breaking news
Revanth Reddy
-
కాంగ్రెస్ రంగు మారిందా?
సింగరేణిపై ఏ గద్దలనూ, ఏ పెద్దలనూ వాలనీయబోనని భట్టి విక్రమార్క ఘంటాపథంగా చెబుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ తన మీద చేసిన ఆరోపణలపై ఈ శనివారం కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై ఇదేవారంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన రెండో మీడియా సమావేశం ఇది. రాబందుల ప్రయోజనాలను కాపాడటానికే రాధాకృష్ణ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని భట్టి విమర్శించారు. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక’గా ఆ పత్రికను అభివర్ణిస్తూ ‘ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి నాపై తప్పుడు వార్తలు రాస్తున్నావ’ని రాధాకృష్ణను ఆయన ప్రశ్నించారు.సింగరేణి యాజమాన్యం కింద ఉన్న నైనీ బ్లాక్ బొగ్గు తవ్వకాల కాంట్రాక్టును ఎన్టీవీ యజమాని బంధువుకు ఇప్పించడం కోసమే ఎక్కడా లేని ‘సైట్ విజిట్’ నిబంధనను భట్టి విక్రమార్క తీసుకొచ్చారని ఆ వ్యాసంలో రాధాకృష్ణ ఆరోపించారు. అదే కాంట్రాక్టు మీద కన్నేసిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుతగలడంతో ఆయన మీద ఎన్టీవీలో ఒక అభ్యంతరకరమైన కథనం ప్రసారమైందని రాధాకృష్ణ ఆరోపించారు. ‘సైట్ విజిట్’ నిబంధనను తను తీసుకొని వచ్చానన్న ఆరోపణ శుద్ధ అబద్ధమని తేలుస్తూ శనివారం నాడు భట్టి డాక్యుమెంటరీ సాక్ష్యాలను విడుదల చేశారు.నలభయ్యేళ్లుగా రాజకీయ నిబద్ధతతో నిర్మించుకున్న తన వ్యక్తిత్వాన్ని హననం చేయడం పట్ల భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగినందుకే తనను రాధాకృష్ణ టార్గెట్ చేశారని కూడా మొదటి సమావేశంలో ఆయన ఆరోపించారు. నిజంగానే భట్టిది నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితమే! దళిత కుటుంబం నుంచి ఎదిగిన విద్యాధి కుడు. హైదరాబాద్ యూనివర్సిటీలో ఎం.ఏ. చదివారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొంతకాలం ఎమ్మెల్సీగా పని చేసి, తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి వరసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికై కమ్యూనిస్టు నేత బోడేపూడి వెంకటేశ్వరరావు రికార్డును బద్దలు కొట్టారు. గడచిన అసెంబ్లీలో తన సహచర పార్టీ ఎమ్మెల్యేలు వరుసకట్టి పార్టీ ఫిరాయిస్తున్నా చలించకుండా పార్టీకే కట్టుబడిన వ్యక్తి. అనంతరం పార్టీ గెలుపు కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశమున్న వారిలో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అటువంటి తన కెరీర్పై మీడియాలో బురద చల్లడం పట్ల సహజంగానే ఆయనకు ఆవేదన కలిగి ఉంటుంది.భట్టితో పాటు అదే వ్యాసం మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా బజారున పెట్టింది. మంత్రి పదవిలో ఉండి సొంత పనికోసం తన పలుకుబడిని ఉపయోగించుకున్నారనే మరకను ఆయనకు అంటించారు. పేర్లు ప్రస్తావించకుండా మంత్రి మీద, మహిళా అధికారుల మీద ఎన్టీవీ ప్రసారం చేసిన ‘ఆఫ్ ది రికార్డు’ కథనం అభ్యంతరకరమైనదే! కాకపోతే మాజీ గవర్నర్, వయోవృద్ధుడైన ఎన్.డి. తివారీ మీద రాసలీలల పేరుతో కథనాలు వండివార్చిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక మరో మీడియా ఛానల్ను ఎత్తిచూపడమే వింతగొలుపుతున్నది. మీడియాలో అభ్యంతరకరమైన వార్తలు వచ్చినప్పుడు ఆ మీడియా సంస్థ ముఖ్యబాధ్యులకు నోటీసులివ్వడం, పరువు నష్టం కేసులు, సివిల్ కేసులు వేయడం ఒక సంప్రదాయం. కానీ ఎకాయెకిన క్రిమినల్ కేసులు పెట్టి, ఎంపిక చేసుకున్న ముగ్గురు బీసీ, ఎస్సీ జర్నలిస్టులను (దొంతు రమేశ్, పరిపూర్ణాచారి, సురేశ్) అరెస్టు చేశారు. గత కొంతకాలంగా పాత కాంగ్రెస్ నేతల మీద రకరకాల లీకులు, ఆరోపణలు అటు యెల్లో మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వరసగా కనిపిస్తున్నాయి. దీని వెనుకనున్న అదృశ్య హస్తం ఎవరిదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. కాంగ్రెసులోనే పుట్టి పెరిగిన బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడైన మంత్రి మీద కూడా సోషల్ మీడియాలో విప రీతంగా వ్యతిరేక ప్రచారం జరిగింది. నాలుగు దశాబ్దాలుగా జగి త్యాల ప్రాంత కాంగ్రెసుకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన సీనియర్ నేత, నిబద్ధత గల నాయకుడిగా పేరున్న జీవన్రెడ్డికి పార్టీలోనే పొగబెట్టడం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. గాంధీ భవన్లో జరిగిన తమ పార్టీ ప్రాంతీయ సమావేశంనుంచి కూడా ఆయన వాకౌట్ చేసి బయటకు రావలసిన దుఃస్థితి పాత కాంగ్రెస్ నేతల పరిస్థితికి ఇప్పుడు అద్దం పడుతున్నది.కాంగ్రెస్ వ్యవహారాల్లో ఈ లీకులు, ఆరోపణలు, యెల్లో మీడియా ద్వారా వెలువరిస్తున్న కథనాలు, కుంభకోణాలు వగైరాలన్నీ ఉపకథలు మాత్రమే. అసలు కథ అంతర్లీనంగా జరుగుతున్న రాజకీయ మార్పు. కొద్ది రోజుల కిందట ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన రాజకీయ ప్రసంగం తెలంగాణ సమాజంలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీని లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీని ఎన్టీఆర్ అభిమా నులూ, చంద్రబాబు అనుయాయులూ కలిసి బొందపెట్టాలని, బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెలను కూల్చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ముఖ్య భాగ స్వామి. రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి. మరి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను ఓడించడానికి ఎన్డీఏ అభిమానులను ఆహ్వా నించడమేమిటి? రాష్ట్ర కాంగ్రెస్లో కాంగ్రెస్ రక్తమే ఉన్నదా? లేక ‘క్రమశిక్షణ కలిగిన రక్తకణాలు’ ఏవైనా బయట నుంచి ప్రవేశించాయా? ‘మా రక్తాన్ని ఎక్కించుకుంటే చిరంజీవి ఎన్నికల్లో గెలిచే వాడ’ని వెనుకటికి ఒక ‘కులోత్తుంగ’ చోళుడు నుడివిన పలుకులు ఎవరూ మరిచిపోయేవి కావు. తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక మార్పయితే జరుగుతున్నదనే అభిప్రాయం కార్యకర్తల్లో ఈమధ్య బాగా వినిపిస్తున్నది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొందపెట్టిందెవరు? బీఆర్ఎస్సా? ఎంత మాత్రం కాదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ‘తెలుగుదేశం’ను భూస్థాపితం చేసింది. ‘మహాకూటమి’ని ఏర్పాటు చేసుకున్నా కూడా 2009లో అది లేవలేకపోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మోదీతో, పవన్తో జోడీ కట్టి అలవికాని హామీలిచ్చి టీడీపీ పునరుజ్జీవం పొందగలిగింది. కానీ తెలంగాణలో రెండు దశాబ్దాలు దాటినా ఇంకా అది సమాధి స్థితిలోనే ఉన్నది.కేసీఆర్ హయాంలో జరిగిందేమిటంటే, ‘ఓటుకు నోటు’ బాగోతంలో దొరికిపోయినందువల్ల ‘పదేళ్ల రాజధాని’ హైదరా బాద్ను వదిలేసుకుని చంద్రబాబు సర్కార్ పలాయనం చిత్తగించింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొందపెట్టింది మాత్రం 2004లో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలే! ముఖ్యమంత్రి సందేశాన్ని అందుకొని తెలుగుదేశం అభిమానులు పగ సాధించ వలసింది ఎవరిపైన? కాంగ్రెస్పైనే కదా! నాటి కాంగ్రెస్ – నేటి కాంగ్రెస్ అని విభజించి యాక్షన్ ప్లాన్ అమలుచేయాలా? ఏమిటిప్పుడు తెలుగుదేశం అభిమానుల తక్షణ కర్తవ్యం?‘ఎవరి కళ్లలో ఆనందం చూడటం కోసం నా మీద అసత్య వార్తలు రాస్తున్నావు రాధాకృష్ణా?’ అని భట్టి ప్రశ్నిస్తున్నారు. ఆ కళ్లు ఎవరివై ఉంటాయి? ఏ రాబందుల ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. ఆ రాబందులు ఎక్కడివై ఉంటాయి? భట్టి మీద, ఆయనతో సహా పాత తరం కాంగ్రెస్ నేతల మీద ఆ కళ్లు ఎందుకని నిప్పులు పోసుకుంటున్నాయి? జీవన్రెడ్డి వంటి నీతిమంతులైన నేతలను ఎందుకని మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రొటో కాల్ను పక్కనపెట్టి ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణను కలిసిరావడం కాంగ్రెస్ శ్రేణుల్లో కింది నుంచి పైస్థాయి వరకు చాలామందికి మింగుడుపడడం లేదు. బీఆర్ఎస్ను తరిమికొట్టే పేరుతో తెలుగుదేశం అభిమానులకు స్నేహహస్తం చాచడం కూడా పార్టీ కార్యకర్తలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇరవై రెండేళ్ల కింద తామే స్వయంగా సమాధి చేసిన పార్టీ ఆత్మను ఇప్పుడు ఆవాహన చేయవలసిన అవసరమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో నిట్టనిలువునా ఒక సైద్ధాంతిక విభజనైతే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ శ్రేణుల దౌర్భాగ్యం ఏమిటంటే స్వయానా ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్గాంధీకి చంద్రబాబుతో అంతుచిక్కని చెలిమి ఏదో ఏర్పడి ఉండటం! ఫలితంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల జాతీయ పార్టీకి నియంత్రణ లేకుండా పోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందువల్ల, బీజేపీ మీద బలమైన సైద్ధాంతిక పోరాటం ఆ పార్టీ చేయాలని కాంగ్రెస్ నాయకులు గానీ, లౌకికవాదులు గానీ ఆశిస్తారు. కానీ ఇక్కడ ఎన్డీఏ ముఖ్య భాగస్వామి కనుసన్నల్లో జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి.వ్యూహాత్మకంగానే రెండు రాజకీయ పరిణామాలు తెలంగాణలో నిశ్శబ్దంగా జరిగిపోతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకటి – కాంగ్రెస్ పార్టీలో పాత కాంగ్రెస్ లేదా సైద్ధాంతిక కాంగ్రెస్వాదులు పూర్తిగా పట్టు కోల్పోయేలా చేయడం! రెండు – రాష్ట్రంలో ప్రతిపక్షంగా బీజేపీ బలపడాలంటే బీఆర్ఎస్ నిర్వీర్యం కావాలి... అందుకు అవసరమైన భూమికను తయారుచేయడం! గత కొంత కాలంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు, విచారణలు వగైరాలన్నీ ఈ కోణంలోంచి చూసినప్పుడే అర్థం చేసుకో గలుగుతాము. ఫోన్ ట్యాపింగ్ పేరుతో జరుగుతున్న దర్యాప్తులో వేగం పెంచాలని బీజేపీ నేతలు ఒత్తిడి చేయడం, ‘ఫార్ములా–ఇ’ రేసు కేసులో ఈడీ రంగప్రవేశం, ఆగమేఘాల మీద బొగ్గు వ్యవహారంపై కేంద్ర కమిటీ దర్యాప్తు ప్రారంభించడం వగైరాలన్నీ తెలంగాణలో తెర వెనుక జరుగుతున్న విచిత్ర రాజకీయ మైత్రీబంధాల సంకేతాలుగానే భావించాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మీకు.. మాకు సై.. తెలంగాణలో కక్ష రాజకీయాలు?
-
RS Praveen : ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి
-
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో సంచలన మార్పులు తీసుకొచ్చింది. దీంతో, ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదికి పైగా అనధికార గైర్హాజరు అయితే ఉద్యోగం కోల్పోయే విధంగా రూల్స్లో పలు సవరణలు చేసింది.వివరాల మేరకు.. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల నిబంధనల్లోని సివిల్ సర్వీసెస్ రూల్స్లో రూల్ 9, రూల్ 25కి సవరణలు చేసింది. ఈ క్రమంలో ఏడాదికి పైగా అనధికార గైర్హాజరు అయితే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. అలాగే, ఐదేళ్లకు మించి నిరంతర గైర్హాజరు అయితే సేవల నుంచి తొలగించే విధంగా సవరణ జరిగింది. ఇక, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ టూర్ వెళ్లినా చర్యలు తీసుకునే విధంగా మార్పులు చేశారు. అయితే, చర్యలకు ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీసు తప్పనిసరి అని నిబంధనల్లో పేర్కొన్నారు. -
బేఫికరుండు.. నాదీ గేరంటీ
‘ఏం తమ్మీ మంచి గున్నవా?’..‘మంచిగున్న అన్నా.. నిన్నిట్టా సీఎం పోస్టులో జూస్తాంటే బలే హేపీగా ఉన్నదన్నా’..‘మీ బాపూ చూపించిన దారే గద తమ్మీ. అందుకే గద తమ్మీ.. సార్ని నేను దేవుడంటా వుంటా’..‘నీ అసుంటి మంచోడు దునియాలోనే వుండడన్నా.. మంచి జేసినా గూడా యెనకాల గోతులు తవ్వేటోల్లే తప్ప.. ఇలా యాది పెట్టుకునేటోళ్లు యెవరుంటున్నారన్నా’..‘అరె ఛుప్. అలా గట్టిగా అనకురా తమ్మీ.. నీ బాపు గురించి నువ్వే సీక్రెట్స్ బయటపెట్టేస్తన్నావని.. అందరూ క్రిటిసైజ్ చేస్తారు మల్ల’.. ‘అర్రర్రె పాయింటు మర్చిపొయినా! అది మన హిస్టరీనే గదా.. బలే గుర్తుచేశావ్ రేవంతన్నా. మనలో మనం మురిసిపోవచ్చు గానీ.. బయటకు అనగూడదు కరక్టే.’‘నీ బాపు ఎక్కడ తమ్మీ.. కానొస్తలేడు. అందరం దావోస్ లోనే ఉన్నం. ఒకే చోట తిరుగుతున్నం. ఒకే పంచాయతీలు పెడుతున్నాం. పుటో దిగుతున్నం. డప్పు గొట్టిపిచ్చుకుంటున్నం.. అయినా మీ నాయిన కానొస్తలేడేంది తమ్మీ’.. ‘ఊకో అన్నా.. దావోస్ ల నువ్వు ఉన్నావంటేనే మా నాయినకు జొరమొచ్చేట్టుంది. దూరం నుంచి నువ్వు గనిపిస్తే చాలు.. తప్పించుకు తిరుగుతున్నాడు పాపం..’‘గదేంది తమ్మీ.. నీ బాపు గనిపిస్తే క్లోజ్డ్ రూంల సిటింగేసి ముచ్చట బెట్టాలనుకుంటి’‘ఊర్కో అన్నా. ఒక క్లోజ్డ్ రూం ముచ్చటనే బరాబర్ బజార్ల పెట్టేశావు. దునియా అంతా మా మొహాన దుమ్మెత్తి పోస్తాంటే లాక్కోలేక పీక్కోలేక నానా యాతన అవుతాంది. మా మినిస్టర్లను జూసినవా. నిన్ను ఒక్క మాటైన అననీకి, నువు జెప్పింది అబద్దం అననీకి దైర్యం లేదు. కానీ.. మా నాయిన మీద బురదని మాత్రం కడిగెయ్యాలి.. అందుకోసం ఎన్ని పాట్లు పడుతున్నారో జూసినవా..’‘మరైతే బాపును క్లోజ్డ్ రూం ల కలవడం కుదరదంటవా..’‘నువ్వింకోపాలి ఆ క్లోజ్డ్ రూం మాటెత్తితే దావోస్ నుంచే పారిపోయేట్టున్నాడన్న మా నాయిన’‘చల్ తియ్.. అయితే మాన్లె. నిన్నయినా ఇట్ట ఓపెన్ రూం కల్సులు అయ్యె ఈ తానకి’‘అయినా రేవంతన్నా.. ఏడాదికి మించి కుర్సీలో ఉండవేమో అనుకుంటినే’‘గట్లెట్ల అవుతది తమ్మీ.. నాదేమైనా గసుమంటి గిసుమంటి ట్రెయినింగనుకుంటివా? మీ బాపు దగ్గర నేర్చుకుంటినని యాద్ మరిసితివా? ఎవులైతే మన కుర్సీ మీద కన్నేసిన్రో.. ఆల్లందరూ ఇప్పుడు అవినీతి కంప్లయింట్ల బురదలో పడి కొట్టుకుంటున్నరు.. జూసినవా’‘అరె.. ఏం వుషారున్నవ్ రేవంతన్నా.. ఈ లెక్కన నీకు అయిదేళ్లూ కుర్సీ గ్యారంటీ స్కీముంటదేమో నన్నా’‘తప్పదు గద తమ్మీ.. వుషారుండాలె. దునియా అందరికీ నీ బోంట్ల కుర్సీలో కూర్సోబెట్టే బాపు వుండడు గద తమ్మీ’‘ఎక్కడన్నా.. కూర్సొనుడు కూర్సొనుడ అనుకోడమే గానీ.. ఎప్పుటికి గూర్సుంటనో ఏమో’‘నీకు మించి నీ బాపుకి మస్తు కోరికున్నది గానీ.. ఫికరు జెయ్యకు తమ్మీ.. జరూరు కుర్సీ నీదే..’‘మా సోపతోల్లు ఊకుంటరో లేదో నని చిన్న గుబులున్నది అన్నా’‘చల్ తియ్.. గింత బేకారున్నవేంది తమ్మీ. నీ సోపతుల్లో పవన్ కల్యాణు నీ కుర్సీ మోసేటందుకే ఎగబడుతోంటే నువ్వు ఫికరౌతవేంది. బేఫికరుండు.. అంతగైతే నేనున్న గద. మంత్లీ మంత్లీ డిల్లీకి జమాయిస్తన్నది కాస్తా ఓపాలి నీకు జమాయిస్త. గంతె. జబర్దస్త్ నువు కుర్సీలో కొస్తవ్.. నాదీ గేరంటీ’‘ఆ మాట అనబోకు రేవంతన్నా.. నీ ఆరు గేరంటీల్లోనే యిది గూడా కలిపేస్తావేమో’‘ఇంత పిచ్చోనివి ఎలా బతుకుతవ్ రా బై. మందికిచ్చేటిది.. నా దేముని కొడుకైన తమ్మీకిచ్చేటిది వొకటే అవుతదా’‘ఆ మాటన్నావ్.. దైర్యంగా వుందన్నా’‘చల్ పోదం పా. ఉన్నూర్లో ముచ్చట్లాడుకోవాలంటే.. గాలికి గూడా సెవులు మొలుస్తయ్.. యింటా వుంటయ్.. యింత కష్టపడి స్పెషలు గాలిమోటర్లేసుకుని దావోసు కొచ్చినం. యిక్కడైనా మన మనసులో ముచ్చట్లు పంచుకోకుంటే గెట్ల? యింక పోదాం తియ్’::రాజేశ్వరి -
కాంగ్రెస్ ప్రభుత్వంలో దండుపాళ్యం ముఠా ఉంది
-
ఏ తప్పూ చేయలేదు.. దేనికీ భయపడం
సిరిసిల్ల: ఏ తప్పూ చేయలేదు.. దేనికీ భయపడమని..సిట్ విచారణకు బరాబర్ పోతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని తెలంగాణభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వేసిన సిట్ అంటే.. రేవంత్రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని విమర్శించారు. రేవంత్రెడ్డికి పరిపాలన రాదు..చేతగాదు, అసమర్థుడు.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదన్నారు. హామీలు అమలు చేయకుండా అటెన్షన్ డైవర్షన్ గేమ్స్ ఆడుతున్నారని చెప్పారు. ఈ రెండేళ్లు డ్రామాలు తప్ప రేవంత్రెడ్డి ప్రభుత్వం సాధించిందేమీ లేదని చెప్పారు. జిల్లాలను తగ్గించాలని చూస్తే బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉద్యమిస్తుందని హెచ్చరించారు. బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకు.. మొన్న హరీశ్రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టారని సాయంత్రాని కల్లా సిట్ నోటీస్ ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. ఇటు రేవంత్రెడ్డి.. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బదులుకొని ఎలా దోపిడీ చేస్తున్నారో బయటపెడితేనే నోటీసులు పంపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడితే ఆశ్చర్యం అనిపించిందని చెప్పారు. తాము ఆధారాలతో సహా చూపెడుతుంటే.. దొంగనే ఫిర్యాదు చేయాలనడం ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వ వైఖరి అట్లనే ఉందన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెబితేనే జర్నలిస్టులు వార్తలు రాశారని.. వాటిపై ప్రభుత్వం ఖండించలేదని చెప్పారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీని అడుగుతున్నాను.. ప్రస్తుతం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదని ప్రమాణం చేసి చెప్పగలుగుతారా అని అన్నారు. ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలు ఎవరైనా చేస్తే కాపాడేందుకు నెహ్రూ టైం నుంచి ఇప్పటి మోదీ వరకు ఇది ఉంటుందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్ని వేల ఫోన్లు వింటున్నారని.. అది ఆయనకు తెలుసో తెలియదో తనకు తెలవదని కేటీఆర్ అన్నారు. శాంతిభద్రతల వ్యవహారం దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్గా చేసే కార్యక్రమమని కేటీఆర్ పేర్కొన్నారు. దానికి మంత్రులు, ప్రభుత్వంలో ఉండే నాయకులకు పాత్ర ఉండదని.. ఇదే చెబుతానని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు గూఢచారి వ్యవస్థ మీద ఆధారపడతాయని, ప్రభుత్వాధినేతలకు రిపోర్టులు వస్తాయన్నారు. అవి ఎట్లా వస్తాయో తమకు తెలవదని పేర్కొన్నారు. సిట్ ఎవరిని పిలవాలి? నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన ప్రస్తుత డీజీపీగా ఉన్న శివధర్రెడ్డిని పిలిచారా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు? ఇవాల్టి డీజీపీ శివధర్రెడ్డి, మొన్నటి దాకా డీజీపీగా పనిచేసిన జితేందర్కు తెలుస్తది ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారో, మాకేం తెలుస్తదని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. పది రోజుల టైం పాస్ వ్యవహారం ముఖ్యమంత్రి దావోస్ పోయిండు కదా? ఆడికెళ్లి హార్వర్డ్ పోతుండు కదా? 10 రోజులు టైం పాస్ చేయాలి కదా? అందుకే ఒక రోజు హరీశ్రావును, ఒక రోజు కేటీఆర్ను పిలవండి.. అని సిట్కు ఆదేశాలిచ్చారని కేటీఆర్ అన్నారు. హరీశ్రావును పిలిచి అడిగిందే అడుగుడు, తిర్లమర్ల చేసి అడుగుడు, మరల తిర్లేసి అడుగుడు తప్ప.. ఈ ప్రభుత్వం ప్రజలకు పనికొచ్చే పనిచేసిందా అన్నారు. దావోస్ పోయిన ముఖ్యమంత్రి ఎక్కడా ఉపముఖ్యమంత్రి తన కుర్చీ గుంజుకుంటాడోనని రేవంత్రెడ్డి నోటీసులు పేరిట టైంపాస్ డ్రామా చేయిస్తుండని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు పాల్గొన్నారు. -
దావోస్ పెట్టుబడులు రూ.28,693కోట్లు
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సును ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడు రోజుల పాటు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో జరిపిన చర్చలు, సంప్రదింపులు ఫల ప్రదంగా ముగిశాయి. రాష్ట్రంలో రూ.28,693 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటనలో ఆశించిన లక్ష్యాలను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘డబ్ల్యూఈఎఫ్–2026 సదస్సు’లో పెట్టుబడుల సాధన కంటే ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరినట్లు ప్రకటించాయి. గత నెలలో హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన విషయాన్ని గుర్తు చేశాయి. పెట్టుబడులు.. కీలక ఒప్పందాలు మూడు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సుస్థిర అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి డబ్ల్యూఈఎఫ్ నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారు. హెదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలంటూ సీఎం చేసిన ప్రతిపాదనపై డబ్ల్యూఈఎఫ్ వర్గాలు సానుకూలంగా స్పందించాయి. స్వదేశానికి మంత్రులు ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో జరిగిన 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలు కీలక సమావేశాలు, ప్రత్యేక సెషన్ల అనంతరం.. తెలంగాణ ప్రతినిధి బృందం మూడు రోజుల దావోస్ పర్యటన గురువారం సాయంత్రం ముగిసింది. దావోస్లో కార్యక్రమాలు ముంగించుకున్న ముఖ్యమంత్రి.. రోడ్డు మార్గంలో జ్యూరిచ్కు వెళ్లారు. అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్తారు. తెలంగాణ బృందంలో సభ్యులుగా ఉన్న మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అధికారులు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. -
ఫాలో అప్ భేటీపై సానుకూలత
సాక్షి, హైదరాబాద్: దావోస్లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు కొనసాగింపుగా ఏటా జూలైలో హైదరాబాద్లో ‘ఫాలో అప్’సమావేశం నిర్వహించాలని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రతిపాదనపై సానుకూల స్పందన వ్యక్తమయ్యింది. దావోస్ సదస్సులో జరిగే చర్చలు, తీసుకునే నిర్ణయాల పురోగతిని సమీక్షించేందుకు ‘ఫాలో అప్’సమావేశం ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. కాగా ఈ ప్రతిపాదనపై డబ్ల్యూఈఎఫ్ ఎండీ జెరెమీ జర్గెన్స్ స్పందించారు. గురువారం తెలంగాణ పెవిలియన్లో జెరెమీ జర్గెన్స్, సీ4ఐఆర్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు ఫాలో అప్ సదస్సు నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు.ఫాలో అప్ సదస్సు నిర్వహణ ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగ అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి చూపించాలనే తన ఆలోచనను సీఎం పంచుకున్నారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై డబ్ల్యూఈఎఫ్ బృందం సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు అందాయని, సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని జర్గెన్స్ తెలిపారు.చైనా లో ప్రతి ఏడాదీ ‘సమ్మర్ దావోస్’ జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా ఫాలో అప్ సమావేశ నిర్వహణకు ఆసక్తి చూపుతోందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్మ్యాప్ తదితరాలను ఆయన ప్రశంసించారు. ‘తెలంగాణ రైజింగ్’లో తాము భాగస్వాములం అవుతామని చెప్పారు. హైదరాబాద్లో ప్రతిభావంతమైన మానవ వనరులున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రీడలు, నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత అధునాతన టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ వివరించారు. నైపుణ్యాభివృద్ధితో పాటు క్రీడలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. కాగా హైదరాబాద్లో జరిగిన బయో ఏషియా–2024లో ప్రారంభించిన సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండ్రస్టియల్ రివల్యూషన్) పురోగతిపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం కోర్, ప్యూర్, రేర్ పేరిట అమలు చేస్తున్న మూడు జోన్ల విధానం, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రత్యేకతలను మంత్రి శ్రీధర్బాబు వివరించారు. విమానయాన, అంతరిక్ష, రక్షణ, ఐటీ, ఔషధ రంగాల్లో హైదరాబాద్ అనుకూలతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. -
ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను దేశంలో ఏఐ డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. యూపీసీ వోల్ట్ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. దావోస్లో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం ఈ మేరకు యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రెన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రెన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై జరిపిన చర్చల ఫలితంగా ఈ ఎంవోయూ కుదిరింది.నెదర్లాండ్స్కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ భాగస్వామ్యంతో యూపీసీ వోల్ట్ సంస్థ ఆవిర్భవించింది. కాగా ఎంవోయూ ప్రకారం ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు దానికి అవసరమయ్యే విద్యుత్ కోసం 100 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును సంస్థ నెలకొల్పుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగాలు దక్కుతాయి. మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. శంషాబాద్, గాగిల్లాపూర్లో ‘స్నైడర్’విస్తరణరాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా’రూ.623 కోట్లతో శంషాబాద్, గాగిల్లాపూర్లో తమ యూనిట్లను విస్తరించనుంది. దావోస్లో సీఎం రేవంత్రెడ్డితో జరిగిన భేటీలో ఆæ కంపెనీ సీఈవో దీపక్ శర్మ ఈ మేరకు ప్రకటన చేశారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రియల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. స్నైడర్ ఎలక్ట్రిక్కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. ‘ఐనాక్స్’తో మంత్రుల భేటీతెలంగాణను కాలుష్య రహి త మహానగరంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్తో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమావేశ మయ్యారు. సోలార్ మాడ్యూల్స్ సహా ఆధునిక, సుస్థిర తయారీ రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించారు. ఐనాక్స్ గ్రూప్ తెలంగాణలో సౌర , పవన విద్యుత్ ఉత్పత్తి చేపట్టి, ఆ తర్వాత తయారీ రంగంలోకి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ: సీఎం రేవంత్ కృత్రిమ మేధస్సు (ఏఐ)లో యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్ తరాల కోసం నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. దావోస్ వేదికగా ప్రారంభించిన తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (టీఏఐహెచ్)కు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం జరిపిన చర్చల ఫలితంగా పలు ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ⇒ బ్రిటన్కు చెందిన విద్యా, పబ్లిíÙంగ్ సంస్థ పియర్సన్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలో ఏర్పాటు కానున్న ‘గ్లోబల్ ఏఐ అకాడమీ’కి పియర్సన్ సహకారం అందిస్తుంది. ⇒ జార్జ్ టౌన్ యూనివర్సిటీకి చెందిన ‘ఏఐ కోల్యాబ్ సంస్థ’తో కుదిరిన మరో ఒప్పందం ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ⇒ దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్తో కుదిరిన ఎంఓయూ ద్వారా రాష్ట్రంలో స్టార్టప్ల అభివృద్ధికి అవకాశాలు అన్వేíÙంచనున్నారు.గోద్రెజ్ చైర్మన్తో మంత్రులు భేటీ గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్తో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దావోస్లో సమావేశమయ్యారు. ఆయిల్ పామ్ సాగులో ఏఐ సాంకేతికత వినియోగం, హైదరాబాద్లో ఉన్న గోద్రెజ్ క్రీమ్లైన్ డెయిరీ ప్లాంట్ను రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే అవకా శాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నివాస ప్రాంతంలో భారీ గృహ నిర్మాణాల ప్రాజెక్టులు చేపట్టే అంశంపైనా చర్చించారు. హైదరాబాద్ను సందర్శించాల్సిందిగా నాదిర్ను మంత్రి శ్రీధర్బాబు ఆహ్వానించారు. -
తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్కు అపూర్వ స్పందన
దావోస్: దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2026 సమావేశాల్లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH)కు అంతర్జాతీయ స్థాయిలో అపూర్వ స్పందన లభించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' బృందం పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది.బ్రిటన్కు చెందిన ప్రముఖ విద్యా, పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలో ఏర్పాటు కానున్న గ్లోబల్ ఏఐ అకాడమీకి పియర్సన్ సహకారం అందించనుంది. ఏఐ శిక్షణ, పాఠ్య ప్రణాళిక, లెర్నింగ్ కంటెంట్, అంచనా విధానాలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లలో తన నైపుణ్యాన్ని పియర్సన్ ఉపయోగించనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... యువతకు ఏఐ శిక్షణ అందించి భవిష్యత్ తరాలకు నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఎంఓయూ కుదుర్చుకున్న బృందాన్ని ఆయన అభినందించారు.ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్లో ఏఐ సిటీ నిర్మాణానికి అవసరమైన పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే అన్ని ప్రముఖ టెక్ కంపెనీలు ఉన్నాయని, ప్రతిభ, మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఐటీ, పరిశ్రమలు) సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పియర్సన్తో కలిసి ఉన్నత నైపుణ్యాల కలిగిన మానవ వనరుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.ప్రాజెక్టు త్వరితగతిన అమలుకు అవసరమైన అనుమతులు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. జార్జ్న్ యూనివర్సిటీకి చెందిన ఏఐ కోల్యాబ్ సంస్థతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అనువర్తిత పరిశోధనలకు ఇది దోహదపడనుంది.అలాగే దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్ (DMCC)తో కుదిరిన ఎంఓయూ ద్వారా స్టార్టప్ల అభివృద్ధికి అవకాశాలు అన్వేషించనున్నారు. రెండు దేశాల మార్కెట్లు, ఎకోసిస్టమ్లపై అవగాహన కల్పించడంతో పాటు, అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. -
రేవంత్, సిట్.. టీవీ సీరియల్ వంటి డ్రామా: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అండే స్టాండ్ అనే విధంగా సిట్ వ్యవహరిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లను ట్యాపింగ్ చేయడం లేదా? అని ప్రశ్నించారు. అడిగిందే అడిగి.. టైం పాస్ చేయడం తప్ప దీంట్లో మరేమీ లేదని వ్యాఖ్యలు చేశారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అండే స్టాండ్. పాలన చేతగాక అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఫోనట్ ట్యాపింగ్ కేసు కార్తీక దీపం సీరియల్ మాదిరిగా నడుస్తోంది. కార్తీక దీపం సీరియల్ కూడా ముగిసింది. ఇది మాత్రం అవ్వట్లేదు. టీవీ సీరియల్ డ్రామాలను తలపించేలా డ్రామాలు చేస్తున్నారు. కేసు విచారణ ప్రారంభించి రెండేళ్లు అయ్యింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బలి అయ్యేది పోలీసు అధికారులే అని చెప్పుకొచ్చారు. ఇది ట్రాష్ కేసు.. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. హరీష్ రావును అడిగిందే అడిగి టైమ్ పాస్ చేశారు. రేపు నాతో కూడా అదే చేస్తారు. నా ఫోన్ ట్యాప్ అవుతుందో లేదో సిట్ను అడుగుతాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లను ట్యాపింగ్ చేయడం లేదు?. గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న శివధర్ రెడ్డిని విచారణకు పిలిచారా?. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని చెబుతున్నారు. సిట్ వేయాల్సింది ఎవరి మీదనో తెలుసా.. గూండాలతో భూములు కబ్జా చేస్తున్న మంత్రి పొంగులేటి కొడుకుపై సిట్ వేయాలి. బొగ్గు కుంభకోణంలో రేవంత్ రెడ్డి బావమరిదిపై సిట్ వేయాలి. కంచె గచ్చిబౌలి భూముల్లో స్కామ్ జరిగింది. సిట్ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా ఇప్పటి వరకు సిట్ వేయలేదన్నారు.హరీష్ రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టారు. సాయంత్రం కల్లా సిట్ నోటీసులు అందాయి. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అనేది నేడు జరుగుతోంది ఏం కాదు.. 1952 నుంచి ఇప్పటి వరకూ జరుగుతోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా అదే ట్వీట్ చేస్తాడు. ఆయనకేం తెలుసో, లేదో నాకైతే తెలియదు. సిట్ విచారణకు బరాబర్ వెళ్తాను. అన్ని సమాధానాలు చెబుతాను అని అన్నారు. అలాగే, పరాభవం తప్పదనే భయంతో జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రజల సౌలభ్యం కోసమే మేము జిల్లాలను ఏర్పాటు చేశాం. కేసీఆర్ ఏర్పాటు చేసిన కొన్ని జిల్లాలను రద్దు చేయాలని చూస్తున్నారు. కొత్త జిల్లాల రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి సులభతరం అవుతుందని కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలని చూస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచాయతీ ఫలితాలు మించి మున్సిపల్ ఫలితాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం సంపాదిస్తుంది. జిల్లాల ఏర్పాటుపైన కమిషన్ వేస్తున్నామంటున్నారు. కొత్త జిల్లాలైన సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలను రద్దు చేయాలనే యోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. పాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేశారు. జిల్లాల విభజన అశాస్త్రీయమంటూ తుగ్లక్ పనులు చేస్తే ప్రజల చేత తిరస్కరించబడతారు. అధికార వికేంద్రీకరణ కొరకు కేసీఆర్ అడుగేస్తే మీరు చెరిపేయాలనుకుంటే ఉద్యమిస్తాం అని హెచ్చరించారు. -
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తారా?: హరీష్ రావు
-
దావోస్.. డెస్టినేషన్ మీటింగ్ అడ్డలా మారింది: రామచందర్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కావాలని బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు. సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అవకతవకలపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు దావోస్ వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ తీరుపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి నాలుగు నెలలు పూర్తి, అనుబంధ విభాగాల పనితీరుపై ఆయన సమీక్ష చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర కమిటీ పనితీరుపై రామచందర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం, రామచందర్ రావు మాట్లాడుతూ.. బీజేపీ అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాం. జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ లాంటి వారి సభల కోసం బీఎల్ సంతోష్కి ప్రతిపాదనలు పంపాం అని అన్నారు.ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ..‘సింగరేణి నైనీ కోల్ టెండర్ల విషయంలో రాష్ట్రం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉంది. సీబీఐకి ఇస్తే 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలన్నది బీజేపీ డిమాండ్. దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ లాస్ట్ టైం వెళ్లినప్పుడు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో చూపెట్టాలి. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలి. దావోస్ వెళ్లి చేస్తున్నారు?. మంచు చూడటానికి వెళ్లారా?. దావోస్ డెస్టినేషన్ మీటింగ్ అడ్డలా మారింది. పెట్టుబడులు తేవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రెండు దావోస్ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యం చెందాయి కాబట్టి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. -
ఇంట్రస్ట్.. ఇన్వెస్ట్
సాక్షి, హైదరాబాద్: డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్, తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.12,500 కోట్ల పెట్టుబడికి సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 2026’సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ప్రతినిధి బృందం రష్మి గ్రూప్తో భేటీ అయ్యింది. తెలంగాణలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే అవసరమైన బొగ్గు సరఫరా లింకేజీ సహా ఇతర సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. చర్చల అనంతరం ఎంవోయూ కుదిరింది. గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంపై కూడా రష్మి గ్రూప్ చర్చించింది. ఈ భేటీలో సంస్థ ప్రమోటర్ సజ్జన్కుమార్ పటా్వరి, డైరెక్టర్ సంజీబ్కుమార్ పటా్వరి పాల్గొన్నారు. కాగా డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం బుధవారం మరికొన్ని కీలక భేటీలు జరిపింది. వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. మరికొన్ని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ కీలక ప్రకటనలు చేశాయి. రూ.6 వేల కోట్ల పెట్టుబడికి ఈఓఐ క్లీన్ ఎనర్జీ రంగంలో రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఈఓఐ) సమరి్పంచింది. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బృందంతో జరిగిన భేటీలో ఐక్యూ క్యాపిటల్ గ్రూప్ చైర్మన్ డా.న్ బాబిక్, సీఈఓ, డైరెక్టర్ అనిల్కుమార్ బావిశెట్టి, గ్రీన్ హౌస్ ఎన్విరో సీఈఓ, డైరెక్టర్ మొలుగు శ్రీపాల్రెడ్డి, స్లోవాక్ రిపబ్లిక్ కాన్సుల్ మాటుస్ జెమెస్ పాల్గొన్నారు. 2047 నాటికి కాలుష్య రహిత తెలంగాణ సాధన లక్ష్యంతో తమ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది. ఇది గరిష్టంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్టు స్థాపనకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. ‘సర్గడ్’రూ.1,000 కోట్ల పెట్టుబడులు విమానయాన రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన ‘సర్గడ్’సంస్థ రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో దశల వారీగా రూ.1,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం రేవంత్తో ‘సర్గడ్’సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనివాస్ తోట భేటీ సందర్భంగా జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో విమానాల నిర్వహణ, మరమ్మతులు, పునరుద్ధరణ (ఎమ్మార్వో) కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని సంస్థ ప్రతినిధులు వ్యక్తం చేశారు. వరంగల్, ఆదిలాబాద్లో కొత్తగా ఏర్పాటయ్యే విమానాశ్రయాల్లో ఏదో ఒకచోట ఎమ్వార్వో కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. ‘సర్గడ్’పెట్టుబడితో రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు తయారీ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. హైదరాబాద్లో లోరియల్ బ్యూటీ టెక్ జీసీసీ ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయంగా ఆవిష్కరణలు, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా నిలిచే ఈ జీసీసీ నవంబర్లో ప్రారంభమవుతుంది. దీని ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందుతాయి. మెడ్టెక్, హెల్త్టెక్తో పాటు ‘బ్యూటీ టెక్’వంటి కొత్త విభాగాల్లోనూ తెలంగాణ ముందుంటోందని శ్రీధర్బాబు అన్నారు. తమ జీసీసీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా రేవంత్, శ్రీధర్బాబులను లోరియల్ ఆహ్వానించింది. కాగా రేవంత్రెడ్డి, లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్ నడుమ జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ జీసీసీ ద్వారా 2030 నాటికి 2 వేల టెక్, ఏఐ, డేటా ఇంజనీరింగ్ ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ‘బ్లైజ్’విస్తరణ హైదరాబాద్లోని తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించేందుకు కాలిఫోరి్నయాకు చెందిన ‘బ్లైజ్’సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది. బ్లైజ్ కో ఫౌండర్, సీఈఓ దినకర్ మునగాల, ముఖ్యమంత్రి మధ్య జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ కంప్యూటింగ్కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ను ఈ సంస్థకు చెందిన డేటా సెంటర్ అభివృద్ధి చేస్తోంది. విస్తరణకు ‘ఏబీ ఇన్బెవ్’పెట్టుబడి ప్రపంచ వ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అతిపెద్ద బీరు తయారీ సంస్థ ‘ఏబీ ఇన్బెవ్ ’రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న తమ తయారీ యూనిట్ విస్తరణకు పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. సీఎం రేవంత్రెడ్డితో సంస్థ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్తో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్బెవ్, సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. స్టేడియంల అభివృద్ధికి టాటా గ్రూప్ సంసిద్ధత – సంస్థ చైర్మన్తో సీఎం రేవంత్ భేటీ సీఎం రేవంత్రెడ్డి బుధవారం దవోస్లో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్తో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్లోని ప్రధాన క్రీడా మైదానాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసే ఆలోచన ఉందని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, 2036 ఒలింపిక్స్లో భారత్ పతకాలు సాధించేలా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చడంలో టాటా టెక్నాలజీస్తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. కాగా స్పోర్ట్స్ స్టేడియాల అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై ఆయన ఆసక్తి చూపారు. రాష్ట్రంలో హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుపై కూడా చర్చలు జరిగాయి. మేడారం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయ ప్రాంతాల్లో హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపింది. శ్రీశైలం రహదారి వెంబడి అంతర్జాతీయ స్థాయి రిసార్ట్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించింది. ఏఐ డేటా సెంటర్లు, సెమీ కండక్టర్, ఈవీ తయారీ రంగాల్లో తెలంగాణలో కొత్త పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలపై కూడా చంద్రశేఖరన్ ఆసక్తి చూపారు.ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇలావుండగా..సీఎం నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’బృందం సిస్కో సంస్థ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. -
స్కీముల పేరుతో స్కాములు సీఎం, డిప్యూటీ సీఎంలపై కేటీఆర్ కేకు ముక్క కథ
-
నైనీ కోల్ బ్లాక్ టెండర్లలో అవినీతి, అక్రమాలు: కిషన్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తరహాలోనే పనిచేస్తోందన్నారు. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. ఎక్కడా లేని సైట్ విజిట్ అనే కొత్త నిబంధన పెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ అనేక సమస్యల్లో కూరుకుపోయింది. కేంద్రానికి సింగరేణిలో 49 శాతం వాటా ఉన్నా నిర్వహణలో జోక్యం చేసుకోలేదు. నైనీ బొగ్గు గనులకు చివరి అనుమతులు వచ్చాక పనులు ఎందుకు ఆలస్యం చేశారు?. తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గు కోసం కేంద్రం నైనీ కోల్ బ్లాక్ను సింగరేణికి అప్పగించింది. టెండర్లను ఆహ్వానించి వాటిని రద్దు చేశారు. దేశంలో ఎన్నో టెండర్లు నిర్వహిస్తుంటాం.. కానీ, ఎక్కడా ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఒడిషాలో బీజేపీ వచ్చాక అక్కడి ప్రభుత్వంతో అనుమతులపై చర్చించాను.నేను సింగరేణికి 683 ఎకరాల అటవీ భూమిని అప్పగించేందుకు ఒడిశా ప్రభుత్వం ఒప్పించాను. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. రాష్ట్ర పెద్దల ఆదేశంతోనే ఇది జరిగింది. దేశంలో అనేక గనులను కేంద్రం పారదర్శకంగా వేలం నిర్వహిస్తోంది. తెలంగాణ చేతిలో ఒక్క నైనీ కోల్ బ్లాక్ పెడితే అక్రమాలకు తెర లేపారు. ఈ వివాదంలోకి నన్ను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 32వేల కోట్ల బకాయి పడింది. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ సింగరేణిని వాడుకుంటున్నాయి. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పనిచేస్తోంది. సింగరేణిని బంగారు బాతుగా కాంగ్రెస్ చూస్తోంది. 12 ఏళ్లుగా నైనీ బ్లాక్ విషయంలో సమస్యలు సృష్టిస్తున్నారు. సీబీఐ అనుమతి కోరుతున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి. బీఆర్ఎస్ హయాంలోనూ అనేక అక్రమాలు జరిగాయి. సింగరేణి బొగ్గు క్వాలిటీ పడిపోయింది. దీనిపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సింగరేణిని కలుషితం చేశాయి. సింగరేణి భవిష్యత్ అంధకారంగా మారే పరిస్థితి ఉంది. అనేక జిల్లాలో సింగరేణి భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి నచ్చిన విధంగా వారికి భూములు ఇస్తున్నారు. అవినీతి, అక్రమాలతో సింగరేణిని నాశనం చేయవద్దు. సింగరేణిలో ఒక్క అధికారిని కూడా బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదు. సింగరేణి సంపూర్ణ ప్రక్షాళన జరగాలి. సింగరేణి అన్ని వ్యవహారాలపై దర్యాప్తు జరగాలి. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే పరిశీలిస్తాం. మంత్రుల మధ్య వాటాల తేడా వల్లే నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు జరిగింది. సైట్ విజిట్ నిబంధన పెట్టాలనే విషయం కేంద్రానికి తెలియదు. దేశవ్యాప్తంగా సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన ఉంటే.. ఇక్కడ మాత్రం వేరుగా పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కేంద్రానికి అప్పగిస్తే లాభాల్లోకి తీసుకువస్తాం అని అన్నారు. -
చేతకాని సీఎం రేవంత్ వల్లే.. అన్నదాతల ఆత్మహత్యలు
-
రేవంత్ టీంలో చిరంజీవి.. దావోస్లో తెలంగాణ రైజింగ్ సందడి (చిత్రాలు)
-
రాహుల్ తో రాజకీయం.. NDAలో ఉంటూ కాంగ్రెస్ తో అక్రమ సంబంధం
-
రేవంత్ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటా
సాక్షి, హైదరాబాద్: సిట్ పేరుతో రేవంత్ ప్రభుత్వం తనకు ఇచ్చిన నోటీసుల్లో పస లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు వ్యాఖ్యానించారు. విచారణ పేరిట సిట్ అధికారులు నిరాధార ఆరోపణలు చేస్తూ ‘అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం’అన్నట్లుగా వ్యవహరించారని విమర్శించారు. ముగ్గురు అధికారులు విచారణ జరుపుతూ మధ్యలో తరచూ బయటకు వెళ్లి ఫోన్లు మాట్లాడారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్కు చేరుకున్న హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్రెడ్డి బావమరిది సింగరేణి టెండర్ల కుంభకోణాన్ని బయట పెట్టినందుకే నాకు నోటీసులు ఇచ్చారు. సీఎంకు దమ్ముంటే సింగరేణి కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి.ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకు ఎన్ని సిట్లు వేసినా భయపడేది లేదు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించినందుకు నాపై ఇదివరకే అనేక అక్రమ కేసులు నమోదు చేశారు. పోలీసుల వెనుక దాక్కుని పిరికిపందలా నోటీసులు పంపడం కాదు, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొనాలి. రేవంత్ కుంభకోణాలు కుండబద్ధలు కొట్టినట్లు బయట పెడుతూనే ఉంటా. నోటీసులతో మీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు..’అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. మీడియా సమావేశం తర్వాత హరీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విచారణలో నేనే పోలీసులకు వంద ప్రశ్నలు వేశా. సమాధానాలు చెప్పలేక వారే ఉక్కిరిబిక్కిరి అయ్యారు.గతంలో నేనేమైనా హోం మంత్రిగా పనిచేశానా? ఫోన్ ట్యాపింగ్ అంశం నాకేం తెలుసు? అప్పటి డీజీపీ మహేందర్రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రస్తుత డీజీపీ శివధర్రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పా..’అని హరీశ్ తెలిపారు. కాగా సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు కూడా హరీశ్రావు..కేటీఆర్తో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో నష్ట నివారణకే డైవర్షన్ ‘చట్టాన్ని గౌరవించి సిట్ విచారణకు హాజరవుతున్నా. రేవంత్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. బొగ్గు స్కామ్తో పాటు వాటాలు పంచుకోవడంలో మంత్రులు తన్నుకుంటున్న వైనాన్ని బయట పెట్టా. మున్సిపల్ ఎన్నికలకు ముందు తమ అవినీతి బండారం బయట పడితే నష్టం జరుగుతుందనే రేవంత్ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపాడు. పంచాయతీ ఎన్నికలకు ముందు కేటీఆర్కు, ప్రస్తుతం నాకు నోటీసులు ఇచ్చి ఎన్నికల మీద మేము దృష్టి కేంద్రీకరించకుండా కుట్రలు పన్నుతున్నాడు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకపోతే విచారణ జరపాలి ఫోన్ ట్యాపింగ్ పేరిట రేవంత్ రెండేళ్లుగా సీరియల్ నడుపుతున్నాడు. ఎంతగా పక్కదారి పట్టించినా బొగ్గు, విద్యుత్, హిల్ట్ కుంభకోణాలను బయట పెట్టడమే కాకుండా, ఆంధ్రాకు అమ్ముడు పోయిన తీరుపై నిలదీస్తాం. కుంభకోణంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డికి లేఖ రాస్తున్నా. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాకపోతే రేవంత్ తన బావమరిదితో కలిసి చేస్తున్న కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి. నైనీ బ్లాక్తో పాటు ఇతర టెండర్లు రద్దు చేసి అవినీతిపరులను అరెస్టు చేయాలి..’అని హరీశ్రావు డిమాండ్ చేశారు.హరీశ్రావు నివాసానికి కేటీఆర్ కేటీఆర్ మంగళవారం ఉదయం కోకాపేటలోని హరీశ్రావు నివాసానికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు నేతలు భారీ కాన్వాయ్తో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి సిట్ విచారణ కోసం వెళ్లేందుకు బయలుదేరిన హరీశ్రావును అనుసరించేందుకు ప్రయతి్నంచిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా విచారణ అనంతరం తెలంగాణ భవన్కు చేరుకున్న హరీశ్రావుకు ఉదయం నుంచి అక్కడే వేచి ఉన్న కేటీఆర్, ఇతర నేతలు స్వాగతం పలికారు. -
ఎన్డీఏలో భాగస్వామి.. కాంగ్రెస్తో రహస్య కాపురం!
సాక్షి, అమరావతి: టీడీపీని దెబ్బ తీసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి అలా మాట్లాడుతున్నారంటే హైకమాండ్, రాహుల్ ఆశీస్సులు లేకుండా సాధ్యం కాదని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబుతో క్లోజ్డ్ డోర్ మీటింగ్ ద్వారా రాయలసీమ లిఫ్ట్ను ఆపించానని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించటాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకవైపు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతూనే మరోవైపు చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్తో, రాహుల్గాందీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారనే విషయాన్ని రేవంత్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు – రాహుల్ బంధంపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఓ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి.. టీడీపీని వెనకేసుకురావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి.. టీడీపీ ప్రయోజనాల కోసం తహతహలాడటం, బాధపడటం ఏమిటని విస్తుపోతున్నారు. ‘తెలంగాణలో టీడీపీ ఉండకూడదని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బ తీసిన బీఆర్ఎస్ను, కేసీఆర్ను సమూలంగా వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి.. బీఆర్ఎస్ వాళ్లు గద్దెలు దిగాలి... ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి..’ అని ఖమ్మం జిల్లాలో రేవంత్రెడ్డి సోమవారం వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. రేవంత్రెడ్డి వ్యాఖ్యల ద్వారా రాహుల్గాంధీ ఎప్పటికప్పుడు చంద్రబాబుతో టచ్లో ఉంటున్నట్లు నిరూపితమవుతోందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటునే మరోవైపు కాంగ్రెస్తో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారనేందుకు ఇవన్నీ నిదర్శనాలని విశ్లేషిస్తున్నారు. ఇక దేశంలో ఓట్ల చోరీ గురించి పదేపదే ఆందోళనకు దిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాందీ.. 2024 ఎన్నికల సమయంలో ఏపీలో ఈవీఎంల మాయాజాలం, రాత్రి వేళ భారీగా పోలింగ్, భారీగా దొంగ ఓట్లు గురించి ఏనాడూ కనీసం నోరు విప్పిన పాపాన పోలేదని గుర్తు చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబుకు ఇబ్బంది కాకూడదనే ఈ అంశాన్ని ఆయన ఏనాడూ ప్రస్తావించలేదని స్పష్టం చేస్తున్నారు. బాబు అనైతిక బంధం! రాజకీయ ఊసరవెల్లి నారా చంద్రబాబు మళ్లీ రంగులు మార్చుతున్నారు. ఒక్కోసారి ఒక్కో రంగు మారుస్తూ వచి్చన ఆయన ఈసారి... ఏకకాలంలో విభిన్న రంగులు మారుస్తూ ఊసరవల్లికే అసూయ కలిగిస్తున్నారు. సొంతంగా ఎన్నికల్లో గెలవలేని చంద్రబాబు ప్రతి ఎన్నికకు వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకుని ప్రజలను మోసగించడం బహిరంగ రహస్యమే. ఈసారి ఆయన తన రాజకీయ అవకాశవాదాన్ని పరాకాష్టకు తీసుకువెళుతుండటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఓవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతూనే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అక్రమ సంబంధం నెరుపుతుండటం విస్మయపరుస్తోంది. భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాందీతో తెరచాటు మైత్రి కొనసాగిస్తున్నారని టీడీపీ వర్గాలు సమర్థిస్తున్నాయి. కాంగ్రెస్తో చంద్రబాబు తెరచాటు రాజకీయ మంత్రాంగంపై బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయాన్ని తమ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్తో అక్రమ సంబంధం కోసం చంద్రబాబు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పణంగా పెడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాబు స్క్రిప్ట్ ప్రకారమే రాజకీయ డ్రామా.. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. మరోవైపు కాంగ్రెస్తో అంటకాగుతుండటం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్టగా నిలుస్తోందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. 2018లో బీజేపీతో విడిపోయి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ... మళ్లీ 2024 ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టినా సరే కాంగ్రెస్తో తెరచాటు మైత్రికి ఏమాత్రం భంగం కలగకుండా జాగ్రత్త పడుతోంది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ శ్రేణులు సహకరించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా చంద్రబాబు కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు. ఇక రేవంత్రెడ్డి తెలంగాణ సీఎం అయిన తరువాత కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు బంధం మరింత బలపడింది. ఏపీలో ఒంటరిగా పోటీ చేసి గెలవలేమని గ్రహించి అనివార్యంగా 2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంతమాత్రాన కాంగ్రెస్తో బంధాన్ని చంద్రబాబు తెగదెంపులు చేసుకోలేదు. భవిష్యత్ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వంలో ఇటు ఏపీ ప్రభుత్వంలోనూ బీజేపీ, టీడీపీ భాగస్వాములుగా ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం టీడీపీ శ్రేణులు కాంగ్రెస్తో సన్నిహితంగా ఉంటున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ తెరచాటు మైత్రి తెలంగాణకే పరిమితం కాలేదు. ఢిల్లీలో కూడా టీడీపీ ప్రత్యేక ప్రతినిధులు రాహుల్గాందీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు టీడీపీ ఎంపీలు ఎవరూ కూడా కాంగ్రెస్ను విమర్శించకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రాజకీయ డ్రామా సాగుతోందన్నది సుస్పష్టం. ఏపీ ప్రయోజనాలు పణంగా పెట్టి..చంద్రబాబు ఇటు బీజేపీతో బహిరంగ మైత్రి... అటు కాంగ్రెస్తో తెరచాటు బంధం కొనసాగిస్తే కొనసాగించుకోవచ్చు. టీడీపీ రాజకీయ వైఖరి ఆ పార్టీ ఇష్టం. కానీ అందుకోసం ఏకంగా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమకు అత్యంత ముఖ్యమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను చంద్రబాబు నిలిపివేయడమే అందుకు నిదర్శనం. ఆ విషయాన్ని స్వయంగా రేవంత్రెడ్డి తెలంగాణ శాసనసభలోనే వెల్లడించారు. ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని చంద్రబాబును క్లోజ్డ్ డోర్ మీటింగ్లో కోరా.. ఆయన ఆ పనులను నిలిపివేశారు..’ అని రేవంత్రెడ్డి ప్రకటించడం తెలిసిందే. ఆయన చెప్పింది నిజం కాదని చంద్రబాబు కనీసం ఖండించకపోవడం గమనార్హం. పైగా రాయలసీమ ప్రాజెక్టుతో ప్రయోజనం లేదంటూ చంద్రబాబు, మంత్రులు దారుణంగా మాట్లాడటం నివ్వెరపరుస్తోంది. తద్వారా రేవంత్రెడ్డి రాజకీయ ప్రయోజనం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను నిలిపివేశామని చంద్రబాబు ఒప్పుకున్నట్లైంది! -
కాలుష్య రహితం.. పర్యావరణ హితం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి కాలుష్య రహిత, పర్యావరణ హిత (నెట్ జీరో గ్రీన్ఫీల్డ్) స్మార్ట్ సిటీగా తెలంగాణలో రూపుదిద్దుకోనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధి ప్రాజెక్టు ప్రత్యేకతలను దావోస్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివరించారు. 30 వేల ఎకరాల్లో ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాస, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మరుబెని, సెమ్ కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యం కావడం గురించి తెలియజేయడంతో పాటు, రిలయన్స్ గ్రూప్ (వంతారా) ఏర్పాటు చేస్తున్న జంతు ప్రదర్శనశాల ప్రత్యేకతలను వివరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం తొలిరోజు వరుస భేటీలు నిర్వహించింది. అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులతో రేవంత్రెడ్డి సమావేశమయ్యారు. మరోవైపు యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్మార్రీతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఫ్యూచర్ సిటీ గురించి చెప్పారు. ఈ భేటీల్లో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను సీఎం ఈ సందర్భంగా వివరించారు. ఫ్యూచర్ సిటీపై యూఏఈ ఆసక్తి భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో తెలంగాణతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తెలిపారు. తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆసక్తితో ఉందన్నారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేఏందుకు రెండు ప్రభుత్వాల అధికారులతో సంయుక్త టాస్్కఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్తో తెలంగాణ కలిసి పనిచేసి గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సీఎంతో ‘ఎక్స్పరై్టజ్’ భేటీ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యంపై సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘ఎక్స్పరై్టజ్’ ఆసక్తి చూపింది. సీఎం రేవంత్తో ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ మొహమ్మద్ ఆసిఫ్ భేటీ అయ్యారు. తమ సంస్థలో ఏటా సుమారు 5 వేల మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది నియామకం జరుగుతోందని, యంగ్ ఇండియాతో భాగస్వామ్యం తమకు ఉపకరిస్తుందని చెప్పారు. విద్యా, ఉద్యోగ అవకాశాల నడుమ ఉన్న అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం చెప్పారు. మధ్య ఆసియా ప్రాంతంలో ఎక్స్పరై్టజ్ సంస్థ పెట్రో కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎరువులు, స్టీల్, సిమెంట్, వాటర్ ట్రీట్మెంట్, విద్యుత్ ఉత్పత్తి వంటి నైపుణ్యాధారిత రంగాల్లో ప్లాంట్ నిర్వహణ సేవలను అందిస్తోంది. తెలంగాణతో భాగస్వామ్యంపై రాయల్ ఫిలిప్స్ ఆసక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యంపై హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి చూపింది. హైదరాబాద్లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై చర్చించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం రేవంత్రెడ్డి బృందంతో భేటీ సందర్భంగా సంస్థ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ జాన్ విల్లెమ్ స్కీజ్ గ్రాండ్ ఈ విషయం వెల్లడించారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత సేవలను ప్రశంసించారు. కాగా ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ నెక్స్ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030’ ప్రత్యేకతలను రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఔషధ తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పారిశ్రామిక క్లస్టర్ను తెలంగాణలో నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్ను ఏఐకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నెదర్లాండ్స్ ప్రధాన కార్యాలయాన్ని సదర్శించాల్సిందిగా సీఎం రేవంత్ను రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ జాన్ విల్లెమ్ స్కీజ్ గ్రాండ్ ఆహ్వానించారు. పలు రంగాల్లో కలిసి పనిచేస్తామన్న గూగుల్ ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్లలో భాగస్వామ్యం పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం రేవంత్తో భేటీ అయిన గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా (ఏపీఏసీ) ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. ట్రాఫిక్ కంట్రోల్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఇన్నోవేషన్కు మరింత మద్దతు వంటి రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. తొలి ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ను హైదరాబాద్లో ఏర్పాటు చేసినందుకు సంస్థ బృందానికి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆయా అంశాల్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో మద్దతు అందించేందుకు గూగుల్ సిద్ధంగా ఉందని గుప్తా అన్నారు. యూనిలీవర్ జీసీసీ ప్రపంచ వ్యాప్తంగా వస్తు వినియోగరంగంలో అగ్రగామిగా ఉన్న యూనిలీవర్ సంస్థ, హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసింది. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో సమావేశమయ్యారు. తెలంగాణలో జీసీసీ ఏర్పాటు అంశంపై విస్తృతంగా చర్చించారు. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్తో కూడా సీఎం భేటీ అయ్యారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాల్లో ఇజ్రాయెల్ స్టార్టప్లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్లను ప్రారంభించనుంది. -
హరీష్ ఫోనే వాడలేదు.. విచారణ ఏంటి?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో ఇంకెన్నాళ్లీ డ్రామాలు? అంటూ ప్రశ్నించారు. కర్ర విరగదు.. పాము చావదన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు సాగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి అని సవాల్ విసిరారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీకి, ఫాంహౌస్కు మధ్య ఇంకా డీల్ కుదరలేదా?. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులైన తండ్రీ కొడుకులను ఎందుకు విచారించడం లేదు?. దీనికి కారకులైన ఒక్క నాయకుడినైనా అరెస్ట్ చేశారా?. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ హరీష్ రావు గతంలో చెప్పారు కదా?. చాలా రోజులు హరీష్ రావు ఫోన్ కూడా మాట్లాడని విషయం మీకు తెలియదా?. కర్ర విరగదు.. పాము చావదన్నట్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. రెండేళ్లుగా సాగుతున్న విచారణలో కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేకపోయారు.కేసీఆర్ సర్కార్ మాదిరిగానే ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరును చూస్తుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల దాకా ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీసేలా ఉన్నారు. విచారణ పేరుతో సిట్ సాగదీస్తున్న విచారణను చూసి జనం నవ్వుకుంటున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
MLA Vivekananda: రాజకీయ కక్ష సాధింపే..!
-
ఎన్ని విచారణలైనా చేసుకోండి.. భయపడం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హరీష్రావుకు సిట్ నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఓ లొట్టపీసు కేసు అంటూ వ్యాఖ్యానించారు. విచారణ, కమీషన్ల పేరుతో మా పార్టీని నేతలను వేధిస్తున్నారని.. రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావుకు నోటీసులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మీరు ఎన్ని విచారణలైనా చేసుకోండి.. మేం భయపడం. ఈ లొట్టపీసు కేసులో కేసీఆర్కు కూడా నోటీసులు ఇస్తారంట.. ఇచ్చుకోండి’’ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేశాయి. అయినా ఎంక్వైరీలు చేయిస్తున్నారు. డెవర్షన్ పాలిటిక్స్ రేవంత్కు వెన్నతో పెట్టిన విద్య. రేవంత్రెడ్డి బావమరిది సృజన్రెడ్డికి కోల్ టెండర్లు దక్కేలా ప్రయత్నాలు జరిగాయి. సింగరేణిలో స్కామ్ను నేను ఆధారాలతో సహా బయటపెడతా.. సింగరేణిలో రేవంత్ బావమరిదిని కింగ్పిన్ చేసి ఆయన రింగ్ తిప్పేలా చేశారు’’ అని కేటీఆర్ ఆరోపించారు.‘‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణి దోపిడీ మొదలైంది. సింగరేణి టెండర్లపై హరీష్ చేసిన కామెంట్స్పై ప్రభుత్వం ఎందుకు స్పందించదు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం లేదు. నైని కోల్ బ్లాక్ రద్దు వెనుక వాటాల పంచాయితీ ఉంది. నైని కోల్ బ్లాక్ కుంభకోణంపై హరీష్ మాట్లాడారనే అక్కసుతో నోటీసులు. అసెంబ్లీలో మంత్రులను హరీష్ ఫుట్బాల్ ఆడుకున్నారు’’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనకు తానే రాజకీయ బురద జల్లుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం లేదంటే మంత్రులపై పట్టు పెంచుకునే క్రమంలో ఆయన చేస్తున్న విన్యాసాలు కొన్నిసార్లు బెడిసికొడుతున్నట్లుగా ఉంది. దీనికి తోడు అనవసర వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో తన విశ్వసనీయతను తానే దెబ్బ తీసుకుంటున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలకు ఆజ్యం పోస్తున్నారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి మీడియా అధిపతి రాధాకృష్ణను కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ అధికంగా నమ్ముకుంటున్నారన్న భావన కలుగుతోంది. దానివల్ల తెలంగాణ రాజకీయాలపై ఆ పత్రికలో ఏ కథనం వచ్చినా అది ఎంత వివాదాస్పదమైనా, చెత్త పలుకైనా అదంతా రేవంత్ భ్రీఫింగ్ వల్లేనని రాజకీయ వర్గాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మీడియాను ప్రమాణాలతో నిమిత్తం లేకుండా నీచమైన రాతలు రాసేవారిని నమ్ముకుంటే.. అది ఎప్పటికైనా భస్మాసుర హస్తం అయ్యే ప్రమాదం ఉంటుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన పరిణామాల సారాంశంగా దీనిని తీసుకోవచ్చు. ఎన్టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన ఒక కథనం మహిళా ఐఏఎస్లను కించ పరిచేదిగా ఉందన్నది అభియోగం. దీనిని ఎవరూ సమర్థించరు. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసోసియేషన్లు ఖండన ఇవ్వడం, దానిపై ఆ టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పింది. అయినా తప్పు చేశారని అనుకుంటే కేసు పెట్టవచ్చు. చర్య తీసుకోవచ్చు. కాని ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించారు. ఆ పోలీసులు విచారణ పేరుతో చట్టబద్దమైన నిబంధనలు పాటించకుండా ఆ టీవీ ఛానల్లో సోదాలు చేయడం, ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. ఆ కేసులో ఫిర్యాదుదారు ఎవరు? బాధితులు ఎవరని కోర్టు ప్రశ్నించడంతో నీళ్లు నమలడం పోలీసుల వంతైంది. అంతటితో ఆ ఉదంతానికి ఫుల్స్టాప్ పడినట్లయింది. పోలీసులు ఈ వ్యవహారంలో అతిగా చేశారన్న విమర్శలు వచ్చాయి. అది వేరే కథ. ఇంతలో ఏమి జరిగిందో కాని సడన్గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వ్యాసంలో ఆ గాయాలను మళ్లీ కెలికారు. వ్యాపార ప్రయోజనం కోసమో, లేక ముఖ్యమంత్రి రేవంత్కు ఉపయోగపడుతందని అనుకున్నారో తెలియదు కాని ఓ కథ వండి జనం మీదకు వదిలారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఈ వివాదంలోకి లాగారు. ఎన్టీవీ యజమానికి సంబంధించిన కంపెనీకి బొగ్గు టెండర్ రావడానికి మల్లు భట్టి రూల్స్ మార్చారని ఆరోపించారు. పోనీ ఈ స్కామ్ వరకు రాసి ఉంటే అది వేరే విషయం అయ్యేది. అలా కాకుండా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీకి ఆ టెండర్ దక్కకుండా ఉండడం కోసం ఎన్టీవీ ఆయనపై అనుచితమైన స్టోరీ ప్రసారం చేసిందని ఆరోపించారు. ఆ క్రమంలో ఆయనకు మహిళలపట్ల ఎంతో గౌరవం ఉన్నట్లు నటించారు. పనిలో పనిగా, ఆవు కథ మాదిరి వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో మీడియాకు స్వేచ్చ లేదంటూ ఒక పచ్చి అబద్దాన్ని కూడా జోడించారు. రాధాకృష్ణకు నిజంగా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన ఉంటే, సంక్రాంతి సందర్భంగా ఏపీలో జరిగిన దారుణమైన అశ్లీల నృత్యాలపై ఎక్కడైనా సరైన రీతిలో స్పందించారా? ఎల్లోమీడియాలో వైసీపీ మహిళా నేతలపై కక్ష కట్టినట్లు ఎన్ని తప్పుడు కథనాలు వచ్చేవో కూడా తెలిసిందే. ఈ మధ్యనే మాజీ సీఎం జగన్పై నీచమైన శీర్షికలతో కథనాలు లో ప్రసారం చేశారో కూడా చూశాం. ఈయన ఒక వైపు నీచమైన రాతలు రాస్తూ, ఎదుటివారికి నీతులు చెబుతుంటారు. తన వ్యాసంలో మల్లు భట్టిపై ఆరోపణలు చేయడంతోపాటు రేవంత్ ను అమాయకుడన్నట్లు చిత్రీకరించే యత్నం చేశారు. సిట్ వేసిన సంగతి రేవంత్కు తెలియదని అందులో రాశారు. దీనివల్ల రేవంత్కు నష్టం జరిగింది. అయితే.. రేవంత్ భ్రీఫింగ్తోనే రాధాకృష్ణ ఈ వ్యాసం రాశారా అన్న సందేహాన్ని వివిధ రాజకీయ పక్షాలు కాని, చివరికి కాంగ్రెస్ లో కొన్ని వర్గాలు కాని అనుమానించాయి. దానికి తోడు టీవీ కథనం వచ్చిన రోజున కాని, కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన రోజున కాని రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, రాధాకృష్ణ వ్యాసం రాసిన తర్వాత స్పందించడం చర్చనీయాంశం అయ్యాయి. మీడియా సంస్థలు ఆంబోతుల మాదిరి తన్నుకుని తమను అందులోకి లాగవద్దని ఆయన అనడం విడ్డూరంగా అనిపించింది. ఒక వేళ నిజంగానే రాదాకృష్ణ తప్పుడు వ్యాసం రాసి ఉంటే ఆయనపై కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఉండవచ్చు! కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలతోనే ఈ గొడవలన్ని బయటకు వచ్చాయన్న భావన ప్రజలలో ఏర్పడింది. దాంతో ఆ బురదను కడుక్కోవడానికి రేవంత్ స్టేట్ మెంట్ ఇచ్చి మంత్రులను బద్నాం చేయవద్దని కోరారు అంతేకాక తమ ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు మల్లు భట్టి ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, రాధాకృష్ణ కథనం వెనుక ఎవరు ఉన్నారో తర్వాత చెబుతానని అన్నారు. పైగా తెలంగాణ వనరులు, సంపదను దోచుకోవడానికి వ్యవస్థీకృత నేరస్తులు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ మరో మాట కూడా చెప్పారు. బీఆర్ఎస్కు లబ్ది జరిగేలా కథనాలు ఉండవద్దని అన్నారు. తనకు డామేజీ అవుతోందని అర్థం చేసుకుని ఈ వ్యాఖ్య చేసి ఉండాలి. నిజంగానే బీఆర్ఎస్ ఈ ఎపిసోడ్ను తనకు అనుకూలంగా మలచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. సింగరేణి టెండర్ల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేయడం, ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులలో ఉన్న ముగ్గురి మధ్య కాంట్రాక్ట్ కోసం పోటీ జరిగిందని, మంత్రివర్గంలో పలువురు మంత్రులు దోచుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. రేవంత్ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఖతం చేసిన బీఆర్ఎస్ను బొంద పెట్టాలని ఆయన అన్నారు. అదే ఎన్టీఆర్కు నివాళి అని కొత్త సూత్రీకకరణ చేశారు. అదేదైనా అయితే చంద్రబాబుకు కానుక అవుతుంది కాని, ఎన్టీఆర్కు ఎలా శ్రద్దాంజలి అవుతుందో తెలియదు.హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీకి ఉన్న కాస్తో, కూస్తో బలాన్ని, ఆ పార్టీకి ప్రధానంగా మద్దతు ఇచ్చే సామాజిక వర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని రేవంత్ మాట్లాడినట్లు అనిపిస్తుంది. పైగా తెలంగాణలో టీడీపీ ఖతం అవడానికి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ల పాత్ర కారణమన్నది బహిరంగ రహస్యమే కదా! ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన రేవంత్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఎగబాకారు. అయినా పాత వాసన వదులుకోలేక పోతున్నట్లు ఉంది. కాంగ్రెస్ను అంతం చేయడానికి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ను రేవంత్ పొగడడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎంతవరకు సంతోషిస్తారో చెప్పలేం.ఏది ఏమైనా ఈ మద్యకాలంలో పలు ప్రకటనలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా చేస్తూ రేవంత్ రెడ్డి ఎదుటివారిపై బురద చల్లబోయి.. తనపై కూడా వేసుకుంటున్నట్లు ఉంది. హార్వర్డ్ యూనివర్శిటీలో నాయకత్వ కోర్సులో చేరిన రేవంత్ బీఆర్ఎస్ గద్దెలు గ్రామాలలో లేకుండా చేయాలని అనడం ఏ పాటి నాయకత్వ ప్రమాణం అవుతుందో!. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘తాటాకు చప్పుళ్లకు భయపడం’
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ‘నిన్న సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టినందుకే సాయంత్రానికి తనకు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) హరీష్రావుకు నోటీసులు జారీ చేసింది. ఇవాళ జూబ్లీహిల్స్ పీఎస్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే ఈ పరిణామంపై హరీష్ రావు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘నిన్న రేవంత్ బావమరిది బాగోతాన్ని బయటపెట్టా. సాయంత్రం తొమ్మిదిగంటల సమయంలో హైదరాబాద్లోని నా నివాసంలో నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో నేను నా నియోజకవర్గం సిద్ధిపేటలో పలు కార్యాక్రమాల్లో పాల్గొన్నాను. అయినప్పటికీ.. చట్టం మీద గౌరవంతో హైదరాబాద్కు వచ్చా. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడను. అక్రమాలు, బొగ్గు, భూస్కాం, హామీల అమలు విషయాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ముందే వీరి అవినీతి బయటపడుతుందని నాకు నోటీసులు ఇచ్చారు. నేను ఏ తప్పు చేయలేదు. ఈ నోటీసులు కొత్త కాదు. గతంలో నా మీద ఫోన్ టాపింగ్ కేసు పెడితే హై కోర్టు, సుప్రీం కోర్టులో కొట్టేశారు. అయినా మళ్ళీ పిలుస్తున్నారు. ఎన్ని రోజులు ఈ డ్రామా?’అని ప్రశ్నించారు. -
మరో చాన్స్ లేదు!
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేస్తున్న వారిలో ఏ ఒక్కరికీ మరోమారు అవకాశం ఇవ్వకూడదని, ఈ పదవులను ఎప్పుడు భర్తీ చేసినా అంతా కొత్తవారినే నియమించాలని సీఎం రేవంత్రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే చైర్మన్లను నియమించిన 35 కార్పొరేషన్లతో పాటు మిగతా కార్పొరేషన్లకు కూడా ఒకేసారి చైర్మన్లను నియమించాలని, ప్రస్తుతం పనిచేస్తున్న వారి పద వీకాలం ఈ ఏడాది జూలైలో ముగియనున్నందున ఆ లోపు ఒకేసారి ఈ పదవులన్నింటినీ భర్తీ చేయాలనే నిర్ణయం కూడా జరిగిందని సమాచారం.తలనొప్పి ఎందుకనే..! 2024 మార్చి నెలలో 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు. కానీ అధికారిక ఉత్తర్వులు వచ్చి వారు పదవీ బాధ్యతలు స్వీకరించే సరికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. జూలై 8న వారంతా అధికారికంగా చైర్మన్లుగా నియమితులయ్యారు. దీంతో వారి రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది జూలై రెండో వారంలో ముగియనుంది. అయితే ఇలా రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న చైర్మన్లు తమకు మళ్లీ అవకాశం ఇస్తారేమోనన్న ఆశతో ఉన్నారు. ఈ మేరకు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసినందున ఓ దఫా చైర్మన్లుగా అవకాశం ఇచ్చామని, రెండోసారి అవకాశం దక్కాలంటే పార్టీ పటిష్టతతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల విస్తృత ప్రచారం కోసం పనిచేయాలని గతంలో పలుమార్లు సీఎం, పీసీసీ అధ్యక్షుడు, పార్టీ ఇన్చార్జి చెప్పారు. దీంతో పలువురు చైర్మన్లు ఆ రకంగా ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ కాకపోయినా పనితీరు ప్రాతిపదికన కొందరికి మళ్లీ చాన్స్ దక్కవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. కానీ కొందరికి ఇచ్చి మరికొందరిని పక్కన పెట్టడం వల్ల లేని తలనొప్పులు వస్తాయని, ఎలాగూ ఒకసారి అవకాశమిచ్చినందున మలిదఫాలో పూర్తిగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్, రాష్ట్ర పార్టీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ జిల్లా కమిటీలు ప్రస్తుతానికి పెండింగే! మున్సిపల్ ఎన్నికలకు ముందు తలనొప్పి ఎందుకులే అనే ఆలోచనతో పార్టీ జిల్లా కమిటీల ఏర్పాటును పీసీసీ ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది. వాస్తవానికి జనవరి 11 నాటికే జిల్లా కమిటీలు, 15 నాటికి మండల పార్టీ అధ్యక్షుల నియామకాలను పూర్తి చేసి తమకు పంపాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్లు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులను ఆదేశించారు. కానీ మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఎవరికి ఏ పదవి ఇస్తే ఏమవుతుందోననే మీమాంసతో ఎమ్మెల్యేలు, మంత్రులు చాలావరకు జిల్లా కమిటీల కోసం పూర్తి స్థాయిలో పేర్లను ఇవ్వలేదు. మండల పార్టీ అధ్యక్షుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పీసీసీ నిర్ణయించింది. మున్సిపల్ వ్యూహంలో గందరగోళం! మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహం ఆ పార్టీ నేతలను గందరగోళానికి గురి చేస్తోంది. మంత్రులను వారు ప్రాతినిథ్యం వహిస్తున్న చోట కాకుండా వేరేచోట ఇన్చార్జిలుగా నియమించడమే ఇందుకు కారణం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న వారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మంత్రులను వేరే పార్లమెంటు స్థానాలకు ఇన్చార్జులుగా నియమించడం వల్ల వారు సొంత నియోజకవర్గాలకు సమయం ఇవ్వగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు చాలా జిల్లాలకు అసలు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. మిగిలిన అసెంబ్లీల విషయంలో.. స్థానిక ఎమ్మెల్యేలు, అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు వారికి సహకరించక పోవడమే కారణమనే వాదన ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జులుగా వారు ఏ మేరకు పార్టీ నేతలను, కేడర్ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్లమెంటు స్థానాల వారీగా ఇన్చార్జులను నియమిస్తున్నట్టు సీఎం కార్యాలయం అధికారికంగా ప్రకటిస్తే, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అవే పార్లమెంటు స్థానాల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఇన్చార్జి మంత్రి చైర్మన్గా, పార్లమెంటు పరిధిలోని డీసీసీ అధ్యక్షులు కనీ్వనర్లుగా ఉండే ఈ కమిటీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులు సభ్యులుగా ఉంటారని, టికెట్ల ఖరారులో ఈ కమిటీలదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. లోక్సభ స్థానాల వారీగా ఇన్చార్జి మంత్రులు వీరే! కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (మల్కాజిగిరి), దుద్దిళ్ల శ్రీధర్బాబు (చేవెళ్ల), తుమ్మల నాగేశ్వరరావు (కరీంనగర్), కొండా సురేఖ (ఖమ్మం), పొన్నం ప్రభాకర్ (మహబూబాబాద్), దామోదర రాజనర్సింహ (మహబూబ్నగర్), మహ్మద్ అజహరుద్దీన్ (జహీరాబాద్), వివేక్ వెంకటస్వామి (మెదక్), వాకిటి శ్రీహరి (నాగర్కర్నూల్), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (నల్లగొండ), సీతక్క (భువనగిరి), ఉత్తమ్కుమార్రెడ్డి (నిజామాబాద్), పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (వరంగల్), జూపల్లి కృష్ణారావు (పెద్దపల్లి), సుదర్శన్రెడ్డి, సలహాదారు (ఆదిలాబాద్)లను లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జులుగా నియమించారు. -
ఇప్పుడేమంటావ్ సజ్జనార్?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: రేవంత్ సర్కార్ అనేక కుంభకోణాలకు పాల్పడుతోందని.. సీఎం మంత్రుల మధ్య వాటాల పంచాయితీ నడుస్తుందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సైట్ విజిట్ చేసే విధానం గతంలో లేదని.. రేవంత్ రెడ్డి బావమరిదికి బొగ్గుగని కాంటాక్ట్ కట్టబెట్టేందుకే సైట్ విజిట్ విధానం తెచ్చారంటూ మండిపడ్డారు. సింగరేణిలో అతిపెద్ద కుంభకోణం జరుగుతుందని.. దీనిపై కిషన్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని హరీష్రావు డిమాండ్ చేశారు.‘‘కుంభకోణంపై అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. సింగరేణిలో సైట్ విజిట్ విధానం వెంటనే రద్దు చేయాలని భట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తున్నా. సింగరేణిలో సమర్థవంతమైన అధికారిని నియమించాలి. బొగ్గు గనుల కాంటాక్ట్ కోసం ఐఏఎస్ అధికారులను, జర్నలిస్ట్లను బలి పశువులను చేశారు. వ్యాపారవేత్తల దగ్గర తుపాకులు పెట్టీ వసూలు చేసిన డబ్బుల వాటా పంచాయితీలోనే కొండా సురేఖ ఇంటికి పోలీసులను పంపించారు.‘‘సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మధ్య వైరం. ముఖ్యమంత్రి, జూపల్లి కృష్ణారావు మధ్య ఆలోగ్రామ్ పంచాయతీతో నిజాయితీ గల ఐఏఎస్ అధికారి బలి అయ్యారు. పెంచిన సినిమా టికెట్ ధరల డబ్బులు పంచుకునేందుకు ముఖ్యమంత్రి, మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మధ్య పంచాయితీ. ఖాకీ బుక్ అందరికి ఒకటే అని చెప్పిన డీజీపీ.. ఎందుకు రూల్ బుక్ పాటించడం లేదు’’ అంటూ హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జర్నలిస్ట్లను సజ్జనార్ బెదిరిస్తున్నారు. ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా అని బెదిరించి మాట్లాడావు కదా. ఇప్పుడు ఏమంటావు సజ్జనార్?. ముఖ్యమంత్రి తెలియకుండా సిట్ వస్తే, ముఖ్యమంత్రి ఫెయిల్ అయినట్టే. బీఆర్ఎస్ గద్దెల జోలికి వస్తే, నీ గద్దె కూలుతుంది జాగ్రత్త బిడ్డా రేవంత్ రెడ్డి. హులా మాటలు బంద్ చెయ్.. కేబినెట్లో రైతు భరోసా ఉసే లేదు. ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించిందే రాజీవ్ గాంధీ...కాంగ్రెస్ భూస్థాపితం అయినప్పుడే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది. నైని బ్లాక్ కాంట్రాక్ట్ రద్దు చేశారు సంతోషం. భట్టి విక్రమార్క మీద వచ్చిన వార్తలపై దాని వెనుక ఎవరు ఉన్నారో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నా.. బయట పెట్టకపోతే ముఖ్యమంత్రికి, భట్టి విక్రమార్కకు వాటాల పంచాయతీ సయోధ్య కుదిరినట్లే. జరుగుతున్న కుంభకోణంపై హైకోర్టుకు వెళ్తాం.. సీబీఐకి పిర్యాదు చేస్తాం’’ అని హరీష్రావు హెచ్చరించారు. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
-
మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
-
దావోస్కు బయల్దేరిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం ఇవాళ సోమవారం (జనవరి 19, సోమవారం) స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు బయలుదేరింది. ఈ నెల 19 నుంచి 23 వరకు దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)–2026 సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయనుంది.సదస్సులో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్–2047 ఉద్దేశాలు, లక్ష్యాలకు విస్తృత ప్రచారం కలి్పంచనుంది. సీఎం రేవంత్ 20న తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ, తెలంగాణ ఏఐ హబ్ను అక్కడ ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ దార్శనికత, రాష్ట్రాభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ పేరుతో రూపొందించిన ప్రణాళికలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను దావోస్ సదస్సులో రాష్ట్ర బృందం వివరించనుంది.జీఎస్డీపీ వృద్ధికి అవలంబిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక సదుపాయాలు, 2047 నాటికి సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాల ప్రణాళికలను పెట్టుబడిదారుల సమక్షంలో ఆవిష్కరించనుంది. దావోస్లో ఏర్పాటు చేసే తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్ఫోర్స్, హనీవెల్, ఎల్–ఓరియల్, నోవార్డిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ కంపెనీల సీఈవోలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. కొన్ని రౌండ్టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. -
సీఎం రేవంత్.. హార్వర్డ్ స్టూడెంట్!
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నిర్వహించే ‘నాయకత్వం: 21వ శతాబ్దం’ అనే కోర్సులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవేశం పొందారు. మసాచ్యూసెట్స్లోని కేంబ్రిడ్జ్లో ఉన్న కెన్నడీ స్కూల్ క్యాంపస్లో ఈ నెల 25 నుంచి 30 వరకు జరగనున్న తరగతి గది విద్యాబోధనకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు.ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులు, ఘర్షణలు, వాటిని ఎదుర్కోవడంలో అవసరమైన అంశాలను ఈ కోర్సులో బోధించనున్నారు. అమెరికాలోని అత్యుత్తమ ప్రైవేటు వర్సిటీ (ఐవీ లీగ్)ల్లో ఒకటైన హార్వర్డ్లో ప్రవేశం పొందిన స్వతంత్ర భారతదేశ తొలి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఐదు ఖండాల పరిధిలోని 20 దేశాల నుంచి అభ్యర్థులు ఈ కోర్సులో చేరినట్లు తెలిపింది.సీఎం రేవంత్ తరగతులకు హాజరై అసైన్మెంట్లు, హోమ్వర్క్తోపాటు సహ విద్యార్థులతో కలిసి గ్రూప్ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్టు పేర్కొంది. ప్రొఫెసర్ టిమ్ ఓబ్రియన్ ఈ కోర్సుకు అధ్యక్షుడిగా, ప్రొఫెసర్ కరెన్ మొరిస్సే కోర్సు డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ప్రపంచంలోని విభిన్న ప్రాంతాలు, వేర్వేరు సమయాలకు సంబంధించిన చరిత్రను కోర్సులో భాగంగా విశ్లేషించనున్నారు. ప్రస్తుత సమస్యలకు పరిష్కారాలను విద్యార్థుల గ్రూపులకు సూచించనున్నారు. కోర్సు పూర్తయ్యాక సీఎం రేవంత్ హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ పొందనున్నారు. -
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి
-
ముఖ్యమంత్రివా.. ముఠా నాయకుడివా?
