సాక్షి,హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు తీర్పు ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్రెడ్డి. నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనున్న తరుణంలో కొద్ది సేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు.
12ఏళ్లగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతోంది. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయండి. ఓటు వేసే ముందు గత పాలను గుర్తు చేసుకోండి. తెలంగాణకు బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్ట్గా గుర్తిస్తామని ప్రధాని మోదీ విస్మరించారు.మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలంగాణను అవమానించారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.


