Hyderabad
-
ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావ్?
హైదరాబాద్: భర్త మందలించడంతో భార్య ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన సంఘటన ఆదివారం కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండలం, నాగారానికి చెందిన పెంట శ్రీను తన భార్య రమాదేవి ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందని మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన భార్య ఈ నెల 19న హెచ్బీకాలనీలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మరుసటి రోజు భర్త శ్రీను హెచ్బీకాలనీకి వెళ్లి చూడగా, భార్య అక్కడే ఉంది. అదేరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరకి చెప్పకుండా బయటకు వెళ్లిన రమాదేవి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెతికిన ఫలితం లేకపోవడంతో ఆదివారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భర్తతో గొడవపడి ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దోమలగూడ పీస్ పరిధిలోని దోమల గూడ అడ్వొకేట్స్ కాలనీలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.మధుసూదనరావు వివరాల ప్రకారం..కాలనీలో నివాసం ఉండే గౌసియా బేగం (32) మణికంఠ రాజు తొమ్మిదేళ్ల క్రితం (2015)లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి విక్రాంత్(9) కుమారుడు ఉన్నాడు. గౌసియా వృత్తిరీత్యా న్యాయవాది. కొంత కాలం క్రితం హందూజా ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మణికంఠ బజాజ్ ఫైనాన్స్లో రికవరీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య భర్తలు తరచూ గొడవలు పడేవారు. ఆరు నెలల నుంచి గొడవల కారణంగా మణికంఠ రోజూ మద్యం తాగివచ్చి గౌసియాను వేదిస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో శనివారం రాత్రి కూడా గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన గౌసియా ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గౌసియా కుటుంబ సభ్యులు దోమలగూడ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. డబ్బుల కోసం తన కూతురిని నిత్యం వేదించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని, ఇందుకు కారణమైన ఆమె భర్త మణికంఠపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి ఆమీదా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ తెలిపారు. -
పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..
విదేశీ పళ్లు.. ప్రస్తుతం సూపర్ మార్కెట్ల నుంచి తోపుడు బండ్ల వరకు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. అయితే, ప్రతి పండు వెనుక ఉండే ‘కెమికల్ కథ’ మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో లేదా దెబ్బ తీయడంలో కీలకపాత్ర పోషిస్తోందన్న విషయం మీకు తెలుసా? హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో విదేశీ పండ్ల వినియోగం 5 ఏళ్లలో బాగా పెరిగింది. వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) లెక్కల ప్రకారం 2024–25లో రూ.8,500 కోట్ల విలువైన పండ్లు దిగుమతి అయ్యాయి. అమెరికా యాపిల్స్, న్యూజిలాండ్ కివీ, చిలీ చెర్రీలకు డిమాండ్ ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్3, 4తో మొదలైతే ప్రమాదం... 9తో మొదలైతేనే భద్రంపండ్లపై ఉండే ప్రైస్ లుక్–అప్ (పీఎల్యూ) కోడ్లోనే అసలు రహస్యం ఉంది.4 అంకెలు.. 3 లేదా 4తో మొదలు: రసాయన ఎరువులతో పండించినవి.5 అంకెలు.. 9తో మొదలు: 100 శాతం సేంద్రియం.5 అంకెలు.. 8తో మొదలు: జన్యు మార్పిడి (జీఎమ్వో) పండ్లు. భారత్లో నిషేధం.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏమంటోంది అంటే..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రసాయన అవశేషాలతో కాలేయం, కిడ్నీలు దెబ్బ తింటాయి. పిల్లల్లో హార్మోన్ల సమస్యలు, పెద్దల్లో క్యాన్సర్ వస్తాయి. అమెరికా యాపిల్ను 6 నెలలు నిల్వ ఉంచేందుకు ‘డైఫినైల్ అమైన్’ వాడతారు. ఇది యూరప్లో నిషేధం.స్టిక్కర్ కోడ్ చెక్ చేయండికొనేముందు 5 సెకన్లు కేటాయించి స్టిక్కర్ చూడండి. 9తో మొదలయ్యే కోడ్ ఉంటేనే కొనండి. స్టిక్కర్ లేకుంటే ముట్టుకోవద్దు. గర్భిణులు, పిల్లలకు కెమికల్ పండ్లు వద్దని నిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.నిబంధనలు ఏవి?భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రకారం కాల్షియం కార్బైడ్తో మాగబెడితే రూ.10 లక్షల జరిమానా, 6 నెలల జైలు విధించాలి. కానీ దిగుమతి పండ్లపై తనిఖీలు లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. -
కొత్త కార్డులు హుళ క్కే!
సాక్షి, సిటీబ్యూరో: సరూర్ నగర్లోని పేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఏడాదికిపైగా గడిచింది. ఇప్పటివరకు కనీసం క్షేత్ర స్థాయి విచారణ జరగలేదు. సర్కిల్ ఆఫీస్కు వెళ్లి సిబ్బందిని అడిగితే సరైన సమాధానం లేకుండా పోయింది. దీంతో ఉచిత బియ్యంతో పాటు ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తింపు లేకుండా పోయింది. ఇలా ఒక శ్రీనివాస్ సమస్యే కాదు.. మహా హైదరాబాద్లో రేషన్ కార్డు మంజూరుకాని లక్షలాది మంది పేదలదీ ఇదే పరిస్థితి.కొత్త రేషన్ (ఆహార భద్రత) కార్డు మంజూరు ప్రక్రియ ఆగినట్టేనా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటూ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. మహా నగర పరిధిలో కేవలం దరఖాస్తులను స్వీకరిస్తున్నప్పటికీ.. వాటిని పరిశీలించి కార్డుల మంజూరు మాత్రం తాత్కాలికంగా పెండింగ్లో వేసినట్లు కనిపిస్తోంది. ఫలితంగా లక్షలాది మంది అర్హులైన పేద ప్రజలు రేషన్ బియ్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ప్రతిరోజూ వందలాది కుటుంబాలు పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో మీ–సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల చేసుకుంటున్నాయి. దరఖాస్తులు మాత్రం లాగిన్లకు పరిమితమవుతున్నాయే తప్ప క్షేత్రస్థాయి పరిశీలనకు మాత్రం మోక్షం లభించడం లేదు. దీంతో పెండెన్సీ పేరుకుపోతోంది.దరఖాస్తుదారుల ప్రదక్షిణ.. మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పేదలు వాటి హార్డ్ కాపీలను పౌరసరఫరాల విభాగం సర్కిల్ ఆఫీసులో సమరి్పంచి ఆ తర్వాత దరఖాస్తు స్థితి (స్టేటస్) తెలుసుకోవడానికి కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సర్కిల్ ఆఫీసుల్లో సిబ్బందిని అడిగితే ‘పై నుంచి ఆదేశాలు రావాలి’.. ‘సర్వర్ సమస్య’ అంటూ దాటవేస్తున్నారు. మరోవైపు పౌరసరఫరా విభాగాల్లో సర్కిల్ ఆఫీసుల్లో తీవ్ర సిబ్బంది కొరత వేధిస్తోంది. ఒకవైపు ఇతర ప్రభుత్వ విధులతో తీరికలేకుండా ఉండటం, మరోవైపు క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో విచారణ ప్రక్రియ పూర్తిగా స్తంభించినట్లు తెలుస్తోంది. కాగా.. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం కార్డుల సంఖ్య సుమారు 2.41 లక్షల మించలేదు. మరోవైపు 30 శాతంపైగా దరఖాస్తులు పెండింగ్లో మగ్గుతున్నాయి. పెరిగిన ప్రాధాన్యం..కేవలం చౌకధరల దుకాణంలో బియ్యం తీసుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా రేషన్ కార్డు బహుళ ప్రయోజనకారిగా పని చేస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు, గృహజ్యోతి (ఉచిత విద్యుత్), సబ్సిడీ సిలిండర్లు వంటి ప్రతి సంక్షేమ పథకానికి ఇది ప్రామాణికంగా మారడంతో కొత్త కార్డులకు ప్రాధాన్యం పెరిగింది. -
అద్భుతం.. అదిత్రి అరంగేట్రం
హైదరాబాద్: అమెరికాలో పుట్టి పెరిగిన అదిత్రి వైష్ణవి చేపూర్ కూచిపూడి అరంగేట్రం నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. బేగంపేటలోని సెస్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ప్రముఖులతో పాటు ఆమె రెండు తరాల కుటుంబసభ్యుల మధ్య అరంగేట్రం చేసి తన కలను సాకారం చేసుకుంది. గురువు రేవతి కొమండూరి వద్ద నృత్యం నేర్చుకున్న ఆమె వేదికపై అద్భుతమైన హావభావాలు పలికించి అబ్బురపరిచారు. అన్నమాచార్య కీర్తనతో సాగిన అరంగేట్ర నృత్య ప్రయాణం శివుని స్తుతిస్తూ తాండవేశ్వర..చివరగా థిల్లానాతో ముగిసింది. అదిత్రి వెష్ణవి తల్లిదండ్రులు భానుచందర్, సరితలు అమెరికన్ సిటిజన్స్ కాగా..వారి కూతురు అదిత్రి లా అండ్ సైకాలజీ శాస్త్రంలో విద్యనభ్యసిస్తున్నారు. తన ఏడేళ్ల ప్రాయం నుంచి కూచిపూడి నృత్య శిక్షణ తీసుకుంటూ వచ్చారు. నగరంలో ఉండే తాతయ్యలు, అమ్మమ్మ, నాన్నమ్మలు ముందు తన అరంగేట్రం జరగాలన్న ఆమె కోరికను నెరవేర్చుకున్నారు. మనవరాలి కూచిపూడి అరంగేట్రం తిలకించిన నాన్నమ్మ, తాతయ్య దేవి, జనార్దన్రావు, అమ్మమ్మ, తాతయ్య మంజులత, శ్యాంసుందర్లు ఆనందం వ్యక్తం చేశారు. -
హైటెక్ – హైరిస్క్
1990ల చివరలో ప్రారంభమైన ఐటీ విప్లవం హైదరాబాద్ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్గూడా వంటి ప్రాంతాలు ప్రపంచస్థాయి వ్యాపార కేంద్రాలుగా ఎదిగాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెలాయిట్, యాక్సెంచర్ వంటి సంస్థలు వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించాయి.దేశం నలుమూలల నుంచి యువత ఇక్కడికి వచ్చారు. అధిక వేతనాలు, వేగవంతమైన జీవనశైలి, ఆర్థిక స్వేచ్ఛ నగర సంస్కృతిని కొత్త దిశలో నడిపించాయి. పబ్లు, లాంజ్ బార్లు, వీకెండ్ పార్టీలు, ఫామ్హౌజ్ ఈవెంట్లు వేగంగా విస్తరించాయి. నైట్ లైఫ్ ఉండటం తప్పు కాదు. ప్రపంచంలోని ప్రతి ఆధునిక నగరంలో అది ఉంటుంది. కానీ వినోదం నియంత్రణ కోల్పోయినప్పుడు, స్వేచ్ఛ బాధ్యతను విస్మరించినప్పుడు, రాత్రి జీవితం చట్టాన్ని సవాలు చేయడం మొదలైనప్పుడు సమస్యలు మొదలవుతాయి.ప్రస్తుతం హైదరాబాదులో వందల సంఖ్యలో పబ్లు, నైట్ క్లబ్బులు పని చేస్తున్నాయి. వీటి చుట్టూ కోట్లాది రూపా యల వినోద ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, సెల బ్రిటీ సంస్కృతి యువతలో ఒక భ్రమను సృష్టిస్తున్నాయి. మద్యం సేవించడం, పార్టీలకు హాజరుకావడం వంటివి ఆధునికతకు చిహ్నంగా యువత భావిస్తోంది. ఇదే వాతావరణాన్ని డ్రగ్స్ మాఫియా అవకాశంగా మార్చుకుంటోంది. ఒకప్పుడు గంజాయికి పరిమి తమైన మాదకద్రవ్యాల నెట్వర్క్ ఇప్పుడు ఎమ్డీఎమ్ఏ, ఎల్ఎస్డీ, కోకైన్ వంటి సింథటిక్ డ్రగ్స్ వరకు విస్తరించింది. డార్క్వెబ్, క్రిప్టోకరెన్సీల సహా యంతో జరిగే అక్రమ వ్యాపారం యువతను లక్ష్యంగా చేసుకుంటోంది. హైదరాబాద్ ఎందుకు డ్రగ్స్ మాఫియాకు ఆకర్షణీయంగా మారింది? అధిక ఆదాయం కలిగిన యువ జనాభా, అంతర్జాతీయ కనెక్టివిటీ, నైౖట్లైఫ్, ఫామ్ హౌజ్ సంస్కృతి... ఇవన్నీ కారణాలే.అభివృద్ధి అంటే ఐటీ టవర్లు, ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్లు, స్కైస్క్రాపర్లు మాత్రమే కాదు. మహిళలు రాత్రి వేళ భయపడకుండా ప్రయాణించగలగడం, యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, చట్టం పట్ల గౌరవం ఉండటం కూడా అభివృద్ధి సూచికలే. స్వేచ్ఛ–అనాగరికత మధ్య గీత చెదిరి పోకుండా కాపాడుకోవడం సమాజం బాధ్యత. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వం, పోలీసులు, కుటుంబాలు, విద్యాసంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయాలి. చివరికి ప్రశ్న ఒక్కటే– మన యువతను, నగర భవి ష్యత్తును కాపాడగలమా? సమాధానం కాలం కాదు, మన చర్యలే చెబుతాయి. – డా‘‘ బి. హర్షిణి ‘ సైకియాట్రిస్ట్ -
బిల్డర్ను మోసం చేసిన ముగ్గురు మహిళలు
బంజారాహిల్స్: ఒక నకిలీ విల్డీల్ను సృష్టించి అసలు నిజాన్ని దాచిపెట్టి నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన ముగ్గురు మహిళలపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్లోని వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థతో ఎం.కాంతరాజులు వారసులైన ముగ్గురు మహిళలు 2020లో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. భూమిని డెవలప్మెంట్ కోసం బిల్డర్కు ఇచ్చారు. అయితే ముగ్గురు మహిళలు కుట్రపూరితంగా వ్యవహరించారని ‘వంశీరామ్’సంస్థ ప్రతినిధి విశ్వరాజ్ మోహన్ కోర్టును ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగుచూసింది. నకిలీ విల్డీడ్ సృష్టించి నిజాన్ని దాచి, ఆ నకిలీ పత్రాల ఆధారంగా 2025 జనవరిలో మూడో వ్యక్తి కి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. నిందితులు అక్రమంగా లాభపడ్డారని వంశీరామ్ బిల్డర్స్ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో సంతోష్కుమారి, సద్గుణ, అనురాధ అనే ముగ్గురు మహిళలపై చీటింగ్, పోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంచిని పెంచే ‘సరిగమల ఖాకీ’
పోలీసులంటేనే నిత్యం ఏదో ఒక ఒత్తిడి, బందోబస్తులు, కేసులు, గొడవలు, కొట్లాటలు ఒక్కోసారి వ్యక్తిగత జీవితానికి కూడా సరిగ్గా సమయం ఇవ్వలేని విధులు... కానీ తనకున్న కళతో ఓ అధికారి ఒక వైపు వి«ధులను సక్రమంగా నిర్వహిస్తూనే మరో వైపు సమాజంలో యువతను, పౌరుల్లో స్ఫూర్తి నింపుతూ ముందుకు సాగుతున్నాడు.నగరంలోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న బోడసింగి సురేష్ కుమార్ దేశ భక్తిగీతాలు ఆలపించడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు నిజ జీవిత సంఘటనలపై పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. 2007 బ్యాచ్కు చెందిన సురేష్ గతంలో పని చేసిన జిల్లాలో సైతం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదో ఒక ప్రాంతంలో యువతను, స్థానికంగా ఉండే ప్రజలకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.పాటకు దేన్నైనా మార్చే శక్తి ఉంటుందని, మంచిని పెంచడానికి పది మందిలో స్ఫూర్తిని నింపి మంచి మార్గంలో నడిపించేందుకు పాట ఒక ఆయుధంగా పని చేస్తుందనే విషయాన్ని తాను నమ్ముతానని సురేష్ కుమార్ చెబుతున్నారు. ఇప్పటి వరకు సురేష్ కుమార్ సమాజాన్ని మేల్కొల్పేందుకు రచించిన జై భారత్ జెండా, షీ టీమ్స్ వల్ల అమ్మాయిలకు ఎటువంటి రక్షణ లభిస్తుందో తెలియజేసే పాట, పల్లెను వదిలి పట్నానికి రాలేని ఓ పల్లెటూరి వ్యక్తి బాధ, అడవుల వల్ల కలిగే ప్రయోజనాలు, అడవుల పరిరక్షణకై ఓ పాట, తండ్రి ప్రాముఖ్యత, పిల్లల కోసం తండ్రి చేసే త్యాగాలు, తండ్రి కష్టాన్ని తెలియజేసేలా రచించిన పాట ఇలా ఎన్నో రకాల పాటలను పాడి ఆకట్టుకున్నారు.ఏదైనా విషయాన్ని పాట రూపంలో చెప్తే అందరూ అటెన్షన్లోకి వస్తారని అందులోనూ ఖాకీ యూనిఫాం ధరించి తాను పాట పాడుతుంటూ అంతా కూడా ఆసక్తిగా చూడటంతో పాటు పాట భావాన్ని అర్థం చేసుకొని మంచి మాటలు వినేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. కరోనా సమయంలో కూడా భయపడవద్దని, ఎలా ఉండాలో చెప్పేందుకు ప్రత్యేకంగా ఓ సాంగ్ను తయారు చేయించి మరీ పాడారు.పాట రూపంలో చెప్తే అందరూ వింటారు..చదువుకునే రోజుల నుంచే నాకు పాటలంటే ఇష్టం. పోలీస్ ఉద్యోగం వచ్చినా కూడా పాడే అలవాటును మాత్రం వదులుకోలేదు. శాంతి భద్రతల పరిరక్షణతో ఓ వైపు కషి చేస్తూనే మరో వైపు సమాజంలో మంచిని పెంచేందుకు పాటల రూపంలో కషి చేస్తూనే ఉన్నా. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్షర జ్ఞానం లేని వారినే కాదు బాగా చదువుకున్న వాళ్ళను కూడా సైబర్ నేరగాళ్ళు మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని తీసుకొని సైబర్ నేరగాళ్ళతో అప్రమత్తంగా ఉండాలంటూ ఓ పాటను తయారు చేయించి పాడబోతున్నాను. మా ఉన్నతాధికకారులు కూడా నా ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. - బోడసింగి సురేష్ కుమార్, సీఐ రాంగోపాల్పేట -
‘గుర్తింపు’ గండం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ గాలిలో ఊగిసలాడుతోంది. కాలేజీల్లో చేరినా వాటికి గుర్తింపు ఉందా? లేదా? అన్న డోలాయమానంలో పడిపోయారు. అన్ని జిల్లాల్లో ఈ అయోమయం నెలకొన్నా ఇంటర్మీడియెట్ బోర్డు ఏమాత్రం చలించడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా 3,400 జూనియర్ కాలేజీలున్నాయి. ప్రైవేటు రంగంలో 1400. ప్రభుత్వ రంగంలో ఉన్న 800 కాలేజీలకు బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ప్రైవేటు రంగంలో ఉన్న వాటిల్లో కేవలం 209కి మాత్రమే బోర్డు గుర్తింపు వచ్చింది. వెయ్యికి పైగా కాలేజీలకు అఫ్లియేషన్ ఎందుకు ఆపారో బోర్డు అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఈ విషయమై ప్రశ్నిస్తే ‘చూస్తాం... ఇస్తాం... చేస్తాం...’ అంటూ దాటవేస్తున్నారు. అనుబంధ గుర్తింపును ఏప్రిల్ నాటికే పూర్తి చేస్తామని గతంలో అధికారులు చెప్పారు. ఇంటర్ షెడ్యూల్ ప్రకారం చూసినా మే నెలాఖరుకే గుర్తింపు ఇవ్వాలి. ప్రైవేటు కాలేజీలను తనిఖీలు చేసి, నివేదికలను బోర్డుకు పంపామని జిల్లా అధికారులు కూడా చెబుతున్నారు. ప్రైవేటువే కాదు కొన్ని మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, సంక్షేమ గురుకులాలకు కూడా బోర్డు అనుమతినివ్వలేదు. వాటిని ధ్రువీకరించేదెవరు?ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కాలేజీలు అవసరమైన ధ్రువపత్రాలన్నీ సమర్పించాయి. అగ్నిమాపకశాఖ, శానిటేషన్, ట్రాఫిక్, భవన పటిష్టత వంటి పత్రాలను బోర్డుకు ఇచ్చాయి. వీటన్నింటినీ అధికారులు స్వయంగా పరిశీలించాలని ఇంటర్ కార్యదర్శి భావిస్తున్నట్టు తెలిసింది. క్షేత్రస్థాయి అధికారులు కాలేజీలతో కుమ్మక్కై వాటిని ధ్రువీకరించారనేది కార్యదర్శి అనుమానం. వాస్తవానికి బహుళ అంతస్తుల భవనాల్లో నడిచే కాలేజీలకు అగ్నిమాపక శాఖ ఎప్పట్నుంచో అనుమతి ఇవ్వొద్దని చెబుతోంది. పరీక్షలు దగ్గరపడే వరకూ అనుమతులూ ఇవ్వడం లేదు. ఆఖర్లో విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అఫ్లియేషన్ ఇస్తున్నట్టు చెబుతున్నాయి. అఫ్లియేషన్ లేకున్నా అడ్మిషన్లుఅనుబంధ గుర్తింపు లేకున్నా అన్ని కాలేజీలూ పెద్దఎత్తున విద్యార్థులను చేర్చుకున్నాయి. రూ. 80వేల నుంచి రూ. 4 లక్షల వరకూ వార్షిక ఫీజు దండుకున్నాయి. జూన్ 1 నుంచే క్లాసులు మొదలు పెట్టాయి. అయినా అధికారులు గుర్తింపులేని కాలేజీలను అడ్డుకునే సాహసం చేయడం లేదు. గుర్తింపు లేని కాలేజీల్లో ఇప్పటికే ఐదు లక్షల మంది చేరారు. గుర్తింపు ఉంటే తప్ప వీళ్లు వార్షిక పరీక్షలు రాసే అవకాశం ఉండదు. లేదంటే ప్రైవేటుగా పరీక్షలు రాయాలి. ఇంకోవైపు కార్పొరేట్ కాలేజీల మాయాజాలం యథాతథంగా సాగుతోంది. గుర్తింపు ఉన్న బ్రాంచీల్లో విద్యార్థుల ప్రవేశాలు చూపిస్తున్నారు.ఉదాహరణకు హైదరాబాద్ బ్రాంచీలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య నిండినా చేర్చుకుంటున్నారు. వారి ప్రవేశాలను వరంగల్, ఖమ్మం లేదా ఆదిలాబాద్ బ్రాంచీల్లో చూపిస్తున్నారు. అక్కడ ప్రవేశాలు లేకపోవడమే వారికి కలిసి వస్తోంది. పెద్ద కాలేజీలు ఇంత బాహాటంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోని అధికారులు తమకు మాత్రం అఫ్లియేషన్లు ఇవ్వకుండా వేధించడం ఏమిటని కొన్ని కాలేజీల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇంటర్ అధికారుల వివరణ కోరేందుకు యత్నించగా వారు స్పందించలేదు. -
అర్జున్రెడ్డి హిట్.. రేవంత్రెడ్డి ఫట్
శంషాబాద్: ‘‘ఆమధ్య విడుదలైన అర్జున్రెడ్డి అనే సినిమా సూపర్ హిట్ అయ్యింది.. కానీ మన రాష్ట్రంలో ఇంటర్వెల్ వరకు వచ్చిన రేవంత్రెడ్డి సినిమా మాత్రం ఫట్ అయ్యింది. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోతాడు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్రెడ్డి సినిమాతో రాష్ట్రంలో 4 కోట్ల మంది నష్టపోతున్నారు’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు.రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు ఆదివారం శంషాబాద్లో నిర్వహించిన ‘సర్’ప్రక్రియ అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని గప్పాలు చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి... ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని 1.67 కోట్ల ఆడబిడ్డల ఖాతాల్లో రూ. లక్షన్నర చొప్పున జమ చేస్తే రాజకీయాలను మానేస్తానని సవాల్ విసిరారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 4 వేలతోపాటు పెన్షన్ను రూ. 4 వేలకు పెంచుతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాహుల్బంధు మాత్రమే : రాష్ట్రంలో ప్రస్తుతం రైతుబంధు లేదని.. రాహుల్ బంధు మా త్రమే ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులకు యురియా లేదని.. కనీసం వాటిని దాచుకోవడానికి సంచులు ఇక్కడ ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని సంచులు ముట్టజెప్పి రెన్యూవల్ చేయించు కుంటున్న సీఎం మాత్రమేనని వ్యాఖ్యానించారు. సర్ ప్రక్రియను బూత్ స్థాయి కార్యకర్తలు నిశితంగా పరిశీలించి దొంగ ఓట్లను తీయించి అసలు ఓట్లు ఉండేలా చూడాలన్నారు. అలాగే క్రియాశీల సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మహేశ్వర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు నవీన్కుమార్రెడ్డి, వాణీదేవి తదితరులున్నారు. -
చిన్న రాష్ట్రం.. వేతన కష్టం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని చిన్న రాష్ట్రాలు ఏటా పెట్టే మొత్తం ఖర్చులో పావలా వంతు ఉద్యోగుల జీతాలకే సరిపోతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నాగాలాండ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర, మిజోరం రాష్ట్రాలు తమ మొత్తం బడ్జెట్లో 25 శాతానికిపైగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే వెచ్చించాయి. అత్యధికంగా నాగాలాండ్ మొత్తం బడ్జెట్లో 37 శాతం వేతనాలకు ఖర్చు చేసినట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘స్టేట్ ఫైనాన్సెస్’పేరుతో కాగ్ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. 2015–16 నుంచి 2024–25 వరకు పదేళ్లపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదాయ వ్యయాలు, ఆర్థిక పరిస్థితులను ఈ నివేదికలో వెల్లడించింది. ఏ రాష్ట్రంలో ఎలా ఉందంటే.. 2024–25లో వేతనాలకు తెలంగాణ మొత్తం బడ్జెట్లో 14.19 శాతం ఖర్చు చేస్తోంది. ఏపీ (16.96%), కేరళ (22.96%) కూడా వేతనాలకు గణనీయంగానే ఖర్చు చేస్తున్నాయి. కర్ణాటక (6.59 శాతం), మహారాష్ట్ర (8.51%) మాత్రం తక్కువ నిధులు వెచ్చిస్తున్నాయి. ⇒ వేతనాలకే కాక ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల కోసం కూడా చిన్న రాష్ట్రాలే ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. దేశంలో అత్యధికంగా తన ఏడాది బడ్జెట్లో పింఛన్లకు హిమాచల్ ప్రదేశ్ 19,63 శాతం ఖర్చు చేస్తుండగా.. అత్యల్పంగా ఛత్తీస్గఢ్ 5.84 శాతం మాత్రమే ఖర్చు పెడుతోంది. ఇక, దక్షిణాది విషయానికి వస్తే కేరళ టాప్లో నిలిచింది. ఈ రాష్ట్రంలో పింఛన్ల కోసం 16.04 శాతం ఖర్చు చేస్తుండగా, తెలంగాణ 7.77 శాతం ఖర్చు చేస్తోంది. ⇒ అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు ఎక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో నిలిచింది. అత్యధికంగా 19 శాతం నిధులను వడ్డీల కోసం పంజాబ్ ఖర్చు చేస్తుండగా, తెలంగాణ 13 శాతం ఖర్చు పెడుతోంది. అత్యల్పంగా ఒడిశా 2.52 శాతం మాత్రమే చెల్లిస్తోంది. ⇒ ఆహార, విద్యుత్, ఇతర సబ్సిడీల కింద దేశంలోనే ఎక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఈ రాష్ట్రంలో 14 శాతం నిధులు సబ్సిడీల కోసమే ఖర్చు చేస్తుండగా, అందులో సగం మాత్రమే మన రాష్ట్రంలో సబ్సిడీల రూపంలో ఖర్చవుతోంది. దేశంలోనే అత్యల్పంగా మొత్తం బడ్జెట్లో 0.02 శాతం మాత్రమే అరుణాచల్ ప్రదేశ్లో సబ్సిడీల కింద ఖర్చవుతోంది. కేరళలో ఇది 1.07 శాతమే కావడం గమనార్హం. -
గ్రేటర్లో ఓట్ల గల్లంతు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 కార్యక్రమంలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాకముందే భారీ సంఖ్యలో ఓటర్ల పేర్ల గల్లంతు సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో ఓటర్ల జాబితా భారీ ‘శుద్ధికరణ’కు లోనుకానుందని ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల ఓటర్ల మ్యాపింగ్ గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,38,62,322 మంది (70.54%) ఇప్పటివరకు మ్యాపింగ్ అయ్యారు. ఇంకా 99,64,126 మంది ఓటర్లు (29.46%) మ్యాపింగ్కు అందుబాటులోకి రాలేదు. మూడు జిల్లాల్లో.. హైదరాబాద్ జిల్లాలో 25.24 లక్షలు, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 16.78 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 15.29 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ పెండింగ్లో ఉంది. ఓటర్ల మ్యాపింగ్ జరగాల్సిన వారిలో 57.31 లక్షల (57.5 శాతం) మంది ఈ మూడు జిల్లాల ఓటర్లే కావడం గమనార్హం. రాష్ట్రంలోనే అత్యల్ప మ్యాపింగ్ ఈ జిల్లాల్లోనే జరిగింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 43.67శాతం, హైదరాబాద్ జిల్లాలో 46.69 శాతం, రంగారెడ్డి జిల్లాలో 58.68 శాతమే మ్యాపింగ్ జరిగింది. స్థానిక బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) సైతం మిగిలిన ఓటర్లకు సంబంధించిన ‘ఆచూకీ’తెలియరావడం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అద్దె ఇళ్లల్లో నివా సం ఉండటం, తరచూ ఉద్యోగాలు మారడం, ఐటీ ఉద్యోగుల వలసలు, విద్యార్థుల వలసలు, ఒకే వ్యక్తి బహుళ చిరునామాలు కలిగి ఉండటం వంటి కారణాలతో ఈ మూడు జిల్లాల్లో ఓటర్ల ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల సిబ్బంది సహాయాన్ని ఎన్నికల సంఘం కోరింది. మేడ్చల్లో మరింత తీవ్రమా? ప్రస్తుత ఓటర్ల జాబితాను 2002 ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసి రెండు జాబితాల్లో ఓటర్ల సమాచారాన్ని ప్రత్యేక సాఫ్ట్వేర్తో సరిపోల్చి చూస్తున్నారు. రాష్ట్రంలో మ్యాపింగ్ జరిగిన 2.38 కోట్ల ఓటర్లలో 89.88లక్షల (37.67శాతం) మందికి సంబంధించిన వివరాల్లో వ్యత్యాసాలు/లోపాలున్నట్టు గుర్తించారు. వీరిలో 28.55 లక్షల (32శాతం) మంది ఓటర్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలవారే. రంగారెడ్డి జిల్లాలో 11.44 లక్షలు, హైదరాబాద్ జిల్లాలో 8.65 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 8.45 లక్షల మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలున్నట్టు తేలింది. మేడ్చల్ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. జిల్లాలో 13 లక్షలు మంది ఓటర్లు మ్యాపింగ్ పూర్తైతే 8.45 లక్షల (65శాతం) మంది వివరాల్లో తేడాలున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక శాతం వ్యత్యాసాలు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం. గ్రామీణ జిల్లాల ముందంజ గ్రామీణ జిల్లాలు ఓటర్ల మ్యాపింగ్లో ముందంజలో ఉండటమే కాకుండా అతి తక్కువగా వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. మహబూబాబాద్లో 94.54శాతం, జనగాంలో 93.44 శాతం, మెదక్లో 89.98 శాతం, నారాయణపేటలో 85.54 శాతం, రాజన్న సిరిసిల్లలో 84.92శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తైంది. గ్రామీణ జిల్లాల్లో జనాభా స్థిరంగా ఉండటం, వారిని స్థానిక బీఎల్ఓలు సులభంగా చేరుకోగలగడంతో మ్యాపింగ్ వేగంగా జరిగింది. రాజకీయాలు, ఎన్నికలపై తీవ్ర ప్రభావం రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లుండగా, 1.13 కోట్ల మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలవారే. రాష్ట్రంలో ఇంకా మ్యాపింగ్ మిగిలిన ప్రతి ఇద్దరు ఓటర్లలో ఒకరు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికే చెందినవారే కాగా, వివరాల్లో వ్యత్యాసాలున్న ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వారే కావడం గమనార్హం.హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏకంగా 28 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలున్నాయి. అసెంబ్లీ, లోక్సభతోపాటు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలపై ఈ జిల్లాల్లో జరిగే ఓటరు జాబితా మార్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా భారీ మార్పుకు లోనైతే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం సైతం మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. -
‘రీ–నీట్’ కఠినమే..
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ–2026 పునఃపరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ముగిసింది. గత మే 3న జరిగిన తొలి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కారణంగా రద్దు కావడంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రీఎగ్జామ్ నిర్వహించింది. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనివిధంగా త్రీటైర్ సెక్యూరిటీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జామర్ల నిఘా నడుమ పరీక్ష జరిగింది. తెలంగాణలో మొత్తం 73,059 మంది అభ్యర్థులకు హాల్టికెట్లు జారీ చేయగా, 65,087 (89.09 శాతం) మంది హాజరయ్యారు. తొలి నీట్ పరీక్షతో పోలిస్తే రీ–ఎగ్జామ్కు హాజరైన విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష రాసిన విద్యార్థులు, సబ్జెక్ట్ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. మే 3న జరిగిన పరీక్షతో పోలిస్తే రీఎగ్జామ్ ప్రశ్నపత్రం కాస్త కఠినంగా, ఎక్కువ సమయం తీసుకునేలా (లెంగ్తీగా) ఉందని వెల్లడైంది. కొరవడిన సమతుల్యత: రద్దయిన నీట్ పరీక్షతో పోలిస్తే పునఃపరీక్షలో బయాలజీ విభాగం సులభంగానే ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ప్రశ్నలన్నీ నేరుగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే అడిగినట్టు తెలిపారు. కొన్ని అధ్యాయాల నుంచి అసలు ప్రశ్నలే లేవని, అధ్యాయాల పరంగా సమతుల్యత కొరవడిందని సబ్జెక్ట్ నిపుణులు భావిస్తున్నారు. స్టేట్మెంట్, మల్టిపుల్ చాయిస్ జతపరచడం వంటి ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చినట్టు తెలిపారు. గత పరీక్షలతో పోలిస్తే కెమిస్ట్రీ, ఫిజిక్స్ కొంత కఠినంగానే ఉన్నట్టు నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా ఫిజిక్స్ గత రెండు పరీక్షలతో పోలిస్తే చాలా మారిపోయినట్టు పేర్కొన్నారు. గతంలో మోడరన్ ఫిజిక్స్, సెమీకండక్టర్ నుంచి నేరుగా సిద్ధాంతపరమైన ప్రశ్నలు రాగా, ఈసారి సీన్ రివర్స్ అయింది. జేఈఈ మెయిన్ స్థాయి క్లిష్టత ఫిజిక్స్లో ఉందని వెల్లడైంది. మెకానిక్స్ నుంచి వచ్చిన ప్రశ్నలు జేఈఈ మెయిన్ స్థాయిని తాకగా, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ విభాగాల్లో డయాగ్రమ్స్ ఇచ్చి, అందులో రెండు మూడు సూత్రాలు ప్రయోగించాల్సినట్టుగా ప్రశ్నలను క్లిష్టతరం చేశారు. దీంతో ఒక్క ఫిజిక్స్ విభాగానికి గంటన్నర, ఆపైన కేటాయించాల్సి వచ్చిందని విద్యార్థులు చెప్పారు. ఈసారి స్కోర్, మెరిట్ ర్యాంకులను ఫిజిక్స్ శాసిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇక కెమిస్ట్రీలో ప్రశ్నలన్నీ ఎన్సీఈఆర్టీ నుంచి వచ్చాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో లెక్కలన్నీ నేరుగా ఫార్ములా ఆధారంగానే ఉన్నాయి. ఇన్ఆర్గానిక్లో మల్టిపుల్ స్టేట్మెంట్స్, అస్సెర్షన్–రీజన్ ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడంతో వాటిని చదవడానికి ఎక్కువ సమయం పట్టిందని విద్యార్థులు అన్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అత్యంత ఇబ్బందిగా అనిపించిందని నిపుణులు అంచనా వేశారు. డైరెక్ట్ ప్రశ్నలు తగ్గించి, రసాయన చర్యల అంతర్గత విధానంపై లోతైన ప్రశ్నలు అడిగారని, దీంతో ఆప్షన్లు చాలా దగ్గరగా ఉండటంతో విద్యార్థులు పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక్కడ నెగిటివ్ మార్కుల ఉచ్చులో విద్యార్థులు పడే వీలుందన్నారు. కటాఫ్ అంచనా ఇలా.. ! 2025తో పోలిస్తే ఈసారి కూడా నీట్ ప్రశ్నపత్రం కఠినంగా ఉండటంతో కటాఫ్లు పెద్దగా పెరిగే అవకాశం లేదని నిపుణుల అంచనా. మే నెలలో నిర్వహించిన నీట్ ప్రశ్నపత్రం కొంత సులభంగా ఉండటంతో గతేడాదితో పోలిస్తే కటాఫ్లు పెరుగుతాయని భావించారు. పునఃపరీక్షతో ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. 2025 తరహాలోనే కటాఫ్లు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సెలింగ్ ముగిసే సమయానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో జనరల్ అభ్యర్థులకు 605–610 మార్కుల వద్ద కన్వీనర్ సీట్లు వచ్చాయి. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 540–550 మార్కులు వచ్చిన వారికి చివరి విడతల్లో సీట్లు దక్కాయి. బీసీలకు ప్రభుత్వ కాలేజీల్లో 575–595 మార్కుల మధ్య చివరి సీట్లు కేటాయించబడ్డాయి. ప్రైవేట్లో బీసీ విద్యార్థులకు 490–510 మార్కుల వరకు కూడా సీట్లు లభించాయి. ఎస్సీ విద్యార్థులకు కటాఫ్ ప్రభుత్వ కాలేజీల్లో 495 – 510 మార్కుల మధ్య, ప్రైవేటులో 435–450 మార్కుల శ్రేణిలో ఉంది. ఈ క్రమంలో ఆయా కేటగిరీల్లో గతేడాది కటాఫ్ కంటే 10 నుంచి 20 మార్కులు అదనంగా సాధించిన వారికి ఈసారి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు దక్కే అవకాశం ఉంటుందని అంచనా. మొబైల్తో పట్టుబడ్డ అభ్యర్థి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పరీక్ష కేంద్రంలో అక్రమాలకు యత్నించిన అభ్యర్థి పట్టుబడ్డాడు. జండావత్ నరేందర్ అనే అభ్యర్థి తన మొబైల్ ఫోన్ను టాయిలెట్లోని ఫ్లష్ ట్యాంక్లో దాచిపెట్టాడు. పరీక్ష సమయంలో టాయిలెట్కు వెళ్లి ఆ మొబైల్ను ఉపయోగించే ప్రయత్నం చేయగా ఇని్వజిలేటర్లు గుర్తించి, అతడిని పోలీసులకు అప్పగించారు. కాగా, పరీక్ష నిర్వహణ కోసం హైదరాబాద్లోని ఇంటరీ్మడియట్ విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సందర్శించారు. ట్రాఫిక్ జామ్తో పరీక్షకు దూరం మెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండల కేంద్రానికి చెందిన వంజరి అనే విద్యార్థిని ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాలలో జరిగే నీట్ పరీక్ష రాయడానికి బస్సులో వచ్చింది. అయితే పట్టణంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ వల్ల ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి 10 నిమిషాలు ఆలస్యమైంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమనే నిబంధన వల్ల అధికారులు ఆమెను పరీక్షకు అనుమతించలేదు. పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని తన తల్లితో కలిసి అరగంటపాటు పరీక్ష కేంద్రం వద్దే నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో కన్నీరుమున్నీరైంది. -
కలుషితమై'నది'!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గోదావరి, కృష్ణా నదుల్లో కలుషిత బ్యాక్టీరియా ముఖ్యంగా ఫీకల్ కొలిఫాం బ్యాక్టీరియా పరిమితికి మించి నమోదవుతున్నట్లు వెల్లడైంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నివేదికల ప్రకారం... మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వల్ల బ్యాక్టీరియా (టోటల్ కోలిఫాం) పరిమితికి మించి నమోదవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, నిర్మల్ జిల్లాల పరిధిలోని గోదావరిలో మానవ మలమూత్రాల ద్వారా వచ్చే కోలిఫాం బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. అలాగే కాళేశ్వరం (త్రివేణి సంగమం), బేగంపేట, రామగుండం పారిశ్రామిక ప్రాంతాల వద్ద రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు నదిని కలుషితం చేస్తున్నాయి. మరోవైపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని కృష్ణా నది నీటిలో టోటల్ కోలిఫాం సంఖ్య ప్రతి 100 మిల్లీలీటర్లకు 9,200కుపైనే నమోదవుతోంది. ఇది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రతి 100 ఎంఎల్ నీటిలో 500లోపు పరిమితితో పోలిస్తే ఎన్నో రెట్లు అధికం కావడం గమనార్హం. నీటి నాణ్యతపై ఆందోళన..: కాళేశ్వరం, మంథని, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో గోదావరి ఎగువ, దిగువ భాగాల నుంచి నీటి నమూనాలను టీపీసీబీ గతంలో సేకరించి నీటి నాణ్యత పరీక్షలను విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం కొన్ని ప్రాంతాల్లో జీవ రసాయన ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ), రసాయన ఆక్సిజన్ డిమాండ్ (సీవోడీ), సస్పెండెడ్ సాలిడ్స్ (ఎస్ఎస్) వంటి సూచీలు పెరిగినట్లు గుర్తించారు. మరోవైపు తాజాగా సీడబ్ల్యూసీ వెల్లడించిన కోలిఫాం కాలుష్య పరిస్థితి చూస్తే సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో తెలంగాణలోని గోదావరి పరీవాహక ప్రాంతాల నీటి నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. కోలిఫాం అంటే ఏమిటి? ఫీకల్ కోలిఫాం అనేది మానవ, జంతు వ్యర్థాల ద్వారా నీటిలోకి చేరే బ్యాక్టీరియా సమూహం. ఇది అధికంగా ఉంటే మురుగునీరు నదిలో కలుస్తోందని అర్థం. తాగునీటికి మాత్రమే కాకుండా స్నానాలకు కూడా ఈ బ్యాక్టీరియాను ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. దీనివల్ల చర్మ వ్యాధులు, కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లు, వైరల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. మంథని, కాళేశ్వరంలో అధిక కాలుష్య ఛాయలు... గతంలో టీపీసీబీ నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల ఆధారంగా రూపొందించిన నివేదికలో మంథని ప్రాంతంలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీవోడీ) విలువలు కొన్ని రోజుల్లో 90 ఎంజీ/ఐ వరకు నమోదైనట్లు కనిపిస్తోంది. బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) కూడా 8 ఎంజీ/ఐ వరకు నమోదైంది. ఇవి ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉండటం గమనార్హం. అలాగే టోటల్ డిజాల్్వడ్ సాలిడ్స్ (టీడీఎస్) 300 ఎంజీ/ఐకుపైగా నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇక కాళేశ్వరం ప్రాంతంలో సీవోడీ 95 ఎంజీ/ఐ వరకు, బీవోడీ 4 ఎంజీ/ఐ ( ఝజ/ ) వరకు నమోదైంది. స్నాన ఘాట్ల దిగువ భాగంలో కాలుష్య సూచీలు కొంత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇది స్థానిక మురుగునీటి ప్రవాహాలు, మానవ కార్యకలాపాల ప్రభావం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఏటూరునాగారం ప్రాంతంలో బీవోడీ సాధారణంగా తక్కువగానే ఉన్నప్పటికీ సీవోడీ, సస్పెండెడ్ సాలిడ్స్ విలువలు కొన్ని నమూనాల్లో పెరిగినట్లు నమోదయ్యాయి. నీటిలో ఘన వ్యర్థాలు, మట్టి కణాలు అధికంగా చేరుతున్న సంకేతాలుగా దీనిని పరిగణిస్తున్నారు. పుష్కరాల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దాలంటున్న నిపుణులు వచ్చే ఏడాది జూన్ చివర్లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో వెంటనే ఆయా ప్రాంతాల్లో నదీ జలాలు, బ్యాక్టీరియా కాలుష్య నియంత్రణకు, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాళేశ్వరం, ధర్మపురి, మంథని, భద్రాచలం, బాసర తదితర చోట్ల ప్రతి వారం నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి, నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. –బీవోడీ(బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్)... నీటిలోని సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులకు అవసరమైన ఆక్సిజన్ పరిమాణం –సీవోడీ (కెమికల్ ఆక్సిజన్ డిమాండ్)... నీటిలో ఉన్న మొత్తం కాలుష్య భారాన్ని సూచించే ప్రమాణం –టీడీఎస్... నీటిలో కరిగి ఉన్న లవణాలు, ఖనిజాల పరిమాణం –సస్పెండెడ్ సాలిడ్స్ (ఎస్ఎస్)... నీటిలో తేలియాడే ఘన కణాలు (వాటి విలువలు పెరిగిన కొద్దీ నీటి నాణ్యత తగ్గుతున్నట్లు పరిగణిస్తారు) -
బస్సుల ఫిట్నెస్ ఈ'శూన్యం'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల్లో రోడ్ల మీద పరుగుపెడుతున్న వందల సంఖ్యలోని ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల నిర్వహణలో జరుగుతున్న ఓ చీకటి వ్యవహారం ఇప్పుడు వణుకుపుట్టిస్తోంది. ఒక్కో బస్సులో కనీసం 50 మంది చొప్పున ప్రయాణికులుంటారు. వారి ప్రాణాలు పూర్తిగా ఆ బస్సు పటుత్వం మీదనే ఆధారమై ఉంటుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న బస్సు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రధాన అంశాల్లో వాటి ఫిట్నెస్ లేమి అన్నది మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది. అందుకే బస్సుల ఫిట్నెస్ అన్నది అత్యంత కీలకమైంది. అలాంటి కీలక విషయంలోనే భయంకర నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. అత్యంత ప్రమాదకరమైన విషయమేంటంటే బస్సుల ఫిట్నెస్ను ప్రత్యక్షంగా చూడకుండా ఏకంగా 2,800 కిలోమీటర్ల దూరం నుంచి వీడియోకాల్లో బస్సులను చూసి వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాల రవాణాశాఖలు. మరోవైపు ఎలాంటి అధికారిక పర్యవేక్షణ లేకుండా ఈ బస్సులు రోడ్లమీద పరుగులు పెడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం గమనార్హం. బస్సును చూడకుండానే..హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 1,150 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలిస్తున్నాయి. విచిత్రమేంటంటే, వీటిల్లో కేవలం 128 బస్సులు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్నాయి. దాదాపు 750 బస్సులు హైదరాబాద్కు 2,800 కి.మీ.కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లాంటి రాష్ట్రాల పరిధిలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు తమ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బస్సుల పర్మిట్ ఫీజు, రోడ్డు ట్యాక్స్, త్రైమాసిక పన్నులో భారీ రాయితీలను ప్రకటించాయి. దీంతో వాటి పరిధిలో రిజిస్ట్రేషన్ చేయిస్తే, ఒక్కో బస్సుపై సాలీనా రూ.8 లక్షల వరకు లబ్ధికలుగుతుంది. ఆ డబ్బులు మిగుల్చుకునే కక్కుర్తితో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు తమ బస్సులను ఆయా దూరప్రాంత రాష్ట్రాల పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించి, హైదరా బాద్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాలు, పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల మధ్య తిప్పుతున్నారు. ఈ బస్సులు దూర ప్రాంత రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నందున, వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా ఆయా రాష్ట్రాల రవాణాశాఖలే జారీ చేయాలి. ఇక్కడే అసలు మతలబు చోటుచేసుకుంటోంది. బస్సులను తీసుకెళ్లకుండానే...ఎనిమిది సంవత్సరాల వరకు బస్సుకు ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి, ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఫిట్నెస్ చేయించాల్సి ఉంటుంది. బస్సు బ్రేకులు, గేర్లు, స్టీరింగ్, టైర్లు, ఇతర యంత్ర పరికరాలు సహా బస్సును ఆసాంతం పరీక్షించి బాగుంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులను ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడి రవాణాశాఖ శాఖ అధికారుల ముందుంచితే వారు తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. బస్సు అక్కడికి వెళ్లి రావడానికి దాదాపు వారం రోజుల సమయం అవసరమవుతుంది. భారీ వ్యయం కూడా అవుతుంది. దీంతో బస్సులను అక్కడికి తీసుకెళ్లకుండానే ఆపరేటర్లు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందుతున్నారు. కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారిద్వారా బస్సు నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేయించి, వీడియో కాల్ ద్వారా బస్సులను చూసి సర్టిఫికెట్లు జారీ చేసేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ చర్యలేవీ?ఇలా అడ్డదారిలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందుతున్నారని రాష్ట్రప్రభుత్వానికి తెలిసి కూడా చర్యలు తీసుకోలేకపోతోంది. బస్సులను తనిఖీ చేయకుండా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఎలా జారీ చేస్తున్నారని సంబంధిత ఈశాన్య రాష్ట్రాల రవాణాశాఖలను నిలదీయలేకపోతోంది. ఆ బస్సులు పేరుకు ఆయా రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినప్పటికీ, వాటిల్లో తిరుగుతోంది మాత్రం తెలుగు రాష్ట్రాలవారేనన్న విషయాన్ని విస్మరిస్తోంది.ఆ నిబంధన ఏమైనట్లు? ఏదీ కేంద్రం నిఘా?పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఈశాన్య రాష్ట్రాల్లో రిజిష్టర్ చేయించి వేరే ప్రాంతాల్లో ఆపరేటర్లు బస్సులు తిప్పుతున్నారన్న విషయాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. బస్సు ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిందో ఆ రాష్ట్రం వెలుపల బస్సు 60 రోజులకు మించి ఉండకూడదన్నదే ఆ నిబంధన. అంటే ప్రతి 60 రోజులకు ఓమారు బస్సు కచ్చితంగా, రిజిస్టర్ అయిన రాష్ట్రంలోకి రావాల్సిందే. హైదరాబాద్ కేంద్రంగా తిరుగుతున్న బస్సులు ప్రతి రెండు నెలలకోమారు అంతదూరం వెళ్లి రావడం దాదాపు అసాధ్యం. దీంతో ఆ నిబంధన దర్జాగా బేఖాతరు అవుతోంది. కానీ, నిబంధన విధించిన కేంద్రం మాత్రం నిఘాను గాలికొదిలేసింది.ఆ రోడ్లమీద ఎలా తిరుగుతాయి?ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా కొండచరియలతో నిండి ఉంటాయి. కొన్ని మినహా అన్నీ ఘాట్ రోడ్లే. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు 10–12 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఇంత పొడవైన బస్సులు ఆ ఘాట్రోడ్లలో తిరగలేవు. మరి ఈ విషయం తెలిసి కూడా వాటిని ఆయా రాష్ట్రాల పరిధిలో తిరిగే బస్సులుగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఈశాన్య రాష్ట్రాల అధికారులకే తెలియాలి. -
‘వీబీ జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ-జీ రామ్-జీ చట్టం దేశంలోని కోట్లాది గ్రామీణ పేదల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకరమైన చట్టమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు.ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మొదటి సమావేశం ఇవాళ (ఆదివారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపసంఘం చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, గడ్డం వినోద్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ పేదలకు కల్పించిన హక్కులను క్రమంగా నిర్వీర్యం చేసి, రాష్ట్రాల అధికారాలను హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తోందని ఆయన ఆరోపించారు. "ఉపాధి హామీ చట్టం కేవలం ఒక పథకం కాదు.. అది గ్రామీణ భారతదేశానికి ఆర్థిక భరోసా కల్పించిన సామాజిక విప్లవం. అలాంటి చట్టాన్ని బలహీనపరచడం అంటే రైతులు, కూలీలు, మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవితాలతో ఆటలాడటమే" అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదిత చట్టం ద్వారా రాష్ట్రాల పాత్రను తగ్గించి, అన్ని అధికారాలను ఢిల్లీ చేతుల్లో కేంద్రీకరించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో రాష్ట్రాలకు ఉన్న స్వేచ్ఛను హరించడం సహకార సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. -
ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవకాశాలు లేక మరుగున పడిపోతున్న ప్రతిభాపాటవాలను వెలికితీసి, వారికి సరైన శిక్షణనిచ్చి ప్రపంచానికి పరిచయం చేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ఒలింపిక్స్ బరిలో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం" అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.ఉప్పల్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైన 'టీజీ 20 క్రికెట్ లీగ్' మెగా టోర్నమెంట్కు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ లీగ్ ఒక బలమైన పునాది కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు."గతంలో క్రికెట్ అంటే కేవలం నగరాలకే పరిమితమనే భావన ఉండేది. కానీ, ఆ పరిస్థితులను మారుస్తూ మొదటిసారిగా మా ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించింది. జిల్లాల వారీగా జట్లను (టీమ్లను) ఎంపిక చేసి గ్రామీణ యువతకు ఈ మెగా వేదికను కల్పించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడలను పెద్దపీట వేస్తూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంది" అని భట్టి విక్రమార్క తెలిపారు.గతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్బాల్ స్టార్ 'మెస్సి' ఆడిన ఈ ఉప్పల్ స్టేడియం సాక్షిగా.. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి వసతులు, అన్ని హంగులతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతోందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఒలింపిక్స్ స్థాయి శిక్షణ ఇచ్చేలా తెలంగాణలో ఒక బలమైన క్రీడా వ్యవస్థను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.మొత్తం 21 రోజుల పాటు సాగనున్న ఈ 'టీజీ 20 క్రికెట్' హంగామా.. రాష్ట్రంలోని క్రీడాభిమానులకు ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది. ఈ టోర్నీ విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. -
భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను భద్రాచలానికి చెందిన దూడల సాయి ప్రకాష్, ఆయన భార్య సంధ్య, మరియు వారి కుమారుడు మోక్ష్గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో సాయి ప్రకాష్ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉదయ రాగం.. నాన్న యోగం!
