో ఎన్టీఏ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 18 పరీక్షలను వాయిదా వేయగా.. పలు పరీక్షల విషయంలో ప్రశ్నల రూపకల్పనలో పొరపాట్లు చేయడంతో లక్షల మంది విద్యార్థులు ప్రతికూల ప్రభావానికి గురయ్యారు. 2024లో ఎన్టీఏ డీజీపై వేటు 2024లో కొన్ని సెంటర్లలో నీట్ పేపర్ లీకేజ్, యూజీసీ నెట్ లీకేజ్లకు బాధ్యులుగా.. అప్పుడు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా ఉన్న సుబోధ్ కుమార్ సింగ్ను తొలగించారు. ఆయన స్థానంలో ప్రదీప్ సింగ్ ఖరోలాను నియమించారు. అయినప్పటికీ ఆశించిన మార్పులు లేకపోవడంతో తాజాగా ఆయన స్థానంలో మరో ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ను నియమించారు. ఇలా అధికారుల స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో నిర్వహణ వరకు పలు లోటుపాట్లు ఎన్టీఏలో జరుగుతున్నాయని అంటున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తీవ్ర ఒత్తిడి ఉంటుంది నీట్ యూజీ పేపర్ లీకేజ్ కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఒకసారి చదివిన అంశాలే అయినప్పటికీ.. పరీక్ష క్లిష్టత, పోటీ వంటి కారణాలతో ఒత్తిడికి గురవుతారు. అదేవిధంగా నీట్లో అవకాశం చేజారితే దృష్టి సారించాల్సిన ముఖ్య ప్రత్యామ్నాయ కోర్సులైన అగ్రి బీఎస్సీ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్ కోణంలోనూ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందే పరిస్థితి తలెత్తింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే నీట్ను ఆన్లైన్లో నిర్వహించడం శ్రేయస్కరం. –ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. రేవంత్రెడ్డి రెండున్నరేళ్ల పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో వంద శాతం తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, పార్టీ నేతలు ఇంటికి పరిమితం కాకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలో జనంతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. మంగళవా రం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్ష తన పార్టీ కీలక సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీమంత్రి హరీశ్రావుతో పాటు శాసనసభ, శాసన మండలిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు 7 గంటల పాటు సాగిన సమావేశంలో కేసీఆర్ కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణానికి సంబంధించి నేతలకు దిశా నిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం భేటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేతల పనితీరును గమనిస్తున్నాం ‘క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరును నిశితంగా గమనిస్తున్నాం. పనిచేయని వారిని పక్కన పెడతాం. ప్రజా సమస్యలపై స్పందిస్తూ కష్టపడి పనిచేసే వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. సీఎం రేవంత్ గుజరాత్ మోడల్ను పదే పదే వల్లె వేస్తున్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గుజరాత్ మోడల్ను మించి ఫలితాలు సాధించాం. జాతీయ స్థాయిలో అనేక సూచీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రభుత్వానికి నిధుల సమీకరణ, వనరుల వినియోగం వంటి అంశాలపై ఏ మాత్రం అవగాహన లేదు. పాలన చేతకాక కాంగ్రెస్ క్రమంగా కనుమరుగవుతోంది..’ అని కేసీఆర్ చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి సమన్వయకర్త రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తలకు శిక్షణ వంటి అంశాలపైనే కేసీఆర్ ఎక్కువగా మాట్లాడినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆయా అంశాలపై నేతల అభిప్రాయాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ పద్ధతిలోనే పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని ఆదేశించారు. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో పాటు, ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటల్ పద్ధతిలోనే జరపాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ నమోదు సమన్వయకర్తను నియమించాలి. కార్యకర్తలకు శిక్షణ అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహిచేందుకు ‘సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండుమూడు రోజుల్లో నియమించాలి. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేస్తున్నందున రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్లకు బూత్కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాలు కొనసాగుతాయి..’ అని కేసీఆర్ తెలిపారు. సభ్యత నమోదు కోసం ఇన్చార్జిలను ప్రకటించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు పలువురు కూడా పాల్గొన్నారు. -
కలెక్టర్లపైనా చర్యలకు వెనుకాడం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను మిషన్ మోడ్లో పనిచేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని చెప్పారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత తీసుకుని పరిష్కరించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకూ ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై రేవంత్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి ‘గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి. రవాణా శాఖ కమిషనర్ ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలి. ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దు. అవసరమైతే స్థానికంగా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలి. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకూడదు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సీఎస్కు నివేదికలు పంపాలి. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను వాడుకోండి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు మిల్లుల్లో స్థలం సరిపోవడం లేదని అంటున్నారు. చాలా ప్రాంతాల్లో గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను తీసుకుని ధాన్యాన్ని అక్కడికి తరలించాలి. తర్వాత పరిస్థితిని బట్టి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి..’అని సీఎం ఆదేశించారు. అకాల వర్షాల నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ ‘అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలి. కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలి. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలి. వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి మిల్లు వద్ద ఒక అధికారి ఉండాల ప్రతి ఐకేపీ సెంటర్కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి. ప్రతి రైస్ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలి. ధాన్యం లోడింగ్లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలి. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు ఇవ్వాలి. అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చు..’అని ముఖ్యమంత్రి అన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి: మంత్రి ఉత్తమ్ ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో జిల్లాల్లో ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో ఎలాంటి సహకారం అందించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పొరుగు రాష్ట్రాల ధాన్యంతో సమస్యలు: మంత్రి తుమ్మల సరిహద్దు రాష్ట్రాల రైతులు కొంతమంది ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని, దీంతో కొన్నిచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అలా ధాన్యం రాకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
6 గంటలు చర్చించిన కేసీఆర్.. కీలక నిర్ణయాలు
ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు, వోటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వాన్ని కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిజిటలైజేషన్ పద్ధతిలో జరపాలని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయ పడ్డారు.ప్రతి నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి మండలానికి, మున్సిపల్ బాడీల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి, సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండు మూడు రోజుల్లొ నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.డిజిటలైజేషన్ పద్దతిలో సభ్యత్వ నమోదు చేయాలని అనుకుంటుండడంతో రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్ లలో, బూత్ కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణాతరగతులు నిర్వహించాలని, ఈ సందర్భంగా డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలపై శిక్షణ ఇవ్వాలని సమావేశం అభిప్రాయ పడింది.సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం నియమించిన ఇన్చార్జిల వివరాలుఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు- తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎంఎల్సీ, ప్రధాన కార్యదర్శిజగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు – జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శిములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శిజనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు - పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శిమెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు- గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శినిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు- గంగాధర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శిమంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు- నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శిఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు- రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శివికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు- సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యేమహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలు — మహమూద్ అలీ, మాజీ మంత్రిగద్వాల్,నాగర్కర్నూల్,వనపర్తి జిల్లాలు— మెట్టు శ్రీనివాస్, కార్యదర్శిమేడ్చల్-మల్కాజిగిరి,యాదాద్రి జిల్లాలు — పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్హైదరాబాద్ జిల్లా— తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యేనల్గొండ, సూర్యాపేట జిల్లాలు — ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి -
బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సిట్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సిట్ బృందం బండి భగీరథ్కు నోటీసులు జారీ చేసింది. పోక్సో కేసులో నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో రేపు మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరు కావాలని సూచించింది.భగీరథ్ను వెంట తీసుకుని రావాలని కరీంనగర్లో నివసించే అతని మేనమామ వంశీ కృష్ణకు పోలీసులు నోటీసులు పంపించారు. మరోవైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి విచారణకు రానుట్లు తెలుస్తోంది. భగీరథ్.. తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఈ నెల 8న కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు తర్వాత భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోమవారం (మే11,2026)న భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ మేరకు మెమో జారీ చేసింది. ‘‘సైబరాబాద్ కూకట్పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ పెట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 684/2026లో బీఎన్ఎస్ 74, 75 సెక్షన్లు, పోక్సో 12 సెక్షన్ కింద నమోదైన కేసు దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాం.దర్యాప్తు సరైన, నిష్పాక్షిక, వృత్తిపరమైన విధానంలో సాగేటట్లు చూసి, కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిర్లక్ష్యం లేకుండా, ఎటువంటి తప్పుదారి పట్టింపు లేకుండా పరిశీలించాల్సిందిగా ఆమెకు ఆదేశాలు ఇచ్చాం. దర్యాప్తు పురోగతిని డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రతిరోజూ దర్యాప్తు నివేదికపై సంతకం చేసిన అధికారికి తప్పనిసరిగా సమర్పించాలి’’ అని పేర్కొంది. -
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు మే 14న విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇక ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం భగీరథ్ను స్వయంగా విచారణ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. పోక్సో కేసు నమోదు, సిట్ ఏర్పాటు పరిణామాల నడుమ భగీరథ్ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా భగీరథ్ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పేట్ బషీరా బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసు దర్యాప్తును ప్రత్యేక బృందానికి అప్పగించారు. కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఈ టీమ్ను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. రమేశ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు శుక్రవార రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్కు తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం సమీక్ష నిర్వహించారు. కాగా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగుతుందని, ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని సైబరాబాద్ సీపీ ప్రకటించారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది.బండి భగీరథ పరారీలో ఉన్నట్లు కేసు విచారణాధికారి,డీసీపీ రీతిరాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. మూడు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉందని చెప్పారు. అతని ఆచూకీ కోసం గాలి స్తున్నామని, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) పరిశీలిస్తుస్తున్నామని వెల్లడిం చారు. బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, మరిన్ని వివరాల కోసం ఇం కోసారి ప్రశ్నిస్తామని వివరించారు. -
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన బండి సంజయ్ తనయుడి కేసు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో భగీరథ్ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, ఆమె కుటుంబం స్టేట్మెంట్లు నమోదు అయ్యాయి. అయితే సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి రికార్డు చేయాలని అనుకుంటోంది. తద్వారా ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు మార్చే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే బండి భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడన్న ప్రచారం నేపథ్యంలో నోటీసులు ఇచ్చి మరీ విచారణ జరిపొచ్చని తెలుస్తోంది. మైనర్ బాలిక కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనలు, సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా విచారణ జరిపే చాన్స్ ఉంది. అలాగే కేసుల్లో సంబంధం ఉన్నవారిని సైతం సిట్ విచారించవచ్చని తెలుస్తోంది. కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఇప్పటికే సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.ఈ కేసుపై ఆమె స్పందిస్తూ.. ‘‘పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నాం. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం చేస్తాం’’ అని వెల్లడించారామె. -
పట్టపగలే పంజాగుట్టలో రూ.15లక్షల మాయం
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే పంజాగుట్టలో రూ.15 లక్షలు ఉన్న బ్యాగ్ మాయమైంది. నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్కు వచ్చిన ఆఫ్షద్ అనే వ్యక్తి.. గణేష్ స్టాంప్స్ అండ్కో వద్ద ఆగి బ్యాగ్ను కుర్చీలో పెట్టారు. రూ.15 లక్షలు నగదు ఉన్న బ్యాగ్ను క్షణాల్లో చోరీచేశారు. బాధితుడు పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీపీఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
రూ.500కే.. జైలు యోగం!
చంచల్గూడ (హైదరాబాద్): సాధారణంగా జైలుకెళ్లాలంటే ఏదో ఒక నేరం చేయాలి.. పోలీసులు అరెస్ట్ చేయాలి.. కోర్టు రిమాండ్ విధించాలి.. ఇదంతా పాత పద్ధతి. అసలు సిసలైన ‘ఖైదీ’ఫీలింగ్ కోసం ఇకపై అలాంటి కష్టాలేమీ పడక్కర్లేదు. కేవలం ఐదు వందల రూపాయలు జేబులో ఉంటే చాలు, చంచల్గూడ జైలు గేట్లు మీ కోసం గౌరవంగా తెరుచుకుంటాయి!.. మీరు చదివింది నిజమే. తెలంగాణ జైళ్ల శాఖ ఆలోచనతో చంచల్గూడలోని శిక్షణ సంస్థ (సీకా) ప్రాంగణంలో సరికొత్త ‘జైలు మ్యూజియం’కొలువుదీరింది. మంగళవారం ఉదయం గవర్నర్ శివప్రతాప్ శుక్లా దీనికి రిబ్బన్ కట్ చేయగానే, పర్యాటకులు క్యూ కట్టేయొచ్చు.రూ.500 టికెట్ కొంటే,ఒక్క రోజంతా జైలు వాతావరణాన్నిఅనుభవించవచ్చు. కేసుల భయం లేదు, బెయిల్ కోసం తిప్పలు లేవు!పాత కాలపు శిక్షలు ఎలా ఉండేవి?జైలు విధానాలు ఏంటన్నవిపెయింటింగ్స్ రూపంలో చూపిస్తూ మనల్ని భయపెడతారు. నేను జైలు చూశానని కాలర్ఎగరేయడానికి ఇదో సువర్ణావకాశం. -
1 నుంచి ప్రెస్ క్లబ్ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రెస్ క్లబ్ సభ్యులు అందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరి సోమవారం సచివాలయంలో మంత్రి దామోదర్ రాజ నరసింహకు వినతి పత్రం సమరి్పంచారు. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా జూన్ 1 నుంచి నిమ్స్లో మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఈ స్పెషల్ డ్రైవ్లో మాస్టర్ హెల్త్ చెకప్ ఉచితంగానే చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు నిమ్స్లో అవసరమైన ఏర్పాటు చేయాలని దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ఆరోగ్య విభాగం కార్యదర్శి క్రిస్టినాను ఆదేశించారు. -
ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఆత్మహత్య
మియాపూర్: మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న కృష్ణప్రియ (30), మైత్రీనగర్లోని ఫేజ్– 2లో నివాసముంటున్న మాధురి (32) బలవన్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. కృష్ణ ప్రియ (35), మైనేని మోనిల్ సింహ దంపతులు నివాసముంటున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిని ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కృష్ణప్రియ హైటెక్సిటీలో పనిచేస్తుండగా భర్త కొద్ది రోజులు బెంగళూరులో, కొద్దిరోజులు స్థానికంగా పనిచేస్తాడు.వేసవి సెలవులు కావడంతో భర్త, కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవాయం సాయంత్రం కృష్ణ ప్రియ సోదరి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో వాచ్మన్కు సమాచారం ఇచి్చంది. వాచ్ మెన్ వెళ్లి తలుపు తలుపులు బద్దల కొట్టి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేయనుకోని మృత దేహాన్ని గాంధీకి తరలించామని తెలిపారు. విజయనగరం జిల్లా, నల్లబెల్లి గ్రామానికి చెందిన హరిపాక బ్రహ్మ, చిన్న అమ్ములు కూతురు మాధురి (35)కి 12 ఏళ్ల క్రితం సత్యనారాయణతో వివాహం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మియాపూర్ మదీనాగూడలోని మైత్రీనగర్లోని ఫేజ్– 2లో నివాసముంటున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. 6 నెలల క్రితం మాధురి భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటినుంచి కుమారుడితో కలిసి ఉంటోంది. 5 రోజుల క్రితం మాధురి తల్లిదండ్రులు మనుమడిని తీసుకుని ఊరికి వెళ్లారు. సోమవారం ఉదయం నుంచి తండ్రి కాల్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ఇంటి పక్కనున్న వ్యక్తికి కాల్ చేసి తమ ఇంట్లో చూడమని చెప్పాడు. అతను వెళ్లి కిటికి నుంచి చూడగా మాధురి బెడ్రూంలో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే మియాపూర్ పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లి చేసుకుందామనుకున్నా.. నా మరదలినే ప్రేమిస్తావా..!
హైదరాబాద్: చిలకలగూడలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తేలచ్చారు. సోమవారం అంబర్పేటలో డీసీపీ రక్షిత కె మూర్తి వివరాలు వెల్లడించారు. నామలగుండుకు చెందిన యవన్(21) చిలకలగూడకు చెందిన యువతి పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇటీవల జవహార్నగర్లో డబుల్బెడ్రూం కేటాయించడంతో అక్కడికి కుటుంబాన్ని మార్చారు. అయితే యవన్ సోదరి కుటుంబం నామలగుండు ప్రాంతంలో ఉండడంతో వస్తూ పాత స్నేహితులతో పాటు యువతితో సైతం సంప్రదిస్తున్నాడు. యువతి బావ అల్లాబోయిన సాయికిరణ్ సైతం వరసకు యువతి మరదలు కావడంతో పెళ్లి చేసుకుందమని భావించాడు. అప్పటికే సాయికిరణ్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో రౌడిïÙటర్. దీంతో ప్రేమ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి కుటుంబ సభ్యులతో చర్చించారు. యవన్ను హత్య చేయడమే పరిష్కారమని భావించి పథకం వేశారు. ఈ నెల 7న స్నేహితుడు సుబ్బు ఇంటికి యవన్ వచ్చినట్లు తెలుసుకున్నారు. యవన్ను బయటకు పిలిచి దాడి చేశారు. పెళ్లి చేసుకుందామనుకుంటున్న నా మరదలిని ప్రేమిస్తావా అంటూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీసులు విచారణ జరిపి యవన్ హత్యకు కారణమైన యువతి బావ అల్లబోయిన సాకిరణ్(27), తండ్రి రాజం నర్సింహాయాదవ్, బాబాయ్లు రాజం శ్రీశైలం యాదవ్(48), రాజం మల్లేశ్యాదవ్(48), సోదరులు రాజం పరేమేశ్ యాదవ్(19, రాజం వంశీకృష్ణ(19, రాజం మనీష్(21), వీరి స్నేహితులు సిరిగిరి రాహుల్(22), కుచ్చుల శివనందన్యాదవ్(20)తో పాటు మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. -
బీన్స్ @ రూ.145
సనత్నగర్: బీన్స్ ధర ౖపైపెకి ఎగబాకింది. రైతుబజార్లోనే కిలో బీన్స్ రూ.145 ఉండగా, బహిరంగ మార్కెట్లో 180–200 వరకు పలుకుతోంది. వెజ్ బిర్యానీలో ప్రధాన ముడిసరుకుగా ఉపయోగించే బీన్స్ ధర అమాంతం పెరగడంతో అటు హోటళ్ల యజమానులు, ఇటు గృహ నివాసితులు కొనాలంటే ఒకింత ఆలోచనలో పడుతున్నారు. డిమాండ్కు తగ్గట్లుగా దిగుబడి రాకపోవడంతో వ్యాపారులు బీన్స్ ధరను భారీగా పెంచేశారు. వారం క్రితం రైతుబజార్లో రూ.60–70లుగా ఉన్న బీన్స్ ధర ఒక్కసారిగా రూ.115కు పెరిగింది. సోమవారం నాటికి రూ.145కు చేరింది. పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉండటంతో బీన్స్ ధర మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
ముంబయ్లోనే మకాం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య తనూజను నేపాలీ గ్యాంగ్ దారుణంగా హత్య చేసి పరారైన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు టాస్క్ఫోర్స్ బృందాలు, మూడు సీసీఎస్ బృందాలు, ఒక లోకల్ పోలీస్ బృందం పూణె, ముంబాయి, ఢిల్లీ, లక్నోలతో పాటు నేపాలి సరిహద్దుల్లో ముమ్మర గాలింపు చేపట్టాయి. అయితే నిందితులు ముంబయ్లో తలదాచుకున్నట్లు సమాచారం. ● నిందితులు కల్పనతో పాటు నేపాల్కు చెందిన సుజన్షాహి అలియాస్ సురేష్షాహి, గణేష్షాహి, భరత్లుగా గుర్తించారు. సురేష్షాహికి ఈ పథకంలో భాగంగా దేవేందర్ అనే నేపాలీ డబ్బులు సర్దుబాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరంతా ముంబాయిలో తలదాచుకున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ బృందాలు అక్కడే గాలిస్తున్నాయి. ● ముఖ్యంగా ముంబయ్ రైల్వేస్టేషన్లో గాలింపు తీవ్రంచేశాయి. అయితే నిందితుల్లో ఒకరైన భరత్ సరిహద్దులు దాటి నేపాల్లోకి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.ప్రధాన నిందితురాలు కల్పనతో పాటు సురేష్షాహి, గణేష్షాహిలను పట్టుకోవడం ద్వారా ఈ మిస్టరీని చేధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ● నిందితుల ఖర్చుల కోసం దేవేందర్ అనే నేపాలీ సురేష్షాహికి పంపించగా, ఆయనే గత నాలుగు వారాల నుంచి ఇక్కడ తిష్టవేసి పథకం రచించి రెక్కీ నిర్వహించి ఈ దోపిడీకి పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ● ప్రధాన నిందితురాలు కల్పనను స్థానికంగా ఓ ఇంట్లో పనిచేస్తున్న మహిళ నియమించినట్లు తేలింది. ఇప్పటికే టాస్క్ఫోర్స్ పోలీసులు పూణెలో కల్పన తల్లిదండ్రులను, చెల్లెళ్లను హైదరాబాద్కు తరలించారు. వారిని ఒకవైపు విచారిస్తూనే ఇంకోవైపు వారి సహాయంతోనే నిందితులను పట్టుకోవాలని యోచిస్తున్నారు. ఇప్పటికే నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ● ప్రధాన నిందితుల్లో భరత్ సరిహద్దు దాటివెళ్లగా కల్పన ముంబాయిలో తలదాచుకున్నట్లు తెలియడంతో ఆమె కోసం వేట ముమ్మరం చేశారు. గణేష్షాహి, సురేష్షాహిలు ముంబాయిలోనే ఓ చోట తలదాచుకోగా వారిని గుర్తించినట్లుగా సమాచారం అందింది. మొత్తానికి ఒకట్రెండు రోజుల్లో నేపాలీ గ్యాంగ్ను పట్టుకునే దిశగా పోలీసులు ముందడుగు వేశారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసు నేపాలీగా గ్యాంగ్ కోసం గాలింపు ముమ్మరం సాయిభాస్కర్పై చర్యలు.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భద్రత నిమిత్తం వ్యక్తిగత సెక్యూరిటీ అధికారి సాయిభాస్కర్ అనే పోలీసును ప్రభుత్వం నియమించింది. ఆయన ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే విధుల్లో ఉంటారు. హత్య, దోపిడీ జరిగిన రోజు రాత్రి ఆయన అందుబాటులో ఉండి ఉంటే ఈ ఘోరం జరగకపోయి ఉండేదని పోలీసులు భావిస్తున్నారు. 24 గంటలు వ్యక్తిగత భద్రత కోసం ఉండాల్సిన పోలీసులు రిలీవర్ లేకపోవడంతో సాయిభాస్కర్ ఒక్కడే ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటూ ఆ తర్వాత వెళ్లిపోతున్నాడు. రాత్రి కూడా ఉండి ఉంటే హత్య, దోపిడీ జరిగి ఉండేది కాదని పోలీసులు అంటున్నారు. -
ఉపాధి కల్పనే లక్ష్యం
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు● సరూర్నగర్లో మెగా జాబ్మేళా ● భారీగా తరలివచ్చిన అభ్యర్థులు ● 779 మందికి నియామక పత్రాలు హుడాకాంప్లెక్స్: యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహించిన మెగా జాబ్మేళాను మంత్రి ప్రారంభించారు. 123 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. 4,318 మంది నిరుద్యోగులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 3,716 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వీరిలో 1,645 మందితో జాబితా కుదించి, 779 మందికి ఆయా కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. మంత్రి మాట్లాడుతూ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదన్నారు. ప్రైవేటు ఫార్మా, ఉత్పత్తి రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఈఈటీ నిరుద్యోగులు, పరిశ్రమలకు మధ్య వారధిగా పనిచేస్తుందని చెప్పారు. కంపెనీల్లో ఖాళీల సమాచారాన్ని యువతకు చేరవేసి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తోడ్పడుతుందన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరుచోట్ల ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఆత్మహత్య
మియాపూర్: మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న కృష్ణప్రియ (30), మైత్రీనగర్లోని ఫేజ్– 2లో నివాసముంటున్న మాధురి (32) బలవన్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. ● కృష్ణ ప్రియ (35), మైనేని మోనిల్ సింహ దంపతులు నివాసముంటున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిని ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కృష్ణప్రియ హైటెక్సిటీలో పనిచేస్తుండగా భర్త కొద్ది రోజులు బెంగళూరులో, కొద్దిరోజులు స్థానికంగా పనిచేస్తాడు.వేసవి సెలవులు కావడంతో భర్త, కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవాయం సాయంత్రం కృష్ణ ప్రియ సోదరి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో వాచ్మన్కు సమాచారం ఇచ్చింది. వాచ్ మెన్ వెళ్లి తలుపు తలుపులు బద్దల కొట్టి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేయనుకోని మృత దేహాన్ని గాంధీకి తరలించామని తెలిపారు. ● విజయనగరం జిల్లా, నల్లబెల్లి గ్రామానికి చెందిన హరిపాక బ్రహ్మ, చిన్న అమ్ములు కూతురు మాధురి (35)కి 12 ఏళ్ల క్రితం సత్యనారాయణతో వివాహం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మియాపూర్ మదీనాగూడలోని మైత్రీనగర్లోని ఫేజ్– 2లో నివాసముంటున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. 6 నెలల క్రితం మాధురి భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటినుంచి కుమారుడితో కలిసి ఉంటోంది. 5 రోజుల క్రితం మాధురి తల్లిదండ్రులు మనుమడిని తీసుకుని ఊరికి వెళ్లారు. సోమవారం ఉదయం నుంచి తండ్రి కాల్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ఇంటి పక్కనున్న వ్యక్తికి కాల్ చేసి తమ ఇంట్లో చూడమని చెప్పాడు. అతను వెళ్లి కిటికి నుంచి చూడగా మాధురి బెడ్రూంలో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే మియాపూర్ పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ముఠా కట్టి.. హవాలా బాట పట్టి..
నాలుగు క్వింటాళ్ల గంజాయి పట్టివేత ● ఏడుగురి అరెస్ట్ గచ్చిబౌలి: కూకట్పల్లి ఎస్ఓటీ, పటాన్చెరు పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి 4 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. సోలాపూర్లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న మనీషా పడ్వాల్ మరింత గంజాయి కోసం అదే ప్రాంతానికి చెందిన మధ్యవర్తి ప్రతాప్ హరిదాస్ పవార్(24)ను సంప్రదించింది. ఒడిశాకు చెందిన ట్రిబుని వద్ద గంజాయి ఉందని తెలుసుకున్న ప్రతాప్ డీసీఎం యజమాని ఆనంద్యప్ప హోవల్(34), డ్రైవర్లు చందన్షిప్వే అబుంబర్(46), రంజిత్ రాజేందర్ గడాగే(27)లు ఒడిశాలోని మల్కన్గిరికి ఈ నెల 8న బయలుదేరారు. డీసీఎం వ్యాన్కు ఎస్కార్ట్గా కారులో బాలాజీ గణేష్(35), రోహిత్ హోవల్(27), చంద్శివ్ సాహిల్(17) వెళ్లారు. ఖమ్మం జిల్లా వైరాకు వెళ్లగానే మల్కన్గిరికి కాకుండా, రాజమండ్రికి రావాలని గంజాయి పెడ్లర్ నుంచి కబురు వచ్చింది. ఈ మేరకు రాజమండ్రిలోని మారుమూల ప్రాంతానికి వెళ్లి రెండు కిలోల బరువు ఉన్న 200 గంజాయి ప్యాకెట్లను డీసీఎంలో లోడ్ చేసుకుని తెలంగాణ మీదుగా బయలుదేరారు. పోలీసులు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఓఆర్ఆర్ ముత్తంగి ఎగ్జిట్ వద్ద డీసీఎంను అడ్డుకున్నారు. ఆరుగురు నిందితులతోపాటు ప్రతాప్ హరిదాస్ పవార్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మనీషా పడ్వాల్, ట్రిబుని పరారీలో ఉన్నారు. 400 కిలోల గంజాయి, డీసీఎం వ్యాన్, కారు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2 కోట్లు ఉంటుంది. హవాలా ద్వారా డబ్బు చేరవేత ప్రధాన నిందితురాలు మనీషా పడ్వాల్ హవాలా ద్వారా అంతర్రాష్ట్ర ముఠాకు మూడు లక్షల నగదు, గూగుల్ పే ద్వారా చేరవేసింది. మనీషా పడ్వాల్, ట్రిబుని పట్టుబడితే మరింత సమాచారం తెలిసే వీలుందని, వారిని త్వరలో పట్టుకుంటామని డీసీపీ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓస్ఓటీ డీసీపీ శోభన్ బాబు, ఏడీసీపీ విశ్వప్రసాద్, ఆర్సీపురం ఏసీపీ శ్రీనివాస్ , పటాన్చెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, డీఐ రాజు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
1 నుంచి ప్రెస్ క్లబ్ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్
పంజగుట్ట: తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రెస్ క్లబ్ సభ్యులు అందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరి సోమవారం సచివాలయంలో మంత్రి దామోదర్ రాజ నరసింహకు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా జూన్ 1 నుంచి నిమ్స్లో మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఈ స్పెషల్ డ్రైవ్లో మాస్టర్ హెల్త్ చెకప్ ఉచితంగానే చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు నిమ్స్లో అవసరమైన ఏర్పాటు చేయాలని దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ఆరోగ్య విభాగం కార్యదర్శి క్రిస్టినాను ఆదేశించారు. శంషాబాద్ తహసీల్లో రోజంతా ఏసీబీ పరిశీలన శంషాబాద్: శంషాబాద్ తహసీల్ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ పరిశీలన కొనసాగింది. ఉదయం 10.30కు వచ్చిన ఏసీబీ అధికారులు తహసీల్దార్తో పాటు కార్యాలయంలో ఉన్న అందరు అధికారులతో మరోసారి రికార్డుల పరిశీలన చేపట్టారు. శుక్రవారం గైర్హాజరైన కొందరు అధికారులు సోమవారం విధులకు రాగా... వారి రికార్డులను కూడా తనిఖీ చేశారు. ఇద్దరు ఉద్యోగులు ఆకస్మికంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లినట్లు సమాచారం. రికార్డుల పరిశీలనతో పాటు వివిధ అంశాలపై ఏసీబీతో చర్చించేందుకు రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్రెడ్డి రోజంతా తహసీల్దార్ కార్యాలయంలోనే ఉండడం గమనార్హం. -
పెళ్లి సందట్లో ఇల్లు గుల్ల
● షాహినాయత్ గంజ్లో భారీ చోరీ ● 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదుతో పరార్ అబిడ్స్: షాహినాయత్గంజ్ ముల్తానిపురాలో భారీ చోరీ చోటుచేసుకుంది. గోషామహాల్ ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ కథనం ప్రకారం... ముల్తానిపురాకు చెందిన మహేశ్ బేగంబజార్లోని స్టీల్ దుకాణంలో సేల్స్మేన్. లంగర్హౌస్లో బంధువుల పెళ్లి ఉండటంతో 4, 5 రోజులుగా ఉదయం కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్లి అర్ధరాత్రి తిరిగి వస్తున్నారు. ఆదివారం వెళ్లి వచ్చేసరికి ఇంటి ద్వారం తెరిచి ఉంది. లోపల బీరువా పగలగొట్టి ఉంది. అందులోని 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదు, ఇతర సామగ్రి కనిపించలేదు. మహేష్ వెంటనే గోషామహాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ సంఘటనాస్థలానికి వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. 2వ అంతస్తులో తమ్ముడి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నప్పటికీ ఏ వస్తువు కూడా చోరీ కాలేదు. గ్రౌండ్ఫ్లోర్లోని స్టోర్రూమ్ కానీ, ఫస్ట్ ఫ్లోర్లో తల్లి నివాసం వైపుకానీ కన్నెత్తి చూడలేదు. తెలిసిన వ్యక్తులే రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దాదాపు రూ.50 లక్షల సొత్తు చోరీ అయిందని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మహా నిదానం
నత్త నడకన ఎలివేటెడ్ స్టీల్బ్రిడ్జి భూసేకరణ● రక్షణ శాఖ భూములు ఓకే.. ప్రైవేట్ వాటిపై నిర్లక్ష్యం ● ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ వరకు 18.18 కి.మీ. నిర్మాణం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి భూసేకరణ నత్తనడకన సాగుతోంది. రెండేళ్ల క్రితమే ప్రణాళికలను రూపొందించి నిర్మాణ సంస్థ ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ వరకు 18.18 కి.మీ. వరకు నిర్మించనున్న ఈ మార్గంలోని రక్షణశాఖ భూముల సేకరణ తుదిదశకు చేరుకుంది. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములపై జాప్యం నెలకొందని అధికారులు అంటున్నారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో ఈ మార్గం ఉంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగడం లేదనే చర్చ సాగుతోంది. ఈ మార్గంలో భూసామర్ధ్య పరీక్షలను హెచ్ఎండీఏ ఇప్పటికే పూర్తి చేసింది. సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్, మేడ్చల్ మార్గాల్లో రెండు బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించారు. మేడ్చల్ రూట్లో డెయిరీఫామ్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. శామీర్పేట్ స్టీల్బ్రిడ్జికే గ్రహణం పట్టుకుంది. కొరవడిన సమన్వయం... వెస్ట్ మారేడ్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఈ ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి కారిడార్ నిర్మించనున్నారు. ప్యారడైజ్ నుంచి వెస్ట్ మారేడ్పల్లి, కార్ఖానా వరకున్న మార్గం హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో ఉంది. తిరుమలగిరి నుంచి శామీర్పేట్ వరకున్న మార్గం మేడ్చల్ కలెక్టరేట్ పరిధిలో ఉంది. రెండు జిల్లాల అధికారులు భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటివరకు రెండు జిల్లాల్లో ముగ్గురు కలెక్టర్ల చొప్పున బదిలీ అయ్యారు. రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే భూసేకరణలో జాప్యం నెలకొనడం గమనార్హం. ఈ ప్రాజెక్టు కోసం 9.35 కి.మీ. మార్గంలో 114.50 ఎకరాల రక్షణ శాఖ భూముల సేకరణ తుదిదశకు చేరుకుంది. కానీ, మరో 8.35 కి.మీ. మార్గంలో సేకరించాల్సిన 78.39 ఎకరాల ప్రైవేట్ భూములపై నిర్లక్ష్యం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ అధికారులు ఈ భూమిని సేకరించి హెచ్ఎండీఏకు అందజేస్తే సుమారు 937 ప్రైవేట్ ఆస్తులను తొలగించి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. హెచ్ఎండీఏ రూ.4,263 కోట్లతో అంచనాలను రూపొందించింది. అందులో రూ.2,872 కోట్లు నిర్మాణ వ్యయం కాగా, మరో రూ.1,240 కోట్లను భూసేకరణ కోసం వెచ్చించనున్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 18.18 కి.మీ. దూరం చేపట్టనున్న ఈ బ్రిడ్జి నిర్మాణంలో 11.52 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. హకీంపేట్ ఎయిర్ఫోర్స్ అకాడమీ వద్ద 6 లేన్లతో భూమార్గంలో టన్నెల్ నిర్మించనున్నారు. తిరుమలగిరి, అల్వాల్ వద్ద వాహనదారులు బ్రిడ్జిపైకి ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు ఎంట్రెన్స్, ఎగ్జిట్లు ఉంటాయి. నగరాన్ని రాజీవ్ రహదారికి అనుసంధానం చేసేందుకు ఇది దోహదం చేయనుంది. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. మరోవైపు ప్యారడైజ్ జంక్షన్ నుంచి మేడ్చల్ రూట్లో డెయిరీఫామ్ వరకు 5.40 కి.మీ. వరకు చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాథమిక పనులు కొనసాగుతున్నాయి. తాడ్బంద్, బోయిన్పల్లి మీదుగా డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఈ రూట్లో బేగంపేట్ ఎయిర్పోర్టు వద్ద 600 మీటర్ల టన్నెల్ రానుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,487 కోట్లు వ్యయం కానుంది. -
ప్రధాని మోదీ సూచనలు పాటించాలి: ఎంపీ ఈటల
కంటోన్మెంట్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనా ధోరణికి అనుగుణంగా ప్రజలు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పరేడ్ గ్రౌండ్లో బీజేపీ సభ విజయవంతం అయిన నేపథ్యంలో ఆయన సోమవారం కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు భానుక నర్మదతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన కలిగిన ప్రధాన మంత్రి ప్రజలకు పలు సూచనలు చేశారని అన్నారు. ముఖ్యంగా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. మేక్ ఇన్ ఇండియా.. మేడ్ ఇన్ ఇండియా కోసం మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిని తమతో కలవాలంటూ మోదీ పిలుపునివ్వడాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈటల అన్నారు. ఈ పిలుపుతో బీజేపీలో నాయకత్వ లేమి ఉందని చెప్పడం సరికాదన్నారు. -
నా మరదలినే ప్రేమిస్తావా..!
