breaking news
Hyderabad
-
సంక్రాంతి రద్దీ.. ఏపీ నుంచి వచ్చేవారికి బిగ్ అలర్ట్..
సాక్షి, నల్లగొండ జిల్లా: హైదరాబాద్-విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక చర్యలు పోలీసులు చేపట్టారు. ఎన్హెచ్- 65పై రద్దీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలుగుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్.మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలుమాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలునల్లగొండ - మార్రిగూడ బై పాస్ -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలుకోదాడ- హుజూర్నగర్- మిర్యాలగూడ- హాలియా- చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.ఎన్హెచ్ 65 (విజయవాడ-హైదరాబాద్) రహదారి పై చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్ -
‘గ్లాస్’ గొడవ.. అన్నను చంపిన తమ్ముడు
సాక్షి, హైదరాబాద్: నాచారంలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు హత్య చేశాడు. మద్యం తాగే క్రమంలో గ్లాస్ కోసం గొడవ జరిగింది. మూడంతస్తుల భవనంపై నుంచి అన్నను తమ్ముడు తోసేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.వరంగల్లో..మరో ఘటనలో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఈరియా తండాలో ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. బెల్ట్ షాప్ వద్ద మద్యం కోసం వచ్చిన గణేష్ అనే యువకుడిపై దంపతులు రోకలి బండతో దాడి చేశారు. గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతలించారు. దాడి చేసిన దంపతులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
పిన్నెల్లి ఘటనపై హైకోర్టుకు వైఎస్సార్సీపీ
సాక్షి, పల్నాడు: రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని గురజాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్ను టీడీపీ గుండాలు పొట్టనబెట్టుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియలను రాజకీయం చేస్తుండడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఈ వ్యవహారంలో వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ‘‘కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగంలో గురజాల నియోజకవర్గంలో ఏడు రాజకీయ హత్యలు జరిగాయి. వైఎస్సార్సీపీ హయాంలో గురజాల నియోజకవర్గానికి కృష్ణానది నీటిని ఇచ్చాం. టీడీపీ వచ్చాక డయేరియాతో జనం చనిపోయే పరిస్థితి. పిన్నెల్లిలో వైసీపీకి చెందిన రెండు, మూడు వందల కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయారు. నాలుగు రోజులక్రితం టీడీపీవాళ్లు ఎస్సీ నేత సాల్మన్ ఇంటిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. పోలీసులకు ఫోన్ చేసినా స్పందించలేదు. అసలు ఊరిలోకి ఎవరు రమ్మన్నాడు అంటూ సీఐ భాస్కర్ మాట్లాడారు. పైగా సాల్మన్పైనే ఎదురు కేసు పెట్టారు.నాలుగు రోజులు చికిత్స తర్వాత సాల్మన్ చనిపోయాడు. కనీసం హత్యాయత్నం కేసు కూడా నమోదు చెయ్యలేదు. సీఐ భాస్కర్ లాంటి పోలీసు అధికారిని సస్పెండ్ చెయ్యాలి. అంత్యక్రియలు ఊర్లో చెయ్యాలంటే కుదరదంటున్నారు. వైఎస్ జగన్ ఇప్పటికే సాల్మన్ కుటుంబ సభ్యలతో మాట్లాడారు. ఈ కేసులో మా పోరాటం కొనసాగుతుంది. న్యాయం కోసం హైకోర్టుకు వెళ్తాం. మేం అధికారంలోకి రాగానే సీబీసీఐడీ విచారణ చేపడతాం. మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు... మీకు గుణపాఠం చెబుతాం. గ్రామంలో శాంతికమిటీ వేసి గొడవలు జరగకుండా చూడాలి. ఇవాళ ఇది జరగకుంటే.. పోలీసులను అడ్డంపెట్టుకుని బచ్చాగాడు కూడా మాట్లాడతారు. పిన్నెల్లిలో సాల్మన్ అంత్యక్రియలు జరగకపోతే రేపు జగన్ వస్తారు.. అని కాసు తెలిపారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘‘పిన్నెల్లిలో కుటుంబాలకు కుటుంబాలు ఊరు వదిలిపెట్టి వెళ్లారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూడా వెలివేతలు జరిగాయి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారా?.. గతంలో రషీద్, భూషయ్య.. ఇప్పుడు సాల్మన్ను హత్య చేశారు. సాల్మన్ పై పెట్టిన కేసు పోలీసుల దుర్మార్గానికి పరాకాష్ఠ. చనిపోయిన వ్యక్తిపై 324సెక్షన్ కింద కేసు నమోదు చెయ్యడం పోలీసుల తీరుకు నిదర్శనం. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలిగానీ బాధితుల మీద కాదు. కనీసం అంత్యక్రియలకు సొంతూరు కూడా వెళ్లనియ్యరా?. సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు. టీడీపీ బెదరింపు పోస్టర్లువైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. దీంతో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సాల్మన్ కుటుంబ సభ్యలతో కలిసి పిన్నెల్లి బయల్దేరాఉ. అయితే.. అంత్యక్రియలను జరగనివ్వమని, వైఎస్సార్సీపీ నేతలు గ్రామంలో అడుగుపెడితే ఊరుకునేది లేదని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. గ్రామంలో అంతటా వైఎస్సార్సీపీని విమర్శిస్తూ ఫ్లెక్సీలు వేయించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. -
ఖమ్మం జిల్లాలో పండుగ వేళ తీవ్ర విషాదం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి సాంబార్లో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ప్రమాదవశాత్తూ చిన్నారి రమ్మశ్రీ వేడి వేడి సాంబార్లో పడటంతో తీవ్ర గాయాలపాలైంది. దాంతో చిన్నారి రమ్మశ్రీని హైదరాబాద్కు తీసుకువచ్చి చికిత్స అందించారు. నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దాంతో చిన్నారి తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డను కోల్పోవడంతో వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. -
ఆసుపత్రి పెట్టుబడుల పేరుతో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: ఆసుపత్రి పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఆసుపత్రి మాజీ ఎండీపై 14 మంది సీనియర్ డాక్టర్ల ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రి మాజీ ఎండీపై కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో రూ.38 కోట్లకు పైగా మోసం చేశారంటూ ఎండీపై ఆరోపణలు ఉన్నాయి. భారీ లాభాల ఆశ చూపి డాక్టర్లను నమ్మించారని.. మోసానికి మాజీ ఎండీతో పాటు అతని సోదరుడి పాత్ర ఉందంటూ ఫిర్యాదు చేశారు.ప్లాస్టిక్ సర్జన్ డా. చొక్కా రాజేష్ వాసు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2014–2015 మధ్య ఆసుపత్రి ఈక్విటీ పేరిట పెట్టుబడులు పెట్టగా.. మొత్తం రూ.100 కోట్ల మేరకు డాక్టర్ల నుంచి నిధుల సమీకరణ చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు చేసిన 14 మంది డాక్టర్ల పెట్టుబడి రూ.38 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. హామీ ఇచ్చిన లాభాలు ఇవ్వకుండా మభ్యపెట్టినట్టు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఖాతాల్లో నష్టాలు చూపుతూ డాక్టర్లను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.రోగుల సంఖ్య బాగానే ఉన్నా నష్టాలంటూ లెక్కలు చూపినట్టు ఆరోపిస్తున్నారు. కోవిడ్ సమయంలో రోగుల నుంచి అధిక బిల్లుల వసూలు ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి ఆదాయాన్ని రియల్ ఎస్టేట్, బంగారానికి మళ్లించారని ఫిర్యాదులో పేర్కొనగా.. ఆసుపత్రి నిధుల ఉద్దేశపూర్వక దారి మళ్లింపు ఆరోపణలు ఉన్నాయి. పీఏసీ 406, 409, 477-A, 120-B సెక్షన్ల కింద సీసీఎస్ పోలీసులు కేసు చేశారు. మాజీ ఎండీ, అతని సోదరుడిపై లోతైన దర్యాప్తు చేపట్టారు. ఆధారాలపై తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని సీసీఎస్ స్పష్టం చేసింది. -
సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే ఊరుకోం..!
సాక్షి, హైదరాబాద్: విస్తరిత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందేనని, అందుకోసం ఆమరణ దీక్షకైనా వెనుకాడేది లేదని ఉద్యమానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ తన డిమాండ్ నెగ్గించుకుంటారా.. లేక వెనక్కు తగ్గుతారా? అన్నది నగరంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డీలిమిటేషన్ సైతం ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా అస్తవ్యస్తంగా చేశారని పేర్కొన్న ఆయన సికి ంద్రాబాద్ను ముక్కలుగా చేసి మల్కాజిగిరి కార్పొరేషన్లో కలిపితే చూస్తు ఊరుకోబోమనే డిమాండ్తో సికింద్రాబాద్కు చెందిన వివిధ వర్గాలను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే. ఈ నెల 17న భారీ ర్యాలీ.. సికింద్రాబాద్ ఎప్పటినుంచో అటు జీహెచ్ఎంసీలో, ఇటు హైదరాబాద్ జిల్లాలో భాగంగానే ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్తగా తాను మారుస్తున్నదంటూ ఏమీ లేదని ఇటీవల సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. దీంతో సికింద్రాబాద్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు ఉండబోదనే చాలామంది భావిస్తున్నారు. తన డిమాండ్ సాధనకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్న శ్రీనివాస్యాదవ్.. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎంజీరోడ్ గాంధీ విగ్రహం వరకు పదివేల మందితో భారీ ర్యాలీ సహా వివిధ కార్యక్రమాలు ప్రకటించారు. ముందుకా.. వెనకకా? ఉద్యమానికి శ్రీకారం చుడుతూ బాలంరాయి లీ ప్యాలెస్లో వివిధ వర్గాల వారితో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో సీఎంనుద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ఆవేశంలో చేశానని, రాజ్యాంగ పదవుల్లో ఉన్న సీఎం అన్నా, మంత్రులన్నా తనకు గౌరవమేనన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని, పర్సనల్ అజెండా అంటూ లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే తప్పకుండా ఉపసంహరించుకుంటానని వ్యాఖ్యానించారు. గట్టి గా మాట్లాడినంత మాత్రాన కొమ్ములొచ్చినట్లు కాదని, ఆత్మాభిమానం, అస్తిత్వం కోసమే తమ పోరాటమన్నారు. సికింద్రాబాద్ను కార్పొరేషన్గా కానీ, జిల్లాగా కానీ చేయాలని, లేని పక్షంలో ఉన్నది ఉన్నట్లుగానే ఉండాలనేదే తమ అభిమతమన్నారు. దీంతో ఏం జరగనుందన్నది నగర ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. ఏం జరగనుందో చూద్దామనే ధోరణిలో వేచి చూస్తున్నారు. -
మరో ఇద్దరి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు డిస్మిస్
సాక్షి, హైదరాబాద్: మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవన్న స్పీకర్.. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ తీర్పు వెలువరించారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తీర్పు స్పీకర్ ఇచ్చారు. ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పెండింగ్లో ఉంది. త్వరలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసులో కూడా స్పీకర్ తీర్పు చెప్పనున్నారు.పది మంది ఎమ్మెల్యేలలో.. ఐదుగురిపై దాఖలైన పిటిషన్లను శాసనసభ స్పీకర్ ఇదివరకే కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ఇద్దరి వ్యవహారంపై తీర్పు ఇచ్చారు. తమ పార్టీ సింబల్పై నెగ్గిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య(చేవెళ్ల), పోచారం శ్రీనివాసరెడ్డి(బాన్సువాడ)లు ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పీకర్ తీర్పు ఇచ్చారు.మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సంజయ్(జగిత్యాల) కాకుండా దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్) ఇప్పటిదాకా స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీళ్ల విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది.అంతకు ముందు.. గత నెలలో(డిసెంబర్ 17న) ఆరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు(ఖమ్మం), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్చెరు), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(గద్వాల్), టి. ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్) పిటిషన్లను స్పీకర్ కొట్టిపారేశారు. -
హృదయ విదారక ఘటన.. సాంబార్లో పడి చిన్నారి మృతి
సాక్షి,ఖమ్మం: వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. సింహాద్రి, సరోజినీ దంపతుల చిన్నారి కుమార్తె రమ్యశ్రీ (6) ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు వేడి సాంబార్లో పడి కన్నుమూసింది. ఇంట్లో వంట పనులు జరుగుతున్న సమయంలో రమ్యశ్రీ పక్కనే ఆడుకుంటూ ఉండగా, జారి వేడి సాంబార్ పాత్రలో పడింది. తీవ్రంగా కాలిన గాయాలతో హహాకారాలు చేస్తున్న చిన్నారిని కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి చిన్నారిని హైదరాబాద్కు తరలించారు. మార్గం మద్యలో చిన్నారి కన్నుమూసింది. ఈ ఘటనతో ఇందిరమ్మ కాలనీ అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తల్లిదండ్రుల ఆవేదన చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. -
TG: ఇద్దరు ఎమ్మెల్యేలపై తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాయితీ ఎంతకూ తెగడం లేదు. పది మంది ఎమ్మెల్యేలలో.. ఐదుగురిపై దాఖలైన పిటిషన్లను శాసనసభ స్పీకర్ ఇదివరకే కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇవాళ అదీ సంక్రాంతి పండుగపూట.. మరో ఇద్దరి వ్యవహారంపై తీర్పు ఇవ్వబోతున్నారు. తమ పార్టీ సింబల్పై నెగ్గిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య(చేవెళ్ల), పోచారం శ్రీనివాసరెడ్డి(బాన్సువాడ)లు ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మరికాసేపట్లో తీర్పు ఇవ్వనున్నారు. ఇంతకు ముందులాగే పిటిషన్లు డిస్మిస్ చేస్తారా?.. అనర్హత వేటేమైనా వేస్తారా?.. నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి. అయితే.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సంజయ్(జగిత్యాల) కాకుండా దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్) ఇప్పటిదాకా స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీళ్ల విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది. అంతకు ముందు.. గత నెలలో(డిసెంబర్ 17న) ఆరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు(ఖమ్మం), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్చెరు), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(గద్వాల్), టి. ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్) పిటిషన్లను స్పీకర్ కొట్టిపారేశారు. ఈ ఐదుగురు సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారని తీర్పు సందర్భంగా స్పష్టం చేశారాయన. అయితే స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న బీఆర్ఎస్.. ఈ అంశంలో విచారణ ముగిశాక కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. -
నోటీసుల గుబులు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కేసు పలుజిల్లాల తహసీల్దార్లను వణికిస్తోంది. తమకు నోటీసులు వస్తాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2021 –2025 మధ్య కాలంలో జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పని చేసిన తహసీల్దార్లు, కార్యాలయ సిబ్బందిలో టెన్షన్ నెలకొంది. ఈ కేసును విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో ఏసీబీ అధికారులు కూడా ఉన్న నేపథ్యంలో.. తమకు నోటీసులు తప్పవనే భావనలో తహసీల్దార్లు ఉన్నారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు నిర్వహించిన అనేకమంది రైతులకు ఇప్పటికే రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థిక పరమైన లావాదేవీల్లో అక్రమాలు జరగడం, పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితుల్లో మండల రెవెన్యూ అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది. గత రెండు, మూడు రోజులుగా జరుగుతున్న ఆడిట్లో భాగంగా.. తాము గతంలో పనిచేసిన కార్యాలయాల్లో జరిగిన లావాదేవీల్లో తేడాలేమైనా వచ్చాయా అనే కోణంలో తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం తాము పనిచేస్తున్న చోట్ల తమకు తెలియకుండా జరిగిన ఏవైనా అక్రమాలు బయటకు వస్తాయోమేననే ఆందోళనా వ్యక్తమవుతోంది. పండుగ తర్వాత రంగంలోకి ఏసీబీ..? ఈ కేసుకు సంబంధించి సాంకేతిక, నేర పూరిత అక్రమాలకు సంబంధించిన ఆధారాలను రాబట్టడంలో ప్రభుత్వం నియమించిన కమిటీ నిమగ్నమైంది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో పోలీసుల విచారణ ఓవైపు, సాంకేతిక ఆధారాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధరణి, భూభారతి లావాదేవీల ఆడిటింగ్ మరోవైపు జరుగుతున్నాయి. ఈ విచారణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత లభించే సమాచారాన్ని బట్టి సంక్రాంతి పండుగ తర్వాత ఏసీబీ రంగంలోకి దిగుతుందని, అప్పుడు అసలు విచారణ ప్రారంభమవుతుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. కలెక్టర్లకు నివేదికలు.. సాంకేతిక ఆధారాల సమీకరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడిటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. సోమ, మంగళవారాల్లో జరిగిన ఈ ఆడిటింగ్లో తేడా వచ్చిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం నుంచి తహశీల్దార్లకు పంపారు. ఈ లావాదేవీల విషయంలో ఏం జరిగిందనే వివరాలు పంపాలని కోరగా, తహశీల్దార్లు ఆ మేరకు తమ జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపినట్టు తెలిసింది. కాగా కలెక్టర్లు ప్రతి లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి లావాదేవీ వారీగా వివరాలను ధ్రువీకరించుకుంటూ 90 శాతానికి పైగా లావాదేవీల వివరాలను తిరిగి సీసీఎల్ఏ కార్యాలయానికి పంపినట్టు సమాచారం. రెండు చలాన్లు, క్యాన్సిలేషన్ డీడ్ల విషయంలో అంతా సవ్యంగానే ఉందని, అక్కడక్కడా చిన్న చిన్న తేడాలు మినహా ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టే స్థాయిలో ఈ రెండు లావాదేవీల్లో అక్రమాలు జరగలేదని తహశీల్దార్లు, కలెక్టర్ల ద్వారా సీసీఎల్ఏకు నివేదించినట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
మళ్లీ.. కొత్త జిల్లాల లొల్లి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ అంశం ఇప్పుడు అన్నివర్గాల్లో హాట్టాపిక్గా మారింది. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించడమే దీనికి కారణం. ఉద్యోగాల సాధన కోసం కసరత్తు చేస్తున్న నిరుద్యోగులతోపాటు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, స్థానిక రాజకీయ నాయకులు, విద్యార్థులు... ఇలా అన్ని వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏవిధంగా ఉంటుందనే సందేహం కొందరిలో ఉంటే... ఈ తంతు ఎలాంటి సమస్యలకు దారితీస్తుందోననే ఆందోళన మరికొందరిలో వ్యక్తమవుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్లలో రాష్ట్రంలోని 10 జిల్లాలను అప్పటి ప్రభుత్వం 33 జిల్లాలకు పెంచింది. తొలుత 31 జిల్లాలుగా ఏర్పాటు చేసిన అనంతరం మరో రెండు జిల్లాలను కలిపి జిల్లాల సంఖ్యను 33కు పెంచింది. అలాగే, రెవెన్యూ డివిజన్లు 74కు పెరగగా, రెవెన్యూ మండలాల సంఖ్య 612కు చేరింది. ఆ తర్వాత ప్రభుత్వం 33 జిల్లాలను ఏడు జోన్లుగా, రెండు మల్టీజోన్లుగా వర్గీకరించింది. ఈమేరకు రాష్ట్రపతి ఆమోదంతో 2018 ఆగస్టు నుంచి నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ విభాగాల విభజన, ఉద్యోగుల కేటాయింపులు, స్థానికత నిర్ధారణ, ఉద్యోగ నియామకాలు... ఇలా పలురకాల అంశాల్లో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు ఐదేళ్లు పట్టగా... ఉద్యోగుల కేటాయింపుల్లో సమస్యలు, స్థానికతకు సంబంధించిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ తరుణంలో కొత్తగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మండలాల హేతుబద్ధీకరణ అంశాలు తెరపైకి రావడం గమనార్హం. మార్పుచేర్పులు చేసినా... జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంపు లేదా తగ్గింపు అని అనను’అని పేర్కొన్నారు. సంఖ్యాపరంగా మార్పు ఉండదని చెప్పినప్పటికీ.. జనాభా ప్రాతిపదికన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను హేతుబద్దీకరిస్తామని స్పష్టంచేశారు. దీంతో జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎం ప్రకటన ఆచరణలోకి వస్తే ముందుగా తెరపైకి వచ్చేది స్థానికత అంశమే. ఇది కేవలం ఉద్యోగులకు సంబంధించినదే కాదు. నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అందరికీ సంబంధించింది. ఈ నిర్ణయంతో పాలన పరంగా మార్పులు చోటుచేసుకోవడంతోపాటు ఉద్యోగుల కేటాయింపులు, కొత్తగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జోనల్, మల్టీజోనల్ పరిధుల్లో మార్పులు అనివార్యమవుతాయి. దీనికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అవుతుంది. నిరుద్యోగులతోపాటు విద్యార్థులు చదువుతున్న విద్యాసంస్థల ప్రాంతాల వారీగా స్థానికత ఖరారు చేయాలి. ఈ స్థానికతే తదుపరి చదువులకు, ఉద్యోగాలకు అవసరమవుతుంది. స్థూలంగా చూస్తే ఏమాత్రం మార్పులు చేసినా అది అన్ని విభాగాల్లోనూ ప్రభావం చూపుతుందని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎడతెగని పంచాయితీ... రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రాకముందు కేవలం రెండు జోన్లు మాత్రమే ఉండేవి. కానీ కొత్త జిల్లాల ఏర్పాటుతో జోన్ల సంఖ్య 7కు పెరగగా... కొత్తగా మల్టీజోన్లను ఏర్పాటు చేశారు. జోన్ల సంఖ్య పెంపుతో విద్యార్థులు, ఉద్యోగుల స్థానికతలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన జోనల్ విధానం అమలులో భాగంగా ఉద్యోగ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జీఓ 317 జారీ చేసింది. స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సీనియార్టీని ముందు వరుసలోకి తీసుకోవడంతో మెజార్టీ ఉద్యోగులు జిల్లాలు మారిపోయారు. దాదాపు 30 శాతం మంది సొంత ప్రాంతాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు కేటాయించబడ్డారు. ప్రధానంగా జిల్లా కేడర్ ఉద్యోగుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. పెద్ద సంఖ్యలో టీచర్లతోపాటు పోలీస్ కానిస్టేబుల్స్ ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ⇒ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఓ 317 ద్వారా నష్టపోయిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆన్లైన్లో ఆర్జీలను స్వీకరించింది. ఏకంగా 1.5 లక్షల మంది ఆర్జీలు పెట్టుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో కొన్నింటిని పరిష్కరించినా... మరికొందరికి తాత్కాలిక పద్ధతిలో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం డెప్యూటేషన్ పద్ధతిని ఎంచుకుంది. కానీ ఈ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. మరోవైపు ఉద్యోగ కేటాయింపులతో పట్టణ ప్రాంత జిల్లాల్లో ఖాళీలు లేకుండాపోగా... గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణ ప్రాంత అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గిపోవడంతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న పునర్వ్యవస్థీకరణ ప్రక్రియతో ఈ సమస్యలన్నీ పునరావృతమవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. -
బీసీల వాటా 31.4%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లు, చైర్పర్సన్, మేయర్ల పదవుల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మహిళల వారీగావార్డులు, డివిజన్లు, చైర్మన్, మేయర్ పదవులు ఏ కేటగిరీకి ఎన్ని దక్కుతాయో వెల్లడించింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు సంబంధించి పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి బుధవారం జీవో నంబర్ 14 జారీ చేశారు. మున్సిపల్ వార్డులు, డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ స్థానాలు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు, 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళలకు రిజర్వుడు స్థానాల సంఖ్యను ఖరారు చేశారు. బీసీలకు మున్సిపాలిటీల్లో 31.4 శాతం, కార్పొరేషన్లలో 30 శాతం సీట్లు రిజర్వు చేశారు. 121 మున్సిపాలిటీల్లో బీసీలకు 38 చైర్మన్ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ జనరల్కు 19, బీసీ మహిళకు 19 చొప్పున ఖరారయ్యాయి. 10 కార్పొరేషన్లకు గాను బీసీలకు మూడు మేయర్ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ మహిళలకు ఒకటి, బీసీ జనరల్కు రెండు మేయర్ పదవులు దక్కనున్నాయి. -
‘జర్నలిస్టులపై కాంగ్రెస్ సర్కార్ తీరు అనైతికం’
హైదరాబాద్: జర్నలిస్టులపై కాంగ్రెస్ సర్కారు తీరు అనైతికమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. నోటీసుల ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఓ వార్తకు సంబంధించి ఎన్టీవీకి చెందిన పలువురు జర్నలిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కిషన్రెడ్డి ప్రశ్నించారు. విచారణ చేయకుండా చర్యలు తీసుకోవడం సరికాదని, జర్నలిస్టులను బెదిరించి భయపెట్టి చర్యలకు పాల్పడకూడదన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేవారు కిషన్రెడ్డిఅర్థరాత్రి జర్నలిస్టుల అరెస్ట్ సరికాదు బండి సంజయ్ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం తగదన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు బండి సంజయ్పోలీసుల తీరు సమర్థనీయం కాదు కొమ్మినేనిఎన్టీవీకి చెందిన జర్నలిస్టులను అరెస్ట్ చేసే వ్యవహారంలో పోలీసుల తీరు సమర్థనీయం కాదన్నారు రాజకీయ విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాసరావు. సోదాల పేరుతో మీడియా సంస్థలన ఇబ్బంది పెట్టొద్దన్నారు కొమ్మినేని. జర్నలిస్టుల అరెస్ట్ను ఖండిస్తున్నాం: పల్లాజర్నలిస్టుల అరెస్ట్ను బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి ఖండించారు. అర్థరాత్రి తలుపులు పగులగొట్టి జర్నలిస్టులన అరెస్ట్ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ సర్కార చర్యలు ఎమెర్జెన్సీని తలపిస్తున్నాయని, అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పల్లా. -
వ్యవస్థలు వైఫల్యం చెందిన వేళ..
గల్ఫ్ దేశంలో మృతి చెందిన ఓ కార్మికుడి మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేమని కంపెనీ యాజమాన్యం, అలాగే ఇండియన్ ఎంబసీ కూడా చేతులెత్తేసిన పరిస్థితిలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆ వ్యయాన్ని పూర్తిగా భరించిన అరుదైన మానవీయ ఘటన చోటు చేసుకుంది.నిజామాబాద్ జిల్లా, నవీపేట మండలం యామ్చా గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు (తొగరి అబ్బయ్య) అనే 40 ఏళ్ల కార్మికుడు, నాలుగు నెలల క్రితం ఓమాన్ దేశంలోని సలాలా ప్రాంతంలో ఒక క్లీనింగ్ కంపెనీలో పని చేయడానికి వెళ్లాడు. యాజమాన్యం వైఖరి నచ్చక కంపెనీ నుంచి బయటకు వెళ్లిన కొంతకాలానికే, డిసెంబర్ 14న ఇబ్రి ప్రాంతంలో మృతి చెందాడు. అనుమతి లేకుండా కంపెనీ నుంచి వెళ్లిన కార్మికులను అక్కడి చట్టాల ప్రకారం ‘ఖల్లివెల్లి’ (అక్రమ నివాసి)గా పరిగణించడంతో, వారికి లభించాల్సిన కొన్ని హక్కులు, సౌకర్యాలు రద్దవుతాయి. ఈ నేపథ్యంలో, “అబ్బులు, కంపెనీ నుంచి వెళ్లిపోయాడు కాబట్టి అతనితో మాకు సంబంధం లేదు” అంటూ మృతదేహం తరలింపు ఖర్చును భరించబోమని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ఐసీడబ్ల్యూఎఫ్) నుంచి సహాయం అందిస్తారు. అయితే నిధుల కొరత ఉందని పేర్కొంటూ, మృతదేహం తరలింపుకు రూ.1.50 లక్షలు చెల్లించాలని మస్కట్లోని ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు కుటుంబానికి ఫోన్ చేసి తెలిపారు. ఆ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితిలో ఓమాన్లోనే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు.ఈ పరిస్థితుల్లో మృతుడి భార్య తొగరి చిన్న సావిత్రి తన కుమారుడు సంజయ్, యామ్చా గ్రామ సర్పంచ్ బేగారి సాయిలుతో కలిసి మంగళవారం (13.01.2026) హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. తన భర్త పార్థివదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చును సీఎం సహాయనిధి నుంచి మంజూరు చేయాలని ఆమె వేడుకున్నారు. కాగా ఆమె ఇదివరకే డిసెంబర్ 29న మెయిల్ ద్వారా సీఎంఓ కు వినతిపత్రం పంపారు. దీనికి స్పందనగా జీఏడి ఎన్నారై విభాగం ఇండియన్ ఎంబసీకి వైర్ మెసేజ్ పంపింది.ఇదిలా ఉండగా, అబ్బులు చిన్నాపూర్ కు చెందిన ఒక గల్ఫ్ సబ్ ఎజెంట్ కు రూ.1.20 లక్షలు చెల్లించి ఓమాన్ కు వెళ్ళాడు. ఎమిగ్రేషన్ క్లియరెన్స్ మాత్రం అస్సాం రాజధాని గౌహతి లోని ఒక రిజిస్టర్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా జరిగింది. ప్రవాసీ భారతీయ బీమా యోజన (పిబిబివై) అనే రూ.10 లక్షల విలువైన ప్రమాదం బీమా పాలసీ కూడా జారీ అయింది. వలస కార్మికుడు విదేశాల్లో మరణించినప్పుడు మృతదేహాన్ని తరలించేందుకు అయ్యే ఖర్చును ప్రవాసీ పాలసీ ద్వారా పొందే అవకాశాన్ని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ ఎందుకు వినియోగించలేదన్నది పెద్ద ప్రశ్న. చట్ట ప్రకారం శవాన్ని తరలించే బాధ్యత రిక్రూటింగ్ ఏజెన్సీ తీసుకోవాలి. సమస్య 'మదద్' పోర్టల్ లో నమోదు అయిన తర్వాత కూడా ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయం గురించి సరిగా పట్టించుకోలేదని స్పష్టం అవుతున్నది.తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, కమిటీ సభ్యుడు నంగి దేవేందర్ రెడ్డి, ప్రవాసీ ప్రజావాణి వాలంటీర్ మహమ్మద్ బషీర్ అహ్మద్ ఈ అంశాన్ని సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జి. చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన డా. చిన్నారెడ్డి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రిని ఆదేశించారు.చలించిన ఐఏఎస్ అధికారిణిఇదే అంశాన్ని సీఎం ప్రజావాణి నోడల్ అధికారి, ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్కు వివరించగా, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని వెంటనే స్పందించారు. ఓమాన్కు వెళ్లిన మూడు నెలలకే అబ్బులు మృతి చెందడం, నెలరోజులుగా ఆసుపత్రి శవాగారంలో మృతదేహం ఉండిపోవడం, భర్త పార్థివదేహం కోసం గ్రామం నుంచి హైదరాబాద్ వరకు వచ్చి మొరపెట్టుకున్న భార్య పరిస్థితి ఆమెను చలింపజేసింది.ఫలితంగా, ఓమాన్ నుంచి మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు అవసరమైన రూ.1.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే చెక్కుగా జారీ చేసి మృతుడి భార్య చిన్న సావిత్రికి అందజేశారు. ఓమాన్లో ఇండియన్ ఎంబసీ గుర్తింపు పొందిన ఇండియన్ సోషల్ క్లబ్ – తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్ ఈ వ్యవహారంలో సమన్వయం చేస్తూ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.ఈ మానవీయ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డిని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ బెగారి సాయిలు, మంద భీంరెడ్డి తదితరులు ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన మానాల మోహన్ రెడ్డి, అనిల్ ఈరవత్రి, నాగేపూర్ మహిపాల్ రెడ్డికి వారు కృతఙ్ఞతలు తెలిపారు. -
NTV రిపోర్టర్ల అరెస్టు.. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ఓ కథనానికి సంబంధించిన కేసులో హైదరాబాద్ పోలీసులు ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేశారు. ఈ అక్రమ అరెస్టులను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. జర్నలిస్టుల అరెస్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.కాంగ్రెస్ పాలన ప్రతిసారీ ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తోంది.జర్నలిస్టులను నేరస్తుల్లా చూడటం దురదృష్టకరం. నోటీసులు ఇచ్చి విచారణకు పిలవచ్చు కదా?. అర్థరాత్రి ఇళ్లల్లోకి వెళ్లి అతిగా ప్రవర్తించడం సరికాదు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి’అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో ముగ్గురు జర్నలిస్టులను అత్యంత అమానవీయ పద్ధతిలో, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు Dear @RahulGandhi,I hope you are taking note of how the Telangana branch of your "Mohabbat ki Dukan" is trampling upon constitutional rights of citizens. Last night, three journalists were abducted by state police. In once instance, police broke open the doors of a journalist's…— KTR (@KTRBRS) January 14, 2026 -
NTV రిపోర్టర్ల అరెస్ట్.. రేవంత్ సర్కార్పై జర్నలిస్టుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు ఎన్టీవీ రిపోర్టర్లు అరెస్ట్ ఘటన తీవ్ర దుమారం లేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఒక వార్త విషయంలో విచారించాలంటూ మంగళవారం రాత్రి ఎన్టీవీ రిపోర్టర్లను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో నుంచి జర్నలిస్టులను పోలీసులు తీసుకెళ్లారు. ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న జర్నలిస్టును కూడా ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఎన్టీవీ రిపోర్టర్ల అక్రమ అరెస్ట్పై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికీ ముగ్గురు ఎన్టీవీ రిపోర్టర్లు పోలీసుల అదుపులోనే ఉండటం గమనార్హం. -
ఇది రేవంత్ సర్కార్ రాజకీయ వికృత క్రీడ
సాక్షి, హైదరాబాద్: పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు అన్నారు. తెలంగాణవ్యాప్తంగా మీడియా ప్రతినిధులను, డిజిటల్ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడం అక్రమమని అన్నారు. ‘‘మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా? జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి. .. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియా పై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. అంతేకాదు డీజీపీ శివధర్రెడ్ఢికి ఫోన్ చేసి జర్నలిస్టులను విడుదల చేయాలని కోరారు.పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు.మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా?ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా?జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా…— Harish Rao Thanneeru (@BRSHarish) January 14, 2026ఈ అరెస్టులను తెలంగాణ పీసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఖండించారు. ‘‘అర్ధరాత్రిళ్లు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సదరు జర్నలిస్టులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని ఉంటే బాగుండేది. జర్నలిస్టుల అరెస్టుతో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదు’’ అని అభిప్రాయపడ్డారు. ఓ మంత్రి-ఐఏఎస్ అధికారిణి అంటూ.. ప్రముఖ చానెల్లో కథనం ప్రసారం అయ్యింది. దాని ఆధారంగా అటు సోషల్ మీడియాలో విస్తృత కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మంత్రి కోమటిరెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఈ క్రమంలో సదరు ప్రముఖ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులను గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఇంటికెళ్లి తలుపులు బద్ధలు కొట్టి మరీ అరెస్ట్ చేశారని.. ఎలాంటి ప్రొసీజర్, నోటీసులు ఫాలో కాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. రాష్ట్రంలో మరికొన్ని చోట్లా పోలీసులు పాత్రికేయుల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా పలు చానెల్స్, 40కి పైగా యూట్యూబ్ చానెల్స్పై పోలీసులు దృష్టిసారించినట్లు సమాచారం. అయితే అక్రమ అరెస్టులు.. పోలీసుల ప్రతాపంపై జర్నలిస్టుల సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. -
‘సీఎం, మంత్రి’ కేసుల దర్యాప్తునకు సిట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి ఫొటోను అసభ్యంగా మార్ఫింగ్ చేయడం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై అనుచిత కథనాల ప్రసారాన్ని పోలీస్ విభాగం సీరియస్గా తీసుకుంది. ఈ రెండు కేసుల్నీ దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ బత్తుల శివధర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ పర్యవేక్షణలో పనిచేసే ఈ సిట్కు సిటీ నార్త్ రేంజ్ జాయింట్ సీపీ ఎన్.శ్వేత నేతృత్వం వహిస్తారు. ఇందులో మొత్తం 8 మంది అధికారులను నియమించారు. ఇప్పటికే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన అధికారిక సిట్ను సజ్జనారే పర్యవేక్షిస్తున్నారు. ⇒ సీఎం రేవంత్రెడ్డి ఫొటోను అసభ్యంగా మారి్ఫంగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.నర్సింహ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటకొండ గ్రామానికి చెందిన కావలి వెంకటేశ్ అసభ్యంగా మారి్ఫంగ్ చేశారని, దాన్ని ‘తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్’లో పోస్టు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ⇒ రాష్ట్ర కేడర్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణిని ప్రస్తావిస్తూ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై జరిగిన దుష్ఫ్రచారానికి సంబంధించి ఐఏఎస్ అ«ధికారుల సంఘం కార్యదర్శి జయేశ్రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఇందులో టీవీ, యూట్యూబ్ చానళ్లతోపాటు వెబ్సైట్లు కలిపి తొమ్మిదింటిని నిందితుల జాబితాలో చేర్చారు. ఈ ఫిర్యాదు, కేసు ల్లో ఎక్కడా కోమటిరెడ్డి పేరు లేకపోయినా, ఆయన ఇటీవలే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ కథనాలను ఖండించిన విషయం విదితమే. ఈ రెండు కేసుల్లోని అంశాలను తీవ్రంగా పరిగణించిన పోలీసు విభాగం సిట్ ఏర్పాటు చేసి, రెండు కేసుల్నీ అక్కడకు బదిలీ చేసింది. ఈ సిట్లో కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న సీసీఎస్ టీమ్–10 ఏసీపీ జి.గురు రాఘవేంద్రతోపాటు చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతం, హైదరాబాద్ పరిపాలన విభా గం డీసీపీ కె.వెంకటలక్ష్మి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి.అరవింద్ బాబు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఎస్పీ బి.ప్రతాప్ కుమార్, హైదరాబాద్ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ సి.శంకర్రెడ్డి, షీ–సైబర్ సెల్ ఎస్సై పి.హరీశ్ సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు కేసుల దర్యాప్తు పూర్తి చేసే సిట్ అభియోగపత్రాల దాఖలు వరకు బాధ్యత తీసుకోనుంది. సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే కొన్ని చోట్ల సోదాలు సైతం చేశారు. -
‘విద్వేషం’పై ఉక్కుపాదం!