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు నగర జీవనశైలిలో నాన్న అంటే.. ఉదయం ఇంటినుంచి బయలుదేరి, ట్రాఫిక్తో పోరాడి, ఆఫీస్ బాధ్యతలు మోసి, రాత్రి అలసటతో ఇంటికి చేరే వ్యక్తి. పిల్లలతో గడిపే సమయం ‘వీకెండ్ ఆప్షన్’గా మిగిలేది. కానీ.. ఇప్పటి నాన్నలు కొంచెం విభిన్నంగా, వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఉన్న సమయాన్ని అనువుగా వినియోగించుకుంటూ ఆరోగ్యం, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాల వైపు కొత్తదారులు వెతుక్కొంటున్నారు.ఇటీవలి కాలంలో ఉదయపు పార్కులు, అపార్ట్మెంట్ టెర్రస్లు, కమ్యూనిటీ హాళ్లలో పిల్లలతో కలిసి యోగా మ్యాట్పై కనిపిస్తున్నారు. ఐటీ, ఫార్మా, స్టార్టప్ల హబ్గా పేరొందిన కార్పొరేట్ నగరంలో పని ఒత్తిడి సహజం. ఈ పరుగుల మధ్య తండ్రితనం కూడా ఒక ‘రెస్పాన్సిబిలిటీ లిస్ట్’గా మారడంతో ఉదయాన్నే యోగాతో పిల్లలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటు మానసికంగా, అటు శారీరక మేలు కోసం అన్నింటికీ మించి పిల్లలకు సమయం ఇవ్వాలనే కోరిక దీనికి ప్రధాన కారణం. నేడు ఫాదర్స్ డే, యోగా డే రెండూ ఒకే రోజున కలిసి రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇలా నాన్న– పిల్లలు నిత్యం చేస్తున్న యోగా వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారికి ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. డాడ్– కిడ్ యోగా రీల్స్.. యోగా.. ఇక్కడ కేవలం ఫిట్నెస్ ట్రెండ్ కాదు.. ఇది ఒక న్యూ ఏజ్ ఫాదర్హుడ్ స్టేట్మెంట్. ‘శ్వాసపై దృష్టి పెట్టడం, నిశ్శబ్దాన్ని వినడం, శరీరంతో పాటు మనసును సర్దుకోవడం’ ఈ అలవాట్లు తండ్రులను మరింత సమతుల్యంగా మార్చుతున్నాయి. పిల్లలతో కలిసి సూర్య నమస్కారాలు చేయడం, ప్రాణాయామం నేర్పడం.. ‘క్వాలిటీ టైమ్’ కొత్త నిర్వచనం ఇస్తున్నాయి. ఫలితంగా తండ్రి–పిల్లల మధ్య సంభాషణ పెరుగుతోంది. డిజిటల్ యుగంలో ఈ మార్పు డాడ్–కిడ్ యోగా రీల్స్, ఫ్యామిలీ ఫిట్నెస్ చాలెంజ్లుగా ట్రెండ్ అవుతున్నాయి. పిల్లలు తండ్రిని కేవలం సంపాదించే వ్యక్తిగా కాకుండా, మార్గదర్శిగా చూడటం మొదలుపెడుతున్నారు. నాన్నలు సమయమిచ్చి పిల్లలతో కలిసి యోగా చేయడమే నిజమైన ఫాదర్స్ డే గిఫ్ట్ అని చెబుతున్నారు.కూతురుతో కలిసి యోగా ఆనందకరంఉద్యోగం, బిజీబిజీ నగర జీవన శైలితో అలసిపోయే నాకు యోగాతో ఒక చక్కని పరిష్కారంతో పాటు నాన్నగా కూతురుతో అద్భుత క్షణాలను ఆస్వాదించే అవకాశం లభిస్తోంది. ఇది అలవాటుగా మారకముందు మా దినచర్య వేరేలా ఉండేది. కానీ.. ప్రస్తుతం వినోదం, వి/ê్ఞనం, ఆరోగ్య వికాసం.. ముఖ్యంగా నాన్నగా ఆతీ్మయ సంతృప్తి పొందుతున్నా. మొబైల్స్, టీవీలకు అతుక్కు పోయే బాల్యం ఇలా నాన్నతో, ఆరోగ్యంగా కొనసాగడం సంతోషంగా ఉంది. నా పాప అని్వక కూడా అందరి పిల్లల్లా కాకుండా వినూ త్న ఆలోచనా విధానంతో పెరుగుతోంది. – నవీన్ కుమార్, సరూర్నగర్ -
హైదరాబాద్లో వర్షం.. మరో రెండు గంటల్లో..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్లో మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో, వాతావరణం చల్లబడింది. కాగా, తెలంగాణలో రానున్న రెండు గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట సహ పలు జిల్లాలో మోస్తరు నుంచి కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.మరోవైపు.. రానున్న మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలను జారీ చేసింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మచిలీపట్నం, ఏలూరు, నర్సాపూరం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటు హెచ్చరిక.. అలాగే, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్తో పాటుగా పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల క్రింద, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించింది. RAIN ALERT - 4 AM ⚠️🌧️ STEADY MODERATE RAINS to continue in Sangareddy, Vikarabad, Rangareddy, Medak, Kamareddy in next 2hrsISOLATED - SCATTERED RAINS ahead in Medchal, Siddipet, Yadadri - Bhongir, Karimnagar, Bhupalapally, Peddapalli, Nagarkurnool, Mahabubnagar, Narayanpet…— Telangana Weatherman (@balaji25_t) June 20, 2026 -
2030 కంటే ముందే స్వదేశీ బ్రహ్మోస్
సాక్షి, హైదరాబాద్: బ్రహ్మోస్.. ఆపరేషన్ సిందూర్లో లక్ష్యాన్ని ఛేదించి శత్రువుకు నిద్రలేని రాత్రులు చూపించిన.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ మిస్సైల్. భారత్–రష్యా సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. దీనిని భూమి, సముద్రం, జలాంతర్గామి, యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశించి ప్రయోగిస్తే.. ఇది స్వయంచాలకంగా టార్గెట్ను ధ్వంసం చేస్తుంది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా చాలా తక్కువ ఎత్తులో దూసుకుపోవడం దీని ప్రత్యేకత. ఇలాంటి క్షిపణుల తయారీలో హైదరాబాద్ సైతం కీలకంగా వ్యవహరిస్తోందని బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈవో, ఎండీ జైతీర్థ్ ఆర్. జోషి తెలిపారు. ఎన్డీఈ–2026 సదస్సు వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటైన సమావేశంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... నూరు శాతం దేశీయంగా.. బ్రహ్మోస్ క్షిపణుల తయారీకి అవసరమైన 85 శాతం విడిభాగాలను దేశీయంగా సమకూర్చుకుంటున్నాం. కొన్ని ఎలక్ట్రానిక్ విడిభాగాల విషయంలో వెనుకబడ్డాం. సెమీకండక్టర్ పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం. నూరు శాతం తయారీ దేశీయంగా సాధ్యమే. 2030 కంటే ముందే ఈ కల సాకారం అవుతుంది. కాన్సెప్ట్ రెడీ అయితే మూడేళ్లలోనే సరికొత్త బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేయగల సత్తా మనకు ఉంది. ఈ మేరకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పూర్తిస్థాయి సామర్థ్యం సొంతం చేసుకుంది. ప్రస్తుతం సంస్థ వద్ద 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.56 వేల కోట్లు) విలువైన ఆర్డర్ బుక్ ఉంది. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్కు సరఫరా చేస్తున్నాం. వియత్నాంకు అతి త్వరలోనే అందించనున్నాం. ఈ క్షిపణుల కోసం పశ్చిమ, తూర్పు ప్రాంతంలోని చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. రష్యా సైతం అడుగుతోంది. 10 రోజుల్లో ఒక క్షిపణిని తయారు చేయగలం. 20 శాతం హైదరాబాద్ నుంచే.. బ్రహ్మోస్ ఇండస్ట్రి కన్సార్షియంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 200కుపైగా చిన్న, మధ్యతరహా కంపెనీలున్నాయి. బ్రహ్మోస్ క్షిపణుల తయారీలో వాడే విడిభాగాలను ఈ కన్సార్షియంలో ఉన్న కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. మిసైళ్ల అసెంబ్లింగ్లోనూ ఇవి పాలుపంచుకుంటున్నాయి. కన్సార్షియంలోని 20 శాతం కంపెనీలు హైదరాబాద్ నుంచే ఉంటాయి. భాగస్వామ్య కంపెనీలకు సాంకేతిక బదిలీ, నిపుణులకు శిక్షణ ఇస్తున్నాం. హైదరాబాద్, నాగ్పూర్, పిలానీ, లక్నో వద్ద సంస్థకు తయారీ కేంద్రాలున్నాయి. 4 యూనిట్లలో మూడవ షిఫ్ట్ మొదలుపెట్టబోతున్నాం. బ్రహ్మోస్ ప్రాజెక్టులో డిజైన్, డెవలప్మెంట్, తయారీలో హైదరాబాద్ అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. తెలంగాణలో సర్వే పూర్తి.. కొత్త ప్లాంటుకు 400–500 ఎకరాలు అవసరం. ఏపీ ప్రభుత్వం చూపించిన స్థలం అనువైనది కాదు. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వద్ద సర్వే పూర్తి చేశాం. ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే. ప్లాంటు ఏర్పాటు ముఖ్యం కాదు. అందుకు అవసరమైన ఎకో సిస్టమ్ ప్రధానం. వాస్తవానికి ఈ రంగంలో దేశవ్యాప్తంగా మానవ వనరుల కొరత చాలా ఉంది. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఐఎస్ఎన్టీ) వచ్చే నవంబర్లో నాన్ డిస్ట్రక్టివ్ ఇవాల్యుయేషన్ (ఎన్డీఈ)–2026, ఏరోఎన్డీటీ–2026 సదస్సులను నిర్వహిస్తోంది. 15–17 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమాలకు హైటెక్స్ వేదిక. దేశ, విదేశాల నుంచి రక్షణ, వైమానిక, ఇంధన, తయారీ రంగాలకు చెందిన 2వేల మంది నిపుణులు పాలుపంచుకోనున్నారు. -
12 పత్రాలే అంతిమం కాదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్), 2026లో భాగంగా రాష్ట్రంలో నోటీసులు అందుకోనున్న వ్యక్తులు సమర్పించాల్సిన రుజువులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల జాబితానే పరిమితం కాదు..రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర పత్రాలను సైతం రుజువుగా సమర్పించొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్రెడ్డి అన్నారు. సర్ కార్యక్రమానికి ముందస్తు సన్నద్ధతలో భాగంగా 2002, 2026 ఓటర్ల జాబితాలను అనుసంధానం (మ్యాపింగ్) చేయగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 89,88,175 మంది ఓటర్ల వివరాల్లో తార్కిక వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. ‘సర్’షెడ్యూల్ ప్రకారం వ్యత్యాసాలు కలిగిన ఓటర్లందరికీ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య స్థానిక ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీకి విచారణకు పిలుస్తారన్నారు. సర్ కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం తన కార్యాలయంలో సుదర్శన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏఏ ధ్రువీకరణ పత్రాలను రుజువుగా స్వీకరిస్తారని విలేకరులు ప్రశ్నించగా, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఈఆర్వోలకు విచక్షణాధికారాలను కల్పించినట్టు వెల్లడించారు. 5 లక్షల డూప్లికేట్ ఓటర్ల తొలగింపు రాష్ట్రంలో 5 లక్షలకు పైగా డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించినట్టు సీఈఓ సుదర్శన్రెడ్డి తెలిపారు. ఒకే పేరు, ఇతర వివరాలతో వేర్వేరు చోట్లలో ఓటర్లు కలిగి ఉన్నట్టు ప్రత్యేక సాఫ్ట్వేర్తో ఈ ఓటర్లను గుర్తించామన్నారు. గడువు పొడిగింపు ఉండదు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్య బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి ప్రతి ఓటరుకు సంబంధించిన పాక్షిక వివరాలతో ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని సుదర్శన్రెడ్డి అన్నారు. ఒక వేళ ఇంటికి తాళం వేసి ఉన్నా, మూడు నాలుగు పర్యాయాలు ఆ ఇంటికి వెళ్లి ఫారాలను పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తారన్నారు. ఫారాలను పూరించి వచ్చే నెల 24లోగా సమర్పిస్తే 31న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు లభిస్తుందని స్పష్టం చేశారు. గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని వారి పేరు ముసాయిదా జాబితాలో గల్లంతు అవుతుందని, అలాంటి వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మళ్లీ ఫారం–6 సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్యూమరేషన్ ఫారంతో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి అవసరం లేదన్నారు. 2002 ఓటర్ల జాబితా వివరాలు బీఎల్ఓల వద్ద ఉంటాయని, ఆ వివరాలను సైతం ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్లో ఆంగ్లంలోనే ఎన్యూమరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషలో ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నామని సీఈఓ సుదర్శన్రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆంగ్ల భాషలో ముద్రించిన ఫారాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అత్యల్పంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 43.67 శాతం ఓటర్ల మ్యాపింగ్ జరగ్గా, ఆ తర్వాత హైదరాబాద్ 46.69 శాతం, రంగారెడ్డి జిల్లాలో 58.68 శాతం మ్యాపింగ్ మాత్రమే జరిగిందన్నారు. మిగిలిన జిల్లాల్లో 80 శాతం వరకు మ్యాపింగ్ పూర్తయిందన్నారు. విలేకరుల సమావేశంలో అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, జాయింట్ సీఈఓ ఎం.సత్యవతి, అదనపు కార్యదర్శి శంకర్, సహాయ కార్యదర్శి ఏఎస్ చారి, డిప్యూటీ కలెక్టర్ బి.చెన్నయ్య పాల్గొన్నారు. -
ఒత్తిడితో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
మియాపూర్ (హైదరాబాద్): నీట్ రీ ఎగ్జామ్కు సిద్ధమవుతున్న విద్యార్థిని చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మియాపూర్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. మియాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ వివరాలు తెలిపారు. వైఎస్ఆర్కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్సనా నీట్ ఎగ్జామ్కు సిద్ధం అవుతోంది. తండ్రి ఉద్యోగ రీత్యా కువైట్లో ఉంటుండగా, పది రోజుల కిందట షేక్ సనా తల్లి అబ్బునిసా సొంతూరికి వెళ్లింది. దీంతో సనా తన ఇద్దరు చెల్లెళ్లు ఇంట్లో ఉంది.శనివారం చదువుకునేందుకు షేక్ సనా తన గదిలోకి వెళ్లి సాయంత్రం అయినా బయటకు రాకపోయేసరికి ఆమె చెల్లెళ్లు గది తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది.‘తల్లిదండ్రులను మెప్పించలేకపోతున్నా.. భయం, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం కోల్పో యి బాధపడుతున్నాను. చదువులో కుటుంబ అంచనాలను అందుకోలేకపోతున్నా. గత పరీక్షల్లో వైఫల్యం కారణంగా బాధపడుతున్నా. నా బాధను ఎవరితో పంచుకోవాలో తెలియదు’అని సూసైడ్ నోట్లో పేర్కొంది. -
నేడే నీట్ రీఎగ్జామ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వైద్యవిద్య ప్రవేశాల భవిష్యత్ను నిర్ణయించే నీట్–యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. గత నెల 3వ తేదీన నిర్వహించిన పరీక్ష.. పేపర్ లీక్, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేడు నీట్ రీఎగ్జామ్ నిర్వహిస్తోంది. తెలంగాణలో సుమారు 73 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ లీక్తో రద్దు... ఎన్టీఏపై విమర్శల వెల్లువ గత నెల 3న జరిగిన నీట్కు ముందు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. జీవశాస్త్రం, రసాయన శాస్త్రానికి చెందిన అనేక ప్రశ్నలు ముందుగానే సోషల్మీడియాలో చక్కర్లు కొట్టినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష సమగ్రత దెబ్బతిన్నదని ఎన్టీఏ నిర్ధారించింది. దీంతో పరీక్షను పూర్తిగా రద్దు చేసి రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఎన్టీఏ పరీక్షల నిర్వహణ విధానంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఈసారి ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొనే నిపుణులను రహస్య ప్రదేశాలకు తరలించి డిజిటల్ కమ్యూనికేషన్పై పూర్తిగా ఆంక్షలు విధించారు. ప్రశ్నల బ్యాంకును విస్తరించడం, ప్రశ్నపత్ర రూపకల్పనలో ఎక్కువ మంది నిపుణులను భాగస్వామ్యం చేయడం, గోప్యతా నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేశాం : ఎన్టీఏ నీట్ రీఎగ్జామ్ అత్యంత పారదర్శకంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది. 95,000లకు పైగా పరీక్ష గదుల్లో మొత్తం 1,38,560 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. లైవ్ ఫీడ్లను జాతీయ, ఆయా రాష్ట్ర స్థాయిలో వర్చువల్గా పర్యవేక్షిస్తారు. ఎల్రక్టానిక్ అక్రమాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 51,311 జామర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష గదికి ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉంటారు. అభ్యర్థుల తనిఖీకి 38,795 మంది సిబ్బందిని, బయోమెట్రిక్ వెరిఫికేషన్కు 48,448 మందిని రంగంలోకి దించారు. ఈసారి బయోమెట్రిక్ సిబ్బందిని రెట్టింపు చేయడమే కాకుండా ఫేస్ అథెంటికేషన్ సదుపాయాన్ని కూడా కల్పించారు. సాంకేతిక సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి కేంద్రంలో ఒక సెంటర్ సిస్టమ్స్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. పరీక్షా కేంద్రాల్లో సుమారు 6,700 మంది అబ్జర్వర్లు విధుల్లో ఉండగా, 100 మందికి పైగా వర్చువల్ అబ్జర్వర్లు కేంద్ర కార్యాలయం నుంచి నిరంతరం లైవ్ సీసీటీవీ ఫుటేజీని పర్యవేక్షిస్తారు. ఈ ఫుటేజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్తో విశ్లేíÙంచి, ఎక్కడైనా తేడాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు, విద్యుత్ బ్యాకప్, వైద్య సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ రీ ఎగ్జామ్కు ముందు శనివారం దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ నిర్వహించారు. రాష్ట్రంలో కూడా ఎంపిక చేసిన అన్ని పరీక్ష కేంద్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా వ్యవస్థలు, ప్రశ్నపత్రాల రవాణా, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను పరీక్షించారు. ప్రశ్నపత్రాల భద్రత కోసం జిల్లా యంత్రాంగాలు, పోలీసు బలగాలు, ఎస్కార్ట్ బృందాలు కలిపి రెండు లక్షల మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించారు. పేపర్ లీకేజీలకు సోషల్ మీడియా వేదికలు ఉపయోగించారనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. నీట్ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఎన్టీఏ ఖండిస్తూ, విద్యార్థులు వదంతులను నమ్మొద్దని సూచించింది. అనుమానాస్పద సమాచారం, నకిలీ పేపర్లపై ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే నీట్ రీ ఎగ్జామ్ ఎన్టీఏ విశ్వసనీయత, దేశంలోని అత్యంత కీలక ప్రవేశ పరీక్షల పారదర్శకతకు అగ్నిపరీక్షగా మారింది. -
రాజకీయ'దుర్గం'!
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో భూముల వేలం వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మధ్య వివాదం అంశాన్ని ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రత్యర్థి పార్టీలు వినియోగించుకుంటున్నాయన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టిపై ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సీఎం రేవంత్రెడ్డి సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టడాన్ని అడ్డుకున్న మాదిరిగానే రాయదుర్గంలోని భూముల బహిరంగ వేలాన్ని వివాదాస్పదం చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని రాష్ట్ర ప్రభుత్వం బలంగా భావిస్తోంది. ఎస్బీఐతో కటీఫ్! 2010లో భూ విక్రయంలో విధించిన నిబంధనలను పాటించకపోవడంతో భూ విక్రయాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐకి స్పష్టంచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఆ సేల్ డీడ్ను రద్దు చేస్తూ ఉత్తర్తులు జారీచేయకపోవడంతో ఎస్బీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఆ భూ విక్రయాన్ని రద్దు చేయడంతోపాటు ఎస్బీఐకి ప్రత్యామ్నాయంగా నాలెడ్జి సిటీలో రూ.500 కోట్ల విలువైన రెండున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వడానికి ప్రతిపాదించినా సరే... ఎస్బీఐ ముందుకు రాకుండా వేలానికి ఒక రోజు ముందు అంటే మే 27న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ తిరస్కరణ లేఖ వేలం ముగిసిన మరుసటి రోజు టీజీఐఐసీకి అందినట్లు సమాచారం. వేలం నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు కానీ, ప్రీబిడ్ సమావేశమప్పుడు గానీ స్పందించని ఎస్బీఐ ఆ మరుసటి రోజు హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతోనే కోర్టుకు వెళ్లిందన్న అభిప్రాయంతో సర్కారు ఉంది. దీని వెనుక రాజకీయ ప్రోద్బలం (కుట్ర) ఉందనే అనుమానాన్ని ప్రభుత్వ ముఖ్యులు వ్యక్తంచేస్తున్నారు. ఈనేపథ్యంలో ఎస్బీఐతో కఠినంగానే వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఎస్బీఐతో ఉన్న లావాదేవీలను ఉపసంహరించుకునే అవకాశాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిశీలిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఎస్బీఐతో జరిపే ఆర్థిక లావాదేవీలు, డిపాజిట్ల వివరాల సేకరణలో ఆర్థిక శాఖ నిమగ్నమైంది. కనీసం రూ.5వేల కోట్లకు పైగా ప్రభుత్వ డిపాజిట్లు ఎస్బీఐలో ఉన్నట్లు ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా డిపాజిట్లను ఉపసహరించుకునే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించగా, టీజీఐఐసీ దాదాపు 25 కోట్ల ఎఫ్డీలను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అప్పట్లోనే ఎకరా రూ. 25 కోట్లపైనే... రాయదుర్గం రెవెన్యూ పరిధిలో 2006–07 నాటికే ఎకరం భూమి మార్కెట్ ధర రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు ఉందని ప్రభుత్వం చెబుతోంది. 2010 నాటికి రాయదుర్గం పరిధిలో ఎకరం రూ.40 కోట్లు పలికింది. 2010లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సర్వే నం. 83/1లో 5 ఎకరాల భూమిని కార్యాలయ నిర్మాణం, ఇతర కార్యకలాపాల కోసం ఎస్బీహెచ్కు రూ.13.30 కోట్లకు కేటాయించింది. బహిరంగ మార్కెట్ ప్రకారం చూస్తే దీని విలువ రూ.200 కోట్లు. ఎస్బీహెచ్ నిర్మించే కార్యాలయాలు.. ఇతర వాణిజ్య కార్యకలాపాలతో ఆ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని నాటి ప్రభుత్వం భావించింది. అయినా ఏడాది తరువాత కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో 2012 సెపె్టంబర్లో ఎస్బీహెచ్కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే 2016 మార్చి 30న, జూన్ 27న మరింత సమయం కావాలంటూ ఎస్బీహెచ్ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు రాసింది. రద్దు చేయాలంటూ టీఎస్ఐఐసీ లేఖ ఎస్బీహెచ్.. ఎస్బీఐలో విలీనమయ్యాక టీఎస్ఐఐసీ 2019 మే 27న ఆ భూ కేటాయింపును రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. తమకు చివరి అవకాశం ఇవ్వాలంటూ ఎస్బీఐ 2020 జూలై 2న ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. 15 రోజుల్లోగా ప్రాజెక్టుకు సంబంధించి కాలపరిమితి సమర్పించాలని ఎస్బీఐకి తుది షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు ఎస్బీఐ ఇచ్చిన సమాధానం 2020 సెప్టెంబర్ 1న ప్రభుత్వానికి అందింది. నిర్దిష్ట కాలపరిమితిలోగా నిర్దేశించిన ప్రయోజనానికి ఆ భూమిని వినియోగించుకోని పక్షంలో దానిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2021 జనవరిలో కేటాయింపు రద్దు ప్రభుత్వానికి ఉన్న అధికారం మేరకు 2021, జనవరి 22న ఎస్బీఐకి చేసిన భూ కేటాయింపును రద్దు చేసినట్లు అధికారవర్గాలు వివరించాయి. రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖ రాయడంతోపాటు ఎస్బీఐ జూన్1న హైకోర్టులో రిట్పిటిషన్ను దాఖలు చేసింది, రద్దు చేసిన భూమికి ప్రత్యామ్నాయంగా ఉస్మాన్నగర్, గండిపేటలో భూమి ఇవ్వాలని టీజీఐఐసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈలోగా కాలపరిమితి పొడిగించే అంశాన్ని పునఃపరిశీలించాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. దీనికి ప్రత్యామ్నాయంగా కోర్టు కేసు ఉపసంహరించుకుని ఉస్మాన్నగర్లో భూకేటాయింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఎస్బీఐకి సూచించింది. అయినా స్పందించకపోవడంతో 2024 ఆగస్టు 21న కేటాయింపుతోపాటు సేల్ డీడ్ రద్దు చేయాలని ప్రభుత్వానికి టీజీఐఐసీ లేఖ రాసింది. రద్దు పునరుద్దరణను తిరస్కరించామని, ప్రత్యామ్నాయ స్థలాల కోసం ముందుకు రావాలని 2024 ఆగస్టు 21న ఎస్బీఐని మరోసారి కోరింది. అప్పుడు కోర్టుకు వెళ్లగా.. 4 వారాల్లో ఎస్బీఐ ప్రతిపాదనను పరిశీలించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రతిపాదనలతో ముందుకు రావాలని 2026 మే 4న రావాలని టీజీఐఐసీ కోరింది. ఆ సమావేశంలో నాలెడ్జి సిటీలో 2.5 ఎకరాల భూమి ఇవ్వడానికి టీజీఐఐసీ ప్రతిపాదించింది. ప్రత్యామ్నాయ భూమి తీసుకోవడానికి ఎస్బీఐ సుముఖత వ్యక్తం చేసింది. దీనితో మే 6న వేలం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి హెడ్ఆఫీసుతో మాట్లాడినట్లు ఎస్బీఐ అధికారులు తెలిపారు. మే 18న ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు. ఆ మరుసటి రోజునే ఎస్బీఐ హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. కానీ విచారణకు రాలేదు. మే 20న ఎస్బీఐ ప్రతిపాదనను ప్రభుత్వం మరోసారి తిరస్కరించింది. ఎస్బీఐ చైర్మన్ కారణం? మొదట్లో ఎస్బీఐ సుముఖత వ్యక్తం చేసి ఆ తరువాత ప్రభుత్వంపై బురద చల్లేవిధంగా కోర్టును ఆశ్రయించడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది., ఇందులో రాజకీయ హస్తం ఉందని భావిస్తోంది, తెలుగు వ్యక్తి ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి మహబూబ్నగర్ జిల్లా పెద్త పోతులపాడు గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో స్థానిక రాజకీయాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది, 16 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయని ఎస్బీఐ ఇప్పుడు అదే స్థలం కావాలంటూ కోరడం వెనుక రాజకీయాలే కారణమని భావిస్తోంది, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 2.50 ఎకరాల్లో ఎస్బీఐ నిర్మాణాలు చేపట్టవచ్చని ఆ భూములు కేటాయించినా సకాలంలో పనులు చేపట్టకపోతే వాటిని కూడా రద్దు చేసే అధికారం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండున్నరేళ్ల క్రితం అధికార పీఠానికి దూరమైన బీఆర్ఎస్ తిరిగి పూర్వవైభవం సాధించాలని భావిస్తోంది. ఇందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేస్తున్న బీఆర్ఎస్ మరోవైపు సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపైనా దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది పార్టీ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు బస్సు యాత్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాదయాత్ర ఉంటుందని బీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోంది. అదే సమయంలో నాయకత్వలేమి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన నాయకుల కోసం అన్వేష్కిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి హైదరాబాద్లోని పాతబస్తీ సహా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. చురుగ్గా యువనేతలు...2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు ఇతర పార్విల్లోకి వలసపోయారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు అటు పార్టీ అధినాయకత్వం, ఇటు కేడర్తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరితో పార్వికి చెడ్డపేరు వచ్చిందనే ఆరోపణలున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓటమి పాలయ్యామనే అభిప్రాయాన్ని కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో కొత్త తరానికి అవకాశమివ్వాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. అదీగాక, గతంలో విద్యార్థి, యువజన విభాగాలతోపాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేతలే ప్రస్తుతం పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా అవకాశం దక్కుతుందనే ఆశావహ దృక్పథం వీరిలో కనిపిస్తోంది. మరోవైపు పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనే వార్తల నేపథ్యంలో ఆశావహులు సందడి చేస్తున్నారు. పార్విలో అనేక మంది సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులతో అరంగేట్రం చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళా, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయా కేటగిరీలకు చెందిన వారు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్వైపు చూస్తున్నట్లు సమాచారం. నిష్క్రమణలు.. చేరికలు.. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్లో చేరారు. అక్కడ పొసగక తిరిగి బీఆర్ఎస్ గూటికి తిరిగి చేరుకుని క్రియాశీలమయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడ బీఎస్పీ నుంచి పోటీచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరి నాగర్కర్నూలు ఎంపీగా పోటీ చేసి, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ అచ్చంపేట (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశముంది. నిర్మల్లో ఓటమి అనంతరం మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్లో చేరినా క్రియాశీలంగా పనిచేయడం లేదు. ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయి. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ స్థానికంగా బలమైన నాయకుడి కోసం అన్వేష్కిస్తోంది. ⇒ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కుమారుడిపై కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్మూరులో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితయ్యారు. ⇒ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కాంగ్రెస్లో చేరడంతో మాజీ మంత్రి జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. రామగుండంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని పార్విలో ఆయన ప్రత్యర్థులు ఎత్తి చూపుతున్నారు. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నా వారి వయసు, ఆరోగ్య కారణాలతో కొత్త ముఖాలు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేశ్ బీజేపీ నుంచి తిరిగి బీఆర్ఎస్లో చేరారు. స్టేషన్ ఘనపూర్లో పార్టీని వీడిన కడియం శ్రీహరి స్థానంలో మాజీ మంత్రి రాజయ్య తిరిగి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మాజీ ఎంపీ డాక్టర్ వినోద్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ⇒ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరడంతో పార్టీ కేడర్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమన్వయం చేస్తున్నారు. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం (ఎస్టీ) ఎమ్మెల్యే వెంకట్రావు కాంగ్రెస్లోకి ఫిరాయించడంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ సాగుతోంది. కొత్తగూడెంలోనూ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్థానంలో వెతుకులాట సాగుతోంది. ⇒ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కాంగ్రెస్లో చేరడంతో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్రెడ్డి పార్టీ కేడర్ను సమన్వయం చేస్తున్నారు. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కాంగ్రెస్కు చేరువ కావడంతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ తాండూరు తన కార్యకలాపాలు ముమ్మరం చేశారు. ⇒ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గతంలో ఎంఐఎంతో దోస్తీ మూలంగా ఏడు చోట్ల స్నేహపూర్వక పోటీకి బీఆర్ఎస్ పరిమితమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాతబస్తీలోనూ బలమైన అభ్యర్థులను పోటీ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దానం నాగేందర్ బీఆర్ఎస్లో చేరడంతో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మన్నె క్రిశాంక్ పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నారు. -
రూ.1.5 కోట్ల నగదు, 2 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన తెలంగాణ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ మల్టీ జోన్–2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు ఆస్తులపై ఏసీబీ ఆరా కొనసాగుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం కీలక సోదాలు నిర్వహించారు. ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొందిన అనంతరం అధికారులు కెనరా బ్యాంక్ శాలిబండ శాఖలోని నరహరిరావు భార్య పేరుతో ఉన్న రెండు బ్యాంక్ లాకర్లను తెరిచారు. ఈ సోదాల్లో రూ.1.50 కోట్ల నగదు లభ్యమైంది. అదేవిధంగా ఒక్కోటి 100 గ్రాముల బరువున్న 12 బంగారు బిస్కెట్లు సహా సుమారు 2 కిలోల బరువున్న బంగారం, వజ్రాల ఆభరణాలు కూడా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, మంగళవారం నరహరిరావు ఇంట్లో ఏసీబీ సోదాల్లో రూ.1.54 కోట్ల నగదు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు లభించాయి. బ్యాంక్ బ్యాలెన్స్ రూ.2.29 కోట్లు, రూ.5.04 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఐదు స్థలాలు, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాల్గూడలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్, నార్సింగిలో 1,860 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు ఫ్లాట్లు, రాజేందర్నగర్ సమీపంలో 1,377 చదరపు అడుగుల ఫ్లాట్, గచ్చిబౌ లి టీఎన్జీఓ కాలనీలో జీప్లస్–3 భవంతి, ఛత్రినాకలో జీప్లస్ 2 భవనం ఉన్నట్టు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రూ.13,05,67,100గా ఉన్నట్టు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ప్రస్తుతం నరహరిరావు జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్నారని ఏసీబీ అధికారులు వెల్లడించారు. -
వివాహితలకు కష్టాలే 'సర్'..
సాక్షి, హైదరాబాద్: గతంలో భర్త పేరు.. ఇప్పుడు తండ్రి పేరును బంధువుగా ఓటర్ల జాబితాలో పేరు కలిగి ఉన్న మహిళలకు ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 కార్యక్రమంలో తలనొప్పులు తప్పేటట్టు లేదు. చివరిసారిగా రాష్ట్రంలో సర్ కార్యక్రమాన్ని 2002లో నిర్వహించగా, నాటి జాబితాతో ప్రస్తుత ఓటర్ల జాబితాను అనుసంధానం (మ్యాపింగ్) చేసి వ్యత్యాసాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా గుర్తిస్తోంది. 2002 ఓటర్ల జాబితాలో భర్త పేరును బంధువుగా కలిగి ఉండి ... ప్రస్తుత ఓటర్ల జాబితాలో తండ్రి పేరును బంధువుగా ఓటు కలిగి ఉంటే మ్యాపింగ్ ప్రక్రియలో తార్కిక వ్యత్యాసంగా గుర్తించి వారికి సైతం నోటీసులు జారీ చేయనున్నారు.2002 నాటి జాబితాలో తండ్రి పేరును బంధువుగా కలిగి ఉండి..ఆ తర్వాత పెళ్లి కావడంతో ప్రస్తుత జాబితాలో భర్త పేరు కలిగి ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ, దీనికి భిన్నంగా భర్త పేరును తీసేసి తండ్రి పేరును బంధువుగా ప్రస్తుత జాబితాలో పేరును నమోదు చేసుకునే ఉంటే మాత్రం అలాంటి మహిళలు విచారణ హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, ఇప్పటి వరకు 2,38,62,322 మంది (70.54శాతం) మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. ఇప్పటి వరకు మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో 89,88,175 (37.67) శాతం ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలున్నట్టు గుర్తించారు. వీరందరికీ ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారులు (ఈఆర్ఓ) నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీకి విచారణకు పిలుస్తారు. ఈ 11 రకాల తార్కిక వ్యత్యాసాలు ఇలా ఉన్నాయి. » 2002 ఓటర్ల జాబితాలోని తల్లిదండ్రుల పేర్లతో అనుసంధానమైన తోబుట్టువుల మధ్య వయస్సులో తేడా 9 నెలల కంటే తక్కువ ఉండడం. » తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సులో తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా ఉండడం. » తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సులో తేడా 50 ఏళ్లకు మించి ఉండడం. » 2002 ఓటర్ల జాబితాలోని నానమ్మ/తాతయ్య పేర్లతో మ్యాపింగ్ జరిగితే వారి మధ్య వయసులో 40 ఏళ్ల కంటే తక్కువ తేడా ఉండడం. » 2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లో వేర్వేరు తల్లిదండ్రుల పేర్లు కలిగి ఉండడం. » 2002 జాబితా, ప్రస్తుత జాబితాల్లో వేర్వేరు బంధుత్వం పేర్లు కలిగి ఉండడం. ఒక జాబితాలో తండ్రి ఉంటే మరో జాబితాలో తల్లి పేరు కలిగి ఉండడం. » 2002 జాబితాలో భర్త పేరు, ప్రస్తుత జాబితాలో తండ్రి పేరును బంధువుగా ఓటు కలిగి ఉండడం. » 2002 జాబితా, ప్రస్తుత జాబితాల్లో వేర్వేరు తండ్రి పేరు కలిగి ఉండడం. » 2002 జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లోని ఓటరు వయస్సుల్లో తేడాలుండడం. »ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయకపోవడం » కేవలం ఆధార్ మాత్రమే కలిగి ఉండడం. -
మూగ జీవుల ‘మనసు’ తెలుసుకునేలా..
సాక్షి, హైదరాబాద్: మానసిక ఒత్తిడి మనుషులకే కాదు, మూగజీవులకూ ఉంటుంది. మరి వాటి మానసిక ఒత్తిడిని గ్రహించేదెలా? హైదరాబాద్, సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ)లోని అంతరించిపోతున్న జాతుల పరిక్షణ ప్రయోగశాల (లాకోన్స్) శాస్త్రవేత్తలు జంతువుల మనసును చదవడానికి ‘బయో–స్కోర్’విధానాన్ని అభివృద్ధి చేశారు. మలపరీక్ష చాలు! సాధారణంగా జంతువుల అనారోగ్యాన్ని గుర్తించడానికి రక్తపరీక్ష చేస్తారు. రక్తం సేకరించే క్రమంలో అవి మరింత ఒత్తిడికి గురవుతాయి. బయో–స్కోరింగ్ విధానంలో జంతువుల మలాన్ని పరీక్ష చేస్తారు. దీనిని ‘ఫీకల్ గ్లూకోకార్టికాయిడ్ మెటాబోలైట్’(ఎఫ్జీఎం) విశ్లేషణ అంటారు. ఈ పరీక్ష ద్వారా జంతువుల్లోని హార్మోన్ల హెచ్చుతగ్గులను పరిశీలించి, అవి కొన్ని రోజులు, వారాలుగా అనుభవిస్తున్న ఒత్తిడిని కచి్చతంగా నిర్ధారిస్తారు. బోనులోని సింహానికీ తప్పని ఒత్తిడి జంతుప్రదర్శనశాలల్లోని బోనుల్లో ఉండే పులులు, సింహాల వంటి వన్యప్రాణులు పైకి ఎంత గంభీరంగా, ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తుంటాయి. జూ నిర్వహకులు జంతువుల శారీరక లక్షణాలు, ప్రవర్తన ఆధారంగా ఇచ్చే ‘కేర్ ఇన్ క్యాప్టివిటీ’స్కోర్కార్డులు కచ్చితమైన ఆరోగ్యస్థితిని అంచనా వేయలేవని గుర్తించిన శాస్త్రవ్తేలు ఈ బయో–స్కోర్ విధానాన్ని అభివృద్ధి చేశారు. భవిష్యత్తు సమస్యలకు అద్దం జూలలో జంతువు చురుగ్గా తిరుగుతోందా, బక్కచిక్కిందా, ఆహారం సరిగ్గా తింటోందా వంటి పైకి కనిపించే విషయాల ఆధారంగా రిపోర్టు ఇస్తారు. బయో స్కోర్ డేటా ద్వారా జంతువుల ప్రస్తుత ఆరోగ్య స్థితితోపాటు భవిష్యత్తు ఆరోగ్యాన్ని కూడా గ్రహించవచ్చు. తీవ్రమైన ఒత్తిడి వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతినడం వంటి పరిణామాలను గ్రహించి, తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. -
భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్య వారసత్వం యోగా: గవర్నర్
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్య వారసత్వం యోగా అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించిన యోగా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించడంతో దేశాల సరిహద్దులు, భాష, సంస్కృతులను దాటి మానవాళిని ఏకం చేసే శక్తిగా యోగా నిలిచిందన్నారు. వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సంప్రదాయం యోగా అని అన్నారు.ఆధునిక జీవితంలోని సవాళ్లు, ఒత్తిళ్లు, అసమతుల్యతల మధ్య యోగా ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల శక్తిని ప్రసాదిస్తుందన్నారు. కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యోగా మతానికి పరిమితం కాదని, అలా చూడటం మూర్ఖత్వమే అవుతుందని.. యోగా ప్రపంచానికి మనం ఇచ్చిన వరమని అన్నారు. భారత్ ప్రపంచానికి విశ్వగురువుగా నిలవడానికి మన సంస్కృతి, సంప్రదాయాలే కారణమని చెప్పారు.కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో గత 7 సంవత్సరాలుగా అద్భుతంగా యోగా దినోత్సవాన్ని 24 కౌంట్డౌన్ పేరుతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, రాకేశ్రెడ్డి, పాయల్ శంకర్, కొమురయ్య, అంజిరెడ్డి, సినీనటులు నవీన్ పొలిశెట్టి, డింపుల్ హయతి, పాయల్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
'సాక్షి' కథనాలను సుమోటోగా తీసుకున్న TGHRC
హైదరాబాద్: మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా భద్రత, బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ‘‘సాక్షి’’ తెలుగు దినపత్రికలో జూన్ 20న ప్రచురితమైన 2 వార్తలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు (జ్యుడీషియల్) శివడి ప్రవీణ సుమోటోగా విచారణకు స్వీకరించారు.మొదటి కేసు (HRC నెం.2468/2026)లో “తీవ్రంగా గాయపరచి.. నోట కరుచుకుని” అనే శీర్షికతో ప్రచురితమైన వార్తను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. వరంగల్ నగరంలోని లేబర్ కాలనీ సమీపంలోని శాలినీనగర్లో వీధికుక్క దాడి చేయడంతో రెండేళ్ల చిన్నారి పాయల్ తీవ్రంగా గాయపడింది. అలాగే, ఐదేళ్ల బాలుడు సహా మరికొందరు కూడా గాయపడినట్లు వార్తలో పేర్కొన్నారు. ఈ ఘటన ప్రజా భద్రతకు, ముఖ్యంగా చిన్నారుల జీవన హక్కు, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తోందని భావించిన కమిషన్.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందించిన సాయం, వీధికుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టనున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.“నలుగురిని కన్నా.. నడి రోడ్డుపైనే అమ్మ” రెండో కేసు (హెచ్ఆర్సీ నెం.2469/2026)లో “నలుగురిని కన్నా.. నడి రోడ్డుపైనే అమ్మ” అనే శీర్షికతో ప్రచురితమైన వార్తను కమిషన్ స్వీకరించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని శివాజీచౌక్ (గోల్బంగ్లా జంక్షన్) వద్ద ఓ గుర్తుతెలియని వృద్ధురాలు దయనీయ స్థితిలో రోడ్డుపైనే జీవిస్తున్నట్లు వార్తలో వెల్లడైంది. శారీరక ఇబ్బందులతో బాధపడుతూ, దారిన పోయేవారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవిస్తున్న ఆ వృద్ధురాలి పరిస్థితి, వృద్ధుల గౌరవప్రదమైన జీవనం, సంక్షేమం, సంరక్షణ, పునరావాసానికి సంబంధించిన తీవ్రమైన అంశాలను లేవనెత్తుతోందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆమెను గుర్తించడం, రక్షించడం, వైద్య చికిత్స, పునరావాసం కల్పించడం, కుటుంబ సభ్యులను గుర్తించే ప్రయత్నాలు చేయడం, ఆమె భద్రత, సంక్షేమం కోసం తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ను కమిషన్ ఆదేశించింది. ఈ రెండు కేసుల్లోనూ సంబంధిత అధికారుల నివేదికల కోసం విచారణను జులై 20కి వాయిదా వేసింది. -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్, ఫిల్మ్నగర్ మణికొండ, నానక్ రామ్గూడ, కొండాపూర్లో కుండపోత వర్షం పడింది. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్సిటీలో వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. -
నిర్మాణ వ్యర్థాల విచ్చలవిడి డంపింగ్పై చర్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎక్కడపడితే అక్కడ నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను (సీఅండ్డీ వేస్ట్) పారబోసే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పర్యావరణ పరిరక్షణ, నాలాల పూడిక నివారణ, నగరాల్లో వరద ముప్పును అరికట్టడమే లక్ష్యంగా అత్యంత కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని తాజాగా సంచలన జీఓ జారీ చేసింది. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీతో పాటు హెచ్ఎండీఏ, హెచ్ఎంఆర్ఎల్, హైడ్రా, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, ఆర్అండ్బీ, టీజీఐఐసీ, టీజీఎస్పీడీసీఎల్ ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి.కొత్త నిబంధనలు ఇలా.. ఇష్టానుసారంగా నిర్మాణ వ్యర్థాలు పారబోస్తే వాహనాలు సీజ్తో పాటు భారీ జరిమానాలు విధిస్తారు. రోడ్ల పక్కన, ఖాళీ స్థలాలు, చెరువులు, నాలాలలో వేస్తే భారీ జరిమానాలతో పాటు, ఆ వ్యర్థాల తొలగింపు ఖర్చును సదరు వ్యక్తి లేదా సంస్థ నుంచే రికవరీ చేస్తారు. అక్రమ రవాణా వాహనాలను స్పాట్లోనే సీజ్ చేస్తారు. నిబంధనలు అతిక్రమించే బిల్డర్లు, కాంట్రాక్టర్ల పర్మిషన్లు రద్దు చేయడమే కాక, వారిని శాశ్వతంగా బ్లాక్లిస్ట్లో పెడతారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విధులకు అడ్డుతగిలితే కఠిన క్రిమినల్ చర్యలు ఉంటాయి. u ఇకపై భవన నిర్మాణ, లేఅవుట్ లేదా కూల్చివేత అనుమతులు పొందాలంటే బిల్డర్లు కేవలం దరఖాస్తు చేస్తే సరిపోదు. దాంతో పాటు వ్యర్థాలను అక్రమంగా పారబోయబోమని అండర్ టేకింగ్ ఇవ్వాలి. u వేస్ట్ మేనేజ్మెంట్ , యుటిలైజేషన్ ప్లాన్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. u పర్యావరణ హితాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ పరిధిలో జరిగే అన్ని సివిల్, రోడ్డు మౌలిక వసతుల పనుల్లో కనీసం 10 శాతం నిర్మాణ సామగ్రిని రీసైకిల్ చేసిన వ్యర్థాలతో తయారు చేసిన వాటినే ఉపయోగించాలి. u రోడ్డు కటింగ్ పనులు, డ్రైనేజీలు, మెట్రో లేదా మౌలిక వసతుల కాంట్రాక్టర్లు పనులు ముగించే లోపు సైట్ను పూర్తిగా క్లీన్ చేయాలి. u ఈ ఉత్తర్వులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉన్నాయని, ఈ సరికొత్త నిబంధనల అమలులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ హెచ్చరించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా సంబంధిత నోడల్ అధికారులు, కమిషనర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని జీవోలో స్పష్టం చేశారు. ఇక్కడే వ్యర్థాలను అప్పగించాలి.. శంషాబాద్ ప్లాంట్ (టోల్ఫ్రీ: 18002030033) తూము కుంట ప్లాంట్ (18002030033) జీడిమెట్ల ప్లాంట్ (18001201159) ఫతుల్లాగూడ ప్లాంట్ (18001201159) -
బండి భగీరథ్కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్ మంజూరైంది. మల్కాజ్గిరి కోర్టు భగీరథ్కు బెయిల్ మంజూరు చేసింది. కాగా, రెండు వారాలకుపైగా రిమాండ్లో ఉన్న బండి భగీరథ్కు బెయిల్ రావడంతో బయటకు రానున్నాడు. అయితే బెయిల్కు సంబంధించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసినట్లు సమాచారం.మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా పోలీసులు POCSO చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్ను పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు.ఈ నేపథ్యంలో భగీరథ్ తరపు న్యాయవాదులు మల్కాజ్గిరి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్పై శనివారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. భగీరథ్ తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తూ బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న గౌరవ న్యాయస్థానం.. కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ రావడంతో భగీరథ్ జైలు నుంచి విడుదల కానున్నారు. -
24 గంటల కరెంట్ లేక..!