పెళ్లి చేసుకుందామనుకున్నా.. యువకుడి హత్యకేసులో 10 మంది అరెస్ట్ అంబర్పేట: చిలకలగూడలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తేలచ్చారు. సోమవారం అంబర్పేటలో డీసీపీ రక్షిత కె మూర్తి వివరాలు వెల్లడించారు. నామలగుండుకు చెందిన యవన్(21) చిలకలగూడకు చెందిన యువతి పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇటీవల జవహార్నగర్లో డబుల్బెడ్రూం కేటాయించడంతో అక్కడికి కుటుంబాన్ని మార్చారు. అయితే యవన్ సోదరి కుటుంబం నామలగుండు ప్రాంతంలో ఉండడంతో వస్తూ పాత స్నేహితులతో పాటు యువతితో సైతం సంప్రదిస్తున్నాడు. యువతి బావ అల్లాబోయిన సాయికిరణ్ సైతం వరసకు యువతి మరదలు కావడంతో పెళ్లి చేసుకుందమని భావించాడు. అప్పటికే సాయికిరణ్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో రౌడిషీటర్. దీంతో ప్రేమ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి కుటుంబ సభ్యులతో చర్చించారు. యవన్ను హత్య చేయడమే పరిష్కారమని భావించి పథకం వేశారు. ఈ నెల 7న స్నేహితుడు సుబ్బు ఇంటికి యవన్ వచ్చినట్లు తెలుసుకున్నారు. యవన్ను బయటకు పిలిచి దాడి చేశారు. పెళ్లి చేసుకుందామనుకుంటున్న నా మరదలిని ప్రేమిస్తావా అంటూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీసులు విచారణ జరిపి యవన్ హత్యకు కారణమైన యువతి బావ అల్లబోయిన సాకిరణ్(27), తండ్రి రాజం నర్సింహాయాదవ్, బాబాయ్లు రాజం శ్రీశైలం యాదవ్(48), రాజం మల్లేశ్యాదవ్(48), సోదరులు రాజం పరేమేశ్ యాదవ్(19, రాజం వంశీకృష్ణ(19, రాజం మనీష్(21), వీరి స్నేహితులు సిరిగిరి రాహుల్(22), కుచ్చుల శివనందన్యాదవ్(20)తో పాటు మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. -
బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి
● బీఆర్ఎస్ మహిళా విభాగం నిరసనగచ్చిబౌలి: బండిభగీరథ్ను వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తుల ఉమా డిమాండ్ చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ముందు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర హోంశాఖా సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ఎప్పుడూ ధర్మరక్షణ, దేశ రక్షణపై చాలా మాట్లాడతారని.. అతని కుమారుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని, మా బిడ్డను రక్షించాలని కోరిన ఆ తండ్రికి ఏం న్యాయం చేస్తారన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ బేటీ బచావో, బేటీపడావో అని చెబుతుంటారని ఇప్పుడు ఇలాంటి నేరానికి పాల్పిడిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ? చెప్పాలని పోలీసులను డిమాండ్ చేశారు. నేరం చేసిన వ్యక్తిని కాపాడుతున్న బండి సంజయ్, సీఎం రేవంత్రెడ్డి నేరస్తులేనని విమర్శించారు. బీఆర్ఎస్ శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు కొమిరిశెట్టిసాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగం..దేశానికి కాపలా కాసే సైనికుడు
సుల్తాన్బజార్ : భారత రాజ్యాంగం సరిహద్దుల్లో అప్రమత్తంగా దేశానికి కాపలా కాసే సైనికుడిలాంటిదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్రెడ్డి సహిత్య పురస్కారాన్ని సుదర్శన్ రెడ్డికి ప్రదానం చేశారు. పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు డాక్టర్ జి.చిన్నారెడ్డి పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ న్యాయవ్యవస్థ పాత్ర అనే అంశంపై సుదర్శన్రెడ్డి ప్రసంగింగాచారు. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయ వ్యవస్థ తప్పక జోక్యం చేసుకోవాలన్నారు. తాను ఓడిపోతానని తెలిసినా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడడానికి కారణం దేశం పట్ల ఉన్న నిబద్ధతేనని సుదర్శన్రెడ్డి అన్నారు. -
జనగణన వివరాలు అత్యంత గోప్యం
ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి ● ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి ● ప్రిన్సిపల్ ఎన్యూమరేషన్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ బంజారాహిల్స్లో జనగణనను పరిశీలిస్తున్న ఆర్వీ కర్ణన్సాక్షి,సిటీబ్యూరో: సెల్ఫ్ ఎన్యూమరేషన్ ముగియడంతో సోమవారం క్యూర్ పరిధిలోని ట్రై కార్పొరేషన్లలో ఇంటింటి సర్వే ద్వారా జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ జూన్ 9వ తేదీ వరకు కొనసాగనుంది. సెన్సస్ యాక్ట్ ప్రకారం ప్రజలు తమ వివరాలివ్వడం తప్పనిసరి అని, ఎన్యూమరేటర్లకు సహకరించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్యూర్ పరిధిలోని 60 సర్కిళ్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సర్కిల్కు ప్రిన్సిపల్ ఎన్యూమరేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు అందుతున్న సంక్షేమ పథకాలకు జనగణనతో గండిపడుతుందనే అపోహలున్నాయని, దీని ద్వారా జనా భా, భవనాల వివరాలు సేకరించడం మినహా, ఇతరత్రా ఏ కార్యక్రమానికీ వినియోగించరని తెలిపారు. ఆర్టీఐ ద్వారా సైతం ఎవరికీ సమాచారం వెళ్లదని, అత్యంత గోప్యంగా ఉంటుందని, జనగణన వివరాలు డౌన్లోడ్, షేర్ చేయలేరని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లకు గుర్తింపు కార్డు, క్యూఆర్ కోడ్ ఉంటాయని, వారితోపాటు జీహెచ్ఎంసీ సిబ్బంది సైతం ఉంటారని పేర్కొన్నారు. ఏవైనా ఫిర్యాదులుంటే ప్రజలు జీహెచ్ఎంసీ కాల్సెంటర్ నెంబర్కు చేయవచ్చన్నారు. 19,868 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ క్యూర్ పరిధిలో 19,868 బ్లాకులుగా ఇళ్లను డిజిటలైజ్ చేసినట్లు కర్ణన్ తెలిపారు. ఒక్కో బ్లాక్లో 200– 300 ఇళ్లుంటాయని, జనగణన కోసం 25,175 మంది సిబ్బందిని నియమించామని వివరించారు. వివరాల్ని మొబైల్ యాప్లో నమోదు చేస్తారని, జనగణనను డిజిటల్గా జరపడం ఇదే తొలిసారని తెలిపారు. ఇంట్లో ఉన్న వారెవరైనా వివరాలు ఇవ్వవచ్చని, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్ ఇవ్వడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇళ్లలో మాత్రమే కాక సంస్థల పరంగానూ ఎన్యూమరేషన్ జరుగుతుందని, ప్రతి భవనంలో ఉంటున్న వారి వివరాలు సేకరించడమే లక్ష్యమన్నారు. శని, ఆదివారాల్లోనూ ఎన్యూమరేషన్ జరుగుతుందని తెలిపారు. క్యూర్లో 1.27 లక్షల మంది మాత్రమే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నట్లు చెప్పారు. వ్యక్తుల వారీ వివరాలు వచ్చే సంవత్సరం ఇది కుటుంబ సర్వే మాత్రమేనని, వ్యక్తుల వారీగా అసలైన జనగణన సర్వే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జరుగుతుందని కర్ణన్ తెలిపారు. ఇప్పుడు సర్వే చేసే ఎన్యూమరేటర్లు, ప్రతి ఇంటికీ వెళ్లి ఇంటి నెంబర్, ఎన్యూమరేషన్ నెంబర్ ప్రత్యేకంగా వేస్తారన్నారు. పర్యవేక్షిస్తూ.. పరిశీలిస్తూ.. బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12లోని ఎన్బీటీనగర్లో జనగణనను కర్ణన్ సోమవారం పర్యవేక్షించారు. జనాభా వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టేందుకు, పాలసీలు రూపొందించేందుకు జనగణన ఎంతో కీలకం. దీని ద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. తెలిసిన సాధారణ వివరాలే నమోదు చేస్తారు. అందరూ సహకరించండి. – ఆర్వీ కర్ణన్ -
సీనియర్ మహిళా ఐపీఎస్తో విచారణ
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు వ్యవహారంపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సోమవారం ఉదయం సమీక్షించానని, ఈ కేసు సున్నితమైనందున మహిళా ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. సోమవారం మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన ఈ విషయం ప్రస్తావించారు. ఈనెల 8వ తేదీన మైనర్ బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని, అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా 9, 10 తేదీల్లో దాదాపు 10 వేల మంది పోలీసు యంత్రాంగం బందోబస్తు విధుల్లో నిమగ్నమైందని సీఎం తెలిపారు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేయడానికి ముందే.. బండి సంజయ్ కుమారుడు కరీంనగర్లో వాళ్లపై వేరే ఫిర్యాదు చేశారని అన్నారు. సోమవారం ఉదయమే ఈ కేసులో విచారణ ప్రారంభమైందన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద ఏవీ జరగవని, వారు పనిలేకుండా ఉన్నంత మాత్రాన ఎవరూ పనిలేకుండా ఉన్నారను కోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తాను మాజీ పోలీసు అధికారినన్న విషయం మరిచిపోవద్దని సూచించారు. బాధితులను కలిసి స్టేట్మెంట్ తీసుకుని చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని, దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని చెప్పారు. కేటీఆర్ బావమరిది ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ జరిగితే కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మైనర్ బాలికకు సంబంధించిన అంశంలో అంతా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ కమిషనర్కు ఇవ్వొచ్చని సూచించారు. -
ప్రజా జీవనంపై మోదీ అప్రకటిత నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ తన అసమర్థ పాలన, విదేశాంగ విధానంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల జీవనంపై అప్రకటిత నిషేధం ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ‘బంగారం కొనొద్దు.. వెకేషన్కు వెళ్లొద్దు.. నూనె తినడం తగ్గించాలంటూ ప్రధాని ప్రజలకు పిలుపునివ్వడం బాధ్యతా రాహిత్యం. మోదీ ప్రభుత్వ వైఫల్యం, అసమర్థ విధానాలే ఇందుకు కారణం. విదే శాంగ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సూచనలు సలహాలు తీసు కోకుండా ఏకపక్ష నిర్ణయాలు సరికాదు. దేశంలో సంక్షోభం తలెత్తే అంశాలపై రాహుల్గాంధీ ఆరు నెలల నుంచే చెబుతున్నా అంతా సవ్యంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. కేంద్రానికి ఓ స్పష్టమైన విధానం లేదు. దశ, దిశ లేదు. అనుభవ రాహిత్యం, అహంకారంతో దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. గాలి తిని, గాల్లో బతకమని చెప్పి మోదీ వెళ్లిపోయారు. పశ్చిమాసియా యుద్ధంలో మనమేమీ ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు..’ అంటూ సీఎం విమర్శించారు. సోమవారం తన నివాసంలో ఆయన మీడియాతో సుదీర్ఘంగా చిట్చాట్ చేశారు. మావోయిస్టులను చంపడమే బీజేపీ ఎజెండా ‘బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారిని ఖతం చేయడమే ఆ పార్టీ విధానం. ముస్లింలు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కారా? వారికి తమ సిద్ధాంతాలను చెప్పుకునే స్వేచ్ఛ లేదా? మావోయిస్టులను చంపడమే బీజేపీ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుంది. మేము ప్రాణాలు తీయడానికి వ్యతిరేకం. మా సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్లను కూడా ఒప్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాం. మనుషుల ప్రాణాలకు మా ప్రభుత్వం విలువ ఇస్తుంది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ మాది. మనషులను చంపడం పరిష్కారం కాదు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అత్యధికంగా తెలంగాణలోనే లొంగిపోయారు. 818 మంది మావోయిస్టులు రాష్ట్రంలో సరెండర్ అయ్యారు. వందలాది ఆధునాతన ఆయుధాలను అప్పగించారు. అందుకోసం మేం ప్రత్యేక చొరవ తీసుకున్నాం. మేం బుల్లెట్ కాదు బ్యాలెట్ అన్నాం.. లొంగిపోయిన వారికి రక్షణ, వైద్యం, ఆర్థికపరమైన సాయం ప్రభుత్వం అందిస్తుంది. మావోయిస్టుల విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. భూ పంపణీ, ఉపాధి హామీ పథకాల అమలుతో వారి ఉద్యమాలు తగ్గాయి. గణపతి కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను అభినందించకపోగా విమర్శించడం దురదృష్టకరం. బుల్లెట్ కాదు బ్యాలెట్ అని మేం అన్నాం. చివరకు మావోయిస్టులు మా లైన్కు వచ్చారు. ముస్లింలను వేరే చేసి చూపించడం మంచిది కాదు. కలిసి ఉండాలని ప్రధాని మాట్లాడాలి కానీ విడగొట్టాలని మాట్లాడం దురదృష్టకరం. బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ.. విభజించు, పాలించు అన్నదే వాళ్ల సిద్ధాంతం..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. నేను అడిగిన అంశాలకు మోదీ అంగీకరించారు.. ‘ఆదివారం అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా నేను అడిగిన అంశాలకు ప్రధాని అంగీకరించారు. అందులో ఎలాంటి రాజకీయాలు లేవు. మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కు సాయం చేసిన విధంగానే తెలంగాణకు కూడా మీరు సహకరించాలని కోరా. అందుకు ప్రధాని స్పందిస్తూ.. ‘నీవొక్కడివే చేస్తే అనుకున్న లక్ష్యాలను (3 ట్రిలియన్ ఎకానమీ) సాధించలేవు. నీ కలలు నిజం అవ్వాలంటే మాతో కలిసి వస్తే.. అది సాధ్యం అవుతుంది’ అనే విధంగా అన్నారు. అయితే ఆయన మాటలను ఎవరికి తోచిన విధంగా వారు అర్థం చేసుకుంటున్నారు. నేను బీజేపీని ఓడించే ముఖ్యమంత్రి అయ్యా. నన్ను కాదు..రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానని మోదీ అన్నారు. ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు.. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సమన్వయంపై మేం చర్చించాం.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందే..అది హక్కు. వాటిని సాధించుకుంటాం. కేంద్రంతో సత్సంబంధాలు లేకుండా నిధులు అడగకుండా ఉంటే రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది? కానీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదు. కొన్ని అంశాల్లో సహకరిస్తున్నా.. మంత్రులను కలిసి ఎన్నిసార్లు అడిగినా అనుమతులు రావడం లేదు. రాష్ట్రాల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రధాని కార్యాలయంలో సింగిల్విండో ఏర్పాటు చేయాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం విధానంపైనే అభ్యంతరాలు ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి లేదు. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం అనుసరించే విధానంపైనే ప్రతిపక్ష పార్టీలన్నింటికీ అభ్యంతరాలు ఉన్నాయి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు, నియోజకవర్గాల పెంపునకు ముడిపెట్టడంతోనే బిల్లు వీగిపోయింది. 50 శాతం సీట్ల పెంపునకు ఎలాంటి ఫార్ములా లేదు. 2029లో జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు అమలు కావొచ్చు. అయితే బీజేపీ ఎన్నికల విధానం అంతా జెమినీ సర్కస్లా ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రధాని అన్నారు. వారిష్టం.. అనందపడనివ్వండి. రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ భవిష్యత్తులో మళ్లీ ఆదే రెండు సీట్లకు పరిమితం అవుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మాకు ఒక రాష్ట్రం వస్తే.. వారికి ఒక రాష్ట్రం అదనంగా వచ్చింది అంతే. కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది..’ అని సీఎం వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో యాంటీ డ్రగ్ ప్రమాణం ‘రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభోత్సవం రోజున పిల్లలతో యాంటీ డ్రగ్ ప్రమాణం చేయించనున్నాం. అందుకోసం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఆహ్వానిస్తున్నాం. నిపుణులు, విద్యావంతులతో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే పాఠశాల విద్యాశాఖలో ఇంటర్ విలీనంపై ఒక నిర్ణయం తీసుకుంటాం. తుమ్మిడిహెట్టిపైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. ఇంకా స్పందన రాలేదు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు ప్రధానమంత్రి పెద్దరికం వహిస్తే బావుంటుంది. ధాన్యం సేకరణలో సమస్యలు ధాన్యం సేకరణలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ధాన్యం దిగుబడి విపరీతంగా వచ్చింది. ప్రకృతి కారణంగా కూడా సమస్యలు ఉన్నాయి. అన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. గత ఎక్సెస్ టెండర్లపై సీబీఐ విచారణకు సిద్ధమా? హామ్ రోడ్ల టెండర్లలో అన్నీ ఎక్సెస్ అని హరీశ్రావు వ్యాఖ్యానిస్తున్నారు. 26 శాతం లెస్కు వచ్చిన విధంగానే అందరికీ ఇవ్వాలని అంటే.. గతంలో వారు ఎక్సెస్కు ఇచ్చిన టెండర్లన్నింటిపై సీబీఐ విచారణకు సిద్ధమా? నాకు ఎవరిపైనా కక్ష లేదు. తప్పు చేసిన వారిని న్యాయస్థానాలు శిక్షిస్తాయి..’ అని సీఎం వ్యాఖ్యానించారు. మీ విషయంలో అలా జరగలేదు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అడవికి రాజునని, వేటాడి చంపే మృగం బలం ఉన్నప్పుడు అలా వ్యవహరించినా.. శక్తి లేనప్పుడు పొదల మాటున, రాళ్ల మాటున దాగి మరణిస్తుందని అంటూ ఇది ఎవరినీ ఉద్దేశించి తాను వ్యాఖ్యానించడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
విద్యకు బడ్జెట్లో 15 శాతం నిధులిస్తాం
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. విద్య కోసం రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలని రాష్ట్ర విద్యా కమిషన్ సిఫారసు చేసిందని, అయితే ఒక్కరోజులో ఈ కేటాయింపులను పెంచే పరిస్థితి ఉండదన్నారు. కేటాయింపులను ప్రతి ఏటా బడ్జెట్లో క్రమంగా పెంచుతూ పోతామని, 15 శాతానికి పెరిగే వరకు ఇది కొనసాగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలను నిర్వహిస్తోంది. సోమవారం ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవాల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించి టీచర్లు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘విద్యాశాఖకు ఈ ఏడాది రూ.26,674 కోట్లు కేటాయించాం. రాష్ట్ర బడ్జెట్లో 8.22 శాతం కేటాయింపులు జరిపాం.గతేడాది కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు పెంచాం. ఇదేవిధంగా ఏటా పెంచుతాం. ఓఆర్ఆర్ లోపల క్యూర్ ప్రాంతంలో రూ.1,700 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు శంకుస్థాపన చేయడం శుభపరిణామం. వర్సిటీలు, విద్యను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది. పేదలకు న్యాయమైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం మా ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రంలోని తండాలు, గూడేలు, మారుమూల గ్రామాల్లోని పేదలు, దళితులు, గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో విద్యాశాఖను నేనే నిర్వహిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం.ప్రజాప్రభుత్వంలో కేవలం 60 రోజుల వ్యవధిలో 11 వేల మంది టీచర్లను నియమించడం చరిత్రాత్మక అంశం. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా 22 వేల టీచర్లకు పదోన్నతులు, 36 వేల మంది టీచర్లకు బదిలీలు పూర్తి చేశాం. నీతిఆయోగ్ నివేదికలో విద్యలో రాష్ట్రం సాధించిన విజయాలను అభినందించింది. ఇందుకు విద్యాశాఖ ఉద్యోగులు, టీచర్లను అభినందిస్తున్నాను. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షలకు పైగా పేద విద్యార్థులు చదువుకుంటున్నారు.1.05 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నాడు. విదేశాల్లో విద్యాబోధన, అభ్యసన కార్యక్రమాల పరిశీలనకు టీచర్లను పంపుతాం దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. ప్రపంచ దేశాల్లో విద్యావిధానాన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. మంత్రులు, ఉన్నతాధికారులే కాదు.. క్షేత్రస్థాయిలో బోధించే టీచర్లు ఈ అధ్యయనంలో భాగం కావాలి. అందుకే ఇటీవల 25 మంది ప్రభుత్వ టీచర్ల బృందాన్ని ఫిన్లాండ్కు పంపించాం. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఉపాధ్యాయులను ఎంపిక చేసి 500 మందిని విదేశాలకు పంపించాలనుకుంటున్నాం. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించే టీచర్లను అభినందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున లేదా మరో ప్రత్యేక దినాన టీచర్లకు సన్మానం చేస్తాం.దేశానికి ఆదర్శంగా నూతన విద్యా విధానం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ టు 12 వ తరగతి వరకు ప్రవేశపెడుతున్నాం. పదోతరగతి పాసైన తర్వాత ఇంటర్లో డ్రాపౌట్స్ను అరికట్టేందుకే ఈ నిర్ణయం. వర్సిటీలల్లో సదుపాయాల కల్పనకు భారీగా నిధులు ఖర్చు పెడుతున్నాం. 100 నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. పాఠశాల ప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు ఒక జత స్కూల్ డ్రెస్, మరో జత జూన్ నెలాఖరున ఇస్తాం.ఎడ్యుకేషన్ కిట్ కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ టీచర్లకు ఉద్యోగం కాదు భావ్వోదేగం. పేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే టీచర్లు ఒక గంట అదనంగా పని చేయాలి. విద్యాశాఖకు మంత్రి లేడని కొందరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. సమీక్ష సమయంలో నన్ను ముఖ్యమంత్రిగా కాకుండా విద్యాశాఖ మంత్రిగా చూడండి. కావాలనే నేను విద్యా శాఖను నా దగ్గర పెట్టుకున్నాను’అని సీఎం స్పష్టం చేశారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను సీఎం అందజేశారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, జి.వివేక్ పాల్గొన్నారు. -
‘ప్రభుత్వ పాఠశాలలే దేశ భవిష్యత్కు వేదికలు’
హైదరాబాద్: విద్యాశాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించామన్నారు రేవంత్. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలను అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించాం. విద్యాశాఖ పనితీరు నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకూ పేదవారికి విద్యను అందిస్తాం. ప్రైవేటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారుచేస్తాం. విద్యాశాఖకు అంచెలంచెలుగా 15 శాతం నిధులు కేటాయిస్తాం. ప్రభుత్వ పాఠశాలలే దేశ భవిష్యత్కు వేదికలు. తెలంగాణ కల సాకారంలో విద్యార్థుల కృషి వెలకట్టలేనిది. 22వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం.’ అని రేవంత్ పేర్కొన్నారు.విద్య మూలంగానే కుటుంబాలు ఉన్నత శిఖరాలకు..మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ.. ‘ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో బాగంగా ఈరోజు ముఖ్యమంత్రి విద్యా వారోత్సవాలు ప్రారంభించారు. అందులో భాగంగా దాదాపు 1100 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలతో పాటు ,క్యూర్ ప్రాంతంలో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ చెప్తుంటారు..విద్యార్థి సంఘ్ రాజకీయాల నుండి వచ్చిన వ్యక్తిగా అనేక సమావేశాల్లో వేదికలపై చెప్పడం జరిగింది.. ఒక వ్యక్తి అభివృద్ధి వెనుక కులం , మతం డబ్బు కారణం కాదు ,విద్య మూలంగానే కుటుంబాలు ఉన్నత శిఖరాలకు చేరుతాయి’ అని తెలిపారు. -
హీరోయిన్ త్రిషకు షాకింగ్ కౌంటర్ : డా.శివరంజని పోస్ట్ వైరల్
అనేక ట్విస్ట్స్ అండ్ టర్న్స్ మధ్య ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంప్రదాయ చీరకట్టులో హాజరైన నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలం రంగు పట్టుచీరలో, కొప్పున మల్లెలతో కనిపించడమే కాదు, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆనందబాష్పాలతో నిండిన కళ్లతో భావోద్వేగానికి లోనవుతున్న వీడియో సంచలనం రేపింది. ఆ తరువాత తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ప్రేమ ఎప్పుడూ గొప్పదే అంటూ ఆమె చేసిన ఇన్స్టా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో విజయ్-త్రిష మధ్య ప్రేమానుబంధంపై రకరకాల వాదనలు, పుకార్లు హాట్ టాపిక్గా మారాయి.అయితే చిన్నపిల్లల వైద్యురాలు, ఓఆర్ఎస్పై అలుపెరుగని పోరాటం చేసిన హైదరాబాద్కు చెందిన డా. శివరంజని ఇన్స్టా పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా త్రిష పోస్ట్కు కౌంటర్గా ఆమె షేర్ చేసిన ఫోటో చర్చకు దారి తీసింది. ‘ప్రేమ ఎప్పటికీ గొప్పది కాదు. ద్రోహం. విచ్ఛిన్నమైన కుటుంబాల నిశ్శబ్దం బాధాకరం. ముఖ్యంగా పిల్లలకు’ అని అర్థం వచ్చే పిక్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. View this post on Instagram A post shared by Dr Sivaranjani Santosh (@drsivaranjanionline) నెటిజనుల స్పందనవావ్..ఎంత అద్భుతమైన సమాధానం, వావ్. మీపై గౌరవం పదివేల రెట్లు పెరిగింది అంటూ ఆమెను కొనియాడగా, మహిళలు ఆమెనే ఎందుకు నిందిస్తున్నారు, దీనికి ఆ వ్యక్తి ( విజయ్) బాధ్యుడు కాదా? నిజం ఏమిటంటే, ప్రతీ వివాహం శాశ్వతంగా నిలవాలని లేదు. కొన్నిసార్లు విడిపోవడమేమంచిది. ఆరోగ్యకరం కూడా. అందుకే చాలా జంటలు సమాజం కారణంగా కలిసి జీవిస్తాయి. వారు తమలో నింపుకున్న ద్వేషం చాలా లోతుగా పాతుకుపోయి, చాలాసార్లు దానిని పిల్లలకు కూడా అందిస్తారు అని మరొకరు కమెంట్ చేశారు.చిన్నప్పుడు నేను దీనిని అనుభవించాను. అది నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది, ఇప్పటికీ నన్ను ప్రభావితం చేస్తూనే ఉంది! ఈ విషయాన్ని గట్టిగా చెప్పినందుకు ధన్యవాదాలు అని మరొకరు సమాధానం ఇవ్వడం విశేషం.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను‘ప్రతి ఒక్కరూ వివాహేతర సంబంధాన్ని సాధారణీకరించి, దాన్ని గొప్పగా కీర్తిస్తుండటం అత్యంత అసహ్య కరమైన విషయం. పిల్లలు మోయబోయే బాధ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. పిల్లలు తమ తల్లికి చాలా గట్టిగా అండగా నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లూ భార్య వెన్నెముకలా నిలబడింది, అకస్మాత్తుగా మరో స్త్రీ వచ్చింది. ఇది ఇద్దరి వ్యక్తుల తప్పే. అతను ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు, కానీ తన పిల్లల ముందు ఓడిపోయాడు.ఆమెను వేడుకకు తీసుకువచ్చి, పిల్లలను, భార్యను అవమానించడం అత్యంత ఘోరమైన విషయం.’ ఇది మరో స్పందన.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?ఒక పిల్లల వైద్యురాలిగా, విడిపోయిన లేదా, విచ్ఛిన్నమైన కుటంబాలలోని పిల్లలు అనుభవించే మానసిక క్షోభ, ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఆమె వ్యాఖ్యలు చేశారని, పిల్లలపై ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనం అంటున్నారు మరికొందరు. ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే? -
తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్కు కొత్త ఛైర్పర్సన్, సభ్యులు నియమితుయ్యారు. ఈ కమిషన్ ఐదేళ్ల పాటు ఉంటుంది. ఛైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శశికళ యాదవ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా షకీరా కూడా సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వు జారీ చేశారు. ఇంతకుముందు మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద ఉన్న విషయం తెలిసిందే. నేరెళ్ల శారదకు ముందు ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఉన్నారు. -
‘యావన్ను హత్య చేయడానికి కారణం అదే’
సికింద్రాబాద్: చిలకలగూడకు చెందిన యావన్ హత్య ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని సికింద్రాబాద్ డీసీపీ రక్షిత స్పష్టం చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ప్లాన్ ప్రకారం హత్య చేశారన్నారు. అమ్మాయి తండ్రి, బాబాయి, బావ, అన్న, కజిన్ బ్రదర్స్ కలిసి యావన్ను హత్య చేసినట్లు గుర్తించామన్నారు. మే 7వ తేదీ జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి వివరాలను డీసీపీ మీడియాకు వెల్లడించారు.మే 7 అర్ధరాత్రి యావన్ హత్య జరిగింది. ఐదు ప్రత్యేక బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసాము.. యావన్, చంద్రికలు స్కూల్ డేస్ నుండి ఫ్రెండ్స్.. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. గతంలో అమ్మాయి కుటుంబ సభ్యులు యావన్ ను హేచ్చరించారు. హత్యకు ఐదు రోజుల ముందే హత్య కోసం నిందితులు ప్లాన్ చేసుకున్నారు. అందరూ కలిసి రెక్కి నిర్వహించారు. A1 అల్లబోయిన సాయి కిరణ్ యువతి బావ.. ప్రధాన నిందితుడు..హత్య కు ప్లాన్ చేశారు. సాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశాం. నిందితులలో ఇద్దరికి గాంజా పాజిటివ్ వచ్చింది ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులతో పాటు ఓ మైనర్ అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. ప్రేమించాడని నరికి చంపారు.. -
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. విచారణకు ప్రత్యేక టీమ్
హైదరాబాద్: పేట్బషీరాబాద్ పీఎస్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. తన కుమార్తెని లైంగికంగా వేధించారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, తనని హనీట్రాప్ చేశారని కరీంనగర్ టూటౌన్ పీఎస్లో భగీరథ్ ఫిర్యాదు చేశారు. భగీరథ్ ఫిర్యాదుతో బాలిక, ఆమె తల్లిదండ్రులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ మేరకు మెమో జారీ చేసింది. ‘‘సైబరాబాద్ కూకట్పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ పెట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 684/2026లో బీఎన్ఎస్ 74, 75 సెక్షన్లు, పోక్సో 12 సెక్షన్ కింద నమోదైన కేసు దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాం.దర్యాప్తు సరైన, నిష్పాక్షిక, వృత్తిపరమైన విధానంలో సాగేటట్లు చూసి, కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిర్లక్ష్యం లేకుండా, ఎటువంటి తప్పుదారి పట్టింపు లేకుండా పరిశీలించాల్సిందిగా ఆమెకు ఆదేశాలు ఇచ్చాం. దర్యాప్తు పురోగతిని డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రతిరోజూ దర్యాప్తు నివేదికపై సంతకం చేసిన అధికారికి తప్పనిసరిగా సమర్పించాలి’’ అని పేర్కొంది.ఇదిలా ఉంటే బండి భగీరథ్ వ్యవహారంపై సీఎం రేవంత్ ఆరా తీస్తున్నారు. కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ సీఎంకు వివరించారు. సమగ్ర విచారణకు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పోలీసులు బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. -
అందుకే మోదీ బంగారాన్ని కొనొద్దన్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బంగారం కొనొద్దని, విమానాల్లో ప్రయాణించొద్దని చెప్పడం ప్రధాని మోదీ వైఫల్యాన్ని సూచిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్స్లో సభ నిర్వహించిన మోదీ దేశ ప్రజలకు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో దీనిపై స్పందించారు.‘‘విదేశాంగ విధానంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ అసమర్థ విధానాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇది బాధ్యతారాహిత్యమైనది. రాహుల్ గాంధీ మొదటి నుంచి అదే చెబుతున్నారు. ప్రతిపక్షాల సూచనలను తీసుకోవాలి.. అఖిలపక్షాలను పిలిచి మాట్లాడాలి. కేంద్రానికి స్పష్టమైన విధానం లేదు. అనుభవరాహిత్యం, అహంకారం వల్లనే దేశాన్నిసంక్షోభంలోకి నెడుతున్నారు. యూరియాను కేంద్రం ఇవ్వాలి.. రాష్ట్ర ప్రభుత్వం పంచాలి’’ అని విమర్శించారు.2029లో జమిలి ఎన్నికలు కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘ఎస్ఐఆర్ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోంది. పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లను తొలగించారు. ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ ఎస్ఐఆర్ ను ప్రయోగిస్తున్నారు.జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదు.. మున్సిపాలిటీల్లో బీజేపీ పరిస్థితి ఏమిటి? జమిలి ఎన్నికలు 2029లో పెట్టడానికి ఆస్కారం ఉంది. బీజేపీకి ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదు. అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించాలి. గవర్నర్ చెప్పిన తేదీన బలనిరూపణ చేయించుకుంటే సరిపోతుంది. బండి సంజయ్ కొడుకు అంశంపైన డీజీపీ, ఇతర అధికారులతో సమీక్ష చేశాను. విచారణ ప్రారంభమైంది.. పోలీసులు చర్యలు తీసుకుంటారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద జరగదు. బాదితులను కలిసి స్టేట్ మెంట్ తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మైనర్ బాలిక కు సంబంధించిన అంశంలో అంతా భాద్యతాయుతంగా ఉండాలి. తుమ్మడి హట్టి పైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేలా చూడాలని ప్రధాని మోదీకి నేను లేఖ రాశాను.తెలంగాణకు కేంద్రం నుంచి ఆశించిన మేరకు సహకారం లేదు. రీజనల్ రింగ్ రోడ్డు నార్డ్ ఫార్ట్ , కాకాతీయ మెగా టెక్స్ టైల్స్, ఎయిర్ పోర్టులు క్లియర్, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ కోసం ఏడీబీ నిధులు, నేషనల్ హై వేలు వచ్చాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవి ముందుకు సాగలేదు. మేం వచ్చాక క్లియర్ చేయిస్తున్నాం. మెట్రో, సదరన్ పార్టు రీజనల్ రింగ్ రోడ్డు ఇలా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. సింగిల్ విండో విధానం తీసుకువచ్చి పరిష్కరించమని ప్రధానిని కోరాం. అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు లేవు. రాజకీయ అంశాలకు తావు లేదు. నేను, మోదీ ప్రస్తావించింది అభివృద్ధిని మాత్రమే. అభివృద్ధి విషయంలో కలిసి పనిచేద్దామని ఆయన చెప్పారు’’ అని తెలిపారు. తమ ఇద్దరి మధ్య జరిగిన ప్రస్తావన అభివృద్ధికి చెందినది మాత్రమేనని.. అందులో రాజకీయాలకు తావులేదని చెప్పారు. -
బండి తనయుడి కేసుపై సీఎం రేవంత్ ఆరా!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడి వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడడంతో భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది కూడా. అయితే.. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ నుంచి సరైన స్పందన కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసుపై స్పందించినట్లు సమాచారం అందుతోంది. సోమవారం డీజీపీ సీవీ ఆనంద్తో భేటీ అయ్యి ఈ కేసుపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ‘‘ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే..ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని డీజీపీని సీఎం ప్రశ్నించారు. అయితే.. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలోనే పోలీసులంతా నిమగ్నమయ్యారని ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. తక్షణమే విచారణ మొదలు పెట్టాలని సీఎం డీజీపీని ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. మైనర్ బాలిక వేధింపులకుగానూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ పైన నమోదు కేసు అయ్యింది. అయితే బాలిక కుటుంబంపై సంచలన ఆరోపణలు చేస్తూ భగీరథ్ కూడా ఫిర్యాదు చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే పోలీసు వర్గాలు ఆ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. తాజా విమర్శల నేపథ్యంలో కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
మోదీకి టీపీసీసీ చీఫ్ కౌంటర్
సాక్షి, నిజామాబాద్: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటిరిచ్చారు. నరేంద్ర మోదీ దేశానికి కాదు.. కేవలం బీజేపీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాగే, తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు ప్రధాని ఎన్ని సార్లు వచ్చిన బీజేపీ బలపడే అవకాశం లేదన్నారు.ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి బహుషా తెలంగాణ పరిస్థితులు తెలియకపోవచ్చు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులిచ్చి ఆదుకోవాల్సిన ప్రధాని కేవలం రాజకీయాలు మాట్లాడటం ప్రజలకు రుచించదు. తెలంగాణ కాంగ్రెస్కు అనుకూలం.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పరిపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావటం ఖాయం అని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో సెక్యులార్ల ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణకు ప్రధాని ఎన్ని సార్లు వచ్చినా బీజేపీ బలపడే అవకాశం లేదు. బీఆర్ఎస్ను ఓడించిన పార్టీ కాంగ్రెస్.. వారితో మాకు కలయిక ఉండదు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ పార్టీకి సమాన దూరంలో ఉంటాయి’ అని క్లారిటీ ఇచ్చారు. -
ఎస్బీఐ బ్యాంకులో భారీగా డబ్బు మాయం..!
