తెలంగాణలో సంచలనం.. ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌ సస్పెన్షన్‌! | IAS Arvind Kumar Suspended In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో సంచలనం.. ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌ సస్పెన్షన్‌!

Feb 28 2026 8:58 AM | Updated on Feb 28 2026 10:05 AM

IAS Arvind Kumar Suspended In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

వివరాల మేరకు.. తెలంగాణలో ఇటీవలే ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. అనంతరం, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కోవడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అర్వింద్‌ కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతకం చేసినట్లు సమాచారం.

ఇక, ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ కొంతకాలం కిందటే అనుమతించారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ప్రాసిక్యూషన్‌కు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. బీఎల్‌ఎన్‌ రెడ్డి ఇప్పటికే పదవీ విరమణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement