breaking news
Hyderabad
-
సీఎం రేవంత్ ఇంటికి మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డితో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. సీఎం రేవంత్కు రాఖీ కట్టేందుకు వచ్చారు. వివాదం తర్వాత తొలిసారి సీఎంతో ఆమె సమావేశమయ్యారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు తర్వాత పొలిటికల్ గ్యాప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ కమిటీ.. నివేదికను ఏఐసీసీకి పంపించింది.. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్తో కొండా సురేఖ భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది. చెల్లెమ్మ సురేఖను అన్న రేవంత్ క్షమిస్తారా?. కాంగ్రెస్లో కొండా సురేఖ తుపాన్ ముగిసిపోతుందా?. సుస్మిత కామెంట్ల వివాదానికి తెరపడుతుందా? అనే చర్చ జరుగుతోంది.కాగా, తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికతో వేటుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం ఊపందుకున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. సురేఖపై చర్య ఖరారైందా? లేక అధిష్టానం చివరి నిమిషంలో మరో మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం తెలిసిందే. ఈ నివేదిక ఏఐసీసీకి చేరడంతో బంతి పూర్తిగా అధిష్టానం కోర్టులోకి వెళ్లింది.టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా ఈ వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో ఖర్గేతో భట్టి బెంగళూరులో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా భట్టి ఖర్గేకు వివరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అలాగే చిన్నారెడ్డి వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సిఫారసు బయటకు వచ్చిన తర్వాత సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమన్న వాదన బలపడింది. కేబినెట్ నుంచి తక్షణమే తొలగించాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు ఆగాలా? అన్న అంశంపై అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
రాఖీ పండుగ.. హైదరాబాద్లో కిక్కిరిసిన బస్టాండ్లు
సాక్షి, హైదరాబాద్: రాఖీ సందర్భంగా నగరంలోని బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు రావడంతో నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్లలో రద్దీ నెలకొంది. ఐదు వేల ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. డిమాండ్ ఉన్న రూట్లలో అదనంగా సిటీ బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. ఈ నెల 31 వరకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. గతేడాది కంటే అదనంగా 240 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.ఉప్పల్ నల్లచెరువు వద్ద తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసిన ఆర్టీసీ.. నల్లచెరువు నుంచి వరంగల్, హన్మకొండ, నర్సంపేట, జనగాం, యాదాద్రి, తొర్రూరు వైపు ప్రత్యేక బస్సులు నడుపుతుంది. రద్దీ ఉన్న రూట్లలో అదనపు సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తెస్తుంది. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీపై 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేస్తోంది. రాఖీ పండుగతో పాటు లాంగ్ వీకెండ్ కారణంగా రద్దీ మరింత పెరగనుంది. రాఖీ రోజు తర్వాత తిరుగు ప్రయాణాల్లోనూ రద్దీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: సీఎం రేవంత్ ఇంటికి మంత్రి కొండా సురేఖ -
అమెరికాలో నగర యువతి హత్య కేసులో పురోగతి
హైదరాబాద్: అమెరికా మేరీల్యాండ్లో గతేడాది దారుణ హత్యకు గురైన తార్నాకకు చెందిన తెలుగు యువతి నిఖిత గొడిశాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.ఈ ఘటనకు బాధ్యుడైన నిందితుడు అర్జున్ శర్మను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది నెలల సుదీర్ఘ పోరాట విజయంగా దీన్ని బాధితుల కుటుంబం స్వాగతించింది. అమెరికాలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారనీ, మృతికి గల కారణాలను అధికారికంగా చెప్పకుండా దాస్తున్నారనీ నిఖిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూఎస్, భారత్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలనీ కోరుతున్నారు. ఈ హత్య వెనుక ఏమైనా నేరపూరిత చర్యలు ఉన్నాయా అనేది తేల్చాలని కోరారు. చదవండి: వీడియో కాల్ వైద్యానికి గర్భిణి మృతి -
రాఖీ కట్టనిస్తారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో రాఖీ పండుగ వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ.. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి రాఖీ కట్టేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. భట్టి ఇంకా బెంగళూరులోనే ఉండగా!.. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇస్తారా? అన్న అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.ప్రతీ ఏడాది రాఖీ పండుగ సందర్భంగా మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సీఎం, డిప్యూటీ సీఎంలకు రాఖీ కడుతుంటారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సురేఖ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో ఉండటంతో ఆయనను కలిసే అవకాశం కూడా ఆసక్తికరంగా మారింది.సుస్మిత వ్యాఖ్యలతో దుమారం..కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపాయి. పరకాల(వరంగల్) ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డితో పాటు సీఎం రేవంత్రెడ్డిపై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పరకాల ఎమ్మెల్యే కాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి.అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి స్పష్టం చేశారు. అయినప్పటికీ సురేఖ వివరణపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ క్రమశిక్షణా కమిటీకి, అటు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు.అధిష్టానం వద్దకు వ్యవహారం..ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించింది. క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అంశంపై పార్టీ పెద్దలతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో కొండా మురళి కూడా పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరుకు వెళ్లారు. కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీలో మరికొందరిపై క్రమశిక్షణ చర్యల అంశాలపైనా ఖర్గేతో భట్టి చర్చించినట్లు సమాచారం.మౌనంగా సురేఖ.. అపాయింట్మెంట్పై ఉత్కంఠకొండా సురేఖ వ్యవహారం అధిష్టానమే చూసుకుంటుందని.. ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే సూచించారు. అయితే ఆయన అపాయింట్మెంట్ కోసం సురేఖ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటు కూతురి వ్యవహారంపైనా కొన్నిరోజులుగా కొండా సురేఖ పెద్దగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా ఆమె కొంత దూరంగా ఉంటూ.. తన నియోజకవర్గంలో జరిగే శుభకార్యాలకు హాజరవుతూ బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతలను కలిసేందుకు సురేఖ తాజాగా అపాయింట్మెంట్ కోరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా? రాఖీ కట్టేందుకు అవకాశం కల్పిస్తారా? అన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఎపిసోడ్.. లాస్ట్ మినిట్లో ఆ ట్విస్ట్ తప్పదా? -
స్టాప్ ఇక్కడ.. బస్చ్సు అక్కడ!
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సులు హడలెత్తిస్తున్నాయి. ప్రయాణికులను పరుగులు పెట్టిస్తున్నాయి. బస్సెక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. డ్రైవర్లు రోడ్డు మధ్యలోనే బస్సును ఆపేస్తారు. అప్పటి వరకు బస్టాపులో ఎదురు చూస్తున్న ప్రయాణికులు వేగంగా దూసుకెళ్లే వాహనాలను దాటుకొని వెళ్లి బస్సెక్కాల్సి వస్తోంది. ఈ హడావుడిలో వేగంగా వచ్చే ఏ వాహనం ఢీ కొన్నా ప్రాణాలకే ప్రమాదం. మరోవైపు ఎంతో కష్టపడి రోడ్డు దాటుకొని బస్సెక్కేందుకు పరుగెత్తినా ప్రయాణికులు చేరేవరకు బస్సు ఆగుతుందనే నమ్మకం లేదు. మరోవైపు బస్సు దిగిన వాళ్లు సైతం వాహనాల మధ్యలోంచి రోడ్డు దాటి ఫుట్పాత్పైకి చేరుకోవాల్సివస్తోంది. ఇలా ఎక్కే, దిగే ప్రయాణికుల పాలిట సిటీబస్సులు ప్రమాదకరంగా మారా యి. మరోవైపు స్టాపుల్లో మహిళలు ఉంటే కొందరు డ్రైవర్లు బస్సు ఆపడంలేదు. గ్రేటర్లో ఈ పరిస్థితి నిత్యకృత్యంగా మారింది. దిల్సుఖ్నగర్, మెహిదీపట్నం, గచి్చ»ౌలి, సికింద్రాబాద్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారిన బస్సుల నిర్వహణను ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో నమోదు చేసింది. ప్రమాదకర ప్రయాణం.. నిత్యం రద్దీగా ఉండే దిల్సుఖ్నగర్లో స్టాపుల్లో బస్సులను ఆపకపోవడంతో ప్రయాణికులు నడిరోడ్డు వరకు పరుగెత్తాల్సి వస్తోంది. ఇలా రోడ్డు మధ్యలో ఆగే బస్సులను మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎక్కలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు బస్టాపుల్లో బస్సులు ఆగకపోవడంతో చిరువ్యాపారులు ఫుట్పాత్లను దాటుకొ ని రోడ్లపైకి వచ్చారు. బస్టాపులను ఆక్రమించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళల కోసం ప్రభుత్వం ఉచిత ప్రయాణసదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఆర్టీసీ సిబ్బంది మాత్రం మహిళలు కనిపిస్తే బస్సు ఆపకుండానే వెళ్లిపోతున్నారు. మలక్పేట్ స్టాపులో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళను పట్టించుకోకుండా రోడ్డు మధ్యలో ఒక క్షణం పాటు ఆపి డ్రైవర్ బస్సును ముందుకు దూకించాడు. ఆమె మరో బస్సు కోసం పడిగాపులు కాసింది.ఆటోలకు అడ్డాలుగా.. అమీర్పేట్, సికింద్రాబాద్, మలక్పేట్, మెహిదీపట్నం, ఉప్పల్ తదితర అనేక ప్రాంతాల్లో బస్టాపులు, బస్షెల్టర్లు ఆటోలు, ప్రైవేట్ వాహనాలకు అడ్డాలుగా మారాయి. దీంతో డ్రైవర్లు బస్సులను రోడ్డు మధ్యలోనే ఆపేస్తున్నారు. మూణ్నాళ్ల ముచ్చటగానే.. గతంలో నాచారంలో ఓ మహిళ బస్సు దిగి రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై చనిపోయారు. ఆ సందర్భంగానే రోడ్డు మధ్యలో నిలిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అప్పటి ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రకటించారు. కొంతకాలం బస్సులు స్టాపుల్లోనే ఆగాయి. ప్రయాణికులు ఎక్కే వరకు, దిగేవరకు వేచి ఉండటంతో ఎంతో ఊరట లభించింది. కానీ ఆ క్రమశిక్షణ మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. ర్యాష్ డ్రైవింగ్, లెఫ్ట్ డ్రైవింగ్, బస్టాప్ జంపింగ్ యథావిధిగా కొనసాగుతున్నాయి. -
మాకు ఏ భేషజాలు లేవు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విజయవాడ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో ఇప్పటికే వేల మంది ప్రాణాలను కోల్పోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రోడ్లు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి గురు వారం సమీక్షించారు. ఈ సందర్భంగా కోదాడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంతో పాటు ఇటీవల జరిగిన పలు ప్రమాదాలపై మంత్రి ఆరా తీశారు. హైదరాబాద్–విజయవాడ రహదారిలో గుర్తించిన 17 బ్లాక్ స్పాట్స్పై నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, హైమాస్క్ లైట్స్ పనుల పురోగతిని తెలుసుకున్నారు. చిట్యాల ఫ్లైఓవర్ ఈ దసరా నాటికి పూర్తిచేయాలని, మిగతావి డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు. 6+2 రహదారి విస్తరణ కోసం ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు కలిశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే తమ ధ్యేయమని, అందుకోసం తమకు ఎలాంటి భేషజాలు లేవు అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులతో కలిసి మరోసారి నితిన్ గడ్కరీని.. అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తామన్నారు. -
టూరిజం హబ్గా ‘మీరాలం’
సాక్షి, హైదరాబాద్: చారిత్రక ప్రాధాన్యం కలిగిన మీరాలం చెరువుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూపునివ్వనుంది. కుటుంబ సమేతంగా వచ్చి రోజంతా ప్రకృతి, వినోదం, విశ్రాంతిని ఆస్వాదించేలా పర్యాటక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈక్రమంలో మీరాలం చెరువును సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆకస్మికంగా పరిశీలించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. చెరువు చుట్టూ జరుగుతున్న పనులు, మీరాలం చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు.నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. చెరువు పునరుజ్జీవం, చెరువు పరిసర ప్రాంతాలు, అందులోని ఐలాండ్ల అభివృద్ధి, చెరువుపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం.. ఈ మూడు ప్రధాన అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అయితే, మీరాలం చెరువులోకి మురుగునీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసు కోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. చెరు వు నుంచి మూసీ నదిలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాలను విస్తరించాలని సూచించారు. చెరువు పునరుజ్జీవంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాటర్ స్పోర్ట్స్కు డిజైన్.. మీరాలం చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన సాంకేతిక, పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బోటింగ్, జల క్రీడలు, అడ్వెంచర్ కార్యకలాపాలకు అవకాశాలను పరిశీలించాలన్నారు.చెరువు చుట్టూరా ఫుడ్కోర్టులు, పచ్చని పార్కులు, విశ్రాంతి ప్రదేశాలు, కుటుంబ వినోద సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, వినోద, కార్యకలాపాల కేంద్రాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు. పాదచారులకు అనుకూలంగా వాకింగ్, పబ్లిక్ స్పేస్లను తీర్చిదిద్దడంతో పాటు రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరచాలన్నారు. చెరువులో ఉన్న ఐలాండ్లను అభివృద్ధి చేయాలని, ప్రకృతి ఆధారిత విశ్రాంతి కేంద్రాలు, గ్లాంపింగ్, ఇతర పర్యాటక కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని వినియోగించుకునే అవకాశాలను అధికారులను పరిశీలించాలని సీఎం చెప్పారు. వెడ్డింగ్, ఈవెంట్ డెస్టినేషన్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసే అంశంపై దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన పర్యాటక, వినోద సదుపాయాల అభివృద్ధిలో పీపీపీ విధానంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని వెల్లడించారు. సమీపంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుతో మీరాలం ట్యాంక్ అభివృద్ధిని అనుసంధానం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూ సందర్శన, ప్రకృతి, చెరువు అందాలు, కుటుంబ వినోదం అన్నీ ఒకే పర్యాటక అనుభవంగా అందించడమే లక్ష్యంగా ఉండాలని చెప్పారు. ట్యాంక్ పునరుజ్జీవం, పరిసర ప్రాంతాలు, ఐలాండ్ల అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్ ప్రస్తుతం రూపుదిద్దుకుంటుందన్నారు. -
హైదరాబాద్ మూలాలున్న ఇద్దరు మిస్సింగ్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్/నాగోలు/మునుగోడు: నేపాల్ వరదల్లో హైదరాబాద్ ఎల్బీనగర్ వాస్తు కాలనీకి చెందిన కందిమళ్ల మహేందర్రెడ్డి–ప్రేమలతా రెడ్డిల కూతురు సుహాసినిరెడ్డి (44) గల్లంతయ్యా రు. నల్లగొండ జిల్లా పెద్దకాపర్తికి చెందిన మహేందర్రెడ్డి పెద్ద కుమార్తె సుహాసినిరెడ్డిని మునుగోడు మండలం గుడాపూర్కు చెందిన నన్నూరి సంజీవరెడ్డికి ఇచ్చి 2004లో వివా హం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. ఉద్యోగరీత్యా న్యూజిలాండ్ వెళ్లి పౌరసత్వం పొందారు. సుహాసిని ప్రస్తుతం ఆ్రస్టేలియాలో పనిచేస్తున్నారు. ఇటీవల ఎల్బీనగర్ చంద్రపురి కాలనీలో గృహ ప్రవేశం చేశారు. ఈ నెల 23న మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. ఈమె వెంట వెళ్లాల్సిన హబ్సిగూడ డాక్టర్ శిరీష చివరి నిమిషంలో ఆగిపోయా రు. దీంతో ఆ్రస్టేలియాలో ఉండే స్నేహితురాలిని కలుపుకొని సుహాసిని టూర్కు వెళ్లారు. ఖాట్మండ్ నుంచి కళ్యాణ్ కైలాష్ జర్నీస్ టూర్స్–ట్రావెల్స్ ద్వారా మొత్తం 29 మంది యాత్రకు బయల్దేరారు. చివరగా నేపాల్లోని «ధుంచే–స్యాబ్రుబెసి ప్రాంతంలో టిబెట్ సరిహద్దు వైపు ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి సుహాసిని ఫోన్ కలవలేదు. తర్వాత వరదలు వచ్చాయని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆ భవనం వద్ద ఆఖరిసారిగా... నాచారం నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన లక్ష్మీనాథ్ గోపిశెట్టి 8 మందితో కలిసి కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లారు. బుధవారం ఉదయం 8.10 గంటలకు ఆఖరిసారిగా కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఆ సమయంలో నేపాల్లోని ‘రసువా కస్టమ్స్ ఆఫీస్’వద్ద ఉన్నారు. తర్వాత ఆకస్మిక వరదలతో ఆ కార్యాలయం తుడిచిపెట్టుకుపోయింది. అప్పటినుంచి ఆయనతో సంబంధాలు తెగిపోయాయని ముషీరాబాద్కు చెందిన లక్ష్మీనాథ్ బంధువు డి.రామచంద్ర తెలిపారు. లక్ష్మీనాథ్ బృందం నేపాల్కు చెందిన క్లాసిక్ వెకేషన్స్ ఏజెన్సీ ద్వారా వెళ్లారని, ముంబైలోని ఆ సంస్థ బ్రాంచ్ను సంప్రదించగా నిర్వాహకులు తమ బాధ్యత లేదన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. ఆయన తన కుటుంబ సభ్యులను కూడా సంప్రదించారు. సురక్షితంగా ఉన్నాం: సతీశ్రెడ్డి నేపాల్లో తాము క్షేమంగానే ఉన్నామని డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డితో కూడిన బృందం గురువారం ఒక వీడియో సందేశంలో తెలిపింది. విపత్తు సంభవించే సమయానికి తామంతా అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయాని స్పష్టం చేసింది. ఏపీకి చెందిన నలుగురు క్షేమంఆంధ్రప్రదేశ్కు చెందిన ఏడుగురు యాత్రి కుల సమాచారం హెల్ప్లైన్కు అందింది. అయితే.. వారిలో నలుగురు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. -
అద్దెకు ఎఫ్డీసీ కార్యాలయ భవనం
సాక్షి, హైదరాబాద్: కార్యాలయ భవనాన్ని అద్దెకిచ్చేందుకు ఏపీ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ సిద్ధమైంది. మాసాబ్ట్యాంక్లోని 42 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కార్యాలయం అద్దె లేదా లీజు ప్రాతిపది కన ఇచ్చేందుకు కార్యాలయ ఆవరణలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు, అద్దె కిచ్చే నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వ శాఖలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్యా లయ భవనాలు తెలంగాణ పరిధిలో ఉండగా.. ఏపీ అధికారులు లీజు/అద్దెకు ఇవ్వ డాన్ని ఆక్షేపిస్తున్నాయి. ఇదిలావుండగా... అద్దె కోసం బీసీ సంక్షేమ శాఖ ఏపీఎఫ్డీసీని సంప్రదించింది. తమకు అద్దెకు ఇవ్వాలని ప్రతిపాదించి ప్రత్యేకంగా లేఖలు సమర్పించింది. కానీ ఏపీఎఫ్డీసీ స్పందించలేదు. దీంతో ఈ అంశా న్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు... ప్రత్యామ్నా య ఏర్పాట్లపై దృష్టి సారించారు. అద్దె విషయంలో ఆగ్రహించిన కొందరు ఏకంగా ఫ్లెక్సీలోని కాంటాక్టు నంబర్లను తొలగిస్తూ... ఆమేరకు ఫ్లెక్సీని కత్తిరించడం కొసమెరుపు. -
ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: నీట్–యూజీ 2026లో భాగంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల రెండో విడత ఆన్లైన్ కౌన్సెలింగ్కు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) షెడ్యూల్ను ప్రకటించింది. 15 శాతం అఖిల భారత కోటా (ఏఐక్యూ), 100 శాతం డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఏఎఫ్ఎంసీ, ఎయిమ్స్, జిప్మర్ సంస్థల్లోని సీట్లకు ఈ కౌన్సెలింగ్ వర్తిస్తుంది. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పాల్గొనే కళాశాలలు తాత్కాలిక సీట్ల వివరాలను పరిశీలించనున్నాయి. సెప్టెంబర్ 3 నుంచి 8 వరకు అభ్యర్థుల రిజి్రస్టేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది.సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండగా.. ఫీజు చెల్లింపునకు సాయంత్రం 6 గంటల వరకు గడువు ఉంటుంది. అదే సమయంలో సెప్టెంబర్ 3 నుంచి 9 వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 9 ఉదయం 10 గంటల వరకు ఛాయిస్ ఫిల్లింగ్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 8 సాయంత్రం 4 గంటల నుంచి సెప్టెంబర్ 9 ఉదయం 10 గంటల వరకు చాయిస్ లాకింగ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఎంసీసీ సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనుంది. సెప్టెంబర్ 11న రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడించనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేసి చేరాల్సి ఉంటుంది. చేరిన అభ్యర్థుల వివరాలను ఆయా కళాశాలలు సెప్టెంబర్ 19న ఎంసీసీకి ధ్రువీకరించాల్సి ఉంటుంది. రెండో విడతలో సీటు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు గడువులను తప్పకుండా పాటించాలని ఎంసీసీ సూచించింది. ముఖ్యంగా చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ గడువు దాటిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్లో... రాష్ట్ర కోటా కౌన్సెలింగ్లో భాగంగా సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలను సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు రాష్ట్ర వైద్య విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర కౌన్సెలింగ్ సంస్థలు పరిశీలించనున్నాయి. ఏఐక్యూ, డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల పరిధిలో చేరిన అభ్యర్థుల వివరాలను ఎంసీసీ సెప్టెంబర్ 19న ధ్రువీకరించనుంది. రాష్ట్ర కోటాలో చేరిన వారి వివరాలను కూడా సెప్టెంబర్ 19న ధ్రువీకరించనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియకు సమయం పరిమితంగా ఉన్నందున శని, ఆదివారాలు, గెజిటెడ్ సెలవు రోజులను కూడా పనిచేసే రోజులుగా పరిగణించాలని అన్ని వైద్య కళాశాలలు, సంస్థలకు ఎంసీసీ సూచించింది. రెండో విడతలో సీటు పొందిన విద్యార్థులు నిర్ణీత గడువులో చేరకపోతే సీటుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున అభ్యర్థులు షెడ్యూల్ను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.అగ్రి బీఎస్సీ కౌన్సెలింగ్ ప్రారంభంసాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో రెగ్యులర్ సీట్ల భర్తీకి గురువారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఈ నెల 29వ తేదీ వరకు తొలి విడత కౌన్సెలింగ్ కొనసాగనుంది. ఇన్చార్జి రిజిస్ట్రార్, విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ సీహెచ్.వేణుగోపాల్రెడ్డి, వ్యవసాయ డీన్ డాక్టర్ కె. ఝాన్సీరాణి కౌన్సెలింగ్ను లాంఛనంగా ప్రారంభించారు. తొలి సీటు కేటాయింపు పత్రాన్ని కొత్తపల్లి రోష్నికి అందజేశారు. రెండో సీటు కేటాయింపు పత్రాన్ని పూల పూజకు, మూడో సీటు కేటాయింపు పత్రాన్ని ఎం.ఏ.హాధీకి అందజేశారు. ఈ ముగ్గురికీ రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో సీట్లు లభించాయి. తొలి రోజు వివిధ కళాశాలల్లో మొత్తం 213 సీట్లు భర్తీ అయ్యాయి. -
టీచర్లపై నిఘా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయులపై నిఘా పెరిగింది. వారి ప్రతీ కదలికను పసిగడుతున్నారు. పాఠశాలకు వచ్చిపోయే సమయాలు, వ్యక్తిగతంగా వారి కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ద్వారా హాజరు తీసుకుంటున్నారు. జీపీఎస్ ఆధారంగా జరిగే ఈ ప్రక్రియలో ఏమాత్రం ఆలస్యంగా వచ్చినా నోటీసులు ఇస్తున్నారు. గడచిన పది రోజులుగా ప్రతీ జిల్లాల్లోనూ 30 మందికి తగ్గకుండా నోటీసులు వెళ్లాయి. ఆలస్యానికి కారణాలు చెప్పాలని డీఈఓలు వెంటబడుతున్నారు. ఇతర వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లో మునిగి తేలే టీచర్ల జాతకాలను కూడా సేకరిస్తున్నారు. పనిచేసే ప్రాంతానికి వారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు? స్కూల్కు ఏ విధంగా వస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుంటున్నారు.ఎందుకీ నిఘా..: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. దీనిపై గత నెల సీఎం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి అధ్యయన నివేదికను ఉన్నతాధికారులు సీఎం వద్ద ఉంచారు. ప్రభుత్వ స్కూళ్లల్లో టీచర్లు సకాలంలో రావడం లేదని, ప్రతి రోజూ ఆలస్యంగా వస్తున్నారని, పాఠాలు కూడా సరిగ్గా చెప్పడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. కొంతమంది స్కూల్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారని, రావడం, పోవడంతో అలసిపోయి బోధనపై శ్రద్ధ చూపడం లేదని నివేదికలో పేర్కొన్నారు.20 వేల మంది ఉపాధ్యాయులు ఈ విధంగా దూర ప్రాంతాల్లో ఉంటున్నట్టు తెలిపారు. 38 వేల మంది టీచర్లు ప్రభుత్వ ఉద్యోగంతో తృప్తి పడటం లేదని, ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొంతమంది చిట్టీలు, మరికొంతమంది రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రతీ టీచర్ సమగ్ర వ్యక్తిగత డేటాను కోరినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే నిఘా పెంచినట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం ద్వారా తెలిసింది.ఎఫ్ఆర్ఎస్తో సమస్యలు..: పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారంటూ నోటీసులు అందుకున్న టీచర్లు విభిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ వల్ల ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఉదయం 9 గంటలకల్లా స్కూల్కు వెళ్లి సెల్ఫోన్ యాప్ ద్వారా ముఖాన్ని చూపించి, స్కూల్ ప్రాంగణం నుంచే హాజరు నమోదు చేయాలి. అయితే కొన్నిసార్లు నెట్వర్క్ సమస్య వస్తోందని టీచర్లు అంటున్నారు.దీనివల్ల ఉదయం హాజరు నమోదు కావడం లేదని, సాయంత్రం వేసే హాజరు...ఉదయం హాజరుగా నమోదు అవుతోందని, లేదా ఆలస్యంగా నమోదు అవుతోందని టీచర్లు అంటున్నారు. సాంకేతిక సమస్యలను అర్థం చేసుకోకుండా నోటీసులు ఇస్తున్నారనేది వారి వాదన. మారుమూల ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వాదనను మాత్రం పాఠశాల డైరెక్టరేట్ కార్యాలయం అంగీకరించడం లేదు. అన్నిచోట్ల నెట్వర్క్ ఉన్నప్పుడు ఈ సమస్య రావడానికి వీల్లేదని చెబుతున్నారు. -
బంగారం.. రాగి వెలికి తీసి దేశ సంపద పెంచుదాం
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి పెద్ద ఎత్తున బంగారం, రాగి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించడానికి కలిసికట్టుగా కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్ళి గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపర్, గోల్డ్ మైనింగ్ అన్వేషణ కార్యక్రమాన్ని గురువారం అధికారికంగా డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఖనిజ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో దేవదుర్గ బ్లాక్ ఎక్స్ప్లోరేషన్ (అన్వేషణ) హక్కులను దక్కించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఆయన మాట్లాడుతూ అన్వేషణ పనులను సింగరేణి సంస్థ త్వరలోనే వేగవంతం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విజయవంతమై ఇక్కడ బంగారం, రాగి విరివిగా లభిస్తే ప్రాంతీయంగా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించడమే కాకుండా ఈ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే అక్కడ పర్యవేక్షణకు సైట్ ఆఫీసును ప్రారంభిస్తామన్నారు. స్థానిక ప్రజల అండదండలతో ఈ ప్రాజెక్టును త్వరలోనే విజయవంతంగా పూర్తి చేసి దేశ సంపదను పెంచడానికి ఉపయోగపడదామని పిలుపునిచ్చారు. ఈ అన్వేషణ రెండు రాష్ట్రాల పురోగతికి, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు. దేవదుర్గ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి అన్నారు. ఈ ప్రాంతంలో గతంలో సీఐగా పని చేశానని, ప్రస్తుతం సింగరేణి సీఎండీగా పనులను స్థానికుల సమక్షంలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. బంగారం, రాగి ఖనిజ బ్లాకు పరిశీలన పర్యటనలో భాగంగా లింగదహళ్ళిలోని దేవదుర్గ బంగారు ఖనిజ బ్లాక్ వ్యూ పాయింట్ నుంచి ఖనిజ అన్వేషణ చేపట్టనున్న ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి భట్టి పరిశీలించారు. అనంతరం అక్కడి బ్లాక్ నుంచి సింగరేణి అధికారులు సేకరించిన వివిధ రకాల ఖనిజ నమూనాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకించారు. సింగరేణి అధికారులు మరియు కర్ణాటక రాష్ట్ర అధికార యంత్రాంగంతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించి ఖనిజ అన్వేషణపై దిశా నిర్దేశం చేశారు. కర్ణాటక మంత్రితో భట్టి సమావేశం బెంగళూరు పర్యటనలో భాగంగా కర్ణాటక ఇంధన శాఖమంత్రి కె.జె.జార్జ్తో గురువారం భట్టి సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంధన రంగ పురోగతి, బొగ్గు సరఫరా, బొగ్గు కొనుగోళ్ల చెల్లింపులు, సాంకేతికత మారి్పడిపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. పెరుగుతు న్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తగినంత బొగ్గును అందించడం కోసం సింగరేణి సంస్థ, కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు కలిసి పని చేద్దామని కె.జె.జార్జ్కు భట్టి ప్రతిపాదన చేశారు. ఈ సమావేశంలో కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ గౌరవ్ గుప్తా, సింగరేణి సంస్థ సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి పాల్గొన్నారు. -
పనితీరు పసిగట్టేలా..!
సాక్షి, హైదరాబాద్: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో ఇకపై పోలీసులు మరింత మర్యాదగా, బాధ్యతగా వ్యవహరించాల్సిందే. స్టేషన్లో తమకు ఎదురైన అనుభవం ఎలా ఉంది? సిబ్బంది సరిగ్గా స్పందించారా? వెంటనే ఫిర్యాదు స్వీకరించారా? కేసు దర్యాప్తు ఏ దశలో ఉంది? పురోగతిపై సమాచారం అందిస్తున్నారా? వంటి అంశాలపై ఇక నేరుగా బాధితుల నుంచే పోలీస్ శాఖ ఫీడ్బ్యాక్ తీసుకోనుంది. పోలీసుల పనితీరును మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పోలీస్–సిటిజన్ ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ వ్యవస్థను ప్రారంభించే అవకాశముంది. ర్యాండమ్గా బాధితులకు ఫోన్లు పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసిన బాధితుల వివరాల నుంచి ఎంపిక చేసి.. కొందరికి ర్యాండమ్గా కాల్ చేయనున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కాల్ సెంటర్లోని టెలీకాలర్లు బాధితులతో మాట్లాడి వారి అనుభవాన్ని తెలుసుకుంటారు. రిసెప్షన్ వద్ద స్వాగతం మొదలు..దర్యాప్తు పురోగతి, కేసుకు సంబంధించిన సమాచారం అందుతున్న విధానం తదితర అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు.పోలీసులే కాదు.. థర్డ్ పార్టీతో.. ఫీడ్బ్యాక్ వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశంగా థర్డ్ పార్టీ ఏజెన్సీతో కాల్ సెంటర్ నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. పోలీస్ సిబ్బందితోనే బాధితులకు ఫోన్లు చేయిస్తే వాస్తవ పరిస్థితులపై పూర్తిస్థాయి ఫీడ్బ్యాక్ రాకపోవచ్చనే ఉద్దేశంతో.. స్వతంత్ర ఏజెన్సీ ద్వారా అభిప్రాయాలను సేకరించనున్నట్టు సమాచారం.ఏఐతో విశ్లేషణ.. బాధితుల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ను ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా విశ్లేíÙంచేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఏ పోలీస్స్టేషన్పై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి? ఏ అంశంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది? ఏ అధికారి లేదా సిబ్బంది పనితీరుపై పదేపదే ప్రతికూల అభిప్రాయాలు వస్తున్నాయి? వంటి అంశాలను గుర్తించే అవకాశం ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు...బాధితుల అభిప్రాయాలు కేవలం రికార్డులకే పరిమితం కాకుండా.. పోలీసుల పనితీరు మెరుగుదలకు, అవసరమైతే సంబంధిత సిబ్బందిపై చర్యలకు ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. మంచి ఫీడ్బ్యాక్ వస్తున్న సిబ్బందిని ప్రోత్సహించడంతోపాటు.. పదేపదే ప్రతికూల ఫీడ్బ్యాక్ వస్తున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్, శిక్షణ లేదా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది. పోలీస్స్టేషన్లలో జవాబుదారీతనం పెరగడంతోపాటు, ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ అందించాలన్న లక్ష్యంతోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. -
కాంగ్రెస్ వేయి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వేయి రోజులు పూర్తయినా ఎన్నికల హామీలను నెర వేర్చకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణభవన్లో గురువారం బీఆర్ఎస్ చేపట్టే నిరసన కార్యక్రమాల షెడ్యూల్ను మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ప్రకటించారు. ⇒ సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్లో నిరసన కార్యక్రమాల లోగో ఆవిష్కరణ అనంతరం ఏడు రోజుల పాటు నిర్వహించే నిరసన కార్యక్రమాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం. ⇒ సెప్టెంబర్ 2న ఆయా గ్రామాల్లో వైఫల్యాలపై ప్రచారం, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, బైక్ ర్యాలీలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ప్రజలకు వివరణ.⇒ 3న రైతు సభల ద్వారా వ్యవసాయం, నీటి పారుదల రంగం, విద్యుత్, యూరియా, రైతు బీమాకు సంబంధించిన సమస్యలను రైతుల దృష్టికి తీసుకెళ్తారు. హైదరాబాద్, అర్బన్ ఏరియాల్లో 22ఏ నిషేధిత భూముల కోసం ధర్నాలు.⇒ 4న విద్యార్థులు, వికలాంగులు, మహిళలతో నిరసనలు. మహిళలకు రూ.2,500, కేజీ టు పీజీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర హామీల అమలుపై విద్యార్థులు, మహిళలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తారు.⇒ 5న విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో నిరసనలు. ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ అమలుపై నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు.⇒ 6న ఆదిలాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్లో ఏసీసీ, సింగరేణి ప్రాంతాల్లో 12 నియోజకవర్గాల నుంచి నిరసన సభలు. హైదరాబాద్లో తాగునీరు, విద్యుత్ దీపాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బస్తీ దవాఖానాలు తదితర అంశాలపై ఆందోళన కార్యక్రమాలు. మిగిలిన తెలంగాణ నియోజకవర్గాల్లో పల్లెల విద్యుత్, పడకేసిన పారిశ్రామిక విధానంపై నిరసనగా గ్రామాల్లో కార్యక్రమాలు⇒ 7న జిల్లాలు, మండలాల్లోని ప్రజావాణిలో 420 హామీల అమలుపై వినతిపత్రాల సమర్పణ. ⇒ 8న జిల్లా కేంద్రాల్లో ఏడు రోజుల కార్యక్రమాలపై ప్రెస్మీట్ నిర్వహించి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ. ⇒ సెప్టెంబర్ 10న ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం. -
గనులశాఖ ఏడీ జయరాజుపై ఏసీబీ కొరడా
సాక్షిప్రతినిధి, వరంగల్/తాండూరుటౌన్ /బోడుప్పల్: గనులు, భూగర్భ శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గురువారం కొరడా ఝళిపించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ప్రస్తుతం వరంగల్ మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్గా అడిషనల్ చార్జ్లో ఉన్న బొజ్జ జయరాజుపై కేసు నమోదు చేసింది. గురువారం ఆయనకు సంబంధించిన కార్యాలయం, బంధువులు, సహచరుల నివాసాలు, ప్రదేశాలు కలిపి మొత్తం 8 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ప్లాట్లు, వ్యవసాయ భూములు సోదాల్లో ఇప్పటివరకు గుర్తించిన స్థిర, చరాస్తుల విలువ సుమారు రూ.3,06,53,177గా ఏసీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మార్కెట్ విలువ అధికారిక/డాక్యుమెంట్ విలువ కంటే మరింత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 15 కోట్లకు పైనే ఉంటుందనే చర్చ జరుగుతోంది. అదనపు ఆస్తులపై తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపింది. బోడుప్పల్లో జీ+2 భవనం, కేపీహెచ్బీ కాలనీలో ఫ్లాట్, కీసరలో రెండు ప్లాట్లు, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటలో ఒక్కో ప్లాట్ సహా మొత్తం ఐదు ప్లాట్లు, నగదు రూ.10,03,640 తోపాటు, ఎల్ఐసీ, మ్యాక్స్ లైఫ్ సేవింగ్స్ సుమారు రూ.19.86 లక్షలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, పోస్టాఫీస్ సేవింగ్స్ రూ.20,86,175లు కాగా, 629 గ్రాముల బంగారు ఆభరణాలు తదితరాలు మూడు బ్యాంకు ఖాతాల్లో కలిపి రూ.7,12,761 నిల్వలు ఉన్నట్టు ఏసీబీ ప్రకటించింది. ⇒ 2009 నుంచి 2016 వరకు గనుల శాఖ ఏడీఏగా జయరాజ్ తాండూరులో విధులు నిర్వర్తించారు. 2012లో ఉమ్మడి పెద్దేముల్ మండలం ఒగులాపూర్ గ్రామంలో మూడెకరాల సుద్ద భూమిని తన భార్యతోపాటు తాండూరుకు చెందిన కొందరు వ్యాపారులతో కలిసి కొనుగోలు చేసినట్టు ఏసీబీకి ఆధారాలు లభించాయి. దీంతో తాండూరు పట్టణానికి చెందిన ఫారూఖ్ ఖురేషి నివాసంలో ఏసీబీ సీఐ వెంకటేశ్తోపాటు అధికారుల బృందం సోదాలు చేసింది, డ్రైవర్ ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు..ఏడీ జయరాజుకు చెందిన మొబైల్ సమాచారం, ఇప్పటివరకు పరిశీలించిన లావాదేవీల ఆధారంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు ఏసీబీ తెలిపింది. అధికారికి డ్రైవర్గా పనిచేస్తున్న సత్తునూరి యాదయ్య బ్యాంకు ఖాతా నుంచి జయరాజు తన కుమార్తె బ్యాంకు ఖాతాకు సుమారు రూ.24.80 లక్షలు బదిలీ చేయించినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు పేర్కొంది. ఈ మొత్తం ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తుల నుంచి వసూలు చేసినదని డ్రైవర్ విచారణలో తెలిపినట్టు ఏసీబీ వెల్లడించింది. మరిన్ని ఆస్తులపై ఆరాజయరాజు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఏసీబీ వెల్లడించింది. సోదాల్లో లభించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్న అధికారులు.. ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా? వాటి కొనుగోలుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.బొజ్జ జయరాజు ఇటీవల జరిగిన పంద్రాగస్టు వేడుకల సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ నుంచి ‘ఉత్తమ అధికారి’గా ప్రశంసాపత్రం అందుకున్నారు. -
40 ప్రశ్నలతో జనగణన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జనగణన వివరాల సేకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు గురువారం జీఓ 124 జారీ చేశారు. జనగణన–2027కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 40 రకాల ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్లో పేర్కొంది. తాజాగా ఈ గెజిట్కు సంబంధించి రాష్ట్రంలో వివరాల నమోదుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఎన్యూమరేటర్లు సేకరించే వివరాలివి1. వ్యక్తి పేరు; 2. కుటుంబ పెద్దతో సంబంధం3. లింగం; 4. పుట్టిన తేదీ, వయసు (నిండిన సంవత్సరాలు)5. ప్రస్తుత వైవాహిక స్థితి; 6. వివాహ సమయానికి వయసు (నిండిన సంవత్సరాలు) 7. జీవిత భాగస్వామి పేరు; 8. జాతీయత; 9. మతం10. షెడ్యూల్డ్ కులం(ఎస్సీ)/షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)/కులం11. తండ్రి వివరాలు;12. తల్లి వివరాలు 13. డిజెబిలిటీ; 14. మాతృభాష, తెలిసిన ఇతర భాషలు15. అక్షరాస్యత; 16. డిజిటల్ అక్షరాస్యత స్థితి17. విద్యాసంస్థలో చదువు/హాజరు స్థితి18. అత్యున్నత విద్యార్హత, విభాగం/విద్యాశాఖ19. గత సంవత్సరంలో ఎప్పుడైనా పని చేశారా?20. ఆర్థిక కార్యకలాపాల కేటగిరీ; 21. వృత్తి22. పరిశ్రమ/వ్యాపారం/సేవ స్వభావం; 23. కార్మికుల వర్గం24. ఆర్థికేతర కార్యకలాపం (పాక్షికంగా పనిచేసేవారు, స్వల్పంగా పనిచేసేవారు, పనిచేయనివారి కోసం)25. పని కోసం వెతుకుతున్నారా/పని చేయడానికి అందుబాటులో ఉన్నారా?26. పనిచేసే ప్రదేశానికి ప్రయాణ వివరాలు27. జన్మస్థలం; 28. చివరిగా నివసించిన ప్రదేశం29. వలస రావడానికి కారణం30. చివరి వలస తర్వాత ఈ గ్రామం/పట్టణంలో ఉంటున్న కాలం; 31. శాశ్వత నివాస చిరునామా32. ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత, వితంతు, విడాకులు పొందిన లేదా విడిపోయిన మహిళలకు మాత్రమే)33. ఇప్పటివరకు సజీవంగా జన్మించిన పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత, వితంతు, విడాకులు పొందిన లేదా విడిపోయిన మహిళలకు మాత్రమే)34. గత ఒక సంవత్సరంలో సజీవంగా జన్మించిన పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహిత మహిళలకు మాత్రమే)35. కోవిడ్–19 టీకా తీసుకున్న ప్రదేశం36. మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య37. మొబైల్ నంబర్ (అందుబాటులో ఉంటే)38. ఆధార్ నంబర్ (అందుబాటులో ఉంటే)39. ఓటరు గుర్తింపు కార్డు నంబర్ (అందుబాటులో ఉంటే); – పాస్పోర్ట్ నంబర్(భారతీయ పాస్పోర్ట్ కలిగి ఉంటే)40. డ్రైవింగ్ లైసెన్స్ అందుబాటులో ఉందా? -
చివరి నిమిషంలో ట్విస్ట్ ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికతో వేటుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం ఊపందుకున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. సురేఖపై చర్య ఖరారైందా? లేక అధిష్టానం చివరి నిమిషంలో మరో మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం తెలిసిందే.ఈ నివేదిక ఏఐసీసీకి చేరడంతో బంతి పూర్తిగా అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా ఈ వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో ఖర్గేతో భట్టి బెంగళూరులో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా భట్టి ఖర్గేకు వివరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే చిన్నారెడ్డి వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సిఫారసు బయటకు వచ్చిన తర్వాత సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమన్న వాదన బలపడింది. కేబినెట్ నుంచి తక్షణమే తొలగించాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు ఆగాలా? అన్న అంశంపై అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీకి ముగ్గురు కీలక నేతలుమంత్రి కొండా సురేఖతోపాటు చిన్నారెడ్డి తదితర నేతలకు సంబంధించి క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదికను ఏఐసీసీకి పంపిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపే ఉంది. అదే సమయంలో సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ఈనెల 31న ఢిల్లీకి వచ్చిన తరువాతే ఈ అంశంపై స్పష్టత వస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది.ఈ ముగ్గురు అధిష్టానంతో భేటీ అయితే సురేఖపై చర్యతోపాటు తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవలి కాలంలో పెరిగిన అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సురేఖ, చిన్నారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు రాజగోపాల్రెడ్డి, అనిరుధ్రెడ్డి తదితర ఎమ్మెల్యేల వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మురళీ భేటీలో ఏం జరిగింది?కొండా మురళీ డిప్యూటీ సీఎం భట్టిని కలిసి తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యం గురించి వివరించినట్లు చెబుతున్నారు. సురేఖ కుటుంబం తరఫున వివరణ ఇవ్వడంతోపాటు రాజకీయంగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న చర్చకు ఈ భేటీ కారణమైంది. అదే సమయంలో సురేఖ మంత్రి హోదాలో తనదైన శైలిలో వరంగల్ జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటుండడం, వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. -
గవర్నర్కు గుండె శస్త్రచికిత్స
గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా బుధవారం గుండె నొప్పితో హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి స్టెంట్ వేశారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం ఉదయం ఆసుపత్రిలో గవర్నర్ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి ఉన్నారు. -
ధరల మంటలు.. కుటుంబ బడ్జెట్ బేజారు
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి వంటింటి బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. కూరగాయలు, ఉల్లిగడ్డ, పప్పులు, ఇతరత్రా కిరాణా వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మధ్యతరగతిపై భారం పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల కొనసాగుతున్నప్పటికీ... రాష్ట్రంలో అది మరికొంత అధికంగా ఉండటం ఆందోళనను కలిగిస్తోంది. ప్రధాన రాష్ట్రాల్లో దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రిటైల్ ద్రవ్యో ల్బణం 6.32% నమోదవడం కలవరం రేపుతోంది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ గణాంకాల్లో ఈ పరిస్థితి వెల్లడైంది. తెలంగాణ తరువాత ఏపీలో ద్రవ్యోల్బణం 5.72% ఉండగా, తమిళనాడులో 5.44%, మధ్యప్రదేశ్లో 4.91%, కర్ణాటకలో 4.89%గా ఉంది. దేశం సగటు ద్రవ్యోల్బణం 4.45%గా నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే కూరగాయలతోపాటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా.. జూలైలో దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 4.45%గా ఉండగా, ఆహార వస్తువుల ధరలను ప్రతిబింబించే ఆహార ద్రవ్యోల్బణం 5.52%గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా 5.79 శాతంగా నమోదైంది. దీనికి భిన్నంగా తెలంగాణలో మొత్తం ద్రవ్యోల్బణం 6.32%గా ఉండటం రాష్ట్ర ప్రజలపై ధరల భారం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో ధరల పెరుగుదల అధికంగా ఉంది. ప్రతి కుటుంబం నెలవారీ వంటింటి ఖర్చులో కనిపిస్తున్న అదనపు భారానికి ఇది అద్దం పడుతోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లలో ఉల్లిగడ్డ కిలో రూ.50–55 పలుకుతోంది. బోయిన్పల్లి హోల్సేల్ మార్కెట్లో అదే ఉల్లి రూ.30–35 మధ్య లభిస్తుండగా, రైతుబజార్లలో రూ.40–44 విక్రయిస్తున్నారు. అదే రిటైల్ మార్కెట్కు చేరే కొద్దీ ధర గణనీయంగా పెరుగుతోంది. అలాగే, క్యారట్, చిక్కుడు, బీన్స్, వంకాయలు తదితరాల ధరలు కూడా భారీగా పెరగడంతో కుటుంబాల నెలవారీ కూరగాయల ఖర్చు భారీగా పెరిగింది. పప్పుల ధరలు సైతం సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. బియ్యం ధరలు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. మూడు నెలల క్రితం సన్న బియ్యం ధర కిలో రూ.48–55 ఉండగా, ఇప్పుడు 65–70 వరకు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ జోక్యం అవసరం రాష్ట్రంలో హాకా, రైతుబజార్ల ద్వారా సబ్సిడీ ధరలకు ఉల్లి, ఇతర నిత్యావసరాలను అందుబాటులోకి తేవాలనే డిమాండ్ పెరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరిగాయని చెబుతున్న అధికారులు రేట్ల తగ్గింపునకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయకపోవడం గమనార్హం. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ధరలపై మరింత ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లోకి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను పెంచడం, రైతుబజార్లలో నిల్వలు పెంచడం, హోల్సేల్–చిల్లర ధరల వ్యత్యాసాన్ని పర్యవేక్షించడం, అక్రమ నిల్వలు–కృత్రిమ కొరతపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు ⇒ మునుపటి పంట నిల్వలు తగ్గిపోవడం, కొత్త పంట మార్కెట్కు రావడానికి ఇంకా సమయం ఉండటం. ఉత్పత్తి తగ్గిన సమయంలో డిమాండ్ పెరగడంతో ధరలపై ఒత్తిడి పెరిగింది. ⇒ పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం, పొలాల నుంచి మార్కెట్లకు సరుకు రవాణాలో ఆలస్యం ఏర్పడటం. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో వర్షాలు పంటల కోత, రవాణాపై ప్రభావం చూపుతున్నాయి. ⇒ శ్రావణ మాసం, రాబోయే వినాయక చవితి వేళ స్వీట్లు, పిండివంటల తయారీ పరిశ్రమలు, హోటళ్లు, గృహాల నుంచి వినియోగం ఒక్కసారిగా పెరగడం. ⇒ అంతర్రాష్ట్ర రవాణా వ్యయం పెరగడం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన మార్కెట్ల నుంచి వచ్చే సరుకుపై అదనపు భారంపడింది. ⇒ భారత్ దిగుమతి చేసుకునే ముడి పామాయిల్, సన్ఫ్లవర్ నూనెలపై అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరగడం, దిగుమతి సుంకాల్లో మార్పులు. ఇంటి ఖర్చులకే సరిపోక..హైదరాబాద్లోని అంబర్పేటలో రవికిరణ్ అనే ప్రైవేటు ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. నెలసరి వేతనం రూ.50 వేలు. గతంలో ఇంటి అద్దె, టూవీలర్ ఖర్చు, కిరాణా, కూరగాయలు, పాలు, పిల్లల చదువు, విద్యుత్, రవాణా, ఇతర ఖర్చులకు కలిపి సుమారు రూ.45 వేలు ఖర్చయ్యేవి. నెలకు రూ.5 వేలు పొదుపు చేసుకునేవారు. ఇప్పుడు కూరగాయలు, ఉల్లి, పప్పులు, నూనె, పాల ధరలు పెరగడంతో నెల ఖర్చు రూ.50 వేలకుపైగా అవుతోంది. ముఖ్యంగా కూరగాయలు, కిరాణాపై నెలకు రూ.3వేల వరకు అదనంగా ఖర్చవుతోంది. దీంతో గతంలో పొదుపు చేసిన రూ.5 వేలు ఇప్పుడు ఇంటి ఖర్చులకే సరిపోని పరిస్థితి. పిల్లల వినోదం, కొత్త దుస్తులు, బయట భోజనాలు తగ్గించడంతోపాటు పొదుపును కూడా వదులుకోవాల్సి వస్తోంది. -
డాక్టర్ అని నమ్మి మోసపోవద్దు.. సజ్జనార్ హెచ్చరిక!
వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కట్టుబడిన హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. నగరంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని, 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని అన్నారు.ఎలాంటి విద్యార్హతలూ, కనీస వైద్య పరిజ్ఞానం లేని వీరు అసలైన వైద్యుల తరహాలోనే నటిస్తూ రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులతో పాటు విచక్షణారహితంగా ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారు. అవగాహనారాహిత్యంతో రోజుల తరబడి మందులు వాడాలని సూచించడంతో ప్రజల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.ఇలాంటి మోసగాళ్లపై మా నిఘా, కఠిన చర్యలు కొనసాగుతుండగా.. ప్రజలు కూడా చికిత్స కోసం వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.తాము వెళ్లే క్లినిక్లు, ఆసుపత్రుల రిసెప్షన్ వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను ప్రముఖంగా ప్రదర్శించారో లేదో గమనించాలి.అలాగే వైద్యుల బోర్డులపై పేరు, విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.వైద్యుల వివరాలపై ఏమాత్రం సందేహం కలిగినా వెంటనే onlinetsmc.in వెబ్సైట్లోకి వెళ్లి Doctor Searchలో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వారి వివరాలను సరిచూసుకోవచ్చు. అక్కడ వివరాలు కనిపించకపోతే వారు నకిలీలని గుర్తించాలి.చికిత్స విధానం లేదా సిబ్బంది ప్రవర్తనపై ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అర్హత గల ఇతర నిపుణులైన వైద్యుల వద్ద రెండో అభిప్రాయం (Second Opinion) తీసుకోవాలి.ఎక్కడైనా నకిలీ వైద్యులు చలామణి అవుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేసి అమాయకుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నానని సజ్జనార్ పేర్కొన్నారు.నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి.. అప్రమత్తంగా ఉండండి!వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కట్టుబడిన హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కల్తీ ఆహారంపై… pic.twitter.com/M6SYM2awYj— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 27, 2026 -
వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఇద్దరికి ఉద్వాసన!
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్పై సస్పెన్స్ కొనసాగుతోంది. కేబినెట్ విస్తరణ, ప్రక్షాళనతోనే ఈ ఎపిసోడ్కు ఎండ్కార్డ్ వేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశముందని సమాచారం. విస్తరణలో భాగంగా పలువురు మంత్రుల శాఖల మార్పు.. ఇద్దరు, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాముందని చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఇదిలా ఉండగా.. శాఖల మార్పు సంకేతాలతో తమ శాఖలో పూర్తయిన పనులకు రిబ్బన్ కటింగ్ చేసేందుకు మంత్రులు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, వరంగల్లో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతుంది, వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గాల్లో అనధికార పర్యటనలో పాల్గొంటున్న మంత్రి కొండ సురేఖ.. నో పొలిటికల్ కామెంట్స్ అంటూ ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు. అదే రీతిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కూడా మౌనం పాటిస్తున్నారు. అయితే, ఒక వైపు ఏం జరుగుతుందోన్న ఆందోళనలో వరంగల్ ఈస్ట్ కొండా క్యాడర్ ఉంటే.. మరో వర్గం సంబరాలు చేసుకుంటున్నారు.రెండు రోజులుగా హైదరాబాద్లో ఉన్న కొండా మురళి తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత మూడు రోజులుగా ఎక్కడ కనిపించని సుస్మిత పటేల్ హడావుడి లేకుండా సైలెన్స్ మూడ్లోకి వెళ్లిపోయారు. మరో వైపు, మాజీ ఓఎస్డీ సుమంత్ జాడ కోసం వరంగల్లో కూడా టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని రాష్ట్రవాప్తంగా ఆసక్తి నెలకొంది. -
నేపాల్ వరదలు.. DRDO మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు సురక్షితం
టిబెట్: నేపాల్లో సంభవించిన భారీ వరదలు,మంచుచరియల విరిగిపడిన ఘటనలో డీఆర్డీఓ మాజీ ఛైర్మన్ జి. సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు.హైదరాబాద్ నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది సభ్యుల యాత్రికుల బృందంలో సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. వీరు మానస సరోవర్ యాత్రకోసం సతీష్ రెడ్డి బృందం వెళ్లిన కొన్నిగంటల్లోనే వరదలు వచ్చాయి. నిన్న ఉదయమే వరదలు సంభవించి ప్రాంతాన్ని దాటి వచ్చారు. సతీష్ రెడ్డి బృందం ఆ ప్రాంతాన్ని దాటిన కొన్ని గంటలకే అక్కడ వరదలు సంభవించడం, పెద్ద ఎత్తున మంచుకొండ చరియలు విరిగిపడటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఈ ప్రమాదం నుంచి తమ బృందమంతా క్షేమంగా బయటపడినట్లు సతీష్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ‘మేం 31 మంది యాత్రకు వెళ్లాం. భారీ మంచుకొండ చరియ విరిగిపడి వరదలు ముంచెత్తాయి. అయితే, మేము ఆ ప్రాంతాన్ని సకాలంలో దాటడంతో ప్రాణాపాయం తప్పింది. అందరం సురక్షితంగా ఉన్నాం. ప్రస్తుతం టిబెట్లోని సాగా అనే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడి నుంచి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే భారత్కు చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం’ అని ఆయన తెలిపారు. -
పది రూపాయల వడ్డీకి రూ.37 లక్షలు.. వడ్డీ కట్టినా వేధింపులే!
హైదరాబాద్: అధిక వడ్డీ వసూలు చేస్తూ బలవంతంగా చెక్కులను తీసుకొని బెదిరింపులకు పాల్పడుతుందంటూ మధురానగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. మధురానగర్కు చెందిన పరిమళలకు సుమలత అనే మహిళ ఇంట్లో పనిచేసే లక్ష్మీ ద్వారా 2016లో పరిచయం ఏర్పడింది. సుమలత భర్త చనిపోయిన తర్వాత ప్రశాంత్సాయితో పెళ్లి జరిగింది. పరిమళ తనతో పాటు తన కజిన్స్కు ఆర్థిక సాయం కావాలని చెప్పగా పలు దఫాలుగా రూ.37 లక్షలు సుమలత ఇచ్చింది. అయితే కోవిడ్లో పరిమళ కజిన్స్ ఆర్థికంగా బలహీనపడ్డారని తెలిసి కూడా వడ్డీని రూ.7 నుంచి రూ.10కి పెంచింది. తప్పని పరిస్థితిలో వడ్డీ కడుతూ వచ్చింది. అయితే పరిమళ కూతురి వివాహమని తెలిసి రూ.37 లక్షలు చెల్లించాలని బలవంతంగా చెక్కులపై సంతకాలు చేయించుకొని, మేము చెప్పినట్లు వినకపోతే పెళ్లి జరగకుండా చేస్తామని వేధింపులకు గురిచేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తప్పుడుగా వార్తలను సైతం ప్రచురించి పరువు, ప్రతిష్టలను దెబ్బతీ«శారని, అధిక వడ్డీతో సహా అదనంగా కూడా ఇచ్చానని, వేధింపులకు గురిచేసిన సుమలత, ప్రశాంత్సాయిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం పరిమళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: అన్నయ్య వచ్చేసరికే నేనక్కడ ఉండాలి! చెల్లెలి విషాదం! -
మా వాళ్లు ఎలా ఉన్నారో?
సాక్షి, హైదరాబాద్: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద నగరవాసులకు ఆందోళన కలిగిస్తోంది. వృత్తి, వ్యాపార, పర్యాటక, ఆధ్యాత్మిక యాత్ర కోసం వెళ్లిన తమవాళ్లకు సంబంధించిన సమాచారం కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. వీరికి ఏ హానీ కలగకుండా తిరిగి రావాలంటూ మొక్కుకుంటున్నారు. నగరం నుంచి నేపాల్ వెళ్లినవారు 150 మందిపైనే ఉంటారని తెలుస్తోంది. నేపాల్కు వీసా లేకుండా అధికారిక గుర్తింపు కార్డులు చూపించి వెళ్లే అవకాశం ఉంది. దీంతో భారతీయులు పర్యాటకంతో పాటు వృత్తి, వ్యాపార, ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతున్నారు.అనేక కారణాల వల్ల నగరం నుంచి నేపాల్ ఉత్తర ప్రాంతానికి వెళ్లేవారి సంఖ్య నిత్యం ఎక్కువగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారిలో అత్యధికులు హైదరాబాద్ నుంచే ఉంటారు. వీరిలో కొందరు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వెళ్తుండగా మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సొంతంగా వెళ్తుంటారు. ఇలాంటివారితో పాటు సఫారీలు, ట్రెక్కింగ్స్ కోసం వెళ్లే వారి సంఖ్య గణనీయమే. వర్షాకాలం నేపథ్యంలో ట్రెక్కింగ్కు వెళ్లేవారి సంఖ్య తగ్గినా, మిగిలిన పనులపై వెళ్లేవారు పదులు, వందల్లోనే ఉంటారు.ఆకస్మిక వరదల వార్త దావానలంలా వ్యాపించడంతో వీరందరి కుటుంబాల్లో ఉత్కంఠ, ఆత్రుత నెలకొంది. నేపాల్ యాత్రకు వెళ్లినవారిని సంప్రదించడానికి ప్రయత్నించగా అనేకమంది ఫోన్లు బుధవారం అర్ధరాత్రి వరకు పని చేయలేదు. కొందరి ఫోన్లు రింగ్ అవుతున్నా సమాధానం ఉండట్లేదు. ఈ పరిణామాలు నగరంలోని వారి కుటుంబీకుల్లో ఆందోళన మరింత పెంచుతోంది. చాలామంది తమవారిని తీసుకెళ్లిన, పంపిన ట్రావెల్ ఏజెన్సీలు, వ్యక్తుల వద్దకు పరుగులు పెట్టారు. 31 మంది క్షేమం చిక్కడపల్లి: నగరం నుంచి కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది క్షేమంగా ఉన్నారు. ఈ నెల 18న వీరి యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం టిబెట్ వైపు ఉన్నారు. అయితే, వీరు ప్రయాణించి వచ్చిన ప్రాంతం వరదల్లో కొట్టుకుపోయింది. చైనా అనుమతిస్తే 29వ తేదీన కొడారి మార్గం నుంచి ఖాట్మాండుకు చేరుకుని, అక్కడినుంచి భారత్లోకి రానున్నారు. ఈ విషయాన్ని యాత్రకు వెళ్లిన ఎమ్మెస్ రామారావు ట్రస్టు చైర్మన్ పోలాప్రగడ శ్రీనివాస్ స్వామి ఫోన్ ద్వారా వెల్లడించారు. 2013లో ఉత్తరాఖండ్లో వచ్చిన ఆకస్మిక వరదలు నగరం నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లినవారిపై తీవ్ర ప్రభావం చూపాయి. పదుల సంఖ్యలో నగరవాసులు చనిపోగా, ఇంకొందరు గల్లంతయ్యారు. 2014లో హిమాచల్ప్రదేశ్ మండి జిల్లాలోని బియాస్ నది వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు అధికారులు ముందస్తు హెచ్చరికలు లేకుండా రిజర్వాయర్ గేట్లను తెరవడంతో నగరం నుంచి విహార యాత్రకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేపాల్ ఆకస్మిక వరదల వార్త విన్న నగరవాసులు పై రెండు ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు. నాటి బీభత్సాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ మూడు దుర్ఘటనలూ హిల్ స్టేషన్లలో జరిగినవే కావడంతో మరింత కంగారు పడుతున్నారు. చదవండి: నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో.. -
అన్నకు అంతిమ రాఖీ
హైదరాబాద్: విద్యుదాఘాతంతో చనిపోయిన అన్న మృతదేహానికి చెల్లి రాఖీ కట్టి కన్నీరుమున్నీరైంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని నెహ్రూనగర్ కాలనీకి చెందిన నర్సింలు, రాణిబాయ్ దంపతుల కుమారుడు జమాల్పూర్ నవీన్ (24) చటాన్పల్లి రైల్వేగేట్ సమీపంలో మటన్ షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం షాపులోకి విద్యుత్ సరఫరా కాకపోవడాన్ని గమనించి, సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే నవీన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంత్యక్రియలకు తీసుకెళ్తున్న క్రమంలో.. సోదరి పూజిత అన్నకు చివరి రాఖీ కట్టి గుండెలవిసేలా రోదించింది. -
హరీష్రావు హౌస్ అరెస్ట్.. వరంగల్ పర్యటనకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు ఆయన వరంగల్ వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వరంగల్ వెళ్లాలని హరీష్రావు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ఈ క్రమంలో హరీష్ను బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించి హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో హరీష్ రావు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చదవండి: ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్పై సస్పెన్స్!మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హౌస్ అరెస్ట్వరంగల్ జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/KsHQVCetUB— Telugu Scribe (@TeluguScribe) August 27, 2026 -
మళ్లీ జల జగడం!
సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం రాజుకుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నుంచి నీటి విడుదల ఉత్తర్వులు పొందకుండానే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాల్వ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకోవడానికి ఏపీ ప్రయత్నించగా, తెలంగాణ అడ్డుకుంది. నాగార్జునసాగర్ డ్యామ్ ఎడమ భాగం తెలంగాణ, కుడి భాగం ఏపీ భూభాగ పరిధిలోకి వస్తాయి. ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్లు బుధవారం ఉదయం 11.10 గంటల ప్రాంతంలో కుడి కాల్వ వద్దకు చేరుకొని గేట్లు ఎత్తడానికి ప్రయత్నించగా, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అడ్డుకున్నారు. తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీటి విడుదల చేసుకుంటున్నామని ఏపీ ఇంజనీర్లు వాదించగా, కృష్ణాబోర్డు అనుమతి లేకుండా గేట్లు ఎత్తడానికి వీలులేదని తెలంగాణ ఇంజనీర్లు అభ్యంతరం తెలిపారు. రెండు రాష్ట్రాల ఇంజనీర్ల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ తరఫున నీటిపారుదలశాఖ ఎస్ఈ మల్లికార్జున్, ఈఈ గోపినాథ్, ఏఈఈ విజయ్కుమార్ ఏపీ ఇంజనీర్లను అడ్డుకున్నారు. గేట్లను ఎత్తడం సాధ్యం కాకపోవడంతో ఏపీ ప్రత్యామ్నాయ మార్గంలో జలవిద్యుద్పుత్తి ప్రారంభించి కుడి ప్రధాన కాల్వకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ఏపీ జెన్కో యాజమాన్యంలోని 90 మెగావాట్ల (3గీ30) సాగర్ కుడి ప్రధాన కాల్వ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరపాలంటే కనీసం 530 అడుగుల మేర నిల్వలు ఉండాలి. ప్రస్తుతం డ్యామ్లో 535 అడుగులకు నీటిమట్టం, 181 టీఎంసీలకు నిల్వలు చేరడంతో ఏపీ విద్యుదుత్పత్తి ప్రారంభించి కుడి ప్రధాన కాల్వ ద్వారా తమ రాష్ట్రానికి నీటిని విడుదల చేసుకుంది. దీంతో తెలంగాణ సైతం ఎడమ కాల్వ గేట్లు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది గతంలోనూ సాగర్పై వివాదం రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణ చేపట్టింది. 2023 నవంబర్ 29న అర్ధరాత్రి వేళ ఏపీ ప్రభుత్వం సాయుధ బలగాల సహాయంతో సాగర్ కుడి భాగాన్ని తమ అ«దీనంలోకి తీసుకోవడంతో అప్పట్లో రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సాగర్ కుడివైపు భాగం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల పహారాను ఏర్పాటు చేసింది. డ్యామ్ కుడి భాగం వైపు మరమ్మతులు, నిర్వహణ పనులకు ఇంజనీర్లను కృష్ణాబోర్డు అనుమతి ఉంటేనే గతంలో సీఆర్పీఎఫ్ బలగాలు అనుమతించాయి. కృష్ణాబోర్డు అనుమతి తీసుకోకుండానే కుడిభాగం వైపు ఏపీ ఇంజనీర్లు ప్రవేశించి గేట్లను ఎత్తడానికి ప్రయత్నించారని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. బుధవారం సాధారణ సెలవులు కావడంతో గురువారం ఈ అంశంపై కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ ఇంజనీర్లు తెలిపారు. నీటి విడుదల ఉత్తర్వులు లేకుండానే.. ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు ఆశించిన మేరకు వరద రాలేదు. సూపర్ ఎల్నినో ప్రభావం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి జలాశయాల్లోని నిల్వలను కేవలం తాగునీటి అవసరాలకే వాడుకోవాలని ఇటీవల జరిగిన కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఏకభిప్రాయానికి వచ్చాయి. అక్టోబర్ 31 వరకు ఉండనున్న తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు 47 టీఎంసీలను కేటాయించాలని ఏపీ కోరగా, 2027 జూన్ 31 వరకు ఉండే తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు 112 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం లేకుండానే త్రిసభ్య సమావేశం ముగిసింది. శ్రీశైలం, సాగర్ పరిధిలో తెలంగాణలో రెండు కోట్ల జనాభా ఉందని, అక్టోబర్ 31వరకు తాగునీటి అవసరాల కోసం తమకూ 47 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరింది. ఏపీలో రెండు జలాశయాల పరిధిలో 76 లక్షల జనాభా ఉంటే 47 టీఎంసీలను ఎలా కోరుతారని ప్రశ్నించింది. చర్చల్లో ఏకభిప్రాయం సాధ్యం కాకపోవడంతో సెపె్టంబర్ 4న మళ్లీ సమావేశమై ఆనాటికి జలాశయాల్లో నిల్వలు పెరిగితే వాటి ఆధారంగా నీటి పంపకాలు జరుపుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో నీటి విడుదలపై కృష్ణాబోర్డు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈలోగా సాగర్ నుంచి ఏపీ నీటిని విడుదల చేసుకోవడం పట్ల తెలంగాణ తీవ్ర ఆక్షేపణ తెలిపింది. -
ఏఐ.. స్టార్టింగ్ ప్రాబ్లమ్!
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం విపరీతంగా పెరిగింది. అయినప్పటికీ మెజారిటీ అభ్యాసకులు సాంకేతిక నైపుణ్యాలను ఎక్కడ నుంచి నేర్చుకోవడం ప్రారంభించాలో తెలియక సతమతమవుతున్నారు. తగినంత అవగాహన లేకపోవడం, శిక్షణా కార్యక్రమాల ఎంపికలో గందరగోళం వంటి అంశాలు వారి వృత్తిపరమైన ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రముఖ విద్యా సంస్థ అప్గ్రాడ్ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 56 శాతం మంది భారతీయ అభ్యాసకులు కృత్రిమ మేధస్సును నేర్చుకునే ప్రయాణంలో సరైన దిశానిర్దేశం లేకపోవడమే అతిపెద్ద అడ్డంకిగా భావిస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాల కోర్సులు, వాటి విశ్వసనీయతపై ఉన్న అనిశ్చితి కారణంగా 43 శాతం మంది అయోమయానికి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని వివిధ వృత్తుల్లో ఉన్న అభ్యాసకుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఏదో ఒక రూపంలో.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 94 శాతం మంది ఏదో ఒక రూపంలో ఏఐని ఉపయోగిస్తున్నామని చెప్పారు. అందులో సగానికి పైగా (53 శాతం) మంది ప్రతిరోజూ దీనిని వాడుతున్నారు. ఈ ధోరణి కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా, చిన్న నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించింది. దీనివల్ల ఉద్యోగులు, విద్యార్థులు ఈ నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 87 శాతం మంది ఇప్పటికే ఈ తరహా కార్యక్రమాల్లో చేరడం లేదా నేర్చుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. వృత్తిపరమైన రంగంలో ఎక్కువ అనుభవం ఉన్నవారు ఈ సాంకేతికతను నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రారంభ దశలో ఉన్న అభ్యాసకులలో రోజువారీ వాడకం 44 శాతంగా ఉంటే, 8 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్న వారిలో ఇది 62 శాతానికి పెరిగింది. సీనియర్ నిపుణుల్లో 31 శాతం మంది వారానికి కనీసం మూడు గంటలు దీనిని అభ్యసించడానికి వెచ్చిస్తున్నారు. మునుపటి కంటే సులభంగా.. ఈ నైపుణ్యాల వల్ల 54 శాతం మంది తమ వృత్తి జీవితంలో స్పష్టమైన పురోగతిని సాధించారు. ఇందులో ఆత్మవిశ్వాసం పెరగడం, కొత్త బాధ్యతలు చేపట్టడం, పదోన్నతులు, అదనపు ఆదాయ వనరులు పొందడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. దాదాపు సగం మంది అభ్యాసకులు గతంలో తమ సామర్థ్యానికి మించిన పనులను ఇప్పుడు దీని సహాయంతో సులభంగా చేయగలుగుతున్నారు. వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ సాంకేతిక సృజనాత్మకతలో భారతీయులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నారు. కేవలం నాలుగింట ఒకవంతు మంది మాత్రమే ఇతర సాధనాలతో దీనిని అనుసంధానించారు. కేవలం 20 శాతం మంది మాత్ర మే ఆటోమేటెడ్ వ్యవస్థలను లేదా నూతన అప్లికేషన్లను తయారు చేయగలిగారు. భవిష్యత్తు సవాళ్లు సాంకేతిక రంగంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులను అందుకోవడం 43 శాతం మందికి దైనందిన సవాలుగా మారింది. ‘భారత్ ఇప్పుడు ఈ సాంకేతికత పనిని మారుస్తుందా లేదా అనే ప్రశ్నను దాటి ముందడుగు వేసింది. ప్రజలు ఇప్పటికే దీనిని ఉపయోగిస్తూ, నైపుణ్యాలపై పెట్టుబడి పెడుతున్నారు. తదుపరి సవాలు ఏమిటంటే అభ్యాసకులకు స్పష్టమైన మార్గాన్ని చూపించడం. వారు నేర్చుకున్న నైపుణ్యాలను అర్థవంతమైన ఉద్యోగ అవకాశాలుగా మార్చడమే’అని అప్గ్రాడ్ పేర్కొంది. భారత్లో ఈ సాంకేతిక ప్రయాణం విజయవంతం కావాలంటే కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా, ఉద్యోగాలకు ఉపయోగపడే ఆచరణాత్మక నైపుణ్యాల వైపు అడుగులు పడాల్సి ఉందని అభిప్రాయపడింది. -
మీ భద్రత.. మీ చేతుల్లోనే...
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారం అత్యంత విలువైన ఆస్తిగా మారింది. ఒకప్పుడు సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతా నంబర్, కార్డు వివరాలు మాత్రమే అవసరమయ్యేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. బాధితుడి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్, సోషల్ మీడియా ప్రొఫైల్, ఉద్యోగం, కుటుంబ సభ్యుల వివరాలు, ప్రయాణ వివరాలు, ఫొటోలు, లొకేషన్, ఆన్లైన్ కొనుగోళ్ల సమాచారం వంటి చిన్నచిన్న వివరాలను సేకరించి.. వాటిని ఆధారంగా చేసుకుని మరింత నమ్మదగిన మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే మీ భద్రత మీ చేతుల్లోనే.. అని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా సైబర్ భద్రతపై కనీస అవగాహన తప్పనిసరని వారు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు అధికారులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, కస్టమర్ కేర్ ప్రతినిధులమని చెప్పినా.. ఓటీపీ, యూపీఐ పిన్, ఏటీఎం పిన్, సీవీవీ, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ వంటి గోప్య వివరాలను ఎవరికీ చెప్పకూడదని పేర్కొంటున్నారు. మనం ఇచ్చే వివరాలే పెట్టుబడి.. సోషల్ మీడియాలో మనం సరదాగా పెట్టే ప్రతి సమాచారం సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది. పుట్టిన తేదీ, కుటుంబ సభ్యుల పేర్లు, పిల్లల పాఠశాల, ఉద్యోగ సంస్థ, ఇంటి ప్రాంతం, సెలవుల కోసం ఎక్కడికి వెళ్తున్నామనే వివరాలు కూడా నేరగాళ్లు సేకరించే ప్రమాదం ఉందని మనం గ్రహించాలి. ఈ సమాచారాన్ని ఉపయోగించి బాధితుడికి తెలిసిన వ్యక్తిలా ఫోన్ చేయడం, బ్యాంకు లేదా ప్రభుత్వ సంస్థ పేరుతో సందేశాలు పంపడం, నకిలీ పెట్టుబడి ఆఫర్లు ఇవ్వడం, బంధువు అత్యవసర పరిస్థితిలో ఉన్నాడంటూ డబ్బులు అడగడం వంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవడం మరవొద్దు.. ఈ–మెయిల్, సోషల్ మీడియా, ఆన్లైన్ బ్యాంకింగ్, క్లౌడ్ స్టోరేజ్ తదితర ఖాతాలకు ఒకే పాస్వర్డ్ ఉపయోగించడం ప్రమాదకరం. ఒక ఖాతా పాస్వర్డ్ లీక్ అయితే మిగిలిన ఖాతాలన్నింటికీ ముప్పు ఏర్పడుతుంది. ప్రతి ముఖ్యమైన ఖాతాకు ప్రత్యేకమైన పాస్వర్డ్ పెట్టుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, 123456, p్చటటఠీౌటఛీ వంటి సులభంగా ఊహించగలిగే పాస్వర్డ్లు అస్సలు వద్దని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక చిహ్నాలతో పొడవైన పాస్వర్డ్లను ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు. పాస్వర్డ్ను కాగితాలపై, ఫోన్ నోట్స్లో బహిరంగంగా రాసి ఉంచకూడదని, అవసరమైన చోట మల్టీ–ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేదా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ, 2ఎఫ్ఏ)ను యాక్టివేట్ చేయాలని సూచిస్తున్నారు. డబ్బు పంపడానికి యూపీఐ పిన్ అవసరం. డబ్బు స్వీకరించడానికి యూపీఐ పిన్ అవసరం లేదని గుర్తుంచుకోవాలి. ఆగండి.. ఆలోచించండి.. ధ్రువీకరించండి.. » అధికారిక వెబ్సైట్ లేదా సంస్థకు చెందిన అధికారిక యాప్ ద్వారా మాత్రమే సేవలను ఉపయోగించాలి. మెసేజ్లో ఉన్న లింక్ను ఉపయోగించకుండా సంస్థ అధికారిక నంబర్ లేదా వెబ్సైట్ ద్వారా వివరాలను నిర్ధారించుకోవాలి. » సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం అవసరానికి మించి పంచుకోవద్దు. » సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పంచుకోవడం అలవాటుగా మారింది. అయితే అది వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారవచ్చు. » ఇంటి పూర్తి చిరునామా, వ్యక్తిగత ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, కుటుంబ సభ్యు ల వివరాలు, ప్రయాణానికి సంబంధించిన కచ్చితమైన తేదీలు సోషల్ మీడియాలో పంచుకోవద్దు. » లొకేషన్ షేరింగ్ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. » పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ వంటి సున్నితమైన లావాదేవీలను వీలైనంత వరకు నివారించాలి.»అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదు. -
A ఫర్ అఫిడవిట్.. B ఫర్ బెయిల్
ఏ ఫర్ అఫిడవిట్.. బీ ఫర్ బెయిల్.. అంటూ పాఠశాల విద్యార్థులకు ‘న్యాయ’పాఠాలు నేర్పించాలని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ(టీజీఎల్ఎస్ఏ), పాఠశాల విద్యా శాఖ నిర్ణయించాయి. వివిధ చట్టాలు, సెక్షన్లతో పాటు శిక్షలకు సంబంధించిన పూర్తి వివరాలపై వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాయి. దీని కోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమమే ‘మిషన్ బాల్ సురక్ష, శిక్ష అండ్ న్యాయ్–2026’. పలు చట్టాలపై తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 3,180 మంది మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. మరిన్ని పాఠశాలలకు వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ, న్యాయ సేవల సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి, అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ శామ్కోషి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.పాఠశాల విద్యాశాఖతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో బాలల హక్కులు, బాలలకు సంబంధించిన చట్టాలు, న్యాయ సాయం అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటివరకు 3,180 మంది పాఠశాల ఉపాధ్యాయులకు చట్టాలపై శిక్షణ ఇచ్చాం. ఇందులో ‘గుడ్ టచ్– బ్యాడ్ టచ్’తోపాటు పలు కీలక చట్టాలున్నాయి. – జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, హైకోర్టు సీజే ప్రధానంగా ఏఏ చట్టాలపై అవగాహన?» బాలలపై వేధింపులు, కించపర్చడం» బాల్య వివాహాలు, సమస్యలు» బాల కార్మిక వ్యవస్థ» మాదకద్రవ్యాల వినియోగం, ఇతర వ్యసనాలు» ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు» బాలల హక్కులు, రక్షణ చట్టాలు» గుడ్ టచ్, బ్యాడ్ టచ్(‘ధీరా వెల్నెస్ ప్రోగ్రామ్’ద్వారా యోగా సాధన)ఏమేం చేస్తారు..?» రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో న్యాయ అక్షరాస్యత, అవగాహన కార్యక్రమాల నిర్వహణ» లీగల్ లిటరసీ క్లబ్లు, చైల్డ్ రైట్స్ క్లబ్ల ఏర్పాటు » చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా నియమితులయ్యే ఉపాధ్యాయుల (మహిళ)కు ప్రత్యేక శిక్షణ» విద్యార్థులకు వారి హక్కులు, విధులపై పోటీలు, ఇంటరాక్టివ్ సెషన్లు » చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, పోలీసు శాఖ, ఎన్జీవోలతో సమన్వయం» అవసరమైన సందర్భాల్లో విద్యార్థులు, వారి కుటుంబాలకు న్యాయ సాయం కల్పించడంపాఠశాల విద్యార్థుల్లో న్యాయ అవగాహన, రాజ్యాంగ విలువలు, బాలల హక్కులపై చైతన్యం పెంపొందించడంతో పాటు బాలల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు కనీస చట్టాలపై అవగాహన అవసరం ఎంతైనా ఉంది. సబ్జెక్ట్ అంశాల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి కూడా న్యాయ అవగాహన ఉండటం లేదు. వారికి సంబంధించిన చట్టాలు తెలియడం లేదు. అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రస్తుతం సమాజంలో విద్యార్థి దశ నుంచే చట్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. – సీహెచ్.పంచాక్షరి, సభ్యకార్యదర్శి, టీజీఎల్ఎస్ఏ పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర స్థాయిలో..» పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్» విద్యాశాఖ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్» టీఎస్ఎల్ఎస్ఏ సభ్యకార్యదర్శి/అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్జిల్లా స్థాయిలో....» జిల్లా విద్యాశాఖ అధికారి » జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్» డీఎల్ఎస్ఏ (జిల్లా న్యాయసేవా సంస్థ) కార్యదర్శి -
అధ్యాపకుల కోత... ఆర్థిక ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో భారతీయ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. అక్కడి వర్సిటీల్లో రానురాను నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. విశ్వవిద్యాలయాలు అధ్యాపకులను తగ్గించుకుంటున్నాయి. కోర్సులకూ కోత పెడుతున్నాయి. సిలబస్లో మార్పులు చేస్తున్నాయి. భారతీయులు ఎక్కువ ఆసక్తి చూపించే ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ మాస్టర్ డిగ్రీలకూ ఇదే ప్రతికూల పరిస్థితి. మౌలిక సదుపాయాలకు వర్సిటీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పరిశోధనల వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాయి. ప్రాధాన్యతనివ్వాల్సిన ప్రాక్టికల్ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రధాన వర్సిటీలు మినహా... విదేశీ విద్యార్థులు వెళ్లే అన్ని చోట్లా ఇదే పరిస్థితి. గత ఏడాది 9 వేల మంది తొలగింపు అమెరికా ఆన్లైన్ జర్నల్ ‘ఇన్సైడ్ హయ్యర్ ఎడ్యుకేషన్’కథనం ప్రకారం వర్సిటీలు 2025లో 9 వేలకుపైగా అధ్యాపకులను తొలగించాయి. గత ఏప్రిల్లో వెయ్యికి పైగా తొలగింపులు జరిగినట్టు పేర్కొంది. ఈ నెల మొదటి వారంలో ఇల్లినాయి టెక్ 160 మందికి ఉద్వాసన పలికింది. ది న్యూస్కూల్లో జూన్లో 19 మంది ఫ్యాకల్టీ, 68 మంది సిబ్బందిని తొలగించారు. పోర్ట్లాండ్ స్టేట్ యూనివర్సిటీ తాజాగా 36 మంది ఫ్యాకల్టీని ఇంటికి పంపింది. మరో 8 మందిని కాలపరిమితి గల ఫ్యాకల్టీగా మార్చింది. వెస్ట్రన్ మిచ్గన్ వర్సిటీ 60 ఏళ్లు నిండిన అధ్యాపకులకు బై అవుట్ ఇచ్చింది. వారికి భారీగా ఆఫర్లు ప్రకటించి, రాజీనామా చేయించింది. అర్సినస్ కాలేజీ 29 పూర్తిస్థాయి ఫ్యాకల్టీ పోస్టులను పార్ట్టైమ్గా మార్చి వేతనాలు తగ్గించింది. కొలంబియా కాలేజీ ఆఫ్ షికాగో 54 ఫ్యాకల్టీ పోస్టులను రద్దు చేసింది. అనేక వర్సిటీల్లో ఇదే పరిస్థితి. భారత విద్యార్థులు చదివే 80 శాతం వర్సిటీల్లో అధ్యాపకుల కోత కన్పిస్తోంది. పరిశోధనకు పనికిరాని విధంగా కోర్సులు మారుతున్నాయని అక్కడి అధ్యాపకులు అంటున్నారు. కారణాలేంటి? ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలుగా పేరు పొందిన అమెరికా వర్సిటీలు ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ వీసా మార్పులు విద్యార్థుల్లో భయం పుట్టిస్తున్నాయి. దీంతో విదేశీ విద్యార్థుల సంఖ్య రెండేళ్లుగా గణనీయంగా తగ్గింది. 2024–25లో అమెరికాకు వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 11,77,766. వీరి ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు 55 బిలియన్ డాలర్లు వచ్చాయి. దీనివల్ల 3.55 లక్షల మందికిపైగా ఉద్యోగాలు పొందారని రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది 14 శాతం విద్యార్థులు తగ్గారు. ఈ ఏడాది 17 శాతానికి చేరినట్టు అంచనా. దీంతో ఈ ఏడాది ఆమెరికా ఆర్థిక వ్యవస్థకు 3.4 బిలియన్ డాలర్ల ఆదాయం తగ్గవచ్చని లెక్కగట్టారు. ఇది 40 వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపవచ్చని జాబ్డేటా గుర్తించింది. ఫలితంగా వర్సిటీలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లాయి. సిబ్బంది వేతనాలు, బీమా, ఇతర సంక్షేమం ఖర్చులు పెరగడం, మరోవైపు ఆదాయం తగ్గడం సమస్యగా మారింది. పోర్ట్ల్యాండ్ వర్సిటీ 3.6 కోట్ల డాలర్ల లోటులోకి వెళ్లగా, కొలంబియా కాలేజీ 4 కోట్ల డాలర్ల లోటు చూపించింది. భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ సబ్జెక్లుల్లో మాస్టర్ డిగ్రీ కోసం భారత్ నుంచి విద్యార్థులు ఎక్కువగా అమెరికా వెళ్తారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుందని, ప్రధాన కంపెనీలు వర్సిటీ భాగస్వామ్యంతో పనిచేస్తాయని విశ్వసిస్తారు. దీనివల్ల ఏఐలో తాజా టెక్నాలజీ నేర్చుకోవడం, కోర్సు పూర్తవ్వగానే స్కిల్ ఉద్యోగాలు పొందే వీలుందని భావిస్తారు. కంపెనీలకు వర్సిటీలు దూరమవ్వడంతో పరిపూర్ణమైన విద్య అందే అవకాశం ఉండదు. దీనివల్ల ఉద్యోగాలు పొందడం కష్టమవుతుంది. పరిశోధనలకు ప్రాధాన్యత తగ్గడం వల్ల ఏఐ, సైబర్ సెక్యూరిటీలో కొత్త చాలెంజ్ను ఎదుర్కోవడం విద్యార్థులకు సమస్యగా మారుతుంది. రూ.లక్షలు అప్పుచేసి అమెరికా వెళ్లినా ఉపయోగం లేకపోవడం విద్యార్థులకు ఆర్థికంగా, విద్యాపరంగా నష్టం జరిగే వీలుందని నిపుణులు అంటున్నారు.ఫ్యాకల్టీ కోతలు పెరుగుతున్నాయి ఆంక్షల నేపథ్యం, అంతర్జాతీయ పరిణామాల వల్ల అమెరికా వర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. కీలకమైన బ్రాంచీల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందనే ఆందోళనలూ ఉన్నాయి. ఇది నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. –ప్రొ. మాథ్యూ హోలాండ్ (పరూడ్య యూనివర్సిటీ)ఉపాధికీ దెబ్బేమాస్టర్ డిగ్రీలో పరిశోధనలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ముఖ్యం. ఏఐ వేగం తర్వాత కొత్త టెక్నాలజీపై పట్టు పెరగాలి. ఫ్యాకల్టీ తగ్గుదల వల్ల ఈ తరహా కృషికి బ్రేకులు పడే ప్రమాదం ఉంది. దీనివల్ల విద్యార్థులు కార్పొరేట్ సంస్థల అవసరాలకు తగ్గట్టు తయారవ్వడం కష్టం. ఇది ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుంది. –ప్రొ. నథానెల్ హన్సూ (యూనివర్సిటీ ఆఫ్ జార్జియా) -
పేగుబంధం మరిచి.. కన్నవారినే విడిచి
గతేడాది హైదరాబాద్ లింగంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంపాలైన 78 ఏళ్ల తల్లిని కుమారుడు చేర్చాడు. రూ. 3 లక్షల బిల్లు కావడంతో డబ్బు తీసుకొచ్చి కడతానని చెప్పి వెళ్లిన అతను మళ్లీ కనిపించలేదు. 45 రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్న ఆమెను చివరకు పోలీసులు, ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో వృద్ధాశ్రమానికి తరలించారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో నగరంలోని కూకట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రి ముందు 82 ఏళ్ల తండ్రిని కుమారుడు కారులో దింపి వెళ్లిపోయాడు. ఆ పెద్దాయన వద్ద ఆధార్ కార్డు, రూ. 200 మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలోని కారు నంబర్ ఆధారంగా ఆ కుమారరత్నాన్ని పట్టుకున్నారు.సాక్షి, హైదరాబాద్: దేశంలో కుటుంబ సంస్కృతి, విలువలు ఒకప్పుడు అనుబంధాలు, ఆత్మీయతల కలబోతగా ఉండేవి. కానీ నేటి ఉరుకుల పరుగుల ఆధునిక జీవనంలో అను రాగాలు దూరమవుతున్నాయి.. మమకారాలు మాయమవు తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు అమెరికా వంటి అగ్రదేశాల్లో కనిపించిన ఈ పెడధోరణి ప్రస్తుతం మన రాష్ట్రం దాకా పాకింది. ఎంతగా అంటే.. జన్మనిచ్చి, విద్యాబుద్ధులు నేర్పించి జీవితంలో ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్నారనే కారణంతో ఏమాత్రం కనికరం లేకుండా పిల్లలు వదిలించుకుంటున్న ఉదంతాలు కొంతకాలంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, కేర్ హోమ్స్ వద్ద తల్లి లేదా తండ్రిని వదిలేసి కుటుంబ సభ్యులు పరారవుతున్న దారుణ పరిస్థితులు సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. ఈ పెడ ధోరణినే ‘గ్రానీ డంపింగ్’గా పిలుస్తున్నారు. అధికారిక గణాంకాలు లేనప్పటికీ ఈ తరహా కేసులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెలకు సగటున 12 నుంచి 15 వరకు నమోదవుతున్నాయని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధులను ఆస్పత్రుల్లో చేర్పించి కుటుంబ సభ్యులు వెళ్లిపోతున్నారని.. బిల్లులు కూడా కట్టకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ అమానవీయ ధోరణిపై ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.46 శాతం వృద్ధులపై పిల్లల నిర్లక్ష్యం..ఆర్థిక భారం, వృద్ధుల వైద్య ఖర్చు నెలకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉంటోంది. దీనికితోడు ఉమ్మడి కుటుంబాలు మాయమై చిన్న కుటుంబాలు, న్యూక్లియర్ కుటుంబాలు ఏర్పడటంతో కుటుంబ సభ్యులు వృద్ధులను చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేర్పించడమో లేదా అక్కడ వదిలేయడమో చేస్తున్నారు. చికిత్స పూర్తయినప్పటికీ వారిని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావట్లేదు. కొన్ని సందర్భాల్లో వృద్ధులను రోడ్ల పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లోనూ వదిలివేస్తున్నారు. హెల్పేజ్ ఇండియా 2025 సర్వే ప్రకారం తెలంగాణలో 46 శాతం మంది వృద్ధులు పిల్లల నుంచి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు.ఎందుకు ఇలా చేస్తున్నారు?వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు వదిలించుకోవాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రేమ లేకపోవడమే కారణం కాదని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయç³డుతున్నారు. వృద్ధుల దీర్ఘకాలిక సంరక్షణ ఖర్చులు పెరగడం, చాలామంది వృద్ధులకు ఉండే మతిమరుపు వంటి అనారోగ్య సమస్యల నేపథ్యంలో నిరంతరం పర్యవేక్షించేందుకు సౌకర్యాలు లేకపోవడం, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు కూడా కొన్ని కుటుంబాలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయని చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంరక్షణ చట్టం 2007 ప్రకారం తల్లిదండ్రులను పోషించడం పిల్లల చట్టబద్ధ బాధ్యతని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించే వారికి 3 నెలల జైలు లేదా రూ. 5 వేల జరిమానా పడే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. పిల్లల నిరాదరణకు గురయ్యే వృద్ధులు హైదరాబాద్ పోలీసుల పరిధిలోకి వచ్చే సీనియర్ సిటిజన్ సెల్, 1091 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు.అమెరికాలో 1990ల నుంచే..అనారోగ్యంతో బాధపడే వృద్ధులను ఆస్పత్రుల వద్ద వదిలేసే విష సంస్కృతి ఇటీవల కాలంలో వచ్చిందేమీ కాదు. అమెరికాలో 1992లోనే అమెరికన్ కాలేజీ ఆఫ్ ఎమర్జెన్సీ ఫిజీషియన్స్ సర్వే ప్రకారం సంవత్సరానికి సుమారు 70,000 మంది వృద్ధులు ఆస్పత్రుల వద్ద నిరాదరణకు గురైనట్లు అంచనా. అయితే గ్రానీ డంపింగ్ కేవలం కుటుంబ సమస్య కాదు.. వృద్ధ సంరక్షణ వ్యవస్థ, సామాజిక భద్రత, కుటుంబాలపై పడుతున్న సంరక్షణ భారానికి కూడా అద్దం పడుతున్న సమస్య. కుటుంబం చూసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు వృద్ధులను వదిలేయడం కాకుండా, సామాజిక సేవలు, అసిస్టెడ్ లివింగ్ లేదా ప్రభుత్వ/స్వచ్ఛంద సహాయ వ్యవస్థలను ఉపయోగించుకోవడం అవసరం.అలాంటి వారికి మానవీయ సేవలు అందిస్తున్నాంఅనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను కొందరు పిల్లలు ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసి వెళ్లిపోతున్నారు. ఎక్కువగా 70 ఏళ్లు దాటిన వారు, పక్షవాతం, షుగర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారినే పిల్లలు వదిలేస్తున్నారు. అలాంటి వృద్ధులను మా సిబ్బంది దగ్గరుండి చూసుకుంటున్నారు. మేము కూడా మా సొంత తల్లిదండ్రుల్లాగే భావించి వారికి వైద్యంతోపాటు మానవీయ సేవలు అందిస్తున్నాం. ‘గ్రానీ డంపింగ్’పై 2024–25లో పోలీసులకు 170కిపైగా ఫిర్యాదులు చేశాం.– డాక్టర్ రాకేశ్ సహాయ్ (ఉస్మానియా సూపరింటెండెంట్)– డాక్టర్ శివప్రసాద్ (ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి సూపరింటెండెంట్) -
‘డెడ్డ్రాప్’కు వచ్చి చిక్కారు!
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యమైన మెథాంఫెటమైన్ (మెథ్) తమకు ఎలా దొరికిందో... అలానే డెడ్డ్రాప్ విధానంలో విక్రయించడానికి ప్రయత్నించిన ‘ఈగల్’ఇంటి దొంగలు పులకరం స్వామి, సుగూరి నరహరి గౌడ్ పోలీసులకు చిక్కారు. తెలంగాణ స్పెషల్ పోలీసు (టీజీఎస్పీ) విభాగంలో కానిస్టేబుళ్లయిన ఈ ద్వయం గత ఏడాది జనవరి నుంచి మాదకద్రవ్యాల వ్యతిరేక విభాగం ఈగల్లో డిప్యుటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరినీ అరెస్టు చేసిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం... కోణార్క్ ఎక్స్ప్రెస్లో డెడ్డ్రాప్ ద్వారా... ఇటీవల కాలంలో డ్రగ్ సప్లయర్స్ మాదకద్రవ్యాల సరఫరా పంథాను పూర్తిగా మార్చేశారు. ఒకప్పుడు నేరుగా వచ్చి, ఆపై కొరియర్ లేదా పార్సిల్ ద్వారా డ్రగ్స్ పంపేవాళ్లు. ఇలా చేస్తుంటే పోలీసుల నిఘాకు చిక్కుతున్నామనే ఉద్దేశంతో కొన్నాళ్లుగా డెడ్డ్రాప్ విధానంలో పార్సిల్ చేయడం ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన ఓ పెడ్లర్ ఇచ్చిన ఆర్డర్ ఆధారంగా పొరుగు రాష్ట్రానికి చెందిన సప్లయర్ రూ.1.5 కోట్ల విలువైన మెథ్ను ఈ నెల 3న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో డెడ్డ్రాప్ చేశాడు. దీన్ని పార్సిల్ చేసి జనరల్ బోగీలో నిర్దేశిత ప్రాంతంలో ఉంచాడు. ఆ వివరాలు, ఫొటోను ఇక్కడి పెడ్లర్కు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. రైలు నగరానికి చేరుకున్నాక పెడ్లర్ వెళ్లి ఆ పార్సిల్ తీసుకోవాల్సి ఉంది. ఈగల్లో అంతర్భాగమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని రీజినల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్లో పని చేస్తున్న కానిస్టేబుళ్లు పులకరం స్వామి, సుగూరి నరహరి గౌడ్లకు ఈ నెల 4న ఆ రైలులో ఈ పార్సిల్ దొరికింది. బహిరంగ మార్కెట్లో రూ.1.5 కోట్ల విలువైన మెథ్ను విక్రయించి సొమ్ము చేసుకోవాలని కుట్ర పన్నారు. డ్రగ్ పెడ్లర్స్పై నిఘా ఉంచడానికి అధికారులు ఇప్పటివరకు రికార్డుల్లోకి ఎక్కిన వారి వివరాలను వీరికి అందించారు. అందులోని ఫోన్ నంబర్ల ఆధారంగా వీరిని సంప్రదించి విక్రయించాలని పథకం వేశారు. దీనికోసం జగదీష్ మార్కెట్ నుంచి సెకండ్ హ్యాండ్ ఫోన్ ఖరీదు చేశారు. స్వామి తన వద్ద ఉన్న ఓ నేరగాడి సిమ్కార్డును ఇందులో వేశారు. ఆపై ఈ ద్వయం తమ వద్ద ఉన్న జాబితాలోని ఫోన్ నంబర్ ఆధారంగా పక్షం రోజుల క్రితం లూథిఫర్ అనే పెడ్లర్ను సంప్రదించారు. అతడికి ఐదు గ్రాముల మెథ్ విక్రయించిన ఇద్దరు కానిస్టేబుళ్లు డెడ్డ్రాప్ విధానంలో అందించారు. మరో పెడ్లర్తో 100 గ్రాములకు బేరం కుదుర్చుకుని, దాన్ని కూడా పార్సిల్ చేసి ఏదో ఒకచోట డ్రాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. నాంపల్లికి వచ్చి చిక్కి.. ఈ పార్సిల్ తీసుకుని ఈ ద్వయం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ సమీపంలో ఉన్న యూని గ్యాస్ ఆటో ఎల్పీజీ పంప్ పక్కన ఉన్న సందులో డెడ్ డ్రాప్ చేయడానికి సిద్ధమయ్యారు. స్వామికి చెందిన ద్విచక్ర వాహనంపై సోమవారం అక్కడకు వచ్చారు. అప్పటికే దీనిపై సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, ద్విచక్ర వాహనంతోపాటు మెథ్ స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చందూర్ మండలం ఉదాతలపల్లికి చెందిన పులకరం స్వామి ప్రస్తుతం 3వ బెటాలియన్లో పనిచేస్తూ కుంట్లూరు రత్న కాలనీలో ఉంటున్నాడు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాలకు చెందిన నరహరి గౌడ్ 12వ బెటాలియన్లో పనిచేస్తూ మన్నెగూడ బృందావన్ కాలనీలో నివసిస్తున్నాడు. వీరిని రిమాండ్కు తరలించిన సీసీఎస్ పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. పరారీలో ఉన్న లూథిఫర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
7న జలవివాదాల కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా, గోదావరి జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ రెండో సమావేశం సెప్టెంబర్ 7న న్యూఢిల్లీలో జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన గతేడాది జూలై 16న ఢిల్లీలో తెలంగాణ, ఏపీ సీఎంలతో నిర్వహించిన సమావేశంలో సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవడానికి ఓ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకోగా, కమిటీ తొలి సమావేశం గత జనవరి 30న జరిగింది. తదుపరి సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతో ఎజెండాను ప్రతిపాదించాలని రెండు రాష్ట్రాలకు ఆ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ సూచించారు. పోలవరం–బనకచర్ల/నల్లమల్లసాగర్ ప్రాజెక్టుపై ఈ కమిటీ సమావేశాల్లో చర్చించడానికి అప్పట్లో తెలంగాణ అభ్యంతరం తెలిపింది. రెండు రాష్ట్రాలు కమిటీకి ఎజెండాను ప్రతిపాదించకపోవడంతో తదుపరి సమావేశం సాధ్యం కాలేదు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చల ద్వారా జలవివాదాలు పరిష్కరించుకోవాలని ఆయన రెండు రాష్ట్రాలకు సూచించారు. దీంతో తక్షణమే సీడబ్ల్యూసీ కమిటీ రెండో సమావేశాన్ని నిర్వహించనుంది. 1న తుమ్మిడిహెట్టిపై సీడబ్ల్యూసీ భేటీప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం విషయంలో కదలిక వచ్చింది. 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించడానికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరుతూ జూన్ 11న ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ రాశారు. పీఎం కార్యాలయ సూచనల మేరకు ఈ అంశంపై సెప్టెంబర్ 1న మహారాష్ట్ర, తెలంగాణ అధికారులతో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో వార్ధా, వెయిన్గంగా నదులు ప్రాణహిత నదిలో కలిసే ప్రాంతానికి ఎగువన లంబాకారాంలో బరాజ్ నిర్మించడానికి ఇప్పటికే తెలంగాణ ప్రీఫిజిబిలిటీ నివేదికను సిద్ధం చేసింది. బరాజ్ నిర్మాణంతో మహారాష్ట్రలో ఏర్పడనున్న ముంపు విషయంలో ఆ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కావడం లేదు. గతంలో 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి అంగీకరించిన మహారాష్ట్ర తాజా చర్చల్లో 150 మీటర్లకు ఎత్తు పెంచేందుకు సమ్మతిస్తే తెలంగాణకు భారీ ఊరట లభించనుంది. -
‘కిస్తీ’ కోసం కుస్తీ!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు పూర్తయి గృహప్రవేశాలు జరిగినా చివరి విడత ఆర్థిక సాయానికి సంబంధించిన బిల్లులు విడుదల కాలేదు. ఇళ్లు పూర్తయి నెలలు గడుస్తున్నా చివరి బిల్లు కోసం లబ్దిదారులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేయాల్సిన యూనిట్ల విషయంలో దోబూచులాడటమే కారణం కావడం విశేషం. ఇందిరమ్మ పట్టణ యూనిట్లను మంజూరు చేసిన కేంద్రప్రభుత్వం, గ్రామీణ యూనిట్ల విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. అసలు మంజూరు చేస్తుందా? లేదా? అన్న విషయాన్ని కూడా తేల్చకుండా పెండింగ్లో పెట్టింది. ఏకంగా లక్ష ఇళ్ల చుట్టూ నెలకొన్న అయోమయమిది. ఎందుకీ గందరగోళం? రాష్ట్రప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద తొలి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో గ్రామీణ ఇళ్లలో దాదాపు లక్ష ఇళ్లు పూర్తయ్యాయి. ఈ పథకం కింద రాష్ట్రప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద రాష్ట్రానికి కొన్ని ఇళ్లను మంజూరు చేస్తుంది. పట్టణ ప్రాంత ఇంటికి రూ.లక్షన్నర, గ్రామీణ ప్రాంత ఇంటికి రూ.72 వేలు అందిస్తుంది. పట్టణ ప్రాంతానికి సంబంధించి రూ.1.13 వేల ఇళ్లను మంజూరు చేయడంతో ఆ ఇళ్ల విషయంలో స్పష్టత వచ్చింది.కానీ గ్రామీణ ఇళ్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మంజూరు లేదు. ఆ రూపంలో కేంద్రం ఇచ్చే సాయం నేరుగా లబ్దిదారు ఖాతాలోకే జమ అవుతుంది. గతంలో లాగా ఆ మొత్తం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి అందదు. రాష్ట్రప్రభుత్వం తనవంతు సాయంగా ఇచ్చే విడతలవారీ బిల్లులను ఇందుకు తగ్గట్టుగా సర్దుబాటు చేస్తుంది. కేంద్రం ఒక్కో ఇంటికి ఇచ్చే రూ.72 వేలను తన వంతు వాటాతో కలిపి లబ్దిదారు ఖాతాకు ఆ విడత కోటా కింద అందిస్తుంది. ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్లకు మూడు విడతల బిల్లులు చెల్లించినందున, ఇక చివరి విడత ఒక్కటే మిగిలి ఉంది. అది చెల్లించాలంటే కేంద్రం సాయంలో స్పష్టత రావాల్సి ఉంది. రీయింబర్స్మెంట్ విధానం లేకపోవడంతో... ఇలాంటి పరిస్థితిలో ముందు రాష్ట్రప్రభుత్వం మొత్తం సాయాన్ని లబ్దిదారుకు అందిస్తే కేంద్రం తర్వాత తన వంతు మొత్తాన్ని రీయింబర్స్ చేసే పద్ధతి ఉంటుంది. కానీ, ఈ పథకంలో రీయింబర్స్మెంట్ బదులు కేంద్రం నేరుగా లబ్దిదారు ఖాతాకే జమ చేసే విధానం ఉన్నందున, రాష్ట్రప్రభుత్వానికి ఆ మొత్తం తిరిగి అందదు. కేంద్రం నుంచి స్పష్టత వచ్చాకే చివరి విడత బిల్లు చెల్లించాలని నిర్ణయించి నెలలుగా పెండింగులో పెట్టింది. చివరి విడత బిల్లు అందనందున లబ్దిదారులు ఇంటి ఫినిషింగ్కు సొంత డబ్బులు వ్యయం చేయాల్సి వస్తోంది. కేంద్రం నుంచి నిధులు రాని విషయంపై అవగాహన లేని లబ్దిదారులు, చివరి విడత బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఆచితూచి చివరి బిల్లు విడుదలపై నిర్ణయం... కేంద్రం నిధులు ఇవ్వని పేరుతో చివరి బిల్లు విడుదలను ఎక్కువ కాలం నిలిపేయటం ఇక కుదరదని రాష్ట్రప్రభుత్వం తేల్చుకుని, చివరి విడత బిల్లు విడుదలకు సిద్ధమైంది. మొత్తం ఒకేసారి చెల్లిస్తే... భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చే సాయం చేతికందదన్న ఆందోళన కూడా వెంటాడుతోంది. దీంతో, మార్చి నాటికి పూర్తయి ఇళ్లకు ముందు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 15,475 ఇళ్లకు సంబంధించి రూ.185 కోట్లను విడుదల చేసింది. ఆ మొత్తం గురువారం లబ్దిదారుల ఖాతాలకు జమ కానుంది. మరికొద్ది రోజులు కేంద్రం సాయం కోసం ఎదురుచూసి మరికొన్ని ఇళ్లకు తదుపరి విడత విడుదల చేయాలని భావిస్తోంది. ఇంకెంతకాలం చూస్తూ ఊరుకుంటాం: పొంగులేటిఇందిరమ్మ గ్రామీణ ఇళ్లకు కేంద్రం రూపాయి కూడా సాయం చేయలేదు. ఏడాదిగా ఆ సాయం కోసం ఎదురుచూస్తూ చివరివిడత బిల్లు నిలిపివేశాం. ఇంకా ఎంతకాలం బిల్లు ఇవ్వకుండా ఉండగలం. పేదల ఇబ్బందులు చూస్తూ ఉండగలమా, అందుకే కేంద్రం సాయం చేయకున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా రాష్ట్రప్రభుత్వమే సాయం చేయాలని నిర్ణయించింది. తొలివిడతగా రూ.185 కోట్లు విడుదల చేశాం. మిగతావారికీ తదుపరి విడతల్లో ఇస్తాం. -
పెరోల్.. 40 ఏళ్లు పరార్
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, హైదరాబాద్: ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం.. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డు.. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఖైదీ నంబర్ 1567 వీరన్న కథ 1982లో మహబూబాబాద్లో ఓ పాన్షాప్ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, అల్లర్ల కేసులో సందెల వీరన్న నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో వరంగల్ అదనపు జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలులో (ఖైదీ నంబర్ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు. అనంతరం పెరోల్ను 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల ‘పరారీ జీవితం’. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్్కఫోర్స్ అతడిని పట్టుకుంది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. పేరు మార్చుకుని ప్రభుత్వ టీచర్గా.. ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించినట్లు కోర్టు రికార్డుల్లో పేర్కొన్నారు. 2013లో పదవీ విరమణ చేశాడు. పెన్షన్ పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డు కూడా అందుకున్నట్లు పిటిషనర్ తరఫు వాదనలో నమోదైంది. 2013 నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టుకోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయత్నాలు చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 2012 నవంబర్ 19 నుంచి 2020 అక్టోబర్ 3 వరకు మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదని పేర్కొంది. ఎట్టకేలకు ప్రత్యేక టాస్్కఫోర్స్ను నియమించి అరెస్టు చేసినట్లు తెలిపింది. మళ్లీ పెరోల్ కోరిన భార్య.. తిరస్కరించిన హైకోర్టు వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు, మూడేళ్ల పాటు పెరోల్, ఫర్లో తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందడం ఆశ్చర్యకరమంది. ఇది జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల తీరును తెలియజేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా లేదా పరిశీలించడం, హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కిచెప్పింది. మూడేళ్లపాటు పెరోల్–ఫర్లో (మంచితనంపై బయటకు వెళ్లేందుకు ఇచ్చే అనుమతి) నిరాకరణలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. జీవితంలోని అత్యంత ముఖ్యమైన కాలాన్ని ఖైదీ జైలు వెలుపల గడిపాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. జైలు శిక్ష నుంచి తప్పించుకుని, ఆ సమయంలో సాధారణ జీవితంలోని ప్రయోజనాలను పొందాడరన్నారు. కానీ అతడిపై విధించిన జీవిత ఖైదు శిక్ష ఇప్పటికీ రద్దు కాలేదని.. ఉద్దేశపూర్వంగా శిక్ష తప్పించుకున్నట్లు అవగతమవుతోందన్నారు. మిగిలిన శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు. -
చినుకు జాడేది?
