-
ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైరికల్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కరెంట్ కోతల విషయంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ హరీశ్రావు ట్వీట్ చేశారు.‘‘విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే బాధ్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించింది’’ అని హరీశ్ పేర్కొన్నారు.‘‘రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్పకూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణ చేస్తున్నారు’’ అని హరీశ్రావు మండిపడ్డారు.‘‘తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం’’ అంటూ హరీశ్ వ్యాఖ్యానించారు.‘‘సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ హయాంలో రెప్ప పాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిది. తన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడతారని సీఎం భ్రమల్లో ఉన్నట్టున్నారు. వాటిని వీడి పాలన పై దృష్టి పెడితే మంచిది’’ అంటూ హరీశ్రావు హితవు పలికారు. కరెంట్ కోతల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే భాద్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే…— Harish Rao Thanneeru (@BRSHarish) May 15, 2024 -
‘కాంగ్రెస్ గూండాల దాడి.. ఇదా రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం?’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయటం అధికార దుర్వినియోగం చేయటమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్పై మండిపడ్డారు. నిన్న( మంగళవారం) అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ గూండాల దాడి ఘటనలో స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ప్రేమ దుకాణం’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘ప్రత్యర్థులపై నిర్మొహమాటంగా దాడి చేయడం, అధికార దుర్వినియోగం చేయటమే. పోలీసుల దుర్వినియోగం, దాడిలో భాగం కావడం సిగ్గుచేటు. ఇది రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం. తెలంగాణ డీజీపీ.. ఈ గూండాలపై కఠిన చర్యలు తీసుకోకుండా, పోలీసులాగా ప్రేక్షక పాత్ర వహిస్తే.. మేము మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించి న్యాయం జరిగేలా చూస్తాం’’ కేటీఆర్ ‘ఎక్స్’లో విమర్శించారు.Yahi Hai Kya Aapki “Mohabbat Ki Dukaan” @RahulGandhi ?Brazenly attacking opponents and abusing power. Shameful that police have become part of the abuse and attack @TelanganaDGP If you don’t act and book these goons and the spectator like cops, we will move the Human Rights… https://t.co/9VL4VjxD31— KTR (@KTRBRS) May 15, 2024 అచ్చంపేటలో కాంగ్రెస్ గూండాల దాడికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ ట్యాగ్ చేశారు. ప్రవీణ్కుమార్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్పై విధంగా స్పందించారు. -
మే 17 నుంచి సినిమా థియేటర్లు మూసివేత
కరోనా తర్వాత మళ్లీ సినిమా థియేటర్లు మూత పడనున్నాయి. దీంతో సినిమా అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే, ఈసారి కరోనా వల్ల థియేటర్లు మూత పడటం లేదు. కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ఇలాంటి సమస్య వచ్చింది. థియేటర్ యజమానులకు సమ్మర్లో ఇలాంటి ఇబ్బందులు రావడంతో కాస్త నిరుత్సాహానికి గురౌతున్నారు.వేసవి శెలవులలో లెక్కలేనన్ని సినిమాలు విడుదల అవుతాయి. ప్రేక్షకులతో థియేటర్స్ అన్నీ నిండిపోతాయి.. కానీ ఈ ఏడాదిలో అలాంటి సందడి లేకపోవడంతో హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ మే 17 నుంచి పదిరోజులపాటు మూసివేయనున్నారు. సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం భారం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.థియేటర్స్ బంద్పై ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రియాక్షన్తెలంగాణలో థియేటర్స్ బంద్పై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి స్పందించారు. థియేటర్స్ బంద్ కావడానికి కారణం చిన్న సినిమాలకు కలెక్షన్స్ లేకపోచడం పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడమని ఆయన అన్నారు. ప్రతి రోజు థియటర్స్ ఖర్చులు భరించలేకే తాత్కాలికంగా సింగిల్ థియేటర్స్ మూసివేయాల్సి వచ్చిందన్నారు. కేవలం ఖర్చులు భరించలేకే బంద్ చేయాల్సి వచ్చింది. కానీ, మరే ఇతర కారణాలు ఏమి లేవన్నారు. నిర్మాతలు ముందుకు వచ్చి మెయింటెనెన్స్ భరిస్తామని చెబితే థియేటర్స్ ఓపెన్ చేస్తామని విజయేందర్ రెడ్డి అన్నారు. -
Malkajgiri Lok Sabha: ఈవీఎంలలో అభ్యర్థుల భవిత
చంపాపేట: పార్లమెంట్ ఎన్నికల ఘట్టం ముగియడంతో మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీలో నిలచిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు గెలుపుపై టెన్షన్ మొదలైంది. తమ తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు సర్వశక్తులు ఒడ్డి పని చేశారు. ఓటర్లు అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని ఎల్రక్టానిక్ యంత్రాల్లో భద్రపర్చారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ 20 రోజులూ తమ పార్టీ అభ్యర్థుల విజయంపై ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటుండగా, ఎల్బీనగర్లోని ప్రధాన పారీ్టల అభ్యర్థులు, నాయకులు మాత్రం బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఓటింగ్ శాతం తాము ఊహించినంతగా లేకపోవటంతో లోలోపల మాత్రం వారిలో ఆందోళన నెలకొంది. 👉 మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలో ఎల్బీనగర్తో పాటు మరో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎంపీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే అధిక ఓటర్లు కలిగిన ఎల్బీనగర్ శాసన సభ నియోజకవర్గ పరిధిలో 6,04,763 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ 46.27 శాతం మాత్రమే కావటంతో ఆ ప్రభావం ఏ పార్టీ అభ్యర్థి జయాపజయాలపై చూపుతుందోనని పార్టీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు, 👉 మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేయడం వల్ల ఎల్బీనగర్ వాసులు, అన్ని పార్టీల నాయకులతో ఆయనకు సత్సబంధాలు ఉన్నాయి. దానికి తోడు ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని మెజార్టీ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో ఆయన తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ పార్టీ కార్పొరేటర్లు, క్రియాశీలక కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఈటల విజయం కోసం ఏమాత్రం పాటు పడ్డారో అభ్యర్థి జయాపజయాలను నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 👉 బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజయం కోసం స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్ రెడ్డి ఉన్న కొద్దిపాటి పార్టీ కార్యకర్తలను ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ రాగిడి విజయానికి అహరి్నషలు కృషి చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఉన్న సానుభూతి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు నోచుకోక పోవటం వంటి అంశాల వల్ల రాగిడి లక్ష్మారెడ్డికి ఎల్బీ నగర్లో మెజారిటీ ఓట్లు వచ్చి విజయం ఖాయమని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 👉 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతామహేందర్రెడ్డికి ఎల్బీనగర్లోని పలు పార్టీ నేతలతో పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయి. దీనికి తోటు ఎన్నికల సమయంలో భారీ ఎత్తున ఇతర పారీ్టలనుంచి కార్యకర్తలు కాంగ్రెస్లో చేరి బూత్ స్థాయినుంచి పార్టీ ఇన్చార్జీలను నియమించి పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి కారణాల వల్ల పార్టీ అభ్యర్థి ఎల్బీ నగర్లో మెజార్టీ ఓట్లు సాధించడం పక్కా అని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటరు నాడి అంతు చిక్కటుంలేదని, ఓటర్లు ఎక్కడా తమ మనోభావాన్ని, అంతరంగాన్ని బయట పెట్టడంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
‘బుల్లెట్’ పేలిన ఘటనలో మరొకరి మృతి
హైదరాబాద్: బుల్లెట్ ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పేలిన ఘటనలోఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు. భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు 80 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయం మహ్మద్ నదీం మృతి చెందాడు. భవానీనగర్ ఇన్స్పెక్టర్ ఎం.బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీర్నగర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీంఖాన్ ఈ నెల 10న బుల్లెట్ వాహనంపై తన భార్య నేహాతో పని నిమిత్తం బయటికి వెళ్తున్నాడు. నసీర్ ఫంక్షన్ హాల్ సమీపం వద్దకు రాగానే వాహనం నుంచి స్వల్పంగా మంటలు రాసాగాయి. దీంతో అబ్దుల్ రహీం ఖాన్ వాహనాన్ని స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయతి్నంచాడు. ఇంతలోనే బుల్లెట్ వాహనం కింద పడిపోవడంతో పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ ఘటనలో అబ్దుల్ రహీం ఖాన్తో పాటు మంటలను ఆర్పేందుకు సహాయం చేసిన స్థానికులు సలేహ, షేక్ అజీజ్, ఖాజా పాషా, చెరుకు బండి యజమాని మహ్మద్ నదీం, ఫలక్నుమా జహంగీర్నగర్కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ, మహ్మద్ హుస్సేన్ ఖురేíÙ, షేక్ ఖాదర్, గౌస్ రహమాన్లు మంటల వ్యాప్తి కారణంగా గాయాలకు గురయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో మొఘల్పురా పీఎస్ కానిస్టేబుల్ సందీప్ సైతం గాయాలకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ నదీమ్ సోమవారం మృతి చెందగా.. ఫలక్నుమా జహంగీర్నగర్కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు. -
Telangana: జాలీగా..సరదాగా..
రికార్డు స్థాయిలో తన ఆగ్రహాన్ని చూపించాడు సూరీడు.. అయినా ఓటర్ల అనుగ్రహం కోసం అనుక్షణం తపించారు నేతలు.. స్వేదంతో తడిసి ముద్దవుతున్నా పట్టు సడలకుండా ప్రచారం చేశారు. సోమవారం లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాజకీయ పారీ్టల అభ్యర్థులు నచ్చిన వ్యాపకాలతో సేదదీరుతున్నారు. ఫలితాలకు ఇంకా చాలా రోజుల సమయం ఉండడంతో ఆహ్లాదంగా గడపడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులతో పాటు ఆయా పారీ్టలకు చెందిన ఎమ్మెల్యేలూ ప్రచారంలో పాల్గొని.. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతున్నారు. మనవరాలితో సరదాగా పద్మారావు గౌడ్ సతీమణి అనిత, మనవరాళ్లతో దానం నాగేందర్ మనవడు ఆహాన్తో గడ్డం శ్రీనివాస్ యాదవ్ అలసిసొలసిన మనసుకు చిన్నారి చిరునవ్వులను మించిన సాంత్వన ఏముంది? అందుకేనేమో.. హైదరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ తన మనవడు ఆహాన్తో ఆటల్లో మునిగిపోయారు. తాను సైతం చిన్న పిల్లాడిలా మనవడితో ఆటపాటల్లో మునిగిపోతూ సోమవారం అంతా సేదదీరారు. సికింద్రాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ సైతం మంగళవారం మొత్తంగా ఇంటికే పరిమితమయ్యారు. రోజుల తరబడి అలుపెరగని ఎన్నికల ప్రచారాన్ని సాగించిన ఆయన మరో మూడు రోజుల్లో ఉత్తరాది పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మనవడు రుద్రాంశ్తో రాగిడి లక్ష్మారెడ్డి.. ఈ విరామంలో కుటుంబ సభ్యులతో మనవలు, మనవరాళ్లతో గడుపుతున్నారు. గత కొన్ని రోజులుగా క్షణం తీరిక లేకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లోనే ఉన్న మల్కాజిగిరి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మంగళవారం సందడిగా గడిపారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో.. మనవడు భవనం రుద్రాంశ్, కుమారుడు రాగిడి వెంకటసాయి రియాన్ రెడ్డిలతో కలిసి ఆటలాడుతూ వారితో కలిసి స్విమ్ చేస్తూ రీచార్జ్ అయ్యారు. ప్రచారంలో బిజీగా మారిన సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికల ముగిసిన తర్వాత మంగళవారం కుటుంబంతో కాస్త రిలాక్స్గా కనిపించారు. ఉదయం తన మనవరాళ్లతో ఇంట్లో సరదాగా గడిపారు. పచ్చని పరిసరాల్లో... ఎన్నికల ప్రచారంలో భాగంగా వేసవి ఎండలను లెక్కచేయకుండా క్షణం తీరిక లేకుండా పనిచేశాం. పోలింగ్ పూర్తయి ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో కొంత మానసిక ప్రశాంతత అవసరం అని కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. మొక్కల మధ్య పచ్చని పరిసరాల్లో గడుపుతూ పెట్స్తో రిలాక్స్ అవుతున్నా.– సునీతా మహేందర్రెడ్డి, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిఆరోగ్యంపై దృష్టి.. తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలవాలి. మనం ఓటరుకు ఏం చెప్పాలనుకుంటున్నామో వారికి చేరవేయాలనే తపనతో నియోజకరవ్గం మొత్తం కలియతిరిగాను. ఇక ఇప్పుడు ఈ ఒత్తిడి నుంచి దూరం కావడానికి మానసిక ప్రశాంతత కోసం 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా.అలాగే ఈ టైమ్లో ఆరోగ్యంపై దృష్టిపెట్టి తగిన మార్పు చేర్పులు చేసుకుంటున్నా. – రంజిత్రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి మనవడు ఆర్యవీర్తో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ‘సాక్షి’ పత్రిక చదువుతున్న ఎమ్మెల్యే కాలేరు -
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ విషయంలో గ్రేటర్ జిల్లాల్లో మార్పు రావడం లేదు. గతంలో మాదిరిగానే హైదరాబాద్ జిల్లాకు అత్యల్ప పోలింగ్ నమోదై చివరి స్థానం దక్కింది. గత లోక్సభ ఎన్నికల పోలింగ్తో పోలిస్తే దాదాపు మూడు శాతం పెరిగినా..రాష్ట్రంలోనే అత్యల్ప పోలింగ్ మాత్రం ఇక్కడే నమోదైంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 48.48 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంమీద 22,17,094 ఓట్లకు గాను 10,74,827 ఓట్లు పోలయ్యాయి. గోషామహల్ సెగ్మెంట్లో 54.72 శాతం, కార్వాన్లో 51.23, బహదూర్పురాలో 50.07, చాంద్రాయణగుట్టలో 49.15, చారి్మనార్ 48.53, యాకుత్పురాలో 43.34, మలక్పేటలో 42.76 శాతం పోలయ్యాయి. సికింద్రాబాద్లో 49.04%సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో 49.04 శాతం పోలింగ్ నమోదైంది. గత లోకసభ ఎన్నికలతో పోలిస్తే ఒక శాతం పోలింగ్ పెరిగినా, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల కంటే ఒక శాతం తగ్గినట్లయింది. సెగ్మెంట్ల వారిగా పరిశీలిస్తే ముషీరాబాద్లో 49.09 శాతం, అంబర్పేటలో 51.65, ఖైరతాబాద్లో 50.28, జూబ్లీహిల్స్లో 45.59, సనత్నగర్లో 49.45, నాంపల్లిలో 46.59, సికింద్రాబాద్లో 52.28 శాతం పోలింగ్ నమోదైంది. చేవెళ్లలో 56.50% చేవెళ్ల లోక్ సభ పరిధిలో 56.50 శాతం పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే 0.31 పెరిగినా..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే పది శాతం తగ్గింది. మొత్తం మీద 29,38,870 ఓటర్లకు గాను 16,57,107 మంది ఓటేశారు. సెగ్మెంట్ల వారిగా చేవెళ్లలో 71.83 శాతం, వికారాబాద్లో 70.44 శాతం, తాండూర్లో 67.33 శాతం. పరిగిలో 67.01 శాతం, రాజేంద్రనగర్లో 54.12 శాతం, మహేశ్వరంలో 52.71 శాతం, శేరిలింగంపల్లిలో 54.12 శాతం పోలింగ్ నమోదైంది. మల్కాజిగిరిలో 50.78% మల్కాజిగిరి పరిధిలో పోలింగ్ 50.78 శాతం నమోదైంది. అసెంబ్లీ వారిగా పోలింగ్ శాతం పరిశీలిస్తే మేడ్చల్లో 57.83 శాతం, మల్కాజిగిరిలో 51.97, కుత్బుల్లాపూర్లో 50.19, కూకట్పల్లిలో 48.48, ఉప్పల్లో 48.45, ఎల్బీనగర్లో 46.27, కంటోన్మెంట్–సికింద్రాబాద్లో 51.61 శాతం పోలింగ్ నమోదైంది. -
Bengal Tiger: అభిమన్యు వెళ్లిపోయాడు
బహదూర్పురా: నెహ్రూ జూ పార్క్లో అభిమన్యు అనే 8 ఏళ్ల తెల్లపులి కిడ్నీ సంబంధిత వ్యాధితో మంగళవారం మృతి చెందింది. నెహ్రూ జులాజికల్ పార్క్లో 2016 సంవత్సరం మే నెలలో బద్రి, సమీరాలకు రెండు తెల్లపులి కూనలు జని్మంచాయి. అందులో ఒకటైన అభిమన్యు జూలోనే పెరిగింది. ఇది మృతి చెందడంతో అధికారులు వీబీఆర్ఐ, లాంకోన్స్తో పాటు ఇతర విభాగాల శాస్త్రవేత్తలు, డాక్టర్లు జూలోనే పోస్టుమార్టం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా నెహ్రూ జులాజికల్ పార్కులో కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో పులులు, సింహాలు, చిరుత పులులు మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
ఈ చిత్రంలోని రైతు దంపతులు మీసా పరుశరాములు, రేణుక (రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్) 2.20 ఎకరాల సొంత భూమితో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. పండిన ధాన్యాన్ని 17 రోజుల క్రితం ముస్తాబాద్లోని కొనుగోలు కేంద్రానికి తెచ్చారు. కానీ ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. అప్ప ట్నుంచి ఇప్పటివరకు మూడుసార్లు వర్షాలతో ధాన్యం తడిసింది. ఇప్పుడు 17% తేమ వచ్చే వరకు కొనలేమని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టడం, ఈలోగా మళ్లీ వర్షం పడటం, మళ్లీ ఆరబెట్టడం నిత్యకృత్యంగా మారడంతో ఈ దంపతులు లబోదిబోమంటున్నారు. సాక్షి, హైదరాబాద్: తడిచిన ధాన్యాన్ని సైతం కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఆ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇచి్చన హామీలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ రైతులు రోజుల తరబడి వేచి చూస్తున్నా.