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రత లను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అసాంఘిక చర్యలు, నేరాలను ప్రోత్సహించేలా సీఎం రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేసి పార్టీని రాజకీయంగా బొందపెట్టాలని రేవంత్రెడ్డి పిలుపునివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడివా’అని రేవంత్ను ప్రశ్నిస్తూ కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న రేవంత్రెడ్డి.. కనీస సోయి లేకుండా ఇలాంటి హింసాత్మక పిలుపు ఇవ్వడం అరాచకానికి దారితీస్తుందని హెచ్చరించారు. గడిచిన పదేళ్లలో శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో ఇప్పుడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచేవారు అధికారంలో ఉండటం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.గులాబీ జెండాపై చెక్కుచెదరని అభిమానంతెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండాపై ఉన్న చెక్కు చెదరని అభిమానాన్ని చూసి ముఖ్యమంత్రికి మైండ్బ్లాక్ అయ్యిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం రెండేళ్లలోనే అట్టర్ ఫ్లాప్ పాలనతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్రెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందని ఖమ్మం సభ సాక్షిగా తేలిపోయిందని విమర్శించారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టుకే చురుగ్గా స్పందించి అరెస్టులు చేసే పోలీస్శాఖ, డీజీపీ..ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన ఈ తీవ్రమైన, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా టీడీపీ పాట పాడటం వెనుక ఉన్న అసలు కుట్రతెలంగాణ సమాజానికి అర్థమైందని కేటీఆర్ అన్నారు.గత రెండేళ్లుగా తన పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టం చేసేలా జల హక్కులను కాలరాశారని, ఈ రోజు ఆయన చేసిన ప్రకటనతో నిజస్వరూపం బట్టబయలైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే నావ అని అర్థం కావడంతోనే, రేవంత్రెడ్డి ఏ క్షణమైనా దాని నుంచి బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు తెలంగాణ ప్రజలు తిరస్కరించిన టీడీపీని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చే పన్నాగాలు పన్నుతున్నారని కేటీఆర్ హెచ్చరించారు. నీళ్ల నుంచి మొదలుకొని నిధులు, నియామకాల వరకూ తెలంగాణ ప్రయోజనాలను పాతాళంలోకి నెట్టిన ఈ కోవర్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. -
మంత్రులను బద్నాం చేయొద్దు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘సింగరేణి బొగ్గు టెండర్లపై పత్రి కలు, టీవీల్లో వార్తలు వస్తున్నాయి. సింగరేణి టెండర్లు సహా మా ప్రభుత్వంలో ఏ పనిలోనూ నయాపైసా అవినీ తికి తావులేదు. ఇలాంటి వార్తలతో శుక్రాచార్యుడు, మారీ చులకు పరోక్షంగా సహకరించకండి. మీడియా యాజమా న్యాలకు గొడవలు ఉంటే మీరు, మీరు చూసుకోండి తప్ప మంత్రులను బద్నాం చేయకండి. ఏదైనా వార్త రాసేముందు ఒకసారి నన్ను అడగండి. ముఖ్యమంత్రిగా నేను 24 గంటలూ ప్రజలు, మీడియాకు అందుబాటులో ఉంటా. నా ఎమ్మెల్యేలు, మంత్రులపై వచ్చే ఏ చిన్న ఆరోపణ అయినా అది నా నాయకత్వానికి బద్నాం కలిగించినట్లే భావిస్తా.మేమంతా సమన్వయంతో ప్రభుత్వాన్ని నడిపి స్తున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రూ.362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పైలాన్ను మద్దులపల్లి వద్ద ఆదివారం సీఎం ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ ఎన్నికలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలతో మద్దులపల్లి వద్ద సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..ఎర్రవల్లి ఫామ్హౌస్లో శుక్రాచార్యుడు‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్త యింది. మొదటి సంవత్సరం నుంచే శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు అడ్డుకోవడానికి బయలుదే రారు. శుక్రాచార్యుడు, మారీచుడు గురించి మీకు తెలుసు. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే భగ్నం చేయాలని ప్రయత్నించారు. రాక్షసుల కులగురువు శుక్రాచార్యుడు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో ఉన్నాడు. ఇక మారీచుడు, సుబాహులు బావబామ్మర్దులు. మారీచుడు మాయా జింక రూపంలో సీతను ఎత్తుకెళ్లడానికి సహకరిస్తే రాముడి చేతిలో చావు తప్పలేదు. మారీచుడు, సుబాహుడు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని అడ్డగోలు ప్రచారాలు చేస్తున్నారు.. (మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావును ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు) 2034 వరకు మాదే అధికారం.. ‘రాష్ట్రంలో పదేళ్ల చొప్పున టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అధి కారంలో ఉన్నాయి. 1994 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. 2023 నుంచి 2034 వరకు మనమే అధికారంలో ఉంటాం. చరిత్ర పున రావృతం అవుతుంది. నేను చెప్పింది జరగకుండా ఒక్కటీ లేదు. ఇక్కడి రాములవారీ సాక్షిగా చెబుతున్నా.. ఈ పదేళ్లు పేదల ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. వైఎస్సార్, ఎన్టీఆర్ గొప్ప నేతలురైతాంగానికి ఉచిత విద్యుత్ అందించిన వ్యక్తి వైఎస్ రాజ శేఖరరెడ్డి. 2004లో ముఖ్యమంత్రిగా మొదటి సంతకాన్ని ఉచిత విద్యుత్ ఫైల్పై పెట్టడమేకాక రూ.1,300 కోట్ల రైతుల బకాయిలను రద్దు చేశారు. ప్రస్తుతం మేము 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూ, పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వైఎస్సార్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు. మేము ఇప్పుడు గృహనిర్మాణ శాఖను పునరుద్ధరించి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. పార్టీలు వేరైనా వైఎస్సార్, ఎన్టీఆర్ గొప్ప నేతలు. సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. వీరిని స్ఫూ ర్తిగా తీసుకుని పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పట్టణ పేదలకూ అర్హత కల్పిస్తాం. మాది కలిసి పనిచేసే ప్రభుత్వంనాకన్నా అనుభవజ్ఞులైన నేతలు ఈ వేదికపై ఉన్నారు. సహచర మంత్రుల అనుభవాలను ఉపయోగించుకుంటూ, అందరి సమన్వయం, సహకారంతో ముందుకెళ్తు న్నాం. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం తుమ్మలకు ఉంది. సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు, 100 రోజుల్లో అమ్మవారి దేవాలయాన్ని నిర్మించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెబితే ఆయనే చూసు కున్నారు. ఢిల్లీలో ఏ పని ఉన్నా డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క చూసుకుంటారు. ఇలా మాలో ఏకాభిప్రాయమే తప్ప, ఏకపాత్రాభినయం లేదు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలి. బీఆర్ఎస్ను బొంద పెట్టాలి. ఏకలింగం, తోకలింగం లాంటి బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంది. ఎవరైనా గెలిస్తే మున్నేరు, పాలేరు ప్రాజెక్టు ఆగిపోయే ప్రమాదం ఉంది. భద్రాచలం రామాలయానికి రూ.100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ ఇవ్వలేదు. మేము ఇప్పటికే భూసేకరణ కోసం నిధులు ఇచ్చాం. అయోధ్య తరహాలో భద్రాచలంలో రామాలయ నిర్మాణాన్ని చేపడతాం’ అని రేవంత్రెడ్డి చెప్పారు.గ్రామాల్లో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి తెలంగాణలో నందమూరి తారకరామారావుకు అభి మానులు ఉన్నారు.. చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారు. వారందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.. తెలంగాణలో టీడీపీ ఉండొద్దని కక్ష కట్టి.. ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బ తీసిన చంద్రశేఖర్రావు, బీఆర్ఎస్ను వంద మీటర్ల గొయ్యి తీసి సమూలంగా పాతిపెట్టాలి. బీఆర్ఎస్ వాళ్లు గద్దె దిగాలి.. గ్రామా ల్లో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి. అప్పుడే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అర్పించిన వాళ్లమవుతాం.ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పాలేరు నియోజకవర్గం మద్దులపల్లిలో రూ.362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి వద్ద నర్సింగ్ కళాశాల ఆవరణలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, కూసుమంచి మండలంలో వంద పడకల ఆస్పత్రి, మున్నేరు–పాలేరు లింక్ కెనాల్కు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ భవనాల ప్రారంభోత్సవ పైలాన్లను సీఎం ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, మల్లు రవి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు వేంనరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు మువ్వా విజయ్బాబు, రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, తోట దేవిప్రసన్న తదితరులు పాల్గొన్నారు.విద్య, వైద్యం, ఆరోగ్యంపై ప్రధాన దృష్టిప్రభుత్వం నీటిపారుదల, విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులం ఈ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే సీతారామ ప్రాజెక్టు నిర్మాణమవుతోంది. ఇక విద్యారంగానికి సంబంధించి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, వైద్య రంగానికి సంబంధించి నర్సింగ్ కళాశాల అందుబాటులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లాకు ఇండస్ట్రియల్ పార్కు మంజూరు చేయాలని సీఎంను కోరుతున్నా. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కప్రజాప్రభుత్వంపై విషంపాముకు కేవలం కోరల్లోనే విషం ఉంటుంది.. కానీ పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుని, అప్పుల పాలు చేసిన ఆ నాయకులకు ఒంటి నిండా విషమే ఉంది. వారు చేసిన పాపాలు బయటపడతాయనే భయంతో ప్రజా ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. సెమీఫైనల్ అంటూ కారుకూతలు కూస్తున్న ట్విట్టర్ టిల్లుకు గ్రామపంచాయతీ ఎన్నికలే సమాధానం చెప్పాయి. ఇదే జోరు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలి. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. జిల్లా ప్రగతిలో సాగునీటి ప్రాజెక్టులు చారిత్రక మైలురాయిగా నిలుస్తాయి. రూ.162.54 కోట్లతో నిర్మించే మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ ద్వారా 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. – రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికాంగ్రెస్ సమావేశంలో టీడీపీ జెండాలుకాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో టీడీపీ జెండాలు కనిపించాయి. ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలతో కూడిన పార్టీ జెండాలతో వచ్చిన కొందరు ‘జై రేవంతన్న’ అంటూ నినాదాలు చేశారు. ఈ సభలో సీఎం అరగంటకు పైగా మాట్లాడగా.. టీడీపీ జెండాలు పట్టుకున్న వారు పలుమార్లు జెండాలను పైకెత్తి చూపుతూ నినదించారు. -
తొందరలోనే రేవంత్ అధికార కోట కూలుతుంది: జగదీష్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చంద్రబాబుకు పట్టిన గతే రేవంత్కూ పడుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముంటే బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొట్టండి. మేమేంటో చూపిస్తామంటూ జగదీష్రెడ్డి సవాల్ విసిరారు. రోత రాతల పత్రికపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్ల సంఘం కోరాలి. త్వరలోనే పోలీసుల కూడా ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుందంటూ జగదీష్రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘తొందరలోనే రేవంత్ అధికార కోట కూలుతుంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు, పంచుకునేందుకు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. నేడు ఖమ్మం సభలో తెలుగుదేశం జెండాలు కనిపించినప్పుడే అర్థమైంది. ఆనాడు చంద్రబాబు కూడా ఇలానే మాట్లాడిండు. అలా మాట్లాడిన బాబును పాతాళలోకానికి ప్రజలు పాతరేశారు.’’ అని జగదీష్రెడ్డి గుర్తు చేశారు.‘‘చంద్రబాబు వైఖరినీ రాజకీయంగా కేసీఆర్ ఎదుర్కొన్నారు. తప్పా వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. కేసీఆర్ కాలి గోటికి రేవంత్ రెడ్డి సరిపోడు. కేసీఆర్ స్థాయికి.. రేవంత్ రెడ్డి గడ్డి పోసతో సమానం. కేటీఆర్పై సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తే ఇంత వరకు చర్యలు లేవు’’ అని జగదీష్రెడ్డి మండిపడ్డారు. -
మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్సిగ్నల్
సాక్షి, ములుగు జిల్లా: మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. తొలిసారిగా సచివాలయం బయట మేడారం వేదికగా సమావేశం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.రెండున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం సాగింది. 18 అంశాల ఎజెండాగా భేటీ జరిగింది. జిల్లాల పునర్వవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. పొట్లపాడు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదించింది. -
‘బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్కు దిమ్మ తిరిగే బదులిస్తాం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని రేవంత్ కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ.. బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్కు దిమ్మ తిరిగే బదులిస్తామంటూ హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కొలేకే భౌతికదాడులకు పిలుపునిచ్చారని.. హింసను ప్రేరేపించేలా సీఎం వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ హరీష్ మండిపడ్డారు.‘‘ముమ్మాటికీ రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర. అడుగడుగునా వెన్నుపోట్లు.. అనుక్షణం అబద్ధాలు.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట. ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉంది. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన 'ఓటుకు నోటు' దొంగ.. సీఎం పదవి అనుభవిస్తూనే, కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్’’ అంటూ హరీష్ ఘాటుగా విమర్శించారు. -
వైయస్సార్, ఎన్టీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రశంసలు
-
మా మంత్రులను బద్నాం చేయొద్దు: సీఎం రేవంత్
సాక్షి, ఖమ్మం జిల్లా: సింగరేణి టెండర్లలో అవినీతి జరిగిందని కథనాలు వస్తున్నాయని.. తమ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మద్దులపల్లి సభలో ఆయన మాట్లాడుతూ.. కోల్ మైనింగ్ టెండర్లు అనుభవరం ఉన్నవారికే ఇస్తామన్నారు. తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.‘‘మీకు మీకు ఉన్న పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు. మా మంత్రులను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. ఇలాంటి కథనాల రాసే ముందు మమ్మల్ని వివరణ అడగాలి. మంత్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారు. సింగరేణిలో బొగ్గంతా మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. తప్పుడు ప్రచారాలతో అపోహలు సృష్టించొద్దు. మీడియాకు వివరాలు ఇచ్చేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటాను’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.‘‘మొట్టమొదటి సారి నా రాజకీయ ప్రయాణం ఖమ్మం నుంచి జరిగింది. 20 సంవత్సరాలలో ఖమ్మం ఎప్పుడు వచ్చినా నన్ను అభిమానించారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు కోట్ల పదిహేను లక్షల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి రేషన్ కార్డు రాకపోయినా అందరికీ ఇవ్వండి. ఉచిత విద్యుత్ మీద మొట్ట మొదటి సంతకం పెట్టింది నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి...వైఎస్సార్ స్పూర్తితో ఈనాడు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదు. ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు ఇచ్చాము. సన్నబియ్యం పథకం, ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం ఖమ్మంలోనే జరిగింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. కేసీఆర్ పేదలను దగా చేసిండు తప్ప ఇళ్ళు ఇవ్వలేదు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది...ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం పూర్తి కాకముందే ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రయత్నం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ల గురువు ఫామ్ హౌస్లో ఉన్నాడు.. ఫామ్ హౌస్లో ఉండి పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు...మా ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు. 100 రోజుల్లో సమ్మక్క,సారక్క పనులు పూర్తి చేశాం. గత ముఖ్యమంత్రి ఏకపాత్రాభినయం చేశాడు. మేమందరం సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. కోల్ మైనింగ్ టెండర్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఖమ్మం జిల్లాలో 1130 గ్రామపంచాయతీలు ఉంటే 790 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు. -
తుగ్లక్ పాలన చేస్తూ పేర్లు మారుస్తారా?: తలసాని ఫైర్
సాక్షి, సికింద్రాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తుగ్లక్ పాలన చేస్తూ పేర్లు మార్పు చేస్తున్నారు అని ఆరోపించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మొదట ర్యాలీకి అనుమతి ఇచ్చిన పోలీసులు రాత్రి 10.40కి అనుమతి రద్దు చేశారు. సికింద్రాబాద్ పేరు మార్చడం లేదని సీఎం చెబుతూనే మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. తుగ్లక్ పాలన చేస్తూ పేర్లు మార్పు చేస్తున్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం తప్పదు. నిన్న ఎన్ని విధాలు ప్రయత్నించినా వాళ్ళు ఫెయిల్ అయ్యారు మనం సక్సెస్ అయ్యాం. మొదటి వారంలో కోర్టు అనుమతితో వేలాది మందితో ర్యాలీ చేస్తాం. కలిసి వచ్చే పార్టీలు కలిసి రావాలని కోరాం. ర్యాలీకి మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ఈసారి జరిగే ర్యాలీని ఎవరూ అడ్డుకోలేని విధంగా నిర్వహిస్తాం. మన రక్తంలోనే భయమన్న మాట లేదు.. కేసులకు భయపడేది లేదు అంటూ హెచ్చరించారు.కాగా, సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్.. శనివారం పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు భారీ శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే.. ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి పేరుతో ర్యాలీకి అనుమతి అడిగారని.. అయితే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కారణంతో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
నేడు మేడారంలో కేబినెట్ భేటీ.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, హైదరాబాద్/ఎస్ఎస్ తాడ్వాయి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. అక్కడి హరిత హోటల్ కేంద్రంగా కీలకాంశాలపై నిర్ణయం తీసుకోవడానికి సమాయత్తమైంది.షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్రెడ్డి ఆదివారం పాలేరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఖమ్మం పట్టణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆ తర్వాత అక్కడే జరగనున్న సీపీఐ వందేళ్ల సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత పలువురు మంత్రులతో కలిసి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 4 గంటలకల్లా మేడారానికి చేరుకోనున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మేడారంలోనే రాత్రి బస చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులతో కలిసి సోమవారం ఉదయం 6:30 గంటలకు నూతనంగా నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెలను ప్రారంభించనున్నారు. వనదేవతలకు చీర, సారె, బెల్లంతో మొక్కులు సమర్పించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.భద్రత కట్టుదిట్టం..రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో మేడారంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం హెలిప్యాడ్ స్థలం, హరిత హోటల్, టెంట్ సిటీ, సాంస్కృతిక కార్యక్రమాల సభా ప్రాంగణం తదితర ప్రాంతాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. డీజీపీ శివధర్రెడ్డి, ఐజీ చంద్రశేఖర్రెడ్డి భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించగా ములుగు ఎస్పీ సు«దీర్ రాంనాథ్ కేకన్ భద్రతా ఏర్పాట్లపై మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూంలో సమీక్షించారు. బందోబస్తు విధుల కోసం 1,600 మంది పోలీసులను మోహరించినట్లు చెప్పారు.మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్సిగ్నల్! మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల్లో కో–ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్లను నియమించే అంశంపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్సిగ్నల్ ఇవ్వనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ములుగు జిల్లాలోని రామప్ప చెరువుపై రూ. 103.22 కోట్ల అంచనా వ్యయంతో పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం నిర్మించాలనే ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ భేటీలో సుమారు 15 అంశాలు చర్చకు రానున్నట్లు తెలిసింది. భూ కేటాయింపులు, మూడు యూనివర్సిటీల్లో కొత్తగా మూడు ప్రొఫెసర్ పోస్టుల మంజూరు, పురపాలక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై స్టేటస్ నోట్లు కేబినెట్ ముందుకు రానున్నట్లు తెలియవచ్చింది. నీటిపారుదల శాఖ నుంచి చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల సవరించిన అంచనాల ఫైల్ కేబినెట్ ముందుకు రానుంది. సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతీయ హోదా సాధన, నిర్వహణ కోసం నిధుల మంజూరు అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు అలాగే రైతు భరోసా చెల్లింపులు, సీఎం దావోస్ పర్యటన, ఇతర సమకాలీన రాజకీయ అంశాలపై కేబినెట్లో చర్చకు రానున్నట్లు తెలిసింది.గిరిజన సంప్రదాయ వంటకాలతో విందు: మంత్రి సీతక్క మేడారంలో కేబినెట్ భేటీ కోసం వస్తున్న సీఎం, మంత్రులకు గిరిజన సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పపువ్వు లడ్డూ, కరక్కాయ చాయ్, ఇప్పపువ్వు టీ, జావ, జొన్న రొట్టె, గోదావరి చేపలు, రొయ్యలు, బొంగు చికెన్ తదితర వంటకాలను వడ్డించనున్నట్లు చెప్పారు. జిల్లాలో లభించే పదార్థాలతోనే ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు వివరించారు.ట్రాఫిక్ మళ్లింపులు.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేడారం వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ వెల్లడించారు. ఆదివారం మేడారం జాతరకు వన్వే అమలు చేస్తున్నట్టు తెలిపారు. వరంగల్ నుండి మేడారం వచ్చే భక్తులు. ములుగు పసర.. నార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారం చేరుకోవాలి. తాడ్వాయి మీదుగా ప్రవేశం లేదు. ఆదివారం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. తిరుగు ప్రయాణంలో భయక్కపేట భూపాలపల్లి.. పరకాల.. గూడెపాడు మీదుగా వరంగల్ చేరుకోవాలి. మేడారంలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు ఎగుర వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పేదలకు అండ.. శత వసంతాల ఎర్రజెండా!
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, ఖమ్మం: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత వసంతాల ముగింపు ఉత్సవాలకు కమ్యూనిస్టుల ఎర్రకోట ఖమ్మం ముస్తాబైంది. కాలపరీక్షకు తట్టుకొని రెపరెపలాడుతున్న ఎర్రజెండా నూరేళ్ల పండక్కి కమ్యూనిస్టు శ్రేణులు కదంతొక్కుతున్నాయి. ఆదివారం నుంచి ఈనెల 21 వరకు సీపీఐ వందేళ్ల ఉత్సవాలను ఖమ్మంలో నిర్వహించేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఖమ్మంలో నిర్వహిస్తున్న ర్యాలీ, భారీ బహిరంగసభ ద్వారా ఎర్రజెండాకు పూర్వ వైభవం తీసుకురావాలని సీపీఐ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. బహిరంగసభకు ఆ పార్టీ జాతీయస్థాయి నేతలతోపాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరవుతున్నారు. ఈనెల 19 నుంచి 21 వరకు జరిగే సీపీఐ జాతీయ సమితి సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కార్యదర్శులు డి.రాజా, ఎంఏ బేబీ సహా 40 దేశాలకు చెందిన వామపక్ష పార్టీల నేతలు పాల్గొనబోతున్నారు. భారత గడ్డపై ప్రస్థానం ఎంఎన్ రాయ్, అబానీ ముఖర్జీ వంటి నేతలు 1920లోనే తాష్కెంట్లోనే కమ్యూనిజానికి పునాదులు వేయగా, భారత గడ్డపై సత్యభక్త నేతృత్వంలో 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో పార్టీ రూపుదిద్దుకుంది. ’సంపూర్ణ స్వరాజ్’ కావాలని కాంగ్రెస్ కంటే ముందే డిమాండ్ చేసిన ఘనత కమ్యూనిస్టులదే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సీపీఐ రాజకీయంగా బలమైన పార్టీగా ఎదిగింది. ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది. 1957లో కేరళలో ఈఎంఎస్. నంబూద్రిపాద్ నేతృత్వంలో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. ఇది భూ సంస్కరణలు, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. 1964లో పార్టీ సీపీఐ, సీపీఎంగా చీలిన తరువాత నుంచి ఎర్రజెండా బలహీనపడటం మొదలైంది. రాజకీయ ప్రాధాన్యతలో క్రమక్రమంగా పార్టీ క్షీణిస్తూ వచ్చినప్పటికీ, పోరాటాల్లో ఆ పార్టీ ముద్ర ఇప్పటికీ బలంగా కనిపిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటం తెలుగు నేలపై కమ్యూనిస్టుల చరిత్ర అంటే అది రక్తం చిందించిన పోరాటాల చరిత్ర. నిజాం నవాబు ఆగడాలకు, దొరల గడీల అరాచకత్వానికి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం (1946–1951) కమ్యూనిస్టుల అతిపెద్ద విజయం. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, రావి నారాయణరెడ్డి వంటి ఉద్ధండులు ఈ పోరాటాన్ని ముందుండి నడిపారు. 1946 జూలై 4న కడివెండిలో దొడ్డి కొమరయ్య అమరత్వం ఈ పోరాటానికి నిప్పుకణిక అయింది. చాకలి ఐలమ్మ భూమిని కాపాడటానికి ’సంఘం’ (కమ్యూనిస్టులు) అండగా నిలిచింది. 3000 గ్రామాలను విముక్తం చేయడం, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. దేశ చరిత్రలోనే అతిపెద్ద రైతాంగ పోరాటంగా నిలిచింది. దీనికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టు పార్టీయే. ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో ప్రస్థానం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులోనూ, విశాలాంధ్ర ఉద్యమంలోనూ కమ్యూనిస్టులు అగ్రభాగాన నిలిచారు. 1952 ఎన్నికల్లో రాష్ట్రంలో కమ్యూనిస్టులు భారీ విజయాన్ని సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఏళ్లపాటు సీపీఐ బలమైన ప్రతిపక్షంగా పనిచేసింది. చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, సురవరం సుధాకరరెడ్డి వంటి దిగ్గజ నాయకులు ఇక్కడి నుంచే జాతీయ స్థాయికి ఎదిగారు. సీహెచ్ రాజేశ్వర్ రావు, దేశిని చినమల్లయ్య, చాడా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు వంటి నాయకులు రాష్ట్రంలో సీపీఐ ఎదుగుదలలో తమ వంతు పాత్ర పోషించారు. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో సీపీఐ బలమైన రాజకీయశక్తిగా కొనసాగింది. పొత్తు రాజకీయాల్లో పార్టీ కుంచించుకుపోయినా, రాజకీయంగా పల్లెలు, పట్టణాల్లో ఎర్రజెండా ఉనికి ఇప్పటికీ చాటుతోంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా సీపీఐ తనదైన ముద్ర వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో జరిగిన విద్యుత్ ఉద్యమంలో కూడా సీపీఐ కీలక పాత్ర పోషించింది. లౌకికవాదాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా.. వందేళ్ల వేళ ఖమ్మం నగరం ఎర్రకోటను తలపిస్తోంది. దేశంలో మితవాద శక్తులు బలపడుతున్న తరుణంలో, లౌకికవాదాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ సభ జరుగుతోంది. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభంపై గళమెత్తడం. రాబోయే రోజుల్లో వామపక్ష ఐక్యతను చాటడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం. ––కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పుదుచ్చేరి నుంచి సైకిల్పై.. ఖమ్మంమయూరి సెంటర్: సీపీఐ వందేళ్ల సభలో పాల్గొనేందుకు తమిళనాడుకు చెందిన పార్టీ నాయకులు సైకిల్ యాత్రగా ఖమ్మం చేరుకున్నారు. తమిళనాడు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవసహాయం, కార్యవర్గ సభ్యుడు శరవణన్ పుదుచ్చేరి నుంచి ఈనెల 8న సైకిళ్లపై బయలుదేరారు. రోజుకు 90 కి.మీ. మేర 750 కి.మీ. ప్రయాణించి శనివారం ఖమ్మం వచ్చారు. వీరికి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్ స్వాగతం పలికారు. -
పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? : సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘ప్రజా సమస్యలు, ప్రాజెక్టులపై శాసనసభ వేదికగా చర్చించాలని సవాల్ విసిరా. రోజంతా చర్చ పెట్టినా ప్రతిపక్ష నాయకుడు రాకుండా పారిపోయారు. నిజంగా వారు తెలంగాణకు ప్రాజెక్టులు తెచ్చి ఉంటే.. సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తే ఎందుకు పారిపోయారు? చర్చకు రాకుండా పారిపోయి మళ్లీ మమ్మల్ని ప్రశ్నిస్తారా? మీరు పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిలదీశారు. జిల్లాల పర్యటనలో భాగంగా శనివారం మహ బూబ్నగర్కు వచ్చిన ఆయన రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టిన ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణాలు, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పునరుద్ధరణ, బలోపేతం వంటి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఎలా పాలించాలో మాకు తెలుసు ‘నేను సీఎం అయి రెండేళ్లు కాలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు నన్ను దిగిపో దిగిపో అంటున్నారు. సీఎం కుర్చీ ఏమైనా మీ జాగీరా? మీ తాతలు ఇచ్చిన ఆస్తినా? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టారు. పాలన ఎలా చేయాలో.. సమస్యలు ఎలా పరిష్కరించాలో మాకు తెలుసు. ఇంకా పదేళ్లు మేమే ఉంటాం. నచ్చితే ఆశీర్వదించు. నచ్చకపోతే నీ ఫాంహౌస్లో విశ్రాంతి తీసుకో. శుక్రాచార్యులు, మారీచులు, సుబాహులు, రాక్షసులను కట్టడిచేసే సత్తా పాలమూరు బిడ్డకు ఉంది. గొప్పలు చెబుతున్న ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నవారు మేము విజయాలు సాధించామని గొప్పలు చెబుతున్నారు. కానీ తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లాకు ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు అయినా మంజూరు చేసిండా? లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూళేశ్వరం అయింది. డిండి, బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, సంగంబండ, పాలమూరు–రంగారెడ్డి తదితర ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో అప్పటి పాలమూరు ఎంపీ విఠల్రావు పాలమూరు పథకం గురించి నాటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన అకాల మరణం తర్వాత దీంతో పాటు జలయజ్ఞంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఆగిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఈ పథకానికి రూ.25 వేల కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించి, ఉద్ధండాపూర్ నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు? కల్వకుర్తి ప్రాజెక్టు భూసేకరణకు ఎందుకు నిధులు ఇవ్వలేదు? బీమా–1లో భాగంగా సంగంబండ రిజర్వాయర్ కాల్వకు అడ్డుగా బండ ఉంటే.. దాన్ని తొలగించేందుకు రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదు. నేను సీఎం అయిన తర్వాత వీటికి నిధులు మంజూరు చేశా. జూరాల వద్ద నూతన బ్రిడ్జి కావాలని అడిగితే రూ.123 కోట్లు మంజూరు చేశాం. కేసీఆర్ ఈ పనులు ఎందుకు చేయలేదు?..’ అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఈ ప్రాంతంపై ఎందుకు వివక్ష? ‘మక్తల్–నారాయణపేట–కొడంగల్ పథకం ఆషామాషీగా రాలేదు. అప్పటి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి.. అప్పటి సీఎం వైఎస్సార్తో మాట్లాడి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని, ఎత్తిపోతలు అవసరమని, బీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని కోరారు. కానీ వారి అకాల మరణంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. నేను కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచాక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వెంటపడటంతో రూ.1,500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని పేర్కొంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి జీఓ 69 జారీ చేశారు. కానీ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది. ఈ ప్రాంతంపై ఎందుకు వివక్ష చూపించారు? గత ప్రభుత్వంలో సీఎంను కలిసి ప్రాజెక్టులను పూర్తి చేయాలని అడిగేందుకు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ధైర్యం చేయలేదు. మీరు ఇప్పుడు వచ్చి.. మేము పనులు చేస్తుంటే తప్పు పడుతుండడం మీ చేతగానితనం..’ అని రేవంత్ అన్నారు. రూ.20 లక్షల కోట్ల లెక్కలేవి? ‘కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఖర్చు చేసిన రూ.20 లక్షల కోట్ల వివరాలు చెప్పలేదు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న మీరు ఈ రూ.20 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారనేది ఎందుకు చెప్పడం లేదు? పాలమూరులో ఐఐఎం! రేవంత్రెడ్డి పదేపదే ప్రధాని మోదీని కలుస్తున్నారని నేనంటే గిట్టనివాళ్లు కొందరు అంటున్నారు. తెలంగాణకు నిధులు, అనుమతులు సాధించుకునేందుకు ప్రధానిని కలిస్తే తప్పేంటి. హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు మొదటి సీఎం కాగా.. 75 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు రెండోసారి రాష్ట్రానికి సీఎంగా అయ్యే అవకాశం దక్కింది. ఇక్కడి ఎంపీ డీకే అరుణతో కలిసి మోదీని కలుస్తాం. తెలంగాణకు ఐఐఎం ఇవ్వమని అడుగుతా. దీన్ని పాలమూరులో ప్రారంభించుకుందాం. ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవు. ఉచితంగా ఏమి ఇచ్చినా అది శాశ్వతం కాదు. విద్య ఒక్కటే శాశ్వతం. విజ్ఞానం ఉంటేనే రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలగలిగే స్థాయికి చేరతాం. కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో పైకి రావాలి..’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. -
CM Revanth: పాలమూరుకు అన్యాయం BRS పాలనలోనే!
-
కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
సాక్షి, మహబూబ్నగర్: బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు అన్యాయం చేశారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను కేసీఆర్ వివక్షతో చూశారని.. పదేళ్లలో బీఆర్ఎస్ పాలమూరులోని ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదంటూ విమర్శించారు. బీఆర్ఎస్ చేతకానితనాన్ని కాపాడుకునేందుకు తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు జిల్లాలో ఒక్కటైనా ఉందా? అంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు.సంగబండ పగలగొట్టేందుకు రూ.10 కోట్లు కూడా ఇవ్వలేదు. గత పాలకులు పదేళ్లు పాలమూరుకు అన్యాయం చేశారు. అసెంబ్లీకి వచ్చి చర్చించమంటే ముఖం చాటేశారు. త్వరలోనే తెలంగాణకు ఐఐఎం కోసం ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రధాని మోదీని కలుస్తాం.. ఐఐఎంను కూడా పాలమూరులోనే పెడతాం.. ‘‘మా ఎంపీ డీకే అరుణను ఓడించాలని నేను 14 మీటింగులు పెట్టిన.. కానీ ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు.. పాలమూరు అభివృద్ధికి కలిసి పోతాం. విమర్శలు వస్తుంటాయి...దేశ ప్రధానిగా మోదీని అభివృద్ధి కోసం కలుస్తాం.. ఎన్నికలప్పుడు బరాబర్ కొట్లాడతాం. వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ వారిని గెలిపించండి. అందరం కలిసి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం’’ అని రేవంత్రెడ్డి అన్నారు. -
మోదీని కలిస్తే తప్పేంటి?
నిర్మల్: నరేంద్ర మోదీ తనకు బంధువేమీ కాదని, తనకు చుట్టరికం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ‘నరేంద్ర మోదీని రేవంత్రెడ్డి పదేపదే కలుస్తుంటారని చాలామంది అంటున్నారు. ఆయన మన దేశానికి ప్రధానమంత్రి. ఆయన్ను కలిస్తే తప్పేంటి? ఆయన అనుమతిస్తే ఎయిర్పోర్టు వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లినప్పుడు మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు కూడా నా వెంట ఉంటారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే ఎవరినైనా, ఎన్నిసార్లైనా కలుస్తా..’ అని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరిపై నిర్మించిన సదర్మట్ బరాజ్ని ఆయన ప్రారంభించారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ అభివృద్ధి ‘కొమురం భీమ్, రాంజీ గోండ్ పుట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోరాటాల పురిటి గడ్డ. జల్ జంగిల్ జమీన్ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. కానీ పదేళ్లలో ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది. ఒకప్పుడు ఎర్రబస్సు ఎరగని ఆదిలాబాద్ జిల్లాకు ప్రస్తుతం ఎయిర్బస్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత పథకాన్ని ప్రారంభించి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతాం. ఆదిలాబాద్ జిల్లాలో పదివేల ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామికవాడ, నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. నా సొంత జిల్లా పాలమూరుతో సమానంగా ఉమ్మడి ఆదిలాబాద్ను అభివృద్ధి చేస్తా. చనాఖా–కొరటాకు సి.రామచంద్రారెడ్డి పేరు, సదర్మట్ బరాజ్కు పొద్దుటూరి నర్సారెడ్డి పేరు పెడుతున్నాం..’ అని సీఎం ప్రకటించారు.వాళ్ల తప్పులు, అప్పులే ఉరితాడుగా మారాయి.. ‘గత పాలకులు చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి ఉరితాడుగా మారాయి. అప్పటి ప్రభుత్వం పదేళ్లలో చిన్న సమస్యలను కూడా పరిష్కరించకపోవడం, పట్టించుకోకపోవడంతోనే చనాఖా–కొరట, సదర్మట్ వంటి బరాజ్ల పనులు పెండింగ్లో ఉండిపోయాయి. మా ప్రభుత్వం వచ్చాక, ఉత్తమ్కుమార్రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయ్యాక సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ ఫామ్హౌస్లో ఉండేటాయన శుక్రాచార్యుడిలా తెరవెనుక ఉంటే, మారీచుడు, సుబాహుల్లా బావబామ్మర్దులు అడ్డుపడుతున్నారు. హైదరాబాద్లో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ పేరిట గొప్ప నగరాన్ని నిర్మిస్తున్నాం. ప్రపంచంలోని ప్రతి కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెడుతుంది. ముందుచూపుతో అభివృద్ధి చేపడుతుంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు. అనుభవంతో అభివృద్ధికి సహకరించడం చేతకాకపోతే ఫామ్హౌస్లో మౌనంగా ఉండాలి..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.సౌత్ కుంభమేళా మేడారం ‘ప్రపంచలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర.. సౌత్ కుంభమేళా లాంటిది. రూ.300 కోట్లతో నిర్మించిన అమ్మవార్ల గుడులను, చేసిన అభివృద్ధి పనులను ఈ నెల 19న ప్రారంభిస్తాం. ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా ఆలయ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే బొజ్జుపటేల్ అడిగిన మేరకు రూ.22 కోట్లు మంజూరు చేశాం..’ అని సీఎం తెలిపారు. మంచివాళ్లనే గెలిపించండి ‘రేపోమాపో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మంచివాళ్లను గెలిపించుకోవాలి. మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలంటే పది ఖర్చు పెట్టి, వందలు వెనకేసుకునే వాళ్లను కాకుండా మంచోణ్ణి, మనోణ్ణి గెలిపించుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం సర్పంచ్ స్థానాలను గెలుపొందాం. మేము పాలకులు కాదు..సేవకులం.. ప్రజల మనసులు గెలుస్తున్నాం..’ అని రేవంత్రెడ్డి అన్నారు.గోదావరి నీళ్లను వదులుకోం: ఉత్తమ్కుమార్రెడ్డి గోదావరి నదీ జలాల విషయంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశాయని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. గోదావరి జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా తాము వదులుకోబోమన్నారు. పోలవరం–నల్లమలసాగర్ను వ్యతిరేకిస్తూ తాను, సీఎం రేవంత్రెడ్డి..కేంద్ర ప్రభుత్వాన్ని, ట్రిబ్యునల్ను కలిశామని ఉత్తమ్ వెల్లడించారు. చనాఖా–కొరాట కోసం రూ.100 కోట్లు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. దక్షిణ కశ్మీరాన్ని తలపించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి చెప్పారు. రూ.100 కోట్లతో బాసర అభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, బొజ్జు పటేల్, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీలు దండె విఠల్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.రైతులను అడ్డుకున్న పోలీసులుఇబ్రహీంపట్నం (కోరుట్ల): సదర్మట్ ప్రాజెక్టు నుంచి గంగనాల ప్రాజెక్టుకు నిరంతరం నీళ్లు వచ్చేలా చూడాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు జగిత్యాల జిల్లా రైతులు సిద్ధం అయ్యారు. అయితే పోలీసులు వారిని అనుమతించలేదు.చనాఖా–కొరట నుంచి నీళ్లు విడుదలసాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం హత్తిఘాట్లోని చనాఖా–కొరట పంప్హౌస్ వద్ద మీట నొక్కిన సీఎం రేవంత్రెడ్డి నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేశారు. అనంతరం కాలువలో పారుతున్న నీటికి పూజలు నిర్వహించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సుదర్శన్రెడ్డి, నగేష్తో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్Š ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
CM Revanth : ఇదేనా నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర
-
Talasani : సికింద్రాబాద్పై రేవంత్ సర్కార్ కుట్ర
-
జోగు రామన్న హౌజ్ అరెస్ట్.. సీఎం రేవంత్ పర్యటనతో టెన్షన్
సాక్షి, అదిలాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పర్యటనను ఎలాగైనా అడ్డుకుని తీరతామంటూ బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు జిల్లాల ఎస్పీల నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ సవాల్ చేసింది. దీంతో.. ఆ పార్టీ శ్రేణుల్ని ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నను అర్ధరాత్రి హౌజ్ అరెస్ట చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అటు వైపు రానివ్వకుండా ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. సీఎం రేవంత్ తన పర్యటనలో భాగంగా.. అదిలాబాద్ నియోజకవర్గంలో కొరట చనక మ్యారేజ్ పంప్ హౌస్ను ప్రారంభిస్తారు. ఆపై నిర్మల్ జిల్లా మామడ మండలంలో సదర్ మార్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం.. నిర్మల్ టౌన్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. -
మళ్లీ.. కొత్త జిల్లాల లొల్లి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ అంశం ఇప్పుడు అన్నివర్గాల్లో హాట్టాపిక్గా మారింది. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించడమే దీనికి కారణం. ఉద్యోగాల సాధన కోసం కసరత్తు చేస్తున్న నిరుద్యోగులతోపాటు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, స్థానిక రాజకీయ నాయకులు, విద్యార్థులు... ఇలా అన్ని వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏవిధంగా ఉంటుందనే సందేహం కొందరిలో ఉంటే... ఈ తంతు ఎలాంటి సమస్యలకు దారితీస్తుందోననే ఆందోళన మరికొందరిలో వ్యక్తమవుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్లలో రాష్ట్రంలోని 10 జిల్లాలను అప్పటి ప్రభుత్వం 33 జిల్లాలకు పెంచింది. తొలుత 31 జిల్లాలుగా ఏర్పాటు చేసిన అనంతరం మరో రెండు జిల్లాలను కలిపి జిల్లాల సంఖ్యను 33కు పెంచింది. అలాగే, రెవెన్యూ డివిజన్లు 74కు పెరగగా, రెవెన్యూ మండలాల సంఖ్య 612కు చేరింది. ఆ తర్వాత ప్రభుత్వం 33 జిల్లాలను ఏడు జోన్లుగా, రెండు మల్టీజోన్లుగా వర్గీకరించింది. ఈమేరకు రాష్ట్రపతి ఆమోదంతో 2018 ఆగస్టు నుంచి నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ విభాగాల విభజన, ఉద్యోగుల కేటాయింపులు, స్థానికత నిర్ధారణ, ఉద్యోగ నియామకాలు... ఇలా పలురకాల అంశాల్లో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు ఐదేళ్లు పట్టగా... ఉద్యోగుల కేటాయింపుల్లో సమస్యలు, స్థానికతకు సంబంధించిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ తరుణంలో కొత్తగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మండలాల హేతుబద్ధీకరణ అంశాలు తెరపైకి రావడం గమనార్హం. మార్పుచేర్పులు చేసినా... జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంపు లేదా తగ్గింపు అని అనను’అని పేర్కొన్నారు. సంఖ్యాపరంగా మార్పు ఉండదని చెప్పినప్పటికీ.. జనాభా ప్రాతిపదికన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను హేతుబద్దీకరిస్తామని స్పష్టంచేశారు. దీంతో జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎం ప్రకటన ఆచరణలోకి వస్తే ముందుగా తెరపైకి వచ్చేది స్థానికత అంశమే. ఇది కేవలం ఉద్యోగులకు సంబంధించినదే కాదు. నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అందరికీ సంబంధించింది. ఈ నిర్ణయంతో పాలన పరంగా మార్పులు చోటుచేసుకోవడంతోపాటు ఉద్యోగుల కేటాయింపులు, కొత్తగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జోనల్, మల్టీజోనల్ పరిధుల్లో మార్పులు అనివార్యమవుతాయి. దీనికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అవుతుంది. నిరుద్యోగులతోపాటు విద్యార్థులు చదువుతున్న విద్యాసంస్థల ప్రాంతాల వారీగా స్థానికత ఖరారు చేయాలి. ఈ స్థానికతే తదుపరి చదువులకు, ఉద్యోగాలకు అవసరమవుతుంది. స్థూలంగా చూస్తే ఏమాత్రం మార్పులు చేసినా అది అన్ని విభాగాల్లోనూ ప్రభావం చూపుతుందని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎడతెగని పంచాయితీ... రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రాకముందు కేవలం రెండు జోన్లు మాత్రమే ఉండేవి. కానీ కొత్త జిల్లాల ఏర్పాటుతో జోన్ల సంఖ్య 7కు పెరగగా... కొత్తగా మల్టీజోన్లను ఏర్పాటు చేశారు. జోన్ల సంఖ్య పెంపుతో విద్యార్థులు, ఉద్యోగుల స్థానికతలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన జోనల్ విధానం అమలులో భాగంగా ఉద్యోగ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జీఓ 317 జారీ చేసింది. స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సీనియార్టీని ముందు వరుసలోకి తీసుకోవడంతో మెజార్టీ ఉద్యోగులు జిల్లాలు మారిపోయారు. దాదాపు 30 శాతం మంది సొంత ప్రాంతాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు కేటాయించబడ్డారు. ప్రధానంగా జిల్లా కేడర్ ఉద్యోగుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. పెద్ద సంఖ్యలో టీచర్లతోపాటు పోలీస్ కానిస్టేబుల్స్ ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ⇒ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఓ 317 ద్వారా నష్టపోయిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆన్లైన్లో ఆర్జీలను స్వీకరించింది. ఏకంగా 1.5 లక్షల మంది ఆర్జీలు పెట్టుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో కొన్నింటిని పరిష్కరించినా... మరికొందరికి తాత్కాలిక పద్ధతిలో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం డెప్యూటేషన్ పద్ధతిని ఎంచుకుంది. కానీ ఈ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. మరోవైపు ఉద్యోగ కేటాయింపులతో పట్టణ ప్రాంత జిల్లాల్లో ఖాళీలు లేకుండాపోగా... గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణ ప్రాంత అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గిపోవడంతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న పునర్వ్యవస్థీకరణ ప్రక్రియతో ఈ సమస్యలన్నీ పునరావృతమవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. -
NTV రిపోర్టర్ల అక్రమ అరెస్టు
-
ఇది రేవంత్ సర్కార్ రాజకీయ వికృత క్రీడ
సాక్షి, హైదరాబాద్: పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు అన్నారు. తెలంగాణవ్యాప్తంగా మీడియా ప్రతినిధులను, డిజిటల్ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడం అక్రమమని అన్నారు. ‘‘మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా? జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి. .. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియా పై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. అంతేకాదు డీజీపీ శివధర్రెడ్ఢికి ఫోన్ చేసి జర్నలిస్టులను విడుదల చేయాలని కోరారు.పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు.మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా?ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా?జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా…— Harish Rao Thanneeru (@BRSHarish) January 14, 2026ఈ అరెస్టులను తెలంగాణ పీసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఖండించారు. ‘‘అర్ధరాత్రిళ్లు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సదరు జర్నలిస్టులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని ఉంటే బాగుండేది. జర్నలిస్టుల అరెస్టుతో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదు’’ అని అభిప్రాయపడ్డారు. ఓ మంత్రి-ఐఏఎస్ అధికారిణి అంటూ.. ప్రముఖ చానెల్లో కథనం ప్రసారం అయ్యింది. దాని ఆధారంగా అటు సోషల్ మీడియాలో విస్తృత కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మంత్రి కోమటిరెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఈ క్రమంలో సదరు ప్రముఖ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులను గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఇంటికెళ్లి తలుపులు బద్ధలు కొట్టి మరీ అరెస్ట్ చేశారని.. ఎలాంటి ప్రొసీజర్, నోటీసులు ఫాలో కాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. రాష్ట్రంలో మరికొన్ని చోట్లా పోలీసులు పాత్రికేయుల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా పలు చానెల్స్, 40కి పైగా యూట్యూబ్ చానెల్స్పై పోలీసులు దృష్టిసారించినట్లు సమాచారం. అయితే అక్రమ అరెస్టులు.. పోలీసుల ప్రతాపంపై జర్నలిస్టుల సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. -
బాబూ.. ఓటుకు నోటు కేసు భయమా?: కాకాణి
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొన్నదని కాకాణి చెప్పుకొచ్చారు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం పట్టుకుంది అంటూ విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి కాకాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రహస్య ఒప్పందంతో చంద్రబాబు రైతు ప్రయోజనాలు తాక్కట్టు పెట్టి ద్రోహిగా మారాడు. కలత చెందిన రైతులను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా..? కాదా?. రేవంత్ రెడ్డి అడగటంతో చంద్రబాబు ఈ చర్యలకు పాల్పడటం నిజం కాదా?. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తారు ఏమో అనుకుంటే సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు. 20 టీఎంసీల నీళ్ళు పోతే ఏంటి అని రివర్స్ లో మాట్లాడటం విడ్డూరంగా వుంది.రాయలసీమ లిఫ్ట్ రైతులకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది అని ఆలోచించి వైఎస్ జగన్ ఆ ప్రాజెక్టు చేపట్టారు. నేడు సంజీవనీ లాంటి రాయలసీమ లిఫ్ట్ ను స్వప్రయోజనాల కోసం చంద్రబాబు తాకట్టు పెట్టాడు. పోతిరెడ్డిపాడు నుండి పూర్తి స్థాయిలో నీటిని ఉపయోగించున్న పరిస్థితి లేదు. రైతులు చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఉమ్మేస్తున్నా పట్టించుకోవడం లేదు. కల్వకుర్తి సామర్థ్యం పెంచుకుంటే నోరు మెదపలేదు. తెలంగాణ ప్రభుత్వం 8 టీఎంసీలు అధికంగా వినియోగించుకుంటున్నా నోరు మెదపటం లేదు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం.చంద్రబాబు సీఎం అయ్యాక తెలంగాణ ప్రభుత్వం ఏపీ రైతులకు ద్రోహం తలపెట్టడం ప్రారంభించారు. అడ్డదారుల్లో నీటి ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని తరలించుకుంటున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదలతో రాయలసీమతో పాటు నెల్లూరు, కొంత ఒంగోలు రైతాంగం కూడా నష్టపోతున్నారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కు మూడు సార్లు అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదు. రాయలసీమ, మిట్ట ప్రాంతాల రైతాంగం కోసం ఆలోచన చేసిన నాయకులు వైఎస్సార్, జగన్ మాత్రమే’ అని చెప్పుకొచ్చారు. -
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన గురుశిష్యులు!
తెలుగు రాష్ట్రాల్లో గురుశిష్యుల రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని, పంచాయతీ కాదు..పరిష్కారం కావాలని, గొడవలతో ప్రయోజనం లేదని, సామరస్యంగా ముందుకు వెళితేనే మేలని గురువు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేరోజు కూడ బలుక్కున్నట్లు చేసిన ప్రకటనలు ఆసక్తికరమైనవే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో తాను అనుకోకుండా చేసిన తప్పును దిద్దుకునేందుకు రేవంత్ తన స్వరం మార్చారా? లేక.. ఇద్దరికి సన్నిహితులైన వారు తమకు వివాదాలు అక్కర్లేదని.. నీళ్లు కావాలని ప్రకటన చేయించినట్లుగా ఉందీ వ్యవహారం. అయితే.. తెలంగాణ ప్రాజెక్టులకు ఓకే చేయాలని రేవంత్ రెడ్డి చంద్రబాబును కోరడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. రేవంత్తో ఎలాంటి రహస్య ఒప్పందమూ లేదని చంద్రబాబు స్పష్టంగా చెప్పలేకపోయారు. పైగా రేవంత్ కోరినట్లు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని నిలిపివేయడమే కాకుండా, చివరికి ఆ స్కీమే వృథా అన్న ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ రాజకీయ పార్టీలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏపీకి జరిగే నష్టాన్ని పట్టించుకోలేదు. ఇది ఒకరకంగా దుస్సాహసమే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపడం తమ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టడమేనని ఆ ప్రాంత మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. రాయలసీమ స్కీమ్కు వ్యతిరేకంగా విజయవాడలో టీడీపీ అనుకూల మేధావులతో ఆలోచనపరుల పేరుతో సదస్సు పెట్టించడంంపై కూడా సీమలో అసంతృప్తి ఏర్పడింది. ఇది చాలదన్నట్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణకు కూడా నీరు ఇస్తారట. చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఎత్తుకుని ప్రమాదకర క్రీడ అడుతున్నారన్న అనుమానం కలుగుతుంది. తనకు తెలుగు జాతి ముఖ్యమని తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు అంటున్నారు. ఆయన రెండు రాష్ట్రాలకు సీఎం కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్కు మాత్రమే అనే సంగతి మర్చిపోరాదు. తనకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని గతంలో పలుమార్లు అన్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతలా బలహీనంగా మాట్లాడుతున్నారు? రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ముందుకు తీసుకువెళితే జగన్కు పేరు వస్తుందనా? లేక రేవంత్కు ఇచ్చిన మాట తప్పితే తెలంగాణలో కాంగ్రెస్కు నష్టం కలుగుతుందనా? లేక తన సొంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనా?.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వంతో ఘర్షణకు దిగారు?.. విమర్శలు చేశారు?.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికే కుట్రపన్నారు?. ఓటుకు నోట కేసులో ఎలా దొరికిపోయారు? అప్పుడు తెలుగు రాష్ట్రాలు, తెలుగు జాతి ఏమైపోయినా ఫర్వాలేదా? కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు తదితర ప్రాజెక్టులను ఎలా వ్యతిరేకించారని చంద్రబాబును బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. మరి నాగార్జున సాగర్ వద్ద పోలీసుల మొహరింపు మాటేమిటి? కేసీఆర్, జగన్ భేటీ అయి ఆయా ప్రాజెక్టులపై చర్చిస్తే ఎన్ని ఆరోపణలు చేశారు. అప్పుడు తెలుగుజాతి గుర్తుకు రాలేదా?.. చంద్రబాబే కాదు.. రేవంత్ కూడా తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ను విమర్శిస్తూ జగన్కు పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టారంటూ కొద్ది రోజుల క్రితం కూడా ఎద్దేవ చేశారే! పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టు సమయంలో చంద్రబాబు అనుసరించిన విధానం ఏమిటి? తెలంగాణలో టీడీపీ నేతలతో నిరసనలు, కోస్తాలో ఆ ప్రాంత టీడీపీ నేతలతో వ్యతిరేక ప్రదర్శనలు చేయించారు కదా? అంటే రాయలసీమ ప్రజలకు, తెలంగాణ, ఏపీ ప్రజలకు మధ్య తగాదా పెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందా? లేదా? అప్పుడు తెలుగుజాతి ఒక్కటిగా లేకపోయినా ఫర్వాలేదా! కెసిఆర్ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు కలిసి ఉండనక్కర్లేదన్నమాట. రేవంత్ తన శిష్యుడు కాబట్టి, ఆయన కాంగ్రెస్ అయినా, తాను బీజేపీ కూటమిలో ఉన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడేమో రాయలసీమ ప్రయోజనాలను పణంగా పెట్టి రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని అంటున్నారు. తెలంగాణకు ఓడరేవు లేదు కనుక ఏపీతో సఖ్యంగా ఉండాలని రేవంత్ భావిస్తున్నారట. అయితే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడరాదని షరతు పెట్టారు. కేంద్రానికి తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులను చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి ఒప్పుకుంటుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుని అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే ఎవరూ కాదనరు. ఒక్క నీటి విషయంలో అన్న మాటేమిటి? విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.75 వేల కోట్ల విలువైన ఆస్తి రావల్సి ఉంటుందని, గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సు లెక్కకట్టింది కదా! అది ఇవ్వడానికి రేవంత్ సర్కార్ ఓకే అంటుందా? అసలు చంద్రబాబు ఉమ్మడి ఆస్తుల విభజన గురించి డిమాండ్ చేస్తారా? దీనిపై అవగాహన కుదిరితే అప్పుడు నీళ్ల సంగతి ఆలోచించవచ్చు కదా!. ఇంకో సంగతి చెప్పాలి.. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత వ్యయం చేసి, అందులో వాటా తీసుకోవాలన్న ప్రతిపాదన వస్తే ఇదే చంద్రబాబు, టీడీపీ నేతలు ఏమని అన్నారు? జగన్ బందరు పోర్టును కేసీఆర్కు రాసిచ్చేస్తున్నారని, ఏపీకి తీరని నష్టం చేస్తున్నారని ఆరోపించారా? లేదా? అది తెలుగుజాతి మధ్య గొడవలు పెట్టినట్లు కాలేదా? రాయలసీమ లిఫ్ట్ వల్ల కేవలం 22 టీఎంసీల నీరే వస్తుందని, ఆ ప్రాంతానికి ప్రయోజనం పెద్దగా ఉండదని చంద్రబాబు అంటున్నారు కదా! ఆ విషయమే రేవంత్కు వివరించి, ఈ చిన్న స్కీమ్ వల్ల తెలంగాణకు నష్టం లేదని చెప్పి ముందుకు తీసుకువెళ్లవచ్చు కదా! తెలంగాణకు పోర్టు కనెక్టివిటి కోసం ఏపీ సహకారం కావాలని, అమరావతి అభవృద్దికి హైదరాబాద్ సహకారం అవసరమని రేవంత్ చిత్రమైన వాదన తెచ్చారు. వీళ్లిద్దరు మాచ్ ఫిక్సింగ్ ప్రకటన చేస్తున్నారేమో!. కానీ అదే సమయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కమార్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ పోలవరం-నల్లమలసాగర్ స్కీమ్పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. మొత్తంగా చూస్తే తను చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయంగా చంద్రబాబుకు జరిగిన నష్టాన్ని తగ్గించడం కోసం రేవంత్ రెడ్డి ఏదో కంటితుడుపు ప్రకటన చేసినట్లుగా ఉంది. అలాగే చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతంతో ఇరు ప్రాంతాల ప్రజలను మభ్య పెట్టడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘సీఎం, మంత్రి’ కేసుల దర్యాప్తునకు సిట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి ఫొటోను అసభ్యంగా మార్ఫింగ్ చేయడం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై అనుచిత కథనాల ప్రసారాన్ని పోలీస్ విభాగం సీరియస్గా తీసుకుంది. ఈ రెండు కేసుల్నీ దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ బత్తుల శివధర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ పర్యవేక్షణలో పనిచేసే ఈ సిట్కు సిటీ నార్త్ రేంజ్ జాయింట్ సీపీ ఎన్.శ్వేత నేతృత్వం వహిస్తారు. ఇందులో మొత్తం 8 మంది అధికారులను నియమించారు. ఇప్పటికే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన అధికారిక సిట్ను సజ్జనారే పర్యవేక్షిస్తున్నారు. ⇒ సీఎం రేవంత్రెడ్డి ఫొటోను అసభ్యంగా మారి్ఫంగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.నర్సింహ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటకొండ గ్రామానికి చెందిన కావలి వెంకటేశ్ అసభ్యంగా మారి్ఫంగ్ చేశారని, దాన్ని ‘తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్’లో పోస్టు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ⇒ రాష్ట్ర కేడర్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణిని ప్రస్తావిస్తూ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై జరిగిన దుష్ఫ్రచారానికి సంబంధించి ఐఏఎస్ అ«ధికారుల సంఘం కార్యదర్శి జయేశ్రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఇందులో టీవీ, యూట్యూబ్ చానళ్లతోపాటు వెబ్సైట్లు కలిపి తొమ్మిదింటిని నిందితుల జాబితాలో చేర్చారు. ఈ ఫిర్యాదు, కేసు ల్లో ఎక్కడా కోమటిరెడ్డి పేరు లేకపోయినా, ఆయన ఇటీవలే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ కథనాలను ఖండించిన విషయం విదితమే. ఈ రెండు కేసుల్లోని అంశాలను తీవ్రంగా పరిగణించిన పోలీసు విభాగం సిట్ ఏర్పాటు చేసి, రెండు కేసుల్నీ అక్కడకు బదిలీ చేసింది. ఈ సిట్లో కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న సీసీఎస్ టీమ్–10 ఏసీపీ జి.గురు రాఘవేంద్రతోపాటు చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతం, హైదరాబాద్ పరిపాలన విభా గం డీసీపీ కె.వెంకటలక్ష్మి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి.అరవింద్ బాబు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఎస్పీ బి.ప్రతాప్ కుమార్, హైదరాబాద్ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ సి.శంకర్రెడ్డి, షీ–సైబర్ సెల్ ఎస్సై పి.హరీశ్ సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు కేసుల దర్యాప్తు పూర్తి చేసే సిట్ అభియోగపత్రాల దాఖలు వరకు బాధ్యత తీసుకోనుంది. సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే కొన్ని చోట్ల సోదాలు సైతం చేశారు. -
‘విద్వేషం’పై ఉక్కుపాదం!