సాక్షి, హైదరాబాద్: వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్ మూడో వంతు ముగుస్తున్నా వర్షాలు మాత్రం ఆశాజనకంగా కురవడం లేదు. ఎల్నినో ప్రభావంతో ఈసారి తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా అంచనాలు విడుదల చేసింది. ఈక్రమంలో సీజన్ మొదట్నుంచీ రాష్ట్రంలో అత్తెసరు వర్షాలే కురుస్తున్నాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు 53.78 సెంటీమీటర్ల సగటు వర్షపాతం కురవా ల్సి ఉండగా ఇప్పటివరకు 46. 47 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణం కంటే 14 శాతం లోటు వర్షపాతం ఉంది. సీజన్లో ఇప్పటివరకు భారీ వర్షాలు నమోదు కా లేదు. రుతుపవనాల కదలికలు చురుకుగా ఉన్నప్పటికీ వేగంగా వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడడంలేదని నిపుణులు చెబుతున్నారు. 15 జిల్లాల్లో లోటు...: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు తేలికపాటి వర్షాలే నమోదయ్యాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. ఇప్పటివరకు 15 జిల్లాల్లో 20 శాతం కంటే అధికంగా లోటు వర్షపాతం నమోదైంది. మరో 16 జిల్లాల్లో వర్షపాతం సాధారణమని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ ఇందులోనూ చాలా జిల్లాల్లో 10 నుంచి 15శాతం లోటు ఉన్న జిల్లాలు ఆరు జిల్లాలున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం తీరును పరిశీలిస్తే... కేవలం రెండు మండలాల్లో మాత్రమే అత్యధిక వర్షపాతం నమోదైంది. 73 మండలాల్లో అధిక వర్షపాతం, 269 మండలాల్లో సాధారణ వర్షపాతం, 273 మండలాల్లో లోటు వర్షపాతం, నాలుగు మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా వర్షపాతం తీరు... లోటు: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగుడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్–మల్కాజ్గిరి, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట్, ఖమ్మం, నారాయణపేట. సాధారణం: కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ములుగు అధికం: కామారెడ్డి, మెదక్ మరో పదిరోజులు అంతంతే... రాష్ట్రంలో వర్షాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, ఈ నెల రెండో వారం నుంచి ఇప్పటివరకు వర్షాలు అత్యంత పరిమితంగానే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షానికి అనుకూల వాతావరణం ఏర్పడడం లేదని, రుతుపవనాలు విరామదశలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. రానున్న పది రోజుల వరకు వర్షాలు తక్కువగా నమోదవుతాయని అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్లో బంగాళాఖాతంలో ఒకటి రెండు బలమైన అల్పపీడనాలు ఏర్పడితే పరిస్థితి పూర్తిగా మారవచ్చని, సెప్టెంబర్ 10వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ/వాయవ్య దిశలో కదిలితే రాష్ట్రంలో వర్షాలకు అవకాశం ఉంటుందని తెలిపారు. -
వేటేస్తారా... వదిలేస్తారా?
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆమెపై వేటు వేయాల్సిందేనంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో శంఖంలో పోయడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసమైన ప్రజాభవన్ వేదికగా నాటకీయ ఘటనలు జరిగాయి. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన మరుసటి రోజు బుధవారం భట్టి నివాసంలో కొండా మురళీ కనిపించారు. ఆయన వచ్చిన సమయంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కనిపించింది. కొండా ఎపిసోడ్ను కోల్డ్స్టోరేజీలో పెట్టే దిశలో పరిణామాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే సురేఖ కుటుంబంతో మాట్లాడే బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. భట్టికి అప్పగించారని, అందులో భాగంగానే మురళీని కలిశారని అంటున్నారు. కలిసి వచ్చారా..? మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, అసమ్మతికి మారుపేరైన రాజగోపాల్రెడ్డి ప్రజాభవన్లో ఉన్న సమయంలోనే మురళీ కూడా రావడం అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, గ్లోబల్ సమ్మిట్పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కోసం ఉత్తమ్, శ్రీధర్బాబు వచ్చారని, తన నియోజకవర్గ పనుల కోసం రాజగోపాల్రెడ్డి వచ్చారే తప్ప ముందస్తు సమాచారం ప్రకారం రాలేదని ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి. కానీ, మురళీని కలిసేందుకు భట్టి సమ్మతించడం, సీఎంతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతుండటం, సాయంత్రానికి హడావిడిగా బెంగళూరుకు బయలుదేరి వెళ్లడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ వ్యక్తమవుతోంది. భట్టి భుజంపై తుపాకీ పెట్టి సురేఖ కుటుంబాన్ని కాల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదంటే తొందరపడద్దనే ధోరణితో సీఎం ఉన్నారా... లేదా సురేఖ వ్యవహారం మధ్యే మార్గంలో వెళ్తుందా అన్న చర్చ గాం««దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. భట్టి గురువారం బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మాత్రం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సెపె్టంబర్ 7 నాటికే కొండా ఎపిసోడ్కు ఫుల్స్టాప్ పడుతుందని సమాచారం. మురళీ ఏమన్నారంటే... మురళీ, భట్టి భేటీలో ఏం జరిగిందన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం భట్టి కొంత గట్టిగానే మాట్లాడినట్టు తెలుస్తోంది. సుస్మిత చేసిన వ్యాఖ్యలు సీఎంను కించపరిచేలా, పార్టీని నష్టపరిచేలా ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. అయితే, సుస్మిత మాటలతో తనకేం సంబంధమని మురళీ చెప్పినట్టు తెలిసింది. పదేపదే వివాదాలకు కారణమవడం, జిల్లా నేతలతో సమన్వయంతో వ్యవహరించలేకపోవడం, సీఎంతో ముఖాముఖి కలిసే పరిస్థితి కూడా లేకుండా చేసుకోవడం లాంటి అంశాలపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం. అనంతరం మురళీ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఓ బిల్లు కోసం భట్టి దగ్గరకు వచ్చానని చెప్పారు. సుస్మిత వ్యాఖ్యల గురించి తాను భట్టితో మాట్లాడలేదని, ఆ వ్యాఖ్యలకు తనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ‘అది నా బిడ్డకు సంబంధించింది. ఆమెకు 35 ఏళ్ల వయసు.. 15 ఏళ్ల పిల్లలున్నారు. వరల్డ్ చాంపియన్ అయిన కొడుకు ఉన్నాడు. ఆమె మనోభావాలు ఆమెకు ఉండొచ్చు. ఎవరి స్వతంత్రత వారిది... ఆమెను ప్రశ్నించే హక్కు మాకు లేదు. ఆమె ప్లాన్ ఏలో భాగంగా ఏదో మాట్లాడింది. ప్లాన్ బీలో ఏం చేస్తుందో.. ఆమె మనసులో ఉన్నది మాకెలా తెలుస్తుంది. కవిత గారు పోయారు. అలానే ఎవరి నిర్ణయం వాళ్లు తీసుకుంటారు. మాకు సోనియా, రాహుల్, ప్రియాంకా గాం«దీలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. మేం కాంగ్రెస్లోనే ఉంటాం’ అని మురళీ వ్యాఖ్యానించారు. రాజగోపాల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గ విషయాలు మాట్లాడేందుకు ప్రజాభవన్కు వచ్చానన్నారు. తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి గురించి, వ్యక్తిగతంగా ఎవరి గురించీ మాట్లాడలేదన్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో హైకమాండ్దే తుది నిర్ణయమని, ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహించాల్సిందేనన్నారు. సురేఖ విషయంలోనూ హైకమాండ్దే తుది నిర్ణయమని, ఈ విషయంలో సీఎం అభిప్రాయమే తన అభిప్రాయమన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకో రాధాకృష్ణ: రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్, ఆ చానల్ ఎండీ రాధాకృష్ణకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ఏబీఎన్ చానల్ ఎవరికి సపోర్ట్ చేస్తోంది. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. లేదంటే మర్యాద దక్కదు. మా కెపాసిటీ ఏంటో చూపిస్తే మీ చానల్, పేపర్ ఉండవు. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీపరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పారీ్టల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నతస్థాయిలో ఉండొచ్చు. అంతమాత్రాన పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడిన మాలాంటి వ్యక్తులను కించపరచొద్దు. అసలైన కాంగ్రెస్ రక్తం మాది. మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు రాస్తే బాగుండదని హెచ్చరిస్తున్నా. మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపర్చే విధంగా ప్రయత్నించడం మంచిది కాదు. ఎవరు చేస్తున్నారో వారికే చెబుతున్నా. కొందరు వ్యక్తుల గురించి, వారిని బలంగా చేసేందుకు నా లాంటి వారిని బలహీనులను చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి... ఇలాంటి చానళ్లు, పేపర్లు 100 పెడతా. మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు’ అని రాజగోపాల్రెడ్డి హెచ్చరించారు. -
నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం హెల్ప్లైన్
సాక్షి, హైదరాబాద్: నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమన్వయ కేంద్రం ఏర్పాటు చేశారు.MEA, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ భవన్ అధికారుల సమన్వయం చేసుకుంటున్నారు. నేపాల్లో ఉన్న తెలంగాణ యాత్రికులు, పర్యాటకుల కుటుంబ సభ్యులు హెల్ప్లైన్ను సంప్రదించవచ్చు. బాధితుల పేరు, పాస్పోర్ట్, మొబైల్, నేపాల్లోని ప్రాంత వివరాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ట్రావెల్/టూర్ ఆపరేటర్, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అందిన విజ్ఞప్తులను ప్రాధాన్యతా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయానికి చేరవేయనుంది. తెలంగాణ భవన్ హెల్ప్లైన్ నంబర్లు: 9871999044, 9949351270, 9618597969. -
రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల అంశంపై ఎందుకు స్పందించడం లేదంటూ రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 22ఏ నిషేధిత జాబితాపై కుట్ర చేసిందెవరో తేల్చాలి. 22ఏ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూదందాపై నెలరోజులుగా బీజేపీ పోరాటం చేస్తుంది. ఆధారాలతో అసెంబ్లీకి నేను చర్చకు వస్తే రాకుండా మంత్రి పారిపోయారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని ఏలేటి డిమాండ్ చేశారు. కుట్ర చేసి నిషేధిత జాబితాలో భూములు పెడితే విచారణ జరపాలి. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ లేదా హౌజ్ కమిటీ వేస్తారా స్పష్టం చేయాలి. భూ భారతి మంత్రులకు నగల, వజ్రాల హారంగా మారింది. కాంగ్రెస్ 33 నెలల పాలనలో భూ భారతి అతిపెద్ద కుంభకోణం. సీఎం రేవంత్ చెప్పిన అసలు కుట్ర ఆయన కేబినెట్లోనే జరుగుతుంది. 22A బాధితులకు న్యాయం చేయాలి. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి. 22A అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి. అంతేకాదు సీబీఐ విచారణ కోరుతూ ప్రభుత్వం లేఖ రాయాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలి’’ అంటూ మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. -
‘సీఎం రేవంత్పై కొండా సుష్మిత వ్యాఖ్యలతో నాకేం సంబంధం’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్లో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కివేసే ప్రయత్నం జరుగుతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి వివాదాన్ని సర్దుమణిచే ప్రయత్నంలో భాగంగా కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కాగా, ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారన్న ప్రచారంపై ఆయన స్పందించారు. కొండ సుస్మిత పటేల్ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు. మునుగోడు అభివృద్ధి నిధుల విషమై చర్చించేందుకు భట్టి విక్రమార్కను కలిశాను. నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని నేను. ఎంపీ, ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం ఆనాడు ఫైట్ చేశా. తెలంగాణ ఏర్పాటులో భాగస్వామ్యం లేని వాళ్ళు ఇవాళ విమర్శలు చేస్తున్నారు.నా పైన విమర్శలు చేసే వాళ్ళు వాళ్ళ స్థాయి ఏంటో గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కి వేసే ప్రయత్నం జరుగుతుంది. ఉద్యమంలో లేనివాళ్లు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉండవచ్చు. కొండా సుస్మిత పటేల్ అంశాన్ని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. నాలాంటి ఉద్యమ నేతలను విమర్శ చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం’అని హెచ్చరికలు జారీ చేశారు.👉ఇదీ చదవండి: కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు -
కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్గా మారగా, అధిష్టానం ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యల్లో భాగంగా కొండా సురేఖ భర్త కొండా మురళి రంగంలోకి దిగి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు కీలక నేతలను ప్రత్యేకంగా కలిశారు. ఈ భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా కొండా సుష్మిత వ్యాఖ్యలపై స్పందించారు. ‘కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, సుష్మితను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. మేం క్రమశిక్షణా కమిటీకి చెప్పాల్సిన వివరణ ఇచ్చాం. అధికారిక పనుల్లో భాగంగానే బిల్లుల గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశాం’‘కొండా సుస్మిత నా బిడ్డ. ప్లాన్-ఏలో ఆమె అలా మాట్లాడింది. ప్లాన్-బీలో ఏం చేస్తుంది అంటే నాకేం తెలుస్తుంది? ఆ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వివాదం నా బిడ్డది. అందులో ప్లాన్-బీలో ఏముందో నాకు తెలియదు’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ క్రమశిక్షణా కమిటీకి తాము చెప్పాల్సిన వివరణ స్పష్టంగా ఇచ్చామని, అధికారిక పనుల్లో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పరకాల నియోజకవర్గ టికెట్ కేటాయింపులపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను ఏఐసీసీ క్రమశిక్షణా రాహిత్యంగా భావించడంతో పాటు, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివాదం ముదరకుండా ఉండేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన కొండా మురళితో పాటు, ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,ఇటీవల ప్రభుత్వంపై అసంతృప్తి స్వరం వినిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొనడం గమనార్హం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు వివాదాన్ని సర్దుమణిగేలా చేస్తాయా, లేక పార్టీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా అనేది వేచి చూడాలి. 👉ఇదీ చదవండి: నా కుమార్తె మాటలకు నాకేం సంబంధం -
అసభ్య చిత్రాలతో ఆర్మీ మేజర్ భార్యకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: ఆమె ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ. ఆమె ఫొటోలను ఇన్స్ట్రాగామ్ ఖాతా నుంచి సేకరించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్తో అశ్లీలంగా మార్ఫింగ్ చేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. సోషల్మీడియాలో పోస్టు చేసి వేధిస్తుండటంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో మంగళవారం కేసు నమోదైంది. ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్న ఆమె భర్త ఫిర్యాదు కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్ట్రాగామ్ ఖాతాలో ఉన్న ఆమె ఫొటోలను సేకరించి ఏఐ ఆధారిత సాంకేతికతతో నగ్న, అసభ్యకర చిత్రాలు, వీడియోలుగా మారుస్తున్నాడు. బాధితురాలి ముఖాన్ని పోలిన విధంగా రూపొందించిన ఈ కంటెంట్ను రెడిట్, ఇన్స్ట్రాగామ్, డిస్కార్డ్ సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేస్తున్నాడు. ఈ విధంగా రూపొందించిన చిత్రాలు, వీడియోలు, పోస్టులను బాధితురాలి బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకు చేరేలా చేసి ఆమె పరువుకు భంగం కలిగించేందుకు ప్రయత్నించాడు. రోజూ సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడుతూ డబ్బు డిమాండ్ చేస్తున్నాడు. ఏడాదిన్నరగా 200కుపైగా పోస్టులు ఏడాదిన్నర కాలంగా మొత్తం 200కుపైగా పోస్టులు వివిధ వేదికల్లో నిందితుడు పోస్టు చేశాడు. ఈ వ్యవహారంపై బాధితురాలి భర్త ఆన్లైన్లో పరిశీలించి కొన్ని యూజర్ ఐడీలు, యూజర్ నేమ్స్, తొలగించిన పోస్టులు, కామెంట్లు తదితరాలకు సంబంధించిన లింకులను గుర్తించారు. వీటి ఆధారంగా సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రయాణికులున్నా.. లేకున్నా ఒకే మార్గంలో బారులు
సమయం ఉదయం 10 గంటలు. స్థలం ఉప్పల్ రింగ్రోడ్డు బస్టాపు.. ఉప్పల్ నుచి నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల మీదుగా మెహిదీపట్నం వెళ్లే రూట్ నంబర్ 300 బస్సు వచ్చి ఆగింది. క్షణాల్లోనే ప్రయాణికులతో బస్సు నిండిపోయింది. ఆ తర్వాత 10 నిమిషాలకు వచ్చిన మరో బస్సు కూడా కిక్కిరిసిపోయింది. ఈ రెండు బస్సుల తర్వాత వరుసగా ప్రతి 2 నిమిషాలకో బస్సు వచ్చి చాలా వరకు ఖాళీగానే వెళ్లాయి. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉప్పల్ రింగ్రోడ్డు నుంచి బయలుదేరిన 39 బస్సుల్లో ఇలా సగానికి పైగా ఖాళీగా బయల్దేరినవే ఉన్నాయి. కొన్ని మాత్రం సగం ప్రయాణికులతో కదిలాయి. ఈ ఒక్క రూట్ మాత్రమే కాదు. నగరంలోని ప్రధాన మార్గాల్లో ఇదే పరిస్థితి. బస్సుకు మరో బస్సుకు మధ్య కనీస వ్యవధి లేకుండా బయలుదేరుతున్నాయి. ఐదారు బస్సులు ఒకేసారి వరుసగా వస్తున్నాయి. కొన్నిసార్లు గంట గడిచినా ఒక్క బస్సు కూడా అందుబాటులో ఉండదు. మరోవైపు ఒకేరూట్లో నగరంలోని వివిధ డిపోల నుంచి బయలుదేరే బస్సుల మధ్య నిర్దిష్టమైన సమయపాలన అమలు కావడం లేదు. కొరవడిన సమయ పాలన.. బోరబండ మీదుగా సికింద్రాబాద్ వరకు రాకపోకలు సాగించే ‘10 వై/ఎఫ్’ రూట్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో వరుసగా 5 బస్సులు బయలుదేరాయి. మొదటి రెండు బస్సుల్లో మాత్రమే ప్రయాణికులు కనిపించారు. ఆ తరువాత అన్నీ ఖాళీయే. కానీ.. ఈ ఐదు బస్సులు వెళ్లిపోయిన తర్వాత గంటకు పైగా ఒక్క బస్సు కూడా రాలేదు. దీంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సివచి్చంది. నగరంలోని సుమారు 1,050 రూట్లలో సిటీ బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రధాన రూట్లలో వివిధ డిపోల నుంచి బస్సులను నడుపుతున్నారు. నాలుగైదు డిపోల బస్సులు ఒకేసారి రావడంతో బంచింగ్ సమస్య తలెత్తుతోంది. కొన్ని రూట్లలో నిమిషానికి ఒకటి చొప్పున నడిస్తే మరికొన్ని రూట్లలో అరగంట నుంచి గంట గడిచినా బస్సులు లభించడం లేదు. నగరంలోని 25 డిపోల నుంచి ప్రతిరోజూ సుమారు 1,950 బస్సులు రోజుకు 24 వేల ట్రిప్పులకు పైగా తిరుగుతున్నట్లు అంచనా. బస్సుల మధ్య సమయపాలనను రేషనలైజ్ చేయకపోవడంతోనే బంచింగ్ సమస్య ఉత్పన్నమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. కొన్ని డిపోల్లో కండక్టర్లు, డ్రైవర్లు సకాలంలో విధులకు హాజరు కాకపోవడంతోనూ బస్సులు ఆలస్యంగా బయలుదేరుతున్నట్లు ఆరోపణలున్నాయి. మొదటి రెండింట్లోనే రద్దీ.. పటాన్చెరు నుంచి సికింద్రాబాద్కు 219, 226 రూట్ బస్సులు ఎక్కువగా నడుస్తాయి. ఒకేసారి నాలుగైదు బస్సులు వస్తున్నాయి. మొదట వచ్చే రెండింటిలో మాత్రమే రద్దీ ఉంటుంది. మిగతావి ఖాళీగా ఉంటాయి. – జ్యోతి, ప్రయాణికురాలు, కూకట్పల్లి ట్రాఫిక్ సమస్యల వల్లే.. హై ప్రీక్వెన్సీ రూట్లలోనే ఈ బంచింగ్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో ప్రతి 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు, 10 నిమిషాల వ్యవధితో బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు ఎక్కడో ఒకచోట ట్రాఫిక్లో చిక్కుకోవడంతో చివరకు అన్నీ కలిసి ఒకే బస్టాప్లో ఒకే సమయానికి చేరుకుంటున్నాయి. – శ్రీధర్, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ చదవండి: భారీగా పెరిగిన చాయ్ ధర! -
భారీగా పెరిగిన చాయ్ ధర!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాదీలకు ఎంతో ప్రియమైన చాయ్ ధర అమాంతం కొండెక్కింది. నిన్నమొన్నటి వరకు గల్లీ షాపుల్లో రూ.10 ఉన్న కప్పు టీ ధర ఎప్పుడు ఏకంగా రూ.20కి చేరింది. ఇక ఓ మోస్తరు టీస్టాళ్లు, ఇరానీ హోటళ్లలో ఏకంగా రూ.25 నుంచి రూ.30 తీసుకుంటున్నారు. ఎందుకిలా అంటే.. చక్కెర ధర పెరగడమే కారణమని తెలుస్తోంది. కిలో చక్కెర రూ.69కి చేరడంతో చాయ్ ధర పెంచక తప్పలేదని నిర్వాహకులు చెబుతున్నారు. పాతబస్తీ, చార్మినార్, అబిడ్స్, అమీర్పేట, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి పరిధిలోని ఇరానీ కేఫ్లలో ఇరానీ చాయ్ రూ.30, దమ్ చాయ్ రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం టీ తాగేవారికి రోజుకు రూ.20, నెలకు రూ.600 అదనపు భారం పడుతోంది. ఇక స్వీట్ల ధరలూ పెరిగాయి. చక్కెర ధర పెరుగుదల కారణంగా అన్ని రకాల స్వీట్ల పైన కిలోకు రూ.50 నుంచి 100 వరకు పెంచేశారు. ఇదీ చదవండి: ప్రయాణికులున్నా.. లేకున్నా ఒకే మార్గంలో బారులు -
రూ.100 కోట్ల భూమి కాజేసే యత్నం
కందుకూరు: నకిలీ పత్రాలు సృష్టించారు.. భూ యజమానులను భయభ్రాంతులకు గురిచేశారు.. సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని కాజేసే యత్నం చేశారు.. చివరికి పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. కందుకూరుకు చెందిన మర్రిపల్లి శ్రీనివాస్, మర్రిపల్లి మహేశ్, మర్రిపల్లి అర్జున్, మహేశ్వరం మండలం మంఖాల్కు చెందిన ఉల్ల మల్లేశ్ కందుకూరు రెవెన్యూ సర్వే నంబర్లు 151, 152, 153, 165, 166లోని తమ పేర్లతో పాటు తమ కుటుంబానికి చెందినవారి భూమిని రాజేంద్రనగర్కు చెందిన పోలిశెట్టి మల్లికార్జున్, జూబ్లీహిల్స్కు చెందిన వడాల రాజేంద్రనాథ్, పుప్పాలగూడకు చెందిన అధిక మంజునాథ్రెడ్డికి డెవలప్మెంట్ కోసం ఇస్తున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయా సర్వే నంబర్లలో భూమి ఉన్న మర్రిపల్లి కుమార్, మర్రిపల్లి అశోక్, మర్రిపల్లి శైలజ, మర్రిపల్లి నీలమ్మ, మర్రిపల్లి నర్సింహ, మర్రిపల్లి కల్పన, బొద్దం జంగారెడ్డి, ఐ.శ్యాంసుందర్రెడ్డి తదితరులను సంప్రదించగా వారు నిరాకరించారు. దీంతో వారి ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్పుస్తకాల వివరాలు సేకరించారు. 21 మంది పట్టాదారులు కలిసి మొత్తం 31.36 ఎకరాలు (డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ ఇర్రోకబల్ జనరల్ పవర్ ఆఫ్ అటారీ్న) రద్దు చేయలేని డెవలప్మెంట్ జీపీఏ చేసినట్లుగా 2024 మార్చి 26న నకిలీ పత్రాలు సృష్టించారు. తోట్ల సాయి అనే వ్యక్తితో భూమి ఇవ్వడానికి అంగీకరించని యజమానుల సంతకాలను ఫోర్జరీ చేయించారు.ఏవిధంగానైనా ఆ యజమానుల నుంచి భూమి డెవలప్మెంట్కు తీసుకోవాలన్న సంకల్పంతో ఒత్తిడి తెచ్చారు. ఇటీవల బాధితులకు తమకు భూమి అగ్రిమెంట్ చేసి ఇవ్వడంలేదని, చర్యలు తీసుకుంటామని తెలిపేలా లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. అప్పటి వరకు తమ భూమి ఇలా ఫోర్జరీ జరిగిన విషయం యజమానులకు తెలియదు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ పత్రాలు సృష్టించి అగ్రిమెంట్ చేసుకున్న పోలిశెట్టి మల్లికార్జున్, వడాల రాజేంద్రనాథ్, అధిక మంజునాథ్రెడ్డితో పాటు వారికి సహకరించిన మర్రిపల్లి శ్రీనివాస్, ఉల్ల మల్లేశ్, తోట్ల సాయి, మర్రిపల్లి అర్జున్, మర్రిపల్లి మహేశ్పై కేసు నమోదు చేశారు. వీరిలో పోలిశెట్టి మల్లికార్జున్, మర్రిపల్లి శ్రీనివాస్, వడాల రాజేంథ్రనాథ్, అధిక మంజునాథ్రెడ్డిని సోమవారం అదుపులోకి తీసుకుని సాయంత్రం రిమాండ్కు తరలించారు. మల్లేశ్, సాయి, అర్జున్, మహేశ్ పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. -
‘ఇందిరమ్మ టవర్స్’ లబ్ధిదారుల ఎంపిక కోసం 28 నుంచి లక్కీ డ్రా
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇందిరమ్మ టవర్లలోని గృహాల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపిక కోసం 28 నుంచి 31వ తేదీ వరకు పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించనున్నట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. క్యూర్ పరిధిలో 16 నియోజకవర్గాలకు సంబంధించి అందిన 60,720 దరఖాస్తుల్లో సమగ్ర విచారణ అనంతరం 40,900 మందిని అర్హులుగా గుర్తించినట్టు వెల్లడించారు. అనర్హుల దరఖాస్తులను ఎందుకు తిరస్కరించామో కారణాలతో వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. లక్కీ డ్రాలను స్థానిక ఫంక్షన్హాళ్లలో నిర్వహిస్తామని, ఒక్కో కేంద్రానికి ఒక్కో ప్రత్యేక పర్యవేక్షణాధికారిని నియమించామని తెలిపారు. ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ. పది వేల ఈఎండీ మొత్తాన్ని వారి ఖాతాల్లోకి తిరిగి జమ చేస్తామని స్పష్టం చేశారు. మరో నాలుగు నియోజకవర్గాల్లో కూడా స్థలాల ఎంపిక.. 28వ తేదీన రాయదుర్గం, కేపీహెచ్బీ కాలనీ, మైలార్దేవ్పల్లి, రెడ్ హిల్స్, 29న కౌకూర్, పాటిగడ్డ, జల్పల్లి, కుల్సుంపుర, 30న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, బోయిష్ పల్లి, బండ్లగూడ (ఎల్ఐజీ కాలనీ), నందిముస్లాయిగూడ, 31న గాజులరామారం, అంబర్ పేటలోని సిటీపోలీస్ లైన్స్, గడ్డిఅన్నారం, ఆర్–బి క్వార్టర్స్,పోచారం (ఎల్ఐజీ కాలనీ)లో లక్కీడ్రా నిర్వహిస్తారని తెలిపారు. క్యూర్ పరిధిలో మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఇళ్ల చొప్పున మొత్తం 1,920 ఇళ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో హయత్నగర్ గ్రామంలోని ఆమన్గల్, గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లి, ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాపూర్ (ఆర్టీసీ క్వార్టర్స్), చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో (ఫలక్నుమా సమీపంలో) ఇళ్లు నిర్మిస్తామని, ఆసక్తి ఉన్న నిరుపేదలు సెప్టెంబర్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. -
గల్లీకో నకిలీ డాక్టర్!
సాక్షి, హైదరాబాద్: నర్సు... కాంపౌండర్... అనస్థీషియా అసిస్టెంట్... ఫస్ట్ ఎయిడ్ ప్రొఫెషనల్... ఈ కోర్సులు చదివిన వాళ్లు, ఇలా పనిచేసిన వాళ్లూ డాక్టర్లుగా మారిపోయారు. ఎవరికి వారుగా సొంత క్లినిక్లు ఏర్పాటు చేసుకుని సెలైన్లు ఎక్కించడం, ఇంజెక్షన్లు చేయడంతో పాటు ఎడాపెడా మందుల్నీ రాసేస్తున్నారు. మరికొందరు తమ కుటుంబీకుల ఎంబీబీఎస్ డిగ్రీలు అడ్డం పెట్టుకుని ప్రాక్టీసు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సూడో డాక్టర్లు నిర్వహిస్తున్న క్లినిక్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుస దాడులు చేశారు. ఫలితంగా 12 మంది చిక్కారని, వీరినుంచి భారీగా ఔషధాలు, పరికరాలు, లెటర్హెడ్స్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మంగళవారం తెలిపారు. ఇన్స్పెక్టర్లు జె.రాజశేఖర్, సీహెచ్ యదేందర్లతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఇటీవల చోటు చేసుకున్న రోగుల మరణాల నేపథ్యంలో ఈ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులైన ఒక్కో ‘డాక్టర్’వెనుక ఒక్కో కథ ఉందని వివరించారు. మెడికల్ షాపు నడవటం కోసం క్లినిక్ కేపీహెచ్బీ ప్రాంతానికి చెందిన డి.రామశేఖర్ రెడ్డి 2015 నుంచి తన భార్య నాగజ్యోతి డి–ఫార్మసీ సర్టీఫికెట్ ఆధారంగా రహమత్నగర్లో ‘ఆక్వా ఫార్మసీ‘ని నడుపుతున్నాడు. ఈ దుకాణానికి వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గడంతో తానే ఓ క్లినిక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫార్మసీని శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా మార్చేసి డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ పూర్తి చేసిన నిజాంపేట వాసి రాగం సుధాకర్ను డాక్టర్ని చేశాడు. ఈయన రోజుకు దాదాపు 50 మంది రోగులకు వైద్యం చేస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.200 చొప్పున ఫీజు వసూలు చేసి పంచుకుంటున్నారు. నర్సు అనుభవంతో పీడియాట్రిక్ ప్రాక్టీస్ తూప్రాన్కు చెందిన మిరుదొడ్డి భారతి మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు చేసి, నర్సుగా పని చేసింది. ఈ అనుభవంతో డాక్టర్గా మారి రహమత్నగర్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసింది. కొన్నాళ్లుగా పీడియాట్రిక్ డాక్టర్గా మారిపోయి చిన్న పిల్లలకూ వైద్యం చేస్తోంది. ఫాస్ట్ఫుడ్ సెంటర్ మానేసి క్లినిక్ జూబ్లీహిల్స్కు చెందిన కాటిక మహేశ్రావు బీఏ చదివాడు. ఫాస్ట్ఫుడ్ సెంటర్ పెట్టి నష్టపోయిన ఇతగాడు... నకిలీ వైద్యుడిగా మారి రెండేళ్ల క్రితం వెంకటగిరిలో ఒక గదిని అద్దెకు తీసుకుని క్లినిక్ ప్రారంభించి ప్రాక్టీసు చేస్తున్నాడు. కుమార్తె డిగ్రీతో తండ్రి వైద్యం షేక్పేటకు చెందిన పానుగంటి బాల నరసింహ ఫార్మసీ పూర్తి చేసి శ్రీ తిరుమల మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నడుపుతున్నాడు. ఈయన కుమార్తె పి.పరమేశ్వరి ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీకి సిద్ధమవుతున్నారు. ఆమె సర్టీఫికెట్ ఆధారంగా తన దుకాణం పక్కనే క్లినిక్ ఏర్పాటు చేశాడు. తానే డాక్టర్గా మారి వైద్యం చేస్తున్నాడు. ల్యాబ్ టెక్నీషియనే డాక్టర్ ఇంటరీ్మడియట్ మధ్యలో ఆపేసిన మహమ్మద్ అబ్దుల్ వలీ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేశాడు. ఆ అనుభవంతో గంగానగర్ వెజిటబుల్ మార్కెట్ వద్ద క్లినిక్ తెరిచి డాక్టర్గా అవతారమెత్తాడు. తండ్రి సర్టిఫికెట్తో ప్రాక్టీస్ సికింద్రాబాద్కు చెందిన ఎ.సందానీ తండ్రి ఎస్జీ సుబానీ చర్మ వైద్యుడు. ఇంటరీ్మయట్లో బైపీసీ చదివిన ఇతగాడు తండ్రి సర్టీఫికెట్ ఆధారంగా నల్లగుట్టలో నాలుగేళ్లుగా సందానీ క్లినిక్ పేరుతో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఇతడు రోగులకు ఇస్తున్న పెట్రోలియం జెల్లీలో హానికరమైన కాల్షియం పౌడర్, జింక్ ఆక్సైడ్ తదితరాలు ఉన్నట్లు తేలింది. కాంపౌండర్లే క్లినిక్లు... బీహెచ్ఎంసీ చదివి, పదేళ్లు కాంపౌండర్గా పని చేసిన ఎన్.ప్రసాద్ చిలకలగూడలో ఫ్యామిలీ క్లినిక్, డిగ్రీ చదివి కొన్నాళ్లు కాంపౌండర్లుగా పని చేసిన ఎం.శ్రీనివాస్, పి.సదానంద్, సీహెచ్ రమేష్ , ఎస్.లింగయ్యలు లోయర్ ట్యాంక్బండ్లో సాయిరాం క్లినిక్, చిలకలగూడలో సాయిరాం క్లినిక్, మాణికేశ్వర్ నగర్లో సరోజినీ పాలీ క్లినిక్, సూర్య క్లినిక్లు ఏర్పాటు చేసి ఏళ్లుగా వైద్యం చేసేస్తున్నారు. తమ వైద్యంలో పరిస్థితి చేతులు దాటిన పేషెంట్లను ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్కు పంపిస్తున్నారు. -
ఏఐ వైపు విద్యా సంస్థలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం రాబోయే రోజుల్లో పెద్దఎత్తున పెరగబోతోంది. ఇప్పటికే 80 శాతం విద్యాసంస్థలు ఏఐ ఆధారిత పాలన విధానాలను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో బోధన విధానాల్లోనూ ఏఐ తోడ్పాటును అనివార్యంగా స్వాగతించాల్సిన పరిస్థితి కన్పిస్తోంది. 2035 నాటికి ఏఐ వినియోగం మూడు రెట్లు పెరిగే అవకాశం కన్పిస్తోంది. అయితే, ఏఐని ప్రవేశపెట్టడంతోనే సరిపోదు. దానిపై పూర్తి స్థాయి అవగాహన అధ్యాపక వర్గానికి అందినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. క్యూఎస్–1 గేజ్ (క్వాక్వారెల్లి సైమండ్స్ ఇండియన్ గేజ్) తాజా అధ్యయనంలో ఈమేరకు వెల్లడైంది. క్యూఎస్–1 గేజ్ యూకే ఆధారిత గ్లోబల్ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ. ఇది ప్రపంచ యూనివర్సిటీల ప్రమాణాలపై అధ్యయనం చేసి, ర్యాంకింగ్ ఇస్తుంటుంది. కొన్ని నెలలుగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 146 ఉన్నత విద్యా సంస్థల నుంచి ’భారత ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ అనుసంధానం’అనే అంశంపై అధ్యాపకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ నివేదికను ఇటీవల విడుదల చేసింది. పాలనలో మెరుగు ఏఐని విద్యాసంస్థల్లో పాలన అవసరాల కోసం ఉపయోగించేందుకు 80 శాతం సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల పాలన మరింత సమర్థవంతంగా ఉంటుందని 83 శాతం మంది అభిప్రాయపడ్డారు. రొటీన్ పనులు, సమాచార నిర్వహణ, కంటెంట్ తయారీకి ఏఐ బాగా ఉపయోగపడుతోందని చెప్పారు. అయితే, విద్యాసంస్థలు ఏఐ సాధనాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకోకుండా, అధ్యాపకులకు శిక్షణ, స్పష్టమైన నైతిక మార్గదర్శకాలు, బలమైన డిజిటల్ మౌలిక వసతులు, సంస్థాగత మద్దతు ఇవ్వాలని మెజారిటీ అధ్యాపకులు తెలిపారు. ప్రతిభకు స్పీడ్ బ్రేకర్ ఏఐ వినియోగం వల్ల విద్యార్థుల ప్రతిభ మసకబారుతుందని 76 శాతం మంది అధ్యాపకులు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ సాధనాలు విద్యార్థుల వ్యక్తిగత అభ్యసన అవసరాలను సమర్థంగా తీర్చలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మానవీయ అవగాహన, సానుభూతి, సందర్భానుసారమైన మార్గదర్శకత్వంలో ఏఐకి ఇంకా పరిమితులు ఉన్నాయని తెలిపారు. ఏఐపై అతిగా ఆధారపడితే విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు తగ్గే అవకాశం ఉందని 78 శాతం మంది అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఏఐని పూర్తిగా ప్రత్యామ్నాయంగా కాకుండా బోధనకు సహాయక సాధనంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని నివేదిక ప్రస్తావించింది. విద్యార్థులు ప్రాజెక్టు వర్క్, ఇతర అసైన్మెంట్ల విషయంలో అధ్యాపకులు పూర్తిగా విశ్వసించలేకపోవడమే దీని సారాంశం. ప్రతీ పనికి విద్యార్థులు ఏఐపై ఆధారపడటం వల్ల వారి సృజనాత్మకత దెబ్బతింటోందని, సొంతంగా ఆలోచించే విధానం తగ్గుతోందని 72 శాతం మంది అధ్యాపకులు అన్నారు. ఇంకెన్నో అనుమానాలు ఏఐని మూల్యాంకన దశకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఏఐ రూపొందించిన సమాధానాల కచ్చి తత్వాన్ని ధ్రువీకరించడం సవాల్గానే మారిందని 68% మంది అధ్యాపకులు అన్నారు. ఏఐ సమాచారాన్ని యథాతథంగా నమ్మకుండా వాస్తవ నిర్థారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. డేటా గోప్యత, డేటా షేరింగ్ పరిమితులను అర్థం చేసుకోవడం కూడా మరో ప్రధాన సమస్యగా ఉందని 53% మంది అధ్యాపకులు పేర్కొన్నారు. ఏఐని సమర్థంగా అమలు చేయడానికి సంస్థలు అందించాల్సిన సహాయాల్లో ప్రత్యక్ష శిక్షణా వర్క్షాప్లు ఉండాలని 71 మంది అధ్యాపకులు సూచించారు. 61 శాతం మంది ప్రీమియం లేదా ఎంటర్ప్రైజ్ స్థాయి ఏఐ సాధనాలకు సంస్థాగత గోప్యత అవసరమని తెలిపారు. 40 శాతం మంది అధ్యాపకులు ఏఐ సాధనాలను సమర్థంగా నేర్చుకోవడానికి ముందస్తు సాంకేతిక పరిజ్ఞానం అవసరమని భావిస్తున్నారు. దీంతో కేవలం సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంచడం కాకుండా, దాన్ని బోధనలో ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రాక్టికల్ శిక్షణ అవసరమని చెప్పారు. ఏఐ అనివార్యమేఏఐ ఆధారిత ప్రోగ్రామ్ విద్యాసంస్థలకు అనివార్యం. పాలనపరమైన అంశాల్లో డేటా బేస్డ్ ప్రోగ్రాంకు వెళ్తున్నాం. ఇది ఉపయుక్తంగా ఉంటోంది. పాఠ్యాంశాల రూపకల్పన, అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా సాంకేతికతపై మరికొంత క్లారిటీ కావాలి. – వినీత్ జాన్ రాబర్ట్ (హైదరాబాద్లో ఉన్నత విద్యాసంస్థ నిర్వాహకుడు) విద్యార్థుల కోణంలో ఆలోచించాలిప్రాజెక్టు వర్క్లను ఏఐ ఆధారంగా పూర్తి చేస్తున్న విద్యార్థుల్లో ఆలోచన శక్తి తగ్గుతోంది. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయగలిగినా వాస్తవ జిజ్ఞాస కొరవడటం పెద్ద లోపం. ఉద్యోగాల్లో నిత్యం కొత్త ఆలోచనలతో ముందుకెళ్తేనే భవిష్యత్. పునాది దశలో ఈ లోపాన్ని సరిచేయాలి. ఏఐకి విద్యార్థులు టూల్గా మారితే ప్రమాదమే. – సంధ్యారాణి (వరంగల్ ప్రైవేటు కాలేజీలో అధ్యాపకురాలు) -
సమృద్ధిగానే యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా, ఇతర ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఎరువుల విక్రయాల్లో పారదర్శకత, సమాన పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ను రాష్ట్రంలో దశలవారీగా అమలు చేస్తు న్న ప్రభుత్వం.. ఎరువుల వినియోగంపై రైతులను అప్రమ త్తం చేస్తోంది. రైతులకు ఎరువులు అందించేందుకు గత సంవత్సరం రబీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫెర్టిలైజర్ యాప్ ను రూపొందించి అమలు చేసింది. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా బుకింగ్ విధానాన్ని అమలు చేస్తుండడంతో తదనుగుణంగా అడుగు లు వేస్తోంది. తొలుత రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానాన్ని ఆగస్టు 6 నుంచి మరో 10 జిల్లాలకు, ఆగస్టు 21 నుంచి మరో 10 జిల్లాలకు విస్తరించారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి. మిగిలిన 10 జిల్లాల్లో ఈ నెలాఖరులోగా అమలు చేయనున్నారు. 42.34 లక్షల బస్తాలకు బుకింగ్ ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఇప్పటివరకు 10.17 లక్షల క్యూఆర్ కోడ్లు జనరేట్ కాగా, 42.34 లక్షల ఎరువుల బస్తాలు బుక్ అయ్యాయి. ఇందులో 28.39 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేశారు. ఎఫ్ఎఫ్ఎస్ యాప్ అమలు కాని జిల్లాల్లో రాష్ట్ర యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 33.37 లక్షల మంది రైతులు 137.63 లక్షల యూరి యా బస్తాలను బుక్ చేసుకోగా, 123.93 లక్షల బస్తాలను కొనుగోలు చేశారు. అయితే ఎఫ్ఎఫ్ఎస్ అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు అధికారులు తెలిపారు. కొందరు డీలర్ల వద్ద ఉన్న నిల్వకు మించి బుకింగ్లు నమోదవడం, కొన్ని గ్రామాలు, భూముల వివరాలు యాప్లో కనిపించకపోవడం, బుకింగ్ ప్రక్రియలో ఇతర సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, సాంకేతిక బృందాలు సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నాయని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి తెలిపారు. 2.77 లక్షల టన్నుల యూరియా నిల్వ గత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 9.79 లక్షల టన్నుల యూరియా వినియోగం కాగా, ప్రస్తుత వానాకాలంలో ఇప్పటివరకు 6.75 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2.77 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉంది. సెప్టెంబర్ నెలకు కేటాయించిన అదనపు సరఫరా కూడా రాష్ట్రానికి రానుంది. గత ఏడాది ఇదే సమయానికి 0.32 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 2.77 లక్షల టన్నులు ఉన్నాయి. రైతులు అవసరానికి మించి ముందస్తుగా ఎరువులను బుక్ చేసుకోవడం, కొనుగోళ్ల కోసం తొందరపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది. ఎరువుల లభ్యత, సరఫరా, రవాణా, పంపిణీని వ్యవసాయశాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రతి నిజమైన సాగుదారుడికి అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి.గోపి తెలిపారు. -
ఉద్యమం ఆగదు.. సర్కార్ను నిద్రపోనివ్వం
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు బకాయిల కోసం తన నిరాహార దీక్ష ముగిసినా, విద్యార్థుల హక్కుల కోసం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రకటించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభు త్వం తన మొండివైఖరి వీడి రూ. 15 వేల కోట్ల బకాయిలను చెల్లించేవరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని, విద్యార్థులకు న్యాయం జరగకపోతే త్వరలోనే సచివాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ మెడలు వంచుతామని స్పష్టం చేశారు. ఈ పోరాటానికి అండగా నిలిచిన విద్యార్థి లోకానికి, యువతకు, మేధావులకు, విద్యాసంస్థల ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం మధ్యా హ్నం రెండు గంటల ప్రాంతంలో బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండురోజుల నిరాహారదీక్షను ఉపసంహరించిన సందర్భంగా రాంచందర్రావు మాట్లాడారు. మంగళవారం దీక్షా శిబిరానికి వచ్చిన వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి రక్తపోటు, చక్కెరస్థాయిలు తగ్గాయని గుర్తించారు. నిరాహార దీక్ష ను కొనసాగిస్తే ఆయన ఆరోగ్యానికి ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇతర నేతల చేతుల మీదుగా నిమ్మరసం స్వీకరించి నిరాహార దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఎంపీ డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతీ ఏడాది యూపీఎస్సీ తరహాలో క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? రాహుల్ గాంధీ దీనిపై తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘రేవంత్ను సీఎంను చేసినందుకు తెలంగాణ ప్రజలు కుమిలిపోతున్నారు. భూములు అమ్మితే వచ్చిన వేల కోట్లు ఏం చేస్తున్నావు?.. పిల్లలకు ఫీజులు ఇవ్వడానికి మనసు రావడం లేదా ? విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరు ఆత్మహత్య చేసుకున్నా బాధ్యత రేవంత్రెడ్డిదే’అని హెచ్చరించారు. ‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా ఆశల మీద నీళ్లు చల్లావని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోయిలేని సీఎంను చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది’అన్నారు. ఎమ్మెల్సీలు డా.చిన్నమైల్ అంజిరెడ్డి, మల్కకొమరయ్య, పార్టీనేతలు డా.ఎన్.గౌతంరావు, టి.వీరేందర్గౌడ్, ఎన్వీ సుభాష్, గణేష్ కుండే, పి.మురళీధర్రావు, ఇ.పెద్దిరెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, సైదిరెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్రావు, జి.మనోహర్రెడ్డి, బండా కార్తీకరెడ్డి, గుజ్జుల ప్రేమేందర్రెడి పాల్గొన్నారు. 5, 6 తేదీల్లో బీజేపీ ప్రజాప్రతినిధుల నిరసన దీక్షలు: ఏలేటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ముఖ్యమైన సమస్యలపై అనుసరిస్తున్న వైఖరిపై నిరసనగా...వచ్చేనెల 5, 6 తేదీల్లో బీజేపీ ఆధ్వ ర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రకటించారు. భూభా రతి అక్రమాలు, 22ఏ పేరుతో లక్షలాది ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, తదితర సమస్యలపై సర్కార్ వైఖరిని ఎండగడతామన్నారు. అప్పటికీ ప్రభు త్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయకపతే, భూ కుంభకోణాలపై చర్యలు తీసు కోకపోతే బీజేపీ పక్షాన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభరోజైన 7న ’అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు తాండవిస్తుంటే సీఎం రేవంత్రెడ్డి అమెరికాలో పర్యటించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సర్కార్ భూభారతి పేరుతో దారుణమైన దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. -
ఏడాదిలో దేవాదుల పూర్తి!
సాక్షి, హైదరాబాద్: దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు.38 టీఎంసీల గోదావరి జలాలతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఇకపై జాప్యానికి తావులేకుండా సీఎం రేవంత్ నిర్ణయం మేరకు ప్రాజెక్టును ఫాస్ట్ట్రాక్పై పెట్టి ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో కలిసి మంగళవారం జలసౌధలో దేవాదుల ప్రాజెక్టుపై సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏ పని ఎక్కడ నిలిచిపోయింది? దానికి కారణమేంటి? పరిష్కారానికి ఏం చేయాలి? అనే అంశాలపై లోతుగా చర్చించామన్నారు. భూసేకరణ, అటవీ అనుమతులు, ఇతర సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. పరిహారం చెల్లింపులో ఒక్కరోజూ జాప్యం ఉండకూడదన్నది ప్రభుత్వ విధానమని, సాధ్యమైనంత అధికంగా గోదావరి జలాలను ఎత్తిపోయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేవాదుల ప్రాజెక్టుతో ఏళ్లుగా అనుబంధం ఉన్న సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, సీనియర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి, దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు సమీక్షలో పాల్గొనడంతో క్షేత్రస్థాయిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సమగ్రంగా పరిశీలించే అవకాశం లభించిందని తెలిపారు. సీఎంకు నివేదించాలి..: పొంగులేటి దేవాదుల ప్రాజెక్టుపై అవగాహన ఉన్న అధికారులతో మొదటి నుంచి చివరివరకు సమగ్ర సమీక్ష నిర్వహించి, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. రామప్ప చెరువులో నీటి నిల్వ సామర్థ్యాన్ని 29 నుంచి 35 అడుగులకు పెంచేందుకు అంచనాలను సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఒక్కో అడుగు నిల్వ పెంచితే ఎంత భూమి అవసరమవుతుందో సమగ్ర నివేదిక అందించాలని కోరారు. రామప్ప–లక్నవరం లింక్ కెనాల్ పనులను రూ.33 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జంపన్నవాగులో ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండేలా ఈ లింక్ కెనాల్ కీలకంగా ఉపయోగపడుతుందన్నారు. త్వరలో జరగనున్న జాతరను దృష్టిలో ఉంచుకుని రామప్ప–లక్నవరం లింక్ కెనాల్ పనులతో పాటు సంబంధిత అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. -
లక్ష కోట్లకు చేరువగా..!