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు 17 శాతం తేమ వచ్చేదాకా ధాన్యం కాంటా వేయలేమని కరాఖండిగా చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఇప్పటికే చాలాసార్లు తడిచింది. ధాన్యం తడవడం, రైతులు ఆరబెట్టేందుకు అష్టకష్టాలూ పడటం నిత్యకృత్యమైంది. మరోవైపు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చేస్తున్న సూచనలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 45 రోజుల్లో 27 ఎల్ఎంటీలే సేకరణ రాష్ట్రంలో గత 15 రోజుల నుంచి అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రైతుల పంటను నీళ్లపాలు చేస్తున్నాయి. వర్షం పడిన ప్రతిసారీ పౌరసరఫరాల శాఖ తడిచిన ధాన్యం కొంటామనే హామీ ఇవ్వడమే తప్ప అమలుపై శ్రద్ధ చూపించడం లేదు. దీంతో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే రైతుల వడ్లు పలుమార్లు నీళ్లలో తడిశాయి. చాలాచోట్ల ధాన్యం వరదల్లో కొట్టుకుపోయింది.ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు మొదలై 45 రోజులు దాటినప్పటికీ, ఇప్పటివరకు 27 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించింది. నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సైతం కోతలు దాదాపుగా ముగిశాయి. వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కోతలు కొంత ఆలస్యం అయ్యాయి. అయితే వరి కోసి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెస్తున్న రైతులు అక్కడే ఆరబెట్టి, తమ వంతు వచ్చేంత వరకు కాంటా కోసం వేచిచూస్తున్నారు.రైతుల పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, బ్యాంక్ పాస్బుక్ ఫోన్ నంబర్తో లింక్ అయితేనే కొనుగోళ్లు జరుపుతుండడంతో కొందరు రైతులతో పాటు కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా తేమ 17 శాతానికి చేరుకునే వరకు వేచి ఉండాలని చెబుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.మిల్లర్ల కొర్రీలు మరోవైపు కొంచెం తేమ శాతం ఎక్కువగా ఉన్నా మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవడం లేదు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టిన తరువాత ధాన్యం రంగు మారినా తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. అలాంటి ధాన్యం లోడ్లు మిల్లులకు వస్తే నేరుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, రైతులకు ఫోన్లు చేసి పచ్చి ధాన్యాన్ని తీసుకోబోమని తేల్చిచెబుతున్నారు. తీసుకునే పక్షంలో క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల తరుగు తీయాల్సి ఉంటుందంటూ మెలిక పెడుతున్నారు.ధాన్యం కాంటాకే ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు విధిలేని పరిస్థితుల్లో మిల్లర్లు చెప్పినట్లు వింటూ దోపిడీకి గురవుతున్నారు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ ఈ అంశంపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షంతో తడిచిన ధాన్యం గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటాం. – ఇటీవల హైదరాబాద్లో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి -
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీనికి తోడుగా రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి బలమైన గాలులు వీస్తు న్నా యి. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమో దయ్యే అవకాశం ఉన్న ట్లు వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, గాలు లతో కూడిన వానలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళ వారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలే నమో దయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమో దైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత నిజామా బాద్లో 41.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 22.5 డిగ్రీ సెల్సి యస్గా నమోదైంది. గురువారం నుంచి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతా వరణ శాఖ నిపుణులు తెలిపారు. -
TG: పాలనపైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఎన్నికలు ముగి శాయి. రాజకీయం అయిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలకు సమయం అయిపోయింది. నా విమర్శకులు ఏం మాట్లాడినా నేను పట్టించుకోను..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. బుధవారం నుంచి సచివాలయానికి వెళ్తానని.. పాలనపై, ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెడతానని తెలిపారు. రైతు రుణమాఫీ, తడిచిన ధాన్యం కొను గోళ్లు, విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, యూని ఫామ్లు, హాస్టళ్లకు సన్నబియ్యం లాంటి కార్య క్రమాల అమలు పనిని ప్రారంభిస్తానని వివరించారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో రేవంత్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు పలు అంశాలపై తన ఆలోచనలు పంచుకున్నారు. ఒక్క మెదక్లోనే బీఆర్ఎస్ పోటీలో ఉందిలోక్సభ ఎన్నికల్లో 13 స్థానాల్లో విజయం సాధిస్తాం.మహబూబ్నగర్ పార్లమెంటులో 50 వేల మెజా ర్టీతో గెలవబోతున్నాం. కంటోన్మెంట్ అసెంబ్లీలో 20 వేల మెజార్టీతో గెలుస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏం చేసిందన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ బలవంతంగా మాకు బీజేపీని ప్రత్యర్థిగా సృష్టించింది. బీఆర్ఎస్ వ్యవస్థనంతటినీ తీసుకెళ్లి బీజేపీకి ఔట్సోర్సింగ్ చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ నిలబడుతుందా లేదా అన్నది చూడాలి. ఆ పార్టీకి ఐదారు చోట్ల డిపాజిట్లు రావు. ఒక్క మెదక్లోనే పోటీలో ఉంది. ఈ ఎన్నికల్లో మోదీ గాలి లేదు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 220కి ఓ పదిశాతం ఎక్కువో, తక్కువో వస్తాయి. కేంద్రంలో సొంతంగా అధికారంలోకి రాదు. 12 సీట్లు గెలిచి ప్రధాని రేసులో ఉంటానన్న కేసీఆర్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అయినా మాకేం అభ్యంతరం లేదు. మా ప్రభుత్వం పడిపోవాలంటే బీఆర్ఎస్, బీజేపీలు కలిసే ప్రయత్నం చేయాలి కదా. అలా జరిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ బీజేపీ వైపునకే వెళ్లాలని ఏముంది? సగం మాతో కూడా రావచ్చు. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీనే మిగలదు.రైతు రుణాల బాధ్యత తీసుకుంటాంరాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)కి అన్ని విషయాలు చెప్పాం. రైతులకు ఏ బ్యాంకులో ఎంత రుణం ఉందో లెక్కలు తీయమని చెప్పాం. ఈ రుణాలకు మేం బాధ్యత తీసుకుంటాం. రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దానికి ఆదాయం చూపించి రుణాలపై బ్యాంకర్లను ఒప్పిస్తాం. రైతులను అప్పుల నుంచి విముక్తులను చేస్తాం. అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయాలుబీఆర్ఎస్ గత పాలనలో వివాదాస్పదమైన అన్ని అంశాలపై అసెంబ్లీలో లేదంటే అఖిలపక్షం ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటాం. రైతు సంఘాలతో సమావేశమై అభిప్రాయాలు తీసుకుంటాం. రైతుకు పెట్టుబడి, గిట్టుబాటు ధరలు కల్పించడంపై నా ఫోకస్ 100 శాతం ఉంటుంది. రైతుబంధు ఇవ్వలేదన్నారు. మే ఆరోతేదీ కల్లా 100 శాతం వేసి చూపించాం. గతంలో డిసెంబర్ వరకూ వేసేవాళ్లు. రైతుబంధు కొత్త నిబంధనలపై ఆషామాషీగా నిర్ణయాలు తీసుకోబోం.రేషన్షాపుల్లో సంస్కరణలురేషన్షాపుల ద్వారా గతంలో మేం 9 వస్తువులిచ్చే వాళ్లం. ఇప్పుడు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. తాజాగా రైతులు పండించే అన్ని పంటలను గిట్టు బాటు ధర కంటే కొంచెం ఎక్కువే ఇచ్చి కొనుగోలు చేసి వాటిని ఉత్పత్తుల కింద మార్చి రేషన్షాపుల ద్వారా పేదలకు తక్కువ ధరకు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. వడ్లు కొని మేమే సన్న బియ్యం తయారు చేసి పేదలకిస్తాం. ఇక్కడ పండే దొడ్డు బియ్యాన్ని ఎఫ్సీఐకిస్తాం. మిల్లర్లు ఎక్కడైనా తేడా చేస్తే లోపల వేస్తా. రైతుకు, వినియోగదారుడికి మధ్య వారధిగా ప్రభుత్వం ఉంటుంది. పదేళ్లలో వందేళ్ల ప్రణాళికలుపదేళ్లు ఇక్కడే ఉంటా. 2024–34 వరకు తెలంగాణ రాష్ట్రమే నా ప్రపంచం. ఈ పదేళ్లలో వందేళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించి భావితరాలకు అందించడమే నా బాధ్యత. కొత్తగా మంత్రి పదవులు రెండయితే గ్యారంటీ వస్తాయి. నేనైతే అధిష్టానాన్ని నాలుగు భర్తీ చేసుకునేందుకు అనుమతి అడుగుతున్నా. అనుమతి లభిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు ఒక్కొక్కటి చొప్పున వస్తాయి. యూటీ.. ఓ విఫల ప్రయోగంహైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేస్తారనే చర్చ చేస్తున్న వారికి మెదడు లేనట్టే. తలకు మాసినోళ్లు చేసే చర్చ అది. యూటీ ఎందుకు చేస్తారు? అదో విఫల ప్రయోగం. ఏపీతో సానుకూల వైఖరితోనే ముందుకు..ఏపీ నుంచి ఎవరు సీఎం అయినా వారితో కలిసి పనిచేస్తా. సానుకూల వైఖరితోనే ముందుకెళ్తా. -