హైదరాబాద్: యూసుఫ్గూడ ఎస్బీఐలో రూ.23 లక్షలు మాయమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. యూసుఫ్గూడ ఎస్బీఐలో క్యాష్ ఇన్చార్జ్గా అబ్బిరెడ్డి యాదగిరిరెడ్డి పని చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 7న యూసుఫ్గూడ బ్రాంచిలోని పాత ఏటీఎం స్ధానంలో ఎస్పీఆర్ మిషన్ను ఏర్పాటు చేయాలని బ్యాంకు నిర్ణయించింది. బ్యాంకు రికార్డులో రూ 27.5 లక్షలు ఎంట్రీ చేశారు. బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీయకుండానే తీసినట్లుగా బోగస్ ఎంట్రీలు సృష్టించారు. మరుసటి రోజు యాదగిరి రెడ్డి ఇతర సిబ్బందితో కలిసి ఏటీఎంలోని డబ్బు పెట్టెలను బ్యాంకు స్ట్రాంగ్ రూంకు తరలించారు. బ్యాంకు అధికారులు డబ్బు పెట్టెలను లెక్కించి చూడగా.. నగదులో తేడా వచి్చంది. రూ23 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. సీసీ టీవీ కెమెరాలు పరిశీలించగా.. యాదగిరి రెడ్డి ఉద్దేశపూర్వకంగానే మోసానికి పాల్పడి, డబ్బును కాజేసినట్లు బ్యాంకు అదికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఎస్బీఐ చీఫ్ మేనేజర్ కిరణ్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఔటర్పై రోడ్డు ప్రమాదం ఇద్దరు నటుల దుర్మరణం.!
ఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నోయల్రాజ్ తెలిపిన ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా వేదాయపాలేనికి చెందిన కత్తి భరత్కాంత్ (31), గూడ సాయి త్రిలోక్ (31) షార్ట్ఫిల్మ్ యాక్టర్లు. శనివారం నెల్లూరు నుంచి కారులో హైదరాబాద్ బయలుదేరారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు వెళ్తుండగా.. బొంగ్లూర్ సమీపంలో మితిమీరిన వేగం కారణంగా కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. కారులోని భరత్కాంత్, గూడ సాయి త్రిలోక్ తీవ్రగాయాలతో మృతి చెందారు. -
‘క్లూ’ దొరికింది
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ భార్య తనూజ రంజన్ను పని మనిషితో పాటు మరో ముగ్గురు నేపాలీలు హత్య చేసి, నగదు, నగలతో ఉడాయించిన ఘటనపై పోలీసులు సీరియస్గా దృష్టి సారించారు. నిందితులు పుణెలో ఉన్నట్లు సమాచారంతో గ్యాంగ్ను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హత్య జరిగిన రాత్రి నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్లో తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలులో వెళ్లి పుణెలో దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పది పోలీసు బృందాలు అక్కడ జల్లెడ పడుతున్నాయి. కాగా.. నిందితురాలు కల్పన లక్నోలో పని చేస్తున్న సందర్భంలో కూడా నేరాలకు పాల్పడినట్లు.. పథకం ప్రకారం హైదరాబాద్కు వచ్చి సంపన్నుల ఇళ్లలో పని చేస్తూ వారి కదలికలను గమనిస్తూ అవకాశం రాగానే అందినకాడికి దండుకుంటున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. లక్నోలో కల్పన పని చేసిన ఇంట్లోనూ ఓ పోలీసు బృందం విచారణ చేపట్టింది. మూడు బృందాలు నేపాల్ సరిహద్దులో తిష్టవేశాయి. ముంబై, ఢిల్లీ, కోల్కతాలో కూడా మరో మూడు బృందాలు నిఘా పెట్టి నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత నిందితులు పుణె చేరుకోగా అక్కడ నుంచి ఎక్కడిడి ప్రయాణం కాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పుణె చుట్టూ బృందాలు నిఘా పెట్టాయి. వినయ్ రంజన్ ఇంట్లో ఈ గ్యాంగ్ 225 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. నగదు ఎంత చోరీ అయిందనేది ఇంకా లెక్క తేలలేదు. నేడో, రేపో నిందితులను పట్టుకునే దిశలో పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. నిందితుల వద్ద ఎలాంటి సెల్ఫోన్లు లేవని పోలీసులు గుర్తించారు. రెండు సెల్ఫోన్లు హైదరాబాద్లోనే పడేసిపోయినట్లు సమాచారం. నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్ల మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు మృతిచెందారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వేదాయపాలేనికి చెందిన కత్తి భరత్కాంత్(31), గూడ సాయి త్రిలోక్(31) అనే ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు శనివారం సాయంత్రం నెల్లూరు నుంచి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు వస్తుండగా బొంగ్లూర్ ఎగ్జిట్–12 సమీపంలో కారు డ్రైవర్ అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఎదురెదురుగా వెళ్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న కత్తి భరత్కాంత్, గూడ సాయి త్రిలోక్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం తెల్లవారుజామున 3.20గంటల సమయంలో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ అధికారి శ్రీకాంత్ ఇచి్చన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
మార్క్ఫెడ్లో మక్కతిక
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకునే మార్క్ఫెడ్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఖరీఫ్ సీజన్లో మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన 3.97 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను విక్రయించేందుకు పిలిచిన టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. రైతుల నుంచి రూ. 2,400కు క్వింటాలు చొప్పున కొనుగోలు చేసిన 3.97 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను రూ. 1,400 నుంచి రూ. 1,500లోపు అంటే దాదాపు రూ. 1000 నష్టానికి బల్క్గా విక్రయించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పౌల్ట్రీ రైతులు రూ. 1,600కు క్వింటాలు చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినా గోదాములవారీగా చిన్న వ్యాపారులు రూ. 1,600 నుంచి రూ. 1,700లోపు మక్కలు కొనేందుకు సిద్ధపడినా ఆ టెండర్లను రద్దు చేసి మరీ బల్క్ టెండర్ల ద్వారా బడా సంస్థలకు కట్టబెట్టేందుకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో పాల్గొన్న ఐదు బడా కంపెనీలు కనీస మద్దతు ధరకన్నా రూ. 1,000 వరకు తక్కువకు కోట్ చేసినట్లు సమాచారం. నేడో, రేపో ఆయా సంస్థలకు టెండర్లు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతుండగా, ప్రభుత్వానికి ఉప్పందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హఠాత్తుగా మార్క్ఫెడ్ ఎండీ వి. శ్రీనివాస్రెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి రాహుల్ రాజ్ను మార్క్ఫెడ్ ఎండీగా నియమించింది. రూ. 950 కోట్ల విలువకు కొనుగోలు చేసి .... రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగవుతోంది. అందులో భాగంగానే గత ఖరీఫ్లో దాదాపు 9 లక్షల ఎకరాల్లో సాగు చేయగా భారీ ఎత్తున మక్కలు మార్కెట్కు వచ్చాయి. మార్కెట్లో అప్పట్లో ధర రూ. 2,000 కూడా లేకపోవడంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ. 2,400 చొప్పున 3.97 లక్షల మెట్రిక్ టన్నులను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందుకోసం రైతులకు దాదాపు రూ. 950 కోట్ల వరకు వెచ్చించిన మార్క్ఫెడ్... రవాణా, గోనె సంచులు, గోదాముల్లో నిల్వ కోసం భారీగానే వెచ్చించింది. కొనుగోలు చేసిన మక్కలను విక్రయించే విషయంలో మార్క్ఫెడ్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. మార్కెట్లో ధర లేదనే కారణంగా విక్రయించే విషయంలో మీనమేషాలు లెక్కించిన అధికారులు.. మార్చిలో గోదాములవారీగా టెండర్లను ఆహా్వనించారు. దాదాపు 200 గోదాముల్లో మక్కలను నిల్వ చేయగా గోదాములవారీగా పిలిచిన టెండర్లలో పాల్గొన్న చిన్న వ్యాపారులు రూ. 1,600 నుంచి రూ. 1,700 వరకు వెచ్చించి మక్కలు కొనేందుకు ముందుకొచ్చారు. కానీ అధికారులు హఠాత్తుగా ఆ టెండర్లను రద్దు చేశారు. వెంటనే పౌల్ట్రీ వ్యాపారుల ప్రతినిధులు మార్క్ఫెడ్ అధికారులను సంప్రదించి క్వింటాలుకు రూ. 1,600 చొప్పున మక్కలను కొంటామని, పౌల్ట్రీ దానా కోసం ఇతరుల నుంచి కొనే బదులు మార్క్ఫెడ్ నుంచే తీసుకొంటామని ముందుకొచ్చారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోకుండా బల్క్ టెండర్లు పిలిచారు. రూ. 100 కోట్లపైన టర్నోవర్ నిబంధనతో... బల్క్ టెండర్ల ద్వారా ఒకేసారి మక్కలను విక్రయించి గోదాములను ఖాళీ చేస్తామని చెప్పిన మార్క్ఫెడ్ అధికారులు.. ఈ మేరకు గత నెలలో మళ్లీ టెండర్లు పిలిచారు. ఇందుకోసం రూ. 100 కోట్లపైన టర్నోవర్ కలిగిన సంస్థలే పాల్గొనాలనే నిబంధన విధించారు. దీంతో కేంద్రీయ బండార్, నాకాఫ్, వి–కేర్, మంచుకొండ ఆగ్రో ఇండస్ట్రీస్, అమరావతి కంపెనీలు ముందుకొచ్చాయి. 2022–23 రబీలో మిల్లర్లు మాయం చేసిన రూ. 7,000 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రాబట్టేందుకు 2023లో పిలిచిన టెండర్లలో పాల్గొన్న కంపెనీలే ఈ మక్కల బల్క్ టెండర్లలో పాల్గొనడం గమనార్హం. అయితే ధాన్యం రికవరీకి బదులు డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఈ కంపెనీలు సగంలోనే చేతులెత్తేశాయి. ఈ కంపెనీలే తిరిగి మక్కల టెండర్లలో పాల్గొని క్వింటాలుకు రూ. 1,400 నుంచి రూ. 1,500 చొప్పున కొనేందుకు బిడ్లు వేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో మార్క్ఫెడ్లో జరుగుతున్న మక్కల టెండర్ల దందా గురించి సర్కార్కు ఫిర్యాదులు అందడంతో ప్రాథమిక విచారణ జరిపినట్లు తెలియవచ్చింది. అందులో భాగంగానే ఆకస్మాత్తుగా మార్క్ఫెడ్ ఎండీ వి. శ్రీనివాస్రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో మక్కల టెండర్ల కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. -
ఇంటర్ అడ్మిషన్లు పాత పద్ధతిలోనే..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ప్రవేశాలు 2026–27 విద్యా సంవత్సరానికి పాత పద్ధతిలోనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉందని, ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండటంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ను రద్దు చేసి సీబీఎస్ఈలో తరహాలో 11, 12 తరగతులను పాఠశాల విద్యలోనే కొనసాగించాలని, ఫలితంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరడం లేదు. అక్కడితోనే చదుకు ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ను వేరుగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి గతంలో అధికారులకు సూచించారు. ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా తన నివేదికలో పేర్కొంది. ఇటీవల ఇంటర్మీడియట్లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. జూనియర్ కాలేజీల యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో సీఎం, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.వి.శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణాలతో ఆదివారం సమీక్షించారు. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడంతో ముడిపడిన పలు సాంకేతిక సమస్యలను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం తాజా ఆదేశాలతో అతి త్వరలో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసే అవకాశం ఉంది. -
అబ్కే బార్ తెలంగాణ
బెంగాల్లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదు.. ఒక రాజకీయ నీతి పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారింది. ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకు వెళ్తోంది. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందు అబద్ధపు హామీలిస్తారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు.సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాక తెలంగాణలోనూ ఆ గెలుపు ప్రకంపనలు కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విశ్వాసఘాతుకం, హామీల అమల్లో వైఫల్యం, కుటుంబ రాజకీయాల పట్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా... మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో బీజేపీవైపు గాలిమార్పు స్పష్టంగా గోచరిస్తోందన్నారు. ‘అబ్కీ బార్ తెలంగాణ’ (ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం) అంటూ సభికులతో మోదీ నినాదాలు చేయించారు. దశాబ్దాల కింద బీజేపీకి ఎన్నో రాష్ట్రాల్లో ఆదరణ లభించలేదని, అయితే దేశవ్యాప్తంగా బీజేపీకి రెండుసీట్లు ఉన్నప్పుడు ఒకటి తెలంగాణలో వచ్చిందని గుర్తుచేశారు. ఆ విధంగా బీజేపీ చరిత్రలో తెలంగాణకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. ఇప్పుడు దేశం నలుమూలలా బీజేపీపై ప్రజల ఆశీర్వాదం పెరుగుతోందని, బీజేపీ గుడ్గవర్నెన్స్ మోడల్పై ఎన్నికల్లో ప్రజలు ఓటు ముద్రవేశారన్నారు. తెలంగాణ అలాంటి ప్రదేశమైనందున ఇప్పుడు 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారని, ఇక అధికారానికి రావడమే తరువాయి అని చెప్పారు. బీజేపీ అభివృద్ధి మోడల్పై విశ్వాసం దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి మోడల్, సుపరిపాలనపై మళ్లీ మళ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని మోదీ చెప్పారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా అదే విషయం స్పష్టంగా చెబుతున్నారన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, ప్రజలను ఏళ్ల పాటు బంధించిన కుటుంబ, నియంతృత్వ రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అవినీతి, కుటుంబవాదం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే రాజకీయాలకు మారుపేరుగా మారిందని ధ్వజమెత్తారు. అదే మార్గంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా నడిచిందని, ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరిస్తున్నారని అన్నారు. అయితే బెంగాల్లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదని, ఒక రాజకీయ నీతి పరాజయం పాలైందని మోదీ చెప్పారు. ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా కాంగ్రెస్ది విభజన రాజకీయం కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకెళ్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ను ‘ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్’ (ఎంఎంసీ)గా అభివరి్ణస్తున్నారని ఎద్దేవా చేశారు. మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా దేశం ఎన్నో నష్టాలు చవిచూసిందని, తెలంగాణ కూడా దశాబ్దాల పాటు బాధలు అనుభవించిందన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు మావోయిస్టులకు భావజాల పరంగా మద్దతు ఇవ్వడం వల్లే ఈ సమస్య ఇంతకాలం కొనసాగిందని చెప్పారు. తెలంగాణ పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టు ఉగ్రవాదాన్ని చాలాకాలం క్రితమే అంతం చేసేవారన్నారు. ‘మావోయిస్టు తీవ్రవాదంతో దేశానికి ఎంతో నష్టం జరిగింది. తెలంగాణలోనూ వారి తీవ్రవాద చర్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మావోవాది అంతిమ ఘడియలు సమీపించినా నక్సల్వాదిని రక్షించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ గత 12 ఏళ్లు కేంద్రంతోపాటు కలిసి పనిచేసే ఉంటే ఎప్పుడో మావోయిస్టుల నుంచి విముక్తి లభించి ఉండేది. ఎన్డీఏ ప్రభుత్వ కృషితో ఇప్పుడు తెలంగాణ మావోయిస్టుల నుంచి విముక్తి దిశగా వెళ్తోందని చెప్పారు. ముందుచూపుతో, వికసిత్ తెలంగాణ సాధన దిశగా కృషిచేస్తోందన్నారు. బీజేపీ అభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి పెడుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ‘ప్రస్తుతం దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ సీఎంలు ఉన్నారు. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందుగా అబద్ధపు హామీలు ఇస్తారు.. ఆకాశం నుంచి చుక్కలు తెంచి ఇస్తామని చెబుతారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు’ అని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, తెలంగాణలో కూడా అదే జరుగుతోందని దుయ్యబట్టారు. -
కొంగొత్త నేరస్తులు
సాక్షి, హైదరాబాద్: ముందుగా రెక్కీ, పక్కా స్కెచ్, అదును కోసం ఎదురుచూపులు, పకడ్బందీగా అమలు.. ఇదీ ఒకప్పుడు నేరగాళ్లు అనుసరించిన పంథా. కానీ ఇటీవల కాలంలో తరచూ నేరాలకు పాల్పడేవారి స్థానంలో కొత్త నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. హత్య, హత్యాచారం.. మరేదైనా ఘరానా నేరం.. వాటిలో నిందితులంతా దాదాపుగా కొత్తవారే ఉంటున్నారు. వారికి ఎలాంటి నేరచరిత్ర ఉండట్లేదు. వ్యక్తిగత కక్షలతో కొందరు.. ప్రతీకారం తీర్చుకోవడానికి మరికొందరు నేరగాళ్లుగా మారుతున్నారు. రాష్ట్రంలో నేరాలకు పాల్పడి పోలీసులకు చిక్కుతున్న వారిలో 95 శాతం మంది కొత్త వాళ్లే ఉంటున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2024కుగాను విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.తెలంగాణలో వివిధ చట్టాల కింద నమోదైన నేరాల్లో మొత్తం 98,351 మంది పట్టుబడగా వారిలో 92,389 మంది తొలిసారి నేరం చేసి చిక్కిన వారేనని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఐపీసీ, బీఎన్ఎస్ చట్టాల కింద నమోదైన నేరాల్లో 79,698 మంది నేరస్తులు అరెస్టవగా వారిలో 74,801 మంది తొలిసారి అరెస్టయిన నేరస్తులే. వారిలోనూ తొలిసారి పట్టుబడ్డ జువెనైల్స్ 1,565 మంది ఉన్నారు. అలాగే ప్రత్యేక, స్థానిక చట్టాలు (ఎస్ఎల్ఎల్) కింద నమోదైన నేరాల్లో అరెస్టయిన నేరస్తుల సంఖ్య 18,653 కాగా వారిలో 17,588 మంది తొలిసారి చిక్కిన వారే ఉన్నారు.యువకులు ఎక్కువగా ఆర్థిక అవసరాల కోసం నేరాల బాట పడుతున్నారు. సాధారణంగా పాత నేరగాళ్లపై పోలీసుల నిఘా ఉంటుంది. కానీ కొత్త నేరగాళ్ల విషయంలో అలా కుదరట్లేదు. ముఖ్యంగా వ్యక్తిగత కక్షలతో నేరాలకు పాల్పడే వారిని పసిగట్టడం సవాల్గా మారుతోంది. కొత్త నేరస్తుల ఫొటోలు, వేలిముద్రల వంటివి పోలీసు రికార్డుల్లో ఉండకపోవడం, సాంకేతిక ఆధారాలు లేకపోవడంతో కొత్త నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులకు అడుగడుగునా సవాళ్లే ఎదురవుతున్నాయని నివేదిక పేర్కొంది. -
పారదర్శకత.. ఉత్తమ పనితనం
వికారాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల పరిధిలోని మో త్కుపల్లి గ్రామ పంచాయతీ సుపరిపాలనలో జాతీయ పురస్కారానికి ఎంపికయింది. రికార్డులు పూర్తి స్థాయి లో ఆన్లైన్లో నిర్వహించటం, నిధుల ఖర్చులో పారదర్శకత, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడటం, తరచూ సమావేశాల ద్వారా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను పాలనలో భాగస్వాములను చేయటం, రికార్డుల్లో నమోదైన అంశాలు వాస్తవంలోనూ ప్రతిబింబించటంలాంటి అంశాలు ఈ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక కావటంలో కీలక భూమిక వహించాయి. ఈ గ్రామంలో 703 కుటుంబాలు, 2,090 ఓటర్లు, 2,576 మంది జనాభా ఉన్నారు. అవార్డు వరకు తీసుకువెళ్లిన అంశాలివే.. మోత్కుపల్లి గ్రామంలో జరిగిన ప్రగతి, గ్రామంలో తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసే పద్ధతి, పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం, వాటిని వాడటం, మురుగు గుంతలు లేకుండా గ్రామంలో చేపడుతున్న చర్యలు, రోడ్ల పరిశుభ్రత, మురుగు కాల్వల పరిశుభ్రత, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, గ్రామంలో నిర్వహించిన హరితహారం.. అందులో బతికి ఉన్న మొక్కల శాతం, ఇంకుడు గుంతలు, విద్యా, వైద్యం, పౌష్టికాహారం, ఇమ్యునైజేషన్ తదితర అంశాలు కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆకర్షించాయి.వీటితో పాటు గ్రామంలో అక్షరాస్యత పెంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలను సైతం పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే గ్రామంలో ఖర్చు చేసిన నిధులు, పన్నుల వసూలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, వారికందిస్తున్న పౌష్టికాహారం, ఉపాధి హామీలో వందరోజులు పని చేసిన కుటుంబాలు, లబ్ధి పొందిన కుటుంబాలు.. వీటన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్ర ఉన్నతాధికారులు గ్రామాన్ని జాతీయ అవార్డు కోసం ఎంపిక చేశారు. మాపై బాధ్యత మరింత పెరిగింది మా గ్రామానికి జాతీయ స్థాయి అవార్డు రావటం సంతోషంగా ఉంది. దీంతో మాపై బాధ్యత మరింత పెరిగింది. గ్రామ అభివృద్ధిలో అధికారులు, ఉద్యోగులు, జీపీ సభ్యులు, ప్రజలు.. ఇలా అందరి సహకారం ఉంది. అవార్డు రావటంలో గత సర్పంచ్, వార్డు సభ్యుల కృషి కూడా ఎంతో ఉంది. అవార్డు ద్వారా వచ్చే నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ది చేస్తాం. – అమృతమ్మ, సర్పంచ్, మోత్కుపల్లి -
రేపట్నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయి. వాతావరణంలో నెలకొన్న మార్పులతో వారం రోజులుగా సాధారణం, అంతకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయి. ఆదివారం రాష్ట్రంలో చాలాచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదు కాగా.. మంగళవారం నుంచి క్రమంగా పెరిగి సాధారణం కంటే 2 నుంచి 4డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది.ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వివరించింది. ఈ వారాంతం వరకు ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్లో 41.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 22.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సోమవారం ఆదిలాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. -
సంపూర్ణంగా సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం ఎలాంటి వివక్ష చూపదని హామీ ఇచ్చారు. తెలంగాణ వికసిస్తేనే దేశం వికసిస్తుందనే నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోదీ.. హెచ్ఐసీసీ వేదికగా రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణను దేశ ఆర్థిక వృద్ధికి కీలక శక్తిగా అభివర్ణించిన ఆయన ఇవి కేవలం ప్రాజెక్టులు కాదు.. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు అని పేర్కొన్నారు. అంతకు ముందు నిధుల కేటాయింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఛలోక్తులు విసిరారు.‘సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఇది వింటున్నారా?‘ అంటూ తెలంగాణకు కేంద్రం ఇస్తున్న భరోసాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను మోదీ గుర్తు చేశారు. ‘పదేళ్లుగా గుజరాత్కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. కేంద్రం పదేళ్లలో గుజరాత్కు ఎంత ఇచ్చిందో రేవంత్రెడ్డి చెప్పాలి. ఆ రాష్ట్రంతో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్తో సమానంగా నిధులిస్తే ఇప్పుడు వచ్చే దాంట్లో మీకు సగమే వస్తాయి. అన్ని రాష్ట్రాలను కేంద్రం ఐక్యంగా ముందుకు తీసుకెళ్తోంది.తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉంది’అని మోదీ అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని ముఖ్యమంత్రికి సూచించారు. మౌలిక సదుపాయాలు, హైవేల అభివృద్ధి కోసం కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, దీనివల్ల తెలంగాణకు భారీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం నుంచి సహకారం లభించింది. ఇప్పుడు అదే భావనతో తెలంగాణకు కూడా సహకరిస్తున్నాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు స్థానం ఉండకూడదు’అని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ను వికసిత్ భారత్లో భాగం చేద్దామంటూ పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు అభివృద్ధే ఎజెండా ‘ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పుడూ భేదభావం చూపలేదు. గత పదేళ్లలో తెలంగాణలో నిర్మించిన జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, మౌలిక సదుపాయాలే ఇందుకు నిదర్శనం’అని ప్రధాని పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలు ముగిశాయని.. ఇక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల అభ్యున్నతిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో భుజం భుజం కలిపి నడిస్తే తెలంగాణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు. సైబరాబాద్ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, ఇది దేశంలోనే అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని ప్రశంసించారు.వరంగల్లో ఏర్పాటవుతున్న పీఎం మిత్ర పార్క్ (కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్) తెలంగాణ పారిశ్రామిక రంగానికి గేమ్ చేంజర్గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ చేనేత కళాకారుల ప్రతిభ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ పార్క్ ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. స్థానికంగా తయారయ్యే వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్లకు చేరతాయి’అని చెప్పారు. దీంతో తెలంగాణ టెక్స్టైల్ రంగంలో ప్రధాన హబ్గా ఎదుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ పాత్ర అత్యంత కీలకం హైదరాబాద్–పనాజీ కారిడార్, జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి వంటి ప్రాజెక్టులను ప్రస్తావించిన ప్రధాని.. ‘ఇవి కేవలం రోడ్లు కాదు.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే ఇంజిన్లు’అని వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే పెట్టుబడులు పెరుగుతాయని.. తద్వారా యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో తెలంగాణ పాత్ర అత్యంత కీలకమని మోదీ అన్నారు.మాటకు మాట... సీఎం రేవంత్రెడ్డి: మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకారంతో గుజరాత్ మోడల్ను అభివృద్ధి చేశారు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నాటి మన్మోహన్ సింగ్ ఇచ్చిన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నా..’ప్రధాని మోదీ: పదేళ్లుగా గుజరాత్కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. కేంద్రం పదేళ్లలో గుజరాత్కు ఎంత ఇచ్చిందో రేవంత్రెడ్డి చెప్పాలి. ఆ రాష్ట్రంతో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్తో సమానంగా నిధులిస్తే ఇప్పుడు వచ్చే దాంట్లో మీకు సగమే వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే బడ్జెట్ రూ. 1,000 కోట్లు కూడా దాటేది కాదు, కానీ ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.5,500 కోట్లు కేటాయించాం. మీరు కంటున్న కలలు చేరుకోవాలంటే మాతో కలసి రండి.. లేకపోతే ఎప్పటికీ అది సాధ్యం కాదు. -
మీ పెద్ద మనసు చాటుకోండి
సాక్షి, హైదరాబాద్: ‘జాతీయ భద్రత, దేశ అభివృద్ధే మనకు అత్యంత ప్రాధాన్యం. ముందు భారతదేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ.. ఇదే మా నినాదం.. ఇదే మా విధానం’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హెచ్ఐసీసీలో జరిగిన అభివృద్ధి ఉత్సవంలో సీఎం ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలను పక్కన పెట్టి కేంద్రంతో కలిసి నడిచేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ తరచూ ప్రధానికి పెద్ద మనసు ఉందని చెబుతుంటారని.. ఆ పెద్ద మనసుతో తెలంగాణ పెండింగ్ పనులు, ప్రతిపాదనలను వెంటనే ఆమోదించాలని కోరారు.వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా దేశాన్ని 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై మాట్లాడినప్పుడు రాష్ట్రం కోసం ’తెలంగాణ రైజింగ్–2047’ను రూపొందించామని, ఈ క్రతువులో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి తమకు సహకారం అందడం లేదని, ప్రధాని మోదీ రాకతో తెలంగాణ అభివృద్ధికి కొత్త రూపు వస్తుందని రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని, తెలంగాణ అభివృద్ధికి పండగ లాంటిదన్నారు. మన్మోహన్ సింగ్ స్ఫూర్తిని కొనసాగించండి.. ‘మీరు (మోదీ) గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకారంతో గుజరాత్ మోడల్ను అభివృద్ధి చేశారు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నాడు మన్మోహన్ ఇచి్చన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నా’నని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 2034 నాటికి రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని, దీనికి కేంద్రం తోడ్పాటు అత్యవసరమని విన్నవించారు. మీరు సమయం కేటాయించండి దేశాభివృద్ధిలో మహానగరాల పాత్ర కీలకమని, ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా మెట్రో నగరాల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ సూచించారు. దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే ఈ మహా నగరాలను అభివృద్ధి చేయాలన్నారు. జాతీయ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు వేగవంతం చేసేలా ప్రధాని కార్యాలయంలో ఈ రాష్ట్రాల కోసం ప్రత్యేక ’సింగిల్ విండో టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.‘నా రాష్ట్రం, నా ప్రజల కోసం సానుకూల నిర్ణయాల విషయంలో నేను మిమ్మల్సి, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను. మా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు మీ అత్యవసర అనుమతులు, ఆమోదాలు అవసరం. మూసీ నది, మెట్రో రైలు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్–మచిలీపట్నం వరకు 12 వరుసల రహదారికి సంబంధించి రెండు గంటలపాటు మీరు సమయం కేటాయించి సమీక్షించాలి’అని మోదీని రేవంత్ కోరారు.రాజకీయాలకన్నా రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎప్పుడూ వివక్ష చూపదు’అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. హెచ్ఐసీసీలో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకు రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా తెలంగాణలో రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు అంకురార్పణ జరగడం రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టమన్నారు.ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు మూడేళ్ల క్రితమే కేంద్రం పచ్చజెండా ఊపిందని, భూసేకరణ పూర్తయి కేబినెట్ ఆమోదం లభించగానే పనులు పరుగులు పెడతాయని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతోందని, ముఖ్యంగా సికింద్రాబాద్ స్టేషన్ను రూ. 220 కోట్లతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్థాయి సౌకర్యాలతో ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు.2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నది మోదీ సంకల్పమని, ఈ మహా యజ్ఞంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ పెండింగ్ పనులను వేగవంతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అప్పటి వరకు బంగారం కొనుగోలు చేయొద్దు : ప్రధాని మోదీ
సాక్షి,హైదరాబాద్: బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం అత్యంత ఖరీదైందిగా మారింది. అందుకే ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకపోవడం మంచిదన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు మోదీ హాజరయ్యారు.ఈ సభలో మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్పై తీవ్రంగా పడింది. దీంతో పెట్రోల్, డిజీల్ ధరలు తీవ్రంగా పెరిగాయి.గ్యాస్,యూరియా ధరలు అమాంతం పెరిగినప్పటికీ ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ధరలు పెంచడం లేదు. "ప్రస్తుత కష్ట సమయాల్లో ప్రజలంతా సంయమనం పాటించాలి. విదేశీ ప్రయాణాలు, దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలి. పెట్రోల్, డీజిల్ను పరిమితంగా వినియోగించాలి. ప్రజా రవాణానే అధికంగా వాడాలి" అని మోదీ అన్నారు.ప్రజలంతా ఎలక్టిక్ వాహనాల వైపు మళ్లాలని, వాటినే వినియోగించాలని కోరారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని ఉక్రెయిన్- రష్యా యుద్ధం, పశ్చిమాసియా యుద్ధాలతో సరఫరా చైన్ దెబ్బతింది అని మోదీ అన్నారు. ఆ నష్టాన్ని కేంద్రమే భరిస్తోందని తెలిపారు. వంట నూనెలు ఎరువుల మందులను పూర్తిగా తగ్గించాలని పురుగుల మందులు, ఎరువుల వినియోగాన్ని తక్కువ చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
అందుకే బీజేపీ మళ్లీ మళ్లీ గెలుస్తోంది: ప్రధాని మోదీ
హైదరాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని మాట్లాడారు. మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘బెంగాల్లోని విజయ ఉత్సాహం తెలంగాణలోనూ కనపడుతోంది. తొలిసారి బెంగాల్లో అఖండ విజయం సాధించాం.పుదుచ్చేరిలోనూ మరోసారి ఎన్డీఏనే గెలిచింది. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. నిన్న నేను బెంగాల్లో ఉన్నాను. తొలిసారి అక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ చారిత్రాత్మక విజయోత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది. ఇక్కడ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉత్సాహంతో నిండిపోయి ఉన్నారు. ఈ రోజు దేశం నలుమూలలా భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం నిరంతరం పెరుగుతోంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి నమూనాకు ప్రజలు మళ్లీ మళ్లీ తమ ఆమోద ముద్ర వేస్తున్నారు. నిన్న నేను బెంగాల్లో ఉన్నాను. తొలిసారి అక్కడ బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో ప్రతి బీజేపీ కార్యకర్త ఉత్సాహంతో నిండిపోయి ఉన్నారు. దేశం నలుమూలలా బీజేపీకి ప్రజల నుంచి ఆరదణ నిరంతరం పెరుగుతోంది. బీజేపీ అభివృద్ధి నమూనాకు ప్రజలు మళ్లీ మళ్లీ ఆమోద ముద్ర వేస్తున్నారు. పచ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంతో దేశం అంతా సంబరాలు జరుగుతున్నాయి. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని పెంచింది. పశ్చిమ బెంగాల్ను సంకెళ్ల బందీ నుంచి విడదీశాం. ఇక తెలంగాణలో అబ్ కీ బార్ బీజేపీ సర్కార్. దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలో మాత్రమే ఉంది. అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ నైజం. తెలంగాణలో అబద్ధాలతో ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కంటే లెఫ్ట్ అయింది. కాంగ్రెస్ ముస్లిం లీగ్ కంటే ఎక్కువగా కాంగ్రెస్ ముస్లిం లీగ్ అయింది. మావోయిస్టులను కాంగ్రెస్ ఎన్నో ఏండ్ల నుంచి రక్షిస్తుంది. తెలంగాణ పోలీస్ కేంద్రంతో కలిసి పనిచేసి ఉంటే మావోయిస్టులు ఎప్పుడో ఖతం అయ్యేవారు. కొంత ఆలస్యం అయినా మావోయిస్టులు ఖతం అయ్యారు. కొత్త విజన్, ఆలోచన, వికసిత్ తెలంగాణ పేరుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది’’ అని తెలిపారు . -
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎదుర్కొలేక నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.నేను పార్టీ తలవంచే పనిని నేను చేయను.చేతకాని దద్దమ్మలు నన్ను ఇబ్బంది పెట్టలేరు. నేను భయపడటానికి ఫామ్ హౌస్లో ఎలుకని కాదు. సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చాను’ అని వ్యాఖ్యానించారు. -
‘‘రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్ అన్నారు.. నేను కూడా..’’
హైదరాబాద్: ‘‘రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్రెడ్డి అన్నారు. నేను కూడా రాజకీయాలు మాట్లాడబోను’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చమత్కరించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెచ్ఐసీసీలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మోదీ ప్రసంగానికి ముందు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఆ సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యను గుర్తు చేస్తూ మోదీ పై విధంగా వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా చిరునవ్వులు చిందించారు.కాగా, మోదీ ప్రసంగిస్తూ.. ‘‘గుజరాత్కు యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో తెలంగాణకు అంతే నిధులు ఇస్తాం. దీంతో తెలంగాణకు అందుతున్న నిధుల్లో సగం కోత పడుతుంది. కాబట్టి మీరు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నారో అది సాధ్యం కాదు. మీరు కూడా నాతో కలిసి రండి సైబరాబాద్ అభివృద్ధికి వేల కోట్లు రూపాయలు కేటాయించాం. తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకే రూ.5,500 కోట్లు రైల్వే పనులకు కేటాయించాం. దేశంలో టెక్స్టైల్ రంగానికి ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. వరంగల్ పీఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టెక్స్టైల్స్ రంగానికి ఊతమిస్తుంది.అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఇప్పుడు తెలంగాణ రైల్వే బడ్జెట్ ఎన్నో రెట్లు పెరిగింది. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. 2014లో ఉమ్మడి ఏపీలో రైల్వే బడ్జెట్ రూ.1000 కోట్లు మాత్రమే. హైదరాబాద్ అభివృద్ధికి వేలాది కోట్లు కేటాయించాం. రోడ్లు, రైల్ కనెక్టివిటీని పెంచాం. తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.’’ అని చెప్పారు. -
అదే మా లక్ష్యం.. హైదరాబాద్లో మోదీకి చెప్పిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేశ ఎకానమీని 2047 నాటికి 30 ట్రిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెచ్ఐసీసీలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను నంబర్ 1గా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఫ్యూచర్సిటీ, మూసీనది అభివృద్ధికి ప్రధాని మోదీ సహకారం అవసరమని అన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి అభివృద్ధిపై దృష్టిపెడతామని చెప్పారు. తెలంగాణను నంబర్ 1 చేయడానికి రైజింగ్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు.మరోవైపు, గతంలో ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలకు వస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి రాలేదని కిషన్ రెడ్డి చెప్పారు. 2014కు ముందు రోడ్లు ఎలా ఉండేవి?ఇప్పుడు ఎలా ఉన్నాయి? అని అన్నారు. త్వరలోనే రీజనల్ రింగ్రోడ్ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. -
‘బండి సంజయ్ కుమారుడి ఎపిసోడ్.. 36 గంటలైనా కేసు లేదా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు విషయంలో రాజకీయం హీటెక్కింది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై పోక్సో కేసు నమోదు చేయడంలో పోలీసుల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం బాధితురాలు పోలీస్ స్టేషన్కు వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా..‘బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?. కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా? పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి @revanth_anumula దీనికి సమాధానం చెప్పాలి.రాష్ట్రంలో కాంగ్రెస్,…— Harish Rao Thanneeru (@BRSHarish) May 10, 2026 డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతబండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు ఆదివారం మెరుపు ధర్నా చేశారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను పలువురు మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలుబండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలు.#pocso #bandisanjaypic.twitter.com/8akltWzosD— ఉప్పిడి పిండి (@bharathbunny27) May 10, 2026 -
హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఇవాళ ఆ రూట్లలో వెళ్లొద్దు!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2,000 మంది శాంతిభద్రతల పోలీసు సిబ్బంది, 620 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బందితో పాటు ప్రత్యేక యూనిట్లను మోహరించాయి. పరేడ్గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.👉ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..⇒బేగంపేట నుంచి సంగీత్ వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్– ప్యాట్నీ– క్లాక్ టవర్ మీదుగా సంగీత్ చౌరస్తాకు మళ్లిస్తారు. సంగీత్ నుంచి బేగంపేట వెళ్లే వాహనాలకూ ఇదే మార్గంలో మళ్లింపు ఉంటుంది.⇒బేగంపేట నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్, ప్యాట్నీ ఫ్లైఓవర్ల మీదుగా సెయింట్ జాన్స్, ఏఓసీ మార్గాల నుంచి మళ్లిస్తారు. ⇒బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను ఫతేనగర్, అమీర్పేట, పంజాగుట్ట నుంచి బేగంపేట మార్గంలోకి మళ్లిస్తారు.⇒బేగంపేట నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయంగా రసూల్పురా జంక్షన్, మినిస్టర్ రోడ్డు రాణిగంజ్, సికింద్రాబాద్ వైపు వెళ్లాలి.⇒సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలు క్లాక్టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ – సీటీఓ మీదుగా బోయిన్పల్లి వైపు మళ్లిస్తారు.⇒ట్యాంక్ బండ్ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ నుంచి సీటీఓ టాడ్బంద్– డైమండ్ పాయింట్ మార్గాల్లో మళ్లిస్తారు.👉ఈ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్.. ⇒నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ నుంచి వచ్చే వాహనాలకు ఐఏఎల్, ఆర్జీఐ స్టేడియం, ఉప్పల్ భగాయత్, రైల్వే డిగ్రీ కళాశాల, ఆర్ఆర్సీ గ్రౌండ్స్ వద్ద పార్క్ చేయాలి.⇒నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ మార్గాల నుంచి వచ్చే వాహనాలను కంటోన్మెంట్ పరిధిలోని దోభీఘాట్, ఇంపీరియల్ గార్డెన్స్,బోయిన్పల్లి మార్కెట్ యార్డు ఆవరణలో నిలపాలి.⇒మెహిదీపట్నం, మహబూబ్ నగర్, కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ స్టేడియం, బస్భవన్, నిజాంకాలేజ్, పబ్లిక్ గార్డెన్స్ ఆవరణలో పార్కు చేయాలి.⇒సంగారెడ్డి, హైటెక్ సిటీ నుంచి వచ్చే వాహనాలను నల్లగుట్ట, నెక్లెస్ రోడ్డు మార్గంలో పార్కు చేయాలి. -
భర్త కదలికలు ప్రియుడికి తెలిసేలా సీసీ కెమెరాలు
హైదరాబాద్: ఓ వ్యక్తిపై భార్యతోపాటు ఆమె ప్రియుడు హత్యాయత్నం చేశారు. ఈ సంఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు శనివారం తెలిపిన మేరకు.. చౌదరిగూడలోని విజయపురి కాలనీకి చెందిన రమావత్ సుజాత అదే కాలనీకి చెందిన జటోతు మంగిలాల్తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయం భర్త రమావత్ బిక్కుకు తెలియకుండా ఇంట్లో నాలుగు స్పై కెమెరాలను అమర్చి, భర్త కదలికలు ప్రియుడికి తెలిసేలా ఏర్పాట్లు చేసింది. ఇది తెలుసుకున్న బిక్కు తన భార్య సుజాతను గట్టిగా మందలించాడు. ఈ క్రమంలో మంగిలాల్తో సుజాత కలిసి తన భర్తను చంపేందుకు కత్తితో దాడి చేసింది. దీంతో బిక్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన పోలీసులు సుజాత, మంగిలాల్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, ఇద్దరినీ అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపారు. -
కుమారుడిపై ఆ కేసు.. బండి సంజయ్ రియాక్షన్
సాక్షి, కరీంనగర్: తన తనయుడిపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఇటీవల నిరాధారమైన ఆరోపణల దృష్ట్యా.. నా ప్రజా జీవితమంతటా నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవించానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఎలాంటి మచ్చ లేకుండా జీవించాను. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయ పోరాటాల్లోకి లాగడం అనేది.. నాతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారి నిస్సహాయతను మాత్రమే ప్రతిబింబిస్తుంది. క్షేత్రస్థాయి నుండి వచ్చి, కార్పొరేటర్గా పనిచేసి, కఠోర శ్రమ, ప్రజా మద్దతుతో అంచెలంచెలుగా కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి...రేపు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ముందు.. నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశించిన రాజకీయ కుట్ర ఇది అని స్పష్టమవుతోంది. ఏది సరైనదో, ఏది తప్పో న్యాయవ్యవస్థే నిర్ణయిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతుంది. ప్రతి కుట్రను బయటపెడుతుంది. సత్యమేవ జయతే’’ అంటూ ఆయన ఎక్స్లో పేర్కొన్నారు.నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటననాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను.నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 9, 2026కాగా, కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడిపై హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలో ఉండే ఓ బాలిక (17) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి ఫిర్యాదురాగా పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ (24) డిసెంబర్ 31న మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో స్నేహం పేరిట తిరుగుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే రోజు రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడనేది ప్రధాన ఆరోపణ. భగీరథపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 74, 75తోపాటు సెక్షన్ 11 రెడ్విత్ 12 పోక్సో చట్టం కింద నమోదు చేశారు. భగీరథపై గతంలో బహదూర్పల్లిలో ఉన్న కళాశాలలో ర్యాగింగ్తోపాటు డ్రగ్స్ విషయంపై ఫిర్యాదులు రాగా దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, ప్రధాని మోదీ నగరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదుకావడం చర్చనీయాంశమైంది. -
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు
కుత్బుల్లాపూర్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడిపై హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలో ఉండే ఓ మైనర్ బాలిక (17) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి ఫిర్యాదురాగా పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ (24) డిసెంబర్ 31న మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో స్నేహం పేరిట తిరుగుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే రోజు రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడనేది ప్రధాన ఆరోపణ. భగీరథపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 74, 75తోపాటు సెక్షన్ 11 రెడ్విత్ 12 పోక్సో చట్టం కింద నమోదు చేశారు. భగీరథపై గతంలో బహదూర్పల్లిలో ఉన్న కళాశాలలో ర్యాగింగ్తోపాటు డ్రగ్స్ విషయంపై ఫిర్యాదులు రాగా దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, ప్రధాని మోదీ నగరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదుకావడం చర్చనీయాంశమైంది. స్నేహం పేరుతో బ్లాక్మెయిల్ స్నేహం పేరుతో తనను బ్లాక్మెయిల్ చేస్తూ వివాహానికి ఒత్తిడి తెచ్చారని బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక యువతిపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సదరు యువతితో తన స్నేహితులకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. ఈ మేరకు సదరు యువతి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
తెలంగాణలో ఆత్మహత్యలు ఎక్కువే..
ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఇవే రాష్ట్రంలో కుటుంబ కలహాలు, ఇతర సమస్యల కారణంగా అత్యధికంగా 4,675 మంది (42.6%) ప్రాణాలు తీసుకున్నారు. అనారోగ్య సమస్యలతో 2,209 (20.1%) మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధలు తాళలేక 1,313 మంది, ఆస్తి తగాదాల వల్ల 727 మంది, వివాహ సంబంధిత సమస్యలతో 170 మంది తనువు చాలించారు. ప్రేమ వ్యవహారాల వైఫల్యాలు కూడా బలవన్మరణాలకు దారితీశాయి. రాష్ట్రంలో 4 సామూహిక ఆత్మహత్యల కేసులు నమోదు కాగా, వీటిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఆత్మహత్యల పరంపర తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో బలవన్మరణాల రేటు రెట్టింపు కంటే ఎక్కువగా నమోదైంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన ‘భారతదేశంలో ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు (ఏడీఎస్ఐ)–2024’నివేదిక గణాంకాలు ఈ చేదు నిజాన్ని కళ్లకు కట్టాయి. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు ఆత్మహత్యల రేటు సగటున 12.2గా ఉంటే, తెలంగాణలో అది ఏకంగా 28.6గా రికార్డవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో 10,975 మంది ఆత్మహత్య ఎన్సీఆర్బీ–2024 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 1,70,746 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో తెలంగాణ నుంచి 10,975 మంది ఉన్నారు. దేశ వ్యాప్త ఆత్మహత్యల్లో రాష్ట్ర వాటా 6.4 శాతంగా ఉంది. ఆత్మహత్యల రేటు (ప్రతి లక్ష జనాభాకు) ప్రకారం చూస్తే అండమాన్ నికోబార్ (40.6), సిక్కిం (36.3), కేరళ (30.2) రాష్ట్రాల తర్వాత 28.6 రేటుతో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. దినసరి కూలీలదే అగ్రస్థానం రాష్ట్రంలో నమోదైన ఆత్మహత్యల్లో దినసరి కూలీలు, నిరుపేదలే అత్యధికంగా ప్రాణాలు తీసుకున్నారు. వృత్తుల వారీగా చూస్తే రాష్ట్రంలో ఏకంగా 5,745 మంది దినసరి కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో 5,021 మంది పురుషులు, 723 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు 1,577 మంది, ప్రైవేటు రంగ ఉద్యోగులు 787 మంది, ప్రభుత్వ ఉద్యోగులు 145 మంది ఆత్మహత్య చేసుకున్నారు. గృహిణుల ఆత్మహత్యలు 789గా నమోదయ్యాయి. 763 మంది విద్యార్థులు, 118 మంది నిరుద్యోగులు, వివిధ కారణాలతో మరికొంత మంది కూడా తనువు చాలించారు. అన్నదాతల ఆత్మహత్యలు తక్కువే ఎన్సీఆర్బీ నివేదికలో తెలంగాణకు సంబంధించి ప్రధాన సానుకూల అంశం వ్యవసాయ రంగంలో నమోదైంది. గత పదేళ్ల గణాంకాలతో పోలిస్తే అన్నదాతల బలవన్మరణాలు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు పూర్తిగా సున్నా (0)గా రికార్డయ్యాయి. సొంత భూమి, కౌలు భూమి సాగు చేసుకుంటున్న రైతులు కేవలం 43 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ప్రమాద మరణాల్లోనూ పైపైకే.. రాష్ట్రంలో ప్రమాదాల వల్ల సంభవించే మరణాలు సైతం ఆందోళనకరంగానే ఉన్నాయి. 2024లో తెలంగాణలో 13,458 ప్రమాద మరణాలు సంభవించాయి (దేశవ్యాప్త మరణాల్లో ఇది 2.9 శాతం). జాతీయ స్థాయిలో ప్రమాద మరణాల రేటు 33.3గా ఉంటే, తెలంగాణలో అది 35.1గా నమోదైంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల (వడదెబ్బ, పిడుగుపాటు తదితర) 222 మంది చనిపోగా.. ట్రాఫిక్/రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల 13,236 మంది ప్రాణాలు కోల్పోయారు. -
సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ నగరంగా మార్చాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రహదారుల విస్తరణ ఒక్కటే సరిపోదని, బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉంటుందన్నారు. పెరుగుతున్న నగరీకరణతో సమీప భవిష్యత్తులో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) ప్రాంతం మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు వెల్లడించారు. ‘హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగ రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కీలకమైన ప్రాంతాల్లో అండర్పాస్లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ వంటి మూడు విధానాల్లో సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నాం. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం’అని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. కాలుష్య కోరల నుంచి హైదరాబాద్ను కాపాడటానికి మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అనుసంధానించబోతున్నట్లు వివరించారు. నగర తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పునరుజ్జీవ ప్రాజెక్టు దేశంలోనే మొదటిది: స్టాండింగ్ కమిటీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ మాగుంట శ్రీనివాసులరెడ్డితోపాటు ఇతర సభ్యులు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును విప్లవాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. హైదరాబాద్ నగర జీవన స్థితిగతులను మెరుగుపరిచే మూసీ పునరుజ్జీవ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని అభిప్రాయపడ్డారు. ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును చేపట్టడంపై కమిటీ ముఖ్యమంత్రిని అభినందించింది. దీంతోపాటు రాష్ట్రంలో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కొనియాడింది. అంతకుముందు స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్తోపాటు సభ్యులను ముఖ్యమంత్రి సత్కరించారు. తెలంగాణ రైజింగ్ –2047 విజన్ డాక్యుమెంట్ను కమిటీ సభ్యులకు అందజేశారు. సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ముద్ర రుణాల్లో వెనుకంజలో తెలుగు రాష్ట్రాలు
సాక్షి, హైదరాబాద్: ముద్ర రుణాల మంజూరులో తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మంజూరైన ముద్ర ఖాతాల సంఖ్య దాదాపు సగమే. దీంతో రుణాలు అందక ఔత్సాహిక యువత ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. చిరు వ్యాపారులు తదుపరి వ్యాపార విస్తరణ చేపట్టలేక పోతున్నారు. 100 మందికి 21 ఖాతాలు.. ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) పథకం ద్వారా చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా విస్తరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి తనఖా లేకుండా రుణాలను అందిస్తోంది. 2015 ఏప్రిల్ 8 నుంచి 2026 జనవరి 2 మధ్య 56.31 కోట్ల ఖాతాలకుగాను రూ.37.31 లక్షల కోట్ల రుణాలు మంజూరు అయ్యాయి. 70% మంది లబ్ధిదారులు మహిళలు కావడం విశేషం. మొత్తం జనాభా ప్రాతిపదికన చూస్తే దేశవ్యాప్తంగా ముద్ర ఖాతాల సంఖ్య 39.88 శాతం ఉంది. అంటే 100 మందికి దాదాపు 40 లోన్లు జారీ అయినట్టు.వాస్తవానికి ఇదొక రికార్డు. అయితే, తెలంగాణలో 21.44 శాతం, ఆంధ్రప్రదేశ్లో 21.04శాతం.. అంటే ఒక్కో రాష్ట్రంలో 100 మందికిగాను 21 లోన్లే అందాయంటే మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థాయిలో వెనుకంజలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదే పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, ఒడిశాలు జనాభా ప్రాతిపదికన అత్యధిక ఖాతాలతో టాప్–3లో ఉండడం గమనార్హం. టాప్–10 జాబితాలోనూ తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కలేదు. పీఎంఎంవై ప్రారంభం నుంచే.. ముద్ర రుణాలు విరివిగా లభిస్తే డెయిలీ, నకిలీ ఫైనాన్స్లకు అడ్డుకట్ట పడుతుందన్నది జనం మాట. కనీసం ఐదు ముద్ర ఖాతాలు లేని గ్రామాలు వేలాదిగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ నిర్దేశించిన లక్ష్యాల మేరకే రుణాలు మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకుల ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు ముద్ర రుణాలు తక్కువగా మంజూరు అవుతున్నాయని పలు సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు సమర్పించినా ఫలితం లేకపోయింది. పీఎంఎంవై ప్రారంభం నుంచే తెలంగాణ, ఏపీకి తక్కువ కేటాయింపులు జరగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు ఉన్నాయి. -
నేడే మోదీ సభ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మూడోసారి ప్రధాని అయిన రెండేళ్ల తర్వాత తొలిసారి రాష్ట్రానికి రానున్నందున మోదీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని తొలుత గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీ నుంచి రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించడంతోపాటు మరి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ సభకు భారీ సమీకరణ ద్వారా సత్తా చాటేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సర్వశక్తులు ఒడ్డి సన్నాహాల్లో తలమునకలైంది. అంచనాలకు మించి జనసమీకరణ, ప్రజలు, కార్యకర్తల హాజరు ద్వారా మోదీ సభను విజయవంతం చేసి సత్తా చాటాలనే పట్టుదలతో పార్టీ శ్రేణులున్నాయి. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవడం, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిని (ఒకటి మిత్రపక్షంతో కలిసి) బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో పార్టీపరంగా రాజకీయ అంశాలపై మోదీ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోదీ పర్యటన షెడ్యూల్ ఇదీ... మధ్యాహ్నం 2:20 గంటలకు కర్ణాటక నుంచి బేగంపేట విమానాశ్రయానికి రాక. 3 నుంచి 3:30 గంటల మధ్య గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. 3:45–4:15 గంటల మధ్య హైటెక్ సిటీ సమీపంలో సింధు హాస్పటల్ ప్రారంభోత్సవం. అనంతరం ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు పరామర్శ. సాయంత్రం 4:45 నుంచి 6:15 గంటల మధ్య బేగంపేట ఎయిర్పోర్ట్లో రిజర్వ్ టైమ్. 6:30 నుంచి 7:10 గంటల మధ్య సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభలో ప్రసంగం. రాత్రి 7:20 గంటలకు బేగంపేట నుంచి గుజరాత్లోని జామ్నగర్కు పయనం. ప్రధాని ప్రారంభించే/శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు ఇవే.. ⇒ హైదరాబాద్–పనాజీ ఎకనమిక్ కారిడార్లో భాగంగా గుడెబెల్లూర్ నుంచి మహబూబ్నగర్ వరకు రూ. 3,175 కోట్ల ఖర్చుతో ఎన్హెచ్–167 ఫోర్ లేనింగ్ పనులకు శంకుస్థాపన. దీనిద్వారా రవాణా సమయం గంటన్నర దాకా తగ్గనుంది. ⇒ సంగారెడ్డి జిల్లాలో రూ. 2,350 కోట్ల వ్యయంతో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన. హైదరాబాద్–నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్లో 3,245 ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఎన్హెచ్–65 వెంట చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు, భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ⇒ వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద రూ. 1,700 కోట్లతో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ను ప్రధాని ప్రారంభిస్తారు. ఇది దేశంలోనే పూర్తిస్థాయిలో పనిచేస్తున్న తొలి పీఎం మిత్ర పార్క్గా నిలవనుంది. కేంద్ర ప్రభుత్వ ఫైవ్–ఎఫ్ విజన్లో భాగంగా ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్గా పనిచేయనుంది. ప్రతిపాదిత నాగపూర్–విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్్కప్రెస్ హైవే (ఎన్హేచ్–163 జీ)కి సమీపంలో మేజర్ రైల్వే నెట్వర్క్స్, సీ–పోర్టులకు కనెక్టివిటీ అందించనుంది. ⇒ జాతీయ స్థాయిలో ముఖ్యమైన రూ. 1,535 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. కాజీపేట–విజయవాడ రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో పలు సెక్షన్లను కవర్ (118 కి.మీ) చేయనున్నాయి. రద్దీగా ఉండే గ్రాండ్ట్రంక్ కారిడార్లో లైన్ కెపాసిటీని పెంపొందించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. దీని ద్వారా వేగవంతమైన రైళ్ల కార్యకటాపాలు, సమయపాలన మెరుగదల, సరుకు రవాణా వేగవంతానికి దోహదపడనుంది. ఈ సందర్భంగా కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. కాజీపేట జంక్షన్లో సాఫీగా రవాణా సాగేలా దోహదపడటంతోపాటు హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు రైళ్ల రాకపోకలు వేగంగా సాగేలా సహాయపడనుంది. ⇒ హైదరాబాద్ శివార్లలోని మల్కాపూర్లో రూ. 600 కోట్లతో అభివృద్ధి చేసిన ఇండియన్ అయిల్ టెర్మినల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. ⇒ హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన 1,500 పడకల ‘సింధు కేన్సర్ హాస్పిటల్’ను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. లాభాపేక్ష లేని సంస్థ ద్వారా కేన్సర్ చికిత్స కేంద్రీకృతంగా మల్టీ–సూపర్ స్పెషాలిటీ క్వార్టర్నరీ కేర్ను అందించనున్నారు. -
ఈ ఘోరమైన కేసుల్లో చర్యలేవీ?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణలో గత 15 రోజులుగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో మాజీ ఐపీఎస్ భార్య హత్య జరిగినా, కరీంనగర్ గోల్డ్ షాపులో భారీ చోరీ జరిగినా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని విమర్శించారు.మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ను 40 మంది ఆకతాయిలు వేధించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి చిన్న విషయానికి 'సిట్' వేస్తారని, మరి రాష్ట్రంలో పెరుగుతున్న ఈ నేరాల పరంపరపై ఎందుకు ప్రత్యేక విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసు శాఖ తూతూ మంత్రంగా పనిచేస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.‘‘రేవంత్ రెడ్డి నిజంగా మీకు, బండి సంజయ్ కు మధ్య ఎలాంటి దోస్తానా లేకుంటే, మీ కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాకపోతే బండి సాయి భగీరథ్ ను వెంటనే జైలుకు పంపండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నాడు. అమ్మాయి తల్లితండ్రులకు ఎలాంటి హాని జరిగినా దానికి రేవంత్ రెడ్డి, పోలీసులే బాధ్యత వహించాలి. బండి సంజయ్ కొడుకు బాలికపై అఘాయిత్యానికి పాల్పడితే చర్యలేవీ? రేవంత్ రెడ్డి, బండి సంజయ్ స్నేహితులు కాబట్టే చర్యలు లేవు’ అని అన్నారు. -
తెలంగాణ పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపు(మే 10, ఆదివారం) హైదరాబాద్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనపై ఆయన ట్వీట్ చేశారు.‘‘రేపు మే 10వ తేదీన కర్ణాటక, తెలంగాణలో వివిధ కార్యక్రమాలు పాల్గొంటాను. ఉదయం 11 గంటలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటాను. సమాజ సేవకు అంకితమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వివిధ రంగాల్లో అద్భుత కార్యక్రమాలు చేస్తోంది. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని రూ.9500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం,శంకుస్థాపన.. రోడ్లు, లాజిస్టిక్స్, టెక్స్టైల్స్, రైల్వేలు, ఇంధనం తదితర రంగాల్లో ప్రధాన ప్రాజెక్టులు....సింధు హాస్పిటల్ను దేశానికి అంకితం చేస్తాను. సాయంత్రం హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తాను. బీఆర్ఎస్, కాంగ్రెస్ తప్పుడు పాలనలతో విసిగిపోయిన తెలంగాణ బీజేపీ వైపు చూస్తోంది. బీజేపీకి తెలంగాణ ప్రజల ఆదరణ పెరుగుతోంది’’ అంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ನಾಳೆ, ಮೇ 10 ರಂದು ನಾನು ಕರ್ನಾಟಕ ಮತ್ತು ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ವಿವಿಧ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಭಾಗವಹಿಸಲಿದ್ದೇನೆ.ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ 11 ಗಂಟೆಗೆ, ‘ಆರ್ಟ್ ಆಫ್ ಲಿವಿಂಗ್’ ಸಂಸ್ಥೆಯ 45ನೇ ಸಂಸ್ಥಾಪನಾ ವರ್ಷದ ಸ್ಮರಣಾರ್ಥ ಹಮ್ಮಿಕೊಂಡಿರುವ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲಿದ್ದೇನೆ. ಸಮಾಜ ಸೇವೆಯ ಸಂಸ್ಕೃತಿಗೆ ಅನುಗುಣವಾಗಿ, ಈ ಸಂಸ್ಥೆಯು ವಿವಿಧ…— Narendra Modi (@narendramodi) May 9, 2026 -
సర్.. నా భార్య మనీషా కనిపించడం లేదు!
హైదరాబాద్: వివాహిత అదృశ్యమైన సంఘటన స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్కి చెందిన కైలాష్ కుమార్ భార్యతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చి ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వచ్చాడు. ఇక్కడే ఉంటూ కార్పెంటర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారం రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చి చూసేసరికి భార్య మనీషా కనిపించలేదు. వెంటనే ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో సమీపంలో తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 15 ఏళ్ల బాలుడు.. 26 ఏళ్ల యువతితో ప్రేమ..! -
లిఫ్ట్లో ఇరుక్కొని బాలుడి మృతి
హైదరాబాద్: లిఫ్ట్లో ఇరుక్కొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని రామచంద్రారెడ్డినగర్ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా చంద్రజుపాలెంకి చెందిన వెంకటేశ్వర్లు తన కుటుంబ సభ్యులతో కలిసి రామచంద్రాపురంలో నివాసం ఉంటూ వాచ్మేన్గా ఉంటున్నాడు. రాత్రి 7గంటలకు కూతురు వర్షిత, కుమారుడు గిరివర్ధన్(4) ఆడుకుంటున్నారు. అదే సమయంలో గిరివర్ధన్ లిఫ్ట్లోకి వెళ్లగా.. మొదటి అంతస్తులోకి వెళ్లగానే పెద్ద శబ్ధం వచి్చంది. వెంటనే వెళ్లి చూడగా లిఫ్ట్లో బాలుడు ఇరుక్కొని ఉన్నాడు. తీవ్రగాయాలైన అతడిని 108 అంబులెన్స్లో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఏసీపీ శ్రీనివాస్ కుమార్, ఇన్స్పెక్టర్ జగన్నా«థ్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
Hyderabad: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణహత్య
బంజారాహిల్స్ (హైదరాబాద్): బంగారు నగలు, నగదు కోసం నేపాలీ గ్యాంగ్ ఘాతుకానికి పాల్పడింది. హైదరాబాద్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే...జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రశాసన్నగర్ రోడ్ నం.7లో ప్లాట్ నం. 46లో జైళ్లశాఖలో అదనపు డీజీగా పనిచేసి రిటైర్ అయిన వినయ్ రంజన్రాయ్ కుటుంబం ఉంటోంది. ఈ నెల 1వ తేదీన వినయ్ రంజన్రాయ్ చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లారు. ఇంట్లో ఆయన భార్య తనూజ రంజన్ (60) మొదటి అంతస్తులో ఉండగా, రెండో అంతస్తులో ఆమె ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడు నెలల క్రితం ఈ ఇంట్లో పనిమనిషిగా నేపాల్కు చెందిన కల్పన చేరింది. నమ్మకంగా పనిచేస్తున్నట్టు నటిస్తూ తనూజ ఆలనాపాలనా చూసేది.తండ్రి బెంగళూరుకు వెళ్లడంతో మొదటి అంతస్తులో తల్లి ఒక్కరే ఉంటారని, బెడ్రూమ్ ముందు హాల్లో పడుకోవాలని పెద్దకూతురు సునంద గురువారం రాత్రి 9 గంటలకు కల్పనకు చెప్పి పైఅంతస్తుకు వెళ్లింది. అంతకుముందే పథకం వేసుకున్న కల్పన రాత్రి 1 గంట సమయంలో ఇంటి బయటకు వచ్చింది. అప్పటికే ఇంటి పక్కన మున్సిపల్ పార్కులో వేచి చూస్తున్న ముగ్గురు నేపాలీలను ఇంట్లోకి తీసుకెళ్లింది. ఆమె బయట కాపలా ఉండగా, ఆ ముగ్గురూ మొదటి అంతస్తులోకి వెళ్లి నిద్రిస్తున్న తనూజను లేపి కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె ఒంటిమీద ఉన్న నగలతోపాటు అల్మారాలో ఉన్న నగదు, రూ. కోట్ల విలువ చేసేబంగారు వజ్రాభరణాలను మూటగట్టుకొని 3.30 గంటల ప్రాంతంలో నలుగురు కలిసి ఉడాయించారు.శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పెద్ద కూతురు సునంద బయట కార్పెంటర్ వెయిట్ చేస్తుండగా ఇంట్లోకి పిలిచి మొదటి అంతస్తులోకి తీసుకెళ్లింది. ఆమె వెళ్లేసరికి తల్లి బెడ్రూమ్లో నేల మీద కాళ్లు చేతులు కట్టేసి ఉండటంతోపాటు నోట్లో గుడ్డలు కుక్కి ఉండి అచేతనంగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే తన సోదరి, డ్రైవర్ సహాయంతో అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఇంటెలిజెన్స్ విభాగ ఐజీ, సీసీఎస్ డీసీపీ తదితరులు అంతా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. జరిగిన ఘటనపై సునంద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో తనూజ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. ఆమె ఒంటిమీద ఎలాంటి గాయాలు లేకపోవడం చూస్తే ఆమెపై దాడి జరగలేదని కేవలం నోట్లో గుడ్డలు కుక్కడం వల్ల ఊపిరాడక చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తమ బెడ్రూమ్లోని అలమారాలో భారీగా నగదు, నగలు ఉన్నాయని అవి ఎంత అనే విషయం తెలియదని మృతురాలి భర్త వినయ్ రంజన్రాయ్ పోలీసులకు ఫోన్లో చెప్పారు. సీసీ ఫుటేజీలో నలుగురు నేపాలీ గ్యాంగ్ ఇంట్లోకి వస్తున్న, బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించాయి. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో పని మనిషి బయటికి వచ్చి వారిని పిలవగా చేతుల్లో కత్తులు, రాడ్లతో ముగ్గురు ఆగంతకులు లోపలికి రావడం కనిపించింది. సరిగ్గా 3.30 గంటల ప్రాంతంలో వీరంతా బంగారు, నగదు ఉన్న బ్యాగుతో ఉడాయించారు. అంతకుముందు రోజు రాత్రి కూడా ఇక్కడ ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గడిచిన నెల రోజుల నుంచి వీరు ఈ ఇంట్లో దొంగతనానికి పథకం వేసినట్లు తెలుస్తున్నది. కల్పన పనిలో చేరేముందు ఎలాంటి ఆధారాలు యజమానులకు ఇవ్వలేదు. వీరి కోసం ముమ్మర గాలింపు జరుగుతోంది. వీరు నేపాల్లోకి ప్రవేశించకముందే పట్టుకోవాలని వేర్వేరు చోట్ల బృందాలు నిఘా పెట్టాయి. -
పంటల మార్పిడి సాగుకు జీవనాడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయం నాలుగు కాలాలపాటు కొనసాగాలంటే పంటల మార్పిడి విధానం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ స్పష్టం చేసింది. ఈ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి పంటను రెండు కాలాల్లో సాగు చేయకుండా ఒక పంట వరి, మరో పంట ఆరుతడి సాగుచేసేలా రైతులను చైతన్యవంతులను చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పంటల సాగు, మార్కెటింగ్, ఇతర సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలపై దాదాపు ఏడాది కాలం పాటు అధ్యయనం చేసిన కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ నివేదికను అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం, దీని ఆధారంగానే రాష్ట్రంలో అమలు చేసే వ్యవసాయ విధానాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం.రైతు కమిషన్ చేసిన ప్రధాన సిఫారసులివి⇒ వ్యవసాయ వాతావరణ మండలాల ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించాలి. పంట మార్పిడి లక్ష్యాలను సంవత్సరాలు, గ్రామాల వారీగా నిర్ణయించాలి. ⇒ ఉద్యాన పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు విస్తరణ చేయగలిగితే ఏక పంటల వల్ల కలిగే నష్టాలను తగ్గించొచ్చు. ⇒ ఉద్యాన పంటల సాగులో స్వయంవృద్ధి సాధించాలి. ఇందుకు కూరగాయల విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్, మల్చిం గ్తోపాటు కూరగాయల పందిరికి రాయితీ ఇవ్వాలి. ⇒ కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు అత్యధిక మోతాదులో విత్తనాలు అవసరం. దీని కోసం విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలి. ⇒ ఉద్యాన పంటల సాగులో వన్యప్రాణుల బెడదను తప్పించడానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు నాబార్డు సహకారంతో రాయితీ ఇప్పించాలి. ⇒ ఆయా జిల్లాల్లో ఏ పంటల సాగు ఎక్కువగా ఉందనే అంచనాల మేరకు ఆ ప్రాంతాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. ఉదాహరణకు నిజామాబాద్లో పసుపు, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మిరప, ఖమ్మం, జగిత్యాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో మామిడి అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ఆయా పంటలకు సంబంధించిన ప్రాసిసెంగ్ యూనిట్లు, ప్యాక్ హౌస్లు (గ్రేడింగ్, సారి్టంగ్, ప్యాకింగ్ కోసం), కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను ఆ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలి. ⇒ కేరళ తరహాలో కూరగాయల క్లస్టర్లు ఏర్పాటు చేయాలి. మహారాష్ట్ర నాసిక్లోని సహ్యాద్రి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ (ఎఫ్పీసీ) లాగానే ఇక్కడా ఏర్పాటు చేయాలి. ⇒ రైల్వే బడ్జెట్ తరహాలోనే వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ⇒ పంట మార్పిడిని ప్రోత్సహించేందుకు పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల పంటలకు కూడా కనీస మద్దతు ధరతోపాటు కొనుగోలు మద్దతు కల్పించాలి. ⇒ ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు రైతుల పంటలను తప్పనిసరిగా కొనుగోలు చేసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. ⇒ పంటల మద్దతు ధర నిర్ణయించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ధరల నిర్ణయ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో రైతులకు ప్రాతినిధ్యం కల్పించాలి. ⇒ కలుపు తీసే యంత్రాలు, ఇతర చిన్న వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ ఇవ్వాలి. వ్యవసాయ క్లస్టర్ల వారీగా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం నుంచి ప్రోత్సాహకాలతోపాటు సహకారం తీసుకోవాలి ⇒ ఆహార పంటల కొనుగోలుకు మార్క్ఫెడ్ను ఆర్థికంగా బలోపేతం చేయాలి. పంటలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే స్థాయిలో తగిన నిధులు సమకూర్చాలి. ⇒ నీటి పొదుపునకు రెండు కాలాల్లోనూ వరికి బదులు ఓ కాలంలో వరి, రెండో పంటగా ఆరుతడి పంటలను సాగు చేయించాలి. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, క్రాప్ కాలనీల ఏర్పాటు ద్వారా రైతులు సంఘటితం కావడంతోపాటు ఆ వర్గాన్ని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేస్తాయి. ⇒ వరి, పత్తి పంటలకే కాకుండా ఇతర ముఖ్య పంటలకు కూడా సంస్థాగత రుణాలు ఇప్పించాలి. ఇతర ముఖ్య పంటలకు పంటల బీమా సౌకర్యం కల్పించాలి. ⇒ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి సాగు నుంచి ఇతర పంటల మార్పిడికి ఇస్తున్న ప్రోత్సాహకాల మాదిరిగా, తెలంగాణలో కూడా రైతులకు ప్రోత్సాహకాలు అందించాలి. చెరుకు, పసుపు పంటలు... ప్రత్యేకం సంప్రదాయ పంటలైన చెరుకు, పసుపు సాగుకు వ్యవసాయ కమిషన్ ప్రత్యేక సిఫారసులు చేసింది. ఈ నివేదిక ప్రకారం 2013–14లో పసుపు సాగు 1,52,445 ఎకరాలలో ఉండేది. ప్రస్తుతం అది 42,246 ఎకరాలకు తగ్గిపోయింది. నిజాం కాలం నుంచే నిజామాబాద్, మెదక్ ప్రాంతాల్లో చెరుకు విస్తృతంగా సాగు చేసేవారు. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత 95,348 ఎకరాల నుంచి 51,482 ఎకరాలకు తగ్గింది. పంటల కోత సమయంలో కూలీల కొరత తీవ్రత, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం, పసుపు బోర్డుకు నిధులు లేకపోవడం, అధికసాగు ఖర్చులు, చక్కెర ఫ్యాక్టరీలు మూతపడడం లాంటి సమస్యలతో ఈ రెండు పంటలకు సాగు విస్తీర్ణం తగ్గుతోంది.పసుపు రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుకు తగిన నిధులు కేటాయించాలి. అధిక కుర్కుమిన్ శాతం కలిగి, ఎగుమతులకు అనుకూలమైన ఎక్స్పోర్ట్ క్వాలిటీ రకాల సాగును ప్రోత్సహించేందుకు పసుపు కొమ్ములపై సబ్సిడీపై ఇవ్వాలి. వ్యవసాయ యాంత్రీకరణ జరగాలి. పసుపు ఉడికించడానికి బాయిలర్ల కొనుగోలుకు ప్రోత్సాహమివ్వాలి. యూపీ, పంజాబ్లతో తరహాలో చెరుకు సాగుకు ప్రత్యేక బోనస్ ప్రకటించాలి. చెరుకు కట్టింగ్, డ్రిప్ ఇరిగేషర్, ఆటోమేటెడ్ ప్లాంటర్లు, హార్వెస్టర్లను సబ్సిడీపై ఇవ్వాలి. పెసర వంటి అంతరపంటలను ప్రోత్సహించడంతోపాటు రాష్ట్రంలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీల పున:ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. -
లక్ష్యం.. 2 లక్షలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో నిర్వ హించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను రాష్ట్ర బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ జనసమీకరణతో మోదీ సభ విజయవంతానికి కసరత్తు చేస్తోంది. గతంలో ఎన్నడూ చేయని విధంగా ముందస్తు సన్నాహాలు, ఏర్పాట్లలో పార్టీ ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ మోదీ సభ కోసం అన్ని జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, జిల్లా స్థాయి నాయకులను ఇన్చార్జ్లుగా (ఒక్కో జిల్లాకు పార్టీ నుంచి ఒకరు, ప్రజాప్రతినిధి ఒకరు) నియమించారు.ఏ జిల్లాకు ఆ జిల్లా నుంచి పార్టీ కేడర్, ప్రజలను తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు. గతంలో హైదరాబాద్/సికింద్రాబాద్లలో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల సభ నిర్వహిస్తే చుట్టుపక్కల కొన్ని జిల్లాల నుంచే సమీకరణకు పరిమితమయ్యేవారు. అందుకు పూర్తి భిన్నంగా రాష్ట్ర పార్టీ యావత్ యంత్రాంగం ఇందులో నిమగ్నమైంది.జనసమీకరణకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మొదలుకొని కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండిసంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఎం.రఘునందన్రావు, అర్వింద్ ధర్మపురి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్శంకర్, పైడి రాకేశ్రెడ్డి,, ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం పరేడ్ గ్రౌండ్స్ను సందర్శించిన రాంచందర్రావు అక్కడ సాగుతున్న సన్నాహాలు, ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు 2 లక్షల మందితో భారీ జనసమీకరణ చేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు: బండి సంజయ్ చిక్కడపల్లి: ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉండి.. ప్రత్యే కంగా నిధులు ఇస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ సభను జయప్రదం చేయాలని ఆర్టీసీ క్రాస్రోడ్ నుంచి చేపట్టిన బైక్ ర్యాలీని ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో అభివృదిŠధ్ పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 10వ తేదీ తర్వాత రాజకీయ పరిణామాలు మారుతాయన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనన్నారు. ఈ ర్యాలీలో సికింద్రాబాద్ జిల్లా మహకాళి జిల్లా అధ్యక్షుడు జి.భారత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పన్ను ఎగవేతదారులు తప్పించుకోలేరు
సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను ఎగవేతదారులు ఎక్కువకాలం తమ నుంచి తప్పించుకోలేరని.. ప్రతి ఒక్కరి ఆర్థిక లావాదేవీలపైనా తమ దృష్టి ఉంటుందని ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ (ఏపీ, తెలంగాణ) సురేశ్ బత్తిని తెలిపారు. ఏఐ సాయంతో అందరి వివరాలను క్రోడీకరిస్తున్నట్లు చెప్పారు. పాత చట్టంతో పోలిస్తే నూతన ఐటీ చట్టం–2025లో పన్ను చెల్లింపుదారులకు సులువుగా అన్ని అంశాలు గుర్తించేలా సరళీకరించామన్నారు. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు పక్కా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నూతన ఆదాయపన్ను చట్టంపై విస్తృత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ‘సాక్షి’కి శుక్రవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై సురేశ్బత్తిని మాట్లాడారు. పన్ను ఎగవేతదారులను దారికి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలేంటి? పన్ను ఎగవేత మున్ముందు కష్టమే. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీస్లు, కార్ల విక్రయాలు, ఎల్ఐసీ చెల్లింపులు, ట్రావెల్ ఆఫీసులు, హోటళ్లు ఇలా అనేక మార్గాల ద్వారా మేం సమాచారం సేకరిస్తాం. ఆ సమాచారాన్ని ఏఐ ఉపయోగించి విశ్లేషిస్తాం. వాటి ఆధారంగా అసెసీ (పన్ను చెల్లించాల్సిన వ్యక్తి)కి ఆర్థిక లావాదేవీల వివరాలు పంపుతాం. ఈ లావాదేవీలన్నీ మీరే చేసినట్లయితే అందుకు అనుగుణంగా పన్ను చెల్లించాలని సూచిస్తాం. ఇది కేవలం ర్యాండమ్గా కాకుండా ఇలా అందరి వివరాలను పరిశీలిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఎక్కడ ఖర్చు పెట్టినా వెంటనే వారి ఆదాయానికి సంబంధించిన సమాచారం మాకు తెలిసిపోతుంది. రెండు మూడేళ్లలో ప్రతి ఒక్కరి ఆదాయం మాకు తెలిసిపోయే స్థితికి వస్తాం. పాన్ లింకేజీ, డిజిటల్ లావాదేవీల ట్రాకింగ్తో ఎగవేతలు ఏ మేరకు తగ్గుతాయి? ప్రస్తుతానికి ఎంత మొత్తంలో పన్ను ఎగవేతలు ఉన్నాయో చెప్పలేకపోవచ్చు. కానీ పాన్ కార్డు లింకేజీ, డిజిటల్ లావాదేవీల ట్రాకింగ్తో రెండు మూడేళ్లలోనే మేం 95 శాతం వరకు పన్ను ఎగవేతలను నిర్మూలించే స్థాయికి వెళ్తాం. ఎందుకంటే.. లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఎవరూ నగదు రూపంలో ఎంతోకాలం దాయలేరు. ఎక్కడో ఒకచోట తప్పకుండా వాటిని ఖర్చు చేయాల్సిందే. అలా ఖర్చు చేస్తే తప్పకుండా మా దృష్టికి వస్తారు. ఫేక్ జీఎస్టీలు, బోగస్ బిల్లులపై దృష్టి పెడతారా? జీఎస్టీ అధికారులు ఫేక్ జీఎస్టీలు, బోగస్ బిల్లులకు సంబంధించి పరిశీలిస్తారు. అందులో ఏమైనా తేడాలున్నట్టు గ్రహిస్తే మాకు సమాచారం ఇస్తారు. దాని ఆధారంగా మేం చర్యలు తీసుకుంటాం. నగదు లావాదేవీలు అత్యధికంగా జరిగిన రియల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో పన్ను ఎగవేతలను ఎలా అరికడతారు? రూ. 2 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేస్తే ఎంతో మార్పు వస్తుంది. అలాగే నగదు లావాదేవీలను వీలైనంత వరకు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా తీసుకొచ్చిందే నోట్ల రద్దు. భవిష్యత్తులో నగదు లావాదేవీలు వీలైనంత వరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి పన్ను ఎగవేతలకు అవకాశాలు తగ్గుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏయే రంగాల నుంచి ఎక్కువగా ఆదాయపన్ను చెల్లింపులు ఉంటున్నాయి? ప్రధానంగా ఫార్మా, రియల్ ఎస్టేల్, సాఫ్ట్వేర్ రంగాల నుంచి ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లింపులు ఉంటున్నాయి. ఆదాయ పన్ను చెల్లించని వారికి మీ సందేశం ఏంటి? ఆదాయం ఆర్జించే వారంతా చట్ట ప్రకారం పన్నులు చెల్లించాలని కోరుతున్నాం. ఒకవేళ పన్నులు చెల్లించకపోతే చట్ట ప్రకారం వ్యవహరిస్తాం. గతంతో పోలిస్తే పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతోంది. గత ఐదేళ్ల గణాంకాలు చూస్తే రూ. కోటికిపైగా పన్ను చెల్లించే వారి సంఖ్య మూడింతలు పెరిగింది. కొత్త చట్టం అమలుతో ఐటీ చెల్లింపు విధానం మరింత సరళతరం అవుతుంది కాబట్టి పన్ను చెల్లింపులు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. కొత్త ఐటీ యాక్ట్–2025కు పాత ఐటీ యాక్ట్–1961 మధ్య ప్రధాన తేడాలేంటి? పాత చట్టంతో పోలిస్తే కొత్త చట్టాన్ని ఎంతో సరళీకరించాం. పాత చట్టంతో పోలిస్తే కొత్త చట్టంలో దాదాపు 50 శాతం మేర సెక్షన్లు, నిబంధనలు తగ్గించాం. అలాగే పాత చట్టంలో ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని ఉండేవి. ఆ సందిగ్ధత తొలగించేందుకు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒకేదాన్ని ట్యాక్స్ ఇయర్ అని తీసుకొచ్చాం. పన్ను చెల్లింపుదారుల ప్రశ్నలు, అనుమానాలకు సమాధానం ఇచ్చేలా ఏఐ చాట్బోట్ను ఏర్పాటు చేశాం. -
రిటైర్డ్ డీజీపీ భార్య కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లో రిటైర్డ్ డీజీపీ భార్య హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. పని మనిషే హత్య చేసినట్లు అనుమానిస్తున్నామని.. నేపాలీ పని మనుషులతో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ డీజీపీ భార్య తనూజాను రాత్రి రెండు గంటలకు దుండగులు హత్య చేశారన్నారు. నేపాలి గ్యాంగ్ పనిగా ప్రాథమికంగా తాము ఒక అంచనాకు వచ్చామన్న సజ్జనార్.. కొన్ని క్లూస్ లభించాయని.. ఆ క్లూస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘‘నేపాలి పని వాళ్ళ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. నేపాలి పని మనుషులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేరాలకు పాల్పడతారు. రాత్రి మాజీ డీజీపీ ఇంట్లో లేనప్పుడు ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ మరికొందరితో కలిసి ఈ క్రైమ్ చేసింది. ఘటన సమయంలో తనూజ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న కల్పనతో బయట వ్యక్తులు కాంటాక్ట్ పెట్టుకొని ఈ క్రైమ్ చేశారు. నిందితులను అతి త్వరలో ఖచ్చితంగా పట్టుకుంటాం’’ అని సజ్జనార్ పేర్కొన్నారు.ఇంట్లో ఏడాది, రెండేళ్లు పనిచేసిన నేపాలి మనుషులపై కూడా నిఘా ఉండాలి. ఈ కేసును చాలా సీరియసగా తీసుకుంటున్నాం. చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను ఈ గ్యాంగ్ హత్య చేసింది. మాజీ డిజీపి వాళ్ల మదర్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చారు. ఇటీవల మరణించారు. అప్పటినుండి మృతురాలు తనూజ ఇక్కడే ఉంటుంది. ఎంత బంగారం నగదు పోయింది అన్న అంశాలపై ఆరా తీస్తున్నాము. నిందితులు బ్యాక్ గేట్ నుండి ఇంట్లోకి ప్రవేశించారు. క్రైమ్ అనంతరం వెనక నుండి పారిపోయారు’’ అని సజ్జనార్ వివరించారు. -
జూబ్లీహిల్స్.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య
సాక్షి, జూబ్లీహిల్స్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్యకు గురయ్యారు. జూబ్లీహిల్స్లోని ఐఏఎస్ క్వార్టర్స్లో శుక్రవారం ఉదయం ఈ హత్య జరిగింది. వినయ్ రంజన్ ఇంట్లో పనిచేసే పని మనిషే ఆమెను హత్య చేసినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఎండల్లో డిమాండ్
భారీగా పెరిగిన బీర్ల విక్రయాలు సాక్షి, సిటీబ్యూరో: మద్యం ప్రియులు చిల్డ్ బీర్తో ‘చీర్స్’ కొట్టేస్తున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం బార్లకు పోటెత్తుతున్నారు. అనూహ్యంగా పెరిగిన డిమాండ్ దృష్ట్యా ఎకై ్సజ్ అధికారులు బీర్ అమ్మకాలపై రేషన్ విధించడం గమనార్హం. గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అమ్మకాలు అత్యధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే విక్రయాల్లో 45 శాతానికి పైగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు సుమారు 3 లక్షల కేస్ల బీర్ల అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. ఎకై ్సజ్ శాఖ లెక్కల ప్రకారం గత సంవత్సరం ఏప్రిల్లో 46.46 లక్షల కేస్ల బీర్లు విక్రయిచంగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 56.21 లక్షల కేస్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. సుమారు 20 శాతానికి పైగా వినియోగం పెరిగింది. మరోవైపు ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది. -
పారిశుద్ధ్య కార్మికులతో కమిషనర్ అల్పాహారం
శ్రీనగర్కాలనీ: నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేలా కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి పాటుపడతామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గురువారం యూసుఫ్గూడ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్లో, జనగణన–స్వీయ గణనలో పాల్గొని విలువైన అభిప్రాయాలను అందించాలని స్థానిక నివాసితులను, జయప్రకాష్నగర్ వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాలా సమస్యల పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వేసవిలోపు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్కిల్ డీఎంసీ సురేష్, డీవైఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అంగన్వాడీలపై అక్కడికక్కడే నిర్ణయం
ఉద్యోగాల భర్తీ ఫైల్పై మంత్రి సీతక్క సంతకం మల్లాపూర్: నగరంలో ఖాళీగా ఉన్న 180 అంగన్వాడీ టీచర్లు, 370 ఆయాల పోస్టుల భర్తీ ఫైల్పై గురువారం నాచారం తెలంగాణ ఫుడ్స్లో జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క సంతకం చేశారు. మంచి ముహూర్తం ఉండడంతో ఇక్కడే ఫైల్పై సంతకం చేశామన్నారు. తెలంగాణ ఫుడ్స్లో రూ.4 కోట్లతో చేపట్టిన మోడ్రన్ క్యాంటీన్, గోదాం భవనాల పనులకు టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫహీమ్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిని ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోందని వివరించారు. సర్కారు లక్ష్యాన్ని టీజీ ఫుడ్స్ నెరవేరుస్తూ, దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తోందన్నారు. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులదేనని సూచించారు. నగరంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న కోడి గుడ్లు సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బాలామృతం పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ సేవల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలు లేనిచోట, కొత్త భవనాలు పూర్తయ్యే వరకు జూన్ తొలి వారం నుంచి సంచార వాహనాల ద్వారా బాలామృతం, స్నాక్స్ సరఫరా చేస్తామని చెప్పారు. తెలంగాణ ఫుడ్స్ కార్మికుల ఇళ్ల స్థలంపైనా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. వారికి నాణ్యమైన భోజనం అందించేందుకు మోడ్రన్ కిచెన్ నిర్మిస్తామని, టీజీ ఫుడ్స్ను మరింత విస్తరించేందుకు అదనంగా ముడి పదార్థాల గోదాం నిర్మిస్తామని తెలిపారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రాంచంద్రన్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ ఫుడ్స్ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, ఆర్జేడీ అంకేశ్వరరావు పాల్గొన్నారు. -
గస్తీకి సుస్తీ
మల్కాజిగిరి పరిధిలో కానరాని నైట్ పెట్రోలింగ్ సాక్షి, సిటీబ్యూరో గల్లీ గల్లీలో గస్తీ. విజిబుల్ పోలీసింగ్తోనే నేరాల నియంత్రణ. నేరస్తుల కదలికలపై నిఘా పెడితేనే ప్రజలకు రక్షణ, శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. కానీ.. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్లో గస్తీ వ్యవస్థకు సుస్తీ చేసింది. పోలీసు కమిషనర్ సుమతీ డెకాయ్ ఆపరేషన్తో కమిషనరేట్లో డొల్లతనం బయటపడింది. రాత్రి వేళలో స్వయంగా సీపీనే నడి రోడ్డుపై మూడు గంటల పాటు నిల్చున్నా.. ఒక్క పెట్రోలింగ్ వాహనం అటు వైపు కనిపించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కమిషనర్ సంబంధిత ఠాణా పరిధిలోని అధికారులపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులతో రద్దీగా ఉండే దిల్సుఖ్నగర్ వంటి కీలకమైన ప్రాంతంలోనే పెట్రోలింగ్ పోలీసుల నిఘా లేకపోవడం మల్కాజిగిరి కమిషనరేట్ గస్తీ తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోడ్లపై రౌడీషీటర్ల వీరంగం.. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో మిళితమై ఉంటుంది. పట్టణ ప్రాంతాలకు పోలీసులు చేరుకోవడం కాస్త సులువే అయినా, శివార్లకు చేరుకోవడం కష్టమే. పెట్రోలింగ్ వాహనాలను, బ్లూ కోల్ట్ సిబ్బంది పెంపుతో శివార్లలోనూ గస్తీ పెట్టవచ్చు. కానీ, ఆమేరకు ఆశించినంత చర్యలు కనిపించడం లేదు. ప్రస్తుతం మల్కాజిగిరిలో 75కు పైగా పెట్రోలింగ్ వాహనాలు, రోజుకు 3 వేలకు పైగా బ్లూ కోల్ట్స్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య భారీగా తగ్గింది. పోలీసుల గస్తీ తగ్గడంతో రాత్రి వేళల్లో వసతి గృహాలు, పని ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మెట్రో స్టేషన్లు తదితర ప్రాంతాలలో రౌడీ షీటర్లు, డ్రగ్స్ పెడ్లర్లు వీరంగం సృష్టిస్తున్నారు. కర్మన్ఘాట్లో ఓ హోటల్లో బిల్లు కట్టమని అడిగిన యజమానిపై రౌడీ షీటర్లు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడమే ఇందుకు నిదర్శనం. విమెన్ పెట్రోలింగ్ ఎక్కడ? నిర్మానుష్య ప్రాంతాలు, మహిళా వసతి గృహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పెట్రోలింగ్ వాహనాల్లో పోలీసులు నిరంతరం తిరుగుతూ గస్తీ కాస్తుంటారు. 24/7 మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలనే లక్ష్యంతో బ్లూ కోల్ట్, పెట్రోలింగ్ వాహనాల్లోనూ మహిళా సిబ్బందిని నియమించారు. బ్లూ కోల్ట్ అనేది అత్యవసర సమయంలో స్పందించే బృందం. 24/7 బైక్లపై తిరుగుతూ వేధింపులు, చెయిన్ స్నాచింగ్, రోడ్డు ప్రమాదాల వంటి నేరాలు జరిగినప్పుడు వేగంగా స్పందించి, ఘటనా స్థలికి చేరుకుంటారు. కానీ, కమిషనరేట్లో ఈ వ్యవస్థ అటకెక్కింది. అలాగే స్థానిక మహిళలు, యువతతో పాటు గేటెడ్ కమ్యూనిటీ సంఘాలతో గూఢచారి వ్యవస్థను బలోపేతం చేసుకోవడం గతంలో ప్రారంభించిన సైకిల్ పెట్రోలింగ్ వ్యవస్థ క్రమంగా తగ్గింది. పోలీసు సిబ్బంది సైకిళ్లపై గల్లీల్లో తిరుగుతూ గస్తీ కాస్తుండేవారు. ఇప్పుడా వ్యవస్థ కనిపించడంలేదు. మాటలకే పరిమితం.. విజిబుల్ పోలీసింగ్ రాత్రిపూట రోడ్లపై రౌడీషీటర్ల వీరంగం చిన్నారులు, మహిళల భద్రతకూ సవాళ్లు మూలకు పడిన బైసైకిల్ పెట్రోలింగ్ వ్యవస్థ కమిషనర్ డెకాయ్ ఆపరేషన్లో వెల్లడైన డొల్లతనం -
మోదీ సభకు జనం పోటెత్తేలా..
ప్రచారంలో నిమగ్నమైన గ్రేటర్ బీజేపీ నేతలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఆదివారం నిర్వహించతలపెట్టిన ప్రధాని మోదీ సభకు భారీ జన సమీకరణ చేసేలా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఒక్కో డివిజన్కు కనీసం 500 నుంచి 1000 మందిని తరలించాలని లక్ష్యాలను నిర్దేశించింది. బీజేవైఎం ఆధ్వర్యంలో డివిజన్కు వంద బైకులకు తగ్గకుండా ర్యాలీ తీయాలని నిర్ణయించారు. అదే సమయంలో జనం స్వచ్ఛందంగా తరలి రావాలని కాలనీల్లో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. డివిజన్, నియోజకవర్గ స్థాయి నేతలతో పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ఇతర జన సమూహ ప్రాంతాల్లో కర పత్రాల పంపిణీ చేస్తున్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, మహిళా సంఘాలు, కార్మిక, ఇతర సంఘాలను సభకు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి మోదీ సభ ప్రత్యేకతలను వివరించడం, గోడలపై పెయింటింగ్స్, ఇతర ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలతో కార్యాచరణపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా.. పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడం, నాయకత్వానికి మేమున్నామని ధైర్యం కల్పించడం, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈ సభ బీజేపీకి ఒక ఆయుధంగా ఉపయోగపడతుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రెండో దశ హైదరాబాద్ మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు, వైద్యం, రైల్వే, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులు ఇతర రంగాల్లో కేంద్రం అందించిన రూ.లక్షల కోట్లు నిధులను ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. -
గ్యాస్ కొట్టేస్తున్నారు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వాణిజ్య సిలిండర్ల అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. గృహావసరాల సిలిండర్లు ఈ దందాకు ‘ఆజ్యం’ పోస్తున్నాయి. డెలివరీ బాయ్స్ చేతివాటంతో సామాన్యుడి గ్యాస్.. వాణిజ్యావసరాలకు మళ్లుతోంది. ఇటీవల పాతబస్తీ గోషామహల్, గాంధీనగర్ ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ దాడులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. డొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్ను మార్చే అక్రమ ప్రక్రియ ఇష్టానుసారంగా సాగుతోంది. అక్రమార్కులు డెలివరీ బాయ్స్ సహకారంతో డొమెస్టిక్ సిలిండర్ నుంచి 2 నుంచి 3 కిలోల గ్యాస్ను సేకరిస్తున్నారు. ఇలా పోగైన గ్యాస్ను అధునాతన రీఫిల్లింగ్ పరికరాల ద్వారా 19 కిలోల వాణిజ్య సిలిండర్లలోకి నింపుతున్నారు. అక్రమార్కులకు కాసుల పంట డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ ధరల మధ్య వ్యత్యాసం అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం డొమెస్టిక్ (14.2 కేజీలు) ధర రూ. 965 (కిలో ధర రూ. 67.95), కమర్షియల్ (19 కేజీలు) ధర రూ. 3,315 (కిలో ధర రూ.174.47) ఉంది. వీటి ధరల మధ్య వ్యత్యాసం (కిలోకు) రూ. 106.52 వరకు కనిపిస్తోంది. ఒక కమర్షియల్ సిలిండర్ను ఇలా అక్రమ రీఫిల్లింగ్ ద్వారా విక్రయిస్తే, కేవలం గ్యాస్ ధర వ్యత్యాసం ద్వారానే రూ. 1,113 వరకు లాభం వస్తోంది. దీనికి అదనంగా వ్యాపారుల నుంచి మరో రూ. 300 వసూలు చేస్తున్నారు. ఒక్కో సిలిండర్పై రూ. 1400 వరకు లాభం గడిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారుల ఆసక్తి.. గంటల్లోనే డెలివరీ మార్కెట్లో అధికారికంగా కమర్షియల్ సిలిండర్ బుక్ చేస్తే వచ్చే సమయం కంటే, బ్లాక్ మార్కెట్లో గంట వ్యవధిలోనే డెలివరీ అందుతుండటంతో వ్యాపారులు సైతం ఆసక్తి కనబర్చుతున్నారు. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కేటరింగ్ యూనిట్లు ’క్విక్ సర్వీస్’గా సిలిండర్ అందుతుండటంతో సర్వీస్ చార్జీలుగా అదనంగా రూ. 300 చెల్లించేందుకు వెనుకాడటం లేదు. సామాన్యుడిపై ప్రభావం గ్యాస్ అక్రమ దందా వల్ల అంతిమంగా నష్టపోతోంది సామాన్య వినియోగదారుడే. ఇంటికి వచ్చే డొమెస్టిక్ సిలిండర్లో బరువు తక్కువగా ఉండటంతో నెల రోజులు రావాల్సిన గ్యాస్ 20 రోజులకే నిండుకుంటోంది. పౌరసరఫరాల శాఖ తనిఖీలు నామమాత్రంగా ఉండటం, తూనికల కొలతల విభాగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడంతో అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. డొమెస్టిక్ టు కమర్షియల్ గృహావసరాల సిలిండర్లో గ్యాస్ తస్కరణ ఆపై వాణిజ్య సిలిండర్లలోకి రీ ఫిల్లింగ్ -
ఈసీఐఎల్లో పీఎఫ్ గోల్మాల్!