సాక్షి, హైదరాబాద్: విద్వేష పూరిత ప్రసంగాలు, వార్తల ప్రచారాన్ని కట్టడి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. ప్రభుత్వంలో ఉండే కీలక వ్యక్తులు, అధికారులే లక్ష్యంగా ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో ప్రసారమయ్యే నిరాధార ఆరోపణలు, విమర్శలకు చెక్ పెట్టేందుకు వీలుగా కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన బిల్లు (విద్వేష పూరిత ప్రసంగాలు, ద్వేష పూరిత నేరాల (నివారణ) బిల్లు, 2025) తరహాలో ప్రత్యేక చట్టం తేవాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇప్పటికే ఈ అంశాలను పరిశీలించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై ఆరోపణలతో ఓ న్యూస్ చానల్లో ప్రసారమైన వార్త, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూప్లలో ప్రచారం చేయడంపై నారాయణపేట జిల్లా మద్దూర్ పోలీస్స్టేషన్లో వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగిస్తూ డీజీపీ బి.శివధర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విద్వేష పూరిత ప్రచారాలపై ప్రభుత్వం సీరియస్గా ఉందనే విషయం ఈ సిట్ ఏర్పాటుతో స్పష్టం అవుతోంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇలాంటి కేసులు ఏవైనా నమోదయ్యాయా అని సిట్ బృందం పరిశీలించే అవకాశం ఉంది. నిరాధార ఆరోపణలు చేయడానికి కారణాలు ఏంటి..? తెరవెనుక ఇంకెవరైనా వ్యక్తులు ఉండి చేయిస్తున్నారా? అన్నది నిగ్గు తేల్చే దిశగానే సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు అయ్యిందని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. సిట్ బృందం గుర్తించే అంశాలను ఆధారంగా చేసుకుని కర్ణాటక తరహాలో చట్టం తేవడానికి అవకాశం ఉందని ఆయన చెప్పారు. కర్ణాటక బిల్లులో ఏముంది..? కర్ణాటక ‘హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ నివారణ బిల్లు–2025’లో అనేక కీలక అంశాలున్నాయి. సమాజంలో మతం, కులం, జాతి, లింగం, భాష తదితర అంశాల ఆధారంగా విద్వేషాలు, ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యలను అరికట్టే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. విద్వేష పూరిత ప్రసంగాలు, నేరాలను నియంత్రించడంతోపాటు అటువంటి నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు విధించడం, బాధితులకు తగిన పరిహారం అందించడం లక్ష్యంగా దీనికి రూపకల్పన చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.బహిరంగ ప్రదేశాల్లో లేదా ఎల్రక్టానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా మాటలతో, రాతలతో, సంకేతాలతో లేదా దృశ్య రూపాల్లో వ్యక్తి లేదా వర్గంపై ద్వేషం, శత్రుత్వం, వైరం రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసే వ్యాఖ్యలను ‘విద్వేష ప్రసంగం’గా పరిగణిస్తామని బిల్లులో పేర్కొన్నారు. మతం, జాతి, కులం, లింగం, లైంగిక అభిముఖ్యత, జన్మస్థలం, నివాసం, భాష, వైకల్యం, గిరిజన గుర్తింపు వంటి అంశాలపై పక్షపాతం చూపితే అది నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్ని కాగి్నజబుల్, నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు.ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ కోర్టులో విచారణ జరుగుతుంది. ద్వేష నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ముందుగానే గుర్తిస్తే ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్ లేదా డిప్యూటీ ఎస్పీ హోదాకు తక్కువ కాని పోలీసు అధికారి ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. ద్వేషాన్ని ప్రోత్సహించే కంటెంట్ను సోషల్ మీడియా, ఎల్రక్టానిక్ మీడియా నుంచి తొలగించేందుకు లేదా బ్లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ద్వేష నేరానికి ఏదైనా సంస్థ లేదా సంఘం పాల్పడితే, ఆ సంస్థతో పాటు దాని నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారిపై కూడా కేసులు నమోదు చేస్తారు.కఠిన శిక్షలు⇒ ద్వేష నేరానికి పాల్పడితే కనీసం ఒక సంవత్సరం నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తారు. ⇒ అదే నేరాన్ని పునరావృతం చేస్తే కనీసం రెండేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ.1 లక్ష జరిమానా ఉంటుంది. ⇒ బాధితులకు నష్టం తీవ్రతను బట్టి న్యాయస్థానం తగిన పరిహారం ఇవ్వవచ్చు. -
మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు
హైదరాబాద్ : ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఈసారి దాదాపు మూడు కోట్లమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్షణ్ కుమార్, దనసరి అనసూయలు అన్నారు. మేడారం జాతరపై నేడు డా. బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర గిరిజన, ఎస్సి సంక్షేమ, ... శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్, రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి దనసరి అనసూయ (సీతక్క) లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, స్వాతి లక్రా, వివిధ శాఖ కార్యదర్శులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ మాట్లాడుతూ, గత 2024 మేడారం జాతరకు కోటిన్నర మంది హాజరుకాగా, ఈసారి 2026 లో జాతరకు దాదాపు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 150 కోట్ల నిధులను మంజూరు చేసి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నందున ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని వివరించారు. సమ్మక్క–సారలక్క జాతరను కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మహాజాతరను విజయవంతంగా నిర్వహించడం ప్రతి అధికారికి ఒక బాధ్యతగా తీసుకుని, ఏ చిన్న లోపం కూడా లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సూచించారు.దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ జాతరకు రూ.150 కోట్లకుపైగా నిధులు కేటాయించి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఈ నిధులతో మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు వంటి అన్ని విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి, జాతరకు వచ్చే భక్తులు సులభంగా గమ్యానికి చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన దిశా సూచిక బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అయోమయానికి గురికాకుండా ట్రాఫిక్ నియంత్రణ పటిష్టంగా ఉండాలని, ప్రత్యేక రూట్ మ్యాప్లతో పాటు అవసరమైన చోట వన్వే వ్యవస్థ అమలు చేయాలని సూచించారు. ఈ జాతరపై క్యాబినెట్ మొత్తం ప్రత్యేక దృష్టి సారించిందని, మంత్రులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి అడ్లూరి తెలిపారు. ఇలాంటి స్థాయి సమిష్టి పర్యవేక్షణ గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు.తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు–సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ఈసారి జాతర ఏర్పాట్లకు రూ. 150 కోట్లతో పాటు గద్దెల పునరుద్ధరణ పనులకు రూ. 101 కోట్లు మొత్తం 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారని వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తులకు సాఫీగా దర్శనం లభించేలా ప్రాధాన్యత నిస్తున్నట్టు అన్నారు. ఇందుకు గాను ప్రతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖ కార్యదర్సులు, హెచ్.ఓ.డీ లతో ప్రత్యేకంగా వాట్స్-అప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి జాతర నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సీతక్క సూచించారు. శానిటేషన్, తాగునీరు, రవాణా, భద్రతాలపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలని, ప్రధానంగా టాయిలెట్ లను మరింత పెంచాలని కోరారు. జాతర సందర్భంగా గురు, శుక్ర వారాల్లోనే ప్రతి రోజు కనీసం 40 లక్షల మంది భక్తులు ఉంటారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మేడారం జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2010 నుండి ప్రతీ సంవత్సరం వస్తున్నారని, వచ్చే వందేళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని సీతక్క గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు మాట్లాడుతూ, జాతర నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నందున అన్ని శాఖల ఉన్నతాధికారులు జాతర పనులకు సకాలంలో పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సాధించాలని పేర్కొన్నారు. జాతర సందర్బంగా భక్తులకు చేసిన ఏర్పాట్లు, రవాణా, ఇతర సౌకర్యాలు, భక్తులు పాటించాల్సిన సూచనలపై విస్తృత స్థాయిలో సమాచారాన్ని అందించాలని తెలిపారు. మేడారానికి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకుగాను డ్రోన్ లను ఉపయోగించుకోవాలన్నారు. అదేవిధంగా, జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్ ను/ క్యూ.ఆర్ కోడ్ రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్కింగ్ ఏరియాలలో కూడా ప్రత్యేకంగా వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీ రోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను కోరారు. ఈ సందర్బంగా, మేడారం జాతరకు వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టిన పనులు, వాటి పురోగతి పై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. మేడారం జాతరపై ములుగు జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్, వీడియోలను మంత్రులు సీతక్క, లక్షణ్ కుమార్, సి.ఎస్ రామకృష్ణ రావు లు ఆవిష్కారించారు. -
Talasani : మా ఆత్మగౌరవంపై దెబ్బ కొడితే చూస్తూ ఊరుకోం
-
సీఎం రేవంత్పై వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన తలసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా చేయాలని భావించింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ను విభజించాలని సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతటితో ఆగకుండా సికింద్రాబాద్ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అనంతరం, తలసాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై తలసాని తాజాగా స్పందించారు. సాక్షితో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ..‘సీఎం రేవంత్పై చేసిన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవడంతో నాకేమీ అభ్యంతరం లేదు. ఆవేశంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు అలా వస్తాయి. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులను గౌరవించే వ్యక్తిని నేను. సికింద్రాబాద్ ప్రాంతం మా ఎమోషన్. సికింద్రాబాద్ను మార్చట్లేదు అనుకుంటూనే ఇక్కడి ప్రాంతాలన్నీ మల్కాజ్గిరిలో కలుపుతున్నారు. పదవిలో ఉన్నామని ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు బుద్ది చెబుతారు.గతంలో కేసీఆర్ శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసి పోలీసు కమిషనరేట్లు చేశారు. ఇప్పుడు ఏ పోలీసు స్టేషన్ ఎవరికీ వస్తుందో అర్ధం కానీ పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవి అన్నీ అబద్దాలే. సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజిగిరి జోన్లో కలిపింది వాస్తవం కాదా?. 17వ తేదీన నిర్వహించనున్న శాంతి ర్యాలీకి అనుమతి కోసం ఈ నెల 5న హైదరాబాద్ పోలీసు కమిషనర్కు దరఖాస్తు చేస్తే మల్కాజ్గిరి కమిషనర్ అనుమతి ఇవ్వాలంటూ సమాధానం ఇచ్చారు. సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్లోకి చేర్చారు. భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరిది. మన అస్తిత్వం, ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలి. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతి ర్యాలీని ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు సాగుతుంది. భారీ ర్యాలీలో అన్ని సంఘాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి’ అని పిలుపునిచ్చారు. -
KTR : ఆ జిల్లాలను ముట్టుకుంటే! రేవంత్ రెడ్డికి వార్నింగ్
-
త్రిముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి జిల్లాల పర్య టన ఈ దఫా త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగనుంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ప్రచారం, పలుచోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడానికి నిరసనగా సభలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా రెండు దఫా ల పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. 16 నుంచి షురూ తొలి విడతలో ఈనెల 16, 17, 18 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలకు వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతోపాటు పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. నిర్మల్, మహబూబ్నగర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరవుతారు. 19వ తేదీన మేడారం వెళ్తారు. అదే రోజు సింగపూర్, అమెరికా దేశాల పర్యటనకు వెళ్తారు. ఫిబ్రవరి 1న హైదరాబాద్ తిరిగి వస్తారు. మరుసటి రోజు వీలును బట్టి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండో విడతలో ఆరు రోజులు ఫిబ్రవరి 3 నుంచి మలి విడత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఆయన ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ఆరు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. వరుసగా నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు వెళతారు. తొలి దఫా తరహాలోనే వీలును బట్టి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. కార్యకర్తలతో సమావేశాలు, కార్నర్ మీటింగ్ల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభలకు హాజరవుతారు.ఇక ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల మంత్రులు, ఇన్చార్జి మంత్రులకు టీపీసీసీ అప్పగించనుంది. కాగా చివరి రోజు, రెండు రోజుల్లో సీఎం వెళ్లే మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన షెడ్యూల్ ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కావాల్సి ఉంది. -
హైదరాబాద్ వేదికగా...
సాక్షి, హైదరాబాద్: పలు ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లకు వేదికగా నిలిచిన హైదరాబాద్ మరో పెద్ద టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. మహిళల హాకీ వరల్డ్కప్లో భాగంగా జరిగే క్వాలిఫయింగ్ టోర్నీని ఇక్కడి గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహిస్తారు. మార్చి 8 నుంచి 14 వరకు ఈ పోటీలు జరుగుతాయి. మొత్తం ఎనిమిది జట్లు ఇందులో పాల్గొంటాయి. టాప్–3లో నిలిచిన టీమ్లు నేరుగా వరల్డ్ కప్కు అర్హత సాధిస్తాయి. భారత్తోపాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆస్ట్రియా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హత టోర్నీ నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఒప్పందం చేసుకుంది. ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రామ్ ఇందులో పాల్గొని టోర్నీ నిర్వహణపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని పునరుద్ఘాటించారు. హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ నిర్వహించడం తమకు గర్వకారణమని... మున్ముందు నగరాన్ని అత్యుత్తమ స్థాయి క్రీడా కేంద్రంగా మార్చే క్రమంలో ఇది మరో ముందడుగు అని ఆయన అన్నారు. టోర్నమెంట్కు సంబంధించిన పోస్టర్ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత హాకీ సమాఖ్య (హెచ్ఐ) అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ తిర్కీ, భోలానాథ్ సింగ్తో పాటు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సలహాదారు జితేందర్ రెడ్డి, క్రీడా కార్యదర్శి జయేశ్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ఉద్యోగులకు 3.64% డీఏ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు సంక్రాంతి సందర్భంగా శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలకుగాను గతంలో ప్రకటించినట్లుగానే ఒక డీఏను మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 3.64 శాతం డీఏను మంజూరు చేసింది. ఈ నెల వేతనంతోపాటు పెంచిన డీఏను ఫిబ్రవరిలో చెల్లింపులు చేయనుంది. ప్రస్తుతం సర్విసులో ఉన్న ఉద్యోగులకు డీఏ బకాయిలను జీపీఎఫ్లో జమ చేయనున్నారు.పెన్షనర్లకు మాత్రం 01–07–2023 నుంచి 31–12.2025 వరకు చెల్లించాల్సిన డీఆర్ బకాయిలను 30 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ట్రెజరీ ద్వారా వేతనాలు పొందని వారికి జిల్లా పరిషత్, మునిసిపాలిటీల పెన్షన్ ఫండ్స్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. పెంచిన డీఏ ప్రకారం రాష్ట్ర ఖజానాపై ఏటా దాదాపు రూ.2,180 కోట్ల భారం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం డీఏను పెంచడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం రాజకీయ విభజన కోణంలో ఏర్పాటు చేసిన జిల్లాలను ప్రజల అభీష్టం మేరకు హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. అప్పట్లో అడ్డగోలుగా విభజన ‘గత ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టానుసారంగా విభజించింది. ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే, మరో జిల్లాలో 14 ఉన్నాయి. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన అడ్డగోలుగా జరిగింది. జిల్లాల సంఖ్య తగ్గించడం, పెంచడం అని కాదు కానీ రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి..ఒక మండలంలో ఎంత జనాభా ఉండాలి, ఒక డివిజన్లో ఎంత ఉండాలి, ఒక జిల్లాలో ఎంత ఉండాలనేది నిర్ణయించాలి. ప్రస్తుతం ఒక జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే ఒక జిల్లాలో కోటి జనాభా ఉంది. ఇలాంటప్పుడు పరిపాలన ఏవిధంగా చేస్తారు? ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఒక లీడర్ తనకు నచ్చిన 3, 4 గ్రామాలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకుంటే... మరొకాయన 2, 3 ఎంపీటీసీలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా పరిషత్ సమావేశానికి వెళ్లా. వేదికపై చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. మరొకాయన రాలేదు. నాకు ఎవర్ని చూసి మాట్లాడాలో అర్థం కాలేదు. జిల్లా ఈ విధంగా ఉంటే ఎలా? ఇలాంటి తప్పిదాల వల్ల పాలనపై నమ్మకం పోతుంది. దీన్ని సరి చేయాలి..’ అని సీఎం అన్నారు. తొలుత మండలాల హేతుబద్ధీకరణ ‘ముందుగా మండలాలను హేతుబద్ధీకరించాలి. మండలంలో 10 శాతం ఎక్కువ జనాభా లేదా తక్కువ.. రెవెన్యూ డివిజన్, జిల్లాల్లో కూడా ఇదే ఫార్ములాతో విభజన జరగాలి. దీనిపై అసెంబ్లీలో డిబేట్ పెడతాం. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. మార్గదర్శకాలు రూపొందిస్తాం. కూలంకషంగా చర్చించిన తర్వాతే విధివిధానాలు ఖరారు చేసి నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ పద్ధతిలో వీటిని హేతుబద్ధీకరించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇందుకోసం ప్రత్యేకంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ను ఏర్పాటు చేస్తాం. ఇందులో రెవెన్యూ అధికారులతో పాటు సంబంధిత అధికారులంతా సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ఆర్నెల్లు పర్యటించి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తాం’ అని రేవంత్ తెలిపారు. సగటు మధ్య తరగతి ఉద్యోగి సంసారంలా.. ‘రాష్ట్ర ప్రభుత్వంలో 10.5 లక్షల మంది ఉద్యోగుల సైన్యం ఉంది. సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కేవలం నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంటుంది. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల కలయికే ప్రభుత్వం. పదవీ విరమణ ప్రతి ఉద్యోగికీ వస్తుంది. ఆ రోజున తనకు అందాల్సిన ఆర్థిక లబ్ధి తీసుకోవడం అతని హక్కు. కానీ గత ప్రభుత్వం చేతకాక వయో పరిమితిని పెంచింది. అందువల్ల ఆ సమయంలో జరగాల్సిన రిటైర్మెంట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. ఉద్యోగులకు గత ప్రభుత్వం రూ.11 వేల కోట్ల మేర బకాయి పెట్టింది. అలాగే కాంట్రాక్టర్ల బిల్లులకు రూ.42 వేల కోట్లు..ఇలా అన్నీ కలిపి రూ.1.11 లక్షల కోట్లు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వానికి అప్పులు సంక్రమించాయి. ప్రస్తుతం క్రమ పద్ధతిలో పొదుపు చేస్తూ సగటు మధ్యతరగతి ఉద్యోగి సంసారం మాదిరి రెండేళ్లుగా శ్రమిస్తూ ఆర్థిక స్థితిని గాడిన పెడుతున్నాం. గతంలో ఉద్యోగులకు ఏ రోజున జీతాలు వచ్చాయి.. ఇప్పటి పరిస్థితి ఏమిటో సమీక్షించుకోవాలి. ఉద్యోగులకు పెద్దన్నగా ఓ తీపి కబురు ఉద్యోగులకు పెద్దన్న మాదిరిగా ఇక్కడికి వచ్చా. తీపి కబురు చెప్పకుండా ఉండడం సబబు కాదు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఫైలుపై సంతకం చేసి వచ్చా. ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు రూపొందిస్తున్నాం. రూ.1.02 కోట్ల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఉద్యోగులు పన్నుల వసూళ్లు, ఇతర ఆదాయం విషయంలో మరింత కృషి చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత వేగంగా గాడిన పడుతుంది. ఉద్యోగ సంఘ భవనం ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ముందుగా హైదరాబాద్లో రాష్ట్ర కార్యాలయం నిర్మించుకోవాలి. ఉద్యోగ సంఘం ఎంత నిధి ఇస్తుందో.. అదే స్థాయిలో ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది..’ అని సీఎం చెప్పారు. టీజీవో అధ్యక్ష కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, బి.శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని ఏలూరు.. సచివాలయంలో విలేకరులకు తెలిపారు. పెండింగ్ బిల్లుల కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.700 కోట్లను ఏప్రిల్ నుంచి రూ.1,500 కోట్లకు పెంచుతామని చెప్పారన్నారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న సీఎం, మంత్రులకు టీజీవో తరఫున ధన్యవాదాలు తెలిపారు. -
'బురద' రాజకీయాలు మానాలి!
‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’పై బురద చల్లే కార్యక్రమాన్ని ఆపి సీమను ఆదుకునే పనిపై సంబంధిత పక్షాలన్నీ దృష్టి పెట్టాలి. ఈ పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా తప్పు పట్టడం, ఆ పథకం ప్రాధాన్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దీనికి ప్రత్యామ్నాయం అన్నట్లు మాట్లాడటం సరికాదు. కొంత మంది రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదనీ, 800 అడుగుల నుంచి నీరు తీసుకుంటే నీళ్లు కాదు బురద వస్తుందనీ మాట్లాడటం అభ్యంతరకరం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయం కాదు. అసలు రెండు ప్రాజెక్టులకు పోటీ పెట్టి మాట్లాడటమే పొరపాటు. రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమకు నీటిని గరిష్ఠ స్థాయిలో ఎలా తీసుకోవాలి అనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలి.ముచ్చుమర్రి ఎలా ప్రత్యామ్నాయం?ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయంగా మాట్లాడుతున్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 798 అడుగులు ఉన్నపుడు కూడా నీటిని తోడే అవకాశం ముచ్చుమర్రి ద్వారా సాధ్యం అవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమే ముచ్చుమర్రి. 2007లో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయల ఖర్చుతో పాలనాపరమైన, ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు దాదాపు 50 శాతం పనులు పూర్తి చేశారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రి వలన ప్రయోజనాలు, పరిమితులను నిజా యతీగా విశ్లేషించుకోవాలి.ఈ పథకం ద్వారా కేసీ కెనాల్కు 1,000 క్యూసెక్యులు,హంద్రీ–నీవా ప్రాజెక్టుకు 3,000 క్యూసెక్యుల నీటిని రెండు మార్గాల ద్వారా లిఫ్ట్ చేస్తున్నారు. మల్యాల నుంచి మరో 3,000 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా హంద్రీ–నీవాకు సరఫరా చేస్తున్నారు. అయితే మల్యాల నుంచి లిప్ట్ చేయాలంటే శ్రీశైలంలో 834 అడులు నీరు ఉంటేనే సాధ్యం. ముచ్చుమర్రి దగ్గర కృష్ణానది నుంచి సిద్ధేశ్వరం దాకా 7 కి.మీ. మేరకు కాలువ తవ్వడం వలన నీటిని ఎత్తిపోతల ద్వారా హంద్రీ– నీవా, కేసీ కెనాల్లకు పరిమిత స్థాయిలో సరఫరా చేయవచ్చు. 11,574 క్యూసెక్కులు నిరాటంకంగా తోడితే ఒక టీఎమ్సీ నీటిని తోడవచ్చు. ఒక్క హంద్రీ–నీవాకే 40 టీఎమ్సీలు అవసరం. 2017లో ప్రారంభమైన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా గడిచిన 7, 8 సంవత్సరాలలో ఏడాదికి 7 నుంచి 9 టీఎమ్సీల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. హంద్రీ–నీవాకు 40 టీఎమ్సీలూ, కేసీ కెనాల్కు పూర్తి స్థాయి అవసరాలకూ అనుగుణంగా నీరు సరఫరా సాధ్యం కావడం లేదు. అలాంటి పరిస్థితిలో అదనంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీరు విడుదల చేయా ల్సిన ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్, తెలుగుగంగ, నెల్లూరు జిల్లా సోమశిల వంటి వాటికి ముచ్చుమర్రి ద్వారా నీరు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది?పోతిరెడ్డిపాడు కింద ఎస్ఆర్ఎమ్సీ వద్ద రోజుకు మూడు టీఎమ్సీల నీటిని సరఫరా చేసే అవకాశం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా లభిస్తుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ముచ్చుమర్రి ద్వారా మొత్తం సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నట్లు మాట్లా డటం సరికాదు. ముచ్చుమర్రి ద్వారా వచ్చే పరిమిత ప్రయోజ నాలను కొనసాగిస్తూ అదనపు ప్రయోజనాలకు అనుగుణంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.అవగాహన లేని వ్యాఖ్యలుకొందరు ఏకంగా శ్రీశైలంలో 800 అడుగులు నుంచే నీరు లిఫ్ట్ చేస్తే బురద వస్తుందనడం అభ్యంతరకరం. మరి అంతకన్నా కొన్ని అడుగుల క్రింద నుంచే గడిచిన ఏడెనిమిది సంవత్సరాలుగా ముచ్చుమర్రి ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల కింద నుంచే నీటిని లిఫ్ట్ చేస్తోంది. అక్కడెక్కడా రాని బురద రాయలసీమ ఎత్తిపోతల పథకంలో మాత్రమే వస్తుందనడం న్యాయమా? కొందరు మంత్రులు ఏకంగా ముచ్చుమర్రి నుంచే పోతిరెడ్డిపాడుకు నీరు లిఫ్ట్ చేసుకుందాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ముచ్చుమర్రి, మల్యాల నుంచి హంద్రీ–నీవా అవస రాలకు 40 టీమ్సీల నీరు అవసరం అయితే, అందులో సగం నీరు కూడా తీసుకోలేని దుఃస్థితిలో ఉంటే... అదనంగా పోతిరెడ్డిపాడుకు కూడా ముచ్చుమర్రి నుంచే నీరు లిఫ్ట్ చేసుకుందాం అనడం దారుణం.రాయలసీమ ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లతో నికర జలాలు సగం కూడా తీసుకోలేక పోతున్నాము. ఇంక వరద జలాలపై ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలుగొండ, సోమశిలలకు నీరు ఎలా తీసుకుంటాం? బాధ్యత గల ప్రభుత్వాలు శ్రీశైలం నుంచి అవకాశం ఉన్న మేరకు గరిష్ఠ స్థాయిలో నీటిని తీసుకునేందుకు మార్గాలను అన్వేషించాలి. సింహ భాగం పూర్తి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తే నష్టపోయేది రాయలసీమ ప్రజలే!మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
Revanth Reddy: రోడ్డు మీదకొచ్చే ముందు.. యాక్సిడెంట్స్ మర్డర్స్ తో సమానం
-
ప్రతి ఉద్యోగికి కోటి ప్రమాద బీమా...రేవంత్ రెడ్డి వరాల జల్లు
-
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు మరో డీఏ ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ ప్రకటన చేశారు. డీఏ ఫైల్ మీద సంతకం చేసి వచ్చా. రేపో మాపో డీఏ జీవో వస్తుంది’అని తెలిపారు. పెన్షనర్లకు డీఏ,డీఆర్ పెంపు తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్లకు డీఏ,డీఆర్ పెంపు ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు ఉపశమనం కలగనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 30.03శాతం డీఆర్ను 33.67శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2018 జూలై 1 తర్వాత రిటైర్డ్ అయిన పెన్షనర్లకు వర్తించనుంది. 2020 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి ఇది ప్రత్యక్ష లాభం కలిగిస్తుంది.2018కి ముందు రిటైర్డ్ అయిన పెన్షనర్లకు కూడా డీఆర్ పెంపు వర్తించనుంది. 2015 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 68.628శాతం నుంచి 73.344శాతానికి పెరిగింది. 2016 పే స్కేల్స్ పెన్షనర్లకు డీఆర్ 42శాతం నుంచి 46శాతానికి పెంపు జరిగింది. UGC/AICTE 2006 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 221శాతం నుంచి 230శాతానికి పెరిగింది. ఈ పెంపు విద్యా రంగానికి చెందిన పెన్షనర్లకు గణనీయమైన లాభం కలిగించనుంది.పెరిగిన డీఆర్ 2023 జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. 2023 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు పెరిగిన డీఆర్ బకాయిలు చెల్లించనున్నారు. ఈ బకాయిలు మొత్తం 30 నెలవారీ వాయిదాల్లో చెల్లించబడతాయి. 2026 జనవరి నెల పెన్షన్తో పెరిగిన డీఆర్ చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 2026లో పెన్షన్ మరియు డీఆర్ చెల్లింపులు పూర్తిగా అమలులోకి వస్తాయి. ఈ పెంపు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్రాంట్స్ పొందుతున్న వారికి వర్తించదు. కేవలం పెన్షన్ పొందుతున్న వారికి మాత్రమే ఈ లాభం అందుతుంది.జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటనతెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో ఈ అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ‘జిల్లాల సరిహద్దులు మార్చాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అందుకే జిల్లాల పునర్విభజన కోసం ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయనున్నాం. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో చర్చ జరిపి, సభ్యుల సలహాలు తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ అంశంపై అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ముందుగా మండలాల రేషనలైజేషన్, తర్వాత రెవెన్యూ డివిజన్ల రేషనలైజేషన్, ఆ తర్వాతే జిల్లాల పునర్విభజన జరుగుతుంది’ అని తెలిపారు. -
అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు సరిగ్గా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళితబంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్సీ ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి, ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. రేవంత్రెడ్డి రైతులు, రైతు కూలీలు, కౌలుదారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అందరిని మోసం చేశారని కేటీఆర్ అన్నారు. రేవంత్కు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలు రావు కానీ ఆయనకు వచ్చిన ఏకైక భాష బూతుల భాష అని ఎద్దేవా చేశారు. బండ్లగూడ మాజీ మేయర్ లతాప్రేమ్గౌడ్, వారి అనుచరులు ఆదివారం తెలంగాణభవన్లో కార్తీక్రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ కనిపిస్తే ధైర్యం వస్తది అని ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్రంలో వ్యాపారాలు తగ్గడానికి, పరిస్థితులు దిగజారడానికి సన్నాసి రేవంత్రెడ్డి ప్రభుత్వమే కారణం. కాంగ్రెస్లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఏమి అభివృద్ధి చూసి కాంగ్రెస్లో చేరిండో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి’అని కేటీఆర్ అన్నారు. బీజేపీ బలం గాలివాటమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పది సంవత్సరాల్లో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, కచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ వైపు నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆదివారం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో జరిగిన పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రెండు జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన మున్సిపల్ ఎన్నికల వ్యూహం, ఇతర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురపాలక ఎన్నికల్లో సమష్టిగా కలిసి కొట్లాడి కాంగ్రెస్పై ఘన విజయం సాధించేలా ప్రయత్నం చేయాలని సూచించారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదని, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మొదలు సర్పంచ్ల వరకు ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ప్రజలు నిలబడ్డారన్నారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలివాటమే అని చెప్పారు. ఆనాడు దేశంలోని రాజకీయ పరిస్థితులతోనే బీజేపీ గెలిచిందే తప్ప, ఆ పార్టీకి తెలంగాణలో క్షేత్రస్థాయి బలం లేదన్నారు. అసెంబ్లీలో పోటీచేసిన ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ నేతలు ఘోరమైన ఓటమి పాలయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గాలివాటంగా గెలిచారని చెప్పారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని మున్సిపాలిటీలలో ఉన్న స్థానిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఈ సమావేశంలో పాల్గొని అనేక అంశాలపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
నేను సోషల్ డాక్టర్! : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్లు కేవలం వైద్య నిపుణులే కాదు.. సమాజానికి దిక్సూచి వంటివారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘నేను డాక్టర్ను కాదు.. కానీ సోషల్ డాక్టర్ను. ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో శనివారం ఫెలోస్ ఇండియా సదస్సులో భాగంగా ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ఐసీఆర్టీఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి వైద్య సదస్సును నిర్వహించడం గర్వకారణమని చెప్పారు. ఈ సదస్సుకు భారత్తోపాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు హాజరుకావడాన్ని ఆయన అభినందించారు. ఇప్పటికే సక్సెస్ఫుల్ కార్డియాలజిస్టులైన డాక్టర్లు కూడా జ్ఞానం, నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ఈ సదస్సుకు రావడం అభినందనీయమన్నారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని, కొత్త విషయాలు తెలుసుకోవడం, స్కిల్స్ను అప్డేట్ చేసుకోవడం మానేస్తే కెరీర్కు ముగింపు పలికినట్టేనని పేర్కొన్నారు. సాంకేతికత అతివేగంగా మారుతున్న నేపథ్యంలో వైద్య రంగం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటితో ముడిపడుతోందన్నారు. అందుకే ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అయితే, ప్రజల నాడి పట్టుకోవడాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దని హితవు పలికారు. హెల్త్కేర్ హబ్గా హైదరాబాద్ లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాల్లో హైదరాబాద్ ఆవిష్కరణల కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. డాక్టర్లు కావాలని చాలామంది ఆశపడతారని, కానీ అందరికీ ఆ అవకాశం దక్కదని చెప్పారు. అందుకే డాక్టర్లు సమాజంలో ఒక ప్రత్యేక వర్గమని, ప్రజల ప్రాణాలు కాపాడే గొప్ప బాధ్యత మీపైన ఉందని గుర్తుచేశారు. ప్రజా ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం హెల్త్ పాలసీలను మెరుగుపరచడంలో వైద్యుల సహకారం కీలకమని, మీ సలహాలు, సూచనలతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. గుండె జబ్బులపై అవగాహన కల్పిస్తే... ఇటీవలి కాలంలో గుండె జబ్బులతో మరణాలు పెరుగుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గుండె జబ్బులను నివారించే మిషన్లో అందరూ భాగస్వాములవ్వాలని వైద్యులకు పిలుపునిచ్చారు. విద్యార్థులకు సీపీఆర్ శిక్షణను స్వచ్ఛందంగా అందించేందుకు కార్డియాలజిస్టులు ముందుకొస్తే అనేక ప్రాణాలను కాపాడగలమని చెప్పారు. చాలా సందర్భాల్లో నివారణపై నిర్లక్ష్యం చేస్తామని, కానీ ప్రజలకు అవగాహన కల్పిస్తే సమాజం మొత్తంగా లాభపడుతుందన్నారు. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ విషయంలో అందరూ కృషి చేయాలని, ఆరోగ్య సంరక్షణలో భారత్.. వరల్డ్ బెస్ట్గా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతీ వైద్యుడు ఉత్తమంగా ఎదగాలన్నదే తన కోరికని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెలోస్ ఇండియా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ శరత్ రెడ్డి, మెడికవర్ సీఎండీ డాక్టర్ అనిల్ కృష్ణ, మెడికవర్ సీఈవో డాక్టర్ హరికృష్ణ, మాజీ సీఎస్ఐ అధ్యక్షుడు పీసీ రథ్ పాల్గొన్నారు. -
నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తాను డాక్టర్ను కాదు.. కానీ సోషల్ డాక్టర్నని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. హెచ్ఐసీసీలో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్లో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ జరగడం సంతోషమన్నారు.‘‘భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు వచ్చారు. మీరంతా సక్సెస్ ఫుల్ కార్డియాలజిస్టులు. అయినా మీ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఈ కాన్ఫరెన్స్ కు వచ్చారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు...కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే మీ కెరీర్కు ముగింపు పలికినట్లే. ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరగడం ఎంతో గర్వకారణం. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాలలో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాలా మంది డాక్టర్లు అవ్వాలనుకున్నా అందుకు అర్హత సాధించలేరు. మీరంతా సమాజంలో ఒక ప్రత్యేక గ్రూప్. డాక్టర్లు ప్రాణాలు కాపాడతారని మేం బలంగా నమ్ముతాం. మనుషులపట్ల, సమాజం పట్ల మీ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దు...ప్రజల ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రజల ప్రయోజనాల కోసం మా పాలసీని మెరుగుపరచడానికి మీలాంటి వైద్యులతో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఆ దిశగా మీ సలహాలు, సూచనలు ఇచ్చి మాకు సహకరించండి. విజ్ఞానం, సాంకేతికత ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తున్నాయి. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ హై టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందుకే లేటెస్ట్ టెక్నాలజీ పై మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి.. కానీ ప్రజల నాడిని పట్టుకోవడం మరిచిపోవద్దు...ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతున్నారని మీకు తెలుసు. గుండె జబ్బులను నివారించే మిషన్లో మనమందరం భాగస్వాములం అవుదాం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మనమందరం కలిసి పనిచేద్దాం. విద్యార్థులకు సీపీఆర్ నేర్పించడానికి మీరు స్వచ్ఛందంగా ముందుకు రాగలిగితే.. మన దేశంలో చాలా మంది ప్రాణాలను కాపాడగలం. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ గురించి అంతా కృషి చేయాలని మీ అందరినీ కోరుతున్నా. ఆరోగ్య సంరక్షణలో మనం వరల్డ్ బెస్ట్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ ఉత్తమ వైద్యుడిగా ఎదిగేందుకు ప్రయత్నించాలి’’ అని రేవంత్ అన్నారు. -
Buggana: ఆ నాలుగు గోడల మధ్య ఏం జరిగింది?