ఈ రైతు పేరు పులిమామిడి శ్రీనివాస్. సిద్దిపేట జిల్లా, లింగాపురం గ్రామం. ఈయనకు పదెకరాల భూమి ఉంది. పొద్దంతా బోరు వేస్తే నీళ్లు కింద మడులకు అందడం లేదని, రాత్రిపూట త్రీఫేజ్ కరెంట్ ఇస్తే బోర్లు, బావులు మంచిగా నడిచి పొలమంతా పారుతుందని పేర్కొంటున్నాడు. వ్యవసాయానికి 12 గంటల త్రీఫేజ్ కరెంట్ సరిపోవట్లేదని 24 గంటలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాడు.ముస్తాబాద్ (సిరిసిల్ల): నిన్నమొన్నటి వరకు పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు తిప్పలు పడ్డ రైతాంగం.. ఇప్పుడు నారుమళ్లు, వరిసాగుకు విద్యుత్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం పంటల సాగుకు సమాయత్తం అవుతున్న రైతులకు త్రీఫేజ్ కరెంట్ సరఫరా తగినంత లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం అమ్మకాల సమయంలో త్రీఫేజ్ కరెంట్ సరఫరాను అధికారులు కుదించారు. అప్పుడు పెద్దగా అవసరం లేని కరెంట్ కోసం రైతులు ఏం ఆలోచించలేదు. ఇప్పుడు ఏరువాక సిద్ధం చేస్తున్న రైతాంగానికి కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రాత్రి కరెంట్ నిలిపేసిన అధికారులు నెల రోజులుగా రాత్రిపూట త్రీఫేజ్ కరెంట్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ధాన్యం విక్రయాల సమయంతోపాటు రైతులెవరూ ఇతర పంటలు కూడా వేయకపోవడంతో కరెంట్ సరఫరాపై ఆలోచించలేదు. ప్రస్తుతం మృగశిర కార్తె ముగిసి ఆరుద్రలోకి వస్తున్న తరుణంలో త్రీఫేజ్ కరెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం వ్యవసాయం కోసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేజ్ కరెంట్ను సరఫరా చేస్తున్నారు. రైతులు నారుమడులు సిద్ధం చేసుకోగా, వరి నాట్లకు అవసరమైన పొలాన్ని సిద్ధం చేసేందుకు కరెంట్ సరిపోవడం లేదని పేర్కొంటున్నారు. పైగా ఇంకా ఎండలు మండుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వేళ పొలాల్లో పనిచేసే పరిస్థితులు లేవని, రాత్రి వేళ కరెంట్ సరఫరా ఉంటే పొలం మొత్తం నీరు పారించి ఇతర పనులు చేసుకుంటామనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. హామీ అమలు చేయాలి ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు కేవలం 10 గంటలు మాత్రమే త్రీఫేజ్ కరెంట్ రావడంతో జిల్లాలో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం చేయలేక, కరెంట్ రాక అవస్థలు పడుతున్నారు. నాణ్యమైన కరెంట్ ఇచ్చి, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. |– కొండ శ్రీనివాస్, ముస్తాబాద్నీళ్లున్నా కరెంట్ ఉంటలేదు భూగర్భ జలాలు మంచిగానే ఉన్నాయి. చెరువుల్లో కూడా నీళ్లున్నాయి. కానీ కరెంట్ ఉంటలేదు. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు మాత్రమే త్రీఫేజ్ ఇస్తున్నారు. గతంలో కరెంట్ ఇచ్చినట్లు ఈసారి కూడా ఇవ్వాలి. రైతులకు అండగా నిలవాలి. – తాళ్ల చంద్రారెడ్డి, రైతు, ముస్తాబాద్త్వరలోనే త్రీఫేజ్ సరఫరా ప్రస్తుతానికి 12 గంటల త్రీఫేజ్ కరెంట్ సరఫరా అవుతోంది. రైతులు పూర్తిస్థాయిలో పంటలు వేసుకునేలోగా 24 గంటల కరెంట్ సరఫరా అవుతుంది. ఇప్పటికైతే ఇంకా మాకేమీ ఆదేశాలు రాలేదు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వ్యవసాయానికి అవసరమైన కరెంట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – విష్ణుతేజ, ఏఈ, ముస్తాబాద్రాజన్న సిరిసిల్ల జిల్లా వరిసాగు : లక్షా 40వేల ఎకరాలు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు: 80,289 రైతులు : సుమారు లక్ష మంది ఈ రైతు పేరు ఎద్దండి నర్సింహారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం. ఇతడికి నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. వానాకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నాడు. తనకున్న రెండు బోరుబావులతో వరి సాగుచేసే నర్సింహారెడ్డికి విద్యుత్ బాధలు వచ్చి పడ్డాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే త్రీఫేజ్ కరెంట్ సరఫరా ఉండడంతో వ్యవసాయం ఎలా చేసేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం 12 గంటల కరెంట్ ఎలా సరిపోతుందో అధికారులు చెప్పాలని కోరుతున్నాడు. నెలరోజులుగా ఇదే పరిస్థితి ఉందని, పొలం మొత్తం నీరు పారిద్దామంటే కరెంట్ సరిపోవడం లేదని పేర్కొంటున్నాడు. 24 గంటలు త్రీఫేజ్ కరెంట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇలా.. ఇతనొక్కడే కాదు.. చాలా మంది రైతులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. -
‘కనెక్షన్’లో కలెక్షన్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నెలకు వందకుపైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఏటా 3 వేల వరకూ దెబ్బతింటున్నాయి. ప్రతిరోజూ కనీసం 60 ప్రాంతాల్లో విద్యుత్ లోఓల్టేజీ లేదా విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని విద్యుత్ అధికారులు ప్రకృతి వైపరీత్యాలపై నెట్టేస్తున్నారు. సాంకేతిక లోపాలంటూ తప్పించుకుంటున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.ట్రాన్స్ఫార్మర్ స్థాయికి మించి విద్యుత్ లోడ్ ఇవ్వడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు జరిపిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. ఈ వ్యవహారం వెనుక విద్యుత్ సిబ్బంది ముడుపుల వ్యవహారం ఉంటోంది. ఈ అవినీతిలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని ఉన్నతాధికారుల వరకూ భాగం ఉంటోంది. లోడ్ ఉన్నా కనెక్షన్ వినియోగదారులు కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసేప్పుడు విద్యుత్ అధికారులు హైడ్రామా ఆడుతున్నారు. వాస్తవానికి లోడ్ ఎంత ఉందో ముందే లెక్కగట్టాలి. ట్రాన్స్ఫార్మర్ స్థాయి కన్నా ఎక్కువ లోడ్ ఉంటే కొత్తదాన్ని బిగించాలి. దీనికి వినియోగదారుల నుంచి అధికారికంగా ఫీజు వసూలు చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఖర్చు, బిగింపు, రవాణా ఇతరత్రా లెక్కలు వేసి, వినియోగదారులను ముందుగా విద్యుత్ సిబ్బంది భయపెడుతున్నారు.దీంతో వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తోంది. లోడ్ తక్కువున్న...దూరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్కు కనెక్షన్ ఇస్తామని, రికార్డుల్లో చూపిస్తారు. కానీ లోడ్ ఎక్కువగా ఉన్న దగ్గర్లోని ట్రాన్స్ఫార్మర్కే కనెక్షన్ ఇస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల కనెక్షన్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. దీనికి ఒక్కో వినియోగదారుడి నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు.కార్పొరేట్ ఆఫీసుల విషయంలో విద్యుత్ అధికారుల పంట పండినట్టే. మల్టీ నేషన్ కంపెనీలు ఖర్చులను పెద్దగా పట్టించుకోవు. కాబట్టి రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. దీంతో లోడ్ ఎక్కువగా ఉన్న ట్రాన్స్ఫార్మర్కే కనెక్షన్లు ఎక్కువవుతున్నాయి. ఫలితంగా తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, పేలిపోవడం లేదా చెడిపోవడం జరుగుతోందని డిస్కమ్ల అంతర్గత అధ్యయనంలో వెల్లడైంది. చేతులెత్తేస్తున్న ఉన్నతాధికారులు హైదరాబాద్ నగరంలో ఓ ఏఈ తన పరిధిలో పది చోట్ల లోడ్ ఎక్కువగా ఉన్న ట్రాన్స్ఫార్మర్కే నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్లు ఇచ్చాడు. ఈ విషయమై అధికారులు నిలదీస్తే, మర్నాడే ఓ రాజకీయ నేత నుంచి ఫోన్ వచి్చంది. ఖమ్మంలో ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. లోడ్ ఎక్కువై 12 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. దీనికి ఏఈని సస్పెండ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ జిల్లా అధికారులకు రాజకీయ నేతల నుంచి ఫోన్ వస్తే ఆగిపోయారు.ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. సిబ్బంది కూడా విచిత్రమైన సమాధానం చెబుతున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించే వరకూ వినియోగదారులు ఓపిక పట్టడం లేదని చెబుతున్నారు. ఎవరో ఒక నాయకుడితో ఫోన్లు చేయిస్తున్నారని, అందుకే ఉన్నచోట కనెక్షన్లు ఇస్తున్నామని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము మాత్రం ఏం చేయగలమని ఉన్నతాధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. -
ఎస్సీ గురుకుల సొసైటీలో 550 ఖాళీలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలున్నాయి. ఇప్ప టికే మంజూరైన పోస్టుల్లో ఉన్న ఖాళీలపై జోనల్ అధి కారులు పరిశీలన పూర్తి చేసిన సొసైటీ కార్యదర్శికి తాజాగా నివేదిక సమర్పించారు. ప్రస్తు తం ఎస్సీ గురుకుల సొసైటీలో బోధన కేటగిరీలో 550 ఖాళీలు న్నాయి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, ఈనెల 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో తరగ తులు ప్రారంభించడంతో బోధనా సిబ్బంది ఖాళీలను అధి గమించేందుకు సొసైటీ కార్యదర్శి కార్యాలయం క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఖాళీలను పరిశీలించిన జోనల్ అధికారులు కేట గిరీల వారీగా గుర్తించి నివేదిక సమర్పించారు. ఈ ఖాళీలన్నీ శాశ్వ త ప్రాతిపది కన ప్రభుత్వం మంజూరు చేసి న పోస్టులే. ప్రాధాన్యత క్రమంలో ఈ ఖాళీ లను పార్ట్ టైమ్ టీచర్లతో భర్తీ చేయాలని సొసైటీ కార్యాలయం నిర్ణయించింది.జిల్లా కలెక్టర్ల అనుమతితో...ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేలా జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిధిలోని ఖాళీల వివరాలను వెంటనే కలెక్టర్లకు అందించాలని గురుకుల సొసైటీ కార్యదర్శి సంబంధిత జోనల్ అధికారులను ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. జిల్లా కలెక్టర్ అనుమతితో పార్ట్టైమ్ ఉద్యోగులను నియమించుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలో దాదాపు వెయ్యికి పైగా పార్ట్టైమ్ ఉద్యో గులున్నట్లు సమాచారం.తాజాగా నియ మించుకునే వారికి కూడా ఇదే తరహా వేత నాలు ఇవ్వాలని సొసైటీ అధికారులు ప్రాథ మికంగా నిర్ణయించారు. అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే 2 విడతల్లో ప్రవేశా లను చేప ట్టిన అధికారులు ఈనెల 21వ తేదీలోగా ఆయా విద్యా ర్థులను నిర్దేశించిన పాఠశా లల్లో రిపోర్టు చేయాలన్నారు. మరోవైపు బోధన తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పార్ట్ టైమ్ టీచర్లను నియమించుకోవా లని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
గాంధీసరోవర్కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్కు లైన్ క్లియరైంది. మూసీ సుందరీకరణలో భాగంగా బాపూఘాట్ ప్రాంతంలో గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు ఇప్పటివరకు అడ్డంకిగా ఉన్న కేంద్ర రక్షణ శాఖకు చెందిన భూముల అప్పగింతకు తాజాగా కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని బాపూఘాట్ పరిసరాల్లో రక్షణ శాఖకు చెందిన 83.814 ఎకరాల భూమిని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్)కు బదిలీ చేసింది.ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ (డిఫెన్స్ ల్యాండ్స్ విభాగం) ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అవుతున్న ఈ భూముల మొత్తం విలువ రూ.533.42 కోట్లు అని రక్షణ శాఖ నిర్ధారించింది. దీనికి బదులుగా రక్షణ భూముల నిబంధనల ప్రకారం సమాన విలువైన మౌలిక వసతులను సైన్యానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. కేంద్రం నిర్ణయంతో సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మూసీ నదిని సరికొత్త పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా మార్చేందుకు, బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ఈ ల్యాండ్ క్లియరెన్స్ ఎంతో కీలకమని తన ‘ఎక్స్’ఖాతాలో పేర్కొన్నారు. ఈ సహకారానికిగాను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, భారత సైన్యానికి సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.బదిలీ చేసిన భూములివీ..గండిపేట మండలంలోని బండ్లగూడలో సర్వే నంబర్లు 86, 87, 88లోని 25.15 ఎకరాలు, హైదర్గూడలోని సర్వే నంబరు 126లోని 5.23 ఎకరాలు, అలాగే బండ్లగూడలోని 91, 92, 96 సర్వే నంబర్లు, హైదర్గూడలోని 123, 124, 125ల్లోని మొత్తం 39.72 ఎకరాలు, అలాగే బండ్లగూడలోని సర్వే నంబరు 94లోని 5.5 ఎకరాలు, గోల్కొండలోని ఖిలా మొహమ్మద్ నగర్లోని సర్వే నంబర్లు 3/ఎల్/15 (రెవెన్యూ సర్వే నంబర్లు 250, 251, 252లోని 8.09 ఎకరాలను ఎంఆర్డీసీఎల్కు బదిలీ చేసింది. తొలి దశలో ఉస్మాన్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (11.8 కి.మీ), హిమాయత్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (9.2 కి.మీ) మూసీని అభివృద్ధి చేయనున్నారు. ఈ మూసీ కారిడార్ పొడవునా అవసరమైన అదనపు ప్రైవేట్ భూముల సేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసింది.త్రివేణి సంగమంగా గాంధీ సరోవర్..మొత్తం 238 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. మూసీ, ఈసా నదులతో పాటు మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తరలించి బాపూఘాట్ త్రివేణి సంగమ ప్రాంతంలో 150 అడుగుల ఎత్తయిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహనీయుడి విగ్రహం ఇదే కానుంది. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఎత్తయిన గాంధీ విగ్రహం పాట్నాలోని గాంధీ మైదానంలో ఉంది. దీని ఎత్తు 72 అడుగులు (22 మీటర్లు). కాంస్య విగ్రహం.ఈ ప్రాజె క్టులో భాగంగా గాంధీ సరోవర్ను హ్యాపెనింగ్ ప్లేస్గా నైట్ ఎకానమీగా అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. గాంధీ తత్వ శాస్త్రాన్ని బోధించే మ్యూజియం, గాంధీ జీవిత చరిత్రను వివరించే ఆడిటోరియాలు, ఫొటో ఎగ్జిబిషన్లు, ధ్యాన మందిరం, చేనేత శిక్షణ కేంద్రం, భారీ వీక్షణ గోపురాన్ని నిర్మించనున్నారు. ఈ సంగమంలో బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. వ్యాపార, ఆర్ధిక కార్యకలాపాల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు కూడా ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, షాపింగ్ మాల్స్, యాంపీ థియేటర్లు, వినోద కేంద్రాలు, ఉద్యానాలు, ఇతరత్రా యుటిలిటీలను అభివృద్ధి చేస్తారు. -
అన్నిటికీ ఒకటే క్యూర్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగర ప్రజలు ఇకపై వివిధ ప్రభు త్వ విభాగాలకు చెందిన వివిధ సేవల చెల్లింపులను ఒకే యాప్ (క్యూర్–1) ద్వారా చేయొచ్చు. ఈ మేరకు ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ ద్వారా క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో ‘కామన్ యూనిఫైడ్ బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టం’ అమలుకు మార్గ దర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ వ్యవస్థ ద్వారా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ట్రాఫిక్ చలాన్లు తదితర ప్రభుత్వ బకాయిలన్నింటినీ ఒకే డిజిటల్ ప్లాట్ఫాంలో చెల్లించే అవకాశం కల్పించనున్నారు.ప్రస్తుతం నగర ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన బిల్లులు, పన్నులు చెల్లించేందుకు వేర్వేరు పోర్టళ్లను వినియోగించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి వల్ల ప్రజలకు ఇబ్బందులు, శాఖలకు వసూళ్ల సమన్వయంలో సమస్యలు, ఆదాయ లీకేజీలు చోటుచేసుకుంటున్నాయని గుర్తించిన ప్రభుత్వం.. ఈ యాప్ ద్వారా సమగ్ర చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. దీంతో చెల్లింపుల పారదర్శకత, జవాబుదారీతనం, వసూళ్ల సామర్థ్యం పెరగడంతో పాటు విభిన్న చెల్లింపు వ్యవస్థల అవసరం తొలగిపోనుంది. ఏ సేవలు అందుబాటులోకి?మొదటి దశలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలకు సంబంధించిన ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, సెల్ఫ్ అసెస్మెంట్, సూపర్ స్ట్రక్చర్ ఫీజులు, ఖాళీ భూముల పన్ను (వీఎల్టీ) చెల్లింపులను అనుసంధానించనున్నారు. అలాగే టీజీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లులు, జలమండలికి సంబంధించిన వాటర్, సివరేజి చార్జీలు, హైదరాబాద్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు కూడా ఈ వేదికలోకి రానున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వం సూచించే ఇతర సేవలను కూడా ఇందులో చేర్చనున్నారు. యాప్ నిర్వహణ బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు అప్పగించనున్నారు. రోజువారీ సెటిల్మెంట్యాప్ ద్వారా జరిగే అన్ని చెల్లింపులు మీ సేవ పేమెంట్ గేట్వే ద్వారా ప్రాసెస్ అవుతాయి. వసూలైన మొత్తా లు తాత్కాలికంగా కేంద్ర ఖాతాలో నిల్వ చేసి, టీ+0 లేదా టీ+1 విధానంలో సంబంధిత శాఖలకు బదిలీ చేస్తారు. పేమెంట్ వైఫల్యాలు, రీకన్సిలియేషన్ సమస్యలు, ఇతర సేవా వివాదాల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్ రెడ్రెస్సల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.పౌరులు క్యూర్ –1 యాప్,మై క్యూర్ యాప్, ఆయా శాఖల పోర్టళ్ల ద్వారా ఫిర్యాదులు నమో దు చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని శాఖలు 90 రోజుల్లోపు క్యూర్–1 యాప్తో చెల్లింపు వ్యవస్థలోకి మారా ల్సి ఉంటుంది. కాగా.. ఒకే డిజిటల్ ఎకో సిస్టమ్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం తీసుకొచ్చిన క్యూర్ –1 యాప్ నగర పాలనలో డిజిటల్ సంస్కరణలకు కొత్త మైలురాయిగా నిలవనుందని అధికారులు భావిస్తు న్నారు. 3 కార్పొరేషన్ల పరిధిలోని పౌరులకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని పేర్కొంటున్నారు. -
తెలంగాణకు మూడు బుల్లెట్ రైళ్లు
కందుకూరు: దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో భాగంగా తెలంగాణకు మూడు బుల్లెట్ రైళ్లు(హైస్పీడ్ రైల్ కారిడార్లు) రానున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించిందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు, బేగంపేట, తిమ్మాపూర్ గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి సీఆర్ఎఫ్ నిధులు రూ.87 కోట్లతో లింకు రహదారులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.ఈ సందర్భంగా లేమూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ హైస్పీడ్ కారిడార్ల కోసం మొదట రూ.5 లక్షల కోట్లు అంచనా వేయగా, భూముల ధరలు పెరగడంతో ఆ ఖర్చు రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని, దీనికి సంబంధించి సర్వే పనులు కొనసాగుతున్నాయన్నారు. ఆర్ఆర్ఆర్ కోసం ఉత్తరం వైపు భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని, ఆ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం హైవే విస్తరణ పనులకు డీపీఆర్ సిద్ధమవుతోందని, ఏడాది లోపు పనులు ప్రారంభమవుతాయని స్పష్టంచేశారు.రంగారెడ్డి జిల్లా తెలంగాణకు గుండెకాయ లాంటిదని, జిల్లాలోని గ్రామాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఈ ప్రాంత అభివృద్ధికి రహదారుల అనుసంధానం అత్యంత కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేశాన్ని ఏలే పాలకులు కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘గురుకుల విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ అధికారులుగానే కాకుండా దేశాన్ని ఏలే పాలకులుగా ఎదగాలి. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి 100 మంది అంబేడ్కర్లు తయారు కావాలి. మీరంతా (విద్యార్థులు) తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలిం. దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో విద్య, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా 27.50 లక్షల మంది విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అలాగే గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి అన్న–అక్క మెంటార్షిప్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అలాగే సుమారు రూ.150 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడామౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ స్కూళ్ల కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటే అద్భుత ఉదాహరణ అన్నారు.విధ్వంసం నుంచి వికాసం వైపు..‘అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని ప్రజాప్రభుత్వం సంపూర్ణంగా విశ్వశిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ బడుల మూసివేతతో విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించింది. అందుకే బడ్జెట్లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం. విద్యాభివృద్ధికి రూ. 26,600 కోట్లు కేటాయించాం. దీన్ని ఖర్చుగా కాకుండా ంభవిష్యత్ తరాలకు పెట్టుబడిగా భావిస్తున్నాం. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచాం.’ అని సీఎం రేవంత్ వివరించారు.విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసమే.. ‘విద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యా శాఖను నా దగ్గరే పెట్టుకున్నా. ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. కుల వ్యవస్థను రూపుమాపాలనే లక్ష్యంతో సమీకృత గురుకులాలను తీసుకొస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరు చేశాం. వచ్చే విద్యా సంవత్సరంలో 119 పాఠశాలలను ప్రారంభిస్తాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్తో దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలుపుతాం. ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. బంగారు పతకాలు సాధించే బాధ్యతను రాష్ట్ర విద్యార్థులపై పెడుతున్నాం’ అని సీఎం రేవంత్ చెప్పారు.బ్లూకాలర్ ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాం‘ఏఐ తుపానుతో కోట్లాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే బ్లూ కాలర్ ఉద్యోగాల కల్పన వైపు దృష్టి సారించాం. యువతకు నైపుణ్యాన్ని అందిస్తున్నాం. ఆంగ్లంతోపాటు జర్మన్, జపానీస్ భాషలను నేర్పిస్తున్నాం. ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం. స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. విద్యార్థుల్లో నైపుణ్యాలకు పదునుపెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. మన తలరాతను మార్చేది చదువొక్కటే. మీరంతా శ్రద్దతో చదవండి. మీకేం కావాలో ఇచ్చే బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా’ అని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.డ్రగ్స్రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యం: గవర్నర్తెలంగాణను మాదకద్రవ్యాల రహితంగా మార్చడమే తన లక్ష్యమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. గతంలో హిమాచల్ గవర్నర్గా పనిచేసిన తాను ఆ రాష్ట్రాన్ని డ్రగ్స్రహితంగా తయారు చేసినట్లు గుర్తుచేశారు. డ్రగ్స్ నిర్మూలనపై ఇంటి నుంచే విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర ప్రభుత్వం కూడా నషా ముక్త్ భారత్ కోసం కృషి చేస్తోందన్నారు. మంచిపని చేసే ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని.. రేవంత్ ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తానన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆత్మగౌరవానికి ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టిరాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఆత్మగౌరవానికి యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ ప్రతీక అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రజాప్రభుత్వం తీర్చిదిద్దుతోందని చెప్పారు. యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్లో బూట్లు, యూనిఫారాలు, పుస్తకాలు, బెడ్షీట్స్ వంటి వస్తువులను అత్యంత నాణ్యతతో సేకరించినట్లు వివరించారు. 27 లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ ఒక తండ్రిలా బాధ్యత తీసుకొని ఈ కిట్లను అందిస్తున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం భారీ సంస్కరణలు చేపడుతుంటే ప్రతిపక్ష నాయకులు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని.. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, ప్రపంచంతో పోటీ పడుతున్న విద్యార్థులను చూసి ఓర్వడం లేదని విమర్శించారు.వాట్సాప్ ద్వారా 18 లక్షల మంది విద్యా సమాచారంరాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికిపైగా విద్యార్థుల పాఠశాల విద్యా సమాచారాన్ని నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్కు పంపే సేవలను గవర్నర్తో కలిసి సీఎం రేవంత్రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రారంభించారు. రాష్ట్ర పక్షి పాలపిట్టను డిజిటల్ మస్కట్గా పరిచయం చేశారు. పాలపిట్ట యానిమేషన్ వీడియోల ద్వారా ముఖ్యమైన సమాచారం, అవగాహన సందేశాలు, వీడియోలు వాట్సాప్లో పంపిస్తారు. విద్యా పురోగతి, పరీక్షల సమాచారం, విద్యా సామగ్రి పంపిణీ, స్కాలర్షిప్స్, పాఠశాల కార్యక్రమాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాలపై సకాలంలో సమాచారం అందుబాటులోకి రానుంది. విద్యారంగంలో సాంకేతికత వినియోగాన్ని విస్తరించి విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం, తల్లిదండ్రులతో ప్రభుత్వ అనుసంధానాన్ని బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలిపారు. -
ఆస్తులు విడుదల చేయాల్సిందే ఈడీ జప్తు సరికాదు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా ఆరోపించిన కేసుల్లో వాన్పిక్ (వాడరేవు–నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాన్పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస్తులను విడుదల చేస్తూ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన తొమ్మిది పిటిషన్లు కొట్టివేసింది.ఈ మేరకు జస్టిస్ పి. శామ్ కోషి, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం.. అన్ని వర్గాల నుంచి సుదీర్ఘ వాదనలు విని గతేడాది డిసెంబర్ 23న తీర్పు రిజర్వు చేసింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులు, అందులోని నిర్ధారణలు, పత్రాలను సమగ్రంగా పరిశీలించిన ధర్మాసనం.. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేలా ఎటువంటి కొత్త ఆధారాలు లేదా చట్టపరమైన కారణాలను ఈడీ చూపించలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.ట్రిబ్యునల్ ఇచ్చిన కారణాలు సమంజసంగా ఉన్నాయని సమర్ధించింది. వాటిని తప్పుబట్టేందు కు తగిన ఆధారాలు రికార్డులో లేవని స్పష్టం చేసింది. దీంతో ఈడీ దాఖలు చేసిన 9 అప్పీళ్లను కొట్టివేస్తూ.. ట్రిబ్యునల్ ఉత్తర్వులను యథాతథంగా వెంటనే అమలు చేయాలని తేల్చిచెప్పింది. అప్పిలేట్ ట్రిబ్యునల్ మొత్తం 12 కేసుల్లో ఉత్తర్వులు జారీ చేయగా గతంలో హైకోర్టు మూడు కేసుల్లో ఊరటనిచ్చింది. దీంతో వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్తోపాటు సంబంధిత కంపెనీలకు ఇది కీలక న్యాయపరమైన విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఏమిటి వాన్పిక్ కేసు? వాడరేవు, నిజాంపట్నం ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, షిప్యార్డ్, విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వాన్పిక్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రస్ అల్ ఖైమా ప్రభుత్వం మధ్య ప్రభుత్వ–ప్రభుత్వ (జీటుజీ) విధానంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.ఈ ప్రాజెక్టులో ప్రయోజనాలు పొందిన నిమ్మగడ్డ ప్రసాద్, ప్రతిఫలంగా జగన్కు చెందిన కంపెనీల్లో రూ. 863.33 కోట్ల పెట్టుబడులు పెట్టారన్న నాటి అధికార, ప్రతిపక్ష కుట్రలో భాగంగా సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. అక్రమంగా మనీలాండరింగ్ కేసులు నమోదు చేసి, పలు ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ జప్తు ఉత్తర్వులను అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించడంతో జగన్మోహన్రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ సహా కంపెనీలు అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. ట్రిబ్యునల్ఏం చెప్పింది? విచారణ అనంతరం ట్రిబ్యునల్కీలక వ్యాఖ్యలు చేసింది. వాన్పిక్ ప్రాజెక్టు అధికారికంగా అమల్లోకి రావడానికి ముందే సంబంధిత పెట్టుబడులు జరిగాయని.. కాబట్టి వాటిని ప్రాజెక్టుకు ప్రతిఫలంగా ఇచ్చినట్లు లేదా క్విడ్ ప్రో కోగా పేర్కొనలేమంది. అక్రమ పెట్టుబడులను నిర్ధారించేందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఈడీ జప్తు చేసిన ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూ.. 2019 జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. అనేక మంది ఉద్యోగులు పనిచేస్తున్న మీడియా సంస్థ జగతి పబ్లికేషన్స్ ఆస్తుల బదిలీని నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఉన్నందున, ఆ సంస్థకు సంబంధించిన రూ. 273.39 కోట్ల విలువైన ప్లాంట్, యంత్రాల జప్తును కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంది.మొత్తం 60 మంది పెట్టుబడిదారులు (నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన గ్రూప్ కంపెనీలతో సహా) ఒక్కో షేరుకు రూ. 360 చొప్పున షేర్లను కొనుగోలు చేశారన్న వాస్తవాన్ని ఈడీ తరఫు న్యాయవాది కూడా కాదనలేదు. 60 మందిలో 45 మంది పెట్టుబడిదారులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పెట్టుబడి పెట్టిన వారిలో కొందరిని మాత్రమే ప్రత్యేకంగా ఎంచుకొని వారి వ్యవహారాలను క్విడ్ ప్రో కోగా ఆరోపించడం వెనుక ‘ఎంపిక చేసుకునే విధానం’అవలంభిస్తోందని సందేహం కలుగుతోందని ట్రిబ్యునల్ అనుమానం వ్యక్తం చేస్తూ జప్తు ఉత్తర్వులను రద్దు చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో దర్యాప్తు సంస్థల జోక్యం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ అనుమతితోనే పెట్టుబడులు.. ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2019 అక్టోబర్లో ఈడీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. వాన్పిక్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వ విధానాలను దురి్వనియోగం చేసి భారీ ప్రయోజనాలు పొందారని.. ప్రాజెక్టు కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఈడీ వాదించింది. ప్రతివాదుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ–ప్రభుత్వ ఒప్పందం ఆధారంగా చేపట్టారన్నారు. రస్–అల్–ఖైమా ప్రభుత్వం అధికారిక భాగస్వామిగా వ్యవహరించిందన్నారు. ప్రాజెక్టు కోసం జరిగిన పెట్టుబడులు, భూముల కొనుగోళ్లు, కంపెనీల ఏర్పాటు అన్నీ ప్రభుత్వ అనుమతులతోనే జరిగాయని కోర్టుకు తెలిపారు. ప్రతివాదులకు ఊరట.. హైకోర్టు కొట్టివేసిన అప్పీళ్లలో జీ2 కార్పొరేట్ సర్విసెస్, సుగుణి కన్స్ట్రక్షన్స్ ఎల్ఎల్పీ, జగతి పబ్లికేషన్స్, గిల్క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్, కార్మెల్ ఏసియా హోల్డింగ్స్, వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, ఆల్ఫా విలాస్ ప్రైవేట్ లిమిటెడ్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితర ప్రతివాదులకు ఊరట లభించింది. (వాన్పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అదర్స్, వాన్పిక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లకు రెండేళ్ల కిత్రం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఊరట లభించిన విషయం తెలిసిందే) ట్రిబ్యునల్ నాటి ఉత్తర్వుల్లోని మరికొన్ని అంశాలు.. వాన్పిక్ ప్రాజెక్టు రస్–అల్–ఖైమా (యూఏఈ) ప్రభుత్వంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ–ప్రభుత్వ ఒప్పందం కింద ప్రారంభించిందన్న వాదనలకు రికార్డుల్లో ఆధారాలు ఉన్నాయంది. పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వం నేరుగా చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని గుర్తుచేసింది. వాన్పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాల్లో సీబీఐ, ఈడీలు విధాన నిర్ణయాలను కూడా నేరపూరిత చర్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయని వ్యాఖ్యానించింది.ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక, పారిశ్రామిక విధాన నిర్ణయాలను దర్యాప్తు సంస్థలు తమ అభిప్రాయాలతో భర్తీ చేయలేవని పేర్కొంది. ప్రభుత్వానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అవగాహన ఒప్పందంలోని ప్రతి అంశం తుది ఒప్పందంలో యథాతథంగా ఉండాల్సిన అవసరం లేదని, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు సహజమని అభిప్రాయపడింది. అడ్జుడికేటింగ్ అథారిటీ పలు కీలక పత్రాలు, వాదనలను సరిగా పరిశీలించలేదంది. వాన్పిక్ కేసుల్లో ఈడీ అటాచ్ చేసిన ఆస్తులివే... మొత్తం ఆస్తుల విలువ: 863.33 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రూప్: రూ.538.31 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ గ్రూప్: రూ. 325.02 కోట్లు వైఎస్ జగన్కు చెందిన కంపెనీల్లో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి: రూ. 68.31 కోట్లు (సండూర్ పవర్స్: 54.94 కోట్లు, స్థిరాస్తులు: 13.35 కోట్లు) జగతి పబ్లికేషన్స్: రూ. 450.00 కోట్లు కార్మెల్ ఆసియా హోల్డింగ్స్: రూ. 20.00 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన కంపెనీల్లో... నిమ్మగడ్డ ప్రసాద్: రూ. 37.83 కోట్లు ఆల్ఫా అవెన్యూస్: రూ. 97.82 కోట్లు ఆల్ఫా విల్లాస్: రూ. 35.90 కోట్లు గిల్క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్స్: రూ. 45.85 కోట్లు జి2 కార్పొరేట్ సర్విసెస్: రూ. 49.98 కోట్లు సుగుణి కన్స్ట్రక్షన్స్: రూ. 7.00 కోట్లు వాన్పిక్ పోర్ట్స్: రూ. 23.23 కోట్లు వాన్పిక్ ప్రాజెక్ట్స్: రూ. 27.72 కోట్లు (ఇందులో వాన్పిక్ పోర్ట్స్, వాన్పిక్ ప్రాజెక్టుపై ఉత్తర్వులు గతంలోనే వెలువడ్డాయి) -
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించబోయే నీట్ (NEET) రీ-ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ను చూపించి, తమ ఇళ్ల నుండి పరీక్షా కేంద్రాల వరకు, తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఉచితంగా రాకపోకలు సాగించవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక ఉచిత ప్రయాణ సదుపాయం సంస్థకు చెందిన ఏసీ సర్వీసులు మినహాయించి అన్ని బస్సులలో అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు.ఈ పరీక్షకు దాదాపు 73 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల మార్గాలలో తగినన్ని బస్సులను నడిపేందుకు ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 21వ తేదీ మొదటి సర్వీసు నుంచి అర్ధరాత్రి వరకు ఈ సదుపాయాన్ని అభ్యర్థులు వినియోగించుకోవచ్చని, ఏదైనా ఆటంకాలు ఎదురైనట్లయితే, టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-2345 0033, 6815 3333లలో సంప్రదించవచ్చంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షకు సకాలంలో చేరుకోవడానికి అభ్యర్ధులు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. -
తెలంగాణ: వాట్సాప్లో పాఠశాల విద్యా సేవలు
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యాశాఖ ద్వారా అన్ని పాఠశాలల సమాచారం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులకు అందించనున్నారు. మీసేవ సహకారంతో వాట్సాప్ ద్వారా ఇకపై స్కూల్ అప్డేట్స్ నేరుగా వారి ఫోన్ కు చేరనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు.ఈ వినూత్న కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందనున్నారు. విద్యా పురోగతి, పరీక్షల సమాచారం, విద్యా సామగ్రి పంపిణీ, స్కాలర్షిప్లు, పాఠశాల కార్యక్రమాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాలపై సకాలంలో సమాచారం అందుబాటులోకి రానుంది.ఈ ప్లాట్ఫారమ్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD)-మీసేవ విభాగం, పాఠశాల విద్యా శాఖతో కలిసి అభివృద్ధి చేసింది.విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు, హాల్ టికెట్ల డౌన్లోడ్, మార్కుల మెమోలు, పరీక్షా ఫలితాలు, ఎస్ఎస్సీ మెమోలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు, ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్లు, ఎస్ఎస్సీ మెమో సవరణల దరఖాస్తులు.. సేవలు పొందవచ్చుత్వరలో అందుబాటులోకి రానున్న సేవలుయూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ వివరాలు, విద్యార్థుల హాజరు సమాచారం, ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు, క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాల సమాచారం, రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమాల వివరాలు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ -
ఆంగ్ల భాషపై విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ సందేశం
సాక్షి,హైదరాబాద్: విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందిస్తూనే వారి మాతృభాషలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన “రెండు వారాల ఆంగ్ల భాషా ప్రావీణ్యత కార్యక్రమం”లో పాల్గొన్న ఉపాధ్యాయులతో గవర్నర్ శుక్రవారం లోక్ భవన్లో ముచ్చటించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఉపాధ్యాయులకు గవర్నర్ ధృవపత్రాలను అందజేసి అభినందించారు.హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ నివాస విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆంగ్ల భాషా బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా నిర్వహించబడింది. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి మద్దతుగా గవర్నర్ విచక్షణ నిధుల నుంచి రూ.12.80 లక్షలు లోక్ భవన్ మంజూరు చేసింది. కార్యక్రమంలో 50 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు ఈఎఫ్ఎల్యూ అధ్యాపకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల భావప్రసార, బోధనా సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈఎఫ్ఎల్యూ మరియు గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. ఉపాధ్యాయులలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెరగడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడి, ఉన్నత విద్యా, ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయని ఆయన పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని గవర్నర్ అన్నారు. ఇటువంటి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు విద్యాపరమైన అంతరాలను తగ్గించడమే కాకుండా, గిరిజన ప్రాంతాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి మద్దతుగా లోక్ భవన్ నిధుల మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.“శిక్షణ పొందిన 56 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఆదర్శంగా నిలవాలి. నాణ్యమైన విద్య ద్వారా గిరిజన విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి మనమందరం కలిసి పనిచేయాలి. గిరిజన సంక్షేమానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి లోక్ భవన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని గవర్నర్ పేర్కొన్నారు. మాతృభాషలను, గిరిజన సమాజాల సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే, పోటీ ప్రపంచంలో రాణించగల సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించేలా బోధన సాగాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఉపాధ్యాయులను గవర్నర్ అభినందించి, శిక్షణ ద్వారా పొందిన జ్ఞానం, నైపుణ్యాలను విద్యార్థుల ప్రయోజనం కోసం సమర్థవంతంగా వినియోగించాలని కోరారు.కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, ఈఎఫ్ఎల్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగరాజు, గవర్నర్ సంయుక్త కార్యదర్శి కె. శశికిరణా చారి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజా రామ్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో తరచూ ఇక్కడే యాక్సిడెంట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు బ్లాక్స్పాట్స్పై దృష్టి సారించారు. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో 2023–25 మధ్య నిర్వహించిన అధ్యయనం ఆధారంగా 49 ప్రాంతాల్లో బ్లాక్స్పాట్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మూడేళ్లలో 398 ప్రమాదాలు జరగ్గా.. 279 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా చోట్ల ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సంబంధిత విభాగాలకు లేఖలు రాశారు. జాతీయ రహదారులపైనే అత్యధికం.. నగర ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో కేవలం కొన్నింటిలో మాత్రమే బ్లాక్స్పాట్స్ లేవని తేలింది. అత్యధిక ఠాణాల పరిధిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్స్పాట్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తం 49 బ్లాక్స్పాట్స్లో 26 జాతీయ రహదారుల పైనే ఉన్నాయని ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించారు. ఎన్హెచ్ నం.44పై 11, ఎన్హెచ్ నం.65పై 13 ఉండగా.. ఎన్హెచ్ నం.765, 163లపై ఒకొక్కటి చొప్పున ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా ఇతర రహదారులపై మిగిలినవి ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అనేకం ‘చావు’రస్తాలే... నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో అత్యధికం చౌరస్తాలు, జంక్షన్లే. రద్దీ వేళలు, సిగ్నళ్లు యాక్టివ్గా ఉండే సమయంలో కంటే మిగిలిన సమయాల్లోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ 49 బ్లాక్స్పాట్స్లో 40 శాతం చౌరస్తాల్లో ఉన్నవే. ఆయా ప్రాంతాలు సైతం హైదరాబాద్–సైబరాబాద్–మల్కాజిగిరి సరిహద్దుల్లో కొన్ని ఉండటం గమనార్హం. వీటిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో మరణించిన/క్షతగాత్రులైన వారిలో పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉన్నారు. ప్రమాదాలకు కారణాలివే ⇒ పరిమితికి మించిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపటం ⇒ మలుపులున్న చోట్ల డివైడర్లు, మీడియమ్స్ లేకపోవడం ⇒ అత్యంత సమస్యాత్మకంగా (బ్లైండ్) ఉన్న మలుపులు ⇒ కీలక సూచనలు చేసే సైనేజ్ బోర్డులు లేకపోవడం ⇒ ఇరుకైన రోడ్లు, ఆపై అక్కడే ఉంటున్న ఆక్రమణలు ⇒ రోడ్ ఇంజినీరింగ్ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం ⇒ రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు ⇒ క్యారేజ్ వేలో తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు ⇒ అవసరమైన స్థాయిలో విద్యుత్ దీపాలు లేకపోవడం ⇒ వాహనచోదకులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం ⇒ నో–ఎంట్రీల్లోకి వాహనాలతో దూసుకుపోవడం ⇒ రోడ్ మార్కింగ్ పక్కగా లేకపోవడం, శాస్త్రీయత కొరవడటంచదవండి: బుడ్డోడి సరదా.. లగ్జరీ కారు గోవిందా! గ్రే స్పాట్లే కీలకం బ్లాక్ స్పాట్స్తో పాటు గ్రే స్పాట్స్ గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వాలి. తరచూ ప్రమాద ప్రాంతాలు బ్లాక్ స్పాట్స్ కిందికి వస్తే.. ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్నవి గ్రే స్పాట్స్. గ్రే స్పాట్లను గుర్తించి ముందే చర్యలు తీసుకుంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడవచ్చు. – ఎం.ప్రకాష్ కుమార్, రవాణా రంగ నిపుణుడు -
‘తలరాతను మార్చేది చదువొక్కటే.. మీకేం కావాలో నాకు చెప్పండి’
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర,దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ శుక్రవారం (జూన్ 19) హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని మేం సంపూర్ణంగా విశ్వసించాం. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే బడ్జెట్లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం.విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.ఇది ఖర్చుగా కాదు…భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా మేం భావిస్తాం. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు.పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం.ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారువిద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా. ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం.ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరుఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపబోతున్నాం. రాబోయే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఏఐ తుఫాన్తో కోట్లాదిమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించాం.యువతకు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంగ్లీష్ తో పాటు జర్మనీ, జపాన్ భాషను నేర్పిస్తున్నాం .ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం… స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం.. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి పదును పెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందిసోషల్ వెల్ఫేర్లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లుగా, ఐఏఎస్ లుగా, ఐపీఎస్ లుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలి. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి.దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి.రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది..మీ తలరాతను మార్చేది చదువొక్కటే. మీరు చదవండి… మీకు ఏం కావాలో ఇచ్చే బాధ్యత మీ రేవంతన్న తీసుకుంటాడు. 27.50 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నాం . తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం’అని స్పష్టం చేశారు. -
బుడ్డోడి సరదా.. లగ్జరీ కారు గోవిందా!
హైదరాబాద్: కేవలం నాలుగు సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే లగ్జరీ కారు అది. దానిని ఐదవ తరగతి చదువుతున్న 11 సంవత్సరాల బాలుడు ఓఆర్ఆర్ పై నడుపుతూ దూసుకెళ్లాడు. విచిత్రమేమంటే తండ్రి బాలుడి పక్కనే కూర్చున్నాడు. ఈ దృశ్యాన్ని అటుగా వెళుతున్న మరో వాహనదారుడు వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఈ క్లిప్ ను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ రాజు చూసి సీసీ కెమెరాల ఆధారంగా కారు యజమానిని గుర్తించారు.కారు టోలీచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్ హాదీది అని నిర్ధారించారు. అతను ఎంజీ సైబర్ స్టార్ లగ్జరీ కారును ఇటీవల కొనుగోలు చేశాడు. ఈనెల 11న తన 11 ఏళ్ల కుమారుడితో కారులో వచ్చాడు. కారు కుమారుడికి చేతికిచ్చి ఔటర్పై శంషాబాద్ వైపు వెళ్ళాడు. చివరకు వాహనాన్ని జప్తు చేశారని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీహెచ్ రాజు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అయ్యో శ్వేతా.. ఆదుకునేవారే లేరా?#Rajendranagar #Police have Booked a #Tolichowki-based businessman, after a video of his 11-year-old son driving #Minor #Driving an #MG #Cyberster convertible luxury electric sports car on the Outer Ring Road went viral on social media. 1/2 pic.twitter.com/l0MQmwYYB5— shinenewshyd (@shinenewshyd) June 19, 2026 -
అయ్యో శ్వేతా.. ఆదుకునేవారే లేరా?
హైదరాబాద్: విధి ఆడిన వింత నాటకంలో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది.. భర్త, కూతురితో ఆనందంగా సాగిపోవాల్సిన ఆమె ఇపుడు అనాథ అయింది.. కన్న కూతురు, కట్టుకున్న భర్త ప్రాణాలు ఆమె కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు.. ఈనెల 13న తెల్లవారుజామున జరిగిన విద్యుత్ ప్రమాదంలో అందరి ముందూ తండ్రి, కూతురు విగతజీవులగా మారిపోయారు.అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానాజీగూడ టెలికాం కాలనీలో జరిగి విద్యుత్ తీగ కారుపై పడటంతో సందీప్(45), అతని కూతురు రుత్విక(16) ప్రాణాలు కోల్పోవడం ఇంకా స్థానికుల కళ్లముందే మెదులుతోంది.మీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది.. కాదు.. మీ నిర్లక్ష్యం వల్లే అని విద్యుత్ శాఖ అధికారులు, మల్కాజిగిరి మున్సిపల్ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికి ఆరు రోజులవుతోంది. ప్రమాదానికి కారణం ఏ శాఖ అయినా.. ప్రభుత్వ శాఖలే కదా.. మరి బాధితురాలు శ్వేత గురించి ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోతే ఎలా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ అధికారులైనా వచ్చి బాధితురాలికి భరోసా ఇచ్చి పరిహారం గురించి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఆ కుటుంబ పరిస్థితి కూడా అంతంత మాత్రమేనని చెబుతున్నారు. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని స్థానికులు పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసినప్పటికీ స్పందన లేదని ఆరోపిస్తున్నారు. సుమారు 45 నిమిషాల పాటు సహాయం కోసం ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్పందించి కరెంట్ సరఫరా నిలిపివేసి ఉంటే.. అత్యవసర టీమ్ వెంటనే చేరుకుంటే ఇద్దరి ప్రాణాలు దక్కేవని చెబుతున్నారు. ఇపుడు అధికారులు సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం శ్వేతకు ఆర్థిక సహాయం అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.ఇలాంటి సమయంలో బాధితురాలికి మానసికంగా, ఆర్థికంగా అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యతని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్వేత అత్త లలిత క్యాన్సర్ బారిన పడింది, మామ చక్రపాణికి ఇటీవల బైపాస్ సర్జరీ జరిగింది. తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కుటుంబ పరిస్థితిని ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకొని అండగా నిలవాలని కోరుతున్నారు. -
బొల్లా బ్రహ్మనాయుడికు బెయిల్ మంజూరు
సాక్షి,హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కోర్టు విధించిన 3 రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (EOW) అధికారులు ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, అలాగే రూ. 20 వేల చొప్పున రెండు పూచీకత్తులు (ష్యూరిటీలు) సమర్పించాలని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
ఈ పన్నీరు తింటే కన్నీరే..