రూ.50 లక్షల చెక్కులు మాయం ● ఇప్పటికే రూ.40 లక్షలు విత్ డ్రా ● దర్యాప్తు చేస్తున్న పోలీసులు కుషాయిగూడ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో కార్మికుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధులు పక్కదారి పట్టాయి. పీఎఫ్ సెక్రటరీగా కొనసాగుతున్న ఉద్యోగే ఈ నిధులను కొల్లగొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి ఉద్యోగుల చెక్కులను డ్రా చేశారని పీఎఫ్ విభాగం సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుషాయిగూడలోని ఈసీఐఎల్ సంస్థలో సుమారు 10 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించిన రూ.50 లక్షల చెక్కులు మాయమయ్యాయి. కంపెనీలో పని చేసే దినసరి కూలీ పేరుతో రూ.40 లక్షలు డ్రా చేశారు. ఒకే ఎకౌంట్ నంబర్తో పెద్ద మొత్తంలో నగదు డ్రా కావడాన్ని బ్యాంకు అధికారులు పసిగట్టి ఈసీఐఎల్ పీఎఫ్ విభాగానికి సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు మిగతా చెక్కులను నిలిపివేశారు. రోజూవారీ ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ భాస్కర్రెడ్డి తెలిపారు. కాగా, ఈ గోల్మాల్ వ్యవహారంలో పీఎఫ్ విభాగం సెక్రటరీపై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఈసీఐఎల్లో పీఎఫ్ గోల్మాల్!
సాక్షి, కుషాయిగూడ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో కార్మికుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధులు పక్కదారి పట్టాయి. పీఎఫ్ సెక్రటరీగా కొనసాగుతున్న ఉద్యోగే ఈ నిధులను కొల్లగొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి ఉద్యోగుల చెక్కులను డ్రా చేశారని పీఎఫ్ విభాగం సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కుషాయిగూడలోని ఈసీఐఎల్ సంస్థలో సుమారు 10 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించిన రూ.50 లక్షల చెక్కులు మాయమయ్యాయి. కంపెనీలో పని చేసే దినసరి కూలీ పేరుతో రూ.40 లక్షలు డ్రా చేశారు. ఒకే ఎకౌంట్ నంబర్తో పెద్ద మొత్తంలో నగదు డ్రా కావడాన్ని బ్యాంకు అధికారులు పసిగట్టి ఈసీఐఎల్ పీఎఫ్ విభాగానికి సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు మిగతా చెక్కులను నిలిపివేశారు. రోజూవారీ ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ భాస్కర్రెడ్డి తెలిపారు. కాగా, ఈ గోల్మాల్ వ్యవహారంలో పీఎఫ్ విభాగం సెక్రటరీపై∙ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ప్రియురాలు పిలిచిందని వెళ్తే..
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఓ యువకుడిపై కొందరు కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం రాత్రి సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆల్వాల్లోని యాప్రాల్లో నివాసం ఉంటున్న యువన్.. నగర శివారులో ఓ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి చిలకలగూడకు వచ్చి స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన ఫోన్లో మ్యాచ్ చూస్తూ మునిగిపోయాడు. ఈలోపు బైకులపై వచ్చిన ఏడుగురు యువన్ను పక్కకు లాక్కెళ్లి దాడి చేశారు. ఈ పరిణామంతో ఆ యువకులు చెల్లాచెదురుకాగా.. కత్తులతో దాడి చేయడంతో తీవ్రగాయాలతో యువన్ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల, మెడ, చేతులు మొత్తం 15 కత్తిపోట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తొలుత భావించగా.. తర్వాత అదే నిర్ధారణ అయ్యింది. యువన్ స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయంలో పెద్దలకు తెలిసి గొడవ జరగడంతో పంచాయితీ పెట్టారు. అయితే కలుద్దామని యువతి గురువారం యువన్కు మెసేజ్ చేసింది. దీంతో యువన్ చిలకలగూడకు రాగా.. తట్టుకోలేకపోయిన యువతి సోదరుడు స్నేహితుల సాయంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. చిలకలగూడలో ఉద్రిక్తతయువన్ హత్య నేపథ్యంలో శుక్రవారం ఉదయం చిలకలగూడలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. అతని తల్లిదండ్రులు, బంధువులు యువతి నివాసం ఎదుట రోడ్డు మీద బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నంలో తోపులాట జరిగింది. దీంతో లాఠీఛార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సీతాఫల్మండి, నామాలగుండు ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు.. ఘాతుకానికి పాల్పడ్డ వాళ్లలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే యువతి కుటుంబం కూడా పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. వస్తే చంపేస్తారని చెప్పిందా?ఏడాది నుంచి యువన్ ఆ యువతితో మాట్లాడడం లేదని సోదరి మీడియా ముందు వాపోయింది. ‘‘పెద్దల అంగీకారంతో అప్పట్లో కాంప్రమైజ్ జరిగింది. ఇద్దరి మధ్య మాటలు లేకపోవడంతో అంతా సర్దుమణిగింది అనుకున్నాం. అయితే నిన్న మా తమ్ముడు ఆమె కోసం చిలకలగూడకు వచ్చాడు. వస్తే చంపేస్తారని కూడా యువతి ఫోన్లో చెప్పింది(అందుకు సంబంధించిన కాల్ సంభాషణను బయటపెట్టారు). ఆమె సోదరి, కుటుంబ సభ్యులకు నేర చరిత్ర ఉంది. మా తమ్ముడిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. వాళ్లందరినీ ఉరి తీసి మాకు న్యాయం చేయండి’’ అని వాపోయిందామె. -
25 లక్షలిస్తే.. మా అబ్బాయి మీ అమ్మాయి జోలికి రాడు..
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రిచ్కిడ్స్ ట్రాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. తనను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించాడని బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడి తల్లితో పాటు మేనమామపై కేసు నమోదు చేశారు. దీంతో, ఈ కేసు మరో మలుపు తిరిగింది.వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్కు చెందిన ప్రముఖ వ్యాపారి మైనర్ కూతురిని కూకట్పల్లికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ట్రాప్ చేసి రూ.13 లక్షల వరకు వసూలు చేశాడు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్ ఆజాద్తో పాటు ఆయన తల్లి మీనాకుమారి, తమ్ముడు రాజీవ్, మేనమామ తరక ప్రశాంత్, మీనాకుమారి స్నేహితుడు వినీల్చౌదరిలతో పాటు మరికొందరు స్నేహితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చంద్రశేఖర్ ఆజాద్ను రిమాండ్కు తరలించారు. మిగతా వారందరినీ అరెస్టు చేశారు.అయితే తన కూతురి జోలికి రావద్దని, డబ్బులు డిమాండ్ చేయవద్దని బాధితురాలి తండ్రి పలుమార్లు మీనాకుమారిని బతిమలాడారు. ‘నీ కూతురి జోలికి నా కుమారుడు రాకుండా ఉండాలంటే, నీ కూతురితో మావాడు తిరగవద్దనుకుంటే రూ.25 లక్షలు ఇవ్వాలంటూ’ మీనాకుమారి బాధిరాలి తండ్రిని డిమాండ్ చేసింది. మీనాకుమారి సోదరుడు ప్రశాంత్ కూడా పలుమార్లు బాధితురాలి తండ్రికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకుంటే నా మేనల్లుడు మీ అమ్మాయితో అలాగే తిరుగుతాడంటూ హెచ్చరించాడు. దీంతో బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మీనాకుమారితో పాటు ఫ్రశాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరో యువతి ఫిర్యాదు.. సంపన్న యువతులను ట్రాప్ చేస్తూ యువతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ సోదరుడు రాజీవ్ పై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో మరో చీటింగ్ కేసు నమోదైంది. తనను ప్రేమ పేరుతో తిప్పుకుని తరచూ శారీరిక వాంఛలు తీర్చుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేశాడని నార్సింగ్కు చెందిన ఓ యువతి తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇస్తే 'మ్యాచింగ్' అభివృద్ధి స్వింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామపంచాయతీలను నిధుల లేమి సమస్య వెంటాడుతోంది. తాజాగా మే 1 నాటికి విడుదల కావాల్సిన రూ. 2,979 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మ్యాచింగ్ గ్రాంట్లు అందకపోవడం, నిధులు పెండింగ్లో ఉండటం వల్ల గ్రామాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని వాపోతున్నారు. గ్రామాల్లో మురుగునీటి కాల్వలు, వీధి దీపాల నిర్వహణ, మరమ్మతులు, శ్మశానవాటికల నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి పనులకు అంతరాయం ఏర్పడుతోందని, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ జాప్యం జరుగుతోందని చెబుతున్నారు.కేంద్రం ఇస్తున్నా...‘మ్యాచింగ్’ లేదు.. కేంద్రం విడుదల చేసిన నిధులు సకాలంలో గ్రామ స్థాయికి చేరడం, గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించడానికి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు సకాలంలో విడుదల చేయడం అత్యంత అవశ్యం కాగా.. ఈ విషయంలో రాష్ట్రంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు క్షేత్రస్థాయి పరిస్థితులు తేట తెల్లం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రధాన బకాయిలను చెల్లించినప్పటికీ, రాష్ట్రం మాత్రం నామమాత్రంగానే నిధు లు విడుదల చేసింది. 2026 సంవత్సరం ప్రారంభం నాటికి కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయించలేదనే విమర్శలు ఉన్నాయి. పంచాయతీలకు రూ.3,991 కోట్లు విడుదల కావాల్సి ఉంటే కేవలం రూ.1,011 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కేంద్రం ఇటీవల 2026–27 సంవత్సరానికి రూ.619 కోట్లకు పైగా విడుదల చేసినప్పటికీ, గ్రామీణ స్థానిక సంస్థలు నిధుల కొరతను ఎదుర్కొంటుండటం గమనార్హం. కేంద్రం 15వ ఆర్థిక సంఘం టైడ్, అన్టైడ్ గ్రాంట్లను విడతల వారీగా విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 2026 ఫిబ్రవరిలో రూ.387.53 కోట్లు, ఏప్రిల్లో మరో రూ.619.85 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ గ్రాంట్లకు సమాన నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 2026 నివేదికల ప్రకారం.. కేంద్రం రూ.1,900.45 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా (మ్యాచింగ్ గ్రాంట్) కింద కొంత భాగాన్ని మాత్రమే విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. దాదాపు రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం (రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) నిధులు) పంచాయతీలకు రూ.1,011 కోట్లు మాత్రమే మ్యాచింగ్ గ్రాంట్ల కింద ఇచ్చింది. 2024–25లో ఎస్ఎఫ్సీ నిధులు రూ.611 కోట్లు, 2025–26లో ఇప్పటివరకు రూ.400 కోట్లు మాత్రమే (మొత్తం కలిపి రూ.1,011కోట్లు) మాత్రమే విడుదల చేసింది. మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇంకా రూ.2,979 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల తర్వాత భారీగా కేంద్ర నిధులు గత రెండున్నరేళ్లుగా (ముఖ్యంగా 2024–2026 మధ్య) తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల పంచాయతీ ఎన్నికలు జరగని కారణాల వల్ల నిలిచిపోయినప్పటికీ, 2025 డిసెంబర్ చివరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. కొత్తగా ఎన్నికైన పంచాయతీలు బాధ్యతలు స్వీకరించాక (డిసెంబర్ 22, 2025) రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ సరి్టఫికెట్లు సమరి్పంచడంతో నిధుల విడుదల వేగవంతమైంది. మొత్తం 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో తెలంగాణకు సుమారు రూ.9,000 కోట్లకు పైగా నిధులు కేటాయించగా, అందులో ఎక్కువ భాగం విడుదలయ్యాయి. అయితే ఈ నిధుల విడుదల జరిగినప్పటికీ.. 2026 మార్చి 31 లోగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) నిర్వహణలో జాప్యం కారణంగా, సుమారు రూ.550 కోట్ల కేంద్ర నిధులు రాష్ట్రానికి రాకుండా ఆగిపోయాయని, ఇప్పుడు వాటిని రాష్ట్రం తిరిగి రాబట్టుకోలేకపోతోందని అధికార వర్గాల సమాచారం. నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రం కూడా పంచాయతీల బకాయిలు పూర్తిగా చెల్లించకుండా కేవలం 2023– 2024 సంవత్సరానికి విడుదల చేయడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్ఎఫ్సీ నిధులు కానీ, మ్యాచింగ్ గ్రాంట్ కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. – పాలకొండ ప్రణీల్ చందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం -
అన్నీ డల్ 'సైబర్' హడల్
సాక్షి, హైదరాబాద్ / సాక్షి స్పెషల్ డెస్క్: దేశంలో సైబర్ నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 2024లో అన్ని రకాల నేరాలకు సంబంధించిన కేసుల్లో 6 శాతం తగ్గుదల నమోదైనప్పటికీ సైబర్ నేరాల సంఖ్య మాత్రం 2023తో పోలిస్తే 17.9 శాతం పెరిగినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) గురువారం విడుదల చేసిన 2024 నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2023లో 86,420 సైబర్ నేరాల కేసులు నమోదవగా 2024లో ఆ సంఖ్య 1,01,928కు పెరిగింది. అలాగే సైబర్ నేరాల నమోదులో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2024లో 27,230 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక (21,993 కేసులు), ఉత్తరప్రదేశ్ (11,073 కేసులు), మహారాష్ట్ర (9922 కేసులు) నిలిచాయి. దేశవ్యాప్తంగా 2024లో 51,24,205 కేసులకుగాను 35,21,488 కేసుల్లో పోలీసుల దర్యాప్తు పూర్తవగా వాటిలో 25,40,668 కేసుల్లో (72.1%) చార్జిషీట్ నమోదు సైతం పూర్తయింది.మొత్తంగా 6 శాతం తగ్గిన నేరాలు... దేశవ్యాప్తంగా 2024లో మొత్తం అన్ని రకాల నేరాలు కలిపి 58,85,867 నమోదవగా 2023లో మొత్తం కేసుల సంఖ్య 62,41,569గా నమోదైంది. 2023తో పోలిస్తే 2024లో కేసుల నమోదు సంఖ్యలో ఆరు శాతం (3,55,702) తగ్గుదల నమోదైనట్లు నివేదిక తెలిపింది. 2023తో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం 2024లో గాయపరచడం అనే నేరానికి సంబంధించి కేసుల్లో తగ్గుదలేనని నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో అన్ని రకాల నేరాలకు సంబంధించి 2024లో మొత్తం 2,17,976 కేసులు నమోదవగా 2023లో 1,83,644 కేసులు, 2022లో 1,65,830 కేసులు నమోదయ్యాయి. మహిళలపై నేరాల్లో గృహహింస కేసులే అధికం ⇒ మహిళలు, చిన్నారులపై నేరాల నమోదుకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే 2024లో మొత్తం 2,84,530 కేసులు నమోదయ్యాయి. వాటిలో ‘భర్త లేదా అతని బంధువుల క్రూరత్వం’కేసులు అత్యధికంగా 1,20,227గా నమోదయ్యాయి. అంటే మొత్తం కేసుల్లో వాటి వాటానే 42.3 శాతం. ఆ తర్వాతి స్థానాల్లో మహిళలపై అసభ్య ప్రవర్తనతో దాడులు (48,303 కేసులు, 17.0శాతం), అత్యాచారం (29,536) కేసులు, 10.4శాతం) ఉన్నాయి. ⇒ రాష్ట్రవ్యాప్తంగా 2024లో 144 వరకట్న హత్యలు నమోదవగా 10,061 గృహహింస కేసులు నమోదయ్యాయి. స్వల్పంగా తగ్గిన హత్య కేసులు... ⇒ 2024లో మొత్తంగా 27,049 హత్య కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2023తో పోలిస్తే హత్య కేసుల సంఖ్య (27,721)లో 2.4 శాతం స్వల్ప తగ్గుదల నమోదైనట్లు తెలిపింది. 2024లో నమోదైన హత్య కేసుల్లో వివాదాల కారణంగా జరిగినవి 9,607 కేసులు, వ్యక్తిగత కక్షలకు సంబంధించినవి 3,638 కేసులు, ఆస్తి కోసం జరిగినవి 1,460 కేసులు ఉన్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా 1,040 హత్య కేసులు నమోదవగా 2023లో 954 హత్యలు జరిగినట్లు నివేదిక తెలిపింది. 15.4 శాతం తగ్గిన కిడ్నాప్, అపహరణ కేసులు... 2024లో దేశవ్యాప్తంగా మొత్తం 96,079 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఇది 2023తో (1,13,564 కేసులు) పోలిస్తే 15.4 శాతం తగ్గినట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2024లో కిడ్నాప్లకు గురైన వారిలో మొత్తం 1,10,433 మందిని పోలీసులు తిరిగి గుర్తించారు. ఇందులో 1,10,087 మంది సజీవంగా లభించగా 346 మందిని మరణించాక గుర్తించారు. తెలంగాణలో 2024లో మొత్తం 3,372 కిడ్నాప్ కేసులు నమోదుకాగా 2023లో ఆ సంఖ్య 3,174గా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. -
ఎల్నినో.. తాగునీళ్లకూ నో!
సాక్షి, హైదరాబాద్: ఎల్నినో ముంచుకురావడంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2026 జూన్ నుంచి 2027 జనవరి వరకు ఎల్నినో కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే జూన్, జూలైలో వర్షాలు కురవకపోతే తీవ్ర కరువు పరిస్థితులు ఉత్పన్నమై ఆగస్టు నాటికి తాగునీటి కష్టాలు ముదిరిపోతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అరకొరగా కురిసే వర్షాలు కూడా వచ్చే వానాకాలం సీజన్లో ఆలస్యమైతే రానున్న నెలల్లో తాగునీటికి కటకటలాడాల్సిందేనని నీటిపారుదల శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అడుగంటిన జలాశయాలు: తెలుగు రాష్ట్రాలకు జీవధార అయిన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు ఇప్పటికే అడుగంటిపోగా, ఇతర జలాశయాల్లో సైతం అలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. జంట నగరాలకు తాగునీటితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు తాగు, సాగునీటిని సరఫరా చేసే కీలకమైన సింగూరు జలాశయాన్ని ఖాళీ చేసి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 39 టీఎంసీల నిల్వలే మిగిలి ఉన్నాయి. నాగార్జునసాగర్ నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలైతే ప్రస్తుతం 158.5 టీఎంసీలకు నిల్వలు పడిపోయాయి. సాగర్లో కనీసం 128.299 టీఎంసీల నిల్వలుంటే తాగునీటికి పంపింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. 29.92 టీఎంసీల సామర్థ్యమున్న సింగూరు ప్రాజెక్టులో 6.15 టీఎంసీలే ఉన్నాయి. 80.5 టీఎంసీల శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులో సైతం 22 టీఎంసీలే మిగిలాయి. 20.18 టీఎంసీలకు గాను ఎల్లంపల్లి ప్రాజెక్టులో 9.19 టీఎంసీలే మిగిలాయి. వచ్చే ఏడాది జనవరి వరకు ఎల్నినో ప్రభావం ఉండనున్న నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను అత్యంత పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వలు డెడ్ స్టోరేజీకి పడిపోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుందని, లేనిపక్షంలో హైదరాబాద్ మహానగరంతో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం తదితర జిల్లాలకు తాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 14న జరగనున్న కృష్ణాబోర్డు సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించాలని కోరుతున్నారు. -
బడి బాగు 'బోధనలోనే ల్యాగు'
సాక్షి, హైదరాబాద్/సాక్షి న్యూఢిల్లీ: పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, వసతులపరంగా జాతీయ స్థాయిలో రాష్ట్రం ముందు వరుసలో ఉన్నప్పటికీ నాణ్యతతో కూడిన విద్యావిధానం ఆశాజనకంగా లేదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. 2014– 15 నుంచి 2024–25 విద్యాసంవత్సరం మధ్య దేశవ్యాప్తంగా పాఠశాలల్లో పరిస్థితిపై నీతి ఆయోగ్ అధ్యయనం చేపట్టింది. దీని ఆధారంగా ‘స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టం ఇన్ ఇండియా: టెంపోరల్ అనాలసిస్ అండ్ పాలసీ రోడ్మ్యాప్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్’నివేదికను గురువారం విడుదల చేసింది. యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్), పరక్ (పెర్ఫార్మెన్స్ అసిస్మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్), ఎన్ఏఎస్ (నేషనల్ అచీవ్మెంట్ సర్వే), ఎసర్(యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) నివేదికలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. వసతుల్లో మెరుగే కానీ... నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం.. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులున్నాయి. స్కూళ్లలో విద్యుత్ వసతి, కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్మార్ట్ క్లాస్రూమ్ల విస్తరణ గణనీయంగా పెరిగింది. అలాగే విద్యార్థుల నమోదు రికార్డు స్థాయిలో ఉంది. 2014–15 విద్యాసంవత్సరంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి పాఠశాలల వరకు విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 87.93 శాతం ఉండగా 2024–25 నాటికి అది 111.6 శాతానికి చేరింది. అలాగే మాధ్యమిక స్థాయిలో విద్యార్థుల నమోదు 76.7 శాతం నుంచి 99.9 శాతానికి పెరిగింది. దేశంలోనే అత్యధిక మాధ్యమిక నమోదుగల రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. ప్రధానంగా 8వ తరగతి తర్వాత డ్రాపౌట్ల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు తగినన్ని ఉండటంతో విద్యార్థులు వాటిపైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో విద్యార్థుల నమోదు సంతృప్తికరంగా ఉందని నీతి అయోగ్ అభిప్రాయపడింది. కానీ బోధన, అభ్యసన కార్యక్రమాల్లో మాత్రం పెద్దగా పురోగతి లేదని పేర్కొంది. ప్రధానంగా బోధనలో నాణ్యత లోపించడం, గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో విద్యార్థులు అత్యంత వెనుకబడి ఉండటం, ప్రాథమిక అభ్యసన, అవగాహన తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 9వ తరగతి పరీక్షల్లో విద్యార్థుల గణితం, సైన్స్ ఫలితాలు జాతీయ సగటు కంటే తక్కువగా నమోదయ్యాయి. లాంగ్వెజెస్లో జాతీయ సగటుతో సమానంగా ఉన్నప్పటికీ గణితం, సైన్స్, సోషల్లో రాష్ట్రం వెనుకబడి ఉంది. ‘నాస్’2017–21 గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో అభ్యసన క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. 5వ తరగతిలో లాంగ్వెజెస్, గణితం, ఈవీఎస్ సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రతిభ పతన స్థాయిలో ఉంది. 8వ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో మార్కులు భారీగా తగ్గాయి. కరోనా తర్వాత పాఠశాలలు, విద్యార్థుల తీరు ఇంకా కోలుకోలేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. 3వ తరగతి నుంచి 5వ తరగతి ఫౌండేషనల్ లిటరసీ నుంచి కాన్సెప్ట్యువల్ లెర్నింగ్కి మారే దశలో లెర్నింగ్ గ్యాప్స్ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేటు స్కూళ్ల వైపు మళ్లుతుండటంతో.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో నిర్మాణాత్మక సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో 2,245 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేరని.. అయినప్పటికీ వాటిలో 1,016 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వివరించింది. 5,001 సింగిల్ టీచర్ స్కూళ్లలో 62 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా మార్పులు, ప్రైవేటు పాఠశాలల వైపు తల్లిదండ్రుల మొగ్గు, ప్రభుత్వ పాఠశాలలపై విశ్వసనీయత లోపిస్తుండటం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు నివేదిక విశ్లేషించింది. రాష్ట్రంలో మొత్తం 43,154 పాఠశాలలు ఉన్నప్పటికీ వాటిలో అధిక సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలే ఉండటం మరో ప్రధాన సమస్య అని నీతి ఆయోగ్ గుర్తించింది. కేవలం 974 పాఠశాలలే 1 నుంచి 12 వరకు ఇంటిగ్రేటెడ్/కాంపోజిట్ స్కూల్స్గా ఉన్నాయని తెలిపింది. దీనివల్ల విద్యార్థులు తరచూ స్కూళ్లు మారాల్సి వస్తోందని.. ఇది భవిష్యత్తులో డ్రాపౌట్లకు దారితీసే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని హెచ్చరించింది. బాలికల విద్యలో ముందంజ నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం.. ఆడపిల్లల చదువుల విషయంలో రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబరుస్తోంది. 2024–25 విద్యాసంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో బాలికల జీఈఆర్ జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ 115.6 శాతంగా నమోదైంది. ప్రాథమికోన్నత స్థాయిలో బాలికల నమోదు పదేళ్లలో 88.91 శాతం నుంచి 113.4 శాతానికి ఎగబాకింది. సెకండరీ స్థాయిలో 78.58 శాతం నుంచి 101.5 శాతానికి చేరి 100 మార్కును దాటేసింది. హయ్యర్ సెకండరీలో బాలికల నమోదు 49.58 శాతం నుంచి 71.3 శాతానికి చేరుకుంది. దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక మరుగుదొడ్లు అంతంతే.. వీల్చైర్ తదితర సదుపాయాల కోసం ర్యాంపుల ఏర్పాటులో రాష్ట్రం 28.3 శాతం నుంచి 76.7 శాతానికి ఎగబాకిందని నీతి ఆయోగ్ పేర్కొంది. కానీ దివ్యాంగులకు ప్రత్యేకంగా వినియోగపడే మరుగుదొడ్లు కేవలం 6.8 శాతం బడుల్లోనే ఉన్నాయని తెలిపింది. అయితే పదేళ్ల కిందట ఇది 2.7 శాతంగా ఉండేదని వివరించింది. రాష్ట్రానికి నీతి ఆయోగ్ కీలక సిఫార్సులు.. – భవిష్యత్తులో తెలంగాణ విద్యావ్యవస్థ రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ దిశగా ముందుకు సాగాలి. – ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీపై మరింత దృష్టి పెట్టాలి. – కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ అమలు చేయాలి. – టీచర్ ట్రైనింగ్ను ఆధునీకరించాలి. – ఏఐ ఆధారిత లెర్నింగ్ టూల్స్ వినియోగాన్ని పెంచాలి. -
పోసాని కృష్ణ మురళి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: అకారణంగా తనని, తన కుటుంబాన్ని తిడితే ఊరుకోనిని సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం తర్వాత గురువారం ప్రెస్మీట్లో పోసాని మాట్లాడారు. నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. నాకు నచ్చిన పార్టీలన్నింటికీ సర్వీస్ చేశాను. చంద్రబాబు మంచిగా ఉన్నప్పుడు ఆయనకూ సర్వీస్ చేశా. సినీ రంగానికి సేవల కోసమే నాకు ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. నిజం చెబితే ఎవరినైనా టార్గెట్ చేయడం సహజమే. అకారణంగా నన్ను, నా కుటుంబాన్ని తిడితే ఊరుకోను. నా కోపానికి ఎలాంటి హద్దులు ఉండవు’ అని వ్యాఖ్యానించారు. -
తెలంగాణలో ఇలా... ఆంధ్రప్రదేశ్లో అలా!
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్ట తెస్తుందా? లేక ఇందులో ఏమైనా రిస్క్ ను ఫేస్ చేయవలసి ఉంటుందా? రేవంత్ గురువుగా భావించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో గత సీఎం జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకువచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు పరం చేయడానికి యత్నిస్తున్నారు. రేవంత్ మాత్రం ప్రైవేటు రంగంలో ఉన్న మెట్రో రైల్ను రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కేవలం రూ.ఐదు వేల కోట్లతో కోట్లాది ప్రజలకు మంచి చేయగల వైద్య కళాశాలల ప్రారంభానికి వెనుకాడుతోంది. ఈ మధ్యకాలంలో ప్రైవేటు సంస్థ నుంచి ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం ఇదే కావచ్చు. దీనిని బట్టి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వాల కన్నా బాగా పని చేస్తాయన్నది ఒక అపోహ మాత్రమే అన్నది స్పష్టమవుతోంది. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎల్ అండ్ టీకి మేలు చేస్తోందన్న భావన కలిగినా, మెట్రో రైలు ఆస్తులు అన్ని ప్రభుత్వపరం అవుతాయి కనుక భవిష్యత్తులో వాటికి మంచి విలువ రావచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంతగా స్వాగతించడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. మెట్రో రైలు స్వాధీనం చేసుకోవడం కన్నా, ప్రత్యామ్నాయ మోడల్లో రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ను అమలు చేయవచ్చని కేంద్రం సూచిస్తోందంటూ ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. బహుశా ఇది భవిష్యత్తులో రాజకీయ వివాదంగా మారొచ్చు. మెట్రో రైల్ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎల్ అండ్ టీ రెండో దశ విస్తరణకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు చర్చోపచర్చల తరువాత ప్రాజెక్టును తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఇది మేలైన మార్గం కావడంతో ఎల్ అండ్ టీ కూడా అంగీకరించింది. ఇందుకోసం సుమారు రూ. 1461 కోట్ల విలువైన షేర్లను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించుకుంటుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టుకు ఉన్న సుమారు రూ.13538 కోట్ల మొత్తాన్ని రీఫైనాన్స్ కు అంగీకారం కుదిరింది. అంటే ఈ అప్పు భారం అంతా తెలంగాణ ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు ఇది అదనమన్నమాట. అయితే ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలేవీ పెద్దగా విమర్శలు చేయకపోవడం గమనార్హం. అయితే... ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు చూస్తే తెలంగాణ నిర్ణయం భవిష్యత్తులో వివాదమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం మెట్రో రైల్ ఫేజ్ 2, ఫేజ్ 2ఎ మ కింద సుమారు 162 కిలో మీటర్ల దూరం వరకు విస్తరించడానికి రాపిడ్ ట్రాన్సిట్ మోడల్ మంచిదని రాష్ట్రానికి సూచించిందట. దీనికి మెట్రో మోడల్ కన్నా తక్కువ వ్యయం అవుతుందని చెబతున్నారు. పటాన్ చెరు,ఆరామ్ఘఘర్, కోకాపేట, హయత్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫ్యూచర్ సిటీ, రాజివ్ గాంధీ విమానాశ్రయం, మేడ్చల్, షామీర్ పేట ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని తలపెట్టారు. ప్రస్తుతం భరిస్తున్న రుణంతో కలిపి ఈ రెండో దశకు 58 వేల కోట్ల రూపాయలు వ్యయం అవతుందని అంచనా వేస్తున్నారు.అదే కేంద్రం ప్రతిపాదిస్తున్న రాపిడ్ ట్రాన్సిట్ రైల్ వల్ల రూ.48 వేల కోట్లే ఖర్చు అవుతుందట.ఢిల్లీ-మీరట్ రూట్ లో ఈ తరహా విధానం అమలులో ఉందని చెబుతున్నారు.ఆరున్నర కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ రైల్ వస్తుందని అధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఒరిజినల్ స్కీమ్ కే కట్టుబడి ఉంటే బీజేపీ, బీఆర్ఎస్లు అదనపు భారంపై విమర్శలు చేయవచ్చు. కొత్త ప్రాజెక్టుపై అధిక వ్యయం చేయబోతున్నారని ఆరోపణలు గుప్పించవచ్చు. అలాగని ఇంత జరిగాక మెట్రో రైల్ మోడల్ కాకుండా రాపిడ్ రైల్ కు వెళ్లడం కూడా కష్టం కావచ్చు. ఏపీలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను సొంతంగా నడపలేదని, అవసరమైన పెట్టుబడులు పెట్టలేదని చంద్రబాబు సర్కార్ చెబుతోంది.ఒక పక్క అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు చేసి భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.చంద్రబాబు ఎంతసేపు ప్రైవేటువారికి సంపద కట్టబెట్టాలని చూస్తారన్న విమర్శలను విపక్షం చేస్తోంది.అయినా ఆ ప్రైవేటు సంస్థలు ఎంతవరకు బాధ్యత తీసుకుని ఆ మెడికల్ కాలేజీలను సమర్ధంగా నిర్వహిస్తాయో చెప్పలేం.దానివల్ల ప్రజలపై అదనపు భారం పడదన్న గ్యారంటీ లేదు.తెలంగాణలో మాత్రం ప్రజల ప్రయోజనాల కోసమే ప్రైవేటు కంపెనీని తప్పించి ప్రభుత్వమే మెట్రోని చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. రేవంత్ సర్కార్ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సంపద సమకూరవచ్చు.ఎందుకంటే ఇప్పటికే నిర్మాణం అయిన మెట్రోలో రియల్ ఎస్టేట్ మోడల్, మాల్స్ వంటివాటికి ఏర్పాట్లు, ప్రచార ప్రకటనల ద్వారా ఆదాయ ఆర్జన వంటివి ఉన్నాయి. ఇప్పటికైతే అవన్ని లాభసాటిగా ఉన్నాయని చెప్పలేం కాని, హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందినందున ఫ్యూచర్ లో ఇది మెరుగైన ఫలితాలు ఇవ్వవచ్చేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నిలోఫర్లో రోగి సహాయకురాలిపై దాడి!
హైదరాబాద్: నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగి సహాయకురాలిపై ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోగి సహాయకురాలిపై ఓ మహిళ సెక్యూరిటీ పిడి గుద్దులు కురిపించింది. అంతటితో ఆగకుండా మరో ముగ్గురు మహిళా సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకొని రోగి సహాయకురాలిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి సద్దుమణిగాక అధికారులు, వైద్యులు బాధితురాలిపై సానిభూతిని ప్రదర్శించి సర్ది చెప్పి బయటికి పంపింనిట్లు తెలిసింది. ఈ దాడి ఎప్పుడు జరిగింది, ఏ విషయంలో జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయమై సూపరిండెంట్ను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన స్పందించలేదు. స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
లెక్కల్లోకి పెళ్లికాని కాపురాలు!