-
రేవంత్ తో కుమ్మక్కై.. సీమకు సమాధి.. చివరకు కథ అడ్డం తిరిగింది
-
పంచాయితీ కాదు.. పరిష్కారం కావాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. సరిహద్దు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో మేము ఎలాంటి వివాదాలను కోరుకోవడం లేదు. పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నాం. తద్వారా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాన్ని ఆశిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన తెలంగాణ ప్రాజెక్టులకు పొరుగు రాష్ట్రాలు అడ్డంకులు సృష్టించొద్దు. మీరు సృష్టించే సమస్యల వల్ల తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలే కాదు.. కేంద్రం నుంచి ఆర్థిక సహకారం కూడా అందకుండా పోతోంది. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపిద్దాం.ఇందుకోసం ఏపీ ఒక అడుగు ముందుకేస్తే... పది అడుగులు ముందుకు వేసే తత్వం మాది. పక్క రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు ఓ సూచన చేస్తున్నా. నీళ్ల వివాదాన్ని రాజకీయం చెయ్యొద్దు. రాజకీయాలకు అతీతంగా చర్చించి, సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపిద్దాం. ఇందుకోసం న్యాయ స్థానాలు, ఇతరుల సమక్షంలో కూర్చొనే కంటే మన సమస్యలను మనమే పరిష్కరించుకోవడం ఉత్తమం. మీకు పంచాయితీలు కావాల్నా? నీళ్లు కావాల్నా? నేనైతే జలాలు కావాలనే కోరుకుంటా. వివాదాలు కావాల్నా? పరిష్కారం కావాల్నా? అంటే పరిష్కారమే కోరుకుంటా..’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం నగర శివార్లలోని రావిర్యాల ఫ్యాబ్సిటీలో ‘సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్’తయారీ యూనిట్ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. పక్క రాష్ట్రంతో సయోధ్య అవసరం ‘కృష్ణా బేసిన్లో పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతలతో పాటు, డిండి, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరయ్యాయి. కానీ ఏపీ అభ్యంతరాల వల్ల వాటికి పర్యావరణ, సీడబ్య్లూసీ అనుమతులు, బ్యాంకులు, కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. ఇది రాష్ట్రానికి భారంగా పరిణమిస్తోంది. ఇక్కడ డేటా సెంటర్లు పెట్టాలంటే విద్యుత్తో పాటు నీరు కూడా కీలకం. కృష్ణానది నుంచి ఇక్కడికి నీటిని తరలించాలన్నా..యాదాద్రి నుంచి కరెంట్ తరలించాలన్నా.. పరస్పర సహకారం అవసరం. తెలంగాణకు పోర్టు రావాలన్నా..ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేయాలన్నా పక్క రాష్ట్రంతో సయోధ్య, సహకారం అవసరం. అలాగే అమరావతి అభివృద్ధి కావాలంటే హైదరాబాద్ సహకారం కూడా ఉండాలి..’అని సీఎం అన్నారు. ప్రపంచ దేశాలతోనే పోటీ ‘రాష్ట్రంలో పారిశ్రామిక, ఇంధన, పర్యాటక, ఎండోమెంట్, మెడికల్ పాలసీలను తీసుకొచ్చాం. త్వరలో ఎడ్యుకేషన్ పాలసీ కూడా తీసుకురానున్నాం. ఐటీ, ఫార్మా, డేటా సెంటర్ల రంగంలో రాష్ట్రం పోటీ పడుతోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి అనుగుణంగా పాలసీ డాక్యుమెంట్ను రూపొందించాం. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుర్గాంవ్తో తెలంగాణ పోటీ పడుతోందనే చర్చ పదేపదే జరుగుతోంది. దీనికి పుల్స్టాఫ్ పెట్టి జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతో పోటీ పడాలని ఆలోచన చేస్తున్నాం.యంగ్ ఎంటర్ప్రెన్యూర్లు ప్రారంభించే పరిశ్రమలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. సహాయ సహకారాలు అందజేసి ప్రోత్సహిస్తుంది. దేశ బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. నాలుగు కోవిడ్ వ్యాక్సిన్లలో మూడు ఇక్కడి నుంచే వచ్చాయి. సిలికాన్ వ్యాలిలోని ఐటీ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తున్న వారు హైదరాబాద్లోనే చదువుకున్నారు. సక్సెస్ స్టోరీలు సృష్టించాలి. ప్రభుత్వం ఇప్పటికే 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచి్చంది. మరో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరికి ప్రైవేటు రంగంలోనూ అవకాశం కల్పించాలి. ఐఎస్ఎస్ల కన్నా ప్రైవేటు రంగంలోనే ప్యాకేజీలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ప్రైవేటు రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలి..’అని ముఖ్యమంత్రి సూచించారు. ఉపాధి అవకాశాలకు పెద్దపీట:.శ్రీధర్రాబు మెడికేర్, ఫార్మా, లైఫ్సైన్స్కు సంబంధించిన ఎకో సిస్టమ్లో నాలుగు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ప్రధానంగా ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. పరిశ్రమలకు అనుగుణంగా పాలసీలు ఉండాలని భావించి, ఆ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. విదేశీ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఒడిఎన్ మాల్ను ప్రారంభించిన సీఎం సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ప్రపంచ స్థాయి షాపింగ్, డైనింగ్, వినోదాల సమ్మేళనంగా నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన అల్ట్రా ప్రీమియం ఒడిఎన్ మాల్ను సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, అజహరుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఎంపీ అనిల్కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఓడిఎన్ మాల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఇదేమన్నా మీ ఇంటి వ్యవహారం అనుకున్నారా.. ఏకిపారేసిన సాకే శైలజానాథ్
-
‘ఉపాధి’ని దెబ్బతీస్తే సహించం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసే కుట్రలను సహించబోమని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం గాందీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో 140 కోట్ల జనాభాలో 80 శాతం మంది ఉపాధి హామీ పథకంపై ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ పథకం పేదల ఆత్మ గౌరవాన్ని పెంచిందని, దీని రూపకల్పన, అమలుకు తెలుగు రాష్ట్రాలే వేదికయ్యాయని సీఎం గుర్తు చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోదీ ప్రభుత్వం తెచ్చినప్పుడు, వాటికి వ్యతిరేకంగా రాహుల్గాంధీ పోరాడారని చెప్పారు. చివరకు రైతులకు క్షమాపణ చెప్పి, కేంద్ర ప్రభుత్వం ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా చేయడంలో రాహుల్గాంధీ విజయవంతమయ్యారని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదని రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ అంశంపై మోదీతో దేశానికి క్షమాపణ చెప్పిస్తామన్నారు. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి మండలానికి ఒక ఇన్చార్జ్ను నియమిస్తామని, తాను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటానని సీఎం వెల్లడించారు. ఫిబ్రవరి 3 నుంచి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని, ములుగు సభకు సోనియాగాందీ, రాహుల్గాంధీ, ప్రియాంక గాందీని ఆహా్వనిస్తామని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున రాష్ట్ర ఎంపీలు నిరసన తెలపాలని సూచించారు. ఎస్ఐఆర్ వెనుక పెద్ద కుట్ర కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓట్లు తొలగించే ఎస్ఐఆర్ (సర్) వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఇల్లు లేని , ఆస్తి లేని పేదలకు ఉన్న గుర్తింపు కార్డే ఓటు అని, పేదల గుర్తింపును తొలగించేందుకు ఓట్లను తీసేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ తీసుకొచ్చిందని విమర్శించారు. ఎప్పుడైతే ఓటు హక్కు తొలగిస్తారో, అతని ఆధార్ కార్డు, రేషన్కార్డు కూడా పోతుందని, ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి దేశంలో ఉండాలో, లేదో అని నిర్ణయించే శక్తి కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుందని ధ్వజమెత్తారు. సర్ పేరుతో ఓట్లను తొలగించి కోట్లాది మంది పేదలను ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి, వారిని తిరిగి వెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. మునిసిపోల్స్లో అంతటా కాంగ్రెస్ జెండా ఎగరాలి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలని సీఎం రేవంత్ చెప్పారు. గల్లీ గల్లీ కాదు, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తాను ముఖ్యమంత్రి అయ్యానని, తెలంగాణ ఎప్పుడూ కాంగ్రెస్కు అండగా నిలిచిందని పేర్కొన్నారు. దేశం ఇబ్బందుల్లో ఉందని, ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. 20 నుంచి గ్రామగ్రామాన సభలు :మహేశ్గౌడ్ వీబీజీ –రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా ఏఐసీసీ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ఈ నెల 20 నుంచి 30వ తేదీల మధ్య అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, వీబీజీ–రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గానికి 5 వేల చొప్పున కరపత్రాలు ముద్రించి, అవి గ్రామగ్రామాన, వాడవాడకు చేరేలా పంపిణీ చేయాలని చెప్పారు. వీబీజీ –రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా ప్రతి డీసీసీ తప్పనిసరిగా గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. బీజేపీ కుట్రలను గ్రామగ్రామానా ఎండగడతాం : భట్టి విక్రమార్క బీజేపీ పాలన సామ్రాజ్యవాదుల కంటే ప్రమాదకరంగా మారిందని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవస్థాగతంగా కుట్ర చేస్తోందని ఆరోపించారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో గాం«దీజీ నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు జరిగినా బ్రిటిష్ పాలకులు ఆయనపై లాఠీ కూడా ఎత్తలేదని, కానీ స్వాతంత్య్రం వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులు గాంధీజీని హత్య చేశారని గుర్తు చేశారు. అందుకే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలమే ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు. ఉపాధి హామీ చట్టం రాకముందు రోజుకు రూ.40 ఉన్న కూలీ ఒక్కసారిగా రూ.100కి పెరిగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ తెచ్చిన చట్టాలన్నింటినీ రద్దు చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. – దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు గౌరవప్రదమైన ఉపాధి లభించిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పారు. సోనియాగాంధీ ఎంతో శ్రమించి పేదలకు పని హక్కు కల్పించే చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్,, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అజాహరుద్దీన్, ఏఐసీసీ నేతలు విశ్వనాథన్, ప్రవీణ్ చక్రవర్తి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లలో తరగతులు
సాక్షి, హైదరాబాద్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం పనులను ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని, రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గురువారం విద్యారంగంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యకు సంబంధించిన పలు అంశాలపై సీఎం దృష్టి పెట్టారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు, నిర్మాణ డిజైన్లను కన్సల్టెన్సీ సంస్థలు ఆయనకు వివరించాయి. కాగా రెండేళ్ళలో అన్ని స్కూళ్ళ నిర్మాణం పూర్తి చేసి, తరగతులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. బాలికలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ జిల్లాల వారీగా బాలురు, బాలికల వివరాలు తెప్పించాలని ఆదేశించారు. ఈ స్కూళ్లకు అవసరమైన బడ్జెట్ విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నాణ్యతలో రాజీ పడొద్దు.. ‘అక్షయ పాత్ర భాగస్వామ్యంతో జూన్ నుంచి పాఠశాల విద్యార్థులకు అందించే అల్పాహారంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఈ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అందించే భోజనం నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలి. వంటకు సోలార్ పవర్ను వాడుకునే అంశాన్ని పరిశీలించాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 23 కొత్త పాఠశాల భవనాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలి. బాచుపల్లి పాఠశాల భవన నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న స్థలానికి సమీపంలో ఎకరంన్నర కేటాయించాలి..’అని సీఎం ఆదేశించారు. ఖర్చుతో కూడిన ప్రతిపాదనలు తేవద్దు ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక వసతుల కల్పన, భవనాల మరమ్మతులతో పాటు పలు అంశాలను పాఠశాల విద్యా కమిషనర్ ప్రస్తావించారు. అయితే ఖర్చుతో కూడిన ప్రతిపాదనలు ప్రస్తుతానికి వద్దని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. ఎంఈవో పోస్టుల భర్తీని కూడా సీఎం వ్యతిరేకించినట్టు తెలిసింది. రాష్ట్రంలో విద్యార్థుల నిష్పత్తి కన్నా టీచర్లు ఎక్కువగా ఉన్నారని, హేతుబదీ్ధకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ: సీఎం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురానున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. దీనిపై అధ్యయనం కోసం ఓ కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలోనే పాలసీని ప్రకటిస్తామని చెప్పారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రోహిత్కుమార్ నేతృత్వంలోని ఆ రాష్ట్ర బృందం గురువారం సచివాలయంలో సీఎంను మర్యాపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం కల్పించాలని యోచిస్తున్నామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాగా దీనిపై సమగ్ర నివేదికను అందించాలని హిమాచల్ప్రదేశ్ మంత్రి సీఎంను కోరారు. నేడు రావిర్యాలలో సీఎం పర్యటన తుక్కుగూడ: సీఎం రేవంత్ గురువారం రావిర్యాలలో పర్యటించనున్నారు. మంఖాల్ డివిజన్ పరిధిలోని ఫ్యాబ్సిటీలో మనీషా గ్రూప్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించిన సుజిన్ మెడికే ర్ ప్రైవేటు లిమిటెడ్ ఐవీ ద్రవం తయారీ కంపెనీని ఉదయం 10 గంటలకు సీఎం ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో ఇంటర్ బోర్డు ఉండదు! పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా ఉన్నతీకరించాలన్న ప్రతిపాదనపై సీఎం అనేక ప్రశ్నలు సంధించారు. ఇదెలా సాధ్యమని, అనుబంధ గుర్తింపు ఎలా వస్తుందని, ఏఐసీటీఈ అనుమతి ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం ప్రతిపాదనను కూడా తోసిపుచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అందుబాటులోకి వస్తే 12వ తరగతి వరకూ అక్కడే ఉంటుందని, భవిష్యత్తులో ఇంటర్ బోర్డు ఉండదని సీఎం అన్నట్టు తెలిసింది. సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, పి.సుదర్శన్రెడ్డి, సీఎంఓ, విద్యాశాఖ ఉన్నతాధికారులు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
రాయలసీమ ఆశాదీపం
రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా సాగు, తాగునీటి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక ఆశాదీపం అయ్యింది. అయితే ఇటీవల తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సంప్రదింపులు జరిపి ఈ పథకాన్ని నిలిపివేయించానని ప్రకటించడం, సీమ ప్రాజెక్టులను అక్రమమైనవిగా అభివర్ణించడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో, రాయలసీమ నీటి హక్కుల వెనుక ఉన్న భౌగోళిక, సాంకేతిక వాస్తవాలను నిశితంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.కేటాయింపులుండీ వాడుకోలేక...రాయలసీమ దాహార్తిని తీర్చే క్రమంలో గాలేరు–నగరి, హంద్రీ –నీవా, హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, ఎస్సార్బీసీ, గుండ్రేవుల, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి నిర్మాణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి దాదాపు 144.7 టీఎంసీల నికర జలాల కేటాయింపులు చట్టబద్ధంగా ఉన్నాయి. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దయ నీయంగా ఉంది. ప్రస్తుతం సీమలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల సామర్థ్యం 100 టీఎంసీల కంటే తక్కువగానే ఉంది. సరైన కాల్వల వ్యవస్థ లేకపోవడం వల్ల ఏటా కేవలం 50 నుంచి 60 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు. అంటే, తమకు దక్కాల్సిన వాటాలో సగం కూడా వాడుకోలేక పోతున్న ఈ ప్రాంతంపై ‘జల దోపిడీ’ చేస్తున్నారనే నిందలు వేయడం అత్యంత విచారకరం.రాయలసీమ ప్రాజెక్టులకు జీవనాధారమైన పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి వంటి మలుపులకు శ్రీశైలం రిజర్వాయర్ ప్రధాన వనరు. గతంలో శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలుగా ఉండేది. కానీ తీవ్రమైన పూడిక పేరుకుపోవడం వల్ల అది ప్రస్తుతం 200 టీఎంసీల లోపుకు పడిపోయింది. దీనికి అదనంగా, తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని ఖాళీ చేయడం వల్ల జలాశయం మట్టం వేగంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు నెలల తరబడి వచ్చే కృష్ణా, తుంగభద్రల ప్రవాహాలు ఇప్పుడు కేవలం కొన్ని వారాలకే పరిమితమవు తున్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని మళ్లించాలంటే శ్రీశైలంలో కనీసం 854 అడుగుల మట్టం ఉండాలి. పూడిక, విద్యుత్ అవసరాల కారణంగా ఈ మట్టం నిర్వహించడం అసాధ్యంగా మారుతోంది, ఫలితంగా వరద జలాల మీద ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ– నీవా వంటి ప్రాజెక్టులకు గండం ఏర్పడుతోంది.పథకం ఆవశ్యకతవరద సమయంలో కృష్ణా నది నుంచి సుమారు 700–800 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి వృథాగా వెళ్తోంది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడానికి ఉన్న పరిమితులను అధిగమించేందుకు, కేవలం వారం పది రోజులు మాత్రమే లభించే వరద సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించడం సాధ్యమవుతుంది.ముచ్చుమర్రి వంటి ఎత్తిపోతల కేంద్రాలకు అనేక సాంకేతిక పరిమితులు ఉన్నాయి. ముచ్చుమర్రి నుంచి నాలుగు రోజులు నిరంతరాయంగా నీటిని తోడితే కానీ ఒక టీఎంసీ నీరు రాదు. 40 టీఎంసీల లక్ష్యంతో నిర్మించిన హంద్రీ–నీవాకు ఇది ఏమాత్రం సరిపోదు. అలాగే మల్యాల నుంచి నీటిని తీసుకోవాలంటే కనీసం 842 అడుగుల మట్టం అవసరం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగానే 800 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునేలా ‘రాయలసీమ ఎత్తిపోతల పథకా’న్ని రూపొందించారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 800 అడుగుల కంటే తక్కువ మట్టం నుంచి నీటిని లిఫ్ట్ చేసే పథకాలను నిర్మించుకుంది. అటువంటప్పుడు, ఆంధ్రప్రదేశ్ తన చట్టబద్ధమైన వాటాను వినియోగించు కోవడానికి 800 అడుగుల వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసు కోవడం ఏమాత్రం అక్రమం కాదు. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉండి, నీరు సముద్రంలో కలిసే సమయంలో ఆ నీటిని తీసుకోవడం వల్ల ఎవరికీ నష్టం ఉండదు. అది ఏపీ ప్రాథమిక హక్కు కూడా!శాశ్వత పరిష్కారంరాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే అది గాలేరు నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులకు వెన్నెముకగా మారుతుంది. పోతి రెడ్డిపాడు ద్వారా ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకు 15 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో గండికోట, చిత్రావతి రిజర్వాయర్ల ముంపు సమస్యలను పరిష్కరించి, అక్కడ 35 టీఎంసీల నీటిని నిల్వ చేసే వెసులుబాటు కల్పించారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని అనంతపురం జిల్లాలోని హంద్రీ–నీవాతో అనుసంధానం చేస్తే, చిత్తూరు జిల్లాలోని మదన పల్లి డివిజన్ నుంచి కుప్పం వరకు గాలేరు–నగరి నీటిని సరఫరా చేసే అద్భుత అవకాశం కలుగుతుంది. ఇది రాయలసీమ కరవు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారంగా మారుతుంది.ఈ పథకానికి అనుమతులు సాధించడం అసాధ్యమైన పని కాదు. సీడబ్ల్యూసీ నియమించిన కమిటీలు ఒక కీలకమైన సిఫార్సు చేశాయి: డ్యామ్ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు లేదా పూడిక వల్ల నిల్వ సామర్థ్యం తగ్గినప్పుడు, ఆ లోటును భర్తీ చేయడానికి ఎగువన నీటి నిల్వ ఏర్పాట్లు చేసుకోవచ్చు. శ్రీశైలం సామర్థ్యం 315 టీఎంసీల నుంచి 200 టీఎంసీలకు తగ్గిపోయిన వాస్తవాన్ని ప్రభుత్వం సమర్థంగా వాదించాలి. శ్రీశైలం భద్రతను, తగ్గిపోయిన నిల్వ సామర్థ్యాన్ని సాధికారిక సంస్థల ముందు నిరూపించగలిగితే, రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు సిద్ధేశ్వరం అలుగు వంటి ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం సులభమవుతుంది.తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజ నాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ పెద్దలు అప్రమత్తంగా వ్యవహరించాలి. గత ప్రభుత్వం అనుమతులు లేకుండా పనులు చేసిందనే నెపంతో ప్రాజెక్టు అవసరాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ వాదనకు ఆయుధంగా మారుతుంది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, ఈ పథకానికి మిగిలి ఉన్న అనుమతులను తీసుకురావడానికి, పెండింగ్లో ఉన్న కొద్దిపాటి పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి.శ్రీశైలం ఎగువ భాగం నుంచి నీటిని తీసుకోవడం సీమ ప్రజల ప్రాథమిక హక్కు అని జాతీయ వేదికలపై గట్టిగా వినిపించాలి. ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ కేవలం ఒక ఇంజినీరింగ్ నిర్మాణం కాదు, అది సీమ రైతాంగం ఆత్మగౌరవ ప్రతీక. ఈ పథకం కార్యరూపం దాల్చితేనే వెనుకబడిన ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డివ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలి: సీఎంకు విజ్ఞప్తి
సాక్షి: హైదరాబాద్: రాష్ట్రంలో అనుభవం గల గ్రూప్ -1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గ్రూప్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ సీఎంను కలిశారు. స్థానిక సంస్థల్లో అనుభవం గల పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖల గ్రూప్ -1 అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ను కోరారు.అలాగే పాలనా అనుభవం గల సీనియర్ గ్రూప్ 1 అధికారులను కార్పొరేషన్ ఎండీలుగా, డైరెక్టర్లుగా నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 2015లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై ఆరుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు అయిందని.. ఆ కమిటీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదని తెలిపారు. స్టేట్ సివిల్ సర్వీస్ పరిధిలో అన్ని గ్రూప్ -1 పోస్టులను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అతి త్వరలో గ్రూప్-1 అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో శశికిరణా చారి,అరవింద్ రెడ్డి,నూతనకంటి వెంకట్, పద్మావతి,భరత్ రెడ్డి, ప్రశాంతి, మాధవ్, ఫణి గోపాల్, వినోద్, సోమ శేఖర్ ఉన్నారు. -
వికసిత్ భారత్ కాదు.. సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: అధికారం ఉంది కదా అని మోదీ సర్కార్ ఇష్టానుసారం వ్యవహరిస్తోందని.. పేదలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం మార్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా.. గురువారం గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. .. బ్రిటీష్ పాలన తరహాలో మోదీ పాలన ఉంది. ఎన్డీయే కూటమికి అనుకున్నంత మెజారిటీ రాకపోవడంతో రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు. అందుకే వేరే రూపంలో హక్కులను కాలరాస్తున్నారు. ఓటు హక్కు తీసేసే కుట్రలో భాగంగా ఎస్ఐఆర్ తీసుకొచ్చారు. కోట్లాది మంది పేదలను దేశ పౌరులే కాదని చూపించేందుకు కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతోంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతోందిఉపాధి హామీ పథకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. భూమిలేని పేదలకు ఆహార భద్రత కల్పించేందుకే కాంగ్రెస్ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం వల్ల గ్రామాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. వలసలు ఆగిపోయాయి.. వెట్టిచాకిరీ ఆగింది. దేశంలో 80 శాతం ప్రజలు ఈ పథకం ఆధారపడి బతుకుతున్నారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పథకాన్ని మార్చి పేదలకు అన్యాయం చేస్తున్నారు. పేదలపై కక్ష పూరితంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అదానీ, అంబానీలకు తక్కువ ధరకు కూలీలు దొరకడం లేదని పథకాన్ని మారుస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల కోసమే ఇలా చేస్తున్నారు. గతంలో వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. ఆ నల్ల చట్టాలను ఉపసంహరించుకునేలా చేయడమే కాకుండా మోదీతో జాతికి క్షమాపణ చెప్పించింది కాంగ్రెస్. ఇప్పుడు అదే పని చేయబోతున్నాం. మోదీ క్షమాపణలు చెప్పేంత వరకు వదిలేది లేదు. ఉపాధి హామీ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం. ఈ నెల 20 నుంచి గ్రామ సభలు నిర్వహిద్దాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నేను కూడా ఓ మండలం బాధ్యత తీసుకుంటా. అన్ని మండలాలకు ఒక్కొకకకరు బాధ్యత తీసుకోవాలి. ఫిబ్రవరి 3 నుంచి అన్ని జిల్లాల్లో రోజుకు లక్ష మందితో సభ పెడదాం. హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో సభలు పెడతాం. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేంత వరకు మోదీ సర్కార్పై యుద్ధం ఆగదు.. బీఆర్ఎస్ను వరుసగా అన్ని ఎన్నికల్లో ఓడించాం. మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలిచి తీరతాం. బీఆర్ఎస్, బీజేపీలకు రాజకీయాలే తప్ప ప్రజాసమస్యలు పట్టడం లేదు. వికసిత్ భారత్ కాదు.. సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నారు అని రేవంత్ అన్నారు. -
బాబు, రేవంత్ చీకటి ఒప్పందం నిజాలు బయటపెట్టిన జగన్
-
రేవంత్ చెప్పింది నిజమే.. నిజం ఒప్పుకున్న బాబు?
-
సీమ ఎత్తిపోతలపై శాపనార్థాలు!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రానికి జీవనాడి పోలవరం సాక్షిగా... రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం చంద్రబాబు తన కడుపు మంట, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.3,528 కోట్లు మంజూరు చేసి సరైన అనుమతులు లేకుండా ప్రారంభించారని విమర్శించారు. అనుమతులు లేని ప్రాజెక్టును మొదలుపెట్టి విచ్చలవిడిగా, అడ్డగోలుగా పనులు చేశారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల దిగువన కేవలం 34 టీఎంసీలే నిల్వ ఉంటాయని.. అందులో రాష్ట్ర వాటా 22 టీఎంసీలని.. ఆ నీటిని వాడుకోవడానికి మల్యాల, ముచ్చుమర్రి (హంద్రీ–నీవా) ఎత్తిపోతల ఉందంటూ దబాయించారు. ఆ నీటిలో రోజుకు 3 టీఎంసీలను మళ్లించేలా, పర్యావరణ అనుమతి తీసుకోకుండానే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని.. దానిపై ఎవరో ఎన్జీటీలో కేసు వేస్తే పనులు ఆపేయాలని తీర్పు ఇచ్చిందని.. దాంతో పనులు ఆగిపోయాయంటూ తనకు అలవాటైన రీతిలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. పోలవరం పనులను బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఫిబ్రవరి నాటికి డయాఫ్రమ్వాల్ పూర్తవుతుందని, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2 పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయని, హంద్రీ–నీవా ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చామని, కుప్పం వరకు నీళ్లు పారించామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాగా సీఎం చంద్రబాబునాయుడుతో ఏకాంతంగా (క్లోజ్ రూమ్లో) సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేయించా..! ఆ పనులు ఆగిపోయాయో లేదో అన్నది తెలుసుకోవాలంటే తనిఖీ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలను ఇంతవరకూ చంద్రబాబు ఖండించకపోవడం గమనార్హం. ఆ సమావేశంలో ఏం ఒప్పందం కుదిరిందన్నది వెల్లడించలేదు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పింది నిజమేనని చంద్రబాబు అంగీకరించారన్నది స్పష్టమవుతోంది. దీన్ని బట్టి.. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే ఈర‡్ష్యతో.. పనిగట్టుకుని ఆ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేయించారని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. రాయలసీమ, నెల్లూరు వరదాయిని..⇒ శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా కనీస నీటి మట్టం 854 అడుగులు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టుకు సాగునీరు, చెన్నైకి తాగునీటిని శ్రీశైలం జలాశయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే నీటిని విడుదల చేయాలి. ⇒ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటి మట్టం వద్ద అమర్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. అదే 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఇక శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. ⇒ విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు సర్కార్.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఏపీ ప్రభుత్వం.. నాగార్జునసాగర్ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని నాడు కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందంటూ అప్పట్లో తెలంగాణ తన అధీనంలోకి తీసుకున్నప్పటికీ చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు. ఇంతలో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్కు సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ⇒ ఇదే అదునుగా తెలంగాణ సర్కార్ కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచుతున్నా.. అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టినా నాడు బాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ నుంచి 0.5 టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి–డిండి ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 6.95 టీఎంసీలు తరలించే సామర్థ్యాన్ని తెలంగాణ సాధించుకుంది. శ్రీశైలం నుంచి 800 అడుగుల స్థాయిలో హంద్రీ –నీవా ద్వారా కేవలం 0.33 టీఎంసీలు తరలించే సామర్థ్యం మాత్రమే ఏపీకి ఉంది. ⇒ శ్రీశైలం దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే నీటిని విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయాలన్నది నిబంధన. కానీ.. 2014 నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రారంభం కాకున్నా సరే.. డెడ్ స్టోరేజీలో ఉన్న నీటిని శ్రీశైలం దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేనప్పటికీ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ రాయలసీమ రైతుల హక్కులను హరిస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఇక శ్రీశైలంలోకి వరద ప్రవాహం ప్రారంభమయ్యాక కూడా తెలంగాణ సర్కార్ వచ్చింది వచ్చినట్టుగా నీళ్లను తరలించడం వల్ల నీటి మట్టం 881 అడుగులకు చేరడం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లందక.. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టులో 2014–19 మధ్య ఏటా పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా బేసిన్లో 2015–16లో వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలానికి 58.69 టీఎంసీల ప్రవాహమే రాగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు కేవలం 0.95 టీఎంసీని మాత్రమే సరఫరా చేశారు. ఆ ఏడాది గుక్కెడు తాగునీటి కోసం కటకటలాడటమే అందుకు నిదర్శనం. ⇒ ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తడారిన గొంతులను తడిపేందుకు.. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకుని ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం.. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్లతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ ఎత్తిపోతల రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు వరదాయిని అవుతుందని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ⇒ చంద్రబాబు చెబుతున్నట్లుగా శ్రీశైలంలో 841 అడుగుల దిగువన నిల్వ ఉండే 34 టీఎంసీలను తరలించడానికి కాదు.. 841 అడుగుల ఎగువ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువకు 3 టీఎంసీలను ఎత్తిపోసి.. మనకు హక్కుగా దక్కిన వాటా జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి చేపట్టిందే రాయలసీమ ఎత్తిపోతల.పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు అడుగడుగునా మోకాలడ్డు..రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర‡్ష్యతో.. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్ ద్వారా ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయించారని.. అదే వ్యక్తితో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాల రూపురేఖలను మార్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పనులపైనా ఎన్జీటీలో ఫిర్యాదు చేయించారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ మూడు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఎన్జీటీలో పిటిషనర్ వాదించారు. అయితే తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీలకు పర్యావరణ అనుమతి ఉందని.. ఆ ప్రాజెక్టులకు నీటిని అందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదని వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు ఎన్జీటీకి స్పష్టం చేసింది. కానీ.. పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే.. రాయలసీమ, నెల్లూరు, చెన్నై తాగునీటి అవసరాల కోసం సీమ ఎత్తిపోతల పనులను కొనసాగించింది. ఈ క్రమంలో రూ.990 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలను తొలి దశలో తాగునీటి అవసరాల కోసం చేపడుతున్నామని.. మలి దశలో పర్యావరణ అనుమతి తీసుకుంటామని చంద్రబాబు సర్కారు స్పష్టం చేసి ఉంటే ఆ ఎత్తిపోతల పనులకు ఎలాంటి అడ్డంకి ఉండేది కాదని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే ఈర‡్ష్యతోనే ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కార్ చెప్పలేదని స్పష్టం చేస్తున్నారు.ఒక్క ప్రాజెక్టూ కట్టకుండా బడాయి మాటలు..ఉమ్మడి రాష్ట్రంలో 1995–99, 1999–2004.. విభజన తర్వాత 2014–19, మళ్లీ ఇప్పుడు.. మొత్తం నాలుగు సార్లు సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నారు. దాదాపు 16 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు డిజైన్ చేయలేదు.. నిర్మాణాన్ని చేపట్టలేదు.. పూర్తి చేసి జాతికి అంకితం చేయలేదు అంటూ జలవనరుల శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన రిటైర్డు ఇంజనీర్–ఇన్–చీఫ్లు, చీఫ్ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ.. రాష్ట్రంలో 90 శాతం ప్రాజెక్టులు తానే కట్టానంటూ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ బడాయి మాటలు మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో జలయజ్ఞం కింద ఒకేసారి రూ.లక్ష కోట్ల వ్యయంతో పోలవరం, పులిచింతల, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తోటపల్లి, పుష్కర, తాడిపూడి, వంశధార స్టేజ్–2 ఫేజ్–2 వంటి భారీ, సూరంపాలెం, భూపతిపాలెం వంటి మధ్య తరహా 83 ప్రాజెక్టులు చేపట్టి.. తాను మరణించే నాటికే 44 ప్రాజెక్టులను పూర్తి చేసి, జాతికి అంకితం ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారని ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. జలయజ్ఞంలో భాగంగా దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడం కోసం 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు.. దాన్ని నిరసిస్తూ, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమాహేశ్వరరావుతో తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డితో చంద్రబాబు ధర్నాలు చేయించారని గుర్తు చేస్తున్నారు. ఇక తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ నిర్మాణంలో లోపాల వల్ల మట్టికట్టలో లీకేజీలు ఏర్పడటంతో 2020 వరకూ ఎన్నడూ నాలుగైదు టీఎంసీలకు మించి నిల్వ చేసిన దాఖాలు లేవు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రూ.90 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మించి, మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేసి 2020 నుంచి బ్రహ్మంసాగర్లో పూర్తి సామర్థ్యం మేరకు 17.74 టీఎంసీలను నిల్వ చేస్తే.. ఆ పని తాను చేసినట్లుగా సీఎం చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటూ ఆ పనులను పర్యవేక్షించిన రిటైర్డు అధికారి ఒకరు విస్తుపోయారు. మహానేత వైఎస్ నిర్మించిన గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు వైఎస్ జగన్ 2019లో రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించి.. ఆ రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను ప్రతి ఏటా నిల్వ చేస్తే.. ఆ పని తాను చేసినట్లుగా సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడటం గమనార్హం. ఇక మహానేత వైఎస్సార్ పూర్తి చేసిన పుష్కర, తాడిపూడి, చాగల్నాడు, కల్వకుర్తి, నెట్టెంపాడు, దేవాదుల లాంటి ఎత్తిపోతల పథకాలను తాను పూర్తి చేసినట్లుగా సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయకుండా.. కమీషన్ల కోసం గోదావరి కుడి గట్టుపై పట్టిసీమ, ఎడమ గట్టుపై పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టింది. ఆ రెండు ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. ఇక చింతలపూడి ఎత్తిపోతల తొలిదశకు 2008లో నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకుంది. కానీ.. 2018లో ఆ ఎత్తిపోతల సామర్థ్యాన్ని చంద్రబాబు సర్కార్ పెంచింది. అయితే దానికి పర్యావరణ అనుమతి తీసుకోలేదు. ఈ మూడు ఎత్తిపోతల పథకాలపై ఎన్జీటీలో కేసులు దాఖలయ్యాయి. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఆ మూడు ఎత్తిపోతల పథకాలపై జరిమానా విధిస్తూ 2021 డిసెంబర్ 2న ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై రూ.24.56 కోట్లు, పట్టిసీమ ఎత్తిపోతలపై రూ.24.9 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతలపై రూ.73.6 కోట్లను జరిమానాగా విధించింది.జగన్ హయాంలోనే సీమ సుభిక్షం..⇒ నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పులిచింతల నిర్వాసితులకు పరిహారం చెల్లించింది. తెలంగాణకు పరిహారం చెల్లించి పూర్తి స్థాయిలో అంటే 45.77 టీఎంసీలను పులిచింతలలో నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండు పంటలకు నీళ్లందించి చరిత్ర సృష్టించింది. ⇒ తెలుగుగంగ లింక్ కెనాల్ను ఆధునికీకరించి.. వెలుగోడు రిజర్వాయర్ను సకాలంలో గరిష్ట సామర్థ్యం 16.95 టీఎంసీలను చేర్చి నింపింది. రూ.600 కోట్లతో తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి.. డిజైన్ మేరకు ప్రవాహ సామర్థ్యాన్ని 5 వేల క్యూసెక్కులకు పెంచింది. ⇒ బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లతో డయాఫ్రం వాల్ను వేసి లీకేజీలకు అడ్డుకట్ట వేసి దాని పూర్తి సామర్థ్యం మేరకు 17.74 టీఎంసీలను నిల్వ చేసింది. ⇒ తెలుగుగంగలో అంతర్భాగమైన సోమశిల రిజర్వాయర్లో గరిష్ట సామర్థ్యం మేరకు 78 టీఎంసీలు, కండలేరు రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం మేరకు 68.3 టీఎంసీలను నింపి ఐదేళ్లూ ఆయకట్టులో రెండు పంటలకూ నీళ్లందించింది. ⇒ గాలేరు–నగరి వరద కాలువలో అవుకు వద్ద రెండు సొరంగాలను పూర్తి చేసి..గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లను పరిహారంగా చెల్లించి, వారికి పునరావాసం కూడా కల్పించి గరిష్ట సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను నిల్వ చేసింది. ⇒ చిత్రావతి రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లను పరిహారంగా చెల్లించి, పునరావాసం కల్పించి.. గరిష్ట సామర్థ్యం మేరకు పది టీఎంసీలు నిల్వ చేసింది. ⇒ ఇలా ఐదేళ్లూ రిజర్వాయర్లను సకాలంలో నింపి.. రాయలసీమను సస్యశ్యామలం చేసింది.కొత్తగా అనేక పనులు చేపట్టిన జగన్ సర్కార్...మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు కురిసే రోజులు తగ్గాయి. శ్రీశైలానికి గరిష్టంగా వరద వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకునే సామర్థ్యం కాలువలకు లేదు. దీంతో కృష్ణా వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి శ్రీశైలానికి వరద వచ్చే 30–40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపేలా వైఎస్సార్సీపీ హయాంలో కాలువల సామర్థ్యం పెంచే పనులు, అవసరమైన చోట్ల కొత్త ప్రాజెక్టుల పనులను చేపట్టింది. ⇒ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు.. శ్రీశైలం కుడి గట్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని, గాలేరు–నగరి వరద కాలువ, తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులను చేపట్టింది. ⇒ కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజోలి, జోలదరాసి రిజర్వాయర్ల పనులను చేపట్టింది. ⇒ తెలుగుగంగ ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందించడానికి కుందూ ఎత్తిపోతల పనులను చేపట్టింది. ⇒ గాలేరు–నగరి సుజల స్రవంతి–హంద్రీ–నీవా సుజల స్రవంతిలను అనుసంధానం చేస్తూ ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు పనులు చేపట్టింది. ⇒ హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టింది. ⇒ కానీ.. చంద్రబాబు సర్కార్ ఆ పనులన్నింటినీ ఆపేసి రాయలసీమకు వెన్నుపోటు పొడిచింది. -
సీఎం రేవంత్రెడ్డి సోదరుడికి సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో బాధితులతో పాటు రాజకీయ నాయకులు, వారి సంబం«దీకుల నుంచీ వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డికి కూడా బుధవారం నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11కి సిట్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరింది. మరోపక్క బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్లతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, ఎమ్మెల్సీ నవీన్రావు తండ్రి కొండల్రావు తదితరులనూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ 16న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆ రోజు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో సిట్ వేగం పెంచింది. ప్రత్యేకంగా ఆర్ఆర్ మాడ్యూల్ ప్రభాకర్రావు 2023 ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, సంబంధీకులు, అనుచరులపై నిఘా ఉంచారని, దీనికోసం ప్రత్యేకంగా ‘ఆర్ఆర్ మాడ్యూల్’పేరుతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అప్పట్లో ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్కు (ఎస్వోటీ) నేతృత్వం వహించిన డీఎస్పీ డి.ప్రణీత్రావు దీన్నీ పర్యవేక్షించారు. ప్రభాకర్రావు హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా అనేక మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని, వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు, బిల్డర్లు, రియల్టర్లు కూడా ఉన్నారని సిట్ చెబుతోంది. ఈ క్రమంలోనే వారికి వచ్చే ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్ తదితరాలను పర్యవేక్షించడానికి కొందరు ఎస్ఐబీ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఇందులో భాగంగానే రేవంత్రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్రెడ్డి సహా మరికొందరు నంబర్లు కలిపి ఏర్పాటు చేసిన మాడ్యూల్కు ప్రభాకర్రావు ‘ఆర్ఆర్ మాడ్యుల్’అనే పేరు పెట్టినట్లు తెలుస్తోది. ఈ విధంగా ఏర్పాటు చేసిన మాడ్యూళ్లలో ఉన్న వారి ఫోన్లను సర్వకాల సర్వావస్థల్లోనూ పర్యవేక్షిస్తూ ఉండటానికి డీఎస్పీ ప్రణీత్రావు నేతృత్వంలో 20 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కొందరు అత్యాధునిక ఉపకరణాలతో రేవంత్రెడ్డి, కొండల్రెడ్డి ఇళ్ల సమీపంలో తాత్కాలిక వార్రూమ్స్ ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కొండల్రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. -
తెలంగాణ సీఎం రేవంత్ కామెంట్స్ పై నోరువిప్పని సీఎం చంద్రబాబు
-
రెచ్చిపోయిన రేవంత్...దిక్కు తోచని స్థితిలో ఈనాడు.. ABN
-
‘చంద్రబాబు, రేవంత్ కలిసి రాయలసీమ గొంతు కోశారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై కడప డీఆర్సీ సమావేశంలో వైఎస్సార్సీపీ గళమెత్తింది. ఇంచార్జ్ మంత్రి సబితా అధ్యక్షతన జరిగిన డీఆర్సీ సమావేశంలో ఇరిగేషన్పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఆ అంశంపై చర్చను కూటమి నేతలు పక్కదోవ పట్టించారు. అవినాష్రెడ్డి మాట్లాడుతూ.. డీఆర్సీ సమావేశంలో అంతా ఆత్మ స్తుతి తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదని మండిపడ్డారు.‘‘రాయలసీమ ఎత్తిపోతలపై చర్చిస్తే పక్కదోవ పట్టిస్తున్నారు. రేవంత్రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ కలిసే రాయలసీమ గొంతు కోశారు. ఓ వైపు ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ సాగు, విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతోంది. వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు రూ. 950 కోట్లు ఖర్చు చేశారు. వరద సమయంలో రోజుకు 3 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా తీసుకోవచ్చు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే ఈ ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులు రిజెక్ట్ చేశారు..పొత్తులో ఉన్న బాబు ఆ అనుమతులు తీసుకురావడానికి కనీసం ప్రయత్నం చేయలేదు. పైగా దాన్ని రేవంత్, చంద్రబాబు కలిసి కుట్ర చేసి పక్కన పెట్టారు. సీమకు హక్కుగా రావాల్సిన 111 టీఎంసీల నీరు రావడం లేదు. అయినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. పైగా ఈ ప్రాజెక్ట్ నిరర్థకమని ఇరిగేషన్ మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 800 అడుగుల్లో మనమూ నీళ్ళు తీసుకునే అవకాశం ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్లే వస్తుంది. చంద్రబాబు వెంటనే పర్యావరణ అనుమతులు తీసుకురావాలి. రాయలసీమ ఎత్తిపోతల పనులు ముందుకు కొనసాగించాలి. ఈ ప్రాజెక్ట్ చేపట్టే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది. రాయలసీమ రైతులపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగించాలి’’ అని అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. -
శిష్యుడి మాటకు గురువు తలూపుతున్నారా?
ఎల్లో మీడియాకు పెద్ద చిక్కే వచ్చింది. ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకోపక్కేమో తమకు అత్యంత ప్రియుడైన తెలుగుదేశాధిపతి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబును చిక్కులే పడేసేలా వ్యాఖ్యానిస్తే.. సమర్థించుకోలేక, విమర్శించనూ లేక అల్లల్లాడిపోతోంది ఈ పచ్చమీడియా! తన విజ్ఞప్తితోనే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని రేవంత్ చెప్పడం.. ఏపీలో తెలుగుదేశంతోపాటు, ఎల్లో మీడియాకు కూడా దిక్కుతోచటం లేదు.రేవంత్ రెడ్డిని విమర్శించే ధైర్యం తెలుగుదేశం పార్టీ ఎటూ చేయదు. వంతపాడే జనసేన, బీజేపీలు కూడా కామ్గానే ఉన్నాయి. రహస్య విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చి మూడు రోజులు అవుతున్నా చంద్రబాబు కూడా రేవంత్ వ్యాఖ్యలను నేరుగా ఖండించలేకపోయారు. నష్టం కొంత తగ్గిద్దామనుకున్నాయేమో.. ఎల్లో పత్రికలు రేవంత్ వ్యాఖ్యలను కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేశాయి. చంద్రబాబుకు నష్టం జరిగే సమాచారాన్ని ఎడిట్ చేసి కనీ కనిపించకుండా వేసి ఏపీ పాఠకులను మోసం చేశాయి.సాక్షి మీడియా మాత్రమే రేవంత్ ప్రకటనను యథాతథంగా ఇచ్చింది. విశ్లేషణలు అందించింది. సాక్షి, సోషల్మీడియా చురుకుగా ఉండటంతో చంద్రబాబు ఏపీ ప్రజలకు ముఖ్యంగా రాయలసీమకు ఎంత అన్యాయం చేసింది అర్థమైంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఈ ఊబి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తన సహజ ధోరణిలో జగన్ వల్లే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆగిందంటూ దిక్కుమాలిన వాదన తెరపైకి తెచ్చింది. ఈనాడు పత్రిక తెలంగాణ ఎడిషన్లో 'చచ్చినా, బతికినా తెలంగాణ కోసమే’ అన్న శీర్షికతో రేవంత్ వ్యాఖ్యలను ప్రచురించింది.ఇందులో రాయలసీమ లిఫ్ట్ను తానే ఆపు చేయించానన్న అంశానికి ప్రాధాన్యమివ్వలేదు. లోపల పేజీలో మాత్రం కొద్దిగా రాసింది. అందులో కూడా జగన్ ప్రస్తావన తెచ్చింది. పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టి కేసీఆర్ భుజం తట్టి జగన్ను ప్రోత్సహిస్తే తాను చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి ఆపించానంటూ రేవంత్ చేసిన కామెంట్ను ముద్రించారు. తెలంగాణలో కనీసం లోపలి పేజీలోనైనా వేశారు.. ఈనాడు ఏపీ ఎడిషన్లో వేసినట్లు కనిపించలేదు. కాని మరుసటి రోజు మాత్రం మంత్రులు సవిత, రామానాయుడుల ప్రకటనలను మొదటి పేజీలో ప్రచురించారు.కాగా తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రేవంత్ అబద్దాలు చెప్పారని చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈనాడు మీడియా చంద్రబాబు పట్ల స్వామిభక్తి చూపింది. రాయలసీమ లిఫ్ట్ ఆగడానికి కారణం జగనే అని ఏపీ మంత్రి సవిత ఆరోపించారు. ఎన్జీటీ ఆదేశాలతోనే 2020లో ఎత్తిపోత పనులు నిలిచిపోయాయని అన్నారు. చంద్రబాబును బూచిగా చూపుతూ తెలంగాణ నేతల రాజకీయ ఎత్తుగడలుగా ఈ ఉదంతాన్ని కొట్టిపారేశారు. అంతే తప్ప తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనలేకపోయారు. దీనినిబట్టి టీడీపీ కాంగ్రెస్ మాచ్ ఫిక్సింగ్ చాలా స్పష్టంగా వెల్లడైంది. ఈ పథకంపై ఎన్జీటీలో ఫిర్యాదు చేసింది తెలంగాణ టీడీపీ సహకారంతోనే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్జీటీ వ్యతిరేక ఆదేశాలు ఇచ్చినా జగన్ వ్యూహాత్మకంగా పనులు కొనసాగించారు. దాంతో అటు కేసీఆర్ ప్రభుత్వం, ఇటు ఏపీలో జగన్ అంటే పడని శక్తులు ఎన్జీటీకి మళ్లీ మళ్లీ ఫిర్యాదులు చేశాయి. ఈలోగా కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి 19 నెలలు అయినా ఈ స్కీమ్ అడుగు ముందుకు కదల్లేదు. ఎందుకిలా అన్నదానికి ఈ మంత్రులు సమాధానం ఇవ్వాలి కదా! ఆ ఊసే లేకుండా వారు స్టేట్ మెంట్ ఇచ్చారు.కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుపుతున్నామని ఊదరగొట్టే ఈ నేతలు, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తెచ్చి ఉండాలి కదా!అవేమీ చేయలేదంటే ఈ పథకాన్ని ఆగినా, రాయలసీమకు నష్టం జరిగినా ఫర్వాలేదన్నట్లే కదా అన్న ప్రశ్నకు ఏమి జవాబు ఇస్తారు? రేవంత్ డిమాండ్ కు తలొగ్గినట్లే అవుతుంది కదా! ఒకవేళ జగన్ పై ఇలాంటి ఆరోపణ వచ్చి ఉంటే తెలుగుదేశంతోపాటు ఎల్లో మీడియా ఎంత రచ్చ చేసి ఉండేవో ఊహించుకోవచ్చు. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కూడా రాయలసీమకు జగన్ ద్రోహం చేశారంటూ ఒక తప్పుడు ఆరోపణ చేశారే తప్ప, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒక్క విమర్శ చేయలేదు. రేవంత్ చాలా స్పష్టంగా ఏకాంత సమావేశంలో చంద్రబాబును ఒప్పించానని వెల్లడించారు. తనపై గౌరవంతోనే చంద్రబాబు ఈ స్కీమ్ పనులు నిలిపివేశారని అన్నారు. కావాలంటే కమిటీగా వెళ్లి చూడవచ్చని తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. అయినాసరే... టీడీపీ నేతలు, మంత్రులు మొక్కుబడిగా మాట్లాడి సరిపెట్టుకున్నారు.రాయలసీమకు చెందిన చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమా? కాదా? వైఎస్సార్ కాంగ్రెస్ కాని, ప్రజాసంఘాలు కాని చేస్తున్న విమర్శలకు కూటమి నేతలు నేరుగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. 2024లో జగన్ ప్రభుత్వం ఉన్నంతవరకూ ఈ స్కీమ్ పనులు కొనసాగాయనేందుకు వైసీపీ నేత సతీష్ రెడ్డి రికార్డులు చూపించారు. వైసీపీ బృందం ఒకటి లిఫ్ట్ స్కీమ్ ప్రాంతానికి వెళ్లి జగన్ టైమ్లో జరిగిన పనులు ప్రజలకు తెలియచెప్పింది.అలాగే నమస్తే తెలంగాణ పత్రిక గతంలో ఆ ప్రాంతానికి వెళ్లి జగన్ ఈ స్కీమ్ పనులు ఆపలేదని, ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన నాటికి 14 శాతం పనులు జరిగితే, ఆ తర్వాత 85 శాతం జరిగాయని ఆ రోజుల్లో తెలిపింది. ఏపీ మంత్రులు ఈ విషయాలను కప్పిపుచ్చుతూ ప్రకటనలు చేస్తున్నారు. ఎల్లో మీడియా కూడా అప్పట్లో ఈ స్కీమ్ను ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆపలేదంటూ కొన్ని వార్తలు ఇచ్చిన క్లిప్లింగ్లు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఈ మీడియా కూడా జగన్పై ద్వేషంతో రాయలసీమకు నష్టం చేయడానికి వెనుకాడలేదన్నమాట.ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో దీనిపై మీడియా సమావేశం పెట్టి వాస్తవాలు చెబుతారని లీక్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక 'సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అని పెద్ద హెడింగ్ పెట్టి తన పాఠకులను, ఏపీ ప్రజలను మోసం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసింది. ఈ పత్రిక రేవంత్ చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని ఒక్క ముక్క కూడా ఏపీ ఎడిషన్ లో ప్రస్తావించినట్లు కనిపించలేదు. ఆ తర్వాత రోజు మాత్రం తాటికాయంత శీర్షిక పెట్టి జగన్ పై బురద చల్లేందుకు యత్నం చేసింది. రేవంత్ ప్రకటనతో ఏపీలో చంద్రబాబుకు తీరని నష్టం జరిగిందని గమనించిన ఈ ఎల్లో మీడియా మొత్తం ఇష్యూని జగన్ పై నెట్టేసి టీడీపీని రక్షించాలని విఫల యత్నం చేసింది.అనుమతులు లేవు.. డీపీఆర్ లేదు.. అయినా జగన్ 2020లో ఈ ప్రాజెక్టును చేపట్టారని ఈ పత్రిక రాసింది. పర్యావరణ అనుమతులు వచ్చాకే నిర్మించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయంటూ రాశారు. ఈ వివాదంలో చంద్రబాబుపై బురద చల్లి రాజకీయ లబ్దిపొందేందుకు వైసీపీ ఎత్తు అని ఎల్లో మీడియా ఆరోపించింది. అయినా వాస్తవాలు వెల్లడవడంతో ఆ ఎత్తు చిత్తయిందని ఈ పత్రిక అభిప్రాయపడింది. అది నిజమే అయితే ఇంతగా కంగారు పడుతూ జగన్కు వ్యతిరేకంగా కథనాలు ఇవ్వవలసిన అవసరం ఏముంది. అసలు ఈ వివాదానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కదా! ఆయనను ఎందుకు ఒక్క మాట అనలేదు?జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ స్కీమ్ పనులను చెడగొట్టడానికి ఎల్లో మీడియా ఎన్ని ఎత్తులు వేసింది తెలియచేస్తూ సోషల్ మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. అటు రేవంత్ తోను, ఇటు చంద్రబాబుతోను ఈనాడు యజమాని కిరణ్ కు, ఆంద్రజ్యోతి యజమాని రాధాకృష్ణకు ఉన్న సంబంధాలు అందరికి తెలిసినవే. వారి వ్యాపార ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఎల్లో మీడియాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అవడంతో దానిని కవర్ చేయడానికి జగన్ పై తోసేయాలని కుట్ర చేస్తున్నారు.ఇదే టైమ్ లో ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు నాయుడు పోలవరం నుంచి బనకచర్లకు లిఫ్ట్ స్కీమ్ అంటూ విపరీతంగా ప్రచారం చేసి, సడన్గా దానిని ఆపేసి పోలవరం-నల్లమల సాగర్ స్కీమ్ అంటూ కొత్త గాత్రం ఎందుకు ఎత్తుకున్నారో ఎల్లో మీడియా చెప్పగలదా! ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ తో ఏర్పడిన సంబంధ బాంధవ్యాల రీత్యా చంద్రబాబు ఆయన మాట కాదనలేని పరిస్థితి ఏర్పడిందన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.ఆ కేసు వల్లే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదలుకుని చంద్రబాబు ఏపీకి వెళ్లిపోతే, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టి ఏకంగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ నే నీరుకార్చుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. అంటే గురువును శిష్యుడే శాసిస్తున్నారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జన్మభూమికీ వెన్నుపోటు
-
క్లోజ్డ్ రూమ్ లో కన్నింగ్ ప్లాన్.. అసెంబ్లీ సాక్షిగా అంతా బాబే చేశాడు..