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా రూ.లక్ష కోట్లకు చేరువైంది. గత నాలుగు నెలల కాలంలో అన్ని రకాల రాబడుల రూపంలో రూ. 93,388 కోట్లు సమకూరాయి. అంటే ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రూ.3.24 లక్షల కోట్లలో దాదాపు 30 శాతం మేర సమకూరాయన్నమాట. అదే గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.19వేల కోట్ల కంటే ఎక్కువ ఖజానాకు సమకూరాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో పురోగతితోపాటు రుణాలు కూడా ఓ మేరకు ఎక్కువగా తీసుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడులు ఆశాజనకంగానే ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక చెబుతోంది. పన్ను రాబడులు మెరుగ్గానే.. సొంత పన్నుల ఆదాయం ఏటేటా పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరం కూడా అదే ధోరణి కనిపిస్తోంది. జీఎస్టీ రూపంలో రూ.19,103 కోట్లు, స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ద్వారా రూ. 6,144 కోట్లు, అమ్మకపు పన్ను పద్దు కింద రూ. 12,584 కోట్లు, ఇతర పన్నుల రూపంలో రూ. 2,703 కోట్లు, పన్నేతర ఆదాయం కింద రూ. 4,274 కోట్లు సమకూరాయి. వీటికి తోడు బహిరంగ మార్కెట్లో రుణాల రూపంలో రూ. 33,729 కోట్లు ఖజానాకు చేరాయి. జీతాలకే ఎక్కువ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు పద్దులను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకే ఎక్కువగా ఖర్చయింది. రెవెన్యూ పద్దు కింద రూ.32వేల కోట్లకు పైగా ఖర్చు కాగా, ఉద్యోగుల వేతనాల కోసం రూ. 17,874 కోట్లు, పింఛన్ల రూపంలో రూ. 10,492 కోట్లు వ్యయమైంది. ఇక, గతంలో చేసిన అప్పులకు వడ్డీల కింద రూ. 10,532 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతోపాటు వివిధ రకాల సబ్సిడీల కోసం రూ. 7,870 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నాలుగు నెలల కాలంలో అన్ని పద్దుల కింద రూ. 93వేల కోట్లు రాగా, రూ. 88,182 కోట్లు ఖర్చు కావడం గమనార్హం. కేంద్రం నుంచి వచ్చింది తక్కువే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి సాయం తక్కువగానే వచ్చింది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 4నెలల కాలంలో రూ. 5,502 కోట్లు వచ్చాయి. దీంతోపాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో మరో రూ.2,300 కోట్లు వచ్చాయి. అదే గత ఏడాది ఇంతకంటే ఎక్కువ నిధులు కేంద్రం నుంచి వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలలకు రూ. 5,899 కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా కింద, రూ.700 కోట్లకుపైగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో సమకూరాయి. -
సాగునీరు బాధ్యత సర్కార్దే
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇబ్బందులు విధానపరమైన అంశాలని, సాగునీటిని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల భద్రత, పునరుద్ధరణ, నీటి నిర్వహణపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) ఇప్పటికే పలుమార్లు సాంకేతిక పరిశీలనలు నిర్వహించి, నిపుణుల కమిటీల సిఫారసుల మేరకు చర్యలు చేపట్టినట్టు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హైకోర్టుకు తెలిపింది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పూర్తయ్యే వరకు దానిని ఆపరేట్ చేయరాదని, నిర్మాణంపై నీటిఒత్తిడి తగ్గించేందుకు గేట్లను పూర్తిగా తెరిచి ఉంచాలని నిపుణుల కమిటీ సూచించినట్టు వెల్లడించింది. ఈ పిటిషన్పై రెండు వారాల్లో విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును సురక్షితంగా వినియోగించే అంశంపై ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ న్యాయవాది ఎస్.శరత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్ల రక్షణ, వినియోగ సాధ్యాసాధ్యాలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, ఎన్డీఎస్ఏతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. బరాజ్లతోపాటు కన్నెపల్లి సుందిళ్ల పంప్హౌస్ల స్వతంత్ర సాంకేతిక తనిఖీ చేపట్టాలని, ఆ ప్రాంతంలోని పొలాలకు సాగునీరు అందించేందుకు పంప్హౌస్లలో దేనినైనా పాక్షికంగా వినియోగించే సాధ్యతపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. బరాజ్ల భద్రతపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కౌంటర్లో సీడబ్యూసీ పేర్కొన్న వివరాలు.. ‘మేడిగడ్డ బరాజ్ పియర్లు కుంగిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) 2023, అక్టోబర్ 22న ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అక్టోబర్ 23–25 మధ్య బరాజ్ను పరిశీలించి, నవంబర్ 1న నివేదిక సమర్పించింది. ప్రణాళిక, డిజైన్, నిర్మాణ నాణ్యత, నిర్వహణలో లోపాలతోనే నష్టం జరిగిందని పేర్కొంది. మేడిగడ్డను వినియోగంలోకి తేవడానికి ముందు పునరుద్ధరణ అవసరమని, అన్నారం, సుందిళ్ల బరాజ్లను కూడా అత్యవసరంగా పరిశీలించాలని సిఫారసు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు.. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 2024, మార్చి 2న మరో కమిటీని ఏర్పాటు చేశాం. సీడబ్ల్యూసీ, సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్ఎంఆర్ఎస్, ఐఐటీ ఢిల్లీ సభ్యులతో కూడిన ఈ కమిటీ మూడు బరాజ్లపై సమగ్ర అధ్యయనం చేసింది. 2025 మార్చిలో తుది నివేదిక సమర్పించింది. మేడిగడ్డ బ్లాక్–7 గేట్లను వరద కాలానికి ముందు పూర్తిగా తెరిచి ఉంచాలని, అత్యధికంగా దెబ్బతిన్న పియర్ నంబర్ 20కు సమీపంలోని గేట్ నంబర్లు 20, 21లను అవసరమైతే పూర్తిగా తొలగించాలని కూడా సూచించింది. మిగిలిన ఆరు గేట్లను పూర్తిగా తెరిచి, ఆ స్థితిలోనే పటిష్టంగా బిగించాలని పేర్కొంది. ఏదైనా గేటును పూర్తిగా ఎత్తడంలో ఇబ్బంది ఎదురైతే దానిని కూడా పూర్తిగా తొలగించాలని సిఫారసు చేసినట్టు వివరించింది. పియర్ నంబర్ 20కి ఆనుకుని ఉన్న గేట్లను పూర్తిగా తొలగించాలని కమిటీ మధ్యంతర సిఫారసులు చేసింది. ఈ మార్చి 27న హైదరాబాద్లో ఎన్డీఎస్ఏ చైర్మన్ అధ్యక్షతన బరాజ్ల ఆరోగ్య స్థితిపై సమీక్షా సమావేశం జరిగింది. కాళేశ్వరం బరాజ్ల పునరుద్ధరణ పనులను పర్యవేక్షించేందుకు 2026, జూన్ 30న సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశాం. డ్యామ్ సేఫ్టీ చట్టం, 2021 కింద ఎన్డీఎస్ఏ.. తన చట్టబద్ధ విధులను నిర్వర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టినప్పుడు వాటిని కమిటీ పర్యవేక్షిస్తుంది. నిర్దిష్ట బరాజ్కు భద్రత, మరమ్మతు చర్యలపై సూచనలిచ్చే బాధ్యత స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్వో)దేనని తెలిపింది. తాము చట్టబద్ధ విధులను నిర్వర్తించలేదని, దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు పొందడంలో రైతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని పిటిషనర్ చేసిన ఆరోపణలు సరికాదు. వ్యవసాయపరమైన ఇబ్బందులు విధానపరమైనవని, అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. పిటిషనర్ ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలగలేదు. పిటిషన్ను కొట్టివేయాలి’అని కోరింది. -
నిమ్స్ తరహాలోనే టిమ్స్లో ఫీజులు
సాక్షి, హైదరాబాద్ /వెంగళరావునగర్ : డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్)లో నిమ్స్ తరహా టారిఫ్ విధానం అమలు కానుంది. ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు లేని రోగులకు నిమ్స్లో వసూలు చేసినట్టే నామమాత్రపు ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో గుండె సంబంధమైన వ్యాధుల కోసం ఏర్పాటైన తొలి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కావడంతో రోగుల నియంత్రణ, ఆస్పత్రి నిర్వహణ, నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని టిమ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం నిర్ణయించింది. మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిమ్స్లో అమల్లో ఉన్న టారిఫ్లను టిమ్స్లోనూ అమలు చేసే కీలక నిర్ణయానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీనివల్ల రెండు ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థల్లో వైద్యసేవల చార్జీల్లో ఏకరూపత వస్తుందని, మెరుగైన ఆర్థిక ప్రణాళికకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం టిమ్స్కు రోజూ సగటున 600 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని సంస్థ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రకుమార్ మంత్రికి వివరించారు. వారికి అవసరమైన వైద్య సేవలతోపాటు డే కేర్ విధానంలో చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. సర్వీస్ రూల్స్ కూడా నిమ్స్వే ఎంసీఆర్ టిమ్స్లో డాక్టర్లు, సిబ్బంది నియామకాల కోసం నిమ్స్ సర్వీస్ రూల్స్ను అనుసరించడంతోపాటు, నిమ్స్లో అమలులో ఉన్న టారిఫ్లను టిమ్స్లో కూడా అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. టిమ్స్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ (టీఆర్ఏ) ద్వారా నిర్వహించేందుకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను సమన్వయం చేయడానికి కూడా అనుమతి ఇచ్చింది. మల్టీలెవల్ పార్కింగ్..పీజీ హాస్టళ్లు రోగులు, వైద్యులు, సిబ్బందికి మౌలిక వసతులను మెరుగుపరిచే పలు ప్రతిపాదనలకు కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. ఆస్పత్రిలో పార్కింగ్ సమస్యకు పరిష్కారంగా మల్టీలెవల్ కార్ పార్కింగ్ నిర్మాణం, రోగుల సహాయకుల కోసం అదనపు టాయిలెట్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నిమ్స్ తరహాలో టిమ్స్లో పీజీ కళాశాలను ప్రారంభించనున్న నేపథ్యంలో పీజీ విద్యార్థుల కోసం హాస్టళ్ల నిర్మాణ ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. టిమ్స్ను అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకురావడంతోపాటు వైద్య విద్య, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి రాజనర్సింహ తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ఉప్పల్, వైద్య విద్య సంచాలకురాలు డాక్టర్ వాణి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్నాయక్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ పాల్గొన్నారు. -
‘మూసీ’ భూసేకరణ వేగవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో మూసీ ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో భూసేకరణ సమస్యలు, ల్యాండ్ పూలింగ్ విధానం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. వీటిపై స్పష్టమైన విధానం రూపొందించాలని, భవిష్యత్లో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్–2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి లభించే రుణాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని సూచించారు. భూసేకరణలో భాగమైన టీడీఆర్ అంశంపై ప్రతి వారం సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు వెంటనే టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. కొత్వాల్గూడ బర్డ్స్ పార్కుకు విస్తృత ప్రచారం కల్పించి సందర్శకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం కార్యదర్శి మాణిక్రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు 55 కిలోమీటర్ల కారిడార్ను పునరుద్ధరించే లక్ష్యంతో పనులు చేపడుతున్నట్టు ఎంఆర్డీసీఎల్ అధికారులు తెలిపారు. మూసీ పరిధిలోని ఎంఎఫ్ఎల్/బఫర్ జోన్లలో భూములను స్వచ్ఛందంగా అప్పగించే వారికి టీడీఆర్ అందించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచి్చంది. మూసీ ప్రాజెక్టులో భూసేకరణకు సంబంధించి కొందరు యజమానులు టీడీఆర్కు బదులుగా నగదు, ఇళ్లు లేదా ఓపెన్ ప్లాట్లు కోరుతున్నట్టు సమాచారం. భూముల స్వభావం, హక్కులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ హద్దులను స్పష్టంగా నిర్ధారించడం ద్వారా భవిష్యత్ న్యాయ వివాదాలను నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
వేటు వేయండి!
సాక్షి, హైదరాబాద్: అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిపై చర్యలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. పార్టీకి ఇబ్బంది కలిగేలా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారని, ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి, చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని పార్టీని కోరింది. ఈ మేరకు కొండా సురేఖ, చిన్నారెడ్డిలకు సంబంధించిన నివేదికలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు అనంతుల శ్యాంమోహన్, వాజిద్ హుస్సేన్ తదితరులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ను కలిసి నివేదికను అందజేశారు. ఈ నివేదికను ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందా..? లేక నేరుగా అధిష్టానం పరిశీలించి నిర్ణయం వెంటనే తీసుకుంటుందా? లేక ఏఐసీసీ స్థాయిలో వారిద్దరిని పిలిపించి వారి వివరణలు తీసుకున్నాక తుది నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆసక్తికర చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఆమెను తప్పించడమే పరిష్కారం మంత్రి కొండా సురేఖ విషయంలో ఇచ్చిన నివేదికలో ‘క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటం సురేఖకు అలవాటుగా మారింది. ఆమె రాజకీయ నేపథ్యమంతా వివాదాలతో కూడుకున్నదే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఆమె వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రెండుసార్లు పార్టీకి క్షమాపణలు చెప్పి మళ్లీ పార్టీ నియమావళిని ఉల్లంఘించారు. అమెను మంత్రి పదవి నుంచి తప్పించడమే సరైన చర్య అని భావిస్తున్నాం’ అని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. సురేఖకు సంబంధించి మూడు, చిన్నారెడ్డిపై రెండు పేజీల నివేదికతోపాటు ఇందుకు తగిన ఆధారాలను కూడా పొందుపరిచిన క్రమశిక్షణ కమిటీ ఇదే నివేదికను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు కూడా పంపినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. మంచి అవకాశమిచ్చాం... విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ చిన్నారెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా, గెలిచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి అవకాశం ఇచ్చాం. కేబినెట్ హోదా ఇచ్చాం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఆయన కేబినెట్ సమావేశాలకు కూడా వస్తున్నారు. తొమ్మిదిసార్లు ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది. పోటీ చేసేందుకు అవకాశామిచ్చింది. కానీ ఉద్దేశపూర్వకంగానే పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరించారని, పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడారని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించి ఆయన్ను పదవి నుంచి తప్పించాలి’ అని చిన్నారెడ్డి గురించి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. హైకమాండ్ నిర్ణయం మేరకు చర్యలు: మల్లురవి పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్కు నివేదిక ఇచ్చిన అనంతరం గాం«దీభవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ప్రధానమైందని చెప్పారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి గురించిన అన్ని విషయాలు, సిఫారసులను తమ నివేదికలో పొందుపర్చామని చెప్పారు. ఈ నివేదికను ఏఐసీసీ చీఫ్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పంపుతారని చెప్పారు. ఏదైనా హైకమాండ్దే తుది నిర్ణయమని, తమ సిఫారసుల ద్వారా పార్టీ కేడర్కు ఓ సందేశం వచ్చేలా నివేదిక ఇచ్చామని మల్లురవి స్పష్టం చేశారు. పార్టీ పెద్దగా తనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా సురేఖ, చిన్నారెడ్డి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ కోణంలో ఆ ఇద్దరికి నోటీసులు ఇస్తే.. ఆ నోటీసులనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సమాధానం ఇవ్వడం సబబు కాదని వ్యాఖ్యానించారు. కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన అంశం కొండా సురేఖకు తెలియకుండానే జరుగుతుందా అని పశి్నంచారు. సాయంత్రం సీఎం రేవంత్రెడ్డిని కూడా కలిసి నివేదికలోని అంశాలను వివరించడానికి ప్రయత్నించారు. కానీ రేవంత్ బిజీ షెడ్యూల్ కారణంగా కలవలేకపోయారని, వీలును బట్టి బుధవారం సీఎంను కలిసే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.ఏమి జరుగుతుందో? కఠిన చర్యలు తీసుకోవాలన్న క్రమశిక్షణ కమిటీ నివేదిక నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు హైకమాండ్ అంగీకరిస్తుందా? లేక గౌరవప్రదంగా ఆమెతో రాజీనామా చేయిస్తుందా..? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమె శాఖను మారుస్తారా.. ఇంతకు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు చిన్నారెడ్డి విషయంలో ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు... అధికారిక పదవి నుంచి మాత్రమే తప్పిస్తారా లేదంటే మందలింపుతో సరిపెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. -
సారంపల్లి... నీకు సలాములయ్యా
హైదరాబాద్: ‘సారంపల్లి మల్లారెడ్డి నీకు సలాములయ్యా...మీ తరమెల్లిపోతుందయ్యా...మా చేయి పట్టి నడిపేదెవరయ్యా...మీలాంటి నేతలు మళ్లీ మళ్లీ పుట్టాలయ్యా... కార్మిక కర్షక రాజ్యం రావాలయ్యా... సమాసమాజ స్థాపన జరగాలయ్యా...’’ అంటూ కమ్యూనిస్టు యోధుడు సారంపల్లి మల్లారెడ్డికి రైతాంగం కన్నీటి వీడ్కోలు పలికింది. రైతాంగ ఉద్యమాల గురువు భావించే మల్లారెడ్డిని కడసారి చూసేందుకు హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయానికి అన్నదాతలు, రైతు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున కదలొచ్చారు. చివరి చూపు కోసం వచ్చిన ప్రతి ఒక్కరి కండ్లలోనూ ‘మొన్నటిదాకా నవ్వుతూ పలుకరించిన నేత.. మన కోసం ఇంతగా పోరాడిన మనిషి ఇక లేడా’ అని ఆయన పార్థీవదేహంపై పుష్పాంజలి ఘటిస్తూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. నవ్వుతూ మాట్లాడే ఆ విజ్ఞానఖని దేహం నిర్జీవంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయారు.కన్నీటి చుక్కలు జాలువారాయి. మాట్లాడేందుకు నోటిమాట రాక మౌనందాల్చారు. కష్టకాలంలో అండగా నిలిచిన ఆ యోధునికి కడసారి చేతులెత్తి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆ పెద్ద మనిషికి వీడ్కోలు చెబుతూ బరువైన హృదయంతోనూ ప్రతీ గొంతూ నినదించింది. తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన మల్లారెడ్డి చివరి మజిలీ కూడా ఒక సందేశంగా మారింది. పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించడంతో మరణాన్నీ సమాజ సేవకే అంకితం చేసినట్టు అయింది. మల్లారెడ్డి లేరనే నిజం ఎంత చేదైనా రైతుల కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ స్మరణీయమే..ఆచరణీయమే. ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రతి రైతులో, ఆయన మాటను గుర్తుచేసుకునే ప్రతి మనసులో, అన్నదాత హక్కుల కోసం ఎగిసే ప్రతి గొంతులో... సారంపల్లి మల్లారెడ్డి జీవించే ఉంటారు. రైతుల క్షేమం కోసం ఆయన రగిలించిన స్ఫూర్తి యువతరానికి ఆదర్శప్రాయంగా నిలువనున్నది. ఏఐకేఎస్ జాతీయ నేత, సీపీఐ(ఎం) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఉంచారు. ఆయన్ను కడసారి చూసేందుకు నిమ్స్ నుంచి ఆయన మృతదేహం రాకముందే ఎంబీభవన్కు రైతులు, ప్రజలు, అభిమానులు, సన్నిహితులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున తరలొచ్చారు. దీంతో ఆర్టీసీ క్రాస్రోడ్డు మెట్రో స్టేషన్, నాబార్డు కార్యాలయం పరిసర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. గాంధీ మెడికల్ కాలేజీకి సారంపల్లి భౌతిక కాయం అప్పగింతమధ్యాహ్నం 12 గంటల తర్వాత సారంపల్లి మల్లారెడ్డి అంతిమ యాత్ర సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ ఆస్పత్రి వరకు కొనసాగింది. అందులో ఆయా జిల్లాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజానాట్యమండలికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు, డప్పు కళాకారులు తమ ప్రదర్శనలు ఇస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత గాంధీ మెడికల్ కాలేజీ వరకు అంతిమ యాత్ర కొనసాగింది. అక్కడ గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్, నాగమోహన్, ప్రొఫెసర్లు గౌరి, రమాదేవి సమక్షంలో మల్లారెడ్డి భౌతిక కాయాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్, నాగమోహన్ మాట్లాడుతూ..నలుగురికీ ఉపయోగపడాలనుకునే ఉన్నత భావాలున్నవాళ్లే ఇలాంటి మంచి పని చేస్తారనీ, వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం డెడ్బాడీని ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులను అభినందించారు. -
ఒంటరైన మంత్రి కొండా సురేఖ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమానికి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. వనమహోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా పండగలా నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చినప్పటికీ, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు గైర్హాజరయ్యారు. కేవలం మంత్రి సీతక్క మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.వరంగల్ జిల్లాలో నిర్వహించిన వనమహోత్సవంలో భాగంగా కొండా సురేఖ మొక్కలు నాటారు. ఆమె పిలుపు మేరకు మంత్రి సీతక్క వచ్చి మద్దతు తెలిపారు. అయితే, సీతక్క మినహా మిగతా మంత్రులందరూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం.కొండా సురేఖకు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య వివాదం నడుస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలోనే మంత్రులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వనమహోత్సవంలో పాల్గొంటే సీఎంకు దూరంగా ఉన్నట్లు అవుతుందనే ఉద్దేశంతోనే మిగతా మంత్రులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది.👉ఇదీ చదవండి: ‘నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ -
జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదులో అలసత్వం వహించారంటూ సీఐపై వేటు వేసింది. సుమంత్ను పట్టుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకుంది. మూడు వారాల క్రితమే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్గా ముత్తు యాదవ్ బాధ్యతలు చేపట్టారు.కాగా, హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు మూడు బృందాలు ఏర్పాటు చేయగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. గత నెల 30న జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయానికి సుమంత్ సహచరులు రాము డబ్బు వ్యవహారంలో మాట్లాడేందుకు చెంగిచెర్ల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ని పిలిపించారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టుఅక్కడే ఉన్న సుమంత్ ఆయన అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము తదితరులు ఇనుపరాడుతో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సుమంత్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ఆయన డ్రైవర్ నవీన్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
హైదరాబాద్లో 'ఏక్చిత్ర న్యూ ఆర్ట్ గ్యాలరీ' ప్రారంభం..
హైదరాబాద్ నగరాన్ని కళలకు మరో కొత్త వేదికగా మార్చేందుకు ముందుకొచ్చింది ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ. పెయిటింగ్, శిల్పకళ, సెరామిక్స్, ఇన్స్టాలేషన్స్, ఫొటోగ్రఫీ, మిక్స్డ్ మీడియా, వివిధ కళారూపాల సమ్మేళంతో పాటు విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ కొత్త గ్యాలరీ పెద్ద పీట వేయనున్నట్లు ఆర్టిస్ట్, క్యురేటర్ ఏక్చిత్ర స్థాపకురాలు అన్నపూర్ణ మడిపడిగ తెలిపారు. వీటన్నింటికీ అనుగుణంగా విస్తృత స్థలం, ఇతర సౌకర్యాలు ఈ గ్యాలరీలో అందుబాటులో ఉన్నాయి. వర్ధమాన కళాకారులతోపాటు ప్రఖ్యాత కళాకారులకూ అనువైన వేదికగా ఈ ఏక్చిత్ర గ్యాలరీని రూపొందించినట్లు అన్నపూర్ణ తెలిపారు.ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్ట్ కలెక్టర్ అంజూ పొద్దార్, ప్రముఖ రచయిత, దర్శకుడు దేవకట్టా, రావు బహదూర్ ఫేమ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా, యాదగిరిగుట్ట ప్రధాన ఆలయ శిల్పి, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సీనియర్ కళాకారులు బీఏ రెడ్డి, శంకర్ పామర్తి హాజరై అన్నపూర్ణ, ఏక్చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఏక్చిత్ర కొత్త ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి ఎంఎస్ఎస్ రియాల్టీ, రెస్టారెంట్ అనగనగా తెలుగు కలినరీ టేల్స్ భాగస్వామ్యులుగా మారి మద్దతునిచ్చాయి.పర్మనెంట్ ప్రింట్ మేకింగ్ స్టూడియో:ఈ ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీలో పర్మనెంట్ ప్రింట్ మేకింగ్ స్టూడియో కూడా ఏర్పాటు చేశారు. ప్రింట్ మేకింగ్ను ఒక ప్రత్యేక కళారూపంగా మార్చడం, దాన్ని ప్రోత్సహించడంలో ఈ గ్యాలరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అలాగే కళాకారులను ఈ మాధ్యమంతో అనుసంధానించడం కూడా ముఖ్య ఉద్దేశ్యంగా పని చేస్తుంది. అంతేకాదు.. శిక్షణ, ప్రయోగాలు, వర్క్ షాప్స్, స్క్రీనింగ్స్, డిబేట్స్, ఆర్ట్ ఎక్స్చేంజ్ మొదలైన అంశాల్లో కూడా కళాకారులకు ఈ గ్యాలరీ ఒక వేదికగా ఉపయోగపడుతుంది.ఈ సందర్భంగా ఆర్టిస్ట్, ఏక్చిత్ర వ్యవస్థాపకురాలు అన్నపూర్ణ మాట్లాడుతూ.. 'ఈ ఏక్చిత్ర గ్యాలరీ ప్రదర్శనలు, భాగస్వామ్యాలు, సంభాషణలతో పాటు కళాకారులు, ప్రేక్షకుల మధ్య ఏర్పడిన సంబంధాల వల్లే అభివృద్ధి చెందింది. ఎగ్జిబిషన్లకు వేదికగా మాత్రమే కాకుండా కళాకారులు, కళల మధ్య అనుబంధాలను పెంచుతూ.. సంభాషణలు, వర్క్ షాపులు వంటి సరికొత్త కార్యక్రమాలకు వేదిక కావాలన్నదే మా ముఖ్య ఉధ్దేశ్యం. వీటన్నింటికీ మా ఆర్ట్ గ్యాలరీ ఉపయోగపడాలని, దాన్నొక అవసరంగా మేము భావించాం' అని తెలిపారు. ఈ కొత్త గ్యాలరీ కళకారులు, డిజైనర్లు, ఆర్కిటెక్ట్స్, పరిశోధకులు, సాంస్కృతిక రంగానికి చెందిన వ్యక్తులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు భవిష్యత్తులో పలు అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు అన్నపూర్ణ వెల్లడించారు.ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన దర్శకుడు వెంకటేశ్ మహా మాట్లాడుతూ, 'కళతో మమేకమయ్యే ఇంటరాక్టివ్ ఆర్ట్ స్పేస్ లను నేను యూరప్ పర్యటనలో చాలా చూశాను. అలాంటి చోట నాకు టైమ్ స్పెండ్ చేయడం చాలా ఇష్టం. అవకాశం ఉన్నప్పుడు అక్కడి వర్క్ షాపుల్లో పాల్గొనేవాడిని. ఇప్పుడు ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ అలాంటి స్పేస్గా ముందుకురావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో నేను పాల్గొనేందుకు ఎదురుచూస్తుంటాను' అని చెప్పారు.దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ, 'ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ కళ, సృజనాత్మకతకు ఒక ప్రత్యేక గుర్తింపుగా మారాలని కోరుకుంటున్నాను. కళాకారులు, కళాభిమానులకు ఇది గొప్ప కమ్యూనిటీని ఏర్పర్చాలని ఆశిస్తుస్తున్నాను' అని తెలిపారు.మొదటి ప్రదర్శన : ట్రాన్సిషన్ఏక్చిత్ర న్యూ గ్యాలరీ.. ‘ట్రాన్సిషన్: ఎ కంటిన్యుటీ టు చేంజ్ - యాన్ ఓడ్ టు ఐడెంటిటీస్ ఇన్ ఫ్లక్స్’ అనే ఎగ్జిబిషన్ తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు ఇందులో పాల్గొంటారు. శిల్పకళ, పెయింటింగ్, సెరామిక్స్, ప్రింట్ మేకింగ్ మొదలైన విభిన్న కళారూపాలకు చెందిన కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తారు. కళారూపాలతో వీళ్లంతా మన దేశ వారసత్వ సంపదలను ప్రపంచానికి చాటనున్నారు. ఈ కొత్త గ్యాలరీ గతంలో వేర్వేరుగా భాగాలుగా మారిన ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్, డెకరేటివ్ ఆర్ట్స్ ల మధ్య సంబంధాన్ని గుర్తుచేయనుంది.ఫౌండర్ కమ్ క్యురేటర్ అన్నపూర్ణ..ఆర్టిస్ట్, క్యురేటర్ అన్నపూర్ణ మడిపడిగ ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకురాలు. ఆమె హైదరాబాద్ కేంద్రంగా కళ, కథనం, జ్ఞాపకం, సంస్కృతి, ప్రాంతీయతలను ఒకచోటకు చేర్చే క్యురేటోరియర్ ప్లాట్ఫామ్ గా ఈ ఏక్ చిత్ర ను స్థాపించింది. హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ వంటి నగరాల్లో ఆమె ఇప్పటివరకు 25కు పైగా ప్రధాన ప్రదర్శనలకు క్యురేటర్ గా వ్యవహరించింది. తెలుగు రాష్ట్రాల కళా చరిత్ర, జీవన సంప్రదాయాలతో ఏక్చిత్రకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆర్కిటెక్చర్, సాహిత్యం, చిత్రకళ , సంగీతం, హస్తకళలు, దేవాలయ సంప్రదాయాలు, దక్కనీ ప్రభావాలు, జానపద కళారూపాలు వంటి అంశాలపై కూడా ఆమె దృష్టి సారిస్తోంది.ఏక్చిత్ర భవిష్యత్ ప్రణాళికలు:లివింగ్ టెంపుల్ నుంచి బావ్లీ ఆర్ట్ సంగంఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ తమ కార్యకలాపాలపై పక్కా ప్రణాళికలు రూపొందించింది.- లివింగ్ టెంపుల్ - ఎడిషన్-2:ఈ కార్యక్రమం ద్వారా వారసత్వ ప్రదేశాలను సాంస్కృతిక వేదికలుగా మార్చడం. కళ, ఆర్కిటెక్చర్, సంప్రదాయ వ్యక్తీకరణ, ప్రజల భాగస్వామ్యం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం.- కీర్తనం:ఈ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల కళా చరిత్రకు అంకితం చేసే విధంగా రూపొందించనున్నారు. కళా చరిత్రలు, సాంస్కృతిక కథనాలకు అధిక ప్రాధాన్యం అందించడం.- బావ్లీ ఆర్ట్ సంగం:దీనిద్వారా హైదరాబాద్ లోని చారిత్రక మెట్ల బావులను కళా వేదికలుగా మార్చే ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం. మెట్ల బావులను కేంద్రంగా చేసుకుని, ప్రదర్శనలు, వర్క్ షాపులు, హెరిటేజ్ వాక్స్, టాక్స్ వంటి వాటిని ప్రోత్సహించడం. వారసత్వం, నీరు, ఆర్కిటెక్చర్ లకు సమకాలీన కళను అనుసంధానం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం.ఇటువంటి విభిన్న, అద్భుత ప్రాజెక్టులతో ఈ కొత్త ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్ కళారంగానికి మరో చిరునామాగా మారనుంది. ప్రదర్శన, అభ్యాసం, భాగస్వామ్యం ద్వారా కళను కళాభిమానులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏక్చిత్ర ముందుకొచ్చింది. -
Hyderabad: వందేళ్ల సిటీ కళాశాలలో ప్రమాదం
చార్మినార్: వందేళ్ల చరిత్ర ఉన్న ప్రఖ్యాత సిటీ కళాశాల భవనంలోని కారిడార్ కూలిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఫిజిక్స్ ల్యాబ్ వైపు ఉన్న కారిడార్ ఒక్కసారిగా కుప్పకూలింది. విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మి, డాక్టర్ నీరజలు ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. కారిడార్ ఆదివారం కూలి ఉండవచ్చునని..తమకు మాత్రం సోమవారం ఉదయం తెలిసిందని కళాశాల అధికారులు చెబుతున్నారు. సిటీ కళాశాల పూర్వ విద్యారి్థ, చారి్మనార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. సిటీ స్కూల్గా ప్రారంభమై.. 6వ, ఆసిఫ్ జా కాలంలో మెహబూబ్ అలీ ఖాన్ 1865లో దారుల్–ఉల్–ఉలూం పేరుతో సిటీ స్కూల్గా ప్రారంభమై.. ఏడో ఆసిఫ్ జా ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో హైస్కూల్గా మారింది. 1929లో సిటీ కళాశాలగా ఉన్నతీకరించారు. 30 మందితో ప్రారంభమైన ఈ కాలేజీలో ప్రస్తుతం 6వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్ అనే చీఫ్ ఇంజినీర్ ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఆన్లైన్లో ప్రాక్టికల్స్ ప్రస్తుతం సైన్స్ ల్యాబ్లు అన్నింటినీ మూసివేశారు. వారం రోజులు ప్రాక్టికల్స్ ఉండవని సంబంధిత ప్రొఫెసర్లు చెబుతున్నారు. అవసరమైతే ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. శిథిలావస్థకు చేరి.. ఈ కళాశాల ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. హెరిటేజ్ భవనం కావడంతో పురావస్తు శాఖ అధికారుల అనుమతితో మరమ్మతులు చేయించాల్సి ఉంది. కానీ గత కొన్నేళ్లుగా ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. ఎప్పుడు వర్షాలు కురిసినా.. పైకప్పు తడిసి ముద్దయి..సైన్సు ల్యాబ్ లోకి నీరు కారుతుంది. అప్పుడప్పుడు పెచ్చులు సైతం ఊడిపడ్డాయి. సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ హెరిటేజ్ భవనం కావడంతో మరమ్మతులకు ఆలస్యమవుతుంది. వర్షాలలో ప్రమాదం పొంచి ఉండడంతో ఈనెల 20న చారి్మనార్ ఎమ్మెల్యే మీర్ జులి్ఫకర్ అలీతో పాటు ఉన్నతాధికారులకు సిటీ కళాశాల ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపక బృందం సమాచారాన్ని అందజేసింది. అప్పటికే పెచ్చులూడిపడటంతో ఫిజిక్స్ ల్యాబ్ మూసివేశారు. వందేళ్ల సిటీ కళాశాలలో ప్రమాదం -
హైదరాబాద్లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ డాక్టర్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ వైద్యుల దందాపై దాడులు నిర్వహించిన టాస్క్ఫోర్స్ పోలీసులు.. 11 మంది నకిలీ డాక్టర్లను పట్టుకున్నారు. డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పలు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పేరుతో వైద్యం చేస్తున్నారు. నకిలీ వైద్యులపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. అర్హతలు లేకుండానే వైద్యం చేయడంపై ఆరా తీస్తున్నారు. నకిలీ వైద్యులపై ఉక్కుపాదం మోపిన పోలీసులు.. నకిలీ డాక్టర్ల వైద్యంపై విచారణ చేపట్టారు.కాగా, గత ఏడాది కూడా అర్హత లేకుండా వైద్యం చేస్తున్న 8 మంది నకిలీ డాక్టర్లను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గుర్తించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలోని బౌరంపేట్, దుండిగల్, సూరారం ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి అధిక స్థాయి మందులను రోగులకిచ్చి హాని కలిగిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మెడికల్ బృందాలు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
టీ హబ్తో భారత ఆర్మీ ఒప్పందం
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ హబ్ తాజాగా భారత ఆర్మీకి చెందిన సెంట్రల్ కమాండ్తో కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రక్షణ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేపడుతున్న స్టార్టప్లకు సైన్యంతో కలిసి నేరుగా క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశాన్ని ఈ ఒప్పందం కల్పిస్తుంది. భారత రక్షణ రంగాన్ని ఆధునీకరించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లకు సరికొత్త సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, వాటిని ధ్రువీకరించడానికి ఇది దోహదపడనుంది.భారత ఆర్మీ వెస్ట్రన్ కమాండ్తో టీ హబ్కు ఇప్పటికే ఉన్న భాగస్వామ్యానికి కొనసాగింపుగా ఈ తాజా ఒప్పందం నిలిచింది. దీంతో కమాండ్ స్థాయిలో రక్షణ దళాలతో ప్రత్యక్ష అనుబంధం కలిగిన అతికొద్ది జాతీయ సంస్థలలో టీ హబ్ ఒకటిగా చేరింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐడెక్స్ పథకాన్ని అమలు చేస్తున్న 28 సంస్థలలో టీ హబ్ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్గా గుర్తింపు పొందింది.ఇప్పటివరకు 100కు పైగా రక్షణ స్టార్టప్లతో పనిచేస్తూ, 70కి పైగా ఛాలెంజ్లను పూర్తిచేసింది. ఈ పథకం ద్వారా టీ హబ్ స్టార్టప్లు రూ.4.2 కోట్లకు పైగా గ్రాంట్లు, రూ.9 కోట్ల విలువైన ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ డెలివరీల సహకారంతో సుమారు రూ.250 కోట్లకు పైగా వాణిజ్య రక్షణ ఆర్డర్లను సాధించాయి. ఈ భాగస్వామ్యం కింద ఆర్మీ సెంట్రల్ కమాండ్ అందించే నిర్దిష్ట సమస్యలను పరిష్కరించే స్టార్టప్లను టీ-హబ్ ఎంపిక చేస్తుంది. స్టార్టప్లు, సైనిక భాగస్వాముల మధ్య కార్యక్రమాల సమన్వయాన్ని ఒక సంయుక్త పర్యవేక్షణ కమిటీ పర్యవేక్షిస్తుంది.ఈ సందర్భంగా టీ-హబ్ సీఈవో కవికృత్ మాట్లాడుతూ ‘సాంకేతికతలు క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా ఉండాలంటే వ్యవస్థాపకులకు సైన్యంతో ప్రత్యక్ష సమన్వయం తప్పనిసరి. ఈ ఒప్పందం దానికి మార్గం సుగమం చేస్తుంది. భారతీయ రక్షణ స్టార్టప్ల నైపుణ్యంతో పాటు సంక్లిష్ట అవసరాలను తీర్చే సాంకేతికతలను రూపొందించడంలో హైదరాబాద్ సామర్థ్యంపై ఉన్న నమ్మకాన్ని ఇది తెలియజేస్తోంది’ అని పేర్కొన్నారు. దేశీయ సాంకేతికతలను ప్రోత్సహించడానికి భారత సైన్యం కట్టుబడి ఉందని సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి తెలిపారు. క్షేత్రస్థాయి అవసరాలను తీర్చే స్టార్టప్ల ఆవిష్కరణలు సాయుధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయని వివరించారు.ఇది కూడా చదవండి: ఓణం హిందూ పండుగ కాదా?.. తెరపైకి కొత్త చర్చ! -
చిన్న సమస్యతో ఆస్పత్రికి.. చివరికి విషాదం!
సాక్షి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వివాహిత మృతి చెందింది.దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రిని ధ్వంసం చేశారు.వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యం పరారైంది. వివరాల్లోకి వెళితే.. కాచిగూడకు చెందిన దివ్య (35) చిన్నపాటి ఆనారోగ్య సమస్యతో మారేడుపల్లిలోని బృందావన్ ఆసుపత్రిలో చేరారు.వారం రోజుల క్రితమే ఆమెను పరీక్షించిన వైద్యులు సోమవారం ఆపరేషన్ చేస్తామని చెప్పడంతో, ఆదివారం రాత్రి అడ్మిట్ అయ్యారు. సోమవారం ఉదయం చికిత్స ప్రారంభించారు. తొలుత పేషెంట్కు రక్త స్రావం అవుతోందని.. అదనపు రక్తం కావాలని చెప్పారు. ఇంతలోనే పెషెంట్ వైట్ బ్లడ్ సెల్స్ పడిపోయాయని, బ్లడ్ సెల్స్ తెప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరికొద్ది సేపటికి పేషెంట్ మృతి చెందినట్లు చెప్పి, మృతదేహాన్ని అక్కడే వదిలేసి వైద్యులు తప్పించుకున్నట్లు మృతురాలి బంధువులు పేర్కొన్నారు. దీంతో ఆందోళనకు దిగడంతో మరికొందరు బంధువులు కూడా మద్దతు పలికారు.ఆసుపత్రి అద్దాలు, పూలకుండీలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి ఆసుపత్రి యాజమాన్యం, బాధితులతో మాట్లాడారు. ల్యాప్రోస్కోపీ సమయంలో ప్రమాదవశాత్తూ వెయిన్ తెగిపోవడంతో తీవ్రంగా రక్తస్రావంతో పాటు పెషెంట్ గుండెపోటుకు గురై ఉంటుందని వైద్యులు సమాధానం ఇచ్చారు. ఈ మేరకు రాతపూర్వక సమాధానం అనంతరం బాధితులు శాంతించినప్పటికీ, నిర్లక్ష్యపు వైద్యం చేసిన ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.కేసు నమోదు... మృతురాలి భర్త వికాస్ ఫిర్యాదు మేరకు అస్పత్రి వైద్యులు శ్రీకాంత్, గీతాంజలి పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు.ఎమ్మెల్యే పరామర్శ.. దివ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరామర్శించారు. బృందావన్ ఆస్పత్రికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు. -
చిక్కిన నకిలీ డీఎస్పీ..
సాక్షి, హైదరాబాద్: డబ్బులు డబుల్ చేస్తామని వ్యాపారి నుంచి రూ.1.20 కోట్లు కాజేసిన కేసులో కీలక నిందితుడు నకిలీ డీఎస్పీ కొండూరు రెడ్డి వెంకట్ రాజు ఎట్టకేలకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. దాదాపు ఐదేళ్లుగా పరారీలో ఉన్న అతడిపై మరో మూడు కేసులు ఉన్నట్లు డీసీపీ చైతన్యకుమార్ సోమవారం వెల్లడించారు.మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు సునీల్కుమార్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఆయన స్నేహితుడు కోడటి జయప్రతాప్ 2018 డిసెంబర్లో ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇస్తే పెట్టుబడులు పెట్టి, పక్షం రోజుల్లో రూ.18 కోట్లు ఇస్తాడని చెప్పగా.. సునీల్కుమార్ నమ్మలేదు.దీంతో 2019 అక్టోబర్ 28న అప్పుడు సీఐడీ విభాగంలో తిరుపతి డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.మునిరామయ్యను జయప్రతాప్ హైదరాబాద్ తీసుకువచ్చి సునీల్ కుమార్ను కలిశారు. రూ.1.20 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తామంటూ మునిరామయ్య నమ్మించారు. ఇవ్వకుంటే పరిస్థితి ఏంటని సునీల్ ప్రశ్నించడంతో.. మునిరామయ్య ఓ నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపాడు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన రాజు అనే వ్యక్తిని తీసుకువచ్చి టాస్క్ఫోర్స్ డీఎస్పీగా పరిచయం చేశాడు.డబ్బు వసూలు చేయడం రాజుకు పెద్ద పనేంకాదంటూ ఒప్పించారు. రెండేళ్లయినా డబ్బు తిరిగిరాకపోవడంతో సునీల్కుమార్ ఆరా తీయగా రాజు అనే డీఎస్పీనే లేరని తేలింది. సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో జయప్రతాప్, మునిరామయ్య, రాజు సహా ఐదుగురిపై 2021లో కేసు నమోదు చేశారు. 2021, 2022లో కొందరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సూడో డీఎస్పీ రాజు బెంగళూరులో ఉన్నట్లు టీమ్–5 ఏసీపీ కె.కిరణ్ కనిపెట్టి పట్టుకున్నారు. -
సమయం లేదు వినాయకా!
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి పండుగకు కేవలం 20 రోజుల సమయే ఉండగా..మట్టి గణపతి విగ్రహాల పంపిణీపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎలాంటి కదలిక లేదు. పర్యావరణ హితమైన గణపతి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేసి ప్రజల్లో అవగాహన పెంచేందుకు, పొల్యూషన్ను అడ్డుకునేందుకు ప్రతి ఏటా పీసీబీ లక్షల సంఖ్యలో మట్టి గణపతి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉంటుంది. ఈమేరకు దాదాపు రెండు నెలల ముందుగానే విగ్రహాల తయారీ, టెండర్లు, కాంట్రాక్టర్లకు అప్పగింత వంటి పనులు మొదలవ్వాలి. ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉండగా..ఇప్పటికీ టెండర్లే పిలవలేదు. దీంతో విగ్రహాల పంపిణీ ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టెండర్ల ప్రక్రియను తూతూ మంత్రంగా మార్చేందుకే ఇలా జాప్యం జరుగుతోందన్న ఆరోపణలూ విన్పిస్తున్నాయి. గత ఏడాది కూడా విగ్రహాలకు సంబంధించిన టెండర్ల వ్యవహారం ఆలస్యమై చివరి నిమిషం వరకు గందరగోళం ఏర్పడింది. దాన్ని అనుభవంలోనికి తీసుకునైనా ఈ ఏడాది అధికారులు స్పందించడం లేదు. లక్ష్యం 3.26 లక్షలు పీసీబీ ఈ ఏడాది 3,26,471 మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. కానీ గుత్తేదారుల నుంచి టెండర్లు పిలవడంలో ఇప్పటి వరకు స్పష్టత లేకుండా పోయింది. టెండర్లు తెరిచి తక్కువకు కోట్(ఎల్–1) చేసిన వారికి సరఫరా బాధ్యతలు అప్పగిస్తారు. అయితే ఉన్న ఈ తక్కువ సమయంలో ఎల్–1 గుత్తేదారుకు 3.26 లక్షల విగ్రహాల తయారీ, పంపిణీ సాధ్యమయ్యే వి షయమేనా అన్నదే అసలు సమస్యగా కనిపిస్తోంది. 40 శాతం గోల్మాల్.. గత ఏడాది పీసీబీ అధికారులు 2.20 లక్షల విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. సరిపడా సమయం లేకపోవడంతో చివరి క్షణంలో ఎల్–1 గుత్తేదారు మొత్తం మేం సరఫరా చేయలేమని చెప్పడంతో అధికారులు ఆత్మరక్షణలో పడ్డారు. టెండరులో పాల్గొన్న అందరిని పిలిచి సనత్నగర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరు ఎన్ని విగ్రహాలను సరఫరా చేయగలరో అన్ని ఇవ్వండని సూచించారు. దీంతో సుమారు 40 శాతం మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయకుండానే అక్రమంగా బిల్లులు పొందారని పీసీబీ సిబ్బంది పేర్కొంటున్నారు. ‘దేవుడి విగ్రహాల విషయంలో ఇలా చేస్తారని అనుకోలేదు. నమ్మకంతో అప్పగిస్తే కాకిలెక్కలు చెప్పారు’ అని ఓ ఉన్నతాధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. -
డబ్బులిస్తే ఎంతటి ఉల్లంఘన అయినా బలాదూరే..
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణం.. అధికారుల నోటీసులు.. క్రమబద్ధీకరణ ప్రయత్నం.. కోర్టు జోక్యం.. మళ్లీ అక్రమ నిర్మాణం..చర్విత చరణం. ...ఇదీ హైదరాబాద్ మహానగరం తీరు. దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతున్న సమస్య. ప్రభుత్వాలు మారాయి.. పథకాలు మారాయి.. నిబంధనలు మారాయి.. కానీ అక్రమ నిర్మాణాలను పుట్టుకలోనే అడ్డుకునే వ్యవస్థ మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. టౌన్ ప్లానింగ్ అంటే..హైదరాబాద్ మహానగరంలో మనీ ప్లానింగ్గా మారింది. గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన ఈ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. నిర్మాణాన్ని అడ్డుకోవడంలో సంబంధిత టౌన్న్ప్లానింగ్ అధికారి విఫలమయ్యారంటూ సస్పెండ్ చేశారు. అక్రమ నిర్మాణాలపై విస్తృత తనిఖీలకు, ఉల్లంఘనలున్న చోట కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత యంత్రాంగం రంగంలోకి దిగింది. కానీ, భవనం కూలితేనే మేల్కొంటారా.. అప్పటిదాకా నిద్రపోతారా? అనే ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాలి. ఎప్పటి నుంచో .. అక్రమ నిర్మాణాలనుక్రమబద్ధీకరించేందుకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే 2008లో బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) తెచ్చారు. అప్పట్లోనే 2.05 లక్షల దరఖాస్తులందాయి. అక్రమ నిర్మాణాలను ఒకసారి క్రమబద్ధీకరించి సమస్యకు శాశ్వత ముగింపు పలకాలని అప్పటి ప్రభుత్వం భావించింది. తర్వాత టీఆర్ఎస్(బీఆర్ఎస్) అధికారంలోకి వచ్చాక 2015లోనూ అలాంటి ప్రయత్నమే చేసింది. పేరు మాత్రం బీఆర్ఎస్ (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్)గా మారింది. అంతే తేడా. దాదాపు 1.27 లక్షల దరఖాస్తులందినట్లు అప్పట్లో అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుల ఆదేశాలతో ఆ దరఖాస్తులకు మోక్షం రాలేదు.ఇంకా పెరిగాయి.. అయినప్పటికీ అక్రమ నిర్మాణాలు రాకుండా అధికారులు శ్రద్ధ చూపలేదు. పైపెచ్చు అక్రమార్కులతో చేయి కలిపి వారికి అండగా ఉండటంతో మరిన్ని అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయ నే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ గడువు ముగిశాక వెలసిన అక్రమ నిర్మాణాలు రెండు లక్షల దాకా ఉంటాయని అంచనా. అలాంటి వాటిల్లోదే గచ్చిబౌలిలో కుప్పకూలిన భవనం. దీని వెనుక ‘పొలిటికల్ పవర్ ’ ఉందనే ఆరోపణలున్నాయి. బీపీఎస్, బీఆర్ఎస్లకు అందిన దరఖాస్తుల్లోనూ సింహభాగం కూకట్పల్లి జోన్వి కావడం విశేషం. తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లి, ఎల్బీనగర్లున్నట్లు సమాచారం. నోటీసులతో మమ ఏ ప్రమాదం జరిగినా అంతకుముందే నోటీసులిచ్చినట్లు అధికారులు చెబుతారు. తమపైకి రాకుండా ఉండేందుకు అదో నైపుణ్యం. సాధారణ ప్రజల సెట్బ్యాక్లలో స్వల్ప ఉల్లంఘనలు కనిపిస్తే పదేపదే సతాయించే అధికారులకు భారీ భవంతులెందుకు కనిపించవో వేరుగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఇవే ప్రశ్నలు వేశాయి. అక్రమ భవనాన్ని కూల్చడం మాత్రమే కాదు.. అది అక్రమంగా నిలబడేలా చేసిన వ్యవస్థనూ ప్రశ్నించాలన్నాయి. అంతేకాదు, చట్టవిరుద్ధ నిర్మాణాలను కేవలం కాలం గడిచిందనే సాకుతో కొనసాగించేందుకు వీల్లేదని స్పష్టం చేశాయి. చట్టబద్ధంగా క్రమబద్ధీకరించలేని నిర్మాణాన్ని తొలగించాల్సిందేనని పేర్కొంటూ, అక్రమ నిర్మాణం ఎలా ఏర్పడిందో, అందులో అధికారుల పాత్రపై కూడా విచారణ అవసరమని సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాన్ని జీహెచ్ఎంసీ వర్గాలే చెబుతున్నాయి. బహుశా, ఈ నేపథ్యంలోనే కావచ్చు కొత్తగా రానున్న క్యూర్ చట్టంలో పకడ్బందీ ప్రతిపాదనలున్నాయి.80 శాతం ఫిర్యాదులు టౌన్ప్లానింగ్పైనే.. సోమవారం ప్రజావాణిలో సీఎంసీలో అందిన మొత్తం ఫిర్యాదులు 47 కాగా, టౌన్ప్లానింగ్వే 38 ఉన్నాయి. అంటే 80 శాతం. ఎంఎంసీలో మొత్తం 23 ఫిర్యాదుల్లో టౌన్ప్లానింగ్వి 19 అంటే 82 శాతం. వీటిని బట్టి నగరంలో అక్రమ నిర్మాణాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ నిజంగా అక్రమాలు అరికట్టడానికేనా ? అంటే కాదు. అక్రమ నిర్మాణదారులను డబ్బులు డిమాండ్ చేసేందుకు ఫిర్యాదులిచ్చేవారే ఇందులో ఎక్కువగా ఉంటారని సమాచారం. అంటే అక్రమాల ఆధారంతో మరో అక్రమం. ఇదీ నగరంలో టౌన్ (మనీ)ప్లానింగ్కు మరో ఉదాహరణ. -
అమెరికా నుంచి వచ్చిన యువతి అదృశ్యం
హైదరాబాద్: అమెరికాలో నివాసం ఉంటున్న యువతి అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు..పీర్జాదిగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన బుడిగె శైలజ కుమార్తె బుడిగె విహారిక (27), అల్లుడు హరీష్ లు ఈ ఏడాది జనవరి 26 నుంచి అమెరికాలో నివసిస్తున్నారు. అయితే ఈ నెల 20న విహారిక కనిపించడం లేదంటూ భర్త కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకోగా... విహారిక అమెరికా నుంచి తన పాస్పోర్ట్తో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆమె హైదరాబాద్కు వస్తుందని భావించి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లగా ఆమె అక్కడికి చేరుకోలేదు. అయితే ఆగస్టు 21న విహారిక ముంబై విమానాశ్రయంలో ఉన్నట్లు సమాచారం అందింది. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ కలవకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. మేడిపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. -
ప్రేయసి దూరమైందని అమెరికాలో ఆత్మహత్య..!