పెళ్లికాని కాపురాలు ఇక ‘లెక్కల్లోకి’ ఎక్కనున్నాయి. సహజీవనం చేస్తున్న జంటలు సరికొత్త తరహా కుటుంబాలుగా పరి‘గణన’ పొందనున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన మొదటి దశలో తొలి అడుగు పడనుంది. జన గణనలో భాగంగా ఇళ్ల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల సంఖ్యను నమోదు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. సహజీవనం చేస్తున్న జంటలను కూడా కుటుంబంగా గుర్తించాలని అధికారులు నిర్ణయించిన విషయం విదితమే. దీంతో ఈ లెక్కలు తమకు తెచి్చపెట్టే చిక్కులపై లివ్ ఇన్ కపుల్లో కొంత అటెన్షన్, మరికొంత టెన్షన్ మొదలైంది. హైదరాబాద్: నగరంలో దాదాపు 2 దశాబ్దాల క్రితమే ఊపిరి పోసుకున్న సహజీవన సంస్కృతి కార్పొరేట్ కల్చర్తో మమేకమైపోతూ విస్తరించింది. విభిన్న ప్రాంతాల నుంచి వృత్తి ఉద్యోగాలు, వ్యాపకాల రీత్యా తరలి వస్తున్న యువతీ యువకులు రకరకాల కారణాల రీత్యా పెళ్లికి దూరంగా ఉంటూ కలిసి జీవించేందుకు అనుకూలమైనదిగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ మార్గాన్ని ఎంచుకోవడం సర్వసాధారణంగా మారింది. కెరీర్ కోసం పెళ్లిని వాయిదా వేయాలనుకునే యువత లక్ష్యాల వేటకు ఇది బాగా అనుకూలించింది. దాంతో తొలుత ఐటీ అనుబంధ కంపెనీలలోనే బాగా కనిపించిన ఈ సంస్కృతి అలా అలా హాస్పిటాలిటీ, సినిమా, టీవీ, మోడలింగ్ తదితర రంగాలకూ వేగంగా విస్తరించింది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, పోచారం, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో సహజీవనం చేస్తున్న జంటల సంఖ్య భారీగా ఉండవచ్చని అంచనా. ఈ కల్చ ర్ యువతకు కలిగించే సౌలభ్యాల సంగతి ఎలా ఉన్నా, దీని తాలూకు దుష్ప్రభావాలు పలు నేర ఘటనల రూపంలో తరచుగా వెలుగు చూస్తున్నాయి. లెక్కకు చిక్కుతారా? సాధారణంగా సహజీవనం చేసే జంటల్లో తమ వ్యవహారాన్ని పెద్దలకు తెలియనివ్వని వారే ఎక్కువగా ఉంటారు. జనగణనలో భాగంగా వీరికి సంబంధించిన వివరాలు అధికారికం అవుతాయని, అంటే ఇక తమ సంబంధం బహిరంగ రహస్యమే అవుతుందనే ఆందోళన వీరిలో ఉంది. వీరి వివరాలను తాము రహస్యంగా ఉంచుతామని అధికారులు ఇస్తున్న హామీని ఎంత వరకు విశ్వసిస్తారనేది చూడాలి. మరోవైపు ఇటీవల న్యాయ స్థానాలు వెల్లడించిన పలు తీర్పులు.. సహజీవనం చేస్తున్న జంటలకు కొన్ని రకాల హక్కులను కూడా కల్పిస్తున్నాయి. కాబట్టి అధికారిక నమోదు ప్రయోజనకారి కాగలదని కూడా కొందరు లివ్ ఇన్ కపుల్ భావిస్తున్నారు. కలిసి ఉంటున్నప్పటికీ పెళ్లి విషయంలో భవిష్యత్తులో తమ బంధం విచ్ఛిన్నమైతే ఎలా? అప్పుడు వేరే వ్యక్తులను పెళ్లి చేసుకునేందుకు తమ ప్రస్తుత వివరాల నమోదు ప్రక్రియ అడ్డంకిగా మారవచ్చునేమో కదా? అనే భయమూ కొందరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీరిలో ఎందరు సహకరిస్తారు? అలా సహకరించేలా అధికారులు వారిలో ఎటువంటి విశ్వాసం కల్పిస్తారు? అనేది చూడాలి. పోచారం ఐటీ కారిడార్కు.. సహజీవనం చేస్తున్న జంటలు విబేధాలు వస్తే ఎవరి దారిన వారు విడిపోతారు. ఇతర దేశా ల నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్లోని పడమర ప్రాంతానికి విస్తరించిన లివింగ్ రిలేషన్షిప్ నెమ్మదిగా పోచారంలోని ఐటీ కారిడార్కు పాకింది. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు రావడంతో ఈ కంపెనీలకు సమీపంలోని పలు భవనాల్లో సహజీవనం చేస్తు న్న జంటలు కనిపిస్తున్నాయి. జనగణనతో వీరిలో ఎలాంటి మార్పు వస్తుందో వేచి చూడాల్సిందే. పాత లెక్కల ప్రకారం పోచారం డివిజన్లో 60 వేల జనాభా ఉండగా, ఇప్పుడు లక్షన్నరకు చేరుకునే అవకాశం ఉంది. వీరిలో ఐటీ ఉద్యోగులే ఎక్కువని అంచనా. -
మెట్రో ఫేజ్–2కు ఆమోదం తెలపండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏడు కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్–2 సమగ్ర ప్రణాళికను రూపొందించి ఇప్పటికే డీపీఆర్ను సమర్పించినట్లు తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో సీఎం సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2, ఫేజ్–3పై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫేజ్–2, ఫేజ్–3 విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశంతో మెట్రో ఫేజ్–1ను ఎల్అండ్టీ ఎంఆర్హెచ్ఎల్ను ప్రభుత్వం స్వా«దీనం చేసుకుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఫేజ్–2ను భారత ప్రభుత్వం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్జీఐ ఎయిర్పోర్ట్ – భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్ను మెట్రో ఫేజ్–3గా చేపట్టాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. దీనికి సంబంధించిన డీపీఆర్ను కూడా ఇప్పటికే సమర్పించామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా) ఎన్వీఎస్ రెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్కుమార్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేరళలో మోదీ, అమిత్షాలను ఓడించాం: సీఎం – వాళ్లకు ఒక్క సీటే దక్కింది తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కేరళలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాను ఓడించామని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు స్పందించారు. ‘కేరళలో కాంగ్రెస్ విజయం సాధించింది. అక్కడ రాహుల్, ప్రియాంకా గాం«దీ, మల్లికార్జున ఖర్గేలు నరేంద్ర మోదీ, అమిత్షాలను ఓడించారు. వాళ్లకు అక్కడ ఒక్క స్థానం మాత్రమే దక్కింది. అదీ వాళ్ల పనితీరు..’అంటూ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. -
అధికారం దక్కలేదనే కేటీఆర్ ఆక్రోశం
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్లో కూడా అధికారం దక్కదనే భయంతోనే కేటీఆర్ తీవ్ర నిరాశ, అసహనంలో తెలంగాణ ప్రజానీకం అసహ్యించుకునేలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమాన్ని విస్మరించి, ఇప్పుడు రాజకీయ మైలేజీ కోసం మాటల దాడులకు దిగడం వారి నిస్సహాయతకు నిదర్శనమని మంత్రి విమర్శించారు. వరంగల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రైతు సంక్షేమంపై చింత కాదు..పూర్తిగా రాజకీయ నిరాశ, ఆక్రోశానికి ప్రతిబింబమని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై, వారిపై ఈగ వాలనివ్వకుండా కాపాడుతూం అన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం..బీఆర్ఎస్ అసలు రాజకీయ స్వరూపాన్ని బయటపెడుతోందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. వరంగల్లో నిర్వహించిన సభ రైతు సంగ్రామ సదస్సుగా చెప్పడం పూర్తిగా అసత్యమని, అది బీఆర్ఎస్ ఆక్రోశ సభ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. ఆ సమావేశానికి రైతులు రాలేదని కేవలం పార్టీ కార్యకర్తలే హాజరయ్యారని విమర్శించారు. రైతుల ప్రాణాలతో ఆటలాడినవారే ఇప్పుడు రైతు మిత్రులమంటూ మాట్లాడటం ప్రజలను మోసం చేయడమేనన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పంటల బీమా ఎత్తివేసి, వరదలు–వర్షాలతో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదని చెప్పారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసి అప్పుల బారినుంచి బయటపడే అవకాశం లేకుండా చేసిందే బీఆర్ఎస్ అని మండిపడ్డారు. అందుకే రైతులే వారిని అధికారానికి దూరం చేశారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమంలో చరిత్ర సృష్టిస్తోందన్నారు. పంట నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నామని, నెలకు సగటున రూ.5,500 కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు రూ.2,533 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. రెండేళ్లలోనే రైతుల కోసం లక్షా 5 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి, రైతు భరోసా, రుణమాఫీ, బీమా వంటి పథకాలతో రైతులకు నిజమైన అండగా నిలిచామని పేర్కొన్నారు. రైతు పేరుతో రాజకీయాలు చేసే రోజులు ముగిశాయని, తెలంగాణ రైతులు నిజాన్ని గుర్తించి తగిన సమాధానం ఇస్తారని మంత్రి స్పష్టం చేశారు. రాహుల్గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని హామీలను నెరవేర్చిందన్నారు. -
వయోపరిమితి ఐదేళ్లు పెంపు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అభ్యర్థుల వయోపరిమితి పెంపుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వం పదేళ్లపాటు వయోపరిమితి సడలింపును ఇవ్వగా... ప్రస్తుతం ఆ ఉత్తర్వుల కాలపరిమితి తీరింది. దీంతో ఈ అంశంపై స్పష్టత ఇచ్చాకే కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈసారి వయోపరిమితి పెంపును ఐదేళ్ల పాటు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో ఉద్యోగ నియామక ప్రకటనల జారీలో తీవ్ర జాప్యం నెలకొనడం... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు దాదాపు పదేళ్లపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి రావడంతో ప్రభుత్వం అప్పట్లో పదేళ్లపాటు వయోపరిమితిని సడలించింది. దీంతో సాధారణ వయసు 34 సంవత్సరాలు కాగా... వయోపరిమితి సడలింపుతో 44 ఏళ్ల వయసు వరకు ఉద్యోగ అర్హత పరీక్షలు రాసే అవకాశం కలిగింది. తాజాగా ఐదేళ్లు మాత్రమే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గరిష్ట వయోపరిమితి 39 ఏళ్లకే పరిమితం కానుంది. జీఏడీ వద్ద పెంపు అంశం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 70వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. గతేడాది ప్రభుత్వం జాబ్ కేలండర్ ఇచ్చినప్పటికీ... ఉద్యోగ ప్రకటనలు మాత్రం వెలువడలేదు. ప్రస్తుతం వయోపరిమితిపై స్పష్టత లేకపోవడంతో కొత్త నియామక ప్రకటనలు వెలువడటం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఆర్థిక శాఖ వద్ద ఉంది. గ్రూప్–1 కేటగిరీలోనే దాదాపు 160 ఖాళీలున్నట్లు సమాచారం. ఇతర కేటగిరీల్లో భారీగా ఖాళీలున్నాయి. వయోపరిమితి సడలింపు ఉత్తర్వులు వెలువడితే నూతన నియామకాలకు మార్గం సుగమం కానుంది. వయోపరిమితి సడలింపు అంశం ప్రస్తుతం సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశం తర్వాత దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. పదేళ్లు పెంచాలని విజ్ఞప్తి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు వయోపరిమితిని పదేళ్లు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్తోపాటు పలువురు నిరుద్యోగులు భేటీ అయ్యి వినతిపత్రాన్ని సమర్పించారు. ఉద్యమ కాలంలో పదేళ్లపాటు ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పదేళ్ల కాలంలో ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేసిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. రెండు దశాబ్దాల కాలంలో సరైన నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి, అర్హత కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై భట్టి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం వయోపరిమితిపై తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
రోగి కోలుకోవడంలో ట్రాన్సిషనల్ కేర్ కీలకం
హైదరాబాద్: శస్త్రచికిత్సలు, తీవ్ర అనారోగ్యం తర్వాత రోగులు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి 'ట్రాన్సిషనల్ కేర్' (మధ్యంతర సంరక్షణ) ఎంతో కీలకమని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి పేర్కొన్నారు. ఇవాళ (బుధవారం) హైదరాబాద్లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన 'ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్' సెంటర్ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి జగదీష్ గౌడ్, సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ డైరెక్టర్ మౌనికా రెడ్డి అట్ల తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. "సాధారణంగా ఆసుపత్రులు రోగుల ప్రాణాలను కాపాడి నిలకడగా ఉంచుతాయి. కానీ, వారు తిరిగి సాధారణ జీవనశైలికి చేరుకోవడానికి ప్రత్యేక పునరావాస కేంద్రాల అవసరం ఉంది. మన దేశంలో ఇటువంటి ప్రత్యేక కేంద్రాల కొరత ఉంది. అమెరికా ప్రమాణాలతో ఎవరెస్ట్ కేర్ సెంటర్ అందుబాటులోకి రావడం అభినందనీయం" అని అన్నారు.ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ కె. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికాలో 20 ఏళ్ల క్లినికల్ అనుభవం తర్వాత, స్వదేశంలో ప్రపంచస్థాయి వైద్య సేవలందించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. పక్షవాతం (స్ట్రోక్), వెన్నెముక గాయాలు, వృద్ధాప్య సమస్యలతో బాధపడే వారికి ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందిస్తామని వివరించారు. వైద్యులు, స్థానిక నేతలు ఈ కేంద్రాన్ని సందర్శించి, ఇక్కడి అత్యాధునిక వసతులను పరిశీలించారు. నగరం నడిబొడ్డున ఇలాంటి సమగ్ర పునరావాస కేంద్రం అందుబాటులోకి రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.కేంద్రం ప్రత్యేకతలు:అడ్వాన్స్డ్ రోబోటిక్స్ మరియు స్పెషలైజ్డ్ థెరపీ జోన్లుడిమెన్షియా (మతిమరుపు), పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక విభాగాలుఅమెరికా దేశపు ఎవిడెన్స్ బేస్డ్ రీహాబిలిటేషన్ ప్రోటోకాల్స్. -
హైదరాబాద్లో మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే..
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మే 10వ తేదీన మధ్యాహ్నం 1.10 గంటలకు మోదీ బెంగళూరు విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయలుదేరతారు. మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీపై నుంచే పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్లో హైటెక్ సిటీకి వెళ్తారు. 3.45-4.15 గంటల మధ్య అక్కడి సాయి సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. తిరిగి 4.40 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.40-5.25 గంటల మధ్య రిజర్వ్ సమయం ఉంటుంది. 5.30 గంటలకు మోదీ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 వరకు బహిరంగ సభలో ఉంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి జామ్ నగర్కు తిరిగి వెళ్తారు.ప్రధానమంత్రి మోదీ మే 10న హైదరాబాద్ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రత, ట్రాఫిక్, బందోబస్తుపై పోలీసులకు సూచనలు చేశారు. కాన్వాయ్ మార్గాలను పరిశీలించి అవసరమైన రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. -
తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. 17 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, వైఎస్ ఛైర్మన్లను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్గా బొమ్మ శ్రీనివాస్, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్గా బండి రమేష్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్గా బస్వరాజు శ్రీనివాస్....హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఛైర్మన్గా గూడెం వెంకటరమణ, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా శ్రీనివాస్, పెరికి కార్పొరేషన్ ఛైర్మన్గా కొంగర వెంకటేశ్వర్లు, వెలమ కార్పొరేషన్ ఛైర్మన్గా జువ్వాడి నర్సింగ్రావు, యాదవ్ కార్పొరేషన్ ఛైర్మన్గా రఘునాథ్ యాదవ్, వాషర్ మెన్ - డాక్టర్ అజయ్ కుమార్, గీత కార్మిక - చంద్ర శేఖర్ గౌడ్, మేర-సంగ వెంకట్ రాజం, వాల్మీకి బోయ - గట్టు తిమ్మప్ప, వడ్డెర ఫెడరేషన్-గుంజా రేణుక, లైవ్ స్టాక్ - చరణ్ కౌశిక్ యాదవ్లను ప్రభుత్వం నియమించింది. -
కిమ్స్లో క్రీడా గాయాలు & ఆర్థ్రోస్కోపీపై ఫెలోషిప్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కిమ్స్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విద్యారంగం, స్పోర్ట్స్ మెడిసిన్లో కీలక మైలురాయిని సాధించింది. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రీడా గాయాలు ఆర్థ్రోస్కోపీపై అంతర్జాతీయ గుర్తింపు పొందిన తొలి ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ సాధారణ ఆర్థోపెడిక్ శిక్షణ, క్రీడాకారులు, శారీరకంగా చురుకైన వ్యక్తులకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు రూపొందించబడింది. ఆర్థ్రోస్కోపీ అనే ఈ మినిమల్ ఇన్వేసివ్ శస్త్రచికిత్స పద్ధతి చిన్న జాయింట్ స్థలాల్లో అధునాతన పరికరాలు మరియు ఫైబర్ ఆప్టిక్ కెమెరా సహాయంతో పని చేసే నైపుణ్యాన్ని కోరుతుంది. ఏసీఎల్ (ACL) పునర్నిర్మాణం, లాబ్రల్ రిపేర్, కార్టిలేజ్ రీస్టోరేషన్ వంటి శస్త్రచికిత్సలు అత్యంత ఖచ్చితత్వంతో చేయాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్ ద్వారా వైద్యులకు ఈ నైపుణ్యాలపై సమగ్ర శిక్షణ అందుతుంది.ఈ కార్యక్రమంలో మోకాలి, భుజం, నడుము జాయింట్ల రీకన్స్ట్రక్టివ్ ఆర్థ్రోస్కోపీతో పాటు స్పోర్ట్స్ మెడిసిన్, జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీలో ప్రత్యేక శిక్షణ అందింస్తారు. ప్రాక్టికల్ శస్త్రచికిత్స అనుభవంతో పాటు సైద్ధాంతిక బోధనను కలిపి, ఖచ్చితమైన శస్త్రచికిత్స, క్రీడలకు సంబంధించిన గాయాల అంచనా, పునరావాస విధానాలు మరియు ఆధారిత వైద్య విధానాలపై ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. కిమ్స్ హాస్పిటల్స్ మెుదటి నుంచే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెరుగైన చికిత్స ఫలితాలతో పాటు నిపుణుల తయారీకి కట్టుబడి ఉంది. ఈ ఫెలోషిప్కు లభించిన అంతర్జాతీయ గుర్తింపు, సంస్థ యొక్క వైద్య నైపుణ్యం మరియు గ్లోబల్ ప్రమాణాలపై ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ఈ ఫెలోషిప్ కార్యక్రమానికి డైరెక్టర్ ఆర్థ్రోస్కోపీ, స్పోర్ట్స్ మెడిసిన్ హెచ్ఓడి డా. ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం దేశంలో ఆధునిక ఆర్థోపెడిక్ శిక్షణకు మార్గదర్శిగా నిలవనుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ మరియు ఆర్థ్రోస్కోపీ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ హెచ్ఓడి డా. ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి మాట్లాడుతూ, ఈ ఫెలోషిప్ ద్వారా అత్యాధునిక ఆర్థ్రోస్కోపీ పద్ధతుల్లో వైద్యులను శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రాంతంలో క్రీడా గాయాల చికిత్స నాణ్యతను మరింత మెరుగుపరచగలమని తెలిపారు. ఈ కార్యక్రమంతో కిమ్స్ హాస్పిటల్స్ ఆధునిక వైద్య విద్య మరియు ప్రత్యేక శస్త్రచికిత్స సేవలలో తన నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, దేశవ్యాప్తంగా కొత్త ప్రమాణాలను స్థాపిస్తోంది. -
ఐపీఎస్ సుమతికి వేధింపులు.. పోకిరీలకు దిమ్మతిరిగే షాక్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పోకిరీల ఆట కట్టించేందుకు మల్కాజ్గిరి సీపీ సుమతి సరికొత్త ప్రయోగం చేశారు. కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్నారు. దీంతో, సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు.. వేధింపులకు గురి చేశారు. వస్తావా? రేటెంత? అంటూ ఐపీఎస్నే వేధింపులకు గురిచేశారు. అనంతరం, దాదాపు 40 మంది పొకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఐపీఎస్ అధికారిణినే ఇంత వేధించారు అంటే అత్యవరస పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వెళ్ళే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.మల్కాజ్గిరి సీపీ సుమతి తన మార్క్ చూపించారు. దిల్సుఖ్నగర్లో పోకిరీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. సీపీ సుమతి మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 వరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్నారు. ఈ సందర్భంగా అధికారి సుమతిని పోకిరీలు చుట్టుముట్టారు. ‘వస్తావా? రేటెంత?’ అంటూ అసభ్య పదజాలంతో వేధించారు. దీంతో, దాదాపు 40 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, స్పెషల్ ఆపరేషన్లో పట్టుబడ్డ వారంతా విద్యార్థులు, ఉద్యోగార్థులు కావడం గమనార్హం. వీరిలో పలువురు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం. 40 మంది పోకిరీలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.వస్తావా? రేటెంత? అంటూ ఐపీఎస్ అధికారిణి సుమతికి వేధింపులుదిల్సుఖ్నగర్లో మంగళవారం అర్ధరాత్రి మల్కాజ్గిరి సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్న ఐపీఎస్ అధికారి సుమతిని చుట్టుముట్టిన పోకిరీలుఅర్ధరాత్రి 12 గంటల నుంచి 3.30 వరకు సాగిన స్పెషల్… pic.twitter.com/aKJcRbQxRK— Telugu Scribe (@TeluguScribe) May 6, 2026 -
సెల్ఫోన్ సినిమాలు చూస్తున్నారా..!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఓ బాధితుడికి టోకరా వేశారు. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్ పరిధిలో ఓ వ్యక్తి సెల్ఫోన్లో ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తుండగా ‘లేటెస్ట్ సినిమాలు ఫ్రీగా చూడండి, ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి’అనే ప్రకటన కనిపించింది. ఆ ప్రకటనలో కనిపించిన లింక్పై బాధితుడు క్లిక్ చేయగా.. ‘ gdpr. tubi. tv వెబ్సైట్ తెరుచుకుంది. అందులోంచి యాప్ను డౌన్లోడ్ చేసుకుని సినిమా కూడా చూశాడు. కానీ, కొద్దిసేపటికే బాధితుడి ఫోన్లో సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతున్నట్లు కనిపించింది. కొన్ని నిమిషాల తర్వాత మొబైల్ సరిగా పనిచేయకపోవడం, యూపీఐ సేవలు స్పందించకపోవడం, ఇతర యాప్లు తెరుచుకోకపోవడంతో ఆందోళనకు గురైన బాధితుడు వెంటనే బ్యాంక్ ఖాతాలను పరిశీలించాడు. తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.80 వేలు, తల్లి బ్యాంక్ ఖాతా రూ.95 వేలు డెబిట్ అయినట్లు గుర్తించి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్: ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబ సభ్యులు అందించే చేప ప్రసాదాన్ని జూన్ 8వ తేదీన ప్రారంభించనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు అమర్నాథ్ గౌడ్, గౌరీ శంకర్ గౌడ్, అనిరుధ్ గౌడ్, దుర్గా గౌడ్ మంగళవారం తెలిపారు. మృగశిర కార్తె ప్రవేశం రోజైన 8వ తేదీన దూద్బౌలిలోని తమ నివాసంలో ప్రత్యేక వనమూలికలతో చేప ప్రసాదాన్ని తయారు చేస్తా మన్నారు. ఆ రోజు తమ కుటుంబ సభ్యులు, బంధువులు చేప ప్రసాదాన్ని సేవించిన అనంతరం సాయంత్రం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానానికి తరలించి రాత్రి 9 గంటలకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. 10వ తేదీన దూద్»ౌలిలోని తమ నివాసంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. -
తల్లి సహకారం.. కొడుకుల వలపు వల
హైదరాబాద్: సంపన్న బాలికలకు వలపు వల విసురుతూ అన్నదమ్ములు రూ.లక్షల్లో దండుకున్న కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల విచారణలో వెల్లడైన మేరకు.. కూకట్పల్లికి చెందిన ఈవెంట్ మేనేజర్ కొడూరి చంద్రశేఖర్ ఆజాద్ (22) ఖరీదైన అద్దె కార్లలో తిరుగుతూ ఇన్స్ట్రాగామ్లో ఫొటోలు పెట్టి సంపన్న బాలికలు, యువతులతో పరిచయాలు పెంచుకున్నాడు. వెయ్యిమంది యువతులు ఫాలోవర్స్ ఉన్న అతడికి తల్లి మీనాకుమారి, మేనమామ ప్రశాంత్ ప్రోత్సాహం ఉంది. నిందితుడితో పాటు అతడి సోదరుడు రాజీవ్ను పొక్సో కింద అరెస్టు చేసి, రిమాండ్కు తరలించి 4 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరి స్నేహితుడు కార్తీక్ను అరెస్టు చేశారు. మంగళవారం మీనాకుమారి, ఆమె స్నేహితుడు వినీల్చౌదరి, ప్రశాంత్, చంద్రశేఖర్ స్నేహితులు హేమంత్, జితిన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చంద్రశేఖర్ ముఠా నాయకుడిగా వ్యవహరిస్తూ అమ్మాయిలకు వల వేసేలా స్నేహితులను ప్రోత్సహించినట్లు తేలింది. వారి వీడియోలను అడ్డంపెట్టుకుని రూ.లక్షల్లో వసూలు చేసినట్లు గుర్తించారు. సీపీ రంగంలోకి దిగింది అందుకే.. కొంతమంది కొత్త తరహా వసూళ్లకు తెరలేపారని, నగరంలో ఇది చాపకింద నీరులా విస్తరిస్తోందని చంద్రశేఖర్ అరెస్టుతో పోలీసులు నిర్ధారిస్తున్నారు. అందమైన యువకులను, ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిని గుర్తించి డబ్బు సాయం చేస్తూ ఖరీదైన కార్లు ఇస్తున్నారు. పబ్లు, క్లబ్లలో జల్సాలకూ సాయం చేస్తున్నారు. అమ్మాయిలను ట్రాప్ చేసి సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. తర్వాత వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీ సజ్జనార్ స్వయంగా కేసు విచారించినట్లు తెలుస్తోంది. ఆదిలోనే ఈ సంస్కృతికి చెక్ పెట్టాలని, వీరి వెనుక ఎవరున్నారో చూడాలని మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్యను ఆదేశించినట్లు సమాచారం. -
నేడు ఉప్పల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ఎస్ఆర్హెచ్, పంజాబ్ కింగ్స్ జట్ల బుధవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు ఉప్పల్ స్టేడియం వైపు వచ్చే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు ఉప్పల్ ఏషియన్ థియేటర్ ఎదురుగా ఉన్న రోడ్డు నుంచి హెచ్ఎండీఏ లేఅవుట్ ద్వారా నాగోల్ వైపు నుంచి వెళ్లాలి. ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి యూ టర్న్ తీసుకుని భగాయత్ లే అవుట్ ద్వారా వరంగల్ రోడ్డుకు వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, చెంగిచర్ల ఐఓసీ నుంచి వరంగల్ వైపు పోవాలి. వరంగల్ నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలు ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఎక్కి ఎల్బీనగర్ నుంచి నగరానికి చేరుకోవాల్సి ఉంటుంది. -
రాజమౌళికి షాకిచ్చిన జలమండలి.. ‘వారణాసి’ షూటింగ్కి బ్రేక్
వేసవిలో గొంతెండుతున్న సామాన్యుడి దాహార్తి తీర్చడం అవసరమా? సినిమా షూటింగ్ కోసం నీటి సరఫరాకు ప్రాధాన్యమా? ఈ రెంటి మధ్య తలెత్తిన ప్రాధాన్యతా అంశంలో జలమండలి సామాన్యుడి పక్షాన నిల్చుంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ షూటింగ్ కోసం కోరిన నీటి సరఫరాను జలమండలి నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అండర్ వాటర్ షూట్.. 150 ట్యాంకర్లు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలోని కీలకమైన అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం గగన్పహాడ్ పరిసరాల్లో భారీ కొలను నిర్మించారు. దీనిని నింపడానికి దాదాపు 150 ట్యాంకర్ల (సుమారు 15 లక్షల లీటర్లు) శుద్ధి చేసిన జలం కావాలని జలమండలికి లేఖ రాశారు. మే 18న జరగబోయే ఈ షూటింగ్ కోసం అవసరమైన వ్యయాన్ని భరిస్తామని ప్రతిపాదించారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ఇంత భారీ మొత్తంలో నీటిని మళ్లించడం భావ్యం కాదని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి తేల్చిచెప్పారు. నీరు ఇవ్వడం సాధ్యపడదని స్పష్టం చేశారు. -
891.38 ఎకరాల భూమి సర్కార్కే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్)కు బాలానగర్లో అప్పగించిన 891.38 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాదీనం చేసుకోకుండా 2008 నాటి పారిశ్రామిక, ఆర్థిక పునర్విర్మాణ మండలి (బీఐఎఫ్ఆర్) ఇచ్చిన ఉత్తర్వును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2008లోనే ప్రభుత్వం భూమిని అధికారికంగా స్వాధీనం చేసుకున్నందున, బీఐఎఫ్ఆర్ ఉత్తర్వులో హేతుబద్ధత లోపించిందని చెప్పింది. నాటి ఉత్తర్వు అమలులో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పూడ్చలేని నష్టాన్ని చవిచూస్తుందని అభిప్రాయపడింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయకుండా, వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇప్పటికే ఈ భూమిని టీజీఐఐసీకి అప్పగించడం కూడా జరిగిందని గుర్తు చేసింది. తదుపరి విచారణ జూన్ 22కు వాయిదా వేసింది. ఈ వివాదం 90వ దశకంలో మొదలైంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వినియోగం కోసం ఆ భూమిని సేకరించి, ఒక ఫార్మాస్యూటికల్ ప్లాంట్ను స్థాపించడానికి ఐడీపీఎల్కు బదిలీ చేసింది. ఆ భూమిని కేవలం పారిశ్రామిక ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలనే నిర్దిష్ట ఒప్పందం కింద అప్పగించారు. అయితే, ఐడీపీఎల్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిపై దృష్టి పెట్టకుండా, తన పరిపాలనా భవనాలను ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని తెలుసుకున్న ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు ప్రారంభించింది. వివాదం బీఐఎఫ్ఆర్కు చేరడంతో.. భూ స్వాధీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, కంపెనీపై బలవంతపు చర్యలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. మూడో పక్షానికి లీజుకివ్వడం కుదరదు.. ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్దిష్ట ప్రజాప్రయోజనం కోసం బదిలీ చేసిన భూమిని ఒక సాధారణ ప్రైవేట్ అమ్మకంలా పరిగణించకూడదన్నారు. ఒప్పందం ప్రకారం పరిశ్రమల స్థాపన కోసమే ఈ భూమిని వినియోగించుకోవాలి తప్ప.. మూడో పక్షానికి లీజుకు, సబ్ లీజుకు ఇచ్చి తద్వారా ఆదాయ వనరుగా మార్చుకోకూడదన్నారు. ఐడీపీఎల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2008లో ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్లో తీవ్ర జాప్యం జరిగిందని, పిటిషన్ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. 2008 నుంచి చట్టపరమైన పరిస్థితులు గణనీయంగా మారాయన్నారు. బీఐఎఫ్ఆర్ను రద్దు చేశారని, కేసును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు సక్రమంగా బదిలీ చేశారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల కోసం లీజుకు ఇవ్వడాన్ని కూడా సమర్థించలేమన్నారు. నాటి ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
ముందుకు సాగని హిల్ట్ పీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఐదారు దశాబ్దాల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక వాడలను ‘బహుళ వినియోగ జోన్లు’గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ‘హిల్ట్ పాలసీ’ముందుకు సాగడం లేదు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు (ఎస్ఆర్ఓ) రేట్ల కంటే బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపాక్ట్ డెవలప్మెంట్ ఫీజు ఎక్కువగా ఉండటంతో పాటు ఇతర కారణాలతో పరిశ్రమల యజమానులు హిల్ట్ పీపై ఆసక్తి చూపడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశాజనకంగా లేకపోవడం, ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు పరిశ్రమల తరలింపులో ఇబ్బందులు తదితరాలు కూడా ఈ పాలసీ అమలుకు అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడల యజమానులతో టీజీఐఐసీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. వారి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని భావిస్తోంది. మల్టీ యూజ్ జోన్లుగా పారిశ్రామిక వాడలు హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం–2025 (హిల్ట్ పీ)ని గత ఏడాది సెప్టెంబర్లో ప్రభుత్వం ఆమోదించి జీఓ నంబర్ 27 విడుదల చేసింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల దృష్ట్యా పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించడం, బాలానగర్, కాటేదాన్, కూకట్పల్లి సహా మొత్తం 22 పారిశ్రామికవాడల్లోని 9,292 ఎకరాలను మల్టీ యూజ్ జోన్లుగా మార్పిడి చేయాలన్నదే ఈ పాలసీ లక్ష్యం. దీని ద్వారా పారిశ్రామికవాడలను.. అపార్ట్మెంట్లు, సమీకృత టౌన్íÙప్లు, ఆఫీసులు, హోటళ్లు, స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, క్రీడా కేంద్రాలు, కల్చరల్ సెంటర్లు తదితరాల కోసం వినియోగించేలా వెసులుబాటు కల్పిస్తారు. సవాలక్ష సందేహాలు ఇండస్ట్రియల్ లోకల్ ఏరియా అథారిటీ (ఐలా)ల ఆధ్వర్యంలో టీజీఐఐసీ నిర్వహిస్తున్న సమావేశాల్లో పరిశ్రమల యజమానులు అనేక సందేహాలు వ్యక్తం చేయడంతో పాటు తమ డిమాండ్లు వినిపిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరిశ్రమలను మూసివేసి హిల్ట్ పాలసీ కింద దరఖాస్తు చేసుకునేందుకు చాలామంది విముఖత చూపుతున్నారు. మల్టీ యూజ్ జోన్గా మార్చుకునేందుకు టీజీఐఐసీకి చెల్లించాల్సిన డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు ఎక్కువగా ఉందని కొందరు చెప్తున్నారు. పరిశ్రమలను ఉన్న ఫళంగా మూసి వేసి ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు తరలించడం సాధ్యం కాదని అంటున్నారు. ఓఆర్ఆర్ వెలుపల భూమి కొనుగోలు, కొత్త పరిశ్రమ ఏర్పాటు అంత సులభతరం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పరిశ్రమల తరలింపులో ఎదురయ్యే సవాళ్లు అన్నింటిలోనూ ప్రభుత్వ సహకారం ఇవ్వాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమల తరలింపుతో తమ వ్యాపారం దెబ్బతినడంతో పాటు ఆధారపడిన వారు ఉపాధి కూడా కోల్పోతారనే వాదన కూడా కొందరు వినిపిస్తున్నారు. ఈ ఫీజు ఎస్ఆర్ఓ కంటే తక్కువగా ఉండాలని కొందరు పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. పరిశ్రమల మూతకు వెనుకంజ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి నిరాశాజనకంగా ఉండటంతో హిల్ట్ పాలసీ కింద దరఖాస్తు చేసుకునేందుకు పరిశ్రమల యజమానులు విముఖత చూపుతున్నారు. నడిచే పరిశ్రమ స్థానంలో మల్టీ యూజ్ జోన్ ఏర్పాటు చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతవరకు లాభదాయకం అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదైనా ఒక పారిశ్రామిక వాడలోని అన్ని పరిశ్రమలు ఏకకాలంలో తరలివెళ్తేనే మల్టీ యూజ్ జోన్గా మార్చడం సాధ్యమవుతుంది. అందుకే పరిశ్రమల యజమానులతో టీజీఐఐసీ సంప్రదింపులు జరుపుతోంది. వాస్తవానికి ఆరు నెలల్లోగా పాలసీ అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. మే నెలాఖరుకు ఆరు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయి మార్గదర్శకాలపై స్పష్టత లేకుండా పోయింది. పరిశ్రమల యజమానుల డిమాండ్లు, రాయితీలు, ఫీజు తగ్గింపు వంటి విన్నపాలపై స్పష్టత ఇస్తూ పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వెలువరిస్తే పాలసీ ముందుకు సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తుమ్మిడిహెట్టి కోసం.. మళ్లీ సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగిరం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. 150 మీటర్లకు ఎత్తును పెంచి తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించుకోవడానికి మహారాష్ట్ర అంగీకారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తక్షణమే సంప్రదింపులను ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి వారం రోజుల్లో మహారాష్ట్రకు వెళ్లి ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమై చర్చలు జరపనున్నారు. ఇందుకోసం ఫడ్నవీస్ అపాయింట్మెంట్ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మిస్తే లిఫ్టు అవసరం లేకుండానే గ్రావిటీ కాల్వ ద్వారా గోదావరి జలాలను ఎల్లంపల్లి ప్రాజెక్టుకి తరలించవచ్చు. దీంతో ప్రాజెక్టు వ్యయం సైతం భారీగా తగ్గనుంది. ఫడ్నవీస్ మహారాష్ట్రలో విపక్షనేతగా ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బరాజ్ నిర్మాణంతో మహారాష్ట్రలో ముంపునకు గురికానున్న రైతుల ఆందోళనలకు సైతం ఆయన మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అయ్యాక ఆయనతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. 2016 మార్చి 8న నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు మహారాష్ట్రకు వెళ్లి 148 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి ఫడ్నవీస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించి 165 టీఎంసీల జలాలను తరలించడానికి 2015 ఫిబ్రవరి 13న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తోపాటు పలు అనుమతులు సైతం వచ్చాయి. పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణలో 2011 ఏప్రిల్లో బహిరంగ విచారణ నిర్వహించగా, మహారాష్ట్రలో చేపట్టలేకపోయారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదన్న కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి దాని స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను నిర్మించింది. ప్రస్తుతం ఈ మూడు బరాజ్లు విఫలమై కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారాయి. ఎల్ నినో ప్రభావంతో వచ్చే 2–7ఏళ్ల పాటు తీవ్ర వర్షాభావం నెలకొనే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేసింది. 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే గ్రావిటీతో నీళ్లను తరలించుకోవచ్చని, కనీసం 129.23 టీఎంసీల నీటి లభ్యత ఉండనుందని ప్రభుత్వం అంచనాకు వచి్చంది. ఆ మేరకు ఎత్తు పెంచినా మహారాష్ట్రలో పెద్దగా ముంపు పెరగదని భావిస్తోంది. -