అబిడ్స్: పన్నీరు అంటే స్వచ్ఛమైన పాలతో తయారు చేస్తారని అధిక శాతం ప్రజలకు తెలుసు. కానీ జంట నగరాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, పన్నీరు విక్రయ కేంద్రాల్లో కల్తీ జరుగుతోంది. పాలు లేని కల్తీ పన్నీర్ తింటున్న చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలోనే హెచ్– ఫాస్ట్ అధికారులు నగరంలోని 45 కల్తీ పన్నీరు తయారీ, విక్రయ కేంద్రాలపై దాడులు చేశారు. కల్తీ పన్నీరు, మలై పన్నీరు, చీజ్లను స్వాధీనం చేసుకున్నారు.గురువారం ఉస్మాన్గంజ్లోని హెచ్ ఫాస్ట్ కార్యాలయంలో టాస్్కఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొంత మంది వ్యాపారులు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ తదితర రాష్ట్రాల నుంచి చీజ్డ్ అనలాగ్ను తీసుకొచ్చి పన్నీరుగా తయారు చేసి వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయాలు చేస్తున్నారు. అదే ఉత్పత్తిని లోప్యాట్ పన్నీర్, మీడియం ప్యాట్ పన్నీర్, ప్రెష్ పన్నీర్ వంటి తప్పుదారి పట్టించే పేర్లతో విక్రయిస్తున్నారని డీసీపీ వివరించారు. పన్నీరు ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్, గడువు తేదీ లేకుండా అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.కొంత మంది వ్యాపారులు అక్రమంగా లాభార్జన కోసం అక్రమాలకు పాల్పడున్నారని ఆయన చెప్పారు. పన్నీరు తయారీ కేంద్రాలపై అధికారులు దాడులు చేయగా.. అధిక నీరు, పాలేతర కొవ్వులు, కృత్రిమ పాలు, ఆహారానికి అనర్హమైన పదార్థాలు కలపడం లాంటి కల్తీ చర్యలను గుర్తించామన్నారు. పన్నీరు ప్యాకెట్లపై లేబ్లింగ్ లేకపోవడంతో పాటు కేంద్రాల్లో చెల్లని లైసెన్సులు ఉండడం, అపరిశుభ్రమైన నిల్వ విధానాలను కూడా గుర్తించామన్నారు. కల్తీ, మిస్ బ్రాండెడ్ 825 కిలోల నకిలీ ఉత్పత్తులను స్వా«దీనపరచ్చుకున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రజలు పన్నీరు కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్పై లేబుల్, గడువు తేదీల వివరాలను తప్పనిసరిగా చూసి కొనుగోలు చేయాలని సూచించారు. -
తెలంగాణ అటవీశాఖకు బహుమతిగా రోబోటిక్ ఏనుగు
తెలంగాణ ప్రజల భద్రతకు, జంతు సంక్షేమానికి ప్రాధ్యానత ఇస్తూ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఊరేగింపులకు, సినిమా షూటింగ్లకు సజీవ ఏనుగులను వినియోగించేవారు. అయితే జంతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ..పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) బహుమతిగా ఇచ్చిన రొబొటిక్ ఏనుగును స్వాగతించారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి. ఈ మేరకు గురువారం గుర్రంగుడ ఎకో పార్కులో జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖల చేతుల మీదుగా ప్రారంభమైన రొబోటిక్ ఏనుగు ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ రోబోటిక్ ఏనుగును నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఏర్పాటు చేయనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. సుమారు రూ. 10 లక్షలు విలువ చేసే ఈ రోబోటిక్ ఏనుగును పెటా తెలంగాణ రాష్ట్ర అటవీశాఖకు బహుమతిగా ఇచ్చింది. కాగా, పెటా మత, సాంస్కృతిక కార్యక్రమాలలో సజీవ ఏనుగుల వాడకానికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కేరళలోని ప్రముఖ దేవాలయాలకు 10కి పైగా రోబోటిక్ ఏనుగులను విరాళంగా ఇచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.(చదవండి: నా సరస్వతిరేఖ మా నాన్న!) -
హైదరాబాద్లో కల్తీ కలకలం : 110 కిలోల ఫ్రైడ్ చికెన్ సీజ్
హైదరాబాద్ : ఆహార కల్తీ మరియు అసురక్షిత ఆహార పద్ధతులపై నిరంతర నిఘాలో భాగంగా, హెచ్-ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్) బృందం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO)తో కలిసి చార్మినార్లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక ఫాస్ట్ ఫుడ్ గోదాముపై ఆకస్మిక దాడి నిర్వహించింది. ఈమేరకు కల్తీ చికెన్, కృత్రిమ, రంగులు, నూనెలకు స్వాధీనం చేసుకుంది. ఈ అక్రమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇద్దరు బాధ్యులను అదుపులోకి తీసుకున్నామని ఐపిఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్.వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.నమ్మకమైన సమాచారం మేరకు, ఈ బృందం చార్మినార్లోని పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్లో ఉన్న ‘మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’ ప్రాంగణాన్ని తనిఖీ చేసింది. ఈ తనిఖీలో, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే విధంగా అత్యంత అపరిశుభ్రమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను తయారు చేయడం మరియు నిల్వ చేయడం జరుగుతున్నట్లు గుర్తించారు.• నిర్బంధ FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహించడం.• నిషేధించబడిన/కృత్రిమ ఆహార రంగులను (MSK లయన్ గ్రీన్ మరియు రాస్ప్బెర్రీ రెడ్) ఉపయోగించడం.• పాడైపోయిన మరియు ప్రమాదకరమైన వంట నూనెను పదే పదే ఉపయోగించడం.• నీటి విశ్లేషణ ధృవీకరణ (Water Analysis Certification) మరియు నాణ్యత నియంత్రణ చర్యలు లేకపోవడం.• విపరీతమైన అపరిశుభ్ర వాతావరణం మరియు కీటకాల నియంత్రణ (Pest Control) లేకపోవడం.స్వాధీనం చేసుకున్న ఆహార పదార్తాల వివరాలు:• సుమారు 110 కిలోల తయారు చేసిన ఫ్రైడ్ చికెన్• 6 టిన్నుల వంట నూనె (ఒక్కొక్కటి 15 లీటర్లు)• కృత్రిమ రసాయన ఆహార రంగులు కల్తీ , అపరిశుభ్రమైన ఆహారం- ఆరోగ్య సమస్యలు • ఫుడ్ పాయిజనింగ్, వాంతులు మరియు విరేచనాలు.• జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు (Gastrointestinal infections).• పదే పదే వాడిన నూనెను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు.• కృత్రిమ ఆహార రంగుల వల్ల అలర్జీలు మరియు టాక్సిసిటీ (విషపూరితం) కావడం.• కాలేయం (Liver) మరియు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపే తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరగడం.చట్టపరమైన చర్యలు:నిందితులు ఈ అసురక్షిత పద్ధతులను దాచిపెట్టి, వినియోగదారులకు కల్తీ ఆహారాన్ని సరఫరా చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసారు మరియు చట్టవిరుద్ధంగా లాభపడ్డారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 (FSS Act, 2006) మరియు ఇతర సంబంధిత చట్టాల నిబంధనల ప్రకారం హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న సామగ్రిని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)కు అప్పగించారు. ఆహార కల్తీపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ కింది జాగ్రత్తలను సూచించింది. • లైసెన్స్ పొందిన సంస్థల నుండి మాత్రమే ఆహారాన్ని కొనుగోలు చేయండి/తీసుకోండి.• కొనుగోలు చేయడానికి ముందు FSSAI లైసెన్స్ను తనిఖీ చేసుకోండి.• కృత్రిమ రంగులు కలిపిన లేదా అనుమానాస్పద ఆహార పదార్థాలను నివారించండి.• అసురక్షిత ఆహార పద్ధతులపై అధికారులకు ఫిర్యాదు చేయండి.ఫిర్యాదుల కొరకు టోల్-ఫ్రీ నంబర్: 8712661212 ను సంప్రదించండి. -
దాన్యం కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది
సాక్షి, హైదరాబాద్: పంట బోనస్కు కోతలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల బాధ్యత నుంచి కూడా తప్పుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. డిజిటల్ కేబినెట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇకపై కేంద్రం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడం అంటే రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల నుంచి చేతులెత్తేసినట్టేనని పేర్కొన్నారు.రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే వారు ఏం చేయాలన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్రావు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పంట బోనస్ విషయంలో కూడా ప్రభుత్వం రైతులపై కొత్త షరతులు విధిస్తోందని హరీశ్రావు మండిపడ్డారు. కేవలం ఏడు రకాల సన్న ధాన్యాలకు మాత్రమే బోనస్ వర్తింపజేయడం ద్వారా సాగుపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లకు పరిమితులు విధించడం రైతులను మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడమేనన్నారు.కేసీఆర్ రైతన్నను రాజుగా నిలబెట్టారని, రేవంత్రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతును ఆర్థికంగా దెబ్బతీసే విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో నీటి నిర్వహణ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్రావు విమర్శించారు. ప్రాజెక్టుల్లో నీటి కొరత ఉందని చెబుతూనే ఆంధ్రప్రదేశ్కు 10 టీఎంసీల నీటిని ఎందుకు వదిలారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా చెల్లింపుల విషయంలో బహిరంగ సభలు నిర్వహించడం హాస్యాస్పదమని, గతంలో పెండింగ్లో ఉన్న మూడు విడతలతోపాటు ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతుభరోసా నిధులు కలిపి మొత్తం రూ.16,545 కోట్లను ఈ నెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. -
ప్రతి గింజా కాదు.. 'కోటా మేరకే'!
సాక్షి, హైదరాబాద్: ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే కోటా మేరకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. ఏటా కేంద్రం ఖరారు చేసే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో నిర్దేశిత కోటా మేరకే కొనుగోళ్లు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన అనధికార మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి.. సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్కతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా.. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయం విలేకరులు ప్రస్తావించగా.. పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బదులిచ్చారు. మిర్చి, పత్తి, ఇతర పంటల ఎగుమతి కేంద్రం వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. ఇందుకోసమే గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్సీఐ, సీసీఐ, నాఫెడ్ సంస్థలను నెలకొల్పిందని గుర్తు చేశారు. పంటల కొనుగోలు బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుండడంతో ఒత్తిడి పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పండించే అన్ని రకాల పంటలను ఎంఎస్పీతో పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి.. ఎల్నినో ప్రభావం తీవ్రమవుతోందని, ప్రధానంగా తెలంగాణ, ఏపీపైనే అధిక ప్రభావం ఉండబోతోందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని తుమ్మల చెప్పారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, కాబట్టి మొదటి వర్షం పడగానే తొందరపాటుతో విత్తనాలు నాటవద్దని రైతులకు సూచించారు. కనీసం 7 సెం.మీ.ల వర్షం కురిస్తేనే విత్తనాలు మొలకెత్తేందుకు సరిపడ తేమ లభిస్తుందని చెప్పారు. మండల వ్యవసాయ అధికారులు చేసే సూచనలను రైతులు పాటించాలని కోరారు. 83% రైతులు ఈ 7 రకాలే పండిస్తున్నారు.. సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న బోనస్ను ఈ ఏడాది ఏడు రకాల సన్నాలకు మాత్రమే ఇవ్వాలని మంత్రుల సమావేశం నిర్ణయించింది. బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048,హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం–1638, డబ్ల్యూజీఎల్–44, కేఎన్ఎం–7715.. ఈ ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుంది. రాష్ట్రంలో సన్నాలు పండించే 83 శాతం రైతులు ఈ రకాలనే పండిస్తున్నారని తుమ్మల చెప్పారు. మార్కెట్ డిమాండ్, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వీటిని పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా రైతులు మార్కెట్లో విక్రయించుకోవచ్చని అన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం మన రాష్ట్రం నుంచి తక్కువ ధాన్యాన్ని సేకరించటంపై కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిరలో ఈ నెల 30న భారీ స్థాయిలో రైతు సమ్మేళనం సభ ఏర్పాటు చేసి ఆ వేదిక నుంచి వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. యూరియా కోసం త్వరలో మరోసారి ఢిల్లీకి.. వానాకాలం సీజన్కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి మళ్లీ విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్టు ఉత్తమ్ తెలిపారు. ఇందుకోసం త్వరలో ఇతర మంత్రులతో కలిసి ఢిల్లీ వెళతామని తుమ్మల చెప్పారు. గత ఏప్రిల్, మే నెలల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించి, లక్ష మెట్రిక్ టన్నులు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రామగుండం ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతున్న ఎరువులను మధ్యప్రదేశ్, బిహార్కు తరలిస్తున్నారని, ఇకపై అధ్యధిక కోటాను రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేశారు. మెట్రో–2కు సహకరించాలి.. ‘మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గం విజ్ఞప్తి చేస్తోంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నాం. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ మెట్రో విస్తరణకు సహకరించాలి..’ అని ఉత్తమ్ కోరారు. ఈ నెల 21న రాష్ట్రంలోని 2,008 పరీక్ష కేంద్రాల్లో జరగనున్న నీట్ పరీక్షకు 2.95 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఈ విద్యార్థులందరికీ (హాల్ టికెట్లు చూపాలి) ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. వీబీజీ రామ్ జీ వద్దు..పాత నరేగా కావాలి పాత ఉపాధి హామీ చట్టం యథాతథంగా కొనసాగించాలని కేంద్రానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పేరు మార్చిన కేంద్రం.. కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని రాష్ట్రంలో జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ఒత్తిడి చేస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా (60:40 నిష్పత్తి) నిధులతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయనుందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఒత్తిడిపై అధ్యయనం కోసం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో తనతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఇక డిజిటల్ కేబినెట్ భేటీలు.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్ లెస్గా నిర్వహించే పద్ధతికి గురువారం నాటి సమావేశంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో డిజిటల్ కేబినెట్ భేటీలే నిర్వహిస్తారు. ఇందుకోసం గురువారం ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్బాబు.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్లు అందజేశారు. ఇకపై ఈ– బుక్ ద్వారానే కేబినెట్ సమావేశం ఎజెండా, నోట్స్ అన్నీ మంత్రులకు అందుబాటులో ఉంచుతారు. -
టమాటాలో పులుపు తగ్గింది!
సాక్షి, హైదరాబాద్: పళ్లెంలో ముద్ద నోట్లోకి వెళ్లేవరకు అంతా బాగానే ఉంది. నమిలాకే తెలుస్తోంది.. రుచి లేదు, వాసన లేదు, పైగా కడుపులో మంట. హైదరాబాద్ మా ర్కెట్లకు ప్రతిరోజూ 2,800 టన్నుల కూరగాయలు దిగుమతవుతున్నా, పోషకాలు మాత్రం ఉండట్లేదు. తొందరపాటు సాగు కోసం మోతాదుకు మించి విష రసాయనాలు వాడటమే దీనికి ప్రధాన కారణమవుతోంది. తిండి తిన్నా బలమేదీ? పంట త్వరగా చేతికందడానికి విచ్చలవిడిగా రసాయన ఎరువులు,కాలుష్య కారకాలు ఎక్కువగా ఉండే మందులు పిచికారీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) తన అధ్యయనంలో తేల్చింది. మడిలో వేర్వేరు కూరగాయల తోటలను సాగుచేస్తుండటం కూడా ఒకింత ప్రమాదకరమని చెప్పింది. ఒక పంటకు పిచికారీ చేసే రసాయనం ఇంకో పంట ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని గుర్తించింది. నగరానికి వచ్చే టమాటాలో పులుపు (లైకోపీన్) 35 శాతం, క్యాప్సికంలో విటమిన్–సీ 28 శాతం తగ్గినట్లు తేల్చింది. ఆహార భద్రత, ప్రమాణాలు (ఎఫ్ఎస్ఎస్ఏఐ)–2025 సర్వేలో హైదరాబాద్ మార్కెట్ నమూనాల్లో 31 శాతం కూరగాయల్లో గరిష్ట అవశేష పరిమితికి మించి పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. కృత్రిమంగా మగ్గబెట్టిన టమాటాలో లైకోపీన్ 38 శాతం, క్యాప్సికంలో విటమిన్–సీ 30 శాతం తగ్గినట్లు ఐకార్ అధ్యయనంలో తేలింది. ఫలితంగా తిండి తిన్నా బలం రావడం లేదు. ఏ మందు ఎంత మోతాదులో... టమాటా త్వరగా పక్వానికి రావడానికి ఎథిఫాన్ ద్రావణం పిచి కారీ చేస్తున్నారు. సొరకాయ, బీరకాయ లావుగా, పొడవుగా పెరగడానికి నిషేధిత ఆక్సిటోసిన్ సూదులు గుచ్చు తున్నారు. ఇది తిన్న పిల్లల్లో హార్మోన్ సమస్యలు, అకాల యుక్తవయస్సు వస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పురుగుల నివారణకు వాడే క్లోర్పైరిఫాస్, మాలాథియాన్ మందులు నరాలను దెబ్బ తీస్తున్నాయి. శంషాబాద్లో గత మార్చిలో బీరకాయ నమూనాలో ఆక్సిటోసిన్ పరిమితికి ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అది తిన్న ఇద్దరు చిన్నారులు వాంతులతో ఆసుపత్రి పాలయ్యారు. మేడ్చల్లో కాలీఫ్లవర్పై నిషేధిత ప్రొఫెనోఫాస్ వాడకం బయటపడింది. నిమ్స్ వైద్యుల లెక్కల ప్రకారం కలుషిత ఆహారం వల్ల గ్యా్రస్టిక్, కాలేయ జబ్బులు గత ఏడాది 22 శాతం పెరిగాయి. -
గాజు చాంబర్లున్న ట్రావెల్స్ బస్సుల సీజ్ షురూ
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఏసీ స్లీపర్ బస్సుల్లో గాజు చాంబర్లు ఏర్పాటు చేస్తున్న బస్సులపై రవాణాశాఖ చర్యలు ప్రారంభించింది. ఇంతకాలం సాధారణ కర్టెన్లతోనే సరిపెట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు, బెర్తులకు కొత్తగా గాజు చాంబర్లు ఏర్పాటు చేసే కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని గురువారం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ‘‘గాజు చాంబర్లలో ప్రయాణికులు బందీ’’ శీర్షికతో ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో రవాణాశాఖ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. నగరంలోని మియాపూర్లో రంగారెడ్డి జిల్లా డీటీఓ శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించి ప్రియా ట్రావెల్స్కు చెందిన ఏసీ స్లీపర్ బస్సును సీజ్ చేశారు. అందులో గాజు చాంబర్లు ఏర్పాటు చేసిన తీరును పరిశీలించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని, ఇలా నిబంధనలకు విరుద్ధంగా గాజు చాంబర్లు ఏర్పాటు చేసిన బస్సులను సీజ్ చేసి వాటిని తొలగింపజేసి, బస్సు ఆపరేటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్టు రవాణాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జరిపిన సాధారణ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 928 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశామని తెలిపింది. అంతకుముందు జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ నగరంలోని పలు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో భేటీ అయి, నిబంధనలు విధిగా పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని, బస్సులు సీజ్ చేసి భారీ పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. సాక్షి వెలుగులోకి తెచ్చిన గాజు చాంబర్ల అంశాన్ని ప్రస్తావించి... వాటి ఏర్పాటు అంటే ప్రయాణికుల ప్రాణాలతో చెలాగాటమాడినట్టేనని, ఆ కొత్త విధానాన్ని విస్తరించకుండా చూడాలన్నారు. -
ఖరీఫ్కు ముందే కష్టాలు!
యాసంగి సన్న ధాన్యానికి రావాల్సిన బోనస్లో రూ.700 కోట్లు ఇప్పటికీ రాలేదు.. ఇంతలో ప్రభుత్వం గుర్తించిన 7 రకాల వరి వంగడాలకే ఈసారి బోనస్ పరిమితమంటూ ప్రకటించింది. మరి.. ఆ రూ.700 కోట్లు ఇక రానట్టేనా? యాసంగి రైతు భరోసా రూ.9 వేల కోట్లు అని చెప్పినా.. అది రూ. 5,653 కోట్లకే పరిమిత మైంది.. ఈ నెల 30న ఈ ఖరీఫ్ రైతు భరోసా నిధులు జమచేస్తామంటూ కేబినెట్ భేటీ అనంతరం సర్కారు ప్రకటించింది.యాసంగి రైతు భరోసాకు మంగళం పాడినట్టేనా? అన్నదాతల అవస్థలు..రైతన్నకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలు, ట్రాక్టర్ అద్దెల భారం, కూలీల కొరత, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ హెచ్చరికలు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. వీటికి తాజా కష్టాలు తోడయ్యాయి. అటు రైతు బీమాలో భాగంగా ఎల్ఐసీకి ప్రీమియం చెల్లింపులో ఆలస్యం జరగడంతో అన్నదాతల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఏడు రకాల వరికే బోనస్గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యం సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ప్రజలకు సన్నబియ్యం పంపిణీ, రైతులకు అదనపు ఆదాయం అనే లక్ష్యాలతో క్వింటాల్కు రూ.500 బోనస్ను ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో లక్షలాది మంది రైతులు దొడ్డు బియ్యం స్థానంలో సన్నాల సాగుకు మొగ్గు చూపారు. యాసంగి సీజన్లో ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సన్నాలకు వాతావరణం అనుకూలించకపోయినా వ్యయ ప్రయాసల కోర్చి రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. అయితే గత యాసంగిలో కొనుగోలు చేసిన దాదాపు 14 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యానికి సంబంధించిన బోనస్ సుమారు రూ.700 కోట్లు ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. వానాకాలం సీజన్ రావడంతో ఇక యాసంగి బోనస్ను వదులుకున్నట్టే. 2024–25 యాసంగిలో కూడా దాదాపు 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బోనస్ రూ.1,159 కోట్లను ఇవ్వలేదు. కాగా, ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇకపై ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల వరి వంగడాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుందని సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అంచనా ప్రకారం 38.19 లక్షల ఎకరాల్లో ఈ ఏడు రకాల సన్నాలను సాగు చేయనున్నారు. దీనికి అవసరమైన విత్తనాల పరిమాణం 9.55 లక్షల క్వింటాళ్లుగా పేర్కొన్న ప్రభుత్వం.. 15.64 లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నట్టు చెబుతోంది. అయితే అందులో దాదాపు 13 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ప్రైవేట్ వ్యాపారుల వద్దనే ఉండడం గమనార్హం. ఇందులో ఇప్పటికే 2 లక్షల క్వింటాళ్లను రైతులకు విక్రయించినట్టు వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వద్ద కేవలం నాలుగు రకాల విత్తనాలు 38 వేల క్వింటాళ్లు మాత్రమే ఉండగా, జాతీయ విత్తన సంస్థ (ఎన్ఎస్సీ) వద్ద కేవలం 4,838 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. రైతులు సన్నాల కోసం ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. రైతుబీమా ఆలస్యం... రైతు బీమా డబ్బు అందక వేలాది కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి.2025–26 సంవత్సరానికి గాను రైతుబీమా ప్రీమియం కింద ఎల్ఐసీకి రూ.1,359 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.436 కోట్లు ఆలస్యంగా చెల్లించినట్టు తెలిసింది. ప్రభుత్వం ప్రీమియం ఆలస్యంగా చెల్లించిన కారణంగా ఈ ఏడాది చనిపోయిన 7,606 రైతులకు సంబంధించిన రైతు బీమాను ఎల్ఐసీ ఇంకా విడుదల చేయలేదు. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందలేదు. 2 ఎకరాలకే పరిమితమైన రైతుభరోసా సాగు యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా కింద ప్రతి సీజన్కు ఎకరానికి రూ.6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం.. గత యాసంగిలో రాష్ట్రంలోని 71.05 లక్షల రైతుల ఖాతాల్లో రెండు ఎకరాలకు మాత్రమే రూ.5,653 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. మార్చి 19న తొలి విడతగా రూ.3,446.94 కోట్లు, రెండో విడతగా రూ.2,206.06 కోట్లను జమచేసింది. రూ.9 వేల కోట్లు రైతుభరోసా కింద చెల్లించనున్నట్టు ప్రకటించినా, రూ.5,653 కోట్లకే పరిమితం చేశారు. ఈ నెల 30న మధిరలో వచ్చే ఖరీఫ్ కోసం రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో యాసంగి రైతుభరోసా కథ ముగిసిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.– సాక్షి, హైదరాబాద్ -
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించామని, వాటితో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన అమలు చేస్తున్నామన్నారు. గురువారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ పనుల పురోగతిపై ఆ శాఖ మంత్రి అజహ రుద్దీన్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ మైనార్టీ సంస్థల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ సంస్కృతిని ప్రతిబింబించేలా భారీ స్థాయిలో ‘ముషాయిరా’ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాన కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆధునిక సదుపాయాలతో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 20 పాఠశాలలు పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, మరో 17 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. మైనార్టీ యువత స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకం ద్వారా పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. అలాగే క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూ.50 కోట్లను కేటాయించి, యువతకు ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సాహకాలు అందించనున్నట్లు వెల్లడించారు. మొహరం వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకా వాలని మంత్రి అజహ రుద్దీన్ కోరగా భట్టి సాను కూలంగా స్పందించారు.మహిళా శక్తి క్యాంటీన్ను పరిశీలించిన భట్టిదక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ను గురువారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కడ ఉద్యోగులకు కల్పించిన వివిధ రకాల మౌలిక సదుపాయాలను పరిశీలించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన, ఉద్యోగులకు నాణ్యమైన భోజనం అందజేయడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లను ప్రభు త్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రసాద్, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ పాటిల్, డైరెక్టర్లు చక్రపాణి, శివాజీ, నరసింహ ఉన్నారు. -
ఫస్ట్.. లీనియర్ ఆల్జీబ్రా
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12.53 లక్షల మంది ఇంజనీరింగ్లో చేరుతున్నారు. వీరిలో 3.9 లక్షల మంది కంప్యూటర్ కోర్సుల్లో చేరేవారే. తెలంగాణలో 1.16 లక్షల సీట్లలో 70 శాతం కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలోనే చేరుతున్నారు. డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సులపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, కోర్ గ్రూపు విద్యార్థులు వీటిని ఓ పేపర్గా ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిలబస్పై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కసరత్తు చేసి మారుతున్న కాలానికి అనుకూలంగా వీటిని తీర్చిదిద్దాలని దేశంలోని అన్ని యూనివర్సిటీలకు సూచించింది. లీనియర్ ఆల్జీబ్రాపై ఫోకస్కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో మొదటి ఏడాది నుంచి లీనియర్ ఆల్జీబ్రాకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. ప్రస్తుతం ఏఐ, ఎంఎల్, డేటాసైన్స్, గ్రాఫిక్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక రంగాలన్నింటికీ లీనియర్ ఆల్జీబ్రానే పునాది వంటిది. ఏఐఎంఎల్లో వాడే టేబుల్స్, ఇమేజ్లు, వీడియోలు అంకెల రూపంలో ఉంటాయి. కంప్యూటర్ డేటాను మ్యాట్రిక్స్, వెక్టర్ల రూపంలో నిల్వచేసి ప్రాసెస్ చేసేదే ఈ లీనియర్ ఆల్జీబ్రా. జీపీఎస్, డ్రోన్లు, రోబోటిక్స్, గ్రాఫిక్స్, ఏఐలో డేటా ప్రాతినిధ్యానికిది కీలకం. ఇందులో మరో కీలకమైన ఈజెన్ వ్యాల్యూస్, ఈజెన్ వెక్టర్స్ సరిగ్గా ప్రాక్టీస్ చేస్తేనే ఫేస్ రికగ్నైజేషన్, గూగుల్ సెర్చ్ అల్గారిథమ్, ఇమేజ్ కంప్రషన్, ఏఐ మోడల్స్పై పట్టు దొరుకుతుంది. అయితే, అకడమిక్ అధ్యాపకులు దీన్ని థియరీగానే అందిస్తారు. దీనివల్ల ఏఐపై సరైన పట్టు రావడం లేదు. క్యాంపస్ సెలెక్షన్స్లో విద్యార్థులు వెనుకబడి ఉండటానికి లీనియర్ ఆల్జీబ్రాపై పట్టు లేకపోవడమేనని తేలింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ నిపుణుల చేత పార్ట్టైం బోధన చేయిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఏఐసీటీఈ సూచించింది.కోర్ గ్రూపులపైనా విజువల్సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి కోర్ గ్రూపుల వారూ ఇప్పుడు ఏఐ పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంది. భవన నిర్మాణం, యంత్ర పరికరాల తయారీ మొత్తం ఏఐపైనే నడుస్తోంది. ఈ కారణంగా కోర్ గ్రూపులను ఆప్డేట్ చేయాలని ఏఐసీటీఈ సూచించింది. కోర్ గ్రూపుల్లో ఏఐ, డేటా మైనింగ్, డేటా విజువలైజేషన్ వంటి సబ్జెక్టులను ప్రవేశ పెడుతున్నారు. మూడో ఏడాది విద్యార్థులకు డీప్ లెర్నింగ్పై చాప్టర్లు ఉంటాయి. బిగ్ డేటా అనాలసిస్ చేసేలా అవసరమైన రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ విధానం అవసరమని ఏఐసీటీఈ చెబుతోంది.జనరేటివ్ ఏఐ, లాంగ్ లెర్నింగ్ మాడ్యూల్స్ వంటివి నాల్గో సంవత్సరంలో కీలకం చేశారు. అయితే, ప్రతీ కాలేజీలోనూ పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, మెషీన్ లెర్నింగ్ లేబొరేటరీ డేటా అనలిటిక్స్ ల్యాబ్, కంప్యూటర్ విజన్ ల్యాబ్, ఏఐ ప్రాజెక్టు ల్యాబ్ ఉండాలని చెబుతోంది. ఇలాంటి మౌలిక వసతులపై ప్రతీ వర్సిటీ దృష్టి పెట్టాలని, ఇవన్నీ ఉన్నప్పుడే అనుబంధ గుర్తింపు ఇవ్వడం మంచిదని అంటోంది. -
గృహమస్తు
సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని అల్పాదాయ, మధ్య తరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహ నిర్మాణ శాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అఫర్డబుల్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రాం కింద లక్ష గృహాల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధితో పాటు నగర ఆర్థిక ప్రాంతాన్ని (క్యూర్) యూనిట్గా తీసుకుని దిగువ ఆదాయ వర్గాలకు (ఎల్ఐజీ) 70 వేల ఫ్లాట్లు, మధ్య ఆదాయ వర్గాలకు (ఎంఐజీ) 30 వేల ఫ్లాట్లను నిర్మించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా 12 వేల ఇళ్లు: భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడత కింద పైలట్ ప్రాజెక్టుగా సుమారు 12,000 ఫ్లాట్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. హౌసింగ్ బోర్డు సొంత నిధులతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన భాగస్వామ్యంతో కేపీహెచ్బీ, బాలానగర్, లింగంపల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్లను నిర్మించనున్నారు. జూన్ నెలాఖరు, లేదా జూలై మొదటి వారంలో డిమాండ్ సర్వే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. క్యూర్ పరిధిలో ఇప్పటి వరకు నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్పేట, మల్కాజిగిరి, మేడ్చల్ తదితర 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో గృహాల నిర్మాణాలకు అనువైన భూములను గుర్తించారు. మరో తొమ్మిది నియోజకవర్గాల్లో స్థలాలను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రితో పాటు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు పలు ప్రాంతాలను సందర్శించారు. గుర్తించిన భూముల్లో ఎక్కెడెక్కడ ఎన్ని టవర్లు, ఎన్ని ఫ్లాట్లు నిర్మించవచ్చన్న దానిపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. జీవనోపాధి ప్రాంతాలకు చేరువగా.. గత ప్రభుత్వాల హయాంలో నగరానికి 30 నుంచి 40 కి.మీ దూరంలో ఇళ్లు నిర్మించడంతో రవాణా, ఉపాధి, వైద్యం కరువై లబి్ధదారులు ఇబ్బంది పడ్డారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నగర నడిబొడ్డున, ఐటీ, పారిశ్రామిక కారిడార్లకు సమీపంలోనే ఈ ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. ప్రతి ఫ్లాట్ను కనీసం 400 చ.అడుగుల ప్లింత్ ఏరియాతో అన్ని ఆధునిక మౌలిక వసతులతో నిర్మించనున్నారు. -
హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, గచ్చిబౌలి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, బోయిన్పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో వర్షం పడింది.రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. -
తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కు బ్రేకులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్సైట్తో పాటు అనుబంధ ఆన్లైన్ సేవలు ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ విరామం అవసరమని ఆయన పేర్కొన్నారు.సుమారు ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ సర్వర్ నిర్వహణ పనుల ద్వారా సర్వర్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేయడం, భద్రతా ప్రమాణాలు బలోపేతం కావడం, సేవల నాణ్యత మెరుగుపడడం లక్ష్యమని ఐజీ వివరించారు.ప్రజలకు అసౌకర్యం తగ్గించేలా షెడ్యూల్జూన్ 26న మొహరమ్, జూన్ 28న ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో, మధ్యలో ఉన్న జూన్ 27న ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ పని దినంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం అత్యల్పంగా ఉండేలా ఈ షెడ్యూల్ రూపొందించామని తెలిపారు.సేవలు పునఃప్రారంభంప్రజలు తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని, జూన్ 29వ తేదీ నుంచి అన్ని సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. శాఖ నిర్వహణ పనులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. -
హైదరాబాద్కు ఆ పరిస్థితి రావద్దనే ఇలా చేస్తున్నాం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీర్వదిస్తేనే తాను సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా ఎల్బీనగర్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. తనకు తన సొంతూరు కొండారెడ్డిపల్లెలాగే ఎల్బీనగర్ అని చెప్పారు. ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే నాకు ప్రత్యేక అభిమానం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో పార్క్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘కాలుష్య కోరల్లో ఢిల్లీ చిక్కుకుంది. హైదరాబాద్కు ఆ పరిస్థితి రావద్దనే మొక్కల పెంపకం చేపట్టాం. మూసీ పునరుజ్జీవం చేస్తామంటే అడ్డుపడుతున్నారు. భూకబ్జాలతో ప్రజలకు సమస్యలు రావద్దనే హైడ్రాను తీసుకొచ్చాం. పేదల జోలికి హైడ్రా వెళ్లదు, కబ్జాదారుల భరతం పడుతుంది. 2018 శాసనసభ ఎన్నికల్లో రాజకీయ కుట్ర వల్ల కొడంగల్లో ఓడిపోయినప్పుడు చాలా మంది ఇక ఏమీకాడని నవ్వుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండగా నిలబడి మల్కాజ్ గిరి ఎంపీగా నాకు అవకాశం ఇచ్చారు. ఆ నాడు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 30 వేల మెజార్టీ ఇచ్చి ప్రశ్నించే గొంతును నిలబెట్టారు. పార్లమెంటులో పార్టీ, ప్రజల తరుపున గట్టిగా నిలబడి కొట్లాడినప్పుడు సోనియా, రాహుల్ గాంధీ నన్ను గుర్తించి పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు.ఈ ప్రాంతంలో రూ.2.400 కోట్లతో 240 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ను నిర్మిస్తున్నాం’’ అని తెలిపారు. -
రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే
హైదరాబాద్: రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు మూడు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల వేలంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది. వేలం వేసిన భూమిలో 5 ఎకరాలు తమవేనని ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టలు స్టే విధించింది. కాగా, రాయదుర్గం భూముల వివాదంపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ల్యాండ్ ఆక్షన్ చేసే సమయంలో SBIకి సమాచారం ఇచ్చామని తెలిపారు. మరో చోట ల్యాండ్ కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఆ ప్రపోజల్ కు SBI కూడా ఒప్పుకుందని అన్నారు. 7 రోజులు కౌంటర్ ధాఖలు చేయడానికి సమయం కావాలని అన్నారు. ఎకరానికి రూ.237 కోట్లు చొప్పున చెల్లించిన గౌరవ్ వెంచర్స్ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతుందని హైకోర్టు ప్రశ్నించింది. -
తెలంగాణ సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సచివాలయాన్ని బీసీ సంఘాలు ముట్టడించాయి. నాలుగు దఫాలుగా సచివాలయం ముట్టడికి బీసీ నేతలు ప్రయత్నించారు. ముట్టడిని అడ్డుకున్న పోలీసులు. బీసీ సంఘాల నేతలను అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన బీసీ నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. బీసీ నేతలు కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, కనకల శ్యామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. గత నాలుగు ఏళ్లుగా ఫీజుల బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం బీసీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని.. తక్షణమే ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే సీఎం, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని బీసీ నేతలు హెచ్చరించారు. -
Gachibowli: నేను పోలీసును.. పైసా ఇవ్వను..!