సాక్షి, హైదరాబాద్: విద్వేష పూరిత ప్రసంగాలు, వార్తల ప్రచారాన్ని కట్టడి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. ప్రభుత్వంలో ఉండే కీలక వ్యక్తులు, అధికారులే లక్ష్యంగా ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో ప్రసారమయ్యే నిరాధార ఆరోపణలు, విమర్శలకు చెక్ పెట్టేందుకు వీలుగా కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన బిల్లు (విద్వేష పూరిత ప్రసంగాలు, ద్వేష పూరిత నేరాల (నివారణ) బిల్లు, 2025) తరహాలో ప్రత్యేక చట్టం తేవాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇప్పటికే ఈ అంశాలను పరిశీలించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై ఆరోపణలతో ఓ న్యూస్ చానల్లో ప్రసారమైన వార్త, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూప్లలో ప్రచారం చేయడంపై నారాయణపేట జిల్లా మద్దూర్ పోలీస్స్టేషన్లో వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగిస్తూ డీజీపీ బి.శివధర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విద్వేష పూరిత ప్రచారాలపై ప్రభుత్వం సీరియస్గా ఉందనే విషయం ఈ సిట్ ఏర్పాటుతో స్పష్టం అవుతోంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇలాంటి కేసులు ఏవైనా నమోదయ్యాయా అని సిట్ బృందం పరిశీలించే అవకాశం ఉంది. నిరాధార ఆరోపణలు చేయడానికి కారణాలు ఏంటి..? తెరవెనుక ఇంకెవరైనా వ్యక్తులు ఉండి చేయిస్తున్నారా? అన్నది నిగ్గు తేల్చే దిశగానే సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు అయ్యిందని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. సిట్ బృందం గుర్తించే అంశాలను ఆధారంగా చేసుకుని కర్ణాటక తరహాలో చట్టం తేవడానికి అవకాశం ఉందని ఆయన చెప్పారు. కర్ణాటక బిల్లులో ఏముంది..? కర్ణాటక ‘హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ నివారణ బిల్లు–2025’లో అనేక కీలక అంశాలున్నాయి. సమాజంలో మతం, కులం, జాతి, లింగం, భాష తదితర అంశాల ఆధారంగా విద్వేషాలు, ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యలను అరికట్టే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. విద్వేష పూరిత ప్రసంగాలు, నేరాలను నియంత్రించడంతోపాటు అటువంటి నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు విధించడం, బాధితులకు తగిన పరిహారం అందించడం లక్ష్యంగా దీనికి రూపకల్పన చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.బహిరంగ ప్రదేశాల్లో లేదా ఎల్రక్టానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా మాటలతో, రాతలతో, సంకేతాలతో లేదా దృశ్య రూపాల్లో వ్యక్తి లేదా వర్గంపై ద్వేషం, శత్రుత్వం, వైరం రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసే వ్యాఖ్యలను ‘విద్వేష ప్రసంగం’గా పరిగణిస్తామని బిల్లులో పేర్కొన్నారు. మతం, జాతి, కులం, లింగం, లైంగిక అభిముఖ్యత, జన్మస్థలం, నివాసం, భాష, వైకల్యం, గిరిజన గుర్తింపు వంటి అంశాలపై పక్షపాతం చూపితే అది నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్ని కాగి్నజబుల్, నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు.ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ కోర్టులో విచారణ జరుగుతుంది. ద్వేష నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ముందుగానే గుర్తిస్తే ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్ లేదా డిప్యూటీ ఎస్పీ హోదాకు తక్కువ కాని పోలీసు అధికారి ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. ద్వేషాన్ని ప్రోత్సహించే కంటెంట్ను సోషల్ మీడియా, ఎల్రక్టానిక్ మీడియా నుంచి తొలగించేందుకు లేదా బ్లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ద్వేష నేరానికి ఏదైనా సంస్థ లేదా సంఘం పాల్పడితే, ఆ సంస్థతో పాటు దాని నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారిపై కూడా కేసులు నమోదు చేస్తారు.కఠిన శిక్షలు⇒ ద్వేష నేరానికి పాల్పడితే కనీసం ఒక సంవత్సరం నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తారు. ⇒ అదే నేరాన్ని పునరావృతం చేస్తే కనీసం రెండేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ.1 లక్ష జరిమానా ఉంటుంది. ⇒ బాధితులకు నష్టం తీవ్రతను బట్టి న్యాయస్థానం తగిన పరిహారం ఇవ్వవచ్చు. -
అంతులేని దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చలాన్ల ఎడిటింగ్ ద్వారా రూ. 50 కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించిన వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తులో మరిన్ని విస్మయకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి తదితర జిల్లాల్లో జరిగిన ఈ కుంభకోణంపై ఆరా తీసేందుకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా తాజాగా నిర్వహించిన ఆడిట్లో రెండు రకాల ప్రధాన లావాదేవీల్లో తేడాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఒకే రిజిస్ట్రేషన్ కోసం రెండు చలాన్లు కట్టే వెసులుబాటు ఉండటంతో తక్కువ మొత్తంలో కట్టిన చలాన్ను ప్రభుత్వానికి చెల్లించి ఎక్కువ మొత్తంలో కట్టిన చలాన్ను వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మరల్చుకున్నారని ఆడిట్లో తేలినట్లు సమాచారం. అలాగే సేల్డీడ్ల రిజిస్ట్రేషన్ తర్వాత వాటిని రద్దు చేసుకున్నట్లు చూపి క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 2 వేలు చెల్లించి అంతకుముందు చేసుకున్న రిజిస్ట్రేషన్ను కొనసాగిస్తున్నారా అనే సందేహం కూడా ఈ పరిశీలనలో తలెత్తింది. అయితే ఈ రెండు అంశాల్లో ఏ మేరకు ఏం జరిగిందన్న దానిపై ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ రెండు అంశాల్లో తేడాలున్న లావాదేవీల వివరాలను తహసీల్దార్లకు పంపి వివరణ కోరారు. ఒకవేళ తాజా ఆడిట్లో తేలిన ఈ రెండు అంశాల్లోనూ దోపిడీ జరిగినట్లు తేలితే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కుంభకోణం విలువ రూ. వందల కోట్లలో ఉంటుందని రెవెన్యూ శాఖ వర్గాలు అంటున్నాయి. నాలుగు స్థానాలు... మూడు కోణాలు తాజా కుంభకోణం వెనుక నాలుగు స్థానాల్లో పనిచేసే సిబ్బంది, అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు, పోర్టల్ ఆపరేటర్లు, సీసీఎల్ఏ సిబ్బంది పాత్రతోపాటు తహసీల్దార్ల నిర్లక్ష్యం వల్లే అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగం, సిబ్బంది కుమ్మక్కు అనే మూడు కోణాల్లో దర్యాప్తు వేగవంతమవుతోందని.. స్కామ్ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్న జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతోపాటు మిగిలిన చోట్ల జరిగిన లావాదేవీలపైనా దర్యాప్తు జరుపుతున్నామని ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ వర్గాలు చెబుతున్నాయి. మరో 4–5 రోజుల్లో అన్ని అంశాలు కొలిక్కి వస్తాయని అంటున్నాయి. అయితే చలాన్ల ఎడిటింగ్ ద్వారానే అక్రమాలు జరిగాయన్నది ఉన్నతాధికారుల ప్రాథమిక అభిప్రాయమైనప్పటికీ అలా జరిగి ఉండకపోతే మాత్రం ఏకంగా పోర్టల్ను హ్యాక్ చేసి ప్రభుత్వ సొమ్మును కాజేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక చలాన్... ఎనిమిది ప్రశ్నలు 1 ఇష్టారాజ్యంగా స్లాట్ల బుకింగ్కు అనుమతి ఎలా? గతంలో ధరణి, ప్రస్తుత భూభారతి పోర్టల్ ద్వారా ఎవరు ఎక్కడి నుంచైనా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించడమే ఈ కుంభకోణానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. క్రయ, విక్రయదారులతో సంబంధం లేని ఫోన్ నంబర్లతో స్లాట్లు బుక్ చేసి, ఆ స్లాట్ ఐడీల ఆధారంగానే దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఒకే ఫోన్ నంబర్పై 70 నుంచి 100 వరకు స్లాట్లను బుక్ చేసినట్లు సమాచారం. 2 ఆ ఉద్యోగులనే ఎందుకు కొనసాగించారు? ధరణి పోర్టల్ను టెర్రాసిస్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహించగా భూభారతి పోర్టల్ను ఎన్ఐసీకి అప్పగించారు. అయితే అప్పుడు, ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల్లో 90 శాతం మంది వారే కావడం కూడా ఈ అక్రమాలు కొనసాగేందుకు ఊతమిచ్చిందన్న చర్చ నడుస్తోంది. వేతనాలు తక్కువగా ఉండే పోర్టల్ ఆపరేటర్లలో 60 శాతం మంది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్ చేసి అదనపు ఆదాయం పొందుతుండటంతో మీ–సేవా కేంద్రాల నిర్వాహకులతోపాటు ఆపరేటర్ల పాత్రపైనా దర్యాప్తు జరుగుతోంది. 3 ఎడిట్ చేశారా.. హ్యాక్ చేశారా? స్లాట్ బుకింగ్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించేటప్పుడే చలాన్లను ఎడిట్ చేసినట్లు అధికారులు ప్రాథమిక అవగాహనకు వచ్చారు. మీ–సేవా నిర్వాహకులు లేదా ఆపరేటర్లు కట్టిన చలాన్లను సీసీఎల్ఏ కార్యాలయ సర్వర్ వద్ద ఉండే సిబ్బంది ఎడిట్ చేస్తేనే ఇది సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. అలా జరగాలంటే మీ–సేవా, ధరణి ఆపరేటర్లు, సీసీఎల్ఏ సిబ్బంది కుమ్మక్కు కావాల్సి ఉంటుందని.. అది సాధ్యం కాదనుకుంటే చలాన్ దోపిడీ జరిగినప్పుడల్లా రిజిస్ట్రేషన్ పోర్టల్నే హ్యాక్ చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. 4 తహసీల్దార్లు ఏం చేస్తున్నట్లు? అసిస్టెంట్ సబ్రిజిస్ట్రార్ హోదాలో ఉండే తహసీల్దార్లకు కేవలం భూమి వివరాలు, క్రయ, విక్రయదారుల వ్యక్తిగత వివరాలు సరిచూసుకునే బాధ్యత తప్ప ప్రభుత్వానికి అందాల్సిన మొత్తాన్ని చెక్ చేసే వ్యవస్థ వారి వద్ద లేదని.. ధరణి పోర్టల్ నుంచే ఇది కొనసాగుతున్నప్పటికీ భూభారతి అమల్లోకి వచ్చినా కూడా దీన్ని మార్చలేదని తెలుస్తోంది. స్లాట్ బుకింగ్ చేసిన వారు ప్రింట్ రూపంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కు జత చేసే చలాన్ జిరాక్స్ను చూసి తహసీల్దార్లు ఎలా సంతకాలు పెట్టారన్నది కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. 5 తనిఖీ వ్యవస్థ లేదా? సాధారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సీనియర్ అసిస్టెంట్ హోదాలోని ఓ ఉద్యోగి చెక్ చేసి సబ్ రిజిస్ట్రార్కు పంపుతారు. సబ్రిజిస్ట్రార్ ఆయా డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఫీజు, చలాన్ అంశాలను సరిచూసుకొని రిజిస్ట్రేషన్కు పంపుతారు. కానీ వ్యవసాయ భూముల విషయంలో ఒకసారి స్లాట్ బుక్ అయిన డాక్యుమెంట్ నేరుగా తహశీల్దార్లకే వెళ్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే సమయంలో ప్రింట్ తీశాకే చలాన్ ఎంత కట్టారన్నది రివర్స్ ఎండార్స్మెంట్లో కనిపిస్తోంది. 6 అప్పుడైనా చూడాలి కదా? తహసీల్దార్లు పనిఒత్తిడి వల్ల రివర్స్ ఎండార్స్మెంట్లో ఎంత చలాన్ వచ్చిందో చూడకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారని.. ఇది కచ్చితంగా వారి నిర్లక్ష్యమేనని దర్యాప్తు కమిటీ భావిస్తోంది. అలాగే తహసీల్దార్లకు తెలిసే ఇదంతా జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. 7 ఫీజు ఎంత కడతారో తెలియదా? వ్యవసాయ భూములను గత ఆరేళ్లుగా రిజిస్ట్రేషన్ చేస్తున్న తహసీల్దార్లకు ఎంత భూమి రిజిస్ట్రేషన్కు ఎంత ఫీజు కడతారో కూడా తెలియదని.. 60 శాతం మంది తహసీల్దార్లు ఆఫీసు సిబ్బందిపైనే ఆధారపడి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఏ డాక్యుమెంట్లో ఏం రాశారో కూడా వారికి అర్థమయ్యే పరిస్థితి లేదని.. ఒకవేళ అర్థమైనా అలా చూసే తీరిక లేదని అంటున్నాయి. 8 లావాదేవీలను ఆడిట్ చేయలేదా? సాగు భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలకు సంబంధించి గత ఆరేళ్లలో ఒక్కసారి కూడా రాష్ట్రవ్యాప్త ఆడిట్ జరగలేదని, అలా జరిగి ఉంటే ఎక్కువగా అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేలిన 2021, 2022లోనే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చేదని తెలుస్తోంది. ‘నాలా’ఫీజు పెంపు గురించి వారికి 8 నెలల దాకా తెలియదట! గతంలో ధరణి పోర్టల్ నిర్వహణ పూర్తిగా ఉన్నతాధికారుల చేతుల్లోనే ఉండేదని తహసీల్దార్లు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన జిల్లాల్లో వ్యవసాయ భూముల వినియోగ మార్పిడి (నాలా) ఫీజును 3 శాతం నుంచి 5 శాతానికి పెంచిన విషయం 7–8 నెలల వరకు తమకు తెలియలేదని వారంటున్నారు. నాలా ఫీజు కింద ఎంత భూమికి ఎంత చలానా కట్టాలో కూడా తమకు తెలిసే పరిస్థితి ఉండేది కాదని పేర్కొంటున్నారు. ఇక సాధారణ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ ఫీజు ఎంత కట్టాలో, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఏముందో అరకొర శిక్షణ ఇస్తే ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును అణాపైసాతో సహా వసూలు చేస్తాం ‘ఇష్టానుసారంగా భూముల రిజిస్ట్రేషన్లు చేసేందుకే గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చింది. కనీసం చలాన్ ఎంత కట్టారో కూడా సరిచూసుకోలేని విధంగా సాంకేతికతను సమకూర్చింది. తహసీల్దార్లకు సరైన శిక్షణ ఇవ్వకపోగా ఆడిట్ వ్యవస్థకు దిక్కేలేదు. ధరణి పోర్టల్ స్థానంలో మేం తెచ్చిన భూభారతి పోర్టల్కు సాంకేతిక సత్తువ సమకూర్చేందుకు కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలోనే ధరణి దరిద్రాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ సొమ్మును అణాపైసాతో సహా తిరిగి తీసుకుంటాం. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం’ – మంత్రి పొంగులేటి -
Hyd: కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి రాజీవ్గాంధీ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం( జనవరి 13వ తేదీ) రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసకుంది.గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. భారీ ఎత్తున మంటల ఎగిసి పడుతూ ఉండటంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. -
ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి కన్నుమూత
రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్ గిర్ (96) ఈరోజు(మంగళవారం, జనవరి 13వ తేదీ) సాయంత్రం హైదరాబాద్లోని జ్ఞాన్భాగ్ ప్యాలెస్లో కన్నుమూశారు. ఆమె నిజాం కోర్టులో ప్రముఖ నోబెల్లో ఒకరైన రాజా ధనరాజ్ గిర్ కుమార్తె. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ భార్య రాజకుమారి ఇందిరాదేవిరాజకుమారి ఇందిరాదేవి చిత్రకారిణి, రచయిత్రి, కవయిత్రి. ఆమె కవిత్వంలో హైదరాబాద్ సంస్కృతి, డెక్కన్ ప్రాంతపు జ్ఞాపకాలు, వ్యక్తిగత అనుభవాలు ప్రతిబింబిస్తాయి.జీవిత చరిత్రజననం: 1930 ఆగస్టు 17తల్లిదండ్రులు: రాజా ధనరాజ్గిర్జీ బహదూర్ , రాణి ప్రేమిలా దేవివిద్య: ఇంటి వద్ద ఆంగ్ల గవర్నెస్ ద్వారా శిక్షణ పొందారువివాహం: ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మసాహిత్య కృషిఇందిరా దేవి ఆంగ్లంలో కవిత్వం రాశారు. ఆమె రచనలు:Return Eternity (1965)Partings in Mimosa (1968)-Memories of the Deccan (2008)సామాజిక సేవలుఅవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో హిందీ అకాడమీకి ఛైర్పర్సన్గా పనిచేశారు.సాహిత్యం, కళలు, ఫోటోగ్రఫీ రంగాల్లో విశేష కృషి చేశారు.వ్యక్తిగత విశేషాలుఆమె పూర్వీకులు మహారాష్ట్రలో పాలకులు.హైదరాబాద్లోని జ్ఞాన్బాగ్ ప్యాలెస్లో నివసించారు.తండ్రి క్రికెట్ను హైదరాబాద్కు పరిచయం చేసినవారిలో ఒకరు -
కూలూవెన్ వర్సిటీతో తెలంగాణ ఈసీ బృందం భేటీ
సాక్షి హైదరాబాద్: బెల్జియం అధికారిక పర్యటనలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) రాష్ట్ర బృందం ప్రపంచ ప్రసిద్ధ కూలూవెన్ యూనివర్సిటీతో కీలక చర్చలు నిర్వహించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలు, ఎన్నికల నిర్వహణ విధానాలపై భారత్-బెల్జియం దేశాల మధ్య పోలికలు ప్రధాన అంశంగా ఈ భేటీ సాగింది.ఈ సందర్భంగా కూలూవెన్ యూనివర్సిటీలోని సోషల్ సైన్సెస్ విభాగం డీన్, ప్రొఫెసర్లు బెల్జియం ఎన్నికల వ్యవస్థ, ఓటింగ్ విధానాలు, సంస్థాగత భద్రతా చర్యలు, ఆధునిక సవాళ్లపై వివరాలను భారత బృందానికి సమగ్రంగా వివరించారు. అనంతరం భారత ప్రతినిధులు దేశంలోని ఎన్నికల వ్యవస్థ విస్తృతి, సామాజిక వైవిధ్యం, సమాఖ్య స్వరూపం వంటి విశిష్ట లక్షణాలను ప్రస్తావిస్తూ భారత ఎన్నికల ప్రక్రియపై తులనాత్మక సమీక్ష ప్రవేశపెట్టారు.అనంతరం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్రెడ్డి మాట్లాడారు. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలెక్షన్ మేనేజ్మెంట్ ఎన్నికల అధికారుల సామర్థ్య వృద్ధి, అంతర్జాతీయ అనుభవాల మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శిక్షణ, సంయుక్త పరిశోధనలు, గ్లోబల్ ఉత్తమ విధానాల పంచకంలో భాగస్వామ్యానికి కూ లూవెన్ యూనివర్సిటీ ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన ఆహ్వానించారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్లో 99 కోట్ల మందికిపైగా ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టేలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న కఠిన చర్యలు, పారదర్శకత, ఎన్నికల సమగ్రత పరిరక్షణ అంశాలను భారత బృందం ఈ సందర్భంగా వారికి వివరించింది.ఈ సమావేశంలో ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డితో పాటు అనుదీప్ దురిశెట్టి, బోయపాటి చెన్నయ్య, కె. అనంత్రెడ్డి, ధృవ కుమార్రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. -
బ్లాక్ మ్యాజిక్ ముగ్గులు గీస్తున్నారు..!
సంక్రాంతి పండుగ వస్తోందంటే.. బడులు, కాలేజీల్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం సాధారణమే..! సహజంగా అమ్మాయిలు పొంగల్, రథం, సంక్రాంతి గాలిపటాలు, హరిదాసుతో కూడిన రంగోళీలతో అలరించడం తెలిసిందే..! కానీ, ఇటీవలికాలంలో ట్రెండ్ మారింది. గడిచిన నాలుగైదు రోజులుగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో రంగోళీ పోటీలో వినూత్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అదేంటో తెలిస్తే.. మీరూ షాకవుతారు..! అందమైన రంగవల్లుల స్థానంలో చేతబడి ముగ్గులు వేస్తున్నారు కొందరు పిల్లలు. ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెట్టినట్లుగా.. చేతబడి బొమ్మలు.. అదే వుడూలను ముగ్గులో పెడుతున్నారు.ఇటీవల హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్ మండల పరిధిలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ముగ్గుల పోటీ జరిగింది. అంతకు ముందురోజు ఓ కుర్రాడు ముగ్గుల పోటీకి పేరు ఇచ్చాడు. టీచర్లు ఆశ్చర్యంతో.. అదేంట్రా? అమ్మాయిలు కదా? ముగ్గులు వేసేది? అని ప్రశ్నిస్తే.. నేను కూడా ముగ్గు వేస్తాను అంటూ సమాధానమిచ్చాడు. సరేనని అవకాశమిస్తే.. పోటీరోజున సీరియస్గా ముగ్గు వేశాడు.జడ్జిమెంట్కు టీచర్ల బృందం ఒక్కోముగ్గును పరిశీలిస్తూ.. ఆ కుర్రాడి ముగ్గు వద్దకు వచ్చి అవాక్కయ్యారు. కొందరైతే భయభ్రాంతులకు గురయ్యారు. కారణమేంటంటే.. అచ్చంగా క్షుద్ర పూజల్లో మాంత్రికులు వేసినట్లుగా ఆ కుర్రాడు చేతబడి ముగ్గు వేశాడు. అంతేకాదు..! ఆ ముగ్గు మధ్యలో ఓ చేతబడి బొమ్మను పెట్టి.. దాన్ని సూదులతో గుచ్చాడు. కంగారుపడ్డ టీచర్లు వెంటనే బకెట్ నీళ్లతో ఆ ముగ్గుని చెరిపివేయించారు. ఈ ఉదంతాన్ని మరవక ముందే.. తాజాగా.. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉండే ఓ కాలేజీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జూనియర్ ఇంటర్ చదివే ఓ అమ్మాయి రంగోళీ పోటీలో ఇదేవిధంగా చేతబడి ముగ్గు వేసి.. భయభ్రాంతులకు గురిచేసింది. ఇక వికారాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు అక్కడి టీచర్లు ‘సాక్షి డిజిటల్’కు తెలిపారు. ఈ ఉదంతాలను గురించి వింటుంటే మీకేమనిపిస్తోంది? పిల్లల్లో చేతబడిపై ఆసక్తి పెరుగుతోందా? లేక.. ఈ మధ్యకాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా మూఢనమ్మకాలవైపు మొగ్గుచూపుతున్నారా? ఈ ప్రశ్నలకు సైకాలజిస్టులు అనేక కారణాలను చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్.. అంటే.. చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం పిల్లలపై చాలా సులభంగా పడుతుందంటున్నారు. అంతేకాదు.. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాల్లో చేతబడి సీన్లు ఎక్కువగా ఉండడంతో.. అనుకున్నది సాధించాలంటే.. ఇదొక్కటే షార్ట్కట్ అనే భావన పిల్లల్లో త్వరగా వస్తుందని వివరిస్తున్నారు. అంతేకాదు.. సినిమాల్లో మంచి కంటే.. చెడు అనేది చాలా త్వరగా పిల్లల్లో నాటుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని సినిమాల్లో మంత్రగాళ్లు చదివే చేతబడి మంత్రాలను పిల్లలు వల్లెవేయడం వంటి కేసులు తమ వద్దకు వచ్చాయని చెబుతున్నారు.ఇక పేరెంటింగ్ నిపుణులు, స్కూల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్లు సైతం తప్పు తల్లిదండ్రులదేనని చెబుతున్నారు. పిల్లలను సరిగ్గా పర్యవేక్షించకుండా తమ పనుల్లో బిజీ అవుతున్నారని, చిన్నారులు ఏంచేస్తున్నారో చూసే తీరిక కూడా వారికి ఉండడం లేదని పేర్కొంటున్నారు. నిత్యం మొబైల్ గేమ్స్ ఆడుతూ.. రీల్స్ చూడడంలో బిజీగా మారిపోతున్న చిన్నారులు క్రమంగా ప్రతికూలాంశాలు ఎక్కువగా ఉండే యాప్స్, మంత్రసాధన సంబంధిత యాప్స్వైపు మొగ్గుచూపుతున్నట్లు వివరిస్తున్నారు. పిల్లలు ఇలా తయారవ్వడానికి ముమ్మాటికీ తల్లిదండ్రుల పర్యవేక్షణలోపమే కారణమంటున్నారు. -
మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు
హైదరాబాద్ : ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఈసారి దాదాపు మూడు కోట్లమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్షణ్ కుమార్, దనసరి అనసూయలు అన్నారు. మేడారం జాతరపై నేడు డా. బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర గిరిజన, ఎస్సి సంక్షేమ, ... శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్, రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి దనసరి అనసూయ (సీతక్క) లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, స్వాతి లక్రా, వివిధ శాఖ కార్యదర్శులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ మాట్లాడుతూ, గత 2024 మేడారం జాతరకు కోటిన్నర మంది హాజరుకాగా, ఈసారి 2026 లో జాతరకు దాదాపు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 150 కోట్ల నిధులను మంజూరు చేసి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నందున ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని వివరించారు. సమ్మక్క–సారలక్క జాతరను కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మహాజాతరను విజయవంతంగా నిర్వహించడం ప్రతి అధికారికి ఒక బాధ్యతగా తీసుకుని, ఏ చిన్న లోపం కూడా లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సూచించారు.దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ జాతరకు రూ.150 కోట్లకుపైగా నిధులు కేటాయించి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఈ నిధులతో మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు వంటి అన్ని విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి, జాతరకు వచ్చే భక్తులు సులభంగా గమ్యానికి చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన దిశా సూచిక బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అయోమయానికి గురికాకుండా ట్రాఫిక్ నియంత్రణ పటిష్టంగా ఉండాలని, ప్రత్యేక రూట్ మ్యాప్లతో పాటు అవసరమైన చోట వన్వే వ్యవస్థ అమలు చేయాలని సూచించారు. ఈ జాతరపై క్యాబినెట్ మొత్తం ప్రత్యేక దృష్టి సారించిందని, మంత్రులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి అడ్లూరి తెలిపారు. ఇలాంటి స్థాయి సమిష్టి పర్యవేక్షణ గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు.తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు–సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ఈసారి జాతర ఏర్పాట్లకు రూ. 150 కోట్లతో పాటు గద్దెల పునరుద్ధరణ పనులకు రూ. 101 కోట్లు మొత్తం 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారని వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తులకు సాఫీగా దర్శనం లభించేలా ప్రాధాన్యత నిస్తున్నట్టు అన్నారు. ఇందుకు గాను ప్రతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖ కార్యదర్సులు, హెచ్.ఓ.డీ లతో ప్రత్యేకంగా వాట్స్-అప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి జాతర నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సీతక్క సూచించారు. శానిటేషన్, తాగునీరు, రవాణా, భద్రతాలపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలని, ప్రధానంగా టాయిలెట్ లను మరింత పెంచాలని కోరారు. జాతర సందర్భంగా గురు, శుక్ర వారాల్లోనే ప్రతి రోజు కనీసం 40 లక్షల మంది భక్తులు ఉంటారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మేడారం జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2010 నుండి ప్రతీ సంవత్సరం వస్తున్నారని, వచ్చే వందేళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని సీతక్క గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు మాట్లాడుతూ, జాతర నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నందున అన్ని శాఖల ఉన్నతాధికారులు జాతర పనులకు సకాలంలో పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సాధించాలని పేర్కొన్నారు. జాతర సందర్బంగా భక్తులకు చేసిన ఏర్పాట్లు, రవాణా, ఇతర సౌకర్యాలు, భక్తులు పాటించాల్సిన సూచనలపై విస్తృత స్థాయిలో సమాచారాన్ని అందించాలని తెలిపారు. మేడారానికి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకుగాను డ్రోన్ లను ఉపయోగించుకోవాలన్నారు. అదేవిధంగా, జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్ ను/ క్యూ.ఆర్ కోడ్ రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్కింగ్ ఏరియాలలో కూడా ప్రత్యేకంగా వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీ రోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను కోరారు. ఈ సందర్బంగా, మేడారం జాతరకు వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టిన పనులు, వాటి పురోగతి పై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. మేడారం జాతరపై ములుగు జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్, వీడియోలను మంత్రులు సీతక్క, లక్షణ్ కుమార్, సి.ఎస్ రామకృష్ణ రావు లు ఆవిష్కారించారు. -
యూరోపియన్ పార్లమెంట్ డీజీ మాంగోల్డ్తో తెలంగాణ సీఈవో భేటీ
ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, సోషల్మీడియా ఆధారిత దుష్ప్రచారాన్ని అడ్డుకునే అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్రెడ్డి.. యూరోపియన్ పార్లమెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్ క్రిస్టియన్ మాంగోల్డ్తో మంగళవారం కీలక భేటీ నిర్వహించారు.ఈయూ ఎన్నికల వ్యవస్థ నిర్మాణం, ప్రజలతో కమ్యూనికేషన్ నిర్వహించే విధానం, ఫేక్ న్యూస్ వ్యాప్తిని నియంత్రించేందుకు యూరోపియన్ యూనియన్ తీసుకుంటున్న సాంకేతిక, విధానపరమైన చర్యలను మాంగోల్ ఈ సందర్బంగా సుదర్శన్ రెడ్డికి వివరించారు. డిజిటల్ వేదికలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గుర్తించి తక్షణమే స్పందించే ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థల వివరాలు ఆయనకు తెలిపారు.అనంతరం ఈవో సుదర్శన్రెడ్డి భారత ఎన్నికల విధానాన్ని సమగ్రంగా వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, వలస ఓటర్లు వంటి వర్గాలకు సులభంగా ఓటు హక్కు వినియోగించేలా భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న నూతన కార్యక్రమాల వివరాలు ఆయనకు తెలిపారు. ఈ వివరాలు తెలుసకున్న మాంగోల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిర్వహిస్తున్న ఎన్నికల విధానంపై ప్రశంసలు వ్యక్తం చేసినట్లు తెలిపారు.2025 జనవరి నుంచి యూరోపియన్ పార్లమెంట్లో డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్గా క్రిస్టియన్ మాంగోల్డ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నికల నిర్వహణలో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడం, డిజిటల్ యుగంలో ఎన్నికల విశ్వసనీయతను పరిరక్షించడమే లక్ష్యంగా సీఈవో నేతృత్వంలోని తెలంగాణ బృందం యూరప్ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా ఈ భేటీ జరిగినట్లు అధికారులు తెలిపారు. -
చైనా మాంజా.. సీపీ సజ్జనార్కు టీహెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: చైనా మాంజాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అడ్వకేట్ రామరావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక కోరిన కమిషన్.. ఫిబ్రవరి 26వ తేదీలోపు రిపోర్ట్ అందజేయాలని టీహెచ్ఆర్సీ ఆదేశించింది.కాగా, నిషేధిత చైనా మాంజా నగరవాసుల ప్రాణాల మీదకు తెస్తోంది. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. కాగా తాజాగా, సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా కారణంగా మరొకరు గాయపడ్డారు. ఉప్పల్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగలడంతో ఏఎస్సై నాగరాజు గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఏఎస్ఐని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చైనా మాంజా అమ్మినా.. కొనుగోలు చేసినా.. ఆ మాంజాతో పతంగులు ఎగరేసినవాళ్లపైనా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
ఆ రెండు కేసులపై సజ్జనార్ నేతృత్వంలో సిట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సీసీఎస్తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్లో నమోదైన కేసుల్లో సిట్ ఏర్పాటైంది. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. 8 మంది సభ్యులతో సిట్ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫోటోలు అసభ్యకరంగా పోస్ట్ చేసిన వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ టివి వాట్సాప్ గ్రూప్లో కావలి వెంకటేష్ పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 11న మద్దూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే వార్తలు టెలికాస్ట్ చేసిన వ్యవహరంలో సీసీఎస్లో కేసు నమోదైంది. రెండు తెలుగు న్యూస్ ఛానెల్స్ సహా ఏడు యూట్యూబ్ చానళ్లపై కేసు నమోదైంది. వీరిపై 75, 78, 79, 351(1), 352(2) BNS సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో సిట్ దర్యాప్తు చేయనుంది.సజ్జనార్ నేతృత్వంలో సిట్ సభ్యులుఎన్. శ్వేత, ఐపీఎస్ (జాయింట్ సిపి నార్త్ రేంజ్)యోగేష్ గౌతమ్, ఐసీఎస్ (డీసీపీ, చేవెళ్ల, ఫ్యూచర్ సిటీ)కె. వెంకట లక్ష్మి(డీసీపీ అడ్మిన్ హైదరాబాద్ సిటీ)వి. అరవింద బాబు (డీసీపీ, సైబర్ క్రైమ్స్, హైదరాబాద్ సిటీ)బి. ప్రతాప్ కుమార్ (అదనపు ఎస్పీ, విఅండ్ఇ)జి. గురు రాఘవేంద్ర (ఏసీపీ, సీసీఎస్, హైదరాబాద్ సిటీసి. శంకర్ రెడ్డి (ఇన్స్పెక్టర్, సీఐ సెల్)పి. హరీష్ (ఎస్ఐ, షీ సైబర్ సెల్) -
విజయవాడ హైవేపై ప్రమాదం.. ఆరు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబ్దుల్లాపూర్మెట్ ఇనాంగూడ వద్ద కర్రల లోడ్తో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. లారీ పల్టీ కొట్టిన కారణంగా రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కర్రలు మొత్తంగా రోడ్డుపై పడిపోయాయి.ఈ కారణంగా హైవేపై సుమారు ఆరు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇనాంగూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. -
చార్మినార్ చుట్టూ మిలమిల!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చే పేరు.. మదిలో మెదిలే చిహ్నం.. ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలు, విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే పర్యాటక ప్రాంతం.. హైదరాబాద్ ఐకాన్గా ప్రసిద్ధి.. అదే చార్మినార్. దీని పరిసరాల్లో పర్యాటకులను ఆకట్టుకునేలా, ప్రత్యేకంగా కనిపించేలా వెలుగుజిలుగులతో స్పెషల్ లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. చారి్మనార్ నాలుగువైపులా ఉన్న వీధిదీపాల స్థానే ఆకర్షణీయంగా కనిపించే విద్యుత్ స్తంభాలు, ప్రకాశవంతమైన స్పెషల్ ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. చార్మినార్ చుట్టూ, పరిసరాల్లోని పత్తర్ఘట్టి, చార్కమాన్ ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు పాతబస్తీలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్న కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) అధికారులు ఆర్ఎఫ్పీ టెండర్లు ఆహ్వానించారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువుంది. పాతబస్తీలో వివిధ పనులు చేసేందుకు వెనుకాడుతున్న కాంట్రాక్టు ఏజెన్సీలు ఈ పనులు చేసేందుకు ఏమేర ముందుకొస్తాయో వేచి చూడాల్సిందే. చారి్మనార్ పరిసరాల్లోనే ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు తెలిసేలా క్యూఆర్ కోడ్లతో కూడిన డిజిటల్ సైన్బోర్డులు ఏర్పాటు చేసేందుకు కూడా టెండర్లు పిలిచి నెలలు గడుస్తున్నా ఇంతవరకు పనులు మొదలుకాలేదు. -
సీఎం రేవంత్పై వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన తలసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా చేయాలని భావించింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ను విభజించాలని సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతటితో ఆగకుండా సికింద్రాబాద్ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అనంతరం, తలసాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై తలసాని తాజాగా స్పందించారు. సాక్షితో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ..‘సీఎం రేవంత్పై చేసిన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవడంతో నాకేమీ అభ్యంతరం లేదు. ఆవేశంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు అలా వస్తాయి. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులను గౌరవించే వ్యక్తిని నేను. సికింద్రాబాద్ ప్రాంతం మా ఎమోషన్. సికింద్రాబాద్ను మార్చట్లేదు అనుకుంటూనే ఇక్కడి ప్రాంతాలన్నీ మల్కాజ్గిరిలో కలుపుతున్నారు. పదవిలో ఉన్నామని ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు బుద్ది చెబుతారు.గతంలో కేసీఆర్ శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసి పోలీసు కమిషనరేట్లు చేశారు. ఇప్పుడు ఏ పోలీసు స్టేషన్ ఎవరికీ వస్తుందో అర్ధం కానీ పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవి అన్నీ అబద్దాలే. సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజిగిరి జోన్లో కలిపింది వాస్తవం కాదా?. 17వ తేదీన నిర్వహించనున్న శాంతి ర్యాలీకి అనుమతి కోసం ఈ నెల 5న హైదరాబాద్ పోలీసు కమిషనర్కు దరఖాస్తు చేస్తే మల్కాజ్గిరి కమిషనర్ అనుమతి ఇవ్వాలంటూ సమాధానం ఇచ్చారు. సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్లోకి చేర్చారు. భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరిది. మన అస్తిత్వం, ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలి. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతి ర్యాలీని ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు సాగుతుంది. భారీ ర్యాలీలో అన్ని సంఘాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి’ అని పిలుపునిచ్చారు. -
కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో..
హైదరాబాద్: విధి ఆడిన వింత నాటకంలో ఆ చిన్నారులు అనాథలయ్యారు.. హత్యకేసులో తండ్రి జైలుకు వెళ్లగా.. తల్లి నిర్దయగా పిల్లలను వదిలి వెళ్లింది. దీంతో 40 రోజులుగా ఆ చిన్నారులు స్థానికులు ఇచ్చే ఆహారం తిని బతుకుతున్నారు. ఇలా ఎన్నాళ్లు? అని ఆలోచించిన ఓ న్యాయవాది సహకారంతో.. కోర్టు ఆదేశంతో చిన్నారుల బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీసుకుంది. సోమవారం కుషాయిగూడలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సత్తు రవీందర్, సిడబ్ల్యూసి మేడ్చల్ జిల్లా చైర్మన్ రాజారెడ్డితో కలిసి వెల్లడించారు. మల్లాపూర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే దంపతులకు ముగ్గురు సంతానం. కుమారుడు (13) కూతురు (9), చిన్న కూతురు (2). తండ్రి హత్య కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇక పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన తల్లి వారిని వదిలివెళ్లి అనాథలుగా మార్చింది. దీంతో అభం శుభం ఎరుగని ఆ పిల్లలు చుట్టు పక్కలవారు ఏమైన పెడితే తింటూ అర్థాకలితో గత 40 రోజులుగా కాలం గడుపుతున్నారు. ఇరుగు పొరుగువారు, ఇంటి యజమాని పిల్లల దుస్థితిని గోపాల్రెడ్డి అనే న్యాయవాది సాయంతో మేడ్చల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జిల్లా న్యాయమూర్తి పిల్లల బాగోగులు చూసుకోవాలంటూ మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్ రాజారెడ్డి ముగ్గురు పిల్లలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇద్దరిని హోంకు తరలించగా మరో చిన్నారి ఆరు సంవత్సరాల లోపు కావడంతో అమీర్పేట్లోని ప్రభుత్వ శిశువిహార్లో అప్పగించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురుదుష్టకరమని, అనాథలు, అభాగ్యులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసులను కానీ.. న్యాయసేవాధికార సంస్థలను కాని ఆశ్రయిస్తే తగిన న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్ స్పష్టం పేర్కొన్నారు. పిల్లల దీనస్థితిపై స్పందించి చేరదీసిన పెంటయ్య, శ్రీనివాస్, అనితలను అభినందించారు. ప్రజల్లో అవగాహన పెరగాలి చట్టాలపై ప్రజల్లో అవగాహన పెరగాలి. చట్టంపై సరైన అవగాహన కొరవడి ఉచిత న్యాయసేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఇలాంటి అనాథ పిల్లలు, దిక్కులేని అభాగ్యులను ఆశ్రయం కలి్పంచే అనేక మార్గాలున్నాయి. అలాంటి వారు ఏవరైనా ఉంటే స్థానిక పోలీస్స్టేషన్లు, న్యాయసేవాధికార సంస్థలను ఆశ్రయిస్తే వారికి తగిన న్యాయం జరుగుతుంది. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం జరగాలి. – బాల భాస్కర్, మేడ్చల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి -
చైనా మాంజా.. ASI మెడకు తీవ్ర గాయం
సాక్షి, ఉప్పల్: హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నా నిషేధిత చైనా మాంజా వాడకం మాత్రం తగ్గడం లేదు. సంక్రాంతి నేపథ్యంలో వరుస మాంజా ప్రమాదాలు.. వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉప్పల్లో మాంజా తగిలి.. ఏఎస్ఐ మెడకు తీవ్ర గాయమైంది. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై వివరాల మేరకు.. నగరంలోని నల్లకుంట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగరాజు మాంజా కారణంగా గాయపడ్డారు. ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్లోని తన ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఉప్పల్ పీఎస్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్ద మాంజా ఆయన మెడకు చుట్టుకుని గొంతుకు తీవ్ర గాయామైంది. వెంటనే ఆయనను ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇక, అంతకుముందు.. హైదరాబాద్లోని గచ్చిబౌలి నుంచి హఫీజ్పేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చైతన్య అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేతికి మాంజా చుట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆయన చేయి తెగింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మాదాపూర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, అవగాహన లోపంతో కొందరు వినియోగిస్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో మాంజా తెగి రోడ్లపై గాలిలో వేలాడుతూ వాహనదారులకు ముప్పుగా మారుతోంది. చైనా మాంజా కారణంగా గతంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. -
త్రిముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి జిల్లాల పర్య టన ఈ దఫా త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగనుంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ప్రచారం, పలుచోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడానికి నిరసనగా సభలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా రెండు దఫా ల పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. 16 నుంచి షురూ తొలి విడతలో ఈనెల 16, 17, 18 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలకు వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతోపాటు పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. నిర్మల్, మహబూబ్నగర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరవుతారు. 19వ తేదీన మేడారం వెళ్తారు. అదే రోజు సింగపూర్, అమెరికా దేశాల పర్యటనకు వెళ్తారు. ఫిబ్రవరి 1న హైదరాబాద్ తిరిగి వస్తారు. మరుసటి రోజు వీలును బట్టి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండో విడతలో ఆరు రోజులు ఫిబ్రవరి 3 నుంచి మలి విడత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఆయన ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ఆరు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. వరుసగా నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు వెళతారు. తొలి దఫా తరహాలోనే వీలును బట్టి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. కార్యకర్తలతో సమావేశాలు, కార్నర్ మీటింగ్ల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభలకు హాజరవుతారు.ఇక ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల మంత్రులు, ఇన్చార్జి మంత్రులకు టీపీసీసీ అప్పగించనుంది. కాగా చివరి రోజు, రెండు రోజుల్లో సీఎం వెళ్లే మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన షెడ్యూల్ ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కావాల్సి ఉంది. -
‘అపెక్స్’కు కృష్ణా వివాదం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల కేటాయింపు అంశం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో ఆలోగా తాత్కాలిక పంపిణీ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను అపెక్స్ కౌన్సిల్కు అప్పగించేలా కేంద్ర జలశక్తి శాఖను కోరుతూ మరోసారి తీర్మానం చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రభుత్వం సూచించింది. త్వరలో జరగనున్న 21వ కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలో చేర్చాల్సిన అంశాలను ప్రతిపాదిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా బోర్డుకు లేఖ రాశారు.ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటును కొనసాగించాలని 19వ కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు మినట్స్లో రికార్డు చేయడంపై లేఖలో తెలంగాణ అభ్యంతరం తెలిపింది. 50:50 నిష్పత్తిలో తాత్కాలిక పంపకాలు జరపాలని ఆ సమావేశంలో తాము గట్టిగా పట్టుబట్టామని గుర్తుచేసింది. కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ వివాదాన్ని అపెక్స్ కౌన్సిల్కు అప్పగించాలని 17వ బోర్డు సమావేశంలో తీర్మానించారని.. 21వ బోర్డు భేటీలో మళ్లీ తీర్మానించాలని ప్రతిపాదించింది. తెలంగాణ ప్రతిపాదించిన ఎజెండాలోని ఇతర కీలకాంశాలు.. పోతిరెడ్డిపాడు, బనకచర్లపై టెలీమెట్రీలు... రెండో విడత కింద ప్రతిపాదించిన టెలిమెట్రీ కేంద్రాలతోపాటు మూడో విడత కింద మరో 11 చోట్ల వాటిని ఏర్పాటు చేయాలి. ఇందుకోసం తెలంగాణ రూ. 4.15 కోట్లను కృష్ణా బోర్డుకు విడుదల చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. శ్రీశైలం కుడి ప్రధాన కాల్వకు ఏపీ లైనింగ్ పనులు చేస్తుండటంతో పోతిరెడ్డిపాడు నుంచి ఆ రాష్ట్రం భారీ మొత్తంలో తరలించుకునే నీటిని కచి్చతంగా లెక్కించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు, బనకచర్ల కాంప్లెక్స్ అవుట్లెట్ల వద్ద టెలిమెట్రీ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పోలవరం విస్తరణను అడ్డుకోవాలి.. పోలవరం–నల్లమల్లసాగర్ అనుసంధాన ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఏపీ టెండర్లు నిర్వహించకుండా అడ్డుకోవాలి. ప్రాజెక్టు ప్రీ–ఫీజిబులిటీ నివేదికను బోర్డు పరిశీలించరాదు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలను కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘానికి తెలియజేశాం. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు, హెచ్ఎన్ఎస్ఎస్, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, తెలుగు గంగ, ఎస్కేప్ చానల్ నిప్పుల వాగు ద్వారా ఏపీ బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలిస్తున్న జలాలను ఆ రాష్ట్ర వాటాల కింద లెక్కించాలి. శ్రీశైలానికి అత్యవసర మరమ్మతులు.. శ్రీశైలం జలాశయం ప్లంజ్పూల్కు ఏర్పడిన భారీ గుంతతో డ్యామ్ భద్రత ప్రమాదంలో పడిందని నిపుణుల కమిటీ నివేదిక ఇచి్చంది. రెండేళ్లు పూర్తయినా ఏపీ మరమ్మతులు చేపట్టలేదు. తక్షణమే డ్యామ్కు మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలి. పనులను కృష్ణా బోర్డు పర్యవేక్షించాలి. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఆర్డీఎస్ ఆనకట్టకు మరమ్మతులు నిర్వహించాలి. ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలి. ఎన్జీటీ తీర్పును ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పనుల విషయంలో ఏపీ ముందుకు పోతోంది. వాస్తవ పరిస్థితిపై బోర్డు నివేదిక తెప్పించుకోవాలి. అనుమతి లేకుండా ఏపీ చేపట్టిన ఎస్ఆర్ఎంసీ కాల్వ లైనింగ్ పనులపై నివేదిక కోరాలి. వచ్చే ఏడాది వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో నీటి నష్టాలను లెక్కిస్తేనే కాల్వ ద్వారా ఏపీ, తెలంగాణ వాడుకుంటున్న నీళ్లపై కచి్చతమైన గణాంకాలు తెలుస్తాయి. నష్టాలను లెక్కించడానికి గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిపై తక్షణమే కమిటీ ఏర్పాటు చేయాలి. తెలంగాణ నీళ్లను పొదుపుగా వాడుకొని వచ్చే నీటి సంవత్సరంలోని ప్రారంభ మాసాల అవసరాల కోసం నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వ చేస్తోంది. ఇలా ఒక సంవత్సరంలో పొదుపు చేసిన జలాలను రాష్ట్రం వచ్చే ఏడాది వాడుకోవడానికి వీలు కల్పించాలి. తాగునీటి కోసం వాడుకుంటున్న జలాల్లో 20 శాతాన్నే లెక్కించి మిగిలిన 80 శాతాన్ని రిటర్న్ ఫ్లోగా పరిగణిస్తూ మినహాయింపు కల్పించాలి. సాగర్ను తెలంగాణకు అప్పగించాలి నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా తెలంగాణకు తిరిగి అప్పగించాలి. 2023 నవంబర్ 29న ఏపీ బలవంతంగా సాగర్పై చొచ్చుకు వచ్చి కుడి రెగ్యులేటర్ ద్వారా నీళ్లను విడుదల చేసుకుంది. డ్యామ్ సేఫ్టీ చట్టంలోని సెక్షన్ 16 (1) ప్రకారం సాగర్ నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ పరిధిలోకే వస్తుంది. మరమ్మతులు నిర్వహించేందుకు తెలంగాణ అధికారులను అనుమతించకపోవడంతో డ్యామ్ భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. -