వానాకాలం సాగు..1.34 కోట్ల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం 1.34 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు పంటల ప్రణాళికను విడుదల చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి ఉంచనున్నారు. ఈ వానాకాలం అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత పత్తి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని పేర్కొంది. గతేడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని అంచనా వేసింది. » గతేడాది 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి 66లక్షల ఎకరాల్లో నాట్లు పడనున్నాయి. » గతేడాది 44.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకాగా, ఈసారి అదనంగా మరో 15.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా ప్రోత్సహించనున్నారు. » వరిసాగు కంటే పత్తినే ప్రోత్సహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అవసరమైతే వరిని తగ్గించి, పత్తినే 70 లక్షల ఎకరాలకు పెంచే ఆలోచన కూడా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం సాగుకనుగుణంగా విత్తన ప్రణాళికను కూడా వ్యవసాయశాఖ విడుదల చేసింది. ఈ వానాకాలం సీజన్కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించింది. » అత్యధికంగా 16.50 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలే కావడం గమనార్హం. పత్తి విత్తనాలు 54 వేల క్వింటాళ్లు అవసరం, సోయాబీన్ విత్తనాలు 1.49లక్షల క్వింటాళ్లు రైతులకు అందుబాటు లోకి తెస్తారు. మొక్కజొన్న విత్తనాలు 48 వేల క్వింటాళ్లు, కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేశారు.» జొన్న, సజ్జ, రాగి, మినుములు, ఆముదం, పొద్దు తిరుగుడు విత్తనాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొంత మేరకు అందు బాటులో ఉంచామని, మిగిలిన వాటిని త్వరలో రైతులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. » పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో ప్రైవేట్ కంపెనీలే అందుబాటులోకి తీసుకొస్తాయి. అయితే కొన్ని కంపెనీల విత్తనాలనే రైతులు కోరుకుంటారు. ఆ మేరకు ఆయా కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచాలని కంపెనీలను వ్యవసాయశాఖ ఆదేశించింది.» ఈసారి 24.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వానాకాలం కోసం సిద్ధం చేయనున్నారు. అందు లో 10.40 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, 10 లక్షల మెట్రిక్ టన్నులు ఎన్పీకేను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. -
లోక్సభ పోలింగ్ 66.3 శాతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు సోమవారం జరిగిన సాధారణ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతంపై స్పష్టత వచ్చింది. దీనికి సంబంధించి తుది గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్ మంగళవారం రాత్రి విడుదల చేశారు. మొత్తంగా రాష్ట్రంలో 66.3 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 3,32,16,348 మంది ఓటర్లకు 2,20,24,806 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఇందులో 2,18,14,035 మంది పోలింగ్ కేంద్రాల్లో ఓటేయగా.. 2,10,771 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. ఇందులో 1,89,091 మంది ఎన్నికల సిబ్బంది, 21,680 మంది వయోవృద్ధులు/వికలాంగ/ అత్యవసర సేవల ఓటర్లు ఉన్నారు. వీరిలో వయోవృద్ధులు, వికలాంగులు తమ ఇళ్ల వద్దే ఓటేశారు. భువనగిరిలో అత్యధికం 2019 లోక్సభ సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69 శాతం పోలింగ్ నమోదవగా.. ఈసారి 3.6శాతం అదనంగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరి లోక్సభ స్థానంలో 76.78 శాతం పోలింగ్, అత్యల్పంగా హైదరాబాద్ లోక్సభ స్థానంలో 48.48శాతం పోలింగ్ నమోదయ్యింది. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు: సీఈఓ వికాస్రాజ్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని.. అవాంఛనీయ ఘటనలు జరగలేదని సీఈఓ వికాస్రాజ్ తెలిపారు. పోలింగ్ శాతం పెంచడానికి ఎన్నికల యంత్రాంగం చేసిన కృషి ఫలించిందన్నారు. ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన ఓటర్లు, ఎన్నికల యంత్రాంగం, సిబ్బంది, పోలీసు బలగాలు, ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు కృతజ్ఞతలు తెలి పారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదని చెప్పారు. ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రిని పరిశీలకులు/అభ్యర్థులు/ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో తనిఖీ చేసి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపర్చినట్టు వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్లను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. వచ్చే నెల 4వ తేదీన 34 కౌంటింగ్ సెంటర్లలో పరిశీలకులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఆ ప్రక్రియ అంతా వీడియో రికార్డింగ్ చేస్తామని చెప్పారు. కౌంటింగ్ తర్వాత ఈవీఎంలను కొంతకాలం తిరిగి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తామని వెల్లడించారు. -
13 సీట్లు మాకే!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో అంచనాలకు అనుగుణంగా మెరుగైన ఫలితాలను సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వివిధ స్థాయిల్లో అభిప్రాయ సేకరణ తర్వాత 13 లోక్సభ స్థానాల్లో విజయ కేతనం ఎగురవేస్తామనే తుది అంచనాకు వచ్చింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నియోజకవర్గాల ముఖ్య నేతలతో మాట్లాడి పోలింగ్ సరళిని సమీక్షించారు.ఏయే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీజేపీ, బీఆర్ఎస్ పోటీ ఇచ్చాయో ఆరా తీశారు. అన్నిచో ట్లా కాంగ్రెస్కు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని, వంద రోజుల కాంగ్రెస్ ప్రజా పాలనకు ఓటేసేందుకు ప్రజలు మొగ్గుచూపారని నేతలు పేర్కొన్న ట్టు తెలిసింది. మొత్తం మీద అన్నివర్గాల నుంచి సానుకూలత వ్యక్తమైందనే అంచనాకు వచ్చారు. పెరగనున్న ఓట్ల శాతం!అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 39.40 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 4 నుంచి 5 శాతం వరకు పార్టీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషించారు. వివిధ సర్వే సంస్థల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ప్రకారం 13 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పక్కాగా గెలిచే అవకాశాలున్నాయని పార్టీ అంచనాకు వచ్చింది. మిగతా నియోజకవర్గాల్లో ఫలితాలు అంచనాకు అందడం లేదనే అభిప్రాయానికి వచ్చింది.