హైదరాబాద్ : నగర కమిషనరేట్లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఫుడ్ కోర్టుకు వెళ్లి గన్తో బెదిరించి హల్చల్ సృష్టించాడు. బాధితుడి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు విచారణ చేపట్టారు. నగర కమిషనరేట్లోని యాంటీ స్నాచింగ్ టీమ్లో పని చేసే ఏఆర్ కానిస్టేబుల్ వివేక్ బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు డీఎల్ఎఫ్ సమీపంలోని మొమోస్ డిలైట్ ఫుడ్ కోర్ట్కు వెళ్లాడు. మొమోస్ తిన్న తర్వాత రూ.175 ఇవ్వమని అడగగా రేట్ ఎక్కువగా ఉందని కానిస్టేబుల్ గొడవకు దిగాడు. ‘నేను పోలీసును, డబ్బులు ఇవ్వను’ అంటూ గన్ చూపించినట్లు ఫుడ్ కోర్ట్ నిర్వాహకుడు మనీష్ 100కు కాల్ చేశాడు. వెంటనే గచ్చిబౌలి పెట్రోల్ మొబైల్ సిబ్బంది కానిస్టేబుల్ వివేక్ను పీఎస్కు తరలించారు. మొమోస్ తినక ముందే ధర విషయంలో వివాదం జరిగిందని, ఐడీ కార్డు లేకపోవడంతో గన్ చూపించాడని గచ్చిబౌలి పోలీసులు చెబుతుండటం గమనార్హం. -
నగరానికొచ్చిన ‘కోజికోడ్ శ్రీదేవి’
హైదరబాద్: మొహర్రం సంతాప దినాల్లో భాగంగా ఈ నెల 26న పాతబస్తీ వీధుల్లో అంబారీతో 10వ మొహర్రం సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది. డబీర్పురా బీబీకా అలావాకు చెందిన బీబీకా ఆలంతో షియా ముస్లింలు ఊరేగింపులో పాల్గొంటారు. ఇందులో భాగంగా కేరళలోని కోజికోడ్ నుంచి శ్రీదేవి అనే ఆడ ఏనుగు బుధవారం రాత్రి పాతబస్తీకి చేరుకుంది. ప్రధాన ఊరేగింపునకు ముందస్తుగా డబీర్పురా నుంచి చార్మినార్ మీదుగా చాదర్ఘాట్ వరకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. -
ఫిన్లాండ్లో విద్యార్థి మణిదీప్ రెడ్డి మిస్సింగ్
ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్కు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ హైదరాబాద్కు చెందిన మణిదీప్ అనే యువకుడు దాదాపు నెలరోజులకు పైగా కనిపించకుండా పోయాడు. అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినా సరైన సమాధానం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్కు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్కు వెళ్లాడు. లాహ్టి (Lahti) నగరంలో ఉన్న ఎల్యూటీ యూనివర్సిటిలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే మే నెల 5వ తేదీ నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోయినట్లు తెలుస్తోంది. ఫోన్, సోషల్ మీడియా సహా ఏ మార్గంలోనూ అతనితో సంప్రదింపులు జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.మణిదీప్ అదృశ్యమైన విషయం గురించి కాలేజీ యాజమాన్యాన్ని, సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి గల్లంతైన విషయంపై కాలేజీ నుంచి కూడా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వారు చెబుతున్నారు.ఇప్పటికే పలు మార్గాల్లో అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్న కుటుంబ సభ్యులు, భారత విదేశాంగ శాఖతో పాటు ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీనే హైదరాబాద్కు చెందిన ఓ లాయర్ మణిదీప్ మిస్సింగ్ మీద ఓ ట్వీట్ చేయడం గమనార్హం.. 🚨 MISSING IN FINLAND 🇫🇮Manideep Reddy Gujja has been missing in Finland.Family and friends are urgently seeking any information regarding his whereabouts.📍 Last Contacted: May 5, 2026🎓 University: LUT University📍 City: Lahti, FinlandContact +91 78932 87099— Nipun Tulsyan (@NipunTulsyan) June 12, 2026 -
మృగశిరలోనూ మంటలు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రమంతా తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో..మళ్లీ ఎండ మండిపోతోంది. ఉత్తరాది నుంచి వస్తున్న వడగాలుల తీవ్రతతో 246 మండలాల్లో వాతావరణ శాఖ హీట్వేవ్ అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ముప్పై జిల్లాల్లో నలభై డిగ్రీలకు మించి పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.వచ్చే రెండు రోజులు కూడా వడగాలుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే మృగశిర కార్తెలో కురిసే వర్షాలతో ఆరుతడి పంటలతో బిజీ కావాల్సిన రైతులు ఇంకా 18 జిల్లాల్లో తొలకరి వర్షాల కోసమే ఎదురుచూస్తున్నారు. కేవలం నాగర్కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఈ సీజన్లో సాధారణం కంటే అధిక వర్షం కురవగా..ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదు అయింది. మిగిలిన అన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం లోటు కనిపిస్తోంది. హనుమకొండ, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో చుక్క వర్షం కూడా కురవలేదు. -
కావాల్సిన సీట్లపై కర్ఛీఫ్ వేశారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు ఇద్దరు తమ రాజకీయ వారసుల కోసం ఇప్పటినుంచే నియోజకవర్గాలను సెట్ చేస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందే పరిస్థితులకు అనుగుణంగా పావులు కదుపుతూ, కాంగ్రెస్ మార్కు రాజకీయం చేస్తూ కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం వ్యూహాలు పన్నుతున్నారా? వీరి వ్యూహాల్లో ఒక చోట రాజ్యసభ సభ్యుడు, మరోచోట లోక్సభ సభ్యుడు పాలుపంచుకుంటున్నారా? వీరి సహకారం వెనుక మరో తంత్రం ఉందా? అంటే.. పాలకుర్తి, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితులను బట్టి చూస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. తన అల్లుడు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రామిరెడ్డి కుమారుడు అర్జున్రెడ్డి కోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాలకుర్తిపై, తన కుమార్తె త్రిష కోసం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై గురి పెట్టారని స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సులభంగా టికెట్ తెచ్చుకోగలమని, ఒకవేళ జరగకపోతే రేసులో గట్టిగా ఉండాలనే ఆలోచనతో ఇద్దరు మంత్రులు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లోని వివాదాల వ్యవహారం టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ముందుకు రావడం గమనార్హం. పాలకుర్తిలో కదులుతున్న పావులుపాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి అసమ్మతి సెగలు భారీగా తగులుతున్నాయి. ఆమె అత్త, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా పలువురు కాంగ్రెస్ నేతలు గళమెత్తుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఝాన్సీరెడ్డిని కాదని ఇతర అభ్యర్థులకు వారు బహిరంగంగానే మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి యశస్వినిరెడ్డితో కలిసి ఝాన్సీరెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే యశస్వినిరెడ్డి ఫిర్యాదు చేసిన ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన సమయంలో ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి కూడా వారితో కలిసి రావడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి మద్దతుగా ఎంపీ రాగా, ఇందుకు మంత్రి పొంగులేటి సహకారం ఉందని, పాలకుర్తి నుంచి ఈసారి తన కుమారుడిని పోటీ చేయించే ఆలోచనలో రఘురామిరెడ్డి ఉన్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే అసమ్మతి నేతలకు ఆపన్న హస్తం అందిస్తున్నారనేది బహిరంగ రహస్యమేనని పార్టీ శ్రేణులంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఫిర్యాదుపై నిర్ణయం తీసుకునేందుకు కూడా టీపీసీసీ వెనుకాడుతోందనే చర్చ జరుగుతుండడం గమనార్హం. కాగా మరోవైపు ఈ అసమ్మతి నేతలకు సీఎం సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి మద్దతు కూడా ఉందని, తన కుమారుడు కృష్ణభార్గవ్ రెడ్డి వేం కోసం పాలకుర్తిపై కన్నేసిన నరేందర్రెడ్డి ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.జహీరాబాద్లో దామోదర వ్యూహంఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి పెటారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి తన కుమార్తె త్రిషకు ఆయన టికెట్ అడిగే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే జహీరాబాద్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్కు పొగ పెడుతున్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనకు స్థానిక ఎంపీ సురేశ్ షెట్కార్ కూడా సహకరిస్తున్నారని తెలస్తుండగా, మరోవైపు ఆయన కూడా ఆ స్థానం తనకు కావాలని అడిగే ఆలోచనలో ఉన్నారని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈసారైనా ఎమ్మెల్యే కావాలనే వ్యూహంతో షెట్కార్ ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి సహకారంతోనే మాజీ మంత్రి చంద్రశేఖర్పై ఫిర్యాదు చేసేందుకు స్థానిక కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వరకు వచ్చారని చెబుతున్నారు. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం కొత్త డ్రామాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు విమర్శించారు. గత రెండున్నరేళ్లలో ప్రధాని మోదీని పలుమార్లు కలిసిన సీఎం... కేంద్రమంత్రులను కలవడానికి అడ్డంకులు కల్పిస్తున్నారనడం హాస్యాస్పదమన్నారు. సీఎం మాటలు చెప్పడంలోనే కాకుండా...ఇప్పుడు అబద్ధాల ప్రచారంలోనూ ప్రావీణ్యం సంపాదించారని ఎద్దేవా చేశారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దాచేందుకే రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.బుధవారం బీజేపీ కార్యాలయంలో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాయడం అత్యంత హాస్యాస్పదమన్నారు. ఇప్పటివరకు సీఎం ఢిల్లీకి 71సార్లు వెళ్లారని, కనీసం 15సార్లు కేంద్రమంత్రులను కలిశారని గుర్తుచేశారు. ఆ సందర్భాల్లో ఎప్పుడైనా కిషన్రెడ్డికి చెప్పి కలిశారా? ఇప్పుడు అపాయింట్మెంట్ ఇప్పించడం లేదంటూ కిషన్రెడ్డిపై ఆరోపణలు చేయడం బూటకమేనని మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి ఈ లేఖ రాశారని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై, బీజేపీపై నిరాధార ఆరోపణలు చేయడం వెంటనే మానుకోవాలన్నారు. మెట్రో విస్తరణ ఆలస్యానికి కేంద్రం, కిషన్ రెడ్డి కారణం కాదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ప్రధానకారణమని పేర్కొన్నారు. కాగా, సీనియర్ సినీ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి, నిర్మాత బండి శ్రీనివాస్ బీజేపీలో చేరడం పట్ల రాంచందర్రావు హర్షం వ్యక్తం చేశారు. -
గాజు చాంబర్లలో ప్రయాణికులు బందీ
గత అక్టోబర్ 24న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో 19 నిండుప్రాణాలు బలయ్యాయి. సకాలంలో ప్రయాణికులు బస్సులో నుంచి తప్పించుకోలేక చనిపోయారు. 2013 అక్టోబర్ 30న మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఏసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై 45 మంది దహనమైన ఘటన తర్వాత కూడా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు కర్నూలు జిల్లా ప్రమాద ఘటన తేల్చింది. కానీ, ఇప్పటికీ తీరు మారలేదని స్పష్టమవుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల ఇష్టారాజ్యం, బస్సుల్లో లోపాలను పసిగట్టి చర్యలు తీసుకోవాల్సిన రవాణాశాఖ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వెరసి ఇప్పుడు ప్రైవసీ, ప్రీమియం సర్వీసు పేరుతో ప్రయాణికులను మరింత ప్రమాదంలోకి నెట్టేసే గ్లాస్ చాంబర్ ఫెసిలిటీ తెరమీదకు వచ్చింది.సాక్షి, హైదరాబాద్ : అర్ధరాత్రి వరకు సెల్ఫోన్తో గడపడం సర్వసాధారణమైంది. ఇక ప్రయాణాల్లో ఇది మరింత ఎక్కువ. బస్సుల్లో సెల్ఫోన్ వాడకం పక్క సీటు ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారం అన్నట్టుగా ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సుల్లో స్లైడింగ్ డోర్ ఉండే గ్లాస్ చాంబర్స్ అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు లోపల పడుకుని చాంబర్ డోర్ మూసేసుకుంటే వీరితో పక్కవారికి, పక్క బెర్త్ వారితో వీరికి ఎలాంటి ‘ఆటంకం’ఉండదు. ప్రమాదం జరిగితే తప్పించుకోవటం ఎలా... ఏసీ బస్సులు అగ్నిప్రమాదానికి గురైతే బస్సుల్లో విపరీతంగా పొగ నిండి ఊపిరాడక చాలా మంది స్పృహ తప్పి సజీవ దహనమవుతున్నారు. ఇప్పుడు బెర్తును గ్లాస్ చాంబర్గా మార్చటంతో ప్రమాదం జరిగినప్పుడు నిద్రలో ఉండే ప్రయాణికులు బెర్తులోంచి వేగంగా బయటకు రావటానికి ఈ గ్లాస్ డోర్లు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తాయి. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుంది. ఈ గ్లాస్ చాంబర్ల ఏర్పాటు అటు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ 119కు, ఇటు మోటారుæ వాహనాల నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇటీవల ప్రమాదాలకు గురైన కొన్ని బస్సుల్లో ఈ తరహా గ్లాస్ చాంబర్లు ఉండటాన్ని గుర్తించిన పలు రాష్ట్రాలు వాటి తొలగింపునకు ఆదేశాలు జారీ చేశాయి. లేకుంటే ఫిట్నెస్ సరి్టఫికెట్ రద్దు చేస్తామని కూడా హెచ్చరించాయి. కానీ, తెలంగాణ రవాణా శాఖ నిద్రమత్తు వీడలేదు.ఎన్ని సిఫారసులు వచ్చినా... డోంట్ కేర్» పాలెం దుర్ఘటన తర్వాత నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో విచారణ కమిటీని వేసింది. ఆ కమిటీ దర్యాప్తు చేయటంతోపాటు వోల్వోకంపెనీ ప్రతినిధులను కూడా పిలిపించి బస్సు తయారీలో మార్పులనుసూచించింది. ఆ మేరకు బస్సు తయారీ డిజైన్లో సంస్థ కొన్ని మార్పులు చేసినా, రవాణాశాఖ అధికారులు మాత్రంగుణపాఠం నేర్చుకోలేదు. » గ్లాస్ చాంబర్ క్లోజ్డ్ గాఉండటం వల్ల చిన్న నిప్పురవ్వ వచ్చినా పొగ నేరుగా చాంబర్లోకి చేరి ప్రయాణికుడు క్షణాల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. » నిద్రలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే, ప్రయాణికులు వెంటనే స్లైడింగ్ డోర్ను తెరవటంలో గందరగోళానికి గురవుతారు. » దట్టమైన పొగ, చీకటి అలుముకొంటే, స్లైడింగ్ డోర్ లాకింగ్ వ్యవస్థ ఎక్కడుందో కనిపించదు, అవి జామ్ అయ్యే పరిస్థితి రావచ్చు. » గ్లాస్ చాంబర్ల కోసం వాడే రబ్బర్ బెల్టులు, ప్లాస్టిక్ స్లైడర్లు అగ్ని ప్రమాదం జరిగితే విషపూరిత పొగను విడుదల చేస్తాయి. » కిటికీ అద్దం పగలగొట్టేందుకు ప్రతి బెర్త్ వద్ద హ్యామర్ (సుత్తి) ఉండాలి. ప్రమాద సమయంలో ఒకవైపు కిటికీ అద్దం పూర్తిగా క్లోజ్ చేసి, మరోవైపు గ్లాస్ డోర్ పెట్టడం వల్ల హ్యామర్తో పగలగొట్టే సమయం కూడా ప్రయాణికుడికి దొరకదు. »ఒక స్లీపర్ బస్సుకు కనీసం 4 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు (1 డోర్, 2 రూఫ్ హాచెస్, విండోస్) ఉండాలి. ఈ గ్లాస్ చాంబర్ల నిర్మాణం వల్ల ప్రయాణికుడు ఆ ఎగ్జిట్ మార్గాల వరకు కూడా రాలేడు. » ప్రస్తుతం అన్ని ఏసీ బస్సుల్లో పొగను గుర్తించే వ్యవస్థ, అల్లారాలు, ఆటోమేటిక్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్స్ తప్పనిసరి. అయితే చాంబర్లు క్లోజ్ చేయడం వల్ల ఇవి కూడా సకాలంలో స్పందించకపోవచ్చు. -
ఆ సన్నాలే కావాలి!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ..రాష్ట్రంలో సన్న రకాల వరి విత్తనాలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, మిల్లర్లు, ఎగుమతిదారుల సూచనల మేరకు ఎంపిక చేసిన ఏడు ప్రధాన సన్న రకాల వంగడాల సాగునే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలంగాణ సోనా, జై శ్రీరామ్, సాంబమసూరి, హెచ్ఎంటీ సోనా, కూనారం సన్నాలు, సిద్ధి, కేఎన్ఎం–7715 రకాల సన్నరకం విత్తనాలను ఈ ఖరీఫ్లో సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు ఇస్తున్న క్వింటాల్కు రూ.500 బోనస్ను కూడా ఈ ఏడు రకాల వరి వంగడాలకే పరిమితం చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇప్పటి వరకు 36 రకాల సన్నాల్లో ఏ వంగడాన్ని పండించినా, ఈ బోనస్ అందేది. అయితే సర్కార్ తాజా నిర్ణయంతో ఒక్కసారిగా ఈ ఏడు వంగడాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ వంగడాల కోసం ప్రభుత్వ విక్రయ కేంద్రాలు, తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎస్డీసీ) డిపోలు, ప్రైవేట్ విత్తన దుకాణాల వద్ద రైతుల తాకిడి పెరిగింది. నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఆ ఏడింటికే ప్రాధాన్యం ఎందుకంటే.. వరి సాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానాల్లో ఉన్నా, రాష్ట్రంలో పండే బియ్యానికి మార్కెట్లో స్థిరమైన గుర్తింపు లేకపోవడం చాలా కాలంగా సమస్యగా ఉంది. రైతులు వివిధ రకాల వంగడాలను సాగు చేయడం వల్ల కొనుగోలు, నిల్వ, మిల్లింగ్, ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ, మిల్లర్లు, ఎగుమతిదారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశాల్లో మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న సన్న రకాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ జాబితాలో తెలంగాణ సోనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాజేంద్రనగర్లోని భారత వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్ఆర్) అభివృద్ధి చేసిన ఈ రకం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో మధుమేహ బాధితులు, ఆరోగ్య స్పృహ కలిగిన వినియోగదారుల్లో తెలంగాణ సోనాకు మంచి డిమాండ్ ఉంది. సాంబా మసూరి ఇప్పటికీ దేశీయ మార్కెట్లో అత్యధిక ఆదరణ పొందుతున్న సన్నబియ్యం రకాల్లో ఒకటిగా కొనసాగుతోంది. రైతుల పరుగులు.. వ్యాపారుల లాభాపేక్ష ప్రభుత్వం ఖరీఫ్కు అవసరమైన విత్తనాల కన్నా ఎక్కువగానే నిల్వలను సిద్ధం చేసింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్కు సుమారు 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, 38 లక్షల క్వింటాళ్లకుపైగా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అయితే రైతులు తెలంగాణ సోనా, సాంబా మసూరి, హెచ్ఎంటీ సోనాతో పాటు ఏడు రకాల విత్తనాలనే ఎక్కువగా కోరుతుండటంతో కొన్ని కేంద్రాల్లో నిల్వలు వేగంగా ఖాళీ అవుతున్నాయి. దీంతో రైతులు ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లి విత్తనాల కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొందరు వ్యాపారులు లాభాపేక్షతో నాసిరకం విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చాలా చోట్ల తెలంగాణ సోనా, సాంబా మసూరి, హెచ్ఎంటీ సోనా , జై శ్రీరాం విత్తనాలకు కొరత ఏర్పడింది. కొందరు వ్యాపారులు డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ, ఎక్కువ ధరకు విక్రయించే పనిలో ఉన్నారు. -
తరగతి గదుల్లో తెలంగాణ భవిష్యత్తు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదల బతుకులు మారవు. అవి కేవలం బతకడానికి మాత్రమే పనికొస్తాయి. భవిష్యత్ తరాల తలరాతలు మారాలంటే ముందు వారు చదువుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులుగా రాణించినప్పుడే బతుకులో మార్పు కన్పిస్తుంది. పుట్టి, పెరిగిన ప్రాంతానికి గుర్తింపు లభిస్తుంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు రంగుల అద్దాల మేడలు, రంగుల గోడల్లో లేదు. తరగతి గదుల్లోనే ఉంది. విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతికేలా విద్యలో రాణించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువును చిన్నతనంగా భావించొద్దు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ప్రభుత్వ స్కూళ్లల్లోనే చదువుకుని రాణించిన వాళ్లే..’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం బడి పిల్లలకు అల్పాహారం పంపిణీ పథకాన్నీ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అటు నుంచి నేరుగా కిచెన్కు వెళ్లి పూరీని వొత్తారు. లైబ్రరీ, ప్రయోగశాల, మ్యూజిక్, డ్యాన్స్ తరగతి గదులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. క్రీడామైదానానికి చేరుకుని పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడారు. విద్యార్థులు, టీచర్లతో కరచాలనం చేశారు. గ్రూప్ ఫొటోలు దిగారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగించారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేలా.. ‘విద్యాశాఖ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. పదేళ్ల పాలనలో విధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు నడిపించేందుకే టీపీఎస్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆరుట్ల టీపీఎస్లో ఇప్పటికే 1,814 మంది అడ్మిషన్లు పొందారు. ఒక ప్రభుత్వ పాఠశాలకు నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇదే విధంగా తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక టీపీఎస్ నుంచి ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. ఆరుట్ల గ్రామం తెలంగాణకు ఆదర్శంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నా. ఇక్కడ ప్రారంభించిన టీపీఎస్ను ఇతర ప్రభుత్వ పాఠశాలలకు అంకితం చేస్తున్నాం. ఈ స్ఫూర్తి ఆరుట్ల గ్రామానికే కాదు..తెలంగాణలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులది. డిసెంబర్ 9న స్కిల్స్ వర్సిటీ ప్రారంభం ఒకప్పుడు ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేవి కాదు. ప్రస్తుతం విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంతో పాటు 9 రకాల వస్తువులతో కూడిన కిట్లు అందించే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. రూ.685 కోట్లతో టెండర్ పిలిస్తే..రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. జూలై ఆఖరి వరకు విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర వస్తువులు అందజేస్తాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా కుల,మతాలకు అతీతంగా 500 మంది విద్యార్థులను ఒకేచోట చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిసెంబర్ 9న యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీని ప్రారంభించనున్నాం..’అని సీఎం తెలిపారు. మెస్సీని తెస్తే విమర్శించారు.. ‘2034 ఒలింపిక్స్లో గోల్డ్మెడల్ సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేశాం. అకాడమీల్లో ఆడే వాళ్ల కంటే..ఆరుట్ల స్కూలు పిల్లలు బాగా ఆడుతున్నారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ, విద్యార్థులను కలిపి ఫుట్బాల్ ఆడించాం. క్రీడలను ప్రోత్సహించేందుకు మెస్సీని తీసుకొస్తే రాజకీయ విమర్శలు చేశారు. కడుపులో కుళ్లు పెట్టుకుని రాజకీయం చేయాలని భావించే వారికి భవిష్యత్తు ఉండదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..’అని రేవంత్ ధ్వజమెత్తారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం 19న ప్రతిజ్ఞ ‘తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ సమస్యగా మారాయి. సరదాగా మొదలైన అలవాటు ఆ తర్వాత వాటికి బానిసలుగా మార్చుతుంది. డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం ఈ నెల 19న ఎల్బీనగర్లో వేలాది మంది విద్యార్థులతో ప్రమాణం చేయించబోతున్నాం. విద్యార్థులు తమ తోటి విద్యార్థులు ఎవరైనా గంజాయి, డ్రగ్స్కు అలవాటైతే ఆ విషయం వెంటనే ఉపాధ్యాయుల ద్వారా పోలీసులకు చేరవేయాలి. పోలీసులకు మీరే సమాచార వారధులుగా నిలవాలి..’అని సీఎం కోరారు. పేదల భూములకు విముక్తి కల్పించండి ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలింసిటీ ఆక్రమణలో ఉన్న పేదల భూములకు విముక్తి కల్పించాలని కోరుతూ సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, ఇతర నాయకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. నాగన్పల్లి సర్వే నంబర్ 189లోని పన్నెండెకరాల నాలుగు గుంటల భూమి, 203 సర్వే నంబర్లో ఎనిమిదెకరాల భూమిలో 2007లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని సీఎంకు తెలిపారు. పేదలకిచ్చిన ఇంటి స్థలాలను రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం ఆక్రమించిందని వివరించారు. ఈ భూమికి విముక్తి కల్పించి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. -
ఖనిజాల ‘పర్వత’o
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల పరిధిలోని పర్వతాపూర్ దేశంలోని అత్యంత కీలక ఖనిజ కేంద్రాల్లో ఒకటిగా అవతరించబోతోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నిర్వహించిన అధ్యయనాల్లో పర్వతాపూర్ బ్లాక్లో భారీ స్థాయిలో వెనేడియం, టైటానియం, అల్యూమినస్ లేటరైట్ ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. సుమారు 335.50 హెక్టార్ల విస్తీర్ణంలో 15.25 మిలియన్ టన్నుల వెనేడియం నిక్షేపాలు, 87 మిలియన్ టన్నుల అల్యూమినస్ లేటరైట్ నిల్వలు ఉన్నట్టు జీఎస్ఐ అంచనా వేసింది. కొత్తగా కనుగొన్న ఈ ఖనిజ బ్లాక్ను కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈ నెల 11న ‘క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్ బ్లాక్స్’కేటగిరీలో ‘ఈ వేలం’వేసింది. ఎన్ఎల్సీ ఇండియా ఈ బ్లాక్ను దక్కించుకుంది. ఇక్కడ లభ్యమవుతున్న వెనేడియం, టైటానియం ఖనిజాలు దేశ పారిశ్రామిక, రక్షణ, శక్తి రంగాలకు అత్యంత ప్రాధాన్యమైనవిగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఖనిజాల కోసం భారత్ విదేశీ దిగుమతులపై గణనీయంగా ఆధారపడుతోంది. పర్వతాపూర్ గనుల అభివృద్ధితో దేశీయ అవసరాలకు స్థానిక వనరులు అందుబాటులోకి వస్తాయి. వెనేడియం, టైటానియం కీలకం ప్రపంచంలో అరుదుగా లభించే ఖనిజాల్లో ఒకటైన వెనేడియంను అధిక దృఢత్వం కలిగిన ప్రత్యేక ఉక్కు తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, దీర్ఘకాలిక శక్తి నిల్వ చేసే బ్యాటరీలు, అణు, రక్షణ రంగ పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక శక్తి నిల్వ వ్యవస్థలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వెనేడియం ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. మరోవైపు ఏరోస్పేస్ రంగానికి టైటానియం వెన్నెముకగా నిలుస్తోంది. » తక్కువ బరువు, అధిక బలం, తుప్పు నిరోధక లక్షణాల కారణంగా టైటానియంను విమానాల తయారీ, అంతరిక్ష నౌకలు, క్షిపణి వ్యవస్థలు, నౌకాదళ పరికరాలు, అధునాతన వైద్య పరికరాల్లో విస్తృతంగా వినియోగిస్తారు. భారత రక్షణ, అంతరిక్ష రంగాలకు కీలకమైన ముడి సరుకు ఇది. » 87 మిలియన్ టన్నుల అల్యూమినస్ లేటరైట్ భవిష్యత్లో అల్యూమినా, అల్యూమినియం పరిశ్రమలకు ఉపయోగపడే అవకాశముంది. తెలంగాణకు కొత్త పారిశ్రామిక దిశ పర్వతాపూర్ ఇప్పటివరకు వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఖనిజ సంపద వెలుగులోకి రావడంతో తెలంగాణలో క్రిటికల్ మినరల్స్ రంగానికి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. గనుల అభివృద్ధి, ఖనిజ ప్రాసెసింగ్ యూనిట్లు, అనుబంధ పరిశ్రమలు ఏర్పడితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. ఎన్ఎల్సీ ఇండియా ఈ బ్లాక్ను దక్కించుకోవడం ద్వారా లిగ్నైట్, విద్యుత్ రంగాలకే పరిమితమైన సంస్థ ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ అడుగుపెట్టినట్టయ్యింది. దేశభద్రత, రక్షణ సామర్థ్యం, అధునాతన తయారీ రంగాలకు అవసరమైన కీలక ఖనిజాల నిలయంగా పర్వతాపూర్ త్వరలో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశముందని నిపుణులు అంటున్నారు. -
ఆ 5 ఎకరాలు మావే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో ఇటీవల ప్రభుత్వం ఎకరా రూ.237 కోట్లకు వేలం ద్వారా విక్రయించిన భూమి తమదేనంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైకోర్టును ఆశ్రయించింది. తమకు కేటాయించిన 5 ఎకరాల భూమిని తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఈ–వేలం ద్వారా విక్రయించడాన్ని సవాల్ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పణ్మక్తా హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో సర్వే నంబర్ 83/1లోని ప్లాట్ నంబర్–1ఏ (5 ఎకరాలు)ను ప్రభుత్వం 2010లో జారీ చేసిన జీవో 501 ప్రకారం పూర్తిస్థాయి విక్రయ పద్ధతిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)కు కేటాయించిందని పేర్కొంది. దీని కోసం రూ.13.33 కోట్లను చెల్లించామంది. అనంతరం ఎస్బీహెచ్.. ఎస్బీఐలో విలీనమైందని గుర్తు చేసింది. ఈ–వేలం నోటిఫికేషన్ను ఇప్పటికే మరో రిట్ పిటిషన్లో సవాల్ చేసినప్పటికీ, ఆ కేసు విచారణలో ఉండగానే మే 28న వేలం నిర్వహించి గౌరా వెంచర్స్ను విజయవంతమైన బిడ్డర్గా ప్రకటించారని తెలిపింది. భూమి విక్రయ ధరను ప్రభుత్వం ఇప్పటికే స్వీకరించిన నేపథ్యంలో తిరిగి అదే భూమిని వేలం వేయడానికి చట్టబద్ధమైన అధికారం లేదని కోరింది. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం ముంబై తరువాత దేశంలో రెండో కార్పొరేట్ ఆఫీసును ఎస్బీఐ హైదరాబాద్లో రెండు టవర్లలో నిర్మాణం చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో వేలంలో జరిగిన విక్రయాన్ని రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు. -
ఎన్యూమరేషన్లో 'సర్'దర్ద్!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) – 2026 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాల్సి ఉండగా, వాటి ప్రచురణ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, ప్రతి ఓటరుకు సంబంధించిన పాక్షిక సమా చారంతో ఒక జత ఎన్యూమరేషన్ ఫారాల ప్రచురణను ఈ నెల 15 నుంచే ప్రారంభించాల్సి ఉంది. హైదరాబాద్లో దక్కనీ ఉర్దూ తోపాటు హిందీ, గుజరాతీ, రాజస్తానీ, మరాఠీ, బెంగాళీ, కన్నడ, తమిళం వంటి భాషలు మాట్లాడే ఓటర్లు లక్షల సంఖ్యలో ఉన్నా రు. రాష్ట్రంలోని ఓటర్లందరికీ పంపిణీ చేసే ఎన్యూమరేషన్ ఫారా లను ఏకరూపంగా కేవలం తెలుగులోనే ముద్రించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించడంతో తెలుగు రాని ఓటర్లు ఇక్కట్లకు గురికానున్నట్టు రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతోపాటు ఇతర పార్టీల నేతలు ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)ని కలిసి జంట నగరాల ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను తెలుగుతోపాటు ఆంగ్ల భాషలో సైతం ప్రచురించాలని కోరారు. దీనిపై ఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వారం గడిచినా, ఈసీ నుంచి స్పందన రాలేదు. దీంతో బుధవారం సైతం వివిధ పార్టీల ప్రతినిధులు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్కు కలిసి ఆంగ్లంలోనూ ఫారాలను ప్రచురించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లందరికీ స్థానిక ఓటర్ల వివరాలతో ప్రచురణకు అవసరమైన డేటాను పంపించగా, తెలుగులో మాత్రమే ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారాలను ప్రచురిస్తున్నామని అధికా రులు తెలిపారు. ఈసీ నుంచి అనుమతి వస్తే అవసరమైన చోట పంపిణీ చేసేందుకు ఆంగ్లంలో సైతం ముద్రిస్తామని ఓ అధికారి తెలిపారు.సరైన సమాచారం భర్తీ కీలకంఎన్యూమరేషన్ ఫారంలో ఓటరు పేరు, ఎపిక్ నంబర్, సీరి యల్ నంబర్, పార్ట్ నంబర్, అసెంబ్లీ/పార్లమెంట్ నియోజక వర్గ పేరుతోపాటు పాత ఫొటోను ముద్రి స్తారు. మిగిలిన వివరాలను ఓటరు పూరించాలి. సర్–2002 ఓటర్ల జాబితా ప్రకారం..ఓటరుతోపాటు అతడి బంధువు పేరు, ఎపిక్ నంబ ర్, బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం నంబ ర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వంటి వివరాలతోపాటు ఓటరు పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ (ఐచ్ఛికం), మొబైల్ నంబర్, తండ్రి/సంరక్షకుడి పేరు, ఎపిక్ నంబర్, తల్లి పేరు, తల్లి ఎపిక్ నంబర్, జీవిత భాగ స్వామి పేరు, ఎపిక్ నంబర్ వంటి వివరాలను ఓటరు భర్తీ చేయా ల్సి ఉంటుంది. బీఎల్ఓలు వివరించినా ఎన్యూమరేషన్ ఫారంలోని భాష అర్థం కాక తప్పుడు సమాచారాన్ని భర్తీ చేస్తే, ఓటర్ల మ్యాపింగ్ సాఫ్ట్వేర్ తేడాలను గుర్తించి అనుమానిత ఓటర్ల జా బితాలో చేర్చే ప్రమాదం ఉంటుంది. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అయితే, ఎన్యూమరేషన్ ఫారా న్ని తప్పుడు సమాచారంతో భర్తీ చేసిన వారిని గుర్తించి జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీ సులు జారీ చేసి వివరణ కోరనున్నారు. విచారణకు హాజరై ఈసీ నిర్దేశించిన 13 రకాల ధ్రువీకరణ పత్రాలను రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈప్ర క్రియ లో ఎక్క డ తేడా వచ్చినా అక్టోబర్ 1న ప్రచురించే సర్– 2026 తుది ఓటర్ల జాబితాలో పేరు గల్లంతయ్యే ప్రమాదముంది. -
రూ.100 కోట్లతో రీసెర్చ్ పార్క్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) క్యాంపస్లో రూ.100 కోట్లతో రీసెర్చ్పార్క్ ఏర్పాటు కానుంది. ఈమేరకు యాక్సిస్ బ్యాంక్, బిట్స్ పిలానీ మధ్య ఒప్పందం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద గ్రాంట్ రూపంలో ఈ నిధులను సమకూర్చనుంది. 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ఇన్నోవేషన్ పార్క్లో ఆరోగ్యం, మందులు, వైద్య పరికరాల రంగంలో కొత్త ఆవిష్కరణలకు పరిశోధనలు జరుగుతాయి. ప్రజలకు తక్కువ ధరకే మంచి వైద్యం అందించడం లక్ష్యంగా సరికొత్త పరిశోధనలకు ఈ కేంద్రం నిలయంగా ఉండనుంది. ఈ పార్క్లో పెద్ద ల్యాబ్లు, స్టార్టప్ కంపెనీల కోసం ప్రత్యేక స్థలాలు ఉంటాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, విద్యార్థులకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ సందర్భంగా బిట్స్ పిలానీ చాన్స్లర్ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ.. బలమైన ఆవిష్కరణ వ్యవస్థలను నిర్మించడానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందన్నారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి మాట్లాడుతూ.. సమ్మిళిత, సుస్థిర పురోగతిలో భాగస్వాములం కావడం ఆనందంగా ఉందన్నారు. -
ఉస్మానియా వైద్య కాలేజీలో ర్యాగింగ్
సుల్తాన్బజార్ (హైదరాబాద్): రాష్ట్రంలో పేరొందిన కోఠి ఉస్మానియా వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. ఈ కళాశాల హాస్టల్లో ఉంటున్న సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులను తమ సొంత పనులకు వినియోగించుకుంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని డెంటల్ కళాశాలలో అభ్యసించే 2025 బ్యాచ్కు చెందిన 14 మంది విద్యార్థులను బీడీఎస్ ఫైనల్ ఇయర్ వైద్య విద్యార్థులు మూడు నాలుగు నెలల నుంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై జూనియర్ విద్యార్థులు ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేయగా, ఆయన నామమాత్రంగా సీనియర్లను మందలించారు. సీనియర్ చెప్పిన పనులు చేయకపోవ డంతో వారు దాడులకు పాల్పడుతున్నారంటూ బాధితులు సుల్తాన్బజార్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2020 బ్యాచ్కు చెందిన 12 మంది బీడీఎస్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఖైరతా బాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పర్యవేక్షణలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.అడ్మిషన్ దశలోనే అవగాహన కల్పించాలి: డీసీపీర్యాగింగ్ చట్టాలపై విద్యార్థులకు అడ్మిషన్ దశలోనే విద్యాసంస్థల అధికారులు అవగాహన కల్పించాలని డీసీపీ శిల్పవల్లి సూచించారు. ర్యాగింగ్కు పాల్పడిన 12 మంది విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారని ఆమె తెలిపారు. ర్యాగింగ్ చట్టాల ప్రకారం... ఆరు నెలల శిక్ష పడుతుందని, అదే ర్యాగింగ్ వల్ల బాధితులు ఆత్మహత్యకు పాల్పడితే జీవితకాలం శిక్ష పడుతుందన్నారు. అంతేకాకుండా ఇతర విద్యాసంస్థల్లో అడ్మిషన్లు దొరకకుండా చర్యలు ఉంటాయని తెలిపారు. విద్యాసంస్థలు యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్ను ఏర్పాటు చేసి విద్యార్థులపై నిఘా ఉంచాలని సూచించారు.ఆర్కిటెక్చర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు!ఓక్సన్ వర్సిటీలో ఈవెంట్ సందర్భంగా ఘటనఆలస్యంగా వెలుగుచూసిన వైనం నాంపల్లి: ఆర్కిటెక్చర్ విద్యార్థినిపై ఓ కాంట్రాక్టు అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని కంకోల్లో ఉన్న ఓక్సన్ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. ఈ నెల 11–14వ తేదీల మధ్యన ఓక్సన్ వర్సిటీలో 68వ వార్షిక నాసా కన్వెన్షన్ జరిగింది. జాతీయ స్థాయిలో జరిగిన కన్వెన్షన్కు దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలు, వర్సిటీల్లో చదివే ఆర్కిటెక్చర్ విద్యార్థులు, డిజైనర్లు పాల్గొన్నారు. ఈ సెమినార్కు మాసబ్ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలకు చెందిన 50 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరితో పాటుగా కళాశాలకు చెందిన కొందరు అధ్యాపకులు కూడా వెళ్లారు. కాగా, మాసబ్ట్యాంక్ నుంచి సెమినార్కు వెళ్లిన ఆర్కిటెక్చర్ అధ్యాపకుల్లో (ఫ్యాకల్టీ) ఒకరైన ఆదిత్య మూర్తి తమ కళాశాలలో ఆర్కిటెక్చర్ కోర్సును అభ్యసించే మొదటి సంవత్సరం విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.సదరు విద్యార్థిని సెమినార్ ముగియగానే విషయం తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో సోమవారం వారు ప్రిన్సిపాల్ వినోద్ గణేష్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా కళాశాల యాజమాన్యం దాచిపెట్టింది. కాగా, ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించామని, నిజనిర్ధారణ కోసం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి యూనివర్సిటీకి లేఖ రాశామని వినోద్ గణేశ్ తెలియజేశారు. -
పదివేలలోపు ర్యాంకుంటే.. టాప్ కాలేజీల్లో సీటు!
సాక్షి, హైదరాబాద్: వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 19 నుంచి మొదలవుతుంది. ఇదే రోజు నుంచి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూన్ 25 నుంచి జూలై 1 వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మాక్ సీట్ల కేటాయింపు జూలై 4న ఉంటుంది. వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి జూలై 5 నుంచి 7 వరకూ గడువు ఇచ్చారు. జూలై 10న తొలి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది.సాంకేతిక విద్య మండలి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు 159 కాలేజీలు ఈ కౌన్సెలింగ్లో పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటాయి. ఇందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు యాజమాన్య కోటా కింద కేటాయిస్తారు. ఇప్పటికే అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీల నుంచి సీట్ల వివరాలు కౌన్సెలింగ్ వెబ్సైట్లో క్రోడీకరించారు.ఆప్షన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త» నచ్చిన బ్రాంచీ, కాలేజీలపై విద్యార్థులు ముందుగా ఒక అవగాహనకు రావాలి. ఎప్సెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కొంత కసరత్తు చేయాలి. వచ్చిన ర్యాంకుకు ఏయే కాలేజీల్లో, ఏ బ్రాంచీలో సీటు వస్తుందో అంచనాకు రావాలి. గత ఏడాది కటాఫ్లను విద్యార్థులు ప్రామాణికంగా తీసుకుంటే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. సీటు లభ్యత ఉన్న కాలేజీల జాబితాల్లో నచ్చిన కాలేజీలను మొదటి ఆప్షన్గా ఎంచుకోవాలి. ఇదేవిధంగా బ్రాంచీ విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. బ్రాంచీ ముఖ్యం అనుకుంటే కాలేజీ ప్రాధాన్యతపై కొంత చూసీచూడనట్టు ఉండొచ్చు. కాలేజీనే ముఖ్యం అనుకుంటే బ్రాంచీ ఏదైనా ప్రాధాన్యం ఇవ్వొచ్చు. దీనిపై అంచనా లేకుండా ఆప్షన్లు ఇస్తే నష్టం జరిగే వీలుంది. ఉదాహరణకు 50 వేలపైన ర్యాంకు వచ్చిందనుకుందాం. ఈ ర్యాంకుతో టాప్ కాలేజీల్లోనే సీటు కావాలని, ఆప్షన్ ఇస్తే కటాఫ్ ప్రకారం రాకపోవచ్చు. విద్యార్థి ర్యాంకుకు తగ్గ కాలేజీలు, బ్రాంచీలకు తొలి కౌన్సెలింగ్లో 70 వేల ర్యాంకు వరకు ఆప్షన్లు ఇవ్వొచ్చు.టాప్ కాలేజీల్లో 10 వేల లోపే» ఈసారి విద్యార్థుల చూపు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీదే కన్పిస్తోంది. గత ఏడాది 68 శాతం విద్యార్థులు సీఎస్ఈ, అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో చేరారు. ఈసారి ఈసీఈ, సీఎస్ఈ కోర్ గ్రూపుల్లో విద్యార్థుల చేరికలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రధాన కాలేజీల్లో గరిష్టంగా 10 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే వీలుందని అంచనాలు చెబుతున్నాయి. ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ వంటి క్యాంపస్లలో సీఎస్ఈతోపాటు అన్ని గ్రూపులకు పోటీ తీవ్రంగానే ఉంది. సీఎస్ఈలో 2 వేల లోపు, ఈసీఈలో 5 వేల లోపు మాత్రమే సీటు వచ్చే అవకాశం కన్పిస్తోంది. జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇతర జిల్లాల్లో ఉన్న కొత్త కాలేజీల్లో పోటీ పెద్దగా కన్పించడం లేదు. 90 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. విద్యార్థులు ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా యూనివర్సిటీ కాలేజీల్లోనూ డిమాండ్ ఉండటం లేదు. -
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1.62 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 70,804 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి కలగనుంది. జనవరి 1 నుంచి డీఏ పెంపు అమలు కానుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. -
హైడ్రా, ఈగల్ తరహాలో ‘ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్’
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్సేఫ్టీపై స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో ఫుడ్సేఫ్టీ వింగ్ను ఏర్పాటు చేస్తారు. డీపీఆర్ రెడీ చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైడ్రా, ఈగల్ తరహాలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్ ఉండనుంది. ఆహార కల్తీ, తనిఖీలు, సేఫ్టీపై చర్యలు తీసుకోనుంది ఈ వింగ్. త్వరలోనే విధివిధానాలతో పూర్తి వివరాలు క్యాబినెట్ ముందుకు రానున్నాయి.కాగా, ఫుడ్ సేఫ్టీపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ సైడ్ ఆహారం తయారీ, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగం సమయంలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదు. దీనివల్ల ఆహారం కలుషితం, బ్యాక్టీరియా, వైరస్లు, రసాయనాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనిని నివారించడంలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.పరిశుభ్రమైన ఆహారం ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం, గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలు ఫుడ్ సేఫ్టీలో భాగం. నాణ్యమైన ఆహారాన్ని అందించే బాధ్యతను వ్యాపార సంస్థలు మరుస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తే ఆహార కల్తీ బాధలు, అంటువ్యాధులు తగ్గి సమాజం మరింత ఆరోగ్యంగా ఉంటుంది. -
బీసీసీఐ అనుమతి లేదు.. విజయ్ దేవరకొండకు నోటీసులు
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు పంపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతి లేకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) టీజీ20 లీగ్ నిర్వహిస్తోందని.. దీనినిప్రమోట్ చేయటం నేరమని ఆరోపించింది.బీసీసీఐ అనుమతి లేకుండా కార్పొరేట్ కంపెనీలతో HCA వ్యాపారం చేస్తోందని.. ఇది ఎంతమాత్రం సరికాదని టీసీఏ పేర్కొంది. లీగ్తో మమేకమైన సినీ హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేశ్లతో పాటు.. క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్లకు టీసీఏ లీగల్ నోటీసులు పంపింది.స్థానిక టీ20 లీగ్ నిర్వహణకు 45 రోజుల ముందు అనుమతి తీసుకోవాలి.. కానీ బీసీసీఐ అనుమతి లేకుండా డబ్బులు వాసులు చేసి HCA లీగ్ నిర్వహిస్తోందని టీసీఏ ఆరోపణలు చేసింది.టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘TG20 ఒక మోసపూరిత లీగ్. TG20 లీగ్ను నిర్వహించడానికి HCA వద్ద BCCI అనుమతులు లేవు. లీగ్ అనుమతులు చూపించమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు నేను సవాలు విసురుతున్నాను. 'తెలంగాణ' అనే పదాన్ని ఉపయోగించే హక్కు HCAకు లేదు. తెలంగాణ క్రికెట్ వ్యవహారాలను చూసుకోవడానికి 'తెలంగాణ క్రికెట్ అసోసియేషన్' ఉంది’’ అని పేర్కొన్నారు. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే 7 రకాల సీడ్స్ను ప్రభుత్వం గుర్తించింది. బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సొన), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-7715 రకాల విత్తనాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ ఏడు వరి రకాలకే బోనస్ వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం గుర్తించిన సీడ్స్ మాత్రమే విక్రయాలు చేయాలని మంత్రి ఆదేశించారు.విత్తన కంపెనీలు, ఫెర్టిలైజర్ డీలర్లు, కృషి వాస్ నిర్వాహకులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ల డిమాండ్, మిల్లర్ల సూచన మేరకు ప్రభుత్వం సూచించిన 7 రకాల విత్తనాల సరఫరాలపై కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీ, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి చర్చించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్పై ఫెర్టిలైజర్ డీలర్ల అభిప్రాయాలను, సూచనలను మంత్రి తుమ్మల అడిగి తెలుసుకున్నారు. కృషి వాస్ ప్రతినిధులతో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాగు సాంకేతికతపై ఆయన చర్చించారు. -
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు: సీఎం రేవంత్ రెడ్డి
ఆరుట్ల: ప్రభుత్వ విద్యావ్యవస్థను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేలా రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ప్రభుత్వం నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (టీపీఎస్) భవనాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా, సుమారు రూ. 15 కోట్ల భారీ వ్యయంతో ఈ విద్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆరుట్లకు చేరుకున్న సీఎం, ముందుగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించి పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు కల్పించే దిశగా తమ ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యపై తల్లిదండ్రులకు పలు అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం చేపట్టినట్లు సీఎం తెలిపారు. విద్యాశాఖపై తమ ప్రభుత్వం 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని, గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నీరుగార్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి పాఠశాలలోని తరగతి గదులను నిశితంగా పరిశీలిస్తూ క్యాంపస్ అంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించిన రేవంత్ రెడ్డి, తరువాత వారితో కలిసి కూర్చుని ఎంతో ఉత్సాహంగా అల్పాహారం తీసుకున్నారు. స్కూల్లోని అత్యాధునిక వంటగదిని పరిశీలించారు. వంట చేస్తున్న మహిళా సిబ్బందితో కలిసి సరదాగా ముచ్చటిస్తూ, స్వయంగా చపాతీలు (పూరీలు) ఒత్తి వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం అక్కడ ఉన్న వారందరితో కలిసి గ్రూప్ ఫొటోలు దిగారు.ఈ అంతర్జాతీయ స్థాయి మోడల్ పాఠశాలలో కల్పించిన అద్భుతమైన మౌలిక వసతుల గురించి విద్యా కమిషన్ మాజీ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ముఖ్యమంత్రికి క్షుణ్ణంగా వివరించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ క్యాంపస్లో డిజిటల్ క్లాస్రూమ్లు, అధునాతన సైన్స్ ల్యాబ్లు, విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయం (లైబ్రరీ), హైటెక్ కిచెన్, విశాలమైన డైనింగ్ హాల్తో పాటు ఆటల కోసం పెద్ద క్రీడా మైదానాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు.ఈ వేడుకలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పలువురు ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
89 లక్షల మంది ఓటర్లకు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 12న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను స్తంభింపజేసింది. ఆ సమయానికి రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా వారందరికీ పంపిణీ చేసేందుకు పేర్లు, ఇతర పాక్షిక వివరాలతో ‘సర్’ఎన్యూమరేషన్ ఫారాలను ప్రచురిస్తోంది. ఓటర్ల జాబితాను స్తంభింపజేశాక ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను నమోదు చేసే ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో సర్ కార్యక్రమం నిర్వహించగా అప్పటి ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లతో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లను సర్–2026లో భాగంగా మ్యాపింగ్ చేస్తోంది. ప్రస్తుత ఓటర్లు 2002 జాబితాలో తమ పేరైనా లేక తల్లిదండ్రులు/నాయనమ్మ/తాతయ్యల పేర్లను అయినా కలిగి ఉంటేనే మ్యాపింగ్ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 70.02 శాతం మంది ఓటర్ల మ్యాపింగ్ను ఇప్పటివరకు పూర్తి చేశారు. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో ఏకంగా 89.55 లక్షల మంది ఓటర్ల పేర్లు/తల్లిదండ్రుల పేర్లు/బంధుత్వం/చిరునామా ఇతర వివరాల్లో తేడాలున్నట్లు ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్వేర్ గుర్తించింది. సర్ కార్యక్రమంలో భాగంగా జూలై 31 నుంచి సెపె్టంబర్ 28 మధ్య వారికి స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటిసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఏకంగా 26.47 శాతం మందికి ఈసీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా అనుమానాల నివృత్తికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల పత్రాలను ఆధారాలుగా చూపాలని వారిని కోరే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్యలో వారితోపాటు రాష్ట్రంలోని ఓటర్లందరికీ రెండు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నారు. వాటిని నింపాక ఒక ప్రతిని వెనక్కి తీసుకోనున్నారు. స్థానిక బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ తిరిగి ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాతే మ్యాపింగ్లో వ్యత్యాసాలున్న గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీన విచారణకు హాజరు కావాలని కోరనున్నారు. ఆరుగురికన్నా ఎక్కువ సంతానమున్నా నోటీసులు... ‘సర్’నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పన చేసింది. ఓటర్ల వివరాల్లో ఎలాంటి తేడాలున్నా పట్టేసి అనామలీస్(అనుమానస్పద) ఓటర్ల జాబితాలో చేరుస్తోంది. 2002 జాబితాకు, ఇప్పటి జాబితాకు పేర్ల అక్షరాల్లో మార్పులు, బంధుత్వం పొరపాటుగా నమోదై ఉండటం (ఉదాహరణ తండ్రికి బదులు భర్త), తండ్రికి, బిడ్డకు మధ్య వయసులో అసాధారణ తేడాలుండటం (ఉదాహరణకు తండ్రి, కుమారుడికి మధ్య వయసు తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా ఉండటం), ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది సంతానం ఉండటం, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు తప్పుడు మ్యాపింగ్ చేయడం వంటి లోపాలను సాఫ్ట్వేర్ గుర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఇలాంటి కారణాలతోనే రాష్ట్రంలో 89.55 లక్షల మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు, అనుమానాలున్నట్లు సాఫ్ట్వేర్ గుర్తించిందని అధికారులు తెలిపారు. మ్యాపింగ్ యథాతథంగా కొనసాగింపు... సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాను స్తంభింపజేసినా మ్యాపింగ్ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 12 నాటికి ఓటర్లుగా నమోదై ఉన్న వారికే ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయనుండగా జాబితాలో పేరు లేని వారికి సైతం ఓటరుగా నమోదు చేసుకోవడానికి సర్ ప్రక్రియలో భాగంగా అవకాశం కల్పిస్తారు. 18 ఏళ్లు నిండి ఓటర్ల జాబితాలో పేరు లేని వారికి బీఎల్ఓలు ఫారం–6 దరఖాస్తుతోపాటు ఒక స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. వాటిని నింపి తిరిగి బీఎల్ఓకు అందజేయాలి. జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను ఈఆర్వోలు పరిశీలించి అర్హులకు తుది ‘సర్’ఓటర్ల జాబితాలో చోటుకల్పిస్తారు. -
సిటీలో గృహప్రవేశాలు ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ప్రజలను ఇళ్లకు పరిమితం చేస్తే పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఏకంగా ‘ఇళ్ల’పైనే పిడుగు వేసింది. పశ్చిమాసియా ద్వారా చమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడటం వల్ల ఇంధన ధరలతోపాటు రవాణా ఖర్చులు పెరిగి ఉక్కు, అల్యూమినియం, టైల్స్, రంగులు, విద్యుత్ ఉపకరణాల వంటి భవన నిర్మాణ సామగ్రి ధరలు ఎగబాకాయి. దీని ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో గడువులోగా ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయడం బిల్డర్లకు సవాల్గా మారింది. కరోనా కంటే డేంజర్.. కరోనా కాలంలో 2020లో 4.66 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యానికిగాను 2.14 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. లాక్డౌన్లు, వలస కార్మీకులు సొంతూళ్లకు వెళ్లిపోవడం, రవాణా వ్యవస్థలో సవాళ్ల కారణంగా కేవలం 46 శాతమే ఇళ్ల డెలివరీ సాధ్యమైంది. మరోవైపు హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది 5,40,400 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గడువులోగా కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉండగా అందులో 87 శాతం యూనిట్ల డెలివరీలో బిల్డర్లు సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో 70 శాతం గృహాలు ముంబై, పుణే, బెంగళూరు నగరాల్లోనే ఉన్నాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 5.19 లక్షల ఇళ్లు డెలివరీ అవగా 2017 నుంచి 2025 మధ్య ఈ సంఖ్య దాదాపు 30.5 లక్షల యూనిట్లుగా ఉంది. హైదరాబాద్లోనూ అదే పరిస్థితి... రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనల ప్రకారం గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉంటుంది. ఈ ఏడాది దక్షిణాది నగరాల్లో మొత్తం 1,68,300 యూనిట్లు డెలివరీ చేయాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా బెంగళూరులో 69 వేలు, హైదరాబాద్లో 63,700, చెన్నైలో 35,600 యూనిట్లు కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉంది. నిర్మాణ సామగ్రి కొరత, ధరల పెరుగుదల కారణంగా హైదరాబాద్లో ఆయా యూనిట్ల డెలివరీ ఈ ఏడాది ఆలస్యం కానుంది. రెరా గడువును పొడిగించాలి కరోనా కాలంలో ఎలాగైతే రెరా గడువులో మినహాయింపులు ఇచ్చారో అదే తరహాలో పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో రెరా గడువును ఏడాదిపాటు పొడిగించాలి. – ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ -
పర్యాటకాన్ని పెంచేలా హైస్పీడ్ రైల్ కారిడార్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని పర్యాటకరంగ పరంగా ప్రమోట్ చేసేందుకు వీలుగా హైస్పీడ్ రైలు కారిడార్లకు ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్–పుణె కారిడార్లో వికారాబాద్ అనంతగిరిలో స్టేషన్ ఉండాలని, అక్కడి నుంచి ఐటీ హబ్కు రవాణా వసతి కల్పించాలని సూచించారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్తో అనుసంధానమయ్యే హైస్పీడ్ రైల్ కారిడార్లు, వరంగల్ విమానాశ్రయంపై సమీక్ష నిర్వహించారు. నగరం నుంచి బెంగళూరుకు నిర్మించే కారిడార్లో ఫ్యూచర్ సిటీ స్టేషన్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని, రాష్ట్రంలో కీలక పర్యాటక స్థలంగా ఎదిగే వీలున్న సోమశిల ప్రాంతంలో, నల్లమల అటవీ ప్రాంతంలోని మన్ననూరు దగ్గర నల్లమల స్టేషన్ ఉండాలని సూచించారు. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ప్రాంతం హబ్గా ఉండాలన్నారు. వరంగల్ నగరంలో త్వరలో పనులు ప్రారంభం కానున్న విమానాశ్రయ భవనం ఆసాంతం కాకతీయ సామ్రాజ్య చరిత్రను స్ఫురణకు తెచ్చేలా డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. విమానాశ్రయం ముందు భారీ ఐలండ్ ఉండాలని, అందులో రాణి రుద్రమ, రుద్ర దేవుడు, భారీ నంది విగ్రహాలు కొలువుదీరాలని చెప్పారు. -
పెన్షను..పేదల్లో టెన్షను!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త చేయూత పింఛన్ల కోసం పేదలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మీకులు..ఇలా అనేక కేటగిరీలకు చెందినవారు పింఛన్ల కోసం దరఖాస్తుల మీద దరఖాస్తులు పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా కరుణిస్తుందన్న ఆశతో కార్యాల యాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లు కలిపి.. దాదా పు నాలుగేళ్లుగా చేయూత కోసం నిరీక్షిస్తున్నా రు. సుమారు 20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అంచనా కాగా..వీటి పరి ష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖ లాలు కన్పించక పోవడంతో పింఛన్ల అంశం అంతుచిక్కని వ్యవహారంగా మారింది. పెంపు సరే.. మంజూరేదీ? కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు (ప్రస్తుతం ఇస్తున్న రూ.4 వేల నుంచి), వృద్ధులు, వితంతువులు, ఇతర కేటగిరీల పింఛను రూ.4 వేలకు (ప్రస్తుతం ఇస్తున్న రూ.2 వేల నుంచి) పెంచుతామని హామీ ఇచ్చింది. 2026–27 బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు.. కొత్తగా వివిధ కేటగిరీలకు చెందిన 2 లక్షల మంది అర్హులకు చేయూత పింఛన్లు (ఎలాంటి పెంపుదల లేకుండా) మంజూరు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ప్రథమ ప్రాధాన్యత కింద వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, వృద్ధులకు కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించినా అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దరఖాస్తుల స్వీకరణే..స్రూ్కటినీ లేదు మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో వివిధ కేటగిరీల వారి నుంచి దరఖాస్తులైతే తీసుకుంటున్నారు కానీ వాటి పరిశీలనే (స్క్రూటినీ) పూర్తి చేయడం లేదు. దరఖాస్తులను స్క్రూటినీ చేయాలనే ఆదేశాలు కూడా సంబంధిత అధికారులకు అందలేదు. అసలు ఎప్పటినుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఉన్నతాధికారులు..అప్పుడే అర్హుల జాబితాను సిద్ధం చేసి పంపవద్దంటూ జిల్లా, మండల అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ముందుగా ఆయా కేటగిరీల కింద అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి అర్హులను గుర్తించాక పరిశీలనకు క్షేత్రస్థాయికి పంపిస్తారు. అక్కడి నుంచి పింఛన్దారుడు అర్హుడనే నివేదిక అందాక డేటా ఎంట్రీ చేసి ఆమోదం తెలుపుతారు. కానీ ఈ ప్రక్రియలో ఎలాంటి ముందడుగూ పడటం లేదని ఎక్కడికక్కడే మూలుగుతున్న దరఖాస్తులు స్పష్టం చేస్తున్నాయి. అయితే మొత్తంగా 20 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉంటే.. రెండులక్షలు మాత్రమే కొత్త పింఛన్లు ఇస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితిని, ప్రభుత్వంపై వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలా అన్న సందిగ్ధంలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న ఆశావహుల సంఖ్య రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద చేయూత పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య 41,48,071గా ఉంది. వాస్తవానికి 2023 డిసెంబర్ చివరినాటికి వివిధ కేటగిరీల పింఛ¯న్దారుల సంఖ్య 43,55,649 కాగా.. అప్పటి నుంచి ఇటీవలి కాలం వరకు వివిధ కేటగిరీల కింద పింఛను పొందే వారి మరణాలు, అనర్హతలు, ఇతర కారణాలతో 3.5 లక్షల పించన్లు తొలగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా మరో 2 లక్షల మందికి పాత మొత్తంతోనే పింఛన్ల మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే 2022 ఆగస్టు నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయకపోవడంతో వీటిని కోరుకుంటున్న పేదల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రజా పాలనలో లక్షల్లో దరఖాస్తులు కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చాక గత రెండున్నరేళ్లుగా ప్రజాపాలన, మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా, ఇతర రూపాల్లో..పింఛన్ల కోసం 19 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. వీటిలో అత్యధికంగా అంటే దాదాపు 12 లక్షల దాకా వృద్ధాప్య, 4 లక్షల దాకా వితంతు, 3 లక్షల దాకా దివ్యాంగుల దరఖాస్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 70 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. వీటన్నింటినీ చేయూత పింఛన్ల మార్గదర్శకాలకు అనుగుణంగా వడపోస్తే ఎంతమంది అర్హులనేది తేలుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే బడ్జెట్ కొరత, సాంకేతిక కారణాల వల్ల కొత్త పింఛన్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు. వారం వారం తిరుగుతూనే ఉన్నా.. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని ఐదేళ్లు అయింది. గత ప్రభుత్వంలో, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నా. వారం వారం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. అయినా ఇప్పటివరకు రాలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. – చంద్రకళ, మరికల్, నారాయణపేట నాలుగేళ్లలో మూడుసార్లు దరఖాస్తు కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో నాకు ఒక కాలు పూర్తిగా తీసేశారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సదరం సర్టిఫికెట్ తీసుకున్నా. నాలుగేళ్లలో మూడుసార్లు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ప్రతీసారి ఎంక్వయిరీ చేసి వదిలేస్తున్నారు. ఇప్పటివరకు నాకు పెన్షన్ అందలేదు. – మీర్జా ఇస్మాయిల్, దివ్యాంగుడు, సుభాష్నగర్ (కరీంనగర్) -
ఇప్పుడే విత్తొద్దు..
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా ఇంకా విస్తరించలేనందున రైతులు తొందరపడి విత్తనాలు వేయవద్దని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తరువాత విత్తే నియమాన్ని పాటించి.. అంటే ఒక వారం వ్యవధిలో తేలికపాటి నేలలో 50–60 మి.మీ., బరువు నేలలో 60–75 మి.మీ వర్షపాతం నమోదైన తరువాత లేదా 15–20 సెం.మీ. లోతు నేల తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం పంటలను విత్తుకోవాలని తెలిపింది. నైరుతి రుతుపవనాల ద్వారా జూన్ నెలలో ఉత్తర, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో సాధారణంకంటే తక్కువ వర్షపాతం, మిగిలిన జిల్లాలలో సాధారణంకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నందున అధిక తేమ, నీటి ఎద్దడి నుంచి ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి పంటలను వాలుకు అడ్డంగా, బోదెలు–కాలువల పద్ధతిలో, ఎత్తు మడులు–కాలువల పద్ధతిలో విత్తుకోవాలని యూనివర్సిటీ ఆగ్రో క్లైమేట్ రీసెర్చ్ యూనిట్ హెడ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పి.లీలా రాణి తెలిపారు. చెరువులు, కుంటలకు దూరంగా ఉండి తక్కువ నీటి వసతి ఉన్న రైతులు తమకు అనువైన తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలని చెప్పారు. -
మరో 3 రోజులు మండుటెండలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. సాధారణంగా జూన్ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదు కావాల్సి ఉండగా ఎల్నినో వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే అత్యధికంగా ఆదిలాబాద్లో 41.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 20 జిల్లాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పులు వీస్తాయని వివరించింది. నాలుగు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని, రుతుపవనాల కదలికలు చురుకుగా ఉంటే వేగంగా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని తెలిపింది. రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
హైడ్రా.. చట్టానికి అతీతం కాదు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట సర్వే నంబర్ 1, 2లోని భూయజమాని స్వాధీన హక్కులను రక్షిస్తూ తాము ఇచ్చిన ఆదేశాలున్నా.. ప్రైవేటు ఆస్తిలో ప్రవేశించినందుకు హైడ్రా కమిషనర్ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా అధికారులు కోర్టు ఉత్తర్వులను బహిరంగంగా ఉల్లంఘించారని.. వారు ప్రత్యేక విభాగ అధికారులుగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. కానీ వారు కూడా చట్టానికి అతీతులు కాదని.. పాలనా వ్యవస్థలో భాగమేనని స్పష్టం చేసింది. చట్ట పరిధిని దాటి వ్యవహరించే అధికారం హైడ్రాకు లేదని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో ఆ భూమిలోకి ప్రవేశించబోమని హైడ్రా తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇవ్వడంతో దీన్ని ఉల్లంఘించవద్దని అధికారులను ఆదేశించింది. అలాగే పిటిషనర్ భూమిలోకి ప్రవేశించకుండా, వారి ప్రశాంత స్వాధీన, అనుభవ హక్కులకు భంగం కలిగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ధిక్కరణ పిటిషన్లో విచారణ ముగించింది.భూమిపై హక్కు లేకున్నా ప్రవేశం సమ్మతం కాదులోతుకుంట గ్రామానికి చెందిన భూమి విషయంలో శాంతా శ్రీరామ్ నిర్మాణ సంస్థ ధిక్కార పిటిషన్లు దాఖలు చేసింది. భూమి వివాదానికి సంబంధించిన రిట్ అప్పీల్, సివిల్ సూట్, ఫస్ట్ అప్పీల్ తదితర కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాకపోయినా హైడ్రా అధికారులు భూమిలోకి ప్రవేశించి తమ స్వాధీన భూమిలో జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘సొసైటీ టు సేవ్ రాక్స్’ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు స్థలాన్ని సందర్శించారని హైడ్రా తరఫు న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ భూమి తమదేనని నిరూపించడంలో సర్కార్ విఫలమైందన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వానికి ఆ భూమిపై ఎలాంటి హక్కు ఉండదని, హైడ్రా అధికారులు ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించడం న్యాయసమ్మతం కాదన్నారు. హైడ్రా ఏర్పాటు ఉత్తర్వులను పరిశీలించిన న్యాయమూర్తి.. రహదారులు, కాలువలు, చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే సంస్థ పరిమితమని తేల్చిచెప్పారు. -
ఆధారాలు చూపిస్తే.. రాజీనామా చేస్తా
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్లపై మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ చెప్పారు. ఆధారాలతో నిరూపిస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ప్రజల సమక్షంలోనే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని హరీశ్రావుకు సవాల్ విసిరారు. సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో ముగ్గురు మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారి సమీక్ష నిర్వహించిన అనంతరమే కొనుగోలు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. అడ్లూరి మంగళవారం సీఎల్పి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఒకే అంశంపై బీఆర్ఎస్ నాయకు లు మూడు రకాల అంకెలు చెబుతున్నారన్నారు. హరీశ్రావు రూ.2,000 కోట్ల కుంభకోణమంటే, ప్రవీణ్ కుమార్ రూ. 3,000 కోట్లు అంటున్నారని, వారి అనుబంధ మీడియా సంస్థలు రూ.200 కోట్ల వ్యవహారమని ప్రచారం చేస్తున్నాయన్నా రు. ఇందులో ఏది నిజమో బీఆర్ఎస్ స్పష్టత ఇవ్వాలన్నారు. హైకోర్టు కూడా టెండర్ విధానాన్ని సమరి్థంచింది టెండర్లన్నీ ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా, సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించామని అడ్లూరి చెప్పారు. హైకోర్టు కూడా ఈ విధానాన్ని సమర్థించిందన్నారు. యూనిఫాం వస్త్రం, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, ట్రంక్ బాక్సులు, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సులు, బెడ్డింగ్ మెటీరియల్, నోట్బుక్స్, స్టేషనరీ కిట్లు, ట్రాక్ సూట్లు, టైలు, బెల్టులు, ఐడీ కార్డ్ హోల్డర్లు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా బెడ్ïÙట్ ధర రూ.425 నుంచి రూ.405కు, కార్పెట్ ధర రూ.412, టవల్ ధర కూడా తగ్గిందన్నారు. బెడ్షీట్లు 3 లక్షలు, కార్పెట్లు 2.29 లక్షలు, బ్లాంకెట్లు 6.49 లక్షలు, టవల్స్ 1,500 కొనుగోలు విలువ రూ.70.86 కోట్లు అని చెప్పారు. ట్రంక్ బాక్సులకు ఐదు కంపెనీలు దరఖాస్తు చేశాయని, పోటీ ప్రక్రియలో ధరలను చర్చల ద్వారా తగ్గించామన్నారు. రూ.1,299 నుంచి రూ.1,275గా నిర్ణయించామని చెప్పారు. దీని మొత్తం విలువ రూ.41.40 కోట్లు అని వెల్లడించారు. యూనిఫాం వస్త్రం టెండర్లలో మూడు సంస్థలు పాల్గొన్నాయని, వర్క్ ఆర్డర్ విలువ రూ.298.10 కోట్లు అని అన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థ టీజీఎస్సీవోలకు 60 లక్షల మీటర్ల వస్త్ర సరఫరా బాధ్యత అప్పగించామని తెలిపారు. దీని విలువ: రూ.57.17 కోట్లు అని వెల్లడించారు. -
కాళేశ్వరం.. కృష్ణశిల నిర్మితం
కాళేశ్వరం: కాకతీయులు, చాళుక్యుల కాలం నాటి పురాతన కాళేశ్వరాలయానికి మహర్దశ రానుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని ఈ ఆలయ జీర్ణోద్ధరణ, తొలగింపు పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.198 కోట్లు కేటాయించింది. ఆలయ పనులకు ఏప్రిల్ 20న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆలయ జీర్ణోద్ధరణకు పూనుకున్నారు. పూర్తిగా కృష్ణశిలతో ఆలయ పునర్నిర్మాణాన్ని చేపడుతున్నారు. మంగళవారం దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవిందహరిలు చేపట్టబోయే పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. ఆలయ నిర్మాణ ప్రత్యేకతలు..» ఆలయాన్ని 7 లక్షల క్యూబిక్ ఫీట్లతో నిర్మాణం చేపడతారు. కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా నిర్మాణశైలి ఉంటుంది. దేవస్థానంలోని గర్భాలయం, అనివెట్టి మండపం అంత రాలయం, ప్రాకారాలు నిర్మిస్తారు. » అన్ని ఉప ఆలయాలు శ్రీశుభానందదేవి, నందులు, శ్రీసుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాలు, యాగశాల, సుపద మండపాలు ఒకే చోట వాస్తు ప్రకారం ప్రతిష్టించనున్నారు. » బయట ఉన్న సరస్వతి అమ్మవారు, శ్రీరామాలయం, శ్రీసూర్యాలయాలు లోపల ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరువాత రెండవ దశలో తూర్పు రాజగోపురం, ఇతర మిగిలిన పనులు చేపట్టనున్నారు. నమూనా చిత్రాల విడుదలకాళేశ్వరంలోని అష్ట తీర్థాలకు రూ.60 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. ఈవో కార్యాలయంలో స్థానికులతో సమావేశంలో కృష్ణశిలతో ఉన్నటువంటి నమూనా చిత్రాలు విడుదల చేశారు. మే చివరి వరకు పనులు పూర్తి చేసేలాగా ప్రణాళికలు చేశామని తెలిపారు. శిల్పులకు ఒక్కో శిల్పానికి మూడు నెలల సమయం పట్టనుంది. పనులు హైదరాబాద్కు చెందిన జైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అప్పగించినట్లు పేర్కొన్నారు.పుష్కర ఘాట్ నమూనా చిత్రం పంచబ్రహ్మ యాగంతో ఆరంభంజీర్ణోద్ధరణలో భాగంగా మంగళవారం సాయంత్రం యాగశాలలో పంచబ్రహ్మ హోమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఘనంగా నిర్వహించారు. పూజా క్రతువులు ప్రారంభం కావడంతో బుధవారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రాయశ్చిత్త పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత 8.15 గంటలకు శృంగేరి శారదా పీఠాధిపతి శిష్యబృందంతో కళాపకార్షణ క్రతువు ఆరంభిస్తారు. దీంతో శ్రీ ఆదిముక్తీశ్వరాలయంలో ఏర్పాటు కానున్న బాలాలయంలో చైన్నైకి చెందిన కళాకారులు అరుదైన అత్తి కర్రతో తయారు చేసిన ఉత్సవ మూర్తులను ప్రతిష్టిస్తారు. అప్పటి నుంచి ఆలయంలో దర్శనాలు, ఆదిముక్తీశ్వరాలయంలో అభిషేక పూజలు ప్రారంభం జరుగుతాయని కమిషనర్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నుంచి కాళేశ్వరం దేవస్థానంలో కైంకర్య పూజలు నిలిపివేస్తారని పేర్కొన్నారు. -
నర్సరీ టు ఇంటర్ ఒకే క్యాంపస్లో..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ విద్యారంగంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) నూతన విద్యా విప్లవానికి నాంది పలకబోతోంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల కేంద్రంగా అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ను బువారం ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం స్కూలుకు సమీపంలో ఏర్పాటు చేసిన బహి రంగ సభలో ప్రసంగించనున్నారు. రోల్మోడల్గా టీపీఎస్ఆరుట్లలో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నత ప్రమాణాలతో విద్య అందిస్తారు. విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమప్రాధాన్యం కల్పిస్తారు. విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన జరగనుంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా తెలంగాణ విద్యకు రోల్ మోడల్గా ఇది రూపుదిద్దుకుందని అంటున్నారు. మొదటి విడతలో ఆరుట్ల, మంచాల పాఠశాలతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. అప్పుడే నో అడ్మిషన్ బోర్డుకార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్ వాతా వరణం కనిపిస్తోంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తోపాటు ప్రతి క్రీడకు ప్రత్యేక మైదానాలు ఏర్పాటు చేశారు. ఆయా క్రీడలకు సంబంధించి ప్రత్యేక శిక్షకులనూ అందుబాటులో ఉంచారు. అదీగాక చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకు రావడానికి ప్రభుత్వం ఐదు బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో ఈ స్కూల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలను సైతం ఇక్కడ చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తు న్నారు. ప్రస్తుతం 1,814 మంది విద్యార్థులు చదువుతుండగా, డిమాండ్ను తట్టుకోలేక నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి టీపీఎస్లో నెలకొంది. -
‘సర్’ ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర
సాక్షి,నల్గొండ: భారతదేశంలో బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే, కొన్ని రాజ్యాంగ బద్ద సంస్థలను నిర్వీర్యం చేస్తూ,రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటూ,సిబిఐ, ఈడీ సంస్థలను వాడుకొని ఇతర పార్టీ నాయకులను భయపెట్టి,అక్రమంగా కేసులు బనాయించి,అన్యాయంగా స్థానిక ప్రాంతీయ పార్టీలను అధికారం నుండి తొలగించే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.ఈ రోజు నల్గొండ జిల్లాలోని దేవరకొండ,నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ బిఎల్ఏల ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎస్ఐఆర్ పేరిట ప్రస్తుతం ఎన్నికల కమీషన్ ను అడ్డుపెట్టుకొని దేశ వ్యాప్తంగా కోట్లాది ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో 86 లక్షల ఓట్లు తొలగించారని, బీహార్లో 46 లక్షల ఓట్లు తొలగించారని, ఉత్తరప్రదేశ్ లో సుమారు 2 కోట్లు మొత్తంగా ఇప్పటివరకు 6 కోట్ల ఓట్లు తొలగించారన్నారు. అస్సాంలో మాత్రం బీజేపీ అధికారంలో ఉన్నదని అక్కడ ఎస్ఐఆర్ నిర్వహించలేదని విమర్శించారు.నిజంగా దేశ ఎన్నికల కమీషన్ పారదర్శకంగా ఉంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయేది కాదన్నారు. తెలంగాణలో కూడా బిజేపి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలని ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నాయని, బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండి,ఆ కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో కలిసే ఉన్నాయని, అందుకే పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను, తొమ్మిది రోజులపాటు రేవంత్ రెడ్డి కాపాడారని స్పష్టం చేశారు. అంతేకాకుండా బీజేపీకి సహాయం చేయడానికి, రాజ్యసభ ఎంపిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేస్తే,గాంధీ భవన్ నుండి లీకులు ఇచ్చి, ఆమెకు వెన్నుపోటు పొడిచి,మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు లీకులు ఇచ్చి ఆమె నామినేషన్ రద్దు చేయించారని పేర్కొన్నారు.అందుకే కాంగ్రెస్, బిజేపి కలిసి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని వివరించారు. 2018లో చంద్రబాబు సేవామిత్ర మొబైల్ యాప్ ద్వారా వైఎస్సార్సీపీకి చెందిన ఓట్లు తొలగించాలని కుట్ర చేస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని గుర్తు చేశారు.అదే విధంగా తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటి యాప్ తెచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. బీఎల్ఏలు అయ్యప్ప దీక్ష, భీమ్ దీక్ష, హనుమాన్ దీక్ష చేపట్టినట్లే, బిఆర్ఎస్ కార్యకర్తలు,బిఎల్ఏలు ఎస్ఐఆర్ దీక్ష చేపట్టి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. బీఎల్ఓలు సర్వేలో భాగంగా ఇంటికి వస్తే ఖచ్చింతంగా నూతన ఓటు నమోదు కోసం ఫారం 6, తొలగించాలంటే ఫారం 7, అభ్యంతరాలు సవరణల కోసం ఫారం 8 నింపి ఇవ్వాలన్నారు. ఇసిఐ నెట్ మొబైల్ యాప్ ద్వారా బూత్ పరిధిలో ఉన్న ఇంటింటికి తిరిగి అర్హులైన అందరి ఓట్లు నమోదు చేసుకునే అవకాశం ఉందని,తర్వాత బిఎల్ఓ సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ ఇటీవల ఏం చేసైనా, కిందపడి, మీద పడి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పడం వెనుక , ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నందునే మాట్లాడారని,అందుకే బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి బిఎల్ఏలు అవసరం లేదని,ప్రభుత్వ ఉద్యోగులను,బిఎల్ఓలను వారు బిఎల్ఏలుగా పని చేసే విధంగా వారిని బెదిరించి పని చేయిస్తారన్నారు. అందుకే బిఎల్ఓలను,బిఎల్ఏలు వెంటవెంటనే అనుసరించి దొంగ ఓట్లు నమోదు కాకుండా,అర్హులైన ఓట్లు తొలగించకుండా చూడాలని వివరించారుదేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్,నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ,సూర్యాపేట శాసన సభ్యులు జగదీష్ రెడ్డి,మాజీ రాజ్యసభ ఎంపి లింగయ్య యాదవ్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేందమంత్రి కిషన్రెడ్డికి సీఎం రేవంత్ లేఖ
సాక్షి, హైదరాబాద్: మెట్రో ఫేజ్-2 నిధుల విడుదలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి లేఖ రాశారు. ఐఆర్ఎఫ్సీ లోన్ ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-I ని రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసింది. ఎల్అండ్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సహకరించాలని కోరారు. ఫేజ్-1 టేకోవర్కు రూ.15,000 కోట్లు - రూ.1,461 కోట్లు ఈక్విటీ, రూ.13,538 కోట్లు రీఫైనాన్స్ నిధులు విడుదలకు సహకరించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.ఐఆర్ఎఫ్సీ లోన్ శాంక్షన్ చేసినా నిధులు విడుదల చేయలేదన్న సీఎం.. రాష్ట్రం అన్ని షరతులు పూర్తి చేసిందని.. రూ.84 కోట్ల అప్ఫ్రంట్ ఫీజు చెల్లించిందని లేఖలో రేవంత్ పేర్కొన్నారు. 1,461 కోట్లు ఎస్క్రో అకౌంట్లో జమ చేశాం.. అయినా ఐఆర్ఎఫ్సీ నిధులు ఆపేసిందన్న సీఎం.. ఫేజ్-2లో 7 కారిడార్లు, 122.9 కి.మీ, రూ.38,595 కోట్ల ప్రాజెక్ట్.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.ఫేజ్-2కి 50:50 జాయింట్ వెంచర్గా ఆమోదం ఇవ్వాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. కేంద్రం ఒప్పుకోకుంటే రాష్ట్రమే సొంతంగా ఫేజ్-2 చేపడుతుందన్న సీఎం.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం దానం అడగడం లేదన్న సీఎం.. డ్యూ డిలిజెన్స్ తర్వాత శాంక్షన్ అయిన లోన్ ఇవ్వమంటున్నామన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ లేక 9వ స్థానానికి పడిపోయిందని.. బెంగళూరు, చెన్నై, ముంబై దూసుకుపోతున్నాయని.. హైదరాబాద్ వెనుకబడిందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణకు చెందిన కేంద్రమంత్రిగా జోక్యం చేసుకోవాలని కిషన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘‘ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మెకానిజం, ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చాం. అయినా లోన్ ఆపేశారు. ఆర్ఎఫ్సీ ప్రభుత్వ రంగ సంస్థే.. కేంద్రం ఆదేశిస్తే వెంటనే నిధులు వస్తాయి. మెట్రో విస్తరణ ఆలస్యమైతే హైదరాబాద్కు తీవ్ర నష్టం. వెంటనే నిర్ణయం తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
నరహరి అక్రమాస్తులు వంద కోట్లు దాటాయ్
సాక్షి,హైదరాబాద్: నారాయణగూడ సర్వే భవన్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి అవినీతి అక్రమాల లెక్కలు వెలుగులోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులకు రూ.100కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్ మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న నరహరిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రతీ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో క్రింది స్థాయి సిబ్బందితో కలిసి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో ఛత్రినాకలోని నరహరి నివాసం.. నారాయణగూడ సర్వే భవన్తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు జరిపారు.ఈ సోదాల్లో నరహరి నివాసంలో రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు రూ.1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి సీజ్ చేశారు. అంతేకాదు నరహరి బ్యాంక్ ఖాతాల్లో రూ.2.29కోట్లు గుర్తించారు. దీంతో పాటు రూ.5.04కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, రంగారెడ్డి జిల్లాలో 5 ఫ్లాట్లు, 1.24 ఎకరాల భూమి, పుప్పాలగూడ, నార్సింగి, రాజేంద్రనగర్లో విలువైన ఫ్లాట్లు,గచ్చిబౌలిలో జీప్లస్3, ఛత్రినాకలో జీప్లస్ 2 భవనాలు గుర్తించారు. నరహరి భార్య పేరిట రెండు లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. -
'క్యూర్' ఎన్నికలపై ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరం విస్తరించిన క్యూర్లోని మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. గత జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు గత ఫిబ్రవరి 10న ముగిసిపోగా, 11 నుంచి స్పెషలాఫీసర్ పాలన కొనసాగుతుండటం తెలిసిందే. జీహెచ్ఎంసీ రూపాంతరం చెంది మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కావడంతో మూడు కార్పొరేషన్ల ఎన్నికలపైనా పలువురు దృష్టి సారించారు. సాధారణంగా అయితే పాలకమండలి గడువు ముగిశాక ఆర్నెళ్ల లోపున కొత్త పాలకమండలి ఏర్పాటు కావాలి. అంటే ఆ లెక్కన ఆగస్టు రెండోవారంలోపున ఎన్నికలు జరగాలి. కానీ ప్రస్తుతమా పరిస్థితి కనిపించడం లేదు.ఓటరు జాబితాకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైంది. ‘సర్’ ముగిశాక అక్టోబర్ ఒకటో తేదీన ఓటరు తుది జాబితా వెలువడనుంది. అంటే, అప్పటిలోగా ఎన్నికలకు అవకాశం లేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలు అప్పటి నుంచి వడివడిగా చేపట్టినా, వార్డుల రిజర్వేషన్లు, మేయర్ రిజర్వేషన్లు తదితరమైనవి పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించేందుకు డిసెంబర్ వరకు పట్టే అవకాశం ఉందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.మూడింటికా..పాలకమండలి గడువును పరిగణనలోకి తీసుకొని కేవలం జీహెచ్ఎంసీకి మాత్రమే తొలుత ఎన్నికలు నిర్వహించి, దాని ఫలితాన్ని బట్టి సీఎంసీ, ఎంఎంసీలకు నిర్వహించనున్నారనే వాదనలున్నప్పటికీ, జీహెచ్ఎంసీ స్వరూపం మారిపోయింది. మిగతా రెండు కార్పొరేషన్లలోనూ పాత జీహెచ్ఎంసీ ప్రాంతాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకే ఎన్నికలు ఒక్క కార్పొరేషన్కో.. రెండు లేక మూడు కార్పొరేషన్లకో జరగనున్నాయని చెబుతున్న వారూ ఉన్నారు. మూడు కార్పొరేషన్లకూ ఏకకాలంలో నిర్వహించే అవకాశాన్ని కాదనలేమని పలువురు భావిస్తున్నారు.ఇటీవలే సీఎంసీ, ఎంఎంసీల సొంత కార్యాలయ భవనాలతో పాటు ఒక్కో కార్పొరేషన్లో వందల కోట్ల పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఈ అంశాలు ఉపకరించనున్నాయి. ఇక జీహెచ్ఎంసీకి సంబంధించి నల్లగొండ ఫ్లై ఓవర్ను ఆలోగా ప్రారంభించడంతో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు కూడా పూర్తి చేసే యోచనలో ఉన్నారు. వీటితోపాటు మూడు కార్పొరేషన్ల పరిధుల్లోనూ వీలైనన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రంగుల ప్రపంచంలో గ్రామాలేవీ? స్పష్టతకు అవకాశం.. మూడు కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న కేబినెట్ సమావేశం జరగనుంది. తొలిసారిగా పేపర్లెస్ విధానంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని ‘ఈ–కేబినెట్’ సమావేశంగా చెబుతున్నారు. సమావేశంలో వివిధ అంశాలతోపాటు క్యూర్లోని కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి కూడా కీలక చర్చ జరగనున్నందున చర్చలో ఒక స్పష్టత రాగలదని భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం జరిగే సెన్సస్తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహిస్తారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్, మూడు కార్పొరేషన్ల ఏర్పాటు జరిగిన తీరులోనే హడావుడి లేకుండానే నిశ్శబ్దంగానే ఎన్నికల నగారా మోగవచ్చునని తెలుస్తోంది. ఇప్పటికే కసరత్తు కూడా జరుగుతోందని సమాచారం. -
మూసాపేట్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్: మూసాపేట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, ప్రమాదం జరిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోలేదని తెలుస్తోంది. ప్రమాదం తీవ్రతతో ఎగిసిపడుతున్న మంటలకు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణ భయంతో ప్రమాద ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా ‘ఈగల్’ ఆపరేషన్.. 19 మంది అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ చేపట్టింది. డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్న 19 మందిని అరెస్ట్ చేసింది. పట్టుబడి వారిలో 14 మందికి గంజాయి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయా వినియోగదారులు చక్రపాణి, హర్షిత్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారు. గతంలో ఎన్డీపీఎస్ చట్ట కింద చక్రపాణి, హర్షిత్ అరెస్ట్ అయ్యారు. అయినప్పటికీ ఈ దందాను ఆపలేదు. డగ్స్ వినియోగదారులపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆపరేషన్లు కొనసాగిస్తూనే ఉంది. కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాల ఆటలు కట్టిస్తోంది.మాదాపూర్లో 2 రోజుల క్రితమే.. హైదరాబాద్లోని మాదాపూర్లో ఆదివారం (జూన్ 14న) డ్రగ్స్ భారీగా పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఎనిమిది మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15 గ్రాముల ఎండీఎంఏ, 382 గ్రాముల ఓజీ కుష్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్తో పాటు 9 మొబైల్ ఫోన్లు, 2 బరువు తూచే మిషన్లు, ప్యాకింగ్ మెటీరియల్ సీజ్ చేశారు. -
కిషన్రెడ్డే అడ్డుకున్నారు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వా«దీనం చేసుకోకుండా, రా ష్ట్రంలో మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు చేపట్టకుండా కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి కుట్రపూరితంగా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ‘ఒప్పందం ప్రకారం తొలి దశ ప్రాజెక్టు స్వాదీనానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి అవసరమైన రుణం విడుదలకు జూన్ 15 చివరి రోజు. బ్యాంకులు సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఈ రోజు కిషన్రెడ్డి రుణం విడుదల చేయిస్తడా? చేయించడా? చివరకు రిజర్వ్ బ్యాంకు నుంచీ గ్యారెంటీ తెచ్చి ఇచ్చాం. ఇక ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు. రుణం ఆపడానికి కారణం ఏమిటో చెప్పండి. రుణం విడుదల చేయించడానికి మీరు మాట్లాడతరా? మాట్లాడరా? రెండో విడత మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు 50 శాతం నిధుల వాటాతో భాగస్వామ్యానికి కేంద్రం ముందుకు వస్తదా? రాదా? ముందుకు రాకపోతే రాష్ట్రమే పూర్తి వ్యయంతో కట్టుకోవడానికి కేంద్రం ఎన్ఓసీ ఇవ్వాలి. ఉత్తరప్రదేశ్, అహ్మదాబాద్, వైజాగ్కు కూడా మెట్రో ఇచ్చారు. విశ్వనగరం హైదరాబాద్కు ఇవ్వడం లేదంటే వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి..’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్వోసీ ఇస్తే మీ వాటా అవసరం లేదు.. ‘మెట్రో తొలి దశ ప్రాజెక్టు స్వా«దీనానికి అవసరమైన రుణం కోసం ఐఆర్ఎఫ్సీని ఒప్పించి అన్ని ఒప్పందాలు చేసుకున్నాం. మే 30 నాటికే అప్పు విడుదల కావాలి. జూన్ 1 నుంచి మెట్రోను పూర్తిగా ఎల్అండ్టీ నుంచి స్వా«దీనం చేసుకునేలా ఒప్పందం చేసుకున్నాం. ప్రభుత్వం పెట్టుబడి వాటాగా రూ.1,400 కోట్ల మార్జిన్ మనీతో పాటు రూ.84 కోట్ల పేపర్ ఫీజు కట్టింది. ఐఆర్ఎఫ్సీ రూ.13,600 కోట్ల రుణం విడుదల చేయాల్సి ఉండగా, కరెక్టుగా ఈ సమయంలోనే (గతనెల 20న) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్, 21న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసిన కిషన్రెడ్డి.. ఇంత సులువుగా మీరు రేవంత్రెడ్డికి అప్పులు ఇస్తే తెలంగాణలో బీజేపీ ఉండాలా? మూసివేయాలా? అని తిరకాసు పెట్టడంతో రుణం విడుదల చేయకుండా కేంద్రం పీటముడి వేసుకుని కూర్చుంది.’ అని సీఎం ఆరోపించారు. ‘రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం ఎన్వోసీ ఇస్తే ఐఆర్ఎఫ్సీ నుంచి 4 శాతం వడ్డీతో మళ్లీ రూ.40 వేల కోట్ల రుణం తెచ్చుకుంటాం. మీ 50 శాతం నిధుల వాటా అవసరం లేదు..’ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు ‘ఎవరితో సంబంధం లేకుండా రేవంత్రెడ్డి 122 కి.మీ.ల మెట్రో కట్టుకుంటే మోదీ, కిషన్రెడ్డి, కేంద్ర ప్రభుత్వం గురించిన చర్చ ఉండదు. అప్పుడు రాజకీయంగా నష్టం వస్తుందనే ఆలోచనతో ఎక్కడికక్కడ ఛిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. ఖట్టర్ను కలవడానికి వెళ్లినప్పుడు కిషన్రెడ్డి నన్నెందుకు తీసుకునిపోడు? వరంగల్ ఎయిర్పోర్టు కొలిక్కి వచ్చాక కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడిని కలిసి ఏం మాట్లాడిండో ఎందుకు చెప్పడు? అశ్వినీ వైష్ణవ్ను కలిసి ఏం మాట్లాడిండో ఎందుకు చెప్పడు?..’ అని సీఎం నిలదీశారు. కేసీఆర్ వల్ల రూ.7 వేల కోట్ల నష్టం ‘నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి 2009లో మెట్రో రైలు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వైఎస్ అకాల మరణం తర్వాత నాటి సీఎం రోశయ్య రూ.15 వేల కోట్లతో 70 కి.మీ.ల కారిడార్తో 2017లోగా మెట్రో రైలు నిర్మాణం పూర్తి చేయడానికి ఎల్అండ్టీ సంస్థతో పీపీపీ విధానంలో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించారు. అయితే 2014లో కేసీఆర్ సీఎం అయ్యాక చారిత్రిక కట్టడాల పేరుతో మూడు మార్గాల్లో అలైన్మెంట్ మార్చాలని ఎడతెగని పేచీ పెట్టడంతో పనులు ఆలస్యమై 2020కి కానీ పూర్తి కాలేదు. మూడేళ్ల జాప్యంతో వ్యయం రూ.22వేల కోట్లకు పెరిగింది. షరతులపై షరతులు పెట్టిన కేంద్రం మెట్రో రైలు రెండో దశకు అనుమతి, నిధులివ్వాలని మేము అధికారంలోకి వచ్చాక ప్రధాని, కేంద్ర పట్టణాభివృద్ధి, రైల్వే, ఆర్థిక శాఖల మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశా. ఎల్అండ్టీని భాగస్వామిని చేస్తేనే అనుమతిస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ షరుతు పెడితే ఎల్అండ్టీ తిరస్కరించింది. గత ప్రభుత్వం పనులు స్తంభింపజేయడంతో రూ.7 వేల కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. ఎల్అండ్టీతో ఒప్పందం చేసుకోవాలంటూ కేంద్రం మరోసారి మెలిక పెట్టగా, ఆ సంస్థ మళ్లీ తిరస్కరించింది. దీంతో ఎల్అండ్టీ నుంచి మెట్రో రైలు కొనుగోలే ఏకైక ప్రత్యామ్నాయం అని కేంద్రం చెప్పింది. ఇందుకు ఎల్అండ్టీని ఒప్పించి, మంత్రివర్గంలో, అసెంబ్లీలో చర్చించి ఆమోదించాం..’ అని సీఎం వివరించారు. నేను అండగా ఉంటా కేసీఆర్ను భయపెట్టు ‘రెండో దశ విస్తరణకు 50శాతం నిధుల వాటా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుందని కిషన్రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవముంటే కాగితం చూపించాలి. తెలంగాణ తరఫున కేంద్ర కేబినెట్ ర్యాంకు మంత్రివి నువ్వు ఒక్కడివే. మంత్రివర్గం భేటీలో పీఎం మోదీతో నువ్వే మాట్లాడాలి. కేసీఆర్కు భయపడి, లొంగిపోయి కిషన్రెడ్డి వ్యవహరిస్తున్నారు. నేను నీకు అండగా నిలబడతా కేసీఆర్ను భయపెట్టు. కిషన్రెడ్డికి అంత తెలివి లేదు. ఆయన వెనుక కేటీఆర్ ఉన్నాడు. ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్ అపరిచితుడి వేషం వేసుకుని అందరినీ బెదిరించినట్టు.. ‘నీ సంగతి చూస్తా ’అని రామచందర్రావు నన్ను బెదిరిస్తుండు. నేను భడేభాయ్(మోదీ)ను కూడా కలిసా. కింద(రాష్ట్రంలో) సమస్యలుంటాయి..అవి ఏందో చూడు అన్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు చాలా మందిని కలిసి వచ్చిన. వారితో జరిగిన చర్చను బయటపెట్టడం అనైతికమని కొన్ని విషయాలు చెప్పుకోదలుచుకోలేదు..’ అని రేవంత్ అన్నారు. కేంద్రం ఎన్నో పార్టీలపై ఆధారపడి ఉంది.. హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రాజీనామా చేయాలని కిషన్రెడ్డి చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ‘మూడు ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీల్లో ఏదీ మోదీ అమలు చేయలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫిజికల్లీ హ్యాండీకాప్డ్ (వికలాంగ ప్రభుత్వం). ఎన్నో పార్టీలపై ఆధారపడి ఉంది. స్పష్టమైన మెజారిటీ లేదు. నాకు పూర్తి మెజారిటీ ఉంది. ఎవరిపై ఆధారపడలేదు. నన్ను రిజైన్ చేయమని అడిగే నైతిక హక్కు వారికి లేదు. అయినా మోదీ చేస్తే నేనూ రాజీనామా చేయడానికి సిద్ధం..’ అని సీఎం స్పష్టం చేశారు. -
ఫీజులు ఎందుకు పెంచాలి?
సాక్షి, హైదరాబాద్: మీరు కోరినంత ఫీజులు ఎందుకు పెంచాలి? అన్ని ఖర్చులూ విద్యార్థుల నుంచే వసూలు చేయడం సరైనదేనా? కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలున్నాయని చెప్పేందుకు ఆధారాలేంటి? మూడేళ్లుగా కొత్తగా తీసుకొచ్చిన లేబోరేటరీలెన్ని? లైబ్రరీలెన్ని?.. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు రాష్ట్ర ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ) వేసిన ప్రశ్నలివి. కోర్టు ఆదేశంతో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహారంపై ఎఫ్ఆర్సీ సోమవారం విచారణ చేపట్టింది. తొలిరోజు ఆరు కాలేజీల ప్రతినిధులు హాజరయ్యారు.వాస్తవానికి ప్రతి మూడేళ్ళకోసారి ఇంజనీరింగ్ ఫీజులను కమిటీ సమీక్షిస్తుంది. ఈ మేరకు 2025–26 విద్యా సంవత్సరంలో ఫీజులను ఖరారు చేసింది. అయితే కాలేజీల ఆడిట్ రిపోర్టులపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం గత ఏడాది ఫీజుల ఖరారును నిలిపివేసింది. తిరిగి విచారణ చేపట్టిన అనంతరం కొన్ని కాలేజీలకు ఫీజులు పెంచారు. మరికొన్ని కాలేజీలకు తగ్గించారు. దీంతో ఫీజులు తగ్గించిన కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన కోర్టు మరోసారి పరిశీలించాలని ఎఫ్ఆర్సీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా కాలేజీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుండగా.. ప్రభుత్వం కోర్టుకు నివేదించనుంది. నిర్వహణ ఖర్చు పెరిగింది: కాలేజీలు కాలేజీల నిర్వహణ ఖర్చు విపరీతంగా పెరిగిందని కాలేజీల యాజమాన్యాలు ఎఫ్ఆర్సీ ముందు వాదించాయి. తాజా ఆడిట్ రిపోర్టులను కమిటీకి అందించాయి. వీటిని పరిశీలించిన కమిటీ సభ్యులు పలు ఖర్చులపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఉద్యోగాల కోసం ఇచ్చే శిక్షణను, పాలనాపరమైన అవసరాలకు వెచి్చంచే మొత్తాన్ని, జాతీయ ర్యాంకుల కోసం ఖర్చు చేసే వ్యయాన్ని ఆడిట్లో పొందుపర్చడం సరికాదని అభిప్రాయపడినట్టు తెలిసింది. జాతీయ ర్యాంకులే రాని కాలేజీలు, ఫ్యాకల్టీ కోసం ఎంతమాత్రం ఖర్చు చేయని కాలేజీల వైఖరిని ప్రశ్నించినట్టు సమాచారం.అయితే మూడేళ్ళల్లో ఒకసారి ర్యాంకులు రానంత మాత్రాన దాన్ని కొలమానంగా తీసుకోవడం సరికాదని కాలేజీలు అంటున్నాయి. ప్రతి ఏటా బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు పెంచుతున్నామని, ఫీజులు తగ్గించడం వల్ల వేతనాల్లో కోత పెట్టాల్సిన పరిస్థితి వచి్చందని చెబుతున్నాయి. ఇప్పటికే నైపుణ్యం ఉన్న అధ్యాపకులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళారని కమిటీ దృష్టికి తెచ్చాయి. ప్రభుత్వానికి నివేదిస్తాం: ఎఫ్ఆర్సీ కాలేజీల అభిప్రాయాలను తెలుసుకున్న ఎఫ్ఆర్సీ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని యాజమాన్యాలకు తెలిపింది. ఆడిట్ నివేదికలను నిపుణుల పరిశీలనకు ఇవ్వాలని భావిస్తోంది. మంగళవారం మరికొన్ని కాలేజీల వాదన విన్న తర్వాత అన్నిటినీ నిపుణులకు అందజేయనుంది. అవసరమైతే అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీల ప్రతినిధులతో కలిసి కాలేజీలను తనిఖీ చేయాలని, మౌలిక వసతుల కల్పన, ఫ్యాకల్టీని పరిశీలించిన తర్వాత ఫీజులపై ఓ నిర్ణయానికి రావాలని ఎఫ్ఆర్సీ భావిస్తున్నట్టు తెలిసింది. -
సైన్యానికి హైదరాబాదీ డ్రోన్లు
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ సాంకేతికత అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్కు చెందిన డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ భారత సైన్యానికి తొలి విడతగా 41 జేకే–250ఈ రకం డ్రోన్లను అందజేసింది. రూ. 72 కోట్ల విలువైన రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ డ్రోన్లను నాసిక్లోని సదరన్ కమాండ్ అధికారులకు అందించినట్లు సంస్థ సీఈవో యశ్వంత్ బొంతు సోమవారం తెలిపారు. మిగిలిన డ్రోన్ల సరఫరాను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు దేశీయ రక్షణ తయారీ రంగాన్ని బలోపేతం చేయనుంది.డ్రోగో ఏరోస్పేస్ రూపొందించిన జేకే–250ఈ రకం డ్రోన్లు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 3 గంటలపాటు నిరంతరాయంగా గగనతలంలో ప్రయాణించగలవు. నిఘా, పర్య వేక్షణతోపాటు ఇతర సైనిక అవసరాలకు ఇవి ఉప యోగ పడతాయి. హైదరాబాద్లోని మాదాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్రోగో డ్రోన్స్ ఇటీవల తన పేరును డ్రోగో ఏరోస్పేస్గా మార్చుకుంది. డ్రోన్ తయారీ సంస్థ నుంచి సమగ్ర రక్షణ, ఏరోస్పేస్ సాంకేతికతల అభివృద్ధి, విమానాలు, ఉపగ్రహాలు, డ్రోన్లు, అంతరిక్ష నౌకల రూపకల్పన, తయారీ, నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిష్కారాలను అందించే సంస్థగా విస్తరించింది.రక్షణ, నిఘా వ్యవస్థలు, తదుపరి తరం మానవరహిత వైమానిక వ్యవస్థల అభివృద్ధిపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో డ్రోన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం డ్రోగో ఏరోస్పేస్కు నాలుగున్నర ఎకరాల భూమిని కేటాయించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ అత్యాధునిక తయారీ కేంద్రం ద్వారా డ్రోన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం సంస్థలో 300 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా కొత్త ప్లాంట్ ప్రారంభంతో మరో 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు యశ్వంత్ బొంతు వివరించారు. -
చందా కోత.. వాటా ఎగవేత!
భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో 73 మంది పనిచేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండర్, ఎల్రక్టీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, సబ్ స్టాఫ్ కేటగిరీలో 2023 ఆగస్టు నుంచి పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగులకు సంబంధించి 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకు ఏజెన్సీ ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించలేదు. దీంతో ఉద్యోగులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆ ఔట్సోర్సింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో చేర్చారు. ఆ తర్వాత మరో ఏజెన్సీని ఎంపిక చేశారు. ప్రస్తుత ఏజెన్సీ కూడా ఈ రెండు కేటగిరీల్లోని బకాయిలు, చందా చెల్లింపును నిలిపివేసింది. దీంతో వారి ఈఎస్ఐ, పీఎఫ్ పరిస్థితి గందరగోళంగా మారింది. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్య నిధి సంకటంలో పడింది. ఉద్యోగుల వేతనం నుంచి నెలవారీగా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేందుకు వీలు కల్పించే పీఎఫ్ ఖాతా లెక్కలు గాడి తప్పుతున్నాయి. పీఎఫ్ చందా చెల్లించడంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్లక్ష్య వైఖరి, తీవ్రమైన జాప్యం, పర్యవేక్షించాల్సిన అధికారుల ఉదాసీనత.. వెరసి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్ అవసరాల ఆసరాగా నిలిచే పీఎఫ్ పరిస్థితి ఆగమాగంగా మారింది.ఉద్యోగుల వాటా కింద క్రమం తప్పకుండా నగదు మినహాయించుకుంటున్న ఏజెన్సీలు ఈ మొత్తానికి సమానంగా తమ వాటా కలిపి ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సి ఉండగా నెలల తరబడి ఎగనామం పెడుతున్నాయి. ఈపీఎఫ్ ఖాతా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఉద్యోగులు.. ఈపీఎఫ్ వడ్డీ, సర్వీసు ఆధారిత పెన్షన్కు అర్హత, బీమా వంటి కీలక ప్రయోజనాలకు దూరం అవుతున్నారు. ఏజెన్సీల ఇష్టారాజ్యంరాష్ట్ర ప్రభుత్వంలోని 31 విభాగాల్లో 4,93,820 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కాకుండా, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమించుకుంటోంది. అయితే ఉద్యోగులకు వేతనాలను నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలకు కాకుండా ఏజెన్సీకి చెల్లించడం.. ఏజెన్సీ తిరిగి ఉద్యోగుల ఖాతాలో డబ్బు జమ చేయడం జరుగుతోంది. ఈ మధ్యవర్తిత్వ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేయడంతో పాటు వారికి నెలవారీగా చెల్లించాల్సిన పీఎఫ్ అలాగే ఈఎస్ఐ పథకాల చందాను కూడా సకాలంలో చెల్లించడం లేదు. పట్టించుకునేవారు లేకపోవడంతో ఆ మొత్తాన్ని ఏజెన్సీలు ఇష్టానుసారంగా వినియోగించుకుంటున్నాయని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత నష్టమో..! ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో నెలవారీగా చందా తప్పనిసరిగా జమ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీపై ఉంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మందికి నెలవారీగా చెల్లింపులు జరగడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. దీనివల్ల ఏటా ఈపీఎఫ్ఓ మంజూరు చేసే వడ్డీ జమ కావడంలో అవరోధాలు ఏర్పడతాయి. ⇒ పీఎఫ్ ఖాతాలో నగదు జమకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ క్రమం తప్పుతుండడంతో వాస్తవ వడ్డీ అందే పరిస్థితి ఉండదు. ⇒ జాతీయ బ్యాంకులు, ఇతర ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే అత్యధిక వడ్డీ ఇస్తున్న సంస్థ ఈపీఎఫ్ఓ. దీంతో ఉద్యోగికి ఆర్థికంగా నష్టం తీవ్రంగానే ఉంటుంది. ⇒ ఈపీఎఫ్ఓ అమలు చేసే మరో పథకం పెన్షన్. సర్వీసు పూర్తయిన తర్వాత ఈ పథకం అమలు కానున్నప్పటికీ... నెలవారీ చందా ఆధారంగానే సర్వీసును పరిగణనలోకి తీసుకుంటారు. చందా చెల్లింపు క్రమం తప్పకుండా జర గకపోతే సర్వీసు పరిగణనలో ఇబ్బందులెదురవుతాయి. ⇒ సర్వీసులో ఉన్న ఈపీఎఫ్ ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి రూ.7.5 లక్షల గరిష్ట బీమా నగదు అందుతుంది. కానీ చందా చెల్లించకపోవడం, చెల్లింపుల్లో జాప్యం నెలకొంటుండడంతో బీమా పథకానికి అర్హత ప్రశ్నార్థకంగా మారుతుంది. ⇒ ఈఎస్ఐ పరిధిలోని ఉద్యోగికి కేంద్ర కారి్మక శాఖ ద్వారా ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తారు. ఈఎస్ఐ ద్వారా అమలయ్యే ఈ పథకానికి ప్రతి నెలా క్రమం తప్పకుండా చందా జమ చేస్తేనే అర్హత సాధిస్తారు. ఎలాంటి జాప్యం నెలకొన్నా అర్హత కోల్పోతారు. అధికారుల నిర్లక్ష్యమే శాపం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన వేతన నిధులు సదరు శాఖాధిపతుల ద్వారా ఏజెన్సీకి విడుదల అవుతున్నప్పటికీ..అవి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సరైన విధంగా అందుతున్నాయో? లేదో? అనే పర్యవేక్షణ మాత్రం కనిపించడం లేదు. కేవలం నిధుల విడుదలకే పరిమితమవుతున్న అధికారులు.. ఆ తర్వాత ఏజెన్సీ ద్వారా జరగాల్సిన ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా ఉద్యోగులు లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే తప్ప అడుగు ముందుకు పడటం లేదు.ఏజెన్సీల ఎంపిక జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంతో శాఖాధిపతికి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉండడంతో ఫిర్యాదుల పరిష్కరానికి సుదీర్ఘ సమయం పడుతోంది. ఇక ఈపీఎఫ్ పథకం అమలుకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా ఈపీఎఫ్ఓలో ఫిర్యాదు చేయాలి. కానీ ఉద్యోగులకు దీనిపై సరైన అవగాహన ఉండటం లేదు. లిఖితపూర్వక ఫిర్యాదులపై తప్పకుండా స్పందిస్తామని ప్రావిడెంట్ ఫండ్ అధికారులు చెబుతున్నారు.⇒ ఎం.లలిత 2022 సంవత్సరం నుంచి నాగర్కర్నూల్ జిల్లా డిగ్రీ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్)గా పనిచేస్తున్నారు. అంతకు ముందు ఆమె నల్లగొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పని చేసేవారు. దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా ఆమె ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలో పైసా నిధి జమ కాలేదు. బదిలీ క్రమంలో ఆమె సర్వీసు ఒక ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో పీఎఫ్ బకాయిలు ఎవరు చెల్లిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. లలిత ఎన్నోసార్లు ఏజెన్సీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పీఎఫ్ చెల్లించకపోవడంతో తన నాలుగేళ్ల సర్వీసు కోల్పోతాననే ఆందోళనకు గురవుతున్నారు.⇒ కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెండేళ్ల పాటు వార్డు బాయ్గా పనిచేసిన కోలా అనుదీప్ అనారోగ్య కారణాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించాడు. అతని ఈపీఎఫ్తో పాటు ఈఎస్ఐ చందా ఏజెన్సీ చెల్లించకపోవడంతో ఇన్సూరెన్స్కు అర్హత లేకుండా పోయింది. దీంతో అతని కుటుంబం పెన్షన్ పథకానికి దూరమైంది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఏజెన్సీల దోపిడీపై ప్రత్యేక విచారణ చేయించాలిరాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపుల్లో చాలా సమస్యలున్నాయి. నెలవారీగా చేయాల్సిన చెల్లింపులు ఆర్నెల్ల కంటే ఎక్కువ జాప్యంతో జరుగుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వం నెలవారీగా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ... ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం ఇష్టానుసారంగా చెల్లింపులు చేస్తున్నాయి. పీఎఫ్ చెల్లింపుల్లో జాప్యం వల్ల ఉద్యోగులకు చేకూరాల్సిన ప్రయోజనాలు అందవు. ఈఎస్ఐ చెల్లింపులు ఆపితే ఉద్యోగికి వైద్య సదుపాయాలు నిలిచిపోతాయి. ఇది ఉద్యోగికి చాలా నష్టం కలిగిస్తుంది. దీనిపై ఫిర్యాదులు చేస్తున్నా అధికారుల నుంచి పెద్దగా స్పందన ఉండటం లేదు. ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా విచారణ చేపట్టాలి. ఏజెన్సీల అక్రమాలను వెలికితీయాలి. – పులి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం -
రిజిస్ట్రేషన్లు యథాతథం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఎప్ప టిలాగానే జరుగుతున్నాయని ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. వాస్తవంగా కూడా భూ ముల విలువల సవరణకు ముందు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలిస్తే పెద్దగా మార్పు ఏమీ లేదని అర్థమవుతోంది. సవరణకు ముందు రోజుకు సగటున ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగేవో, సవరణ తర్వాత కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో భూముల విలువలు సవరించిన తర్వాతి పరిస్థితులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. విలువల సవరణ జరిగి పదిరోజులు పూర్తవుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ కార్యకలాపాలు ఎలా ఉన్నాయన్న దానిపై ఆరా తీసింది.ఈ మేరకు నాలుగైదు రోజుల క్రితమే జిల్లా రిజిస్ట్రార్లకు సచివాలయం నుంచి సమాచారం వెళ్లింది. విలువల సవరణ అమల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత లావాదేవీలు ఎలా జరుగుతున్నాయన్న దానిపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారీగా వివరాలు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ రాజీవ్గాంధీ హన్మంతు కోరారు. ఈ నేపథ్యంలో విలువల సవరణ అనంతరం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కార్య కలాపాలు గాడిలో పడ్డాయని, సాంకేతిక సమస్యలన్నింటినీ అధిగమించామని అధికారులు తెలిపారు. తగ్గేదే లేదు..!స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారం ప్రకారం జూన్ నెలలో ఇప్పటివరకు 50 వేల లావాదేవీలు జరిగాయి. అయితే ఇందులో దాదాపు 24 వేల వరకు తొలి 4 రోజుల్లోనే జరిగాయి. భూముల విలువలు పెరుగుతాయన్న కారణంతో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లకు మొగ్గు చూపడంతో ఆ నాలుగు రోజులు భారీగా లావాదేవీలు జరిగాయి. భూముల విలువలు సవరించిన 10 రోజుల కాలంలో మరో 26 వేల లావాదేవీలు జరగడం గమనార్హం. సెలవు రోజులను మినహాయిస్తే రోజుకు సగటున 2,700 వరకు లావాదేవీలు అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.ఈ సంఖ్య గతంలో ప్రతిరోజూ జరిగే సగటు లావాదేవీలతో సమానంగా ఉందని, ఈ నేపథ్యంలో కొత్త విలువలు అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లలో పెద్దగా మార్పులేదని అర్థమవుతోంది. వ్యవసాయ భూముల విషయానికి వస్తే కొత్త విలువలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 18 వేల లావాదేవీలు జరిగాయి. అయితే మే నెలలో తొలి పదిరోజుల్లో కేవలం 13,500 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. -
‘టిమ్స్’కు కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పేదలకు చేరువ చేసే క్రమంలో ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూడు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులను సాధారణ మల్టీ స్పెషాలిటీ కేంద్రాలుగా కాకుండా, ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ హబ్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో టిమ్స్కు ఒక ప్రధాన స్పెషాలిటీని కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి అనుబంధంగా మరో కీలక విభాగాన్ని జోడించి మొత్తం ఆరు సూపర్ స్పెషాలిటీ సేవలను ఒక సమగ్ర వైద్య వ్యవస్థగా అందుబాటులోకి తేనుంది.నిమ్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి (అటానమస్) కలిగిన సంస్థలుగా ఈ టిమ్స్ ఆస్పత్రులను తీర్చిదిద్దుతూ, అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.మల్టీ–ఆర్గాన్ వ్యాధులపై ప్రత్యేక దృష్టిమారుతున్న జీవనశైలి, పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులను దృష్టిలో పెట్టుకొని, ఒకే అవయవానికి పరిమితమైన వైద్య సేవల కంటే పరస్పరం సంబంధం ఉన్న అవయవాల చికిత్సలను ఒకేచోట అందించాలనే ఆలోచనతో ఈ ప్రణాళిక రూపొందుతోంది. గుండె, కిడ్నీ, మెదడు, మానసిక ఆరోగ్యం, జీర్ణకోశం, మూత్రపిండాల వ్యాధుల మధ్య ఉన్న అనుసంధానాన్ని పరిగణనలోకి తీసుకొని కొత్త స్పెషాలిటీ కాంబినేషన్లను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది.సనత్నగర్ టిమ్స్కు కార్డియో–రీనల్ సెంటర్సనత్నగర్ టిమ్స్ను కార్డియాలజీతోపాటు నెఫ్రాలజీకి ప్రత్యేక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. గుండె జబ్బులతో బాధపడే అనేక మందిలో కిడ్నీ సమస్యలు కూడా ఉండటంతో ఈ రెండు విభాగాల సేవలు ఒకేచోట అందితే రోగులు వేర్వేరు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అత్యాధునిక కార్డియాక్, డయాలసిస్ సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులోకి రానున్నాయి. అల్వాల్ టిమ్స్లో న్యూరో–మెంటల్ కేర్అల్వాల్ టిమ్స్ను న్యూరాలజీతోపాటు సైకియాట్రీ లేదా జెరియాట్రిక్స్ సేవలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. స్ట్రోక్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులతో బాధపడే రోగులకు మానసిక, పునరావాస సేవలు కూడా అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో సమగ్ర న్యూరో కేర్ అందించేలా ప్రణాళిక రూపొందుతోంది.కొత్తపేట టిమ్స్లో గ్యాస్ట్రో–యూరో కాంబినేషన్కొత్తపేట టిమ్స్లో గ్యాస్ట్రో ఎంటరాలజీతోపాటు యూరాలజీ సేవలను అందుబాటులోకి తేనున్నారు. జీర్ణకోశ వ్యాధులు, కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్, మూత్రనాళ సమస్యలకు సంబంధించిన అత్యాధునిక చికిత్సలు ఒకే కేంద్రంలో లభించనున్నాయి.గాంధీ, ఉస్మానియా, నిమ్స్పై తగ్గనున్న ఒత్తిడిఈ మూడు టిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నిమ్స్లపై ఉన్న రోగుల భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. జిల్లాల నుంచి వచ్చే రిఫరల్ కేసులను ఆయా వ్యాధుల స్పెషాలిటీని బట్టి నేరుగా టిమ్స్లకు తరలించే విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో రోగులకు వేగంగా చికిత్స అందడంతోపాటు పెద్ద ఆస్పత్రుల్లో రద్దీ కూడా తగ్గనుంది.మెడికల్ టూరిజంపై సర్కారు ఫోకస్హైదరాబాద్ను అంతర్జాతీయ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మెడికల్ టూరిజంపైనా దృష్టి సారించింది. మూడు టిమ్స్లలో విదేశీ రోగుల కోసం ఒక్కో ఆస్పత్రిలో 50 పడకల ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఆధునిక మౌలిక వసతులతో విదేశీ రోగులను ఆకర్షించడం ద్వారా తెలంగాణను గ్లోబల్ హెల్త్ హబ్గా నిలబెట్టే వ్యూహానికి ప్రభుత్వం పదును పెడుతోంది. -
ఎస్ఐఆర్... ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
హిమాయత్నగర్ (హైదరాబాద్): ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ విమర్శించారు. ఎస్ఐఆర్ ద్వారా ప్రభు త్వం ఓటర్లను ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతోందని, ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధమన్నారు. ఈ ప్రక్రియ రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ నైతికతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశా రు.బలహీన వర్గాల ఓటు హక్కుకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేకమైన, శాస్త్రీయత లేని ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను అమలు చేసిన తీరు వల్ల తన విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. సోమవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహించారు. ప్రజాస్వామ్యవాదులు అడ్డుకోవాలి: కూనంనేని ఎస్ఐఆర్ పేరిట దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కూనంనేని ఆరోపించారు. ఓట్ల తొలగింపే ప్రధాన ఎజెండాగా ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారని, దీనికి సూత్రధారులు ఢిల్లీలోని కేంద్ర పాలకులేనని విమర్శించారు. తెలంగాణలో 80 లక్షల వరకు దొంగ ఓట్లు గుర్తించామని చెబుతున్నారని, ఆ పేరుతో చెల్లుబాటయ్యే ఓట్లను కూడా తొలగించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కు అని చెప్పారు. ఎన్నికల జాబితాల తయారీ, సవరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఓటర్ల పేర్లను తొలగించే ముందు సహజ న్యాయ సూత్రాలను పాటించాలని, ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఉండాలని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు అ«దీనంలోకి తెచ్చుకునేందుకే... భావప్రకటన స్వేచ్ఛను వినియోగించి ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసులు నమోదు చేశారని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆరోపించారు. ప్రశ్నించే వారిని కేసులతో భయపెట్టే ధోరణి పెరుగుతోందని చెప్పారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. అలాగే మీనాక్షి నటరాజన్ నామినేషన్ను కేసులు లేకున్నా తిరస్కరించిన ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర పాలకులు తాము చేసేదే శాసనమనే భావనలో ఉన్నారని ధ్వజమెత్తారు.రాజ్యాంగ వ్యవస్థలను తమ అ«దీనంలోకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఎస్ఐఆర్ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఎన్నికల సంఘం చర్యలు రాజకీయ పక్షపాతం లేకుండా ఉండాలని, ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఎన్నికల సంస్కరణలు అమలు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ నేత తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు. -
వేగం లేని వాహన్ం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రవాణా శాఖ సేవలకు ఆన్లైన్లో దాదాపు 28 వేల స్లాట్స్ బుక్ కాగా,సర్వర్ డౌన్ కావడంతో అధికారులు చేతులెత్తేశారు. సోమవారం నాటి స్లాట్స్ను మంగళవారానికి మార్చామని చెప్పడంతో వేల మంది ఉసూరుమంటూ వెనుతిరిగారు. ఇది ఏ ఒక్కరోజో జరుగుతున్న తతంగం కాదు.. ఇటీవల కాలంలో తరచూ సర్వర్ మొరాయిస్తుండటంతో రవాణాశాఖలో వాహనదారుల లావాదేవీలకు పదేపదే తీవ్ర అంతరాయం కలుగుతోంది. కానీ ఈ సాంకేతిక సమస్యను సరిచేయడం రాష్ట్రపరిధిలో లేదు. సామర్థ్యాన్ని మించి భారం... ఇటీవలి వరకు తెలంగాణ రవాణా శాఖ ఆన్లైన్ సేవలు పూర్తి గా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉండేవి. కానీ తాజాగా కేంద్ర రవాణాశాఖ అధీనంలోని వాహన్–సారథి క్లౌడ్ డేటాబేస్ అధీనంలోకి రాష్ట్రం వెళ్లింది. దేశవ్యాప్తంగా రవాణా సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ‘వాహన్–సారథి’కేంద్రీకృత క్లౌడ్ సాఫ్ట్వేర్ (వెర్షన్ 4.0)ను ప్రారంభించింది. ఇందులో తెలంగాణ ఆరు నెలల క్రితమే చేరింది. ఇప్పుడు రవాణాశాఖ సేవలన్నీ ఈ వాహన్–సారథి క్లౌడ్ పోర్టల్ ద్వారానే జరుగుతున్నాయి.సాధారణంగా రోజుకు సగటున రెండున్నర కోట్ల లావాదేవీలను తట్టుకునే ప్రాథమిక సామర్థ్యంతో దీన్ని డిజైన్ చేశారు. కానీ అన్ని రాష్ట్రాలు దీనిలోనే అనుసంధానమై ఉండటంతో పీక్ అవర్స్లో సర్వర్పై లోడ్ దాని సాధారణ పరిమితి కంటే 4 రెట్లు పెరుగుతోంది. సెకనులో లక్షల మంది యూజర్లు ఆధార్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ అప్ లోడ్, ఫీజుల చెల్లింపు తదితర లావాదేవీలు చేస్తుండటంతో సర్వర్లలోని డేటాబేస్ క్వెరీలు లాక్ అయిపోయి వెబ్సైట్ పూర్తిగా స్తంభించిపోతోంది.ఫలితంగా అన్ని రాష్ట్రాల్లో 100కుపైగా రవాణా శాఖ సేవలు అందించలేని పరిస్థితి నెలకొంటోంది. భారీ ట్రాఫిక్ను తట్టుకునేలా ఏపీఐ ఇంటిగ్రేషన్ ఉన్నా, కొన్ని భద్రతా లేయర్లు, పేమెంట్ గేట్ వేలు స్లోగా ఉండటం వల్ల సర్వర్ రెస్పాన్స్ టైమ్ పెరిగిపోతోంది. ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ క్లౌడ్ డేటాబేస్ను పర్యవేక్షిస్తుండటం వల్ల తెలంగాణలో సమస్య తలెత్తినా దాన్ని ఎన్ఐసీ సరిదిద్దాల్సిన పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు... ఇటీవల నిపుణుల కమిటీతో సమీక్షలు జరిపి చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఉన్న ఒకే నేషనల్ క్లౌడ్పై భారం తగ్గించడానికి, అదనపు లార్జ్స్కేల్ క్లౌడ్ సర్వర్లలోకి డేటాను విభజించే ప్రక్రియను ప్రారంభించింది. దేశాన్ని నాలుగు జోన్లుగా విభజించి ప్రాంతీయంగా లోడ్ బ్యాలెన్సర్ సర్వర్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల దక్షిణాదిలో ట్రాఫిక్ ఒత్తిడి ఢిల్లీ ప్రధాన సర్వర్పై నేరుగా ప్రభావం చూపకుండా స్థానిక జోనల్ సర్వర్లే నియంత్రిస్తాయి.పీక్ అవర్స్లో యూజర్ల సంఖ్య పెరిగినప్పుడు దానంతట అదే సర్వర్ సామర్థ్యాన్ని తాత్కాలికంగా పెంచుకునే ఆటో–స్కేలింగ్ ఫీచర్ను సాఫ్ట్వేర్లో అప్గ్రేడ్ చేస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రివేళల్లో ప్రత్యేక షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ నిర్వహిస్తూ పాత డేటాను ఆరై్కవ్ చేస్తోంది. ఏకకాలంలో ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు యూఐడీఏఐ సర్వర్లతో బ్యాండ్విడ్త్ను పెంచుతోంది. -
అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘ట్రంప్’ పేరు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేరిట నామకరణం చేశారు. గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేసిన ఈ రోడ్డును ఈ నెల 23న సీఎం అధికారికంగా ప్రారంభిస్తారు. భారతదేశంలో అమెరికా రాయ బారి సెర్జియో గోర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. జూలై 4న జరిగే అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ నెల 23న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.హైదరాబాద్ను ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ సంస్థలను గౌరవించే సాంప్రదాయంలో భాగంగా ట్రంప్ పేరిట నా మకరణం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించా యి. ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థల సేవల ను గుర్తిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల పేర్లతో కూడా రహదారులకు నామకరణం చేసే ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తు న్నట్లు సమాచారం.తెలంగాణను ఆవిష్కరణల కు కేంద్రంగా, ప్రపంచ ఐటీ రంగానికి ప్రతీకగా నిలబెట్టడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమ ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ఢిల్లీలో జరిగిన యూఎస్–ఇండియా వ్యూహాత్మ క భాగస్వామ్య వేదిక (యూఎస్ఐఎస్పీఎఫ్) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను వెల్లడించారు. -
‘టికెట్ దొంగ’ ఎవరు!
సాక్షి, హైదరాబాద్: అతను ఆర్టీసీలో కండక్టర్. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసుకుని టికెట్ జారీ చేయలేదు. తనిఖీ సిబ్బంది పట్టుకుని కేసు నమోదు చేశారు. దీంతో విచారణ జరిపిన అధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఇంకో ఘటనలో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ సిబ్బంది సోదా చేశారు. ఓ ప్రయాణికుడి వద్ద టికెట్ లేదు. తాను డబ్బులిచ్చినా కండక్టర్ టికెట్ ఇవ్వలేదని అతను బుకాయించాడు.తోటి ప్రయాణికులను విచారించగా, అతను టికెట్ తీసుకోలేదని, కండక్టర్కు డబ్బు ఇచ్చిన విషయం వాస్తవం కాదని తేలింది. దీంతో అతనికి ఫైన్ విధించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో ఇలాంటివి తరచూ వెలుగు చూస్తున్నాయి. ప్రయాణికుల వద్ద టికెట్ లభించని తరుణంలో విచారణ జరిపితే కొన్ని సందర్భాల్లో కండక్టర్లదే తప్పని, మరికొన్ని సందర్భాల్లో ప్రయాణికులే దోషులని తేలుతోంది. ఆర్టీసీ ఇప్పుడీ అంశం చర్చనీయాంశమయ్యింది. కండక్టర్ల ఉద్యోగ భద్రతపై కార్మీక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఈడీల భేటీలో తీవ్ర చర్చ కొందరు ప్రయాణికులు డబ్బులు మిగుల్చుకునేందుకు టికెట్ తీసుకోవడం లేదని, చెకింగ్ సిబ్బంది వచ్చినప్పుడు కండక్టర్పై నిందమోపుతున్నారని, ఇది కండక్టర్ల ఉద్యోగ భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని కార్మీక సంఘాలు చెబుతున్నాయి. ఆర్టీసీలో కూడా రైల్వే తరహా విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్ లేని పక్షంలో ప్రయాణికులనే బాధ్యులను చేయాలనేది వారి వాదన. రెండు రోజుల క్రితం ఈడీల కమిటీతో జరిగిన చర్చలో కూడా ఇది ప్రధాన అంశంగా మారింది. కార్మీకుల సమ్మె డిమాండ్లపై చర్చించి పరిష్కరించే క్రమంలో ప్రభుత్వం ఈడీలతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.కాగా కమిటీ భేటీ మూడున్నర గంటలపాటు జరిగితే, కండక్టర్ ఉద్యోగ భద్రతకు ముప్పుగా మారిన ‘టికెట్’అంశంపైనే గంటపాటు చర్చించడం గమనార్హం. అయితే కమిటీ ఇందుకు వెంటనే ఆమోదం తెలపలేదు. ఇలాంటి ఘటనలపై క్షేత్రస్థాయి సిబ్బంది అనుభవాలు, డిపో మేనేజర్ల దృష్టికి వచ్చిన ఉదంతాలు తదితరాలు పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఉండే మరో కమిటీని నియమిస్తామని పేర్కొనటం విశేషం. ఎందుకింత ఆందోళన? గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అవకతవకలకు కారకులయ్యారనే కారణంతో దాదాపు 1,000 మందికి పైగా ఉద్వాసనకు గురయ్యారు. వీరిలో సగం మంది కండక్టర్లే కావడం గమనార్హం. అయితే తాము చేయని తప్పునకు ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని, ప్రయాణికులు టికెట్ తీసుకోకుండా తమపై నేరం మోపారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కొందరు కండక్టర్లు ఉద్దేశపూర్వకంగానే టికెట్లు ఇవ్వడం లేదని, దూర ప్రాంత బస్సుల్లో కొన్ని సందర్భాల్లో టికెట్ జారీ చేయకుండా ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసు కుని స్వాహా చేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.ఈ విధంగా నేరం గుర్తించిన వారిని మా త్రమే ఉద్యోగాల నుంచి తొలగించామని చెబుతున్నారు. అయితే ఉద్వాసనకు గురైనవారు పలుమా ర్లు ప్రభుత్వానికి విన్నవించుకోవటంతో దాదాపు 300 మందికి తిరిగి ఉద్యోగాలిచ్చారు. ప్రయాణికులకు టికెట్ జారీ చేయాల్సిన బాధ్యత కండక్టర్లదేనని, టికెట్ ఇవ్వని పక్షంలో ప్రయాణికులు డిమాండ్ చేసి మరీ తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో బస్సులో రద్దీ కారణంగా టికెట్ తీసుకోని వారిని గుర్తించే పరిస్థితి ఉండదని కార్మీక సంఘాలు చెబుతున్నాయి. కండక్టర్లు–ప్రయాణికులు మిలాఖత్! కొందరు కండక్టర్లు–ప్రయాణికులు మిలాఖత్ అయి టికెట్ జారీ కాకుండా ఆర్టీసీని నష్టపరుస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. టికెట్ చార్జీలో సగం మాత్రమే వసూలు చేస్తున్న కొందరు కండక్టర్లు దాన్ని జేబులో వేసుకుంటున్నారు. తనకు సగం డబ్బులు మిగులుతున్నాయన్న ఉద్దేశంతో ప్రయాణికులు టికెట్ తీసుకోవటం లేదు. తనిఖీ జరిగినప్పుడు ఇది కండక్టర్ ఉద్యోగానికి ముప్పు తెస్తోంది. ఆర్టీసీకి నష్టం జరుగుతోందనేది ఒక అంశం కాగా కార్మిక సంఘాలు కండక్టర్ల ఉద్యోగ భద్రత అన్న కోణంలో ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో దీనిపై కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది. -
భట్టి బర్త్డే: ఓయూ విద్యార్థులకు స్టడీ చైర్ల పంపిణీ
హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు స్టడీ చైర్లను పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పాటు అందించడం, మెరుగైన అధ్యయన వాతావరణాన్ని కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.ఈ కార్యక్రమాన్ని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్టీఎఫ్) మరియు బీసీ విద్యార్థులు, ఉద్యోగులు, మేధావుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సంయుక్తంగా నిర్వహించాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా పోటీ పరీక్షలు మరియు ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన అధ్యయన సౌకర్యాలను అందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, భట్టి విక్రమార్క సామాజిక న్యాయం, విద్యా అభివృద్ధి, వెనుకబడిన మరియు అణగారిన వర్గాల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. సమాన అవకాశాల సమాజ నిర్మాణానికి విద్యలో పెట్టుబడి అత్యంత కీలకమని వారు పేర్కొన్నారు. -
పసిపాపతో మహిళ బిల్డింగ్పై నుంచి దూకిన కేసు.. భర్తకు రిమాండ్
హైదరాబాద్: హైదరాబాద్లో ఇటీవల హృదయవిదారక ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒక తల్లి గుండెల్లో దాగిన బాధ ఎంత లోతుగా ఉంటుందో బయటివారికి కనిపించకపోవచ్చు. కానీ ఆ బాధ ఓ కుటుంబాన్నే శోకసంద్రంలో ముంచేసేంత తీవ్రంగా మారితే? అదే జరిగింది. మియాపూర్లో ఇటీవల జరిగిన ఓ ఘటనలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం అందరినీ కలచివేస్తుండగా, ఆమె పసిపాప భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు తాజాగా ఆమె భర్తను రిమాండ్కు తరలించారు.కేసు ఏంటి? ఓ మహిళ తన ఆరు నెలల పాపతో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మియాపూర్లోని మయూరి నగర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ వద్ద చోటుచేసుకుంది. తన ఆరు నెలల పాపతో ఆరో అంతస్తు నుంచి దూకిన ఈషా సాహు (37) అక్కడికక్కడే మృతిచెందగా, గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆమె పాప. రెండో కూతురు పుట్టిందని ఈషా సాహును భర్త భూపేంద్ర సాహు వేధించడమే ఈ ఘటనకు కారణమని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి భూపేంద్ర సాహును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
‘బీజేపీ అంటే సీఎం రేవంత్ భయపడుతున్నారు’
హైదరాబాద్: తమ పార్టీ అంటే సీఎం రేవంత్రెడ్డి భయపడిపోతున్నారన్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు ఎద్దేవా చేశారు. అందుకే కిషన్రెడ్డిని, బీజేపీని టార్గెట్ చేస్తున్నారన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. సాక్షి టీవీతో మాట్లాడిన రాంచందర్రావు.. హైదరాబాద్ వ్యక్తిగా కిషన్రెడ్డితో పాటు తాసు కూడా ఇక్కడ అభివృద్ధి కోరుకుంటామని, రేవంత్కు హైదరాబాద్ అభివృద్ధి జరగాలని లేదని విమర్శించారు. బీజేపీ బలం పుంజుకుంటోందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వదు. మీరు టెక్నికల్ గా తప్పులు ఇస్తే తప్ప. మీ చేతగాని తనాన్ని మా మీద తోయాలని చూస్తున్నావు. మోదీ గురించి మాట్లాడే స్థాయి రేవంత్ది కాదు. మోదీ ముందు రేవంత్ చిన్నపిల్లాడు. రాష్ట్రంలో అసలు పాలన ఎక్కడుంది. సీఎం మాట ఎవరు వినట్లేదు’ అని ఆరోపించారు. -
‘కాంగ్రెస్ రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడింది’
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరిగా జరగలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజనలో కాంగ్రెస్ రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మవంచనతో పనిచేస్తుందని విమర్శించారు. ఏపీ విభజనలో వారసత్వపు ఆస్తుల వివాదాలు ఇంకా అలానే ఉన్నాయని, తెలంగాణలో తన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. 12 ఏళ్లు అయినా ఇప్పటికీ తెలంగాణ అమరులను గుర్తించలేదన్నారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఈరోజు( సోమవారం, జూన్ 15వ తేదీ) పవన్ అంతకుముందు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని విమర్శించారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఆ సినీనటుడు తెలుసుకోవాలంటూ ధ్వజమెత్తారు. ‘ఎవరో ఉప్పందిస్తే పవన్ మాట్లాడడం మానుకోవాలి. ఇదేం సినిమా కాదని పవన్ కల్యాణ్ గుర్తు పెట్టుకోవాలి. విభజన గురించి మాట్లాడడమంటే వ్యతిరేకించినట్లే’’ అని చెప్పారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు
హైదరాబాద్: బాల్య వివాహాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మంత్రి సీతక్క సమక్షంలో ప్రభుత్వం, తరుణి సంస్థ మధ్య ఎంఓయూ కుదిరింది. బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల నివారణే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది. ‘‘బాల్య వివాహం-బతుకు ఆగం’’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనుంది ప్రభుత్వం.సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... ‘‘బాల్య వివాహం కుటుంబ సమస్య మాత్రమే కాదు.. సామాజిక సమస్య. బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. బాల్య వివాహాల వల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోతుంది. బాల్య వివాహాలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. బాలికల ఆర్థిక స్వావలంబనపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ‘బాల్య వివాహం–బతుకు ఆగం’ నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని మరింత విస్తరిస్తాం. బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు చేపడతాం. బాలికలకు హక్కులు, ఆరోగ్యం, విద్యపై అవగాహన కల్పిస్తాం. క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు అందిస్తాం. బాల్య వివాహాల దుష్పరిణామాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. బాలికల విద్య, ఆరోగ్యం, సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి బాలిక తన కలలను సాకారం చేసుకునే వాతావరణం కల్పించాలి. బాల్య వివాహాలకు ముగింపు పలకడానికి అందరూ కలిసి పనిచేయాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం సమష్టిగా ముందుకు రావాలి’’ అని పిలుపునిచ్చారు. -
ఆ సినీనటుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర విభజన గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.మహేశ్కుమార్ గౌడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని విమర్శించారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఆ సినీనటుడు తెలుసుకోవాలంటూ మండిపడ్డారు.‘‘ఎవరో ఉప్పందిస్తే పవన్ మాట్లాడడం మానుకోవాలి. ఇదేం సినిమా కాదని పవన్ కల్యాణ్ గుర్తు పెట్టుకోవాలి. విభజన గురించి మాట్లాడడమంటే వ్యతిరేకించినట్లే’’ అని చెప్పారు. కాగా, పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరుపై తెలంగాణ నేతల నుంచి కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. -
ఇన్స్టాగ్రామ్లో చీర ఆర్డర్.. రీఫండ్ లింక్తో రూ.37 వేల టోకరా
హైదరాబాద్: ఇన్స్ట్రాగామ్ పేజీలో ఆకర్షణీయమైన ఓ చీరకు ఆర్డర్ పెడితే యువతిని సైబర్ మోసగాళ్లు లింక్ పంపించి ఖాతా ఖాళీ చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరిలో నివసించే ఓ మహిళ ఇన్స్ట్రాగామ్ పేజీ చూసి ఓ చీరను ఆర్డర్ చేసింది. అయితే చీర డెలివరీ కాకపోవడంతో వెంటనే సంబంధిత విక్రేతకు ఫోన్ చేసింది. వెంటనే అవతలి వ్యక్తి నుంచి హైదరాబాద్ సిల్క్ శారీస్ పేరుతో రీఫండ్ లింక్ వచ్చింది. ఇది నమ్మిన ఆమె వెంటనే లింక్ నొక్కగా కొద్దిసేపట్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. దీంతో బాధితురాలు వెంటనే సిమ్కార్డును బ్లాక్ చేసింది. అప్పటికే సైబర్ మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.37,447 ఖాళీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కోరిక తీర్చాలంటూ నటికి వేధింపులు.. కేసు నమోదు!
సాక్షి, హైదరాబాద్: సినిమాల్లో నటించినందుకు పారితోషికం ఇవ్వకుండా లైంగికంగా వేధించడంతో పాటు చంపేస్తానని బెదిరించిన కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మేడిపల్లికి చెందిన ఒక యువతి(21) సినీనటిగా రాణిస్తోంది. ఓ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర కోసం ప్రసాద్ ఆమెను సంప్రదించాడు. అందుకు రూ.90 వేల పారితోషికం ఇస్తామని చెప్పాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత తన పారితోషికం పాటు క్యాబ్ ఖర్చులు రూ. 30 వేలు ఇవ్వాలని సదరు నటి ప్రసాద్ని కోరింది. డబ్బుల విషయంమై మాట్లాడడానికి ఫిబ్రవరి 18న సాగర్ సొసైటీకీ పిలిపించిన ప్రసాద్, ఆమెను బలవంతంగా కారు ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు లొంగిపోతే మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానని వేధించాడు. దీంతో బాధితురాలు తప్పించుకుంది. నటి తల్లి కూడా ప్రసాద్ను నిలదీయగా..డబ్బులు ఇచ్చేది లేదని, గతంలోనూ ఇలాగే యువతులను వాడుకొని రూ. 3 కోట్లు సంపాదించానని నిర్లక్ష్యంగా మాట్లాడాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తల్లీ, కూతుళ్లను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొన్నం సమక్షంలో ఎంపీ చిందులు
తెలంగాణ వ్యాప్తంగా బడి గంట మోగిన వేళ.. విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ వేదిక ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార కార్యక్రమం సాఫీగా సాగుతుందని అందరూ అనుకుంటున్న సమయంలోనే.. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపింది. అసలు ఏం జరిగిందన్న ఆసక్తి వేదిక వద్దే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.సాక్షి, హైదరాబాద్: రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు అల్పాహార పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రోటోకాల్ అంశం వివాదాస్పదంగా మారింది.స్థానిక రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్కు కార్యక్రమం గురించి అధికారులు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నేరుగా కార్యక్రమానికి హాజరై మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కొద్దిసేపు కార్యక్రమంలో రాజకీయ వేడి కనిపించింది.అనంతరం అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా, పౌష్టికాహారంతో ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుమారు రూ.800 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారంతో పాటు పాలు, రాగిజావ అందజేస్తున్నామని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల డ్రాప్అవుట్ రేటును తగ్గించడంతో పాటు విద్యను ప్రోత్సహించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్య నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.హైదరాబాద్ నగర వ్యాప్తంగా తొలి దశలో 42 ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.అయితే విద్యార్థుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమం కంటే.. కార్యక్రమం ప్రారంభానికి ముందే చెలరేగిన ప్రోటోకాల్ వివాదమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి సమక్షంలోనే ఎంపీ అధికారులను నిలదీయడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. -
భర్తను వదిలి రా.. మనం పెళ్లి చేసుకుందాం..!
హైదరాబాద్: తనను పెళ్లి చేసుకోవాలంటూ వివాహితను వేధిస్తున్న ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా అంకిరావుపల్లె గ్రామానికి చెందిన డేగరాజు (25), ఫిలింనగర్లో నివాసముంటున్న ఒక వివాహిత (24)ను కొంతకాలంగా ఫోన్ ద్వారా వేధిస్తూ అసభ్యకర మెసేజ్లు పంపుతున్నాడు. భర్తను వదిలి తనతో రావాలని, పెళ్లి చేసుకోవాలని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన కదలికలను గమనిస్తూ, దారిపొడవునా అడ్డగిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. నిందితుడి వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు డేగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సోదరి అదృశ్యంపై గద్వాల్ విజయలక్ష్మి ఫిర్యాదు
బంజారాహిల్స్ (హైదరాబాద్): తన సోదరి కనిపించడం లేదంటూ గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అదృశ్యమైన మహిళ కోసం గాలింపు చేపట్టారు. వివరాలివి. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని కమాన్లో నివసించే మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోదరి కె.నమ్రత (57) ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆమె కోసం అన్ని ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ దొరక్కపోవడంతో మాజీ మేయర్ తన సోదరి కనిపించడం లేదంటూ ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేశారు. సతీశ్ (35), సత్యనారాయణ (45), కుమారి (45) తదితరులపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో విజయలక్ష్మి అనుమానం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సింగరేణిపై రాజకీయాలెందుకు?
శ్రీరాంపూర్: సింగరేణిని రాజకీయాల కోసం వాడుకోవద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి దుద్దిళ్ల« శ్రీధర్బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావుతో కలిసి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని ఆదివారం ఆయన సందర్శించారు. సంస్థపై వస్తున్న ఆరోపణలు ఖండించేందుకు సంస్థ అధికారులతో అక్కడే మీడియా సమక్షంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. సింగరేణిపై జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని అవాస్తవాలను ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి పొందుతున్నారన్నారు. కార్మికుల శ్రమ, వారి ఆత్మగౌరవాన్ని చులకన చేసేలా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. బొగ్గు పెళ్ల కూడా పోలేదు..... బొగ్గు పెళ్ల కూడా దొంగతనంగా బయటకు పోలేదని సింగరేణి అధికారులు తెలిపారు. ఓపెన్హౌస్లో భాగంగా సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు, ఏరియా జీఎం శ్రీనివాస్ డిప్యూటీ సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. బొగ్గు లోడిండ్ మొదలు, రవాణా వరకు అన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని, దీని కోసం వీటీఎస్, జీపీఎస్ టెక్నాలజీని వాడుతున్నామని తెలిపారు. శాప్ సిస్టం ద్వారా ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. దీన్ని కాదని బొగ్గు పెళ్ల కూడా బయటకు పోదన్నారు.ఇటీవల వచ్చిన ఆరోపణలను వారు మీడియా సమక్షంలో ఖండించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్జ్యోతి, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి.జనక్ప్రసాద్, డైరెక్టర్లు గౌతమ్ పొట్రు, ఎల్వీ సూర్యనారాయణ , కొప్పుల వెంకటేశ్వర్లు, తిరుమల్రావు, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రం, సేఫ్టీ జీఎం రవికుమార్, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి సీహెచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాల మోడల్మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణ ప్రగతి అద్భుతంగా ఉందని, 50 ఏళ్లకు సరిపడేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇదే మోడల్ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు నివాసంలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్బాబుతో కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే పట్టుబట్టి నిధులు తీసుకొచ్చి రోడ్ల విస్తరణ, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులతోపాటు, ఇండస్ట్రియల్ పార్కు, ఐటీ హబ్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పాఠశాలలు, కళాశాలల నిర్మాణం చేపడుతున్నారని వివరించారు. ఇవి అద్భుతంగా ఉన్నాయని, ఇక్కడ జరిగే అభివృద్ధిని ఒక మోడల్గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
లోకో భిన్నరుచి.. ఏఐతో గుదిగుచ్చి...
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు ఇడ్లీ–సాంబార్, ఫిల్టర్ కాఫీకి ఫేమస్.. హైదరాబాద్ పేరు చెప్పగానే నోరూరించే దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. ఇలా దేశంలోని వేర్వేరు ప్రాంతాల ప్రత్యేక రుచులు, వంటకాలు, విభిన్న తయారీ పద్ధతులకు డిజిటల్ రూపం ఇచ్చేందుకు భాగ్యనగరం వేదికగా కసరత్తు జరుగుతోంది. ఆయా వంటకాల్లోని పదార్థాల కల యిక, వంట విధానం సహా ప్రాంతానికో రుచి కలిగిన భారతీయ రుచులను సాంకేతికంగా గుర్తించేందుకు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పరిశోధన సాగుతోంది. ఇండియన్ ఫుడ్ మ్యాప్ తయారీ లక్ష్యంగా ప్రొఫెసర్ సీవీ జవహర్ సారథ్యంలో జరుగుతున్న ఈ అధ్యయనంలో కంప్యూటర్ విజన్, ఏఐ సాంకేతికతలను ఉపయోగించి భారతీయ ఆహార ప్రత్యేకతలను పరిశోధక బృందం విశ్లేషిస్తోంది.థాళీ... భళీ...ఈ ప్రాజెక్టులో భాగంగా పరిశోధకులు తొలుత భారతీయ థాళీ’పై అధ్యయనం ప్రారంభించారు. సాధారణంగా భారతీయ భోజనంలో అన్నం, పప్పు, కూరలు, రొట్టెలు, పెరుగు, పచ్చళ్లు వంటి అనేక పదార్థాలు కలిసిపోవడం వల్ల వాటి పోషక విలువలను గుర్తించడం ప్రస్తుత యాప్లకు కష్టమవుతోంది. పాశ్చాత్య దేశాల ఆహారాన్ని గుర్తించేందుకు తయారైన చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్లు భారతీయ వంటకాల వైవిధ్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదని పరిశోధకులు గుర్తించారు. దీనికి పరిష్కారంగా జీరో–షాట్ ఏఐ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత కొత్త వంటకాలను ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే గుర్తించి, విశ్లేషిస్తుంది.బిర్యానీపై స్పెషల్ స్టడీహైదరాబాదీ, అవధీ, అంబూర్, కోల్కతా వంటి బిర్యానీ రకాల్లో ఉపయోగించే మసాలాలు, వంట దశలు, పదార్థాల మార్పులను ఏఐ ప్రత్యేకంగా విశ్లేషిస్తోంది. ఈ ప్రాజెక్టు కేలరీలు లెక్కించే సాధనంగా మాత్రమే కాకుండా భారతీయ ఆహార సంస్కృతిని డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రయత్నంగా కూడా మారనుంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ ఓవర్హెడ్ కెమెరా సహాయంతో పనిచేస్తుండగా భవిష్యత్తులో మొబైల్ యాప్ రూపంలో అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ కెమెరాతో భోజనం ఫొటో తీస్తే అందులోని పదార్థాలు, వాటి పరిమాణం, పోషక విలువలను కూడా ఏఐ అంచనా వేస్తుందని బృందం చెబుతోంది.లాభాలివీ..⇒ ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగదారులు దేశ ఇంటరాక్టివ్ మ్యాప్ను అన్వేషిస్తూ వివిధ ప్రాంతాల సంప్రదాయ వంటకాలను తెలుసుకోగలరు. ⇒ ప్రతి వంటకం మూలాలు, పదార్థాలు, సాంస్కృతిక ప్రాధాన్యం, తయారీ విధానంతోపాటు వాటిని అందించే రెస్టారెంట్ల గురించి కూడా సమాచారం పొందగలరు. ⇒ కొత్త వంటకాలను తెలుసుకోవాలనుకునే ఆహార ప్రియులకు ఇది దోహదపడటంతోపాటు పర్యాటకులకు అసలైన స్థానిక ఆహార అనుభవాలను కనుగొనడంలో సహాయపడుతుంది. ⇒ భారతీయ ఆహార వారసత్వంపై ఆసక్తి ఉన్న పరిశోధకులు, విద్యార్థులు, సాంస్కృతిక సంస్థలకు ఇది ఉపయుక్తమైన వనరుగా ఉంటుంది.ఏఐ ఆధారిత పరిష్కారాలకు దోహదంసమాచార సేకరణ, వర్గీకరణ కోసం ఏఐ సాధనాలను వినియోగించి అనంతరం ధ్రువీకరణ, భౌగోళిక మ్యాపింగ్ కోసం ప్రత్యేక విధానాలను అభివృద్ధి చేశాం. దీంతో వినియోగదారులకు సులభంగా ఉపయోగపడే ఇంటరాక్టివ్ వేదికను రూపొందించగలిగాం. ఈ డేటా వల్ల రుచులు, పోషకాలు, వినూత్న పద్ధతులపై సాంకేతిక విశ్లేషణ సాధ్యమవుతుంది. దీని ద్వారా భారతీయ ఆహార రంగంలో ఏఐ ఆధారిత పరిష్కారాలు అభివృద్ధి చెందుతాయి. వంటకాల్లోని వైవిధ్యాలను, వంటకాల పరిణామ క్రమాన్ని కూడా చేర్చాలని భావిస్తున్నాం.– ప్రొఫెసర్ సీవీ జవహర్ -
సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు
బంజారాహిల్స్(హైదరాబాద్): సీఎం రేవంత్రెడ్డి సొంతపార్టీ నేతలకే వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మీనాక్షీ నటరాజన్కు పదవి రాకుండా అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టించడం రేవంత్రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం తెలంగాణభవన్లో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్లో ఉన్న కొంతమందిలో మీనాక్షి నటరాజన్ నిజాయతీ గల మనిషి అని, రాహుల్గాందీకి నమ్మిన బంటు కావడంతోనే రేవంత్రెడ్డి ఆమె పైనే కుట్ర చేశారన్నారు. తెలంగాణలో రేవంత్రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటూ అడ్డగోలు అవినీతి చేస్తున్నాడని మీనాక్షి నటరాజన్ రాహుల్గాందీకి చెప్పినందుకే రేవంత్రెడ్డి ఆమెపై పగపట్టారని చెప్పారు. అందుకే మీనాక్షి నటరాజన్ మీద రేవంత్రెడ్డి దొంగ కేసు పెట్టించారన్నారు. ఆ కేసు వివరాలు కూడా బీజేపీకి ఇచ్చారని ఆరోపించారు. ఇలా ప్రజలకే కాకుండా సొంతపార్టీ వారికే గుండుకొట్టి శఠగోపం పెట్టిన దొంగ రేవంత్రెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్ను ఆదర్శంగా తీసుకుంటున్నానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రేవంత్రెడ్డి పాలనను అట్టర్ఫ్లాఫ్గా అభివర్ణించారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్టేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్కే ఫ్లాప్ అని తేలిపోయిందన్నారు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి..? నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని హామీఇచ్చిన రేవంత్రెడ్డి అది నెరవేరితే నిరూపించాలన్నారు. అదే జరిగితే తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. జీఓ నంబర్ 50 ద్వారా పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. నగరంలో ఇటుక కూడా వేయని కాంగ్రెస్ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. నగరంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తామన్నారు. ఖైరతాబాద్లో రెండుసార్లు గులాబీ జెండా ఎగురవేశామని, మూడోసారి కూడా సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి రేవంత్రెడ్డి పక్కన కూర్చున్నారన్నారు. త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు. ‘సర్’విషయంలో బాధ్యతాయుతంగా పనిచేయాలి జూన్ 25 నుంచి జూలై 31 వరకు జరిగే ‘సర్’నమోదులో ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతగా పనిచేయాలని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే కొత్త కమిటీలు వేయబోతున్నామని, టికెట్ ఆశించేవారు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ మన్నె గోవర్దన్రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, బీఆర్ఎస్ నేతలు జేజోళ్ల రాజుముదిరాజ్, మహేశ్యాదవ్, హేమలతాయాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
నేను చెప్పినా.. నిర్లక్ష్యమేనా?
సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో జూన్ 9న భారీ వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సైబరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లను వరద ముంచెత్తి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడం, నగరవాసులు ఇబ్బందులు పడటంపై మండిపడ్డారు. వర్షంతో పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదన్నారు. వర్షాకాల సన్నద్ధతపై జూన్ 1న సమీక్ష సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు తాను అనేక సూచనలు చేశానని..అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వ తేదీన వర్షం సమయంలో, ఆ తర్వాత మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్లను ఆదేశించారు. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఆదివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ కమిషనర్, అవసరమైతే నేనూ.. ‘అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇకపై వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి. వర్షం సమయంలో పురపాలక, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి సిబ్బందితో పాటు పోలీసులూ క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే. పోలీసు కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైకి రావాల్సిందే. అవసరమైతే నేను కూడా రోడ్డుపైకి వస్తా. ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇకపై కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ విభాగంలోని ఖాళీలను డీజీపీ తక్షణమే భర్తీ చేయాలి. మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. వర్షాల సమయంలో ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల డేటా ఆధారంగా అధికారులు సన్నద్ధం కావాలి. విద్యుత్ పునరుద్ధరణ వెంటనే జరగాలి. అవసరమైన చోట్ల మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. వర్షం సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో పనిచేసేలా చూడాలి. ఇంజనీర్లు ప్రాజెక్టుల వద్దే ఉండాలి వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలి. మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలి. వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజినీర్లు తప్పనిసరిగా స్థానికంగా ఉండాలి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను వదిలి వెళ్లే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెంటనే మంజూరు చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. విత్తనాలు, యూరియాపై దృష్టి పెట్టండి ‘వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలలి. ముఖ్యంగా విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలి. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలి. యూరియా నిల్వ, పంపణి కోసం స్థానిక వ్యవసాయ అధికారిని బాధ్యుడిగా నియమించడంతో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలి. సన్న వడ్ల కోసం వ్యవసాయ శాఖ ప్రకటించిన 8 రకాల విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. తాగునీరు కలుషితం కావొద్దు.. వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా చూడాలి. గతంలో తాగునీటి కాలుష్యంతో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించాలి. నీటి కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలి. వర్షాలతో నీటి నిల్వలు ఏర్పడి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పురపాలక, జలమండలి, వైద్య ఆరోగ్య శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ను ఆదేశించారు. పోలీసు, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్ను ఆదేశించారు. సమీక్షలో డీజీపీ, సీఎస్లతో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
కొత్త సీఎస్గా జయేశ్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఈనెల 30న పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో కొత్త సీఎస్గా ఎవరిని నియమిస్తారనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీనియారిటీ, అనుభవం, విధేయతతోపాటు భయం లేకుండా ధైర్యంతో సత్వర నిర్ణయాలు తీసుకోగల అధికారిని కొత్త సీఎస్గా నియమించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ నెల 11తో రెండున్నరేళ్ల సమయం గడిచిపోయింది. మిగిలిన రెండున్నరేళ్ల టర్మ్లో చివరి ఏడాది.. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలుపొందడంపైనే ప్రభుత్వం పూర్తిగా దృష్టిసారించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్థూలంగా ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా పరుగులు పెట్టించి సర్కారును మళ్లీ గెలిపించుకోవడానికి దూకుడుగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం గల అధికారినే తదుపరి సీఎస్గా నియమించే అవకాశముంది. ఏ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయాందోళనలతో చాలామంది ఐఏఎస్లు సత్వర నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో సర్కారుకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తే పురపాలక శాఖ (క్యూర్ ఏరియా) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్కు పట్టం కట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయనతోపాటు రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది.నిర్ణయాల్లో చురుకుదనమే గీటురాయిజయేశ్, వికాస్రాజ్లలో ఒకరిని సీఎస్గా నియమించే అవకాశం మెండుగా ఉండగా, సీనియారిటీ ప్రకారం రేసులో శశాంక్ గోయల్ (1990 బ్యాచ్) అందరికంటే ముందున్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఆయన వచ్చే సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండడంతో మరో మూడు నెలల సర్వీసు కాలం మాత్రమే మిగిలింది. సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న అరవింద్కుమార్ (1991 బ్యాచ్) ఫార్ములా ఈ–కారు రేసు కేసులో చిక్కుకుని కొంత కాలంగా సస్పెన్షన్లో ఉండటంతో ఆయన రేసులో లేరు. సీనియారిటీలో ఆ తర్వాతి స్థానంలో జయేశ్ రంజన్ (1992) ఉండగా, ఆయన 2027 సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేస్తారు. ఏదైనా పని అప్పగిస్తే అత్యంత వేగంగా ఫలితాన్ని తెచ్చి చూపించే అధికారుల్లో జయేశ్ ముందు వరుసలో ఉంటారని పేరుంది. సీఎస్ ఎంపికలో ఇదే ఆయనకు కలిసి రానుండగా, ఆయన సామాన్యులకు అందుబాటులో ఉండరనే విమర్శ సైతం ఉంది. సీనియారిటీలో జయేశ్ తర్వాత ఉన్న సంజయ్జాజు (1992) డిప్యూటేషన్పై కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆయన 2029 ఫిబ్రవరి 28న రిటైర్ కానుండగా, రాష్ట్రానికి తిరిగి వచ్చే ఆలోచనలో లేరని తెలిసింది. ఆతర్వాతి స్థానంలో ఉన్న వికాస్రాజ్(1992)కు వివాదరహితుడిగా పేరుండగా, 2028 మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. జయేశ్ను కాదని భావిస్తే వికాస్రాజ్ను సీఎస్గా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, ఆయన చురుగ్గా నిర్ణయాలు తీసుకోకుండా నాన్చుతారని, ‘హామ్’రోడ్ల టెండర్లలో తీవ్ర జాప్యానికి సైతం ఇదే కారణమనే భావనలో ప్రభుత్వం ఉంది. -
వడి వడిగా... బడికి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం సోమవారం తిరిగి తెరుచుకుంటున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేయగా, ఇప్పటికే అకడమిక్ కేడర్ను కూడా విడుదల చేసింది. బోధనతోపాటు ఈసారి ప్రతిరోజూ క్రీడలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలతో కథలు లేదా పత్రికలు, మ్యాగజైన్లు లాంటి వాటిని అరగంట చదివించాలని చెప్పింది. ప్రార్థన సమయంలో లేదా అది పూర్తయిన తర్వాత తరగతి గదిలో ఐదు నిమిషాలపాటు విద్యార్థులకు యోగా లేదా ధ్యానం తప్పనిసరి చేసింది. ప్రతి నెలా మూడో శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తారు. ఈసారి మొత్తం 227 రోజులపాటు పాఠశాలలు పనిచేస్తాయి. – సాక్షి, హైదరాబాద్విద్యార్థుల సంఖ్య పెరిగేనా?రాష్ట్రంలోని ప్రభుత్వ రంగంలో ఉన్న 30 వేల స్కూళ్లలో 24 లక్షల మంది పిల్లలున్నారు. 10 వేల వరకూ ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల్లో 36 లక్షల మంది చదువుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని రెండేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోంది. అయినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చే బడిబాట కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా సీరియస్గా తీసుకోవాలని విద్యాశాఖ టీచర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రాథమిక బడులు మొత్తం 18,254 ఉంటే వాటిల్లో 6,90,816 మంది విద్యార్థులున్నారు. అంటే ఒక్కో బడిలో సగటున 38 మంది ఉన్నారు. 1,864 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. 2023–24లో ప్రభుత్వ స్కూళ్లలో యూడైస్ లెక్కల ప్రకారం 18.13 లక్షలుంటే (డ్రాపౌట్స్ జరిగాక), 2024–25లో 16.84 లక్షల మంది ఉన్నారు. అంటే ఏడాదిలోనే 1.29 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఈ పరిస్థితి ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ప్రశ్నించేలా ఉంది. బడిబాటకు వెళ్లిన టీచర్లకు పేద, మధ్య తరగతి నుంచి వచ్చే స్పందన భిన్నంగానే ఉంది. విద్యపై తమకు భరోసా లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. సరిగా బోధన జరగదని, నాణ్యత లోపించిందని అంటున్నారు. అల్పాహారంపై ఆశలుప్రభుత్వ బడులతోపాటు కాలేజీల్లోనూ ఈసారి అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచే ఈ కార్యక్ర మాన్ని అమలు చేస్తారు. కాలేజీల్లో దశలవారీగా ఉంటుంది. మొత్తం 1.44 లక్షల మందికి బ్రేక్ఫాస్ట్ అందిస్తారు. ఇది విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచుతుందని విద్యాశాఖ ఆశలుపెట్టు కుంది. ఈ ఏడాది నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పైనా పాఠాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుస్తకాలు, నోట్పుస్తకాల పంపిణీకి మరికొంత సమయం పట్టవచ్చు. ఇవి వస్తేగానీ సాంకేతిక విద్యపై పాఠాలు ఎలా ఉంటాయో చెప్పలేమని టీచర్లు అంటున్నారు. మొత్తం మీద ఈ ఏడాది విద్యార్థుల చేరికలు పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. -
హక్కుల కోసం కాక్రోచ్ ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఆదివారం హక్కుల కోసం నగరంలోని ధర్నాచౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పరీక్ష పత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలో నెలకొన్న అవకతవకలు, ప్రభుత్వ పాఠశాలల దయనీయ స్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమ నేత సోనమ్ వాంగ్చుక్తోపాటు పెద్దసంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాంగ్చుక్ మాట్లాడుతూ., నీట్ పరీక్షల లీకేజీ వంటి ఘటనలపై ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ... కోట్లాది యువత భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశాల్లో జవాబుదారీతనం అవసరమన్నారు. ఈ నిరసనను ఇప్పటికీ ఒక విజ్ఞప్తిగా చూస్తున్నామని, సమస్యలు పరిష్కరించకపోతే ఇది పెద్ద ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ యువత చూపిన శాంతియుత, శక్తివంతమైన నిరసన దేశానికి ఆదర్శమన్నారు. ‘నేను అనేక నగరాల్లో ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నాను. కానీ హైదరాబాద్లో నేను చూసిన శాంతి నిరసన మరెక్కడా చూడలేదు’ అని చెప్పారు. భారత్ గొప్ప దేశంగా మారాలంటే విద్య, పర్యావరణ పరిరక్షణే ప్రధాన అంశాలుగా మారాలని వాంగ్చుక్ స్పష్టం చేశారు. ‘విద్య ద్వారా రాబోయే తరాలకు పునాదులు వేయాలి. మీరు చెట్లను, అడవులను, నదులను రక్షిస్తున్నారు. ఇది దేశానికే గర్వకారణం’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెజారిటీ పిల్లలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో చదువుకుంటున్నారన్నారని, ఇలా అయితే, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ఎలా సాకారమవుతుందని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలో పాల్గొంటే తమ పిల్లల స్కూల్ అడ్మిషన్కు ఇబ్బందులు వస్తాయేమో అని భయపడే పరిస్థితి దేశంలో ఉండటం సిగ్గుచేటన్నారు.యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దు: ప్రొ.నాగేశ్వర్ నీట్, సీబీఎస్ఈ సహా అనేక పరీక్షల్లో జరిగిన లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రొ.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. ‘ఒకప్పుడు రైల్వే ప్రమాదం జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు వేలాది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్నా బాధ్యత తీసుకునే రాజకీయ నాయకులు కనిపించడం లేదు. ఇదే మన రాజకీయ పతనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘’పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగితే బంగారం కొనొద్దంటారు. కానీ యువత ఉద్యోగాలు కోల్పోతే ఎవరూ జవాబు చెప్పరు’ అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తూ, ఉద్యోగాలను తొలగించడం అన్యాయమన్నారు. మహిళలపై నేరాలు జరిగినప్పుడు బాధితులనే ప్రశ్నించే ధోరణి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యవస్థను ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్, చైనా ఏజెంట్, దేశద్రోహి అంటారు. కానీ మేము భారతమాత బిడ్డలం, భగత్ సింగ్ వారసులం’ అంటూ నినాదాలు చేశారు. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ ఇది సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఆగిపోవద్దు, ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. దేశంలోని సంపద అంతా ఎక్కడికి వెళ్తోంది.? దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఎందుకు ఇలా నెలకొందని ప్రశ్నించారు. ‘యువతను కాక్రోచ్లుగా పేర్కొనడం సమంజసం కాదు. దేశంలో ఆరు శాతం మంది యువతకు మాత్రమే నైపుణ్యాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. విద్యార్థులకు అన్యాయం చేసిన ధర్మేంద్ర ప్రధాన్ను జైలుకు పంపాలి’ అని అన్నారు. -
మూత్ర'గండం'!