రాష్ట్ర ఉద్యోగులకు 3.64% డీఏ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు సంక్రాంతి సందర్భంగా శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలకుగాను గతంలో ప్రకటించినట్లుగానే ఒక డీఏను మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 3.64 శాతం డీఏను మంజూరు చేసింది. ఈ నెల వేతనంతోపాటు పెంచిన డీఏను ఫిబ్రవరిలో చెల్లింపులు చేయనుంది. ప్రస్తుతం సర్విసులో ఉన్న ఉద్యోగులకు డీఏ బకాయిలను జీపీఎఫ్లో జమ చేయనున్నారు.పెన్షనర్లకు మాత్రం 01–07–2023 నుంచి 31–12.2025 వరకు చెల్లించాల్సిన డీఆర్ బకాయిలను 30 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ట్రెజరీ ద్వారా వేతనాలు పొందని వారికి జిల్లా పరిషత్, మునిసిపాలిటీల పెన్షన్ ఫండ్స్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. పెంచిన డీఏ ప్రకారం రాష్ట్ర ఖజానాపై ఏటా దాదాపు రూ.2,180 కోట్ల భారం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం డీఏను పెంచడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
ముందే ‘సెట్’ చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్ష నోటిఫికేషన్ ఇంకా విడుదల కానప్పటికీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం ప్రవేశాల కోసం ఇప్పట్నుంచే హడావుడి చేస్తున్నాయి. అటానమస్, డీమ్డ్ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ సెట్తో పనిలేకుండానే సీట్లు ఇస్తామంటున్నాయి. అనుబంధ గుర్తింపుతో నడిచే కాలేజీలు మాత్రం యాజమాన్య కోటా సీట్ల భర్తీపై దృష్టి పెడుతున్నాయి. టాప్–10 కాలేజీలు మినహా అన్ని కాలేజీలూ ఇదే దారిలో వెళ్తున్నాయి. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్ష మేలో జరుగుతుంది. మే నెలాఖరులో ఫలితాలు వెలువడతాయి. సాధారణంగా ఆగస్టులో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇదే క్రమంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి అనుమతినిస్తారు. ప్రైవేటు కాలేజీలు మాత్రం ఈ షెడ్యూల్కు విరుద్ధంగా అనధికార అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయి. విద్యార్థుల జాబితా సేకరణ ప్రతి ఇంటర్ కాలేజీ నుంచి సెకండియర్ విద్యార్థుల వివరాలను ఆయా ఇంజనీరింగ్ కాలేజీల తరఫున కన్సల్టెన్సీలు, పీఆర్వోలు సేకరిస్తున్నారు. అంతర్గతంగా జరిగే పరీక్షల్లో వారి మార్కులను పరిశీలిస్తున్నారు. జేఈఈ, ఇంజనీరింగ్ కోచింగ్ కోసం నిర్వహించే పరీక్షల్లో వచ్చే మార్కులను పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా విద్యార్థులను కేటగిరీలుగా విభజిస్తున్నారు. టాప్ ర్యాంకులు వస్తాయనుకునే విద్యార్థులను మినహాయించి ద్వితీయశ్రేణి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కోరుకున్న బ్రాంచీలో సీట్లు ఇస్తామని చెబుతున్నారు. డీమ్డ్, అటానమస్ కాలేజీలు మరో అడుగు ముందుకేస్తున్నాయి. ఇంజనీరింగ్ ఫైనలియర్లో క్యాంపస్ నియామకాలు ఉంటాయని.. ఉద్యోగం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నాయి. కొన్ని సంస్థలతో ఉపాధికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామంటున్నాయి. రంగంలోకి కన్సల్టెన్సీలు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు, కన్సల్టెన్సీ సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్లు పంపుతూ ముందే సీటు బుక్ చేసుకోవాలని కోరుతున్నాయి. కాలేజీల్లో చేరుస్తామని చెప్పే వారి నుంచి అడ్వాన్స్లు తీసుకుంటున్నాయి. మరికొందరి నుంచి సమ్మతి పత్రాలపై సంతకాలు పెట్టించుకుంటున్నాయి. సెట్కు ముందు చేరే విద్యార్థులకు రాయితీలతోపాటు కోరుకున్న బ్రాంచీల్లో సీట్లు ఇస్తామని హామీ ఇస్తున్నాయి. కన్సల్టెన్సీ సంస్థలకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు భారీ కమీషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. తల్లిదండ్రులు, విద్యార్థులను తమ వైపు తిప్పుకోవడంపై కొన్ని కాలేజీలు పీఆర్వోలకు ఏకంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్లైన్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి గతేడాది ప్రభుత్వానికి నివేదిక పంపగా దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇప్పట్నుంచే కాలేజీలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. -
త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం రాజకీయ విభజన కోణంలో ఏర్పాటు చేసిన జిల్లాలను ప్రజల అభీష్టం మేరకు హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. అప్పట్లో అడ్డగోలుగా విభజన ‘గత ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టానుసారంగా విభజించింది. ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే, మరో జిల్లాలో 14 ఉన్నాయి. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన అడ్డగోలుగా జరిగింది. జిల్లాల సంఖ్య తగ్గించడం, పెంచడం అని కాదు కానీ రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి..ఒక మండలంలో ఎంత జనాభా ఉండాలి, ఒక డివిజన్లో ఎంత ఉండాలి, ఒక జిల్లాలో ఎంత ఉండాలనేది నిర్ణయించాలి. ప్రస్తుతం ఒక జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే ఒక జిల్లాలో కోటి జనాభా ఉంది. ఇలాంటప్పుడు పరిపాలన ఏవిధంగా చేస్తారు? ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఒక లీడర్ తనకు నచ్చిన 3, 4 గ్రామాలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకుంటే... మరొకాయన 2, 3 ఎంపీటీసీలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా పరిషత్ సమావేశానికి వెళ్లా. వేదికపై చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. మరొకాయన రాలేదు. నాకు ఎవర్ని చూసి మాట్లాడాలో అర్థం కాలేదు. జిల్లా ఈ విధంగా ఉంటే ఎలా? ఇలాంటి తప్పిదాల వల్ల పాలనపై నమ్మకం పోతుంది. దీన్ని సరి చేయాలి..’ అని సీఎం అన్నారు. తొలుత మండలాల హేతుబద్ధీకరణ ‘ముందుగా మండలాలను హేతుబద్ధీకరించాలి. మండలంలో 10 శాతం ఎక్కువ జనాభా లేదా తక్కువ.. రెవెన్యూ డివిజన్, జిల్లాల్లో కూడా ఇదే ఫార్ములాతో విభజన జరగాలి. దీనిపై అసెంబ్లీలో డిబేట్ పెడతాం. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. మార్గదర్శకాలు రూపొందిస్తాం. కూలంకషంగా చర్చించిన తర్వాతే విధివిధానాలు ఖరారు చేసి నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ పద్ధతిలో వీటిని హేతుబద్ధీకరించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇందుకోసం ప్రత్యేకంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ను ఏర్పాటు చేస్తాం. ఇందులో రెవెన్యూ అధికారులతో పాటు సంబంధిత అధికారులంతా సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ఆర్నెల్లు పర్యటించి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తాం’ అని రేవంత్ తెలిపారు. సగటు మధ్య తరగతి ఉద్యోగి సంసారంలా.. ‘రాష్ట్ర ప్రభుత్వంలో 10.5 లక్షల మంది ఉద్యోగుల సైన్యం ఉంది. సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కేవలం నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంటుంది. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల కలయికే ప్రభుత్వం. పదవీ విరమణ ప్రతి ఉద్యోగికీ వస్తుంది. ఆ రోజున తనకు అందాల్సిన ఆర్థిక లబ్ధి తీసుకోవడం అతని హక్కు. కానీ గత ప్రభుత్వం చేతకాక వయో పరిమితిని పెంచింది. అందువల్ల ఆ సమయంలో జరగాల్సిన రిటైర్మెంట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. ఉద్యోగులకు గత ప్రభుత్వం రూ.11 వేల కోట్ల మేర బకాయి పెట్టింది. అలాగే కాంట్రాక్టర్ల బిల్లులకు రూ.42 వేల కోట్లు..ఇలా అన్నీ కలిపి రూ.1.11 లక్షల కోట్లు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వానికి అప్పులు సంక్రమించాయి. ప్రస్తుతం క్రమ పద్ధతిలో పొదుపు చేస్తూ సగటు మధ్యతరగతి ఉద్యోగి సంసారం మాదిరి రెండేళ్లుగా శ్రమిస్తూ ఆర్థిక స్థితిని గాడిన పెడుతున్నాం. గతంలో ఉద్యోగులకు ఏ రోజున జీతాలు వచ్చాయి.. ఇప్పటి పరిస్థితి ఏమిటో సమీక్షించుకోవాలి. ఉద్యోగులకు పెద్దన్నగా ఓ తీపి కబురు ఉద్యోగులకు పెద్దన్న మాదిరిగా ఇక్కడికి వచ్చా. తీపి కబురు చెప్పకుండా ఉండడం సబబు కాదు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఫైలుపై సంతకం చేసి వచ్చా. ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు రూపొందిస్తున్నాం. రూ.1.02 కోట్ల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఉద్యోగులు పన్నుల వసూళ్లు, ఇతర ఆదాయం విషయంలో మరింత కృషి చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత వేగంగా గాడిన పడుతుంది. ఉద్యోగ సంఘ భవనం ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ముందుగా హైదరాబాద్లో రాష్ట్ర కార్యాలయం నిర్మించుకోవాలి. ఉద్యోగ సంఘం ఎంత నిధి ఇస్తుందో.. అదే స్థాయిలో ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది..’ అని సీఎం చెప్పారు. టీజీవో అధ్యక్ష కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, బి.శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని ఏలూరు.. సచివాలయంలో విలేకరులకు తెలిపారు. పెండింగ్ బిల్లుల కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.700 కోట్లను ఏప్రిల్ నుంచి రూ.1,500 కోట్లకు పెంచుతామని చెప్పారన్నారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న సీఎం, మంత్రులకు టీజీవో తరఫున ధన్యవాదాలు తెలిపారు. -
అరైవ్-అలైవ్ అనేది కార్యక్రమం కాదు.. ఉద్యమం: డీజీపీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టింది పోలీస్ శాఖ. యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. దీనికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రబాకర్, డీజీపీ శివధర్రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. ముందుగా అరైవ్ అలైవ్” థీమ్ సాంగ్ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. దీనిలో భాగంగా డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. ‘ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే అరైవ్ అలైవ్ కార్యక్రమం ఉద్దేశం. అరైవ్ అలైవ్ అనేది ఒక కార్యక్రమం కాదు ఇది ఒక ఉద్యమం. ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం మరింత ఉత్తేజం ఇస్తోంది. ప్రజలందరు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలి. రాష్ట్రంలో సుమారు 30 వేల కిలోమీటర్ల రహదారి నెట్వర్క్ ఉంది. ఏడాదికి 27 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది 800 హత్యలు జరిగితే 7500 మంది రోడ్ల ప్రమాదాల్లో మరణించారు. హత్యలో కన్నా రోడ్డు ప్రమాదాల్లో నే ఎక్కువగా మరణించారు.2025 మరణాలు తగ్గాయి యాక్సిడెంట్లు పెరిగాయి. రోడ్డు ప్రమాదాల పై చాలా మందికి సీరియన్ నెస్ ఉండటం లేదు. 72 శాతం ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నరు.. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే అరైవ్ అలైవ్ లక్ష్యం నెరవేరుతుంది. హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి.. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ పోన్ వాడకూడదు. రేపటి నుండి 10 రోజుల వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమం జరుగుతుంది’ అని స్పష్టం చేశారు. -
మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ అభిమాని మృతి
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లి అర్జున్ థియేటర్లో జరిగిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రదర్శనలో దుర్ఘటన చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్లో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీ స్టారర్ సినిమా చూస్తుండగా ఓ అభిమాని ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందాడు.థియేటర్లో ఉన్న ఇతర ప్రేక్షకులు వెంటనే స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు వెలువడేందుకు వైద్య పరీక్షలు, విచారణ కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో థియేటర్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్ అభిమానుల ఉత్సాహం మధ్య ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచివేసింది. కాగా, మృతుడు 12వ బెటాలియన్కు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్గా గుర్తించారు. ఉదయం 11.30 గంటల షో చూడటానికి సినిమా థియేటర్కు వచ్చారు. సినిమా మధ్యలో, అకస్మాత్తుగా తన సీటులో కుప్పకూలిపోయాడు. తోటి ప్రేక్షకులు భయపడ్డారు. తర్వాత తేరుకుని వెంటనే అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ఆనంద్ చనిపోయినట్లు ప్రకటించారు. గుండెపోటు మరణానికి కారణమని అనుమానిస్తున్నారు -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు మరో డీఏ ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ ప్రకటన చేశారు. డీఏ ఫైల్ మీద సంతకం చేసి వచ్చా. రేపో మాపో డీఏ జీవో వస్తుంది’అని తెలిపారు. పెన్షనర్లకు డీఏ,డీఆర్ పెంపు తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్లకు డీఏ,డీఆర్ పెంపు ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు ఉపశమనం కలగనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 30.03శాతం డీఆర్ను 33.67శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2018 జూలై 1 తర్వాత రిటైర్డ్ అయిన పెన్షనర్లకు వర్తించనుంది. 2020 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి ఇది ప్రత్యక్ష లాభం కలిగిస్తుంది.2018కి ముందు రిటైర్డ్ అయిన పెన్షనర్లకు కూడా డీఆర్ పెంపు వర్తించనుంది. 2015 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 68.628శాతం నుంచి 73.344శాతానికి పెరిగింది. 2016 పే స్కేల్స్ పెన్షనర్లకు డీఆర్ 42శాతం నుంచి 46శాతానికి పెంపు జరిగింది. UGC/AICTE 2006 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 221శాతం నుంచి 230శాతానికి పెరిగింది. ఈ పెంపు విద్యా రంగానికి చెందిన పెన్షనర్లకు గణనీయమైన లాభం కలిగించనుంది.పెరిగిన డీఆర్ 2023 జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. 2023 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు పెరిగిన డీఆర్ బకాయిలు చెల్లించనున్నారు. ఈ బకాయిలు మొత్తం 30 నెలవారీ వాయిదాల్లో చెల్లించబడతాయి. 2026 జనవరి నెల పెన్షన్తో పెరిగిన డీఆర్ చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 2026లో పెన్షన్ మరియు డీఆర్ చెల్లింపులు పూర్తిగా అమలులోకి వస్తాయి. ఈ పెంపు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్రాంట్స్ పొందుతున్న వారికి వర్తించదు. కేవలం పెన్షన్ పొందుతున్న వారికి మాత్రమే ఈ లాభం అందుతుంది.జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటనతెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో ఈ అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ‘జిల్లాల సరిహద్దులు మార్చాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అందుకే జిల్లాల పునర్విభజన కోసం ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయనున్నాం. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో చర్చ జరిపి, సభ్యుల సలహాలు తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ అంశంపై అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ముందుగా మండలాల రేషనలైజేషన్, తర్వాత రెవెన్యూ డివిజన్ల రేషనలైజేషన్, ఆ తర్వాతే జిల్లాల పునర్విభజన జరుగుతుంది’ అని తెలిపారు. -
మాకు న్యాయం చేయాలి
హైదరాబాద్: న్యాయం కోసం పిల్లలతో కలిసి భర్త ఇంటి వద్ద భార్య నిరసన వ్యక్తం చేసింది. ఈ సంఘటన దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని అహ్మద్గూడలో చోటుచేసుకుంది. సాయిచరణ్ అనే వ్యక్తి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యభర్తల మద్య పలుమార్లు గొడవలు జరిగేవి. దీంతో 2020 సంవత్సరం నుండి దూరంగా ఉంటున్నారు. అప్పటినుండి సాయిచరణ్ కనిపించకుండా తిరుగుతుండేవాడు. సాయిచరణ్ కీసర అహ్మద్గూడలోని హిడెన్ గార్డెన్ అపార్టుమెంట్లో ఉంటున్నాడని తెలుసుకొని పిల్లలతో కలిసి భార్య శిల్ప తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగింది. అనంతరం కీసర పోలీసులు వచ్చి ఆమెతో చర్చలు జరిపారు, తనకు న్యాయం జరిగేంతవరకు అక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుకూర్చుంది. -
మాంజా చేసిన గాయం
హైదరాబాద్: పోలీసులు వద్దు వద్దంటున్నా కొందరు చైనా మాంజా వాడుతున్నారు. కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నా వాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ద్విచక్రవాహనాల్లో వెళుతున్న వారు అది తగిలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊ బైక్పై వెళుతున్న ఓ యువకుడు చైనా మాంజా కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. బొటానికల్ గార్డెన్–కొత్తగూడ ఫ్లై ఓవర్పై ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. వైజాగ్కు చెందిన కుందుం సూర్య తేజ(33) మియాపూర్లోని ఎస్ఆర్ ఎస్టేట్లో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వెళుతుండగా బొటానికల్ గార్డెన్–కొత్తగూడ ఫ్లై ఓవర్పై చైనా మాంజా ఎడమ భుజానికి తాకింది. చూసుకునే లోపు అది తీవ్ర గాయం చేసింది. స్నేహితులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన వచ్చిన వారు 108 అంబులెన్స్లో మాదాపూర్ యశోద హస్పిటల్కు తరలించారు. దాదాపు 15 సెంటీ మీటర్ల గాయం కాగా డాక్టర్లు శస్త్ర చికిత్స చేసినట్లు స్నేహితులు తెలిపారు. గచి్చబౌలి పోలీసులు వెంటనే యశోద ఆస్పత్రికి వెళ్లి బాధితుని స్టేట్మెంట్ రికార్డు చేసి కేసు నమోదు చేశారు. చైనా మాంజాలు వాడవద్దని, ఎవరైనా అమ్మినా, వాడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ బాలరాజు హెచ్చరించారు. బాలుడికి తీవ్ర గాయాలు నాగోలు గణేష్నగర్ కాలనీ చెందిన వెల్టూరు గోపాల్ కుమారుడు మనోజ్(14) 9 వ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం స్కూల్ నుంచి బైక్పై వెనుక కూర్చుని ఇంటికి వస్తుండగా, రోడ్డుపై పడివున్న చైనా మాంజా దారం కుడి పాదానికి చుట్టుకోవడంతో తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి కాలి వేలుకు రక్తం సరఫరా చేసే నరం తెగిపోయిందని తెలిపారు. ఎనిమిది కుట్లు వేసి చికిత్స అందించారు. ప్రస్తుతం మనోజ్ అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు. -
పబ్లలో వల.. యువతులకు ఎర
హైదరాబాద్: పబ్లకు వచ్చే ఒంటరి యువతులను వలలో వేసుకుని మోసగిస్తున్న నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శంషాబాద్లోని సదమ్ మెగా టౌన్షిప్లో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి కంభంబెట్టు రాణాప్రతాప్రెడ్డి.. పబ్లకు అలవాటుపడి డబ్బుల కోసం యువతులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన ఓ యువతి తాను సంపాదించుకున్న డబ్బులతో హైదరాబాద్లో వ్యాపారం పెట్టుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో రాణాప్రతాప్రెడ్డి పరిచయమయ్యాడు. మాయ మాటలతో ఆమెను నమ్మించాడు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభాలు ఇప్పిస్తానని రూ.75 లక్షలు తీసుకున్నాడు. ప్రేమిస్తున్నట్టు నటించాడు. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. ఏడాది పాటు ఆమెతో కలిసి తిరిగాడు. ఈ నేపథ్యంలో రాణాప్రతాప్ అసలు స్వరూపం బాధిత యువతికి తెలియడంతో అతడిని నిలదీసింది. దీంతో నిందితుడు రాణాప్రతాప్ తన అసలు స్వరూపం చూపించాడు. పెళ్లికి నిరాకరించాడు. తీసుకున్న డబ్బులు ఇచ్చేది లేదంటూ తేల్చిచెప్పాడు. దీంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటికే నిందితుడు చాలామంది యువతులకు వల వేసి ప్రేమ పేరుతో లోబర్చుకుని పబ్ల్లో, క్లబ్ల్లో తన కోరికలు తీర్చుకుంటూ వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు దండుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘మేడారం’ ప్రత్యేక బస్సుల్లో చార్జీలు 50 శాతం అదనం
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు ఈసారి ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సుల్లో చార్జీలు 50 శాతం అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నందున, గతంతో పోలిస్తే బస్సుల సంఖ్య పెంచాలని భావించినా వాటి లభ్య త సమస్యగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న బస్సులను తిప్పాలని నిర్ణయించింది. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది. దాన్ని వినియోగించుకోవటం ద్వారా సాధారణ చార్జీలను అంతమేర పెంచాలని నిర్ణయించింది. ‘ప్రత్యేకం’లోనూ మహిళలకు ఉచితమే.. జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. గత జాతర సమయంలో 3,491 ప్రత్యేక బస్సులను నడిపితే అవి కీలక సమయాల్లో సరిపోలేదు. కొంత నిర్వహణ లోపాల వల్ల ఆర్టీసీ బస్సులను భక్తులు వాడుకోలేకపోయారు. వెరసి ఇబ్బందులు ఎదురయ్యాయని సంస్థ గుర్తించింది. దీంతో ఈసారి అంతకంటే ఎక్కువ బస్సులు నడపాలని నిర్ణయించింది. కానీ, బస్సుల సర్దుబాటు కష్టంగా మారటంతో ప్రస్తుతానికి 3,495 బస్సులను సిద్ధం చేసుకుంది. అవసరమైతే మరికొన్నింటిని సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది.ఈ బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి నడుస్తాయి. వీటిల్లో సాధారణ చార్జీకి 50 శాతం అదనపు మొత్తాన్ని జోడించి వసూలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ (ఆర్డినరీ, ఎక్స్ప్రెస్) వసతి ఉన్నందున మహిళా ప్రయాణికులకు ఈ నిర్ణయం భారం కాబోదు. కానీ, పురుష ప్రయాణికుల జేబులపై మాత్రం భారం పడనుంది. వీఐపీ పాస్లను నియంత్రించాల్సిందే... గత జాతర సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బడి ముబ్బడిగా వీఐపీ పాస్లు జారీ చేశారు. ఒకే సమయంలో ఎక్కువ మంది వీఐపీలు రావటం, వారి వాహన శ్రేణి జాతర వరకు అనుమతించడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. ఆయా సమయాల్లో పోలీసులు ఆర్టీసీ బస్సులను లోనికి అనుమతించలేదు. దీంతో బస్సులు శివారు ప్రాంతాల్లోనే నిలిచిపోయి సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈసారి ఆ పరిస్థితి రాకుండా, పాసుల జారీని నియంత్రించాలని ఆర్టీసీ అధికారులు ములుగు జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులను కోరారు. వచ్చే వీఐపీలు కూడా ఒకే సమయంలో రాకుండా నియంత్రించాలని కూడా కోరారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేసి భక్తులకు ఇబ్బంది రాకుండా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. -
తలసేమియా రహితంగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తలసేమియా రహిత తొలి రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అందరం కలిసి పనిచేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. 2035 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుందామని అన్నారు. తలసేమియా అండ్ సికిల్సెల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కమల హాస్పిటల్లో నిర్వహిస్తున్న ఏషియన్ తలసేమియా కాన్క్లేవ్లో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోగులు, దేశ, విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు, ఇతర నిపుణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తలసేమియా, సికిల్సెల్ ఎనీమియా, హీమోఫీలియా వంటి వ్యాధులు కేవలం వైద్యపరమైన సమస్యలు మాత్రమే కావని, అవి బాధిత కుటుంబాలను, సమాజాన్ని జీవితకాలం వెంటాడే తీవ్రమైన సవాళ్లని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా రక్తసంబంధీకుల మధ్య వివాహాలు (మేనరికం) చేసుకోవడం వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీనిని నివారించడానికి ముందస్తు స్క్రీనింగ్, కౌన్సెలింగ్, సామాజిక అవగాహన కలి్పంచడమే సరైన మార్గమని, నివారణే అత్యుత్తమ చికిత్స అని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఈ వ్యాధికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని, తలసేమియా, సికిల్సెల్ సొసైటీ సహకారంతో మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో విజయవంతంగా ప్రతి గర్భిణీకి పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. తలసేమియా బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో డే కేర్ సెంటర్లను నిర్వహిస్తున్నామని, త్వరలో ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్లలో అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. 11 లక్షల మందికి స్క్రీనింగ్ రాష్ట్రంలో సికిల్సెల్ వ్యాధిని గుర్తించేందుకు ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ పూర్తి చేసి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. తలసేమియా, సికిల్సెల్, హిమోఫీలియా పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల పరీక్షలను డయాగ్నస్టిక్స్ సెంటర్లలో ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేసి తలసేమియా లేని తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. -
తిండి తగ్గింది.. తీరు మారింది!
పాతికేళ్ల నాటికీ, నేటికీ గ్రామీణ, పట్టణ భారతీయ కుటుంబాల వ్యయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆహారంపై ఖర్చు తగ్గి.. అనేక ఇతర ఖర్చులు పెరిగాయి. ప్రజలు మెరుగైన జీవనశైలులను కోరుకోవటమే ఇందుకు కారణం. కేంద్ర గణాంక శాఖ గృహ వినియోగ వ్యయ సర్వేలు, నేషనల్ శాంపిల్ సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉంది? ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకురావాలి? ప్రజల జీవన శైలి ఎలా మారుతోంది?... అనే విషయాలను తెలుసుకోవడానికి కేంద్ర గణాంక శాఖ ఎప్పటికప్పుడు గృహ వినియోగ వ్యయంపై సర్వే జరుపుతుంటుంది. భారతీయ కుటుంబాలు వివిధ వస్తువులు, సేవల కోసం చేసే ఖర్చుల వివరాలను అనేక దఫాలుగా (రౌండ్లుగా) సర్వే చేసి, ఆ వివరాలను గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది.ఈ క్రమంలో 2022–23, 2023–24లో జరిగిన సర్వేలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలుగా విభజించి ఈ సర్వే నిర్వహిస్తుంది. ప్రజలు ఖర్చు చేసే ప్రతి రూ.100లో 2000 నాటికీ 2024 నాటికీ నెలవారీ తలసరి వ్యయంలో చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. (గమనిక ః తలసరి నెలవారీ వ్యయం (రూ.100 కి))⇒ నెలవారీ తలసరి ఆహార వ్యయం; తలసరి ఇంధనం, విద్యుత్పై చేసే వ్యయం అప్పటితో పోలిస్తే ఇప్పుడు తగ్గాయి. ⇒ అప్పట్లో మొత్తం వ్యయంలో సగం ఆహారం కోసమే ఉంటే.. ఇప్పుడది తగ్గడం విశేషం.⇒ ఇంటి అద్దె, ఇతర వస్తువులు, సేవల ఖర్చు మాత్రం అప్పటితో పోలిస్తే భారీగా పెరిగాయి. -
అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు సరిగ్గా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళితబంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్సీ ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి, ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. రేవంత్రెడ్డి రైతులు, రైతు కూలీలు, కౌలుదారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అందరిని మోసం చేశారని కేటీఆర్ అన్నారు. రేవంత్కు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలు రావు కానీ ఆయనకు వచ్చిన ఏకైక భాష బూతుల భాష అని ఎద్దేవా చేశారు. బండ్లగూడ మాజీ మేయర్ లతాప్రేమ్గౌడ్, వారి అనుచరులు ఆదివారం తెలంగాణభవన్లో కార్తీక్రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ కనిపిస్తే ధైర్యం వస్తది అని ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్రంలో వ్యాపారాలు తగ్గడానికి, పరిస్థితులు దిగజారడానికి సన్నాసి రేవంత్రెడ్డి ప్రభుత్వమే కారణం. కాంగ్రెస్లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఏమి అభివృద్ధి చూసి కాంగ్రెస్లో చేరిండో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి’అని కేటీఆర్ అన్నారు. బీజేపీ బలం గాలివాటమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పది సంవత్సరాల్లో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, కచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ వైపు నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆదివారం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో జరిగిన పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రెండు జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన మున్సిపల్ ఎన్నికల వ్యూహం, ఇతర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురపాలక ఎన్నికల్లో సమష్టిగా కలిసి కొట్లాడి కాంగ్రెస్పై ఘన విజయం సాధించేలా ప్రయత్నం చేయాలని సూచించారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదని, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మొదలు సర్పంచ్ల వరకు ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ప్రజలు నిలబడ్డారన్నారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలివాటమే అని చెప్పారు. ఆనాడు దేశంలోని రాజకీయ పరిస్థితులతోనే బీజేపీ గెలిచిందే తప్ప, ఆ పార్టీకి తెలంగాణలో క్షేత్రస్థాయి బలం లేదన్నారు. అసెంబ్లీలో పోటీచేసిన ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ నేతలు ఘోరమైన ఓటమి పాలయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గాలివాటంగా గెలిచారని చెప్పారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని మున్సిపాలిటీలలో ఉన్న స్థానిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఈ సమావేశంలో పాల్గొని అనేక అంశాలపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
రాష్ట్రాన్ని అప్పులపాలు చేయబోం: భట్టి
గోదావరిఖని/ములుగు: గత పాలకుల మాదిరిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయనీయబోమని, అన్నిరంగాల్లో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లి 2047నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో భట్టి ప్రసంగించారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గానికి 3,500 మంది లబి్ధదారులను ఎంపిక చేశామన్నారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కు రాష్ట్ర కేబినెట్లో ఆమోదం లభించిందని స్పష్టం చేశారు. త్వరలోనే మళ్లీ వస్తామని, పవర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తానని చెప్పారు.సింగరేణి పరిరక్షణకు కృషి సింగరేణి సంస్థ అభివృద్ధి, పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భట్టివిక్రమార్క అన్నారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజావసరాల కోసం నిత్యం తపిస్తున్న నాయకుడు రాజ్ఠాకూర్ అని ప్రశంసించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేపట్టిన యాత్రలో నా వెంట నడిచిన రాజ్ఠాకూర్కు ఆనాడే ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కొండా సురేఖ, ప్రిన్సిపల్ ఎనర్జీసెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ పాల్గొన్నారు. రెండుమూడు రోజుల్లో మేడారం పనులు పూర్తి సమ్మక్క–సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా మేడారం జాతర నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొండా సురేఖ, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్తో ఆదివారం మధ్యాహ్నం 3:26 గంటలకు మేడారం చేరుకున్నారు. కాన్వాయిలో ఆర్టీసీ పాయింట్, జంపన్న వాగు వద్దకు చేరుకొని వాహనంలో నుంచే పనులు పర్యవేక్షించారు. 3:50 గంటలకు హరిత హోటల్కు చేరుకొని అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రుల పర్యవేక్షణలో మేడారంలో అభివృద్ధి పనులు పూర్తికావొచ్చాయని తెలిపారు. రెండు మూడు రోజుల్లోగా మిగిలిన పనులు కూడా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశ అనంతరం గద్దెల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. వారి వెంట మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సు«దీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. -
‘సర్’లో ఉన్నారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్) చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సన్నాహాలు ప్రారంభించింది. రెండో విడత ‘సర్’చేపట్టిన ఆరు రాష్ట్రాల్లో ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించగా, ఫిబ్రవరిలో తుది జాబితాను ప్రచురిస్తామని ఇప్పటికే ఈసీ ప్రకటించింది. కాగా మూడో విడతలో భాగంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ‘సర్’నిర్వహించేందుకు మార్చిలో ప్రకటన వెలువడే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఎస్ఆర్) పేరుతో ఏటా కొత్త ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. అయితే చివరిసారిగా 2002లో ఉమ్మడి ఏపీలో ‘సర్’నిర్వహించారు. ‘సర్’2026 నిర్వహణకు ముందస్తు సన్నాహాల్లో భాగంగా .. ‘సర్’2002లో భాగంగా ప్రచురించిన ఓటర్ల జాబితాతో, ఎస్ఎస్ఆర్ 2025 జాబితాను మ్యాపింగ్ చేసే ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. అంటే ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న వారిలో ఎవరెవరు సర్ 2002 జాబితాలో పేరు కలిగి ఉన్నారో అన్వేషించే బాధ్యతను స్థానిక బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ)కు అప్పగించింది. మరో రెండు మూడురోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వారికి ఆదేశాలు అందాయి. మ్యాపింగ్ బాధ్యతలు బీఎల్ఓలకు.. బీఎల్ఓ యాప్ ద్వారా మ్యాపింగ్ నిర్వహించేందుకు బీఎల్ఓలకు శిక్షణ ఏర్పాట్లు చేశారు. యాప్లో ‘మ్యాప్ ఎలెక్టర్ విత్ ప్రీవియస్ ఎస్ఐఆర్’(సర్) అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకుంటే అందులో మరో రెండు ఐచ్ఛికాలు స్క్రీన్పై ప్రత్యక్షం కానున్నాయి. 2025 జాబితాలోని ఓటరునే 2002 సర్ జాబితాలో మ్యాప్ చేసేందుకు ‘మ్యాప్ ఎలుక్టర్ విత్ ప్రీవియస్ ఎస్ఐఆర్’అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉండనుంది. ఒక వేళ ఎస్ఎస్ఆర్– 2025 జాబితాలోని ఓటర్ల పేరు ..సర్–2002 జాబితాలో లేకపోతే వారి తల్లిదండ్రుల పేర్లను సర్–2002 జాబితాలో వెతికి మ్యాపింగ్ చేసేందుకు గాను ‘మార్క్ ఎలెక్టర్ యాజ్ ప్రొగినీ’అనే మరో ఐచ్ఛికాన్ని ఎంపిక చేయాల్సి ఉండనుంది. ఓటర్ల జాబితాలోని పార్ట్ నంబర్, పార్ట్ సీరియల్ నంబర్ల ఆధారంగా ఓటర్లను గుర్తించి మ్యాపింగ్ చేసేలా ఈ సాఫ్ట్వేర్ను ఈసీ అభివృద్ధి చేసింది. ఒక వేళ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తై ఉంటే వారి సంతానంలోని ఓటర్ల వివరాలను యాడ్ చేస్తారు. సర్ 2002లోని ఓటర్లతో వారికి ఉన్న సంబంధాన్ని సైతం నమోదు చేస్తారు. ఈ విషయంలో ఓటర్లకు ఏమైనా అనుమాలుంటే తమ ప్రాంత బీఎల్ఓతో నేరుగా ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకునేందుకు ఈసీ అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈసీ వెబ్సైట్(https://voters.eci.gov.in/home/bookACallRequest)కు వెళ్లి తమ ఎపిక్ నంబర్, ఫోన్ నంబర్ను ఎంట్రీ చేస్తే సంబంధిత బీఎల్ఓకు ఆ ఓటరు ఫోన్ నంబర్ను ఈసీ పంపించనుంది. బీఎల్ఓ ఫోన్ చేస్తే సర్–2002 జాబితాలోని తమ ఓటరు పోలింగ్ స్టేషన్ నంబర్, పార్ట్ సీరియల్ నంబర్ వివరాలను చెప్పి 2025 జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించుకోవచ్చు. వలస ఓటర్లు ..తస్మాత్ జాగ్రత్త! రాష్ట్రంలోని 119 శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఐఆర్– 2002లో రూపొందించిన ఓటర్ల జాబితాను ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం తన వెబ్సైట్ (https://ceotelangana.nic.in/) లో పొందుపరిచింది. ఎస్ఐఆర్–2002లో ఓటరు పేరు/తమ తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయో లేవో ఈ లింక్ను క్లిక్ చేయడం ద్వారా ఓటర్లు తెలుసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ సంఖ్య ఆధారంగా ఓటర్ల పేర్లను సులువుగా వెదకవచ్చు. ఎస్ఐఆర్ 2002లో తమ పేరు/తల్లిదండ్రుల పేర్లు ఉన్నట్టు రుజువులు సమర్పిస్తే కొత్త ఎస్ఐఆర్లో ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి/ ఒక నియోకవర్గం నుంచి మరో నియోకవర్గానికి/ఒకే నియోజకవర్గంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చిరునామా మారిన వలస ఓటర్లను కొత్త ప్రాంతంలోని బీఎల్ఓలు గుర్తు పట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి ఓటర్లు సర్– 2002 జాబితాలో తమ పేర్లు/తమ తల్లిదండ్రుల పేర్లను గుర్తించి ఆ వివరాలను తమ ప్రాంత బీఎల్ఓలకు మ్యాపింగ్ కోసం అందజేస్తే సర్–2026లో సమస్యలు ఎదుర్కోకుండా గట్టెక్కవచ్చు. -
యక్ష ప్రశ్నలు.. ముప్పు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: అమెరికా విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. కీలకమైన ఐ–20 పత్రాల జారీకి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో కాలయాపన చేస్తున్నాయి. విద్యార్థి సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పడుతున్నాయి. ఏ మాత్రం అనుమానం వచ్చినా పత్రాల జారీ ఆపేస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల పత్రాలపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏటా దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువు కోసం వెళ్తుంటారు. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు లక్ష వరకు ఉంటారు. కాగా ఆగస్టులో మొదలయ్యే విద్యా సంవత్సరానికి ఆరు నెలల ముందే అనుమతులు పొందాల్సి ఉంటుంది. యూఎస్ వీసా తీసుకోవడం ఒక ఎత్తైతే, తాజాగా వర్సిటీల్లో ఐ–20 పత్రం పొందడం మరో ఎత్తవుతోంది. వీసా వచ్చినా ఐ–20 రాకపోతే యూఎస్ వెళ్లేందుకు వీలుండదు. ఐ–20 అంటే ఏమిటి? ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్ళే విద్యార్థులు ముందుగా అక్కడి యూనివర్సిటీలను ర్యాంకు ఆధారంగా ఎంపిక చేసుకుంటారు. సీటివ్వడానికి ఒప్పుకున్న యూనివర్సిటీ సర్టిఫికెట్ ఆఫ్ ఎలిజిబిలిటీ (ఐ–20) పత్రం ఇవ్వాలి. ఇందులో విద్యార్థి ఎంపికైన కోర్సు, ఆ కోర్సు కాల వ్యవధి, ఫీజు వివరాలు, విద్యార్థి ఆర్థిక సామర్థ్యం వివరాలు ఉంటాయి. దీని ఆధారంగా యూఎస్లో యూనిక్ కోడ్ ఇస్తారు. వర్సిటీ ఇచ్చే వివరాల ఆధారంగా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎస్ఈవీఐఎస్) అనే సంస్థ పూర్తి సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. ఇది విద్యార్థికి చాలా కీలకం. విద్యార్థులకు ఇచ్చే ఎఫ్–1 వీసాకు దీన్ని ముఖ్యమైన డాక్యుమెంట్గా గుర్తిస్తారు. సమస్య ఎక్కడ? విద్యార్థులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వర్సిటీలపైనే చర్యలు తీసుకుంటామని ట్రంప్ సర్కార్ ఇటీవల ప్రకటించింది. అవసరమైతే యూనివర్సిటీ గుర్తింపునే రద్దే చేస్తామని హెచ్చరించింది. దీంతో ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ప్రతీ డాక్యుమెంట్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాస్ట్పోర్టు వివరాల్లో తప్పులున్నా, అకడమిక్ వివరాల్లో స్పెల్లింగ్ తప్పిదాలున్నా, మార్క్ట్ తేదీల్లో తేడాలున్నా ఐ–20 పత్రాలు ఆపేస్తున్నాయి. యూఎస్లో కోర్సు చేసేందుకు వచ్చే విద్యార్థులకు ఫీజులు, జీవించడానికి అయ్యే ఖర్చుల అంచనాలను వర్సిటీలే లెక్కగడతాయి. ఆ మొత్తాన్ని బ్యాంకు బాలెన్స్గా చూపించాల్సి ఉంటుంది. కన్సల్టెన్సీలు ఈ మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో వేయడం, విద్యార్థి అమెరికా వెళ్ళగానే తీసుకోవడం చేస్తుంటాయి. ప్రస్తుతం వర్సిటీలు కొత్తగా ఆరు నెలల బ్యాంక్ బ్యాలెన్స్, అది ఏ రూపంలో జమ అయ్యిందో చూస్తున్నాయి. వాటిని స్పాన్సర్ చేసిన వ్యక్తుల వ్యక్తిగత వివరాలు పరిశీలిస్తున్నారు. ఎంపిక చేసుకునే కోర్సులకు సంబంధించి భారత్లో విద్యార్థి చేసిన కోర్సు, సాధించిన మార్కులు, ఇంటర్న్షిఫ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇందులో ఏ ఒక్కటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా, అనుమానాస్పదంగా ఉన్నా పత్రాల జారీ నిలిపివేస్తున్నారు. సోషల్ మీడియాపై దృష్టి విద్యార్థి సామాజిక ఖాతాను లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమ ఖాతాలు ఎన్ని ఉంటే అన్నింటి వివరాలు ఇవ్వాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి. వీటిల్లో గత కొన్నేళ్ళుగా విద్యార్థి ఎలాంటి పోస్టింగ్లు పెట్టాడు? ఏయే సంస్థలతో లింక్ అయి ఉన్నాడు? అమెరికాలోని ఏయే వ్యక్తులతో అతనికి సంబంధాలున్నాయి? వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఏమిటి? ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమిటి? కుటుంబ నేపథ్యం ఏమిటి? అనే వివరాలను లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఒక్క పోస్టు కన్పించినా ఐ–20 పత్రం ఇవ్వడానికి వర్సిటీలు సాహసించడం లేదు. సదరు విద్యార్థితో సంబంధం ఉన్న వ్యక్తుల్లో ఎవరిలోనైనా యూఎస్ వ్యతిరేక భావజాలం ఉన్నట్టు కన్పించినా విచారణకు ఆదేశిస్తున్నారు. యూనిక్ ఐడీ ఇవ్వడానికి ఇదే కొలమానం ఏడాదిగా అమెరికా భద్రత వ్యవహారాల్లో యూనివర్సిటీల బాధ్యత పెంచారు. విదేశీ విద్యార్థులను రప్పించే క్రమంలో అన్ని వివరాలు పరిశీలిస్తున్నారు. అమెరికన్ చట్టాలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు విద్యార్థులు పాల్పడినా పరిణామాలు త్రీవంగా ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో మరింత జాగ్రత్త పడుతున్నారు. ఐ–20 పత్రాలు ఆలస్యం అవ్వడానికి ఇదే కారణం. – నవీన్ చావ్లా (యూఎస్ వర్సిటీలో భారతీయ అధ్యాపకుడు) విదేశీ స్నేహితుల వివరాలు అడిగారు అమెరికా యూనివర్సిటీలో సీటు వచ్చింది. ఆగస్టులో అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యాం. ఫేస్బుక్లో ఇతర దేశాల్లో ఉన్న స్నేహితులూ యాడ్ కావడంతో వాళ్ళ గురించిన వివరాలు అడిగారు. ఆ తర్వాత ఆర్థిక సంబంధమైన వివరాలు కోరారు. వీటిపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతే పత్రాలు వస్తాయని కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. – రోషన్ స్తపతి (హైదరాబాద్ విద్యార్థి) -
కోట్లు మేస్తున్న కంచె
కబ్జాల నుంచి స్థలాలను కాపాడుకునేందుకు వాటి చుట్టూ కంచె నిర్మించుకోవటం సాధారణ విషయమే. కానీ రైల్వే శాఖ ఇప్పుడు వేల కోట్లు వెచ్చించి కంచె నిర్మిస్తోంది. అయితే ఇది ఏదో ఆస్తులను కాపాడుకునేందుకు కాకుండా, ప్రజల్లో లోపించిన క్రమశిక్షణ ఫలితంగా చేస్తున్న వృ«థా ఖర్చు కావడం గమనార్హం. ఈ కంచె కోసం ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగానే వ్యయం కానుండగా.. అవే డబ్బులు వెచ్చిస్తే 30 వందేభారత్ రైళ్లు తయారవడం లేదా వందల కి.మీ. నిడివి ఉండే కొత్త రైల్వే రూట్ రూపొందే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైల్వే కారిడార్లు జనావాసాలు, వ్యవసాయ పొలాలు, అడవుల మీదుగా సాగుతాయన్న విషయం తెలిసిందే. చెరువు కట్టలాగా ఎత్తుగా ఉండే రైలు మార్గం, అక్కడి ప్రాంతాన్ని రెండుగా విభజిస్తుంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు దాన్ని దాటేందుకు నిర్మాణ సమయంలో ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తుంది. పశువులు దాటేందుకు కూడా వీలుంటుంది. కానీ ప్రజలు దీన్ని పట్టించుకోకుండా ఎక్కడ కుదిరితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్ దాటుతున్నారు. చివరకు వంతెనలు ఉన్న చోట కూడా రైలు మార్గం మీదుగా దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రైళ్లు ఢీకొట్టడంతో ఎంతో మంచి చనిపోతున్నారు. ముఖ్యంగా వేల సంఖ్యలో జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. మరోవైపు ఇది రైల్వేకు పెద్ద సమస్యగా మారింది. చనిపోయిన మనుషులు, జంతువుల ప్రాణాలకు విలువ కట్టి పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ట్రాక్ పొడవునా రెండు వైపులా కంచె నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. ఇప్పటికే కొంతపని పూర్తి కాగా, మిగతా ప్రాంతాల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రహరీ గోడలు..ఇనుప కంచెలు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రైళ్లు ఢీకొట్టడం వల్ల అధిక సంఖ్యలో వన్యప్రాణులు చనిపోతున్నాయి. గుజరాత్లో సింహాలు, అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఏనుగులు సైతం మరణిస్తున్నాయి. ఆయా జంతువులు వేగంగా అంతరించే జంతువుల జాబితాలో ఉండటంతో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి చోట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి, కానీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపుగా అలాంటి పరిస్థితి లేదు. వన్య ప్రాణులకు రైళ్లతో పెద్దగా సమస్య లేదు. కానీ ఇక్కడ పశువులు ఎక్కువగా చనిపోతున్నాయి. దూరాభారాన్ని తగ్గించుకునే క్రమంలో నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు లాంటి మూగ జీవాలను పట్టాల మీదుగా తరలిస్తుండటంతో అవి చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు దాటే సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఏకంగా ప్రహరీ గోడలే నిర్మిస్తుండగా, మిగతా ప్రాంతాల్లో ఇనుప కంచె ఏర్పాటు చేస్తున్నారు. కాలి బాటలు ఉన్న చోట్ల సబ్వేలను నిర్మిస్తున్నారు. ఆ మార్గాలపై ప్రత్యేక దృష్టి... ఇటీవల పలు ప్రధాన రైలు మార్గాల్లో రైళ్ల వేగాన్ని 130 కి.మీ.కు పెంచారు. ఆ మేరకు ట్రాక్ను పటిష్టం చేశారు. వేగంగా వెళ్లే వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టడమే కాకుండా వాటి సంఖ్య క్రమంగా పెంచుతున్నారు. కొత్తగా వందేభారత్ స్లీపర్ కేటగిరీ రైళ్లు కూడా పట్టాలెక్కబోతున్నాయి. వీటి వేగం ఎక్కువగా ఉంటున్నందున, ట్రాక్ సామర్థ్యాన్ని కూడా ఆ మేరకు పెంచాల్సి ఉంది. రైళ్ల వేగం పెరిగే కొద్దీ నిర్లక్ష్యంగా ట్రాక్ దాటే వారికి ప్రమాదం జరిగే అవకాశం కూడా పెరుగుతుంది. రెప్పపాటులో రైలు దూసుకొచ్చినప్పుడు తప్పించుకునే చాన్స్ తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రైళ్లు పట్టాలు తప్పేందుకు కూడా ఇది కారణమవుతుంది. అప్పుడు రైళ్లలోని ప్రయాణికులు కూడా ప్రమాదానికి గురవుతారు. ఎంత చెప్పినా, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు దాటటాన్ని జనం వదులుకోవటం లేదు. ఈ నేపథ్యంలోనే.. 4,019 ట్రాక్ కి.మీ. మేర ఇనుప కంచె, 410 కి.మీ. మేర ప్రహరీ గోడలు నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించి పనులు మొదలుపెట్టింది. కంచె కోసం రూ.2,056 కోట్లు, ప్రహారీ గోడ నిర్మాణానికి రూ.1,136 కోట్లు వ్యయం చేయనుంది. ఇప్పటికే 875 కి.మీ. నిడివిలో కంచె నిర్మించగా, దానికి ఈ కొత్త ప్రణాళిక అదనం కావటం విశేషం. ట్రాక్ వద్ద ఏర్పాటు చేసిన ఇనుప కంచె రైల్వేని కుదిపేసిన అస్సాం ఘటన ఇటీవల అస్సాంలో రైలు ఢీకొని ఒకేసారి ఏడు ఏనుగులు చనిపోవటం రైల్వేను కుదిపేసింది. ఇప్పుడు ట్రాక్ చుట్టూ కంచె నిర్మాణం వేగవంతం కావటానికి ఇది ప్రధాన కారణంగా మారింది. ఇక తరచూ మనుషులు చనిపోవటం ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే భద్రత చర్యల కోసం ఏకంగా రూ.1.16 లక్షల కోట్లు వ్యయం చేస్తుండగా, ఇందులో దేశవ్యాప్తంగా కంచె, ప్రహరీ గోడల నిర్మాణానికి దాదాపు రూ.23 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగు పరచటం, రైళ్లు పరస్పరం ఢీకొనకుండా కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేయటం, ట్రాక్ను పటిష్టం చేయటం, అండర్పాస్లను నిర్మించటం లాంటివి భద్రత చర్యల్లో భాగం. ఇవన్నీ అత్యవసరమైనవే కానీ ట్రాక్కు ఇరువైపులా కంచెల నిర్మాణం మాత్రం చాలావరకు ప్రజల నిర్లక్ష్యం ఫలితంగానే చేపట్టాల్సి వస్తోంది. ఎస్సీఆర్ పరిధిలో కంచె పనులు ఇలా.. గుజరాత్లో సింహాలు ప్రమాదాలకు గురికాకుండా, అస్సాం లాంటి అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏనుగులను కాపాడేందుకు, ఇతర టైగర్ రిజర్వ్లలో పులులు సహా ఇతర వన్యప్రాణులు ప్రమాదాలకు గురికాకుండా కంచె నిర్మాణం అవసరం. కానీ మనుషులు, వారు పెంచుకునే పశువులు ప్రమాదాలకు గురికావడానికి మాత్రం స్థానిక ప్రజల నిర్లక్ష్యం, అజాగ్రత్తే కారణం. వాస్తవానికి ట్రాక్ను ఎక్కడ దాటాలో స్పష్టంగా సూచిస్తూ అందుకోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అండర్ పాస్లు, రైల్వే గేట్లు లాంటివి ఇందులో భాగమే. కానీ ప్రజలు నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడపడితే అక్కడ ట్రాక్లు దాటేస్తున్నారు. -గౌరీభట్ల నరసింహమూర్తి -
గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. సజ్జనార్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: చైనా మాంజా జనం ప్రాణాలు తీస్తున్నాయి. బాధిత కుటుంబాల్లో విషాదం నింపుతోంది. విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. పతంగుల పండగ నేపథ్యంలో ‘గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదు’ అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. చైనీస్ మాంజా దారం తెగదు.. కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుంది. మీ క్షణికానందం.. మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదు. నిషేధిత చైనా మాంజా అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవు. పండగని పండగలా జరుపుకోండి. ప్రాణాలు తీసి కాదు’ అంటూ సజ్జనార్ హెచ్చరించారు.కాగా, చైనా మాంజా విక్రయంపై నగర పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. దీని వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2016లో, జాతీయ హరిత ట్రైబ్యునల్ 2017లో నిషేధించింది. అయినప్పటికీ విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. దీంతో నెల రోజులుగా నిఘా ఉంచిన అధికారులు ఇప్పటి వరకు 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.24 కోట్ల విలువైన 6226 బాబిన్ల మాంజా స్వాధీనం చేసుకున్నారు.గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదు!చైనీస్ మాంజా దారం తెగదు.. కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుంది.మీ క్షణికానందం.. మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదు.నిషేధిత చైనా మాంజా అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవు.పండగని పండగలా జరుపుకోండి. ప్రాణాలు తీసి… pic.twitter.com/wrsYH1yXOr— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 11, 2026ఇవాళ(జనవరి 11, ఆదివారం) హైదరాబాద్లో చైనా మాంజాకు మరో వ్యక్తి బలి అయ్యాడు. బైక్పై వెళ్తున్న సాయి వర్దన్ మెడకు మాంజా చుట్టుకోవడంతో అతడి చెయ్యి, మెడకి తీవ్ర గాయమైంది. దీంతో, వెంటనే సాయి వర్ధన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. -
ఎన్నికల నిర్వహణ ప్రక్రియ.. బెల్జియంకు తెలంగాణ సీఈఓ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఎన్నికల నిర్వహణలో అనుభవాల మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం లక్ష్యంగా మూడు రోజుల అధికారిక పర్యటనకు బెల్జియంకు బయలుదేరారు. బెల్జియన్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ – ఇంటీరియర్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది.ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియల్లో పారదర్శకత, సమగ్రత, సామర్థ్యాన్ని మెరుగుపర్చే అంశాలపై రెండు దేశాల అధికారుల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. సీఈఓ సుధర్శన్ రెడ్డి నేతృత్వంలోని బృందంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి, సీఈఓ కార్యాలయ రాష్ట్ర శిక్షణ నోడల్ అధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బోయపాటి చెన్నయ్య, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఈఆర్వో కంకనాల అనంత రెడ్డి, నాంపల్లి నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ నం.97 బూత్ స్థాయి అధికారి వేముల ధ్రువ కుమార్ రెడ్డి ఉన్నారు.పర్యటనలో భాగంగా బెల్జియన్ ఎఫ్పీఎస్ – ఇంటీరియర్, ఎఫ్పీఎస్ – ఫారిన్ అఫైర్స్ ఉన్నతాధికారులతో సమావేశాలు, కేయూ లూవెన్ యూనివర్సిటీ నిపుణులతో చర్చలు, బ్రస్సెల్స్లోని భారతీయ రాయబార కార్యాలయంలో సేవా ఓటర్లతో పరస్పర చర్యలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ (IIIDEM) ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ అవుట్రీచ్ కార్యక్రమంలో భాగమని అధికారులు తెలిపారు. -
చైనా మాంజా.. సిటీలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో చైనా మాంజాకు మరో వ్యక్తి బలి అయ్యాడు. బైక్పై వెళ్తున్న సాయి వర్దన్ మెడకు మాంజా చుట్టుకోవడంతో అతడి చెయ్యి, మెడకి తీవ్ర గాయమైంది. దీంతో, వెంటనే సాయి వర్ధన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో జరిగినట్టు తెలిసింది. మరోవైపు.. శుక్రవారం కూడా చైనా మాంజా కారణంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన సభావల్ మధు శుక్రవారం హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి బైక్పై వెళ్తున్నారు. మార్గ మధ్యలో సాగర్ హైవేపై మాల్ మార్కెట్లో విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న చైనా మాంజా చేతి వేళ్లకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన స్థానికులు యాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి.. చైనా మాంజా విక్రయిస్తున్న వ్యాపారి వివరాలపై ఆరా తీశారు. -
వృద్ధుడి గొంతు కోసిన చైనా మాంజా
రామంతాపూర్: రామంతాపూర్కు చెందిన ఓ వృద్ధుడు చైనామాంజా తగలడంతో గొంతుకోసుకుపోయింది. దామెర వీయ్య (60) శనివారం గోల్నాక నుంచి అంబర్పేట్ కొత్త బ్రిడ్జి నుంచి రామంతాపూర్ వాసవినగర్లోని ఇంటికి బైక్పై వస్తున్నాడుచైనా మాంజా మెడకు తాకడంతో గొంగు కోసుకుపోయింది. దీంతో స్థానికులు అంబర్పేట్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. -
గంజాయి విక్రయిస్తున్న ర్యాపిడో డ్రైవర్
హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ర్యాపిడో డ్రైవర్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని ఇబ్రహీంనగర్లో నివాసం ఉండే ర్యాపిడో డ్రైవర్ మొహ్మమ్మద్ జునైద్ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించాడు. అతని వద్ద నుంచి 137 గ్రాముల డ్రై గంజాయి, హోండా షైన్ ద్విచక్ర వాహనం, ఒప్పో మొబైల్ ఫోన్ను స్వాదీనం చేసుకున్నారు. నిందితుడు జునైద్ను అరెస్టు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: అపార్ట్మెంట్ రెండో అంతస్తులోకి పాము
హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ రెండవ అంతస్తుకు వచ్చిన నాగుపాము కార్మికులకు భయాందోళనకు గురిచేసింది. నార్సింగి సర్కిల్, నెక్నాంపూర్ గోల్కొండ హిల్స్లో నిర్మాణం జరుగుతున్న అపార్ట్మెంట్లోకి శనివారం ఐదు అడుగుల నాగుపాము వచి్చంది. దీంతో కారి్మకులు చూసి భయాందోళన చెందారు. స్నేక్ సొసైటీ సభ్యులు వచ్చి బంధించి తీసుకువెళ్లారు. ఎక్కడ పాములు కనిపించినా తమకు ఫోన్ నెంబర్ 83742 33366 నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
సంక్రాంతికి వస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్/సూర్యాపేట టౌన్ : నగరం నుంచి పండుగ ప్రయాణాలు మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో పోటెత్తాయి.ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, మియాపూర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, అమీర్పేట, సాగర్ రింగ్ రోడ్డు, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి శనివారం ప్రయాణికులు భారీ ఎత్తున సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 3,500 రెగ్యులర్ బస్సులతోపాటు మరో 300 బస్సులను అదనంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సిటీ బస్సులను సైతం దూర ప్రాంతాలకు నడుపుతున్నారు. శనివారం 75 సిటీ బస్సులను విజయవాడ, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట తదితర ప్రాంతాలకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లో సైతం పెద్ద ఎత్తున తరలివెళ్లారు. దీంతో విజయవాడ, వరంగల్, కర్నూలు రహదారులు వాహనాలతో పోటెత్తాయి. రైళ్లలో కిక్కిరిసిన జనరల్ బోగీలు... సాధారణ రైళ్లతోపాటు వివిధ మార్గాల్లో సుమారు 60 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా అన్ని రైళ్లలోనూ బెర్తులు బుక్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు జనరల్ బోగీల్లో తరలి వెళ్లారు. సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి శనివారం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయలుదేరారు. సాధారణంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నిత్యం సుమారు 1.85 లక్షల మంది ప్రయాణం చేస్తారు. శనివారం సుమారు 2.20 లక్షల మంది తరలి వెళ్లినట్లు అంచనా, లింగంపల్లి, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. జాతీయ రహదారిపై రద్దీ పండుగ నేపథ్యంలో ప్రజానీకం సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఏర్పడింది. ఈ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా నుంచి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం సాయంత్రం 5గంటల వరకు విజయవాడ వైపు 55వేల వాహనాలు వెళ్లాయి. పంతంగి టోల్ప్లాజా వద్ద మొత్తం 16టోల్బూత్లు ఉన్నాయి. ప్రస్తుతం రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ వైపునకు 12బూత్లు కేటాయించారు. హైదరాబాద్ మార్గంలో నాలుగు బూత్ల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. అయితే, అదనంగా కేటాయించిన టోల్బూత్లకు ఫాస్టాగ్ స్కానింగ్ చేసే అవకాశం ఉండదు. స్కానింగ్ వ్యవస్థ వెనుక భాగంలో ఉండడంతో విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలకు ఆటోమెటిక్ స్కానింగ్కు అవకాశం లేదు. దీంతో ఆ నాలుగు బూత్ల వద్ద హ్యాండ్ మిషన్ ద్వారా స్కానింగ్ చేస్తున్నారు. ఇందుకుగాను అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రద్దీని తట్టుకునేలా సిబ్బంది హ్యాండ్ గన్లతో సిద్ధంగా ఉంటూ స్కాన్ చేస్తున్నారు. -
అంబర్పేట ఎస్ఐ భానుప్రకాశ్రెడ్డికి రిమాండ్
అంబర్పేట (హైదరాబాద్): రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అప్పగించకుండా తాకట్టు పెట్టిన ఎస్ఐ భానుప్రకాశ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్పేట పోలీసు స్టేషన్లో భానుప్రకాశ్రెడ్డి డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది ఓ చోరీ కేసులో దొంగల నుంచి నాలుగున్నర తులాల బంగారాన్ని రికవరీ చేశాడు. అయితే దానిని బాధితులకు అప్పగించకుండా సొంత అవసరాలకోసం తాకట్టు పెట్టాడు. బాధితులు బంగారం కోసం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లగా విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో భానుప్రకాశ్ను సస్పెండ్ చేశారు. విచారణ తర్వాత అరెస్టు చేసి శనివారం కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. జాడ తెలియని సరీ్వస్ రివాల్వర్భానుప్రకాశ్ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి జీవితాన్ని దుర్భరంగా చేసుకున్నాడు. ఏకకంగా సరీ్వస్ రివాల్వర్ను పొగొట్టుకున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు ఎంత విచారించినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. చివరికి రైలులో ప్రయాణిస్తుండగా పోయినట్లు అతను తెలపడంతో ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారని తెలిసింది. -
తాగి పడి ఉన్న వ్యక్తిని పీక్కుతిన్న కుక్కలు!
రంగారెడ్డి జిల్లా: తాగిన మైకంలో స్పృహ లేకుండా పడి ఉన్న ఓ వ్యక్తి గొంతును కుక్కలు పీక్కుతిన్న సంఘటన శంషాబాద్ సర్కిల్లోని మధురానగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఆర్జీఐఏ పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం వేలూరు అక్కలాయక్కన్పట్టి గ్రామానికి చెందిన చిన్నారసు (36) ఇటీవల విమానాశ్రయంలో ఉద్యోగం చేయడానికి శంషాబాద్ వచ్చాడు. అక్కడ మరికొందరితో కలిసి ఓ గదిలో నివాసముంటున్నాడు. శుక్రవారం రాత్రి బాగా మద్యం తాగిన అతడు మధురానగర్ కాలనీ సంతోషిమాతా ఆలయం వీధి మూలమలుపుపై పడిపోయాడు. రాత్రి 9.30 గంటల సమయంలో రోడ్డుపై పడి ఉన్న అతడిని స్థానికులు కొందరు పక్కకు తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం 6 గంటల సమయంలో అతను శవమై కనిపించాడు. పారిశుద్ధ్య సిబ్బంది చిన్నారసు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. తొలుత హత్యగా భావించినప్పటికీ చిన్నారసు గొంతు భాగం పూర్తిగా కొరికేసినట్లుగా ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గొంతుభాగంలో ఎక్కువగా మాంసం కోల్పోయి ఉండటంతో కుక్కలు పీక్కుతిన్నట్లు అనుమానించారు. ఆ దిశగా సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. స్పృహలేకుండా పడి ఉన్న చిన్నారసును మధ్యరాత్రి సమయంలో కుక్కలు చుట్టుముట్టినట్లు గుర్తించారు. అయితే కుక్కల కన్నా ముందే అతడి గొంతును పందికొక్కులు లేదా పందులు కొరికి ఉండవచ్చని, ఆ తర్వాత కుక్కలు పీక్కుతిని ఉండవచ్చని వైద్యుల పరిశీలనలో తేలినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీ ట్రాఫిక్ జామ్
సాక్షి,హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ భారీగా పెరిగింది. సంక్రాంతి పండుగకు ముందు శనివారం, ఆదివారం రావడంతో హైదరాబాద్లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు. ఒకే సమయంలో వాహనాలు వేల సంఖ్యలో తరలిరావడంతో యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు అర కిలోమీటరు మేర నిలిచిపోయాయి.ఒక దశలో ట్రాఫిక్ కిలోమీటరు మేర నిలిచిపోయింది. ఫాస్టాగ్ విధానం అమలులో ఉన్నప్పటికీ వాహనాలు పరిమితికి మించి రావడం, కొన్ని వాహనాల ఫాస్టాగ్లు స్కాన్ కాకపోవడంతోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని టోల్ ప్లాజా నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నారు. రాచకొండ పోలీసులు, జీఎంఆర్ టోల్గేట్ సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద ఫాస్టాగ్ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టోల్ చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో వాహనాలు నిలిచిపోయి, రద్దీ మరింత పెరిగింది. మరోవైపు జాతీయ రహదారి-65 పై వాహనాల జాతర కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో వాహనాల సంఖ్య పెరగడంతో రహదారి బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్త చర్యలు కనిపించకపోవడం వాహనదారులను ఆందోళనకు గురి చేసింది.టోల్ ప్లాజా వద్ద ఆలస్యం, ఫాస్టాగ్ సమస్యలు, రహదారి బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
సైబర్ వలలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సతీమణి ఊర్మిళ సైబర్ నేరస్తుల వలలో చిక్కారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో భారీ లాభాలు ఆర్జించవచ్చన్న నేరస్తుల మాయమాటలను నమ్మి ఏకంగా రూ.2.58 కోట్లు మోసపోయారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలోని స్రవంతి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న లక్ష్మీ నారాయణ భార్య ఊర్మిళకు గత నవంబర్ చివరి వారంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్లో సందేశం వచ్చింది.స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్కు చిట్కాలు ఇస్తామని, అధిక లాభాలు ఆర్జించవచ్చని ఆ సందేశం సారాంశం. అయితే ఆమెకు ట్రేడింగ్లో అనుభవం లేకపోయేసరికి.. తన భర్తను వాట్సాప్ గ్రూప్లో చేరమని సలహా ఇచ్చారు. దీంతో లక్ష్మీ నారాయణ నవంబర్ 29న ‘స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్సే్ఛంజ్ గ్రూప్–20’అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేరారు. ఇందులో 167 మంది సభ్యులు ఉన్నారు. అమెరికాలో పీహెచ్డీ అంటూ.. దినేష్ సింగ్ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూప్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై సలహాలు ఇస్తూ మెసేజ్లు చేసేవాడు. ‘స్టాక్ మార్కెట్ ట్రెజరీ హంటింగ్ సీక్రెట్స్’ పేరుతో పుస్తకాన్ని కూడా ప్రచురించనున్నానని, ఈనెల 23న ముంబైలో ఈ కార్యక్రమం ఉంటుందని దినేష్ గ్రూప్ సభ్యులకు కల్లబొల్లి మాటలు చెప్పాడు. తాను ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ని అని, అమెరికాలోని వార్టన్ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశానని, జేపీ మోర్గాన్లో 6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులను నిర్వహించిన ఈక్విటీ అనలిస్ట్నని చెబుతూ ఓ నకిలీ లింక్ను పంపించాడు. అది చూసిన గ్రూప్ సభ్యులు నిందితుడిని గుడ్డిగా నమ్మారు.ఇదే సమయంలో దినేష్ ‘ది వెల్త్ అలయెన్స్’ అనే కాన్సెప్్టను గ్రూప్ సభ్యులకు పరిచయం చేశాడు. ఒకేరకమైన ఆలోచనలు, లక్ష్యాలు ఉన్న గ్రూప్ సభ్యులు కలిసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే 500 శాతం రాబడులు వస్తాయని.. అదే అలయెన్స్ లక్ష్యమని నమ్మించాడు. 5–6 వారాల్లో 200 శాతం లాభాలు అందిస్తానని హామీ ఇచ్చాడు. సభ్యులతో ఏకీకృత బ్రోకరేజ్ ఖాతాను తెరిచాడు. మెకన్లీ బ్రోకరేజ్ సర్విసెస్ ద్వారా మాత్రమే ఇండియన్ మార్కెట్ క్యూఐబీ ట్రేడింగ్, యూఎస్ మార్కెట్ క్యూఐబీ ట్రేడింగ్, ఐపీఓ సబ్స్రి్కప్షన్లను నిర్వహించాలని సూచించాడు. ఇందుకు కస్టమర్ సర్విసెస్ మేనేజర్ అంటూ ఖైతీ అనే మహిళను పరిచయం చేశాడు. సెబీ రిజిస్టర్డ్ సంస్థ అని నకిలీ గుర్తింపు పత్రాలను చూపాడు. భారత్తోపాటు అమెరికా, హాంకాంగ్లలో ట్రేడింగ్ చేయడానికి అధికారం ఉందని వివరించాడు. బంగారం మీద రుణం తీసుకొని మరీ.. గ్రూప్ సభ్యులను మూడు శ్రేణులుగా విభజించిన దినేష్.. రూ.20 లక్షల కంటే తక్కువ పెట్టుబడులు ఉన్నవారికి విక్టరీ వాన్ గార్డ్స్ టీమ్–1 అని, రూ.20 లక్షల కంటే ఎక్కువ పెట్టేవారిని విక్టరీ వాన్ గార్డ్స్ టీమ్–2 అని, అత్యధిక పెట్టుబడులు పెట్టేవారిని క్లోజ్డ్ డోర్ డిస్ప్లే టీమ్ అని పేర్లు పెట్టాడు. గ్రూప్ సభ్యులకు వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు మార్గదర్శకత్వం అందిస్తామని మాయమాటలు చెప్పాడు. గ్రూప్ సభ్యులు అధిక లాభాలు పొందేందుకు పెట్టుబడులు పెంచాలని.. లేకపోతే లాభాలు కోల్పోతారని భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఊర్మిళ పెట్టుబడుల మొత్తాన్ని పెంచారు. ఈ2ఈ రైల్, గాబియన్ టెక్నాలజీస్ ఐపీఓలలో పాల్గొనాలని, పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలని సూచించాడు. 300 శాతం లాభాలు వస్తాయని నమ్మించాడు.దీంతో గుడ్డిగా నమ్మిన ఊర్మిళ.. బంగారం మీద రుణం తీసుకొని మరీ పెట్టుబడులు పెట్టారు. ఒకవైపు అత్యాశ వద్దని భర్త హెచ్చరించినా పట్టించుకోకుండా ఆమె పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయడం గమనార్హం. పెట్టుబడుల కోసం నిందితులు పశి్చమ బెంగాల్, అస్సాం, ఒడిశా, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు చెందిన కరెంట్ ఖాతా నంబర్లను అందించారు. దీంతో అనుమానం కలిగిన ఊర్మిళ.. ఇంటర్నెట్లో సెర్చ్ చేశారు. వాట్సాప్ ఆధారిత పెట్టుబడి మోసాల గురించి పలు నివేదికలను చూశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఈనెల 6న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 111(2)(బీ), 318(4), 319(2), 336(3), 338, 340(2)లతో పాటు ఐటీ చట్టంలోని 66–సీ,డీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఒక్క రోజే రూ.38 లక్షలు..ఊర్మిళ తన భర్త పేరు, వివరాలతో ‘మెక్కీ సీఎం’ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని, ట్రేడింగ్ ఖాతాను ప్రారంభించారు. గ్రూప్లో ఇచ్చిన సూచనల మేరకు మెకిన్లీ ట్రేడింగ్ ఖాతాలోకి సొమ్మును బదిలీ చేశారు. గత డిసెంబర్ 24న తొలుత రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. అప్పట్నుంచి ఈనెల 5 వరకు 19 దఫాలుగా మొత్తం రూ.2.58 కోట్లు పెట్టారు. డిసెంబర్ 26న ఒక్క రోజే ఏకంగా రూ.38 లక్షలు పెట్టారు. బాధితురాలి యాక్సిస్ బ్యాంక్ ఖాతా నుంచి నిందితులకు చెందిన సీబీఐ బ్యాంక్లోని కంపాకోలా బెవరేజెస్ ఖాతాకు ఈ సొమ్మును బదిలీ చేశారు. నిందితులు మాతారా ఎంటర్ప్రైజెస్, రిసోర్స్ గ్లోబల్ సర్వీసెస్, సమ్మిట్ ఆటోమేషన్ కంట్రోల్ సిస్టమ్ పేరుతో కరెంట్ ఖాతాలు నిర్వహిస్తున్నారు. -
అతితక్కువ పనిదినాల్లో రెండోస్థానం
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకం కింద నమోదైన అత్యల్ప సగటు పనిదినాల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. ఉపాధి హామీ చట్టం 2025–26 సంవత్సరంలో 9 నెలల్లో 27 అత్యల్ప సగటు పనిదినాలతో ఉత్తరాఖండ్ ప్రథమ స్థానంలో నిలవగా, 28 రోజులతో తెలంగాణ రెండో స్థానంలో సాధించింది. 2025లో ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 దాకా... ప్రతి కుటుంబానికి సగటున 28 రోజుల సగటు పనులను నమోదు చేసింది. ఇదే సమయంలో 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య కూడా తక్కువగానే ఉంది.తెలంగాణలో కేవలం ఆరు వేల కుటుంబాలు మాత్రమే వంద రోజుల పనిని సాధించాయి. మునుపటి సంవత్సరాలతో పోలిస్తే... ఉపాధి కల్పనలో సవాళ్లు పెరగడంతో పర్సన్ డేస్ గణనీయంగా తగ్గాయి. తెలంగాణలో దాదాపు 20 లక్షల కుటుంబాలు ఈ పథకంలో పాల్గొన్నాయి. తాజాగా 18 ప్రధాన రాష్ట్రాల నుంచి సేకరించిన డేటాను విశ్లేíÙంచగా వివిధ అంశాలు వెల్లడయ్యాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఈ ఉపాధి పథకం ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ (గ్రామీణ్) చట్టం’గా అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. అంతకు ముందూ క్షీణతే... 2025లో ఆరునెలల కాలంలో (ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ దాకా) మొత్తం ఉపాధి హామీ పని దినాల్లో 47.6 శాతం మేర (గత ఏడాదితో పోలిస్తే) తగ్గుదల నమోదైంది. తెలంగాణలో ఉపాధి కల్పన గణనీయ తగ్గుదల కనిపించే జూలై–ఆగస్టు నెలల్లోనే కాకుండా.. ఈసారి వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో ఏప్రిల్–మే నుంచే ఈ క్షీణత ప్రారంభమైంది. ఈ తరువాతి నెలల్లోనూ పునరుద్ధరణ కాలేదు.ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా పనిదినాల తగ్గుదల 10.4% మాత్రమే ఉండగా, తెలంగాణలో మాత్రం దానికి నాలుగు రెట్లు అధికంగా ఉండటం ఆందోళనకరంగా మారింది. గత ఏడాది ఇదే సమయంలో ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య 25.33 లక్షల నుంచి 19.94 లక్షలకు (21.3% తగ్గుదల) తగ్గిపోయింది. అలాగే, ప్రతీ కుటుంబానికి లభించిన సగటు పని దినాలు 41 రోజుల నుంచి 27 రోజులకు పడిపోయాయి. ఒక కుటుంబానికి ఏడాదికి రూ.1,686 తక్కువ ఆదాయం (–19.4%) లభించింది. -
నెలాఖరులో తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాతావరణంలో మార్పులు వేగంగా నమోదవుతున్నాయి. చలి కాలం చివరి దశకు చేరుతుండడంతో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదవుతుండగా...రాత్రి పూట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాయుగుండాల ప్రభావం, రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది.చివరి వారంలో ఉత్తర, మధ్య తెలంగాణ, తూర్పు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయని, ఆ సమయంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 30.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 8.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. -
ఆశావహ సంవత్సరమే..!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పట్ల భారతీయుల్లో ఆశావహ దృక్పథం వ్యక్తమవుతోంది. కుటుంబ శ్రేయస్సు, వ్యక్తిగత పరివర్తన, ఆప్తులకు ప్రాధాన్యం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేందుకు మొగ్గుచూపనున్నారు. ఇటీవల నిర్వహించిన ఇప్సాస్ గ్లోబల్ ప్రిడిక్షన్స్– 2026 సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా అత్యంత ఆశావహ వైఖరిని కనబరిచిన వారిలో 90 శాతంతో ఇండోనేసియన్లు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో కొలంబియా–89%, చీలి, థాయ్లాండ్, పెరు 86%తో కాస్త ముందంజలో ఉండగా, ఇండియన్లు 81 %గా నిలిచారు.భారత్లో జరిపిన పరిశీలనలో పాల్గొన్న వారిలో...పది మందిలో 8 మంది 2026 మెరుగ్గా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 30 దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో ప్రధానంగా రాబోయే జీవితం, కొత్త సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లు, ఆర్థిక దృక్పథాలు కుటుంబానికి వెచి్చంచే సమయం, వ్యక్తిగత వృద్ధి, ప్రపంచ ఫుట్బాల్ పట్ల ఆసక్తి, ఏఐ విస్తృత వినియోగంలోకి వస్తున్న నేపథ్యంలో ఉద్యోగాలు, ఉపాధిపరంగా ఎదురయ్యే కష్టనష్టాలు, ఆందోళనలు తదితరాలపై అభిప్రాయాలు సేకరించారు. 2026 గురించి ఇలా... వ్యక్తిగత ప్రాధాన్యాలకు మించి ప్రపంచ, జాతీయ పరిణామాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడిందని సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. పది మందిలో ఎనిమిది మంది భారతీయులు 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చెప్పగా, ఇండోనేసియా, మలేసియా, థాయ్లాండ్, చిలీ పౌరులు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.⇒ సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం 2026లో ముగియాలని ఇద్దరు భారతీయులలో ఒకరు కోరుకుంటున్నారు. ఇతర దేశాల్లోని ప్రజల అభిప్రాయాలతో సరిపోల్చిస్తే, 2026లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి రావొచ్చని భారతీయులు సైతం అంచనా వేస్తుండడం విశేషం. ⇒ పది మందిలో ఆరుగురు భారతీయులు 2026లో ప్రపంచ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే వారి ఆందోళన స్థాయి ఇండోనేసియా, సింగపూర్ పౌరుల కంటే తక్కువగా ఉంది. ఆ దేశాల్లో పది మందిలో తొమ్మిది మంది పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ను అంచనా వేస్తున్నారు. ఇద్దరు భారతీయుల్లో ఒకరు 2026లో తీవ్రమైన వాతావరణ సంఘటనలకు భయపడుతున్నారు. ⇒ భారతీయుల ప్రాధాన్యతలు వ్యక్తిగత శ్రేయస్సు, కుటుంబ సంబంధాలపై బలంగా కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ ఏడాది కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలని 82% కోరుకుంటున్నారు. ఈ భావన ఇండోనేసియా, రొమేనియా, మలేసియా వంటి దేశాల్లోనే కనిపించింది. ⇒ పది మందిలో ఎనిమిది మంది భారతీయులు వ్యాయామాని కి అధిక ప్రాధాన్యం ఇచ్చి, ఎక్కువ సేపు ఇందులో గడపాలని భావిస్తున్నారు. 2025లో దీనిని నిర్లక్ష్యం చేశామన్న అపరాధ భావం కారణంగా కొత్త సంవత్సరంలో ఆ విధంగా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ⇒ భారత్లో సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ శాతం మంది గతేడాదితో పోల్చిస్తే 2026లో సోషల్ మీడియాకు వెచి్చంచే సమయాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు సమతుల్యత, వ్యక్తిగత శ్రేయస్సు, మెరుగుదల దిశలో మరింత కృషి సాగించాలని భావిస్తున్నారు. సర్వే ముఖ్యాంశాల్లో మన దేశానికి సంబంధించి... అధిక ఆశావాదం: భారతీయుల్లో అధిక స్థాయిల్లో ఆశావాదం వ్యక్తమైంది. 2026 మెరుగ్గా ఉంటుందని 81% మంది ఆశిస్తున్నారు ప్రాధాన్యాలు: ఈ ఏడాది కీలకమైన భారతీయ ప్రా ధాన్యతలలో కుటుంబ సమయం (82%), ఫిట్నెస్, వ్యక్తిగత శ్రేయస్సు వంటి వాటికి పెద్దపీట వేశారు.ఏఐ ఆందోళనలు: 62% మంది ఇండియన్లు ఏఐ వల్ల ఉద్యోగ నష్టాలు ఎదురు కావొచ్చునంటున్నారు. అయితే 57% మంది కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని భావిస్తున్నారు రక్షణ–భద్రతా భయాలు: వ్యక్తిగత రక్షణ, భద్రతల విషయంలో ఒకింత నిరాశావాదం వ్యక్తమైంది. తమ ప్రాంతం తక్కువ సురక్షితంగా మారుతుందని 55% మంది భావిస్తున్నారు. పెద్ద ఉగ్రవాద దాడి జరగొచ్చునని 53% మంది భయపడుతున్నారు ⇒ 2026లో అనేక సంభావ్య ముప్పులను కూ డా గుర్తించారు. వీటిలో పెద్ద ఉగ్రవాద దా డి భయాలతో పాటు ఆర్థిక మాంద్యం సంభావ్యత, ప్రజల్లో అశాంతి, అక్రమ వలసలకు సంబంధించిన ఆందోళనలు ఉన్నాయి. ⇒ గతేడాది దేశానికి, సొంత కుటుంబాలకు నష్టదాయకంగా పరిణమించిందని కొందరు అభివర్ణించారు.గతేడాది కఠినమే2025 పలువురు భారతీయులకు కఠినమైన సంవత్సరంగా నిలిచింది. ఆర్థిక ఒత్తిళ్లు, ఆపరేషన్ సిందూర్ ద్వారా పూర్తిస్థాయి యుద్ధం, తీవ్రమైన వాతావరణ ప రిస్థితులు, ట్రంప్ సుంకాల విధింపు–ఉద్యోగాల కోత లు, ఇతర సవాళ్ల నేపథ్యంలో ఇండియన్లు 2026 పట్ల ఆశావాద దృక్పథాన్ని కనబరుస్తున్నారు. 2025 కంటే 2026 మెరుగ్గా ఉంటుందని నమ్ముతున్నారు. కుటుంబం, స్నేహితులతో బంధానికి అధిక ప్రాధాన్యం, వ్యక్తిగత శ్రేయస్సుపై దృష్టి కేంద్రీకరణ, ఈ ఏడాది జరిగే ఫిఫా వరల్డ్కప్పై అధిక ఆసక్తి వంటివి వెల్లడయ్యాయి. – సురేశ్ రామలింగం, సీఈఓ, ఇప్సాస్ ఇండియా -
నేను సోషల్ డాక్టర్! : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్లు కేవలం వైద్య నిపుణులే కాదు.. సమాజానికి దిక్సూచి వంటివారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘నేను డాక్టర్ను కాదు.. కానీ సోషల్ డాక్టర్ను. ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో శనివారం ఫెలోస్ ఇండియా సదస్సులో భాగంగా ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ఐసీఆర్టీఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి వైద్య సదస్సును నిర్వహించడం గర్వకారణమని చెప్పారు. ఈ సదస్సుకు భారత్తోపాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు హాజరుకావడాన్ని ఆయన అభినందించారు. ఇప్పటికే సక్సెస్ఫుల్ కార్డియాలజిస్టులైన డాక్టర్లు కూడా జ్ఞానం, నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ఈ సదస్సుకు రావడం అభినందనీయమన్నారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని, కొత్త విషయాలు తెలుసుకోవడం, స్కిల్స్ను అప్డేట్ చేసుకోవడం మానేస్తే కెరీర్కు ముగింపు పలికినట్టేనని పేర్కొన్నారు. సాంకేతికత అతివేగంగా మారుతున్న నేపథ్యంలో వైద్య రంగం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటితో ముడిపడుతోందన్నారు. అందుకే ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అయితే, ప్రజల నాడి పట్టుకోవడాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దని హితవు పలికారు. హెల్త్కేర్ హబ్గా హైదరాబాద్ లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాల్లో హైదరాబాద్ ఆవిష్కరణల కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. డాక్టర్లు కావాలని చాలామంది ఆశపడతారని, కానీ అందరికీ ఆ అవకాశం దక్కదని చెప్పారు. అందుకే డాక్టర్లు సమాజంలో ఒక ప్రత్యేక వర్గమని, ప్రజల ప్రాణాలు కాపాడే గొప్ప బాధ్యత మీపైన ఉందని గుర్తుచేశారు. ప్రజా ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం హెల్త్ పాలసీలను మెరుగుపరచడంలో వైద్యుల సహకారం కీలకమని, మీ సలహాలు, సూచనలతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. గుండె జబ్బులపై అవగాహన కల్పిస్తే... ఇటీవలి కాలంలో గుండె జబ్బులతో మరణాలు పెరుగుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గుండె జబ్బులను నివారించే మిషన్లో అందరూ భాగస్వాములవ్వాలని వైద్యులకు పిలుపునిచ్చారు. విద్యార్థులకు సీపీఆర్ శిక్షణను స్వచ్ఛందంగా అందించేందుకు కార్డియాలజిస్టులు ముందుకొస్తే అనేక ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. చాలా సందర్భాల్లో నివారణపై నిర్లక్ష్యం చేస్తామని, కానీ ప్రజలకు అవగాహన కల్పిస్తే సమాజం మొత్తంగా లాభపడుతుందన్నారు. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ విషయంలో అందరూ కృషి చేయాలని, ఆరోగ్య సంరక్షణలో భారత్.. వరల్డ్ బెస్ట్గా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతీ వైద్యుడు ఉత్తమంగా ఎదగాలన్నదే తన కోరికని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెలోస్ ఇండియా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ శరత్ రెడ్డి, మెడికవర్ సీఎండీ డాక్టర్ అనిల్ కృష్ణ, మెడికవర్ సీఈవో డాక్టర్ హరికృష్ణ, మాజీ సీఎస్ఐ అధ్యక్షుడు పీసీ రథ్ పాల్గొన్నారు. -
నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తాను డాక్టర్ను కాదు.. కానీ సోషల్ డాక్టర్నని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. హెచ్ఐసీసీలో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్లో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ జరగడం సంతోషమన్నారు.‘‘భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు వచ్చారు. మీరంతా సక్సెస్ ఫుల్ కార్డియాలజిస్టులు. అయినా మీ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఈ కాన్ఫరెన్స్ కు వచ్చారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు...కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే మీ కెరీర్కు ముగింపు పలికినట్లే. ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరగడం ఎంతో గర్వకారణం. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాలలో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాలా మంది డాక్టర్లు అవ్వాలనుకున్నా అందుకు అర్హత సాధించలేరు. మీరంతా సమాజంలో ఒక ప్రత్యేక గ్రూప్. డాక్టర్లు ప్రాణాలు కాపాడతారని మేం బలంగా నమ్ముతాం. మనుషులపట్ల, సమాజం పట్ల మీ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దు...ప్రజల ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రజల ప్రయోజనాల కోసం మా పాలసీని మెరుగుపరచడానికి మీలాంటి వైద్యులతో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఆ దిశగా మీ సలహాలు, సూచనలు ఇచ్చి మాకు సహకరించండి. విజ్ఞానం, సాంకేతికత ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తున్నాయి. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ హై టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందుకే లేటెస్ట్ టెక్నాలజీ పై మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి.. కానీ ప్రజల నాడిని పట్టుకోవడం మరిచిపోవద్దు...ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతున్నారని మీకు తెలుసు. గుండె జబ్బులను నివారించే మిషన్లో మనమందరం భాగస్వాములం అవుదాం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మనమందరం కలిసి పనిచేద్దాం. విద్యార్థులకు సీపీఆర్ నేర్పించడానికి మీరు స్వచ్ఛందంగా ముందుకు రాగలిగితే.. మన దేశంలో చాలా మంది ప్రాణాలను కాపాడగలం. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ గురించి అంతా కృషి చేయాలని మీ అందరినీ కోరుతున్నా. ఆరోగ్య సంరక్షణలో మనం వరల్డ్ బెస్ట్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ ఉత్తమ వైద్యుడిగా ఎదిగేందుకు ప్రయత్నించాలి’’ అని రేవంత్ అన్నారు. -
మహిళా ఐఏఎస్ ఎపిసోడ్.. మంత్రి సీతక్క సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారులపై అసభ్య, అనుచిత ప్రచారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మహిళల గౌరవం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి సీతక్క తాజాగా మాట్లాడుతూ..‘మహిళా అధికారుల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. బాధ్యతాయుతంగా పనిచేస్తున్న మహిళా ఐఏఎస్లను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరం. మహిళలు ఉన్నత స్థాయికి చేరితే తట్టుకోలేని ఫ్యూడల్ మానసిక స్థితే.. దుష్ప్రచారాలకు కారణం. మహిళా అధికారుల వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రచారాన్ని సహించబోము. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది.మహిళా ఐఏఎస్ అధికారులు ధైర్యంగా, నిబద్ధతతో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహిళా అధికారుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నిలుస్తుంది. అసభ్య వ్యాఖ్యలు, దూషణలు చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయి. మహిళలపై ద్వేషపూరిత ప్రచారానికి సమాజం మొత్తం వ్యతిరేకంగా నిలవాలి. మహిళల గౌరవం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. 3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 15 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్పేటలో ఆక్రమణలను తొలగించింది.కాగా, గత ఏడాది నవంబర్లో నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందడంతో అధికారులు పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేని షేడ్స్ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. -
సంక్రాంతికి పల్లె బాట.. ఒక్కసారిగా పెరిగిన వాహనాల రద్దీ
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లెలకు క్యూ కట్టారు. ఏపీకి వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగిపోయింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద..ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్తో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్... విజయవాడ హైవే ఇబ్రహీంపట్నం వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు(శని, ఆది) ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐ చంద్రశేఖర్ అన్నారు.హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్..హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిటీ కాలేజీ, ఎంజే మార్కెట్, బేగంబజార్, హైకోర్టు, ఆఫ్జల్గంజ్, నయాపూల్ భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. వీకెండ్ సంక్రాంతి సెలవులు, ఎగ్జిబిషన్ కారణంగా రద్దీ నెలకొంది.విజయవాడలో..పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి సొంత గ్రామాలకు ప్రజలు ప్రయాణమయ్యారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో రద్దీ పెరిగింది. ఇవాళ ఉదయం నుండి ప్రయాణికులతో బస్టాండ్లు రద్దీగా మారాయి. -
సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 స్పెషల్ ట్రైన్స్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగ నేపథ్యంలో రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-విజయవాడ మధ్య 10 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిసిన దక్షిణ మధ్య రైల్వే.. పండగకు ముందు, తర్వాత రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది.ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రైళ్లలో సగానికి పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేశారు.In order to clear the extra rush of passengers, it is decided to arrange to run #SpecialTrains during #Sankranti festival between Hyderabad andSirpur Kaghaznagar & Hyderabad and Vijayawada with the dates as under: pic.twitter.com/JzzDcDAbZ5— South Central Railway (@SCRailwayIndia) January 10, 2026కాగా, తెలంగాణలోని జంట నగరాల నుంచి ఏపీలోని ముఖ్యపట్టణాలకు బయలుదేరే ప్రయాణికులతో ఇప్పటికే నడుస్తున్న రెగ్యూలర్ రైళ్లు రిజర్వేషన్లు పూర్తయ్యి వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విజయవాడ మీదుగా ఇప్పటికే 150 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నర్సాపూర్, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 వరకు 150 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు సమీపంలోని సికింద్రాబాద్తో పాటు కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్ నుంచి విజయవాడ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో పాటుగా హైటెక్ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ సదుపాయం కల్పించారు. -
మీర్పేట తల్లీబిడ్డ కేసులో బిగ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మీర్పేటలో బిడ్డకు విషమించి.. తాను బలవన్మరణానికి పాల్పడిన వివాహిత సుష్మిత కేసుపై వివాదం నెలకొంది. ఉస్మానియా మార్చురీ వద్ద సుష్మిత, ఆమె భర్త యశ్వంత్ తరఫు బంధువులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. తమ మధ్య గొడవలేం లేవని యశ్వంత్ చెబుతుండగా.. ఆత్మహత్య కాదంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సుష్మ తరఫు బంధువులు. మా మధ్య విబేధాలు లేవు. ఆత్మహత్య చేసుకునేంత గొడవలేం కూడా జరగలేదు. సుష్మ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చు. నా బాబుకి మా అత్తే విషమిచ్చి ఉండొచ్చు అని యశ్వంత్ అంటున్నాడు. అయితే.. తమ కూతురు చనిపోయాక పక్కనే ఉండి తమకు వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు, ఆమె తరఫు బంధువులు నిలదీశారు. పోలీసులు వచ్చిన తర్వాతే సుష్మ చనిపోయిందని మాకు చెప్పారు. చనిపోయే ముందు అరగంట ఏదో జరిగిందనేది మా అనుమానం. ఆ అరగంట ఏం జరిగిందో పోలీసులే తేల్చాలి. ఫ్యాన్ ఒక రెక్కకు ఉరి ఎలా వేసుకుంటారు. రెక్క సుష్మ బరువు ఆపుతుందా?. ఆస్తి కోసమే ఇదంతా చేశారనిపిస్తోంది. యశ్వంత్, అతని బంధువులే సుష్మను మానసికంగా వేధించారు. అందుకే ఆధారాలు మార్చేసి ఉంటారు అని సుష్మ బంధువులు అంటున్నారు. అయితే మీడియా ఎదుటే జరిగిన ఆ వాగ్వాదంలో జోక్యం చేసుకున్న పోలీసులు వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన యశ్వంత్రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్. అదే ప్రాంతానికి చెందిన సుస్మిత(27)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులు నగరంలోని హస్తినాపురం జయకృష్ణ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్నారు. వీరికి అశ్వంత్ నందన్రెడ్డి (11 నెలలు) కుమారుడు ఉన్నాడు. అయితే.. గురువారం ఉదయం భర్త ఆఫీస్కు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య పడకగదిలో చీరతో ఫ్యాన్కు ఉరేసుకొని కన్పించడంతో పాటు, కుమారుడు మృతిచెంది ఉన్నాడు. వారితో పాటే ఉండే సుస్మిత తల్లి లలిత(50) సైతం అపరస్మారక స్థితిలో ఉండగా ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మొదట బాబుకు విషమిచ్చిన సుస్మిత, తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావించారు. అయితే.. సుస్మితను భర్త వేధించేవాడని, బయటకు వెళ్లనీయకపోవడంతో పాటు ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనల నడుమే.. తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు. -
మహిళా అధికారులపై దుష్ప్రచారం.. ఐపీఎస్ సంఘం ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని, కొన్ని మీడియా సంస్థలు సాగిస్తున్న అసత్య ప్రచారాలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది. మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని సంఘం ఆరోపించింది. ఈ విషయంలో ఐఏఎస్ అధికారుల సంఘానికి తమ సంపూర్ణ సంఘీభావాన్ని ఐపీఎస్ అసోసియేషన్ ప్రకటించింది. నిరాధారమైన ఆరోపణలతో ప్రభుత్వ అధికారుల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించింది.ఐపీఎస్ అసోసియేషన్ అధ్యక్షుడు డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఇతర సభ్యులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళా అధికారులు ఎంతో చిత్తశుద్ధి కలిగి, ధైర్యంతో, వృత్తి నైపుణ్యంతో సమాజం కోసం విధులు నిర్వర్తిస్తున్నారని, వారిపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తాయని అసోసియేషన్ ఆ ప్రకటనలో పేర్కొంది.సదరు మీడియా సంస్థలు తక్షణమే తమ తప్పును సరిదిద్దుకోవాలని ఐపీఎస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. చేసిన తప్పును అంగీకరిస్తూ, బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫారమ్లలోని అభ్యంతరకర కంటెంట్ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన మీడియా, మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఇటువంటి అసత్య ప్రచారాలను ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం హెచ్చరించింది.ఇది కూడా చదవండి: చలికి గడ్డకట్టిన ఢిల్లీ.. స్థంభించిన జనజీవనం -
ఆ సంవత్సరం.. రియల్ ఎస్టేట్కు బంగారం!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల వరద పారుతోంది. గతేడాది సిటీ స్థిరాస్తి రంగంలోకి రూ.3,892 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. 2024లో వచ్చిన రూ.2,704 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం అధికం. 2025లో దేశంలోని 8 ప్రధాన మెట్రోల్లోకి 8,474.8 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 5 శాతం వాటాను హైదరాబాద్ కలిగి ఉందని కొల్లియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.– 2025 సంవత్సరం భారత స్థిరాస్తి రంగానికి బంగారంలాంటిది. గతేడాది దేశీయ రియల్ ఎస్టేట్లోకి 8.5 బిలియన్ డాలర్ల గరిష్ట పెట్టుబడులు వచ్చాయి. 2024తో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, సుంకాల పెంపు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత రియల్ ఎస్టేట్లోకి ఈ స్థాయిలో సంస్థాగత పెట్టుబడులు రావడం గమనార్హం.విభాగాల వారీగా చూస్తే.. 2025లో అత్యధికంగా ఆఫీసు విభాగంలోకి పెట్టుబడులు వచ్చాయి. కార్యాలయ సముదాయంలోకి 4,534.6 మిలియన్ డాలర్ల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రాగా.. ఆ తర్వాత నివాస విభాగంలోకి 1,566.9 మిలియన్ డాలర్లు, మిశ్రమ వినియోగ విభాగంలోకి 819.3 మిలియన్ డాలర్లు, పారిశ్రామిక, గిడ్డంగుల రంగంలోకి 734.2 మిలియన్ డాలర్లు, రిటైల్లోకి 380 మిలియన్ డాలర్లు, డేటా సెంటర్లు, సీనియర్ లివింగ్, హాలిడే హోమ్స్, స్టూడెంట్ హౌసింగ్ వంటి ప్రత్యామ్నాయ స్థిరాస్తి విభాగంలోకి 272.5 మిలియన్ డాలర్లు, హాస్పిటాలిటీ రంగంలోకి 167.3 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. -
చైల్డ్ పోర్న్ చూశారు.. పోలీసులు తాట తీశారు!