గెలిచే స్థానాలు ఇవే..నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మహ బూబాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ సహా నేతలు ధీమా వ్యక్తం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఓటర్ల నాడి అంచనాకు చిక్కలేదనే అభిప్రాయానికి వచ్చారు. మల్కాజిగిరి, కరీంనగర్ వంటి చోట్ల బీజేపీ పోటాపోటీగా ఉందని, ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో గట్టెక్కుతారని పార్టీ నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. రెండో స్థానంలో బీజేపీ?ఈ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ బలం పెరిగి అనూహ్యంగా రెండో స్థానానికి పోటీ పడిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్దపల్లి, వరంగల్, మెదక్, మహబూబాబాద్ లాంటి చోట్ల కూడా బీజేపీ రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నాయి. పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లే బీజేపీకి టర్న్ అయినట్లుగా పార్టీ నేతలు చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రమేనని వారు పేర్కొన్నట్లు తెలిసింది.ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం సమీక్షసాక్షి, హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగను న్న ఉపఎన్నికపై సీఎం ఎ.రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న ఆ మూడు జిల్లాల ముఖ్య నాయకులతో మంగళ వారం రాత్రి ఆయన తన క్యాంపు కార్యాల యంలో భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో దృష్టి సారించి పనిచేయాలని, తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచించారు.ఈ మూడు ఉ మ్మడి జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ స్థానాలుండగా, అందులో 33 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నేపథ్యంలో కీలకంగా వ్యవహరించి మంచి మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నను గెలిపించేందుకు కృషి చేయాలని సీఎం ఆయా జిల్లాల నేతలకు చెప్పారు. -
ఇక ‘పట్టభద్రుల’ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఈ నెల 27న జరిగే శాసనమండలి పట్టభద్రుల కోటా ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం అభ్యర్థిగా వరంగల్కు చెందిన ఏనుగుల రాకేశ్రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి కైవసం చేసుకోవడాన్ని బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే లోక్సభ పోలింగ్ ముగిసిన వెంటనే రంగంలోకి దిగింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం కీలక భేటీ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశంఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2027 ఏప్రిల్ వరకు అవకాశం ఉన్నా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 27న ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్కు కేవలం 12 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ముమ్మర ప్రచారం నిర్వహించేలా కేటీఆర్ బుధవారం జరిగే భేటీలో దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీశ్రావు ప్రచార, సమన్వయ బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కూడా ప్రచారాన్ని సమన్వయం చేస్తారు. మూడు జిల్లాల్లో సుమారు 4.61 లక్షల మంది పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, మహిళలు కీలకం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగించాల్సిన ప్రచారంపై బీఆర్ఎస్ వ్యూహాన్ని ఖరారు చేస్తోంది. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలకు గ్రామాలు, మండలాల వారీగా ఓటర్ల జాబితాను అందజేసి వారితో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది.లోక్సభ పోలింగ్ సరళిపై సమీక్షరెండురోజుల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం కూడా సమీక్షించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ను పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు పార్టీ నేతలు కలిశారు. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా పోలింగ్ సరళిపై ఈ సందర్భంగా ఆయన ఆరా తీశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపారనే కోణంలో చర్చ జరిగింది. కాగా మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమా కేసీఆర్ వ్యక్తం చేసినట్లు నేతలు వెల్లడించారు. -
10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తక్కువలో తక్కువ పది సీట్లు గెలుస్తామని, ఓటర్ల నుంచి అంచనాలకు మించి స్పందన వ్యక్తమైనందున 12 స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యం లేదనే ధీమా రాష్ట్ర బీజేపీలో వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని మోదీ ‘వేవ్’ స్పష్టంగా కనిపించిందని ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. నాలుగు సిట్టింగ్ ఎంపీ సీట్లతోపాటు విజయావ కాశాలు అంతగా లేదని మొదట్లో భావించిన సీట్లలోనూ బీజేపీ సత్తా చాటుతుందని పేర్కొ న్నారు.నాగర్కర్నూల్, వరంగల్, పెద్దపల్లి వంటి సీట్లు కూడా వస్తాయని, ఎన్నడూ ఊహించనంత స్థాయిలో ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. పోలింగ్ సందర్భంగా ప్రజలు బీజేపీని, మోదీని చూశారని, అభ్యర్థులు ఎవరనేది కూడా చూడలేదన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అధ్యక్షతన ముఖ్యనేతలతో నిర్వహించిన సమా వేశంలో ఓటింగ్ సరళిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లోని పరిస్థితులను నాయకులు వివరించారు. ఈ భేటీలో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారీ (సంస్థాగత), బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలపై చర్చపార్టీ కార్యాలయంలో నల్లగొండ–వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న జరగనున్న ఉపఎన్నికపై సన్నాహక సమావే శం జరిగింది. పోలింగ్కు సమయం తక్కువగా ఉన్నందున ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇన్చార్జీలను నియమించుకుని, అన్ని మండలాల్లో పార్టీ నాయకులు పర్యటించేలా కార్యాచరణను సి ద్ధం చేశారు. ఈ ఎన్నిక కోసం ఎన్.రామచంద్రరా వును ఇన్చార్జీగా నియమించారు. పార్టీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి బరిలో ఉన్న ఈ ఎన్నికకు సంబంధించిన కసరత్తు అంతా ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించారు. -
ఆ రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం
సిరిసిల్ల: జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కంటే బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తాయని.. రేపు కేంద్రంలో ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామా రావు పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్లలో ఆయ న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని చెప్పారు. రైతుల రుణాలను మాఫీ చేయకుండా, రూ.500 బోనస్, మహిళలకు రూ. 2,500, పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు తదితర హామీలు ఏమయ్యాయని నిలదీశారు. జనవరి నెల పెన్షన్లు కూడా ఇవ్వకుండా మింగేశారని ఆరోపించారు. కొ త్త జిల్లాల రద్దు, మేడిగడ్డ కుంగుబాటు, శ్వేతపత్రం, ఫోన్ ట్యాపింగ్ అంటూ.. కాంగ్రెస్ ఐదు నెలల పాటు టైంపాస్ పాలన సాగించిందని మండిప డ్డారు. ఈనాడైనా, ఏనాడైనా.. తెలంగాణకు బీఆర్ ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.వారిది ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ..కాంగ్రెస్, బీజేపీ రెండూ ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలు తమ నేతలను చేర్చుకుని టికెట్లు ఇచ్చాయని.. ఒకదానికితోడుగా మరొకటి లోక్సభ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను బరిలో దించాయని విమర్శించారు. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి కరీంనగర్లో పోటీ చేస్తానంటే నిజా మాబాద్ బరిలో దింపారని.. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఎవరికీ తెలియదని చెప్పారు.లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కిషన్రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్రెడ్డి కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ, ఇండియా కూటముల కంటే ప్రాంతీయ పార్టీల కూటమి ఎక్కువ సీట్లు సాధిస్తుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని,. అందులో వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్, బీఆర్ఎస్ పార్టీలు భాగస్వాములవుతాయని కేటీఆర్ చెప్పారు.కేసీఆర్ బస్సుయాత్ర ఎన్నికలను మలుపు తిప్పిందిరాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీ ఆర్ 17 రోజుల పాటు 30 చోట్ల చేసిన బస్సుయాత్ర, రోడ్ షోలు లోక్సభ ఎన్నికలను మలుపు తిప్పాయని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ రాష్ట్రంలో ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి వెళ్లి నా ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. కేసీఆర్ కాలుపెట్టిన ప్రతి చోట ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు గులాబీ సైన్యం గుండెల నిండా ఆత్మవిశ్వాసం కనిపించిందన్నారు. కేసీఆర్ రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించారని చెప్పారు.రుణమాఫీ చేయని రేవంత్రెడ్డి తారీకులు మార్చుతూ, దేవుళ్లపై ఒట్టు వేస్తూ.. కాంగ్రెస్పై నమ్మ కం లేని పరిస్థితిని తెచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరెంట్, తాగునీటి సమస్యలు మొదల య్యాయని.. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అనే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి బాగుండదన్నారు. సమావేశంలో టెస్కాబ్ చైర్మ న్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి లెక్క వారిదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠ రేపుతూనే ఉంది. ప్రధాన రాజకీయ పారీ్టలన్నీ ఎవరి అంచనాలు వారు వేసుకుంటుండటం, అన్ని పార్టీలూ తమకే ఎక్కువ సీట్లు వస్తాయని గట్టిగా వాదిస్తుండటంతో.. ఆసక్తి మరింత పెరుగుతోంది. సోమవారం జరిగిన పోలింగ్ సరళిని విశ్లేíÙంచుకున్నాక కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు తమ అంచనాలను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. పైగా మరిన్ని స్థానాలు అదనంగా గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పెరిగిన పోలింగ్ శాతాన్ని ఎవరికి వారే తమకు అనుకూలమని అంచనా వేసుకుంటుండటం గమనార్హం. అయితే అన్ని పారీ్టలు మహిళలు, గ్రామీణ, పట్టణ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారో అన్నది తేల్చుకునేందుకు ప్రయతి్నస్తున్నాయి. పెరిగినది పాజిటివ్ ఓటింగేనంటున్న కాంగ్రెస్.. ఐదు నెలల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పాజిటివ్ ఓటింగ్ జరిగిందని.. ప్రస్తుతం పెరిగిన ఓటింగ్ శాతం కూడా ప్రభుత్వ అనుకూల ఓటేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని అంటున్నాయి. ప్రధానంగా మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్సు, రూ.500కే సిలిండర్లుతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు, ఎన్నికలకు ముందే రైతుభరోసా నిధులు వెళ్లడం, రైతు రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి ఒట్టు వేసి మరీ ప్రకటించడం వంటివి పాజిటివ్ టాక్ తెచ్చాయని.. అవి ఓట్ల రూపంలో కాంగ్రెస్కే దక్కాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే.. లోక్సభ ఎన్నికల్లో తమకు ఓటింగ్ శాతం పెరుగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీనిచి్చన బీఆర్ఎస్.. లోక్సభ ఎన్నికల్లో పోటీలో లేకుండా పోయిందని చెప్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న ప్రచారం బాగానే ప్రభావం చూపిందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు పన్నెండు నుంచి 13 సీట్లు లభిస్తాయని పేర్కొంటున్నారు. బాగా బలోపేతం అయ్యామంటున్న బీజేపీ.. లోక్సభ ఎన్నికలతో రాష్ట్రంలో మరింతగా బలోపేతం అయ్యామని, ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగామని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రధాని మోదీపై అభిమానం, కేంద్రం గత పదేళ్లుగా అందించిన నీతివంతమైన పాలనకు తగిన ప్రతిఫలం తమకు లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఎంతగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని అంటున్నారు.పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న తాము రాజ్యాంగం జోలికి కానీ, రిజర్వేషన్ల జోలికి కాని వెళ్లని విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని వివరిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో మోదీ మేనియా బాగా వర్కౌట్ అయిందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ, అమిత్ షా సహా జాతీయ నాయకులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడం.. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయడం కలసి వచి్చందని అంటున్నారు. ఈసారి రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు ఖాయమని ధీమాగా చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్కు బీజేపీకి అనుకూలంగా ఉందని.. అసెంబ్లీ ఎన్నికల్లోకు ఓటేయని వర్గాలు కూడా లోక్సభ ఎన్నికల్లో ముందుకు వచ్చి తమకు ఓటు వేశాయని అంటున్నారు. కేసీఆర్ బస్సుయాత్ర ఊపుతో.. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తమకు లాభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల్లో విశేష స్పందన లభించిందని ఆ పార్టీ ముఖ్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి ఇబ్బందులు, జిల్లాల రద్దు వంటి అంశాలతోపాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచిందని అంటున్నారు.ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే బాగుండేదన్న అభిప్రాయానికి వచ్చారని, ఇది తమకు సానుకూలంగా మారిందని అంటున్నారు. రెండు జాతీయ పార్టీలకు నేరుగా తమతోనే పోటీ జరిగిందని చెప్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానం ఎక్కడికీ పోలేదని, కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించామని పేర్కొంటున్నారు. ఆ రెండు పారీ్టలు పారాచూట్ లీడర్లకే ఎక్కువ టికెట్లు ఇవ్వడం కూడా.. కార్యకర్తలు, నేతల్లో అసంతృప్తిని రగిలించిందని అంటున్నారు. -
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