-
సీఎం రేవంత్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, జనగాం: భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. మంగళవారం జనగాంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయడం లేదు. రాహుల్, రేవంత్ను ఉరి తీయాలి. చదువురాని దద్దమ్మ రేవంత్రెడ్డి. ఢిల్లీకి డబ్బులు పంపి తన సీఎం సీటును కాపాడుకుంటున్నాడు. కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్కే రేవంత్ లాగు తడిసింది’’ అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హిల్ట్ పాలసీపై చర్చ .. ‘అవి ప్రభుత్వ భూములు కావు’
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక వేత్తల భూములను.. ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారని.. అవి ప్రభుత్వ భూములు కావు.. పరిశ్రమలకు అమ్మిన భూములు అంటూ మంత్రి శ్రీధర్బాబు స్పష్టత నిచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలన్నదే తమ ఆలోచన అని.. పర్యావరణం బాగుచేయాలనే ఆలోచనతోనే హిల్ట్ పాలసీ తీసుకువచ్చినట్లు తెలిపారు.‘‘హిల్ట్ పాలసీ కింద ఆరు నెలల గడువు ఇస్తాం. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే భూములు కన్వర్ట్ చేస్తాం. పాలసీ గురించి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. దశాబ్ధాల కిందటే గత ప్రభుత్వాలు వారికి భూములు అమ్మేశాయి. రాజకీయాల పక్కనపెట్టి ఆలోచించాలి’’ అని శ్రీధర్బాబు పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వలేని నాగరికత అసమర్థ నాగరికతే.. అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతోందని శ్రీధర్బాబు హెచ్చరించారు.‘‘డెవలప్మెంట్ అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదు. పిల్లలకు ఆస్తులు కాదు.. క్లీన్ ఎన్విరాన్మెంట్ నిజమైన వారసత్వం. బంగారు గిన్నెలో విషం పెట్టినట్లవుతోంది మన పరిస్థితి. ప్రకృతి నాశనమైతే తిరిగి రాదు. మనమంతా భూమి యజమానులు కాదు. కేవలం ట్రస్టీలమే. ఫ్యూచర్ జనరేషన్లకు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం మన బాధ్యత. ఇది కేవలం ల్యాండ్ యూజ్ మార్పు కాదు. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం...ఓఆర్ఆర్ లోపల పరిశ్రమలు.. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం. ఫ్యాక్టరీ గోడ పక్కనే ఇళ్లు.. ఇది సైంటిఫిక్ డిజాస్టర్. 1970లలో నగరం బయట పరిశ్రమలు.. నేడు నడిబొడ్డు ప్రాంతాలు బాలానగర్, సనత్నగర్, ఉప్పల్ ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్లు. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించడమే లక్ష్యం. పిల్లలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వడమే ప్రభుత్వ సంకల్పం. హిల్ట్పై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. మతలబు ఉందంటూ విమర్శలు బాధాకరం. తెలంగాణ నుంచే పర్యావరణ రక్షణకు చారిత్రక అడుగు.. మార్పు ఎప్పుడో కాదు.. ఇప్పుడే’’ అంటూ శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. -
సీఎం రేవంత్రెడ్డికి కిషన్రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి లేఖ రాశారు. వరంగల్ కోట భూములు, అక్రమ కట్టడాలపై సీఎంకు లేఖ రాశారు కిషన్రెడ్డి. కోట భూముల్లో ఆక్రమణలు గుర్తించి తొలగించాలని విన్నవించారు. అక్రమ కట్టడాలను తొలగించి ఆ భూములను పురావస్తు శాఖ (ASI )కి అప్పగించాలన్నారు. వారసత్వ సంపద ను కాపాడటంలో పురావస్తు శాఖకు సహకరించాలని బహిరంగ లేఖ ద్వారా సీఎం రేవంత్కు విజ్ఞప్తి చేశారు కిషన్రెడ్డి. -
అటు సీఎం.. ఇటు మాజీ సీఎం!
మహబూబ్నగర్: ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతోంది. ఈ సభకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం ప్రాజెక్టుల బాట పట్టారు. సంక్రాంతి తర్వాత కేసీఆర్ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం మహబూబ్నగర్నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తొలుత వచ్చేనెల మూడో తేదీన జడ్చర్ల నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ ప్రారంభోత్సవానికి రానున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అంతకన్నా ముందుగానే మహబూబ్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి శుద్ధీకరణ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈనెల 10న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుండగా.. ఆ తర్వాత పురపాలికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు నుంచే ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం మోగించనున్నట్లు తెలుస్తోంది. -
సీమ ఎత్తిపోతలకు చంద్ర ‘గ్రహణం’.. !
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తూ.. తడారిన గొంతులు తడిపేందుకు.. తెలుగుగంగ, గాలేరు–నగరి, శ్రీశైలం కుడి గట్టు కాలువ (ఎస్సార్బీసీ) కింద 9.6 లక్షల ఎకరాల్లో పంటలను రక్షించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు చంద్ర‘గ్రహణం’ పట్టుకుంది! ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే ఈర్ష్యతోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) 2024 నవంబర్ 5న.. 2025 జనవరి 1న నిర్వహించిన సమావేశాల్లో ఈఏసీ సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను చంద్రబాబు సర్కార్ ఇవ్వలేదు. దాని పర్యవసానంగానే గతేడాది ఫిబ్రవరి 27న నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇచ్చేందుకు నిరాకరించిందని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశాన్ని లోక్సభలో గతేడాది మార్చి 19న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రస్తావించి చంద్రబాబు సర్కార్ తీరును కడిగిపారేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడానికి.. తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ఆయకట్టులో పంటలను రక్షించుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించడానికి పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్తో కేసు.. ఓటుకు కోట్లు కేసు భయంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టడంతో 2014–19 మధ్య ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు అల్లాడారు. ఈ నేపథ్యంలో ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వాడుకుని తడారిన గొంతులను తడపడం, ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ పనులను రూ.3,707.06 కోట్ల వ్యయంతో కాంట్రాక్టు సంస్థకు అప్పగించి పనులను పరుగులెత్తించింది. సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే అక్కసుతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్తో ఎన్జీటీ (చెన్నై బెంచ్) లో ఆ ప్రాంతంలోని టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ, పర్యావరణ అనుమతి తీసుకుని ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించే పనులను పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు గత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. 22.54 శాతం పనులు పూర్తి చేశారు. చీకటి ఒప్పందంతో పనులు నిలిపివేతసీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై సీమ ఎత్తిపోతల పనులను నిలిపి వేయించా.. కావాలంటే తనిఖీ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా శనివారం రాత్రి ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ ఎత్తిపోతల పనుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. దీన్ని బట్టి తెలంగాణలో రేవంత్రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేసి.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను మళ్లీ తాకట్టు పెట్టారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. ఈ చీకటి ఒప్పందం కుదరడం వల్లే.. పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన సమావేశాల్లో ఈఏసీ సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను చంద్రబాబు సర్కార్ కావాలనే ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిచిపోవడానికి పర్యావరణ అనుమతి రాలేదనే సాకులు చూపడానికే చంద్రబాబు సర్కార్ ఈఏసీకి వివరాలు అందజేయలేదని స్పష్టం చేస్తున్నారు. -
Vishweshwar: బాబు నిర్వాకం వల్ల సీమ ఎడారిగా మారుతుంది..?
-
డే-4.. కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు.. నాలుగో రోజు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో.. తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు–2026ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై చర్చతో పాటు ఆమోదం తెలపనుంది సభ. పాల్వాయి హరీష్, బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్.. డీఆర్డీఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారుఅధికారుల అవినీతి పై నేను ఎక్కని గడుప లేదుఅన్ని స్థాయిల్లో అధికారులకు అవినీతి పై ఫిర్యాదు చేసాంప్రభుత్వం డీఆర్డీఏ అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు–2026ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అలాగే.. తెలంగాణ స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ పెండింగ్ వార్షిక నివేదికలను రిలీజ్ చేయనుంది. 2015-16 నుంచి 2018-19 వరకు ఆడిట్ నివేదికలు టేబుల్ చేయనుంది ప్రభుత్వం. దీంతో పాటు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్టన్) పాలసీపై షార్ట్ డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. -
రాయలసీమకు సైంధవుడు చంద్రబాబే... ఎత్తిపోతల పనులను పూర్తిగా నిలిపివేసి మరణ శాసనం
-
ఏపీ హక్కులు తెలంగాణకు తాకట్టు! బయటపడ్డ చీకటి ఒప్పందం
-
చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం.. ‘సీమ’కు సైంధవుడు!
సాక్షి, అమరావతి: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, సీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైంధవుడిలా అడుగడుగునా అడ్డుపడుతున్నారనేందుకు మరో నిదర్శనమిది. శ్రీశైలం కుడి గట్టు కాలువ (ఎస్సార్బీసీ), తెలుగుగంగ, గాలేరు–నగరి సుజల స్రవంతికి హక్కుగా దక్కిన కృష్ణా జలాలను వాడుకుని రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సుభిక్షం చేసేందుకు వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులను బాబు సర్కారు 19 నెలలుగా పూర్తి స్థాయిలో నిలిపివేయడమే అందుకు తార్కాణం. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై సీమ ఎత్తిపోతల పనులను నిలిపి వేయించా.. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీతో తనిఖీ చేసుకోవచ్చు..’’ అంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా శనివారం రాత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపడం తెలిసిందే. ఒక్క రాయలసీమ ఎత్తిపోతలే కాదు.. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే ఆ నీటిని గరిష్టంగా ఒడిసిపట్టి రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు పనులతోపాటు.. రాజోలి, జోలదరాశి, కుందూ ఎత్తిపోతల లాంటి కొత్త ప్రాజెక్టుల పనులను చంద్రబాబు సర్కార్ రాగానే పూర్తి స్థాయిలో నిలిపివేసింది. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి 2015లో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కార్కు చంద్రబాబు నాయుడు తాకట్టు పెడితే.. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 2020లో ఏపీ ప్రయోజనాలను పరిరక్షిస్తూ చర్యలు చేపట్టారు. వైఎస్సార్ సీపీ హయాంలో చేపట్టిన సీమ ఎత్తిపోతలతోపాటు రాయలసీమ కరువు నివారణ పథకం కింద చేపట్టిన కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు, కొత్త ప్రాజెక్టుల పనులను ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ నిలిపి వేయడంపై సాగునీటిరంగ నిపుణులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన శిషు్యడు రేవంత్రెడ్డికి రాజకీయ ప్రయోజనం చేకూర్చడం కోసం కృష్ణా జలాలపై ఏపీ హక్కులను మళ్లీ తెలంగాణకు తాకట్టు పెట్టడం ద్వారా రాయలసీమను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎడారిగా మార్చేస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు.సామర్థ్యం పెంచకుండా లైనింగ్ పేరుతో లూటీ..!కృష్ణా వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి శ్రీశైలానికి వరద వచ్చే 30–40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన కాలువ సామర్థ్యం పెంచే పనులు, అవసరమైన చోట్ల చేపట్టిన కొత్త ప్రాజెక్టులను పనులను చంద్రబాబు సర్కార్ రాగానే పూర్తిగా నిలిపివేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు.. శ్రీశైలం కుడి గట్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆ మేరకు పెంచే పనులు.. గాలేరు–నగరి వరద కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులను పూర్తిగా ఆపేసింది. కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన రాజోలి, జోలదరాసి రిజర్వాయర్ల పనులను కూడా పూర్తిగా ఆపేసింది. ఇక తెలుగుగంగ ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందించడానికి చేపట్టిన కుందూ ఎత్తిపోతల పనులనూ నిలిపివేసింది. గాలేరు–నగరి సుజల స్రవంతి–హంద్రీ–నీవా సుజల స్రవంతిలను అనుసంధానం చేస్తూ ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన పనులకూ చంద్రబాబు సర్కార్ మోకాలడ్డింది. ఇక హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను రూ.6,182.20 కోట్లతో 2021 జూన్ 7న వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టింది. కానీ.. అధికారంలోకి రాగానే ఆ పనులను ఆపేసిన చంద్రబాబు సర్కార్ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పరిమితం చేస్తూ గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా చేసినట్లుగా చిత్రీకరించి రూ.695.53 కోట్లను దోచేశారని సాగునీటిరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పేరుతో నాసిరకం పనులు చేసి రూ.1,968.62 కోట్లకుపైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.సీమ ఎత్తిపోతలపై ఆది నుంచి బాబు అక్కసు..⇒ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఏపీ ప్రభుత్వం.. నాగార్జునసాగర్ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందంటూ అప్పట్లో తెలంగాణ సర్కార్ తన అధీనంలోకి తీసుకుంది. కానీ ఏపీ భూభాగంలో ఉన్నప్పటికీ నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను.. పులిచింతల పూర్తిగా ఏపీ ప్రాజెక్టు అయినప్పటికీ అందులో అంతర్భాగమైన విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన అధీనంలోకి తీసుకున్నా నాడు చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉనికి కోసం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో కిమ్మనడం లేదని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.⇒ 2015లో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్కు సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. దీంతో తెలంగాణ సర్కార్ కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచుతున్నా.. అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాడు చంద్రబాబు కిమ్మనలేదు. ఈ నిర్వాకాల ఫలితంగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ నుంచి 0.5 టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి–డిండి ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 6.95 టీఎంసీలు తరలించే సామర్థ్యాన్ని తెలంగాణ సర్కార్ సాధించుకుంది.⇒ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల స్థాయిలో హంద్రీ–నీవా ద్వారా కేవలం 0.33 టీఎంసీలు తరలించే సామర్థ్యం మాత్రమే ఏపీకి ఉంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. అదే 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఇక శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. ⇒ శ్రీశైలం ప్రాజెక్టు దిగువన తాగునీరు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు.. కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే నీటిని విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయవచ్చు. కానీ.. తెలంగాణ సర్కార్ శ్రీశైలం దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేనప్పటికీ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేసి ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులను హరిస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరుమెదపలేదు. ఏపీ వాటాలో జలాలు మిగిలి ఉన్నప్పటికీ.. శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ ఖాళీ చేస్తుండటం వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయలేని దుస్థితి దాపురించింది. దాంతో 2014–19 మధ్య నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు.⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వాడుకుని ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం... తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి 2020 మే 5న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీమ, నెల్లూరు జిల్లాలకు తాగునీరు, చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది ఈ ఎత్తిపోతల లక్ష్యం. ఈ ప్రాజెక్టు పనులను వైఎస్ జగన్ అధికారంలో ఉండగా పరుగులెత్తించారు. రూ.795 కోట్లకుపైగా విలువైన పనులను పూర్తి చేశారు.⇒ సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే అక్కసుతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో తెలంగాణ రైతులతో టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. పర్యావరణ అనుమతి తీసుకుని ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది.⇒ ఒకవైపు రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిసూ్తనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించే పనులకు పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కారు సమర్థవంతంగా వాదనలు వినిపించక పోవడంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడింది. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని చెప్పలేకపోయింది. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఏకాంత సమావేశంలో కుదిరిన ఒప్పందం వల్లే సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తిగా నిలిపి వేయించారనడాకి ఇది మరో నిదర్శనమని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు గంగలో కలిపారు
ఎంవీపీ కాలనీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గంగలో కలిపే తీరును మరోసారి బట్టబయలు చేశాయని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం బొత్స విలేకరులతో మాట్లాడుతూ, ‘చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసిమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించినట్లు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తన స్వార్థం కోసం ఎలా తాకట్టుపెడుతున్నారో స్పష్టమవుతోంది. పైగా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అబద్ధమంటూ ఏపీ ప్రభుత్వం లేఖ విడుదల చేయడం సిగ్గుచేటు. సూపర్ సిక్స్ హామీలు కొండెక్కడంతో రాష్ట్రంలో ప్రజా సంక్షేమం సంక్షోభంలో పడింది. రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు పడుతున్న కష్టాలే ఇందుకు నిదర్శనం’ అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చొరవతోనే వేగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంసీఎంగా వైఎస్ జగన్ చొరవలు, విజ్ఞప్తి ప్రకారమే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను జీఎంఆర్ సంస్థ వేగంగా పూర్తిచేసిందన్నారు. ఇందుకు ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. ‘ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. శంకుస్థాపన సమయంలో తొలుత 2026 డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేస్తామని జీఎంఆర్ ప్రకటించారు. అయితే అప్పటి సీఎం జగన్ కలుగజేసుకుని మరింత త్వరగా పనులు పూర్తిచేయ్యాలని విజ్ఞప్తి చేశారు. దానికి జీఎంఆర్ అంగీకారం తెలిపింది. ఎయిర్పోర్టు పనులు పూర్తిచేయించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు’ అని బొత్స వివరించారు. సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మేల్యే ధర్మశ్రీ, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు.ఈ ప్రశ్నలకు బదులేది?: ప్రభుత్వానికి బొత్స సూటి ప్రశ్నలు⇒ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం తానే పూర్తిచేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్న బాబు ప్రభుత్వం గంగవరం ఎయిర్పోర్ట్ ఆధునీకరణ పనులను ఎందుకు చేయించలేకపోతోంది?⇒ భోగాపురం ఎయిర్పోర్ట్–విశాఖ సిటీ మధ్య కనెక్టివిటీ పనులు ఎందుకు వేగంగా జరగడంలేదు? పోర్ట్ టు ఎయిర్పోర్ట్ పేరుతో జగన్ ప్రభుత్వం బీచ్రోడ్డు అభివృద్ధికి ప్రణాళికలు వేసింది. ఆ డీపీఆర్కు కేంద్రమంత్రి నితిన్గడ్కారీ ఆమోదం తెలిపారు. అయినా ఆ పనులను ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు చేపట్టలేకపోయింది? ⇒ కనీస సమాచారం ఇవ్వకుండా విదేశాలకెళ్లిన సీఎం దేశ చరిత్రలో చంద్రబాబు మినహా మరెవ్వరూలేరు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన రహస్య పర్యటనకు కారణమేమిటి?⇒ జగన్ జన్మదినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్న పార్టీ కార్యకర్తలపై ‘జంతుబలి’ అంటూ కేసులు పెట్టి రోడ్డుపై నడిపించి చిత్రహింసలు పెట్టిన పోలీసు యంత్రాంగం, గతంలో బాలకృష్ణ సినిమా రిలీజ్ పోస్టర్ల ఎదుట ఇదే తీరుగా వ్యవహరించిన వారిని ఎందుకు పట్టించుకోలేదు? -
రేవంత్ వ్యాఖ్యలపై బాబు సమాధానం చెప్పాలి: అంబటి
సాక్షి, గుంటూరు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ తోడు దొంగలే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ను చంద్రబాబే కాంగ్రెస్ పార్టీలోకి పంపారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కుట్రపన్నారు. సీమ ఎత్తిపోతల పథకంపై చేసిన వ్యాఖ్యలను ఆంధ్రజ్యోతి, ఈనాడు దాయడానికి ప్రయత్నించాయి. వైఎస్ జగన్.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు దాన్ని ఆపేయడం దుర్మార్గం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా ఇరుక్కున్నారో అందరికీ తెలుసు.గతంలో చంద్రబాబు హయాంలోనే కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచింది. చంద్రబాబు స్వార్థ రాజకీయాలు బయటపడ్డాయి. చంద్రబాబే.. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ మాట్లాడుకుంటానే ఉంటారు. చంద్రబాబు తీరు వల్ల రాయలసీమకు, కృష్ణా జలాల వ్యవహారంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి అడిగితే తిరుమలను కూడా చంద్రబాబు ఇచ్చేస్తారేమో అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
లైవ్ లో రేవంత్ అబద్ధాలు.. బట్టబయలు చేసి పరువు తీసిన హరీష్
-
రేవంత్ది కట్టుకథ.. కుట్రతో ప్రాజెక్ట్ల నిర్లక్ష్యం: హరీష్రావు
సాక్షి, తెలంగాణ భవన్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుకథలు చెప్పారని ఆరోపించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు. తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.తెలంగాణ భవన్లో కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..‘అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ. నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. విభజనలో సెక్షన్-84 పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు. 11వ షెడ్యూల్లో మన ప్రాజెక్ట్లను ఎందుకు పెట్టలేదు?. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్లను 11వ షెడ్యూల్లో పెట్టకపోగా విభజన చట్టంలో రక్షణ కల్పించామని సీఎం చెబుతున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్కు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు.కుట్రపూరితంగా ప్రాజెక్ట్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీఎం రేవంత్ కక్ష గట్టారు.. పాలమూరుపై పగబట్టారు. కాంగ్రెస్ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటోంది. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. రేవంత్ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తోంది. కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. 2004-14 వరకు కాంగ్రెస్ పాలనలో 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 48.74 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. పాలమూరు ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్ట్లను కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు ముఖం మీదే కేసీఆర్ చెప్పారు..టెలీమెట్రీ పెట్టాలని కేసీఆర్ ఎప్పుడో ఒప్పించారు. 2016లోనే టెలీమెట్రీ ఏర్పాటు చేశారు. సొంత ప్రాంతానికే రేవంత్ అన్యాయం చేస్తున్నారు. శాసన సభను రేవంత్ తప్పుదోవ పట్టించారు. తనకు అనుకూలంగా ఉన్న పేజీలను చదివారు. సభలో అసలైన పేజీలను రేవంత్ చదవకుండా వదిలేశారు. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లోనే ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాం. రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే నీటి హక్కులపై కేంద్రాన్ని నిలదీశాం. కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం. పొతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్ట్ అని ఆనాడే కేసీఆర్ చెప్పారు. చంద్రబాబు ముఖం మీదే బల్లగుద్దినట్టు కేసీఆర్ మాట్లాడారు. ఉత్తమ్ కట్టుకథలు, రేవంత్ పిట్ట కథలు చెప్పారు. తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్. రేవంత్ రెండేళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెబుదామంటారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు రేవంత్, చంద్రబాబు లోపాయికారి ఒప్పందం కుదిరింది అని విమర్శించారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వల్లే నీటి సమస్యలు..అసెంబ్లీలో అబద్ధాలు ఆడినందుకు రాజీనామా చేయాలి. కాంగ్రెస్ మాత్రం ఒక్క ప్రాజెక్ట్ డీపీఆర్ కూడా కేంద్రానికి పంపించలేదు. మీ పాలనలో మూడు డీపీఆర్లు వెనక్కి వచ్చాయి. అరెంజ్మెంట్, అగ్రిమెంట్కు తేడా తెలియకుండా విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి 11 ప్రాజెక్ట్ల డీపీఆర్లను పంపించాం. ఏడు ప్రాజెక్ట్లకు అనుమతి తీసుకొచ్చాం. తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారంటే ఎవరైనా నమ్ముతారా?. రేవంత్ అబద్దాలను చేసి నిజమే ఉరేసుకుంటుందేమో. బీఆర్ఎస్ హయంలోనే అత్యధికంగా కృష్ణా నీళ్ల వినియోగం జరిగింది. ప్రాజెక్ట్ల నిర్మాణాన్ని కేసీఆర్ పరుగులు పెట్టించారు. తెలంగాణకు బీఆర్ఎస్ మరణశాసనం రాసిందని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. గత పదేళ్లు నీటి హక్కుల కోసం కేంద్రంపై కేసీఆర్ పోరాడారు. 2023లోనే 66:34 లేకుండానే అగ్రిమెంట్ చేశాం. కృష్ణా జలాల్లో 50:50 నీటి వాటాల కోసం కేంద్రానికి 28 లేఖలు రాశాం. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వల్లే నీటి సమస్యలు వచ్చాయి అని చెప్పుకొచ్చారు. రేవంత్వి బలుపు మాటలు: కేటీఆర్అంతకముందు కేటీఆర్ మాట్లాడుతూ..‘నదీ జలాల మీద కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ద్రోహానికి పాల్పడుతోంది. అధికార మదంతో విర్రవీగుతూ, బలుపు మాటలతో రేవంత్ రెడ్డి విర్రవీగుతున్నాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ఉరితీయాలి. రేవంత్కి ఒక్క భాషలో తిట్లు వస్తే మాకు నాలుగైదు భాషల్లో తిట్టడానికి వచ్చు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప తెలంగాణకు ఏం కావాలో.. రేవంత్కు తెలియదు. రేవంత్ మాటలతో కేసీఆర్ స్థాయి తగ్గదు. కేసీఆర్ గురించి ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఊరి వేయాలి?. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు.. బేసిన్ అంతకంటే తెలియదు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే రేవంత్ రెడ్డి ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు. -
రాయలసీమ ఎత్తిపోతలను ఆపింది చంద్రబాబే! అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా ఇరికించిన రేవంత్
-
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం తర్వాత అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ ప్రారంభమైన సమయంలో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతుండగా పార్టీ ఎమ్మెల్యేలు పలుచగా ఉండడాన్ని గమనించిన ఆయన ఈ మేరకు సీరియస్ అయ్యారని సమాచారం. ‘ముఖ్యమైన అంశంపై చర్చ ప్రారంభమైన తర్వాత కూడా మన ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రాలేదు. వెంటనే వారిని సభకు రమ్మని చెప్పండి. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలందరూ సభలో ఉండాలి’అని ఆయన పార్టీ విప్లను ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వెంటనే సభలో లేని ఎమ్మెల్యేలందరికీ సీఎల్పీ నుంచి ఫోన్లు వెళ్లడంతో అందరూ సభకు వెళ్లారు. -
‘సీమ’ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా..
రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి దాకా నేను సాధించిన విజయాలను చెప్పుకోలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నేను ఏకాంతంగా (క్లోజ్డ్ రూమ్) సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపేయాలని విజ్ఞప్తి చేశాను. నా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశారు. అధ్యక్షా.. రాయలసీమ ఎత్తిపోతలు పనులు ఆగినాయా? లేదా? తెలుసుకోవడానికి కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేపీ నేత మహేశ్వరరెడ్డి, కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కమిటీలో నియమించి అక్కడికి పంపండి. ఒకవేళ శ్రీశైలంలో మేం కట్టే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదని మీరు అభ్యంతరం పెడితే.. మేం తక్షణమే పాత ప్రతిపాదన అయిన జూరాల నుంచి రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల చేపడతామని చంద్రబాబుకు చెప్పాను. ఆ చర్చల ద్వారా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేస్తున్నాం. – తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతలకు, ఆ దుర్భిక్ష ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబునాయుడు మరణ శాసనం రాశారన్న కఠోర వాస్తవం శనివారం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బహిర్గతమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తాను ఏకాంతంగా సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయాలని విజ్ఞప్తి చేశానని, తన మీద గౌరవంతో చంద్రబాబు ఆ ఎత్తిపోతల పనులు ఆపేశారని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కావాలంటే ఆ ఎత్తిపోతల పనులు ఆగాయో లేదో తెలుసుకోవడానికి నిజ నిర్ధారణ కమిటీని అక్కడికి పంపుదామన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక రాయలసీమ ఎత్తిపోతల పనులు పూర్తిగా ఆగిపోవడాన్ని బట్టి చూస్తే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పింది అక్షర సత్యమన్నది స్పష్టమవుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ) సమావేశంలో చంద్రబాబు సర్కారు సమర్థవంతమైన వాదనలు వినిపించక పోవడం ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పనులకు సమాధి కట్టడాన్ని బట్టిచూస్తే ఇది వాస్తవమేనని తేటతెల్లమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో 2015లో తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారని.. ఇప్పుడు తన శిష్యుడు రేవంత్రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం అదే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను వదిలేసుకుని రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు మరణ శాసనం రాశారని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల ⇒ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. సీమ ప్రాజెక్టులకు సాగునీరివ్వడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి.⇒ రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూ భాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకున్నా.. ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువన నీటి అవసరాలు లేకున్నా.. తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ⇒ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి.⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. ⇒ ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్ష్యతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. తాగునీటి పనులకూ బ్రేక్రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నాటి వైఎస్సార్సీపీ సర్కార్ నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పంపారు. పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగు నీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించక పోవడంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడింది. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని చెప్పలేకపోయింది. ఫలితంగా ఈ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం చేసిన పనులను తొలగించి, యథాస్థితికి తేవాలని ఈఏసీ ఆదేశించింది.నిర్విఘ్నంగా పాలమూరు–రంగారెడ్డి⇒ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో గరిష్టంగా 120 టీఎంసీలు తరలించేలా 2015లో తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల (1.5 టీఎంసీలు), డిండి ఎత్తిపోతల (0.5 టీఎంసీలు) చేపట్టింది. తద్వారా మన రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని అటు రైతులు.. ఇటు నీటి పారుదల రంగ నిపుణులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినా అప్పటి చంద్రబాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ⇒ ఇటు ఏపీ, అటు తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతం.. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం.. వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న లక్ష్యంతో 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశంలో నాటి సీఎం చంద్రబాబు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై నోరు మెదపలేదు. దాంతో 2019 నాటికి ఆ ప్రాజెక్టు పనులను సింహ భాగం తెలంగాణ సర్కార్ పూర్తి చేసింది.⇒ కృష్ణా జలాల్లో చిన్న నీటి పారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు ఉందని.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు గాను 45 టీఎంసీల కృష్ణా జలాలు అదనంగా తమకే దక్కుతాయని తనకు తానే తెలంగాణ సర్కార్ తీర్మానించుకుంది. ఆ రెండూ కలిపి 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డిని చేపట్టినట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించింది. ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపగా.. దాన్ని సీడబ్ల్యూసీ అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పంపి అభిప్రాయాన్ని కోరింది. ⇒ చిన్న నీటి పారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు లేదని.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీల్లో ఎవరి వాటా ఎంత అన్నది ట్రిబ్యునల్ తేల్చాలని సీడబ్ల్యూసీకి 2022 సెప్టెంబరు 19న వైఎస్సార్సీపీ ప్రభుత్వం నివేదించింది. నీటి లభ్యతే లేని ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని, తద్వారా ఏపీ హక్కులను పరిరక్షించాలని కోరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సీడబ్ల్యూసీ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ను తెలంగాణ ప్రభుత్వానికి వెనక్కు పంపింది. ⇒ దీంతో ఇప్పుడు తెలంగాణ సర్కార్ కొత్త ఎత్తు వేసింది. చిన్న నీటి పారుదల విభాగం కింద తమకు కేటాయించిన నీటిలో 45.6 టీఎంసీలు మిగులు ఉందని.. ఆ నీటిని తాగునీటి అవసరాల కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల తొలి దశ ద్వారా తరలించడానికి అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పించింది. ఆ మేరకు నిర్విఘ్నంగా పనులు చేస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరు మెదపకపోవడం పట్ల సాగు నీటి రంగం నిపుణులు, రైతులు విస్తుపోతున్నారు. -
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ఆపించా: రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
-
రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణశాసనం
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి మరణశాసనం లిఖించారని.. ‘సీమ’ ప్రాంతాన్ని ఎడారి చేసేందుకు, చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం బట్టబయలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబు బలిపెట్టారని శనివారం ‘ఎక్స్’లో ఆ పార్టీ మండిపడింది. ‘నేను కోరినందువల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేశారు. చంద్రబాబుతో జరిగిన ఏకాంత సమావేశంలో నేను కోరగానే ఆయన ఒప్పుకున్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయి. కావాలంటే నిజనిర్ధారణ కమిటీ కూడా వెళ్లి చూసుకోవచ్చు’.. అంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక విషయాలు వెల్లడించారని వైఎస్సార్సీపీ ఆ పోస్టులో పేర్కొంది. సీమ అంటే గిట్టని చంద్రబాబురాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు తొలి నుంచీ చిత్తశుద్ధి లేదు. ఆ విషయం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలతో తేటతెల్లమైంది. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన బృహత్తర రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తొలి నుంచి చంద్రబాబు మోకాలడ్డుతూనే ఉన్నాడు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రజల గొంతు కోయడం సరికాదు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. రాయలసీమ ప్రజలు ఈ విషయంలో పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి. – సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక, కర్షక సమితిఇది ఏపీ ప్రజల హక్కులపై దాడితెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలపై ఏపీ సీఎం చంద్రబాబు తక్షణం స్పందించాలి. చంద్రబాబు ఏపీ ప్రజల హక్కులపైన దాడి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమకు ఎత్తిపోతల పథకం చాలా అవసరం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు రూ.7వేల కోట్లతో తీసుకొచ్చారు. ఇందులో పైపులైన్ పనులు చాలావరకు పూర్తయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ తానే నిలిపేయించానని చెప్పడమే కాకుండా కమిటీ వేస్తానంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి రేవంత్ రెడ్డి ప్రకటనను ఖండించాలి. రాయలసీమలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి ఎమ్మెల్యే స్పందించాలి. లేదంటే రాయలసీమ చరిత్రలో ఒక మాయని మచ్చగా తెలుగుదేశం పార్టీ మిగిలిపోతుంది. – మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి, సమన్వయకర్త, రాయలసీమ మేధావుల ఫోరంసీమకు అన్యాయం చేసేందుకే కుట్రరాయలసీమకు నీరు రాకుండా చంద్రబాబు కుట్ర చేశారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం బయటపెట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పడం చూస్తుంటే ఆ కుట్ర బహిర్గతమైంది. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బలోపేతానికి కృషి చేశారు. సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతారు. – ఆకేపాటి అమర్నాథరెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడుసీమకు చంద్రబాబు అన్యాయం నిత్యం కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమకు సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇదే విషయం శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టడంతో చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బయటపడింది. ఇద్దరు సీఎంలు చర్చించుకున్న సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని చెప్పడంతో పనులు ఆగిపోయిన విషయం రేవంత్ రెడ్డే చెప్పారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు అన్యాయం చేస్తే వారికి భవిష్యత్లో రైతులే గుణపాఠం చెబుతారు. – గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీమ ద్రోహి చంద్రబాబురాయలసీమ ప్రాజెక్టులకు తాగునీరు అందించే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని రుజువు చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాము ఏపీ చంద్రబాబు నాయుడికి చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయించానని సాక్షాత్తు తెలంగాణ సాక్షిగా కుండ బద్దలుకొట్టారు. సీఎం చంద్రబాబు తక్షణం నోరు విప్పాలి. చంద్రబాబుకు రాయలసీమ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి. – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడురాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే. ఏపీకి దక్కాల్సిన కృష్ణా జలాలను తెలంగాణకు తరలించినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ముఖ్యంగా రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం రాస్తున్నారన్నది మరోసారి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలని తాను అడిగానని, చంద్రబాబు ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆపించానని రేవంత్ రెడ్డి పేర్కొనడం ద్వారా రాయలసీమ రైతులకు చంద్రబాబు తీవ్రంగా అన్యాయం చేశారన్నది రుజువైంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి.. రాజకీయంగా పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. – అనంత వెంకట్రామి రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, అనంతపురంసీమ అంటే చులకన భావంరాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును కోరగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయడం ఇక్కడి రైతులను దగా చేయడమే. సొంత రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన దౌర్భాగ్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికంగా కృష్ణా జలాలు ఆంధ్రాకు తీసుకెళ్లారని రేవంత్ రెడ్డే చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు స్వార్థం వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేతప్రతిసారి రాయలసీమకు ద్రోహమేచంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి రాయలసీమకు అన్యాయమే చేశాడు. సీమపై బాబు వైఖరి మరోసారి బట్టబయలైంది. తన శిష్యుడైన రేవంత్రెడ్డి ఏకంగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తానే ఆపించానని.. కావాలంటే అసెంబ్లీ వేదికగా నిజనిర్ధారణ కమిటీ వేసి చంద్రబాబును అడగండి అన్నారంటే సీమకు గురుశిష్యులు కలిసి ఏ స్థాయిలో ద్రోహం చేస్తున్నారో అర్థమవుతోంది. వెంటనే రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలి. లేదంటే ఆయన్ను రాయలసీమ ద్రోహిగా భావించాల్సి వస్తుంది. రాయలసీమలో పుట్టి, ఈ ప్రాంతంలోని రాయలసీమ లిఫ్ట్ను ఒకరు చెబితే నువ్వు నిలిపేశావంటే ఇంతకంటే ద్రోహం సీమకు మరొకటి ఉండదు. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడుసీమ ద్రోహి చంద్రబాబుతెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలతో చంద్రబాబుచరిత్రలో రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను సీమ ప్రాంతానికి రాకుండా తాను చంద్రబాబుతో కలిసి అడ్డుకున్నానని తెలంగాణ సీఎం చెప్పడం గమనార్హం. ఏనాడూ చంద్రబాబు సీమ ప్రాంతం గురించి ఆలోచించలేదు. అమరావతి తప్ప సీమ ప్రాంతానికి నిధులు, ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన నిజాయితీని నిరూపించుకోవాలి. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడైనా నిధులు రాబట్టాలి.– ఎస్వీ మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడుఇద్దరు సీఎంలూ మోసం చేశారు.. రాయలసీమకు సాగునీటిని అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమ్మక్కై తీవ్ర అన్యాయానికి పాల్పడ్డారు. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తే ఇదే టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లి నిలుపుదల చేయించారు. నేడు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రాజకీయ స్వలాభం కోసం రాయలసీమ ప్రజల జీవనాడిగా చెప్పుకునే కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నారు. – ఆర్.రమేష్ కుమార్ రెడ్డి, హిందూపురం పార్లమెంటరీ వైఎస్సార్సీపీ పరిశీలకుడుతన ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారుతెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు చేతులు కలిపి రాయలసీమకు మరణ శాసనం రాశారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, రాష్ట జల వనరుల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘తన స్వార్థం కోసం తెలంగాణ సీఎంతో లాలూచీపడి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ను చంద్రబాబు ఆపేశారు. ఈ విషయాన్ని రేవంత్రెడ్డే తెలంగాణ అసెంబ్లీలో వెల్లడించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత రాష్ట్రాన్ని ఈ రకంగా తాకట్టు పెట్టడం, రాష్ట్ర ప్రయోజనాలను ఈ రకంగా తన స్వార్థంకోసం అమ్ముకోవడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడాచూసి ఉండం. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్ కమీషన్ల కోసమే ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా ఇలా దెబ్బతీసూ్తనే ఉన్నాడు. రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. ఇంతటి అన్యాయం చేసిన చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు’ అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. – అంబటి రాంబాబు, మాజీ మంత్రి శిష్యుడికి గురువు దక్షిణ ఇచ్చినట్లుగా ఉంది..రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబుతో మాట్లాడి తాను నిలిపివేయించినట్లు తెలంగాణ సీఎం చేసిన ప్రకటన తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు అందిస్తామని ఇంతకాలం చెప్పారు. ఇప్పుడు ఏకంగా ఆ పథకాన్ని ఆపేయడానికి చంద్రబాబు అంగీకరించారన్నది నిర్ధారణైంది. గురువుకు శిష్యుడు దక్షిణ ఇవ్వడం చూశాంగానీ.. ఇప్పుడు గురువు శిష్యుడికి దక్షిణ ఇచ్చినట్లు ఉంది. – రాంభూపాల్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడురాయలసీమకు మరణశాసనం రాసిన చంద్రబాబుచంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ ద్రోహి అనేది ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మాటలతో తేటతెల్లమైంది. దీనిబట్టి చంద్రబాబు రాయలసీమకు మరణ శాసనం రాసినట్లు రుజువైంది. అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిచేస్తే చంద్రబాబు ఆలోచన అందుకు విరుద్ధంగా ఉంది. – కేవీ రమణ, అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడుచంద్రబాబు, రేవంత్ ఇద్దరూ తోడుదొంగలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి ఇద్దరూ తోడుదొంగలు. ఓటుకు కోట్లు కేసులో ఇద్దరూ ఉన్నారు. చంద్రబాబుకు నీటి ప్రాజెక్టులు ఏమాత్రం పట్టవు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు చంద్రబాబు పూర్తి వ్యతిరేకం. కాబట్టే ఆపేశాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ సీఎం చెబుతున్నాడు. రాయలసీమకు ఇంతకంటే ద్రోహం చేసేవారు మరొకరు ఉండరు. – ఇమాం, కదలిక ఎడిటర్ -
ఇదే బీఆర్ఎస్ రాసిన మొదటి మరణ శాసనం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై నిలదీస్తామన్న కేసీఆర్ సభకు రాలేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. సభకు వచ్చి కేసీఆర్ తన దగ్గర ఉన్న సమాచారం ఇస్తారనుకున్నామని.. సూచనలు ఇస్తే తీసుకుందామనుకున్నమన్నారు. కృష్ణా నీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై ఒక రోజు చర్చ పెడదామనుకున్నామంటూ చెప్పుకొచ్చారు.‘‘రెండేళ్లుగా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదు. సభకు వచ్చి మీ అనుభవాలు మాతో పంచుకోవాలని నేను పదేపదే కేసీఆర్ను కోరుతున్నా.. గతంలో జానారెడ్డి, భట్టి విక్రమార్క పోషించిన పాత్ర పోషించమని కోరా. జానారెడ్డి, భట్టిలను ఆనాడు అవమానానించినా భరించి సభకు వచ్చి సలహాలు ఇచ్చారు. బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు.. సభకు రండి నిజాలు ఏంటో తేలుద్దాం. కృష్ణా నది జలాలపై చర్చ పెట్టమని మేము అడగలేదు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అడిగారు. అందుకే అసెంబ్లీ పెట్టి చర్చింస్తున్నాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.‘‘కేసీఆర్ సభకు ఎందుకు రాలేదో కారణమే లేదు. హరీష్ రావుకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇచ్చారు. అయినా మేము సభకు రామని వెళ్లిపోయారు. మీరు సభ పెట్టండి మీ బట్టలు ఊడదీస్తామని ఒకరు ,తొలు తీస్తామని ఒకరు మాట్లాడారు. సభకు వచ్చి చర్చలో పాల్గొంటే ఎవరి బట్టలు ఊడదీయాలో ప్రజలు తేల్చుకునేవారు.’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.‘‘బచావత్ ట్రిబ్యునల్ (KWDT-1)అవార్డు ప్రకారం కృష్ణాజలాల్లో 75 శాతం నీటిలభ్యత అంచనాల ప్రకారం మొత్తం 2130 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 811 టీఎంసీలు.. కేటాయించారు. పునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు చేసుకోవాల్సి ఉండేది. నికర జలాలు, మిగులు జలాల వేర్వేరుగా నీటి కేటాయింపులు జరిపారు. కృష్ణా నదిపై ఉన్న వివిధ రాష్ట్రాల ఫిర్యాదుల కారణంగా 2004 ఫిబ్రవరి 2వ తేదీన అప్పటి కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసింది...బచావత్ ట్రిబ్యునల్ పంపిణీచేసిన 2130 టీఎంసీల నీటి కేటాయింపులను కొనసాగిస్తూనే, అదనపు నీటి లభ్యత అంచనాలతో 2578 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా పరివాహకంలో ఉన్న రాష్ట్రాలకు పంపిణీచేసింది. దీని ప్రకారం మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీల నీటి వాటాలు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటాల పంపిణీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇదే బ్రిజేష్ కుమార్ట్రిబ్యునల్కు (KWDT2) అప్పగించింది. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని పునర్విభజన చట్టంలో ఉంది...ఉమ్మడి రాష్ట్రంలో ఉన్పప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేసింది. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్లో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టింది. 2014లో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిందిపోయి అసంపూర్తిగా వదిలేసింది. 490 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక… కేసీఆర్, హరీష్ రావు బాధ్యతలు చేపట్టాక తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారు. 2015 జూన్లో జరిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో 299 టీఎంసీలకు అంగీకరించారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలల్లో తెలంగాణకు 490 టీఎంసీలు అడగాల్సిందిపోయి 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకం పెట్టారు...21.09.2016 న జరిగిన అపెక్స్ మీటింగ్ లోనూ మనకు 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ తాత్కాలిక నీటి వాటాలకు ఒప్పుకొని వచ్చారు. 06.10.2020లో జరిగిన రెండో అపెక్స్ మీటింగ్లోనూ ఈ కేటాయింపులే కొనసాగించండి.. అని శాశ్వతంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జలాలపై బహిరంగ సభలు కాదు.. సభలోనే చర్చించాలని మేం కేసీఆర్, హరీష్ ను ఆహ్వానించాం. పదేళ్లు కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోయేందుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. వివరాలతో సభలో చర్చిద్దామంటే సభకు రాకుండా వెళ్లిపోయారు.’’ రేవంత్ పేర్కొన్నారు. -