హైదరాబాద్: చదువుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు ప్రేమించిన యువతి దూరం కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఈనెల 21న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపిన మేరకు.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ దమ్మాయిగూడలోని శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన కృష్ణ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు సాయిప్రదీప్(29) 2024లో మాస్టర్స్ చదువు కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో తన అన్న ప్రణీత్తో కలిసి ఉంటూ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుండి మూడు నెలల క్రితం మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న సిద్ధిపేటకు చెందిన యువతిని ప్రదీప్ 9 నెలల పాటు ప్రేమించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని సాయి ప్రదీప్ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముందు తల్లిదండ్రులు అంగీకరించకపోయినా చివరకు ఒప్పుకున్నారు. ఇంతలోనే ప్రేమించిన యువతి దూరంగా ఉంటోంది. సున్నిత మనస్తత్వం కలిగిన ప్రదీప్ ఇది తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న ప్రేయసికి దాదాపు పది సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. తను చేస్తున్న జాబ్ బాధ్యతలను రెండు గంటల పాటు నిర్వర్తించాలని అన్నకు అప్పగించారు. ఆ తరువాత ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు ప్రణీత్ తెలిపారు. ప్రేయసి దూరం కావడంతోనే తమ్ముడు ప్రదీప్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని అమెరికాలో పోలీసులకు ప్రణీత్ ఫిర్యాదు చేశారని మృతుని తండ్రి కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని ఈ నెలాఖరులోపు తెప్పించేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇదిఆ ఉండగా ప్రదీప్కు చిన్నతనంలోనే కిడ్నీ సమస్య ఉండటంతో ఒక కిడ్నీని వైద్యులు తొలగించారు. సాయిప్రదీప్ తల్లిదండ్రులను కాంగ్రెస్ పార్టీ దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షుడు రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ నేత హరిగౌడ్ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు. -
రక్షణ గృహాల్లోని చిన్నారుల వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రక్షణ గృహాల్లోని చిన్నారుల సంఖ్య, అక్రమంగా దత్తత పొందినట్టు అనుమానించి స్వా«దీనం చేసుకున్న చిన్నారులు, ప్రభుత్వ స్పాన్సర్షిప్ పథకం లబ్ధిదారులు, ఫోస్టర్ కేర్ పథకం కింద ఉన్న చిన్నారులు.. ఇలా పలు వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో శిశువుల అక్రమ రవాణాపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమంగా దత్తత తీసుకున్న 9 మంది చిన్నారులను గుర్తించి రక్షించినా, అసలు తల్లిదండ్రులను గుర్తించకపోవడాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణ వచ్చే నెల 2కు వాయిదా వేస్తూ ఆలోగా పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. అవయవాల అక్రమ రవాణా, భిక్షాటన.. నల్లగొండకు చెందిన ఎం.వెంకన్న–స్రవంతి దంపతులకు సంతానం లేకపోవడంతో యాదగిరి ద్వారా ఓ చిన్నారి(శరణ్య)ని దత్తత తీసుకున్నారు. పిల్లలను అమ్ముతున్నాడన్న ఫిర్యాదు మేరకు యాదగిరిపై కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా శరణ్యను బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు. దీన్ని సవాల్ చేస్తూ వెంకన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. కన్న తల్లిదండ్రులు కాకుండా మూడో వ్యక్తి ద్వారా పొందిన దత్తత చెల్లదన్నారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వెంకన్న అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వ సంరక్షణలోని పిల్లల పూర్తి వివరాలను 2వారాల్లో సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి, హోంశాఖను కూడా ప్రతివాదులుగా చేర్చాలన్నారు. సంబంధిత శాఖల్లో డైరెక్టర్ లేదా అదనపు కార్యదర్శి హోదాకు తగ్గని అధికారులు స్వయంగా సమగ్ర నివేదికలు సమర్పించాలని చెబుతూ, విచారణ వాయిదా వేశారు. -
మనం గెలిచింది 2% ఓట్ల తేడాతోనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచి్చంది కేవలం 2 శాతం ఓట్ల తేడాతోనేనని.. ఇప్పుడు లక్షల ఓట్లను ఎన్నికల సంఘం ద్వారా కేంద్రం మాయం చేస్తోందని.. ఇది చాలా ప్రమాదకరమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహా రాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూ డా పోకుండా పార్టీ నాయకత్వం తగిన చర్యలు తీసుకోవా లని ఆమె ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ రెండో దశపై సోమవారం టీపీసీసీ ఆధ్వర్యంలో ‘జూమ్’సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఎస్ఐఆర్ అసెంబ్లీ, పార్లమెంటు సమన్వయకర్తలు, డీసీసీ అ«ధ్యక్షులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఆమె దిశానిర్దేశం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్ఐఆర్లో భాగంగా ఏం జరిగిందన్న దానిపై ప్రత్యేక నివేదికలు తయారు చేస్తామని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో బాగా పనిచేసే వారికే మళ్లీ టికెట్లు ఇస్తామ ని.. పనిచేయకుండా టికెట్ ఇవ్వాలంటే కుదరదని మీనాక్షి స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ను, రాష్ట్రంలో ఓట్ల తొలగింపు కుట్రను గమనించి ప్రతి ఒక్కరూ సీరియస్గా పనిచేయాలన్నారు. ఎస్ఐఆర్లో నిర్లక్ష్యం వద్దు: మహేశ్కుమార్గౌడ్ పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్లో కాంగ్రెస్ ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందువల్ల నేతలెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని.. రెండోదశలో మరింత చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ నెల 27న జరిగే సభలు కీలకమన్నారు. పార్టీ నేతలు జాగ్రత్తగా లేకపోతే నష్టపోతామని హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి ఓటును పరిశీలించాలని చెప్పారు. ఎమ్మెల్యేలతోపాటు నియోజకవర్గ ఇన్చార్జీలు, డీసీసీ అధ్యక్షులు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అదే పనిలో నిమగ్నం కావాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి ఎమ్మెల్యేల పనితీరుపై మహేశ్కుమార్గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నామినేటెడ్ పోస్టుల కోసం అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా నేతల జాబితాలను పంపాలని కోరినా ఎందుకు పంపలేదని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. మండల కమిటీలన్నింటినీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని.. సహకార సంఘాల కమిటీల ప్రతిపాదనలను కూడా వెంటనే పంపాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జీలను మహేశ్గౌడ్ కోరారు. ఈ భేటీలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎస్ఐఆర్ రాష్ట్ర సమన్వయకర్త గంపా వేణుగోపాల్, టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ రాజేశ్ పాల్గొన్నారు.మంత్రి సురేఖ అంశం ఏఐసీసీ చూస్తోంది మెదక్ జోన్: పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని.. మంత్రి కొండా సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక పీసీసీ, ఏఐసీసీకి అందిందన్నారు. త్వరలోనే ఏఐసీసీ పెద్దలు తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఉమ్మడి జిల్లా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రావు, పార్టీ నేతలు మైనంపల్లి హన్మంతరావు, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు. -
ఇది జెన్జీ యుగం
సాక్షి, హైదరాబాద్: ఇది జెన్జీ యుగమని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకుని వినియోగించుకోకపోతే కాలం చెల్లినవారవుతారని (అవుట్డేట్) ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్లు పాతవైపోయాయి. ఇప్పుడు యువత ఇన్స్టాగ్రాంలో హల్చల్ చేస్తోంది. మనం కూడా ఆ బాట పట్టాలి. ఇన్స్టాగ్రాం ఖాతాలు తెరిచి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలి’ అని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. రేవంత్ సోమవారం విలేకరుల సమావేశం అనంతరం కాసేపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించారు.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాను బీఆర్ఎస్ విస్తృతంగా వినియోగిస్తోందని, దీనికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేయాలన్నారు. ‘నాడు ఎకరం రూ.100 కోట్లకు అమ్మితేనే సంకలు గుద్దుకున్నారు. కానీ నేను ఎకరం రూ.260 కోట్లకు అమ్మా. రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం ఊపందుకుంటోంది. ఇటీవలి కాలంలో రియల్ కార్యకలాపాలు 18 శాతం పెరిగాయని నివేదికలు చెపుతున్నాయి. ఇవేవీ సోషల్మీడియాలో కనిపించవు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కోసం స్మార్ట్ కార్డులు తెచ్చాం.కానీ సంగారెడ్డిలో పంపిణీ చేసిన ఆ ఒక్క రోజే ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత అందరూ మర్చిపోయారు’ అని చెప్పారు. ఎమ్మెల్యేలందరూ వారి కార్యక్రమాలతోపాటు రాష్ట్ర పార్టీ, ఏఐసీసీ కార్యక్రమాలను కూడా సోషల్ మీడియాలో పెట్టాలని, ఇందుకోసం ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే సిబ్బందికి ఐ అండ్ పీఆర్ శాఖతో ఓరియంటేషన్ క్లాస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా మనందరం కలిసి పనిచేసినట్లే వచ్చే ఎన్నికల్లో కూడా పనిచేస్తే 100కు పైగా సీట్లు గెలుస్తామన్నారు. అలాగే, 22ఏ భూముల గురించి ఎవరూ మాట్లాడొద్దని. ఇది మన హయాంలోనే వచి్చంది కాదని, ఈ సమస్య బీఆర్ఎస్ హయాంలో కూడా ఉందని చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వివాదాలొద్దు... ఎమ్మెల్యేలందరూ వివాదాల జోలికి వెళ్లకుండా నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను గ్రీన్ చానల్ ద్వారా విడుదల చేస్తామని, వెంటనే ఆ పనుల మీద దృష్టి పెట్టాలని సూచించారు. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, కార్యక్రమ నిర్వహణకు సంబంధించి విప్లు సభ్యులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, విప్లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, వీర్లపల్లి శంకర్, ప్రేమ్ సాగర్ రావు, నవీన్ యాదవ్, మట్టా రాగమయి, మందుల సామేల్, వెడ్మ బొజ్జు, కోరం కనకయ్య, తోట లక్ష్మీకాంతరావు, రాందాస్ నాయక్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, బత్తుల లక్ష్మారెడ్డి, మనోహర్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కె.ఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, మురళీ నాయక్, యశస్విని రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు పాల్గొన్నారు.ఏ ఒక్కరి కోసమో కాదు: భట్టి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ పదేళ్ల పాటు అధికారం లేకపోతే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామో అందరికీ తెలుసునని డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యానించారు. అధికారం వచి్చన తర్వాత కష్టపడుతున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఒకరిద్దరి ప్రయోజనాల కోసం పారీ్టని, ప్రభుత్వాన్ని ఫణంగా పెట్టుకోలేమని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేలా అందరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.క్రమశిక్షణ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేకొండా సుస్మిత వ్యవహారంపై సీఎం స్పందనసాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ తనపై చేసిన ఆరోపణలు, విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా స్పందించడానికి నిరాకరించారు. ఈ వివాదంపై విలేకరుల సమావేశంలో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ అంశం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, కమిటీ తీసుకునే నిర్ణయాన్ని పార్టీ, తాము, అందరూ కట్టుబడి ఉండాల్సి ఉంటుందన్నారు. ఊహాజనిత అంశాలను ప్రస్తావించవద్దని మీడియాను కోరారు. -
అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరికి రిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీపై అక్రమ కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్లోని ఈడీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఆదివారం హైదరాబాద్లోని కొండాపూర్లో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. -
అధిష్టానం కోర్టులోకి!
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోర్టులోకి చేరింది. ఈ విషయంలో ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయంపైనే ఆమె భవితవ్యం ఆధారపడి ఉంటుందని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు తగినట్టుగానే సోమవారం రెండు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్రెడ్డి అటు విలేకరుల సమావేశంలోనూ ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీలోనూ సురేఖ అంశంపై స్పందించారు. అంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందని విలేకరుల సమావేశంలో చెప్పిన ఆయన.. ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని సూచించారు. ‘పాజిటివ్ వద్దు.. నెగెటివ్ వద్దు.. సురేఖ ఎపిసోడ్ గురించి మాట్లాడొద్దు.. ఫుల్స్టాప్ పెట్టండి... విషయం హైకమాండ్ దగ్గరకు వెళ్లింది కదా. వారు నిర్ణయం తీసుకోవాలి.’అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మరోవైపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, షోకాజ్ నోటీసులకు సురేఖ సమాధానంపై ప్రాథమిక నివేదికను పార్టీకి అందజేసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్లకు కమిటీ చైర్మన్ మల్లురవి సోమవారం ప్రాథమిక నివేదికను అందజేశారు. సుస్మిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్టను వ్యక్తిగతంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. కాగా, ఈ నివేదిక ఆధారంగా సుస్మిత, సురేఖల అంశంపై పీసీసీ నుంచి కూడా ఏఐసీసీకి ఓ నివేదిక వెళుతుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత రాష్ట్ర పార్టీ పెద్దలకు హస్తిన నుంచి పిలుపు వస్తుందని, అక్కడ జరిగే చర్చలో సీఎం, పీసీసీ చీఫ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఆ వర్గాల్లో జరుగుతోంది. నాడు అడ్డుకున్నదెవరు? ఈ ఎపిసోడ్లో మరో ఆసక్తికర అంశం వెలుగులోనికి వచ్చింది. గతంలో కూడా సురేఖ కుమార్తె సుస్మిత తననుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే సీఎం రేవంత్ చాలా సీరియస్గా తీసుకున్నారని, ఈ అంశంపై అధిష్టానం దగ్గర చర్చ జరిగినప్పుడు కొండా కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అడ్డుకున్నారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. అప్పుడు చర్యలు తీసుకోకపోవడంతోనే మరోమారు సుస్మిత సీఎం మీద మాట్లాడగలిగారని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. ఈసారి తాను కూడా కాపాడలేనని ఇటీవల మహేశ్గౌడ్ నిజామాబాద్లో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనమని వారంటుండడం గమనార్హం. కాగా, కొండా సురేఖ ఎపిసోడ్ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిల మధ్య కూడా చర్చకు వచ్చింది. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో తెలంగాణ రైజింగ్–2027 సమీక్షకు ముందు తాజా రాజకీయ వివాదం గురించి ఇద్దరూ మాట్లాడుకున్నట్టు సమాచారం. సురేఖ విఫలమయ్యారు: క్రమశిక్షణ కమిటీ విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రి కొండా సురేఖపై చర్యలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. సురేఖ కుమార్తె సుస్మిత పదేపదే సీఎంను కించపరిచేలా, పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతుంటే ఆమెను నియంత్రించడంలో సురేఖ విఫలమయ్యారని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. తాము సుస్మిత మాట్లాడిన మాటలు, ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలను క్షుణ్ణంగా పరిశీలించామని, సురేఖ సమాధానాలను కూడా పరిశీలించామని, అన్నింటినీ పరిశీలించిన మీదట క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సురేఖ అర్హురాలని, ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఏఐసీసీ నిర్ణయమని టీపీసీసీ ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. -
చెక్కులు ఎమ్మెల్యేలే ఇవ్వాలా?
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీలో రాజకీయ నాయకుల జోక్యం అవసరమా అని హైకోర్టు ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని చట్టంలోగానీ, రాజ్యాంగంలోగానీ ఉందా అని అడిగింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తాత్కాలిక స్టేను సవాల్ చేస్తూ శాసనసభ్యులు దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ల(ఐఏ)పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. ఆ నగదు ప్రజాధనం నుంచి వస్తుంది కదా.. దానికి, ప్రజాప్రతినిధులకు ఏం సంబంధమని, వాటిని పంపిణీ చేయడానికి అధికారులు సరిపోరా అని నిలదీసింది. ప్రాజెక్టులు, రహదారులు, ఇతర ప్రజావసరాలకు భూములిచ్చిన దేశ నిర్మాతలైన రైతులకు పరిహారం చెల్లింపు మాటేంటని ప్రశ్నలు సంధించింది. రాజధానిలో రహదారులు, సిగ్నళ్ల వద్ద చిన్నారులు, మహిళలు యాచిస్తున్నారని, భావి భారత పౌరుల సంక్షేమం పట్టదా, వీరు సంక్షేమం పరిధిలోకి రారా అని వ్యాఖ్యానించింది. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఖర్చు చేసే ప్రతీ పైసాకు చట్టబద్ధత అవసరమని స్పష్టం చేసింది. అనంతరం.. పూర్తి వివరాలు అందజేసేందుకు రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో అనుమతించిన ధర్మాసనం, తదుపరి విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేసింది. శాసనసభ ఆమోదం లేకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో న్యాయస్థానం.. పథకాల చెల్లింపుల జీవోలపై స్టే ఇచ్చిన విషయం విదితమే. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రజాధనం పంపిణీకి ఎమ్మెల్యేలు ఎందుకు? సంబంధిత జీవో ప్రకారం.. లబ్ధిదారుల జాబితాను నియోజకవర్గ ఎమ్మెల్యే కౌంటర్ సైన్ చేయాలని ఇంప్లీడ్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది వివరించారు. జీవోలను రద్దు చేయలేదని, సస్పెండ్ చేయలేదని, ఎమ్మెల్యేలను కేసులో ఇంప్లీడ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ వంటి ప్రక్రియలను అధికారులు నిర్వహిస్తున్నప్పుడు చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేల పాత్ర ఎందుకని నిలదీశారు. ప్రజాధనం పంపిణీలో రాజకీయ జోక్యానికి తావు ఉండకూడదని.. ఎమ్మెల్యేలు వెళ్లి చెక్కులు ఇవ్వడం వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటో చెప్పాలన్నారు. సంక్షేమ పథకాలను వ్యతిరేకించడం లేదని, అవసరమైన వారికి సంక్షేమ ప్రయోజనాలు అందాల్సిందేనని పేర్కొన్నారు. అమలు విధానమే చట్టబద్ధంగా ఉండాలని చెబుతున్నామన్నారు. పరిహారం కోసం 8 నెలలుగా... భూసేకరణ బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 8 నెలలుగా అందరూ ఎదురు చూస్తున్నారని.. అభివృద్ధి కోసం సొంత ఇళ్లు, భూమి కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపునకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అలాంటి రైతులు, ఇతరులతోనే దేశ నిర్మాణం సాగుతోందని చెప్పారు. భూసేకరణ బాధితుల పరిహారం చెల్లింపులు ఏ దశలో ఉన్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీ ఇమ్రాన్ఖాన్ను ఆదేశించారు. ఎవరైనా సామాజిక సంక్షేమం కింద ప్రయోజనం కోరితే, అది అవసరానికి అనుగుణంగా ఉండాలని.. సంక్షేమం ఎప్పుడూ అవసరంపై ఆధారపడాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నిరాశ్రయులు, నిరుపేదలు, బాలలు, మహిళలు వంటి అనేక వర్గాలు సంక్షేమం కోసం ఎదురుచూస్తున్నాయన్నారు. రాష్ట్రంలో భిక్షాటన చేస్తున్న పిల్లలున్నారు.. ఆధార్ కార్డు కూడా లేని చిన్నారులున్నారు.. నిరాశ్రయ మహిళలున్నారు. వారందరూ సామాజిక సంక్షేమ పరిధిలోకి వస్తారని వ్యాఖ్యానించారు. వికలాంగ యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించే జీవో 4ను తాత్కాలిక స్టే నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయండి.. న్యాయవాది విజయ్గోపాల్ వాదనలు వినిపిస్తూ.. తెలుగు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘తెలుగు స్క్రైబ్’ను మొత్తంగా నిలిపివేయాలని కోరారు. ఆ ఖాతా నిర్వాహకుడి వివరాలు తెలియడం లేదని, అతనిపై 50కి పైగా క్రిమినల్ కేసులున్నాయని, అతడి చిరునామా తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రవాద నిరోధక చట్టాల నిబంధనల కింద కూడా ప్రయత్నాలు చేశారన్నారు. దీనిపై మెటా తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్ పేర్కొన్న యూఆర్ఎల్పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా, పథకాల అమలుపై సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని, పేద యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై త్వరలో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
తెలంగాణకు అవమానం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం.. వ్యక్తిగా రేవంత్రెడ్డికి అనుమతి నిరాకరించడం కాదు.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం, తిరస్కరణ. దీనికి కారణం గుజరాత్ ఆధిపత్యం. దేశ ప్రధాని మోదీ ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధాని అన్న విషయ విజ్ఞానంతో వ్యవహరించడం లేదు. ఇది తెలంగాణకు జరిగిన అవమానం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రేవంత్ సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘సీఎం హోదాలో అభివృద్ధి కోసం చేసే పర్యటనను అడ్డుకుని తెలంగాణ పట్ల కేంద్రం స్పష్టమైన వివక్ష ప్రదర్శించింది. ఈ అంశాన్ని మా నాయకులు రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ఇతర నాయకులంతా పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇది ఆషామాషిగా తీసుకునే విషయం కాదు’ అని సీఎం మండిపడ్డారు. ‘తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంతో వెళ్తున్నామని గతంలో నేను, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్లేటప్పుడు పెట్టిన విధానంలోనే దరఖాస్తు పెట్టాం. రాజకీయ కోణంలో అనుమతిని తిరస్కరిస్తున్నట్టు విదేశాంగ శాఖ జవాబు ఇచ్చింది. రాజకీయ కారణం ఏమిటని మోదీని ప్రశ్నిస్తున్నా. మీరు (మోదీ) ఎన్నో దేశాల పర్యటనకు వెళ్లారు. మీ సొంత రాష్ట్రం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు 8 రోజుల పాటు అమెరికా, కెనడాలో పర్యటించి వైబ్రెంట్ గుజరాత్ అనే పాలసీని ప్రమోట్ చేయడానికి, రోడ్ షోలు చేసి, పెట్టుబడులు పెట్టాలని కోరడానికి అనుమతిచ్చారు. అదే తెలంగాణ రైజింగ్–2047 పాలసీలో భాగంగా విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం సీఎంగా అమెరికా పర్యటనకు వెళ్తానంటే నిరాకరిస్తారు. ఇంగ్లండ్, అమెరికా రెండింటికీ ఒకే విధానం, ఒకే అంశాలతో విదేశీ పర్యటన తలపెట్టాను. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదనకుంటే ఇంగ్లండ్కు అనుమతి ఎందుకు ఇచ్చారు? అమెరికా పర్యటనకు ఎందుకు తిరస్కరించారు?’ అని రేవంత్ కేంద్రంపై మండిపడ్డారు. మోదీకి బానిసలుగా ఉంటారా? ‘అమెరికా పర్యటనకు అనుమతి తిరస్కరిస్తూ కేంద్రం రాజకీయ కారణాలను అపాదించడాన్ని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. గుజరాత్ను సమర్థించి మోదీ, గుజరాత్ చేతుల్లో కట్టుబానిసలుగా బతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటదలుచుకున్నారా? అని బీజేపీ తెలంగాణ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నా. తెలంగాణకు పెట్టుబడులు వస్తే గుజరాత్కు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే కుట్రతో నా పర్యటనను అడ్డుకున్నారు. దీనిపై నేను స్పందించి విదేశీ వేదికపై నుంచి మాట్లాడి ఉంటే.. చూసినవా, దేశ ద్రోహి, విదేశాల్లో భారత దేశ గౌరవానికి భంగం కలిగించిండు అని విమర్శిస్తారనే ఇక్కడికి వచ్చాక ఖండిస్తున్నం. కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’ అని సీఎం అన్నారు. లక్ష్యాన్ని ఆపలేరు.. ‘ఇంగ్లండ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లే వారు ఒక బృందాన్ని హైదరాబాద్కు పంపించి ఇక్కడ తమ క్యాంపస్ ప్రారంభించడానికి పరిస్థితులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్తే ఎంసీఆర్హెచ్ఆర్డీలో స్వల్పకాలిక కోర్సులు, భారత్ ఫ్యూచర్ సిటీలో ఆక్స్ఫర్డ్ క్యాంపస్ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబద్లో తమ క్యాంపస్ ఏర్పాటుకు అంగీకరించారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో మాట్లాడితే షార్ట్ టర్మ్ కోర్సులను ఎంసీఆర్హెచ్ఆర్డీలో ప్రారంభిస్తామన్నారు. అమెరికాలో సైతం బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్, ఎంఐటీ క్యాంపస్, నార్త్ ఈస్టర్న్ క్యాంపస్, వర్జీనియా టెక్ యూనివర్సిటీ వెళ్లాల్సి ఉండే. సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఐవీ లీగ్లోని టాప్ –10 వర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలన్నది నా లక్ష్యం. మీరు నా పర్యటనను అడ్డుకున్నారు.. కానీ నా లక్ష్యాన్ని ఆపలేరు. అందుకే అధికారులను అమెరికాకు పంపించా. ఆక్స్ఫర్డ్తో అధికారులు ఒప్పందం చేసుకోబోతున్నరు. ఇతర వర్సిటీల ముందు మన ప్రతిపాదనలు ముందుపెట్టబోతున్నారు’ అని సీఎం పేర్కొన్నారు. ప్రధానికి తెలియకుండా జరగలేదు... ‘మేం దరఖాస్తులో వివరాలు ఇవ్వలేదని బీజేపీ నేతలు తప్పుదోవ పట్టించారు. ఏ అధికారిక పర్యటనను అయినా భారత రాయబార కార్యాలయ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారు. విమానాశ్రయంలో మేము దిగే నాటి నుంచి మళ్లీ తిరిగి వెళ్లే వరకు భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఇది చాటుమాటుగా పర్యటన కాదు. గతంలో విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు ఈ విషయాలన్నీ తెలుసు. తెలంగాణ సీఎం పర్యటనకు అనుమతిని సమీక్షించకుండా, ప్రధాని దృష్టిలో లేకుండా తిరస్కరించడం జరుగుతుందా? తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారిని శిక్షిస్తామని ప్రపంచానికి సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్, మెట్రో రైలు ఇతర విషయాల్లో తెలంగాణకు సహకరించడం లేదు’ అని రేవంత్ మండిపడ్డారు. అనుమతి నిరాకరణపై విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బీజేపీలో చేరాలని ఎద్దేవాచేశారు. మోదీ అన్ని దేశాలు తిరగొచ్చు.. ‘న్యూయార్క్ మేయర్ మమ్దానీ అసాంఘిక శక్తి కాదు. మేయర్, అమెరికా ఉపాధ్యక్షుడి అపాయింట్మెంట్ అధికారికంగా ఖరారు కాకుంటే ఏ కార్యక్రమం జరగదు. మమ్దానీ ఏమైనా మన గల్లీలో ఉన్న కౌన్సిలరా? పోతాపోతా ఇంట్లోకి వెళ్లికూర్చుని మాట్లాడడానికి? కేటీఆర్ అమెరికా, హరీశ్ లండన్ వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. నాకు అమెరికా నుంచి ఆహ్వానం ఉంది. హార్వర్డ్లో విద్యార్థిగా చదివా. గతంలో మోదీపై తీవ్రమైన ఆరోపణలున్నాయని అమెరికాకు రానీయలేదు. మోదీ ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయాణం చేయొచ్చు.. ఆయన చంద్రమండలం కూడా ప్రయాణం చేసేటట్టు ఉండు’ అని సీఎం పేర్కొన్నారు. కిషన్రెడ్డి జన్మలో సీఎం కాగలడా? ‘కిషన్రెడ్డి ఎప్పుడు సీఎం అయ్యారు? ఆయన జన్మలో సీఎం కాగలరా? దేశంలో పీఎం, సీఎం, డీఎంలకు ఇతరులతో వేరే హోదా కలిగి ఉంటారు. కిషన్రెడ్డి ఏ హోదాలో అనుమతి కోరితే ఆయనకు అనుమతి నిరాకరించారో నాకు తెలియదు. సీఎంగా నేను విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం వెళ్తే మార్గమధ్యంలో తిరిగి రమ్మని చెప్పడంలో మతలబు ఏమిటి? ప్రొఫెసర్లు మాయా టుడోర్, దేవ్జీ యూకేలో ఉన్నారు. అనుమతి ఇచ్చారుగా? ఇందిరా హయాంలో 1975–76 మధ్య ఎమర్జెన్సీ కాలంలో, ఆ తర్వాత 2014లో మోదీ పీఎం అయ్యాక దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని మాయా ఓ జర్నల్కు వ్యాసం రాశారు. 56 ఇంచీల ఛాతీ అని చెప్పుకునే మీరు ఇతర దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంటే ఈ అభిప్రాయాన్ని ఎందుకు మార్చలేరు? మోదీ ప్రధాని అయ్యాక పాకిస్తాన్కు ఎవరిని అడిగి వెళ్లారు? మీరు పాక్ వెళ్లి వారి ప్రధానిని అలింగనం చేసుకుని బిర్యానీ తినవచ్చు. అధికార పర్యటనకు సీఎం వెళ్లలేడు? అందుకే ఆమె ప్రజాస్వామ్యం క్షీణిస్తుందని రాశారు. నేనూ ఏకీభవిస్తున్నా. ఇది నియంతృత్వ నిర్ణయం’ అని సీఎం రేవంత్ అన్నారు. -
‘సాంకేతిక ఆధారిత ప్రొఫెషనల్ సేవలకు అంతర్జాతీయ హబ్గా హైదరాబాద్’
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ న్యాయ నైపుణ్యాన్ని కృత్రిమ మేధ సాంకేతికతతో అనుసంధానం చేస్తూ, వివిధ దేశాలకు సంబంధించిన న్యాయ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘కవేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్’ హైదరాబాద్ కార్యాలయాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..అంతర్జాతీయ న్యాయ సేవలకు సంబంధించిన వినూత్న సంస్థ హైదరాబాద్లో కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వృత్తిపరమైన సేవలతో సహా అనేక రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం వేగంగా విస్తరిస్తోందని, ఇది అపారమైన అవకాశాలను సృష్టిస్తూనే కొత్త సవాళ్లను కూడా ముందుకు తెస్తోందన్నారు.అందువల్ల ఏఐ వినియోగంలో బాధ్యత, నైతిక విలువలు, పారదర్శకత అత్యంత కీలకమని పేర్కొన్నారు. బలమైన ఐటీ, సాంకేతిక వ్యవస్థ, అత్యున్నత నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ దేశాలతో మెరుగైన అనుసంధానం హైదరాబాద్కు ప్రత్యేక బలాలని మంత్రి చెప్పారు. ఈ అనుకూలతలతో ఏఐ ఆధారిత ప్రొఫెషనల్, న్యాయ సేవలకు హైదరాబాద్ ఒక ప్రధాన అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. తెలంగాణను అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానించే ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు తీసుకొస్తాయని అన్నారు.న్యూయార్క్లోని కవేటి లా ఫర్మ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ అటార్నీ డాక్టర్ శ్రీనివాస్ రావు కవేటి, కవేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్ను హైదరాబాద్కు తీసుకురావడాన్ని మంత్రి అభినందించారు. తెలంగాణకు చెందిన డాక్టర్ కవేటికి భారత్తో పాటు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల్లో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ‘ఇంటర్నేషనల్ లీగల్ యాక్సెస్ హబ్’గా తీర్చిదిద్దాలని సంస్థ ప్రతిపాదించింది. భారత్లోని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రవాస భారతీయులు (NRIs), పెట్టుబడిదారులు వివిధ దేశాల్లో న్యాయ సేవలు అందిస్తున్న న్యాయవాదులు, న్యాయ నిపుణులతో అనుసంధానం కావడానికి ఈ కేంద్రం వేదికగా పనిచేయనుంది. అంతర్జాతీయ న్యాయ నిపుణులు హైదరాబాద్కు వచ్చిన సందర్భాల్లో ప్రత్యక్ష సంప్రదింపులు, న్యాయ వ్యూహాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు.సంస్థ సేవలు వివిధ దేశాల్లోని పలు న్యాయ విభాగాలను కవర్ చేయనున్నాయి. అమెరికాలో ఇమ్మిగ్రేషన్, కుటుంబ చట్టాలు, సివిల్ లిటిగేషన్, అంతర్జాతీయ విడాకులు, కార్పొరేట్, క్రిమినల్ లా అంశాలు; యునైటెడ్ కింగ్డమ్లో ఇమ్మిగ్రేషన్, కుటుంబ చట్టాలు, సివిల్ లిటిగేషన్; యూఏఈలో కార్మిక పరిహారం, ఉద్యోగ సంబంధిత సమస్యలు, ఒప్పంద వివాదాలకు సంబంధించిన సేవలను అందించనున్నట్లు సంస్థ తెలిపింది. భారత్లో కంపెనీ, ట్రేడ్మార్క్ చట్టాలు, సివిల్, క్రిమినల్, కార్మిక చట్టాలు, రిట్ పిటిషన్లు, రుణాల రికవరీ, వినియోగదారుల చట్టాలు, స్పెషల్ లీవ్ పిటిషన్లు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు సంబంధించిన సేవలను అందించనుంది.హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాల్లో న్యాయ సేవల్లో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వినియోగించడం ప్రధాన అంశంగా ఉండనుంది. ముఖ్యంగా సంక్లిష్టమైన అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల్లో లీగల్ రీసెర్చ్, సమాచార సేకరణ, డాక్యుమెంట్ల విశ్లేషణ, డిస్కవరీ, కేసులకు సంబంధించిన ప్రాథమిక మ్యాపింగ్ తదితర అంశాల్లో ఏఐ సహకారాన్ని వినియోగించాలని ప్రతిపాదించారు.అయితే ఏఐ న్యాయవాదులకు ప్రత్యామ్నాయం కాదని, వారికి సహకరించే సాధనంగా మాత్రమే ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. న్యాయ సలహాలు, ప్రాతినిధ్యం వంటి సేవలను ఆయా దేశాల్లో అమలులో ఉన్న చట్టాలు, వృత్తిపరమైన నైతిక ప్రమాణాలకు అనుగుణంగా అర్హత కలిగిన న్యాయ నిపుణులు మాత్రమే అందిస్తారని పేర్కొంది.సాంకేతిక పరిజ్ఞానం అంతిమంగా ప్రజలకు ఎదురయ్యే అడ్డంకులను తగ్గించడానికి, సేవల్లో సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రత్యేక నైపుణ్యంతో కూడిన సేవలను మరింత విస్తృత వర్గాలకు చేరువ చేయడానికి ఉపయోగపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచస్థాయి ప్రొఫెషనల్ నెట్వర్క్లతో అనుసంధానించే ఇటువంటి సంస్థలు తెలంగాణను ఆవిష్కరణలు, విజ్ఞాన ఆధారిత సేవలకు అంతర్జాతీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఖైరతాబాద్ జోన్లోనూ గచ్చిబౌలి సంఘటనకు ఆస్కారం
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పరిధి అంజయ్యనగర్లో 50 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో అధికారులు మాదాపూర్ టౌన్ప్లానింగ్ అధికారి సంతోష్కుమార్ను సస్పెండ్ చేశారు. ఏడంతస్తుల అక్రమ నిర్మాణం జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లుపోయారు. అయితే గచ్చిబౌలి ఘటనలు జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ పరిధి కిందికి వచ్చే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట, యూసుఫ్గూడ, బోరబండ సర్కిళ్ల పరిధిలో కూడా కోకొల్లలుగా ఉన్నాయి. గచ్చిబౌలి ఘటనలు ఖైరతాబాద్ జోన్ పరిధిలో జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.జూబ్లీహిల్స్ సర్కిల్ వెంకటేశ్వరనగర్ కాలనీ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం:14 వెంకటేశ్వరనగర్లో స్టడీ సర్కిల్ను ఆనుకుని గల్లీలో అక్రమ నిర్మాణం జరుగుతుందని, ప్రమాదకరంగా ఉందంటూ 8 నెలలుగా స్థానికులు జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా బిల్డర్తో కుమ్మక్కైన ఇక్కడి టౌన్ప్లానింగ్ సిబ్బంది అటువైపు తొంగిచూడడం లేదు. ⇒ శ్రీనగర్కాలనీలోని కమలాపురికాలనీ మార్బుల్ షాపు వెనుక సత్యసాయి నిగమాగమం పక్కన మూడు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇక్కడి బిల్డర్లతో కుమ్మక్కైన టౌన్ప్లానింగ్ సిబ్బంది కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు.⇒ జూబ్లీహిల్స్ రోడ్ నం: 72లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ ఎదురుగా జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టారంటూ స్థానికులు ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తోన్నా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.⇒ వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ డివిజన్ల పరిధిలో ఏడాది కాలంగా ఎనిమిది అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. ఈ నిర్మాణాలన్నీ తిరిగి తెరుచుకోవడమే కాకుండా వ్యాపార కార్యకలాపాలు కూడా సాగిస్తున్నాయి. ఐదు సర్కిళ్లకు ఒక్కరే.. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ పరిధి కిందికి వచ్చే యూసుఫ్గూడ, అమీర్పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ ఐదు సర్కిళ్లకు కలిపి రమేష్ అనే ఒకేఒక్క టౌన్ప్లానింగ్ ఏసీపీ ఉన్నాడు. యూసుఫ్గూడ సర్కిల్ టౌన్ప్లానింగ్ ఏసీపీగా ఉన్న రమేశ్కు మిగతా నాలుగు సర్కిళ్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో సర్కిల్కు ఒక సెక్షన్ అధికారిని, ఇద్దరు మున్షీలను నియమించారు. వీరంతా వసూళ్లకు తప్పితే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు.జూబ్లీహిల్స్ రోడ్ నం:36 ప్రధాన రోడ్డులో ఇటీవల ‘మంగళం’ పేరుతో నడిచిన భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో ఒక అంతస్తు మొత్తం అక్రమ నిర్మాణమే. హైడ్రా అధికారులు హడావుడి చేశారు. అయితే ఇంతవరకు ఈ భవనంలో ఆక్రమణలు కూల్చివేయకపోవడంతో బిల్డర్ మరమ్మతులు చేసి కిరాయిలకు ఇచ్చేశాడు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: సీ బ్లాక్ భద్రమేనా?జూబ్లీహిల్స్ సర్కిల్లోనే అధికం.. అక్రమ నిర్మాణాలు జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లుగా ఇటీవల ప్రజావాణిలోనూ, జీహెచ్ఎంసీ అధికారులకు అందిన ఫిర్యాదులు తెలియజేస్తున్నాయి. ఏడాది కాలంగా ఈ సర్కిల్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఫిలింనగర్ డివిజన్ల పరిధిలో 100కు పైగా అక్రమ నిర్మాణాలు ఫిర్యాదులు అందాయి. కొన్ని అక్రమ నిర్మాణాలకు తూతూమంత్రంగా నోటీసులు జారీ చేశారు. ⇒ ఖైరతాబాద్ సర్కిల్ పరిధి కిందికి వచ్చే సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్ల పరిధిలోనూ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.⇒ యూసుఫ్గూడ సర్కిల్ పరిధిలో కూడా అక్రమ నిర్మాణాలకు అంతులేకుండాపోతుంది. ⇒ అమీర్పేట సర్కిల్ సైతం అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది.ఇదీ చదవండి: అంజయ్యనగర్లో రంగంలోకి దిగిన హైడ్రాప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి.. ఖైరతాబాద్ జోనల్ పరిధిలోని పలు సర్కిళ్లలో అక్రమ నిర్మాణాల్లో ప్రమాదాలు, ఇతర ఘటనలు చోటుచేసుకున్నప్పుడే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత అటువైపు తొంగిచూడడం లేదు. జూబ్లీహిల్స్ కాలనీలో 70కి పైగా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతుండగా సంబంధిత అధికారులను భవన నిర్మాణ యజమానులు మేనేజ్ చేస్తున్నారు. దీంతో నిర్మాణాలు ఎక్కడా ఆగడం లేదు. ఉన్నతాధికారులు లేరు.. విజిలెన్స్ లేదు ఖైరతాబాద్ జోనల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్న జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. విజిలెన్స్ నిఘా అసలే లేదు. టౌన్ప్లానింగ్ అధికారులు, సిబ్బంది నిఘా కరువైంది. గతంలో ఏసీబీ దాడులు చేసి కొందరు అధికారులను అరెస్టు చేసినా పరిస్థితిలో మార్పు ఉండడం లేదు. -
సెప్టెంబరు 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసనమండలిని ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై తొలి రోజు సమావేశం తర్వాత జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీలో నిర్ణయిస్తారు. ఈ వర్షాకాల సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.ఇదీ చదవండి: ఒక్క పొరపాటు.. అపార్ట్మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు.. -
మంత్రి కొండా సురేఖకు ఊహించని షాక్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖకు ఊహించని షాక్ తగిలింది. మంత్రికి ముందస్తు సమాచారం లేకుండా, ఆమెకు తెలియకుండానే అటవీశాఖలో పలువురు అధికారుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (PCCF) వినయ్ కుమార్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వుల ప్రకారం.. ముగ్గురు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల డిప్యూటేషన్లను రద్దు చేశారు. డిప్యూటేషన్ రద్దయిన అధికారులు వెంటనే హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని పీసీసీఎఫ్ ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా నేరుగా మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నందుకే సదరు అధికారులపై ఈ విధమైన చర్యలు తీసుకున్నట్లు అటవీశాఖ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. తమ డిప్యూటేషన్ల రద్దు వ్యవహారంపై ఎఫ్ఆర్ఓ సంఘం ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై వారు వెంటనే మంత్రి కొండా సురేఖను కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రికి కనీస సమాచారం ఇవ్వకుండానే పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారుల డిప్యూటేషన్లను కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఇప్పుడు అటవీశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి ఆదేశాలను అధిగమించి ఉన్నతాధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై రాజకీయ, అటవీశాఖ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మంత్రి సురేఖకు టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు ఆమెను మంత్రివర్గం నుండి తొలగించాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రాజకీయ వివాదం ముదిరి, ఆమె మంత్రి పదవిపైనే ఊహాగానాలు నడుస్తున్న తరుణంలో.. అటవీశాఖలో మంత్రికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పీసీసీఎఫ్ వినయ్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి ప్రాధాన్యతను తగ్గించడానికే ఉన్నతాధికారులు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి -
ప్రభుత్వ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రభుత్వ పథకాలపై తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్ పథకాలపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. వాటికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యేలు ఇవ్వడమేంటని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన చెక్కులను అధికారులు ఇవ్వకుండా ఎమ్మెల్యేలు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ చెక్కుల పంపిణీ అంశంలో సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో దివ్యాంగులకు ఇచ్చే ఆర్థికసాయం కొనసాగించేందుకు అనుమతించిన తెలంగాణ హైకోర్టు.. జీవో నంబర్ 4పై ఉన్న స్టేను ఎత్తివేసింది.కాగా, ఈ నెల ఆరంభంలో ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఆగస్టు 7వ తేదీన ఒక కేసు విచారణ సందర్భంగా.. కోటీశ్వరులు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని వ్యాఖ్యానించింది. రైతుల కోసం అమలు చేసిన రైతుబంధు వంటి పథకాలలోనూ సంపన్నులు లబ్ధి పొందిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. నిజంగా అవసరం ఉన్నవారికి ప్రభుత్వ సాయం అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇక ఆగస్టు 20వ తేదీన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్ పథకాలపై హైకోర్టు విచారణ సందర్భంగా నిధుల విడుదల అంశానికి సంబంధించి స్టేను ఎత్తివేయడానికి నిరాకరించింది. నిధుల విడుదలపై ఉన్న స్టేను తొలగించాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ పథకాలకు సంబంధించి చెక్కులను ఎమ్మెల్యేలు ఇవ్వడాన్ని ప్రధానంగా తప్పుబట్టిన న్యాయస్థానం.. అది రాజకీయ జోక్యమే అవుతుందని హెచ్చరించింది.ఇవి కూడా చదవండి: ఉచిత పథకాలు కోటీశ్వరులకూ అవసరమా?‘నా అమెరికా పర్యటన రద్దు.. తెలంగాణ ప్రజలకే అవమానం’ -
కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ స్పందన ఇదే!
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ‘కొండా సురేఖ అంశం క్రమశిక్షణా కమిటీ పరిధిలో ఉంది. పార్టీ అంతర్గత అంశాలపై మీడియా ముఖంగా మాట్లాడను.తీసుకునే నిర్ణయాలకు మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఆయన సోమవారం తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా నా విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరైనది కాదు. ఈ వైఖరిని అందరూ తప్పుబడుతున్నారు. ‘వికసిత్ భారత్’ ప్రణాళికలో భాగంగానే మేము ‘తెలంగాణ రైజింగ్ 2047’ను ప్రకటించాం. ముఖ్యంగా విద్యా, క్రీడా రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటనను తలపెట్టాం. లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం, అమెరికా వెళ్లేందుకు మాత్రం నిరాకరించింది.అమెరికా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించలేదనే కారణంతోనే కేంద్రం అనుమతి నిరాకరించిందంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. కొందరు బీజేపీ నేతలు కావాలనే కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారు. నేను లండన్, అమెరికా పర్యటనల పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే అందించా.కేంద్రం కేవలం రాజకీయ కారణాలతోనే నా అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించింది. నా పర్యటనను అడ్డుకోవడం అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానించడమే. కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలి. ఇది నాకు జరిగిన అవమానం కాదు.. తెలంగాణ జరిగిన అవమానం. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోంది. ఈ వివక్షను సహించేది లేదు. పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం. తెలంగాణ బీజేపీ ఎంపీలకు అభివృద్ధి అవసరం లేదా?. కేంద్రం తీరు సమాఖ్య స్పూర్తికి విరుద్ధం. ఒక రాష్ట్ర సీఎం పర్యటనను అడ్డుకోవడం ఆషామాషీ కాదు. నా పర్యటనను అడ్డుకోవచ్చు. కానీ ఆలోచనను కాదు. సీఎం పర్యటనను అడ్డుకోవడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే. విదేశాల్లో ఉండి మాట్లాడితే దేశ ద్రోహి అనేవారు. అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా’ అని వ్యాఖ్యానించారు.(👉ఇదీ చదవండి: కొండా సురేఖ అంశం.. ఏం చేస్తే ఏమవునో ) -
తెలంగాణ మందు బాబులకు గుడ్న్యూస్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలో కొత్తగా 121 రకాల లిక్కర్ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో అంతర్జాతీయంగా పేరున్న బ్రాండ్లను కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSBCL).. 18 ప్రముఖ సరఫరా సంస్థలకు చెందిన 121 కొత్త లిక్కర్ బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టింది. ఆయా బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే ముందు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.సెప్టెంబర్ 1లోగా అభ్యంతరాలు..కొత్త లిక్కర్ బ్రాండ్ల ప్రవేశంపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటే సెప్టెంబర్ 1వ తేదీలోపు తెలియజేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. అందిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తదుపరి అనుమతుల ప్రక్రియ కొనసాగనుంది. కొత్త బ్రాండ్లకు అనుమతులు లభిస్తే.. రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లలో వినియోగదారులకు మరిన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు 121 కొత్త రకాల లిక్కర్ రాష్ట్రంలోకి రానుండటంతో మద్యం ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.చదవండి: డ్రగ్స్ నిరోధక ఈగల్లో ఇంటి దొంగలు.. -
రేవంత్ సర్కార్పై రాంచందర్రావు తీవ్ర ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తీవ్రంగా ఆరోపించారు. విద్యార్థులు, కాలేజీల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం ఒత్తిడికి గురిచేస్తోందని ఆరోపించారు. ఫీజు బకాయిలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని చెప్పినా.. ఆ హామీ కూడా అమలు కాలేదని ఆయన అన్నారు. బకాయిల కోసం విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తుంటే వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.రాహుల్ గాంధీకి సవాల్ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా రాంచందర్రావు టార్గెట్ చేశారు. “రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణకు వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్పై మాట్లాడాలి” అంటూ సవాల్ విసిరారు. దేశంలో యువతను రెచ్చగొట్టి ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీకి ప్రయోజనాలు అందుతున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. విద్యార్థులకు మాత్రం ఫీజు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ను గద్దె దించాలిదేశ వ్యతిరేక శక్తులతో సీఎం రేవంత్రెడ్డి చేతులు కలుపుతున్నారని రాంచందర్రావు ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా తమ ప్రయోజనాల కోసం పరస్పరం పోటీ పడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల శక్తి ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: సెల్ఫీ కోసం వచ్చి రాహుల్కి ముద్దుపెట్టిన యువతి.. వేదికపై హైడ్రామా! -
సీ బ్లాక్ భద్రమేనా!?
హైదరాబాద్: అంజయ్యనగర్లో 50 గజాల విస్తీర్ణంలో చేపట్టిన భవనం పేకమేడలా కుప్పకూలి పక్కనున్న జయదర్శిని రెసిడెన్సీపై పడటంతో ఆ అపార్ట్మెంట్ నాణ్యతపై అనుమానాలు నెలకొన్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించి జయదర్శిని రెసిడెన్సీ నిర్మాణం చేపట్టారని చెబుతున్నప్పటికీ ఐదో అంతస్తుపై ఉన్న స్లాబ్ ధ్వంసం కావడంతో పార్కింగ్లోని రెండు పిల్లర్లకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. శిథిలాలను పూర్తిగా తొలగించిన అనంతరం సీఎంసీ నుంచి నిపుణులైన ఇంజినీర్లు పిల్లర్ల నాణ్యతను పరిశీలించనున్నారు. వారిచ్చే నివేదిక ఆధారంగానే తదుపరి రెసిడెంట్స్ నిర్ణయాన్ని తీసుకుంటారు. భవనం కూలి మీద పడటంతో ఐదు ఫ్లాట్లలో మాస్ట్ బెడ్ రూమ్లు, బాత్ రూమ్లు, కిచెన్లు, పార్కింగ్లోని పిల్లర్లు, ఐదో అంతస్తులోని స్లాబ్ దెబ్బతిన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా హైడ్రా, పోలీసు అధికారులు 10 సీ బ్లాక్లో 10 ఫ్లాట్లను, బి బ్లాక్లోని మరో 10 ఫ్లాట్లను ఆదివారం ఖాళీ చేయించారు. -
కొండా సురేఖ ఇష్యూ.. రేవంత్ కీలక భేటీ!
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటన రద్దు తర్వాత హైదరాబాద్కు తిరిగొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్న పరిణామాలపై దృష్టి సారించారు. సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం, పార్టీలో క్రమశిక్షణ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్రెడ్డి తన విదేశీ పర్యటనను కుదించుకుని లండన్ నుంచి తిరిగి వచ్చారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించగా.. కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడింది. దీనిపై తిరిగి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం రేవంత్ అన్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్(చిట్టక్క) సీఎం రేవంత్ రెడ్డికి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తట్టుకోలేకపోతున్నారు. కూతురి వ్యాఖ్యలను ఖండించకపోగా.. నాకేం సంబంధం అన్నట్లు సురేఖ మాట్లాడటాన్ని కూడా అంగీకరించడం లేదు. ఇప్పటికే ఈ విషయమై క్రమశిక్షణా కమిటీకి వాళ్లంతా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంతో తమ అభిప్రాయాలను పంచుచుకోనున్నారు. మరోవైపు.. కొండా సురేఖ ఎపిసోడ్తో పాటు వనపర్తిలో చిన్నారెడ్డి-ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆదిలాబాద్ నేతలు కంది శ్రీనివాస్రెడ్డి-అల్లూరి సంజీవరెడ్డి గొడవ, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇటు.. కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖ చిక్కుల్లో పడ్డారు. వివరణ కోరుతూ పీసీసీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె నిన్న బెంగళూరు వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. గంట పాటు వీళ్ల మధ్య భేటీ జరిగింది. మరోవైపు ఈ పరిణామాల మధ్య మంత్రి కొండా సురేఖ ఇవాళ సీఎంను కలుస్తారనే ప్రచారం సాగుతోంది. తన శాఖ సమీక్ష కోసం ఆమె సచివాలయానికి చేరుకునే అవకాశం ఉంది.దీంతో ఈ వరుస భేటీలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సాయంత్రం ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆయన స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఫ్యామిలీ వ్యవహారం.. ఏం చేస్తే ఏమవునో? -
కాంగ్రెస్ మహిళా నేతపై అనుచిత పోస్టులు చేసిన వ్యక్తి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: చెందిన కాంగ్రెస్ మహిళా నేతను ఉద్దేశించి ఆన్లైన్లో మార్ఫింగ్ వీడియోలతో అనుచిత పోస్టులు చేసిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాచిగూడకు చెందిన ఓ స్టాఫ్ట్వేర్ ఉద్యోగి (30) ఇన్స్ట్రాగామ్లో నకిలీ ఖాతా సృష్టించాడు. గతేడాది అక్టోబర్లో ‘పూరా లోకల్’ పేరుతో ఉన్న ఆ ఖాతా ద్వారా నగరానికి చెందిన ఓ మహిళా నాయకురాలి వీడియోను మార్ఫింగ్ చేసి పోస్టు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని అరెస్టు చేశారు. -
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కోసం గాలింపు
హైదరాబాద్: హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు మూడు బృందాలు ఏర్పాటు చేయగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. గత నెల 30న జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయానికి సుమంత్ సహచరులు రాము డబ్బు వ్యవహారంలో మాట్లాడేందుకు చెంగిచెర్ల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ని పిలిపించారు. అక్కడే ఉన్న సుమంత్ ఆయన అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము తదితరులు ఇనుపరాడు తో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సుమంత్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ఆయన డ్రైవర్ నవీన్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
డ్రగ్స్ నిరోధక ‘ఈగల్’లో ఇంటి దొంగలు.. 50 లక్షల విలువైన..
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన ఈగల్ శాఖలోనే ఇద్దరు కానిస్టేబుళ్లు డ్రగ్స్ దందాకు ప్రయత్నించిన వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్ పెడ్లర్లను పట్టుకునేందుకు ఉపయోగించాల్సిన నిఘా సమాచారాన్ని దుర్వినియోగం చేసి, ఏకంగా డ్రగ్స్ విక్రయానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారి వద్ద సుమారు రూ.50 లక్షల విలువైన డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం.వివరాల మేరకు.. తెలంగాణలో డ్రగ్స్ పెడ్లర్ను పట్టుకునేందుకు ఈగల్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ సమయంలోనే ఇద్దరు కానిస్టేబుల్స్ నరహరి, స్వామి వ్యవహారం బయటపడినట్లు సమాచారం. వారి వద్ద సుమారు రూ.50 లక్షల విలువైన కిలో ఎక్స్టసీ మాత్రలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మాత్రలను వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరికి విక్రయించేందుకు సిద్ధమయ్యారు? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ పెడ్లర్ల కదలికలు, వారి ఫోన్ నంబర్లు, ఇతర వివరాలపై ఈగల్ శాఖ సేకరించిన నిఘా సమాచారాన్ని కానిస్టేబుళ్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమాచారంతో డ్రగ్స్ పెడ్లర్లను సంప్రదించి, తమ వద్ద ఉన్న ఎక్స్టసీ మాత్రలను విక్రయించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.చదవండి: జైలుకు వెళ్లొచ్చిన సురేఖ.. విషాదంతంఅంటే డ్రగ్స్ ముఠాలను గుర్తించేందుకు పోలీసులకు అందుబాటులో ఉన్న కీలక నిఘా వ్యవస్థనే సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నరహరి, స్వామి గతంలో పలు యాంటీ డ్రగ్స్ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొన్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచినందుకు అవార్డులు కూడా పొందినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ నిర్మూలన కోసం పనిచేసే విభాగంలోనే కీలక బాధ్యతలు నిర్వహించిన సిబ్బందిపై ఇప్పుడు డ్రగ్స్ విక్రయానికి ప్రయత్నించారనే ఆరోపణలు రావడం మరింత సంచలనంగా మారింది.అంతర్గత విచారణ ప్రారంభం..ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లపై ఈగల్ అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించినట్లు సమాచారం. వారి వద్దకు ఎక్స్టసీ మాత్రలు ఎలా వచ్చాయి, డ్రగ్స్ పెడ్లర్లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, నిఘా డేటాను ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు, ఈ వ్యవహారంలో మరెవరైనా సిబ్బంది లేదా డ్రగ్స్ ముఠా సభ్యుల ప్రమేయం ఉందా అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా కానిస్టేబుళ్ల ఫోన్ కాల్స్, డ్రగ్స్ పెడ్లర్లతో వారి పరిచయాలు, నిఘా డేటా వినియోగం వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు విచారణ పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. -
భార్య ప్రైవేట్ ఫొటోలతో భర్త బ్లాక్మెయిల్
హైదరాబాద్: ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ భార్యను భర్త బెదిరిస్తున్న ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసవతారకంనగర్కు చెందిన ఓ టీచర్ (24).. తన భర్త నిరంతరం వేధిస్తూ, తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా తన ఇన్స్ట్రాగామ్ ఖాతాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వేధిస్తున్నాడని తెలిపారు. 2022లో తన ప్రైవేటు ఫోటోలను దుర్వినియోగం చేసి ఫేస్బుక్లో పోస్టు చేశాడని ఆరోపించింది. ప్రస్తుతం మరోసారి అదేవిధంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే అవకాశం ఉందంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘బాహుబలి’తో నిర్మాణం కూల్చివేత షురూ
హైదరాబాద్: అంజయ్యనగర్లో 50 చదరపు గజాల విస్తీర్ణంలో చేపట్టిన జీ ప్లస్ 6 అంతస్తుల నిర్మాణం కుప్పకూలడంతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు హైడ్రా చర్యలు చేపట్టింది. శనివారం అంజయ్యనగర్లో నాలాపై నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మాణం కుప్పకూలి పక్కనున్న జయదర్శిని రెసిడెన్సీపై పడ్డ విషయం తెలిసిందే. ఘటనను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎంసీ కమిషనర్ సృజన అక్రమ నిర్మాణాల తొలగింపును చేపడతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం బాహుబలి (బ్రొంటో) యంత్రంలో భవనం కూల్చివేత చేపట్టారు. సీఎంసీకి అందని లేఖ.. బిల్డర్ ఎం.డీ సాజిద్ చేపట్టిన నిర్మాణం కూలడంతో పక్కనే ఉన్న నిర్మలా రామన్కు చెందిన మణిదీప్ పీజీ హాస్టల్కు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదం పొంచి ఉందని భావించి ఆ భవనాన్ని తొలగించాలని హైడ్రా అధికారులు భావించారు. తొలుత హైడ్రా అధికారులు తొలగించాలని నిర్ణయించినప్పటికీ ఆదివారం సీఎంసీకి టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి లేఖ రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం తొలగిస్తున్న భవనాన్ని ఆనుకొని ఉన్న మహ్మద్ ఇస్మాయిల్ ఖురేషీ కి చెందిన అక్రమ నిర్మాణానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని హైడ్రా అధికారులు పేర్కొంటున్నారు. ఆ భవనాన్ని కూల్చివేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఇటాచీలతో జయదర్శిని రెసిడెన్సీలో ఉన్న శిథిలాలను కొద్ది మేరకు తొలగించారు. అధికారుల పేరు చెబుతూ సీఎంసీకి లేఖ ఇచ్చేందుకు జాప్యం చేస్తున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలాపై సర్వే.. అక్రమ నిర్మాణాల గుర్తింపు కూలిన భవనంతో పాటు మరికొన్ని భవనాలు నాలాపై ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఖురేషీకి చెందిన భవనంతో పాటు మరో నాలుగైదు భవనాలు నాలాపై ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిని తొలగించాలంటే సీఎంసీ నుంచి నివేదిక ఇస్తేనే చర్యలు తీసుకునేందుకు వీలుందని హైడ్రా అధికారులు అభిప్రాయపడుతున్నారు. సీఎంసీ అధికారుల నివేధిక ఆధారంగా మరిన్ని అక్రమ నిర్మాణాలను కూలి్చవేసే అవకాశం ఉంది. రికార్డులలో ఉన్న నాలా మచ్చుకు కూడా కనిపించకపోవడం గమనార్హం. ఆరు హాస్టళ్లు ఖాళీ.. భవనం కూలండంతో దాదాపు ఆరు హాస్టళ్లను రాయదుర్గం పోలీసులు ఖాళీ చేయించారు. ఇప్పటికే ఐటీ ఉద్యోగులు వెళ్లిపోయారు. అంజయ్యనగర్లోని రెండు రోడ్లలో, జయదర్శిని సీ బ్లాక్ వైపు ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. టీపీబీఓ సంతోష్పై వేటు అక్రమ భవనం కూలిన ఘటనలో మాదాపూర్ సర్కిల్–50 టీపీబీఓ యు.సంతోష్ కుమార్పై సీఎంసీ కమిషనర్ సృజన సస్పెన్షన్ వేటు వేశారు. జీ ప్లస్ 6 అంతస్తులు, పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టడం, భవనం కూలిన ఘటనలో ఇద్దరు కారి్మకులు మృతి చెందడం, పక్కనున్న జయదర్శిని రెసిడెన్సీకి నష్టం వాటిల్లడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. అనధికార నిర్మాణాన్ని నిలిపివేయడంతో టీపీబీఓ విఫలమయ్యారని, ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లిందని ఆమె పేర్కొన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అనధికార నిర్మాణాలపై సమగ్ర తనిఖీ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. బిల్డర్ సాజిద్ అరెస్ట్ ∙ కాంట్రాక్టర్ కోసం గాలింపు ∙ మరొకరిపై కేసు నమోదు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, నిబంధనలకు విరుద్ధంగా 50 చదరపు గజాల స్థలంలో జీ ప్లస్ 6, పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టిన ఎం.డి.సాజిద్ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. భవనం కుప్పకూలడంతో ఇద్దరు వలస కూలీలు మృతి చెందడం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడం, పక్క ఇంటికి తీవ్ర నష్టం కలగడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలోనే భవన స్థలం డాక్యుమెంట్పై పేరున్న ఫరీన్ సిద్ధిఖీపై, బిల్డర్ ఎం.డి.సాజిద్, కాంటాక్టర్ ఖాజా మొయినుద్దీన్పై బీఎన్ఎస్ 105 (బి) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సాజిద్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్ ఖాజామొయినుద్దీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఆరా.. సాజిద్ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై సీఎంసీ అధికారులు, అటు పోలీసులు ఆరా తీస్తున్నారు. శనివారం భవనం కుప్పకూలినప్పటికీ అంజయ్యనగర్లో మరో వైపు ఓ భవనంపై స్లాబ్ వేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. గత రెండేళ్లుగా అంజయ్యనగర్, సిద్ధిఖీనగర్లో దాదాపు 8 భవనాలు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. ఓ మాజీ ప్రజా ప్రతినిధి అండతో అధికారులను మభ్యపెట్టి అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. పోస్టుమార్టం పూర్తి భవనం కుప్పకూలిన దుర్ఘటనలో టైల్స్ పని చేస్తున్న మధ్య ప్రదేశ్కు చెందిన ఉమేష్ ఖరే (34), మోపత్(42)లు శిథిలాల కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. -
మార్కెటింగ్ శాఖలో అక్రమాలకు కళ్లెం పడేనా?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెటింగ్ శాఖను గాడిన పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఈ శాఖకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని డైరెక్టర్గా నియమించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మార్కెటింగ్ శాఖలో కొన్నేళ్లుగా వెలుగుచూస్తు న్న కార్యదర్శుల అవినీతి, అక్రమాలు.. ముఖ్యంగా పత్తి కొనుగోళ్లలో బయటపడిన అక్రమాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్గా ఐఏఎస్ అధికారి రాహుల్రాజ్ను నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల క్రితం వరకు డైరెక్టర్ (ఎఫ్ఏసీ)గా కొనసాగిన జి.లక్ష్మీబా యి బదిలీ అనంతరం ఇన్చార్జ్ డైరెక్టర్గా కొనసాగిన డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణుడును ఆ బాధ్యతల నుంచి తప్పించి, పూర్తి అదనపు బాధ్యతల్లో రాహుల్రాజ్ను నియమించింది. సాధారణంగా వ్యవసాయశాఖ కార్యదర్శే ఎక్స్అఫీషియోగా వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం వ్యవసాయశాఖ కార్యదర్శిగా సురేంద్రమోహన్ కొనసాగుతున్నా, మార్కెటింగ్ డైరెక్టర్గా రాహుల్రాజ్ను ప్రత్యేకంగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా..? 2024–25 ఖరీఫ్ పత్తి కొనుగోళ్లలో రైతుల పేర్లతో తప్పుడు తాత్కాలిక నమోదు పత్రాలు జారీ చేసి, అసలు రైతుల వద్ద కాకుండా దళారుల నుంచి పత్తి కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. వ్యవసాయశాఖ వద్ద ఉన్న తాత్కాలిక నమోదులకు, మార్కెటింగ్ శాఖ రికార్డులకు మధ్య కూడా వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఈ మేరకు మార్కెటింగ్ శాఖకు చెందిన ఏడుగురు కార్యదర్శులను 2025 ఫిబ్రవరిలో సస్పెండ్ చేశారు. ఈ విషయంలో మొత్తంగా 21 మందిని దోషులుగా గుర్తించినా, మార్కెటింగ్ శాఖ పరువు బజారున పడకుండా ఏడుగురితో సరిపెట్టారని మార్కెటింగ్ శాఖ సర్కిళ్లలో ప్రచారం జరిగింది. 2026 జనవరిలో ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. 2024 అక్టోబర్ నుంచి పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలను సీఐడీ కోరినట్లు వెల్లడైంది. పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2025 డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా 65కుపైగా జిన్నింగ్ మిల్లులు, కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. తూకం యంత్రాల ప్రమాణాలు, తేమ కొలిచే పరికరాలు, పత్తి నాణ్యతను నిర్ధారించే శాస్త్రీయ పరికరాలు, సీసీ కెమెరాల నిర్వహణ తదితర అంశాల్లో లోపాలను గుర్తించారు. కొన్ని మిల్లులపై చట్టపరమైన కేసులు కూడా నమోదు చేశారు.పత్తి సీజన్ ముందే కీలక బాధ్యతఇలాంటి పరిస్థితుల్లో రాహుల్రాజ్కు మార్కెటింగ్ శాఖ పగ్గాలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సహకారశాఖ రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు మార్క్ఫెడ్, ఆయిల్ఫెడ్ వంటి వ్యవసాయ అనుబంధ సంస్థలతో పని అనుభవం ఉంది. గతంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల కలెక్టర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ముందున్న పత్తి కొనుగోళ్ల సీజన్ మార్కెటింగ్ శాఖకు అత్యంత కీలకం. గత సీజన్లో బయటపడిన లోపాలు పునరావృతం కాకుండా రైతుల నిజమైన నమోదు, పంట విస్తీర్ణం–దిగుబడి ఆధారంగా కొనుగోలు పరిమితుల నిర్ధారణ, దళారుల ప్రవేశానికి అడ్డుకట్ట, తూకాల్లో పారదర్శకత, నాణ్యత పరీక్షలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అంశాలపై కొత్త డైరెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. -
పత్రికా స్వేచ్ఛ లేకుంటే ప్రజాస్వామ్య సారానికే విఘాతం
సాక్షి, హైదరాబాద్: దేశంలో పాత్రికేయుల రక్షణ కోసం సమగ్రమైన వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, పటిష్టమైన చట్టపర రక్షణ వ్యవస్థలు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోకపోవడంపట్ల సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్ వేదికగా ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛకు, భావప్రకటన స్వేచ్ఛకు ఎదురవుతున్న అడ్డంకులపై జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు, వ్యవస్థలు విఫలమవుతున్న తీరుపై ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో నిజాలను వెలికితీసే జర్నలిస్టులకు భద్రత కల్పించేలా సమర్థవంతమైన చట్టాలు, కార్మిక భద్రతా నిబంధనలు అమలులోకి రాకపోవడం వల్ల జర్నలిస్టులు తీవ్రమైన ఒత్తిళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టులు చట్టబద్ధంగా పనిచేస్తున్న క్రమంలో, ప్రభుత్వాలు, కార్పొరేట్ శక్తులు, ఇతర వర్గాల నుంచి వారిపై జరుగుతున్న దాడులు, అణచివేత చర్యలను అడ్డుకోవడానికి జర్నలిస్ట్ సంçఘాలు, ఫెడరేషన్లు సమష్టిగా చట్టపరమైన వేదికలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే భావప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని, ఇవి లేకపోతే ప్రజాస్వామ్యం తన సారాన్ని కోల్పోతుందని చెప్పారు. వర్తమాన మీడియా రంగంలో వస్తున్న మార్పులను ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో నిబద్ధత కలిగిన పాత్రికేయుల పాత్ర ఎప్పటికీ ఎంతో విలువైనదని పేర్కొన్నారు. సంప్రదాయ జర్నలిజం ప్రాధాన్యానికి ఢోకా ఉండదు: ఎన్.రామ్డిజిటల్ ప్లాట్ఫామ్లు, యూట్యూబ్ చానెళ్లు ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సంప్రదాయ జర్నలిజం ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదని, డిజిటల్ కాలంలో రిపోర్టింగ్ ప్రాథమిక సూత్రాలను పాటించడం మరింత అవసరమని ‘ది హిందూ’ గ్రూప్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్ స్పష్టం చేశారు. మీడియాపై ప్రజలకు విశ్వసనీ యత పెరగాలంటే జర్నలిజం తన మూలాలైన క్షేత్రస్థాయి వార్తల కవరేజి, పరిశోధనాత్మక వార్తలు, వివరణాత్మక వార్తల వైపు మళ్లాల్సిందేనని హితవు పలికారు. మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ వ్యవస్థలను మరింత బలోపే తం చేసుకోవాలని, జర్నలిస్టుల కోసం పారదర్శకమైన ప్రవ ర్తనా నియమావళిని పాటించాలని సూచించారు. పాఠశాల స్థాయిలోనే మీడియాపై అవగాహన కల్పించాలని, దీనివల్ల విద్యార్థులు వార్తలను, సమాచారాన్ని సరిగ్గా అర్థం చేసు కుని, విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలరని అభి ప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను బలోపేతం చేయడానికి, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడానికి, వృత్తిగత ప్రమాణాలను పెంపొందించడానికి ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ’హైదరాబాద్ డిక్లరేషన్’ను ఆమోదించింది. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి, ‘ది కారవాన్’ మేగజైన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హర్తోష్ సింగ్ బాల్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు సంగీతా బరూహ్ పిషారోటి, ఫెడరేషన్ అధ్యక్షుడు గౌతమ్ లహరి, ప్రెస్క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సంగీత, దేశంలోని వివిధ ప్రెస్క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు విజయకుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్పల, ఇతర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. -
‘ఈగల్’లో ఇంటి దొంగలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమైన ఈగల్లో ఇంటి దొంగలు ఉన్నారు. ఓ రైలులో దొరికిన మెథ్ను (మెథాంఫెటమైన్) దారి మళ్లించారు. తన ఇంట్లో ఉంచుకొని ‘నెట్వర్క్’ద్వారా విక్రయిస్తున్నారు. యాధృచ్ఛికంగా వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) ఇద్దరు టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లను అరెస్టు చేసింది.పొరుగు రాష్ట్రం నుంచి డెడ్డ్రాప్లో...: ఇటీవల కాలంలో డ్రగ్ సప్లయర్స్ మాదక ద్రవ్యాల సరఫరా పంథాను పూర్తిగా మార్చేశారు. డెడ్డ్రాప్ విధానంలో పార్శిల్ చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ పెడ్లర్ ఇచ్చిన ఆర్డర్ ఆధారంగా పొరుగు రాష్ట్రానికి చెందిన సప్లయర్ గత నెలలో రూ.1.5 కోట్ల విలువైన మెథ్ను రైలులో డెడ్డ్రాప్ చేశాడు. ఈ మాదక ద్రవ్యాన్ని పార్శిల్ చేసి, రైలు జనరల్ బోగీలో నిర్దేశిత ప్రాంతంలో ఉంచాడు. ఆ వివరాలు, ఫొటోను ఇక్కడి పెడ్లర్కు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వీరి పథకం ప్రకారం... రైలు నగరానికి చేరుకున్నాక పెడ్లర్ వెళ్లి ఆ పార్శిల్ తీసుకోవాలి.సమాచారం ఉంది.. రంగంలోకిఈగల్లో అంతర్భాగమైన రీజనల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ (ఆర్ఎన్సీసీ) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కూ ఒకటి ఉంది. ఇందులో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు స్వామి, మరొకరు తమ రోటీన్ తనిఖీల్లో డెడ్ డ్రాప్ పార్శిల్ను ఆ రైలు జనరల్ బోగీలో గుర్తించారు. ఈ రూ.1.5 కోట్ల విలువైన మెథ్ పార్శిల్ స్వాధీనం చేసుకున్న ఈ ద్వయం ఈగల్ పోలీస్స్టేషన్కు చేర్చలేదు. సరుకును ఓ కానిస్టేబుల్ తన ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచాడు. చాలాకాలంగా ఈగల్ విభాగంలో పనిచేస్తున్న ఇతడికి నగరంలో ఉన్న డ్రగ్ పెడ్లర్స్, వినియోగదారుల వివరాలు తెలుసు. వాటిని వినియోగించుకొని మెథ్ మొత్తాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలని కుట్ర పన్నాడు. వినియోగదారుల్ని సంప్రదించగా, ఇది ట్రాప్గా భావించిన పలువురు విముఖత చూపారు. అయినా, కానిస్టేబుల్ స్వామి తన ప్రయత్నాలు ముమ్మురం చేసి, కొందరికి ఆ మెథ్ను విక్రయించాడు. ఈగల్, హెచ్–న్యూ విభాగాల వద్ద ఉన్న డ్రగ్ పెడ్లర్స్, వినియోగదారుల జాబితాలో కొందరు ఉమ్మడిగా ఉంటారు. నిత్యం ఈ వినియోగదారులపై నిఘా ఉంచుతున్న హెచ్–న్యూ అనుమానితులను అదుపులోకి తీసుకొని, పరీక్షలు చేయిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఓ వినియోగదారుడికి పరీక్షలు చేయించగా, మెథ్ వినియోగించినట్టు తేలింది. ఆ డ్రగ్ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో అతడిని విచారించగా, కానిస్టేబుల్ స్వామి చేస్తున్న మెథ్ దందా వెలుగులోకి రాగా, అతడిని అరెస్టు చేసింది. తదుపరి విచారణలో మరో కానిస్టేబుల్ పాత్ర బయటపడటంతో ఆదివారం అతడినీ అదుపులోకి తీసుకుంది. ఈ ‘ఈగల్ డ్రగ్స్ దందా’ను నగర పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. కేవలం కానిస్టేబుల్ స్థాయి అధికారులతో కాదని హెచ్–న్యూ అనుమానిస్తోంది. ఈ దందా వెనుక మరికొందరు అధికారుల పాత్రను తేల్చడానికి లోతుగా ఆరా తీస్తున్నారు. -
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఏపీ మద్యం పాలసీ అక్రమ కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లో ఆయన్ను అదుపులోకి తీసుకుని బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. అనంతరం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం మరోసారి ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించి.. కోర్టులో హాజరుపరుస్తారని తెలిసింది. ఈ సందర్భంగా కారుమూరి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే తన కుమారుడిని అరెస్ట్ చేశారని.. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. -
సమస్యలు ‘శాకో’పశాఖలు!
సాక్షి, హైదరాబాద్: ఏటేటా రాష్ట్రంలో కూరగాయల సాగు తగ్గుతోంది. తెలంగాణ ఉద్యానశాఖ గణాంకాలను పరిశీలిస్తే.. 2022–23లో రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగై 14.64 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైతే, 202–24 నాటికి కూరగాయల విస్తీర్ణం 1.13 లక్షల ఎకరాలకు పడిపోయి, ఉత్పత్తి 11.17 లక్షల టన్నులకు తగ్గింది. అంటే ఒక్క ఏడాదిలోనే సాగు విస్తీర్ణం సుమారు 22 వేల ఎకరాలు తగ్గగా.. ఉత్పత్తి 3.47 లక్షల టన్నులు పడిపోయింది. ఇక 2025–26కు సంబంధించిన తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదికలో కూరగాయల సాగు విస్తీర్ణం 1.03 లక్షల ఎకరాలుగా ఉంది. అదే సమయంలో ఉత్పత్తి 9.53 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే మూడేళ్లలో కూరగాయల పంటల ఉత్పత్తి ఏకంగా 35 శాతం పడిపోయింది. రాష్ట్రంలో వరి సాగుకు నీటివసతి, కొనుగోలు వ్యవస్థ, కనీస మద్దతు ధర, మార్కెట్ భరోసా వంటి అంశాలు రైతులను ఆకర్షిస్తున్నాయి. 2025–26లో రాష్ట్ర వరి ఉత్పత్తి 187.19 లక్షల టన్నులుగా అంచనా వేయగా.. 2024–25లో ఇది 189.45 లక్షల టన్నులుగా నమోదైంది. భారీ లోటులో ఉల్లిగడ్డలు, ఆకుకూరలు, బంగాళాదుంప రాష్ట్రానికి అవసర మైన కూరగాయల్లో నిత్యం వినియోగించే ఆకుకూరలు, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపల ఉత్పత్తి లోటు భారీగా ఉంది. రాష్ట్రంలో ఆలుగడ్డలు, ఉల్లిగడ్డల పంటల జాడ కూడా లేకుండా పోయింది. ఉల్లిగడ్డల ఉత్పత్తిలో ఏకంగా 3.77 లక్షల టన్నుల లోటు ఉందని ఉద్యాన విశ్వవిద్యాలయం–ఐకార్ కూరగాయల పరిశోధన వ్యవస్థ ఆధారంగా జరిగిన విశ్లేషణ వెల్లడించింది. ఈ లోటును పూడ్చాలంటే అదనంగా 44,549 ఎకరాలను కేవలం ఉల్లిపాయల సాగులోకి తేవాల్సి ఉంటుంది. ఆకుకూరల్లో 2.77 లక్షల టన్నుల లోటు ఉండగా, ఇందుకోసం మరో 59,045 ఎకరాలు అవసరం. బంగాళాదుంపలో 2.15 లక్షల టన్నుల కొరత ఉండగా, అదనంగా 26,806 ఎకరాలు సాగు చేయాల్సి ఉంటుందని అంచనా. అంటే రాష్ట్రంలో స్వయం సమృద్ధికి మరో 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు అవసరం. ఆ దిశగా సాగు లక్ష్యాలు నిర్ధేశించుకున్నా, రైతులు ముందుకు రావడం లేదు. కూరగాయల సరఫరాలో డిమాండ్– సప్లై చైన్ విషయంలో అంతరం ఏర్పడుతోంది. టమాటాకు మే–ఆగస్టు, ఉల్లికి జూలై–అక్టోబర్/నవంబర్, ఆకుకూరలకు జనవరి–ఆగస్టు, బంగాళాదుంపకు మే–డిసెంబర్ మధ్య కొరత అధికంగా కనిపిస్తోంది.ముందుకు రాని రైతులుతెలంగాణ ఉద్యానశాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఒక ఎకరా వరికి అవసరమయ్యే నీటితో నాలుగు ఎకరాల వరకు ఉద్యాన పంటలు సాగు చేయవచ్చని పేర్కొంది. ప్రతి రూపాయి పెట్టుబడికి ఉద్యాన పంటల నుంచి సగటున రూ.3.5 లక్షల రాబడి, సాధారణ వ్యవసాయ పంటల నుంచి రూ.1.5 లక్షల రాబడి ఉంటుందని తెలిపింది. బోర్ల కింద అధిక నీరు అవసరమయ్యే వరి స్థానంలో, మార్కెట్ డిమాండ్ ఉన్న కూరగాయలను శాస్త్రీయంగా ప్రోత్సహించాలన్నదే శాస్త్రవేత్తల సూచన. అయినా రాష్ట్రంలో ఈ ఖరీఫ్లో కూడా కనీసం ఆశించిన స్థాయిలో కూడా కూరగాయల సాగు సాగలేదు. సవాలక్ష సమస్యలు.. రైతులు కూరగాయల సాగు చేయాలన్నా సవాలక్ష సమస్యలు ఉన్నాయి. వసతుల కల్పన, రైతులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న వాదన వినవస్తోంది. కూరగాయల సాగులో ధరల హెచ్చుతగ్గులు, పంట నష్టం, నిల్వ సదుపాయాల కొరత, మార్కెటింగ్ సమస్యలు, పురుగు–తెగుళ్లు రైతులను వెనక్కి నెడుతున్నాయి. పైగా కోతులు, అడవి పందుల బెడద కూడా తీవ్రంగా ఉంది. 2026 ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగిన జాతీయ కూరగాయల సదస్సులో నిపుణులు కూడా వాతావరణ మార్పులు, పురుగు–తెగుళ్లు, కోత అనంతర నష్టాలు, పరిమిత ప్రాసెసింగ్ సదుపాయాలు కూరగాయల ఉత్పత్తి పెరగకపోవడానికి ప్రధాన కారణాలని పేర్కొనడం గమనార్హం. -
పర్యావరణంలోని సీసంతో అల్జీమర్స్ తీవ్రం
లాలాపేట (హైదరాబాద్): పర్యావరణంలోని సీసం ప్రభావానికి గురికావడం వల్ల, ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధికి ప్రధాన కారణమయ్యే అమిలాయిడ్–బీటా పెప్టైడ్స్ శరీరంలో ఉన్నప్పుడు, అది నాడీ కణాల సహజ వ్యర్థాల శుద్ధి వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని హైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పర్యావరణంలోని సీసం వల్ల కలిగే నష్టం, అమిలాయిడ్–బీటా వల్ల నాడీ కణాలపై ఒత్తిడిని ఎక్కువ చేస్తుందని, దీనివల్ల నాడీ కణాలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.పరిశోధనలో మానవ నాడీ కణాలపై సీసం, రెండు రకాల అమిలాయిడ్–బీటా పెప్టైడ్ల ప్రభావాన్ని పరిశీలించారు. ఈ వివరాలు ’జర్నల్ ఆఫ్ అప్లైడ్ టాక్సికాలజీ’లో ప్రచురితమయ్యాయి. సీసం లేదా అమిలాయిడ్–బీటా పెప్టైడ్లు విడివిడిగా ఉన్నప్పుడు నాడీ కణాల వ్యర్థాలను శుద్ధి చేసే లైసోజోమ్ వ్యవస్థకు కొంత నష్టం వాటిల్లినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే, ఇవి రెండూ కలిసినప్పుడు మాత్రం నష్టం చాలా తీవ్రంగా ఉన్నట్లు తేలింది. అమిలాయిడ్–బీటా సమక్షంలో సీసం ప్రభావం లైసోసోమ్ల లోపాలను మరింత తీవ్రతరం చేస్తుందనీ సైంటిస్తు డా.సురేష్ చల్లా తెలిపారు. కణ స్థాయి మార్పులను అర్థం చేసుకోవడానికి, పర్యావరణ కాలుష్యం నాడీ ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేయొచ్చన్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పర్యావరణ కాలుష్య కారకాలు, జీవసంబంధిత అంశాల మధ్య జరిగే చర్యలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ డైరెక్టర్ డా.భారతి కులకర్ణి పేర్కొన్నారు. తద్వారా నరాల క్షీణత వ్యాధుల కారకాలను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. -
ఏఐలో అద్వితీయం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీ పెరుగుతున్న వేళ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అమెరికా 6,900, చైనా 1600, భారత్ 710 ఏఐ స్టార్టప్లతో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న నేపథ్యంలో, దేశంలో బెంగళూరు తర్వాత రెండో అతిపెద్ద ఏఐ కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు, టాలెంట్ పూల్, పెట్టుబడులతో నగరం గ్లోబల్ ఏఐ హబ్గా మారే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో 500కు పైగా ఏఐ స్టార్టప్లు పనిచేస్తున్నాయి. 2015–25 మధ్య 160 స్టార్టప్లు 5 శాతం సంయుక్త వార్షిక వృద్ధిరేటుతో పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 900కు పైగా ఏఐ కంపెనీలు, 2 లక్షల మంది ఏఐ ఇంజనీర్లు ఉన్నారు. టీ–డేటా ప్లాట్ఫామ్లో 2026 జూలై నాటికి 3,000 ఏఐ సంస్థలు నమోదయ్యాయి. ఉద్యోగాల వెబ్సైట్ నివేదిక 2025 ప్రకారం ఏఐ/ఎంఎల్ ఉద్యోగాల్లో హైదరాబాద్లో 54 శాతం వృద్ధి నమోదైంది. ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ఇక్కడ జీవన వ్యయం తక్కువ, పాలసీలు బలంగా ఉండటంతో స్టార్టప్లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని చెబుతున్నారు.గూగుల్, టీహబ్ కలిసి ‘ఏఐ–ఫస్ట్ స్టార్టప్ యాక్సిలరేటర్’ ప్రారంభించాయి. ఏటా పదివేల మంది విద్యార్థులకు శిక్షణ, బూట్క్యాంప్లు నిర్వహిస్తారు. వచ్చే ఏడాదిలో 200 కొత్త స్టార్టప్లు, రూ.50 కోట్ల ఫండింగ్ వచ్చే అవకాశం ఉంది.టీ – హబ్లో100 ఏఐ స్టార్టప్లు ఏకకాలంలో ఇంక్యుబేట్ అవుతున్నాయి. తెలంగాణ ఏఐ మిషన్ (టీ–ఏఐఎం), ఏఐ సిటీ, గూగుల్ హబ్ వంటి ప్రాజెక్ట్లతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ భారత్కు ఏఐ రాజధానిగా, గ్లోబల్ టాప్ 20 డెస్టినేషన్గా అవతరించనుందని అంటున్నారు. -
సీపీఎస్ రద్దు చేయండి.. మళ్లీ సీఎంను చేస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ వ్యాఖ్యానించారు. ఇది తన ఒక్కడి మాట కాదని..రాష్ట్రంలోని 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల హామీ అని రేవంత్రెడ్డిని ఉద్దేశించి ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జూలై 11న ప్రారంభమైన సీపీఎస్ ఉద్యోగుల జనజాగరణ యాత్ర రాష్ట్రంలోని 33 జిల్లాలో కొనసాగింది. ఆదివారం ఎల్బీస్టేడియంలో జనజాగరణ యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత కరువైందని, ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ఇప్పటికే 5 వేలకు పైగా ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు. కానీ ఏ ఒక్కరికీ కూడా కనీసం రూ.5వేల పెన్షన్ కూడా రాలేదు. ఎక్కడో యుద్ధం జరిగితే తెలంగాణలోని సీపీఎస్ ఉద్యోగి ప్రాన్ అకౌంట్లో సొమ్ము ఆవిరి అవుతోంది. ఈ ఏడాది మార్చి నెలలో ఉద్యోగులతోపాటు ప్రభుత్వ సొమ్ము రూ.1,800 కోట్లు అవిరైంది. పాత పెన్షన్ విధానంలో ఉన్న మాదిరిగా కనీస పెన్షన్ హామీ కూడా లేకపోవడం దురదృష్ట్టకరం’అని అన్నారు. మన పోరాటంతోనే డీసీఆర్జీ... ‘టీఎస్సీపీఎస్ఈయూ 12 ఏళ్లుగా పోరాటం చేసినందుకే ఇప్పుడు సీపీఎస్ ఉద్యోగులకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ (డీసీఆర్జీ) అమలవుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారు. ఆయా రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ ఓపీఎస్ అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో డే అయిన నవంబర్ 17 నాటికి ప్రభుత్వం స్పందించి సీపీఎస్ రద్దుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ స్పందించకుంటే నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ సామూహిక సెలవులు పెట్టాలి. జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలతో తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలి’అని స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. – సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల వృద్ధాప్య భవిష్యత్ షేర్ మార్కెట్ పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవితకాలం ప్రభుత్వానికి సేవ చేస్తే, చివరకు ఉద్యోగుల పెన్షన్ నిధులను కార్పొరేట్ షేర్ మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడం న్యాయం కాదన్నారు. ప్రజాప్రతినిధులకు వినతులు... 41 రోజుల పాటు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనజాగరణ యాత్ర జరగ్గా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతులు సమర్పించారు. ఆదివారం నాటి సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలివచ్చారు. సభ జరిగినంత సేపు వర్షం కురుస్తున్నా, ఉద్యోగులు సీపీఎస్ రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ సభను ఉత్సాహంగా సాగించారు. ఈ సమావేశంలో సంఘ కోశాధికారి నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు కూరకుల శ్రీనివాస్, మ్యాన పవన్, మల్లికార్జున్, పోల శ్రీనివాస్, కిరణ్ ,లింగమూర్తి, నరేందర్ రావు, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘గంగాజల్’కు గోదావరి ప్రేరణ
సాక్షి, హైదరాబాద్: తపాలా గంగాజలం... ఇప్పుడు మన దేశంలోనే కాదు..విదేశాల్లోని భారతీయుల ఇళ్లకూ బట్వాడా అవుతున్న పూజా నీళ్లు. హిమాచల్ప్రదేశ్లోని గంగోత్రి వద్ద గంగానది నుంచి సేకరించిన నీటిని శుద్ధి చేసి కోరుకున్న భక్తుల ఇళ్లకు భద్రంగా చేరుస్తోంది. ఇందుకోసం ఏకంగా సొంతంగానే బాటిలింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేసి, ఇప్పుడు దాన్ని తపాలా సేవల్లో ముఖ్యమైందిగా మార్చుకుంది. ఈ శ్రావణమాసంలో 20 లక్షల గంగా జలం నీటి సీసాలను ప్రపంచవ్యాప్తంగా బట్వాడా చేయాలనుకుంటోంది. పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ క్రియాశీల ‘సర్వీసు’వెనుక హైదరాబాద్ తపాలా అధికారుల ఓ చిన్న ప్రయోగం ప్రేరణగా నిలవటం విశేషం. ⇒ తపాలా కార్యాలయంలో 250 మి.లీ. పరిమాణంలోని నీటి సీసా ధర రూ.30. దీన్ని ఇంటికి తెప్పించుకోవాలంటే రూ.121 పోస్టల్ చార్జీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ⇒ రెండు సీసాలతో కూడిన ప్యాక్ ఆర్డర్ ఇస్తే చార్జి రూ.201 ⇒ నాలుగు సీసాల ప్యాక్ పోస్టల్ చార్జి రూ.321గోదావరి పుష్కరాలతో...: అది 2015... గోదావరి పుష్కరాలను నాటి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే గోదావరికి చాలా దూరంలో ఉన్న వారు... 12 ఏళ్లకోసారి వచ్చే పవిత్ర పుష్కర స్నానాలు చేయలేకపోతున్నామన్న ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని గమనించిన నాటి తెలంగాణ సర్కిల్ తపాలాశాఖ అధికారులు, గోదావరి నీటిని శుద్ధి చేసి సీసాల్లో నింపి అలాంటి వారి ఇళ్లకే చేర్చే ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. ఏడున్నర లక్షల ఆర్డర్లు రావటం విశేషం. విదేశాల నుంచి కూడా భక్తులు తపాలా ద్వారా ఈ సీసాలను ఆర్డర్ ఇచ్చారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని తపాలాశాఖ ఉన్నతాధికారులు అభినందించారు. గోదావరి నీటిని భక్తులకు బట్వాడా చేసినట్టుగానే గంగానది నీటిని అందిస్తే ప్రజల్లో తపాలాశాఖకు ఆదరణ పెరుగుతుందని నిర్ణయించి వెంటనే దాన్ని అమలులోకి తెచ్చారు. ఇందుకోసం అధికారులు గంగానది నీటిని కూడా సరఫరా ప్రారంభించారు. గంగోత్రి నుంచి ఇంటి గడప వరకు..హైదరాబాద్లో ఒక చిన్న ప్రయోగంగా మొదలైన ఈ సేవ, ఇప్పుడు దేశవ్యాప్తంగా 4,116 పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది. తొలుత గంగోత్రి, రిషికేశ్ల నుంచి గంగానది నీటిని సేకరించి 250 మి.లీ. పరిమాణంలోని సీసాల్లో నింపి తపాలా కార్యాలయాల్లో అమ్మకానికి పెట్టింది. తర్వాత గంగోత్రి నుంచి మాత్రమే నీటి సేకరణను పరిమితం చేసింది. హిమాచల్ప్రదేశ్లోని ఉత్తర్కాశీలో ప్రత్యేకంగా గంగాజల్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది.అయితే, ఇది సాధారణ తాగునీటిగా వాడేందుకు కాదన్న సంకేతాలనైతే ఇచ్చింది. ఉత్తర్కాశీలోని బాట్లింగ్ ప్లాంట్ సామర్థ్యం 8 గంటల ఒక షిఫ్ట్కు 6,400 బాటిళ్లు (1,600 లీటర్లు). ఈ లెక్కన ఏడాదికి 23 లక్షలకు పైగా బాటిళ్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. తాజాగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో ఆ సీసాలను అందుబాటులో ఉంచారు. -
ఈ ప్రేమ ఆర్టిఫిషియల్
ఒంటరిగా ఉన్నప్పుడు మనసు విప్పి మాట్లాడేందుకు ఓ మనిషి కావాలి. బాధలో ఉన్నప్పుడు ఓదార్చే మాట కావాలి. ప్రేమలో ఉన్నప్పుడు భావాలను పంచుకునే వ్యక్తి కావాలి. కానీ ఇప్పుడు ఈ అవసరాలకు కృత్రిమ మేధ (ఏఐ) చాట్బాట్లను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. ఏఐతో గంటల తరబడి మాట్లాడటం.. దానినే స్నేహితుడిగా, గర్ల్ఫ్రెండ్గా, బాయ్ఫ్రెండ్గా భావించడం కూడా కొత్త ట్రెండ్గా మారుతోంది. ఏఐ గర్ల్ఫ్రెండ్/ ఏఐ బాయ్ఫ్రెండ్/ ఏఐ కంపానియన్ వంటి అప్లికేషన్లు వినియోగదారులతో గంటల తరబడి మాట్లాడుతున్నాయి. గత సంభాషణలను గుర్తుంచుకుంటున్నాయి. వారి అభిరుచులకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. కొన్నిసార్లు ప్రేమను, ఆప్యాయతను, ఆకర్షణను కూడా అనుకరిస్తున్నాయి. ఈ సాంకేతికతలో ఒంటరితనానికి తాత్కాలిక మందు ఉన్నా.. దాని మరో కోణం ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏఐ అనేది మనిషికి డిజిటల్ తోడుగా మారుతున్న కొద్దీ, అదే సాంకేతికత నమ్మకాన్ని సంపాదించడానికి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి, డబ్బు ఖర్చు చేయించడానికి, చివరకు బ్లాక్మెయిల్ చేయడానికి కూడా దోహదపడే అవకాశం పెరుగుతుంది.⇒ 2022 నుంచి ఏఐ కంపానియన్ యాప్స్ డౌన్లోడ్లు - 16.5 కోట్లు⇒ గత నాలుగేళ్లలో వినియోగదారులు వెచ్చించిన వ్యయం - రూ. 4,000 కోట్లు⇒ 2026లో మొదటి ఆరు నెలల్లోనే చేసిన ఖర్చు - రూ. 1,500 కోట్లుభావోద్వేగ ఒంటరితనంప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపానియన్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2026లో సైకలాజికల్ సైన్స్లో ప్రచురితమైన అధ్యయనం రెండువేల మందికి పైగా పెద్దలను పరిశీలించింది. ఒంటరితనం ఉన్న వ్యక్తులు సోషల్ చాట్బాట్లను ఎక్కువగా ఆశ్రయించే అవకాశం కనిపించడంతోపాటు, అధిక చాట్బాట్ వినియోగం తర్వాత భావోద్వేగ ఒంటరితనం పెరిగినట్లు కూడా అధ్యయనం తెలిపింది. ఇటీవల ప్రకృతిలో మనుషుల ప్రవర్తనపై ఏఐ కంపానియన్ వినియోగదారులపై మరో అధ్యయనం ప్రచురితమైంది. ఏఐ కంపానియన్ వినియోగదారుల్లో ఎమోషనల్ వెల్–బియింగ్, మెంటల్ హెల్త్ సమస్యలు తలెత్తే అవకాశాలు గమనించారు.అన్నీ తెలుసుకుంటుంది.. మనిషి ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి సాంకేతికతను నమ్మి కుటుంబ సమస్యలు, సంబంధాలు, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, భయాలు, ఇష్టాలు, లైంగిక అభిరుచులు వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని కూడా తెలియకుండానే వెల్లడించే అవకాశం ఉంటుంది. రోజులు, నెలలు కొనసాగిన సంభాషణ ఒక వ్యక్తి గురించి అత్యంత సమగ్ర డిజిటల్ ప్రొఫైల్గా మారవచ్చని సైబర్భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. నకిలీ ముఖం సృష్టించడం.. నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్ తయారు చేయడం వంటి ప్రమాదాలున్నాయని చెప్పారు. వాయిస్ క్లోనింగ్తో ఫోన్ కాల్స్, డీప్ఫేక్ టెక్నాలజీతో సహజంగా కనిపించే సంభాషణలు రూపొందించి బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.పెరుగుతున్న వ్యాపారంఒక వ్యక్తి తనకు నచ్చిన ఏఐ క్యారెక్టర్తో రోజూ గంటల తరబడి మాట్లాడటం ప్రారంభిస్తే, ఆ అనుబంధాన్ని కొనసాగించేందుకు సబ్స్క్రిప్షన్లు, అదనపు ఫీచర్లు, ప్రత్యేకమైన కంటెంట్ కోసం డబ్బు ఖర్చు చేయడం మొదలవుతుంది. ముఖ్యంగా లైంగిక ఆకర్షణను ఆధారంగా చేసుకున్న ఏఐ క్యారెక్టర్లు వినియోగదారుల దృష్టిని ఎక్కువసేపు నిలుపుకోవడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా అప్లికేషన్లలో పూర్తిగా ఏఐ కంటెంట్తో నడిచే అకౌంట్స్, వాటి అకౌంట్ సబ్స్క్రిప్షన్స్ లక్షల్లో వ్యాపారానికి దారి తీస్తున్నాయి. ఉచిత చాట్ తర్వాత ప్రీమియం ఫీచర్లు, ప్రత్యేక క్యారెక్టర్లు, అదనపు సంభాషణలు, వ్యక్తిగతమైన ఇమేజ్లు, అడల్ట్ కంటెంట్ వంటి వాటికి చెల్లింపులు చేయించే విధానాలు పెరుగుతున్నాయి.ఏఐ ఒక్కటే మార్గం కాదుఒంటరితనం, ఇతర భావోద్వేగ సమస్యలకు ఏఐ ఒక్కటే ఆధారంగా మారకూడదు. వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు లేదా అత్యంత సున్నితమైన ఫొటోలు, వీడియోలను డిజిటల్ కంపానియన్స్ లేదా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులతో పంచుకోవడం ప్రమాదకరం. ప్రత్యేకంగా న్యూడ్ వీడియో కాల్స్ లేదా వ్యక్తిగత వీడియో కాల్స్ను రికార్డ్ చేసే అవకాశం ఉన్నందున, ఆన్లైన్ సంబంధాల్లో జాగ్రత్త మరింత అవసరం. హనీట్రాప్ పేరుతో బెదిరించినప్పుడు డబ్బు చెల్లించడం సమస్యను పరిష్కరించదు. చాట్లు, ఫోన్ నంబర్లు, ప్రొఫైల్ వివరాలు, చెల్లింపు వివరాలు, స్క్రీన్షాట్లు వంటి ఆధారాలను భద్రపరచి వెంటనే ఫిర్యాదు చేయాలి.–అద్వైత్ కంభం, సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు -
నాణ్యమైన యూనిఫారాలు కూడా ఇవ్వలేరా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు కూడా అందించలేని దుస్థితిలో ఉందని మాజీమంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. ‘ఊడిన కుట్లు.. కొలతల పాట్లు’అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో వచ్చిన కథనాన్ని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో యూనిఫారాలు అందలేదని, అందిన చోట్ల కూడా కొలతలు సరిగ్గా లేకపోవడంతోపాటు కుట్లు ఊడిపోతున్నాయని ఆరోపించారు. ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయన్నారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు ఇవ్వాల్సి ఉండగా.. చాలాచోట్ల ఒక్క జత కూడా పూర్తిగా అందలేదని తెలిపారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. కమీషన్ల కోసం బడా కార్పొరేట్ల నుంచి నాసిరకం యూనిఫారాలు తెప్పించారని హరీశ్రావు ఆరోపించారు. రేవంత్రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ తెలంగాణ చేనేత కార్మికులపై లేదని విమర్శించారు. ‘మఫత్లాల్ ముద్దు.. చేనేత వద్దు’ అన్నదే ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు. ఒకవైపు చేనేత కార్మికుల ఉపాధికి గండి పడుతుండగా.. మరోవైపు విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందుతున్నాయన్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు, చేనేత కార్మికులకు ఉపాధి నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. నాసిరకం యూనిఫారాల వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్రెడ్డీ? ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ‘ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్రెడ్డీ? ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆవేదన వింటే గుండె కలిచి వేస్తోంది. నెలల తరబడి జీతాల్లేకుండా సిబ్బంది ఎలా బతకాలి? పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించాలి? ప్రతి నెలా 1వ తేదీకే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడం లేదు’అని ఆదివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని గొప్పగా ప్రకటించారని, అది ప్రకటనలకే పరిమితమైందని హరీశ్ ఆరోపించారు. -
కాంగ్రెస్ దగాపై సమరభేరి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సమరభేరికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, వంద రోజుల్లో వాటిని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ వేయి రోజులు పూర్తయినా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. గ్రామగ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. బాకీ కార్డులతో హామీల వైఫల్యం రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువత తదితర వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ‘బాకీ కార్డుల’రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. ఆయా వర్గాలకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, పేరుకుపోయిన బకాయిల వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కేవలం హామీలు అమలు కాలేదనే అంశానికే పరిమితం కాకుండా, 1,000 రోజుల పాలనలో ప్రభుత్వం వివిధ రంగాల్లో ఎదుర్కొన్న వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామాలు, వార్డు స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను వివరించాలని పిలుపునిచ్చారు. కొత్త తరానికి చేరువయ్యేలా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించి వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, మాజీ ప్రజాప్రతినిధులు సహా అన్ని స్థాయిల నాయకులు వారం రోజుల కార్యక్రమాల్లో పాల్గొని వాటిని విజయవంతం చేయాలని కేటీఆర్ కోరారు. -
14 దేశాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల నియామకం: కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ బలోపేతం కోసం 14 దేశాల్లో పార్టీ అధ్యక్షులను నియమించినట్టు ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో కిశోర్ కత్తి (ఆస్ట్రేలియా), సుమన్రావు బల్మూరి (యూకే), వెంకట్రామన్ మెట్పల్లి (కెనడా), తానింకి కిశోర్ యాదవ్ (ఇటలీ), పింటూ ఘోష్ (మాల్టా), ప్రకాశ్ పొన్నకంటి (పోర్చుగల్), శేఖర్ గౌడ్ ఆరె (యూఏఈ), మార్క ప్రమోద్ గౌడ్ (కువైట్), బెమ్మడి మహేందర్ రెడ్డి (జింబాబ్వే), శేఖర్ చిలువూరి (ఖతార్), సందీప్ రెడ్డి ఐరెడ్డి (ఫిన్లాండ్), ప్రసాద్రావు బిక్కినేని (నార్వే), మొజ్జం అలీ ఇఫ్తేకర్ (సౌదీ అరేబియా), జయంత్ రెడ్డి మెట్టు (ఐర్లాండ్) వీరితోపాటు మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్ను నియమించినట్టు పేర్కొన్నారు. -
కేసు నుంచి తప్పించండి 'ఎంతైనా ఇస్తాం'!
సాక్షి, హైదరాబాద్: జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ యాక్సిడెంట్ చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసు నుంచి తప్పిస్తే ఎంత పెద్ద మొత్తమైనా ఇస్తామని పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. మాదాపూర్ ఠాణాలో ఓ ఉన్నతాధికారి, లింగమనేని కుటుంబం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో భారీ మొత్తంలో సెటిల్మెంట్ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈనెల 16న హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ వద్ద లింగమనేని సంజూష్ తన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కారులో అతివేగంగా దూసుకొచ్చి రోడ్డు దాటుతున్న లైఫ్స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతీ ముఖిని ఢీకొట్టడంతో ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసులు ఐదు రోజులపాటు ఈ రోడ్డు ప్రమాదం విషయాన్ని బయటికి పొక్కనివ్వకుండా గోప్యంగా ఉంచారు. ఈ సమయంలో మాదాపూర్ పోలీసు స్టేషన్లోని ఓ ఉన్నతాధికారి, పలువురు కింది స్థాయి సిబ్బందితో నిందితుడి కుటుంబ సభ్యులు సయోధ్య కుదుర్చుకున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇందులో భాగంగానే నిందితుడు సంజూష్ స్థానంలో మరొక ప్రైవేట్ డ్రైవర్ను పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పటికే ఘటనాస్థలిలో స్థానికులు ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఈనెల 21న మీడియాకు లీకులు ఇచ్చారు. అందుకే అతివేగం, నిర్లక్ష్యంగా కారు నడిపి రోడ్డు దాటుతున్న పాదచారి భారతీ మృతికి కారణమైన తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో కూడా పోలీసులు తూతూమంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. నిందితుడు సంజూష్ను వెంటనే అరెస్ట్ చేయకుండా, నోటీసులతో సరిపెట్టేశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. కేవలం బీఎన్ఎస్ 106(1) కింద అనుకూల సెక్షన్ నమోదు చేశారు. కారుతో ఢీకొట్టి మరణానికి కారణమైన కేసులో మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసు బాస్ సీరియస్ ఆర్ధిక, రాజకీయ పలుకుబడి ఉన్న లింగమనేని రమేష్ కుమారుడు కావడంతోనే సంజూష్పై అనుకూల సెక్షన్లు నమోదు చేశారంటూ పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని రాష్ట్ర పోలీసు బాస్ సీరియస్గా తీసుకున్నారు. శనివారం మాదాపూర్ పీఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ), దర్యాప్తు అధికారి ఎస్ఐను కార్యాలయానికి పిలిపించుకొని కేసు నమోదు, దర్యాప్తు తీరు తదితరాలపై సమగ్ర వివరాలను సేకరించినట్లు తెలిసింది. కారు వేగం, తీవ్రమైన గాయాలతో భారతీ మృతి చెందిన తీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి సెక్షన్లు జోడించాలో తెలియదా? లేదా ఎవరి ఒత్తిడి, ప్రలోభాల వల్ల అనుకూల సెక్షన్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెట్టింపు వేగంతో ఢీ కొట్టి.. ఇప్పటికే జిల్లా రవాణా అధికారి (డీటీఓ) ఘటనాస్థలిని సందర్శించారు. నిందితుడు లింగమనేని సంజూష్ నడిపిన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ స్పోర్ట్స్ కారు (టీజీ09 జీ0666)ను స్వా«దీనం చేసుకొని వాహన తనిఖీని పూర్తి చేశారు. రోడ్డు దాటుతున్న భారతీని కారు ఎడమ వైపు బలంగా తాకడంతో ఆమెకు తల, శరీర భాగాలకు తీవ్రమైన గాయాలయ్యాయని, అలాగే కారు ఎడమ వైపు బాగా డ్యామేజ్ అయినట్లు గుర్తించారు. భారతీని ఢీకొట్టిన తర్వాత కారును పక్కన నిలిపి, ఆపేయడంతో కారు వేగం స్పీడోమీటర్లో నమోదు కాలేదు. అలాగే ఘటనాస్థలం వద్ద ఎలాంటి సీసీటీవీ కెమెరాలు గానీ స్పీడో మీటర్లు గానీ లేకపోవడంతో కారు వేగాన్ని అధికారులు అంచనా వేయలేకపోయారు. అయితే మృతిరాలి తలకు, శరీర భాగాలకు తగిలిన గాయాలను బట్టి కారు 80 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇనార్బిట్ మాల్ వంటి రద్దీగా ఉండే నగర రోడ్లపై కార్ల సగటు నిర్దేశిత వేగం 40 కి.మీ.గా ఉండాలి. కానీ, సంజూష్ హైఎండ్ స్పోర్ట్స్ కారుతో మిట్ట మధ్యాహ్నం, బిజీ రోడ్డులో రెట్టింపు వేగంతో కారు నడపడం తీవ్రమైన నేరం కిందకి వస్తుంది. కారు చెట్టు, డివైడర్ వంటి బలమైన వాటికి ఢీకొడితే కారులోని బెలూన్స్ తెరుచుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కొత్త సెక్షన్ల జోడింపు కారు నడిపిన లింగమనేని సంజూష్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ సమర్పించాలని పోలీసులను డీటీఓ కోరారు. సోమవారం చేతిరాతతో రాసిన సమగ్ర నివేదిక కాపీని దర్యాప్తు అధికారికి అప్పగిస్తామని సంబంధిత అధికారి ‘సాక్షి’కి తెలిపారు. అనంతరం మోటారు వాహన తనిఖీ (ఎంవీఐ) నివేదిక పరిశీలన తర్వాత సంజూష్పై కొత్త సెక్షన్లు జోడించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఘటన తీవ్రత దృష్ట్యా బీఎన్ఎస్తోపాటు మోటారు వాహన చట్టం కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పారు. సులువుగా బెయిల్ వచ్చేలా కేసు నిందితుడు సంజూష్పై మాదాపూర్ పోలీసులు కేవలం బీఎన్ఎస్ 106 (1) సెక్షన్ కింద మాత్రమే కేసు నమోదు చేశారు. అంటే అజాగ్రత్త లేదా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల జరిగిన సాధారణ ప్రమాదంగా దీన్ని పరిగణిస్తారు. ఇది పూర్తిగా బెయిలబుల్ నేరం. దీని కింద గరిష్టంగా ఐదేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్నప్పటికీ.. నిందితుడికి పోలీస్ స్టేషన్ నుంచి లేదా కోర్టుకు వెళ్లిన వెంటనే సులువుగా బెయిల్ లభిస్తుంది. అయితే హైస్పీడ్ కారును బిజీ పబ్లిక్ ఏరియాలో నడుపుతున్నప్పుడు దాని వల్ల ఎదుటివారి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్టు ఆధారాలు ఉంటే బీఎన్ఎస్ 105 సెక్షన్ను ఎఫ్ఐఆర్లో చేర్చాలి. ఈ సెక్షన్ కింద (మరణం సంభవించే అవకాశం ఉందని తెలిసి చేసిన చర్య అయితే..) పదేళ్ల వరకు జైలు, జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. మోటార్ వాహన చట్టం 184 సెక్షన్ చేర్చడం కూడా కీలకమే. ఈ సెక్షన్ ప్రకారం ప్రజలకు ప్రమాదకరంగా ఉండే వేగంతో లేదా డేంజరస్ డ్రైవింగ్గా పరిగణిస్తారు. కానీ ఈ సెక్షన్ను ఎఫ్ఐఆర్లో నమోదుచేయలేదు. అయితే ఎంవీఐ నివేదికతోపాటు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సంజూష్ రక్త నమూనా నివేదిక వచ్చాక అందులోని అంశాల ఆధారంగా నిందితుడు సంజూష్పై ఎంవీ యాక్ట్, బీఎన్ఎస్లోని కొత్త సెక్షన్లను జోడించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ’సాక్షి’కి తెలిపారు. -
మల్లికార్జున ఖర్గేను కలిసిన మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరింది. ఆదివా రం మధ్యాహ్నం ఆమె బెంగళూరుకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. దాదాపు 15 నిమిషాలపాటు ఇద్దరి భేటీ జరిగిందని సమాచారం. అయితే బెంగళూరుకు వెళ్లి ఖర్గేను కలిసిన విషయంలో మంత్రి సురేఖ గోప్యత పాటించడం.. సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకోనున్న ముందు రోజే ఆమె ఏఐసీసీ అధ్యక్షుడితో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అన్ని విషయాలపై వివరణ ఖర్గేను కలిసిన సందర్భంగా మంత్రి సురేఖ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై మాట్లాడినట్టు తెలిసింది. ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్గౌడ్లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం. బీజేపీ చీఫ్ రాంచందర్రావుకు తారసపడిన సురేఖ మంత్రి కొండా సురేఖ బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురూ పలకరించుకున్నారని, ఆ సమయంలోనే బెంగళూరు నుంచి వస్తున్నానని సురేఖ వెల్లడించారని సమాచారం. -
TG: ఆటో కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు సఫలం
హైదరాబాద్: ఆటో కార్మిక సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆటో కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో ఈ అర్థరాత్రి నుంచి తలపెట్టాలనుకున్న సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఆటో కార్మిక సంఘాలు ఆటోల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. దీనిలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో కార్మిక సంఘాలు తమ బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఫలితంగా ఆటో కార్మికులు యధావిధిగానే సేవలు అందించనున్నారు.భవనం కూలిన ఘటన.. ఇతర ప్రమాదకర భవనాల కూల్చివేతలు! -
అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి అరెస్టు
హైదరాబాద్: అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో కారుమూరిని ఈడీ అరెస్టు చేసింది. తప్పుడు కేసులో కారుమూరిని కూటమి ప్రభుత్వం ఇరికించిన క్రమంలో ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. దీనిపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీసీ నాయకుడిని తప్పుడు కేసులో ఇరికించారని మండిపడింది. లేని కేసును సృష్టించి కారుమూరి అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ విమర్శించింది. -
భవనం కూలిన ఘటన.. ఇతర ప్రమాదకర భవనాల కూల్చివేతలు!
హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్య నగర్కు జంబో మిషన్ చేరుకుంది. ప్రమాదకర భవనాలను కూల్చనున్న జంబో మిషన్ ద్వారా సిబ్బంది కూల్చివేస్తున్నారు. పక్క భవనాలకు ప్రమాదం జరగకుండా బాహుబలి మిషన్ వాడి, చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే పరిసరాల్లోని 5 భవనాలను అధికారులు ఖాళీ చేయించారు. భారీ యంత్రాలతో కూల్చివేత పనులు జరుగుతున్నాయి.కాగా, అంజయ్య నగర్లో 50 గజాల స్థలంలో ఆ ఏడంతస్తుల భవనాన్ని నిర్మించాలనుకున్నారు. కుప్పకూలిన ఈ భవనం శిథిలాలు దాని పక్కనే ఉన్న నివాస భవనాలపై పడ్డాయి. దీంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వారు మధ్యప్రదేశ్కు చెందిన కార్మికులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో ఇతర భవనాల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ప్రత్యేక పరికరాలతో శిథిలాలను తొలగించారు.అక్కడ ఏడంతస్తుల ఈ భవనాన్ని నిర్మిస్తున్న బిల్డర్ సాజిద్ ఖాన్ పరారీలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో అతడు నిర్మిస్తున్న భవనాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. చిన్న స్థలాల్లో అధిక అంతస్తులు నిర్మించి, వాటిని హాస్టళ్లుగా వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అంజయ్యనగర్లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు మరిన్ని ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రపంచం ముందు భారత్ తలెత్తుకు నిలబడేలా.. 4 నెలల్లో.. -
‘చిన్నారెడ్డి వివరణతో సంతృప్తి చెందలేదు’
హైదరాబాద్: తనపై చేసిన వ్యాఖ్యలకు గాను చిన్నారెడ్డి ఇచ్చిన వివరణతో తాను సంతృప్తి చెందలేదని వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి. స్పష్టం చేశారు. చిన్నారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రమశిక్షణ కమిటీకి ఆడియో, వీడియో సమర్పించినట్లు ఆయన తెలిపారు. మళ్లీ కమిటీ పిలిస్తే తన వర్షన్ చెబుతానన్నారు. నిజమైన కాంగ్రెస్ నాయకులంతా పార్టీ వెంటే ఉన్నారని, కాంగ్రెస్ నాయకుడిని అని చెప్పుకునే చిన్నారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో ఉంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలతో సాన్నిహిత్యం కాంగ్రెస్ ప్రయోజనాలకా.. వ్యక్తిగత ఆధిపత్యానికా? అంటూ ప్రశ్నించారు. ఇవీ చదవండి:కొండా సురేఖకు ఆలిండియా ఓబీసీ సంఘం మద్దతుకాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి సమాధానం ఇదే.. -
కొండా సురేఖకు ఆలిండియా ఓబీసీ సంఘం మద్దతు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ఆలిండియా ఓబీసీ సంఘం మద్దతు ప్రకటించింది కొండా సురేఖకు అండగా ఉంటామని స్పష్టం చేసింది. కొండా సురేఖ బీసీ మంత్రి కాబట్టే కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని ఓబీసీ సంఘం విమర్శించింది. కొండా సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా నోటీసులిచ్చారని మండిపడింది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, చిన్నారెడ్డిలు వ్యతిరేకంగా మాట్లాడినా నోటీసులు ఇవ్వలేదని, అదే కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన దానికి మాత్రం నోటీసులిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి కొండా సురేఖకు అన్యాయం జరిగితే మాత్రం రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించింది. కాంగ్రెస్లో కొందరు చెంచాలున్నారని, అందుకే ఈ తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని దుయ్యబట్టింది. కొండా సురేఖ రెండో లేఖపై సమీక్షిస్తాంకావాలనే కొందరు తనను టార్గెట్ చేశరని, కుమార్తె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా కావాలనే కొంతమంది నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ మరో లేఖ రాసింది. దీనిపై క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందిస్తూ.. కొండా సురేఖ రెండో లేఖపై సమీక్షిస్తామన్నారు. తెరవెనుక ఎవరున్నారనేది చెప్పాల్సిన అవసరం లేదని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదీ చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్పై టీపీసీసీ చీఫ్ రియాక్షన్కొండా సురేఖ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. చర్యలకు కాంగ్రెస్ సిద్ధం -
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి.. ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని సుమంత్పై ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుమంత్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.మేడ్చల్ మల్కాజగిరి జిల్లా మేడిపల్లిలో సుమంత్పై కేసు నమోదు చేశారు పోలీసులు. రాడ్లుతో దాడి చేసినట్లు వ్యాపారి గొంగడి హరికృష్ణ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. సుమంత్పై 109 సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది.అయితే మేడిపల్లిలో పీఎస్లో జీరో ఎఫ్ఐఆర్(నేరం ఎక్కడ జరిగినా, ఏ ప్రాంతానికి చెందినదైనా సరే... బాధితులు తమకు దగ్గరలోని ఏ పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవడం) నమోదు చేయడంతో ఇప్పుడు ఆ కేసు జూబ్లీహిల్స్కు బదిలీ అయ్యింది. సుమంత్తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. -
గచ్చిబౌలి ఘటన.. బిల్డింగ్ యజమాని సాజిద్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో బిల్డింగ్ యజమాని సాజిద్ ఖాన్ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన కార్మికులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అన్న అనుమానంతో రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి.మరోవైపు.. సాజిద్ నిర్మించిన ఇతర భవనాల వివరాలను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అంజయ్యనగర్లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు మరిన్ని ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.50 గజాల్లో 7+1 నిర్మాణంఈ ఘటనలో ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశం భవనం నిర్మాణం. కేవలం 50 గజాల స్థలంలో ఏడంతస్తులతో పాటు పెంట్హౌస్ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. భవనం నాలాను ఆనుకుని నిర్మించినట్లు, సరైన సెట్బ్యాక్లు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. భవనానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి లేదని అధికారుల నుంచి సమాచారం. ఇంత చిన్న స్థలంలో ఇంత భారీ నిర్మాణం ఎలా కొనసాగిందన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నప్పటికీ అధికారులు ఎందుకు అడ్డుకోలేకపోయారన్న అంశంపైనా విచారణ జరుగుతోంది. -
గచ్చిబౌలి ఘటనలో అధికారి సస్పెండ్.. హైడ్రా ఫుల్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిన ఈ భవనం శిథిలాలు పక్కనే ఉన్న నివాస భవనాలపై పడటంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన కార్మికులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అన్న అనుమానంతో రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రత్యేక పరికరాలతో శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.మరోవైపు ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. మాదాపూర్ సర్కిల్-50లో TPBOగా పనిచేస్తున్న సంతోష్ కుమార్పై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ప్రాణనష్టం జరిగినట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయ్యే వరకు సంతోష్ కుమార్ సస్పెన్షన్లో కొనసాగనున్నారు. సస్పెన్షన్ కాలంలో స్థానిక హెడ్క్వార్టర్స్లోనే ఉండాలని, అనుమతి లేకుండా హెడ్క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ఆదేశించినట్లు సమాచారం.బిల్డర్ సాజిద్ ఖాన్ పరారీఈ భవనాన్ని నిర్మిస్తున్న బిల్డర్ సాజిద్ ఖాన్ పరారీలో ఉన్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అంజయ్యనగర్లో సాజిద్ నిర్మిస్తున్న భవనాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు. చిన్న స్థలాల్లో అధిక అంతస్తులు నిర్మించి వాటిని హాస్టళ్లుగా వినియోగిస్తున్నారన్న ఆరోపణలపైనా అధికారులు దృష్టి సారించారు. సాజిద్ నిర్మించిన ఇతర భవనాల వివరాలను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. అంజయ్యనగర్లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు మరిన్ని ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.50 గజాల్లో 7+1 నిర్మాణంఈ ఘటనలో ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశం భవనం నిర్మాణం. కేవలం 50 గజాల స్థలంలో ఏడంతస్తులతో పాటు పెంట్హౌస్ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. భవనం నాలాను ఆనుకుని నిర్మించినట్లు, సరైన సెట్బ్యాక్లు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. భవనానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి లేదని అధికారుల నుంచి సమాచారం. ఇంత చిన్న స్థలంలో ఇంత భారీ నిర్మాణం ఎలా కొనసాగిందన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నప్పటికీ అధికారులు ఎందుకు అడ్డుకోలేకపోయారన్న అంశంపైనా విచారణ జరుగుతోంది.అధికారుల పాత్రపైనా అనుమానాలుఒకవైపు బిల్డర్ పరారీలో ఉండగా.. మరోవైపు ఇంత చిన్న స్థలంలో భారీ నిర్మాణం ఎలా కొనసాగిందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. భవన నిర్మాణంపై గతంలో ఫిర్యాదులు వచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదన్న కోణంలోనూ అధికారులు దృష్టి సారిస్తున్నారు. బిల్డర్కు ఎవరి అండ ఉంది? అక్రమ నిర్మాణం ఇంతవరకు ఎలా సాగింది? నిబంధనలను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేశారు? అనే ప్రశ్నలకు విచారణలో సమాధానాలు రానున్నాయి. -
స్మార్ట్ఫోన్ కొనుగోలులో ఏఐ హవా!
ఏఐ ఫీచర్లు ఇప్పుడు 82% స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్, బ్యాటరీ జీవిత కాలం, కెమెరా సామర్థ్యం వంటివి వరుసగా నిలిచాయి. స్మార్ట్ ఫోన్ ఎంపికలో వినియోగదారులపై ప్రభావం చూపుతున్న అంశాలపై అధ్యయనాన్ని బెస్ట్ ఇన్టెక్ సర్వే పేరిట అమెజాన్ డాట్ ఇన్ నిర్వహించింది.నగరంతో పాటు పలు చిన్న, మధ్య తరహా పట్టణాల వ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాల ప్రకారం.. 87% మంది. పెర్ఫార్మెన్స్ వేగం 79% మంది బ్యాటరీ జీవిత కాలం 77% మంది నాణ్యతలను కోరుకుంటున్నారని ఏఐ రాకతో వినియోగదారుల ప్రాధాన్యతల్లో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అమెజాన్ ఇండియా, కంజ్యూమర్ ఎల్రక్టానిక్స్, డైరెక్టర్, జేబా ఖాన్ అభిప్రాయపడ్డారు. - సాక్షి, హైదరాబాద్రేటింగ్స్కే ప్రథమ ప్రాధాన్యం.. దిగువ మధ్యతరగతి, పేద జనాభా ఎక్కువగా ఉండే మన దేశంలో రూ.15వేల లోపు ధర కలిగిన ఫోన్లకు 7 శాతం మాత్రమే ఎంచుకుంటున్నారని అధ్యయనం వెల్లడించడం విశేషం. అత్యధిక డిమాండ్ (42 శాతం మంది) రూ.25 వేల నుంచి రూ.50 వేల మధ్య ధర కలిగిన ఫోన్లకు ఉందని, రూ.75 వేల లోపు ఖరీదు చేసే ఫోన్లను 15 శాతం మంది, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఫోన్లను 17 శాతం మంది ఎంచుకుంటున్నారు. రూ.15వేల నుంచి రూ.25 వేల మధ్య ధర కలిగిన ఫోన్లను 19 శాతం మంది ఓటేశారు.ఫోన్ వినియోగదారుల్లో 54శాతం మంది తమ ఫోన్లను రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నారు. వచ్చే మూణ్నెళ్లలో ఫోన్ మారుస్తామని 48 శాతం మంది చెప్పారు. ఫోన్ల ఎంపికలో డిస్కౌంట్ల కంటే రేటింగ్స్కే వీరు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కొనుగోలు చేసేటప్పుడు రేటింగ్స్కి మొదటి ప్రాధాన్యమిస్తామని 47శాతం మంది చెప్పగా, డిస్కౌంట్లు, బెస్ట్ డీల్స్కే ఓటేస్తామని 35శాతం మంది వెల్లడించారు. -
హైదరాబాద్ తాగునీటికి రూ.551 కోట్లతో మిషన్ మంజీరా
సాక్షి, హైదరాబాద్: మహా నగర భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల ఆధునికీకరణపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. దశాబ్దాల చరిత్రగల ‘మంజీరా నీటి సరఫరా పథకం (ఫేజ్–1, ఫేజ్–2) వ్యవస్థను సమూల పక్షాళన చేసేలా ‘మిషన్ మంజీరా’కు సిద్ధమైంది. దాదాపు 551.07 కోట్ల వ్యయంతో భారీ పునరుద్ధరణ పనులు చేపట్టనుంది. ఈ మేరకు శనివారం టెండర్ ప్రక్రియకు ఉపక్రమించింది.మంజీరా పైపులైన్ వ్యవస్థలో ఫేజ్–1 (1965), ఫేజ్–2 (1981) ద్వారా ప్రతిరోజూ మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. దశాబ్దాలు గడిచేసరికి 1,500 ఎంఎం డయా సామర్థ్యం కలిగిన ప్రధాన పైపులైన్లు శిథిలమై, నీటి పీడనాన్ని తట్టుకోలేక తరచూ పగిలి పోయి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. కలబ్గూర్ టు పటాన్చెరు ప్రధానంగా మంజీరా లీకేజీల సమస్యకు శాశ్వత పరిష్కారంగా కలబ్గూర్ డబ్ల్యూటీపీ నుంచి పటాన్చెరు పంపుహౌస్ వరకు కొత్తగా సుమారు 1,700 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు జలమండలి చర్యలు చేపట్టింది.అత్యధిక పీడనాన్ని తట్టుకునే సాంకేతికతతో నిర్మించే పైపు లైన్ల ద్వారా సరఫరా సమయంలో జరిగే నీటి నష్టాలు నివారించవచ్చని భావిస్తోంది. పాత పైపులైన్లకు సమాంతరంగా నూతన వ్యవస్థను అనుసంధానించి సాంకేతిక అంతరాయాలు తలెత్తకుండా నీటిని అందించవచ్చని జలమండలి అంచనా వేస్తోంది. కలబ్గూర్ వద్ద రోజువారీగా 232 ఎంఎల్డీ శుదీ్ధకరణ సామర్థ్యం కలిగిన అధునాతన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును నిర్మించనుంది. దీనికి అనుబంధంగా ముడి జలాల నిరంతర సేకరణకు సరికొత్త ‘ఇన్టేక్ వెల్’, పంపింగ్ స్టేషన్లు, పంపు హౌస్లను ఆధునికీకరించనుంది. తీరనున్న దాహార్తి సమస్య..మంజీరా (ఫేజ్–1, 2 దశ పునరుద్ధరణ పనులు రెండేళ్లలో పూర్తిలా టెండర్ ప్రక్రియకు జలమండలి ఉపక్రమించింది. ప్రాజెక్టు పూర్తయితే నగరంలోని 3, 6, 9, 15, 17, 18, 22, 24 తదితర డివిజన్లలోని తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా సనత్నగర్, ఖైరతాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, కార్వాన్, నాంపల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, ఆర్సీపురం, రాజేంద్రనగర్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు ఐటీ, పారిశ్రామిక ప్రాంతాలకు నిరంతర జల భద్రత చేకూరుతుంది. -
ఖమ్మం.. క్లీన్ అప్
రోడ్ల పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పాలన, పర్యవేక్షణ, పౌర సేవల్లో ఆధునిక సాంకేతికతను జోడిస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విపత్తులు, వరదల సమర్థ నిర్వహణకు కేఎంసీ సాంకేతికతను వాడుతోంది. వీధులను నిత్యం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ‘ఖమ్మం–క్లీన్ అప్’పేరుతో ఒక యాప్ రూపొందించారు. దేశంలోనే ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్ లేనివిధంగా తొలిసారి ఖమ్మంలోనే ఏఐ ఆధారిత యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) మాస్టర్ ప్లాన్ మ్యాప్ ఆధారంగా నగరంలోని ప్రతి వీధిని డిజిటలైజ్ చేశారు. ప్రధాన రహదారులతోపాటు అంతర్గత వీధులతో కలిపి మొత్తం 3,271 రోడ్లను యాప్లో పొందుపరిచారు. సాధారణంగా నగరంలో రోజు విడిచి రోజు రోడ్లను ఊడ్చి శుభ్రం చేస్తారు. కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ లోపం, జవాన్ల అలసత్వంతో చాలాచోట్ల వారాల తరబడి అపరిశుభ్రంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన యాప్ ఆధారంగా ఏ రోడ్డు ఎన్ని రోజులకు ఓసారి శుభ్రమవుతుందో కచ్చితంగా తెలుసుకోవచ్చు.జెమిని ఏఐతో పక్కా నిఘా..: జవాన్లు అప్లోడ్ చేసే ఫొటోలు నిజమైనవో కాదో నిర్ధారించేందుకు ఈ యాప్ను జెమిని ఏఐ సాంకేతికతతో అనుసంధానించారు. ఇది 70 శాతానికి పైగా కచ్చితత్వంతో ఫలితాలను విశ్లేషిస్తుంది. ఫొటోలో రోడ్డుపై ఏ మాత్రం చెత్త ఉన్నట్టు చూపించినా ఏఐ గుర్తిస్తుంది. ప్రస్తుతం పది మంది జవాన్లతో యాప్ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల 29 రోడ్ల ఫొటోలను అప్లోడ్ చేయగా, జెమిని ఏఐ ఎనిమిది రోడ్లు శుభ్రంగా ఉన్నాయని.. మరో నాలుగు రోడ్లపై పని జరుగుతున్నట్టు గుర్తించింది. మిగతా 17 ఫొటోల్లో రోడ్లు సరిగా శుభ్రం కాకపోవడంతో వాటిని తిరస్కరించింది. త్వరలోనే జవాన్లకు ప్రత్యేక లాగిన్ కేటాయించి యాప్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారు. మాస్టర్ ప్లాన్లో లేని రోడ్లను కూడా యాప్లో చేర్చాలని కమిషనర్ ఆదేశించారు.రంగుల ఆధారంగా గుర్తింపుఎరుపు రంగు: శుభ్రం చేయాల్సిన రోడ్లు ఈ రంగులో కనిపిస్తాయి.పసుపు రంగు: పని ప్రారంభించి జవాన్ ఫొటో అప్లోడ్ చేయగానే యాక్టివ్గా ఉన్నట్టు చూపుతుంది.ఆకుపచ్చ రంగు: రోడ్డు పూర్తిస్థాయిలో పరిశుభ్రమైన తర్వాత గ్రీన్ మార్క్లోకి మారుతుంది. (ఇది 48 గంటల పాటు అలాగే ఉండి ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్లీ ఎరుపు రంగులోకి మారుతుంది).నలుపు రంగు: రోడ్డు సరిగా శుభ్రం కాకపోయినా, చెత్త కనిపించినా యాప్ ఆ ఫొటోను తిరస్కరించి నలుపు రంగులోకి మారుస్తుంది. -
వీఎల్టీడీ ఉంటేనే రిజిస్ట్రేషన్
ఇక బస్సులు, మ్యాక్సీ క్యాబ్లు, క్యాబ్లు, తదితర రవాణా వాహనాలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (వీఎల్టీడీ) తప్పనిసరి. ప్రయాణికులు, స్కూల్ పిల్లల భద్రత దృష్ట్యా ప్రతీ వాహనానికి ఈ పరికరం ఉండాల్సిందే. రహదారి భద్రతా చట్టం మేరకు వీఎల్టీడీ పరికరాలు ఉన్న వాహనాలు మాత్రమే ఆర్టీఏలో నమోదవుతాయి. ఈ మేరకు రవాణాశాఖ ప్రవేశపెట్టిన ‘వాహన్ పోర్టల్’లో తగిన మార్పు చేసినట్లు సమాచారం. వీఎల్టీడీ ఏర్పాటుపై ఎలాంటి మినహాయింపులు లేవని, గడువు పొడిగించే అవకాశం కూడా లేదని కేంద్ర రవాణాశాఖ తాజాగా ఆదేశించినట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్తోపాటు తెలంగాణలోని రవాణా కార్యాలయాల్లో కొత్తగా నమోదయ్యే ప్రతీ వాహనానికి ఈ డివైజ్ను అమర్చవలసి ఉంటుంది. ఇప్పటికే అన్ని రకాల వ్యక్తిగత వాహనాలకు షోరూమ్లలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ సదుపాయం కొనసాగుతుండగా, కొద్దిరోజుల క్రితం బస్సులు, లారీలు, క్యాబ్లు, ఆటోలు వంటి అన్ని రవాణా వాహనాలకు షోరూమ్ రిజిస్ట్రేషన్లను ఖైరతాబాద్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో అన్ని ఆర్టీఏ కార్యాలయాలకూ విస్తరించనున్నారు. దీంతో వీఎల్టీడీ కలిగిన వాహనాలనే నమోదు చేసేలా వాహన్ పోర్టల్ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు రవాణా అధికారి ఒకరు తెలిపారు.భద్రత పటిష్టంఏఐఎస్–140 ప్రమాణాలతో రూపొందించిన వీఎల్టీడీ డివైజ్లను మాత్రమే వినియోగించేలా వాహన్ పోర్టల్లో మార్పులు చేశారు. ఈ డివైజ్లను విక్రయించే వారినీ కేంద్రం ఇప్పటికే గుర్తించి వివరాలను పోర్టల్లో నమోదు చేసింది. ఈ డివైజ్లలో ప్యానిక్ బటన్, ఎస్ఓఎస్ సిస్టమ్ ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, విపత్కరమైన ప్రతికూల పరిస్థితులు వంటివి ఎదురైనప్పుడు పోలీస్, రవాణా వర్గాలను అప్రమత్తం చేసేందుకు ఈ టెక్నాలజీ దోహదం చేస్తుంది. 24 గంటలపాటు వాహనాలను ట్రాకింగ్ చేసే వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. మహిళా ప్రయాణికులు తమ భద్రత కోసం ఎస్ఓఎస్ వంటి ప్యానిక్ బటన్ నొక్కి పోలీస్ సహాయాన్ని కోరవచ్చు. ఈ మేరకు రవాణా కమిషనర్, పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. ఈ డివైజ్ల నుంచి మినహాయింపును కోరుతూ రవాణా అధికారులు కొంతకాలం గడువును కోరారు. కానీ కేంద్రం అందుకు నిరాకరించి తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.వీఎల్టీడీ ఉంటేనే పర్మిట్లుఆలిండియా పర్మిట్లపై తిరిగే అన్ని బస్సులు, రవాణా వాహనాలకు వీఎల్టీడీ ఉంటేనే పర్మిట్లు లభిస్తాయి. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ పరికరాలు ఉండాల్సిందేనని అధికారులు తెలిపారు. వీఎల్టీడీ ఉన్న వాహనాలకు మాత్రమే వాహన్ పోర్టల్ నుంచి గుర్తింపు లభిస్తుంది. ఈ పరికరాలు లేకుండా అన్ని రకాలుగా ఫిట్నెస్ ఉన్నప్పటికీ రవాణాశాఖ నుంచి ధ్రువీకరణ పత్రాలు లభించవు. స్కూల్ బస్సుల్లోనూ ఇవి తప్పకుండా ఉండాలి. ‘ఇక నుంచి వీఎల్టీడీ ఉన్న కొత్త వాహనాలు మాత్రమే నమోదవుతాయి. అలాగే ఈ డివైజ్లు ఉంటేనే పాతవాటికి పర్మిట్లు లభిస్తాయి. ఇందుకనుగుణంగా త్వరలో మార్పులు అమల్లోకి రానున్నాయి’ అని చెప్పారు. -
జెన్ ఏఐ కోత.. చేయూత
సాక్షి, హైదరాబాద్: మనదేశంలోని వ్యవసాయేతర ఉద్యోగాల్లో 8–12 శాతం మేర జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సేవారంగం, విద్య, మీడియా, ఆర్థిక సేవలు, క్లరికల్ పనులపై అధిక ప్రభావం పడే అవకాశాలున్నాయి. శారీరక శ్రమతో కూడిన పనులు, నిర్మాణం వంటి రంగాలు ఏఐ ప్రభావం నుంచి సురక్షితంగా ఉంటాయని, రాబోయే దశాబ్దకాలంలో వార్షిక కార్మిక ఉత్పాదకత 0.4 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో 42–48 శాతం శ్రామిక శక్తికి ఇది సహాయకారిగా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా గోల్డ్మన్ సాక్స్ విడుదల చేసిన ’జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ)–భారత లేబర్ మార్కెట్పై ప్రభావం’ పై విడుదల చేసిన నివేదికలో ఆయా అంశాలను పొందుపరిచింది. ఈ నివేదిక ప్రకారం ఏఐ ప్రభావం అన్ని రంగాలపై ఒకేలా ఉండదు, ఇది చాలా అసమానంగా ఉంటుందని తేలింది. ఇది పూర్తిగా ఉపాధి, ఉద్యోగాలు పోవడానికి దారితీయదని, దీని ద్వారా పనుల పునరి్వభజన జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నివేదిక ప్రకారం, ఏఐ వల్ల దేశంలో భారీగా ఉద్యోగాల నష్టం జరగదు. మరింత నాణ్యమైన, సృజనాత్మకమైన పనులపై దృష్టి పెట్టేందుకు ఇది దోహదపడుతుంది.ఏఐ వల్ల లబ్ధి పొందే రంగాలు... ⇒ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ల బేసిక్ మోడలింగ్ పనులను ఏఐ వేగవంతం చేస్తుంది, తద్వారా వారు మరింత విలువైన విశ్లేషణలపై దృష్టి పెట్టవచ్చు ⇒ ఆరోగ్యం, విద్య... ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ , డేటా అనలిటిక్స్, నాలెడ్జ్–బేస్డ్ పనుల ద్వారా ఈ రంగాలు భారీగా లాభపడతాయి ⇒ మీడియా,ఎంటర్టైన్మెంట్... క్రియేటివ్ పనులలో ఉత్పాదకత పెరుగుతుందిఏఐ ప్రభావం లేని రంగాలు... ⇒ శారీరక శ్రమతో కూడిన రంగాలు... నిర్మాణం, వస్త్ర పరిశ్రమ, మాన్యుఫ్యాక్చరింగ్, ప్లాంట్ ఆపరేటర్ల ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదు. ఇక్కడ ఏఐ కంటే మానవ శ్రమకే డిమాండ్ పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ⇒ కొత్త ఉద్యోగాల సృష్టి... గత సాంకేతిక విప్లవాలలాగే, ఏఐ కూడా కాలక్రమేణా సరికొత్త ఉద్యోగ విభాగాలు (ఉదాహరణకు: ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ కంప్లయన్స్ అధికారులు) సృష్టిస్తుంది. నివేదికలోని ముఖ్యాంశాలు⇒ భారత్లోని వ్యవసాయేతర శ్రామిక శక్తి చేసే పనులలో 9% నుండి 17% పనులను జెనరేటివ్ ఏఐ సులభంగా ఆటోమేట్ చేయగలదు⇒ 8–12% ఉద్యోగాలు పూర్తిగా లేదా పాక్షికంగా ఏఐ ద్వారా భర్తీ అయ్యే ప్రమాదం ఉంది⇒ 42–48% ఉద్యోగాలకు ఏఐ ఒక అద్భుతమైన ఉత్పాదక సాధనంగా సహాయపడుతోంది⇒ మిగిలిన 40–50% శ్రామిక శక్తిపై ఏఐ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందిఅత్యధిక రిస్క్ ఉన్న ఉద్యోగాలు ⇒ ఆఫీసుల్లో జరిగే రొటీన్, డేటా ఎంట్రీ, అడ్మిని్రస్టేటివ్ సపోర్ట్, క్లరికల్ పనులకు అత్యధికంగా 3% రిస్క్ ఉంది ⇒ కోడింగ్, బేసిక్ కంప్లయన్స్ చెక్స్ వంటి పునరావృతమయ్యే పనుల స్థానంలో ఏఐ వచ్చే అవకాశం ఉంది ⇒ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్... బేసిక్ కస్టమర్ సర్వీస్ బాధ్యతలను ఏఐ చాట్బాట్లు భర్తీ చేయవచ్చు -
నోటీసు వచ్చిందా..?
సాక్షి, హైదరాబాద్: ‘ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026లో భాగంగా మనకూ నోటీసులు పంపుతారా?’ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మంది ఓటర్లకు ఆందోళన కలిగిస్తున్న ప్రశ్న ఇది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 2,64,87,213 మంది ఓటర్లుండగా వారిలో 92,87,577 ఓటర్ల అర్హతలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. వారిలో 32,36,659 మంది అన్మ్యాప్డ్ ఓటర్లందరికీ నోటీసులు జారీ చేయనుంది. వ్యత్యాసాలు ఉన్న 60,50,918 మంది ఓటర్లలో స్వల్ప వ్యత్యాసాలు కలిగిన వారిని ఉపేక్షించి మిగిలిన వారికి నోటీసులు పంపాలని స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ఈఆర్వో)ను ఆదేశించింది. అక్టోబర్ 15లోగా నోటీసుల జారీ, విచారణ ప్రక్రియకు గడువు ఉండటంతో ఓటర్లందరికీ దశలవారీగా నోటీసులు జారీ చేయాలని ఈఆర్వోలు నిర్ణయించారు. అయితే అన్మ్యాప్డ్ ఓటర్లు, వ్యత్యాసాలున్న ఓటర్ల జాబితాలను ఈసీ ప్రకటించకపోవడంతో ఈ విషయంలో ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే ఎవరి పేరిట అయినా ఈఆర్వోలు నోటీసులు సిద్ధం (జనరేట్) చేసి ఉంటే క్షణాల్లో తెలుసుకొనే వెసులుబాటు ఉంది. ఇందుకోసం ఈసీఐ వోటర్స్ వెబ్సైట్ https:// voters.eci.gov.in/ home/ hearingNoticeను తెరిచి అందులో సబ్మిట్ డాక్యుమెంట్ అగైన్స్ట్ నోటీస్ ఇష్యూడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్/ఎపిక్ కార్డు నంబర్ను ఎంటర్ చేస్తే ఫోన్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే మన పేరిట ఇప్పటివరకు నోటీసు జనరేట్ అయిందో లేదో తెలిసిపోనుంది. ఒకవేళ నోటీసు జనరేట్ కాకుంటే ‘ఈరోజు నాటికి నోటీసు జనరేట్ కాలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ చెక్ చేసుకోండి’అనే సందేశం స్క్రీన్పై కనిపిస్తుంది. ఒకవేళ నోటీసు జనరేట్ అయినట్లు తెలిస్తే ఈసీ నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు. దీనివల్ల ఓటర్లు బీఎల్ఓలు, ఈఆర్వోల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్తోపాటు తమ ప్రాంత బీఎల్ఓ/ఈఆర్వో/ఏఈఆర్వోకు సైతం నోటీసులకు రాతపూర్వక సమాధానాన్ని ఓటర్లు ఇవ్వొచ్చు. -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: భూభారతి పేరిట లక్షలాది ఎకరాల ప్రైవేటు భూములను 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చి దందా చేస్తున్న వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యంగా గత రెండు, మూడేళ్లలో 22ఏలో చేర్చిన, తొలగించిన భూములపై విచారణ జరగాలన్నారు. బాధితులకు మండలస్థాయి నుంచి హైకోర్టు వరకు బీజేపీ లీగల్ సెల్ ద్వారా పూర్తిగా ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. శనివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. భూభారతిని అడ్డుపెట్టుకొని 22ఏ నిషేధిత జాబితా పేరిట భూదోపిడీ, సెటిల్మెంట్ల దందా జరుగుతోందని కిషన్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగిన ధరణి కంటే ఇప్పుడు భూభారతి పేరుతో అంతకంటే తీవ్రమైన దోపిడీ జరుగుతోందని దుయ్యబట్టారు. పీనుగలు తినేవాడు పోయి ఏనుగులు తినేవాడు వచ్చినట్లుగా ప్రస్తుత పరిస్థితి తయారైందన్నారు. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సుమారు 4 లక్షల ఎకరాల భూములను రాత్రికి రాత్రే అక్రమంగా 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ, దేవాదాయ భూములు మాత్రమే ఉండాల్సిన 22ఏలోకి దశాబ్దాలుగా మున్సిపల్ అనుమతులు పొంది, పన్నులు కడుతూ నివాసముంటున్న ప్రైవేటు ఇళ్లు, స్థలాలను ఉద్దేశపూర్వకంగా చేర్చి సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ‘భూముల క్లియరెన్స్కు గతంలో 10 శాతం బీఆర్ఎస్ వాటా తీసుకుంటే ఇప్పుడు 50 శాతం వాటా తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఆర్.ఆర్. రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చారు. వంద ఎకరాల భూమి క్లియరెన్స్ కావాలంటే 50 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు’అని కిషన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో భూదందాలు, సెటిల్మెంట్లు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. ఉచిత బియ్యంపై రాష్ట్రం ప్రచారం మానకపోతే ప్రత్యామ్నాయం చూస్తాం... ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద దేశవ్యాప్తంగా కేంద్రమే 70 శాతానికిపైగా సబ్సిడీ భరిస్తూ ధాన్యం కొనుగోలు, రవాణా చేసి డీలర్ల కమీషన్ భరిస్తూ పేదలకు ఐదేసి కేజీల చొప్పున ఉచిత బియ్యం అందిస్తోందని కిషన్రెడ్డి తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ లోగోను ముద్రిస్తుంటే తెలంగాణలో మాత్రం ప్రధాని మోదీ పేరు, కేంద్ర ప్రభుత్వ లోగో లేకుండా కేవలం సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలే వేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమదిగా ప్రచారం చేసుకోవడం మానుకోకపోతే కేంద్రమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లబి్ధదారులకు బియ్యం పంపిణీ ఏర్పాట్లను పరిశీలిస్తుందని హెచ్చరించారు. -
కొండా సురేఖ బేషరతుగా రాజీనామా చేయాలి
సాక్షి, ఆదిలాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అటవీశాఖ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యలకు మంత్రే బాధ్యత వహించాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో శనివారం పర్యటించిన ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బేషరతుగా మంత్రి కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్రెడ్డి చేసిన కృషిని మరవద్దన్నారు. అంతకు ముందు ఉట్నూర్లోని బాలికల ఆశ్రమ పాఠశాలను లక్ష్మణ్ సందర్శించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు, జుంబా, ఏరోబిక్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మంత్రి చేతుల మీదుగా విద్యార్థినులకు యూనిఫాం, కిట్లను అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు భోజనం చేశారు. కేబీ కాంప్లెక్స్లో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సంతోష్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేవిప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, రాంచంద్రునాయక్ సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ విప్లు సీహెచ్ విజయరమణారావు, ఆది శ్రీనివాస్, రాంచంద్రునాయక్ డిమాండ్ చేశారు. రాష్రా ్టన్ని గాడిలో పెట్టేందుకు రోజుకు 18 గంటలు శ్రమిస్తోన్న సీఎం రేవంత్రెడ్డికి తాము అండగా ఉంటామన్నారు. శని వారం సీఎల్పీ మీడియా హాల్లో ఎమ్మెల్యేలు రాజ్ఠాకూర్, నవీన్ యాదవ్ తో కలిసి విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడుతూ కొండా సుస్మిత అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యు రాలే కాదని, ఆమె చేసిన వ్యాఖ్యలకు తల్లిగా సురేఖ బాధ్యత తీసుకోవాల్సిందని అభిప్రా యప డ్డారు. సురేఖ క్షమాపణలు చెప్పాల్సిందని, అలా చెప్పకపోవడం, కనీసం ఖండించక పోవడం దారుణమన్నారు. విజయ రమణా రావు మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి కొందరు ఇష్టారాజ్యాంగా మాట్లాడు తున్నా రని, పదవులు అనుభవిస్తూనే ప్రభు త్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిప డ్డారు. కుటుంబ సభ్యురాలు అసభ్యంగా మా ట్లాడితే ఖండించకపోగా పరోక్షంగా మద్ద తిచ్చేలా సురేఖ తీరు ఉందని రాంచంద్రు నాయక్ ఆరోపించారు. ఆమె నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే బాగుంటుందన్నారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎంపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్ఠాకూర్, నవీన్ యాదవ్ డిమాండ్ చేశారు. -
ఊడిన కుట్లు.. కొలతల పాట్లు
చేతులు పైకెత్తి చిరిగిన చొక్కాను చూపుతున్న ఈ విద్యార్థి పేరు బోడ సందీప్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వేపకుంట్ల పాఠశాల విద్యార్థులకు ఇటీవల పంపిణీ చేసిన యూనిఫారాల్లో అతనికి ఇలా చిరిగిన చొక్కా అందింది. ఇంకా నిక్కర్ ఇవ్వలేదు.కుట్లు ఊడిపోయి.. కొందరికి వదులుగా, మరికొందరికి బిగుతుగా కనిపిస్తున్న ఈ దుస్తులూ స్కూల్ యూనిఫారాలే. మిర్యాలగూడలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వీటిని పంపిణీ చేశారు. ఎగుడుదిగుడు సైజులకు తోడు అతికినట్టు.. పెద్ద సైజు జేబులతో ఉన్న ఈ దుస్తులను వేసుకోబుద్ధి కావడం లేదంటూ విద్యార్థులు వాపోతున్నారు.సరిపోని సైజులతో ఉన్న చొక్కాలు, పొడుగ్గా ఉన్న చెడ్డీలతో కూడిన ఈ యూనిఫారాలను జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అందించారు. వాటిని ఎలా తొడుక్కోవాలని విద్యార్థులు వాపోతున్నారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించాల్సిన యూనిఫారాలు ఈ ఏడాది తీవ్ర గందరగోళానికి దారితీశాయి. పాఠశాలలు తెరిచి రెండు నెలలు గడుస్తున్నా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ దుస్తులు అందలేదు. మరికొన్ని జిల్లాల్లో అరకొరగా మాత్రమే పంపిణీ చేశారు. అక్కడా రెండు జతలు ఇవ్వాల్సి ఉండగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కో జత మాత్రమే అందాయి. యూనిఫారం అందుకున్నవారికి కూడా కొలతలు సరిగ్గా లేకపోవడం, కుట్లు ఊడిపోవడం, వస్త్రం నాణ్యతగా లేకపోవడంతో ‘ఇవేం యూనిఫారాలు?’అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 28,038 ప్రభుత్వ పాఠశాలలు, విద్యాశాఖ గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, సంక్షేమ గురుకులాల్లో సుమారు 27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఏడాదికి రెండు జతల యూనిఫారాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. అదికూడా కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఇస్తామని, బ్రాండెడ్ దుస్తులు అందించేందుకు రూ. 678.78 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించింది. ప్రతీ విద్యార్థికి ఏడాదికి రెండు జతల యూనిఫారాలు, దుప్పట్లు, బెడ్షిట్లు ఇవ్వాలంటే 2.97 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం. గతంలో ఈ వ్రస్తాన్ని స్థానిక చేనేత కారి్మకుల సహకార సంఘం నుంచి కొనుగోలు చేసేవారు. కానీ ఈసారి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ఎక్కువ భాగం అప్పగించింది. సహకార సంఘానికి మాత్రం 30 శాతం వస్త్రం కొనుగోలుకు మాత్రమే ఆర్డర్ ఇచ్చింది. దీనికి తోడు అడ్వాన్స్ చెల్లింపులోనూ జాప్యం జరిగినట్టు కాంట్రాక్టు సంస్థలు చెబుతున్నాయి. సహకార సంఘాలకు ముందస్తుగా చెల్లించకపోయినా వస్త్రం మాత్రం ఇచ్చేవి. వాస్తవానికి యూనిఫాంకు 56 లక్షల మీటర్ల వస్త్రం అవసరం. కార్పొరేట్ స్కూళ్ల తరహాలో ఉండాలని కార్పొరేట్ కంపెనీలను ఎంచుకుంటే వస్త్రం ఇవ్వడానికే ఆలస్యమైంది. యూనిఫారాల పంపిణీని ఆగస్టు 15 నాటికి పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. యూనిఫారాలు అందిన చోట్ల విద్యార్థులకు మరో సమస్య ఎదురవుతోంది. కొలతలు సరిగ్గా లేక కొందరికి పెద్ద సైజులు, మరికొందరికి చిన్న సైజులు అందాయి. నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని పాఠశాలల్లో పొడవైన అంగీలు, చిన్న చెడ్డీలు, సరిగ్గా లేని ప్యాంట్లతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు కొత్త యూనిఫారం ఉపయోగపడక పాత దుస్తులతోనే పాఠశాలకు వస్తున్నారు. ఆడితే చిరిగే.. ఉతికితే వెలిసే.. యూనిఫారాలు అందకపోవడం ఒక సమస్య అయితే.. ఇచ్చిన వ్రస్తాల నాణ్యతపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలుచటి వస్త్రం వాడటంతో విద్యార్థులు ఆడుకునే సమయంలోనే దుస్తులు చిరిగిపోతున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. రెండుసార్లు ఉతికిన తర్వాత రంగు వెలిసిపోతోందని అంటున్నారు. కొన్నిచోట్ల షర్ట్ భుజాల వద్ద కుట్లు ఊడిపోవడం, గుండీలు ఊడిపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. వ్రస్తాన్ని స్థానిక స్వయం సహాయక సంఘాలకు కుట్టేందుకు ఇచ్చారు. ఆలస్యం కావడంతో త్వరగా కుట్టాలని వారిపై విపరీతమైన ఒత్తిడి చేసినట్టు తెలిసింది. దీంతో మిషన్ కటింగ్ ఇష్టానుసారం జరిగినట్టు తెలుస్తోంది. యూనిఫారాలు కుట్టేప్పుడు కూడా నాణ్యమైన దారం, గుండీలు వాడలేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో భుజాల దగ్గర దారం ఊడిపోయి, పగిలిపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. యూనిఫారాల సరఫరా, కుట్టుపని, పంపిణీ ప్రక్రియలో ప్రతి దశలో నాణ్యతను పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ వీటిపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్యలు వచ్చాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే వస్త్రం నాణ్యత, కొలతలపై పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించిన తర్వాతే కుట్టుపని ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో మిగిలిన విద్యార్థులకు యూనిఫారాల పంపిణీ మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నాణ్యత లోపాల ఫిర్యాదులపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ప్రయత్నించగా ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదు.జిల్లాల్లో ఇదీ పరిస్థితి..⇒ నల్లగొండ జిల్లాలోని 1,045 పాఠశాలల్లో 51,719 మంది విద్యార్థులు ఉండగా 30,432 మంది విద్యార్థులకే ఒక్కో జత చొప్పున యూనిఫారాలు ఇచ్చారు. ⇒ సూర్యాపేట జిల్లాలోని 950 పాఠశాలల్లో 50 వేల మంది విద్యార్థులకుగాను 21 వేల మందికే ఒక్కో జత చొప్పున అందింది. ⇒ నారాయణపేట జిల్లాలో 469 ప్రభుత్వ పాఠశాలల్లో 54 వేల మంది విద్యార్థులుండగా.. 11 వేల మందికి మా త్రమే ఒక్కో జత చొప్పున యూనిఫారం అందింది. ⇒ మెదక్ జిల్లావ్యాప్తంగా 75,323 మంది విద్యార్థుల్లో ఇప్పటివరకు 14 వేల మందికే యూనిఫారాలు అందాయి. ⇒ సంగారెడ్డి జిల్లాలో 1.12 లక్షల మంది విద్యార్థులకుగాను 15,000 మందికే ఒక జత చొప్పున యూనిఫారాలు ఇచ్చారు. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలోని 679 స్కూళ్లలో 45,262 మంది విద్యార్థులు ఉండగా 44,212 మంది విద్యార్థులకే యూనిఫారం అందింది. ⇒ కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని పలు పాఠశాలలకు ఇప్పటివరకు యూనిఫారాలు అందలేదు. ఇటీవ లే వస్త్రం సరఫరా చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ⇒ మహబూబ్నగర్లో 65,515 మంది విద్యార్థుల కోసం 3.53 లక్షల మీటర్ల వస్త్రం వచ్చినా కుట్టుపని ప్రారంభం కాలేదు. ⇒ నిజామాబాద్లో 3.65 లక్షల మీటర్ల వస్త్రం కేటాయించినా కుట్టుపని పెండింగ్లో ఉంది. ⇒ ఖమ్మం జిల్లాలో విద్యార్థులకు 3,02,716 మీటర్ల క్లాత్ అవసరం కాగా.. ఇప్పటివరకు 2,74,928 మీటర్ల క్లాత్ మాత్రమే వచ్చింది. బాలురకు సంబంధించి నిక్కర్, బాలికల కోట్ క్లాత్ రాలేదు. ⇒ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొద్దిపాటి పాఠశాలలకు మాత్రమే యూనిఫారాలు అందగా.. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో కుట్టుపని పూర్తికాక పంపిణీ జరగలేదు. షూ, టై, బెల్టులు కూడా అందని పరిస్థితి ఉంది. -
ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించండి..
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలపై తెలంగాణ ఉద్యోగ జేఏసీ (టీఈజేఏసీ) రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులకు నోటీసులను సమర్పించింది. ఈనెల 27లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు, నిరసనలకు దిగుతామని ఇటీవల విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, జేఏసీ ప్రతినిధులు ఆందోళనలకు సంబంధించిన నోటీసులు సమర్పించారు. వాటి పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను కూడా అందులో ప్రస్తావించారు. ఆందోళనలపై తగ్గేదే లేదు... ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఈసారి వెనక్కు తగ్గేది లేదని టీఈజేఏసీ స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఉద్యోగులంతా ముక్తకంఠంతో ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో జేఏసీ సైతం వెనక్కు తగ్గొద్దని, ప్రభుత్వంతో చర్చలు జరిపేది లేదని, సమస్యల పరిష్కారం అయినప్పుడే నిరసనలకు బ్రేక్ పడుతుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ముందుగా నల్లబ్యాడ్జీలతో నిరసనలు, ఆ తర్వాత క్రమంగా ఆందోళనలను తీవ్రతరం చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా కాకుండా ఐక్యంగా ఉద్యమించాలని నిర్ణయించిన టీఈజేఏసీ... ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమాలు ఇలా... –ఈ నెల 27న అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక రోజు మహాధర్నా నిర్వహించనుంది. –ఈ నెల 27నుంచి పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించే వరకు ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కానున్నారు. –టీఈజేఏసీ జిల్లాల్లో పర్యటించనుంది. ఉద్యోగులు చేపట్టే ఆందోళనలకు సంబంధించిన అంశాలతో సన్నాహక సదస్సులు నిర్వహించనుంది. –సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించింది. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్తో సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. –సెప్టెంబర్ 10న ఉద్యోగుల చలో హైదరాబాద్ నిర్వహించనుంది. అనంతరం ఉద్యోగులతో హైదరాబాద్లో మహా ధర్నా నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది. డిమాండ్లు ఇవీ... –ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను సమర్థవంతంగా అమలు చేయాలి. –ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు, ఆరోగ్య కార్డుల వినియోగంలో ఇబ్బందులు లేకుండా చూడాలి. –పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని ఫిట్మెంట్ను ప్రకటించి అమలు చేయాలి. –ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 6 డీఏలను ఏకకాలంలో విడుదల చేయాలి. –ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం నెలవారీగా చెల్లిస్తున్న రూ.2వేల ప్యాకేజీని బకాయిలు పూర్తయ్యే వరకు ప్రతినెలా కొనసాగించాలి. –సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. –ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించాలి. –317 జీఓ బాధితులకు న్యాయం చేయాలి. 190 జీఓను విద్యాశాఖ, పోలీసుశాఖతో పాటు అన్ని శాఖల్లో అమలు చేయాలి. -
మన చదువులకు కేం'బ్రిడ్జ్'
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో లండన్లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం శనివారం ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యావేత్తలతో సమావేశమైంది. తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించింది. హైదరాబాద్లో విద్యా కార్యక్రమాలతోపాటు పరిశోధనల నిర్వహణ, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, స్టార్టప్ల అభివృద్ధికి సహకారం వంటి రంగాల్లో తెలంగాణ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కలిసి పనిచేసేందుకు ఒక ప్రత్యేక సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించాయి. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్లో భారత ప్రభుత్వం తరఫున సేవలందిస్తున్న మార్కెటింగ్ చైర్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, అదే సంస్థకు చెందిన కో–చైర్, ‘ఫ్రూగల్ ఏఐ’ సహ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ వెంకట శిరీష్ గండికోట తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న అవకాశాలపై వారు సానుకూలంగా స్పందించారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలకు హైదరాబాద్లో ఉన్న అవకాశాలను తెలంగాణ రైజింగ్ బృందం.. కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించింది. హైదరాబాద్ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంతో తెలంగాణ భాగస్వామ్యానికి ఈ చర్చలు కొత్త మార్గం చూపనున్నాయి. హైదరాబాద్ను అంతర్జాతీయ విద్య, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తెలంగాణ రైజింగ్ లక్ష్యానికి ఈ సమావేశం మరింత బలం చేకూర్చనుందని సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. అక్టోబర్లో రాష్ట్రానికి లివర్పూల్ బృందం... లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ రంగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్పూల్ సంస్థ ఆసక్తి చూపింది. లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగానికి చెందిన సుసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్, లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్కు చెందిన పలువురు ప్రతినిధులు లండన్లో సీఎం రేవంత్రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. లివర్పూల్తో భాగస్వామ్యాన్ని అధికారికంగా ఖరారు చేయడానికి ఆ సంస్థ ప్రతినిధి బృందం అక్టోబర్లో హైదరాబాద్ను సందర్శించనుంది. ఇంపీరియల్ కళాశాల ఆధ్వర్యంలో షార్ట్ కోర్సులు.. హైదరాబాద్ సహా తెలంగాణలో షార్ట్టర్మ్ కోర్సులు, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని లండన్లోని ప్రతిష్టాత్మక ఇంపీరియల్ కళాశాల అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్, స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అమాండా వోల్తుయిజెన్ తెలిపారు. పరిశోధన రంగంలో భాగస్వామ్యం, విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలపై కలిసి పనిచేసేందుకు ఆసక్తి ఉందని వెల్లడించారు. లండన్లోని ఇంపీరియల్ కళాశాలను సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు సందర్శించి అమాండా వోల్తుయిజెన్, దక్షిణాసియా, ఆస్ట్రాలాసియా ప్రాంతాల సీనియర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మేనేజర్ రొసాన్నా గిల్లెస్పీతో సమావేశమయ్యారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు విచ్చేయాలని ఇంపీరియల్ కళాశాల ప్రతినిధులను ఆహ్వానించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ (స్టెమ్), బిజినెస్ ఎడ్యుకేషన్ రంగాల్లో ఇంపీరియల్ కాలేజీ ప్రపంచంలోనే ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. -
ఏం చేస్తే.. ఏమవునో!
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా అటవీ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ కుటుంబమే కేంద్రంగా అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయం చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సృష్టించిన వ్యాఖ్యల కలకలం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో ఉంది. సురేఖను బర్తరఫ్ చేస్తారని, మంత్రి పదవి నుంచి తీసేస్తారని, ఇందుకు అధిష్టానంతో రేవంత్ సంప్రదింపులు జరుపుతున్నారని, లేదంటే ఆమెతో రాజీనామా చేయిస్తారని సీఎం వర్గం ప్రచారం చేస్తున్నా... అసలు ఏం చేయాలనే విషయంలో మాత్రం అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వం తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. బీసీ వర్గాలకు చెందిన మహిళా మంత్రి కావడం, ఇదే సమయంలో మరికొందరు ముఖ్య నేతలు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందోననే చర్చ జరుగుతోంది. రేవంత్ విదేశీ పర్యటనలో ఉండగా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చే నెల 2 వరకు అందుబాటులో ఉండరన్న ఢిల్లీ వర్గాల సమాచారం నేపథ్యంలో ఈ ఎపిసోడ్ మరికొన్ని రోజులు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం వర్గం అప్రమత్తం సీఎం రేవంత్రెడ్డి సన్నిహితులైన ఎమ్మెల్యేలు, నేతలు కొండా ఎపిసోడ్లో తమ వంతు పావులు కదుపుతున్నారు. రేవంత్ సన్నిహితుడైన ఎంపీ వేం నరేందర్రెడ్డి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కుటుంబ ఎపిసోడ్ను ఎలా ముగించాలన్న దానిపైనే ఎక్కువగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఆమెను తప్పించేలా అధిష్టానాన్ని ఒప్పించాలా లేదంటే ఆమెతో రాజీనామా చేయించాలా లేదా మరో మార్గంలో అంతర్గతంగా ఏదైనా సర్దుబాటు చేయాలా అనే కోణంలోనే ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే, రేవంత్ ఆదివారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్కు రానుండటంతో ఆయన వచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్లో ఎలాంటి సంకేతాలిస్తారన్నది కీలకంగా మారనుంది. ఆయన్ను కలిసి మాట్లాడతానని సురేఖ చెప్పిన నేపథ్యంలో ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చి కలుస్తారా లేదంటే అధిష్టానం పెద్దలతో మాట్లాడతారా? తనకు బహిరంగంగా మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యేలకు ఆయన ఏం చెప్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేవంత్కు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. సురేఖతో పాటు రాజగోపాల్రెడ్డి, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుపడుతున్నారు. కానీ, రేవంత్ కేబినెట్ సహచరులెవరూ ఇప్పటివరకు బహిరంగంగా ఈ అంశంపై మాట్లాడకపోవడం రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అన్నీ పరిశీలించాకే తుది నిర్ణయం: క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ శనివారం గాం«దీభవన్లో సమావేశమైంది. చైర్మన్ మల్లురవి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులు శ్యాంమోహన్ తదితరులు పాల్గొని కమిటీ ముందు పెండింగ్లో ఉన్న పలు అంశాలపై చర్చించారు. రేవంత్నుద్దేశించి సుస్మితా పటేల్ మాట్లాడిన వీడియోను పరిశీలించారు. వనపర్తి నియోజకవర్గం విషయంలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి మాట్లాడిన వీడియోలను కూడా పరి«శీలించారు. అనంతరం మల్లురవి మీడియాతో మాట్లాడుతూ.. తమ నోటీసుకు సురేఖ ఇచ్చిన సమాధానాన్ని, సుస్మిత మాట్లాడిన వీడియోను కమిటీ పరిశీలించిందని చెప్పారు. ‘ముఖ్యమంత్రిని ఒక మామూలు వ్యక్తి కంటే తక్కువగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఈ వీడియోలో కనపడుతోంది. సురేఖ ఇచ్చిన వివరణ చదివిన తర్వాత మరోమారు సమావేశమై పరిశీలించాం. ఎమ్మెల్యేలు కూడా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు ఇస్తామని చెప్పారు. కాబట్టి తుది నిర్ణయం తీసుకోకుండా, అందరి ఫిర్యాదులు స్వీకరించి వాటిపై కమిటీలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సీఎం గురించి ఎవరు మాట్లాడినా ఖండించాల్సిన బాధ్యత సురేఖపై ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఆమె మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది’అని వెల్లడించారు. వనపర్తి విషయంలో కూడా ఇద్దరు నేతలు మాట్లాడిన మాటలను కూడా పరిశీలించామన్నారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణకు, ఎమ్మెల్యే ఫిర్యాదుకు తేడా ఉందని, మరోమారు ఎమ్మెల్యేను పిలిచి వివరణ తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్లో జరిగిన పీఏసీ సమావేశం ఘటన గురించి కంది శ్రీనివాస్రెడ్డి వివరణ ఇచ్చారని, డీసీసీ అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎల్బీనగర్ నేత జక్కిడి ప్రభాకర్రెడ్డి సస్పెన్షన్ గురించి తప్పనిసరి పరిస్థితుల్లోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో వచ్చిన ఫిర్యాదులపై షోకాజ్ ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మాకు ఎవరిపై ప్రేమ ఉండదు... తమకు పార్టీ నేతలెవరిపై వ్యక్తిగతంగా ప్రేమ, వ్యతిరేకత ఉండవని మల్లురవి స్పష్టం చేశారు. ‘మేం తీసుకునే ప్రతి చర్య కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు దిశలోనే ఉంటుంది. పార్టీకి నష్టం జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ , కేబినెట్ హోదాలో ఉన్న చిన్నారెడ్డిలకు నోటీసులిచ్చాం. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రస్తావన ఎమ్మెల్యేల మాటల్లో వచ్చింది కానీ ఫిర్యాదు మా దగ్గరకు రాలేదు. రాజగోపాల్రెడ్డి మాట్లాడింది నాకు తెలియంది కాదు కానీ పద్ధతి ప్రకారం నాకు ఫిర్యాదు రాలేదు. సుమోటోగా తీసుకోవాలా వద్దా అన్నది పరిశీలిస్తున్నాం. ఎవరైనా సరే క్రమశిక్షణ కమిటీ దృష్టిలో వ్యక్తులు ముఖ్యం కాదు. పార్టీనే ముఖ్యం. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా పార్టీ వల్లనే. పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా ఎవరూ మాట్లాడకూడదు’అని ఆయన స్పష్టం చేశారు. మరో లేఖ రాసిన సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ శనివారం మరో లేఖ రాశారు. ‘క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకు నేను వివరణ ఇచ్చాను. అయినా కొందరు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు నన్ను, నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా అవమానించేలా మాట్లాడుతున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే నాపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, నాపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలి. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది’అని లేఖలో పేర్కొన్నారు. పార్టీ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సురేఖ కోరడం కొసమెరుపు. చిన్నారెడ్డి వివరణ వనపర్తి ఎమ్మెల్యే కారణంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న అంశాలను మాత్రమే తాను గోపాల్పేట సమావేశంలో ప్రస్తావించానే తప్ప ఎవరినీ కించపర్చలేదని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీకి నివేదించారు. కాంగ్రెస్ పార్టీ దేవాలయమని, నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గేలు తనకు దేవుళ్ల లాంటి వారని, తాను పార్టీని, పార్టీ నాయకులను ఎక్కడా విమర్శించలేదని పేర్కొన్నారు, ఎమ్మెల్యే ఒంటెత్తుపోకడలతో 40 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలు పడుతున్న బాధలనే ప్రస్తావించానని అన్నారు, తనకు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలని కోరారు. -
సంజూష్ పై ఎఫ్ఐఆర్ ‘ఖాళీ’!