అన్నీ ఎక్సెస్సే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో ఎక్సెస్ టెండర్లు దాఖలు చేశారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు పలు ప్యాకేజీల కింద టెండర్లు పిలవగా.. దాదాపు రూ.18 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులకు గాను కాంట్రాక్టు సంస్థలు కనీసం 14 శాతం నుంచి ఏకంగా 50 శాతం వరకు ఎక్కువగా టెండర్లు దాఖలు చేశారు. కాంట్రాక్టర్లు రింగ్ అయి ఈ విధంగా ఎక్సెస్కు టెండర్లు దాఖలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ ప్యాకేజీల కింద లోయస్ట్ బిడ్ (ఎల్–1) దాఖలు చేసిన కాంట్రాక్టర్లకే ప్రభుత్వం వీటిపై ఎలాంటి చర్చలు, సంప్రదింపులు జరపకుండా ఈ టెండర్లను కట్టబెడితే అంచనాల కంటే అధికంగా ప్రభుత్వం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఖజానాపై రూ.3 వేల కోట్లకు పైగా భారం పడుతుందని స్పష్టమవుతోంది. రహదారులు, భవనాల శాఖ కింద రోడ్ల నిర్మాణానికి గాను 34 ప్యాకేజీలకు, పంచాయతీరాజ్ శాఖ కింద 17 ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు. ఆర్అండ్బీలో సగటున 21.69% ఎక్సెస్ ఆర్అండ్బీ శాఖ కింద మొత్తంగా 6,092 కిలోమీటర్ల రోడ్ల పనులను మొత్తం 34 ప్యాకేజీలుగా (రూ.12,176.53 కోట్లు) విభజించి టెండర్లు పిలిచారు. అందులో 31 ప్యాకేజీలకు సాంకేతిక, ఆర్థిక బిడ్లను తెరిచారు. ఎల్–1 కాంట్రాక్టర్లను ఖరారు చేశారు. మొత్తం 31 ప్యాకేజీల బిడ్ ప్రాజెక్టు కాస్ట్ (బీపీసీ) రూ.11,018.92 కోట్లు కాగా.. ఎల్–1లుగా నిర్ధారించిన కాంట్రాక్టర్లు 21.69 శాతం అధికంగా మొత్తం విలువ రూ.13,408.98 కోట్లుగా కోట్ చేశారు. ఈ ప్యాకేజీల్లో ఒకటైన సిద్దిపేట బీపీసీ విలువ రూ.430. 38 కోట్లు కాగా.. కీస్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏకంగా రూ.753.16 కోట్లు అంటే 75 శాతం ఎక్సెస్కు టెండర్ దాఖలు చేసి ఎల్–1 నిలిచింది. రూరల్ సర్కిల్ హైదరాబాద్–2 ప్యాకేజీ బీపీసీ రూ. 300.42 కోట్లు కాగా అనూషా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.459 కోట్లకు బిడ్ వేసింది. అంటే 52.79 శాతం ఎక్సెస్కు బిడ్ను దాఖలు చేసింది. ఈ విధంగా అన్ని ప్యాకేజీల్లోనూ ఎక్సెస్ టెండర్లు దాఖలు కావడం గమనార్హం. మరో మూడు బిడ్లు (విలువ రూ.1157.61 కోట్లు) ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో వాటిని తిరస్కరించారు. పంచాయతీరాజ్లో 22.10% ఎక్కువగా.. పంచాయతీరాజ్ శాఖలో మొత్తం 17 ప్యాకేజీలకు రూ.6,294 కోట్లతో టెండర్లు పిలిచారు. వీటిల్లో 11 ప్యాకేజీలకు సంబంధించి టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లను ఆ శాఖ దాదాపు ఓకే చేసింది. ఎల్–1లుగా వచ్చిన కాంట్రాక్టు సంస్థల జాబితాను కూడా రూపొందించింది. ఈ 11 ప్యాకేజీల విలువ రూ.3,979.19 కోట్లు కాగా ఎల్–1లుగా నిలిచిన కాంట్రాక్టు సంస్థలు సగటున 22.10 శాతం ఎక్సెస్ (రూ.4,858.46 కోట్లు)తో టెండర్లు దాఖలు చేసినట్లు ఉన్నతాధికారులు రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. అంటే రూ.900 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందన్న మాట. ఈ 11 ప్యాకేజీల్లో 8 ప్యాకేజీలకు ఒకే కంపెనీ జె.ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎల్–1గా వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన ఆరు ప్యాకేజీలకు (రూ. 2,315 కోట్ల పనులు) రీ టెండర్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించి ప్రభుత్వానికి నివేదించారు. అసలు హ్యామ్ అంటే.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే రహదారి నిర్మాణానికి రూ.100 కోట్లు వ్యయం అవుతుందనుకుంటే.. అందులో 40 శాతం నిధులను అంటే రూ.40 కోట్లు ప్రభుత్వం రహదారి నిర్మాణ సమయంలో నాలుగు దశల్లో చెల్లిస్తుంది. మిగిలిన రూ.60 కోట్లను కాంట్రాక్టర్ బ్యాంకుల నుంచి రుణం తీసుకుని నిర్మించాల్సి ఉంటుంది. అయితే ఈ రూ.60 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీతో సహా 15 ఏళ్లల్లో ఆ కాంట్రాక్టరకు చెల్లిస్తుంది. ఈ పదిహేనేళ్లపాటు ఆ రహదారి నిర్వహణ బాధ్యతను సదరు కాంట్రాక్టరే నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్తో పాటు బిల్ట్ ఓన్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పూర్తి చేస్తారు. రోడ్ల అభివృద్ధిలో భాగంగా జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చే వాటిని నాలుగు లేన్లుగా, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చేవి రెండు లేన్లుగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చే రహదారులను మరింత పటిష్ట పర్చాలని, అవసరమైన చోట బీటీ రహదారులుగా మార్చాలని, మండల కేంద్రానికి అనుసంధానించే రహదారుల్లో మట్టి, కంకరతో ఉన్న వాటిని బీటీతో అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్.. కాంట్రాక్టర్లకు పనులు పారంభించేందుకు గాను వారికి కేటాయించిన పని విలువలో 10 శాతం మేరకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 18 వేల కోట్ల పనులకు గాను 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద దాదాపు రూ. 1,800 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. దశల వారీగా పనులు చేపడుతున్నప్పటికీ ఈ మొత్తాన్ని ముందుగా వారికి చెల్లించాల్సిందే. -
ప్రైవేట్ పాఠశాలల ఫీజులు.. మానవ హక్కుల సంఘం కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల ముందస్తు ఫీజు వసూలు విషయంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పాఠశాలల్లో ముందస్తు ఫీజు వసూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఇటువంటి చర్యలు అనుచితం, ఏకపక్షమైనవే కాకుండా వాణిజ్యపరంగా విద్యను మలచరాదనే న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు మానవహక్కుల సంఘం ఛైర్మన్ షమీమ్ అక్తర్ అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్లోని ఒక ప్రైవేట్ పాఠశాల 2026–2027 విద్యా సంవత్సరానికి 50% ఫీజును ముందుగానే వసూలు చేయడం, అలాగే పుస్తకాలు మరియు యూనిఫాంల కోసం ముందస్తు చెల్లింపులు కోరడం వంటి అంశాలపై మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. దీనిని విచారించిన హ్యుమన్ రైట్స్ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్య హక్కు ప్రాథమిక హక్కు కాగా, దానిని లాభాపేక్షతో నిర్వహించరాదని సంఘం పునరుద్ఘాటించింది.తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారం, అలాగే నిర్దిష్ట విక్రేతల వద్ద నుంచే పుస్తకాలు, యూనిఫాంల కొనుగోలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల పారదర్శకత లోపిస్తున్న అంశాలను గమనించిన సంఘం, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి తగిన చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ నిబంధనల ప్రకారం విడతలవారీగా ఫీజులు వసూలు చేసే విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది.ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చట్టం, 1993 ప్రకారం నిర్ణీత గడువులోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారిని సంఘం ఆదేశిస్తూ, ఈ వ్యవహారాన్ని ముగించింది. -
నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ వీరోచిత పోరాటం.. ప్రాణాలకు తెగించి..
హైదరాబాద్: నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందుకు ప్రయత్నిస్తే.. ప్రాణాలకు తెగించి, తన ఆటోనే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్.. రౌడీ షీటర్ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ప్రతిఘటించారు.ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. మహమ్మద్ జాహెర్కు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మార్చి 4వ తేదీ తెల్లవారుజామున మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే, డబీర్పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు.జాహెర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని కిందపడేశారు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. ఆ సమయంలో పారిపోతుండగా వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులు రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జాహెర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు. కాగా, ఈ వీరోచిత దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రౌడీ షీటర్ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి, నిస్వార్థంగా వెళ్లిపోయిన ఆ అజ్ఞాత వీరుడి కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో నంబర్ను చూసి, సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్ను గుర్తించారు.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. “కళ్లముందే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుంది" అని ప్రశంసించారు.నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా, మహమ్మద్ జాహెర్లా ధైర్యంగా స్పందించి వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా, డబిర్ పూరకు చెందిన రౌడీ షీటర్ పై గోషా మహల్ పీఎస్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయి. ✅ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్✅ఆటోతో ఢీకొట్టి ‘నిలువరించిన’ తీరు.. సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం✅సన్మానించిన నగర సీపీ సజ్జనర్.. నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేతనేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని… pic.twitter.com/IyGunUWQyB— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) May 5, 2026 -
కొత్వాల్గూడలో ‘హైడ్రా’మా!
సాక్షి, హైదరాబాద్: కొత్వాల్గూడ్లో హైడ్రా హడావిడి చేస్తోంది. స్థానికంగా ఓ క్రషర్స్ మిషన్స్ను కూల్చివేస్తోంది. ఇది ఓ మంత్రికి సంబంధించిందంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండడం గమనార్హం. వట్టినాగులపల్లిలో అనుమతి లేని క్రషర్లను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. మొత్తం ఐదు ప్రాంతాల్లో అక్రమ క్రషింగ్ యూనిట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో ఉన్న ఈ క్రషర్ల చుట్టూ ఉన్న వివాదాలు నెలకొన్నాయి. జీవో నెంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ.. అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్స్ కంపెనీ క్రషర్లను నడుపుతోందని ఆరోపణలు వచ్చాయి. హిమాయత్సాగర్ క్యాచ్మెంట్ ఏరియా (111 జీవో పరిధి)లో ఈ క్రషర్లు పనిచేస్తున్నాయని, గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని స్థానికులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే..తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. 15 స్టోన్ క్రషర్లకు (పరిధిలోని వివిధ ప్రాంతాలు) జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం. అయితే సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ లిస్ట్లో లేదని స్థానిక అధికారులు తెలియజేశారు. ఆ వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. -
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాచుపల్లి-మియాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న ఫర్నీచర్ షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి.. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. సుమారు 20 కుటంబాలు రోడ్డున పడ్డాయి. షాపుల్లోని ఫర్నిచర్ సోఫా సెట్టులు, ఇంటి సామగ్రి, టేబుల్స్ దగ్ధమయ్యాయి.ఒక్కో షాప్లో సుమారు రూ. 3 లక్షల రూపాయల విలువైన సామగ్రి ఉంది. సంఘటన స్థలానికి ఆరు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి.. అయితే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రజావాణిలో 55 ఫిర్యాదులు
లక్డీకాపూల్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు సమర్పించారు. నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలు 36 వినతిపత్రాలు అందజేశారు. జోన్ వారీగా అందిన ఫిర్యాదుల్లో శంషాబాద్ జోన్లో 2, రాజేంద్రనగర్ జోన్లో 6, చార్మినార్ జోన్లో 3, ఖైరతాబాద్ జోన్లో 2, సికింద్రాబాద్ జోన్లో 6 ఫిర్యాదులు అందాయి. మొత్తం 55 ఫిర్యాదులు ప్రజావాణి కార్యక్రమంలో అందినట్లు అధికారులు తెలిపారు. రాంగోపాల్పెట్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభా వేదిక వద్ద సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇంచార్జి అభయ్ పాటిల్ పాల్గొన్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని, సభకు 2 లక్షలమందిపైగా హాజరవుతారని రాంచందర్రావు తెలిపారు. -
ప్రేమ పేరుతో నయవంచన
● సంపన్న యువతులే లక్ష్యంగా మోసాలు ● పోక్సో నిందితుడిని స్వయంగా విచారించిన సీపీ బంజారాహిల్స్: సంపన్న యువతులే లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి వ్యాపారం పేరిట లక్షల రూపాయలు వసూలు చేసిన చీటర్ను జూబ్లీహిల్స్ పోలీసులు నాలుగు రోజుల కస్టడీ నిమిత్తం తీసుకువచ్చారు. సోమవారం నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ స్వయంగా నిందితుడిని విచారణ చేశారు. కూకట్పల్లిలో నివసిస్తూ ఈవెంట్ మేనేజ్మెంట్లో పని చేస్తున్న కొడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (22) ఇన్స్ట్రాగామ్లో ఖరీదైన కార్లలో తిరుగుతున్నట్లు క్లబ్లు, పబ్ల్లో మద్యం తాగుతున్నట్లు ఫొటోలు పెడుతూ యువతులను ఆకర్షించేవాడు. ఈ క్రమంలో వెంకటగిరికి చెందిన ఓ బాలిక చంద్రశేఖర్ ఉచ్చులో పడింది. స్టార్టప్ పేరుతో ఆమె నుంచి రూ.13 లక్షలు వసూలు చేశాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కింద పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మాయ మాటలతో యువతులను ఆకర్షిస్తూ చాలా మందిని మోసం చేసినట్లుగా విచారణలో తేలడంతో సోమవారం స్వయంగా సీపీ సజ్జనార్ ఇక్కడికి విచ్చేసి నిందితుడితో మాట్లాడారు. ఎంత మందిని మోసం చేసిన విషయాన్ని కూడా ఆరా తీశారు. సుమారు గంట పాటు సీపీ సజ్జనార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుపై దృష్టిసారించారు. కస్టడీ అనంతరం నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. చంద్రశేఖర్ తల్లి మీనాకుమారితో పాటు మేన మామను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్కు రంగం సిద్ధం చేశారు. -
రేపటి నుంచి యువ నాటకోత్సవాలు
గన్ఫౌండ్రీ: నాటక రంగం వైపు యువతను ప్రోత్సహించేందుకు బుధవారం నుంచి మూడు రోజుల పాటు రవీంద్రభారతిలో యువ నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలోని అకాడమీ కార్యాలయంలో యువ నాటకోత్సవాల బ్రోచర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 6న డింభక రాజ్యం వీధి, సిరిసిరి మువ్వ కల్చరల్ సంస్థ కళాకారులు గేమ్ సామాజిక నాటకం, నవ క్రాంతి కల్చరల్ అసోసియేషన్ కళాకారులు శ్రీ మహిషాసుర మర్దిని పద్య నాటకాలను ప్రదర్శిస్తారని వెల్లడించారు. 7న నిషాహి నిషి వీధి నాటకం, స్వప్నం రాల్చిన అమృతం, స్వామియే శరణం అయ్యప్ప పద్య నాటకాలను ప్రదర్శిస్తారని తెలిపారు. 8న మాయాజాలం డాట్ కామ్, అమ్మ చెక్కిన బొమ్మ, యయాతి అనే పద్య నాటక ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. మూడు రోజుల పాటు సాయంత్రం వేళల్లో ప్రదర్శించనున్న నాటకోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. -
ఉత్సాహంగా బాల సమ్మేళనం
సుల్తాన్బజార్: బాల సాహిత్యానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని వక్తలు అన్నారు. సోమవారం సాయంత్రం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో బాల సాహిత్య సమ్మేళనం ఘనంగా జరిగింది. ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు నుంచి బాల సాహితీ వేత్తలు, బాల సాహిత్య వికాసం కోసం ఉత్తమ అభిరుచితో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు పాల్గొని బాల సాహిత్యాన్నికి ఉన్నత భవిష్యత్తు కల్పించే వివిధ అంశాలపై చర్చలు సాగించారు. పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన శాంత వసంత ట్రస్ట్ సౌజన్యంతో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన సమ్మేళనంలో పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి బాల సాహిత్య మిత్ర, బాల సాహితీమూర్తి పురస్కారాలను ప్రధానం చేశారు. ప్రభుత్వ మాజీ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి హాజరైన బాల సాహితీవేత్తలు -
జీఓ నెం.7 రద్దు చేయాలి
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాంపల్లి: జీఓ నెం.7ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు జిఓను తీసుకువచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. స్పష్టత లేని జిఓను వెంటనే రద్దు చేయకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం రాత్రి గన్పార్కు ఎదుట విద్యార్థులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆగమైపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మాకు తెలంగాణ వస్తే మంచి చదువులు వస్తాయని, మా బతుకులు ఎంతో బాగుపడుతాయని ఆశిస్తే విద్యార్థులకు చదువులే లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా తాత్సరం చేస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, నరసింహా నాయక్, విద్యార్థి నేతలు సానియా, అంకిత, వైష్ణవి, సాయి, అర్చన, రమ్య, అశ్విని, కీర్తి, అక్షయ పాల్గొన్నారు. -
బాలల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి
మణికొండ: బాలలంతా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకునే భరోసా ఇవ్వాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన, పోలీస్ కమిషనర్ ఎం.రమేష్లు అన్నారు. నార్సింగిలోని రాజపుష్ప లేబర్ క్యాంప్లో వలస కార్మికుల పిల్లల కొరకు వర్క్ సైట్ స్కూల్ను వారు ప్రారంభించారు. నాణ్యమైన విద్యతో వారికి మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని, ఇది దేశంలోనే మొదటి పాఠశాల అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వలస కార్మికుల శ్రమ ఎంతో ఉందని, వారి పిల్లల భవిష్యత్తుకు మనం భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, రాజపుష్ప ఫౌండేషన్ ప్రతినిధి పుష్పలీల తదితరులు పాల్గొన్నారు. -
గూగుల్లో చూసి.. సంతకాలు ఫోర్జరీ చేసి..
మంత్రులు, జడ్జిల పేర్లతో క్రికెట్ అసోసియేషన్లకు టోకరా ఉప్పల్: మంత్రులు, న్యాయమూర్తుల పేరును వాడుకుంటూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల టికెట్లను సంపాదించడంతో పాటు ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్న ముఠా గుట్టును ఉప్పల్ పోలీసులు రట్టు చేశారు. దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లను వాడుకొని అధికారులను మోసగించిన తీరు విస్తుగొలుపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు.. ఈ నెల 3న ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు స్టేడియం పార్కింగ్ వద్ద టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారనే సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. ఉప్పల్ ఎస్ఐ మాధవరెడ్డి బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పదంగా తచ్చాడుతున్న మహీంద్రా థార్ వాహనాన్ని తనిఖీ చేసింది. అందులో ఉన్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు సంగతి బయటపడింది. అత్యున్నత స్థాయి వ్యక్తుల సంతకాలు ఫోర్జరీ కేవలం బ్లాక్లో టికెట్లు అమ్మడం మాత్రమే కాకుండా, ఈ ముఠా పెద్ద స్కెచ్ వేసింది. గూగుల్ నుండి న్యాయమూర్తలు, మంత్రులు, గవర్నర్ల అధికారిక లెటర్ హెడ్లను డౌన్న్ లోడ్ చేసేవారు. వాటిపై సంబంధిత అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లకు సమర్పించేవారు. అలా వీవీఐపీల కోటాలో ఖరీదైన ’కాంప్లిమెంటరీ’ టికెట్లను పొంది, ఆ తర్వాత వాటిని అవసరమున్న వారికి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా పట్టుబడ్డారు. చైన్నె ప్రాంతానికి చెందిన ముగ్గురి సహకారంతో వీరు టికెట్లను సంపాదించే వారు. ఈ సీజన్లో ఉప్పల్లో రెండు మ్యాచ్లకు, బెంగుళూరులో రెండు మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను పోందారు. ఉప్పల్కు వచ్చే సరికి ఒకసారి టికెట్ను ఇచ్చిన హెచ్సీఏ అధికారులు రెండవ సారికూడా టికెట్లను అందజేసి చివరకు అనుమానం రావడంతో ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులైన గట్టమనేని అశోక్(20) రియల్ ఎస్టేట్ వ్యాపారి, కంకనాల దినేష్(25)పార్టీల జెండాలను తయారు చేసే వ్యాపారం, సింగమనేని వేణుమాధవ్(26)ప్రైవేట్ ఉద్యోగి. ఈ ముగ్గురూ ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం పల్కూరు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చైన్నెకి చెందిన మరో ముగ్గురు నిందితులు ఆశిష్, సెంథిల్, తాన్సిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ. 22 వేల విలువ గల 5 టికెట్లు, మహీంద్రా థార్ వాహనం. 5 మొబైల్ ఫోన్లు, 5 ఫోర్జరీ చేసిన లెటర్ హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ టికెట్లు పొంది బ్లాక్లో విక్రయం ఉప్పల్ స్టేడియం వద్ద ముగ్గురు నిందితుల అరెస్ట్ -
జడ్సీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ చాంబర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోవడంతో ల్యాప్ టాప్తో పాటు ఫర్నిచర్ దగ్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం. సెలవు దినం కావడంతో కార్యాయలంలో ఎవరు లేరు. హై వోల్టేజీతో రివర్స్ విద్యుత్ సరఫరా కావడంతో ఈఈ చాంబర్ పక్కనే ఉన్న కేబుల్స్ కాలిపోయాయి. అక్కడి నుంచి రెండో అంతస్తులో జడ్సీ చాంబర్లో మంటలు చెలరేగాయి. ల్యాప్ టాప్, ఫర్నీచర్, విద్యుత్ లైట్లు, ఫ్లోర్ పూర్తిగా కాలిపోయింది. దీంతో జడ్సీ అమిత్ కాన్ఫరెన్స్ హల్లోనే సోమవారం విధులు నిర్వహించారు.ఇదిలా ఉండగా హై వోల్టేజీ కారణంగా శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలోను కేబుల్స్ కాలిపోయినట్లు తహసిల్దార్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఎంఈఓ కార్యాలయం బయట కూడా కొన్ని విద్యుత్ వైర్లు కాలిపోయాయయి. -
వడదెబ్బతో గుర్తు తెలియనివ్యక్తి మృతి
విజయనగర్కాలనీ: ఎండ వేడిమికి తాళలేక ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ సఘటన సోమవారం ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుడిమల్కాపూర్ విజయశ్రీ అపార్టుమెంట్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (50) స్పృహ లేకుండా పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే అతడు మృతిచెంది ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. వడదెబ్బతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
దక్షిణమధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సాక్షి, సిటీబ్యూరో: వేసవి డిమాండ్ దృష్ట్యా రైళ్ల నిర్వహణ, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సదుపాయాలు, భద్రతపై దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సమావేశం నిర్వహించారు. అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వడగాలుల దృష్ట్యా రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టవలసిన చర్యలపై జీఎం దిశానిర్దేశం చేశారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ట్రాక్లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, అవసరమైన మేరకు ట్రాక్లను కంకరతో నింపాలని సూచించారు. వేడి వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు వేసవి జాగ్రత్తల ప్రాముఖ్యతపై ట్రాక్ పెట్రోల్ సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. రైళ్లలో ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా నివారించడానికి నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా డ్రైవ్ను సమీక్షించారు. ప్రైవేట్ సైడింగ్లు, గూడ్స్ షెడ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ ప్రవేశాలకు ఆవకాశం ఉన్న కొన్ని ప్రదేశాలలో ట్రాక్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలన్నారు. -
హైదరాబాద్
చెత్త ఏరుకునేవారిలాగ వచ్చి.. చీరల చోరీ బంజారాహిల్స్: చెత్త సేకరించే మహిళలు లాగా భుజాలపై సంచులు వేసుకుని వచ్చిన నలుగురు మహిళలు ఓ చీరల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జహ్నుమా నవాబ్సాబ్ కుంటకు చెందిన ఎండీ సాదిక్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లో చీరల దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నలుగురు మహిళలు భుజాలపై చెత్తను ఏరుకునే సంచులు వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఈ చీరల దుకాణం వద్దకు వచ్చి చెత్త ఏరుతున్నట్లు నటిస్తూ షోరూం తాళాలు పగులగొట్టారు. లోనికి వెళ్లి రూ.2 లక్షల ఖరీదైన చీరలను మూటగట్టుకుని మెల్లగా జారుకున్నారు. సోమవారం ఉదయం షాపు తెరవడానికి వచ్చిన సాదిక్ తాళాలు పగులగొట్టి ఉండడం గమనించాడు. లోపల దుస్తులన్నీ చిందరవందరగా పడి ఉండడం అనుమానం వచ్చింది. చాలామంది చీరలను వర్క్ పనుల కోసం ఆయనకు ఇస్తుంటారు. వాటిని కూడా చోరీ చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థానికి చేరుకుని ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించగా నలుగురు మహిళలు ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు తేలింది. వీరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నరు. -
ఐస్క్రీమ్ తేకపోతే బదిలీ చేస్తా!
ఎస్ఐకి జోన్ ఉన్నతాధికారి హుకుం సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఖరీదైన జోన్లో ఓ ఉన్నతాధికారి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. కింది స్థాయి సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు బూతులు మాట్లాడతారని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. శనివారం తెల్లవారు జామున 4 గంటల వరకూ కమిషనర్ అన్ని జోన్ల ఉన్నతాధికారులతో కలిసి చర్చించి ఒకేసారి 65 మంది ఇన్స్పెక్టర్ల బదిలీకి రంగం సిద్ధం చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న ఓ జోన్ ఉన్నతాధికారి తెల్లవారుజామున 3 గంటలకు ఓ ప్రొహిబిషనరీ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)కు ఫోన్ చేసి ఐస్క్రీమ్ తీసుకురావాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ‘మనమే షాప్లను బంద్ చేయిస్తున్నాం కదా సార్. ఈ సమయంలో ఐస్క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది?’ అని సదరు ఎస్ఐ సమాధానం ఇవ్వగా.. చెప్పింది చేయకుంటే మల్టీ జోన్కు బదిలీ చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో చేసేదేం లేక గల్లీ గల్లీ తిరిగి ఆ ఎస్ఐ అధికారులందరికీ ఐస్ క్రీమ్ తీసుకెళ్లక తప్పలేదు. ఇదే జోన్ అధికారి మరో సందర్భంలో ఓ భూ తగాదా కేసులో తాను ఆదేశించినట్లు చేయనందుకు మరో ఎస్ఐపై ఆగ్రహానికి గురై ఫోన్లోనే బూతు పురాణం వినిపించాడు. తిట్ల దండకాన్ని సదరు ఎస్ఐ ఫోన్లో రికార్డ్ చేసి సహచరులకు, పలువురు ఉన్నతాధికారులకు వినిపించి, తన గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. గంటలో రిలీవ్ కావాలంటూ.. కాగా.. సైబరాబాద్ కమిషనరేట్లో ఒకేసారి 32 మంది ఎస్ఐలను చార్మినార్ జోన్కు అటాచ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఎస్ఐలు గంటలోపు రిలీవ్ కావాలని సెట్లో కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం నిర్ణీత గంట వ్యవధి విధిస్తూ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ (ఎస్హెచ్ఓ)లకు ఆదేశాలు రావడంతో గందరగోళం నెలకొంది. బాస్ ఆదేశాలతో చేసేదేం లేక ఎస్ఐలను రిలీవ్ చేసే పనిలో ఎస్హెచ్ఓలు నిమగ్నమయ్యారు. వివిధ కేసుల్లో కోర్టుకు వెళ్లిన ఎస్ఐలకు మెమోలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. బదిలీ అయిన వారిలో కొందరు ఎస్ఐలు డీజీపీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అర్ధరాత్రి గల్లీ గల్లీ తిరిగి పట్టుకొచ్చిన ఎస్ఐ కేసు దర్యాప్తులో మరో ఎస్ఐపై దుర్భాషలు సైబరాబాద్లో చర్చనీయాంశం -
ఒకపూట చిరుధాన్యాల ఆహారంతో ఆరోగ్యం
రాజేంద్రనగర్: రోజూ ఒక పూట చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), న్యూట్రీ హబ్ సహకారంతో మిల్లెట్ మార్వెల్స్ ఆధ్వర్యంలో సోమవారం రాజేంద్రనగర్ ఐఐఎంఆర్లో ‘‘రోజుకు ఒక పూట చిరు ధాన్యాల భోజనం’’ జాతీయ మిషన్కు వర్చువల్గా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ తాను చిరుధాన్యాల అహారం తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని తగ్గించుకోగలిగానన్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ సి.తారా సత్యవతి మాట్లాడుతూ, జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఒక పూట చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం మంచిదన్నారు. -
శిల్పారామంలోసమ్మర్ ఆర్ట్ క్యాంప్
● ఈనెల 22 వరకు శిబిరం మాదాపూర్: మాదాపూర్లోని శిల్పారామంలో సోమవారం సమ్మర్ ఆర్ట్ క్యాంపును ప్రారంభించారు. పాటరీ, పెన్సిల్ స్కెచ్, మధుబని పెయింటింగ్,ఆక్రలిక్ పెయింటింగ్, సీసెల్ క్రాప్ట్, వాటర్ కలర్స్, క్లే టాయ్స్, లిప్పన్ ఆర్ట్ తదితర అంశాలలో చిన్నారులకు, పెద్దలకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచి ఇటువంటి సాంప్రదాయ పెయిటింగ్స్లో శిక్షణ ఇవ్వడం వల్ల వారిలో సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు. వివరాలకు 8886652030, 8886652004 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
విద్యార్థిని అవయవాల దానం
బంజారాహిల్స్: ఇటీవల వెలువడ్డ ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా ఆమె కళ్లతోపాటు ఇతర అవయవాలను తల్లిదండ్రులు దానం చేసి తమ కూతురు మరికొందరికి ప్రాణం పోయాలన్న సంకల్పం నెరవేర్చుకున్నారు. ఫిలింనగర్లోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన లావణ్య సాయి(16) ఇంటర్ ఫెయిల్ అయింది. తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. అయితే తమ కూతురు మట్టిలో కలిసిపోకూడదని మరికొందరికి చూపు నివ్వడమే కాకుండా ప్రాణం పోయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉంగరాల మూర్తి–సుబ్బలక్ష్మి దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు. కూతురి అవయవాలను దానం చేస్తూ నిర్ణయం తీసుకొని అందరితో శభాష్ అనిపించుకున్నారు. -
‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ లోగో ఆవిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ ’(ఈ2ఈ) అంతర్జాతీయ వేదిక లోగోను ఆవిష్కరించారు. తెలంగాణను గ్లోబల్ బిజినెస్ హబ్గా నిలిపేందుకు కృషిచేయాలన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ..2027 మార్చి 31 నాటికి 1,000 వ్యాపారాలు, విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సందీప్ కుమార్ మక్తాలా, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, టీ కన్సల్ట్ డైరెక్టర్ భాగ్య లక్ష్మి వాకిటి తదితరులు పాల్గొన్నారు.