తెలంగాణకు పటేల్ వరం.. నెహ్రూ శాపం: మహేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అన్యాయం జరిగింది అంటే మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. సభను భజన మండలిగా మార్చారు అంటూ మండిపడ్డారు.కృష్ణ జలాలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అనంతరం, బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు పటేల్ వరం అయితే.. నెహ్రూ శాపం. పటేల్ రజాకర్ల నుంచి విముక్తి చేస్తే.. నెహ్రూ తెలంగాణను ఆంధ్రాలో కలిపి ద్రోహం చేశారు. జల దోపిడికి నెహ్రూ చేసిన పనితోనే శ్రీకారం పడింది. బీఆర్ఎస్ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని దురాశతో ఏపీకి సాగు నీళ్ళను దారాదత్తం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన గుత్తదారుల జేబులు నింపడానికి అదే పని చేస్తుంది. నాగార్జున సాగర్ తెలంగాణకు వచ్చే ఎడమ కాల్వను పైకి కట్టి, కుడి కాల్వను కిందకు కట్టి దోపిడిని ఆరోజే ప్రారంభించారు. తెలంగాణ కోసం చేపట్టిన ఎస్ఎల్బీసీ అంతా గందరగోళం.. ఇంకా పూర్తి కాలేదు.సభలో కాంగ్రెస్ తరఫున 25 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. బీజేపీ నుండి ఒక్కరికీ మాత్రమే ఇచ్చారు. బీజేపీ నుండి మరొకరికి అవకాశం అడిగితే ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఎలాగో సభలో లేనే లేదు.. ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వచ్చు కదా?. ఎంఐఎం, సీపీఐతో డబ్బా కొట్టించుకున్నారు. సభను భజన మండలిగా మార్చారు’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో మోసం చేసింది: పొంగులేటిగత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో మోసం చేసింది: పొంగులేటి
-
పేదలు, మహిళా కూలీల హక్కులకు విఘాతం
సాక్షి, హైదరాబాద్: వీబీజీ రామ్జీ (వికసిత్ భారత్–గ్యారంటీ– రోజ్గార్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)) చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేయాలని నిర్ణయించిన ఈ చట్టం.. పేదలు, మహిళా కూలీల హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొంది. పేదలు, కూలీలకు ఉపాధి హామీని కల్పిస్తూ 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ (ఎంజీ ఎన్ఆర్ఈజీఏ) పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం శాసనసభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు.అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ అంశంపై చర్చను ప్రారంభించగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, వెడ్మ బొజ్జు, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి జుల్ఫికర్ అలీ మాట్లాడారు. మహేశ్వర్రెడ్డి కేంద్రం తెచ్చిన చట్టాన్ని సమరి్థంచగా, మిగతా సభ్యులు వ్యతిరేకించారు. అనంతరం సభలో సీఎం తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. వలసలకు ఊతం.. ‘ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని, పేదలు, మహిళలు పని హక్కును కోల్పేయేలా తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పేదల కోసం.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాం. ఏ గ్రామంలోని వారు అక్కడే ఏడాదికి 100 రోజులు పనిచేసుకునేలా తీసుకొచ్చిన ఉపాధి చట్టాన్ని మార్చి కార్మికులు మళ్లీ వలస పోయేలా కేంద్రం చట్టం తెచ్చింది.కూలీ పనుల కోసం దేశమంతా వలసలు పోయే పాలమూరు జిల్లా వాసులతో పాటు అనంతపురం, మెదక్ జిల్లాలను పరిగణనలోకి తీసుకొని గతంలో ఈ పథకాన్ని తీసుచ్చినట్లు గుర్తు చేశారు. సొంత ఊరులోనే పని కల్పించేందుకు తెచ్చిన ఈ చట్టాన్ని మార్చి మళ్లీ వలసలకు పోయే పరిస్థితి కల్పించారని విమర్శించారు. పేద, అణగారిన, ఆదివాసీలు, కూలీల కోసం తెచ్చిన ఈ చట్టం స్ఫూర్తి కొనసాగింపునకు, కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని తిరస్కరించేందుకు సభలో ఆమోదం తెలపాలని కోరగా.సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది ముఖ్యమంత్రి ఏమన్నారంటే.. ‘గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి తీసుకు వచ్చింది. పేదరికం, నిరుద్యోగం, వలసలు, నైపుణ్యం లేని శ్రామిక వర్గాల దోపిడీ, స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గిస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజులు ఉపాధి కCచి, కనీస వేతనం అందేలా చూడటం ఈ చట్టం ప్రధాన లక్ష్యం.గత 20 ఏళ్లుగాగా ఈ పథకం ద్వారా తెలంగాణలో లబ్ధి పొందిన వారిలో సుమారు 90 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. వీరిలో 62 శాతం మహిళలు. దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు, చెంచులు, పేద వర్గాలే ఎక్కువగా ప్రయోజనం పొందారు. కాగా ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టిన ‘వీబీజీరామ్జీ –2025’ పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడిన గ్రామీణ ప్రాంత మహిళలు, బలహీన వర్గాల ఉపాధికి హామీ లేకుండా చేస్తోంది. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సభ కింద తెలిపిన విధంగా తీర్మానిస్తోంది..’ అని సీఎం చెప్పారు. ఇదీ తీర్మానం.. 1. కొత్త చట్టం పథకం అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తోంది. డిమాండ్కు అనుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది. డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి. 2. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు అమల్లో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఏ లో దాదాపు 62% మహిళలు కూలీ పొందేవారు. కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి. దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు. మహిళా సాధికారత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి. 3. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించేది. కొత్త చట్టంలో కేంద్ర–రాష్ట్ర నిధుల వాటా 60:40గా పేర్కొనడం రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. 4. మహాత్మాగాంధీ పేరును ఈ పథకం నుంచి తొలగించటంతో ఆయన స్ఫూర్తిని నీరుగార్చినట్లయింది. 5. వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం తప్పనిసరి చేయడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది. ఈ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి. 6. ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా 266 రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది. కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులు తొలిగించటంతో చిన్న సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు నష్టపోతారు. ఇప్పుడున్న పనుల జాబితాను యథాతథంగా అనుమతించాలి. -
మూసీ కాలుష్యాన్ని మించిన విషం
సాక్షి, హైదరాబాద్: మూసీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని తాను కృత నిశ్చయంతో ఉంటే, విపక్ష బీఆర్ఎస్ అసత్యాల ప్రచారంతో అవినీతి బురద జల్లుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 1.50 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చామని, రూ.25 కోట్ల కమీషన్లు తినేశామని ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు. వాళ్ల కడుపులో విషం మూసీ కాలుష్యం కన్నా ప్రమాదకరమని మండిపడ్డారు.కాలి బూడిదయ్యేంత విషపు కళ్లతో చూస్తున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ పునరుజ్జీవంపై పలువురు లేవనెత్తిన ప్రశ్నలపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. అసలు మూసీ ప్రక్షాళన ఇష్టమా? కాదా? చెప్పాలని నిలదీశారు. ప్రక్షాళనకు సహకరిస్తే సూచనలు ఇవ్వాలని, వ్యతిరేకం అయితే ఆ కడుపు మంటకు కారణమేంటో చెప్పాలని అన్నారు. డీపీఆర్లు వచ్చిన తర్వాతే అంచనాలు ‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిందేంటో చెప్పాలి. కాంట్రాక్టులు ఇవ్వడం, కమీషన్లు పట్టడం, లిçఫ్టులు, పంపులు పెట్టడం, ఇళ్లలో కనకవర్షం కురిపించుకోవడం, జన్వాడ, మొయినాబాద్లో ఫామ్హౌస్లు కట్టుకోవడమే కదా చేసింది. తమను వాళ్లలా ఊహించుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ ప్రక్షాళనకు అంతర్జాతీయ కన్సల్టెన్సీ తోడ్పాటు తీసుకుంటున్నాం. అది డీపీఆర్లు ఇచి్చన తర్వాతే అంచనాలు వెల్లడిస్తాం. ముందే చెప్పడానికి నేను 80 వేల పుస్తకాలు చదవలేదు. వాళ్ళంత పరిజ్ఞానం లేదు. దుర్గంధ భరితమైన మూసీ పక్కన నివసించాలని ఎవరికీ ఉండదు.ఎంతో కష్టాల్లో ఉన్న నిరుపేదలే అక్కడ ఉంటారు. అలాంటి వారికి మంచి కాలనీలు కట్టించాలని, వారి పిల్లలకు చదువులు చెప్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే, విపక్షం మాత్రం వాళ్లు అక్కడే ఉండాలని కోరుకుంటోంది. విపక్ష నేతలు వర్షాలు ఉన్నప్పుడు మూసీ ప్రాంతంలోని ఇళ్ళల్లో ఎందుకు పడుకోలేదు?. ఇప్పుడైనా సగం కాలిపోయి, కుళ్ళిపోయిన శవాలున్న మూసీ ప్రాంతంలో పడుకోవాలి. నన్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు. అది ఒక పరిశ్రమ.. అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి..’అని సీఎం చెప్పారు. మూసీలో నిరంతరం స్వచ్ఛమైన నీరు ‘మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. కంపెనీల కలుíÙత జలాల నుంచి జంతువుల కళేబరాల వరకు మూసీలో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ నది ప్రక్షాళనే ప్రభుత్వ లక్ష్యం. ప్రక్షాళనతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేస్తాం. లండన్ థేమ్స్ నదిని, న్యూయార్క్ జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఇలాంటి ప్రక్షాళన పనులు పరిశీలించాం.మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్ధం చేశాం. 20 టీఎంసీల గోదావరి జలాలు తరలించి 15 టీఎంసీలు తాగు నీటి అవసరాలకు, 5 టీఎంసీలు మూసీలో నిరంతరం స్వచ్చమైన నీరు పారించేందుకు ఉపయోగిస్తాం. మార్చి 31 లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలుస్తాం. ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ. 4 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచి్చంది. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నాం. ఓల్డ్ సిటీ ఎప్పటికీ ఒరిజినల్ సిటీయే. దాన్ని నిర్లక్ష్యం చేయం. మూసీ ప్రక్షాళనకు అందరూ సహకరించాలి..’అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. బుల్డోజర్లకు అడ్డు పడతాం: హరీశ్రావు బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావు ఈ అంశంపై చర్చలో పాల్గొన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ళు కూలగొడితే తమ పార్టీ సహించదని, బుల్డోజర్లకు అడ్డుపడతామని అన్నారు. మూసీలో ఇప్పటివరకు ఎన్ని ఇళ్ళు తొలగించారో, ఎంతమందికి ప్రత్నామ్నాయం చూపారో, ఇంకెన్ని ఇళ్ళు కూల్చాలనుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. మూసీ పునరుజ్జీవం వల్ల నిరాశ్రయులైన వారికి ఇప్పటివరకు ఎంత చెల్లించారో చెప్పాలని కోరారు. 2013 భూసేకరణ చట్టం కింద డబ్బులు ఇచ్చారా లేదా తెలపాలన్నారు. ఇటీవల వర్షాలు కురిసినప్పుడు మూసీ గేట్లు ఉద్దేశపూర్వకంగా ఎత్తివేసినట్టు తమ దృష్టికి వచి్చందని, ప్రభుత్వమే దీనికి అనుమతించినట్టు తెలిసిందని, ఇందులో వాస్తవం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సమగ్ర ప్రక్షాళన అవసరం: అక్బరుద్దీన్ ఓవైసీ మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సమగ్ర వివరాలను సభ ముందుంచాలని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. మూసీ నది ప్రారంభమయ్యే దగ్గర్నుంచి, అది ముగిసే వరకూ ప్రక్షాళన పనులు జరగాలని సూచించారు. హైదరాబాద్లో చారిత్రక కట్టడాలు ఉన్నాయని, వీటితో పాటు నగర సంస్కృతిని కాపాడాలని కోరారు. మైక్ కట్తో బీఆర్ఎస్ నిరసన సీఎం ప్రసంగం తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్..బీఆర్ఎస్ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. హరీశ్రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆమె కోరడంతో స్పీకర్ అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత సునీతా లక్ష్మారెడ్డికీ ఇదే పరిస్థితి ఎదురైంది. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. మూసీ పునరుద్ధరణకు సహకరిస్తామని, నిర్వాసితులకు ఇచ్చే పరిహారం గురించి చెప్పాలని తలసాని అన్నారు. తమకు కడపులో విషం ఉందని సీఎం అనడం సరికాదన్నారు. సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు జోక్యం చేసుకుని.. ముఖ్యమంత్రి ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యానించలేదని అన్నారు.అనంతరం హరీశ్రావుకు అవకాశం ఇవ్వగా..సభలో తమ హక్కులు కాపాడాలని ఆయన కోరారు. మూసీ కంపుకన్నా ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ ఉందంటూ విమర్శించారు. దీంతో హరీశ్రావు మైక్ను స్పీకర్ నిలిపివేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా యూరియా కొరతపై బీఆర్ఎస్, ఇతర అంశాలపై పలువురు ఇచి్చన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సీఎంపై హరీశ్రావు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్టు తెలిపారు. మూసీ పునరుజ్జీవంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు బాలూ నాయక్, శంకరయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, పాయల్ శంకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. -
ఫిబ్రవరిలో మున్సి'పోల్'
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల దిశలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ నెలలోనే ఎన్నికలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని, ఫిబ్రవరిలో ఈ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వా త కచి్చతంగా షెడ్యూల్ ప్రకటించి ఆ వెనువెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చనట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 11న లేదంటే 20న షెడ్యూల్ ప్రకటించే అవకాశా లున్నాయి. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. డబ్ల్యూఈఎఫ్ సమావేశాలకు సీఎం.. జనవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ఈనెల 19 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు 17 లేదా 18న సీఎం రేవంత్ బయలుదేరతారని తెలుస్తోంది. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగే సమావేశాల తర్వాత ఆయన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.ఈ పర్యటనను కూడా ముగించుకుని ఫిబ్రవరి 1న హైదరాబాద్కు వస్తారని, 3న జడ్చర్లకు వెళ్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. ఫిబ్రవరి 3న జడ్చర్లలో ఆయన ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత పలు జిల్లాల్లో పర్యటిస్తారు. గత రెండేళ్లలో ఆయన ఎక్కడెక్కడ పర్యటించారన్న దానిపై సీఎంవో వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ దఫా జిల్లాల పర్యటనలో గతంలో వెళ్లని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని, ఈ మేర కు షెడ్యూల్ తయారవుతోందని సమాచారం. స్థానిక ఎన్నికలు పూర్తి చేస్తేనే..15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే.. స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తి చేయాలి. అప్పుడే కేంద్రం గ్రాంట్లు విడుదల చేసేందుకు సాధ్యమవుతుంది. దాదాపు రూ.500 కోట్ల ని ధులు రాకుండా ఆగిపోయిన నేపథ్యంలో ము న్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఈ కార్పొరేషన్ను మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు తెలిసింది. అనంతరం 300 వార్డులను ఈ మూడు కార్పొరేషన్లకు సర్దుబాటు చేసిన అనంతరం ఓటర్ల జాబితాను ప్రకటించి...ఎన్నికలు వచ్చే మే లేదా జూన్లో నిర్వహించే అవ కాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ హరీష్ రావు కౌంటర్
-
నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది: సీఎం రేవంత్ రెడ్డి
-
మూసీ ప్రాంతంలో ప్రతిపక్ష నేతలు ఉంటారా?: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మూసీకి శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెండేళ్లలో గండిపేటకు గోదావరి నీళ్లను తీసుకొస్తామన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యలు చేశారు. ప్రణాళికబద్దంగా మూసీ ప్రక్షాళన జరుగుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండగలరా?’ అని ప్రశ్నించారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ..‘మూసీ ప్రక్షాళనపై సభ్యులు సూచనలు చేశారు. సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య వరద ముంపు పరిష్కారం చూపారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది. చాలా దేశాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి కొనసాగుతోంది. మూసీ నది అనంతగిరిలో మొదలై 240 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈసా, మూసా నదులు బాపూఘాట్ దగ్గర కలుస్తాయి. అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టాం.మూసీ ప్రక్షాళనపై నెలల తరబడి అధికారులతో సమీక్షలు చేశాం. ప్రణాళికబద్దంగా మూసీ ప్రక్షాళన జరుగుతుంది. ఈసా, మూసా నదులను గోదావరి నీళ్లతో నింపుతాం. రెండేళ్లలో గండిపేటకు గోదావరి నీళ్లను తీసుకొస్తాం. సంక్రాంతిలోగా ఫస్ట్ ఫేజ్పై క్లారిటీ వస్తుంది. ఫస్ట్ఫేజ్లో గండిపేట నుంచి గౌరెల్లి వరకు ప్రక్షాళన జరుగుతుంది. మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ది జరుగుతుంది. వచ్చే మూడు నెలల్లో అంచనాలు ఫైనల్ చేస్తాం. మూసీని కలుషితం చేయడంతో నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. మనుషులు నివాసం ఉండటానికి సాధ్యం కాని విధంగా నల్లగొండ జిల్లా మారిపోయింది. ఫ్లోరైడ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ ప్రాంతంలో ఫ్లోరైడ్ కారణంగా బిడ్డలు అంగవైకల్యంతో పుడుతున్నారు. మూసీ నదిలో నీళ్లు పారాల్సిందేనని అధికారులకు ఆదేశిలిచ్చాం. శాశ్వతంగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం.గండిపేటలో ఆగర్భశ్రీమంతులు ఫామ్హౌస్లు కట్టుకున్నారు. ఫామ్హౌసులు కట్టుకుని డ్రైనేజీ నీళ్లను గండిపేట చెరువులో కలిపారు. గండిపేట, మొయినాబాద్లో ఫామ్హౌస్లు కట్టుకున్న వాళ్లు లక్షలు, కోట్లు ఖర్చు చేసి నాపై సోషల్ మీడియాలో బద్నాం చేయించారు. అయినా మేం భయపడలేదు. గుజరాత్లో సబర్మతి ప్రాజెక్ట్ చేపట్టి 60వేల కుటుంబాలను తరలించారు. యూపీలో కూడా గంగా నది ప్రక్షాళన కోసం ఇళ్లు కూల్చారు. ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పారు. నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారు. మూసీ ప్రక్షాళనకు ఎంత అవుతుందో ఇప్పుడే చెప్పలేం. మూసీ పరివాహక ప్రాంతాల్లో శివాలయం, గురుద్వార్, మసీదు, చర్చి నిర్మిస్తాం. మూసీ ప్రక్షాళన జరగలా వద్దా?.. ప్రతిపక్ష నేతలు చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు నివాసాలు కల్పిస్తామంటే అడ్డుకుంటున్నారు. ప్రతిపక్ష నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండగలరా?’ అని ప్రశ్నించారు. -
టీఎంసీల్లో అబద్ధాలు.. క్యూసెక్కుల్లో అజ్ఞానం
సాక్షి, హైదరాబాద్: నదీ జలాల విషయంలో సీఎం రేవంత్రెడ్డి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన రేవంత్కు అంతర్జాతీయ స్థాయి అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. సీఎంకు నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్) గురించి కనీస అవగాహన లేదని, బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునళ్ల నడుమ తేడా కూడా తెలియదన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అవమానించం అంటూనే కసబ్తో పోలుస్తారా? ‘నిరాహార దీక్షతో కాంగ్రెస్ మెడలు వంచి తె లంగాణ సాధించిన మహనీయుడు కేసీఆర్. ఆయనకు సభకు వస్తే అవమానించం అని ముఖ్యమంత్రి చెబుతూనే కసబ్తో పోలుస్తున్నాడు. సంస్కారం, మర్యాద తెలియని రేవంత్కు అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగాలు మాత్రమే తెలుసు. పో లవరం, నల్లమలసాగర్ విషయంలో మేము వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ‘గోదావరి బనకచర్ల’విషయంలో ఉమ్మడి కమిటీ వేసిన విషయాన్ని దాచిపెట్టి ఏపీ జల దోపిడీకి రేవంత్ తలుపులు తెరిచాడు..’అని హరీశ్రావు ఆరోపించారు. కృష్ణా వాటాలపై పచ్చి అబద్ధాలు ‘కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటాకు కేసీఆర్ ఒప్పుకున్నారని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. 811 టీఎంసీలు పునఃపంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని చెప్పడం లేదు. 811 టీఎంసీల్లో తెలంగాణకు 69 శాతం వాటా దక్కాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీశారు. సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పునఃపంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామీ మేరకే కేసు విత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసినా రేవంత్ అసత్య ప్రచారం చేస్తున్నాడు’ అని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజ్ఞానం బయట పెట్టుకున్నారు.. ‘కృష్ణా నీరు అంతా జూరాలకే వస్తుందంటూ రేవంత్ అజ్ఞానం బయట పెట్టుకున్నాడు. తుంగభద్ర ద్వారా శ్రీశైలం రిజర్వాయర్కు 450 నుంచి 600 టీఎంసీలు ప్రతి ఏటా వస్తాయనే జ్ఞానం లేదు. జూరాలపై ‘పాల మూరు–రంగారెడ్డి ప్రాజెక్టు’భారం మోపితే ఆయకట్టు దెబ్బతింటుందని జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ రైతులకు తెలుసు. రెండేళ్లుగా పాలమూరు–రంగారెడ్డి కోసం ఒక్క అనుమతి తేకపోగా, డీపీఆర్ కూడా వెనక్కి వచ్చింది..’అని మాజీమంత్రి విమర్శించారు. -
'పాలమూరు'పై విచారణ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన నీటి వనరు (సోర్సు)ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వెనుక లోతైన అవినీతి పునాదులున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ‘పాలమూరు ప్రాజెక్టు సోర్సు మార్చడానికి మంత్రివర్గ ఆమోదం లేదు. నేను ఇదే అడుగుదామనుకుంటే కేసీఆర్ సభకు రావడం లేదు. కొందరు ఇరిగేషన్ అధికారులతో ఇటీవల జరిపిన సమీక్షలో విచారణకు ఆదేశిద్దాం..మార్గదర్శకాలు (టీఓఆర్) సిద్ధం చేయండి అని ఆదేశించా..’ అని సీఎం తెలిపారు. ఈ వాసన (విషయం) పసిగట్టిన బీఆర్ఎస్ నేత హరీశ్రావు నాటి నుంచి కృష్ణా జలాలపై చర్చను వదిలేసి నల్లమల్లసాగర్పై మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘జూరాల నుంచి శ్రీశైలంకు ఎందుకు మార్చారు?..ఎవరి బాగోగుల కోసం మార్చారు?..రూ.వేల కోట్ల కమీషన్లు ఎవరి ఇంటికి వెళ్లాయి?.. తెలంగాణకు జరిగిన నష్టం ఏమిటి? అన్న దానిపై విచారణకు ఆదేశించాలి..’ అని అన్నారు. కృష్ణా ప్రాజెక్టులపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు గురువారం ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ముగింపులో రేవంత్ మాట్లాడారు. జూరాల నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలే కావడంతో 300 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంకు ‘పాలమూరు’ ప్రాజెక్టు సోర్సును మార్చామంటూ మాజీమంత్రి హరీశ్రావు చేసిన వాదనను ఆయన తోసిపుచ్చారు. సభలో మాట్లాడదాం రండి కేసీఆర్.. ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు వనరు (సోర్సు)ను తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలనే అత్యంత కీలక నిర్ణయాన్ని మంత్రివర్గానికి బదులు వ్యక్తిగత స్థాయిలో తీసుకున్న వ్యక్తి (కేసీఆర్)ని శిక్షించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. అదే తరహాలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును మార్చారు. దీనిపై సభలోనే మాట్లాడదాం రండి కేసీఆర్.. పాలమూరు కోసం రోజుకు 2 టీఎంసీల చొప్పున 35 రోజులు జూరాల వద్ద నీళ్లు తీసుకోవచ్చని నాటి సీఈ నివేదిక ఇచ్చారు. అయితే రోజుకు 3 టీఎంసీల చొప్పున 30 రోజుల్లో 90 టీఎంసీలను జూరాల వద్దే తీసుకునే అవకాశం ఉండేది. అప్పుడు పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి, రాయలసీమ లిఫ్టు ద్వారా తరలించుకోవడానికి శ్రీశైలంలో ఏపీకి నీళ్లు లభించేవి కాదు. తెలంగాణను కేసీఆర్, హరీశ్ అచేతనావస్థలోకి నెట్టేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేసీఆర్, హరీశ్ను ఉరేసినా తప్పులేదు. వారి పాలనలో శ్రీశైలం నుంచి నీళ్లను తరలించుకు సామర్థ్యాన్ని ఏపీ 4.5 నుంచి 13 టీఎంసీలకు పెంచుకుంది..’ అని సీఎం అన్నారు. కిరణ్కుమార్రెడ్డి లెక్కలకు కేసీఆర్ సమ్మతి ‘రాష్ట్ర విభజనకు ముందు నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి ఏపీకి ప్రయోజనం చూకూర్చాలనే ఉద్దేశంతో కృష్ణా బేసిన్లో ఏపీ ప్రాజెక్టులు 512, తెలంగాణ ప్రాజెక్టులు 299 టీఎంసీలు వాడుకుంటున్నాయని లెక్కలు తీయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య (తాత్కాలికంగా) నీటి పంపిణీ కోసం కేంద్రం నిర్వహించిన సమావేశంలో.. నాటి తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు పాల్గొని నికర జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటాలో ఏపీకి 512 (66%), తెలంగాణకు 299 టీఎంసీలు(34%) సరిపోతాయనే లెక్కల ఆధారంగానే ఒప్పందం చేసుకుని తెలంగాణకు తీవ్ర ద్రోహం చేశారు. తొలుత ఏడాది కోసం చేసుకున్నా, ఆ తర్వాత వరుసగా మరో రెండేళ్లు ఈ ఒప్పందాన్ని పొడిగించేందుకు కేసీఆర్, హరీశ్ సమ్మతి తెలిపారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకు ఈ ఒప్పందాన్నే కొనసాగించాలని, అప్పటి వరకు మళ్లీ ఈ సమావేశాలకు రావాల్సిన అవసరం లేకుండా ‘వన్స్ ఫర్ ఆల్’ సంతకం పెడుతున్నట్టు 2020లో కేసీఆర్ కేంద్రానికి తేల్చి చెప్పి వచ్చారు. ‘‘నాకు మల్లమల్ల డిస్ట్రర్బ్ చేయకురి..ఫార్మ్హౌస్లో ఉంటా’’ అని సంతకం పెట్టి కృష్ణా జలాలపై ఏపీకి శాశ్వతంగా 66 శాతం హక్కు ఇచ్చిండు..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. మా వాదనలతో ఏపీ ఉక్కిరిబిక్కిరి ‘ఏ రాష్ట్రంలో పరీవాహక ప్రాంతం ఎంత దామాషాలో ఉంటే అంత వాటాను ఆ రాష్ట్రానికి ఇవ్వాలనే అంతర్జాతీయ సూత్రాల ప్రకారం తెలంగాణకు 71 శాతం, ఏపీకి 29 శాతం కృష్ణా జలాలు కేటాయించాలని, ఆ లెక్కన మాకు 555 టీఎంసీలు వస్తాయని మేము వచ్చాక ట్రిబ్యునల్ ఎదుట తొలి వాదనగా వినిపించాం. అపెక్స్ కౌన్సిలో కేసీఆర్ ఈ వాదన, కృష్ణా జలాలను పెన్నా బేసిన్కు తరలించకుండా ఏపీని అడ్డుకోవాలని మరో వాదన చేసి ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరిగి ఉండేది కాదు. 2014–23 మధ్య కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో కృష్ణా జలాలపై ఏపీ పూర్తి ఆధిపత్యం సాధించింది. 65 శాతం లభ్యతతో ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్ కేటాయించిన 1,005 టీఎంసీల్లో తెలంగాణకు 763 టీఎంసీలు ఇవ్వాలని మేము ట్రిబ్యునల్ ఎదుట రెండోసారి వాదన వినిపించడంతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అయింది. తెలంగాణ సమర్థవంతంగా వాదనలు వినిపిస్తోంటే ఏపీ ప్రభుత్వం ఎక్కడా నిలువరించలేకపోతోంది. కానీ జూబ్లీహిల్స్, సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తప్పకపోవడంతో బీఆర్ఎస్ మనుగడే ప్రమాదంలో పడిందని బయటకు వచ్చిన కేసీఆర్ ..ఏపీకి సీఎం రేవంత్ సహకరిస్తున్నాడనే ఒక అపోహాను కలిగించి మళ్లీ జల వివాదాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కేసీఆర్, హరీశ్రావు ఏం చెప్పినా తూకం వేస్తే 24 క్యారెట్లు అబద్ధంగా తేలుతుంది..’ అని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ, పాలమూరు ..ఫార్ములా సేమ్ ‘రీడిజైనింగ్ పేరుతో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించి ప్రాణహిత–చేవెళ్ల అంచనాలను రూ.35 వేల కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్లకు పెంచడంలో వాడిన ఫార్ములానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు తరలించడానికి వాడారు. ఇలా పంపులు, లిఫ్టులు పెంచితే కనకవర్షం కురుస్తుందనేది తప్ప కేసీఆర్ మరే ఫార్ములా కనిపెట్టలేదు. జూరాల నుంచి నీళ్లను తీసుకునేలా ‘పాలమూరు’ను చేపడితే అంతర్రాష్ట్ర వివాదాలు ఉండేవి కావు. పంపులు, లిఫ్టులకు బిల్లులు ఇవ్వడానికి కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి ‘పాలమూరు’ సాగునీటి ప్రాజెక్టు కాదని, 7.15 టీఎంసీలతో తాగునీటి ప్రాజెక్టుగా కట్టుకుంటామంటూ అఫిడవిట్ వేసి ఆ మేరకు పనులకే 2023లో అనుమతి పొందారు. కేసీఆర్, హరీశ్రావు కారణంగా రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కమీషన్ల కోసం పంపులు, లిఫ్టుల కంపెనీకి రూ.27 వేల కోట్ల చెల్లింపులు చేశారు..’ అని సీఎం ఆరోపించారు. అన్నీ బయటపెడతాననే సభకు రావడం లేదు.. ‘మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలు, గోదావరి జలాల మళ్లింపుతో లభ్యతలోకి వచ్చిన 45టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలతో ‘పాలమూరు’ ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వాలని ఈ ప్రబుద్ధుడే (కేసీఆర్) పిటిషన్ వేస్తే, గోదావరి జలాల మళ్లింపుతో లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీలపై నిర్ణయాధికారం సీడబ్ల్యూసీకి లేదని, ట్రిబ్యునల్ చేయాల్సి ఉంటుందని ఏపీ అభ్యంతరం తెలిపింది. మైనర్ ఇరిగేషన్లో ఆదా చేసిన 45 టీఎంసీలకు సంబంధించి 30 ఏళ్ల డేటా సీడబ్ల్యూసీ కోరితే గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. మేము వచ్చాక అధ్యయనం చేయించి వివరాలను సమర్పించడంతో పాటు తొలి దశ కింద ఆ 45 టీఎంసీలు వాడుకోవడానికి అనుమతి కోరుతూ మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు. పీఎంకేఎస్వై కింద 60 శాతం కేంద్ర నిధులతో పాటు 7.25 శాతం తక్కువ వడ్డీతో రుణాలు లభిస్తాయనే అనుమతులు కోరాం. రూ.84 వేల కోట్ల అంచనాల్లో రూ.50 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది..’ అని రేవంత్ వివరించారు. ‘సమస్యలు పరిష్కారమైతే.. ప్రాజెక్టులు పూర్తైతే కేసీఆర్కు శాశ్వతంగా జలసమాధి జరుగుతుందన్న భయంతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించాలని వారు ప్రయత్నిస్తున్నారు. నేను తారీఖులతో సహా ఆయన సంతకం చేసిన ప్రతిలేఖ, చేసుకున్న ఒప్పందాలు, పెంచిన అంచనాలను బయటపెట్టి ప్రశ్నిస్తాననే శాసనసభకు రావడం లేదు..’ అని రేవంత్ విమర్శించారు. -
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సియం ఎ.రేవంత్ రెడ్డి
హైద్రాబాద్: జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, తన పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను తన దృష్టికి తెస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రతినిధి బృందం సచివాలయంలో సియంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. అలాగే యూనియన్ రూపొందించిన 2026 మీడియా డైరీని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది. ఈ సందర్భంలో జర్నలిస్టులకు నూతన సంవత్సర కానుకగా సంక్షేమ పథకాలు అందించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ ముఖ్యమంత్రిని కోరగా, ఆయన పై విధంగా స్పందించారు.ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, కార్యదర్శులు వి.యాదగిరి, కె. శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం. వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కిరణ్ కుమార్, అజిత, చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్. హరి, ఉర్దూ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గౌస్ మోహియుద్దీన్, వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరీష్ లు ఉన్నారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని యూనియన్ ప్రతినిధి బృందం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.సీయంకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాస్ రెడ్డితెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి గురువారం నాడు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
‘కేసీఆర్ నిర్ణయాలతోనే తెలంగాణకు నీళ్ల వాటా తగ్గింది’
సాక్షి, హైదరాబాద్: ఏపీ నీటి చౌర్యం చేస్తున్నా.. మనం మనవాటా వాడుకోలేని స్థితి అంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు హాజరైన సీఎం.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టు మార్పు చేశారని.. తల వదిలేసి తోక దగ్గర నీళ్లు తెచ్చేలా ప్రాజెక్ట్ అంటూ దుయ్యబట్టారు.కేసీఆర్ నిర్ణయాలతోనే తెలంగాణకు నీళ్ల వాటా తగ్గిందని సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణ వినియోగిస్తున్న నీటి లెక్కలు చూస్తే ఆశ్చర్యమేస్తోందన్న రేవంత్.. కేసీఆర్ నిర్ణయాలతోనే ఏపీకి ఎక్కువ నీళ్లు వెళ్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. పంపులు పెరిగితే కమీషన్లు ఎక్కువ వస్తాయనేది బీఆర్ఎస్ ప్లాన్. కృష్ణాలో 550 టీఎంసీల నీళ్లు ఇవ్వాలనే వాదనను కేసీఆర్ వినిపించలేదు’’ అంటూ సీఎం విమర్శించారు.‘‘ఎలాంటి అనుమతులు లేకుండా పాలమూరు చేపట్టారు. ఏడేళ్ల వరకు పాలమూరు డీపీఆర్ కూడా తయారు చేయలేదు. రూ.32వేల కోట్ల ప్రాజెక్టును రూ.80 వేల కోట్లకు పెంచారు’’ అని సీఎం రేవంత్ ఆరోపించారు. -
నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. రేవంత్ ప్లానేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రజాభవన్ వేదికగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చ, నీటి కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది.వివరాల మేరకు.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కాంగ్రెస్ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, కార్పోరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు వారికి ఆహ్వానం అందింది.ఈ సమావేశంలో కృష్ణ-గోదావరి నదీజలాల నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే, నీటి కేటాయింపులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2014 నుంచి నేటి వరకు కృష్ణా-గోదావరి నదిలో నీటి కేటాయింపులు , బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలపై ముఖ్యమంత్రి రేవంత్ అవగాహన కల్పించనున్నారు. రేపు అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సమావేశంలో అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. -
నీళ్ల బాధ నీకేం తెలుసు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–బనకచర్ల లింకు ప్రాజెక్టుకు తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండానే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ నీటి ప్రయోజనాలకు భారీగా గండి పడుతుందన్నారు. ‘రేవంత్... నీళ్ల బాధ నీకేం తెలుసు, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని ఆంధ్రాకు, చంద్రబాబుకు దాసోహం అనడం మానుకో’ అని సీఎంకు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అనుమతులు వచ్చాయని, ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్ర వీడాలని హితవు పలికారు. హరీశ్రావు మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. పేరు ఏదైనా జలదోపిడీ తెలంగాణ నుంచే...‘గోదావరి–బనకచర్ల ద్వారా జలదోపిడీకి యత్నించిన ఏపీ.. నష్టాన్ని తగ్గించుకునేందుకు గోదావరి నల్లమలసాగర్ లింకు పేరిట ప్రతిపాదనల్లో మార్పు చేసింది. బనకచర్ల, నల్లమలసాగర్ పేరు ఏదైనా జరిగేది తెలంగాణ జలదోపిడీ మాత్రమే. నల్లమల సాగర్ అక్రమ నిర్మాణానికి చంద్రబాబు సూత్రధారి, సీఎం రేవంత్ పాత్రధారి. కత్తి చంద్రబాబుది అయినా జలద్రోహానికి పాల్పడుతూ రేవంత్ తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. బనకచర్ల ముప్పును ముందుగా పసిగట్టి బీఆర్ఎస్ బల్లెం పట్టి పొడిచినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. బనకచర్లపై కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లి రేవంత్ సంతకం చేయడాన్ని మేము ఎండగడితే బండారం బయట పడింది. బనకచర్ల ప్రతిపాదన విరమించుకుంటున్నట్లు ఏపీ ప్రకటించినా పోలవరం– నల్లమలసాగర్ లింకు ప్రతిపాదించింది. పోలవరం బనకచర్ల లింకు ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా బేసిన్కు తరలిస్తే, గోదావరి అవార్డు ప్రకారం 45:21:14 నిష్పత్తిలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణా జలాల్లో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణకు నీటి వాటా దక్కకుండా ఉండేందుకు కృష్ణా బేసిన్కు బదులుగా పెన్నా బేసిన్కు గోదావరి నీటిని తరలించే కుట్రకు రేవంత్ పాల్పడుతున్నాడు. తెలంగాణతో సహా కర్ణాటక, మహారాష్టకు నీటి వాటా దక్కకుండా గంపగుత్తగా తరలించేందుకు ‘పోలవరం నల్లమలసాగర్’ పేరిట ఏపీ ప్రభుత్వం భారీ కుట్ర చేస్తోంది. ఈ కుట్రను కర్ణాటక, మహారాష్ట్ర అర్థం చేసుకున్నా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయిలేదు’ అని హరీశ్రావు మండిపడ్డారు.దోపిడీదారుల ఏజెంట్ ఆదిత్యనాథ్ దాస్‘రెండు రాష్ట్రాల నడుమ జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన సంయుక్త కమిటీలో చంద్రబాబు దాసుడు, దోపిడీదారుల ఏజెంట్, తెలంగాణ నీటి హక్కులకు సైంధవుడిలా అడ్డుపడిన ఆదిత్యనాథ్దాస్తోపాటు ఏపీ మూలాలు కలిగిన మరో ఇద్దరిని రేవంత్ ప్రభుత్వం నియమించింది. పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టులకు తెరవెనుక సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్ అయితే రేవంత్ జలద్రోహిలా తయారైండు. కేంద్రం ఇచ్చిన అనుమతుల ప్రకారం 200 టీఎంసీల జలాలు ఏపీ తీసుకుపోయే వెసులుబాటు ఉంది. బనకచర్ల విషయంలో ఇప్పటికైనా నిద్రలేచి సలహాదారు పదవి నుంచి ఆదిత్యానాథ్ దాస్ను తొలగించడంతోపాటు జల వివాదాల పరిష్కార కమిటీ నుంచి కూడా తెలంగాణ వైదొలగాలి. బనకచర్ల అనుమతులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అలాగే, సీడబ్ల్యూసీ అనుమతుల రద్దు కోసం ఢిల్లీలో ధర్నా చేద్దాం’ అని హరీశ్రావు చెప్పారు. -
సంక్రాంతికి రైతుభరోసా!
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో రాష్ట్రంలోని రైతులకు రేవంత్రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పబోతోంది. యాసంగి సీజన్కు సంబంధించిన ‘రైతు భరోసా’ మొత్తాన్ని సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... యాసంగి సీజన్ కింద రైతులకు ఇచ్చే రైతు భరోసా కోసం వ్యవసాయ, ఆర్థిక శాఖలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. డిసెంబర్లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆశించిన మేర విజయాలు సాధించగా, కొత్త సంవత్సరం ప్రథమార్థంలో జిల్లా, మండల పరిషత్, మునిసిపల్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు యాసంగి రైతు భరోసాను ‘పెట్టుబడి సాయం’కింద ముందుగానే అందజేయడం ద్వారా ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని అంచనా వేసిన సీఎం రేవంత్రెడ్డి అందుకనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసినట్లు సమాచారం.ఇప్పటి వరకు రైతు భరోసా ఇచ్చినట్లుగానే ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ ‘రైతుభరోసా’అమలు చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. కోటిన్నర ఎకరాలకు అందించే అవకాశం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘రైతు బంధు’పథకాన్ని రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ‘రైతు భరోసా’గా మార్చి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రెండు విడతలుగా రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ. 6వేల చొప్పున జమ చేసింది. 2024–25 యాసంగి సీజన్లో ఆలస్యంగా రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసినప్పటికీ, మొన్నటి వానకాలం సీజన్లో మాత్రం సరైన సమయంలోనే రైతు భరోసా అందించింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా రైతులకు పెట్టుబడికి అందేలా సంక్రాంతి నాటికే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా గత వానకాలం సీజన్లో 69.40 లక్షల మంది రైతులకు సంబంధించిన 145.73 లక్షల ఎకరాలకు రైతు భరోసా మొత్తాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇందుకోసం వెచ్చించిన మొత్తం రూ. 8,744.13 కోట్లు. ఈసారి కూడా దాదాపు అంతే మొత్తంలోగానీ, ఆ సీజన్లో మిస్సయిన ఇతర రైతులందరికీ కలిపి రూ.150 లక్షల (కోటిన్నర) ఎకరాలకు గాని అందించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సాగు భూములకే రైతు భరోసా అంటూ... శాటిలైట్ సర్వే 2024 యాసంగిలో రైతు భరోసా విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం సాగు యోగ్యమైన భూములన్నింటికీ ఈ పథకాన్ని వర్తింప జేయనున్నట్లు తెలిపారు. తదనుగుణంగానే ఒక్కో సీజన్కు రూ. 9వేల కోట్ల వరకు వెచ్చించేందుకు సీఎం రేవంత్రెడ్డి అంగీకారం తెలిపారు. అయితే ఈసారి యాసంగిలో సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఇందుకోసం సాగు విస్తీర్ణాన్ని లెక్కకట్టేందుకు శాటిలైట్ సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని భూముల్లో సర్వే చేశారు కూడా. జిల్లాల్లో ఏఈవోలు సాగు భూముల సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతికి సాగు చేసే భూముల ఇప్పటికిప్పుడు లెక్కలు రావు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు కాగా, కాగా గత సంవత్సరం యాసంగిలో 79.54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అయితే ఈసారి సాగుతో సంబంధం లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా అందించాలని భావిస్తున్న నేపథ్యంలో సంక్రాంతి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. -
సిటీని క్యూర్ చేద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని మహానగరాన్ని పూర్తి కాలుష్య రహితంగా మార్చడంలో భాగంగా ప్లాస్టిక్ను నిషేధించడంతో పాటు డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రికల్ వాహనాలను (ఈవీలు) ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. రహదారులపై గుంతలు, చెత్త ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించడానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి వీలుగా సమూల ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించినట్లు చెప్పారు. పరిపాలనను పట్టాలెక్కించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని, అందుకు అధికారులు కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్లకు దిశా నిర్దేశం చేశారు. చెరువులు కాపాడుకోవాలి ‘సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన చేపడుతున్నాం. జోనల్ కమిషనర్లు జనవరి నుంచి ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలి. హైదరాబాద్ నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మీదే. రోడ్లపై ఎక్కడా చెత్త, గుంతలు ఉండకూడదు. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలి. వీటితో పాటు చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు జనవరి నుంచి నాలాల్లో పూడికతీత పనులు మొదలు పెట్టాలి. యాక్టివిటీ జోన్స్గా పెద్ద చెరువులు 12 జోన్లలోని చెరువులు, కుంటలు, నాలాలను పూర్తిగా మ్యాపింగ్ చేయాలి. ఆక్రమణలను తొలగించి వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. పెద్ద చెరువులను గుర్తించి వాటిని పునరుద్ధరించి యాక్టివిటీ జోన్స్గా అభివృద్ధి చేయాలి. నెలకు 3 రోజులు పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. జనన, మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఆన్లైన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్కు మారాలి. వీధి దీపాలన్నీ వెలగాలి నగరంలో ఏ ప్రాంతం అంధకారంలో ఉండడానికి వీల్లేదు. వీధి దీపాలు సరిపడా ఉండడమే కాదు.. అవి వెలిగేలా చర్యలు తీసుకోవాలి. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్ చర్యలు చేపట్టాలి. ప్రతి పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ (చెత్త తొలగింపు) డ్రైవ్ నిర్వహించాలి. సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్కు వచ్చే ఫిర్యాదులపై వీలైనంత త్వరగా స్పందించాలి. రాబోయే ఐదేళ్లకు కార్యాచరణను రూపొందించుకుని ముందుకు వెళ్లాలి. కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లతో నిత్యం సంబంధాలు, సమాచార వ్యవస్థ కలిగి ఉండాలి. క్యూర్ ఏరియాలోని ఆయా విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకుంటారు. అందరూ కలిసి పనిచేస్తేనే నగర భవిష్యత్తు బాగుంటుంది..’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం వద్దు.. ‘క్యూర్ పరిధిలోని హోటళ్లలో ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని కేటాయించి సొంత భవనాలు నిర్మించాలి. నెలకోసారి జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహిస్తా..’ అని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండీ అశోక్రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఈసారి ఎదురుదాడే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, రెండేళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల హయాంలో ఏం జరిగిందనే వాస్తవాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ విప్లకు సూచించారు. వాస్తవాలు తమకే అనుకూలంగా ఉన్నందున, ప్రజలకు ఆ వాస్తవాలను వివరించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకపడొద్దని చెప్పారు. ఈసారి జరిగే సమావేశాల్లో అధికార పక్షంగా అటాక్ (దాడి) మోడ్లోకి రావాలంటూ దిశానిర్దేశం చేశారు. సోమవారం తొలిరోజు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత తన చాంబర్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ విప్లతో ఆయన దాదాపు 35 నిమిషాల పాటు సమావేశమయ్యారు. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్షాలకు దీటుగా ఇవ్వాల్సిన సమాధానాలపై మార్గదర్శనం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..‘పాలమూరు–రంగారెడ్డి, కృష్ణా నదీజలాల పంపిణీ విషయంలో మనమే కేసీఆర్ను సవాల్ చేశాం. అసెంబ్లీకి వస్తే అన్నీ చర్చిద్దామంటూ ఆహ్వానించాం. ఇప్పుడు ఆయన వస్తాడో రాడో తెలియదు. ఒకవేళ వస్తే కథలు చెప్తారు. ఆ కథలే వాస్తవాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. అలా జరగడానికి వీల్లేదు. ప్రజలకు ఆ భావన కలగకూడదు. బీఆర్ఎస్ అబద్ధాలను మనం సమర్థంగా తిప్పికొట్టాలి. ఇందుకు అందరూ సిద్ధం కావాలి..’ అని సీఎం చెప్పారు. అబద్ధాలు, అన్యాయం వారి విధానం బీఆర్ఎస్ చేసే రాజకీయం అందరికీ తెలుసునని, అబద్ధాలు ఆడి ప్రజలను నమ్మించడమే కాకుండా అన్యాయంగా వ్యవహరించడం వారి విధానమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ‘ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ పడరాని పాట్లు పడుతోంది. అందుకే గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా, ఇప్పుడు వాళ్లకు అవకాశం కావాలని అడుగుతోంది. బీఆర్ఎస్ చెప్పాలనుకున్నది చెప్పనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ డిమాండ్ మొదలుపెట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమేకాకుండా, అసెంబ్లీలోనూ తీవ్రస్థాయిలో ఎండగట్టాలి. సుప్రీంకోర్టుకు ఇచ్చిన డాక్యుమెంట్లలో 7.1 టీఎంసీలు మాత్రమే చాలని ఏ విధంగా పేర్కొన్నారో నిలదీయాలి. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, బీమా ప్రాజెక్టులు గత కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమై దాదాపు పూర్తి కావొచ్చినా.. వాటిని కూడా మొత్తం పూర్తి చేయకుండా పాలమూరు జిల్లాపై బీఆర్ఎస్ సర్కారు కక్ష పూరితంగా వ్యవహరించిన అంశాన్ని ఎండగట్టాలి. పూర్తి అథారిటీ, లెక్కలతో జవాబులివ్వాలి పూర్తి అథారిటీ (సాధికారికంగా), లెక్కలతో సహా బీఆర్ఎస్కు దిమ్మతిరిగే సమాధానం ఇవ్వాలి. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలి. బీఆర్ఎస్తో సహా ఏ పార్టీ సభ్యుడు అడిగిన ఎలాంటి సందేహానికైనా జవాబిచ్చేలా ఉండాలి. సబ్జెక్టుల వారీగా సిద్ధం కావాలి. ప్రతి అంశంపై నోట్స్ తయారు చేసుకోవాలి. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వాలి. సమగ్రంగా చర్చలో పాల్గొనాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలి. 2వ తేదీ నుంచి జరిగే సమావేశాలకు ఎమ్మెల్యేలు ఎవరూ గైర్హాజరు కాకూడదు. ఈ మేరకు మంత్రులు, విప్లు సమన్వయం చేయాలి. కృష్ణా జలాలపై చర్చ జరగనున్నందున నది పరీవాహక ప్రాంతం పరిధిలోనికి వచ్చే ఎమ్మెల్యేలు ధీటుగా సమాధానమిచ్చేందుకు సిద్ధం కావాలి..’ అని సీఎం సూచించినట్టు సమాచారం. -
రేవంత్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మహేశ్వర్రెడ్డి
సాక్షి, వికారాబాద్: రేవంత్ రెడ్డి.. కేసీఆర్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొన్నారనే అనుమానం కలుగుతుందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ అవినీతిపై ఎందుకు కేసులు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మీడియా ముందు తొండలు జోర్రగొడతా అంటూ.. అసెంబ్లీలో కేసీఆర్ ముందు దండాలు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు.హిల్ట్ పాలసీపై చర్చ ఎందుకు పెట్టడం లేదు? గ్లోబల్ సమ్మిట్, విదేశీ పెట్టుబడులపై చర్చించే దమ్ము దైర్యం ఉందా?. లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ పోయాయి?. ప్రతి వర్గానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై చర్చించే దమ్ము దైర్యం ప్రభుత్వానికి ఉందా?. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి సమయం లేదా?. ప్రధాన ప్రతిపక్ష నేతతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని, పాలన గాలికి వదిలేశారు’’ అంటూ మహేశ్వర్రెడ్డి విమర్శలు గుప్పించారు. -
ఆ విషయం కేసీఆర్నే అడగండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్-రేవంత్ కరచలనం.. పలకరింపుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే.. కేసీఆర్ను తాను ముఖ్యమంత్రి హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు కదా అని రేవంత్ అంటున్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియా చిట్చాట్లో ఈ అంశంపై స్పందించారు. ‘‘కేసీఆర్ను నేను సీఎం హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో ఆస్పత్రిలోనూ కలిశాను కదా. నేను సభా నాయకుడ్ని. కాబట్టి అందరినీ గౌరవిస్తా. అందుకే కేసీఆర్ను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా. మరి సభలో నుంచి వెంటనే ఎందుకు వెల్లిపోయారే ఆయన్నే అడగాలి’’ అని రేవంత్ అన్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా.. తొలిరోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయారు. అయితే ఆయన వెళ్లే లోపు సభలో సీఎం రేవంత్, ప్రభుత్వం విప్లు, మంత్రులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సైతం కేసీఆర్ దగ్గకు వెళ్లి పలకరించి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆ సమయంలో కేటీఆర్, పాడి కౌశిక్రెడ్డి మినహా మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. అయితే.. రాకరాక సభకు వచ్చిన కేసీఆర్ కొద్దిసేపైనా సభలో ఉంటారనుకున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగా... బావుంది అని చెప్పారు. నా ఆరోగ్యం గురించి కూడా అడిగారు.. బావుందని చెప్పా. కేసీఆర్ హాస్పిటల్ లో దీక్ష చేశారు. నేను రోడ్లపై దీక్ష చేశాను. నేను ఒరిజినల్ ఉద్యమకారుడిని. తెలంగాణ కోసం పోరాడిన మాజీ శాసన సభ్యుల సంతాప తీర్మానం చదివే సమయంలో కేసీఆర్ బయటకి వెళ్లారు. మౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెల్తే బావుండేది అని కోమటిరెడ్డి అన్నారు.పెద్ద మనిషిగా కేసీఆర్ ను కలవడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కేసీఆర్ ను కలిశారు. నేనూ కేసీఆర్ను కలవాలి అనుకున్నా. కానీ, ఆయన చుటటూ దుర్మార్గులు ఉన్నారు. అందుకే కలవలేదు అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ అన్నారు. -