మూత్ర పిండాల వ్యాధి సమస్యలు ఇప్పుడు తెలంగాణలో ప్రజారోగ్యానికి సవాలుగా మారుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఐసీఎంఆర్–ఇండియాబ్’అధ్యయనం రాష్ట్రానికి ఆందోళన కలిగించే సంకేతాలను వెలుగులోకి తెచ్చింది. ఈ అధ్యయనం ప్రకారం తెలంగాణలో కిడ్నీ పనితీరు లోపం ప్రాబల్యత 7.4 శాతంగా నమోదైంది. జాతీయ సగటు 3.2 శాతంతో పోలిస్తే ఇది రెండింతలకు పైగా ఉండటం గమనార్హం. అంటే రాష్ట్రంలో దాదాపు ప్రతి 14 మందిలో ఒకరు కిడ్నీ సమస్యల ముప్పులో ఉన్నట్టు అంచనా. – సాక్షి, హైదరాబాద్హెచ్చరికగా ఐసీఎంఆర్ అధ్యయనం‘ఐసీఎంఆర్–ఇండియాబ్’ అధ్యయనం దేశవ్యాప్తంగా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు ప్రబలడాన్ని గల కారణాలను అంచనా వేయడానికి చేపట్టిన అతిపెద్ద పరిశోధన. 2015 నుంచి 2023 మధ్యకాలంలో వివిధ దశల్లో 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 25 వేల మందికిపైగా వయసు పైబడిన వారి నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. కిడ్నీ ఆరోగ్యంపై ప్రత్యేకంగా చేసిన విశ్లేషణ ఫలితాలు ఇటీవలి కాలంలో శాస్త్రీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. ఇందులో తెలంగాణ దేశంలోని కిడ్నీ వ్యాధుల హాట్స్పాట్ రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో జీవనశైలి మార్పుల ప్రభావం కిడ్నీలపై తీవ్రంగా పడుతున్నట్టు అధ్యయనం పేర్కొంది.మధుమేహం–బీపీతో కిడ్నీలకు ముప్పుమూత్రపిండాల వ్యాధుల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మ«దుమేహం, రక్తపోటును వైద్య నిపుణులు గుర్తిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే కిడ్నీలలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. అధిక రక్తపోటు కిడ్నీలపై నిరంతర ఒత్తిడిని పెంచి వాటి పనితీరును క్రమంగా బలహీనపరుస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే మధుమేహం, రక్తపోటు కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కిడ్నీ సమస్యల సంఖ్య కూడా అధికమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఉప్పు వినియోగం, ఫాస్ట్ఫుడ్ అలవాట్లు, నొప్పి నివారణ మందుల విచ్చలవిడి వాడకం, ధూమపానం, మద్యపానం వంటి అంశాలు కూడా ప్రమాదాన్ని పెంచుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యత, వేడి వాతావరణంలో తగినంత నీరు తీసుకోకపోవడం వంటి అంశాలు కూడా కొంత ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.స్క్రీనింగ్–చికిత్సపై ప్రభుత్వం దృష్టిపెరుగుతున్న అసంక్రమణ వ్యాధుల భారాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా 30 ఏళ్లు పైబడిన వారిలో మధుమేహం, రక్తపోటు, ఇతర అసంక్రమణ వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. వీటి ద్వారా కిడ్నీ సమస్యలకు దారితీసే ప్రమాద కారకాలను ముందుగానే గుర్తించే ప్రయత్నం జరుగుతోంది.ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలను విస్తరించడంతోపాటు పేదలకు ఉచితంగా సేవలు అందిస్తోంది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కార్యక్రమం ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఒక కేంద్రం అందుబాటులో ఉండేలా చూడాలని ఇటీవల ఆరోగ్యశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల రోగులకు రవాణా ఇబ్బందులు లేకుండా హబ్ అండ్ స్పోక్ మోడల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న 67 కేంద్రాలలో రద్దీని తగ్గించడానికి, అదనంగా మరో 155 డయాలసిస్ యంత్రాలను (పడకలను) అందుబాటులోకి తెస్తున్నారు.యువతలో పెరుగుతున్న కిడ్నీ కేసులుగతంలో మూత్రపిండాల వ్యాధులు ప్రధానంగా వృద్ధుల్లో కనిపించేవి. ప్రస్తుతం 30–45 ఏళ్ల వయసు వారిలో కూడా ఈ సమస్యలు పెరుగుతున్నట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. జీవనశైలి మార్పులు, ఉద్యోగ ఒత్తిడి, అనియంత్రిత ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమవుతున్నాయి. మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్న యువతలో కిడ్నీ పనితీరు క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రమాదకర అంశం ఏమిటంటే.. ప్రారంభ దశల్లో కిడ్నీ వ్యాధులకు పెద్దగా లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరే వరకు చాలామందికి తమకు సమస్య ఉందనే విషయం తెలియదు. అందుకే దీనిని సైలెంట్ డిసీజ్గా వైద్యులు పేర్కొంటున్నారు. -
ఎల్నినో ప్రభావం.. ఖరీఫ్ సన్నద్ధతపై ప్రత్యేక ప్రణాళిక
ఖరీఫ్ సన్నద్ధతపై ఈ రోజు ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ఏప్రిల్ నెలలోనే వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ నిపుణులతో సమీక్ష నిర్వహించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. వర్షాలు ఆలస్యమైనా, తక్కువగా నమోదైనా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలను రూపొందించినట్లు పేర్కొన్నారు.వరి పంటలపై అధికంగా ఆధారపడకుండా రైతులను పంటల వైవిధ్యీకరణ వైపు ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, నువ్వులు, ఆముదం వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. విత్తనాల కొరత తలెత్తకుండా ఈ ఖరీఫ్ సీజన్కు 87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచామని, ముఖ్యంగా కందులు, జొన్నలు, మొక్కజొన్న, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను జిల్లాల్లో ముందుగానే నిల్వ చేసినట్లు మంత్రి వివరించారు.రాష్ట్రంలోని రైతులకు ఎరువుల లభ్యతను మరింత సులభతరం చేయడం, పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా వ్యవసాయశాఖ పలు కీలక చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. రబీ సీజన్లో రైతుల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాల ఆధారంగా రాష్ట్ర ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్లో పలు మెరుగుదలలు చేసినట్లు వెల్లడించారు. జిల్లా వారీగా డీలర్ల స్టాక్ నిర్వహణ, మండల మ్యాపింగ్ సదుపాయాలతో పాటు మీ సేవ కేంద్రాల ద్వారా కూడా ఎరువుల బుకింగ్ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. యాప్ వినియోగంతో ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద రద్దీ తగ్గడంతో పాటు పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని మంత్రి తెలిపారు.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశం ఉన్నందున వ్యవసాయశాఖ ముందస్తుగా పంటల ప్రణాళికను సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. వర్షపాతంలో అనిశ్చిత పరిస్థితులు, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతులకు సాంకేతిక సూచనలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయశాఖ సూచనలను పాటించాలని కోరారు.రైతులకు ఖచ్చితమైన, సమయానుకూలమైన వాతావరణ సమాచారాన్ని అందించేందుకు వ్యవసాయ శాఖ “తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం”ను అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలి వేగం తదితర వాతావరణ వివరాలు రైతులకు నేరుగా వాట్సాప్ సందేశాల ద్వారా చేరుతున్నాయని చెప్పారు. రైతులు విత్తనాలు వేయడం, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, పంట సంరక్షణ వంటి అంశాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 28 లక్షల మందికి పైగా రైతులకు వాతావరణ సమాచార సందేశాలు పంపించినట్లు చెప్పారు. 71 శాతం డెలివరీ రేటుతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట నష్టాలను తగ్గించడం లక్ష్యంగా ఇటువంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి
హైదరాబాద్ , జూన్ 14 : హైదరాబాద్లోని బాగలింగంపల్లి లొ గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (BCI) విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈసమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, వనరులపై నియంత్రణ, బడ్జెట్ లో వాటా,రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా “హిస్సా – ఇజ్జత్ – హుకూమత్” నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.గత ఎనిమిది దశాబ్దాలుగా బీసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక , సాంస్కృతిక అన్యాయాలను ఆయన వివరించారు. బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందని, రాజ్యాధికారం లేకుండా ఏ సమాజమైనా తన అస్తిత్వాన్ని, అభివృద్ధిని కాపాడుకోలేదని అన్నారు.ఈ సమావేశానికి కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్ వీరస్వామి తదితరులు పాల్గొని బీసీ ఉద్యమ దిశ, దశ, భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన కమిటీల సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అలాగే బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్లుగా చెన్న శ్రీకాంత్, అవ్వారు వేణు, ఎర్రమాడ వెంకన్న, లింగేష్ యాదవ్లకు నియామక పత్రాలు ప్రదానం చేశారు. అదేవిధంగా prof బెనర్జీ ని రాష్ట్ర వైస్ చైర్మన్ గా ,prof విజయ్ బాబు ను పొలిటికల్ అడ్వైజర్ గా నియామక పత్రాలు అందజేశారు.సమావేశంలో బీసీ ఉద్యమ విస్తరణ, సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, భావజాల ప్రచారం, శిక్షణా కార్యక్రమాలు మరియు రాబోయే కాలంలో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.– విడుదలకర్తబీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (BCI)తెలంగాణ రాష్ట్ర కమిటీ -
తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని.. నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి(ఆది,సోమ, మంగళ) పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. -
‘మీనాక్షికి సీఎం రేవంత్ వెన్నుపోటు పొడిచారు’
సాక్షి, హైదరాబాద్: మీనాక్షి నటరాజన్కు రేవంత్ వెన్నుపోటు పొడిచారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్పై రేవంత్ దొంగ కేసులుపెట్టించారని.. ఇక్కడి కేసు విషయాలు రేవంత్.. బీజేపీ నేతలకు చెప్పారంటూ ఆరోపించారు.‘‘రేవంత్ పాలనకు సగం సమయం ముగిసింది. రేవంత్ సినిమాకు ఇంటర్వెల్ అయిపోయింది. ఇక శుభం కార్డే. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లో ఒక్క అభివృద్ధి పని జరగలేదు. త్వరలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ పదవి పోతుంది. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్లో బీఆర్ఎస్దే విజయం. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘శనివారం, ఆదివారం వస్తే హైడ్రా పేరుతో వందలాది ఇళ్లు కూలగొడుతున్నారు. మొదటి ఏడాదిలో రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. రాహుల్ గాంధీ అశోక్నగర్ వచ్చి చాయ్ తాగుతూ ఫోజులు కొట్టి నిరుద్యోగుల ముందు చెప్పారు. రేవంత్ సర్కార్.. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి.. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు. రేవంత్రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడని మీనాక్షి నటరాజ్ రాహుల్కి చెప్పింది.’’ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
హైడ్రాలో బైక్ టీమ్లు
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో ముంపు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నా... ఏక్కడ ఏ ప్రమాదం జరిగినా... ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు నిర్వహించే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందాలు ఘటనాస్థలికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు ఈ బృందాలకు సంబంధించిన భారీ వాహనాలు సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర వ్యాప్తంగా 27 బైక్ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఇవి శుక్రవారం నుంచి పని చేయడం ప్రారంభించాయి. శుక్రవారం రాత్రి వర్షం కురిసిన సమయంలో మెరుగైన సేవలు అందించాయి. ప్రతి బైక్పై ఇద్దరు సిబ్బంది.. ఇప్పటి వరకు హైడ్రా అధీనంలోని డీఆర్ఎఫ్కు 122 వాహనాలు ఉన్నాయి. వీటిలో డీఆర్ఎఫ్ తేలికపాటి వాహనాలతో పాటు 21 ట్రక్కులు వినియోగిస్తోంది. ఈ ట్రక్కుల్నే ప్రకృతి వైపరీత్యాలు, రెస్క్యూ కార్యకలాపాలకు వాడుతున్నారు. వీటిలో ప్రత్యేక ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. ట్రాఫిక్ జామ్స్ ఏర్పడినప్పుడు ఈ వాహనాలు ఘనాస్థలికి చేరడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్నిసార్లు ఇవి చేరేసరికి జరగాల్సిన నష్టం వాటిల్లుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న కమిషనర్ ఏవీ రంగనాథ్ బైక్ టీమ్లను రంగంలోకి దింపారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది వినియోగించడానికి ఖరీదు చేసిన 37 ద్విచక్ర వాహనాల్లో 27 వాహనాలకు మార్పులు చేర్పులు చేసి బైక్ టీమ్లకు అందించారు. ప్రతి బైక్పైనా ఇద్దరు డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఉపకరణాలు ఉంటాయి. వీటిని ఉంచడానికి వెనుక భాగంలో ప్రత్యేక పెట్టి ఏర్పాటు చేశారు. తొలిదశలో రంగంలోకి దింపిన 27 టీమ్ల్లో అత్యధికం ఐటీ కారిడార్తో పాటు ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో మోహరించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. -
గగనంలో వైమానిక అబ్బురం..!
దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. మొత్తం 231 మంది ఫ్లైట్ క్యాడెట్లు (194 మంది పురుషులు, 37 మంది మహిళలు) భారత వైమానిక దళంలో అధికారులుగా నియమితులయ్యారు.పరేడ్ సందర్భంగా వైమానిక దళాధిపతి ఏపీసింగ్ నేతృత్వంలో జరిగిన ఫ్లైపాస్ట్ ఆహూతులను ఆకట్టుకుంది. పిలాటస్ పీసీ–7 ఎంఎక్–2, హాక్, కిరణ్, చేతక్ శిక్షణ విమానాలు ఆకాశంలో అద్భుత విన్యాసాలు ప్రదర్శించాయి. ‘ఆకాశ్ గంగ’ స్కైడైవింగ్ బృందం, ‘శక్తి’ ఉమెన్ ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్, సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. -
యుద్ధతంత్రాన్ని సాంకేతికత మార్చింది
సాక్షి, హైదరాబాద్: ‘ఒకప్పుడు యుద్ధం అంటే సైనికుడు, ఆయుధం కనిపించేవి. ప్రస్తుతం యుద్ధస్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పటి యుద్ధాల్లో ప్రత్యర్థి ఎవరో, ఆయుధం ఎక్కడి నుంచి వస్తుందో కూడా కనిపించని పరిస్థితులు ఉన్నాయి. ట్రాఫిక్ నెట్వర్క్లు, సీసీటీవీ వ్యవస్థలను కూడా హ్యాక్ చేసి నియంత్రించే స్థాయికి సైబర్ యుద్ధం చేరుకుంది. ఇప్పుడు రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, సెన్సార్లు, రోబోటిక్స్ వంటి వ్యవస్థలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి’అని భారత వైమానిక దళాని (ఐఏఎఫ్)కి చెందిన యువ అధికారులకు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ యుద్ధ వ్యూహాలు, సాంకేతికతలను వినియోగించే సామర్థ్యం అధికారుల్లో ఉండాలన్నారు.అత్యాధునిక, తక్కువ పరిమాణంలో ఉన్న ఆయుధాలతో చిన్న దేశాలు కూడా పెద్ద దేశాలకు నష్టం కలిగిస్తున్న ఉదాహరణలు (పరోక్షంగా ఇరాన్–అమెరికా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ) ప్రపంచంలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. మొత్తం 231 మంది ఫ్లైట్ క్యాడెట్లు (194 మంది పురుషులు, 37 మంది మహిళలు) వైమానిక దళంలో అధికారులుగా నియమితులయ్యారు.వారిలో తొలిసారిగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) నుంచి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా క్యాడెట్ల తొలి బ్యాచ్ కూడా ఉండటం విశేషం. వారితోపాటు నౌకాదళానికి చెందిన 9 మంది, కోస్ట్గార్డ్కు చెందిన ముగ్గురు, వియత్నాంకు చెందిన ఇద్దరు అధికారులు పాసింగ్ ఔట్ పరేడ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వాయుసేనకు సంబంధించిన శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన క్యాడెట్లకు ప్రెసిడెంట్ కమిషన్ (వైమానిక దళంలో అధికారులుగా గుర్తింపు) ప్రదానం చేశారు. దేశానికి రక్షణ కవచం వైమానిక దళం.. అనంతరం రాజ్నాథ్సింగ్ మాట్లాడుతూ భారత వైమానిక దళం దేశానికి కేవలం రక్షణ కవచమే కాకుండా అవసరమైనప్పుడు శత్రువుపై విరుచుకుపడే ఖడ్గంగా కూడా వ్యవహరించిందన్నారు. 1947–48 కశ్మీర్ యుద్ధంలో శ్రీనగర్ ఎయిర్లిఫ్ట్, 1971 యుద్ధంలో వైమానిక దాడులు, 2025లో ఆపరేషన్ సిందూర్లో ఉగ్రవాద స్థావరాలపై అత్యంత కచి్చతత్వంతో చేపట్టిన దాడులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక వేదికలతోపాటు ఐఏఎఫ్ అధికారుల ధైర్యం, క్రమశిక్షణ వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని రాజ్నాథ్ కొనియాడారు. నారీ శక్తితో ఐఏఎఫ్ మరింత శక్తివంతం.. వైమానిక దళంలో మహిళల సంఖ్య పెరగడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ స్పందిస్తూ నారీ శక్తి భాగస్వామ్యం ఐఏఎఫ్ను మరింత సమతుల్యంగా, శక్తివంతంగా మారుస్తుందన్నారు. ఇది భారత సాయుధ దళాల సమగ్రతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘ఆకాశమే హద్దు కాదు... ఆకాశమే మన ఇల్లు అనే దృక్పథంతో ముందుకు సాగాలి. అదే వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు దోహదపడుతుంది’అని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఉత్తమ అధికారులకు పురస్కారాల ప్రదానం.. శిక్షణలో ఉత్తమ ప్రతిభకనబర్చిన ఫ్లయింగ్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ యాదవ్ ప్రెసిడెంట్ ప్లాక్, నవానగర్ స్వోర్డ్ ఆఫ్ ఆనర్ (పైలట్ కోర్సులో అగ్రస్థానం), ఫ్లయింగ్ ఆఫీసర్ ఏక్తా గుప్తా నావిగేషన్ విభాగంలో ప్రెసిడెంట్ ప్లాక్, ఫ్లయింగ్ ఆఫీసర్ దివ్యాంశి సింగ్ గ్రౌండ్ డ్యూటీ విభాగంలో ప్రెసిడెంట్ ప్లాక్ అందుకున్నారు. ఆశిష్ కుమార్ యాదవ్ పరేడ్ కమాండర్గా వ్యవహరించారు.పరేడ్ ప్రారంభానికి ముందు త్రివిధ దళాలకు చెందిన తొలి మహిళా డ్రిల్ టీం 303 రైఫిల్స్తో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ నేతృత్వంలో జరిగిన ఫ్లైపాస్ట్ ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ఎయిర్ మార్షల్ సీతపల్లి శ్రీనివాస్, దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీ కమాండెంట్ ఎయిర్ మార్షల్ రాహుల్ బసీ, డీజీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ రమేశ్రెడ్డి, యువ అధికారుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కేటీఆర్కే స్థానం లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆయనకే స్థానం లేదని, ఇక మా స్థానం గురించి కేటీఆర్ ఏం మాట్లా డతారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ ఎద్దేవా చేశారు. వాళ్లు మూడో స్థానంలో ఉన్నారని, అందుకే మేం మూడో స్థానంలోకి వెళ్తామని అంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పోటీనే లేదని, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. శనివారం గాం«దీభవన్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర చేస్తామంటున్నారు. యాత్రలు చేయడంలో తప్పులేదు.వైఎస్సార్ పాదయాత్ర, రాహుల్గాంధీ భార త్ జోడో యాత్రలు దేశ చరిత్రను మలుపు తిప్పా యి. కానీ వీళ్లు ఏమని యాత్రలు చేస్తారు? యాత్ర లో ప్రజలకు ఏం చెప్తారు? అయినా వీళ్లు యాత్రలు చేస్తే ఆదరించేవారు ఎవరు? అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన ఆర్థిక విధ్వంసం, భూదోపిడీ, అస్తవ్యస్త పాలన, రైతుల ఆత్మహత్యలపై ప్రజలకు వివరణ ఇచ్చి వీళ్లు యాత్రలు చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ, బీజేపీ ఫాసిస్టు విధా నాలపై కేటీఆర్ స్పందించాలి’అని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు 8 మందీ ఓడిపోతారు.. రూ.వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని కిషన్రెడ్డి అంటున్నారు. ఆయనే కేంద్ర బొగ్గు మంత్రి కదా? ఏం కుంభకోణం జరిగిందో విచారణ చేసి దోషులెవరో తేల్చవచ్చు కదా. ఈసారి బీజేపీకి ఉన్న 8 మంది ఎంపీలు ఓడిపోతారు. అసలు వీళ్లు రాష్ట్రానికి ఏం చేశారని మళ్లీ గెలుస్తారు? బీజేపీ అనే దుష్టసంహారం కోసమే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు జాతీయ స్థాయిలో పార్టీలు ముందుకొస్తున్నాయి. దేశ ప్రజల హక్కుల రక్షణ కోసం ఏం చేయాలన్నదానిపై ఇటీవల ఏఐసీసీ సమావేశంలో చర్చించారు. ఆ మేరకు ఈ నెల 24 నుంచి దేశవ్యాప్త కార్యాచరణ ఉంటుంది.’అని మహేశ్గౌడ్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదు.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం సరైంది కాదు. అసలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి కదా? రాష్ట్రం ఇవ్వాలని అడిగింది, ఇచ్చింది మేమే. అయినా ఏ రోజూ ప్రాంతీయ తత్వాలను ఉసిగొల్పి అమాయక విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేదు. లీకు వీరులెవరో సీఎం తేలుస్తారు పీసీసీ అధ్యక్షుడిగా ఎలా ఉండాలో నాకు తెలుసు. 40 ఏళ్లలో నేను నేర్చుకుంది అదే. తప్పు చేయనంతవరకు నేను భయపడేది లేదు. మీనాక్షీ నటరాజన్ విషయంలో బీజేపీ దిగజారి ప్రవర్తించింది. రిటర్నింగ్ అధికారి ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలా వ్యవహరించి ఇలా చేశారు. ఆయన్ను ఉరితీసినా తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ వారే సమాచారం ఇచ్చారని అనడంలో వాస్తవం లేదు. అయినా లీకు వీరులు, గ్రీకు వీరులెవరైనా ఉంటే సీఎం విచారణ జరిపి తేలుస్తారు. మీనాక్షి విషయంలో కోర్టుకు వెళతాం..’అని పీసీసీ చీఫ్ తెలిపారు. -
కృష్ణా ట్రిబ్యునల్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2 గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై నివేదిక సమర్పించేందుకు జూలై 31 చివరి తేదీ కాగా.. ట్రిబ్యునల్ విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు నిర్దేశిత కేటాయింపులు జరిపే బాధ్యతను తొలుత కృష్ణా ట్రిబ్యునల్–2కు గతంలో కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. తెలంగాణ విజ్ఞప్తి మేరకు అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం(ఐఎస్డబ్ల్యూడీఏ) 1956లోని సెక్షన్–3 కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి 2023 అక్టోబర్ 6న కేంద్రం మళ్లీ ట్రిబ్యునల్కు అదనపు రెఫరెన్స్ జారీ చేసింది. దీంతో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ఆ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం లభ్యత ఆధారంగా కేటాయించిన జలాలను కలిపి మొత్తం 1005 టీఎంసీలను తిరిగి ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో.. తమ రాష్ట్ర ప్రయోజనాలను హరించే ఈ గెజిట్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయగా, దీనిపై నిర్ణయం తీసుకునే వరకు ట్రిబ్యునల్ విచారణను యథాతథంగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సెక్షన్ 89 కింద అప్పటివరకు జరిపిన విచారణను ట్రిబ్యునల్ పక్కనబెట్టి సెక్షన్–3 కింద కేంద్రం జారీ చేసిన రెఫరెన్స్ ఆధారంగా కొత్తగా విచారణను చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ వాదనలు ముగిశాయి. మరో రెండు మూడు నెలల్లో ఏపీ వాదనలూ ముగియనుండగా, ఆ తర్వాత ఆ వాదనలను ఖండిస్తూ తెలంగాణ తుది వాదన వినిపించనుంది. అనంతరం ట్రిబ్యునల్ సెక్షన్ 3 కింద తీర్పును రిజర్వ్ చేసి ఆ వెంటనే ప్రకటించడం కానీ సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచిచూస్తూ వాయిదా వేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అనంతరం రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద మళ్లీ రెండు రాష్ట్రాల వాదనలను పునః ప్రారంభించనుంది. ఆలోగా సుప్రీంకోర్టు సెక్షన్–3 కింద నీటి పంపకాలకు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం సెక్షన్ 89 కింద విచారణను కొనసాగించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ సుప్రీంకోర్టు సెక్షన్ 3 కింద కేంద్రం జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్ను కొట్టివేస్తే మాత్రం సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్లో విచారణ మరి కొన్నేళ్లు కొనసాగే అవకాశం ఉంది. అప్పుడు సెక్షన్ 3 కింద ఇప్పటివరకు ట్రిబ్యునల్ జరిపిన విచారణ వృథా ప్రయాస కానుంది. పొడిగింపులే పొడిగింపులుఅంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956లోని సెక్షన్ 4 కింద 2004 ఏప్రిల్ 2న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ తన తొలి నివేదిక, తీర్పును 2010 డిసెంబర్ 30న ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత భాగస్వామ్య రాష్ట్రాలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలు 2011 మార్చి 29న ట్రిబ్యునల్కు తమ సూచనలు (రెఫరెన్స్) పంపాయి. అనంతరం ట్రిబ్యునల్ తన తదుపరి నివేదికను 2013 నవంబర్ 29న కేంద్రానికి సమర్పించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టం–2014 లోని సెక్షన్ 89 కింద ట్రిబ్యునల్ గడువును పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఆ చట్టంలోని క్లాజ్ (ఎ), క్లాజ్ (బి) లోని అంశాల పరిష్కారం నిమిత్తం 2014 ఆగస్టు 1 నుంచి రెండేళ్ల పాటు గడువును పొడిగిస్తూ అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చారు.ఆ తర్వాత ట్రిబ్యునల్ అభ్యర్థనల మేరకు కాలానుగుణంగా ప్రతి ఏటా కేంద్రం గడువును పొడిగిస్తూ వస్తోంది. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి రాకపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తెగడం లేదు. నీటి కేటాయింపులు లేక కృష్ణా పరీవాహకంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. -
ఈదురు గాలులతో బీభత్సం..
అల్వాల్: నగరంలో అర్ధరాత్రి కురిసిన వర్షం, ఈదురు గాలులు ఓ కుటుంబంలో తీరని విషాదం నింపాయి. విద్యుత్ తీగలు తెగిపడి రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్గా పనిచేసే సందీప్ (44) తన భార్య శ్వేత (39), కుమార్తె రితిక (16)తో కలిసి కానాజీగూడ టెలికం కాలనీలో నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి వర్షం కురవడంతో కాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే అర్ధరాత్రి సుమారు 2:30 గంటల సమయంలో ఇంటి బయట భారీ శబ్దం వినిపించడంతో సందీప్ నిద్రలేచి బయటకు వచ్చి చూడగా ఓ చెట్టు కొమ్మలు తన కారుకు అతిసమీపంగా విరిగిపడ్డాయి. దీంతో కారు దెబ్బతింటుందేమోనని ఆందోళన చెందిన ఆయన.. కారును పక్కకు జరిపేందుకు ప్రయత్నించగా భార్య చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నం చేసింది. అయితే కొమ్మల మధ్య తెగిపడిన విద్యుత్ తీగను గుర్తించకపోవడంతో కరెంట్ షాక్కు గురై కుప్పకూలింది. తల్లి పడిపోవడం గమనించిన కుమార్తె రితిక.. ఆమెను రక్షించే ప్రయత్నం చేయగా ఆమె కూడా విద్యుత్ షాక్కు గురైంది. వారిని కాపాడేందుకు ప్రయత్నించే క్రమంలో సందీప్ సైతం షాక్కు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత సందీప్, శ్వేత స్పృహలోకి వచ్చినా రితిక మాత్రం కదలలేదు. కూతురిని రక్షించాలనే ఆరాటంలో సందీప్ మరోసారి ఆమె వద్దకు వెళ్లగా అక్కడే ఉన్న విద్యుత్ తీగ తగిలి మళ్లీ కరెంట్ షాక్కు గురయ్యారు. శ్వేత ఆర్తనాదాలు విని ఉలిక్కిపడిన కాలనీవాసులు హుటాహుటిన అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న వైద్య సిబ్బంది సందీప్, రితిక మృతిచెందినట్లు నిర్ధారించారు. అయితే తీగలు తెగిపడ్డాయని విద్యుత్ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు ఆలస్యంగా స్పందించారని స్థానికులు ఆరోపించారు. ఒకవేళ వారు వెంటనే స్పందించి ఉంటే కనీసం సందీప్ అయినా బ్రతికేవారని చెప్పారు. తాము వద్దని వారిస్తున్నా కుమార్తె వద్దకు వెళ్లి చెట్టు కొమ్మగా భావించి విద్యుత్ తీగను పట్టుకోవడంతో మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. -
కృష్ణమ్మ ఎడారి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ తడారిపోయింది. పరీవాహక ప్రాంతాల్లో ఆశించిన వర్షాలు లేకపోవడంతో నీళ్లు లేని ఎడారిని తలపిస్తోంది. గతేడాది సరిగ్గా ఇదే సమయానికి ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ జలాశయం వరకు ప్రాజెక్టులన్నింటికీ సగటున 10 వేల క్యూసెక్కుల వరద ప్రారంభం కాగా, ఎల్నినో ప్రభావంతో.. ఈ ఏడాది అక్కడి నుంచి ఇక్కడి వరకు అలాంటి పరిస్థితే లేకుండా పోయింది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి గతేడాది సరిగ్గా ఇదే సమయానికి 12,134 క్యూసెక్కుల వరద నమోదు కాగా.. ఈ ఏడాది జూన్ 13 ఉదయం 9 గంటల సమయానికి కూడా చుక్క నీరు రాకపోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఆల్మట్టి వెలవెల: ఆల్మట్టి గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు. గతేడాది ఈ సమయానికే నిల్వలు 64.12 టీఎంసీలకు చేరాయి. అయితే ప్రస్తుతం 22.8 టీఎంసీలే ఉండటం గమనార్హం. కృష్ణమ్మ జన్మస్థానమైన మహారాష్ట్రలోని మహాబళేశ్వర్లో ఉన్న పశ్చిమ కనుమల నుంచి ఆల్మట్టి ప్రాజెక్టు వరకు ఉన్న 518 కి.మీ.ల నిడివిలోని పరీవాహక ప్రాంతం నుంచి ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటివరకు జలాశయానికి చుక్క నీరు రాకపోవడం ఎగువ పరీవాహక ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు గతేడాది 10,661 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం కేవలం 1,287 క్యూసెక్కులే వస్తున్నాయి. కృష్ణా ఉప నది భీమాపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయినీ జలాశయానికి గతేడాది ఇదే సమయానికి 5,884 క్యూసెక్కుల వరద రాగా, ఈ ఏడాది ఇప్పటివరకు చుక్క రాలేదు. కృష్ణా మరో ఉప నది తుంగభద్రపై కర్ణాటకలో ఉన్న తుంగభద్ర జలాశయానికి గతేడాది ఈ సమయానికి 8,269 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం కేవలం 365 క్యూసెక్కులే వచ్చిచేరుతున్నాయి. ఇక తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు గతేడాది 13,967 క్యూసెక్కుల ప్రవాహం రాగా, ప్రస్తుతం 2,596 క్యూసెక్కులే వస్తుండటం గమనార్హం. జూరాల గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా గతేడాది 8.77 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 7.48 టీఎంసీల నిల్వలున్నాయి. ప్రస్తుత సీజన్లో ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు 3.1 టీఎంసీల వరద వచ్చి చేరగా, 1,500 క్యూసెక్కులు కాల్వకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం, సాగర్లో కరువు ఛాయలు తెలుగు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను కరువు ఛాయలు కమ్మేస్తున్నాయి. పశ్చిమ కనుమలకు 985 కి.మీ.ల దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి గతేడాది ఇదే సమయానికి 12,104 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం 2,352 క్యూసెక్కులే వస్తున్నాయి. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, గతేడాది ఈ సమయానికి 56.59 టీఎంసీలకు నిల్వలు చేరితే ప్రస్తుతం 40.87 టీఎంసీలకే పరిమితమయ్యాయి. ప్రస్తుత సీజన్లో శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరిన వరద కేవలం 2.29 టీఎంసీలే కావడం గమనార్హం. ఇక నాగార్జునసాగర్కు గతేడాది ఈ సమయానికి 10,890 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం 2,987 క్యూసెక్కులే వస్తున్నాయి. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా గతేడాది ఈ సమయానికి 136.47 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 144.58 టీఎంసీలున్నాయి. ఇందులో ప్రస్తుత సీజన్లో వచ్చి చేరింది 6.04 టీఎంసీలే కాగా మిగతా నిల్వలు గతేడాది వాడుకోగా మిగిలిన జలాలే కావడం గమనార్హం. దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 4,734 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 32.8 టీఎంసీలకు చేరాయి. పశ్చిమ కనుమల నుంచి 1,107 కి.మీ.ల దిగువన ఉన్న సాగర్ వరకు నదీ పరీవాహక ప్రాంతంలో తీవ్ర వర్షాభావం నెలకొని ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయినీ జలాశయాలు నిండిన తర్వాతే దిగువన రాష్ట్రంలో ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్కు వరదలు ప్రారంభం కానుండగా, తాజా పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయి. నీళ్లు లేకున్నా విద్యుదుత్పత్తి! ఎల్నినో ప్రభావంతో వానాకాలం అంతటా వర్షాలు కురవకపోవచ్చని, కొన్ని విడతల వారీగా వర్షాలు కురిసినా ఆ తర్వాత వర్షాభావం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో నాగార్జునసాగర్లో మిగిలి ఉన్న కొద్ది నిల్వలను విద్యుదుత్పత్తి అవసరాలకు తోడిపారేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సాగర్ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా శనివారం తెలంగాణ జెన్కో 3,601 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసింది. సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీ 3,378 క్యూసెక్కులు తరలించుకుంటోంది. రోజూ సగటున 2 ఎంయూల చొప్పున.. జూన్ 1 నుంచి 12 మధ్యకాలంలో 25.99 ఎంయూల విద్యుత్ను ఉత్పత్తి చేసి కిందికు నీళ్లను విడుదల చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను తాగునీటి అవసరాలకు సంరక్షించుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జలాశయాల్లోని నిల్వలు ఆగస్టు వరకు సరిపోతాయని, ఆ తర్వాతా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటే మాత్రం తాగునీటికీ ఇబ్బందిపడక తప్పదని అధికారులు అంటున్నారు. -
కాంగ్రెస్లో ‘ఆడియో’ కలకలం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఓ ఆడియో తీవ్ర కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడితో ఆ పార్టీ సీనియర్ నేత, సీఎం రేవంత్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ మాట్లాడినట్టుగా ఉన్న ఈ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంలో పార్టీలోని కోవర్టుల వ్యవహారం ఇంకా ముగియక ముందే..పార్టీని, పీసీసీ అధ్యక్షుడిని ఉద్దేశించి షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్న ఆ ఆడియో గాందీభవన్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. రంగంలోకి దిగిన టీపీసీసీ షబ్బీర్ అలీని వివరణ కోరింది. ఢిల్లీ పెద్దలు సైతం దీనిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఏముందా ఆడియోలో.. ఆవేదన, పరామర్శ కోణంలోనే ఆ ఆడియోలోని మాటలు ఉన్నప్పటికీ పార్టీలో చర్చనీయాంశమయ్యింది. ఆ ఆడియోలో ఉన్న మాటల ప్రకారం.. తనకు కాకుండా ఎవరో చంద్రశేఖర్రెడ్డి అనే వ్యక్తికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడాన్ని తప్పుపడుతూ తాను ఉరి పెట్టుకుంటానంటూ ఓ నాయకుడు షబ్బీర్ అలీకి ఫోన్ చేయగా, సదరు నాయకుడిని ఓదారుస్తూ షబ్బీర్ అలీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. డబ్బులు పెడుతున్నారని, మహిళలను ఎరగా వేసి పదవులు తీసుకుంటున్నారనే కోణంలో వ్యాఖ్యలు ఉండటంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ పేరు కూడా ఉచ్ఛరించారు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆడియో ఎప్పటిదో అయినా..అది కాస్తా ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అయ్యింది. నేనేంటో అందరికీ తెలుసు: మహేశ్గౌడ్ ఈ ఆడియో వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ స్పందించారు. శనివారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంలో దీనిపై ప్రశ్నించగా.. ఎలాంటి ఆరోపణల విషయంలోనైనా తొందరపడేది లేదని స్పష్టం చేశారు. ‘నా వ్యక్తిత్వం, ఆస్తిపాస్తులు, నా పుట్టుక ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. నిజామాబాద్ ప్రజలకు ఇంకా బాగా తెలుసు. 40 ఏళ్లుగా లేని అవినీతి ఇప్పుడెక్కడ నుంచి వస్తుంది? షబ్బీర్ అలీనే ఆ వ్యక్తిని రేవంత్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి్పంచారు. ఎందుకు చేరి్పంచారో ఆయనే సమాధానం చెప్పాలి. రేవంత్రెడ్డి సిఫారసు చేసినందుకే చంద్రశేఖర్రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది. షబ్బీర్ అలీ అయినా, ఎవరైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మహిళల పరువు తీసేలా వ్యాఖ్యానాలు చేయకూడదు. దీనిపై ఆయన్ను వివరణ కోరాం. ఈ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది..’ అని చెప్పారు. పీసీపీ చీఫ్ను టార్గెట్ చేశారా? పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీ కాలం ముగియకముందే మహేశ్కుమార్గౌడ్ను పార్టీలోని కొందరు టార్గెట్ చేశారా? అనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ చర్చకు ఇటీవలి కొన్ని పరిణామాలు కూడా ఊతమిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్గౌడ్ ఫెయిల్ అయ్యారంటూ ఇటీవలే ఓ చానెల్లో పెద్ద ఎత్తున వార్తలు రాగా, సీఎం రేవంత్కు సన్నిహితంగా ఉండే ఓ నాయకుడే ఇలా చేశారనే ప్రచారం కూడా జరిగింది. ఈ వ్యవహారం పూర్తిగా సమసిపోక ముందే ఎప్పుడో మాట్లాడిన ఆడియోను ఇప్పుడు బయటకు తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది. అది కూడా సీఎం రేవంత్కు సన్నిహితుడైన నాయకుడే మాట్లాడినట్టు అందులో ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్గౌడ్ బలహీనపడ్డారా? లేదంటే పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారా..అన్నది అర్థం కావడం లేదని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి పీసీసీ అధ్యక్షుడి ప్రతిష్టకు భంగం కలిగేలా, పార్టీలో పనిచేస్తున్న మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. మీడియాలో వచ్చిన కథనాలు, పార్టీ కార్యకర్తతో మాట్లాడిన సంభాషణపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి, వైస్చైర్మన్ అనంతుల శ్యాంమోహన్, సభ్యుడు జాఫర్ జావేద్లు శనివారం షబ్బీర్ అలీకి లేఖ రాశారు. వివరణపై ఎలాంటి ఆలస్యం చేయకూడదని సూచించారు. -
హైదరాబాద్లో సీజేపీ భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధం
హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హైదరాబాద్లో భారీ నిరసన ప్రదర్శనకు సమాయత్తమవుతోంది. రేపు( ఆదివారం, జూన్ 14వ తేదీ) ఇందిరా పార్క్ దర్నా చౌక్ వద్ద ఆందోళనకు ప్లాన్ చేసింది. నీట్ పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై నిరసన చేపట్టనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ. దీనిలోభాగంగా ధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ ఆందోళనలో సోనమ్ వాంగ్ చుక్ పాల్గొంటుండగా, దీనికి యువత భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. -
హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్
హైదరాబాద్: హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా, ఆవిష్కర్తలను ప్రోత్సహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఎకో సిస్టం’ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైటెక్ సిటీలోని యశోదా ఆసుపత్రిలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్’ను ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఏఐ ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితం కాలేదని, అన్నింటికి విస్తరించి మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ముఖ్యంగా కేవలం వ్యాధి నిర్ధారణ దశకే పరిమితం కాకుండా... రాబోయే ముప్పును ముందే అంచనా వేసే స్థాయికి వైద్య రంగాన్ని చేర్చిందన్నారు. అలాగే... ప్రతి రోగికి ప్రత్యేక వ్యక్తిగత వైద్య సంరక్షణను అందించే సాధనంగా మారిందన్నారు. ఏఐ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాలేదని స్పష్టం చేశారు. సాంకేతికతకు మానవీయ విలువల్ని జోడించినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న తరుణంలో... క్యాన్సర్, గుండెజబ్బులు వంటి క్లిష్టమైన ఆరోగ్య సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు, ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. అందుకు... హైదరాబాద్ ను ఒక ల్యాంచ్ ప్యాడ్ తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. అకాడెమియా, ఇండస్ట్రీ మధ్య బలమైన అనుసంధానం ఏర్పడినప్పుడే ఏఐ హెల్త్ కేర్ ఆవిష్కరణలు సామాన్యుడికి అందుతాయన్నారు. భవిష్యత్తు సవాళ్లను ముందే ఎదుర్కొనేలా... కొత్త ఆలోచనల్ని ప్రోత్సహించే ఇన్నోవేషన్ ఆధారిత వ్యూహాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఆవిష్కరణలు కేవలం ల్యాబ్లకే పరిమితం కాకుండా, సమాజంలో నిజమైన మార్పును తీసుకొచ్చేలా ఆవిష్కర్తలు, స్టార్టప్స్ కు మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు. పరిశోధనలకు ఊతమిచ్చేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత డేటా ఎక్స్ ఛేంజ్ ను ప్రారంభించామన్నారు. లైఫ్ సైన్సెస్ లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘వన్ బయో’ పేరిట ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు. స్టార్టప్స్ కు అండగా నిలిచేందుకు ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్’ను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హెల్త్ టెక్ విప్లవంలో భాగస్వామ్యం కావాలని నిపుణులు, ఆవిష్కర్తలు, కంపెనీలు, స్టార్టప్స్ ను సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. -
‘వర్క్ ఫ్రమ్ బైక్’ అంటే ఇదే కాబోలు.. వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: ల్యాప్టాప్లో పని చేసుకుంటూ బైక్ నడుపుతూ వెళ్తున్న ఓ యువకుడి వీడియో.. వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ‘వర్క్ ఫ్రమ్ బైక్’ అంటూ ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వీడియోపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా స్పందించారు.రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానుకోవాలంటూ హితవు పలికిన సజ్జనార్.. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం. గుర్తుంచుకోండి... కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు. దయచేసి రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానేయండి. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి’’ అంటూ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది.రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా… pic.twitter.com/qSTFaFvf3w— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 13, 2026 -
తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు నగరాన్ని కమ్మేశాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్కు ఆరెంజ్ అలర్ట్.. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. సిద్ధిపేట్, జగిత్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ ప్రకటించింది.శంషాబాద్ అతలాకుతలం..హైదరాబాద్లోని కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. సదాశివపేటలో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి శంషాబాద్ అతలాకుతలమైంది. శంషాబాద్ ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. బస్టాప్ సెల్లార్లోకి వరద నీరు చేరింది. శంషాబాద్లో భారీవర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలుభారీ వర్షాలపై అధికారులకు సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు చేశారు. హైదరాబాద్లో ఉన్నతాధికారులు హై అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను అలర్ట్గా ఉంచాలని సీఎం ఆదేశించారు.సంగారెడ్డిలో ఈదురుగాలుల బీభత్సంసంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కొండాపూర్ మండలంలో గంటన్నర వ్యవధిలోనే 8.1 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షం ధాటికి జన జీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైంది. సదాశివపేట వద్ద రహదారిపై భారీ వృక్షం గాలికి విరిగిపడింది. సదాశివపేట చౌరస్తాలో బలమైన ఈదురుగాలులకు పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ షెడ్డు నేలకూలింది. అప్రమత్తమైన అధికారులు.. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు.చౌటుప్పల్లో భారీ వర్షం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో ఈదరుగాలులతో భారీ వర్షం కురిసింది. వలిగొండ రోడ్డులో రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 16 తేదీ నుంచి అధిక వర్షాపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. వరుసగా మూడు రోజులు తమ ప్రాంతంలో వర్షాలు కురిస్తేనే రైతులు విత్తనాలు వేసుకోవాలని ఆమె సూచించారు. హైదరాబాద్లో 17,18 తేదీలలో భారీ వర్ష సూచన ఉందని.. ఎల్నీలో ఎఫెక్ట్ ఆగస్ట్, సెప్టెంబర్లో ఉంటుందన్నారు. ఎల్నీలో ప్రభావంతో చలికాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయని.. ఎండాకాలం ఉండాల్సిన వేడి కంటే ఎక్కువ నమోదు అవుతుందని తెలిపారు. -
హైదరాబాద్లో బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసి..
హైదరాబాద్: జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్పోర్ట్, వీసా లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని జోగిపేటలో డిపోర్టేషన్కు తరలించారు. విశ్వసనీయ సమాచారం, నమ్మదగిన నిఘా వర్గాల సమాచారం ఆధారంగా... గాజులరామారం–జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో ఉన్న ఒక అద్దె ఇంట్లో కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలోనూ బంగ్లాదేశీయులు పట్టుబడుతుండడం గమనార్హం.భారత్లో ఉండేందుకు అవసరమైన పత్రాలు లేని వందలాది బంగ్లాదేశీయులు ఇటీవలే పశ్చిమ బెంగాల్లోని బితారి-హకింపూర్ సరిహద్దు కేంద్రం వద్దకు భారీగా చేరుకున్నారు. అక్రమ వలసదారులపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న "గుర్తించు-తొలగించు-బహిష్కరించు" వ్యూహం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని వారు ప్రయత్నించారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అనుమానిత చొరబాటుదారులందరికీ వెళ్లిపోవాలని, లేకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. "జల్దీ జల్దీ భాగో నహీ తో జో కర్నా హై సర్కార్ కరేగా (వెంటనే పారిపోండి, లేకపోతే ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది)" అని ఆయన అన్నారు. నిర్బంధంలో ఉన్నవారిని స్వదేశానికి పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా, ఇతర వలసదారుల కోసం 23 జిల్లాల్లో "నిర్బంధ కేంద్రాలు" ఏర్పాటు చేసింది. ఏడాది పాటు అప్పటి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిలిపివేసిన ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. 2023 ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుల్ని కూడా సిట్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత సిట్కు బదిలీ అయింది.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పు జరిగిన తర్వాత.. అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB)లో పనిచేసిన కొందరు అధికారులు కీలక డేటాను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు సాగిస్తోంది. ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నివాసానికి వెళ్లిన అధికారులు.. ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. -
ఎంఆర్సీఓజీ అర్హత సాధించిన డా. సైకం శ్రీలత నాయుడు
నల్గొండ: ప్రసూతి, స్త్రీరోగ వైద్య నిపుణురాలు డాక్టర్ సైకం శ్రీలత నాయుడు ప్రతిష్ఠాత్మక ఎం.ఆర్.సి.ఓ.జి. (MRCOG) అర్హతను సాధించారు. యునైటెడ్ కింగ్డమ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఒబ్స్టిట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (RCOG) అందించే ఈ అంతర్జాతీయ గుర్తింపు పొందిన అర్హతను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు.డాక్టర్ శ్రీలత నాయుడు గత పదేళ్లుగా నల్గొండలో ప్రసూతి, స్త్రీరోగ వైద్య సేవలతో పాటు వంధ్యత్వ చికిత్సలు, లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సల రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. వైద్య వృత్తిలో నిరంతర అధ్యయనం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఈ ఘనతను సాధించినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.ఎంఆర్సీఓజీ అర్హత సాధించడం ద్వారా శ్రీలత నాయుడు అంతర్జాతీయ ప్రమాణాల వైద్య నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారని సహచర వైద్యులు అభినందించారు. ఈ విజయం ఆమె వ్యక్తిగత ప్రగతికే కాకుండా నల్గొండ జిల్లా వైద్య రంగానికి, తెలుగు రాష్ట్రాల మహిళా ఆరోగ్య సేవలకు గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైకం శ్రీలత నాయుడుకు పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.