సాక్షి, హైదరాబాద్: సెల్ఫోన్ చోరీకి గురైతేనే పోలీసులు నమోదు చేసే ఎఫ్ఐఆర్లో ఫిర్యాదుదారు, అనుమానితుల పేర్లు, అడ్రస్లు, ఘటనాస్థలి తదితర వివరాలు నమోదు చేసే పోలీసులు.. జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ పై నమోదైన హిట్ అండ్ రన్ కేసులో మాత్రం కేవలం నిందితుడి పేరుతోనే సరిపెట్టేశారు. మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఈ నెల 16న నిందితుడు సంజూష్ తన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కారులో అతివేగంగా దూసుకొచ్చి భారతి ముఖి (26) అనే యువతిని ఢీకొట్టడంతో ఆమె మృతిచెందడం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు సంజూష్ పై మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్లో కేవలం బీఎన్ఎస్ సెక్షన్ 106 (1) సెక్షన్ కింద మాత్రమే కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువతి మృతికి స్పష్టమైన ఆధారాలు ఉన్నా.. కారు నడిపిన సంజూష్ పూర్తి వివరాలు ఎఫ్ఐఆర్లో ఎక్కడా పేర్కొనలేదు. అదే ఎఫ్ఐఆర్లో ఫిర్యాదు చేసిన లైఫ్ స్టైల్ స్టోర్ మేనేజర్ పంజాల అశ్విన్ కుమార్, మృతురాలి వివరాలను మాత్రం ఇంటిపేరు, తండ్రి పేరు, పూర్తి చిరునామా, వయసు ఇలా అనేక వివరాలను నమోదు చేశారు. నిందితుడి తండ్రి జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు, వ్యాపారవేత్త లింగమనేని రమేష్ అని తెలిసినా రాజకీయ ఒత్తిళ్లతోనే ఎఫ్ఐఆర్లో ఆ వివరాలు నమోదు చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షి బదులు.. రోడ్డు ప్రమాద ఘటనకు ప్రత్యక్ష సాక్షి.. భారతి ముఖితో కలిసి రోడ్డు దాటుతున్న పూజ అశోక్ అలోనే అనే యువతి ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం వారిద్దరూ పనిచేసే లైఫ్స్టైల్ స్టోర్ మేనేజర్ పంజల అశ్విన్కుమార్ నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. తదుపరి దర్యాప్తును నీరుగార్చేందుకే పోలీసులు ఇలా వ్యవహరించారా అనే సందేహం కలుగుతోంది. చట్టపరమైన లొసుగుల ద్వారా నిందితుడిని కాపాడే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఎన్ఎస్ సెక్షన్ను 105 ఎందుకు పెట్టలేదు? ఈ కేసులో పోలీసుల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంజూష్ తేలికగా పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్పై వెళ్లేలా సెక్షన్లు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కేవలం అజాగ్రత్త లేదా నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంగా పేర్కొంటూ బీఎన్ఎస్ సెక్షన్ 106 (1) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీని కింద 5 ఏళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉన్నప్పటికీ.. నిందితుడికి పోలీస్ స్టేషన్ నుంచే లేదా కోర్టుకు వెళ్లిన వెంటనే సులువుగా బెయిల్ లభిస్తుంది. కానీ వాస్తవానికి సంజూష్ రద్దీగా ఉన్న ప్రాంతంలో అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపినందున బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఈ సెక్షన్ కింద (మరణం సంభవించే అవకాశం ఉందని తెలిసి చేసిన చర్య అయితే) పదేళ్ల వరకు జైలు, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాగే మోటార్ వెహికల్ యాక్ట్లోనిసెక్షన్ 184 (డేంజరస్ డ్రైవింగ్)ను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఆసరాగా నిలుస్తానని చెప్పి.. ‘మా కష్టాలు తీర్చేందుకు అండగా ఉంటానంది.. కానీ ఇంతలోనే మమ్మల్ని వదిలి వెళ్లిపోతుందనుకోలేదు’అంటూ లింగమనేని సంజూష్ కారుతో ఢీకొట్టడంతో మృతిచెందిన భారతిముఖి తల్లి ఆనందిని జాతీయ మీడియా ఎదుట కన్నీటిపర్యంతమైంది. ఒడిశాకు చెందిన భారతిముఖిది మధ్యతరగతి కుటుంబం. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఆమెకు బీటెక్ సీటు కూడా వచ్చింది. అయితే కోవిడ్ వ్యాప్తి వల్ల చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచి్చంది. అయినా అధైర్యపడకుండా కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలవాలని హైదరాబాద్ వచ్చి మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్లో ఉద్యోగంలో చేరింది. -
టెలికం, సైబర్ వివాదాల్లో సత్వర పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: టెలికం, ప్రసార రంగం, విమానాశ్రయ టారిఫ్లు, సైబర్ టెక్నాలజీ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో తలెత్తే సాంకేతిక, నియంత్రణ వివాదాలను సమర్థవంతంగా, సత్వరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ పేరొన్నారు. దీని కోసం ప్రత్యేక నైపుణ్యం కలిగిన వివాద పరిష్కార వ్యవస్థలు అవసరమని అభిప్రాయపడ్డారు. ‘విమానాశ్రయ టారిఫ్లు, టెలికం, బ్రాడ్కాస్టింగ్, సైబర్ రంగాల్లో వివాదాల పరిష్కారం’అనే అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. సాంకేతికంగా క్లిష్టమైన నియంత్రణ వివాదాలను పరిష్కరించడంలో ప్రత్యేక న్యాయ సంస్థల ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. 1997లో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), 2000లో టెలికం వివాదాల పరిష్కార, అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) ఏర్పాటు ఈ పరిణామంలో కీలక మైలురాళ్లని పేర్కొన్నారు. తొలుత టెలికం రంగానికే పరిమితమైన టీడీశాట్ పరిధి తర్వాత బ్రాడ్కాస్టింగ్, కేబుల్ సేవలు, విమానాశ్రయ టారిఫ్లకు సంబంధించిన వివాదాలకు కూడా విస్తరించిందని జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ తెలిపారు. ట్రిబ్యునళ్లు న్యాయ వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాదని, దానికి అనుబంధంగా పనిచేస్తూనే రాజ్యాంగపరమైన న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని పేర్కొన్నారు. సాంకేతికత, ఏఐ న్యాయ నిర్ణయ ప్రక్రియకు సాయంగా ఉండగలవని, అయితే న్యాయపరమైన తర్కం, జవాబుదారీతనం, మానవ పర్యవేక్షణకు అవి ప్రత్యామ్నాయం కాలేవని స్పష్టం చేశారు. రూ.5 కోట్ల వరకు సైబర్ వివాదాలు టీడీశాట్ చైర్మన్ జస్టిస్ డీఎన్ పటేల్ మా ట్లాడుతూ సివిల్ స్వభావమున్న సైబర్ వివాదాల్లో తొలుత నియమిత అడ్జుడికేటింగ్ అధికారి విచారణ చేపడతారని.. రూ.5 కోట్లలోపు పరిహారం కోరే క్లెయిమ్లను విచారించే అధికారం ఆయనకు ఉంటుందన్నారు. ఆ ఉత్తర్వులపై టీడీశాట్లో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. రూ.5 కోట్లకు మించిన క్లెయిమ్లను సివిల్ కోర్టులు విచారిస్తాయన్నారు. సైబర్ కేసుల్లో క్రిమినల్తోపాటు సివిల్ కేసును ఒకేసారి దాఖలు చేయొచ్చని సూచించారు. జస్టిస్ శామ్కోషి, ఏజీ ఎ.సుదర్శన్రెడ్డి, హెచ్సీఏఏ అధ్యక్షుడు ఎస్.సురేందర్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జస్టిస్ జీఎం మొహియుద్దీన్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ జనరల్ గోవర్ధన్రెడ్డి, టీజీఎల్ఎస్ఏ సభ్యకార్యదర్శి పంచాక్షరి, హెచ్సీఏఏ ఉపా ధ్యక్షుడు డీఎల్ పాండు పాల్గొన్నారు. -
ఎల్నినో ఉన్నా రెప్పపాటు కూడా కరెంట్ కోతల్లేవు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయబోతున్నాం. పరిశ్రమలు, వ్యవసాయం, సేవారంగం అభివృద్ధికి నిరంతర విద్యుత్ సరఫరా కీలకం. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 18 వేల మెగావాట్లకుపైగా పెరిగినప్పటికీ పక్కా ప్రణాళికలు, బలమైన ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలతో రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చూస్తున్నాం’అని ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డులో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పవర్ ఎగ్జిబిషన్–2026ను ఆయన ప్రారంభించారు. విద్యుత్ రంగానికి సంబంధించిన ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, వినియోగదారుల సేవలు, భద్రతా ప్రమాణాలు, వి ద్యుత్ సంస్థల విజయాలను ప్రతిబింబించే స్టాళ్లను ఆయన పరిశీలించారు. టీజీఎస్పీడీసీఎల్ మస్కట్ను ఆవిష్కరించడంతోపాటు సంస్థ విజయాలు, సేవలు, సంస్కరణలపై రూపొందించిన బ్రోచర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం కారణంగా హైడల్ విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గి అన్ని రంగాల విద్యుత్ వినియోగం రెట్టింపైనా సరఫరాలో రాజీపడటం లేదన్నారు.ఉద్యోగుల సమష్టి కృషి వల్లే నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమైందని చెప్పారు. 1912 టోల్ఫ్రీ సేవలు, పవర్ అంబులెన్స్ వ్యవస్థ, సాంకేతిక ఆధారిత సేవలు, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలతో అంతరాయాలు తగ్గాయని భట్టి వివరించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్, ట్రాన్స్కో సీఎండీ డి.కృష్ణ భాస్క ర్, డిస్కం డైరెక్టర్లు బి.శివాజీ, ఎన్.నర్సింహులు, చక్రపాణి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.సచివాలయంలో సోలార్ విద్యుదుత్పత్తి ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం ఉత్తర భాగంలో కార్ పార్కింగ్ స్థలంలో సోలార్ ప్యానెళ్లు అమర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తయి.. 90 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. దీంతో నెలవారీ బిల్లులో 16 శాతం ఆదా కానుందని అధికారులు చెబుతున్నారు. శనివారం సచివాలయంలో సోలార్ ప్యానెళ్లు, రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, వంతెనల నిర్మాణ పనులపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోలార్ నిర్మాణ నమూనాలను పరిశీలించారు. సచివాలయ భవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, భవనం ఎలివేషన్ దెబ్బతినకుండా మూడు వైపులా సోలార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇందుకు సంబంధించిన డిజైన్లను కూడా చూపించారు. రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న పలు హై లెవెల్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. -
బినామీల ముసుగు తొలగించేలా!
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల రూపాయల సొమ్ము పోగేసిన అవినీతి అధికారుల బినామీల ముసుగు తొలగించేలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన అధికారులపై ఇటీవల ఏసీబీ దాడులు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆదాయపన్నుశాఖ ఈ కేసులలో ఎంట్రీ ఇవ్వబోతోంది. భారీ మొత్తంలో ఆస్తులు పోగేసిన అవినీతి అధికారులపై నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల చిట్టాను ఏసీబీ అధికారులు ఐటీకి పంపినట్లు తెలిసింది. ప్రధానంగా రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన కీలక కేసులలో ఏసీబీ గుర్తించిన ఆస్తులు, లెక్కల్లో చూపని నగదు, బినామీల పేర్లతో ఉన్న ఆస్తులపై విచారణ చేయాలని ఐటీకి లేఖ రాసినట్లు ఏసీబీ అధికార వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఐటీకి సమాచారం ఇవ్వడంతో త్వరలోనే ఆదాయపన్నుశాఖలోని బినామీ ప్రొహిబిషన్ యూనిట్ అధికారులు చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది. వంద కోట్లు దాటిన కేసులన్నీ... భారీ మొత్తంలో అవినీతి ఆర్జనతో ఇటీవల ఏసీబీకి చిక్కిన అధికారుల జాబితా చూస్తే..రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణకు చెందిన అక్రమాస్తులు అధికారిక లెక్కల ప్రకారమే రూ.27.65 కోట్లు కాగా..బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఆస్తుల విలువ దాదాపు రూ.90 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక డీజీపీ కార్యాలయంలో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమారెడ్డిపై జూలై 2న 16 ప్రాంతాల్లో సోదాలు చేసి..విల్లాలు, ఫ్లాట్లు, కమర్షియల్ భవనాలు, పలు చోట్ల వ్యవసాయ భూములు, బంగారం, వెండి, నగదు కలిపి మొత్తం రూ.200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు గుర్తించారు. అదేవిధంగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావుపై నమోదు చేసిన డీఏ కేసులోనూ మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.150 కోట్ల ఆస్తులు గుర్తించారు. ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై నమోదైన ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సోదాల్లోనూ ఏసీబీ అధికారులు బహిరంగ మార్కెట్లో సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. ఈ మొత్తం కేసులలో చాలా వరకు ఆస్తులు అవినీతి అధికారులు తమ కుటుంబ సభ్యులు, సమీప బంధులు, స్నేహితులు, నమ్మకస్తులు ఇలా పలువురిని బినామీలుగా పెట్టుకుని వారి పేర్లపై నమోదు చేసి ఆ పత్రాలను తమ వద్ద భద్రపర్చుకున్నారు. ఆస్తుల కొనుగోలుపై ఆరా.. ఏసీబీ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఆయా ఆస్తుల కొనుగోలుకు వినియోగించిన సొమ్ముపై ఆరా తీశారు. ఆ లెక్కల్లో భారీ వ్యత్యాసాలు ఉండడంతో ఏసీబీ అధికారులు ఈ వివరాలను ఐటీకి పంపారు. వీటిపై ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీస్ ట్రాన్సాక్షన్ యాక్ట్ ప్రకారం ఆస్తుల లెక్కలపై ఐటీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం. బినామీలుగా పేర్కొన్న వారికి ఆస్తులు ఎలా సంక్రమించాయి? అనే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఐటీకి అందించాలి. ఇందులో భాగంగా ఏసీబీ సోదాల్లో స్వాదీనం చేసుకున్న నగదు, బంగారం, ఆస్తి పత్రాలు, బ్యాంక్ ఖాతాలు సహా బినామీ ఆస్తులకు సంబంధించి ఐటీ అధికారులు ముందస్తుగా నోటీసులు జారీ చేయనున్నారు. ఆ తర్వాత విచారణలో నిందితుడు అందించే ఆధారాలు, వివరణ అసంతృప్తికరంగా ఉన్న పక్షంలో అతనిపై బినామీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. బినామీదారుగా ఉన్న వారు సైతం తమ పేరిట ఉన్న ఆస్తుల లెక్కలు చెప్పకపోతే కేసులో కీలక నిందితుడితో పాటు బినామీదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. బినామీగా నేరం రుజువైతే సంబంధిత వ్యక్తికి ఏడేండ్ల పాటు శిక్షతో పాటు ఆయా బినామీ ఆస్తులపై మార్కెట్ విలువ ప్రకారం 25 శాతం జరిమానా విధించే అవకాశాలుంటాయని అధికారులు తెలిపారు. -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్లో శనివారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. వాతావరణశాఖ తెలిపిన విధంగా ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. -
'టాక్సిక్' హైదరాబాద్ ఈవెంట్లో ప్రమాదం
యష్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'టాక్సిక్'. వచ్చే బుధవారం (ఆగస్టు 26) పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు రిలీజ్ చేశారు. తాజాగా హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో యష్ మాట్లాడుతుండగా భారీ సౌండ్ బాక్స్ సెట్ కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరమ్మాయిలకి గాయలవగా.. వీళ్లలో ఒకామె స్పృహ కోల్పోయింది. వీళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.గ్యాంగ్స్టర్ డ్రామాగా తీసిన 'టాక్సిక్' సినిమాలో తండ్రికొడుకులుగా యష్ ద్విపాత్రాభినయం చేశాడు. నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి హీరోయిన్లు. రవి బస్రూర్ సంగీతమందించాడు. గీతూ మోహన్ దాస్ దర్శకురాలు. -
వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు: కొండా సురేఖ లేఖ
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. తనను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు అవమానకరంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారని, వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిటీ ఛైర్మన్ మల్లు రవికి విజ్ఞప్తి చేశారు.టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినప్పటికీ, తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తుండటంపై కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అన్నారు. అటు విచారణ.. ఇటు విమర్శలు పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే.. తనపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని సురేఖ కోరారు. “పార్టీ క్రమశిక్షణపై నాకు పూర్తి గౌరవం ఉంది. అదే సమయంలో, ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది. నా రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకు రావడం వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా పార్టీ నాయకత్వం పరిశీలించాలి” అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్రభుత్వాసుపత్రిలో ఆ అమ్మాయి డ్యాన్సు.. ఎమ్మెల్యేపై విమర్శలుకాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉన్న పార్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ కోరారు. -
వావ్.. సున్నం చెరువు!
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు బోరబండ బస్తీ.. మరో వైపు ఐటీ కారిడార్... మధ్యలోని గుట్టల బేగంపేటలో మురికి కూపంగా ఉన్న సున్నం చెరువును హైడ్రా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఆక్రమణలతో 14.20 ఎకరాలకు కుంచించుకుపోగా... ఇప్పుడు 30.5 ఎకరాలకు విస్తరించింది. ఎక్కడా నిర్మాణాలు, నివాసాల జోలికి వెళ్లకుండా మూడు మీటర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించింది. త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో గుడిసెలు వేసుకుని ఉన్నవారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెరువు చుట్టూ ఆకర్షణలు సున్నం చెరువు (Sunnam Cheruvu) చుట్టూ విశాలమైన బండ్పై పాత్వే సిద్ధమైంది. కూర్చునేందుకు రాతి కుర్చీలు అందుబాటులోకి తెస్తోంది. పిల్లలకు ఆట స్థలాలు, పచ్చిక మైదానం, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తోంది. చెరువు చుట్టూ ఔషధ, సుగంధ మొక్కలు, నీడనిచ్చే చెట్లను నాటి పచ్చదనాన్ని పెంచుతోంది. బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకు బేబీ పాండ్, చెరువులో బోటింగ్ సైతం అందుబాటులోకి రానుంది. చెరువు గట్టు చుట్టూ సోలార్ లైట్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. చెరువుకు ఆనుకుని ఉన్న కొండనూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. చదవండి: లింగమనేని సంజూష్ కేసు.. భారతి తల్లి ఆవేదనఆకర్షణీయంగా ఆంజనేయుని గుడి... చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో చెత్త, చెదారం.. దుర్గంధ భరిత వాతావరణంలో ఉన్న ఆంజనేయ గుడిని కూడా హైడ్రా అభివృద్ధి చేస్తోంది. ఆలయ కమిటీ ప్రతినిధులతో పలుమార్లు హైడ్రా సమావేశమైంది. గోపురం, ఆలయానికి వెళ్లే దారితో పాటు.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి పాత్ వే నిర్మించింది. గుడి ముందు వాటర్ ఫౌంటైన్లో ఆంజనేయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. -
‘రాహుల్ గాంధీ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారు’
హైదరాబాద్: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సెటైర్లు వేశారు. రాహుల్ గాఃంధీ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారంటూ చురకలంటిచారు. టీ షర్టులు వేసుకున్నంత మాత్రానా రాహుల్ గాంధీ జెన్ జీ కాలేరంటూ ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని భూ భారతి నవ్వులుపాలైందని మండిపడ్డారు. పర్మిషన్ తీసుకుని ట్యాక్స్ కడుతున్న ఆస్తులను 22-ఏలో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందన్నారు.భూభారతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. పేద ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలనుకుంటే ప్రత్యేకంగా వేరే పథకం కింద ఇవ్వాలని, అంతే కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం ఇవ్వడానికి రాష్ట్రానికి ఇష్టం లేకపోతే... ప్రత్యేకంగా తామే ఇస్తామన్నారు. -
కొండా సురేఖ ఎపిసోడ్.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సుస్మిత వ్యాఖ్యలను పరిశీలించాం. సీఎం రేవంత్పై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోసారి క్రమశిక్షణ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై కూడా చర్చించాం. చిన్నారెడ్డి అంశంపై కూడా మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.‘‘మూడు గంటల పాటు ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి వ్యవహారం పై చర్చించాం. సుస్మిత మాట్లాడిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాం. కొండా సురేఖ వివరణ అందింది. కొందరు ఎమ్మెల్యేలు ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. వీలైనంత త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖ అంశంపై నిర్ణయం తీసుకుంటాం...చిన్నారెడ్డి వివరణ కూడా అందింది. చిన్నారెడ్డి మాట్లాడిన వీడియోను పరిశీలించాం. ఎమ్మెల్యే మేఘారెడ్డి అభిప్రాయం తీసుకున్న తర్వాత చిన్నారెడ్డి కేసులో నిర్ణయం తీసుకుంటాం. కంది శ్రీనివాస్ రెడ్డిని విచారించాం. తన వాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు’’ అని మల్లు రవి తెలిపారు. -
'యాక్సిడెంట్లో చనిపోయిందని ఫోన్ చేశారు'
హైదరాబాద్: 'ఇంత చిన్న వయసులో నా కూతురు ఎలా చనిపోయింది' అంటూ రోదిస్తోంది ఆనందిని ముఖి. జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతి ముఖి తల్లి ఆనందిని. కూతురి మరణవార్త తెలిసి ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒడిశాలో ఉంటున్న ఆమె మీడియాతో తన బాధను పంచుకుంది.నాలుగైదేళ్లుగా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని తన కూతురే పోషిస్తోందని, తామంతా ఆమెపైనే ఆధారపడి జీవిస్తున్నామని కన్నీరుమున్నీరయింది ఆనందిని. తమ కుటుంబానికి ఇక దిక్కేవరని రోదిస్తూ వాపోయింది. తన కుమార్తె చావుకు కారణం ఎవరని దీనంగా ప్రశ్నించింది.''నా కూతురిని ఎంతో కష్టపడి పెంచి, చదివించాను. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఇంజినీరింగ్లో సీటు కూడా తెచ్చుకుంది. కోవిడ్ లాక్డౌన్తో బీటెక్ చేయలేకపోయింది. దీంతో ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లింది. మాదాపూర్లో ఇనార్బిట్మాల్లో పనిచేస్తూ మాకు నెలనెలా డబ్బులు పంపిస్తోంది. భారతి సంపాదన మీదే ఆధారపడి బతుకుతున్నాం. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి.. భారతికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది. భారతితో మాట్లాడించమని అడిగితే.. చనిపోయిందని చెప్పింది. మాకేం చేయాలో అర్థం కాలేదు. హైదరాబాద్ ఎలా వెళ్లాలో కూడా మాకు తెలియదు. ఇంత చిన్న వయసులోనే నా కూతురు ఎలా చనిపోయింది?'' అంటూ ఆనందిని శోకసంద్రంలో ముగినిపోయారు.నెటిజన్ల స్పందనభారతి ముఖి కుటుంబానికి న్యాయం చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. ఆనందిని ముఖి మీడియాతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. 'ఈ కన్నతల్లి ఉసురు మీకు తగులుతుంది. ఖర్మ ఎవరినీ వదిలిపెట్టదు' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. తమ పార్టీ ఎంపీ కొడుకు కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని మరొకరు ప్రశ్నించారు. హైదరాబాద్లో వలస కార్మికులకు జరిగే ప్రమాదాలు/నేరాల విషయంలో బాధితుల పక్షాన నిలబడేవారు ఎవరు ఉండకపోవడం బాధాకరమైన విషయమని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు. 'ప్రజల నుంచి దొంగిలించిన డబ్బుతో కొన్న లింగమనేని సంజూష్ కారు ఆస్టన్ కిల్లర్ మెషీన్ ను వేలం వేసి, ఆ డబ్బును బాధితుల కుటుంబానికి చెల్లించాలి. అలాగే ఎంపీ లింగమనేని రమేశ్ సంపద మూలాలపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేయాల'ని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.చదవండి: సంజూష్ను తప్పించాలని స్కెచ్!తండ్రి ఎంపీ కాబట్టే.. భారతి ముఖి మరణానికి కారణమైన లింగమనేని సంజూష్ను (Lingamaneni Sanjush) కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఘటన జరిగి వారం రోజులు కావొస్తున్న అతడిని అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లింగమనేని రమేశ్ ఎంపీ కాబట్టే ఆయన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయడం లేదని సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు. సామాన్యులకో న్యాయం, పెద్దలకే న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కేసులో నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు సాగించిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. భారతి ముఖి చావుకు ప్రత్యక్షంగా కారణమైన సంజూష్ను అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా కుమార్తె భారతి ముఖిని ఎంతో కష్టపడి పెంచాను.. చదివించానుడిప్లొమా పూర్తి చేసిన తర్వాత బీటెక్లో సీటు కూడా సంపాదించిందికానీ కొవిడ్ లాక్డౌన్ కారణంగా చదువు కొనసాగించలేకపోయిందిఆ తర్వాత ఉద్యోగం నిమిత్తం నా కుమార్తె హైదరాబాద్కు వెళ్లింది4-5 ఏళ్లుగా అక్కడే ఉంటూ.. ఇంటికి వచ్చి… https://t.co/mTOPlmc072 pic.twitter.com/u8jzbalSZN— PulseNewsBreaking (@pulsenewsbreak) August 21, 2026 -
హైడ్రా రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎవరినీ వదిలిపెట్టేది లేదని.. అంజయ్యనగర్లో ఉన్న అక్రమ నిర్మాణాలన్ని కూల్చేస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కూలిన భవనాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇక ఎవరిని ఉపేక్షించం. ఈ భవనాలన్నీ నాలాల పక్కన ఉన్నాయి. 50 గజాల్లోనే ఏడేసి అంతస్తులు కట్టారు. నిబంధనలు అతిక్రమించిన భవనాలన్నీ కూలుస్తాం. భవనాలు అన్ని నాలాను ఆనుకునే నిర్మించారు. బిల్డర్ సాజిద్ పరారీలో ఉన్నాడు. 50 గజాల్లో భవనాలు కట్టి హాస్టళ్లకు ఇస్తున్నాడు’’ అని రంగనాథ్ తెలిపారు.ఇదీ చదవండి: గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరి మృతిప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందాడు. బిల్డింగ్ యజమాని అందుబాటులోకి రాలేదు. ఈ బిల్డింగ్ నిర్మాణంపై సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్కి ఫిర్యాదు ఇచ్చారు. గతంలో హైడ్రాకు ఈ బిల్డింగ్ నిర్మాణంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఏడు అంతస్తులు, ఒక పెంట్ హౌస్ మొత్తం ఎనిమిది అంతస్తులు బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. నాలాను అతిక్రమించి ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. చుట్టుపక్కల ఉన్న భవనాలను కూడా పరిశీలించి త్వరలోనే కూల్చివేస్తాం. హాస్టల్ బిల్డింగులు నిర్మించి రెంట్కు ఇస్తుంటాడు సాజిద్.. అతనిపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు ఉన్నాయి’’ అని రంగనాథ్ పేర్కొన్నారు. -
‘సీఎం రేవంత్ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు’
హైదరాబాద్: రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారు విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిందని బీజేఎల్పీ నేత మహఏశ్వర్రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే రీయింబర్స్మెంట్ ఇస్తానన్న రేవంత్.. అది మరచి ఎలా దోచుకోవాలో చూస్తున్నారని మండిపడ్డారు. ఫీజు బకాయిలపై ఈనెల 24, 25 తేదీల్లో దీక్షలు చేస్తామని ఏలేటి హెచ్చరించారు. ఇక 22-ఏ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు ఏలేటి. ఈరోజు(శనివారం, ఆగస్టు 22వ తేదీ) ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ పోస్టర్ను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించిన ఏలేటి మహేశ్వర్రెడ్డి.. మాట్లాడారు. ‘ విద్యార్థుల ఫీజు బకాయిల గురించి విద్యార్థుల సంతకాల సేకరణ, ఉద్యమాలు చేస్తుంది బీజేపీ. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. పాఠశాలల్లో, యూనివర్సిటీలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే సీఎం విదేశీ పర్యటనలు చేస్తున్నారు. 21 వేల 126 బడులు శిథిలావస్తలో ఉన్నాయి. బంగారం అమ్ముకుని చదువులు చెప్పిస్తుంటే..ప్రభుత్వానికి పట్టడం లేదు. పీసీసీగా నువ్వు మాట్లాడిన మాటలేవి రేవంత్ రెడ్డి..?, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. 24, 25 తేదీలలో రెండు రోజుల పాటు రాష్ట్ర కార్యాలయం ముందు రాంచందర్ రావు ఆధ్వర్యంలో దీక్ష చేస్తాం. ప్రజల కోసం ప్రభుత్వం మెడలు వంచుతాం’ అని హెచ్చరించారు.ఇదీ చదవండి: చిట్టక్క పంచాయితీ.. కొండా మురళి రియాక్షన్పై ఉత్కంఠ -
గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కూలిన భవన శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్ మీద పడిపోయాయి. ఈ ప్రమాదంతో అక్కడున్న వాళ్లంతా భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాలువను ఆనుకుని ఉన్న కేవలం 50 గజాల స్థలంలో ఈ భవనం నిర్మించ తలపెట్టినట్లు తెలుస్తోంది. భవనం కూలిపోవడంతో శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభం అయ్యాయి. ఇటు ఈ భవన నిర్మాణానికి అసలు అనుమతులు ఉన్నాయా? అనేదానిపై అధికారులు స్పందించాల్సి ఉంది. ఈ భవనాన్ని హాస్టల్ కోసం నిర్మిస్తున్నట్లు సమాచారం. -
సొంతూరు ఎక్కడైనా.. ఓటు హైదరాబాద్లోనే!
సాక్షి, హైదరాబాద్: సొంతూరు ఆంధ్రప్రదేశ్లో లేదా ఉత్తరాది రాష్ట్రంలో.. ఇళ్లు, నివాసాలు మాత్రం హైదరాబాద్ నగరంలో! మూలాలు అక్కడున్నా.. జీవితం మాత్రం ఇక్కడే! సుదీర్ఘకాలంగా నగరంలో ఉంటూ, ఇక్కడే ఎదిగిన వీఐపీల్లో చాలామంది ఓటు విషయంలోనూ నగరానికే ప్రాధాన్యమిచ్చారు. ‘ఇక్కడే ఉంటాం.. ఇక్కడే ఓటు’ అన్నట్టు నగరంలోనే ఓటరుగా ఉండేందుకు సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారు. ఈ వివరాలను పరిశీలించగా.. ఆసక్తికర అంశం వెల్లడైంది. సినీ తారలు, దర్శకులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీస్ ఉన్నతాధికారులు.. ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరి నుంచీ ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించే లక్ష్యంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల యంత్రాంగం వీరిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2,081 మంది వీఐపీలను గుర్తించింది. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగ ప్రముఖులు, సెలబ్రిటీలు, లెజెండ్స్ ఎక్కువ మంది నివసిస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇలాంటి వారు అధికంగా 457 మంది ఉన్నారు. కాగా.. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కంటోన్మెంట్లో ఎక్కువమంది వీఐపీలను అధికారులు గుర్తించారు. తర్వాతి స్థానాల్లో ఖైరతాబాద్, సనత్నగర్, సికింద్రాబాద్లున్నాయి. ఎన్నికల నాటికి ఎక్కడో? ప్రస్తుతానికి వీరంతా నగరంలోనే ఓటర్లుగా ఉండగా, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇతర ప్రాంతాలకు మారొచ్చు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలప్పుడు ఎక్కడ ఉంటారన్నదే మరో ఆసక్తికర అంశంగా మిగిలింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని యామిని ఆత్మహత్య
చిలకలూరిపేటటౌన్: ఉన్నత చదువులు పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడింది. కుటుంబానికి అండగా నిలవాలనే ఆశలు.. జీవితంలో మరెన్నో మెట్లు ఎక్కాలనే కలలు. కానీ అంతలోనే ఆ కుటుంబాన్ని తీరని విషాదం చుట్టుముట్టింది. చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన యామిని(24) హైదరాబాద్లో మృతి చెందడం తల్లిదండ్రులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది. ఏం జరిగిందో..? చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన సుబ్బారావు, లక్ష్మి దంపతుల కుమార్తె యామిని హైదరాబాద్లోని కేపీహెచ్బీ పరిధిలో ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో తోటి యువతులతో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. గురువారం సాయంత్రం తోటి స్నేహితురాళ్లు బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతూ యామినిని కూడా తమతో రావాలని కోరినట్లు తెలిసింది. ఆమె రానని చెప్పడంతో వారు బయటకు వెళ్లారు.కొంతసేపటి తర్వాత తిరిగి హాస్టల్కు చేరుకున్న వారు గదిలో నుంచి స్పందన లేకపోవడంతో వార్డెన్కు సమాచారం అందించారు. అనంతరం గదిని తెరిచి చూడగా యామిని మృతి చెంది కనిపించింది. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతికి ఖచ్చితమైన కారణం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో వివరాలు పరిశీలిస్తున్నారు. శోక సంద్రంలో తల్లిదండ్రులు గతంలో పట్టణంలోని పండరీపురంలో నివాసం ఉన్న యామిని కుటుంబం ప్రస్తుతం మండలంలోని కావూరులో ఉంటోంది. కుటుంబ పోషణ కోసం తండ్రి హైదరాబాద్లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. కష్టపడి పెంచిన కూతురు చదువుకుని ఉద్యోగంలో స్థిరపడటంతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. తమ బిడ్డ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశల మధ్యే యామిని మృతి చెందడంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. కళ్లెదుటే పెరిగిన కూతురు ఇక తిరిగిరాదన్న నిజాన్ని జీర్ణించుకోలేక వారు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి ఆవేదన కుటుంబ సభ్యులు, బంధువులను కలచివేస్తోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
నీ ప్రాణం పోయినా.. మా బైక్ రిపేర్ చేయించాల్సిందే!
హైదరాబాద్: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మరమ్మతు విషయంలో తీవ్ర ఒత్తిడి, వేధింపులకు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యచేసుకున్నాడు. మాసబ్ట్యాంక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపిన మేరకు.. చార్మినార్ ప్రాంతానికి చెందిన మీర్ సోఫియాన్ అలీ అలియాస్ ఆదిల్(24) నాలుగు నెలల క్రితం తన స్నేహితుడు పాషను బైక్ తీసుకువెళ్లాడు. అయితే బైక్ ఓ రోడ్డు ప్రమాదంలో దెబ్బతినడంతో పాషాతోపాటు ఇతని మిత్రుడు ఇషాక్ ఉద్దీన్లు మరమ్మతు చేసివ్వాలని.. లేకపోతే డబ్బులివ్వాలని ఒత్తిడి చేశారు. తన వద్ద డబ్బు లేదని ఆదిల్ చెప్పినా వినలేదు. ఈ క్రమంలో ఈనెల 19న అర్థరాత్రి మాసబ్ట్యాంక్ ఫస్ట్లాన్సర్లోని మార్వా లిబర్టీ అపార్ట్మెంట్ ఏడవ అంతస్తు టెర్రస్పై హంజాలా పాషాతో పాటు మిత్రులు ఇషాక్ ఉద్దీన్, మస్తాన్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఇమ్రాన్ ఖాన్ పార్టీ చేసుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆదిల్ను పిలిపించారు. ఆదిల్, షారుఖ్ వెళ్లగా బైక్ రిపేరు గురించి ఒత్తిడి చేశారు. తాను డబ్బులు చెల్లించలేనని, ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆదిల్ చెప్పినా.. నీ ప్రాణం పోయినా మాకు అనవసరం లేదు.. బైక్ రిపేర్ చేసి తీరాల్సిందే అని హెచ్చరించారు. దీంతో ఆదిల్ ఏడో అంతస్తునుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ ఆదిల్ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.ఇదిలా ఉండగా పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో మాసబ్ట్యాంక్ పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి కుటుంబసభ్యులు ధర్నా నిర్వహించారు. -
ఎల్నినో మబ్బుల్లోనే మాన్సూన్
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో ఎల్నినో మబ్బుల్లో మాన్సూన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. సగటున 20 శాతం తక్కువగా నమోదు కాగా, తూర్పు ప్రాంతాల్లో మాత్రం లోటు 36 శాతం స్థాయికి చేరుకుందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోజువారీ చినుకుల తీవ్రత తగ్గి.. 10 నుంచి 20 నిమిషాల వరకే వర్షం పరిమితమవుతోంది. ఫలితంగా భూమి సరిగా తడవకపోవడంతో భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి.నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరం నుంచి ప్రారంభమై సెప్టెంబరు 30న ముగుస్తాయి. ఈ ఏడాది జూన్¯ 8న ప్రవేశించి, 23 నాటికి పూర్తిగా విస్తరించినా.. జూన్లో సాధారణం కంటే తక్కువగా నమోదైంది. జూలైలో కొంత మెరుగుదల కనిపించినా ఆగస్టులో మళ్లీ లోటు పెరిగింది. ఈ సీజన్లో మరో 41 రోజులు మిగిలి ఉన్నప్పటికీ సాధారణ లోటుకూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.లోతుకు భూగర్భ జలాలు..ఐటీ, పారిశ్రామిక ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఊహించని విధంగా 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ నాటి వర్షానంతర కాలంతో తాజా నివేదికలను పోల్చి చూస్తే భూగర్భ జలమట్టాలు అత్యంత వేగంగా పతనమయ్యాయి. అత్యధికంగా తూర్పు ప్రాంతంలో సగటు నీటి మట్టం 6.51 మీటర్లు మాత్రమే ఉండగా, ఆగస్టు నాటికి అది ఏకంగా 14.03 మీటర్లకు పడిపోయింది. బోరుబావుల ద్వారా నీటిని నిరంతరాయంగా తోడేస్తుండటమే ఈ తీవ్ర క్షీణతకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో మిగిలి ఉన్న రోజుల్లో సుదీర్ఘ, తీవ్రమైన వర్షాలు కురిస్తేనే భూజలాలు పెరిగే అవకాశముంది. లేనిపక్షంలో క్యూర్ పరిధిలో నీటి ఒత్తిడి మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. -
ఏటా 198 గంటల నిద్ర కోల్పోతున్న నగర జీవులు
సాక్షి, హైదరాబాద్: కునుకుపడితే మనసు కాస్త కుదుటపడతది. కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది.. అన్నచందంగా మనిషి జీవితంలో నిద్రకు ఎంతో ప్రాముఖ్యముంది. వ్యక్తిగత సమస్యలు.. మానసిక రుగ్మతలు.. అనారోగ్యం.. సాధారణంగా ఇలాంటి వాటితో నిద్ర కోల్పోవడం చూస్తూనే ఉంటాం. కానీ.. ప్రస్తుతం మెట్రో నగరవాసుల్ని పట్టిపీడిస్తూ నిద్రను దూరం చేస్తున్న సమస్యలు మరో రెండు ఉన్నాయి. అవేమిటంటే.. పీక్ అవర్స్లో ట్రాఫిక్, రాత్రి వేళల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. హైదరాబాద్ విషయాన్నే తీసుకుంటే ఈ రెండు కారణాలతో ఏటా 198 గంటల నిద్రను నగరజీవులు కోల్పోతున్నారు. తాజాగా విడుదలైన టామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్, అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థల సర్వేలు ఈ విషయాలను వెల్లడించాయి. నగరంలోని రహదారులపై మిగిలిన సమయాల్లో కంటే ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని పీక్ అవర్స్ అని పిలుస్తుంటారు. ఉదయం కంటే సాయంత్రం వేళ రద్దీ ఎక్కువగా ఉంటోందని టామ్టామ్ నివేదిక తేల్చింది. ఆ సమయంలో ఉండే ట్రాఫిక్ రద్దీ కారణంగా నగర వాసి ఏటా సుమారు 123 గంటలు కోల్పోతున్నాడు. అంటే.. దాదాపు ఐదు రోజులు అదనంగా ట్రాఫిక్లోనే గడిపేస్తున్నాడు. టామ్టామ్ నివేదిక ప్రకారం నగరంలో ట్రాఫిక్ రద్దీ స్థాయి 55.5 శాతంగా తేలింది. నెదర్లాండ్స్కు చెందిన ఈ టెక్నాలజీ సంస్థ స్లో మూవింగ్ ట్రాఫిక్ ఇండెక్స్ పేరుతో ప్రతి ఏడాదీ నివేదిక విడుదల చేస్తోంది. ఆసియా, యూరప్, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆ్రస్టేలియా ఖండాల్లోని 62 దేశాల్లో 500 నగరాల్లో టామ్ టామ్ సంస్థ సర్వే చేసింది.సాయంత్రం దయనీయం..సాధారణ సమయంలో 10 కి.మీ దూరం ప్రయాణించడానికి సగటున 32.37 నిమిషాలు పడుతోంది. అదే సాయంత్రం రద్దీ వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఈ సమయంలో వాహనాల సగటు వేగం గణనీయంగా తగ్గిపోయి 10 కిమీ దూరం ప్రయాణించడానికి సగటున 39.5 నిమిషాలు పడుతోంది. హైదరాబాద్లో వాహనాల సంఖ్య 80 లక్షలు దాటింది. అదే సమయంలో ప్రజా రవాణాకు ప్రాధాన్యం లభించట్లేదు. నగరంలో వాహనాల సగటు వేగం గంటకు 25–30 కిమీ ఉండాలి. కానీ.. సగటు వేగం కేవలం 15 కి.మీ పరిమితమవుతోంది. సాయంత్రం రద్దీ వేళల్లో ఇది గంటకు 10 కి.మీలకు పడిపోతోంది. ఇలా ప్రయాణ సమయం పెరిగి... సగటు జీవి రాత్రి వేళల్లో నిద్రపోయే సమయం తగ్గిపోతోంది.ఇంటికి చేరాకా నరకమే..ట్రాఫిక్ సుడిగుండాన్ని దాటుకుని ఇంటికి చేరిన నగరవాసికీ నిద్ర పట్టట్లేదు. వాతావరణ మార్పుల కారణంగా వేడెక్కుతున్న రాత్రులతో ఏటా 75 గంటల నిద్రకు దూరం అవ్వాల్సి వస్తోంది. అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1,338 నగరాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ముఖ్యంగా కాంక్రీట్ నిర్మాణాలు, తారు రోడ్లు పగటిపూట వేడిని నిల్వ చేసుకుని.. సూర్యాస్తమయం తర్వాత కూడా ఆ వేడి త్వరగా తగ్గకుండా చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ అంశంలో హైదరాబాద్ కంటే ఎక్కువగా వరంగల్లో 82 గంటల నిద్రను కోల్పోతుండటం గమనార్హం. -
నకిలీ తాళం చెవి చేయించి చోరీ
గచ్చిబౌలి: ఓ ఇంట్లో నివాసముంటున్న దంపతులు గురువారం ఉదయం ఆలయానికి వెళ్లారు. సాయంత్రం వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మూడు గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ భూపతి తెలిపిన మేరకు.. శివపురి కాలనీలో నివాసం ఉండే మాధురి దంపతులు పెద్దమ్మ ఆలయానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు. అయితే ఇంటి తాళం తీసి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించారు. రాయదుర్గం డీఐ రాంరెడ్డి సీసీ ఫుటేజీల ఆధారంగా ఓ మహిళను గుర్తించారు. మణికొండలో నివాసం ఉంటున్న, వంటమనిషిగా పనిచేసే కర్ణాటకకు చెందిన కామేటీ లక్ష్మి (37)గా తేల్చారు. అదే ప్రాంతలో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. తన బంధువు, సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వకలపురి శివ రాఘవేంద్ర (29)తో కలిసి చోరీ చేసినట్లు అంగీకరించింది. ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్ గుర్తించి శివ రాఘవేంద్రను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7 తులాల బంగారు బ్రాస్లెట్లు (2), చైన్లు (2) స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఆధార్ కార్డు చూపించి.. ఇల్లు మాదే అని నమ్మించిశివపురి కాలనీలో రెక్కీ నిర్వహించిన లక్ష్మి ఇంటికి తాళం వేసినట్లు గమనించింది. సాయంత్రం నాలుగు గంటలకు ఇంటి ముందుకు వెళ్లి చూసింది. తాళం చెవి తయారు చేసే వ్యక్తి వద్దకు వెళ్లారు. ఆధార్ కార్డు చూపించి ఆ ఇల్లు మాదేనని నమ్మించి ఆధార్ కార్డు ఇచ్చింది. దీంతో అతను తాళం చెవి చేసి ఇచ్చాడు. లోపలికి వెళ్లి నగలు తస్కరించి అక్కడి నుంచి ఉడాయించారు. చోరీ చేసిన అనంతరం ఆ మహిళ దూరంగా ఉండి ఆ ఇంటికి ఎవరు వచ్చి వెళుతున్నారో గమనిస్తోంది. పోలీసుల రాకను చూసి కొద్ది దూరం వెళ్లిపోయింది. అటుగా అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు చిక్కింది. గతంలో పనిచేసిన యజమాని ఇంట్లో చోరీకి పాల్పడటంతో లక్షి్మపై రాయదుర్గం పీఎస్లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. -
రాహుల్గాంధీ ద్వంద్వ నీతిపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం ముందు ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ను ప్రశ్నిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నట్లు రాహుల్గాంధీ నాటకాలాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై లాఠీలు ఝళిపిస్తూ, వారిని ఈడ్చుకెళ్లి, గొంతులు నొక్కేలా దాడులకు పాల్పడుతున్నా రాహుల్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. రాజ్యాంగ హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకేనా.. తెలంగాణ విద్యార్థులకు వర్తించవా? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో విద్యార్థుల హక్కులు అణచివేస్తున్నా రాహుల్ స్పందించకపోవడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో జరిగిన లాఠీచార్జ్ను కూడా ఖండించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేవంత్రెడ్డిని డిమాండ్ చేయాలని కేటీఆర్ కోరారు. విద్యార్థుల హక్కుల విషయంలో రాజకీయాలకతీతంగా నిలబడతారా.. లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ రక్షణ కల్పిస్తారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేసే నైతిక ధైర్యం ఉన్న రాహుల్.. తెలంగాణలో కాంగ్రెస్ లాఠీలకు గురైన విద్యార్థుల కోసం కూడా అదే పోరాటం చేయాలని, లేకపోతే విద్యార్థుల పట్ల ఆయనది కపట ప్రేమగానే ప్రజలు భావించాల్సి వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
‘ఎల్నినో’ను ఎదుర్కొనేందుకు గ్రామాలు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్, ఏజీవర్శిటీ: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి తెలిపారు. గ్రామస్థాయిలో ప్రతి శాఖ వేర్వేరుగా కాకుండా వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, మత్స్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించి, స్వల్పకాలిక అవసరాలతోపాటు వచ్చే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనులను ఎంపిక చేయాలన్నారు. వీబీ–జీ రామ్జీ నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని, ఈ నిధులతో శాశ్వత సామాజిక ఆస్తులను నిర్మించాలని చెప్పారు. నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంటకు పంట కుంట, ప్రతి గ్రామానికి ఊటకుంట వంటి పనులను చేపట్టాలన్నారు. పంట కుంటల ద్వారా భూగర్భ జలాలు పెరగడంతోపాటు వ్యవసాయం, చేపల పెంపకం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. శుక్రవారం టీజీఐఆర్డీలో ఎల్నినో ప్రభావం, వివిధ ప్రభుత్వ రంగాల్లో చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణపై జరిగిన రాష్ట్రస్థాయి వర్క్షాప్లో మంత్రులు పాల్గొన్నారు.‘ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వెబ్సైట్’ ఆవిష్కరణ ఈ సందర్భంగా ‘ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వెబ్సైట్’ను మంత్రులు ఆవిష్కరించారు. ఈ వెబ్సైట్లో గ్రామాల వారీగా సమగ్ర వివరాలు పొందుపరచనున్నారు. గ్రామ జనాభా, అవసరాలు, వనరులు, గ్రామాభివృద్ధి ప్రణాళిక, శాఖల వారీగా జరుగుతున్న పనులు వంటి సమగ్ర వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. పీఆర్ఆర్డీ స్పెషల్ సీఎస్ దానకిశోర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి నిధుల అభివృద్ధి ప్రణాళికను రూపొందించి తెలంగాణ గ్రామ పంచాయతీలను దేశంలో అగ్రగామిగా, స్వయం సమృద్ధిగా, అనుబంధ శాఖలతో అనుసంధానిస్తున్నామని చెప్పారు.ఎంపీ వేం నరేందర్రెడ్డి, సీఎస్ సంజయ్జాజు, పీఆర్ కమిషనర్ దివ్య దేవరాజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, పశుసంవర్థకశాఖ కార్యదర్శి ఇలంబర్తి , టీజీఐఆర్డీ సీఈఓ నిఖిల, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీఆర్డీఓలు, డీపీఓలు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్య శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామాలను సిద్ధం చేయాలని సీతక్క చెప్పారు. గ్రామాలకు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఉండాలని చెప్పారు. భారీ ప్రాజెక్టులు నిర్మించినా, ఇప్పటికీ 30 లక్షల బోర్లపై సాగు ఆధారపడి ఉన్నందున, భూగర్భ జలాలను పెంచే పనులను ఉపాధి హామీ ద్వారా విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని తుమ్మల చెప్పారు. కరువు పరిస్థితుల్లో పశువుల పెంపకం, సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలని వాకిటి శ్రీహరి చెప్పారు. సెప్టెంబర్లో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులకు సూచించారు. -
హోరెత్తిన అభిమాన సంద్రం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో పర్యటించారు. నగరంలోని జల విహార్ గ్రాండ్ లాన్స్లో జరిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు స్నిగ్ధ, అనంత పినాక్ శర్మలను ఆశీర్వదించి, వారికి హృదయ పూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడున్న వారందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగారు. వైఎస్ జగన్ కాన్వాయి జల విహార్ గేటులోకి ప్రవేశించగానే పెద్ద ఎత్తున అభిమానులు జై జగన్.. అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వైఎస్ జగన్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సమయంలోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా జై జగన్ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం మార్మోగింది. తమ అభిమాన నాయకుడితో కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు పలువురు పోటీపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపు చేయడం కాస్త కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్.. కరచాలనం చేసుకుంటూ.. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కాన్వాయ్ వెంట ద్విచక్ర వాహనాలపై యువత దారి పొడవునా జై జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ ముందుకుసాగారు. ఇదిలా ఉండగా వైఎస్ జగన్ రాక సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల అభిమానులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల వైఎస్ జగన్తో పాటు కేసీఆర్, కేటీఆర్ చిత్రాలతో రూపొందించిన కటౌట్లు కనిపించాయి. ‘ధీరుడు వైఎస్ జగన్కు స్వాగతం’.. ‘వజ్రం ఎక్కడ ఉన్నా మెరుస్తుంది’ అనే క్యాప్షన్తో ఏర్పాటైన కటౌట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. కాగా, వివాహ వేడుకలో వైఎస్సార్సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాథ్, రోజా, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, విడదల రజిని, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్లతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.