కేసీఆర్, రేవంత్ భేటీపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
-
అసెంబ్లీలో కేసీఆర్ కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్
-
అసెంబ్లీలో కేసీఆర్ ను పలకరించిన సీఎం రేవంత్
-
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అప్డేట్స్వారం రోజులు సభ నడపాలని బీఏసీ నిర్ణయంవారం తర్వాత మళ్ళీ బీఏసీ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయం20 రోజులు సభ నడపాలని బీజేపీ,15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్, సీపీఐ పట్టునెక్ట్స్ బీఏసీలో నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం తెలంగాణ ఉభయ సభలు జనవరి 2కు వాయిదాకాసేపట్లో బీఏసీ సమావేశందేని మీద చర్చ పెడుతున్నారో తెల్వదు: కేటీఆర్ముఖ్యమంత్రి కృష్ణా నది ఎక్కడ ఉన్నది అని అడుగుతారుభాక్రా నంగల్ ఏ రాష్ట్రంలో ఉన్నదో తెల్వని ముఖ్యమంత్రి రేవంత్పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అడ్డుకున్న వ్యక్తి ఇవాళ నీటిపారుదల శాఖ సలహా దారుడువీళ్ళు నీటిపారుదల శాఖ పై చర్చ అంటున్నారుదేనిమీద చర్చ పెడుతున్నారో తెల్వదునీటిపారుదల శాఖ పై కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారుకేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు అని చర్చకు మంత్రులు ప్రిపేర్ అవుతున్నారుకౌశిక్ రెడ్డి సభలో ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు మేడిగడ్డను ఎవరో బాంబులు పెట్టి పేల్చారని అన్నాడుబూతులు మాట్లాడాలి అంటే ఎన్ని రోజులైనా సభను పెడతారుసభ లో సబ్జెక్ట్ లేనప్పుడు ఎన్ని రోజులు నడుపుతారుహుజురాబాద్ లోని చెక్ డ్యాం పేల్చివేతలో రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పాత్ర ఉన్నది.ఆనాడు మేడిగడ్డ ను పేల్చారు అని ఇంజనీర్లు పిర్యాదు చేశారు.. అలాంటప్పుడు ఎందుకు మీరు విచారణ చేపట్టడం లేదురష్యా ఉద్యమం లో కాకువ డ్యాంను పేల్చారు.అలానే ఇక్కడ కూడా మేడిగడ్డను పేల్చారనీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ క్లుప్తంగా వివరించి చెప్పారుకేసీఆర్ కాసేపైనా ఉండాల్సింది: కోమటిరెడ్డిసభా సమరం.. మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగా? బావుంది అని చెప్పారు.నా ఆరోగ్యం గురించి కూడా అడిగారు... బావుందని చెప్పా.మాజీ ఎమ్మెల్యే లకు సంతాపం తెలిపితే సభలో లేకుండా కేసీఆర్ వెల్లిపోవడం సరైంది కాదుమౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెల్తే బావుండేదిఅధికార-ప్రతిపక్షం నడుమ బాంబుల గొడవతెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షం నడుమ బాంబుల గొడవబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వ్యాఖ్యలపై దుమారంమేడిగడ్డ ప్రాజెక్టును బాంబులు పెట్టి పేల్చేశారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిమేడిగడ్డ మాదిరిగానే తనుగుల చెక్ డ్యామ్ను కూడా బాంబుతో పేల్చేశారు: కౌశిక్రెడ్డికౌశిక్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుల తీవ్ర అభ్యంతరంకౌశిక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు కౌంటర్ బాంబులు పెట్టి పేల్చారని అనడం ఏంటి?.: ఎమ్మెల్యే నాగరాజు కౌశిక్రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి: ఎమ్మెల్యే నాగరాజుసభలో కాసేపు ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదంశాసనమండలి వాయిదాశాసన మండలిలో ముగిసిన సంతాప ప్రకటనలుదివంగత నేతలకు సంతాపం ప్రకటించిన మండలితెలంగాణ శాసనమండలి జనవరి 2కు వాయిదాబీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.రెండేళ్ల పాలనలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, అధికారులు సమీక్ష చేయలేదు.సిద్దిపేట ఇరిగేషన్ ను మంత్రి పట్టించుకోవడం లేదు.మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ పై లక్షల ఎకరాలు ఆయకట్టు ఆధారపడి ఉంది.ప్రభుత్వం సిద్దిపేట జిల్లా ఇరిగేషన్ పై సమీక్ష చేయాలిఆ ఎమ్మెల్యేలు అలా.. ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్న ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలుట్రెజరీ బెంచీల వైపు కూర్చున్న అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ఇటీవల ప్రకటించిన స్పీకర్ట్రెజరీ బెంచీలవైపు కూర్చున్న ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ఫిరాయింపు ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచీలలో కూర్చోవడాన్ని గతంలో తప్పు పట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుభాషపై బీజేపీ అభ్యంతరం.. మంత్రి వివరణవెంకటరమణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే @ అసెంబ్లీదిగజారి భాష మాట్లాడటం సరికాదుఒకరిని మించి మరొకరు మాట్లాడితే ఎలా ?ఒకరు తప్పు మాట్లాడితే మరొకరు సరిచేయాలిబూతు లు మాట్లాడటమే రాజకీయమా ?నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ వరకు మంత్రులు కూడా దిగజారి మాట్లాడుతున్నారుహైదరాబాద్ వరల్డ్ క్లాస్ అంటున్నారు.. మాటలు మాత్రం థర్డ్ క్లాస్ గా ఉంటున్నాయిశ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రి వివరణ.. మాకు భేషజాలు లేవువెంకటరమణ రెడ్డి తన పార్టీ నేతలకు సూచించాలిగౌరవ సభ్యుల గౌరవం కాపాడే విధంగా చూస్తాంశాసనసభలో ఇంట్రెస్టింగ్ సీన్అసెంబ్లీలో కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి కరచలనంప్రతిపక్ష నేత దగ్గరకు వెళ్లి మరీ షేక్హ్యాండ్ ఇచ్చిన సీఎం, మంత్రులుఆశీర్వాదం తీసుకున్న జూబ్లీహిల్స్ నూతన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్వందేమాతరం తర్వాత సభలో కనిపించని ప్రతిపక్ష నేతఅసెంబ్లీ అటెండెన్స్ రిజిస్ట్రర్లో సంతకం చేసిన కేసీఆర్అనంతరం.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన గులాబీ బాస్ఇటు ఫిరాయింపుల నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ సీన్అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వెనక కూర్చున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పార్టీ ఫిరాయింపు కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ప్రకటించిన స్పీకర్తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలుదివంగత నేతలకు సంతాపం తెలిపిన ఉభయ సభలుఅసెంబ్లీలో జీరో అవర్ ప్రారంభంప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలుతెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభంహాజరైన సీఎం రేవంత్, ప్రతిపక్ష నేత కేసీఆర్దివంగత నేతలకు సంతాప తీర్మానం చదివి వినిపిస్తున్న గడ్డం ప్రసాద్ఇటు తెలంగాణ శాసన మండలి సమావేశాలు ప్రారంభందివంగత నేతలకు మండలిలో సంతాపంసంతాప తీర్మానం చదివి వినిపిస్తున్న చైర్మన్ గుత్తా సుఖేందర్అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్రెడ్డిమరికాసేపట్లో మొదలుకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుఅసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్, మంత్రులుకేసీఆర్.. అటెండెన్స్కే పరిమితం కావొద్దు: కాంగ్రెస్ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలుకేసీఆర్ కేవలం అటెండెన్స్కే పరిమితం కావొద్దుహరీష్, కేటీఆర్ మధ్య గొడవలు పెరిగాయని.. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని పరజలు అనుకుంటున్నారుఅందుకే అసెంబ్లీలో జరిగే చర్చలోనూ కేసీఆర్ పాల్గొనాలిఅసెంబ్లీలో కేసీఆర్ భేటీమరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంఅసెంబ్లీకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేతబీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలతో సమావేశంఫిరాయింపులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలుమీడియా చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలుఏ పార్టీలో ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యే లు చెప్పుకోలేకపోతున్నారుఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ డోర్స్ క్లోజ్ఆ స్థానంలో ఇక కొత్తవారికి అవకాశంగ్రౌండ్లో బీఆర్ఎస్కు మంచి పట్టు ఉందిసర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదురు దెబ్బ తగిలిందిబీఆర్ఎస్కు 80 శాతం అనుకూల ఫలితాలు వచ్చాయికాంగ్రెస్కు అందుకే భయం మొదలింది.. మున్సిపల్ ఎన్నికలు పెడుతలేరుమున్సిపల్ ఎన్నికలకల్లా నన్ను లేకుండా చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోంది నేను లోపలకు పోయినా.. బయట పార్టీ చూసుకుంటదినేను ఎవరికీ.. దేనికి భయపడనుఅసెంబ్లీ వద్ద ఉద్రిక్తతఅసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణంఅసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన మాజీ సర్పంచ్లుపెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్గన్ పార్క్ వద్ద అదుపులో తీసుకున్న పోలీసులుఅసెంబ్లీకి బయల్దేరిన కేసీఆర్!మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంఅసెంబ్లీకి బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్నందినగర్ నివాసం నుంచి బయల్దేరిన కాన్వాయ్కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డిఅసెంబ్లీ వద్ద 1000 మంది పోలీసులుతెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులుఅసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటుచేసిన పోలీసులు..దాదాపు 1,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు..ఈరోజు మాజీ సర్పంచ్ లు తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ముట్టడికి పిలుపుదీంతో ముందస్తుగా మాజీ సర్పంచ్ అరెస్టు చేసిన పోలీసులుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది. సమావేశాలకు ఇటు అధికార కాంగ్రెస్.. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్.. అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి. ఎవరి తోలు ఎవరు తీస్తారో చూద్దామంటు సవాళ్లు విసురుకుంటున్నాయి. అయితే.. సభను హుందాగా నడుపుకుందామని అన్ని పక్షాలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు ఇవ్వడం గమనార్హం. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్పై ప్రతిపక్ష నేత కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తోలు తీస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. దానికి కౌంటర్గా సీఎం రేవంత్ చేసిన ప్రతివ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే కేసీఆర్ సభకి వచ్చి చర్చలో పాల్గొని ఆ ఆరోపణలు నిరూపించాలని కాంగ్రెస్ ప్రతిసవాల్ విసిరింది. మరోపక్క కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ పాలమూరు-రంగారెడ్డిపై కేసీఆర్ తన పదేళ్ల హయాంలో ఎందుకు పెట్టలేదని అధికార పార్టీకి చెందిన ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ తరుణంలో కేసీఆర్ తొలిసారి సమావేశాలకు హాజరవుతారనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోని నిర్ణయాలను ఎండగట్టడంతో పాటు గత రెండేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తామని ఒకవైపు మంత్రులు.. మరోవైపు అధికార ఎమ్మెల్యేలు, హామీల ఎగవేతతో పాటు జల వనరుల విషయంలో ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య ధోరణిని బయటపెడతామని బీఆర్ఎస్.. ఇంకోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్లు చేస్తున్న మోసాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని, సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ అంటోంది. ఈ సెషన్లోనే శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అలాగే.. ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన కొన్ని బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.షెడ్యూల్ ఇలా.. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. తొలుత.. శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు ఉంటుంది. ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఆపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, సీతక్క చర్చల కోసం వివిధ పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలు వాయిదా పడ్డ తర్వాత.. సమావేశాల ఎజెండా ఖరారు, ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.ఇరిగేషన్ ప్రధానాంశంగా..ఈసారి అసెంబ్లీ సమావేశంలో కృష్ణ గోదావరి నదీ జలాలు, ప్రాజెక్టుల పై ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గింపు పై చర్చించాలని పట్టుబడుతోంది గులాబీ పార్టీ. దానికి కౌంటర్గా.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. ఇలాంటి చర్చే గనుక జరిగితే తమకూ పీపీటీ ప్రజంటేషన్కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరే అవకాశం లేకపోలేదు.హైదరాబాద్కు కేసీఆర్కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారనే అంశంపై బీఆర్ఎస్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఇప్పటిదాకా ఆయన రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అయితే.. ఆయన ఆదివారం హైదరాబాద్కు చేరుకోవడంతో కచ్చితంగా హాజరు కావొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఈ ఉదయం నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యి సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. -
‘పాలమూరు’కు బీఆర్ఎస్ ద్రోహాన్ని ఎండగట్టాలి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ఆధారాలతో ఎండగట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలించడానికి 2013లో ఈ ప్రాజెక్టును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించగా, జూరాల ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణ ఆధీనంతో ఉండటంతో ఎలాంటి సమస్యలు వచ్చేవి కావని గుర్తుచేశారు. జూరాలకు వచ్చే నీళ్లను వచ్చినట్టు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా తరలించుకోవడానికి అవకాశం ఉండేదన్నారు. జూరాలకు బదులు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నాటి సీఎం కేసీఆర్ రీడిజైన్ చేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం వేగం పాలమూరుపై చూపలేదు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనుసరించిన వేగాన్ని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో అనుసరించలేదని గత బీఆర్ఎస్ సర్కారును సీఎం రేవంత్ ఎండగట్టారు. శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి అనుమతులు, నీటి కేటాయింపుల విషయంలో ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందన్నారు. జూరాల నుంచే ప్రాజెక్టును చేపట్టి ఉంటే ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యేదని, అంచనా వ్యయం కూడా పెరిగేది కాదని చెప్పారు. రాష్ట్ర పునరి్వభజన చట్టంలో 2014కి ముందు ప్రతిపాదించిన/నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కల్పించిన రక్షణ సైతం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు వర్తించేదన్నారు.ఈ ప్రాజెక్టుకి కేటాయించిన 90 టీఎంసీల్లో గోదావరి జలాల మళ్లింపు ద్వారా లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీలూ ఉన్నాయని, వాటిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పునఃకేటాయింపులు జరిపే అంశం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన మిగిలిన 45 టీఎంసీలతో ప్రాజెక్టుకి తొలి దశ అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, ఏడాదిలోగా ట్రిబ్యునల్ విచారణ పూర్తైతే.. మిగిలిన 45 టీఎంసీల కేటాయింపులూ వస్తాయని స్పష్టం చేశారు. పూర్తిగా 90 టీఎంసీలను వాడుకోవాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ఉందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం గత బీఆర్ఎస్ సర్కారుకు లేదని ఆరోపించారు. ఇప్పుడూ తప్పుడు ఆరోపణలతో అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా బేసిన్లోని పెండింగ్ ప్రాజెక్టులను సైతం ఎందుకు పూర్తి చేయలేకపోయారని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. 2014కు ముందు పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులు 2023లో బీఆర్ఎస్ అధికారం నుంచి దిగే నాటికి అలానే పెండింగ్లో ఉండిపోయాయన్నారు. బీఆర్ఎస్ చేసిన ద్రోహంతోనే కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ 2004–14 మధ్య తరలించుకున్న నీళ్లతో పోల్చితే 2014–23 మధ్య తరలించుకున్న నీళ్లు చాలా ఎక్కువని గుర్తుచేశారు.ఏపీ అక్రమంగా చేపట్టిన పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులకు కేసీఆర్ పూర్తిగా సహకరించారని ఆరోపించారు. ఇలాంటి వివరాలతో అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ను ఎండగట్టడానికి నివేదికలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ చేసిన ద్రోహంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న దిద్దుబాటు చర్యలను వివరిస్తూ జనవరి 1న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. -
పాలమూరుపై పగ.. కాళేశ్వరంపై కక్ష
నాగర్కర్నూల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై పగ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష పెంచుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. అందుకే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మద్దతుతో ఇటీవల గెలిచిన సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని హామీలు అమలు చేయాలని అడుగుతుంటే బూతులు తిడుతున్నాడని విమర్శించారు.బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తట్టెడు మట్టి ఎత్తలేదని.. పాలమూరు ఎత్తిపోతలు పూర్తయితే కేసీఆర్కు పేరు వస్తుందనే దాన్ని పూర్తి చేయట్లేదని కేటీఆర్ ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పాత బాస్ చెప్పినట్లు ఆడుతున్నారని, అందుకే ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రలో నేను చదువుకుంటే తప్పా..? మాట్లాడితే తాను ఆంధ్రలో చదివానని సీఎం విమర్శిస్తున్నారని.. కానీ రేవంత్ ఆంధ్ర నుంచి అల్లుడిని తెచ్చుకుంటే తప్పు లేదంటగానీ తాను ఆంధ్రలో చదువుకుంటే తప్పా అని కేటీఆర్ నిలదీశారు. 40 ఏళ్ల క్రితం తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ చదువుకుంటేనే జీవితం బాగుంటుందని తండ్రి చెప్పడంతో విదేశాల్లో చదువుకున్నానని చెప్పారు. అమెరికాలో ప్రతి ఒక్కరూ ఎవరి పనులు వారే చేసుకుంటారని కేటీఆర్ వివరించారు.తాను అమెరికాలో బాత్రూంలు కడిగానంటూ సీఎం విమర్శిస్తున్నాడని.. కానీ ఆయన సోదరుడు కూడా అమెరికాలోనే ఉంటారని.. మరి ఆ లెక్కన ఆయన కూడా అక్కడ బాత్రూంలు కడుగుతున్నట్టేనా అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డిని ఏం అడిగినా అరుస్తున్నారని, కొన్ని రోజులైతే కరుస్తారేమోనని.. అందుకే ఆయన్ను ఇంట్లో కట్టేయాలని ముఖ్యమంత్రి భార్య గీతమ్మకు కోరుతున్నానన్నారు. హైదరాబాద్ చుట్టూ 9,300 ఎకరాల భూములపై రేవంత్ కన్నేసి రూ. 5 లక్షల కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాటన్నింటినీ వెలికితీస్తున్నందుకే రేవంత్రెడ్డి తమపై చిరాకు పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యారు.. చీకటి, దొంగ ఒక్కటైనట్లు బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా బీజేపీ ఏం మాట్లాడట్లేదని విమర్శించారు. ఆ రెండు పారీ్టలు అలయ్–బలయ్ చేసుకొని బీఆర్ఎస్నే తిడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్కు అధికారం దక్కనివ్వనని రేవంత్రెడ్డి శపథం చేస్తున్నారని.. అయితే ఆయన కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, మహిళలకు రూ. 2,500, రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా ఇస్తామని శపథం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్దన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. 28ఎన్జికెఎల్51: మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
ఉపాధిని నిర్వీర్యం చేసే కుట్రే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లమంది కడుపు నింపిన జాతీయ ఉపాధి హామీ (మన్రే) పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రద్దు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. దీన్ని పేదల ఉపాధిని నిర్వీర్యం చేసే కుట్రగా అభివర్ణించారు. ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడమంటే దేశ గౌరవాన్ని కించపర్చడమే అని మండిపడ్డారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ మాట్లాడారు. బహుళ ప్రయోజనాలను ఆశించి నిరుద్యోగ, రైతు కూలీలు, దళిత, బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో యూపీఏ ప్రభుత్వం మన్రేగా పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు.పేదలకు జీవనాధారంగా మారిన ఈ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి వారి కడుపుకొట్టిందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి పేదల బాధలు పట్టవని, కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యమని ధ్వజమెత్తారు. రాష్ట్రాలపై అదనపు భారాన్ని మోపే ‘వీబీ జీ రామ్ జీ పథకం’పై జాతీయస్థాయి ఉద్యమాలే శరణ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మోదీ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.రాహుల్తో మాటా మంతీసీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సరదాగా సంభాషించుకున్నారు. సమావేశం ముందు, తర్వాత.. రేవంత్ అధిష్టానం పెద్దలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి నడిచారు. ఈ సమయంలో రేవంత్ వారితో చాలాసేపు నవ్వుతూ మాట్లాడారు. అలాగే.. రాహుల్తో ప్రత్యేకంగా కొంతసేపు మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలు, 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీ ఎన్నికల్లో విజయాలు, నామినేటెడ్ పదవులు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్లతో సీఎం రేవంత్రెడ్డి -
ప్రజల తిరుగుబాటు మొదలైంది
సాక్షి, మహబూబాబాద్: ‘దొంగమాటలు చెప్పి అడ్డదారిలో సీఎం అయిన రేవంత్రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లను శనివారం జిల్లాకేంద్రంలో కేటీఆర్ సన్మానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 45 శాతం ఓటింగ్ బీఆర్ఎస్ మద్దతుదారులకు పడిందన్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను సరిదిద్దుకునే పనిలో ప్రజలు ఉన్నారని చెప్పారు. రాష్ట్రావ్యాప్తంగా 1500 మందికిపైగా బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు ఉన్నారని చెప్పారు.వీరిపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు జరిగిన ఎన్నికలు క్వార్టర్ ఫైనల్ అని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్ అని.. తర్వాత ఫైనల్ పోటీతో కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ బయటకువచ్చి సమీక్షలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నాయకుల్లో వణుకు పుట్టిందని చెప్పారు. సీఎం భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఆయనకు ఒకటే భాష వచ్చని, తనకు నాలుగు భాషలు వచ్చని.. అన్ని భాషల్లో తిట్టవచ్చు కానీ, సంస్కారం అడ్డం వచ్చిందని చెప్పారు.తాను గుంటూరులో చదువుకున్నానని చెప్పిన రేవంత్రెడ్డి అల్లుడిది భీమవరం కాదా అని ప్రశ్నించారు. నాలున్నర దశాబ్ధాల క్రితం చనిపోయిన మహానాయకుడు నూకల రాంచంద్రారెడ్డిని గుర్తుచేసి విగ్రహం ఆవిష్కరణకు శంకుస్థాపన చేసింది కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, డీఎస్ రెడ్యానాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కే కుట్ర సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాల్సిందిపోయి, ఉన్న వాటిని తొలగించడంపై కేటీఆర్ మండిపడ్డారు. వారి ఉపాధిని, ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే జర్నలిస్టుల గొంతును పోలీసు బలగాలతో నొక్కేసే కుట్ర చేస్తోందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై శాంతియుతంగా వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన టీయూడబ్ల్యూజే– టీజేఎఫ్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ల పునరుద్ధరణ కోసం సాగే పోరాటంలో బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. -
కేటీఆర్పై కాంగ్రెస్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యా ఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని చెప్పు తీసుకొని కొట్టాలని అనిపిస్తోందంటూ కేటీఆర్ మాట్లాడడా న్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావులు శుక్రవారం వేర్వేరు చోట్ల విలేక రులతో మాట్లాడుతూ కేటీఆర్పై ధ్వజమెత్తారు. బూతు పురాణాన్ని పరిచయం చేసిందే మీరు: ఆది శ్రీనివాస్అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బూతు పురాణాన్ని పరిచ యం చేసిందే బీఆర్ఎస్ నేత లని ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ వ్యాఖ్యానించారు. తోలు తీస్తానని కేసీఆర్ అనడం వల్లనే రేవంత్రెడ్డి స్పందించారని చెప్పా రు. ‘అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్, సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు. మీరు తిట్లు ఆపకపోతే మా వైపు నుంచి కూడా రియాక్షన్ చూడాల్సి వస్తుంది. మాటకు మాట జవాబు ఇస్తాం’అని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. చేతలతోనే సమాధానమిస్తాం: మేడిపల్లి సత్యంసీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడిన మాటలు చూసి యావత్ తెలంగాణ ప్రజలు సిగ్గు పడుతున్నారని మేడిపల్లి సత్యం అన్నారు. అమెరి కాలో చదివానని చెప్పుకునే ఆయన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. ‘ఎన్నికల్లో ప్రజలు చావు దెబ్బ కొట్టారు. అయినా సిగ్గూ, శరం లేకుండా ముఖ్యమంత్రిపై అవాకులుచెవాకులు పేలుతు న్నారు. సీఎం రేవంత్పై కేటీఆర్ అన్న మాటలు వెనక్కి తీసుకోకపోతే ఆయన్ను తెలంగాణలో తిరగనీయం’అని సత్యం హెచ్చరించారు. ఇంకా సిగ్గురాలేదా: బల్మూరికేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డా రు. తెలంగాణ ప్రజలు చెప్పు లతో కొట్టినా, సిగ్గు లేకుండా కేటీఆర్ ఇంకా మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. ‘నీకు, మీ అయ్యకు సిగ్గూశరం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి. మా సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న పనులు చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు నిన్ను, నీ అయ్య చెప్పులు అరిగేలా ఇప్పటికే కొట్టారు. మా ముఖ్యమంత్రి పైన ఇంకోసారి మాట్లాడితే సిరిసిల్లలో చెప్పుల దండ వేసి ఊరేగిస్తారు’అని వెంకట్ చెప్పారు. పిచ్చి ఆలోచనలు మానుకోవాలి: చామలకేటీఆర్ బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నా రని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి మె రిట్ కోటాలో రాజకీయాల్లో గెలిచి సీఎం అయితే, కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా లో రాజకీయాల్లోకి వచ్చాడని ఎద్దేవా చేశారు. ఎవ రిది ఏ కోటానో, ఎవరు ప్రజల పక్షం వహిస్తారో తెలంగాణ ప్రజలకు తెలుసునని చెప్పారు. నోటికి పని చెప్పడం ప్రజాస్వామ్యం కాదు: మల్లు రవితాము అనుకున్నట్టే రాజకీ యాలు నడవాలని.. లేదంటే ఇష్టమొచ్చినట్టు మాట్లాడతా మనే రీతిలో బీఆర్ఎస్ నేత లు వ్యవహరిస్తున్నారని నాగ ర్కర్నూల్ ఎంపీ మల్లురవి అన్నారు. రాజకీయా లు హుందాగా నడపాలే కానీ, నోటికి పని చెప్పడం ప్రజాస్వామ్యం కాదని, ఇది రాజకీయా ల్లో మంచి పరిణామం కాదన్నారు. కేసీఆర్, కేటీ ఆర్లు పదేపదే సీఎం రేవంత్రెడ్డిని తిట్టినా, ఆయ న సహనం వహించారని, అనుచిత వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. -
పోడియంలు తీసేయండి
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. దశాబ్దాలుగా ఉన్న ఓ ఆనవాయితీకి ఆ శాఖ స్వస్తి పలకనుంది. క్వాసీ జ్యుడీషియల్ (పాక్షిక న్యాయపరమైన) అధికారాలున్న సబ్రిజిస్ట్రార్ల చుట్టూ వారి కార్యాలయాల్లో ఉండే పోడియంలు ఇక నుంచి మాయం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని సబ్రిజిస్ట్రార్లంతా పోడియంలు తొలగించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్గాంధీ హనుమంతు ఆదేశాలు జారీ చేశారు. పోడియం ఉన్నప్పుడు ఫొటోను, తొలగించిన తర్వాతి ఫొటోను పంపాలని ఆ ఆదేశాల్లో ఆయన స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోడియంల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. నిజాం కాలం నుంచే..: వాస్తవానికి నిజాం కాలం నుంచే సబ్రిజిస్ట్రార్లకు ప్రత్యేక అధికారాలుండేవి. వారికి క్వాసీ జ్యుడీషియల్ అధికారాలను చట్టం కల్పించింది. డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయించేటప్పుడు క్రయ, విక్రయదారులు, సాక్షుల స్టేట్మెంట్లను తీసుకోవడంతోపాటు వీలునామాలను విచారించే అధికారం కూడా ఉండటంతో న్యాయస్థానాల తరహాలో వారికి పోడియంలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు ట్రెజరీ, జ్యుడీషియల్ అధికారులు సెలవులో ఉన్నప్పుడు పాత కాలంలో ఆ బాధ్యతలను సబ్రిజిస్ట్రార్లకు అప్పగించే వారు. సబ్రిజిస్ట్రార్లు సెలవులో వెళ్తే జ్యుడీషియల్ అధికారులు ఈ బాధ్యతలు నిర్వహించేవారు.అయితే కాలానుగుణంగా చాలా మార్పులు రావడం, ఇప్పుడు అన్ని శాఖలు వేటికవే పనిచేస్తుండటంతో రిజిస్ట్రేషన్ల శాఖ కూడా అందుకనుగుణంగా మార్పును ఆహ్వానించాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్లు తెలిసింది. కలెక్టర్లకే లేని ఆర్భాటం సబ్రిజిస్ట్రార్లకు ఎందుకని ప్రశ్నించిన ఆయన.. పోడియంల తొలగింపుపై ఉన్నతాధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోడియంలను తొలగించనున్నారు. -
రేవంత్ను భీమవరం బుల్లోడు అనాలా?: కేటీఆర్
ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని రేవంత్రెడ్డి నెరవేర్చలేదని.. అది అడిగినందుకే కేసీఆర్పై ఆయన నోరు పారేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. కేసీఆర్కు మళ్లీ అధికారం దక్కనివ్వనని శపథం చేసే బదులు.. ఆ హమీలేదో నేరవేర్చేందుకు శపథం చేయాలంటూ సెటైర్లు వేశారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు(KTR Slams CM Revanth Reddy). శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎలా ఎదిగారో అందరికీ తెలుసు. రోజూ తిట్ల పురాణం తప్ప రేవంత్ చేసేదేమీ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఏం భాష?. హైదరాబాద్ గల్లీల్లో తిరిగిన నేను కూడా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు లో బూతులు తిట్టగలను. ఏనుగు లాంటి కేసీఆర్ ను తిడుతున్నారు, చావు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని గీతమ్మ జాగ్రత్తగా చూసుకోవాలి..ఆయన ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. సోనియా, ప్రియాంక గాంధీ మీద ఒట్టు పెట్టి హామీలు ఎగవేశారు. నెలకు రూ. 2500 ఇవ్వడానికి మొఖం లేదు కానీ, కోటి మంది మహిళలను కోటీశ్వరులు కావాలట!. సీఎం పెద్ద పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారు. రోడ్లపై పెయింట్ వేసుకునే రేవంత్ రెడ్డి పెద్ద స్థాయికి వస్తే మంచిదే. కానీ మంచి పనులతో రావాలి. పేమెంట్ కోటాలో సీఎం అయ్యి... ఇప్పుడు కూడా నెలనెలా ఢిల్లీకి సంచులు పంపుతున్నారుకాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమే. కాంగ్రెస్ పాలనలో ఒక్క చెరువు కట్టలేదు. మేడిగడ్డ ఆనకట్టను కూల్చిన కాంగ్రెస్ నేతలు... ఇపుడు బీఆర్ఎస్ కట్టిన చెక్ డ్యాంలను బాంబులతో పేలుస్తున్నారు. ఇసుక దందాల కోసమే ఆ పని చేస్తున్నారు. రెవెన్యూ మంత్రి కొడుకు భూములు కబ్జా చేస్తుంటే కేసు పెట్టిన పోలీసు అధికారిని లూప్ లైన్లో పెట్టారు..కేసీఆర్ దయతో అరికెపూడి గాంధీ ఎమ్మెల్యే అయ్యాడు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పేరు గాంధీ... చేసేవి గాడ్సే పనులు. భూకబ్జాలకు పాల్పడుతున్నారాయన. దమ్ముంటే గాంధీ శేరిలింగంపల్లి క్షేత్రానికి రావాలి, ఆ ఉప ఎన్నికల్లో తేల్చుకుందాం. కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్లోనే ఉన్నామని చెబుతున్నారు. స్పీకర్ కళ్లు ఉండి చూడలేని ధృతరాష్ట్రునిలా తయారయ్యారు. ఎన్నికలకు భయపడి పదిమంది ఎమ్మెల్యేలు దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంగల్లా కలిసినా మనం గట్టిగా కొట్లాడదాం. ..ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని రేవంత్రెడ్డి అమలు చేయడం లేదు. ముందు ఆ హామీలను నెరవేరుస్తానని శపథం చేయాలి. కోటి మంది మహిళలకు జనవరి ఒకటి నుంచి నెలకు రూ.2500 ఇస్తామని రేవంత్ రెడ్డి శపథం చేయాలి. హామీ ఇచ్చినట్లు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి శపథం చేయాలి. పాలమూరు - రంగారెడ్డి గురించి కేసీఆర్ అడిగితే సమాధానం చెప్పలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. హామీల అమలు గురించి కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారుకేసీఆర్ బయటకు రా అని కాంగ్రెస్ నేతలు అన్నారు. తీరా కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్ పెడితేనే ముచ్చెమటలు పట్టి చలిజ్వరం తెచ్చుకున్నారు. అలాటింది కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చస్తారు. నేను మా నాన్న పేరు చెప్పుకుంటే తప్పేమిటి? తెలంగాణ తెచ్చిన మొనగాని పేరు చెప్పుకుంటే తప్పా?. మా నాన్నను తిడుతున్నందుకు నాకు చాలా కోపం ఉంది, నేను గుంటూరులో చదివితే తప్పేమిటి... రేవంత్ రెడ్డి లాగా చదువు లేకుండా తిరగలేదు. నేను ఆంధ్రాలో చదివితే తప్పు అట కానీ, ఆయన ఆంధ్రా అల్లుడిని తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలా?. రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు. అమెరికాలో ఎవరి పని వారు చేసుకోవాలి, నేను చేసుకుంటే తప్పా?.. ఆయనలా దొంగ పనులు చేయలేదు. ఢిల్లీకి సంచులు మోసుకుంటూ గులాంలాగా బతకబోం. తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వబోమని రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు ఆయన్ను కొడంగల్లో గెలవకుండా చూద్దాం. నిజమైన మార్పు ఊళ్ళల్లో సర్పంచ్ ఎన్నికల్లో ప్రారంభం అయింది. బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్న హైదరాబాద్ వాసులకు పాదాభివందనం చేసినా తప్పులేదు. హైదరాబాద్ను ఎన్ని కార్పొరేషన్లు చేసినా గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలి. 2026లో గట్టిగా కష్టపడితే... 2027లో ఎన్నికల వాతావరణ వస్తుంది, కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునే వరకు పోరాడదాం అని బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. -
సై అంటే సై.. ఎవరి వాదన కరెక్ట్?
-
సావు భాష తప్ప సోయి లేని వ్యక్తి రేవంత్: హరీష్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రేవంత్ చిల్లర రాజకీయాలకు, విధ్వంసకర పాలనకు రైతులు బలైపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు ట్విట్టర్ వేదికగా..‘సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందే. అందరినీ తొక్కుకుంటూ వచ్చాను అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, నీ చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావు. నీ చిల్లర రాజకీయాలకు, నీ విధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతే. రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేని నువ్వు ముఖ్యమంత్రివా? అని ప్రశ్నించారు.అలాగే, యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి తెచ్చిన నీ యూరియా యాప్ ఏమైంది?. యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలైతే, మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?. మీరు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చుంటే, రైతులు మాత్రం తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలిలో చెప్పులు క్యూలో పెట్టుకుని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఇదేనా మీరు చెప్పిన “మార్పు”?. గత సీజన్లో ఎదురైన యూరియా కొరత చేదు అనుభవాల నుంచి కూడా మీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా?. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా? అంటూ ఘాటు విమర్శలు చేశారు. సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందే.“అందరినీ తొక్కుకుంటూ వచ్చాను” అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, నీ చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావు.నీ చిల్లర రాజకీయాలకు, నీ విధ్వంసకర పాలనకు… pic.twitter.com/9ZLU4tce3v— Harish Rao Thanneeru (@BRSHarish) December 26, 2025 -
ఎవరికీ భయపడను.. నా బ్రాండ్ ఇమేజ్ అదే: దానం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడను అని.. తాను కాంగ్రెస్లోనే ఉన్నట్టు కుండబద్దలు కొట్టారు. అదే తన బ్రాండ్ ఇమేజ్ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దానం హాట్ టాపిక్గా మారారు.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. నేను ఏ విషయమైనా డైరెక్ట్గానే చెబుతాను. ఎవరికీ భయపడే రకం కాదు. నేను కాంగ్రెస్ ఉన్నానని ధైర్యంగా చెబుతున్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం శ్రమిస్తాను. జీహెచ్ఎంసీ వార్డుల విభజన శాస్త్రీయబద్దంగా జరిగింది. దేశంలో హైదరాబాద్ నెంబర్-1గా ఉండటానికి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. హైడ్రా నా సలహాలు పరిగణనలోకి తీసుకుంది. అందుకే పేద, మధ్య తరగతి ఇళ్ల జోలికి వెళ్లడం లేదు అని చెప్పుకొచ్చారు.ఇక, అంతకుముందు కూడా దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘నేను కాంగ్రెస్లోనే ఉన్నా. నేను ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది.. అదీ నా స్పెషాలిటీ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించి భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. స్తంభాలు కనిపించకుండా భూగర్భం నుంచి కేబుల్స్ వేసేందుకు రూ.4వేల కోట్లు కేటాయించారు. ఇది నగర రూపురేఖలను పూర్తిగా మార్చే కీలక నిర్ణయం. జనవరి నుంచి హైదరాబాద్లో రోజూ మంచినీటిని సరఫరా చేయాలన్న సీఎం నిర్ణయం హర్షణీయం. గ్రేటర్ హైదరాబాద్ అంతటా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తా. 300 డివిజన్లలో పార్టీ గెలిచి సత్తా చాటుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అలాగే, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఎమ్మెల్యేల గురించి దానంను విలేకరులు ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదన్నారు. -
మళ్లీ కేసీఆర్ మార్కు రాజకీయం!
చాలాకాలం తరువాత తెలంగాణ రాజకీయ యవనికపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన రీతిలో మెరిశారు. భాష, భావ వ్యక్తికరణ, హాహాభావాల ప్రదర్శనలో ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ యాసను తనదైన శైలిలో ప్రయోగిస్తూ పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటారు. ఆసక్తికరంగా... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో తక్కువేమీ తినలేదు అని చెప్పాలి.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడంతో వచ్చిన ఆత్మవిశ్వాసమో ఏమో కానీ... అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్పై విరుచుకు పడుతుంటారు. గత ఆదివారం వీరిద్దరు పరస్పర విమర్శల బాణాలు ప్రయోగించారు. పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఆశాజనకమైన ఫలితాలు రావడం కేసీఆర్లో ఉత్సాహం నింపి ఉండవచ్చు. పార్టీ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీలతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించి ఆ తరువాత మీడియాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ద్విముఖ వ్యూహం అమలు చేసినట్లు కనిపిస్తుంది. ఒకటి నీళ్ల సెంటిమెంట్ రాజకీయం, మరొకటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టడం. రేవంత్ మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి కేటాయింపులపై చర్చించాలని సవాల్ చేయడమే కాక, మొత్తం సమస్యలకు కేసీఆర్ కారణమని వాదించారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు జోలికి పోకుండా కేసీఆర్పై వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ పరిణామాలను వాడుకోవడం ద్వారా రాజకీయం చేయడానికి యత్నించినట్లు కనబడుతోంది. కేసీఆర్ వాదనలోని బలాబలాలు చూద్దాం.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టుకు సంబంధించి తట్టెడు మట్టి తీయలేదని, దీనిపై ప్రజా యుద్ధం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితోనే కేంద్రం డీపీఆర్ను వెనక్కి పంపిందని ఆరోపించారు. అంతేకాకుండా... 45 టీఎంసీల నీరు కేటాయిస్తే చాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను అక్రమంగా వాడుకుంటున్నా ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఇదే క్రమంలో బీజేపీపై కూడా విరుచుకుపడుతూ తెలంగాణకు పట్టిన శని అని వ్యాఖ్యానించారు. బీజేపీ లోక్ సభ ఎన్నికలలో ఎనిమిది సీట్లు గెలుచుకున్నా పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీనే బాగా ముందంజలో ఉంది. దాంతో బీజేపీ ప్రభావాన్ని మరింత తగ్గించడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో సాగింది. ఈ మూడింటిలో నీళ్ల సెంటిమెంట్ ప్రజలను బాగా కదిలించింది. తెలంగాణకు రావల్సిన నీటి వాటా రావడం లేదని, ఏపీకి నీళ్లు తరలిపోతున్నాయని ఆరోపించేవారు. కేసీఆర్ చేస్తానన్న ప్రజా ఉద్యమం ఎంతమేరకు ప్రజలను ప్రభావితం చేస్తుందన్నది అప్పుడే చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్లు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది సందేహమే. కాకపోతే ఆ పేరుతో రాజకీయంగా సభలు నిర్వహించడానికి కేసీఆర్ దీనిని ఒక అవకాశంగా వాడుకునే యోచన చేసినట్లుగా ఉంది. నీటి సమస్యను సెంటిమెంట్ కోసం ఆయన మాట్లాడినా.. అసలు లక్ష్యం రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే. తెలంగాణ, ఏపీ నేతలు నీటిని ఎంత సమర్థంగా వాడుతున్నారన్నది పక్కబెడితే, అవసరమైనప్పుడల్లా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు కూడా ఆ ధోరణినే అనుసరించినట్లు అనిపిస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు అక్కడి ప్రజలను మభ్యపెట్టడానికే అన్నది ఎక్కువ మంది భావన. అయినా తెలంగాణ నేతలు అలాంటి వాటిని బూచిగా చూపించే యత్నం చేస్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సర్వభ్రష్ట సర్కార్ గా కేసీఆర్ అభివర్ణించారు. తన ప్రభుత్వాన్ని ఓడించడానికి కాంగ్రెస్ అబద్దపు వాగ్దానాలు ఇచ్చిందని చెబుతూ ఆ జాబితాను చదివారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలకు హామీ ఇవ్వడమే కాకుండా, బాండ్ పత్రాలను సైతం ప్రజలకు అంద చేసింది. కాని అధికారంలోకి వచ్చాక వాటిలో కొన్నిటిని మాత్రమే చేయగలిగారు. వృద్ధాప్య ఫించన్ రూ.నాలుగు వేలు, కళ్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం, దళిత బంధు కింద రూ.12 లక్షలు మొదలైన హామీలను ప్రస్తావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే టైమ్ లో ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ దందా తప్ప మరొకటి కాదని, తాము తెచ్చిన ఫార్మాసిటీని వంతారా, జూ పార్కులకు కేటాయించాలన్న ఆలోచనను ఆయన తప్పుపట్టారు. అయితే.. ఈ ప్రెస్మీట్లో తోలు తీస్తా..అంటూ తన స్టైల్ లో కొన్ని పరుష పదాలను ఆయన వాడారు. గ్లోబల్ సమ్మిట్ జరిగిన తీరును ఆక్షేపించి అచ్చం గురువు చంద్రబాబు బాటలోనే రేవంత్ వెళుతున్నారని, విశాఖలో గత టర్మ్లో చంద్రబాబు సర్కార్ సమ్మిట్ నిర్వహించి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసిందని, ఆచరణలో పదివేల కోట్లు కూడా రాలేదని ఆయన అన్నారు. విశాఖలో హోటల్ ఉద్యోగులకు సూట్లు తొడిగి తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. నదీ జలాల ఇష్యూపైనే కేంద్రీకరించినట్లు కనిపించినా, మొత్తం రేవంత్ ప్రభుత్వాన్ని దాదాపు అన్ని అంశాలలో కడిగిపారేశారు. అయితే.. తనకు ఇబ్బంది కలిగించే కాళేశ్వరం, ఫోన్ టాపింగ్ తదితర కొన్ని అంశాలను కేసీఆర్ ప్రస్తావించలేదు. అసెంబ్లీకి వెళ్లేది, లేనిది చెప్పలేదు. కేసీఆర్ విమర్శలకు రేవంత్ బదులు ఇస్తూ తొలుత శాసనసభకు వచ్చి నదీ జలాలపై చర్చించాలని సవాల్ చేశారు. సభలో కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. ఇది కొంత అనుమానాలకు తావిస్తుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ తదితరులు అసెంబ్లీ బహిష్కారం వంటి కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదుర్కున్నారు. ఆ నేపథ్యంలో కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒంటికాలి మీద లేచే అవకాశం లేకపోలేదు. అందువల్లే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడానికి కాస్త జంకుతున్నట్లు అనిపిస్తుంది. తాజాగా నీటి సెంటిమెంట్ను వాడుకోవడానికి శాసనసభకు వెళ్లవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. నదీ జలాల సమస్యకు, తెలంగాణ ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలకు కేసీఆర్ కారణమన్న ప్రచారాన్ని ప్రజల ముందు పెట్టడానికి రేవంత్ బృందం ప్రయత్నిస్తోంది. కంటోన్మెంట్, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఆధారంగా కేసీఆర్ వాదనను రేవంత్ తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ను ఆర్థిక ఉగ్రవాదిగా పోల్చడం కచ్చితంగా అభ్యంతరకరకమైన అంశమే. తన చావు కోరతారా అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు బదులుగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులతోనే ప్రమాదం ఉందని, కేటీఆర్, హరీశ్ రావుల మధ్య విబేధాలు ఉన్నట్లు చిత్రీకరించడానికి రేవంత్ యత్నించారు. అలాగే కేసీఆర్ కుమార్తె కవిత బీఆర్ఎస్కు దూరమైన వైనాన్ని రేవంత్ తనకు అనుకూలంగా మలచుకోవడానికి కృషి చేస్తున్నారు. అయితే.. కేసీఆర్ వ్యాఖ్యలు వయసు తగ్గట్లు లేవని, ఆయన తమలపాకుతో కొడితే, తాను తలుపు చెక్కతో కొట్టగలనని రేవంత్ తన వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు. కేసీఆర్ నిజంగానే వచ్చే రోజుల్లో బాగా యాక్టివ్ అయితే వీరిద్దరి మద్య హోరాహోరీ మాటల యుద్దం జరిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ను, ప్రభుత్వ వైఫల్యాల అంశాల ఆధారంగా భవిష్యత్తు రాజకీయం చేయడానికి సిద్దపడుతున్నట్లు అనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలు, కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు తదితర అంశాలను అస్త్రాలుగా వాడుకుని రాజకీయం చేయడానికి రేవంత్ రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది. కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీఆర్ఎస్కు ప్రయోనం కలిగిస్తాయా?లేక గత ప్రభుత్వంలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై రేవంత్ ప్రభుత్వం చేసే ప్రచారం ఫలిస్తుందా?అన్నది తెరపై చూడాలి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మళ్లీ గెలుస్తానని శపథాలా?
సిద్దిపేట జోన్: ‘వయసులో నీకు తండ్రి లాంటి వారైన కేసీఆర్పై మాట్లాడిన మాటలు ఏమిటి? టైమ్ వస్తది బిడ్డా! నీవేదో వీర్ర వీగుతు న్నావు, అహంకారంతో మాట్లాడుతున్నావు. ఇప్పటి కైనా చిల్లర మాటలు మానుకో’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రె డ్డి అనాథ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టక, కా స్మెటిక్ చార్జీలు ఇవ్వడం చేతకాక దుర్భాషలాడటం తగునా అని ప్రశ్నించారు. అలాంటి రేవంత్రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువేనంటూ మండిపడ్డారు.గురువారం క్రిస్మస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ బ్రిడ్జి స్కూల్ను హరీశ్రావు సందర్శించారు. వారి యో గక్షేమాలు అరా తీసి పిల్లలతో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మాట లు సీఎంకే కాదు.. మాకూ వస్తాయి. తెలంగాణకు జరుగుతున్న నీటి అన్యాయం, కాంగ్రెస్ ఎన్నికల హామీల గురించి కేసీఆర్ మాట్లాడితే సీఎం స్థాయి మరచి రేవంత్రెడ్డి బూతులు మాట్లాడటం ఏమిటి? మళ్లీ గెలుస్తా, టూ థర్డ్స్ మెజారిటీతో గెలుస్తా అని శపథాలు చేస్తున్న రేవంత్రెడ్డి.. కొడంగల్ ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చేసిన శపథం ఏమైంది? రేవంత్రెడ్డికి మాటతప్పడం, పార్టీలు మారడం, పదవులు కొనుక్కోవడం, చిల్లర మాటలు మాట్లాడటం బాగా అలవాటే’ అంటూ హరీశ్రావు మండిపడ్డారు.ఫార్మాసిటీ భూముల్ని రైతులకు తిరిగివ్వాలి..ఫార్మాసిటీని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కేసీఆర్ అడగడం తప్పా అని హరీశ్రావు ప్రశ్నించారు. గతంలో ఫార్మాసిటీ భూములు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్.. ప్రస్తుతం చేస్తున్న పని ఏమిటని నిలదీశారు. కేసీఆర్ ఆలోచన మేరకు ఫార్మాసిటీని ఏర్పాటు చేయకుంటే రైతులకు భూములు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా కాస్మెటిక్ చార్జీలు, మెస్ చార్జీలు అందక అనాథ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, సీఎం ఇప్పటికైనా బిల్లులు విడుదల చేయాలన్నారు. -
సీఎం రేవంత్తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ
సాక్షి,హైదరాబాద్: వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జరుపుకునే కైట్ ఫెస్టివల్ను చెరువుల వద్ద ప్రత్యేకంగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఆదేశాలు జారీ చేశారు.గురువారం జూబ్లీహిల్స్ తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలపై కమిషనర్ వివరాలు అందించారు. చెరువుల సంరక్షణ, పునరుద్ధరణలో ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరిస్తూ, ప్రజలకు అందించే ప్రయోజనాలను వివరించారు.అనంతరం,సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చెరువుల వద్ద ప్రత్యేకంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు టూరిజం శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ప్రజలతో పాటు ఐటీ రంగ ప్రముఖులు, ఉద్యోగులు పాల్గొనేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.అలాగే, కూకట్పల్లి నల్లచెరువు వద్ద సినిమా ప్రముఖులతో, రాజేంద్రనగర్ బురుకుద్ఫిన్ చెరువు వద్ద క్రీడాకారులతో కలిసి కైట్ ఫెస్టివల్ జరపాలని ఆదేశించారు. ఈ ఉత్సవాన్ని జనవరి 11, 12, 13 తేదీలలో నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా తెలిపారు. చెరువుల పునరుద్ధరణతో పాటు ప్రజలలో అవగాహన పెంచేందుకు, పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు ఈ కైట్ ఫెస్టివల్ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