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్కు చెందిన కంధాడ శ్రీకాంత్ జీ2 సెక్యూరిటీ సొల్యూషన్స్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. గతంలో హైదర్గూడలోని ఓ ప్రైవేట్ సంస్థలో హౌస్ కీపింగ్ బాయ్గా పనిచేశాడు. ఆ సమయంలో ఓ బాలికపై లైంగిక దాడి చేశాడు. ఆ వీడియోలను తన సెల్ఫోన్లో రికార్డ్ చేసి గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేశాడు. ఆన్లైన్లో సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న టీజీసీఎస్బీకి ఈ విషయం దృష్టికి వచ్చింది. ఆ వీడియోలోని వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. తాము గుర్తించే వరకు కూడా తమ చిన్నారిపై శ్రీకాంత్ లైంగికదాడికి పాల్పడినట్టు ఆ బాలిక తల్లిదండ్రులకు తెలియదని టీజీ సీఎస్బీ అధికారులు తెలిపారు. నిజామాబాద్ ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉద్యోగి విదేశీ చిన్నారుల పోర్న్ వీడియోలు బ్రౌస్ చేస్తున్నాడు. వీటిని తన గూగుల్ డ్రైవ్తో పాటు మొబైల్ ఫోన్లో స్టోర్ చేసుకున్నాడు. సైబర్ టిప్ లైన్ ద్వారా మూడు ఆన్లైన్ బ్రౌసింగ్లను సీఎస్బీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్ సీఎస్బీ యూనిట్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించారు. జూనియర్ అసిస్టెంట్ను అరెస్ట్ చేశారు. చిన్నారుల అశ్లీల చిత్రాలు చూస్తున్న ఇరిగేషన్ శాఖ జూనియర్ అసిస్టెంట్ సహా 24 మందిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) గురువారం అరెస్ట్ చేసింది. చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్న వారిపై ఆన్లైన్లో నిఘా పెట్టిన టీజీ సీఎస్బీ అధికారులు ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్లను తనిఖీ చేశారు. 18 ప్రత్యేక బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చిన్నారుల అశ్లీల చిత్రాలు, పోర్న్ వీడియోలు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వారిని, షేర్ చేయడంతో పాటు డౌన్లోడ్ చేసి స్టోర్ చేసుకున్నవారిని గుర్తించేందుకు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేంద్రంగా గత ఫిబ్రవరిలో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (సీపీయూ) ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సీఎస్ఈఏఎం (చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లోయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్)ను పదేపదే చూస్తున్నట్టు గుర్తించిన 24 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరిలో హైదరాబాద్లో 15 మందిని, వరంగల్లో ముగ్గురు, నిజామాబాద్కు చెందిన ఇద్దరు సహా మొత్తం 24 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరంతా చైల్డ్ పోర్న్ చూడటంతో పాటు గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేసుకున్నట్టు గుర్తించినట్టు వెల్లడించారు. చిన్నారులకు సంబంధించిన పోర్న్ లేదా అశ్లీల చిత్రాల కోసం బ్రౌస్ చేసిన వారిని అరెస్ట్ చేసి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. సీఎస్బీ అధికారులను డీజీపీ శివధర్రెడ్డి అభినందించారు. -
Hyd: సంక్రాంతి పండుగ రద్దీ షురూ..
హైదరాబాద్: సంక్రాంతి పండుగ హడావుడి మొదలైంది. ప్రధానంగా నగరాలను నుంచి పల్లెలకు వెళ్లే జనం.. శుక్రవారం(జనవరి 9వ తేదీ) నుంచే క్యూకట్టేశారు. దాంతో హైదరాబాద్ బిజీబిజీగా కనిపిస్తోంది. నిన్న రాత్రి నుంచే సొంతూళ్లకు పయనమవుతున్నారు నగరవాసులు. ప్రధానంగా ఏపీకి వెళ్లే ప్రయాణికులతో అటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారిపోయాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. మరొకవైప ఇప్పటికే పంతంగి టోల్ప్లాజా వద్ద బారులు తీరాయి వాహనాలు. సంక్రాంతి నేపథ్యంలో హైవే 65పై ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.విజయవాడ వైపు టేకుమట్ల వద్దపాత డైవర్షన్ ఎత్తివేశారు. రాజమండ్రి-విశాఖ వైపు వెళ్లే వాహనాలు నకిరేకల్వైపు మళ్లిస్తున్నారు. హైదరాబాద్-గుంటూరు వెళ్లేవాహనాలు నార్కెట్పల్లి వైపు మళ్లిస్తున్నారు. నియంత్రణకు చర్యలు..సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, చర్లపల్లి, కాచిగూడ స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైళ్ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ప్రతిరోజూ 2.2 లక్షల మంది.. సికింద్రాబాద్ స్టేషన్లో ప్రస్తుతం సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రతి రోజు సగటున 2.2 లక్షల మంది ప్రయాణం చేయనున్నారు. లింగంపల్లి నుంచి 50 వేల మంది, నాంపల్లి నుంచి మరో 35 వేల మంది ప్రయాణం చేయనున్నట్లు అంచనా. దీంతో అన్నిచోట్లా అదనపు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్లో 17 టిక్కెట్ బుకింగ్ కేంద్రాలతో పాటు 20 ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్లను అందుబాటులో ఉంచారు. తొక్కిసలాటకు తావివ్వకుండా.. రైళ్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తొక్కిసలాట వంటివి చోటుచేసుకోకుండా ఆరీ్పఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో అవసరమైన సహాయ సహకారాలను అందజేసేందుకు టీటీఈలను అదనంగా నియమించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రవేశ, నిష్క్రమణ కేంద్రాల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధి పనుల దృష్ట్యా, ప్రస్తుతం ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు పార్కింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ.. పరిమితంగా పికప్,డ్రాప్ సదుపాయం మాత్రం ఉంటుంది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు విశాలమైన పార్కింగ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, తదితర అన్ని సదుపాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు.అదనపు ఏర్పాట్లు ఇలా.. పదో నెంబర్ ప్లాట్ఫామ్ గేట్– 2, గేట్– 4 వద్ద కొత్త హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లోని 24 రైళ్లకు లింగంపల్లి, హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పటిష్టమైన సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. టికెట్ బుకింగ్ కౌంటర్లను పెంచారు. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లను అందుబాటులో ఉంచారు. రైల్వేశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన ‘రైల్వన్’ యాప్ ద్వారా సాధారణ టికెట్లు బుక్ చేసుకొనే ప్రయాణికులకు 3 శాతం రాయితీ లభించనుంది. ఈ నెల 14 నుంచి జూలై 14వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. -
అమ్మా.. లే అమ్మా..!
ఖమ్మం క్రైం: ఒక్కొక్కరికీ ఒక్కో కథ.. అందరిదీ ఒకటే వ్యథ.. కన్నవారు ఎవరో తెలియదు, ఉన్నవారు దగ్గరకు రారు. అలాంటి అభాగ్యులకు తనే ఒడి అయ్యింది. కంటికి రెప్పలా కాపాడే నీడ అయ్యింది. కానీ, ఆ నీడ ఇప్పుడు శాశ్వతంగా కనుమరుగైపోయింది. నిద్రలోనే అనంత లోకాలకు.. ఖమ్మం జిల్లా సీసీఎస్ పోలీస్స్టేషన్లో హోంగార్డు ఏనుగుల మంజుల (47) కేవలం యూనిఫాం వేసుకున్న ఉద్యోగి కాదు.. వందలాది మంది అనాథలకు ప్రాణం పోసిన ‘అమ్మ’. ‘అమ్మ అనాథ శరణాలయం’ఏర్పాటు చేసి ఎందరో పిల్లల ఆకలి తీర్చి, వారికి భవిష్యత్తునిచ్చారు. గురువారం సాయంత్రం విధి నిర్వహణ ముగించుకుని ఆశ్రమానికి వచి్చన మంజుల, ఎప్పటిలాగే పిల్లలతో ముచ్చటించారు. అనంతరం హాల్లోనే నిద్రపోయారు. కానీ, ఆ నిద్ర ఆమెను తిరిగి రాని లోకాలకు తీసుకెళ్తుందని ఆ పసి ప్రాణాలు ఊహించలేదు. ఆ గుడ్మార్నింగ్ వినిపించలేదు.. శుక్రవారం ఉదయం ‘అమ్మా.. గుడ్ మార్నింగ్.. లే అమ్మా..’అంటూ పిల్లలు మంజుల చుట్టూ చేరి పిలిచారు. ఎంత పిలిచినా పలకలేదు. దీంతో పక్కనే నివసించే మంజుల కూతురికి చెప్పగా.. ఆమె వైద్యుడిని తీసుకొచ్చింది. అప్పటికే మంజుల గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారని వైద్యులు చెప్పడంతో చిన్నారులు కన్నీరు మున్నీరయ్యారు. దిక్కెవరు మాకు?: ‘అమ్మా.. ఇప్పుడు మాకు దిక్కెవరు?అంటూ పిల్లలు మృతదేహంపై పడి రోదిస్తుండటం.. అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మంజుల మృతికి పోలీస్ శాఖ నివా ళులు అరి్పంచగా, ఐసీడీఎస్ అధికారులు పిల్లలను బాలల సదనానికి తరలించారు. -
కొడుకును చంపి.. తానూ ఉరేసుకుని!
హైదరాబాద్: మరో నెల రోజుల్లో కుమారుడి తొలి పుట్టిన రోజు వేడుకలు....ఇందుకోసం భార్యా భర్తలిద్దరూ అవసరమైన షాపింగ్ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి...వీటిని తట్టుకోలేక ఓ తల్లి తన 11 నెలల బాబుకు విషమిచ్చి తానూ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇదే తరుణంలో కన్న కూతురు, మనవడు తన కళ్లముందే చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మృతురాలి తల్లి విషం తాగింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జయకృష్ణ ఎన్క్లేవ్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మల్లేపల్లి మండలం పాల్వయికి చెందిన యశ్వంత్ రెడ్డి, సుష్మిత (27)లకు రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 11 నెలల బాబు అశ్వంత్ నందన్ రెడ్డి ఉన్నాడు. కొంత కాలంగా వీరు హస్తినాపురం జయకృష్ణ ఎన్క్లేవ్లోని కుందనిక అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. యశ్వంత్ రెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. కాగా, తండ్రి గతంలోనే చనిపోవడంతో సుషి్మత తల్లి లలిత (50) కూడా కూతురు, అల్లుడి వద్దే ఉంటోంది. మరో నెల రోజుల్లో కుమారుడు అశ్వంత్ నందన్ రెడ్డి తొలి జన్మదినం ఉండడంతో ఈనెల 7న భార్యాభర్తలిద్దరూ షాపింగ్ చేశారు. అనంతరం వీరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. రోజూ మాదిరిగానే ఈనెల 8న ఉదయం విధులకు వెళ్లిన యశ్వంత్ రాత్రి 8 గంటలకు ఇంటికి తిరిగి రాగా, లోపల గడియ పెట్టి ఉంది. ఎంత కొట్టినా తీయకపోవడంతో అపార్ట్మెంట్ వాసుల సాయంతో కిటికీ తొలగించి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఫ్యాన్కు ఉరివేసుకుని భార్య, మంచంపై కొడుకు మృతి చెందగా, అత్త కొనఊపిరితో ఉండగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మీర్పేట పోలీసులు తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమారా్టనికి తరలించారు. మృతురాలి బంధువులు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ తెలిపారు. యశ్వంత్ రెడ్డి వేధింపుల వల్లే సుష్మిత తన కుమారుడికి విషమిచ్చి బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి పెద్దనాన్న సంజీవరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
కూ.. చెక్.. చెక్!
సాక్షి, హైదరాబాద్: వేగంగా దూసుకెళ్లే రైళ్లకు అడ్డుగా ట్రాక్ మీదకు వచ్చే జంతువులను ముందే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ త్వరలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం ప్రధాన రైల్వే కారిడార్లలో రైళ్ల గరిష్టం వేగం గంటకు 110 కి.మీ.గా ఉంది. కొన్ని ముఖ్య కారిడార్లను మాత్రం పటిష్ట పరిచి 130 కి.మీ.వేగాన్ని తట్టుకునేలా మార్చారు.త్వరలో మిగతా కారిడార్లను కూడా ఆ స్థాయికి తెచ్చేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించుకుని అమలు ప్రారంభించింది. దీంతో రైళ్ల వేగం కూడా పెరగబోతోంది. ట్రాక్ మీదకు వచ్చే జంతువులు వేగంగా దూసుకెళ్లే రైళ్లకు ప్రమాదకరంగా మారుతున్నాయి.ట్రాక్ మీద జంతువుల కదలికలను ముందే గుర్తించి రైళ్ల వేగాన్ని తగ్గించటంతోపాటు అవసరమైతే నిలిపివేయగలిగేలా కృత్రిమ మేథతో కూడిన సాంకేతికతను వినియోగించుకోనున్నారు. ఇలా పని చేస్తుంది... అభివృద్ధి చెందిన దేశాలు కృత్రిమ మేథతో కూడిన వ్యవస్థను ఇందుకు అనుసరిస్తున్నాయి. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తుండడంతో మన రైల్వే శాఖ కూడా దీని ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది.ఈ సాంకేతికత రెండు భాగాలుగా ఏర్పాటవుతుంది. ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్), ఏఐ– కెమెరాల ఏర్పాటుతో పని చేస్తుంది. ఐడీఎస్ వ్యవస్థ డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సిస్టమ్ (డీఏఎస్) ఆధారంగా పనిచేస్తుంది.ఇందులో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ)ను రైలు పట్టాల వెంబడి అమరుస్తారు. ఈ కేబుల్స్ జంతువుల కదలికల నుంచి వచ్చే ప్రకంపనలను 300–500 మీటర్ల దూరం నుంచే గుర్తిస్తాయి.ఈ సమాచారాన్ని ఏఐ సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేసి, రైళ్లలోని లోకో పైలట్లు, స్టేషన్లోని సంబంధిత సిబ్బందికి, కంట్రోల్ రూమ్లకు రియల్–టైమ్ అలర్ట్ల ద్వారా పంపుతుంది. దీంతో రైలు వేగాన్ని తగ్గించి జంతువులు ట్రాక్ దాటిన తర్వాత ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటారు. అవి దాటని పక్షంలో రైళ్లను నిలిపేస్తారు. ప్రస్తుతం ఈ వ్యవస్థను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 141 రూట్ కిలోమీటర్ల మేర పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. ఇటీవల అసోంలో రైలు ఢీకొని పెద్ద సంఖ్యలో ఏనుగులు చనిపోయిన నేపథ్యంలో దీన్ని వేగంగా ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వేలో కూడా ప్రయోగాత్మక పరిశీలనకు రెండు కారిడార్లలో ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో దీనికి సంబంధించిన స్పష్టత రానుంది. -
ఫిబ్రవరి 14న ‘పుర’ పోరు..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండళ్ల ఎన్నిక వచ్చే నెల 14న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటరు జాబితా ఈ నెల 16న ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకా శం ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రచారానికి వారం రోజుల వ్యవధి ఇచ్చేలా షెడ్యూల్పై కసరత్తు జరుగుతోంది.రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూలును ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినా చట్టపరమైన అడ్డంకులను దృష్టిలో పెట్టుకుని 32 శాతానికే పరిమితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. నివేదిక అందించిన ‘బూసాని’.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన బీసీ డెడికేషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. వెంకటేశ్వరరావు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి నివేదిక అందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 12 లేదా 13వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించే పక్షంలో ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం నేపథ్యంలో మున్సిపాలిటీల్లో బీసీ జనాభా స్వల్పంగా తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి పరిమితం కానుండగా, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రూ.85 కోట్లు విడుదల చేయాలని లేఖ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం రూ.85 కోట్లు విడుదల చేయాలని కోరుతూ పురపాలక శాఖ ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసింది. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పోరేషన్లు కలుపుకుని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లోని 2,996 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మిగిలిపోయిన ఐదారు కార్పొరేషన్ల పాలక మండళ్లను రద్దే చేయడం లేదా..వారితో రాజీనామా చేయించి ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ర్యాంకులు రావాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు జాతీయ ర్యాంకుల సాధనలో ముందుండేలా చేయడంపై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. ఇతర అంశాలు పక్కన పెడితే అసలు దరఖాస్తు విధానంలోనే లోపం ఉందని గుర్తించి, వాటిని సరి చేసేందుకు నడుం బిగించింది. ప్రభుత్వ ఆదేశాలతో వాస్తవానికి దీనిపై గత కొంతకాలంగా ఉన్నత విద్యామండలి కసరత్తు చేసింది.నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకుల్లో వర్సిటీలు ఎందుకు వెనుకబడ్డాయో గుర్తించింది. దరఖాస్తు విధానంలో లోపాలను అధిగమించేందుకు ప్రతి యూనివర్సిటీ నుంచి ఇద్దరికి దీనిపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు ప్రక్రియలో కీలక భూమిక పోషించే నోడల్ అధికారితో పాటు మరో వ్యక్తిని అవగాహన కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని భావిస్తోంది. దీనికోసం ఓ కన్సల్టెన్సీని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఈ నెల 21వ తేదీన మండలి కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. ర్యాంకుల్లో వర్సిటీల వెనుకబాటు రాష్ట్రంలో వ్యవసాయ యూనివర్సిటీ సహా మొత్తం 13 విశ్వవిద్యాలయాలున్నాయి. ప్రతి సంవత్సరం ప్రకటించే జాతీయ ర్యాంకుల్లో ఇవి వెనుకబడుతున్నాయి. వందేళ్ళ చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాయానికి ఎన్ఐఆర్ఎఫ్ ఓవరాల్ విభాగంలో 2022లో 46వ ర్యాంకు వస్తే, 2023లో ఇది 64కు 2024కు 70కి పడిపోయింది. అయితే 2025లో 53వ ర్యాంకు సాధించడం కాస్త ఊరట కల్గించే అంశం. టాప్–100 యూనివర్సిటీల ర్యాంకులో 2022లో 22వ ర్యాంకు దక్కించుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం 2025లో 30కి పడిపోయింది.సాంకేతిక విద్యకు కీలకమైన జేఎన్టీయూహెచ్ ఓవరాల్ ర్యాంకుల్లో అసలు పోటీలోనే లేకపోవడం గమనార్హం. కాగా టాప్–100లో గత ఏడాది వందో ర్యాంకు దక్కించుకుంది. మిగతా వర్సిటీల్లో చాలావరకూ ఏమాత్రం పోటీ పడలేకపోతున్నాయి. అదే సమయంలో ప్రైవేటు విద్యా సంస్థలు జాతీయ ర్యాంకుల సాధనలో దూసుకుపోతున్నాయి. ఈ ర్యాంకులకు విస్తృతంగా ప్రచారం కల్పించి, సీట్లకు డిమాండ్ పెంచుకుంటున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. దరఖాస్తులోనే లోపం అన్ని యూనివర్సిటీల్లోనూ బోధకుల కొరత ఉంది. 70 శాతం వరకు కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నాయి. దీంతో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయనేది వీసీల వాదన. ఓయూకు గత కొన్నేళ్ళుగా కేంద్ర సంస్థల నుంచి రావాల్సిన ప్రాజెక్టులు 50 శాతం మేర పడిపోయాయి. ప్రొఫెసర్ల కొరత కారణగా పీహెచ్డీలూ తగ్గుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుకు దరఖాస్తు చేసే విషయంలో యూనివర్సిటీలు సరైన అవగాహనతో వ్యవహరించడం లేదు.విశ్వవిద్యాలయంలో మూడేళ్ళుగా విద్యార్థుల చేరిక, ఇతర దేశాల విద్యార్థుల సంఖ్య, ఫ్యాకల్టీ, విద్యార్థుల మార్కులు, ఉపాధి అవకాశాలు, అక్కడ జరుగుతున్న పరిశోధనలు ఇలా అనేక అంశాలను ర్యాంకులకు కొలమానంగా తీసుకుంటారు. వీటిని సరైన ఫార్మాట్లో, సరైన డేటాతో పంపడంలో వర్సిటీలు దృష్టి పెట్టడం లేదు. ప్రధానంగా ఈ కారణంతోనే ర్యాంకుల్లో వెనుకబడిపోతున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వర్సిటీలకు అవగాహన పెంపొందించాలని నిర్ణయించారు. ప్రమాణాలకు ర్యాంకులే గీటురాయి రాష్ట్ర వర్సిటీల ప్రమాణాలకు జాతీయ ర్యాంకులే గీటురాయి. ఎన్ఐఆర్ఎఫ్లో ముందుకు వెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగానే మరింత అవగాహన కల్పించేందుకు కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేశాం. ఫిబ్రవరిలోగా వర్సిటీలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు కోసం సరైన పద్ధతిలో దరఖాస్తు చేయాలి. ఈ మేరకు అవసరమైన డేటాను పొందుపర్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) రీసెర్చ్ డెవలప్మెంట్పై ఎన్ఐఆర్ఎఫ్ దృష్టి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల సాధనంలో రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది ముఖ్యం. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనలు, పబ్లిషింగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి విద్యార్థులు ఎంత మంది చదువు కోసం ఆయా వర్సిటీలకు వస్తున్నారనేది కూడా చూస్తారు. టీచింగ్, లెరి్నంగ్ విధానాలపైనా దృష్టి పెడతారు. ప్రస్తుతం ప్రభుత్వం భారీగా నిధులు ఇవ్వడానికి సిద్ధమవ్వడం, ఫ్యాకల్టీ కొరత తీరుస్తామని హామీ ఇస్తుండటంతో భవిష్యత్లో ఓయూ ర్యాంక్ పెరుగుతుందని ఆశిస్తున్నాం. – ప్రొఫెసర్ కుమార్ మొలుగరం (వీసీ, ఓయూ) -
సుంకాల పెంపు ప్రభావం తాత్కాలికమే
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపవని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టీఐఈ) సహ వ్యవస్థాపకుల కాన్వాల్ రేఖీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు వివిధ సందర్భాల్లో సుంకాలు పెంచిన ట్రంప్.. త్వరలో మరింత పెంపుదల ఉంటుందని హెచ్చరిస్తున్నారని, ఒకవేళ ఆవిధంగా సుంకాలు పెంచినా ఆ ప్రభావం తాత్కాలికమేనని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం ఉండదని వివరించారు.ఇక్కడి ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా సుంకాలు విధిస్తే కొంతకాలం మాత్రమే ఆటుపోటులుంటాయని, వాటి ఎగుమతి శైలిని మార్చుకుంటే పరిస్థితి సర్దుకుంటుందని అన్నారు. దేశ ప్రజలే భారత్కు అతిపెద్ద ఆస్తి అని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఉత్పాదకత కూడా వేగంగా పెరుగుతోందని, ప్రపంచంలోనే బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోందని చెప్పారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన భారత సంతతికి చెందిన రేఖీ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 2047 నాటికి కోటిమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఇది మరింత వేగంగా వృద్ధి చెందుతోంది. వివిధ రంగాల్లో ఉత్పాదకత గణనీయ ఫలితాలు సాధిస్తోంది. దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగుతోంది. 2047 నాటికి కోటిమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో భారత్ ప్రపంచ పటంపై వెలిగిపోనుంది. ఆ దిశగా టీఐఈ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం.దేశంలోని 11 నగరాలను ఎంపిక చేసుకుని దీన్ని అమలు చేస్తున్నాం. ముంబయి, జైపూర్, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ, క్యాలికట్, అహ్మదాబాద్ తదితర నగరాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేయనున్నాం. బుధవారం నిజామాబాద్ జిల్లాకు వెళ్లాం. అక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం. అక్కడ ఒక రైతు వ్యవసాయ క్షేత్రాన్ని చూశా. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన తీరు ఎంతో ముచ్చటగా ఉంది. అమెరికాలో ఒక రైతు సగటు ఆదాయం 75 వేల డాలర్లు ఉంటే..ఇండియాలో అది 2,500 డాలర్లు మాత్రమే. ఈ వ్యత్యాసం తగ్గాలంటే సాంకేతిక పరిజ్ఞానం మరింత విస్తృతం కావాలి. పారిశ్రామిక పాలసీల ప్రభావం పరిమితమే.. ఎక్కడైనా ప్రభుత్వాలు పారిశ్రామిక పాలసీలు రూపొందించడం అత్యంత సహజం. అయితే వాటి ప్రయోజనాలు ఎక్కువగా పెద్ద కంపెనీలకే దక్కుతాయనేది నా అభిప్రాయం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గ్రామీణ ప్రాంత యువతకు ఈ పాలసీలతో పెద్దగా ఒరిగేదేం లేదు. మంచి ఆలోచన, వ్యూహం ఉంటే తప్పకుండా విజయం సాధించవచ్చు. నా ‘ది గ్రౌండ్ బ్రేకర్’పుస్తకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం రాసిందే. ఒక ఎంట్రప్రెన్యూర్ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, ధైర్యం, ప్రశంసలు, పాఠాలు ఇలా అన్ని అంశాలను అందులో వివరించా. నా జీవిత కథ, నా ప్రయాణం స్ఫూర్తిగా ఈ పుస్తకం రాశా. శరవేగంగా హైదరాబాద్ వృద్ధి దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ చురుకుగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలకం. అందులోనూ హైదరాబాద్ పాత్ర అత్యంత కీలకం. అందుకే మా లక్ష్య నగరాల్లో హైదరాబాద్ను కూడా ఎంపిక చేసుకున్నాం. హైదరాబాద్ అంటే కేవలం నగరాన్ని మాత్రమే కాకుండా సమీపంలోని నిజామాబాద్ను కూడా ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకుని టీఐఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. కాబట్టి మారుతున్న పరిస్థితులు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా యువత ఆలోచనలు మారాలి. అప్పుడే పారిశ్రామికవేత్తలు తయారవుతారు. హైదరాబాద్ను చాలాసార్లు సందర్శించా. సందర్శించిన ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది. 25 ఏళ్ల క్రితం హైదరాబాద్, ఇప్పుడున్న హైదరాబాద్ మధ్య ఎంతో తేడా ఉంది. -
ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.కోటి ప్రమాద బీమా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చే ప్రభుత్వ ఉద్యోగులను తమ కుటుంబ సభ్యులుగా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. రూ.1.02 కోట్ల ప్రమాద బీమాకు సంబంధించిన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిసినట్టు భట్టి వెల్లడించారు.ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను ప్రతినెలా క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నామన్నారు. ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎనీ్పడీసీఎల్, జెన్కో పరిధిలోని ఉద్యోగులందరికీ కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తెచి్చనట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. -
జీతం రాని జీతగాళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపుల ప్రక్రియ అత్యంత గందరగోళంగా మారింది. సాధారణంగా ఉద్యోగులకు నెలవారీగా వేతనాలు అందాల్సి ఉండగా...ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి జీతాల జాడ లేకుండా పోయింది. ఈ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అసలే అరకొర వేతనాలు ఇస్తున్నప్పటికీ... వాటిని నెలల తరబడి చెల్లించకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోందని, కుటుంబ సభ్యులు పస్తులుండాల్సి వస్తోందంటూ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వేతనాలు అందకపోవడంతో సంక్రాంతి పండుగ సైతం జరుపుకునే పరిస్థితి లేదంటూ తమ దీన స్థితిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 5లక్షల మంది ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. ఒక్కో ఉద్యోగికి నెలకు సగటున రూ.22 వేల నుంచి రూ.31వేల వరకు ప్రభుత్వం వేతనాల రూపంలో చెల్లిస్తుండగా... పన్నులు, ఇతరత్రా కోతలు పోగా చేతికందేది కేవలం రూ.13వేల నుంచి రూ.20వేలు మాత్రమే. ఈ వేతనాలు సైతం నెలలుగా చెల్లించకపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఏజెన్సీల చేతిలో మాయ: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో ఏజెన్సీ పాత్రే కీలకం. ఉద్యోగుల వేతన నిధులను ప్రభుత్వం నేరుగా ఉద్యోగులకు కాకుండా సంబంధిత ఏజెన్సీలకు విడుదల చేస్తుంది. ఆ నిధుల నుంచి ఈఎస్ఐ, పీఎఫ్, జీఎస్టీ, ఏజెన్సీ కమిషన్, ఇతర పన్నుల కింద చేయాల్సిన చెల్లింపులను పూర్తి చేసిన తర్వాత మిగులును మాత్రమే ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేసినా... చెల్లింపులు చేయడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, సచివాలయంలోని ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో పెద్దగా జాప్యం లేనప్పటికీ... జిల్లాలు, మండల స్థాయి కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం వేతన చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా గాడి తప్పింది. కొన్నిచోట్ల 9 నెలలుగా వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు తమ వేతన చెల్లింపుల జాప్యంపై ఉన్నతాధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదులు ఇవ్వడంతో పాటు చాలా చోట్ల క్షేత్ర స్థాయి కార్యాలయాల్లో నిరసనలు సైతం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు ముగిసినా వేతనాలు చెల్లించనందున కార్యాలయ ఆవరణలోనే పడిగాపులు కాస్తున్నారు. మరికొన్ని చోట్ల నిరసనలకు దిగుతున్నారు. ఇదీ పరిస్థితి... ⇒ నీటి పారుదల శాఖ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 6నెలలుగా వేతనాలు విడుదల కాలేదని అక్కడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. ⇒ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. గతేడాది ఏప్రిల్ నుంచి ఆయా ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్ఐ సైతం చెల్లించలేదు. ⇒ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 339 మంది ఉద్యోగులకు 7నెలలుగా వేతనాలు అందలేదు. ⇒ బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని ఉద్యోగులకు ఆరునెలలుగా, ఎస్సీ వసతి గృహాల్లో పని చేస్తున్న వాచ్మెన్, కామాటిలకు 9నెలలుగా వేతనాలు అందలేదు. ⇒ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న 770 మంది ఉద్యోగులకు 5నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ⇒ ఎస్సీ గురుకుల సొసైటీలో ఐఎఫ్ఎంఎస్లో రిజి్రస్టేషన్ కాకపోవడంతో ఆర్నెళ్ల వేతనాలు నిలిచిపోయాయి. ⇒ కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 5నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిర్వహిస్తాం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించాలి. ఒక్క నెల కూడా పెండింగ్లో పెట్టొద్దు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పేర్లు ఐఎఫ్ఎంఐఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం) పోర్టల్లో ఎక్కించలేదనే కారణంతో జీతాలు నిలిపివేశారు. ఏ కారణం ఉన్నా జీతాలు ఆపేందుకు వీలు లేదు. వచ్చే వార్షిక సంవత్సరం నుంచి ఏజెన్సీ విధానాన్ని మార్చి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి మాకు వేతనాలు చెల్లించాలి. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. – పులి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం 19 రోజులుగా సమ్మె చేస్తున్నాం మాకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. అయినప్పటికీ ఎంతో ఓపిగ్గా విధులు నిర్వహిస్తున్నాం. వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఉద్యోగులెవరైనా ఒక్క నెల జీతం ఆలస్యమైతేనే అల్లాడిపోతారు. అలాంటిది మాకు ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే మా కుటుంబాల పరిస్థితి ఏమిటి? జీతాలు ఇవ్వాలని అధికారులను అడిగి విసుగెత్తాం.అందుకే మున్సిపాలిటీల ముందు సమ్మెకు దిగాం. 19 రోజులుగా నిరసన చేస్తున్నా అధికారుల నుంచి స్పందన లేకపోవడం బాధాకరం. – శంకరమ్మ, స్వీపర్, కాగజ్నగర్ మున్సిపాలిటీ -
సంక్రాంతి ఎఫెక్ట్.. పంతంగి, కూకట్పల్లిలో ఫుల్ ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. రేపటి నుంచే విద్యా సంస్థలకు సెలవులు కావడంతో సిటీ జనం.. పల్లెబాట పట్టారు. సొంతూరికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీంతో.. బస్సులు, రైళ్లు, సొంత వాహనాలతో బయలుదేరుతున్నారు.దీంతో, కూకట్పల్లి-మియాపూర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్, కార్లతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ ఏర్పడింది. #Nalgonda In view of the Sankranti festival rush, traffic congestion has increased significantly on the Hyderabad-Vijayawada National Highway (NH-65). Specifically, there is a heavy influx of vehicles at the Pantangi Toll Plaza.@NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE pic.twitter.com/lFCYHMMhDD— Akalankam Seshu (@ienalgonda) January 9, 2026 -
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా అందించనున్నట్టు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది.అయితే, ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగులకు కోటికి పైగా బీమా అందుతోంది. అదే తరహాలో అందరు ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.02 కోట్ల ప్రమాద బీమా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు బీమా ప్రయోజనం కలుగనుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చే ఉద్యోగులు మా కుటుంబ సభ్యులు అని చెప్పుకొచ్చారు. -
సైబర్ బాధితులకు అండగా 'సీ-మిత్ర’!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక విప్లవంతో పాటే సైబర్ నేరాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్లు, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వంటివి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బాధితులకు అండగా నిలుస్తూ, వారు పోలీస్ స్టేషన్కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మక అడుగు వేశారు. అదే.. 'సీ-మిత్ర' (C-Mitra). దీని ద్వారా ఫిర్యాదు చేయడం మొదలుకొని, ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే వరకూ అంతా ఇంటి నుంచే పూర్తవుతుంది. సాంకేతికత ద్వారా పోలీసులే మీ వద్దకు వచ్చే అద్భుతమైన 'వర్చువల్' పరిష్కారమిది.సైబర్ నేర బాధితుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఒక 'వర్చువల్ హెల్ప్డెస్క్' ఈ సీ-మిత్ర. బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫిర్యాదు ప్రక్రియను పూర్తి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సాధారణంగా సైబర్ మోసం జరిగినప్పుడు బాధితులు '1930' నంబర్కు ఫోన్ చేసి గానీ, జాతీయ సైబర్ పోర్టల్ (https://www.cybercrime.gov.in/) లో గానీ ఫిర్యాదు చేస్తారు. అయితే, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కోసం కచ్చితంగా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ 'సీ-మిత్ర' రాకతో ఇక ఆ అవసరం ఉండదు. సమస్త ఫిర్యాదు ప్రక్రియ ఇంటి నుంచే పూర్తవుతుంది.చాలామంది బాధితులకు ఫిర్యాదులో ఏం రాయాలి? ఏ సెక్షన్లు వర్తిస్తాయి? అనే సందేహాలు ఉంటాయి. అటువంటి వారికి 'సీ-మిత్ర' బృందమే స్వయంగా ఫోన్ చేసి, వివరాలు సేకరించి, ఏఐ సాంకేతికతతో పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్ను సిద్ధం చేసి బాధితులకు పంపిస్తుంది. బాధితులు దాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి సైబర్ మిత్ర హెల్ప్ డెస్క్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్, క్రైమ్ పోలీస్ స్టేషన్, కమిషనర్ ఆఫీస్, బషీర్బాగ్, హైదరాబాద్ - 500029 అనే అడ్రస్ కు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించాలి. అంతేకాదు, సైబర్ క్రైం పీఎస్ వద్ద డ్రాప్ బాక్స్ కూడా అందుబాటులో ఉంటుంది. సంతకం చేసిన ఫిర్యాదు కాపీలను అందులో వేయొచ్చు. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ను సైబర్ క్రైం పోలీసులు నమోదు చేస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న సైబర్ నేర బాధితులు మాత్రమే సీ-మిత్ర సేవలను పొందేందుకు అర్హులు.సీ-మిత్ర విధానం వల్ల పౌరుల సమయం ఆదా అవ్వడమే కాకుండా, స్టేషన్ సిబ్బందికి దర్యాప్తుపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. 1930కి, జాతీయ సైబర్ పోర్టల్కు వచ్చే ఫిర్యాదుల్లో కేవలం 18% మాత్రమే ఎఫ్ఐఆర్లుగా మారుతున్నాయి. సీ-మిత్ర ద్వారా దీనిని 100 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం లక్ష రూపాయలకు మించిన సైబర్ మోసాలను సైబర్ క్రైమ్ స్టేషన్లోనూ, అంతకంటే తక్కువైతే స్థానిక పోలీస్ స్టేషన్లోనూ నమోదు చేస్తున్నారు. అయితే, ఇకపై 'సీ-మిత్ర' విధానం ద్వారా 3 లక్షల లోపు ఉన్న కేసులను జీరో ఎఫ్ఐఆర్ చేసి, తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయడం జరుగుతుంది. 3 లక్షల పైన ఉన్న ఫిర్యాదులను సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరుగుతుంది.సీ-మిత్ర సేవలను పొందాలంటే బాధితులు 1930కి కాల్ గానీ, లేదా జాతీయ సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే సీ-మిత్ర బృందంలోని వర్చువల్ పోలీస్ ఆఫీసర్లు బాధితులకు కాల్ చేసి, వర్చువల్ పద్ధతిలో ఫిర్యాదు చేసే విధానాన్ని వివరిస్తారు. సిద్ధం చేసిన ఫిర్యాదు డ్రాఫ్ట్ను బాధితులకు పంపిస్తారు. బాధితులు దానిని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి పోస్ట్/కొరియర్ లేదా డ్రాప్ బాక్స్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో డిజిటల్ సంతకం ఆప్షన్ కూడా పరిశీలనలో ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ వివరాలను సందేశరూపంలో బాధితులకు పంపిస్తారు.ఈ వర్చువల్ హెల్ప్డెస్క్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 24 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం, ఏఐ పరిజ్ఞానంతో బాధితులకు సేవలు అందిస్తుంది. సీ-మిత్ర అధికారిక ల్యాండ్లైన్ నంబర్: 040-4189-3111 నుంచి మాత్రమే కాల్స్ వస్తాయి. వాట్సాప్ ద్వారా సమాచారం కేవలం 87126 సిరీస్ నంబర్ల నుంచే వస్తుంది. సి-మిత్ర పేరుతో వచ్చే నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సి-మిత్ర సిబ్బంది ఎప్పుడూ ఓటీపీ గానీ, డబ్బులు గానీ అడగరు. సీ-మిత్ర కేసును దర్యాప్తు చేయదు. పోయిన డబ్బును వెనక్కి ఇప్పిస్తామని హామీ ఇవ్వదు. చట్టపరమైన సలహాలు కూడా ఇవ్వదు. కేసు స్టేటస్ తెలుసుకోవాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్నే సంప్రదించాలి. -
మీ టికెట్కు ఏడాది పూర్తి.. త్వరలో టీజీఆర్టీసీ సేవలు?
సాక్షి, హైదరాబాద్: బహుళ ప్రజా సేవలకు ఒకే వేదికగా డిజిటల్ టికెటింగ్ అందిస్తున్న మీ టికెట్ యాప్ విజయవంతంగా తొలి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ కాలంలో యాప్ను సుమారు 2 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోగా, రూ.2.5 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి. 3.5 లక్షలకుపైగా టికెట్లు జారీ అయినట్లు అధికారులు తెలిపారు.సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రారంభమైన ఈ యాప్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 221 ప్రజా ప్రదేశాల్లో అందుబాటులో ఉంది. హైదరాబాద్ మెట్రో, పార్కులు, దేవాలయాలు, మ్యూజియంలు, కోటలు, బోటింగ్ కేంద్రాలు, నేచర్ క్యాంపులు, కమ్యూనిటీ సౌకర్యాలకు డిజిటల్ టికెటింగ్ను ఒకే యాప్లో అందిస్తోంది.త్వరలో మీటికెట్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. నగర, ఉపనగర ప్రయాణికుల కోసం క్యూ ఆర్ ఆధారిత డిజిటల్ బస్ పాస్లు, అంతర్నగర బస్ టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రారంభ దశలో సాధారణ పాస్, మెట్రో డీలక్స్ పాస్, మెట్రో ఎక్స్ప్రెస్ పాస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఏసీ) పాస్, పుష్పక్ ఏసీ పాస్లను యాప్లో పొందుపరచనున్నారు.జనవరి 2026 నాటికి మీ టికెట్ పరిధిలో సుమారు 123 పార్కులు, 50 బోటింగ్ కేంద్రాలు, 16 దేవాలయాలు, 6 మ్యూజియంలు, 4 కోటలు/స్మారకాలు, 4 జలపాతాలు, 11 జీహెచ్ఎంసీ పార్కులు, 5 నేచర్ క్యాంపులు, ఒక హైదరాబాద్ మెట్రో ఇంటిగ్రేషన్, ఒక ఫంక్షన్ హాల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ, పర్యావరణ, సాంస్కృతిక, ధార్మిక ప్రాంతాలకు ఒకే యాప్ ద్వారా చేరువ చేసే ‘సూపర్ యాప్’గా మీటికెట్ నిలుస్తోందని వారు పేర్కొన్నారు. -
కాలేజీ లెక్చరర్ల వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని బలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దారుణ ఘటన వెలుగుచూసింది. క్రమశిక్షణ పేరుతో ఓ విద్యార్థిని పట్ల లెక్చరర్ అనుచితంగా ప్రవర్తించింది. తోటి విద్యార్థుల ముందే తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. దీంతో, తీవ్ర మనస్థాపానికి, మానసిక వేదనకు గురైన విద్యార్థిని అనూహ్యంగా అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్లోని మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెస్ట్ మారేడుపల్లికి చెందిన విద్యార్థిని వర్షిణి (17) ఇంటర్ చదువుతోంది. అయితే, వర్షిణి (Varshini) ఒక రోజు కాలేజీకి కొంచెం ఆలస్యంగా వచ్చింది. అదే సాకుగా తీసుకున్న లెక్చరర్లు శ్రీలక్ష్మి (Sri Lakshmi), మధురిమ (Madhurima)లు ఆమెను తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి దూషించారు. కాగా, వర్షిణి తనకు నెలసరి రావడం వల్ల ఆలస్యం అయిందని చెప్పింది. పీరియడ్స్ వచ్చాయా? నాటకాలు ఆడుతున్నావా.. ఏది చూపించు? అంటూ అత్యంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా మాట్లాడారు. దీంతో, తోటి విద్యార్థులు ముందు ఇలా చేయడం పట్ల వర్షిణి తట్టులేకపోయింది. దీంతో, వర్షిణి మానసికంగా కుంగిపోయింది. ఇంటికి వెళ్లి తల్లితో విషయం చెప్పి ఏడ్చింది. అయితే తల్లి ఓదార్చి తర్వాత వెళ్లి మాట్లాడదామని తల్లి కుమార్తెను సముదాయించింది.పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించుహైదరాబాద్ కాలేజిలో దారుణ ఘటనఅవమానం తట్టుకోలేక దళిత విద్యార్థిని మృతిసికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మృతి కలకలంమల్కాజిగిరికి చెందిన విద్యార్థిని (17) కాలేజీకి… pic.twitter.com/TDpnYTq5KK— Telugu Scribe (@TeluguScribe) January 9, 2026ఇంతలోనే విద్యార్థినికి తలనొప్పి రావడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. దీంతో, వర్షిణిని వెంటనే మల్కాజ్గిరి ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడ సిటీ స్కాన్ చేయించారు. విద్యార్థిని ఎడమ చేయి, కాలు కూడా పనిచేయడం మానేశాయి. స్కానింగ్ చేసిన వైద్యులు.. తీవ్ర మనస్తాపానికి గురికావడంతో బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టిందని చెప్పారు. అనంతరం అదే రాత్రి బాలిక మృతి చెందింది. వర్షిణి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. లెక్కరర్లు చేసిన ఓవరాక్షన్ వల్లే తమ కూతురు ఇలా చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం ఉదయం కళాశాల ముందు ఆమె తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. వెంటనే సదరు లెక్చరర్స్, ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ శివధర్రెడ్డి నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. డీజీపీ నియామకాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రెగ్యులర్ ప్రాసస్ను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించిన కోర్టు.. యూపీఎస్సీకి పంపిన తరువాత కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి తెలిపింది. డీజీపీ నియామక ఆర్డర్ను సస్పెండ్ చేయాలన్న IA(ఇంట్రిమ్ ఆప్లికేషన్)ను హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను వచ్చే నెల ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.రాష్ట్ర డీజీపీగా బి.శివధర్రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త టి.ధన్గోపాల్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2025 సెప్టెంబర్లో సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు.. 2018 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ పుల్ల కార్తీక్ నిన్న (గురువారం జనవరి 8) మరోసారి విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ, యూపీఎస్సీ కౌన్సెల్ అజయ్కుమార్ కులకర్ణి వాదనలు వినిపించారు.కోర్టు ఆదేశాల మేరకు తాము యూపీఎస్సీకి జాబితాను పంపామని, కమిషన్ దాన్ని తిప్పి పంపిందని ఏజీ అన్నారు. కోర్టు ఉత్తర్వులు యూపీఎస్సీకి కూడా వర్తిస్తాయని, రాష్ట్ర జాబితాను తిరిగి పంపకూడదన్నారు. పిటిషనర్ లేవనెత్తిన ప్రశ్న సరైంది కాదన్నారు. రాష్ట్ర సిఫార్సులను పునఃపరిశీలించేలా యూపీఎస్సీని ఆదేశించాలని కోరారు.ఈ విషయంలో కేంద్ర హోం శాఖకు ఎలాంటి పాత్ర లేదని ఏఎస్జీ పేర్కొన్నారు. ఇది రాష్ట్రానికి, యూపీఎస్సీకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల అంశమని తెలిపారు. రాష్ట్రం వైపు నుంచి జరిగిన జాప్యం, డీజీపీల నియామకానికి సంబంధించి సుప్రీం ఆదేశాల దృష్ట్యా అటార్నీ జనరల్ను న్యాయ సలహా కోరామన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు నుంచే స్పష్టత కోరాలని ఆయన సూచించారన్నారు. వాదనలు విన్న జడ్జి.. ఇవాళ(శుక్రవారం) తీర్పు వెల్లడించారు. -
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వాహనదారులు ఇకపై రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరంలేదు. వాహనం కొన్నచోటే సంబంధిత డీలర్ వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. వచ్చే 15 రోజుల్లో కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానుంది. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(RC) నేరుగా పోస్ట్ ద్వారా కొనుగోలుదారు ఇంటికి వస్తుంది. ఈ కొత్త ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేషన్ పనులు జరుగుతున్నాయి. అవి కొలిక్కి రాగానే ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇంతకాలం కొత్త వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రమే షోరూమ్లలో జరుగుతోంది. వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రవాణాశాఖ కార్యాలయాల్లోనే కొనసాగుతోంది. దీన్ని మార్చి షోరూమ్లలోనే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాహనదారులకు ఈ ప్రక్రియ సులభంగా జరిగేలా చూడటంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో దళారులు అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్న తీరును కూడా నిరోధించాలని దీని ద్వారా నిర్ణయించింది.చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చినా తెలంగాణలో మాత్రం ప్రారంభం కాలేదు. కేంద్ర ప్రభుత్వ వాహన్ సారథి పోర్టల్లో రాష్ట్ర ప్రభుత్వం చేరకపోవడం వల్ల కూడా ఇది ఆలస్యమవుతూ వచి్చంది. ఎట్టకేలకు ఇప్పుడు ఆ విధానాన్ని అమలులోకి తేవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం అధికారిక ఆటోమొబైల్ డీలర్ ద్వారా కొనుగోలు చేసే పూర్తి నిర్మిత రవాణాయేతర ద్విచక్ర, కార్లకు మాత్రమే కొత్త విధానం వర్తించనుంది. వాణిజ్య (ట్రాన్స్పోర్ట్) వాహనాలకు వర్తించదు. -
డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురి అరెస్టు
మూసాపేట: బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసినట్లు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్కు చెందిన గంపా శ్రీహర్ష (31), కూన రాజు చందు(22) బాచుపల్లి మల్లంపేటలో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. శ్రీహర్ష వ్యాపారి. చందు డ్రైవర్. ఈ నెల 5న మల్లంపేట రోడ్డులోని హైరైజ్ ప్యారడైజ్ విల్లాస్లో శ్రీహర్ష ఎండీఎంఏ డ్రగ్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా చందుతోపాటు కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సంజప్ప అలియాస్ నితిన్(32) డ్రగ్స్ విక్రయించినట్లు చెప్పాడు. జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్న సంజప్ప బెంగుళూరు నుంచి అక్రమంగా సింథటిక్ ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకువచ్చి చందుతో కలిసి విక్రయించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 7న డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేశారు. 11.34 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు పెడ్లర్లుగా మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరితో సంబంధమున్న మరో ఇద్దరు ఇనావో షైజా, యశ్వంత్ పరారీలో ఉన్నారు. -
హైదరాబాద్లో ఫిన్నిష్ క్యాంపస్ ప్రారంభం
సాక్షి,సిటీ బ్యూరో: హోరిజన్ ఎక్స్పీరియన్సియల్ వరల్డ్ స్కూల్ సౌత్ ఇండియాలో మొదటి ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్ను గురువారం హైదరాబాద్లోని కొల్లూరులో ప్రారంభించింది. టీసీసీ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో టీ–హబ్ మాజీ సీఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇన్నోవేషన్ను ఒకే కాలేజీ కోర్సులో నేర్పలేమని, ప్రైమరీ స్కూల్ దశ నుంచే విద్యార్థులకు దానిపై కనీస అవగాహన ఉండాలని అన్నారు. ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సీఈఓ డా. జోహన్ స్టోర్గార్డ్ మాట్లాడుతూ ‘ఫిన్లాండ్లో పిల్లలకు సబ్జెక్టులు మాత్రమే నేర్పమని, ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తామని అన్నారు. హై–ట్రస్ట్, లో–స్ట్రెస్ వాతావరణంలో విద్యాబోధన ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టూడియో చింతల ఫౌండర్ దివాకర్ చింతల, పాంగేయా ట్రేడ్ (వైస్ ప్రెసిడెంట్ రైతా మోచెర్ల, పీడియాట్రీషియన్, డా. లావణ్య తదితరులు పాల్గొన్నారు. పెళ్లి పేరిట నమ్మించి.. డబ్బులు కాజేసి.. ఫిలింనగర్: వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని లైంగిక వేధించడంతోపాటు రూ.75 లక్షలు తీసుకుని మోసగించిన వ్యక్తిపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ సదరన్ మోగా టౌన్షిప్లో నివాసం ఉండే రాణా ప్రతాప్రెడ్డి వివాహం చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి శారీరంగా లోబర్చుకున్నాడు. వ్యాపారం కోసం ఆమె వద్ద రూ.75 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి మాట ఎత్తితే మొహం చాటేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారణాసి విమానం రద్దు.. మరొకటి వెనక్కి.. ● ప్రతికూల వాతావరణమే కారణం శంషాబాద్: వారణాసిలో ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్ విమానాశ్రయ నుంచి వెళ్లాల్సిన విమానాల్లో ఒకటి పూర్తిగా రద్దు కాగా, మరొకటి మార్గమధ్యంలోంచి తిరిగి వెనక్కి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇండిగో 6719 విమానం గురువారం సాయంత్రం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకునే ముందు వారణాసిలో ప్రతికూల వాతావరణం ఉందనే సమాచారం వచ్చింది. దీంతో సంబంధిత ఎయిర్లైన్స్ సంస్థ విమానాన్ని రద్దు చేసింది. ప్రయాణికులకు షెడ్యూల్ మార్పులున్నట్లు వెల్లడించింది. అర్ధాంతరంగా తిరిగి వచ్చిన విమానం.. వారణాసి బయలుదేరిన మరో విమానం మార్గమధ్యలోంచి తిరిగొచ్చింది. ఇండిగో 6ఈ–307 విమానం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 231 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం బయలుదేరింది. వారణాసిలో ప్రతికూల వాతావరణం ఉన్న కారణంగా అర్ధాంతరంగా విమానం తిరిగి రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరింది. ప్రయాణికులకు ఎయిర్లైన్స్ వర్గాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి. -
హష్ ఆయిల్ విక్రయిస్తుండగా ఇద్దరి అరెస్టు
శంషాబాద్ రూరల్: హష్ ఆయిల్ విక్రయించేందుకు యత్నిస్తుండగా ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి కథనం ప్రకారం... ఏపీలోని విశాఖపట్నం ఓల్డ్ గాజువాకకు చెందిన డింబకేశ్వర నాగప్రణవ్(26) నగరానికి వచ్చి డ్రైవర్గా పనిచేస్తూ ఊట్పల్లిలోని బంధువుల ఇంట్లో నివాసముంటున్నాడు. ఇతను కొన్నాళ్ల కిందట జైలులో ఉన్నప్పుడు గంజాయి కేసులో శిక్ష అనుభవిస్తున్న విశాఖపట్నం చౌడవరం నివాసి యశ్వంత్తో పరిచయం ఏర్పడింది. ప్రణవ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2024లో శ్రీకాకుళం ఇచ్ఛాపురంవాసి యెర్ర శ్రీనివాసులు(21)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి పాతబస్తీలో గంజాయిని కొనుగోలు చేసి సేవించేవారు. గత డిసెంబర్ 30న యశ్వంత్ ద్వారా ప్రణవ్ గోవాకు వెళ్లి రెండు సీసాల హష్ ఆయిల్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఊట్పల్లిలోని తన నివాసానికి సమీపంలో కొంతమంది గంజాయి, హష్ ఆయిల్ సేవిస్తున్నట్లు గమనించాడు. ఈ క్రమంలో ఈ నెల 7న వారి వద్దకు శ్రీనివాసులతో కలిసి వెళ్లి హ్యష్ ఆయిల్ను విక్రయిస్తామనంటూ బేరసారాలకు దిగాడు. అప్పటికే అక్కడ నిఘా వేసిన పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న హష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్టీపీల నిర్మాణంలో వేగం పెంచాలి
సాక్షి,సిటీ బ్యూరో: కొత్త సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనుల్లో వేగం పెంచి ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు.ఈ మేరకు గురువారం ఆయన ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అమృత్– 2.0 పథకంలో భాగంగా నిర్మించనున్న 39 ఎస్టీపీల పనుల పురోగతిపై ఎస్టీపీ విభాగ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఓఆర్ఆర్ పరిధిలో సుమారు రూ.3,849.10 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీ – 2 కింద నిర్మిస్తున్న ఎస్టీపీల పనుల పురోగతి గురించి అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ అనుమతులు లభించిన స్థలాల్లో భూసార పరీక్షలు పూర్తి చేసి వెంటనే ఎస్టీపీ నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. భూమికి సంబంధించిన సమస్యలు ఉన్న ప్రాంతాల్లో త్వరగా సమస్యలు పరిష్కరించి, అనుమతులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రతి ఎస్టీపీకి సంబంధించి 15 రోజులకు ఒకసారి చేయాల్సిన పనులపై చెక్ లిస్ట్ రూపొందించుకుని, గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. వాటి వివరాలు జలమండలి అధికారుల వద్ద, సైట్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధుల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. భూ వివాదాలుంటే... భూ వివాదాలు ఉన్న ప్రాంతాల్లో కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్టేట్ ఆఫీసర్కు సూచించారు. మరోవైపు భూ వివాదాలు ఉన్న ప్రాంత ఎస్టీపీల నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా భూమిని గుర్తించాలన్నారు. వివాదాలు లేకుండా భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణానికి ప్లాన్లను వెంటనే ఖరారు చేయాలని ఆదేశించారు. స్థలాభావం ఉంటే తక్కువ స్థలంలో ఎక్కువ సామర్థ్యంతో నిర్మించే అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. పనులు మొదలు పెట్టినప్పటినుంచి తుదివరకు ఎస్టీపీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి టైం లైన్లను నమోదు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సాయిల్ టెస్టులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సైట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి -
మహీంద్రా సరికొత్త మోడల్స్ ఆవిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన రెండు ఐకానిక్ మోడళ్లు ఎక్స్యూవీ 7ఎక్స్ఓ, ఎక్స్ఈవీ 9ఎస్లను గురువారం సోమాజిగూడలోని ది పార్క్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఎక్స్యూవీ 7ఎక్స్ఓ 2021లో ప్రారంభమైనప్పటి నుంచి 3 లక్షల మందికి పైగా కస్టమర్లను సొంతం చేసుకుందని, దీని ప్రారంభ ధర రూ.13.66 లక్షలు (ఎక్స్–షోరూమ్) ఉందని నిర్వాహకులు తెలిపారు. ఎక్స్ఈవీ 9ఎస్ ప్రారంభ ధర రూ.19.95 లక్షల (ఎక్స్–షోరూమ్)తో భారతదేశపు బిగ్ న్యూ ఎలక్ట్రిక్గా అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్ఈఏఎల్ జోనల్ మేనేజర్ అభిషేక్ కుమార్, ఆటో డివిజన్ రీజినల్ మేనేజర్ స్వాతిక్, ఎమ్ఈఏఎల్ రీజినల్ మేనేజర్ నవేద్ ఖాన్తో పాటు డీలర్ భాగస్వాములు ఆటోమోటివ్ మహీంద్రా సీఈఓ నారాయణ, వీవీసీ మహీంద్రా ఎండీ వీరెన్, ల్యాండ్మార్క్ సీఈఓ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మూడోసారి..ఏమౌనోమరి!
సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల క్రితం జీహెచ్ఎంసీలో కోట్లాది రూపాయల పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టు పని కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ఫ్లై ఓవర్ల సంగతి అటుంచితే.. కనీసం రహదారుల విస్తరణ పనులు కూడా ప్రారంభం కాలేదు. కొన్నింటికి కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. మరికొన్నింటికి ఇప్పటివరకూ టెండర్లు కూడా పిలవలేదు. ఇంకా కొన్ని పనులకు ఒకటి, రెండు పర్యాయాలకు మించి టెండర్లు పిలిచినా, పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అందుకు తాజా ఉదాహరణ ఓల్డ్సిటీలోని తులసీనగర్ నుంచి గౌస్ నగర్ వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు. ఈ పనుల అంచనా వ్యయం రూ.88 కోట్లు. నిధులు మంజూరు చేసినా.. ● హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలనే తలంపుతో పాతబస్తీలోనూ పలు పనులు చేసేందుకు ప్రభుత్వం పలు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసింది. ఫ్లై ఓవర్లతోపాటు ఆయా ప్రాంతాల్లో రహదారులను 100 అడుగుల వెడల్పుతో విస్తరించి అభివృద్ధి చేయాలని భావించింది. అందులో భాగంగా ఆయా పనులకు టెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. తులసీనగర్– గౌస్ నగర్ వరకు పనులకు టెండర్లు ఆలస్యంగా పిలిచారు. అయినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు మొదలుకాలేదు. ● ఇప్పటికే రెండు పర్యాయాలు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో తాజాగా మూడోసారి టెండర్లు ఆహ్వానించారు. ఈసారైనా కాంట్రాక్టర్లు ముందుకు వస్తారో, రారో తెలియని పరిస్థితి. రహదారి అభివృద్ధిలో భాగంగా వెడల్పుగా మాత్రమే కాకుండా పాదచారులకు ఫుట్పాత్లు, మీడియన్లలో గ్రీనరీ తదితరమైనవి ఉండాలనేది లక్ష్యం. కానీ.. రెండు పర్యాయాలు ఎవరూ రాలేదు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు లేనందునే కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. పాతబస్తీలో రహదారి అభివృద్ధి పనులు ఈసారైనా కాంట్రాక్టర్లు ముందుకొస్తారా? అంచనా వ్యయం రూ.88 కోట్లు -
సాగర్ తీరం.. ఆనంద రాగం!
బుద్ధ పూర్ణిమ పునరభివృద్ధికి ప్రణాళికలు సాక్షి, సిటీబ్యూరో: బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పునరభివృద్ధికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. పర్యాటకులను, సందర్శకులను ఆకట్టుకొనేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు సమగ్రమైన మాస్టర్ప్లాన్ రూపొందించనుంది. ఇందుకోసం కన్సల్టెన్సీని ఎంపిక చేసేందుకు సంస్థల నుంచి ఆసక్తుల వ్యక్తీకరణకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ త్వరలో బిడ్డింగ్ వెలువరించే అవకాశం ఉంది. శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, అంబేడ్కర్ మహా విగ్రహం, తెలంగాణ అమరుల స్మారకం, బుద్ధ విగ్రహం వంటి చారిత్రక కట్టడాలతో విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్ సంస్కృతి, తెలంగాణ కళలు ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. పర్యాటకులను ఆకట్టుకొనే నైట్ బజార్ కూడా ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. ఈ ప్రణాళికలు ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ క్రమంలోనే బుద్ధపూర్ణిమ రీ డెవలప్మెంట్కు హెచ్ఎండీఏ తాజాగా ప్రణాళికలు రూపొందించింది. అందంగా.. ఆహ్లాదంగా.. సుమారు 1,300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న హుస్సేన్సాగర్ పరీవాహక ప్రాంత అభివృద్ధి కోసం అప్పటి ఉమ్మడి ప్రభుత్వం హెచ్ఎండీఏకు అనుబంధంగా బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసింది. 2004 నుంచి బీపీపీ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్కు, లేక్వ్యూపార్క్, సంజీవయ్య పార్క్, ఎకోపార్క్, పీవీ జ్ఞానభూమి, పీపుల్స్ప్లాజా, ఎకో కన్జర్వేషన్ జోన్ తదితర ప్రాంతాలు ప్రస్తుతం బీపీపీలో భాగంగా ఉన్నాయి. వీటి నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తోంది. బీపీపీ పునరభివృద్ధిలో భాగంగా ఈ పార్కులు అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని, ఆహ్లాదాన్ని అందజేస్తాయి. మరోవైపు రిక్రియేషన్ కార్యకలాపాల విస్తరణలో భాగంగా పర్యాటకులకు 24 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ లభించే నైట్బజార్ను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉందని అధికారులు చెప్పారు. హుస్సేన్సాగర్ చెరువులోకి స్కైవాక్ సైకిల్ వే నిర్మించాలని హుమ్టా ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం అంబేడ్కర్ విగ్రహాన్ని ఆనుకొని ఐమాక్స్ థియేటర్ వద్ద ఉన్న విశాలమైన స్థలం, ఎకో కన్జర్వేషన్లో ఉన్న మరికొన్ని ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవడం పునరభివృద్ధి ప్రాజెక్టు లక్ష్యం. ఈ మాస్టర్ప్లాన్ రూపకల్పనపై కన్సల్టెన్సీ ని ఎంపిక చేసేందుకు ఓ ప్రైవేట్ సంస్థకు బాధ్యతలను అప్పగించినట్లు అధికారులు తెలిపారు. -
2027 డిసెంబర్ నాటికి గోదావరి పనులు పూర్తి
జలమండలి ఎండీ అశోక్రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్–2–3 ప్రాజెక్ట్ పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో గోదావరి నిర్మాణ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్ వరకు.. అక్కడి నుంచి ఉస్మాన్ సాగర్ వరకు నిర్మించాల్సిన పైపులైన్ విస్తరణ పనులు, ఘన్ పూర్ వద్ద నిర్మించనున్న 80 మిలియన్ లీటర్ల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఘన్పూర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల వద్ద నిర్మించే నీటిశుద్ధి కేంద్రాల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్–1 కింద.. నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీరు తరలిస్తోందని, మరో రెండు దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు తరలించేందుకు పనులు ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తలించే మొత్తం నీటిలో 17.5 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా.. జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. సమావేశంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చైనా మాంజాకు చెక్
ఈ దారంతో పతంగులు ఎగురవేసే వారిపై కేసులు సాక్షి, సిటీబ్యూరో ‘వినియోగదారులు ఉన్నంత వరకు విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే నిషేధిత చైనా మాంజా రవాణా చేసే, అమ్మే వారితో పాటు దీంతో పతంగులు ఎగుర వేసే వారిపైనా కేసులు నమోదు చేయాలని నిర్ణయించాం’ అని నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ స్పష్టం చేశారు. దీనికోసం సంక్రాంతి ముగిసే వరకు ప్రత్యేక బృందాలతో నిఘా తనిఖీలు ఉంటాయని పేర్కొన్నారు. గురువారం బంజారాహిల్స్లోని ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పండగ నేపథ్యంలో బృందాలుగా చేరి పతంగులు ఎగుర వేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఆకస్మికంగా తనిఖీలు చేసే ప్రత్యేక బృందాలు వాళ్లు చైనా మాంజా వాడుతున్నట్లు తేలితే బీఎన్ఎస్తో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నారు. వీటిలో నేరం నిరూపణ అయితే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానాలకు ఆస్కారం ఉందని కొత్వాల్ పేర్కొన్నారు. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు చైనా మాంజా వినియోగాన్ని పోత్సహించవద్దని ఆయన సూచించారు. నెల రోజుల ముందే అప్రమత్తం.. ● పతంగుల పండగ నేపథ్యంలో చైనా మాంజా విక్రయంపై నగర పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. దీని వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2016లో, జాతీయ హరిత ట్రైబ్యునల్ 2017లో నిషేధించింది. అయినప్పటికీ విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. దీంతో నెల రోజులుగా నిఘా ఉంచిన అధికారులు ఇప్పటి వరకు 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.24 కోట్ల విలువైన 6226 బాబిన్ల మాంజా స్వాధీనం చేసుకున్నారు. ● ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ల్లో తయారవుతున్న ఈ మాంజాపై పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు ముద్రించి రవాణా చేస్తున్నా రు. దీనికి సహకరిస్తున్న పార్సిల్, కొరియర్ సంస్థల పైనా చర్యలు తప్పవని సజ్జనర్ హెచ్చరించారు. విక్రేతలతో పాటు గోదాములపైనా దాడులు చేస్తున్న స్థానిక, టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ మాంజా మూలాలు కనిపెట్టడంపై దృష్టి పెట్టారు. ప్రతి ఏడాదీ మాంజా విక్రయాలపై దాడులు చేసినా పంగుల ముగిసిన తర్వాత అంతా మిన్నకుండిపోతారు. ఈసారి మాత్రం సంక్రాంతి తర్వాత కూడా ఈ కేసుల దర్యాప్తును పర్యవేక్షిస్తామని సజ్జనర్ స్పష్టం చేశారు. మాంజా బాబిన్లను చూపిస్తున్న సీపీ సజ్జనర్ తదితరులుఈ–కామర్స్ వెబ్సైట్ల ద్వారానూ అమ్మకాలు... నగర పోలీసు విభాగానికి చెందిన ఓ ఎస్సై చేపట్టిన డెకాయ్ ఆపరేషన్తో ఈ మాంజా విక్రయాలు ఈ–కామర్స్ సైట్ల ద్వారానూ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయా సైట్లలోని క్రయవిక్రయాలను ఆరా తీసిన పోలీసులు కొందరికి నోటీసులు సైతం జారీ చేశారు. ప్రస్తుతం ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్మీడియా సైట్లపై నిఘా ఉంచారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ మాంజా తయారు చేస్తున్న సంస్థల వివరాలు కనిపెట్టడంతో పాటు అవసరమైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం ద్వారా వాటిని సీజ్ చేయించాలని సజ్జనర్ నిర్ణయించారు. ‘తాజా పరిణామాల నేపథ్యంలో హ్యష్ట్యాగ్ సే నో టు చైనీస్ మాంజ క్యాంపెయినింగ్ చేపడుతున్నాం. తల్లిదండ్రులూ బాధ్యతగా వ్యవహరించి నూలు దారం వినియోగాన్ని ప్రోత్సహించాలి. సంక్రాంతి ముగిసిన తర్వాత వైర్లు, రహదారులపై ఉన్న మాంజాను తొలగించడానికి జీహెచ్ఎంసీ, అటవీ అధికారులతో కలిసి పని చేస్తాం. చైనా మాంజాపై సమాచారం ఉంటే ‘100’కు కాల్ చేసి లేదా 94906 16555కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలి’ అని కొత్వాల్ సజ్జనర్ సూచించారు. నేరం నిరూపితమైతే ఐదేళ్ల వరకు జైలుశిక్ష వెల్లడించిన నగర కమిషనర్ వీసీ సజ్జనర్ -
వారి కళ్లలో ఆనందాన్ని నింపండి.. కన్నీళ్లను కాదు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: పొగమంచులో వాహనాలతో సాహసం వద్దంటూ.. మంచు తగ్గాకే కదలాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సంక్రాంతి సంబరం విషాదం కాకూడదు.. పండుగ నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత, మీ ప్రాణాల మీదకు తేకూడదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారింది. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం’’ అని సజ్జనార్ సూచించారు.పొగమంచులో సొంత వాహనాల్లో ప్రయాణం వద్దు. తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వేళల్లో సాహసం చేయకండి. దయచేసి పొగమంచు పూర్తిగా తగ్గి, రోడ్డు స్పష్టంగా కనిపించిన తర్వాతే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మీ రాక కోసం మీ వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి కళ్లలో ఆనందాన్ని నింపండి.. కన్నీళ్లను కాదన్న సజ్జనార్.. తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు ఇచ్చారు.పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి!సంక్రాంతి సంబరం విషాదం కాకూడదు.. పండుగ నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత, మీ ప్రాణాల మీదకు తేకూడదు!ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారింది. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో… pic.twitter.com/esYAMfcz8O— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 9, 2026‘‘పొగమంచు ఉన్నప్పుడు వాహనం నడపాల్సి వస్తే.. ఫాగ్ లైట్లు (Fog Lights), ఇండికేటర్లు ఆన్ చేయండి. ముందు వెళ్లే వాహనానికి తగినంత దూరం (Safe Distance) పాటించండి. రోడ్డు ఖాళీగా ఉందని వేగంగా వెళ్లొద్దు. గుర్తుంచుకోండి.. ఆలస్యంగానైనా సరే.. క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ’’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. -
‘ఉపాధి’ని దెబ్బతీస్తే సహించం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసే కుట్రలను సహించబోమని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం గాందీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో 140 కోట్ల జనాభాలో 80 శాతం మంది ఉపాధి హామీ పథకంపై ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ పథకం పేదల ఆత్మ గౌరవాన్ని పెంచిందని, దీని రూపకల్పన, అమలుకు తెలుగు రాష్ట్రాలే వేదికయ్యాయని సీఎం గుర్తు చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోదీ ప్రభుత్వం తెచ్చినప్పుడు, వాటికి వ్యతిరేకంగా రాహుల్గాంధీ పోరాడారని చెప్పారు. చివరకు రైతులకు క్షమాపణ చెప్పి, కేంద్ర ప్రభుత్వం ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా చేయడంలో రాహుల్గాంధీ విజయవంతమయ్యారని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదని రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ అంశంపై మోదీతో దేశానికి క్షమాపణ చెప్పిస్తామన్నారు. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి మండలానికి ఒక ఇన్చార్జ్ను నియమిస్తామని, తాను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటానని సీఎం వెల్లడించారు. ఫిబ్రవరి 3 నుంచి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని, ములుగు సభకు సోనియాగాందీ, రాహుల్గాంధీ, ప్రియాంక గాందీని ఆహా్వనిస్తామని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున రాష్ట్ర ఎంపీలు నిరసన తెలపాలని సూచించారు. ఎస్ఐఆర్ వెనుక పెద్ద కుట్ర కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓట్లు తొలగించే ఎస్ఐఆర్ (సర్) వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఇల్లు లేని , ఆస్తి లేని పేదలకు ఉన్న గుర్తింపు కార్డే ఓటు అని, పేదల గుర్తింపును తొలగించేందుకు ఓట్లను తీసేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ తీసుకొచ్చిందని విమర్శించారు. ఎప్పుడైతే ఓటు హక్కు తొలగిస్తారో, అతని ఆధార్ కార్డు, రేషన్కార్డు కూడా పోతుందని, ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి దేశంలో ఉండాలో, లేదో అని నిర్ణయించే శక్తి కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుందని ధ్వజమెత్తారు. సర్ పేరుతో ఓట్లను తొలగించి కోట్లాది మంది పేదలను ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి, వారిని తిరిగి వెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. మునిసిపోల్స్లో అంతటా కాంగ్రెస్ జెండా ఎగరాలి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలని సీఎం రేవంత్ చెప్పారు. గల్లీ గల్లీ కాదు, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తాను ముఖ్యమంత్రి అయ్యానని, తెలంగాణ ఎప్పుడూ కాంగ్రెస్కు అండగా నిలిచిందని పేర్కొన్నారు. దేశం ఇబ్బందుల్లో ఉందని, ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. 20 నుంచి గ్రామగ్రామాన సభలు :మహేశ్గౌడ్ వీబీజీ –రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా ఏఐసీసీ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ఈ నెల 20 నుంచి 30వ తేదీల మధ్య అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, వీబీజీ–రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గానికి 5 వేల చొప్పున కరపత్రాలు ముద్రించి, అవి గ్రామగ్రామాన, వాడవాడకు చేరేలా పంపిణీ చేయాలని చెప్పారు. వీబీజీ –రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా ప్రతి డీసీసీ తప్పనిసరిగా గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. బీజేపీ కుట్రలను గ్రామగ్రామానా ఎండగడతాం : భట్టి విక్రమార్క బీజేపీ పాలన సామ్రాజ్యవాదుల కంటే ప్రమాదకరంగా మారిందని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవస్థాగతంగా కుట్ర చేస్తోందని ఆరోపించారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో గాం«దీజీ నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు జరిగినా బ్రిటిష్ పాలకులు ఆయనపై లాఠీ కూడా ఎత్తలేదని, కానీ స్వాతంత్య్రం వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులు గాంధీజీని హత్య చేశారని గుర్తు చేశారు. అందుకే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలమే ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు. ఉపాధి హామీ చట్టం రాకముందు రోజుకు రూ.40 ఉన్న కూలీ ఒక్కసారిగా రూ.100కి పెరిగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ తెచ్చిన చట్టాలన్నింటినీ రద్దు చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. – దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు గౌరవప్రదమైన ఉపాధి లభించిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పారు. సోనియాగాంధీ ఎంతో శ్రమించి పేదలకు పని హక్కు కల్పించే చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్,, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అజాహరుద్దీన్, ఏఐసీసీ నేతలు విశ్వనాథన్, ప్రవీణ్ చక్రవర్తి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ చార్జీలు పెంచొద్దు.. ప్రజలపై భారం వేయొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపొద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ పంపిణీ సంస్థలకు సూచించారు. డిస్కంల ఆర్థిక లోటుపై ప్రభుత్వం సరైన నిర్ణ యం తీసుకుంటుందని తెలిపారు. దీంతో పంపిణీ సంస్థలు తమ వార్షిక ఆదాయ, అవసర నివేదిక(ఏఆర్ఆర్)ల్లో విద్యు త్ చార్జీల భా రం లేకుండానే విద్యుత్ నియంత్రణ మండలికి తమ ప్రతిపాదనలు అందించాయి. డిస్కంల ఏఆర్ఆర్లను గురువారం ఈఆర్సీ ప్రజల ముందుకు తెచి్చంది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు 2026–27 వార్షిక సంవత్సరానికి రూ. 22,104 కోట్ల ఆర్థిక లోటు ఉంటుందని ఏఆర్ఆర్లో పేర్కొన్నాయి.నివేదికలను గత ఏడాది డిసెంబర్లోనే ఈఆర్సీ ముందుకు తెచ్చాయి. ఫిక్స్డ్ చార్జీల పెంపుతో పాటు, పరోక్ష విధానంలో టారిఫ్ పెంపును ప్రతిపాదించాయి. అయితే పంచాయతీ ఎన్నికల దృష్ట్యా వీటిని బయటకు వెల్లడించలేదు. దీనిని డిప్యూ టీ సీఎం పరిశీలించి, చార్జీల పెంపును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అంగీకరించబోదని డిస్కంలకు సూచించారు. దీంతో ఏఆర్ఆర్ నివేదికలను సవరించి, ప్రభుత్వం నుంచి లోటును పూడ్చుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.ప్రజాభిప్రాయ సేకరణకు వి ద్యుత్ నియంత్రణ మండలి నోటిఫికేషన్ ఇవ్వడంతో ఏఆర్ఆర్లను వెల్లడించాయి. దక్షిణ డిస్కం రూ.9,583 కోట్లు, ఉత్త ర డిస్కం రూ.12,521 కోట్ల లోటులో ఉన్నట్టు ఆయా నివేదికల్లో పేర్కొన్నాయి. ఈనెల 31 వరకు డిస్కంల నివేదికపై అ భ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తారు. మార్చి 5న హనుమకొండలో, మార్చి 7న హైదరాబాద్లోని ఈఆర్సీ కార్యాలయంలో బహిరంగ విచారణ జరిపి, టారిఫ్ ఆర్డర్ను జారీ చేస్తుంది.రేపు ఢిల్లీకి డిప్యూటీ సీఎం సాక్షి. హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఢిల్లీలో ఈ నెల 10వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. రాష్ట్రాల అవసరాలు, అవి కోరుకుంటున్న కొత్త ప్రాజెక్టులు, విధానపర నిర్ణయాల్లో మార్పులు, కేంద్రం నుంచి నిధుల విడుదలకు వస్తున్న డిమాండ్లు, వీటన్నింటిపై ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఆమె చర్చించనున్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆర్థిక శాఖ అధికారులు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర బడ్జెట్ను రూపొందించే ముందు రాష్ట్రాల డిమాండ్లు, అవసరాలకు ఏ మేరకు నిధులు కేటాయించాలో ఈ సమావేశం ఆధారంగా నిర్ణయిస్తారు. బడ్జెట్ సన్నాహక సమావేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు సంక్రాంతి తరువాత ప్రారంభం కానున్నాయి. అన్ని శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా వరుస భేటీలు నిర్వహించనున్నారు. -
రెండేళ్లలో తరగతులు
సాక్షి, హైదరాబాద్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం పనులను ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని, రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గురువారం విద్యారంగంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యకు సంబంధించిన పలు అంశాలపై సీఎం దృష్టి పెట్టారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు, నిర్మాణ డిజైన్లను కన్సల్టెన్సీ సంస్థలు ఆయనకు వివరించాయి. కాగా రెండేళ్ళలో అన్ని స్కూళ్ళ నిర్మాణం పూర్తి చేసి, తరగతులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. బాలికలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ జిల్లాల వారీగా బాలురు, బాలికల వివరాలు తెప్పించాలని ఆదేశించారు. ఈ స్కూళ్లకు అవసరమైన బడ్జెట్ విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నాణ్యతలో రాజీ పడొద్దు.. ‘అక్షయ పాత్ర భాగస్వామ్యంతో జూన్ నుంచి పాఠశాల విద్యార్థులకు అందించే అల్పాహారంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఈ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అందించే భోజనం నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలి. వంటకు సోలార్ పవర్ను వాడుకునే అంశాన్ని పరిశీలించాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 23 కొత్త పాఠశాల భవనాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలి. బాచుపల్లి పాఠశాల భవన నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న స్థలానికి సమీపంలో ఎకరంన్నర కేటాయించాలి..’అని సీఎం ఆదేశించారు. ఖర్చుతో కూడిన ప్రతిపాదనలు తేవద్దు ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక వసతుల కల్పన, భవనాల మరమ్మతులతో పాటు పలు అంశాలను పాఠశాల విద్యా కమిషనర్ ప్రస్తావించారు. అయితే ఖర్చుతో కూడిన ప్రతిపాదనలు ప్రస్తుతానికి వద్దని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. ఎంఈవో పోస్టుల భర్తీని కూడా సీఎం వ్యతిరేకించినట్టు తెలిసింది. రాష్ట్రంలో విద్యార్థుల నిష్పత్తి కన్నా టీచర్లు ఎక్కువగా ఉన్నారని, హేతుబదీ్ధకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ: సీఎం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురానున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. దీనిపై అధ్యయనం కోసం ఓ కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలోనే పాలసీని ప్రకటిస్తామని చెప్పారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రోహిత్కుమార్ నేతృత్వంలోని ఆ రాష్ట్ర బృందం గురువారం సచివాలయంలో సీఎంను మర్యాపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం కల్పించాలని యోచిస్తున్నామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాగా దీనిపై సమగ్ర నివేదికను అందించాలని హిమాచల్ప్రదేశ్ మంత్రి సీఎంను కోరారు. నేడు రావిర్యాలలో సీఎం పర్యటన తుక్కుగూడ: సీఎం రేవంత్ గురువారం రావిర్యాలలో పర్యటించనున్నారు. మంఖాల్ డివిజన్ పరిధిలోని ఫ్యాబ్సిటీలో మనీషా గ్రూప్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించిన సుజిన్ మెడికే ర్ ప్రైవేటు లిమిటెడ్ ఐవీ ద్రవం తయారీ కంపెనీని ఉదయం 10 గంటలకు సీఎం ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో ఇంటర్ బోర్డు ఉండదు! పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా ఉన్నతీకరించాలన్న ప్రతిపాదనపై సీఎం అనేక ప్రశ్నలు సంధించారు. ఇదెలా సాధ్యమని, అనుబంధ గుర్తింపు ఎలా వస్తుందని, ఏఐసీటీఈ అనుమతి ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం ప్రతిపాదనను కూడా తోసిపుచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అందుబాటులోకి వస్తే 12వ తరగతి వరకూ అక్కడే ఉంటుందని, భవిష్యత్తులో ఇంటర్ బోర్డు ఉండదని సీఎం అన్నట్టు తెలిసింది. సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, పి.సుదర్శన్రెడ్డి, సీఎంఓ, విద్యాశాఖ ఉన్నతాధికారులు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలి: సీఎంకు విజ్ఞప్తి
సాక్షి: హైదరాబాద్: రాష్ట్రంలో అనుభవం గల గ్రూప్ -1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గ్రూప్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ సీఎంను కలిశారు. స్థానిక సంస్థల్లో అనుభవం గల పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖల గ్రూప్ -1 అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ను కోరారు.అలాగే పాలనా అనుభవం గల సీనియర్ గ్రూప్ 1 అధికారులను కార్పొరేషన్ ఎండీలుగా, డైరెక్టర్లుగా నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 2015లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై ఆరుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు అయిందని.. ఆ కమిటీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదని తెలిపారు. స్టేట్ సివిల్ సర్వీస్ పరిధిలో అన్ని గ్రూప్ -1 పోస్టులను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అతి త్వరలో గ్రూప్-1 అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో శశికిరణా చారి,అరవింద్ రెడ్డి,నూతనకంటి వెంకట్, పద్మావతి,భరత్ రెడ్డి, ప్రశాంతి, మాధవ్, ఫణి గోపాల్, వినోద్, సోమ శేఖర్ ఉన్నారు. -
ఆరాంఘర్లో ఆర్టీఏ తనిఖీలు.. ట్రావెల్స్ బస్సులపై కేసులు
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్లోని ఆరాంఘర్ చౌరస్తాలో తెలంగాణ ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్, ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిట్నెస్లేని ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి కేరళ, బెంగళూరు, తమిళనాడు, పాండిచ్చేరిలతో పాటు ఏపీకి వెళ్తున్న బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలిపారు. ఆర్టీఏ తనిఖీలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
గడువు ముగిసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీకి మార్గదర్శకాలు: జీహెచ్ఎంసీ
సాక్షి, హైదరాబాద్: నగరంలో భవన అనుమతి గడువు ముగిసినప్పటికీ అనుమతించిన ప్లాన్ల ప్రకారమే నిర్మాణం పూర్తిచేసిన నాన్ హైరైజ్ భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) జారీకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది.భవన అనుమతులు పొంది, గడువు లోపల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందలేకపోయినప్పటికీ అనుమతించిన ప్లాన్ల మేరకు నిర్మాణం పూర్తి చేసిన భవనాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల నీటి, విద్యుత్ కనెక్షన్లు (HMWSSB, TSSPDCL) పొందడంలో కొనుగోలుదారులు, గృహ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పాటు, బ్యాంకు రుణాల విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అదనపు పెనాల్టీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వెల్లడించారు.కేసు–1:భవన అనుమతి గడువు ముగిసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల లోపు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినట్లయితే, రూల్–26 ప్రకారం పెండింగ్ భవన అనుమతి ఫీజులు, లింక్ రోడ్ ఛార్జీలు, CRMP ఛార్జీలు తదితర వర్తించే రుసుములు వసూలు చేసి దరఖాస్తును పరిశీలిస్తారు.కేసు–2:భవన అనుమతి గడువు ముగిసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల తరువాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే, దరఖాస్తు తేదీ నాటికి మొత్తం నిర్మిత విస్తీర్ణానికి వర్తించే అన్ని రుసుములు, ఛార్జీలు వసూలు చేస్తారు.రెండు సందర్భాల్లోనూ, తప్పనిసరి సెట్ బ్యాక్ లో (ఫ్రంట్ సెట్ బ్యాక్ మినహా) 10 శాతం లోపు వ్యత్యాసాలు ఉన్న భవనాలకే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ను పరిగణనలోకి తీసుకుంటామని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు నాన్ హైరైజ్ భవనాలకు మాత్రమే వర్తిస్తాయని వెల్లడించింది. ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో పౌరులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే అవకాశం కలుగుతుందని, మౌలిక సదుపాయాల కనెక్షన్లు సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు. -
ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ: జీహెచ్ఎంసీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకం 2025–26ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 90 శాతం మాఫీ లభించనుంది. ఈ పథకం ప్రకారం, పన్ను చెల్లింపుదారులు పూర్తి ప్రిన్సిపల్ ట్యాక్స్తో పాటు కేవలం 10 శాతం వడ్డీ మాత్రమే ఒక్కసారి చెల్లిస్తే, మిగిలిన 90 శాతం వడ్డీ పూర్తిగా మాఫీ చేయబడుతుంది.దీని ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను సులభంగా పరిష్కరించుకునే అవకాశం కలుగుతుంది. పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నగరాభివృద్ధికి సహకరించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. OTS పథకం కింద చెల్లింపులు MyGHMC యాప్, మీ సేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు (CSCs) మరియు ఆన్లైన్ విధానాల ద్వారా చేయవచ్చు. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా నగర మౌలిక సదుపాయాలు, పౌర సేవలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు తెలిపారు. -
చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసుల ఉక్కు పాదం
సాక్షి, హైదరాబాద్: చైనా మాంజా విషయంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దారాన్ని అమ్మినా.. కొనుగోలు చేసినా.. ఆ మాంజాతో పతంగులు ఎగరేసినవాళ్లపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. తాజాగా భారీగా నిషేధిత మాంజాను పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. చైనా మాంజాపై నిషేధం విధించి పదేళ్లు అవుతోంది. ఇండస్ట్రీయల్ అవసరం కోసం తయారైన దారాన్ని మాంజాగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇక మీదట నగరంలో అమ్మినా.. కొన్నా.. ఆ దారంతో పతంగులు ఎగరేసినా కేసులు పెడతాం. చైనా మాంజా కారణంగా ఎవరికైనా గాయాలైనా కేసులు పెడతాం. చైనా మాంజా విషయంలో పీడీ యాక్ట్ ప్రయోగించే ఆలోచన చేస్తున్నాం అని సజ్జనార్ హెచ్చరించారు. చైనా మాంజాపై బ్యాన్ ఉన్నప్పటికీ.. సంక్రాంతి సీజన్కు ఉన్న మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని దుకాణాదారులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో అవి తెగి మాంజా గాలిలో వేలాడుతున్నాయి. వాహనాలపై ప్రయాణించేవారికి చుట్టుకొని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే పక్షులు చనిపోతున్నాయి. తాజాగా.. నగరంలో అధికారులు పట్టుకున్న మాంజా విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి దుకాణాదారులు చైనా మాంజాను తెప్పించే క్రమంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు.. చైనా మాంజా తయారు చేస్తున్న రెండు ఫ్యాక్టరీలను సీజ్ చేసినట్లు.. గుజరాత్, రాజస్థాన్ తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ మాంజా ఫ్యాక్టరీలపై పోలీసుల ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
వికసిత్ భారత్ కాదు.. సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: అధికారం ఉంది కదా అని మోదీ సర్కార్ ఇష్టానుసారం వ్యవహరిస్తోందని.. పేదలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం మార్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా.. గురువారం గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. .. బ్రిటీష్ పాలన తరహాలో మోదీ పాలన ఉంది. ఎన్డీయే కూటమికి అనుకున్నంత మెజారిటీ రాకపోవడంతో రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు. అందుకే వేరే రూపంలో హక్కులను కాలరాస్తున్నారు. ఓటు హక్కు తీసేసే కుట్రలో భాగంగా ఎస్ఐఆర్ తీసుకొచ్చారు. కోట్లాది మంది పేదలను దేశ పౌరులే కాదని చూపించేందుకు కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతోంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతోందిఉపాధి హామీ పథకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. భూమిలేని పేదలకు ఆహార భద్రత కల్పించేందుకే కాంగ్రెస్ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం వల్ల గ్రామాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. వలసలు ఆగిపోయాయి.. వెట్టిచాకిరీ ఆగింది. దేశంలో 80 శాతం ప్రజలు ఈ పథకం ఆధారపడి బతుకుతున్నారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పథకాన్ని మార్చి పేదలకు అన్యాయం చేస్తున్నారు. పేదలపై కక్ష పూరితంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అదానీ, అంబానీలకు తక్కువ ధరకు కూలీలు దొరకడం లేదని పథకాన్ని మారుస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల కోసమే ఇలా చేస్తున్నారు. గతంలో వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. ఆ నల్ల చట్టాలను ఉపసంహరించుకునేలా చేయడమే కాకుండా మోదీతో జాతికి క్షమాపణ చెప్పించింది కాంగ్రెస్. ఇప్పుడు అదే పని చేయబోతున్నాం. మోదీ క్షమాపణలు చెప్పేంత వరకు వదిలేది లేదు. ఉపాధి హామీ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం. ఈ నెల 20 నుంచి గ్రామ సభలు నిర్వహిద్దాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నేను కూడా ఓ మండలం బాధ్యత తీసుకుంటా. అన్ని మండలాలకు ఒక్కొకకకరు బాధ్యత తీసుకోవాలి. ఫిబ్రవరి 3 నుంచి అన్ని జిల్లాల్లో రోజుకు లక్ష మందితో సభ పెడదాం. హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో సభలు పెడతాం. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేంత వరకు మోదీ సర్కార్పై యుద్ధం ఆగదు.. బీఆర్ఎస్ను వరుసగా అన్ని ఎన్నికల్లో ఓడించాం. మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలిచి తీరతాం. బీఆర్ఎస్, బీజేపీలకు రాజకీయాలే తప్ప ప్రజాసమస్యలు పట్టడం లేదు. వికసిత్ భారత్ కాదు.. సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నారు అని రేవంత్ అన్నారు. -
మిల్క్ డెయిరీ మేనేజర్పై దాడి.. పరిస్థితి విషమం
కీసర: మేడ్చల్ జిల్లాలోని కీసరలో దారుణం చోటు చేసుకుంది. పాత బకాయిల వ్యవహారంలో దొడ్ల మిల్క్ డెయిరీ మేనేజర్ శ్రీనివాస్పై తల్వార్తో దాడి చేశాడు పాల వ్యాపారి కిరణ్. మేనేజర్ శ్రీనివాస్పై కిరణ్ అతి కిరాతకంగా దాడి చేశాడు. ఈ ఘటనలో డెయిరీ మేనేజర్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.పాల వ్యాపారి భారీగా బకాయిలు పడటంతో ఆ విషయాన్ని మేనేజర్ శ్రీనివాస్ అడిగాడు. దాంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన కిరణ్.. తన వెంట తెచ్చుకున్న తల్వార్తో దాడికి దిగాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో శ్రీనివాస్కు బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని సదరు డైరీ వర్గాలు స్పష్టం చేశాయి. -
సంక్రాంతికి 150 ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..
హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారికి దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. సుమారు 150 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి (సీపీఆర్ఓ) ఎ శ్రీధర్ మీడియాకు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యే కాకుండా దేశంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ భారత ప్రాంతాలకు కూడా రైళ్లను నడపనున్నట్లు వివరించారు.తిరుపతి, షిరిడీలకు..పండుగ సమయంలో రద్దీగా ఉండే తిరుపతి, షిరిడీ తదితర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు శ్రీధర్ తెలిపారు. పండుగ సీజన్లో 150 ప్రత్యేక రైళ్లతో మొత్తం 600 రైళ్లు నిరంతరాయంగా నడుస్తాయని, తద్వారా సికింద్రాబాద్ లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ స్థాయిలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.స్టేషన్లలో రద్దీ నివారణకు..కాగా పండుగ రద్దీ సమయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రైల్వే శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని ముఖ్య రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లకు మళ్లించారు. మరికొన్ని రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్ల నుండి నడపాలని అధికారులు నిర్ణయించారు. స్టేషన్లలో రద్దీని తగ్గించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.రహదారి మార్గంలో..ఇదిలావుండగా, సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రోజుకు సుమారు లక్ష వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు తాను స్వయంగా మోటారు సైకిల్పై పర్యటిస్తానని ప్రకటించారు.నితిన్ గడ్కరీకి లేఖటోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా 'ఫ్రీవే' విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై చర్చించేందుకు త్వరలోనే కేంద్ర మంత్రితో భేటీ కానున్నట్లు, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున నామమాత్రపు చెల్లింపులు చేసి, ప్రయాణికులకు ఊరట కలిగిస్తామని అన్నారు. వీటితో పాటు ప్రతిష్టాత్మక మేడారం జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి రవాణా ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండుగలు, జాతరల వేళ ప్రజల ప్రయాణం సాఫీగా సాగేలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదని అన్నారు. ఇది కూడా చదవండి: Republic Day 2026: ఉగ్ర ముప్పు.. భారీగా భద్రతా బలగాల మోహరింపు -
హైదరాబాద్లో మెరుగ్గా ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు గతేడాది మెరుగ్గా కొనసాగాయి. 2024తో పోల్చితే 4 శాతం పెరిగి 38,403 యూనిట్లకు చేరాయి. ఇళ్ల ధర చదరపు అడుగునకు (ఎస్ఎఫ్టీ) 13 శాతం పెరిగి రూ.6,271కు చేరుకుంది. దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో చూస్తే మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు గతేడాది ఒక శాతం తగ్గి 3,48,207 యూనిట్లకు పరిమితమయ్యాయి.ఇళ్ల ధరలు మాత్రం ఎస్ఎఫ్టీకి 19 శాతం పెరిగాయి. రేట్లు పెరగడంతో డిమాండ్ నెమ్మదించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ గృహ రుణాలపై రేట్లు తగ్గడం, బలమైన ఆర్థిక వృద్ధితో ఇళ్ల డిమాండ్ను స్థిరంగా కొనసాగేలా చేసింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ఫ్రాంక్ విడుదల చేసింది. ప్రధాన ప్రాంతాల్లోని ఇళ్ల అమ్మకాల డేటా ఆధారంగా ఈ వివరాలు ప్రకటించింది. పట్టణాల వారీ.. ముంబై మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఒక శాతం పెరిగి 97,188 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు ధర 7 శాతం పెరిగి రూ.8,856కు చేరింది. బెంగళూరులో ఇళ్ల విక్రయాలు ఎలాంటి మార్పు లేకుండా 55,373 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధర ఎస్ఎఫ్టీకి 12 శాతం పెరిగి రూ.7,388గా ఉంది. పుణెలో ఇళ్ల అమ్మకాలు 3 శాతం తగ్గి 50,881 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇక్కడ ధర 5 శాతం పెరిగి రూ.5,016కు చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అమ్మకాలు 9 శాతం తగ్గి 52,452 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధర ఎస్ఎఫ్టీకి 19 శాతం ఎగసి రూ.60,28గా ఉంది. అహ్మదాబాద్లో విక్రయాలు 2 శాతం పెరిగి 18,752 యూనిట్లుగా నమోదయ్యాయి. ధర 3 శాతం పెరిగి రూ.3,197కు చేరింది. చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 12 శాతం పెరిగాయి. 18,262 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇళ్ల ధర ఎస్ఎఫ్టీకి 7 శాతం వృద్ధితో రూ.5,135గా ఉంది. కోల్కతాలో అమ్మకాలు 3 శాతం పడిపోయి 16,896 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధర 6 శాతం పెరిగి ఎస్ఎఫ్టీకి రూ.4,037గా నమోదైంది. -
ప్రణయ్ హత్య కేసులో శ్రవణ్కుమార్కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు నిందితుడు శ్రవణ్కుమార్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్, మరో రూ.25 వేలకు రెండు పూచీకత్తులు సమరి్పంచాలని ఆదేశించింది. కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ హత్య కేసులో జిల్లా కోర్టు గతేడాది తీర్పు వెలువరించడం తెలిసిందే. తనకు విధించిన జీవిత ఖైదును సవాల్ చేస్తూ శ్రవణ్కుమార్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. విచారణ ముగిసే వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) వేశారు. ఈ ఐఏపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. నిందితుడు గతంలో జైల్లో ఉన్న విషయాన్ని, అతని వయసును పరిగణనలోకి తీసుకుని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
ప్రేమ కథ.. విషాదాంతం
యాచారం, హయత్నగర్: ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణాలను బలిగొనడంతో పాటు ఇరుకుటుంబాల్లో తీరని విషాదం నింపింది. నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన సిద్దగోని యాదయ్య, పార్వతమ్మల కుమారుడైన మహేశ్ (20), పోతురాజు మహేశ్, అలివేలు కూతురు పూజ (17) ప్రేమించుకున్నారు. పూజ ఇంటర్ సెకండియర్, మహేశ్ డిగ్రీ చదువుతున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలియడంతో ఇరు కుటుంబాల పెద్దలు తీవ్రంగా మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రాణాలతో బయటపడి, పరిస్థితి సద్దుమణుగుతోందనుకుంటున్న సమయంలో మహేశ్ మళ్లీ పూజకు ఫోన్ చేసి, తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే చనిపోతానని వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో పూజ తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో మహేశ్ వేధింపులు తీవ్రం చేయగా, మనస్తాపానికి గురైన పూజ మంగళవారం ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు చనిపోవడం, పోలీసులు తనకోసం వెదకడంతో ఆందోళనకు గురైన మహేశ్ మంగళవారం గ్రామం వదిలి, హయత్నగర్లోని స్నేహితుల ఇంటికి వెళ్లాడు. పూజ మృతితో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దీంతో భయాందోళనకు గురైన అతను బుధవారం ఉదయం హయత్నగర్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని, తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. లొకేషన్ ఆధారంగా వెళ్లిన పోలీసులకు మృతదేహం లభ్యమైంది. 24 గంటల్లో ఇద్దరి మృతితో నక్కర్తమేడిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
HYD: నలుగురు విద్యార్థుల దుర్మరణం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మీర్జాగుడా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన నక్షత్ర అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ ఇక్ఫాయి యూనివర్సిటీ విద్యార్థలు శ్రీ నిఖిల్,సూర్యతేజ,సుమిత్,రోహిత్,నక్షత్ర కోకాపేటలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం, ఓ స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగి నగరానికి వస్తుండగా ఘోరం జరిగింది. మితిమీరిన వేగంతో మీర్జాగుడా వద్ద ఢీవైడర్ను ఢీకొట్టింది. వేగం ఎక్కువగా ఉండటంతో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.దీంతో కారు బోల్తా పడి నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. నక్షత్ర అనే యువతికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు యువతిని అత్యవసర చికిత్స ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. -
బయో ఇంజనీర్డ్ ఊపిరితిత్తులు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సమీప భవిష్యత్తులో బయో ఇంజనీర్డ్ ఊపిరితిత్తులు, రక్తనాళాల నమూనాల అభివృద్ధే లక్ష్యంగా కీలక అడుగు పడింది. ఊపిరితిత్తుల ఆరోగ్య సంబంధ పరిశోధనల కోసం దేశంలోనే తొలి బయోఇంజనీరింగ్ పరిశోధన కేంద్రం (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో బుధవారం ప్రారంభమైంది. జర్మనీకి చెందిన జస్టస్ లీబిగ్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ లంగ్హెల్త్ (ఐఎల్హెచ్), ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, ఇన్స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ ప్రతినిధులు ప్రొఫెసర్ వెర్నర్ సీగర్, ప్రొఫెసర్ సోని సవాయ్ పుల్లంశెట్టి సమక్షంలో పద్మవిభూషణ్ అవార్డుగ్రహీత, ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న గాలి కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని.. ఈ పరిస్థితుల్లో ఊపిరితిత్తుల ఆరోగ్య పరిశోధనలపై దృష్టి సారించడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. ఊపిరితిత్తుల ఆరోగ్య రంగంలో కీలక పరిశోధనలు విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ లంగ్హెల్త్ (ఐఎల్హెచ్)తో కలిసి ఏర్పాటు చేసిన ఈ కేంద్రం క్లినికల్ పరిశోధన, రోగుల ప్రయోజనాలకు కీలక పరిష్కారం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ పరిస్థితులకు ప్రపంచస్థాయి పరిష్కారాలే లక్ష్యం.. ఇప్పటివరకు ఊపిరితిత్తులు పాడైన రోగులకు అవయవ మార్పిడి చికిత్స విధానమే అందుబాటులో ఉండగా బయో ఇంజనీర్డ్ ఊపిరితిత్తులు, రక్తనాళ నమూనాల అభివృద్ధి పూర్తిస్థాయిలో జరిగితే ఊపిరితిత్తుల చికిత్సలో సరికొత్త విప్లవం రానుందని నిపుణులు చెబుతున్నారు. మెకానోబయాలజీ, లేబుల్–ఫ్రీ ఇన్వివో ఇమేజింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జంతు పరిశోధన సదుపాయాలు ఐఐటీహెచ్లో ఉన్నాయి. అలాగే ఐఐటీహెచ్లోని మైక్రోఫ్లూయిడిక్స్ ల్యాబ్, 3డీ ప్రింటింగ్ వంటి సదుపాయాలను కూడా ఈ పరిశోధన కేంద్రం ఉపయోగించుకోనుంది. నాన్–ఇన్వేసివ్ డయాగ్నొస్టిక్స్, ఆధునిక చికిత్సా విధానాల అభివృద్ధికి ఈ కేంద్రం బాటలు వేయనుంది. వాయు కాలుష్యానికి తోడు, ధూమపానం, ఆహార అలవాట్ల కారణంగా దేశంలో లక్షలాది మంది ఊపిరితిత్తుల కేన్సర్లు, ఆస్తమా వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. దేశీయంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ ప్రపంచస్థాయిలో పరిష్కారాలను చూపడమే లక్ష్యంగా ఈ కేంద్రంలో పరిశోధనలు సాగనున్నాయి. -
దరి చేరని 'ధరణి' కష్టం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకుని ఫీజు చెల్లించిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఆ రిజిస్ట్రేషన్లు చేసుకోలేకపోయిన రైతుల సమస్య ఏళ్లు గడిచినా తీరడం లేదు. ఎప్పుడో కట్టిన చలాన్ల డబ్బులు వాపస్ కూడా రావడం లేదు. శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రకారమే ఇంకా 27 వేల మంది రైతుల విజ్ఞప్తులు పెండింగ్లో ఉన్నాయి. తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలని ఇంకా దరఖాస్తు చేసుకోనివారు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారని తెలుస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీలో వివరణ ఇచ్చిన ప్రకారమే ఇంకా రూ.87 కోట్లకు పైగా రైతుల సొమ్ము ప్రభుత్వ ఖజానాలో ఉండిపోవడం గమనార్హం. ధరణి కష్టం.. భూభారతిలోనూ కలగని మోక్షం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసాయ భూములను కూడా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేయడం ప్రారంభించారు. ఈ భూముల క్రయ విక్రయాల కోసం రైతులు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ సమయంలోనే సదరు భూమి రిజిస్ట్రేషన్ కోసం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును చలాన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ చలాన్ (డీడీ) రూపంలో ఫీజు చెల్లింపు ప్రక్రియ ఎప్పటి నుంచో ఉన్నా..ఒకవేళ అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్కు వెళ్లలేకపోతే ఆ డీడీలను వెంటనే నగదు రూపంలోకి మార్చుకునేవారు. కానీ ధరణి పోర్టల్లో ఒకసారి కట్టిన చలాన్లను నగదు రూపంలోనికి మార్చుకునే ఆప్షన్ లేకపోవడంతో అప్పట్లో రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకున్న వారి డబ్బులు అలాగే ప్రభుత్వం వద్దే ఉండిపోయాయి. ఈ డబ్బుల కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ డబ్బు చెల్లించే అధికారం తమకు లేదంటూ తహశీల్దార్ల నుంచి సీసీఎల్ఏ కార్యాలయం వరకు చేతులెత్తేశారు. దీంతో కొందరు కోర్టుకు వెళ్లి తమ డబ్బులు చెల్లించాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ను అమల్లోకి తెచ్చింది. ఈ పోర్టల్లో చలాన్లను నగదు రూపంలోకి మార్చుకునే ఆప్షన్ ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకునే వారికి తహశీల్దార్ల ప్రొసీడింగ్స్తో సీసీఎల్ఏ కార్యాలయం ద్వారా నగదు రూపంలోకి మారుస్తున్నారు. అయితే డీడీలు తీసిన ఆరు నెలల్లోపు దరఖాస్తు చేసుకున్న వారికే ఈ అవకాశం కల్పిస్తున్నారు. అయితే, ధరణి పోర్టల్ అమల్లో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్న వారి నగదు విషయంలో మాత్రం ఇప్పటికీ ఇబ్బందులు వస్తున్నాయని రెవెన్యూ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఆ దరఖాస్తులు పరిష్కరించరా? తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 31,314 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, అందులో 4,574 దరఖాస్తులను పరిష్కరించి రూ.12.97 కోట్లను రైతులకు చెల్లించారు. కానీ మరో 26,740 మంది రైతులకు సంబంధించిన రూ. 87.60 కోట్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఈ దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించి తమ డబ్బులను తమకు ఇప్పించాలని కోరుతూ రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఇంకా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆయా చలాన్లను నగదు రూపంలోకి మార్చే అధికారం సీసీఎల్ఏకు కట్టబెట్టడంతో సదరు ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పడుతోందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని తమ డబ్బులను ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. -
సీఎం రేవంత్రెడ్డి సోదరుడికి సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో బాధితులతో పాటు రాజకీయ నాయకులు, వారి సంబం«దీకుల నుంచీ వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డికి కూడా బుధవారం నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11కి సిట్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరింది. మరోపక్క బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్లతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, ఎమ్మెల్సీ నవీన్రావు తండ్రి కొండల్రావు తదితరులనూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ 16న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆ రోజు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో సిట్ వేగం పెంచింది. ప్రత్యేకంగా ఆర్ఆర్ మాడ్యూల్ ప్రభాకర్రావు 2023 ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, సంబంధీకులు, అనుచరులపై నిఘా ఉంచారని, దీనికోసం ప్రత్యేకంగా ‘ఆర్ఆర్ మాడ్యూల్’పేరుతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అప్పట్లో ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్కు (ఎస్వోటీ) నేతృత్వం వహించిన డీఎస్పీ డి.ప్రణీత్రావు దీన్నీ పర్యవేక్షించారు. ప్రభాకర్రావు హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా అనేక మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని, వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు, బిల్డర్లు, రియల్టర్లు కూడా ఉన్నారని సిట్ చెబుతోంది. ఈ క్రమంలోనే వారికి వచ్చే ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్ తదితరాలను పర్యవేక్షించడానికి కొందరు ఎస్ఐబీ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఇందులో భాగంగానే రేవంత్రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్రెడ్డి సహా మరికొందరు నంబర్లు కలిపి ఏర్పాటు చేసిన మాడ్యూల్కు ప్రభాకర్రావు ‘ఆర్ఆర్ మాడ్యుల్’అనే పేరు పెట్టినట్లు తెలుస్తోది. ఈ విధంగా ఏర్పాటు చేసిన మాడ్యూళ్లలో ఉన్న వారి ఫోన్లను సర్వకాల సర్వావస్థల్లోనూ పర్యవేక్షిస్తూ ఉండటానికి డీఎస్పీ ప్రణీత్రావు నేతృత్వంలో 20 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కొందరు అత్యాధునిక ఉపకరణాలతో రేవంత్రెడ్డి, కొండల్రెడ్డి ఇళ్ల సమీపంలో తాత్కాలిక వార్రూమ్స్ ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కొండల్రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. -
పురం.. సత్వరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల ఖరారు, పోలింగ్ సామగ్రిని సమకూర్చుకోవడం వంటి అంశాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బుధవారం కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని.. జిల్లా కలెక్టర్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం– 2019లోని సవరించిన సెక్షన్ 195–ఎ ప్రకారం మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12వ తేదీలోగా తప్పనిసరిగా ప్రచురించాలని సూచించారు. రాణీ కుముదిని ఈ నెల 13వ తేదీన పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి, వాటిని ‘టి పోల్’యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని చెప్పారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమైన రిటరి్నంగ్ అధికారులు, సహాయ రిటరి్నంగ్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను వెంటనే నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. పోలింగ్ కోసం అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు. నేడు రాజకీయ పార్టీలతో భేటీ ఇప్పటికే జిల్లా స్థాయిలో రాజకీయ పక్షాలతో ఈ నెల 5న సమావేశాలు నిర్వహించగా, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరగనుంది. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఇదిలావుంటే ఈ నెల 16 నాటికి ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లపై స్పష్టత రానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి కార్యాచరణపై ఎస్ఈసీ దృష్టి పెట్టనుంది. పాత రిజర్వేషన్ల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మున్సిపాలిటీ వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఖరారు చేస్తారు. మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ప్రభుత్వం నుంచి అందే రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా కొత్త పాలకమండళ్లు! మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు చేసి ఈ నెల మూడోవారంలోగా షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి వచ్చే నెలాఖరుకు కొత్త పాలక మండళ్లకు పురపాలన బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నల్లగొండ జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ హోదాకు అప్గ్రేడ్ చేస్తూ మంగళవారం ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ‘తెలంగాణ పురపాలికల చట్ట సవరణ’బిల్లును ఆమోదించారు. గతంలో నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా, ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లోనూ 48 డివిజన్లుగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహిస్తారు. -
తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదీలీలు జరిగాయి. 20 మంది అధికారులను ఇతర ప్రదేశాలకు మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటితో పాటు నాలుగు కమిషనరేట్ల పరిధిలోని డీసీపీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు.. చేవేళ్ల డీసీపీగా యోగేష్, కూకట్పల్లి డీసీపీగా రీతిరాజ్, శేరిలింగంపల్లి డీసీపీగా చింతమనేని శ్రీనివాస్, బేగంపేట డీసీపీగా రక్షితామూర్తి, రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ డీసీపీగా సురేష్, సిద్ధిపేట సీపీగా రష్మీ పెరుమాళ్, హెదరాబాద్ ఎస్పీ డీసీపీగా విజయ్ కుమార్లను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
గొర్రె, మేకల రక్తం మాఫియా.. ఖంగుతిన్న అధికారులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గొర్రె, మేకల రక్తం మాఫియా వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠాపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. సీఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్టు కంపెనీపై దాడులు చేసిన 1000 లీటర్ల రక్తాన్ని సంబంధించిన ప్యాకెట్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది.వివరాల ప్రకారం.. కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారుల సూచనలతో హైదరాబాద్ పోలీసులు, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడ ప్రాంతంలోని CNK ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో రక్త నిల్వలు బయటపడ్డాయి. సుమారు 1000 లీటర్లకు పైగా గొర్రె, మేక రక్తంతో నిండిన ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో రక్తం నిల్వ చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే, ఈ రక్తంతో క్లినికల్ ట్రయల్స్ ఏమైనా చేస్తున్నారనే అనుమానాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు వ్యక్తం చేశారు. సీఎన్కే కంపెనీ యజమాని నికేష్ పరారీలో ఉన్నాడు. రెండు రోజులుగా నికేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికేష్ దొరికితే రక్త సేకరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కీసరలోని నిర్మానుష్య ప్రాంతం నుంచి నికేష్.. గొర్రెలు, మేకల రక్తాన్ని తెప్పించుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. -
మైనర్లతో అసభ్యకర ఇంటర్య్వూలు.. యూట్యూబర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా యూట్యూబ్లో చిన్న పిల్లల చేత అసభ్యకరమైన కంటెంట్ ఇంటర్వ్యూలు చేస్తున్న వారికి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఇదే సమయంలో వ్యూస్ వేటలో నైతిక విలువలు మరిచి కంటెంట్, వీడియోలు చేసిన యూట్యూబర్ను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.వివరాల మేరకు.. యూట్యూబ్లో వ్యూస్ కోసం బరితెగిస్తున్న కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు షాకిచ్చారు. వైరల్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేసి.. వీడియోలు అప్లోడ్ చేసిన కంబేటి సత్యమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కగా, 15 నుంచి 17 ఏళ్ల బాలబాలికలతో ఇంటర్వ్యూ చేసిన సత్యమూర్తి.. అసభ్య ప్రశ్నలు, అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ క్రమంలో సీసీఎస్ పోలీసులు.. వారిపై పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ల విషయంలో ఇలాంటి చట్టవిరుద్ధమైన ఇంటర్వూలకు పాల్పడినా.. కంటెంట్ క్రియేట్ చేసినా.. కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. -
ఈసీ సమావేశం.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ఎన్నికల సంఘం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 2019 నాటి ఓటరు జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్లతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్బంగా మున్సిపల్ ఎన్నికల కోసం 2019 నాటి ఓటరు జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. అలాగే, ఈనెల 16వ తేదీన ఓటరు తుది జాబితాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా ప్రచురించాలి. టీపోల్ యాప్లో పోలింగ్ స్టేషన్ల వివరాలు అప్లోడ్ చేయాలని తెలిపింది. ఇక, పోలింగ్ స్టేషన్లలో బీఎల్వోల ద్వారా ఓటరు వివరాలను పరిశీలన చేయాలని సూచించింది. అలాగే, ఆన్లైన్లో కూడా ఓటరు నమోదు, మార్పులకు అవకాశం ఇచ్చింది. FST, SST బృందాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.12-01-2026 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ13-01-2026న క్లెయిమ్స్, అభ్యంతరాల పరిశీలన ప్రారంభం16-01-2026న తుది ఓటరు జాబితా విడుదల చేయాలని ఆదేశం. -
TGSRTC: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ ఏడాది సంక్రాంతికి పండుగకు 6431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది.హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనుంది.2003లో జీవో ప్రకారం ఛార్జీల పెంపు.. ప్రధాన పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడిపిస్తుంది. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.5 రేట్ల వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి ప్రధాన పండుగకు 1.5 రేట్ల వరకు టికెట్ ధరలను ఉమ్మడి కార్పొరేషన్గా ఉన్నప్పటి నుండి అమలు చేస్తుంది. టీజిఎస్ఆర్టీసీ ఏర్పడిన నాటి నుండి ప్రతి ప్రధాన పండుగకు దీన్ని అమలు చేస్తుంది.ఆ బస్సుల్లో ఉచిత ప్రయాణం..ఈ సంక్రాంతి పండుగకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5 రేట్లు వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 9, 10, 12,13 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ను www.tgsrtcbus.in వెబ్ సైట్లో బుక్ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని సూచించింది. -
సిట్ దూకుడు.. సీఎం సోదరుడు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. రేపు(గురువారం) తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ అధికారులను దఫదఫాలుగా ప్రశ్నించిన సిట్.. రాజకీయ నేతలను సైతం సిట్ విచారించడం మొదలుపెట్టింది. మొన్నీమధ్యే ఎమ్మెల్సీ నవీన్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించబోతుండడం విశేషం. అయితే.. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అధికారులు గతంలోనే విచారించారు. ఈ కేసులో మరో నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్లో లింకు దొరికిన నేపథ్యంలో.. ఆ ఆధారాలను ముందుపెట్టి ఈ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. అయితే.. తాజాగా ఈ కేసులో సిట్ను తెలంగాణ ప్రభుత్వం మార్చింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారుల బృందానికి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును అప్పగించింది. అప్పటి నుంచి పొలిటికల్ లీడర్లను ప్రశ్నించడం మొదలైంది. ఇక సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సైతం సిట్ నుంచి పిలుపు వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో రేవంత్రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురైనట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనను సైతం తమ ఎదుట హాజరు అయ్యి తాము అడిగే ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలని సిట్ కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి హరీష్రావును విచారించాలన్న సిట్ ప్రయత్నం ఫలించలేదు. ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేయగా, తాజాగా ఆ తీర్పును ఇటు సుప్రీం కోర్టు సమర్థించడంతో ఊరట లభించినట్లైంది. ఇక.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావును సిట్ రెండు దఫాలుగా కస్టోడియల్ ఎంక్వైరీ జరిపింది. ఆ విచారణకు సంబంధించిన నివేదికను ఈ నెలాఖరులోపే దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ రాజకీయ మలుపు తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ఐబొమ్మ రవికి మరో షాక్
సాక్షి, హైదరాబాద్: పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి హైకోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. అయితే, కేసు దర్యాప్తు దశలో ఉందని కోర్టు దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని.. బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.కాగా, ఇమంది రవి విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ప్రహ్లాద్తో పాటు మరో ఇద్దరి పేర్లు, వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్థారించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లు, వివరాలు వాడి తన ఫొటోతో వీటిని పొందాడు. వీటిని ఉపయోగించి తన ఫొటోతో కొన్ని గుర్తింపు కార్డులతో దరఖాస్తు చేసి తీసుకోగా.. మరికొన్ని తయారు చేశారు.గతంలో రవి అమీర్పేట్లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్తో పరిచయమైంది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్ 2017లో అమీర్పేటలోని హాస్టల్ రూమ్లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్కు సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డు కలర్ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. కరీంనగర్కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేశాడు.ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్మేట్ అయిన కాళీప్రసాద్ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురి పేర్లు, వివరాలు వాడే వెబ్సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్.ఇన్, సప్లయర్స్.ఇన్ తదితర వెబ్సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ రెండూ విజయం సాధించకపోవడంతోనే రవి ‘ఐబొమ్మ’ను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికి రూ.13 కోట్లు గుర్తించారు. వీటిలో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేయగా.. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడు. -
KPHB: ఆలయంలో భారీ చోరీ.. గర్భగుడి తాళాలు పగులగొట్టి..
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్లోని ఆలయంలో చోరీ జరిగింది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో గర్భగుడి తాళాలు పగులగొట్టి విగ్రహానికి ఉన్న నగలు అపహరించారు. సుమారు రూ.30 లక్షల విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుడిలోకి ప్రవేశించి చోరీ చేసినట్లు గుర్తించారు.తెల్లవారుజామున రోజు వారిలానే ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహించే క్రమంలో పూజారులు గుర్తించారు. వెంటనే ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
భార్యకు వంటరాదని విడాకులా?
సాక్షి, హైదరాబాద్: భార్య వంట చేయలేదని చెప్పి భర్త విడాకులు కోరడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ప్పు డు భార్య వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చునని చెప్పింది. అంతేకాకుండా వంట చేయకుండా తన తల్లికి ఆమె సహకరించడం లేదని చెప్పి భార్య క్రూరత్వానికి పాల్పడిందనే భర్త వాదనను తోసిపుచ్చింది. వివరాలు ఇలా...ఎల్ఎల్బీ గ్రాడ్యుయేట్..సాఫ్ట్వేర్ ఉద్యోగినిని 2015, మేలో వివా హం చేసుకున్నారు. వైద్య సమస్యల కారణంగా 2017లో ఆమెకు గర్భస్రావమైంది. ఆ తర్వాత గృహ కలహాలతో 2018, అక్టోబర్ నుంచి ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో విడాకులు కోరుతూ భర్త మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో దావా వేశారు. జిల్లా కోర్టు విడాకులకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ భర్త హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మా సనం విచారణ చేపట్టింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భార్య తనకు వంట చేయడంలో విఫలమైందని, తన తల్లికి రోజువారీ పనుల్లో సహకరించడం లేదన్న అతని ఆరోపణను తప్పుబట్టింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని కావడంతో విభిన్న పనివేళల దృష్ట్యా ఆమె వంట చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించలేమని, దానిని క్రూరత్వంగా పేర్కొనలేమని అభిప్రాయపడింది. చిన్న చిన్న సమస్యలతో విడాకుల వరకు వెళ్లవద్దని సూచిస్తూ.. అప్పీల్ను కొట్టివేసింది. -
ప్రాణం తీసిన వేధింపులు
రంగారెడ్డి జిల్లా: తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువకుడు పెడుతున్న వేధింపులను భరించలేక, తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన సిద్దగోని మహేశ్, ఇదే గ్రామానికి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థిని పూజ(17)ను కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆమె తనకు దక్కుతుందో.. లేదోనని ఆందోళనకు గురైన మహేశ్ నెల రోజుల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చేరి్పంచగా, కోలుకుని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తరచూ పూజకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చచ్చిపోతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది తెలిసిన మహేశ్ యువతిపై మరింత ఒత్తిడి పెంచడంతో మనోవేదనకు గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు, ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. కాగా, మహేశ్ బెదిరింపులతోనే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు మంగళవారం ఉద యం పూజ మృతదేహంతో యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. సీఐ, గ్రామస్తు లు నచ్చజెప్పడంతో శాంతించారు. మహేశ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఫ్రీ కదా.. పోయొద్దాం
సాక్షి, హైదరాబాద్: స్టడీ టూర్ పేరిట ఇతర సిటీలను చూసేందుకు వెళ్లిన కార్పొరేటర్ల అవస్థలు అన్నీఇన్నీ కావు. వారిని చూసి పలువురు జాలి పడుతున్నారు. సాధారణంగా.. నగర పాలనకు సంబంధించి ఇతర సిటీల్లో అమలవుతున్న మెరుగైన విధానాలను అధ్యయనం చేసి, వాటిని హైదరాబాద్లో అమలు చేసే అంశాన్ని పరిశీలించేందుకు కార్పొరేటర్లు స్లడీ టూర్లకు వెళ్తారు. తాము అధ్యయనం చేసిన అంశాల్ని, వాటిని ఇక్కడ ఎలా అమలు చేయవచ్చో పేర్కొంటూ ఒక నివేదిక రూపొందించి కమిషనర్కు అందజేస్తారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి అమలు చర్యలు చేపడతారు. కార్పొరేటర్ల స్టడీటూర్కయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ ఖజానా నుంచే చెల్లిస్తారు. జీహెచ్ఎంసీలో చేయాల్సిన పనులకు కాబట్టి జీహెచ్ఎంసీ నుంచి ఖర్చు చేస్తారు. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఎందుకీ అభ్యంతరాలు ? కార్పొరేటర్ల టూర్లపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గతంలో స్టడీటూర్ల పేరిట ఆయా నగరాలు తిరిగి వచ్చి , ఇక్కడ చేసిందేమీ లేకపోవడం ఒక కారణం కాగా.. మరో నెలరోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న వారు ఇక చేసేదేముంటుందన్నది ప్రధాన అభ్యంతరం. ప్రజా ధనంతో ఇలాంటి టూర్లను అనుమతించరాదంటూ ఫోరమ్ ఫర్ గుడ్గవర్నెన్స్ సహా పలు సంస్థలు, ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో లోకాయుక్త సైతం ప్రజాధనంతో కార్పొరేటర్ల టూర్లను ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా.. మేయర్ సహా అహ్మదాబాద్ కు బయలుదేరారు. దిగిపోయేముందు ఈ టూర్లు అనవసరమని భావించి స్వచ్ఛందంగానే టూర్లను విరమించుకున్న కార్పొరేటర్లు కూడా ఉండటం విశేషం. టూర్ కోసం జీహెచ్ఎంసీ ఒక్కో కార్పొరేటర్కు దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కార్పొరేటర్లు టూర్లు చేయాలనుకుంటే కష్టమేం కాదు. ఏ కొందరో మినహా, ఎన్నికల్లో గెలిచేందుకు లక్షలకు లక్షలు ఖర్చు చేశారు. అలాంటి వారికి ఈ టూర్కయ్యే వ్యయం లెక్కలోది కాదు. అలాంటప్పుడు ఈ కక్కుర్తి ఏమిటన్నదే సాధారణ ప్రజల ప్రశ్న. పదవి దిగిపోయే ముందు అపప్రథ మూటగట్టుకోవడం తప్ప ఇప్పుడీ టూర్ ఎందుకన్నదానికి ‘స్టడీ’టూర్కు వెళ్లిన, వెళ్లనున్న వారేమైనా సమాధానం చెబుతారేమో వేచి చూడాల్సిందే. పేరుకు మాత్రమే.. జీహెచ్ఎంసీలో కొంతకాలంగా, మరీ ముఖ్యంగా ప్రస్తుత పాలకమండలి హయాంలో స్టడీ టూర్లంటే విహార యాత్రలనే ముద్ర పడేలా చేశారు. పేరు మాత్రం స్టడీ టూర్లంటూ ఇష్టమొచ్చినట్టు నగరాల్ని రెండు మూడు బ్యాచ్లుగా వెళ్లి వచ్చేలా అలవాటు చేశారు. వెళ్లనివారు అనివార్య కారణాల వల్ల వెళ్లలేదని పేర్కొంటూ ప్రయాణ చార్జీల్ని పొందిన ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. తాజాగా మంగళవారం 40 మందికి పైగా అహ్మదాబాద్ వెళ్లినట్లు సమాచారం. అహ్మదాబాద్లోని నర్మద రివర్ప్రాజెక్ట్ అధ్యయనం పేరిట వెళ్లారు. మిగతా వారు సంక్రాంతి పండగ తర్వాత వెళ్లేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. -
భార్యకు వంటరాదని విడాకులా? : హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: భార్య వంట చేయలేదని చెప్పి భర్త విడాకులు కోరడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు భార్య వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చునని చెప్పింది. అంతేకాకుండా వంట చేయకుండా తన తల్లికి ఆమె సహకరించడం లేదని చెప్పి భార్య క్రూరత్వానికి పాల్పడిందనే భర్త వాదనను తోసిపుచ్చింది. వివరాలు ఇలా...ఎల్ఎల్బీ గ్రాడ్యుయేట్..సాఫ్ట్వేర్ ఉద్యోగినిని 2015, మేలో వివాహం చేసుకున్నారు. వైద్య సమస్యల కారణంగా 2017లో ఆమెకు గర్భస్రావమైంది. ఆ తర్వాత గృహ కలహాలతో 2018, అక్టోబర్ నుంచి ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో విడాకులు కోరుతూ భర్త మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో దావా వేశారు. జిల్లా కోర్టు విడాకులకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ భర్త హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మా సనం విచారణ చేపట్టింది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భార్య తనకు వంట చేయడంలో విఫలమైందని, తన తల్లికి రోజువారీ పనుల్లో సహకరించడం లేదన్న అతని ఆరోపణను తప్పుబట్టింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని కావడంతో విభిన్న పనివేళల దృష్ట్యా ఆమె వంట చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించలేమని, దానిని క్రూరత్వంగా పేర్కొనలేమని అభిప్రాయపడింది. చిన్న చిన్న సమస్యలతో విడాకుల వరకు వెళ్లవద్దని సూచిస్తూ.. అప్పీల్ను కొట్టివేసింది. -
డ్రగ్స్ సరఫరా చేస్తున్న విదేశీ మహిళ డిపోర్టేషన్
సాక్షి, హైదరాబాద్: స్థానికంగా మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న నైజీరియాకు చెందిన ఓ మహిళను తెలంగాణ ఈగల్ ఫోర్స్ మన దేశం నుంచి బహిష్కరించింది. మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈమెను నైజీరియాకు తరలించారు. ఈ మేరకు ఈగల్ ఫోర్స్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నైజీరియాకు చెందిన ముగ్గురు మహిళలు నకిలీ పాస్పోర్ట్, నకిలీ వీసాలతో భారత్కు వచ్చారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నం చేరుకున్న వారు స్థానికంగా షెల్టర్ తీసుకున్నారు. ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకుని డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారు.నవంబర్ మొదటి వారంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో నిర్వహించిన భారీ ఆపరేషన్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్లో 50 మందికి పైగా నైజీరియన్లను అరెస్ట్ చేయగా.. విశాఖపట్నంలో డ్రగ్స్ దందా చేస్తున్న ముగ్గురు మహిళల సమాచారం తెలిసింది. ఈ మేరకు డిసెంబర్లో విక్టరీ ఇటోహాన్ ఇయాసేలే సహా ముగ్గురు విదేశీ మహిళలను ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. ముగ్గురికీ హైదరాబాద్లోని ఫారినర్స్ రీజినల్ రిజి్రస్టేషన్ ఆఫీస్లో (ఎఫ్ఆర్ఆర్వో) బయోమెట్రిక్ నిర్వహించారు.ఆమెకు జింబాబ్వేకు చెందిన దంబుజా తఫాడ్జ్వా పేరున నకిలీ పాస్పోర్ట్, వీసా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఎఫ్ఆర్ఆర్వో పాస్పోర్ట్ను పరిశీలించారు. ఇయాసేలే విక్టరీ ఇటోహాన్ నైజీరియాకు చెందిన మహిళను గుర్తించారు. ఎఫ్ఆర్ఆర్వో నుంచి అనుమతి తీసుకుని ముగ్గురిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లోని డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. విక్టరీ ఇటోహాన్ ఇయాసేలేకు ఎఫ్ఆర్ఆర్వో నుంచి ఎగ్జిట్ పరి్మట్ పొందిన తర్వాత నైజీరియాకు టికెట్ కొనుగోలు చేశారు. దాదాపు 37 రోజుల పాటు డిటెన్షన్ సెంటర్లో ఉంచిన తర్వాత మంగళవారం నైజీరియాలోని లాగోస్కు పంపించారు. -
ఏ విచారణకైనా రెడీ
హైదరాబాద్లో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. నిర్దేశిత ప్రమాణాలను మించిపోయింది. ఇటీవల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 263 నమోదైంది. వాహనాలతో 27% వాయుకాలుష్యం ఏర్పడుతుంటే, పరిశ్రమలతో 51% ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించడానికి 2012 నుంచే ప్రయ త్నాలు జరుగుతున్నాయి. మేం ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తాం. వాటికి ప్రత్యామ్నాయ పారిశ్రామికవాడలను సిద్ధంగా ఉంచాం.. – డిప్యూటీ సీఎం భట్టిసాక్షి, హైదరాబాద్: 2014 నుంచి, ఇటీవల తమ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్పీ తో పాటు ఇప్పటివరకు జరిగిన పారిశ్రామికవాడల్లోని భూముల వినియోగ మార్పిడిపై ఏ విచారణను ఆదేశించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడ్డగోలుగా చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉంటే.. ఆ మేరకు లేఖ రాసిన మరుక్షణం ఏ విచారణ సంస్థతో కావాలంటే ఆ సంస్థతో విచారణ చేయించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మంగళవారం శాసనసభలో హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి (హిల్ట్) విధానం (పీ), తెలంగాణ రైజింగ్–2047పై లఘు చర్చ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలకు భట్టి జవాబిచ్చారు. హిల్ట్ పీతో రూ.10,776 కోట్ల ఆదాయం: ‘ప్రతిపక్షం కడుపులో విషం పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని పట్టించుకోకుండా తమ రాజకీయం కోసం రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం లీజు భూములను ఫ్రీహోల్డ్ చేసింది. తమకు కావాల్సిన వాళ్లకు పారిశ్రామిక భూములను వినియోగ మార్పిడి చేసింది. సిరీస్, గల్ఫ్ ఆయిల్ పరిశ్రమలకు భూ వినియోగ మార్పిడి చేసిన అంశాన్ని హిల్ట్ పాలసీతో పోల్చినప్పుడు రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.4,076 కోట్ల నష్టం వాటిల్లింది. హిల్ట్ పీ కింద కాంగ్రెస్ ప్రభుత్వం.. 80 అడుగుల లోపు రహదారి ఉన్న భూములకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (ఎస్ఆర్వో) ధరలో 30 శాతం, 80 అడుగుల కంటే ఎక్కువ వెడల్పుతో రహదారి ఉన్నచోట ఎస్ఆర్వో ధరలో 50 శాతం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. ఈ భూములపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు. కేవలం భూ వినియోగ మార్పిడి చేస్తున్నందుకు ఈ ఫీజులు వసూలు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న భూ వినియోగ మార్పిడి ధరల ప్రకారం అయితే కేవలం రూ.574 కోట్ల ఆదాయం మాత్రమే రాష్ట్రానికి లభిస్తుంది. అదే హిల్ట్ పీ కింద దాదాపు 4,780 ఎకరాల భూములకు భూ వినియోగ మార్పిడికి అవకాశం కల్పించడం ద్వారా దాదాపు రూ.10,776 కోట్ల ఆదాయం లభిస్తుంది..’ అని డిప్యూటీ సీఎం తెలిపారు. హిల్ట్ పీ అత్యుత్తమం, పారదర్శకమైనది.. ‘హిల్ట్ పాలసీ రాగానే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఓ నాయకుడు ప్రెస్మీట్ పెట్టి రాష్ట్రంలోని భూములన్నింటినీ అమ్మేస్తూ రూ.5 లక్షల కోట్ల స్కామ్కు తెరలేపారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించి, బట్ట కాల్చి మీద వేసి తుడుచుకోమంటున్నారు. వారు రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కంటే.. సొంత ప్రయోజనాల కోసం ఎక్కువగా పాకులాడుతున్నారు. హిల్ట్ పీ వల్ల రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంటే.. గతంలో వారు చేసిన నిర్ణయాలతో భారీ నష్టం జరిగింది. గత ప్రభుత్వం అనుసరించి విధానాలతో పోలిస్తే హిల్ట్ పీ అత్యుత్తమమైనది. పారదర్శకమైనది. ఆదాయం సమకూరుతుంది. వారు ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్పేట పారిశ్రామిక వాడల్లో ప్రభుత్వ భూములు లీజులో ఉంటే...వాటిని వేలానికి పెట్టకుండా ఇష్టానుసారం ఇచ్చేశారు. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పారిశ్రామికవేత్తలకు అప్పగించారు. వనరుల సమీకరణకు 2019లో అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్రావు నేతృత్వంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీకి సంబంధం లేకుండా కేటీఆర్ పరిశ్రమల మంత్రిగా జీవో ఇచ్చి పారిశ్రామిక భూములను ఐటీ పరిశ్రమలకు మార్చేలా ఉత్తర్వులు ఇచ్చారు. వారికి అనుకూలమైన వారికి భూ మార్పిడి చేశారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. మేము తెచ్చిన పాలసీలో దోపిడీకి ఆస్కారం లేదు..’ అని భట్టి చెప్పారు. రాష్ట్రానికి ఉత్పాదక షాక్ అవసరం ‘ప్రస్తుతం రాష్ట్రం 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. వృద్ధి ఇలానే కొనసాగితే 2047 నాటికి 1.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగానే ఎదుగుతాం. ఇది సరిపోదని..3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్–2047 తీసుకొచ్చాం. కేవలం ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం ద్వారా ఈ లక్ష్యానికి చేరుకోలేం. మనకు ఒక ‘ఉత్పాదకత షాక్’ అవసరం. పెట్టుబడి రేటును జీఎస్డీపీలో 52 శాతానికి పెంచాలనే కఠిన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం..’ అని భట్టి తెలిపారు.తర్వలో హిల్ట్ పీ మార్గదర్శకాలు: శ్రీధర్బాబు పదేళ్ల పాటు సాగిన బీఆర్ఎస్ పాలనలో చాలాచోట్ల అడ్డగోలు భూకేటాయింపులు జరిపిన విషయం వాస్తవమని.. తొలుత మాట్లాడిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పరిశ్రమల పేరిట జరిగిన ఈ భూకేటాయింపులపై తప్పకుండా విచారణ చేపడతామని చెప్పారు. ‘హిల్ట్ పాలసీ ఏకపక్ష నిర్ణయం కాదు. నిపుణులు, మేధావులతో చర్చించిన తర్వాతే రూపొందించాం. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయి. మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులను పబ్లిక్ డొమైన్ (అందరికీ అందుబాటు)లో పెట్టం. అవి కేవలం ఇన్ కెమెరా (అంతర్గత) సూచనలు. వాటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పాజిటివ్గా చూడాలి. అప్పుడే నిర్ణయాల అమలు వేగవంతంగా, విజయవంతంగా పూర్తవుతుంది. పరిశ్రమల తరలింపుతో కార్మికులకు ఉపాధి ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన అవసరం లేదు. కారి్మక చట్టాలు తప్పకుండా అమల్లో ఉంటాయి..’ అని శ్రీధర్బాబు చెప్పారు. పూర్తి పారదర్శక పాలసీ: మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పారిశ్రామిక భూమి బదలాయింపు విధానం రాష్ట్ర సుస్థిర పురోగతితో పాటు పారిశ్రామిక కాలుష్య రహిత హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. పూర్తి పారదర్శకంగా ఉండేలా గొప్ప పాలసీకి రూపకల్పన చేశామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. లీజు హక్కులతో ఉన్న పారిశ్రామిక భూములకు ఈ కొత్త విధానం వర్తించదని, పూర్తిస్థాయి యాజమాన్య హక్కులతో భూములు కలిగిఉన్న పారిశ్రామిక భూములకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆ జీవోలో చీకటి కోణాలు: ఏలేటి ‘కాలుష్య కారక పరిశ్రమలను నగరం బయటకు పంపడం సరైన నిర్ణయమే. కానీ ఎలాంటి పర్యావరణ అధ్యయనాలు, కమిటీల నివేదికలు లేకుండా బయటకు తరలే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించకుండా హడావుడిగా హిల్ట్ పాలసీని తేవడంలో ఆంతర్యం ఏమిటి? ప్రభుత్వం జారీ చేసిన జీఓ 27లో అనేక చీకటి కోణాలు ఉన్నాయి. 22 పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపల ఎక్కడికి తరలిస్తారు? అత్యంత కాలుష్య కారక పరిశ్రమలున్న ఐడీఏ బొల్లారంను హిల్ట్ పాలసీలో చేర్చకపోవడం విడ్డూరం..’ అని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పరిశ్రమల భూములతో రియల్ ఎస్టేట్ దందా చేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పచ్చదనం పెంచాలి..’ అని సూచించారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన హిల్ట్ పాలసీని అందరూ స్వాగతించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తోందని, ఇదే తరహాలో కాలుష్యం పెరిగితే పదేళ్లలో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తుతాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆకాశానికి నిచ్చెన వేస్తే లాభం లేదు: పాల్వాయి హరీశ్బాబు ‘మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది. గ్లోబల్ సమ్మిట్లో విజన్ డాక్యుమెంట్–2047 విడుదల చేశారు. ఇప్పుడు అక్కడ టెంట్లు కూడా లేవు. ఆకాశానికి నిచ్చెన వేస్తే లాభం లేదు..’ అని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని మరో బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ అన్నారు. హిల్ట్ పాలసీకి చట్టబద్ధత లేదు: అక్బరుద్దీన్ ‘వనరుల సమీకరణకు ఈ ప్రభుత్వం భూముల వెనుక పరిగెడుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన హిల్ట్ పాలసీ జీఓకు ఎలాంటి చట్టబద్ధత లేదు. పాలసీ రూపకల్పనలో పారదర్శకత కనిపించడం లేదు. పాలసీలో పేర్కొన్న భూములు ప్రైవేటువా లేక ప్రభుత్వ భూములా అనే అంశంపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాలి..’ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుదీన్ ఒవైసీ అన్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన 50 ఎకరాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. నగర కాలుష్యాన్ని నివారించేందుకు ఉద్దేశించిన హిల్ట్ పాలసీకి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు చెప్పారు. కాగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. -
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ శాసనసభలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 2019 మున్సిపల్ చట్టంలో కీలక మార్పు చేస్తూ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఓటర్ల జాబితా సవరణకు 60 రోజుల ముందే సమాచారం ఇవ్వాలన్న నిబంధన తొలగించారు.దీంతో భారత ఎన్నికల సంఘానికి ముందస్తు సమాచారం అవసరం ఇక లేదు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. చట్ట సవరణతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి పూర్తి వెసులుబాటు వచ్చింది.కాగా, మున్సిపల్ ఎన్నికల దిశలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ నెలలోనే ఎన్నికలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని, ఫిబ్రవరిలో ఈ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వాత కచ్చితంగా షెడ్యూల్ ప్రకటించి ఆ వెనువెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 11న లేదంటే 20న షెడ్యూల్ ప్రకటించే అవకాశా లున్నాయి. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. -
హిల్ట్ పాలసీపై చర్చ .. ‘అవి ప్రభుత్వ భూములు కావు’
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక వేత్తల భూములను.. ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారని.. అవి ప్రభుత్వ భూములు కావు.. పరిశ్రమలకు అమ్మిన భూములు అంటూ మంత్రి శ్రీధర్బాబు స్పష్టత నిచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలన్నదే తమ ఆలోచన అని.. పర్యావరణం బాగుచేయాలనే ఆలోచనతోనే హిల్ట్ పాలసీ తీసుకువచ్చినట్లు తెలిపారు.‘‘హిల్ట్ పాలసీ కింద ఆరు నెలల గడువు ఇస్తాం. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే భూములు కన్వర్ట్ చేస్తాం. పాలసీ గురించి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. దశాబ్ధాల కిందటే గత ప్రభుత్వాలు వారికి భూములు అమ్మేశాయి. రాజకీయాల పక్కనపెట్టి ఆలోచించాలి’’ అని శ్రీధర్బాబు పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వలేని నాగరికత అసమర్థ నాగరికతే.. అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతోందని శ్రీధర్బాబు హెచ్చరించారు.‘‘డెవలప్మెంట్ అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదు. పిల్లలకు ఆస్తులు కాదు.. క్లీన్ ఎన్విరాన్మెంట్ నిజమైన వారసత్వం. బంగారు గిన్నెలో విషం పెట్టినట్లవుతోంది మన పరిస్థితి. ప్రకృతి నాశనమైతే తిరిగి రాదు. మనమంతా భూమి యజమానులు కాదు. కేవలం ట్రస్టీలమే. ఫ్యూచర్ జనరేషన్లకు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం మన బాధ్యత. ఇది కేవలం ల్యాండ్ యూజ్ మార్పు కాదు. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం...ఓఆర్ఆర్ లోపల పరిశ్రమలు.. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం. ఫ్యాక్టరీ గోడ పక్కనే ఇళ్లు.. ఇది సైంటిఫిక్ డిజాస్టర్. 1970లలో నగరం బయట పరిశ్రమలు.. నేడు నడిబొడ్డు ప్రాంతాలు బాలానగర్, సనత్నగర్, ఉప్పల్ ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్లు. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించడమే లక్ష్యం. పిల్లలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వడమే ప్రభుత్వ సంకల్పం. హిల్ట్పై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. మతలబు ఉందంటూ విమర్శలు బాధాకరం. తెలంగాణ నుంచే పర్యావరణ రక్షణకు చారిత్రక అడుగు.. మార్పు ఎప్పుడో కాదు.. ఇప్పుడే’’ అంటూ శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్లో విషాద ఘటన..
సాక్షి, హైదరాబాద్: టోలిచౌకిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు నిర్లక్ష్యానికి యువకుడు బలయ్యాడు. డెలివరీ బాయ్పైకి ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్తూ. అభిషేక్.. బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. గమనించకుండా.. ఆ యువకుడి తలపైకి డ్రైవర్ బస్సు ఎక్కించాడు. స్పాట్లోనే అభిషేక్ మృతి చెందాడు. ఆపకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేసిన బస్సు డ్రైవర్ను వాహనదారులు అడ్డగించి బస్సును నిలిపివేయించారు.ప్రమాదం తర్వాత రోడ్డుపై మృతదేహం పడి ఉన్నా.. వాహనదారులు పట్టించుకోలేదు. మానవత్వం లేకుండా వెళ్లిపోయారు. బతికి ఉన్నాడో.. చనిపోయాడోనని చూసే ప్రయత్నం కూడా చేయని వాహనదారులు.. మృతదేహం పక్కనుంచే వెళ్లిపోయారు. -
సీఎం రేవంత్రెడ్డికి కిషన్రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి లేఖ రాశారు. వరంగల్ కోట భూములు, అక్రమ కట్టడాలపై సీఎంకు లేఖ రాశారు కిషన్రెడ్డి. కోట భూముల్లో ఆక్రమణలు గుర్తించి తొలగించాలని విన్నవించారు. అక్రమ కట్టడాలను తొలగించి ఆ భూములను పురావస్తు శాఖ (ASI )కి అప్పగించాలన్నారు. వారసత్వ సంపద ను కాపాడటంలో పురావస్తు శాఖకు సహకరించాలని బహిరంగ లేఖ ద్వారా సీఎం రేవంత్కు విజ్ఞప్తి చేశారు కిషన్రెడ్డి. -
ఫాల్కన్ స్కాం.. మాస్టర్ మైండ్ అమర్దీప్ అరెస్టు
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్ని కుదిపేసిన ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఫాల్కన్ కంపెనీ ఎండీ అమర్ దీప్ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ దేశం నుండి ముంబైకి చేరుకున్న ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి, సమాచారం అందించడంతో తెలంగాణ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.అమర్ దీప్పై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసిన తెలంగాణ పోలీసులు.. ఆయనను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ముంబైకి పంపారు. చివరికి ఆయనను అదుపులోకి తీసుకోవడంతో కేసులో కీలక మలుపు తిరిగింది. ఫాల్కన్ కంపెనీ డిజిటల్ డిపాజిట్ల పేరుతో ప్రజల నుండి భారీగా డబ్బులు వసూలు చేసింది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని, ఎంఎన్సీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి అమర్ దీప్ ప్రజలను నమ్మబలికాడు. యాప్ ఆధారిత డిజిటల్ డిపాజిట్ల పేరుతో 850 కోట్ల రూపాయలు కొట్టేసినట్లు విచారణలో బయటపడింది. అమర్ దీప్ ప్రజలను ఆకర్షించడానికి పలు వ్యూహాలు ఉపయోగించాడు. యాప్ ద్వారా డబ్బులు పెట్టుబడులుగా తీసుకోవడం, షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికడం, పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు పెడతామని చెప్పి డబ్బులు వసూలు చేయడం వంటి పద్ధతులతో ఆయన ప్రజలను బురిడీ కొట్టించాడు. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే అమర్ దీప్ తన భార్యతో కలిసి చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్కు పారిపోయాడు. అప్పటి నుండి ఆయనపై పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. చివరికి ముంబైలో ఆయనను పట్టుకోవడంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.ఈ కేసులో ఫాల్కన్ కంపెనీ సీఈఓతో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు అమర్ దీప్ అరెస్టు చేశారు. అమర్దీప్ను అరెస్టు చేసిన పోలీసులు కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలికితీసే అవకాశం ఉంది. -
ఘోరం.. కొడుకు, కుమార్తెను ఉరేసి చెరువులో పడేసిన తండ్రి
సాక్షి,హైదరాబాద్: పిల్లా,పాపలతో హాయిగా సాగిపోతున్న సంసారంలో కుటుంబ సమస్యలు ఘోర విషాదాన్ని నింపాయి. కొడుకు,కుమార్తెను ఉరేసి చెరువులో పడేశాడో తండ్రి. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మరికల్ మండలం తీలేరు గ్రామంలో మంగళవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన శివరాములు తన కూతురు రితిక, కొడుకు చైతన్యను ఉరిసే స్థానిక చెరువులో పడేశాడు. అనంతరం, విద్యుత్ తీగను పట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు స్పందించి అతడిని మహబూబ్ నగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు.గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లల మృతదేహాలను చెరువులో నుండి వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తీలేరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సమస్యల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, చిన్నారుల అమాయక ప్రాణాలు ఇలా బలైపోవడం పట్ల ఆవేదన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.తీలేరు గ్రామంలో జరిగిన ఈ ఘటన కుటుంబ సమస్యలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో మరోసారి స్పష్టంచేసింది. శివరాములు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండగా, గ్రామం మొత్తం ఈ దారుణంతో కన్నీటి సంద్రమైంది. -
‘సహకారం’ ఏదీ..?
సాక్షి, హైదరాబాద్: సహకార ఆర్థిక సంస్థలు.. సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక విభాగాలివి. ఈ కార్పొరేషన్ల ప్రధాన లక్ష్యం స్వయం ఉపాధిని ప్రోత్సహించడం.. రాయితీ అందిస్తూ స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం... నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి యువతకు ఉపాధి మార్గాలను చూపించడం. కానీ ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన ఈ కార్పొరేషన్లు ఇప్పుడు అచేతన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాయితీపై రుణాల సంగతి అటుంచితే యువతకు కనీసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సైతం నిర్వహించలేకపోతున్నాయి. కాగితాల్లోనే వార్షిక ప్రణాళికలు.. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలతోపాటు వికలాంగులు, మహిళల కోసం 30 సహకార ఆర్థిక సంస్థలు ఉన్నాయి. గతంలో 17 కార్పొరేషన్లు ఉండగా ప్రజాప్రభుత్వం కొత్తగా 13 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 30కి చేరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ఏటా భారీ ఎత్తున వార్షిక ప్రణాళికలు రూపొందిస్తుండగా వాటిని ప్రభుత్వం ఆమోదిస్తోంది. కానీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయట్లేదు. దీంతో నిర్దేశించిన కార్యక్రమాలన్నీ అటకెక్కుతున్నాయి. 2024–25 వార్షిక సంవత్సరం చివర్లో రాజీవ్ యువ వికాసాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి రూ. 6 వేల కోట్ల మేర నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని కార్పొరేషన్ల పరిధిలో ఈ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానించగా ఏకంగా 16 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. 2025–26 వార్షిక బడ్జెట్లో నిధులు విడుదల చేస్తామని మొదట్లో చెప్పుకొచ్చిన సర్కారు... రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు మంజూరు పత్రాల జాడ లేకపోగా కనీసం ఈ పథకంపై ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవడం గమనార్హం. మరోవైపు రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా ఈ కార్పొరేషన్లు మారుతున్నాయనే విమర్శలున్నాయి. పదవుల పందేరంలో భాగంగా ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం... వారికి నెలవారీ జీతభత్యాల కింద భారీగా నిధులు ఇవ్వడం వరకే కార్పొరేషన్లు పరిమితమవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో చైర్మన్కు జీతభత్యాల కింద ఏటా సగటున రూ. 50 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఐదు కార్పొరేషన్లకే కార్యాలయాలు.. ⇒ బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 1974లో బీసీ కార్పొరేషన్ ఏర్పాటైంది. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో బీసీ కార్పొరేషన్తోపాటు ఎంబీసీ, రజక, నాయీ బ్రాహ్మణ, కల్లుగీత, వడ్డెర, సగర (ఉప్పర), వాలీ్మకి/బోయ, భట్రాజ, విశ్వబ్రాహ్మణ, కృష్ణబలిజ/పూసల, కుమ్మరి/శాలివాహన, మేదర, ముదిరాజ్, గంగపుత్ర, మున్నూరు కాపు, లింగాయత్, యాదవ, మేర, పద్మశాలి, పెరిక కార్పొరేషన్లతోపాటు ఈబీసీ సంక్షేమ బోర్డు కొనసాగుతున్నాయి. ఇందులో కేవలం ఐదింటికి మాత్రమే చైర్మన్లున్నారు. పెద్ద సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఐదింటికి మినహా మిగిలిన వాటికి కార్యాలయాలు సైతం లేవు. వాటిని బీసీ కార్పొరేషన్ కార్యాలయం నుంచే నిర్వహిస్తున్నారు. ⇒ ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయింది. ఈ కార్పొరేషన్ను మాల, మాదిగలకు వేర్వేరుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు ముందడుగు పడలేదు. ⇒ ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని ట్రైకార్ను మూడు కార్పొరేషన్లుగా ప్రభుత్వం మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివాసీల కోసం కుమురం భీం ఆదివాసీ కార్పొరేషన్, లంబాడాల కోసం సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల వర్గానికి ఏకలవ్య కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వాటిలో ట్రైకార్ చైర్మన్ కొనసాగుతున్నప్పటికీ విభజించిన కార్పొరేషన్లకు నీడ కూడా లేదు. ఉద్యోగుల కేటాయింపు, కార్యాలయాల ఏర్పాటు ఊసే లేదు. ⇒ మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో ఒక కార్పొరేషన్ ఉండగా అందులో ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీలకు వేర్వేరుగా కార్యకలాపాలు సాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ముందడుగు పడలేదు. ⇒ వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఉండగా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ కొనసాగుతోంది. వాటికి చైర్మన్లు ఉన్నారు. -
లేత మనసుకు రీల్స్ షాక్
సాక్షి, స్పెషల్ డెస్క్: షార్ట్స్, రీల్స్.. కంటెంట్ ఏదైనా ఆన్లైన్లో అందుబాటులోకి వస్తున్న వీడియోల వీక్షణం ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి వ్యసనంలా దాపురించింది. మాట్లాడటాన్ని మినహాయిస్తే ఒకప్పుడు ఖాళీ సమయాల్లో కొద్దిసేపు వెలిగే మొబైల్ ‘తెర’.. ఇప్పుడు గంటలకొద్దీ కాంతిని వెదజల్లుతోంది. ఒకదాని వెంట మరొకటిగా ప్రత్యక్షమయ్యే వీడియోలను విడిచి పెట్టకుండా చూసేస్తున్నారు. అయితే పిల్లలు సైతం ఈ వ్యసనం బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉండే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర యాప్లలో అప్లోడ్ అవుతున్న ఈ తక్కువ నిడివి వీడియోలు చూడటం నిత్యకృత్యంగా మారింది.డ్యాన్సులు, పాటలు, హాస్యం, నేరాలు, ప్రాంక్ (ప్రాక్టికల్ జోక్స్)..ఇలా అంశం ఏదైనా కోట్లాది షార్ట్ వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. వంటలు చేయడం, పర్యాటక ప్రదేశాలు, ప్రపంచ దేశాలను చుట్టేయడం..వీటన్నిటినీ అప్లోడ్ చేసేది కొందరైతే, అవన్నీ చూస్తూ మొబైల్ స్క్రీన్ ముందు ఎంత సమయం గడుపుతున్నదీ తెలియనంతగా జనం లీనమై పోతున్నారు. వీటిల్లో చాలా వీడియోలు పిల్లలకు పనికొచ్చేవి కాదు..వారిని ఉద్దేశించి చేసినవీ కాదు. అయినప్పటికీ కోట్లాది మంది పిల్లలు వీటికి అలవాటుపడ్డారు. భారీ వరదలా ముంచెత్తే కంటెంట్ ప్రవాహం వీరి నిద్రకు అంతరాయం కలిగిస్తోంది. అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. చదువులపై ప్రభావం చూపిస్తోంది. స్మార్ట్ఫోన్ యూజర్లు ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా 40 వేల కోట్ల యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీక్షిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నియంత్రణ కోల్పోయి..సాధారణంగా 15–90 సెకన్ల వ్యవధితో ఉండే ఈ చిన్న వీడియోలు మెదడు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునేలా రూపొందాయి. స్వైప్ చేసిన ప్రతిసారీ కొత్త వీడియో దర్శనమిస్తుంది. ఇంకేముంది.. స్క్రీన్తోనే తెల్లవారుతోంది.. అదే స్క్రీన్తో నిద్రలోకి జారుకుంటున్నారు. లక్ష మంది పాలుపంచుకున్న 71 అధ్యయనాలను విశ్లేíÙస్తే.. పెద్ద ఎత్తున షార్ట్ వీడియోల వీక్షణంతో స్వీయ నియంత్రణ, పని, చదువుపై శ్రద్ధ తగ్గిందని తేలింది. ముఖ్యంగా నిద్రపై తీవ్ర ప్రభావం పడుతోంది.నిద్రకు దూరం.. షార్ట్ వీడియోలు చూసే వారు సరిపడా నిద్రకు దూరమవుతున్నారు. చాలామంది పిల్లలు నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్స్లో విహరిస్తున్నారు. వేగవంతమైన కంటెంట్లో ఉండే భావోద్వేగ హెచ్చు తగ్గులు మెదడుకు ప్రశాంతత లేకుండా చేస్తాయి. నిద్రపోవడం కష్టమవుతుంది. మరో అధ్యయనం ప్రకారం అధికంగా షార్ట్ వీడియోల వీక్షణంతో కొంతమంది టీనేజర్లు పేలవమైన నిద్ర, బిడియం, ఆందోళనకు గురి అవుతున్నట్టు వెల్లడైంది. హెచ్చరిక లేకుండానే ప్రత్యక్షం స్వీయ నియంత్రణ విషయంలో చిన్నపిల్లల్లో తక్కువ పరిణతి ఉంటుంది. పైగా చాలావరకు సున్నిత మనసు్కలు. దీంతో త్వరితగతిన భావోద్వేగానికి గురవుతున్నారు. పిల్లలు ఎప్పుడూ చూడకూడని కంటెంట్ సైతం దర్శనమీయడం ప్రమాదానికి కారణం అవుతోంది. పిల్లల ప్రమేయం లేకుండానే వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఆటోప్లే అవుతుంటాయి. హింసాత్మక, హానికరమైన చాలెంజ్లు, లైంగిక కంటెంట్ సైతం తెరపై ప్రత్యక్షమవుతుంటుంది. గంటల నిడివిగల వీడియోలు, సంప్రదాయ సోషల్ మీడియా పోస్ట్లకు భిన్నంగా షార్ట్ వీడియోలు ఎటువంటి హెచ్చరిక ప్రదర్శించవు. దీంతో భావోద్వేగ పరంగా సిద్ధం కావడానికి ఎలాంటి అవకాశమూ ఉండదు.భావోద్వేగాలను ఎదుర్కోవడానికి.. కంటెంట్, సౌండ్లో ఆకస్మిక మార్పు, భావోద్వేగపరమైన హెచ్చుతగ్గులు అభివృద్ధి చెందుతున్న మెదడులకు ఇబ్బంది కలిగిస్తుంది. అందరు పిల్లలపై ప్రతికూల మానసిక ప్రభావం చూపనప్పటికీ.. ఆందోళన, శ్రద్ధ వహించడంలో ఇబ్బందులు, భావోద్వేగ అస్థిరత ఉన్నవారు మానసిక స్థితిలో మార్పులకు ఎక్కువగా గురవుతారు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్డీ) ఉన్నవారు ప్రధానంగా వేగవంతమైన కంటెంట్ వైపు ఆకర్షితులవుతారు. బెదిరింపులకు గురైన వారు, ఒత్తిడి, కుటుంబ అస్థిరత, పేలవమైన నిద్రతో బాధపడుతున్న పిల్లలు కష్టమైన భావోద్వేగాలను ఎదుర్కోవడానికి రాత్రి సమయంలో షార్ట్ వీడియోలను చూస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.నైపుణ్యాలు బలహీనం.. సంబంధాల నిర్మాణం, విసుగును తట్టుకోవడం, అసౌకర్య భావాలను ఎదుర్కోవడం బాల్యంలో నేర్చుకుంటారు. అలాంటిది ఎక్కువగా శీఘ్ర వినోదానికి అలవాటు పడిపోయినప్పుడు.. పిల్లలు కలలు కనడం, ఆటలు, కుటుంబంతో ముచ్చటించడం లేదా వారి సొంత ఆలోచనల్లో విహరించడం వంటి అవకాశాలను కోల్పోతారు. బడి నుంచి ఇంటికి వచి్చన తర్వాత ఖాళీ సమయంలో లేత మనసులు తమను తాము ఉల్లాసపర్చుకోవడం, అంతర్గత దృష్టిని పెంపొందించు కోవడం వంటివి చేయాలి. అది కరువైతే నైపుణ్యాలు బలహీన పడతాయని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.తల్లిదండ్రులు ఏం చేయాలి.. ⇒ నిద్ర, ఆఫ్లైన్ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలి. ⇒ ఆరు బయట క్రీడలు, పఠనం, అభిరుచులను ప్రోత్సహించాలి. ⇒ కంటెంట్, ఆన్లైన్ అనుభవాల గురించి పిల్లలతో చర్చించి అవగాహన కల్పించాలి. ⇒ డిజిటల్ ప్రయోజనాలు, స్క్రీన్ వీక్షణ ప్రభావాల గురించి వివరించాలి. -
సాహితీ ఇన్ఫ్రా కేసులో 17 ఛార్జ్షీట్లు దాఖలు
సాక్షి,హైదరాబాద్: సాహితీ స్కాంపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ స్కాం మొత్తం రూ.3000 కోట్లుగా తేల్చినట్లు అధికారులు వెల్లడించారు.నాలుగేళ్ల పాటు విచారణ జరిపిన అనంతరం సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయగా.. ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసుల్లో మొత్తం 64 కేసులు.. అమీన్పూర్లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్టుకు సంబంధించి 17ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.500 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు గుర్తించారు.వసూలు చేసిన డబ్బులను సాహితీ లక్ష్మీనారాయణ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. సాహితీ స్కాంపై మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. వీరిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. -
సైబరాబాద్లో.. ఏఐ ఆధారిత ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రోడ్డు భద్రతను మిషన్ మోడ్లో ముందుకు తీసుకెళ్లే దిశగా ‘అరైవ్ అలైవ్–2026’ కార్యక్రమం మరో ముందడుగు వేసింది. ఈ సందర్భంగా అరైవ్ అలైవ్–2026 టేబుల్టాప్ క్యాలెండర్ను విడుదల చేసి, ఆలోచనల నుంచి అమలుకు మారుతున్న స్పష్టమైన రోడ్మ్యాప్ను ప్రకటించారు. ఈ కార్యక్రమం డీజీపీ బి. శివధర్ రెడ్డి నేతృత్వంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉన్నత పోలీసు అధికారుల సహకారంతో కొనసాగుతోంది.ఈ ప్రచారంలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ ప్రతినిధులు మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేశ్ను కలిశారు. రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడంలో సాంకేతికత ఆధారిత చర్యలు, ప్రజల భాగస్వామ్యం కీలకమని ఈ సందర్భంగా చర్చించారు.ఈ సమావేశంలో ముఖ్య ఆకర్షణగా ఏఐ ఆధారిత ట్రాఫిక్ లా కంప్లయన్స్ వాహనం (TLCV)ను కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వయంగా టెస్ట్ రైడ్ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు గుర్తించడం, ప్రజా భద్రతను మెరుగుపరచడంలో ఈ వాహనం కీలకంగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ‘అరైవ్ అలైవ్’ కేవలం ప్రచారం కాదని, ప్రతి కుటుంబం సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలన్న బాధ్యతగా రాష్ట్రం ముందుకు సాగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు. -
చైనీస్ మాంజా వాడుతున్నారా.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంకాంత్రి అనగానే కోడి పందాలు, గొబ్బెమ్మలు, ముగ్గులు, పంతగులు గుర్తుకు వస్తాయి. హైదరాబాద్లో ప్రత్యేకంగా తయారు చేసిన పంతగులను(కైట్స్) ఎగురవేస్తారు. అయితే, కైట్స్ కోసం వాడే చైనీస్ మాంజా వినియోగంపై నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. చైనీస్ మాంజా విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.హైదరాబాద్ సీపీ సజ్జనార్ తాజాగా ట్విట్టర్ వేదికగా.. హైదరాబాద్ నగరవ్యాప్తంగా చైనీస్ మాంజాపై ప్రత్యేక నిఘా ఉంది. మాంజా విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులతో సంయుక్త దాడులు చేస్తున్నాం. కైట్స్ షాపులు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. అక్రమ రవాణాపై ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలపై కూడా కేసులు పెడుతున్నాం. చైనీస్ మాంజాతో ప్రాణాపాయం. అందుకే అందరినీ హెచ్చరిస్తున్నాం. మాంజా వినియోగంపై సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యతగా ఉంచుతాం. డయల్ 100/ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 165559కు ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. Zero tolerance for Chinese Manja in HyderabadChinese manja is a silent killer that has caused serious injuries and even deaths of pedestrians, two-wheeler riders, birds, and animals.#Hyderabad Police has formed special teams to curb its illegal manufacture, storage,… pic.twitter.com/t8soSwDIsi— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 5, 2026 -
డయల్ 100.. స్పాట్లోనే దొరికిన దొంగ
సాక్షి హైదరాబాద్: మియాపూర్ పోలీసులు శబాష్ అనిపించుకున్నారు. డయల్ 100కు కాల్ చేసిన క్షణాల్లోనే స్పందించి ఏటీఎంలో దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకొని సత్తా చాటుకున్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ బాధ్యతని దానికోసం నిరంతరం అప్రమత్తతతో ఉంటామని పోలీసులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. మాదాపూర్ జోన్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్, మార్థండనగర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద నిన్న(ఆదివారం) రాత్రి సమయంలో దొంగతనం జరుగుతోందని గుర్తుతెలియని వ్యక్తులు 100కు డైల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. ఏటీఏంలో డబ్బుల చోరీకి యత్నిస్తున్న నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అనంతపురం జిల్లా అక్కంపల్లి మండలం జార్జ్పేట్ గ్రామం వాసి కాటమయ్య (24)గా గుర్తించినట్లు తెలిపారుఏటీఏం చోరికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్దనష్టం తప్పినట్లు మియాపూర్ ఏసీపీ సీహెచ్ వై శ్రీనివాస్ కుమార్ తెలిపారు. చుట్టు ప్రక్కల ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు నమోదైతే ప్రజలు డయల్–100కు కాల్ చేయాలని ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. -
అమెరికాలో నిఖిత గోడిశాల హత్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి,హైదరాబాద్: అమెరికాలో తెలుగు యువతి గోడిశాల నిఖిత హత్యకేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన నిఖిత దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు ప్రేమ వ్యవహారం కారణమై ఉంటుందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఆమె మృతికి ప్రేమ వ్యవహారం కాదని, ఆర్ధిక లావాదేవీలేనని తెలుస్తోంది.అమెరికాలో ఉంటున్న నిఖిత, తమిళనాడుకు చెందిన అర్జున్ శర్మ స్నేహితులు. అయితే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్జున్ శర్మ.. నాలుగున్నర వేల డాలర్లు అప్పుగా ఇవ్వాలని, వాటిని త్వరలోనే తీరుస్తానంటూ నిఖితను కోరాడు. అందుకు ఒప్పుకున్ననిఖిత.. అర్జున్ శర్మ అడిగిన మొత్తం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత రోజులు, నెలలు గడుస్తున్నా అర్జున్ శర్మ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు.ఈ క్రమంలో తాను అప్పుగా ఇచ్చిన మొత్తం తిరిగి ఇవ్వాలంటూ అర్జున్పై నిఖిత ఒత్తిడి తెచ్చింది. నిఖిత ఒత్తిడి చేయడంతో అర్జున్ ముడున్నరవేల డాలర్లు ఇచ్చాడు. మిగిలిన వెయ్యి డాలర్లు ఇవ్వాలని కోరగా.. కోపోద్రికుడైన అర్జున్ బలవంతంగా మూడున్నర వేయి డాలర్లు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అనంతరం, హత్య చేసి భారత్కు పరారై వచ్చాడు. నిఖిత హత్యపై సమాచారం అందుకున్న ఇంటర్ పోల్ పోలీసులు తమిళనాడులో అర్జున్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఇదిలా ఉంటే కుమార్తె మృతిపై నిఖిత తండ్రి ఆనంద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. కుమార్తె మృతిపై తండ్రి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం నా కూతురు అమెరికా వెళ్ళింది. నా కూతురు నిఖితను అర్జున్ శర్మ అనే యువకుడు హత్య చేశాడు. అర్జున్ శర్మ గతంలో నా కూతురు రూమ్మెట్గా ఉన్నాడు. అందరినీ డబ్బులు అడిగి తీసుకునేవాడు.నా కూతురు దగ్గర నుండి కూడా డబ్బులు తీసుకున్నాడు అని అంటున్నారు. ఆ డబ్బులు విషయంలోనే అడగడానికి అర్జున్ దగ్గరికి నిఖిత వెళ్లినట్లు ఆమె స్నేహితులు చెప్తున్నారు. నిఖితను చంపేసిన తర్వాత ఏమీ ఎరగనట్టు.. ఆమె కనిపించడం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత అమెరికా నుంచి పారిపోయి ఇండియాకి వచ్చాడు.నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాకు నా కూతురు చదువుకోడానికి వెళ్ళింది. మేరిల్యాండ్లో డేటా అనలిస్ట్గా జాబ్ చేస్తుండేంది. చివరిగా డిసెంబర్ 31న ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పింది... అదే చివరి మాట. నా కూతురికి జరిగినటువంటి అన్యాయం ఎవరికీ జరగకూడదు. అధికారులు నా కూతురు మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను’ అని విజ్ఞప్తి చేశారు. -
శాసన మండలిలో కవిత భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో కంటతడి పెట్టారు. ఇదే తన ఆఖరి హాజరు అంటూ ప్రకటించిన ఆమె.. సోమవారం మండలికి హాజరై పలు అంశాలపై భావోద్వేగంగా మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెడితే అమరజ్యోతి వరకు ప్రతిదాంట్లో అవినీతి జరిగింది. ఉద్యమకారులు, సూటిగా ప్రశ్నించేవారిపట్ల వివక్ష కొనసాగింది. కేసీఆర్పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది. ఈడీ, సీబీఐలపై పోరాడినా బీఆర్ఎస్ నాకు అండగా నిలవలేదు. పార్టీ మౌత్పీస్గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు నాకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదు. నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు. కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. కేసీఆర్కు అవినీతి మరక అంటితే నేనే పోరాడా. అలాంటిది నా సస్పెన్షన్కు ముందు నా వివరణ కోరలేదు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నా అంటూ కంటతడి పెట్టారామె. ఇకనైనా తన రాజీనామా ఆమోదించండి అని మండలి చైర్మన్కు కవిత విజ్ఞప్తి చేశారు. అయితే.. పరిణామాలను తాను అర్థం చేసుకోగలనని, భావోద్వేగాలతో రాజీనామా చేస్తే ఆమోదించరన్న చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి.. రాజీనామాపై పునరాలోచన చేయాలని కవితకు సూచించారు. -
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి యువతిపై కత్తితో దాడి
హైదరాబాద్: నిన్ను ప్రేమిస్తున్నా.. నా ప్రేమను అంగీకరించాలని ఓ యువకుడు ఓ యువతి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడిచేశాడు. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. అలకాపూర్ టౌన్షిప్లో ఓ యువతి(21) మరో ఇద్దరు యువతులతో కలిసి ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటుంది. అదే భవనంలో కొనసాగుతున్న ఓ హోటల్లో వెయిటర్గా పర్వతాల రోహిత్(23) పనిచేస్తున్నాడు. ఈనెల 1న యువతి కొత్త సంవత్సరం వేడుకల అనంతరం అర్ధరాత్రి ఇంటికి వచ్చింది . అప్పటికీ ఆమె మిత్రులు రాకపోవటంతో తలుపు తెరచి ఉంచి నిద్రకు ఉపక్రమించింది. రెండు నెలలుగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న రోహిత్ అదే అదనుగా ఇంట్లోకి చొరబడ్డాడు. యువతి అతన్ని గమనించి అరవటంతో కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో యువతి చేతికి గాయమైంది. అయినా అతను అసభ్యంగా ప్రవర్తించి పరారయ్యాడు. దీంతో బాధితురాలు ఈనెల 2 నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈవిషయమై సెక్టార్ ఎస్సై మునీందర్ను వివరణ కోరగా యువతిపై కత్తితో దాడి, అసభ్యంగా ప్రవర్తించిన రోహిత్పై ఫిర్యాదు వచ్చిందని, నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.