హైదరాబాద్, మే 14, 2024: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు సుమారు నెల రోజుల క్రితం ఓ పెళ్లిలో మటన్ తింటూ, పళ్లు లేకపోవడంతో పొరపాటున ఓ ఎముక మింగేశారు. ఆహారనాళంలో ఇరుక్కుపోయిన ఆ ఎముక.. లోపల రంధ్రం చేసి, తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణమైంది. ఎదభాగం మధ్యలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆ వృద్ధుడు.. ఎట్టకేలకు ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి వచ్చారు.తొలుత నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి ఎముక ఉందన్న విషయాన్ని గుర్తించి, ఎల్బీనగర్ ఆస్పత్రికి పంపారు. ఇక్కడ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాధిక నిట్టల నేతృత్వంలోని వైద్యబృందం ఆయనను క్షుణ్నంగా పరిశీలించి, తగిన పరీక్షలు కూడా చేసి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కొపిక్ ప్రొసీజర్తోనే ఎముకను అత్యంత జాగ్రత్తగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డాక్టర్ రాధిక తెలిపారు.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేన్ గ్రామానికి చెందిన 66 ఏళ్ల శ్రీరాములుకు దవడ పళ్లు లేవు. దానివల్ల నమలలేరు. కానీ ఒక పెళ్లికి వెళ్లి, అక్కడ మటన్ ఉండటంతో తినాలనుకున్నారు. పళ్లు లేకపోవడం వల్ల నమలకుండా నేరుగా మింగేశారు. అలా మింగినప్పుడు దాదాపు 3.5 సెంటీమీటర్ల పొడవున్న ఒక ఎముక ముక్క కూడా లోపలకు వెళ్లిపోయింది. వెళ్లిన విషయం కూడా తొలుత ఆయనకు తెలియలేదు. రెండు మూడు రోజుల తర్వాత ఛాతీలో నొప్పి అనిపించింది. స్థానికంగా వైద్యులకు చూపిస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుని మందులు ఇచ్చారు. కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. దాంతో తర్వాత నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి చూసి, లోపల ఎముక ఇరుక్కుందన్న విషయం చెప్పారు. అక్కడినుంచి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి పంపారు.సాధారణంగా ఇలా ఇరుక్కున్న ఎముకలను ఎవరైనా తీసేస్తారు. కానీ, నెల రోజులుగా అది ఇరుక్కుపోవడం వల్ల ఆహారనాళానికి రంధ్రం చేసిసింది. ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి, పుండ్లు కూడా పడ్డాయి. కొంత చీము చేరింది. దానికితోడు ఇదంతా గుండెకు బాగా దగ్గరగా ఉంది. అలాంటప్పుడు తీసే సమయంలో ఏమాత్రం కొంత అటూ ఇటూ అయినా ఆహారనాళానికి పూర్తిగా రంధ్రం పడిపోయి, అది గుండెకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. దీన్ని అత్యంత జాగ్రత్తగా ఎండోస్కొపీ ప్రొసీజర్లోనే తొలగించాం. లేనిపక్షంలో అక్కడ పెర్ఫొరేషన్ లాంటి మరిన్ని సమస్యలు వచ్చేవి.ఈ ప్రక్రియ చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా జాగ్రత్తలు చెప్పాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అన్నం తింటే ఆ మెతుకులు మళ్లీ ఇన్ఫెక్షన్ అయిన పుండ్ల వద్దకు చేరి, అక్కడ ఆగిపోయి మళ్లీ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. అందుకే ఆయనకు కొంతకాలం పూర్తిగా ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పాం. కొబ్బరినీళ్లు, మంచినీళ్ల లాంటివి తీసుకోవాలన్నాం. ఇప్పుడు ఎముక వల్ల వచ్చిన నొప్పి ఆయనకు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడే కొద్దిగా జొన్న అన్నం, పెరుగు అన్నం తినగలుగుతున్నారు.ఏ వయసువారైనా తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ఇక కాస్త పెద్దవయసు వచ్చి, పళ్లు ఊడిపోయిన తర్వాత అయితే ఏదైనా బాగా ఉడకబెట్టుకుని, మెత్తగా అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఎముకలను ఎవరైనా యథాతథంగా తినకూడదు. కానీ ఈ కేసులో ఆయనకు పళ్లు లేకపోవడంతో తెలియక, పొరపాటున మింగేశారు. అది సమయానికి తియ్యకపోతే ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఆహారనాళానికి రంధ్రం కూడా పెద్దది అయిపోతుంది. అప్పుడు తప్పనిసరిగా మేజర్ సర్జరీ చేయాలి. చీము పడుతుంది. ఇలా ఒక నెల రోజుల పాటు ఎముక లోపల ఉండిపోవడం ఎప్పుడూ చూడలేదు” అని డాక్టర్ రాధిక నిట్టల వివరించారు. -
No Headline
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా మరోమారు అట్టడుగునే నిలిచింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలింగ్ శాతం పెరగలేదు. గత లోక్సభ ఎన్నికల్లో జిల్లాలో 45.65 శాతం పోలింగ్ జరగ్గా ఈసారి దాదాపు 47 శాతం నమోదైనట్లు సమాచారం. ఎండ తీవ్రత వల్ల కూడా పోలింగ్పై ప్రభావం ఉంటుందని భావించినప్పటికీ సోమవారం ఎండ లేకపోవడం కొంతమేర ఊరటనిచ్చింది. కానీ ఆశించిన మేర పోలింగ్ పెరగలేదు. ప్రతిసారీ రాజధాని నగరమైన హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం తక్కువగా ఉండటంపై కలవరపడ్డ అధికార యంత్రాంగం వాస్తవానికి ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. రెండు నెలలుగా స్వీప్ కార్యక్రమాల కింద విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. బాగా చదువుకున్నప్పటికీ, ఎన్నికల నిరక్షరాస్యులుగా మిగలొద్దని ప్రజలను కోరింది. అయినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించలేదు. జాబితా ప్రక్షాళన కాకపోవడమే.. నిజానికి గతంలో కంటే నగర జనం ఎక్కువ సంఖ్యలోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఓట్లు వేశారు. అయినప్పటికీ పోలింగ్ శాతం తక్కువగానే ఉండటానికి వివిధ కారణాలున్నాయి. ముఖ్యంగా ఓటరు జాబితా ప్రక్షాళన కాకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లున్నవారు గణనీయంగా ఉన్నారు. అలాంటి వారిని తొలగించేందుకు గత రెండు సంవత్సరాలుగా జిల్లా ఎన్నికల యంత్రాంగం పనిచేస్తున్నప్పటికీ, పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరగలేదు. దాంతో ఓటర్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నందున పోలింగ్ శాతం తక్కువగా మాత్రమే నమోదవుతోంది. తరలిన ఓటర్లు.. అటు ఏపీలో ఓట్లున్నవారిలో చాలామంది అక్కడకు వెళ్లారు. అలాంటి వారిలోనూ చాలామందికి ఇక్కడ కూడా ఓట్లున్నాయని చెబుతున్నారు. ఒకేరోజు పోలింగ్ రావడంతో ఉపాధి, వృత్తి, వ్యాపారాల కోసం ఇక్కడ ఉంటున్న వారు స్వస్థలానికే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో లక్షల సంఖ్యలో ఏపీకి ఓటర్లు తరలి వెళ్లారు. కొందరు తెలంగాణ జిల్లాల్లోని సొంత ఊర్లకు వెళ్లారు. ఇందువల్లే నగరంలో గతంలో ఇళ్లు కదలని వారు సైతం ఈసారి ఓట్లు వేసినా పోలింగ్ శాతం పెరగలేదు. నగర ప్రజలు ఓట్లేస్తున్నప్పటికీ, ఇలా వివిధ కారణాలతో ఆ మేరకు శాతం పెరగక బద్ధకస్తులనే ముద్ర తొలగిపోవడం లేదు. ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయనంతవరకు ఈ పరిస్థితి తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్డేట్ కాని పోల్ క్యూ యాప్ పోల్ క్యూ రూట్ యాప్ ద్వారా తమ పోలింగ్ కేంద్రంలో ఎందరు క్యూలో ఉన్నారో తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు ప్రకటించినప్పటికీ, చాలా పోలింగ్ కేంద్రాల వివరాలు అప్డేట్ కాలేదు. అరగంటకోమారు అప్డేట్ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ మూడు నాలుగు గంటల వరకు కూడా అప్డేట్ జరగకపోవడంతో ప్రజలకు అది ఉపకరించలేదు. -
No Headline
మందకొడిగా పోలింగ్ పోలింగ్ నగరంలో మందకొడిగానే సాగింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ మొదటి రెండు గంటల్లో 6 శాతం పోలింగ్ కూడా కాలేదు. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 40 శాతం నమోదైంది. పోలింగ్ ప్రశాంతం:రోనాల్డ్రాస్ హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు. అక్కడక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ సందర్భంగా ఈవీఎంలలో కొన్ని సమస్యలు తలెత్తగా వెంటనే వాటిని సంబంధిత ఇంజనీర్స్తో సరిచేయించినట్లు తెలిపారు. మొఘల్పురా, హరిబౌలి ప్రాంతాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన పోలింగ్ ప్రక్రియ పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. అంతకుముందు మాదాపూర్లోని వెంకటేశ్వర ఫైనార్ట్స్ కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కంట్రోల్రూమ్ నుంచి మానిటరింగ్ జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించి, కొన్ని పోలింగ్ కేంద్రాల్లోని అధికారులకు సూచనలు చేశారు. ఓటరు హెల్ప్లైన్ ఫిర్యాదు కేంద్రాన్ని, ఎంసీసీ కేంద్రంలో సిబ్బంది పనితీరును పరిశీలించారు. -
కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 50.2 శాతం పోలింగ్
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ సాయంత్రానికి కాస్త మెరుగుపడింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఒక శాతం అధికంగా పోలింగ్ జరిగింది. ఆరు నెలల క్రితం నాటి ఓటర్ల కంటే కూడా 3 వేల మంది ఓటర్ల సంఖ్య పెరగడంతో పాటు ఒక శాతం అధిక ఓటింగ్ కారణంగా పోలైన ఓటర్ల సంఖ్య దాదాపు 4 వేలు పెరగనుంది. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో 49.18 శాతం మంది ఓటేశారు. సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో 50.2 శాతం మంది ఓటేసినట్లు సమాచారం. -
ఎవరి లెక్కలు వారివే
బౌరంపేటలో బారులు తీరిన ఓటర్లు● బూత్ల వారీగా పోలింగ్పై అంచనాలు ● చివరి నిమిషం వరకు ఓటర్ల తరలింపులో నిమగ్నం ● గుంభనంగా తీర్పును నిక్షిప్తం చేసిన ఓటరు సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికలు ముగిశాయి. అంచనాలు ఆరంభమయ్యాయి. గ్రేటర్లోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరికి వారు గెలిచి తీరుతామనే ధీమాతోనే ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఇచ్చిన హామీలు, ప్రచారతీరు, పార్టీల విధానాలు, వైఖరులు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్ధులు, అనుచరగణాలు లెక్కలు వేస్తున్నాయి. మరోవైపు స్థానికంగా నియోజకవర్గాల్లో తమకు పట్టు ఉన్న ప్రాంతాలు, సామాజిక వర్గాల వారీగా కూడా అభ్యర్థులు భవిష్యత్పైన ఆశలు పెంచుకుంటున్నారు. బలమైన ఓటు బ్యాంకులుగా భావించే వర్గాలపైన ఆశలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీలు అనుసరించిన వైఖరులు కూడా తమను విజయతీరాలకు తీసుకెళ్తాయనే భావన కూడా అభ్యర్థుల్లో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చవి చూసింది. దీంతో బీఆర్ఎస్ ఓటర్లు తమ వైపు మొగ్గుచూపుతారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల ఆ పార్టీ ఓట్లు క్రాస్ ఓటింగ్తో బీజేపీ ఖాతాలో చేరుతాయని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో గ్రేటర్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ ఓటర్లంతా ఇప్పుడు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే భావన ఉంది. అదే సమయంలో గ్రేటర్లో తమకు స్థిరమైన ఓటు బ్యాంకు ఉందని, కచ్చితంగా లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు దక్కుతాయనే భరోసా బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మైనారిటీల ఓట్లపై ఆశలు... బీఆర్ఎస్పై వ్యతిరేకత వల్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లపైన ఆశలు పెట్టుకుంది. ఎంఐఎంతో కాంగ్రెస్కు స్పష్టమైన అవగాహన ఏర్పడింది. దీంతో మైనారిటీ ఓట్లు తమకే పడుతాయని కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని, ఆ పార్టీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ఎన్నికల ప్రచారం కూడా తమకు బాగా కలిసి వచ్చే అంశమని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఎస్సీ,ఎస్టీ, బీసీ, తదితర అణగారిన వర్గాల ఓట్లు గంపగుత్తగా తమ ఖాతాలోనే వచ్చిపడుతాయని కాంగ్రెస్ అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ‘బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి మాత్రమే పడుతుందనే అభిప్రాయం సరైంది కాదు. అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ ఓట్లు పడే అవకాశం ఉంది.’’ అని కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం తాము చేపట్టబోయే ప్రాజెక్టులు కాంగ్రెస్కు సానుకూలతను తెచ్చి పెట్టాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయోధ్య రాముడు గెలిపిస్తాడా... గ్రేటర్లో యువత, ఐటీ వర్గాలు తమకు బలమైన ఓటు బ్యాంక్ అని బీజేపీ అంచనాలు వేస్తుంది. దేశ అంతర్గత భద్రతపైన మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో మోదీ హయాంలోనే ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట పెరిగిందనే భావన కూడా యువతలో బలంగా ఉంది. ఈ రెండు అంశాలతో పాటు అయోధ్యలో రామాలయ నిర్మాణం వల్ల హిందువుల ఓట్లు తమకే పడుతాయని బీజేపీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. -
ఫలించిన పోలీసు వ్యూహం!
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్ సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసుల వ్యూహం..దాదాపు రెండు నెలలుగా తీసుకున్న చర్యలు వెరసి సోమవారం చెదురుమదురు ఘటనలు మినహా పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆస్మాన్ఘడ్లోని పోలింగ్ కేంద్రంలో వివాదాస్పదంగా ప్రవర్తించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై మలక్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నగర వ్యాప్తంగా ఉన్న, కొత్తగా ఏర్పాటు చేసిన 6 వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్లోని ఐసీసీసీకి అనుసంధానించిన అధికారులు అక్కడ నుంచి పరిస్థితులను పర్యవేక్షించారు. నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి స్వయంగా అనేక పోలింగ్ బూత్లకు వెళ్లి పరిస్థితులు సమీక్షించారు. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అందించిన సమాచారం చాలా కీలకంగా మారింది. వీటి ఆధారంగా పోలీసు విభాగం అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను పక్కాగా గుర్తించగలిగారు. దీని ఆధారంగా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటూ వెళ్లారు. దాదాపు ప్రతి అభ్యర్థితో పాటు అనుచరుల్లోనూ కీలకమైన వారిని అనునిత్యం వెంటాడటానికి నగర పోలీసులు షాడో టీమ్స్ను రంగంలోకి దింపారు. పోలింగ్ రోజున కూడా దాదాపు 100 పార్టీలు విధుల్లో ఉన్నాయి. ఫలితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోగలిగారు. పోలింగ్ రోజు చివరి రెండు గంటలు అయిన మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 మధ్య సమయం అత్యంత కీలకం. ఈ వేళల్లోనే దొంగ ఓట్లు ఎక్కువగా పడటం, ఘర్షణలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం ‘ఆ రెండు’ గంటలూ అత్యంత అప్రమత్తమైంది. రిజర్వ్లో ఉన్న బలగాలను సైతం ఏరియాల్లోకి పంపించి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. కాగా అనేక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడానికి పార్కింగ్ ప్రధాన కారణమైంది. -
ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని ఆరు రోజులపాటు(మే 20) వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమె కస్టడీ మంగళవారంతో ముగియడంతో నేడు రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్గా హాజరుపరిచారు. 14 రోజుల పాటు కవిత జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, చార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు తెలిపింది.8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ చెప్పింది. దీనిపై స్పందించిన కోర్టు మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని తెలిపింది. ఈ క్రమంలో కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు స్పెషల్ కోర్టు జడ్జి వెల్లడించారు. కాగా సీబీఐ కేసులోనూ గతంలో కవితకు మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement