Rangareddy
-
వరద నీరు నిల్వకుండా చర్యలు
మహేశ్వరం: వర్షపు నీరు, డ్రైనేజీ నీరు వేగంగా వెళ్లేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాలువలకు మరమ్మతులు చేపట్టాలని ఏసీపీ జానకీరెడ్డి పేర్కొ న్నారు. సోమవారం మండల కేంద్రంలోని మలబార్గోల్డ్, విఫ్రో, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, పాలిటెక్నిక్ కళాశాల, మోడల్ స్కూల్, కళాశాల, అగ్నిమాక కేంద్రం, ఆర్టీసీ డిపోలలో లోతట్టు ప్రాంతాలను ఆయన సీఐతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురిస్తే వరదనీరు రోడ్లపై, కంపెనీలు, పాఠశాలలు, కళాశాలల ఎదుట నిల్వకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాలు కురిసినప్పుడు వరదనీరు సులువుగా వెళ్లేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. రోడ్లపైన నీటి నిల్వల ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. గత సంవత్సరం వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయని గుర్తుచేశారు. భవిష్యత్తులో అలాంటివి పునరావృతం రాకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం వరద నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించారు. కార్యక్రమంలో సీఐ రాఘవేందర్రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కుదరని సఖ్యత.. సాగని పాలన
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు గడిచింది. రాజకీయ సంకటంతో బీఆర్ఎస్ రెండు నెలల క్రితం పాలన పగ్గాలు చేపట్టింది. అయినప్పటికీ.. కొలువుదీరిన పాలకవర్గంతో అధికారులకు, అధికార పార్టీ కాంగ్రెస్ కౌన్సిలర్లకు సఖ్యత కుదరడంలేదు. ఇరు పార్టీల రాజకీయ చదరంగంలో కౌన్సిలర్లు పావులు కాగా.. పరిపాలన పడకేసింది. ఫలితంగా అభివృద్ధి కుంటు పడింది. ప్రజాసంక్షేమం గాలిలో దీపంలా మారింది.డైలమాలో కమిషనర్పట్నం మున్సిపాలిటీలో అధికారం దక్కించుకున్న ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా సహకరించడం లేదు. దీంతో పరిపాలన పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా.. చైర్మన్ టేకుల సుదర్శన్రెడ్డి, కమిషనర్ సుదర్శన్లు చేరో దారిలో పయనిస్తున్నారు. అధికార పార్టీ చెప్పింది వినాలా? లేక పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలనే సంకట స్థితిలో కమిషనర్ కొట్టుమిట్టాడుతున్నారు.వార్డు సభకే చైర్మన్ పరిమితంఇరు వర్గాల మధ్య కుదరని సయోధ్యతో చైర్మన్ తన వార్డు సభకే పరిమితమయ్యారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇటీవల నిర్వహించిన వార్డు సభల్లో కౌన్సిలర్ల మధ్య రాజకీయ విభేదాలు మరలా నెలకొన్నాయి. కమిషనర్ సుదర్శన్పై అధికార పార్టీ రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చైర్మన్ సుదర్శన్రెడ్డి వెళ్లిన ప్రాంతానికి కమిషనర్ వెళ్లని దుస్థితి. దీంతో పలు వార్డు సభలకు హాజరుకావాల్సిన చైర్మన్.. కేవలం తన వార్డు సభకే పరిమితమయ్యారు.కౌన్సిల్ సమావేశాలకు డుమ్మాఫిబ్రవరిలో ఎన్నికలు ముగియగా.. ఇరు పార్టీల మధ్య పొడచూపిన పంచాయితీ కారణంగా ఏప్రిల్ మొదటి వారంలో పాలకవర్గం కొలువుదీరింది. ఈ పీఠాన్ని అధిష్టించిన ప్రతిపక్ష పార్టీ గులాబీకి అధికారుల సహకారం కొరవడింది. నాటి నుంచి జరిగిన రెండు కౌన్సిల్ సమావేశాలకు కమిషనర్ సుదర్శన్ వెళ్లకపోవడం గమనార్హం. ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత ప్రజాతీర్పునకు అనుగుణంగా కలిసి పనిచేయాల్సిన నేతలు, అధికారులు ఆ దిశగా వెళ్లడం లేదు. ప్రజా శ్రేయస్సు, సంక్షేమం, పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.కలిసి పనిచేద్దాంఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలి. జెండాలు, విభేదాలను పక్కకు పెట్టి మున్సిపల్ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం. తమకు ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ముఖ్యం. అధికారులు, పాలకులు, ప్రజలు సమష్టిగా సాగితేనే అభివృద్ధి సాధ్యం.– సుదర్శన్రెడ్డి, చైర్మన్, ఇబ్రహీంపట్నం -
అమావాస్య ఎఫెక్ట్
● తొలిరోజు బోసిపోయిన పాఠశాలలు ● భారీగా తగ్గిన హాజరుశాతం ● విద్యార్థుల కోసంఎదురు చూసిన బోధనా సిబ్బందియాచారం: పాఠశాలల పున:ప్రారంభానికి అమావాస్య అడ్డంకిగా మారింది. తొలి రోజు సోమవారం తల్లితండ్రులు తమ పిల్లలను బడికి పంపించలేదు. మండల పరిధిలో పది ఉన్నత, ఆరు ప్రాథమికోన్నత, 29 ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 3,500 మందికి పైగా చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. అమావాస్య నేపథ్యంలో మొదటి రోజు కేవలం 150 మందే హాజరయ్యారు. ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో వచ్చారు. చిన్నారులకు స్వాగతంపలికేందుకు.. పాఠశాలలకు మామిడి తోరణాలు కట్టారు. కొన్ని పాఠశాలల్లో చిన్నారులకు పుస్తకాలు అందజేశారు. కడ్తాల్లోకడ్తాల్: సెలవుల అనంతరం బడిగంట మోగింది. తొలి రోజు అమావాస్య కారణంగా పాఠశాలలు బోసిపోయాయి. మండల పరిధిలో జెడ్పీహెచ్ఎస్, ఎంపీహెచ్ఎస్ జీయూపీఎస్, యూపీఎప్, ప్రాథమిక పాఠశాలల్లో 1,226 విద్యార్థులకు తొలిరోజు 142 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. తగ్గిన హాజరుశాతం ఇబ్రహీంపట్నం: మండలంలోని 47 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో సుమారు 5,240 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. తొలిరోజు అమావాస్య కావడంతో 1,056 మంది మాత్రమే హాజరయ్యారు. వచ్చిన వారికి పుస్తకాలు అందజేశారు. -
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
కడ్తాల్: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్గుప్తా అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని హనుమాన్ఘడ్ ఆంజనేయస్వామి ఆలయంలో సంతోష్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్విండో వైస్ చైర్మన్ సత్యం, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, చెన్నకేశవ ఆలయ కమిటీ చైర్మన్ జంగారెడ్డి, సభ్యులు యాదయ్య, రమేశ్గౌడ్, నాయకులు రామకృష్ణగుప్తా, వీరేందర్గుప్తా, గోపాల్రెడ్డి, అంజి, సుధాకర్, తిరుమల్ తదితరులు ఉన్నారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత
కడ్తాల్: ప్రజాస్వామ్య పరిరక్షణ మనందరి బాధ్యతని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీష్ అన్నారు. సోమవారం మండల పరిధి మైసిగండిలోని ప్రైవేట్ గార్డెన్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ స్పెషల్ ఇంటెన్సివ్పై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియ, ఓటర్ల జాబితా నిర్వహణ, బూత్ స్థాయి బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను, ఇంటింటి సర్వేను పరిశీలించాలని, ఏ ఒక్కరి ఓటు తొలగింపునకు గురికాకుండా చూడాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సవరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు సద్వినియోగం చేసుకుని, అర్హులైన వారి ఒక్క ఓటు తొలగించకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి దేశ వ్యాప్తంగా ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నాయని, కాంగ్రెస్ ఓటర్ల ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీసింగ్, సభ్యుడు శ్రీనివాస్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, విజయ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి, పార్టీ మండలాల అధ్యక్షులు బీచ్యానాయక్, ప్రభాకర్రెడ్డి, కిషన్రెడ్డి, జగన్, బాల్రెడ్డి, హరికిషన్నాయక్, కల్వకుర్తి పట్టణ అధ్యక్షుడు రాహుల్, నియోజకవర్గ బీఎల్ఓలు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
ఉప సర్పంచ్ల కమిటీ నియామకం
యాచారం: మండల పరిధి గునుగల్ పంచాయతీ ఉప సర్పంచ్ మచ్చ అనిల్కుమార్.. ఉప సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సోమవారం మండల కేంద్రంలో ఉప సర్పంచులు నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడిగా అనిల్కుమార్, ఉపాధ్యక్షుడిగా విస్లావత్ రాజు(తక్కళ్లపల్లితండా), ప్రధాన కార్యదర్శిగా మధుకర్రెడ్డి(నక్కర్తమేడిపల్లి), జాయింట్ కార్యదర్శులుగా నాగరాజు(ధర్మన్నగూడెం), అనమోని రవీందర్(కుర్మిద్ద), కోశాధికారిగా రెడ్డమోని శిరీష(మల్కీజ్గూడం), సభ్యులుగా కుమ్మరిగూడెం మంగ(యాచారం), గౌర లక్ష్మణ్(గడ్డమల్లయ్యగూడం), నాయిని శ్రీకాంత్(చింతుల్ల), అనిత(కొత్తపల్లి), మల్లమ్మ(మాల్), సువర్ణ(తక్కళ్లపల్లి)లను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ.. ఉప సర్పంచుల హక్కులు, వారి బాధ్యతల గురించి త్వరలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కలిసి విన్నవిస్తామని తెలిపారు. -
పంటను అమ్ముకుందాం.. ఆర్థిక ప్రగతి సాధిద్దాం
యాచారం: మన పంటను మనమే అమ్ముకుందాం. మద్దతు ధర పొంది ఆర్థిక ప్రగతి సాధిద్దామని ఎంపీడీఓ రాధారాణి అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో సోమవారం మండల మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు.. సంఘాల ద్వారా రూ.కోట్లు వడ్డీలేని రుణాలు, సీ్త్రనిధి, బ్యాంకు రుణాలు పొంది తమ వ్యవసాయ పొలాల్లో పంటల సాగుకు పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. కానీ మన పొలాల్లో పండించే కూరగాయలను స్వయంగా మార్కెటింగ్ చేసి, విక్రయించుకుందామన్న ఆలోచన ఉండాలని సూచించారు. త్వరలో మండల కేంద్రంలో కూరగాయల ఉత్పత్తి విక్రయాలు జరిగేలా చేద్దామన్నారు. గతంలో మండల కేంద్రంలో కూరగాయల ఉత్పత్తి కేంద్రం ఉండేదని, కొన్ని కారణాల వలన మూత పడిందని పేర్కొన్నారు. మరలా తెరిపించే విధంగా కృషి చేద్దామని చెప్పారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రవీందర్, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఎంపీడీఓ రాధారాణి -
ఏఐటీయూసీ కార్యవర్గం ఎన్నిక
ఇబ్రహీంపట్నం: మండల పరిధి ముకునూర్ ఏఐటీయూసీ గ్రామ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్యామల నర్సింగ్రావు, గౌరవ అధ్యక్షుడిగా కుర్మిద్ద దశరథ, ఉపాధ్యక్షులుగా సునీల్కుమార్, చంద్రయ్య, కార్యదర్శులుగా రాంగోపాల్చారి, రవీందర్, సహాయ కార్యదర్శులుగా మహేందర్, అంజయ్య, ఆర్గనైజర్స్గా రాము లు, లక్ష్మయ్య, భిక్షపతిలను నియమించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నర్సింహ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, సీపీఐ మండల కార్యదర్శి సురేష్, కార్మికులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తు దారులకు ఇంటర్వ్యూ యాలాల: ఎస్సీ కార్పొరేషన్ పథకం రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి బుధవారంఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ శ్రీనిజ సోమవారం తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులు దరఖాస్తుదారులతో మాట్లాడతారని చెప్పారు. అర్జీదారులు ఉదయం 11 గంటల వరకు రావాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి ఆమనగల్లు: వానాకాలం నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే రోగాల బారిన పడకుండా ఉంటామని మేడిగడ్డతండా సర్పంచ్ రాజేశ్వరి అన్నారు. సోమవారం తండాలో ఆమె పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్లకు ఇరువైపులా, వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఉప సర్పంచ్ విజయ్రాథోడ్, కార్యదర్శి ప్రశాంతి, స్థానికులు భాస్కర్, శాంతి, దోళి, రఘు, శ్రీను, మస్రు ఉన్నారు. కంటి వైద్య శిబిరానికి స్పందన ఆమనగల్లు: పట్టణంలోని రాంరెడ్డి లయన్స్ కంటి ఆస్పత్రి విజన్ సెంటర్లో సోమవారం లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. శిబిరాన్ని లయన్స్క్లబ్ జిల్లా చైర్మన్ చంద్రశేఖర్ ప్రారంభించారు. కంటి వైద్య సహాయకుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 65 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ నిమిత్తం 35 మందిని ఎనుగొండలోని రాంరెడ్డి లయన్స్ కంటి ఆస్పత్రికి తరలించారు. లయన్స్క్లబ్ జిల్లా చైర్మన్ యాదయ్య, పీఆర్ఓ పాషా, సభ్యులు మధుసూదన్రెడ్డి, కొండల్రెడ్డి పాల్గొన్నారు. సర్కారు బడులను బలోపేతం చేయాలి ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎంపీడీఓ జయరాం విజయ్ అన్నారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల తరగతి గదులు, పరిసరాలు, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలను వెంటనే విద్యార్థులకు అందించాలని చెప్పారు. చిన్నారుల సంఖ్య పెంచేందుకు గ్రామస్తుల సహకారంతో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ పాండు, ప్రధానోపాధ్యాయులు రామలక్ష్మి, పద్మ పాల్గొన్నారు. మైసమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే పూజలుకడ్తాల్: మండల పరిధి మైసిగండి మైసమ్మను సోమవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శాలువా కప్పి సన్మానించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీసింగ్, సర్పంచ్ ప్రేమజవహర్లాల్, మాజీ సర్పంచ్ శేఖర్గౌడ్, ఉప సర్పంచ్ శేఖర్గౌడ్, ఆలయ ట్రస్టీ శిరోలీ, నిర్వాహకులు భాస్కర్నాయక్, అరుణ్కుమార్, అర్చక సిబ్బంది ఉన్నారు. -
రేపు ఆరుట్ల పబ్లిక్ స్కూలు ప్రారంభోత్సవం
మంచాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఈ నెల 17న సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇదే వేదికగా అల్పాహారం పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల సందర్శన, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, నూతనంగా ఏర్పాటు చేసి కనీస సౌకర్యాలు, క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించనున్నారు. పాఠశాలకు సమీపంలోని అమ్మోరుతల్లి దేవాలయం సమీపంలో హెలీప్యాడ్ పనులు చేపట్టారు. అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంలో బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 20 వేల మందిని తరలించాలని భావిస్తున్నారు. ఆరుట్లకు సీఎం రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఫ్యూచర్సిటీ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, డీఈఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఎంవీ ప్రసాద్, ఎంపీడీఓ వసంతలక్ష్మి, ఏసీపీ రాజు, సర్పంచ్ శోభ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హాజరు కానున్న సీఎం రేవంత్రెడ్డి ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం -
మా భూముల్లోకి మమ్మల్ని వెళ్లనివ్వండి
ఇబ్రహీంపట్నం రూరల్: మా భూముల్లోకి మమ్మల్ని వెళ్లనివ్వండి .. వ్యవసాయం చేసుకొని బతుకుతాం అని అధికారులను కాస్బాగ్ రైతులు వేడుకున్నారు. సోమవారం నాదర్గుల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ గేటు ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాదర్గుల్ సర్వే నంబర్ 613లో తమ భూములు ఉన్నాయని, అక్కడ అడ్డుగా ఉన్న బ్లూషీట్స్ తొలగించి రోడ్డు మార్గం చూపించాలని కోరారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. నాదర్గుల్ నుంచి కలెక్టరేట్ వరకు రైతుల పాదయాత్ర -
ఎరువుల బుకింగ్ యాప్ రద్దు చేయండి
షాబాద్: ఎరువుల బుకింగ్ యాప్ రద్దు చేయాలంటూ సోమవారం షాబాద్ రైతు వేదిక కార్యాలయం వద్ద ఽరైతులు ఆందోళన చేపట్టారు. రైతు వేదికకు తాళం వేసి అధికారులను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యాప్లో సాంకేతిక లోపాలు, ఓటీపీ సమస్యలు, ఎరువుల బుకింగ్లో జాప్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వెంటనే బుకింగ్ యాప్ను రద్దు చేసి, గతంలో మాదిరిగా నేరుగా ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సహకార సంఘంలో ఎరువుల స్టాకు ఉంచాలన్నారు. వెంటనే అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతు వేదిక కార్యాలయానికి తాళం వేసి ఆందోళన -
డయేరియాపై అవగాహన అవసరం
ఇబ్రహీంపట్నం రూరల్: వర్షాకాల సీజన్లో డయేరియా ప్రబలకుండా నివారణపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి డయేరియా క్యాంపెయిన్, పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ, హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ఈనెల 15 వరకు సన్నాహక దశగా, 16 నుంచి జూలై 31 వరకు అమలు దశగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అంగన్వాడీ, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈనెల 28న నిర్వహించనున్న పల్స్పోలియో ద్వారా ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల పిల్లలకు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో డీ వార్మింగ్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న ఇంటింటీకి తిరిగి మాత్రలు అందిస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమిలో ప్రహరీ కూల్చివేత
అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ సర్వే నంబర్ 24లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన ప్రహరీని సోమవారం తహసీల్దార్ సుదర్శన్రెడ్డి ఆదేశాల మేరకు గిర్దవార్ రాంబాబు, జీపీఓలు జేసీబీ సాయంతో కూల్చివేయించారు. ఈ మేరకు కందకం తవ్వించి అధికారిక బోర్డును ఏర్పాటు చేశారు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్రహరీ నిర్మాణం చేపట్టారని అన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కందుకూరు: ఫ్యూచర్సిటీలో నిర్మిస్తున్న 330 అడుగుల రేడియల్ రహదారి నిర్మాణ పనులను సోమవారం మండల పరిధిలోని బేగరికంచె రైతులు అడ్డుకున్నారు. పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని నిలదీశారు. వీరికి సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దుబ్బాక రాంచందర్, మండల కార్యదర్శి బుట్టి బాల్రాజ్ మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు వారి వద్దకు వచ్చారు. కలెక్టర్తో గతంలో నిర్వహించిన సమావేశంలో ఎకరాకు రూ.35 లక్షలు ఇస్తామని అంగీకరించారని, మళ్లీ ఎందుకు పనులు అడ్డుకుంటున్నారని తహసీల్దార్ గోపాల్ వారిని ప్రశ్నించారు. ఎకరాకు రూ.40 లక్షలు పరిహారం ఇవ్వాలని, ఏఏ రైతు భూమి రోడ్డు నిర్మాణంలో పోతుందో లిస్టు ప్రదర్శించాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్డీఓను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని తహసీల్దార్ వారికి సూచించి పంపించారు. కడ్తాల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్సిటీ పరిధిలో భూములు కోల్పోతున్న ఆదివాసీ గిరిజన లంబాడాల హక్కులను కాపాడాలని, వారికి తగిన న్యాయం జరిగేలా చూడాలని గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్ కోరారు. ఈ మేరకు సోమవారం ఫ్యూచర్సిటీలో భూములు కోల్పోతున్న గిరిజనుల పక్షాన గిరిజన సేవా సంఘం నాయకులతో కలిసి, హైదరాబాద్లోని దిల్కుషా గెస్ట్హౌస్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్నాయక్తో సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో ఆదివాసీ లంబాడాలు తమ సాగు భూములు కోల్పోతున్నారని, తరతరాలుగా భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఆయన వెంట గిరిజన సేవా సంఘం నాయకులు ఉన్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: పంచాయతీ సర్పంచులు, పారిశుద్ధ్య కార్మికుల వేతన బిల్లులను ప్రభుత్వం మంజూరు చేసింది. డిసెంబర్ 22 నుంచి మే 2026 వరకు జిల్లాలోని 515 మంది సర్పంచులకు మొత్తం రూ.1,78,13,850 విడుదల చేసింది. మరో పది మంది సర్పంచుల ఆధార్ నంబర్లు ఇతర ఖాతాలతో అనుసంధానమై ఉండటం, ఇతర శాఖల నుంచి వేతనాలు పొందుతుండటంతో వేతనాలను నిలిపివేశారు. మాడ్గుల మండలం నర్సంపల్లికి ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వ హించలేదు. ఆ గ్రామ పంచాయతీకి గౌరవ వేతన చెల్లింపు చేయలేదు. ఇదిలా ఉంటే జిల్లాలోని 2,907 మంది పంచాయతీ సిబ్బందికి నెలకు రూ.9,500 చొప్పున మే నెలకు సంబంధించిన వేతనాలు రూ.2,68,94,500 ఆయా ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ ప్రకటించారు. -
ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం వద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి ఫిర్యాదుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ఓ అనంతరెడ్డికి నేరుగా విన్నవిస్తూ, అర్జీలు సమర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం రెవెన్యూ శాఖకు సంబంధించి 28, ఇతర శాఖలకు సంబంధించి 90, మొత్తం 118 అర్జీలు అందాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొహర్రం ఏర్పాట్లు పూర్తి చేయాలి మొహర్రం ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మొహర్రం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చేపట్టాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలు తదితర అంశాలను మైనార్టీ వర్గాల పెద్దలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేసి చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నవీన్కుమార్రెడ్డి, రోడ్లు భవనాల శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ, వైద్యా ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి -
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
ఆమనగల్లు: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ అన్నారు. తలకొండపల్లి మండలం వెల్జాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేడ్క ర్ విగ్రహానికి పూలమాలలు వేసి, గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. అనంతం ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఎస్సీ లో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థినులు, ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా చారకొండ వెంకటేశ్ మాట్లాడుతూ.. విద్యాకమిషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు రూపొందించి అ మలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మారుస్తూ అత్యాధునిక వసతులు కల్పించి విద్యార్థులకు ఇంటర్ వరకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములమ్మ, ఉపసర్పంచ్ విజయలక్ష్మి, ఎంఈఓ చాంప్లానాయక్, మార్కెట్ డైరెక్టర్ వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డోకురు ప్రభాకర్రెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ అంజయ్యగౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ -
అర్హులైన ఓట్లు తొలగించకుండా చూడాలి
తుక్కుగూడ: ఓటర్ల జాబితా సవరణ విషయంలో కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి సూచించారు. మంఖాల్ డివిజన్ ఇమామ్గూడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించినట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో మనం నిర్లక్ష్యం వహిస్తే పార్టీకి, ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందన్నారు. అర్హులైన ఓట్లు జాబితా నుంచి తొలగించకుండా బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్లార్, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, నాయకులు దేప భాస్కర్రెడ్డి, చిగిరింత పారిజాతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హాజరంతే!
మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026తొలిరోజు సగం కూడా రాని విద్యార్థులుసాక్షి, రంగారెడ్డి జిల్లా: నెలన్నర రోజుల తర్వాత పాఠశాలల గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. సోమవారం సరిగ్గా ఉదయం తొమ్మిది కాగానే బడిగంటలు మోగాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. తొలి రోజు హాజరు పది శాతంలోపే నమోదైంది. పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థులను ఆకర్షించేందుకు ఆయా పాఠశాలల ఆవరణలను అందంగా తీర్చిదిద్దారు. స్కూలుకు చేరుకున్న వారికి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. సరూర్నగర్, గండిపేట మండలాల్లోని పలు పాఠశాలల్లో ఉదయం అల్పాహారం అందజేశారు. మధ్యాహ్నం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం సరఫరా చేశారు. అమావాస్య సెంటిమెంట్తో.. అమావాస్య సెంటిమెంట్ కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు నిరాకరించారు. కడ్తాల్ మండల పరిధి లోని వివిధ పాఠశాలల్లో 1,226 మంది చదువుతుండగా 142 మంది మాత్రమే హాజరయ్యారు. మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో 175 మందికి ఇద్దరే హాజరయ్యారు. బాలికల పాఠశాలలో 110 మందికి 15 మంది మాత్రమే వచ్చారు. యాచారం మండ లంలో 3,500 మంది విద్యార్థులకు కేవలం 150 మంది హాజరయ్యారు. రెండో రోజైన మంగళవారం కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. బుధవారం నుంచి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.గుర్రంగూడ పాఠశాలకు హుషారుగా వస్తున్న విద్యార్థులు తెరుచుకున్న పాఠశాలలు విద్యార్థులకు ఘన స్వాగతం అమావాస్య ఎఫెక్ట్తో తగ్గిన హాజరు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ షురూ -
జంట జలాశయాలకు వరద
● సందర్శించిన ఎండీ అశోక్ రెడ్డి ● అప్రమత్తంగా ఉండాలని సూచన సాక్షి, సిటీబ్యూరో: నగర శివారులోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు హిమాయత్ సాగర్ జలాశయంలోకి 800 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఉస్మాన్ సాగర్ జలాశయానికి కూడా ప్రవాహాలు ప్రారంభమైనట్లు జలమండలి అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయాల్లోకి వస్తున్న ప్రవాహాల పరిమాణం, నీటి మట్టాల పరిస్థితిని జలమండలి సాంకేతిక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. జలాశయాల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి సూచించింది. ఆదివారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హిమాయత్ సాగర్ జలాశయాన్ని సందర్శించారు. వరద సన్నద్ధత చర్యలు, కార్యాచరణ ప్రణాళికలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ఏర్పాట్లను సమీక్షించారు. జలాశయాల్లోని నీటి మట్టాలు, క్యాచ్మెంట్ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాలు, నీటి నాణ్యతకు సంబంధించిన టర్బిడిటీ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖలతో సమన్వయంగా చేసుకోవాలని సూచించారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790.00 అడుగులు (3.518 టీఎంసీ) ప్రస్తుతం నిల్వలు 1784.30 అడుగులు (2.493 టీఎంసీ) హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు (2.521 టీఎంసీ) ప్రస్తుత నిల్వలు 1760.60 (2.110 టీఎంసీ) ఇన్ఫ్లో 800 క్యూసెక్కులు -
ప్రార్థనా మందిరంలోకి వెళ్లి దాడి
ఇబ్రహీంపట్నం రూరల్: ఓ ప్రార్థన మందిరంలోకి వెళ్లి ఓ వ్యక్తిని చితకబాదడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బొంగ్లూర్ సమీపంలోని సప్తగిరి కాలనీలో ఉన్న ఓ ప్రార్థన మందిరంలో ఆదివారం కొంత మంది ప్రార్థన చేస్తుండగా హిందూ వాహిని సంఘాల సభ్యులు వెళ్లి అడ్డుకున్నారు. ఘటనను చిత్రీకరిస్తున్న రాజు అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి నర్సింహారెడ్డి, రోహిత్, వేణుపై ఫిర్యాదు చేశాడు. ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ, హిందు వాహిని సంఘాలు నాయకులు పెద్ద సంఖ్యలో ఆదిబట్ల పోలీస్స్టేషన్కు చేరుకుని ధర్నాకు దిగారు. అరెస్టు చేసిన ముగ్గురినీ వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టారు. పోలీసులు ఆందోళనకారులను సముదాయించి పంపించారు. పెళ్లి చేసుకోవాలంటూ వివాహితకు వేధింపులు ఫిలింనగర్: తనను పెళ్లి చేసుకోవాలంటూ వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా అంకిరావుపల్లె గ్రామానికి చెందిన డేగరాజు (25), ఫిలింనగర్లో నివాసముంటున్న ఒక వివాహిత (24)ను కొంతకాలంగా ఫోన్ ద్వారా వేధిస్తూ అసభ్యకర మెసేజ్లు పంపుతున్నాడు.తన భర్తను విడిచిపెట్టి తనతో రావాలని, పెళ్లి చేసుకోవాలని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన కదలికలను గమనిస్తూ, దారిపొడవునా అడ్డగిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. నిందితుడి వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు డేగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● ముగ్గురిపై కేసు నమోదు ● ఆదిబట్ల ఠాణా ఎదుట హిందూ సంఘాల ధర్నా -
డంపింగ్ యార్డ్ వద్దేవద్దు
వ్యతిరేకంగా 14 గ్రామాల ప్రజల ఆందోళన అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని బండరావిరాల సర్వే నంబర్ 268లో ప్రభుత్వం ఎకోటౌన్ పేరుతో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ సుమారు 14 గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆదివారం ఆందోళన బాటపట్టారు. చిన్నరావిరాలలోని గువ్వలేటి కూడలి నుంచి సద్దుపల్లి కూడలి వరకు వందలాది మంది సుమారు 5 కిలోమీటర్ల మేరకు నిరసన ర్యాలీ చేపట్టారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చిన్నరావిరాల సర్పంచ్ పబ్బతి బాలకిషన్గౌడ్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తే గ్రామాలన్నీ కాలుష్యకోరల్లో చిక్కుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం ప్రభుత్వం తెచ్చిన జీఓ నెం. 20ని వెంటనే రద్దు చేసి ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 14 గ్రామాల ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని చూస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచులు కందికంటి విజయ్కుమార్, కొలన్ ప్రసన్నరవీందర్రెడ్డి, జంగయ్యయాదవ్, పెరుమాళ్ల మహాలక్ష్మీ దానయ్య, మహేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చందానగర్ : రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12 సంవత్సరాల మోదీ పాలనలో రైల్వే వ్యవస్థలో కీలక మార్పులు వచ్చాయన్నారు. కొత్త లైన్ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయన్నారు.హఫీజ్పేట్, హైటెక్ సిటీ స్టేషన్లు రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, కేశవులు, అనిల్ గౌడ్, రామరాజు పాల్గొన్నారు. చీరకు ఆర్డర్ పెడితే ఖాతా ఖాళీ అయ్యింది బంజారాహిల్స్: ఇన్స్ట్రాగామ్ పేజీలో ఆకర్షణీయమైన ఓ చీరకు ఆర్డర్ పెడితే యువతిని సైబర్ మోసగాళ్లు లింక్ పంపించి ఖాతా ఖాళీ చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరిలో నివసించే ఏ.శిల్ప అనే మహిళ ఇన్స్ట్రాగామ్ పేజీ చూసి ఓ చీరను ఆర్డర్ చేసింది. అయితే చీర డెలివరీ కాకపోవడంతో వెంటనే సంబంధిత విక్రేతకు ఫోన్ చేసింది. వెంటనే అవతలి వ్యక్తి నుంచి హైదరాబాద్ సిల్క్ శారీస్ పేరుతో రీఫండ్ లింక్ వచ్చింది. ఇది నమ్మిన ఆమె వెంటనే లింక్ నొక్కగా కొద్దిసేపట్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. దీంతో బాధితురాలు వెంటనే సిమ్కార్డును బ్లాక్ చేసింది. అప్పటికే సైబర్ మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.37,447 ఖాళీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణ పబ్లిక్ స్కూల్ సూపర్
మంచాల: ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ చాలా బాగుందని ఆర్టీఐ కమిషనర్ అయోధ్య రెడ్డి అన్నారు. ఆదివారం స్కూల్ను సందర్శించిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది విద్యార్థులు, ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు.. విద్యా బోధన అమలు తీరు.. సదుపాయాలపై ఆరా తీశారు. కార్పొరేట్ కంటే చాలా బాగుందని కితాబిచ్చారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు శివారెడ్డి, చారకొండ వెంకటేశ్, పద్మజాష, డీఈఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ ఎంవీ ప్రసాద్, ఎంఈఓ రాందాస్, హెడ్ ఆఫ్ ది స్కూల్ గిరిధర్గౌడ్, ఆరుట్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాములు, నోడల్ ఆపీసర్ కిషన్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. 17న సీఎం రేవంత్ రెడ్డి రాక! ఈ నెల 17న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శించినట్టు తెలిసింది. -
అర్హులైన ఓటర్లను కాపాడుకుందాం
ఇబ్రహీంపట్నం రూరల్: అర్హులైన ఓటర్లను కాపాడుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. పీసీసీ ఆదేశాల మేరకు బొంగ్లూర్లోని ప్రమీదా కన్వెన్షన్ హాల్లో ఆదివారం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్స్కు శిక్షణ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్రెడ్డి, పీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో కాంగ్రెస్ ఓట్లు పెద్ద ఎత్తున తొలగించబడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యంగా వహిస్తే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పారు. బీఎల్ఓలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో సాగుతూ ఒక్క ఓటు కూడా వృథా కాకుండా కాపాడుకోవాలన్నారు. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై జరిగే కుట్రలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ట్రైనింగ్ కమిటీ చైర్మన్ రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. నియోజకవర్గ బీఎల్ఓల శిక్షకుడు కృష్ణారెడ్డి ఓటరు జాబితా పరిశీలన, సవరణల ప్రక్రియ, ఇంటింటికీ నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో మల్రెడ్డి అభిషేక్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, నాయకులు శేఖర్గౌడ్, రాచర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
బలవుతున్నా.. పరిహారమేది?
● విద్యుదాఘాతానికి మృతి చెందుతున్న మూగజీవాలు ● అవగాహన లేక పరిహారం పొందలేకపోతున్న బాధితులు దుద్యాల్: విద్యుదాఘాతానికి మూగజీవాలు బలవుతున్న సంఘటనలు అధికమవుతున్నాయి. దీనిపై అవగాహన లేక చాలా మంది నష్ట పరిహారం పొందడం లేదు. ప్రస్తుతం వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగి కింద పడుతుంటాయి. పశువులు, పశువుల కాపరులు, రైతులు కింద పడిన విద్యుత్ తీగలను గమనించకుండా వాటికి తగిలి మృత్యువాత పడుతున్న సంఘటనలు ఉంటాయి. ఈ ప్రమాదాల్లో నష్టపోయిన కుటుంబాలకు విద్యుత్శాఖ పరిహారం అందిస్తుంది. కానీ ప్రభుత్వం అందించే పరిహారంపై అధిక శాతం మందికి అవగాహన లేకపోవడంతో నష్టపోతున్నారు. ఒక వైపు పశువులు, మరో వైపు మనుషులు విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడుతున్నారు. పరిహారం పొందే విధానం గురించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పరిహారం అందుకునే విధానం విద్యుత్ ప్రమాదం జరిగిన వెంటనే పరిహారం కోసం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కేసు నమోదైన తర్వాత పశువైద్యుల సహాయంతో శవ పంచనామా చేయించాలి. కేసుకు సంబంధించిన పత్రాలతో విద్యుత్ శాఖ సహాయక ఇంజనీర్ దగ్గర దరఖాస్తు చేసుకోవాలి. మరణ ధ్రువపత్రం, ఎఫ్ఐఆర్, పంచనామా నివేదిక, ఆధార్ కార్డు, బ్యాంకు పుస్తకం తదితర కాపీలను జతపరిచి విద్యుత్ ఏఈకి అందజేయాలి. ఏఈ నుంచి పత్రాలు ఏడీఈకి చేరుతాయి. ఆ పత్రాలు ఉన్నతాధికారులకు అందిన తర్వాత నష్ట పరిహారం బాధితుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. మానవులకు ప్రమాదం జరిగితే విద్యుత్ ప్రమాదంతో అంగ వైకల్యం కలిగితే ప్రమాద విషయాన్ని వెంటనే విద్యుత్శాఖ అధికారులకు తెలియజేయాలి. వైద్యం నిమిత్తమైన ఖర్చుకు సంబంధించిన బిల్లులు, ఇతర ఖర్చుల వివరాలకు సంబంధించి ధ్రువ పత్రాలు దరఖాస్తుకు జతపరిచి ఏఈకి అందించాలి. ఉన్నతాధికారులు వాటిని పరిశీలించి నష్ట పరిహారం మంజూరు చేస్తారు. మూగజీవాలకు అయితే.. పశువులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందితే ముందుగా సంబంధిత విద్యుత్శాఖ అధికారులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించాలి. పశువైద్యాధికారి నుంచి పశువు ఖరీదు తెలిపే పత్రం, మృతి చెందినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. మృతి చెందిన పశువు నిమిత్తం పరిహారం బాధితుడికి అందిస్తారు. పశు వైద్యులు సూచించిన మేరకు నష్ట పరిహారం అందుతుంది. అర్హులకే ఇస్తాం విద్యుత్ ప్రమాదాలకు సంబంధించిన బాధిత కుటుంబాలు అర్హులైతే పరిహారం తప్పకుండా అందుతుంది. ప్రమాదం జరిగిన స్థాయిని బట్టి పరిహారం ఉంటుంది. నిబంధనల ప్రకారం అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. మూగ జీవాల విషయంలో పశువైద్యాధికారి ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు పరిగణలోకి తీసుకుంటున్నాం. – ఆనంద్, విద్యుత్ ఏఈ, దుద్యాల్ పరీక్షలు చేస్తాం మూగ జీవాలకు విద్యుత్ ప్రమాదం సంభవించిన వెంటనే పశువైద్యులకు తెలియజేయాలి. ప్రమాదం జరిగిన పశువుకు నిర్ధారణ పరీక్షలు చేస్తాం. నిజ నిర్ధారణ తర్వాత పశువుకు సంబంధించి మరణ ధ్రువ పత్రం, పరీక్షకు సంబంధించి పత్రాలు పశువు యాజమానికి అందిస్తాం. – పరమేశ్వర్, పశువైద్యాధికారి, కొడంగల్ ఇటీవల సంఘటనలు దుద్యాల మండలం పోలేపల్లి తండాకు చెందిన రాథోడ్ చందు నాయక్కు సంబంధించి రూ.70 వేల విలువ చేసే పాలిచ్చే గేదె తండాలోనే ట్రాన్స్ఫార్మర్ దగ్గర విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మండలంలోని పల్లెగడ్డకు చెందిన ముకుంద రెడ్డికి సంబంధించి రూ.60 వేల విలువ చేసే ఎద్దు విద్యుత్ షాక్ గురై మృత్యువాత పడింది. కొడంగల్ మండలం పల్గురాళ్ల తండా మునేగారి సాయిలుకు చెందిన రూ.50 వేల విలువ చేసే ఎద్దు విద్యుదాఘాతానికి గురై మరణించింది. రోటిబండ తండాకు చెందిన పాండు నాయక్(61) పశువులకు మేత కోసి వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. అలాగే సేవ్యానాయక్ చెందిన రూ.90 వేల గేదె విద్యుత్ వైర్లు తగిలి మృత్యువాత పడింది. -
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
శంకర్పల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అన్నారు. గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ (జీడబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో ఆదివారం ప్రొద్దటూరులోని ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కులో ఏర్పాటు చేసిన ఎథినిక్ రన్ (జీరో వేస్ట్ రన్)కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న స్వచ్ఛంద సంస్థలను ఏకతాటిపైకి తెచ్చేందుకు రూపొందించిన జాతీయ వేదిక శ్రీస్వచ్ఛ సేతుశ్రీ యాప్ని ప్రారంభించారు. 3కే, 5కే, 10కే రన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. గండిపేట్ వెల్పేర్ సోసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్వచ్ఛ సేతు’ యాప్ ఉద్యమంలో ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థ పాల్గొనాలని పిలుపునిచ్చారు. భూమిలో కరిగే వస్తువుల వాడకంపై దృష్టి సారించాలని, తద్వారా పర్యావరణం విషతుల్యం కాదని అభిప్రాయపడ్డారు. జీడబ్ల్యూఎస్ ప్రతినిధి తిమ్మయ్యగారి వాణి మాట్లాడుతూ.. వ్యర్థాలను నియంత్రించే కార్యక్రమంలో భాగంగానే ఈ ఏడాది జీరో వేస్ట్ రన్ ఏర్పాటు చేశామని, ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శాంతి తుమ్మల, ఎక్స్పీరియం ఎండీ రాందేవ్ రావు, వాటా ఫౌండేషన్ ప్రతినిధి ఉదయ్ కుమార్, జేఎస్ఆర్ అన్నమయ్య, మోకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనర్ -
దూసుకొచ్చిన మృత్యువు
● ఆగివున్న ఆటో డ్రైవర్లను ఢీకొట్టిన టిప్పర్ ● అక్కడికక్కడే ఒకరి దుర్మరణం ● చికిత్స పొందుతూ మరొకరి మృతి మీర్పేట: టిప్పర్ రూపంలో దొసుకొచ్చిన మృత్యువు ఇద్దరు ఆటోడ్రైవర్లను బలిగొంది. ఈ సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుర్రంగూడ ఆదిత్యనగర్కు చెందిన సునీల్ (35) ఆటో శనివారం రాత్రి 10.30 గంటలకు మందమల్లమ్మ చౌరస్తా వద్ద పాడైపోవడంతో స్నేహితుడైన గుర్రంగూడ అరవింద్నగర్ కాలనీకి చెందిన ప్రసాద్కు ఫోన్ చేసి రమ్మన్నాడు. ప్రసాద్ తనకు పరిచయం ఉన్న మరో ఆటోడ్రైవర్ సంతోష్ (35)కు ఫోన్ చేసి రిపేరు కోసం సాయపడాలని పిలిపించాడు. ముగ్గురూ కలిసి సునీల్ ఆటోను తరలించేందుకు మరో ఆటోకు కట్టారు. ప్రసాద్ తన ఆటోను రోడ్డుకు అవతలి వైపు నిలపడంతో రోడ్డు దాటుతుండగా సునీల్, సంతోష్ ఆటోల పక్కన నిల్చున్నారు. అదే సమయంలో ఎల్బీనగర్ నుంచి ఓవైసీ వైపు వేగంగా వెళ్తున్న టిప్పర్ (ఏపీ29వీ 3873) ఢీ కొట్టింది. దీంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా, సునీల్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంతోష్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి, గాయపడ్డ సునీల్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీల్ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. సంతోష్ది మాడ్గుల మండలం రాందుగ్యాల గ్రామం కాగా నగరానికి వచ్చి రెండ్రోజులు ఆటో నడిపి తిరిగి గ్రామానికి వెళ్తుంటాడు. సునీల్కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ను వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన జావాళ సురేష్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సునీల్ (ఫైల్)సంతోష్ (ఫైల్) -
1,321
ఫిట్లెస్ బడి బస్సులుసాక్షి, సిటీబ్యూరో: బడి గడువు ముంచుకొచ్చింది. సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకోను న్నాయి. సాధారణంగా ప్రతి ఏటా మే నెలలో అన్ని బస్సులకు సామర్థ్య పరీక్షలు పూర్తిచేసి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. కానీ.. విద్యాసంస్థల నిర్లక్ష్యం, ఆర్టీఏ అధికారుల ఉదాసీనత కారణంగా గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ 1,321 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి కాలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 13,730 బడి బస్సులు ఉన్నాయి. స్కూళ్లు తెరుచుకొనే సమయానికి అన్ని బస్సులకు సామర్థ్య పరీక్షలు పూర్తి కావాల్సిఉండగా ఇంకా వందల సంఖ్యలో మిగిలిపోవడం గమనార్హం. మరోవైపు ఫిట్నెస్ లేకుండా తిరిగే బస్సులపై చర్యలు చేపట్టేందుకు ఈ నెల 15 నుంచే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ ఫిట్నెస్ తీరుజిల్లా మొత్తం ఫిట్నెస్ ఫిట్నెస్ బస్సులు పూర్తయినవి పూర్తి కానివి హైదరాబాద్ 1,265 1,100 165 రంగారెడ్డి 6,307 5,682 625 మేడ్చల్ 6,158 5,627 531 విద్యా సంస్థలు, ఆర్టీఏ అధికారుల ఉదాసీనత -
చిలుకూరులో ‘వేణునాదం’
మొయినాబాద్: జేష్ట అమావాస్య సందర్భంగా ఆదివారం చిలుకూరు బాలాజీ దేవాలయంలో ‘వేణునాదం’ సంగీత కార్యక్రమం నిర్వహించారు. సమాజ శ్రేయస్సు, ప్రకృతి సమతుల్యత, సకాలంలో వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ ‘వేణునాదం’ పేరుతో దివ్య వేణుగానం కార్యక్రమం చేపట్టినట్టు చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ తెలిపారు. సనాతన ధర్మంలో సంగీతాన్ని దైవారాధనకు శ్రేష్ట సాధనంగా భావిస్తారని.. ఆ సంప్రదాయానికి అనుగుణంగా వేణునాదం నిర్వహించామని చెప్పారు. సంగీత కళాకారులు అనంత కృష్ణ తన మధురమైన వేణుగానంతో భక్తులను పరవశింపజేశారు. ఆయనకు వెంకట నాగ సాయి శర్మ మృదంగం, పవన్ సింగ్ వయోలిన్తో సహకారం అందించారు. షాద్నగర్: ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బేగరి మహేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంలు, బ్యాగులు విక్రయిస్తున్నారని అన్నారు. విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తూ తల్లిదండ్రులపై అధనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. అక్రమ వసూళ్లు, పుస్తకాల దందాను అరికట్టాలన్నారు. విద్యను లాభార్జన సాధనంగా మార్చడం సమాజానికి హానికరమన్నారు. విద్యాశాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇబ్రహీంపట్నం: సమాజాభివృద్ధికి విద్య బలమైన పునాది అని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల కురుమ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పది, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన కురుమ విద్యార్థులకు ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం, నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ల సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. క్రమశిక్షణతో విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కురుమలంతా ఐకమత్యంతో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. కురుమలు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సరితతిరుపతయ్య, ది మిషన్ వ్యవస్థాపకుడు, ఎకై ్సజ్ సీఐ ఏడుకొండలు, ప్రముఖ ఇంపాక్ట్మోటివేషనల్ స్పీకర్ గాజుల శేఖర్, ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు శ్రీశైలం, జంగయ్య, బీరప్ప, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా 118వ సారి రక్తదానం చేసిన ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయి చౌదరిని ఆదివారం హైదరాబాద్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అభినందించారు. యువత దేశానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని గవర్నర్ పిలుపునిచ్చారు. భవిష్యత్లో సైతం రక్తదానం చేయడానికి ముందుకు వస్తానని సాయి చౌదరి పేర్కొన్నారు. -
ఫర్టిలైజర్ యాప్తో పరేషాన్
కొందుర్గు: ఎరువుల కొనుగోలుకు రైతులు ఎలాంటి ఇబ్బంది పడొద్దని.. విక్రయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రయోగాత్మకంగా రంగారెడ్డి, మెదక్ జిల్లాలను ఎంపికచేసింది. ‘ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్’ యాప్ ద్వారా డీలర్లు ఎరువులు విక్రయిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా వివరాల నమోదులో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఇవీ ఇబ్బందులు ● రైతులకు యాప్పై అవగాహన లేకపోవడం. ● రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడం. ● యాప్లో వివరాల నమోదు సమయంలో ఎర్రర్స్ తలెత్తడం. ● యాప్లో పొందుపరిచిన పంటల పేర్లు వాడుక భాషలో లేకపోవడంతో రైతులకు పంటల పేర్ల నమోదులో ఇబ్బందులు. ● కొన్ని పంటల పేర్లు డీలర్లు, అధికారులకు సైతం అర్థం కాకపోవడం విశేషం. ● రైతులు నగదు చెల్లించి ఎరువులు కొనలేని పరిస్థితి. ఈ సమయంలో రెగ్యులర్గా కొనుగోలు చేసే డీలర్ వద్ద తమకు అవసరమైన ఎరువుల స్టాకు లేకపోవడం. ● రైతుల భూమి వివరాలు యాప్లో పూర్తిస్థాయిలో కనిపించకపోవడం. ● డీలర్ వద్ద ఉన్న ఎరువుల స్టాకు యాప్లో ఎప్పటికప్పుడు అప్డెట్ కాకపోవడం. స్టాకు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనిపించడం. ● రైతుల భూముల వివరాలు హెక్టార్లలో చూపడంతో అయోమయం. ● హాకా రైతు కేంద్రాల అడ్రస్ పూర్తిస్థాయిలో కనిపించకపోవడం. ● ఒకే రైతు రెండు రకాల కాంప్లెక్స్ ఎరువులు తీసుకోవడానికి వీలు లేకపోవడం. ● సింగిల్ సూపర్ పాస్పేట్ యాప్లో కనిపించకపోవడం. ఇలా చేస్తే మేలు ● రైతులకు అనుకూలంగా ఉండేలా యాప్ను సులభతరం చేయాలి. ● పంటల నమోదును డైరెక్టుగా వాడుక భాషలో నమోదు చేసుకునేందుకు వీలు కల్పించాలి. ● గ్రామాలవారీగా సదస్సులు నిర్వహించి రైతులకు యాప్పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. ● పంటల అవసరం మేరకు ఏ రకం ఎరువులైనా బుక్చేసుకునే వీలు కల్పించాలి. ● ప్రభుత్వమే ప్రతి గ్రామంలో వలంటీర్లను నియమించేలా చూడాలి. ● ఎండోమెంట్, వక్ఫ్ తదితర భూములు కౌలుకు తీసుకొని సాగుచేసుకునే రైతుల కోసం ప్రత్యేకంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు పూర్తిస్థాయిలో అవగాహన కరువు వినియోగంలో అడుగడుగునా ఎర్రర్స్ ఆందోళనలో అన్నదాతలు ఎరువుల కోసం డీలర్లు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలుప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. విత్తనాలు నాటేందుకు అనుకూలమైన సమయం. ఈ సమయంలో సర్కారు ఇలాంటి యాప్లు తీసుకురావడం బాగాలేదు. మాలాంటి రైతులకు చాలా ఇబ్బంది. రెండు మందు బస్తాల కోసం నాలుగైదు రోజులు తిరిగాను. నేరుగా అమ్మడమే బాగుండేది. – కుర్వ నర్సింలు, కొందుర్గు యాప్లో ప్రస్తుతం చాలా మార్పులు వచ్చా యి. మరికొన్ని రోజుల్లో రైతులు సునాయసంగా వినియోగించేలా మారుతుంది. సమస్యలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయిస్తున్నాం. యాప్తో రైతులు ఇబ్బంది పడకుండా డీలర్లు విధిగా వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. – రాజేందర్ రెడ్డి, ఏఓ, జిల్లేడ్ చౌదరిగూడ -
నగరంలో ‘మత్తు’ కలకలం
గచ్చిబౌలి: అపార్ట్మెంట్పై మెరుపు దాడి చేసిన పోలీసులు ఎండీఎంఏ, ఓజీకుష్ గంజాయిని స్వాధీనం చేసుకుని విక్రేతతోపాటు 8 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు.మాదాపూర్ పోలీసులు తెలిపిన మేరకు.. మాదాపూర్లోని చందానాయక్ తండాలో డ్రగ్స్ విక్రయంతోపాటు వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందంది. దీంతో మాదాపూర్, కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు శనివారం అపార్ట్మెంట్పై దాడి చేశారు. విజయవాడకు చెందిన దనేకుల తరుణ్ తేజ్(22) వద్ద 15 గ్రాముల ఎండీఎంఏ, 382 గ్రాములు ఓజీ కుష్ గాంజా, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మంది నిరుద్యోగులను అదుపులోకి ఎండీఎంఏ, ఓజీకుష్ గంజాయి సరఫరా చేసిన విజయవాడకు చెందిన కార్తీక్, పృథ్వీ పరారీలో ఉన్నారు. 26 కిలోల గంజాయి స్వాధీనం గచ్చిబౌలి: విక్రయించేందుకు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఓ పెడ్లర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపినమేరకు.. గచ్చిబౌలి పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కలిసి శనివారం సాయంత్రం నానక్రాంగూడలోని సుమధుర అక్రోపోలిస్ అపార్ట్మెంట్ ఎదురుగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మంగళ్హట్కు చెందిన మహ్మద్ నయీమ్ (26) ఆటోలో గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. ప్యాక్ చేసి ఉన్న 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ గంజాయిని సరఫరా చేసిన ఒడిశాకు చెందిన గౌతమ్ నాయక్, స్థానిక విక్రేతలు నీతూబాయ్, గౌతమ్ సింగ్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గంజాయి విక్రేత అరెస్ట్ జవహర్నగర్: రోడ్డు పక్కన గంజాయి విక్రయిస్తున్న స్థావరాలపై మల్కాజిగిరి ఎకై ్సజ్ పోలీసుల దాడి మెరుపు దాడులు నిర్వహించి 2.1 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటన అంబేద్కర్నగర్తో పాటు కాప్రా మండలంలోని అనీష్కళాశాల ఆవరణలో ఆదివారం చోటుచేసుకుంది. ఎకై ్సజ్ సీఐ రవి తెలిపిన మేరకు.. జవహర్గనగర్ పరిధిలోని అంబేడ్కర్నగర్లో గంజాయిని అమ్ముతుండగా విశ్వనియసమాచారం మేరకు ఆర్టీసీ డిపో ఎదురుగా ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు చేస్తూ ఓ ద్విచక్రవాహనాన్ని పట్టుకున్నారు. పరిశీలించగా 1.365 కేజీల గంజాయి బయటపడింది. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని షేక్ సల్మాన్ అలియాస్ సలీమ్(25), సెమంగుల రఘు(24), మారిపల్లి మహేష్(23)లను అరెస్ట్ చేశారు. కిరాణా షాపుల్లో నిషేధిత మత్తు పదార్థాలు శంషాబాద్ రూరల్: కిరాణాషాపుల్లో నిషేధిత మత్తు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పాల్మాకుల, పెద్దషాపూర్, ముచ్చింతల్లో ఆదివారం రాత్రి శంషాబాద్ పోలీసులు, ఈగల్, నార్కోటిక్ డ్రగ్ బృందాల సంయుక్త ఆధ్వర్యంలో కిరాణాదుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. పాల్మాకులలో ప్రవీణ్కుమార్, రోహిత్కుమార్ నిర్వహిస్తున్న కిరాణా దుకాణాల్లో నిషేధిత తంబాకు, గుట్కా ప్కాకెట్లు లభించాయి. వీటిని సీజ్ చేసిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. -
మేలైన దిగుబడి
పంట మార్పిడి..కొడంగల్: ఖరీఫ్ సాగు(వానకాలం) సీజన్ మొదలైంది. కొద్ది రోజుల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. పంట మార్పిడి చేపట్టాలని రైతు సంక్షేమ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకే రకమైన పంటలను ఏళ్ల తరబడి సాగు చేయడంతో దిగుబడి రాక అనేక సమస్యలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీడ పీడల బెడద అధికం కావడంతో పాటు భూమి సారం తగ్గుతుందని పంట మార్పిడితోనే ప్రయోజనం పొందవచ్చని ఆదర్శ రైతులు చెబుతున్నారు. పత్తి, వరి, కంది అధికం జిల్లాలో అన్ని రకాల పంటల సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నప్పటికీ రైతులు వరి, పత్తి, కంది పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడల బెడద పెరిగి రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. దీంతో భూమి సారం కోల్పోయి పంట ఎదుగుదల క్షీణించి దిగుబడి రాక అన్నదాతలు నష్టపోతున్నారు. వానాకాలంలో ఎక్కువ మంది రైతులు వర్షాధారంగా పంటలను సాగు చేస్తున్నారు. మరి కొందరు ఇతర పంటల సాగు విధానం తెలియక ఇబ్బంది పడుతున్నారు. మార్పుతోనే మేలు పంట మార్పిడి చేయాలంటే అంతకు ముందు వేసిన పంటకు భిన్నంగా ఇతర పంటను ఎంచుకోవాలి. ఒక ఏడాది కందులు వేస్తే మరుసటి ఏడాది జొన్నలు, పత్తి, ఇతర పంటలు వేయాలి. పంట మార్పిడి విధానంలో ప్రతి సంవత్సరం సాగు చేసే పంటలను మార్పు చేయాల్సి ఉంటుంది. పంట మార్పిడి చేసే రైతులు భూమి నుంచి పోషకాలను గ్రహించే పంటలకు బదులుగా భూమికి పోషకాలను అందించే పంటలు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నలరేగడి నేలల్లో నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు పండించే రైతులు మరుసటి ఏడాది సోయా చిక్కుడు వేసుకుంటే మంచిది. ఈ పంట సమయానికి ఆకులు పూర్తిగా రాలి తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రియ ఎరువును అందిస్తు్ంది. చీడపీడల నివారణ కోసం కొన్ని రకాల తెగుళ్లు కొన్ని పంటలను అధికంగా ఆశించి వ్యాప్తి చెందుతాయి. అలాంటి పంటలను వరుసగా వేసుకోకుండా మార్పిడి చేసుకోవాలి. పత్తి, వరి పంట వేయకుండా పప్పు ధాన్యపు పంటలు, నూనె గింజల పంటలు వేసుకోవాలి. జొన్న, సజ్జ, రాగి, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలతో మార్పిడి చేయాలి. దీంతో ఆయా పంటల్లో పురుగులను నివారించవచ్చు. వేసుకోవాల్సిన పంటలు కొడంగల్ నియోజకవర్గంలో అధిక మొత్తంలో కంది, పత్తి వేస్తారు. ఈ పంటలతో పోలిస్తే మినుము, పెసర, సోయచిక్కుడు పంటలకు కాయ తొలుచు పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది. గతంలో వేరుశనగ వేసిన రైతులు ఈ ఖరీఫ్లో మొక్క జొన్న పంట వేసుకుంటే పంటకు నత్రజని లభిస్తుంది. ఫలితంగా రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. శనగ పంట వరుసగా వేసుకుంటే కాయ తొలుచు పురుగుల తాకిడి పెరుగుతుంది. ఈ పురుగుల దాడి తక్కువగా ఉండే జొన్న, నువ్వులు, ఉలవ పంటలు వేసుకోవచ్చు. ఒకే రకం పంటల సాగుతో నష్టం ఖరీఫ్ సాగులో మెలకువలు ముఖ్యం వ్యవసాయ పనులు మొదలుపెట్టిన కర్షకులు -
ముంపు ముప్పు తప్పదా..
● వానాకాలం మొదలు.. ● వణుకుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు ● పరిష్కారం చూపని అధికారులు తుర్కయంజాల్: వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏటా ఆదిబట్ల సర్కిల్ పరిధి పలు కాలనీల్లో ముప్పు పొంచి ఉన్నా.. జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యం అని ఆరోపణలు వస్తున్నాయి. వరదల నుంచి గుణపాఠం నేర్చుకుని, మరోసారిముంచెత్తకుండా ప్రణాళికలు రూపొందించాల్సింది పోయి, ఏమి పట్టన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో.. తమ ఇళ్లు నీట మునుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రహరీలు, కాల్వల ధ్వంసం మన్నెగూడలో ఎర్రకుంట చెరువు చుట్టూ ప్రహరీ నిర్మించడం, అలుగును పూర్తిగా ధ్వంసం చేయడం వలన ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు సులువుగా చెరువులోకి చేరి, బయటకు ప్రవహించే పరిస్థితి లేదు. దీని వలన శ్రీశ్రీ అరుంధతి, సిరిటౌన్ షిప్తో పాటు పలు కాలనీలకు ఏటా ముంపు ముప్పు వెంటాడుతోంది. అదే విధంగా గంగరాయి చెరువు కబ్జా, ఎఫ్టీఎల్ పరిధిలో యథేచ్ఛగా వెంచర్ల ఏర్పాటు, ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీలు జారీ చేయడంతో చెరువు పూర్తిగా అన్యాక్రాంతం అయ్యే పరిస్థితులు కనిపనిస్తున్నాయి. దీనికి తోడు చెరువులోకి నీరు చేరుకునే కాల్వ అన్యాక్రాంతం అయింది. దీంతో ఈ చెరువు పై భాగంలో వర్షం కురిస్తే.. నీరు ఒక్కసారిగా పై కాలనీలోని ఇళ్లతో పాటు, జీవీఆర్ కాలనీ, రాగన్నగూడ పాత గ్రామం, దుర్గాంజనాద్రి కాలనీలను ముంచెత్తుతోంది. చిన్న పాటి వర్షానికే చెరువులను తలపించేలా ఇళ్ల మధ్యలో నీరు నిలుస్తూ ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇవే కాకుండా పాటిగూడలోని కాలనీలు, సూరజ్ నగర్, రాఘవేంద్ర నగర్ కాలనీ మాసబ్ చెరువులోకి నీరు చేరే కాల్వ కబ్జా కావడంతో ఇక్కడి పరిస్థితులు అలాగే ఉన్నాయి. రాకపోకలు బంద్ మాసబ్ చెరువు 2020 నుంచి వరద నీటితో పాటు.. మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్, బడంగ్పేట, గుర్రంగూడ, ఆదిబట్ల సర్కిల్ పరిధి రాగన్నగూడ, కమ్మగూడ, తుర్కయంజాల్లోని పలు కాలనీల నుంచి వస్తున్న మురుగుతో నిత్యం నిండు కుండలా తలపిస్తుంది. గడిచిన 6 ఏళ్లుగా చెరువు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని అలుగు పారుతోంది. సుమారు 500 ఎకరాల్లో ఉన్న ఈ చెరువు.. వాగు ఉప్పొంగితే ఇంజాపూర్లోని ఆపిల్ అవెన్యూ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏటా నీట మునుగుతున్నాయి. వరద ఉధృతి కారణంగా అవెన్యూ కాలనీ నుంచి పలు కాలనీలకు రాకపోకలు నిలిచిపోతాయి. కాల్వను ఆనుకుని నిర్మించిన అపార్ట్మెంట్లు, పలు నివాసాలు జలమయం అవుతాయి. ఆ సమయంలో ఈ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఇంజాపూర్లోని దిలావర్ఖాన్ చెరువు వలన మునగనూర్లోని పలు కాలనీలు ముంపు బారిన పడతాయి. సుదీర్ఘ కాలం వీరామం అనంతరం మునగనూర్ నుంచి హయత్నగర్కు వెళ్లే చోట బ్రిడ్జి నిర్మించడంతో కొంత ఉపశమనం లభించినప్పటికీ.. వరద ఎక్కువగా వచ్చిన సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఆపిల్ అవెన్యూ కాలనీలో జలప్రవాహం (ఫైల్) ఇళ్ల మధ్యలో ప్రవహిస్తున్న మాసబ్ చెరువు వరద (ఫైల్) మాసబ్ చెరువు నుంచి దిలావర్ ఖాన్ చెరువుకు నీరు ప్రవహించే కాల్వను గతంలో హైడ్రా కమిషనర్ రంగనాఽథ్ పరిశీలించారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. పరిష్కార మార్గం లభించలేదు. ఎప్పటిలాగే కాలనీలు నీట మునుగుతూనే ఉన్నాయి. అధికారులు ఇప్పటికై నా పక్కా ప్రణాళికలు రూపొందించి, ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి.సత్యనారాయణ రెడ్డిని వివరణ కోరగా.. ముంపునకు గురయ్యే కాలనీల జాబితాను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. తగిన చర్యలు చేపట్టి, సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు. -
ఉరిమి.. మెరిసి.. కురిసి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఈదురు గాలులతో కూడిన వర్షం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. అనేకచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు సహా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. లైన్లు తెగిపోవడంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు వెంటనే అప్రమత్తమై.. మెజార్టీ ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరించినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో అంధకారం తప్పలేదు. అత్యధికంగా షాబాద్లో.. జిల్లాలో అత్యధికంగా షాబాద్లో 7.79 సెం.మీ, రాజేంద్రనగర్లో 6.06, కేశంపేటలో 5.66, చేవెళ్లలో 4.68, నందిగామలో 3.19, ఫరూఖ్నగర్లో 3.10 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈదురుగాలికి భారీ వర్షం తోడవడంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. శంషాబాద్లోని పలు అపార్ట్మెంట్లలోకి వరదనీరు వచ్చి చేరింది. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ఈసీవాగు పొంగి ప్రవహిస్తోంది. అమ్డాపూర్ సమీపంలో నిండుగా ప్రవహిస్తూ హిమాయత్సాగర్ చెరువులోకి వచ్చి చేరుతోంది. గాలివాన బీభత్సం విరిగిపడిన చెట్లు నేలకూలిన విద్యుత్ స్తంభాలు రోడ్లపైకి భారీగా వరద నీరు నిలిచిన విద్యుత్ సరఫరా -
అవినీతి నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య చేవెళ్ల: అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఇటీవల ఆయనపై బీఆర్ఎస్ నాయకుడు, విద్యా మౌలిక వసతుల సంస్థ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చేవెళ్ల క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తన 35ఏళ్ల రాజకీయ చరిత్ర ఏమిటో నియోజకవర్గ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు స్పష్టం చేశారు. నాగేందర్ గౌడ్కి రాజకీయ జీవితం ఇచ్చిన వ్యక్తి మాజీ మంత్రి చంద్రశేఖర్ అని, ఆయన్ని సైతం మోసం చేశారన్నారు. నవాబ్పేట్ ఎంపీపీగా ఉన్నప్పుడు వేయని రోడ్లకు నిధులు మంజూరు చేయించుకున్నాడని, విద్యామౌలిక వసతుల సంస్థ చైర్మన్గా ఉండి ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఇప్పటికై నా అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్, గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణ రంగంలో రారాజు భారతి సిమెంట్
యాచారం: నిర్మాణ రంగంలో రారాజు భారతి ఆల్ట్రాఫాస్ట్ సిమెంట్ అని, నిర్మాణాలు దృఢంగా ఉంటాయని ఆ సంస్థ టెక్నికల్ ఇంజినీర్ సామ్రాట్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం తాపీమేస్త్రీలు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మాణ రంగంలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ.. వినియోగదారుల విశ్వాసాన్ని పొందడమే సంస్థ లక్ష్యమన్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణాల్లో భారతి సిమెంట్ను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. స్లాబ్ కాంక్రిట్ సమయంలో సంస్థ ఇంజినీర్లు సైట్ వద్దకు వచ్చి సాయపడతారని చెప్పారు. మార్కెట్లో లభించే ఇతర సిమెట్లతో పోల్చితే భారతి ఆల్ట్రాఫాస్ట్ బలం అధికంగా ఉంటుందని తెలిపారు. అనంతరం రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లు, బ్యాగులు అందజేశారు. కార్యక్రమంలో డీలర్ తలారి మల్లేశ్, తాపీమేస్త్రీలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
ప్రాచీన కళలను ప్రోత్సహించాలి
మంచాల: మన చరిత్ర– మన సంస్కృతిని తెలిపే ప్రాచీన కళలను ప్రోత్సహించాలని సర్పంచ్ మానస వినయ్ అన్నారు. గ్రామంలో మూడు రోజులుగా నల్ల చక్రవర్తి జీవిత చరిత్ర వీధి నాటకం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వారికి ఆర్థిక సహాయం అందజేసి మాట్లాడారు. నేడు యువత దురలవాట్లకు చేరువై జీవితాలను అంధకారం చేసుకుంటుందని తెలిపారు. అలాంటి వారికి ప్రాచీన కళలు, సంప్రదాయాలు, మానవ విలువలను నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మంచాల: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని సీపీఎం మండల కార్యదర్శి రావుల జంగయ్య అన్నారు. శనివారం మండలంలోని నోముల గ్రామంలో ఢీవైఎఫ్ఐ నూతన కమిటీని నియమించారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఎర్ర ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా ఈరమల్ల శివకుమార్, ఉపాధ్యక్షుడిగా ఎర్ర ప్రశాంత్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ.. యువత ఎదుర్కొంటున్న విద్య, నిరుద్యోగ సమస్యలపై ఢీవైఎఫ్ఐ పోరాడుతుందన్నారు. సీపీఎం మండల కమిటీ సభ్యులు పి.జగన్, నాయకులు నాగరాజ్, సృజన్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు: ఎస్ఐ కోటేశ్వర్రావ్ను శనివారం బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు మీసాల వర్షిత్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాకప్పి, సన్మానించారు. లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు తుక్కుగూడ: కా ర్పొరేషన్ పరిధి లోని జెన్నాయిగూ డ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే స్వామివానికి పలు రకాల అభిషేకాలు, అలంకరణ చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కోటగళ్ల రంజిత్కుమార్, ఏఓ శ్రీనివాస్, ఆలయ పండితులు మురళీశర్మ, అజయ్శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం: నందుపల్లి గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ఎంపీ నిధులు మంజూరు చేయాలని శనివారం నాగారంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని గ్రామ బీజేపీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో డ్రైనేజీలు, సీసీరోడ్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నిధులు మంజూరు చేసి సమస్య పరిష్కరించాలని కోరారు. త్వరలో నిధులు విడుదల చేయిస్తామని ఎంపీ హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు కుండె వెంకటేశ్, బీజేపీ సీనియర్ నాయకులు రఘురెడ్డి, దళిత మోర్చా మండల ఉపాధ్యాక్షులు రంగుల రవి, నాయకులు ఆకన్పల్లి ఆశోక్, ఆకన్పల్లి రాజశేఖర్, నవీన్ పలువురు పాల్గొన్నారు. -
యువజన సమ్మేళనం జయప్రదం చేయాలి
తుర్కయంజాల్: కొత్తపేటలోని బీజేఆర్ భవన్లో ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర యువజన సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని జిల్లా కమిటీ సభ్యుడు డి.కిషన్ పిలుపునిచ్చారు. రాగన్నగూడలోని పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం. సత్యనారాయణ, కె.వెంకటకృష్ణ, శ్రీనివాసులు, కృష్ణ, మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరో ఇద్దరికి గాయాలు మీర్పేట: ఈదురు గాలులకు తాటిచెట్టు కూలి ఇంటిపై పడడంతో ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా, లింగాల మండలం షాన్పేటకు చెందిన సభావత్ లక్ష్మీసేవ్య ఇద్దరు కుమారులు, కోడలితో కలిసి కొంత కాలంగా జిల్లెలగూడ రాఘవేంద్రనగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు బలమైన ఈదురు గాలులు వీయడంతో వెనకాల ఉన్న తాటిచెట్టు విరిగి ఇంటిపై పడింది. దీంతో పైకప్పు రేకులు విరిగి నిద్రిస్తున్న లక్ష్మి(75), కుమారుడు వెంకట్రాం, కోడలు లలితపై పడ్డాయి. వెంటనే స్పందించిన స్థానికులు చెట్టుతో పాటు శిథిలాలను తొలగించి, క్షతగాత్రులను ఉస్మానియా ఆస్ప త్రికి తరలించగా, తీవ్రగాయాలైన లక్ష్మి చనిపోయింది. కొడుకు, కోడలు చికిత్స పొందుతున్నారు. పని నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్లి న చిన్నకొడుకు రమేశ్కు ప్రమాదం తప్పింది. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. శంకర్పల్లి: మండల పరిధిలోని ప్రొద్దటూరు–మోకిల వద్ద మూసీ వాగు వంతెనను శనివారం రాత్రి ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి పరిశీలించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనుల గురించి సీఐ, చేవెళ్ల ఏసీపీతో చర్చించారు. స్థానిక రెవెన్యూ, పంచాయతీ, ప్రజాప్రతినిధులతో నిత్యం మాట్లాడుతూ ఉండాలని సూచించారు. ఆయన వెంట చేవెళ్ల ఏసీపీ కిషన్, మోకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు సురేశ్, చెన్నారెడ్డి తదితరులు ఉన్నారు. అనంతగిరిలో అధికమాస యజ్ఞాలు అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్ట అనంతపద్మనాభ స్వామి ఆలయంలో అధికమాసం సందర్భంగా 30 రోజుల పాటు యజ్ఞాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శనివారం కృష్ణ యజ్ఞం ఘనంగా నిర్వహించారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అధికమాసంలో యజ్ఞాలు నిర్వహించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని ఆలయ పురోహితులు తెలిపారు. కార్యక్రమంలో పరిగి మాజీ సర్పంచ్ పార్థసారథి, బీఆర్ఎస్ యువ నాయకుడు కొప్పుల అనిల్రెడ్డి, దోమ మండల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం
షాద్నగర్రూరల్: ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యంగా రైతుల ముంగిటకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తేవడం జరిగిందని వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్ విజయ్కుమార్ అన్నారు. స్థానిక వ్యవసాయశాఖ అధికారులతో కలిసి శనివారం పట్టణంలోని రాఘవేంద్ర ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు. నందిగామ మండలంలో యాప్ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయశాఖ కార్యాలయంలో డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎరువులు కొనుగోలు చేయడానికి రైతులు గంటల తరబడి పడిగాపులు కాయడం, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించడం లాంటివి చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని అందుబాటులో తెచ్చిందని చెప్పారు. ఈ యాప్ద్వారా సులభంగా ఇంటినుంచే ఎరువులను బుక్ చేసుకోవచ్చని, దీంతో సమయం ఆదా అవుతుందని, పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్నారు. యాప్పై గ్రామాల్లోని ఆదర్శ రైతులతో పాటు రైతులందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి, మేడ్చల్తో పాటు మరో ఐదు జిల్లాల్లో అమలు చేయడం జరుగుతోందన్నారు. సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్టు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి శైలజ, ఏడీలు మాధవి, సత్యంబాబు, ఏడీఏ రమాదేవి, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్ విజయ్కుమార్ -
16న ‘పోర్టర్’ కార్యాలయం ముట్టడి
హస్తినాపురం: పోర్టర్ డ్రైవర్ పార్ట్నర్ల సమస్యలను పరిష్కరించడంలో పోర్టర్ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, డ్రైవర్ల శ్రమను దోపిడీ చేస్తూ వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ (సీఐటీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.అజయ్బాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో జూన్ 16న నిర్వహించనున్న పోర్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన డ్రైవర్లకు పిలుపునిచ్చారు. సాగర్ రింగ్ రోడ్డులోని సెంటర్లో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ పోర్టర్ కమిటీ ఆధ్వర్యంలో పోర్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను అజయ్బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోర్టర్ యాజమాన్యం డ్రైవర్లను పార్ట్నర్లుగా పేర్కొంటున్నప్పటికీ వారికి తగిన ప్రయోజనాలు కల్పించడం లేదన్నారు. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలకు అనుగునంగా రవాణా చార్జీలను పెంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ, డ్రైవర్లకు కనీస గిట్టుబాటు రేట్లు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. డ్రైవర్ల కష్టాన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా వారి పొట్ట కొట్టేలా వ్యవహరించడం సరికాదిన్నారు. డ్రైవర్ల శ్రమకు తగిన విలువ ఇచ్చి గిట్టుబాటు అయ్యే రేట్లు నిర్ణయించడంతో పాటు పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు ఏకమై పోరాటాలను ఉదృతం చేస్తారని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరహరి, ఎల్లయ్య ఉన్నారు. -
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
ఆమనగల్లు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్, నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లురవి ఆరోపించారు. ఆమనగల్లులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. అధికారం, ఆధిపత్యం కోసం బీజేపీ సర్కార్ ఇన్నాళ్లు ఓటు చోరీ చేసిందని, ప్రస్తుతం సీటు చోరీ చేసిందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ సీటు చోరీ కుట్రలో భాగమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గద్దె దింపడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి రావడానికి బీజేపీ, బీఆర్ఎస్ పగటి కలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, మహానీయుల జీవిత చరిత్రను ప్రజలకు వివరించి చైతన్యం చేయడానికి నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రెండు బస్సు యాత్రలు జూలై 2న అలంపూర్, మైసిగండిలో ముగుస్తాయని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, యూత్కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికాంత్గౌడ్, కో ఆప్షన్ సభ్యులు ఖాదర్, పార్టీ జిల్లా నాయకులు చెంచు రాములు, కసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, జగన్, మానయ్య, కాలె మల్లయ్య, శ్రీకాంత్, ఖాదర్ఖాద్రి, మండల మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు తదితరులు పాల్గొన్నారు. నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి -
నియామకం
కడ్తాల్: ఉప సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడిగా గానుగుమార్లతండా ఉప సర్పంచ్ జర్పుల లక్పతినాయక్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కార్యకవర్గాన్ని నియమించారు. అధ్యక్షుడిగా జర్పుల లక్పతినాయక్(గానుగుమార్లతండా), ఉపాధ్యక్షుడిగా కిరణ్గౌడ్( చల్లంపల్లి), ప్రధాన కార్యదర్శిగా రమేశ్(బాలాజీనగర్),సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాస్గౌడ్(మక్తమాధారం), కోశాధికారిగా రతన్(గోవిందాయిపల్లితండా) ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా మహేశ్వర్కుమార్(సాలార్పూర్), యాదయ్య(రావిచేడ్)తో పాటు.. సభ్యులుగా హీరానాయక్, ఈరెడ్డి యాదగిరిరెడ్డి, దేవేందర్, రామకృష్ణ, గోపాల్, బల్వంత్రెడ్డి, మహేశ్, సత్తయ్య, యశోధ, పంతు, నర్సింహ, లక్ష్మణ్నాయక్, తులసీరాం ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీని సన్మానించారు. -
సర్కారు బడి.. స్వర్ణోత్సవం
ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాల 50 వసంతాల వేడుక స్వర్ణోత్సవం ఘనంగా జరిగింది. మండల పరిధి ఆకుతోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థులు (1976– 2026) గోల్డెన్ జూబ్లీ నిర్వహించారు. వేడుకలను జెడ్పీటీసీ మాజీ సభ్యడు శ్రీపాతి శ్రీనివాస్రెడ్డితో కలిసి సర్పంచ్ నరేందర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వేడుకలకు నాటి నుంచి చదివిన విద్యార్థులు చాలామంది హాజరయ్యారు. ఒకే వేదికగా ఆటపాటలతో సందడి చేశారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకున్న బడిని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారని, విశాలమైన గదులు, వసతులు, ఆటస్థలం ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని కోరారు. పూర్వ విద్యార్థులంతా తమకు తోచిన విధంగా ఆర్థిక సాయం చేస్తే.. పాఠశాలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు చందులాల్, చిలకమ్మ, మాజీ సర్పంచ్లు రామచంద్రయ్య, ప్రమోద్కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యడు రాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆటపాటలతో సందడి చేసిన పూర్వ విద్యార్థులు పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని పిలుపు -
ఐఐటీలో మెరిసిన హర్షిత
కడ్తాల్: మండల పరిధి వాస్దేవ్పూర్ గ్రామానికి చెందిన పాత్లవత్ సునీత– నరేందర్నాయక్ దంపతుల కూతురు హర్షిత జేఈఈ అడ్వాన్స్లో ఆల్ఇండియా ఎస్టీ కేటగిరి విభాగంలో 467 ర్యాంకుసాఽధించారు. ఉత్తరాఖండ్లోని రూర్కి ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సీటు దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. గతేడాది జేఈఈ అడ్వాన్స్లో నరేందర్నాయక్ సోదరుడు పాత్లవత్ లక్ష్మణ్నాయక్– మంజుల దంపతుల కూతురు ప్రీతి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జార్ఖండ్ ధన్బాద్ఐఐటీలో సీటు సాధించింది. మారుమూల ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేకున్నా.. పట్టుదలతో చదివి అక్క చెల్లైలెన హర్షిత, ప్రీతిలు ఐఐటీలో చోటు దక్కించుకోవడంతో తండా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం హర్షిత, ప్రీతిలను కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించారు. -
బోధన రుసం చెల్లించాలి
ఇబ్రహీంపట్నం: విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్కుమార్ డిమాండ్ చేశారు. ఇదే విషయమై పలుమార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యావ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయి చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందని విమర్శించారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంత్రుల నివాసాలు, కలెక్టరేట్లను ముట్టడించినా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్ట్ కార్డుల ద్వారా విన్నవించినా ప్రభుత్వానికి చలనం కలగడంలేదని మండిపడ్డారు. మరలా విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో కొత్తకొత్త నిబంధనలు పెడుతోందని పేర్కొన్నారు. వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వెంటనే బోధన రుసం, ఉపకార వేతనం చెల్లించాలని, లేని పంక్షలో మరో పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్ -
భవితకు బాట.. కేజీబీవీలు
కడ్తాల్: గ్రామీణ ప్రాంతాల నిరుపేద విద్యార్థినులకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ)వరంగా మారాయి. ఈ విద్యాలయాల్లో చదివించే ఆర్థిక స్తోమత లేని పేదవారితో పాటు.. అనాథ, తండ్రిలేని, తండ్రి ఉండి తల్లిలేని వారికి, చదువు మధ్యలో ఆపేసిన వారికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. అనేక సౌకర్యాలు, వసతులుకల్పిస్తూ.. వారి భవితకు బాటలు వేస్తోంది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుండటంతో ఇందులో ప్రవేశానికి పోటీ పెరిగింది. విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పదిలో 98 శాతం.. మండల కేంద్రంలో 2017– 18 విద్యా సంవత్సరంలో 6,7,8 తరగతులతో అద్దె భవనంలో కేజీబీవీ ప్రారంభమైంది. ఏటా తరగతులు పెరుగుతున్నాయి. భవనం చాలక పోవడంతో ప్రభుత్వం నూతన భవనం నిర్మించింది. అందులో 2024లో తరగతులు ప్రారంభించింది. గత ఏడాది 2025– 26 విద్యా సంవత్సరంలో ఆరు నుంచి 10వ తరగతి వరకు 255 మంది విద్యార్థినులు, ఇంటర్ ప్రథమ సంవత్సరం 56 మంది అభ్యసించారు. 2025– 26లో పదిలో 43 మందికి 42 మంది 98 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన శాఖాహారం, మాంసహారంతో భోజనం అందించడంతో పాటు, వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. విద్యార్థినులు చదువుకే పరిమితం కాకుండా ఆత్మరక్షణ కోసం కరాటే తదితర క్రీడల్లో శిక్షణ ఇస్తోంది. ఇంటర్లో వందశాతం 2025– 26లో కేజీబీవీని ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ఇంటర్ తరగతులు ప్రారంభించింది. బైపీసీ, ఎంపీసీ ఒక్కో గ్రూప్లో 40 సీట్లు కేటాయించడంతో ఎంపీసీలో 23 మంది విద్యార్థులు, బైపీసీలో 33 మంది చేరారు. ఇందులో మొత్తం 56 మందికి 56 మంది ఉత్తీర్ణత సాధించి, 100 శాతం ఫలితాలు సాధించారు. ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కాగా.. ఈ ఏడాది సెకండీయర్ బైపీసీ, ఎంపీసీ ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో గ్రూప్లో 40 సీట్లు ఉండనున్నాయి. బాలికలకు వరం విద్యాలయాలు అద్భుతంగా రాణిస్తున్న విద్యార్థినులు ఆరు నుంచి ఇంటర్ వరకు తరగతులు కేజీబీవీ అప్గ్రేడ్ అయింది. ఇంటర్ వరకు తరగతులు జరుగుతున్నాయి. దీంతో విద్యార్థినులకు చదువులో ఆటంకం కలిగే ఆస్కారం లేదు. ఆంగ్ల మాధ్యమంలో బోధించడంతో పాటు, నాణ్యమైన విద్య, భోజన వసతిని ప్రభుత్వం కల్పిస్తోంది. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. పేద విద్యార్థినులకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – అనిత, ఎస్ఓ, కేజీబీవీ పాఠశాల, కడ్తాల్ -
యాభై బ్యాచ్ల అపూర్వ సమ్మేళనం
షాబాద్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శనివారం పూర్వ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. 1975– 1976లో టెన్త్ పూర్తిచేసిన వారి నుంచి పాటు 2026 వరకు యాభై బ్యాచ్ల పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి, స్కూల్లోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ గురువులను సన్మానించి, ఆశీర్వాదాలు పొందారు. 1992– 93 బ్యాచ్కు చెందిన కొండ విజయ్కుమార్, ప్రవీణ్, మల్లికార్జున్ ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్లుగా వ్యవహరించారు. మూడు వేల మందికి పైగా హాజరైన ఈ వేడుక ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో రాష్ట్ర హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్, జిల్లా హాకీ చైర్మన్ రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, కాంగ్రెస్ నేత పామెన భీంభరత్, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైడ్రాలో బైక్ టీమ్లు
● విపత్కర సమయాల్లో వేగంగా స్పందించేలా.. ● తొలి దశలో 27 ఏర్పాటు చేసిన రంగనాథ్ ● ఇప్పటికే పనులు ప్రారంభించిన బృందాలు సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో ముంపు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నా.. ఏక్కడ ఏ ప్రమాదం జరిగినా.. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు నిర్వహించే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందాలు ఘటనాస్థలికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు ఈ బృందాలకు సంబంధించిన భారీ వాహనాలు సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర వ్యాప్తంగా 27 బైక్ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఇవి శుక్రవారం నుంచి పని చేయడం ప్రారంభించాయి. శుక్రవారం రాత్రి వర్షం కురిసిన సమయంలో మెరుగైన సేవలు అందించాయి. ప్రతి బైక్పై ఇద్దరు సిబ్బంది ఇప్పటి వరకు హైడ్రా అధీనంలోని డీఆర్ఎఫ్కు 122 వాహనాలు ఉన్నాయి. వీటిలో డీఆర్ఎఫ్ తేలికపాటి వాహనాలతో పాటు 21 ట్రక్కులు వినియోగిస్తోంది. ఈ ట్రక్కుల్నే ప్రకృతి వైపరీత్యాలు, రెస్క్యూ కార్యకలాపాలకు వాడుతున్నారు. వీటిలో ప్రత్యేక ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. ట్రాఫిక్ జామ్స్ ఏర్పడినప్పుడు ఈ వాహనాలు ఘనాస్థలికి చేరడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్నిసార్లు ఇవి చేరేసరికి జరగాల్సిన నష్టం వాటిల్లుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న కమిషనర్ ఏవీ రంగనాథ్ బైక్ టీమ్లను రంగంలోకి దింపారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది వినియోగించడానికి ఖరీదు చేసిన 37 ద్విచక్ర వాహనాల్లో 27 వాహనాలకు మార్పులు చేర్పులు చేసి బైక్ టీమ్లకు అందించారు. ప్రతి బైక్పైనా ఇద్దరు డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఉపకరణాలు ఉంటాయి. వీటిని ఉంచడానికి వెనుక భాగంలో ప్రత్యేక పెట్టి ఏర్పాటు చేశారు. తొలిదశలో రంగంలోకి దింపిన 27 టీమ్ల్లో అత్యధికం ఐటీ కారిడార్తో పాటు ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో మోహరించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. దశల వారీగా ఈ బైక్ టీమ్ సంఖ్యను పెంచుతామన్నారు. -
మద్యం మత్తులో కారు డ్రైవింగ్
మీర్పేట: ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు అన్నదమ్ములను తీవ్రంగా గాయపరిచిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అల్మాస్గూడకు చెందిన చక్రధర్ శుక్రవారం తన భార్య పుట్టినరోజు ఉండడంతో స్నేహితులను పిలిచి పార్టీ చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున స్నేహితులను ఆర్సీఐ రహదారిపై దించేందుకు కారు (టీజీ08ఏ 7887)లో వచ్చి తిరిగి సాయినగర్ మీదుగా ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో కమలానెహ్రూనగర్లో నివసించే సోదరులు విఘ్నేశ్వర్ (21), అఖిలేశ్వర్ (18) తమ స్కూటీపై పాల ప్యాకెట్లు సరఫరా చేస్తుండగా మద్యం మత్తులో కారును నిర్లక్ష్యంగా నడిపిన చక్రధర్ వీరిని ఢీ కొట్టాడు. విఘ్నేశ్వర్ కాలు ఫ్రాక్చర్ కాగా, అఖిలేశ్వర్ తలకు బలమైన గాయాలు కావడంతో పాటు స్కూటీ పూర్తిగా ధ్వంసమైంది. అక్కడే ఉన్న స్థానికులు చక్రధర్ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు చక్రధర్ను, కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విఘ్నేశ్వర్ ఏవీఎన్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, అఖిలేశ్వర్ ఇంటర్ పూర్తి చేశాడు. చదువుకుంటూనే పార్ట్టైంగా ఉదయం ఇంటింటికీ పాల ప్యాకెట్లు సరఫరా చేస్తుంటారు. కాగా స్థానికంగా కమలానెహ్రూ నగర్లో బెల్టు షాపు ఉండడంతో చక్రధర్ మద్యం కోసమే వచ్చాడని, ఈ క్రమంలోనే అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను కారును అదుపు చేయలేక అన్నదమ్ముల్లిద్దరినీ ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. కారులో ఖాళీ మద్యం సీసాలు, బీర్ బాటిళ్లు ఉన్నాయని తెలిపారు. స్కూటీని ఢీకొట్టిన వ్యక్తి అన్నదమ్ములకు తీవ్ర గాయాలు -
ప్రకృతి వ్యవసాయం మేలు
మహేశ్వరం: రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయం చేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నాగారంలో కుండె వెంకటేశ్ ఫామ్ హౌస్లో బీజేపీ కిసాన్మోర్చా ఆధ్వర్యంలో శనివారం ప్రకృతి వ్యవసాయంపై రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సూచించారు. సేంద్రియ ఎరువులతో దిగుబడి అధికంగా రావడంతో పాటు పండించిన ధాన్యం, కూరగాయాలు, పండ్లు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామన్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. బీజేపీ, కిసాన్మోర్చా నాయకులు రైతుల వద్దకు వెళ్లి ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం మొక్కలు నాటి, గోమాతకు పశుగ్రాసం వేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కిసాన్మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు బస్వ పాపయ్య గౌడ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోలి మధుసూదన్రెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేఎస్ రత్నం, పొరెడ్డి నర్సింహారెడ్డి, కంజర్ల ప్రకాష్, ముత్యాల భాస్కర్, కడారి జంగయ్య యాదవ్, మిద్దె సుదర్శన్రెడ్డి, కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు టి.యాదీష్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
ప్రజా సంక్షేమం.. ప్రభుత్వ లక్ష్యం
ఆమనగల్లు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అర్హులందరికీ రాజకీయాలకు అతీతంగా పతకాలు అందజేస్తుందన్నారు. నగరంలోని తన నివాసంలో.. తలకొండపల్లి మండలం వెంకట్రావ్పేట గ్రామానికి చెందిన వెంకటయ్యకు మంజూరైన రూ.75 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును శనివారం అందజేసి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం పార్టీ నాయకులు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడురు శ్రీనివాస్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్రెడ్డి, రేణురెడ్డి, అజీజ్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు పంపిణీ
ఇబ్రహీంపట్నం రూరల్: అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు పంపిణీ చేశారు. ఈ సంఘటన ఆదిబట్ల జీహెచ్ఎంసీ పరిధి ఆదిబట్లలో శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గజ్జెల శ్రీలతకు అంగన్వాడీ కేంద్రంలో అక్కడి నిర్వాహకులు గుడ్లు అందజేశారు. ఆ గుడ్లను శనివారం ఉడకబెట్టి తన ఏడాదిన్నర వయసు గల చిన్నారికి తినిపించే క్రమంలో దుర్వాసన వచ్చింది. గమనించి చూడగా.. గుడ్డు కుళ్లిపోయినట్లు గుర్తించింది. అన్నింటిని పరిశీలించగా.. పాడైపోయాయి. దీంతో విషయాన్ని ఆమె.. భర్తకు వివరించింది. ఆయన సామాజిక మాధ్యమాల్లో కుళ్లిన గుడ్ల గురించి పోస్టు చేయగా.. వైరల్ మారింది. బాలింతలు, చిన్నారులకు పోషక పదార్థాలు అందించే విషయంలో అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. -
సంక్షోభంలో విద్యారంగం
చేవెళ్ల: రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర నాయకుడు పానుగంటి పర్వతాలు అన్నారు. పట్టణ కేంద్రంలో శుక్రవారం ఏఐవైఎఫ్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. , ముఖ్యమంత్రి ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యారంగం తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతులు లేమి, నిధులకొరత కారణంగా ప్రభుత్వ విద్యావ్యవస్థ బలహీనపడుతుండగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల పేరిట దోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.శివకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి యువత, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.శివ, నాయకులు మధు, జలీల్, సుధాకర్, అనంత్, శివ, రాజు, రమేశ్, యాదయ్య తదితరులు ఉన్నారు. -
ఎకరాకు రూ.60 లక్షలిస్తేనే..
యాచారం: మొండిగౌరెల్లి అసైన్డ్ భూముల సేకరణ అంశం మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను సవరించడంతో ప్రస్తుత వ్యాల్యూ ప్రకారం పరిహారం పెంచాలని పట్టుబడుతున్నారు. గ్రామంలోని అసైన్డ్ సర్వేనంబర్లు 19, 68, 127తో పాటు పలు పట్టా సర్వే నంబర్లల్లోని 821.11 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్క్ల కోసం సేకరించడానికి ప్రభుత్వం 2025 మార్చి 10న నోటిఫికేషన్ ప్రకటించింది. పట్టా భూముల సేకరణను తాత్కాలికంగా పక్కకు పెట్టిన అధికారులు.. ముందుగా 650 ఎకరాల అసైన్డ్ భూములు తీసుకోవాలని నిర్ణయించారు. నోటిఫికేషన్ వెలువర్చిన ఏడాది తర్వాత 2026 మార్చిలో భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈఏడాది కాలంలో పలు గ్రామాల్లోని భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఏడాది క్రితం యాచారం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎకరా ధర రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు ఉండగా, ప్రస్తుతం ఇవే రూ.కోటికి పైగానే పలుకుతున్నాయి. అయితే, పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలని బాధిత రైతులు మొదటి నుంచీ స్థానిక అధికారులతో పాటు కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డిని కలిసి విన్నవించారు. నేటికీ పూర్తికాని ప్రక్రియ మొదట్లో ఎకరాకు రూ.22 లక్షల పరిహారం, ఎకరాకు 121 గజాల ప్లాటు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఇందుకు రైతులు ససేమిరా అనడంతో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి నిర్వాసితులతో సమావేశమై ఎకరాకు రూ.30 లక్షల పరిహారంతో పాటు ఎకరాకు 121 గజాల ప్లాటు, అదనంగా కుటుంబానికి 121 గజాల ప్లాటు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు అంగీకరించారు. భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నెల రోజుల్లో పరిహారం అందజేయాలని కోరారు. కానీ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో భూసేకరణ ప్రక్రియ నేటికీ పూర్తి కాలేదు. రైతుల కబ్జా సర్వే కూడా ఈరోజు వరకూ పూర్తికాలేదు. రికార్డుల్లోంచి నకిలీల పేర్లను కూడా తొలగించలేదు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏకగ్రీవ తీర్మానం భూసేకరణకు నోటిఫికేషన్ ప్రకటించిన ఏడాది వరకు కూడా పరిహారం అందజేయకపోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో మొండిగౌరెల్లి రెవెన్యూ పరిధిలో భూముల మార్కెట్ విలువ ఎకరాకు రూ.5,62,500 ఉండగా, ఇటీవల సవరించిన వాల్యూ ప్రకారం రూ.9.84,375 పెరిగింది. దీంతో పరిహారాన్ని కూడా రూ.60 లక్షలకు పెంచి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మొండిగౌరెల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పెంచిన మార్కెట్ విలువ ప్రకారం పరిహారం పెంచి ఇవ్వాలని సర్పంచ్ కోలన్ రమాదేవి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేసి తహసీల్దార్ అయ్యప్పకు అందజేశారు. ఈ విషయమై కలెక్టర్ను కలవనున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇండస్ట్రియల్ పార్కుకు భూములిస్తాం ఇటీవల పెంచిన మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలి లేదంటే మరో ఉద్యమం తప్పదు తేల్చిచెబుతున్న మొండిగౌరెల్లి అసైన్డ్ రైతులు మొండిగౌరెల్లిలోని అసైన్డ్ భూములకు పరిహారం పెంచి ఇవ్వాలని రైతులు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన మార్కెట్ ధరల ప్రకారం పరిహారం ఇవ్వమని కోరుతున్నారు. పరిహారం పెంపు అంశం మా పరిధిలో లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. వారే నిర్ణయించాల్సి ఉంటుంది. న్యాయం జరిగేలా మా వంతు ప్రయత్నం చేస్తాం. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తాం. – అయ్యప్ప, తహసీల్దార్, యాచారంఏడాది కింద నోటిఫికేషన్ ప్రకటించిన అధికారులు ఇప్పటి వరకూ ప్రక్రియ పూర్తిచేయలేదు. త్వరగా సర్వే చేసి పరిహారం అందజేసి ఉంటే రైతులు మరో చోటకు వెళ్లి భూములు కొనుక్కునేవారు. ప్రస్తుతం ఆపరిస్థితి లేదు. సవరించిన మార్కెట్ విలువ ప్రకారం అసైన్డ్ భూములకు ఎకరాకు రూ.60 లక్షల పరిహారం ఇవ్వాలి. లేదంటే ఏ అధికారినీ గ్రామంలో అడుగు కూడా పెట్టనీయం. – కోలన్ రమాదేవి, సర్పంచ్, మొండిగౌరెల్లి -
22కిలోల గంజాయి స్వాధీనం
అనంతగిరి: రైలులో అక్రమంగా తరలిస్తున్న 22 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు, ఈగల్ టీం బృందం పట్టుకుంది. రైల్వే సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీజిత్ ముంబైలో జీవనం సాగిస్తున్నాడు. ఒడిశా రాష్ట్రం మల్కన్గిరికి చెందిన అమేష్ పంగి, సుమన్ చంద్ర, శ్యామ జరేల్, సుధీర్ ఖారాతో పరిచయం ఏర్పడింది. ఈ నలుగురు తాగుడుకు అలవాటు పడి గంజాయి విక్రయించడం మొదలు పెట్టారు. మల్కన్గిరి అడవుల్లో గంజాయి సేకరించి రోడ్డు మార్గంలో విజయవాడకు వచ్చారు. అక్కడి నుంచి భువనేశ్వర్ –ముంబై కోణార్క్ ఎక్సెప్రెస్ రైలులో బయలుదేరారు. గురువారం శంకర్పల్లి పరిసర ప్రాంతాల్లో రైలులో ఈగల్ టీం, మహబూబ్నగర్ రైల్వే ఎస్ఐ రాజు జనరల్ చెకింగ్ చేస్తుండగా వీరి వద్ద గంజాయి లభ్యమైంది. నిందితుల నుంచి 21.930 కిలోల గంజాయి, 5 మొబైల్స్ సీజ్ చేశారు. ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ రూ.10.96 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వికారాబాద్ రైల్వే పోలీసులు, ఈగల్ టీం బృందాన్ని రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ ఐజీ రమేష్ నాయుడు, రైల్వే ఇన్చార్జ్ ఎస్పీ సందీప్, ఎస్సీఆర్ డీఎస్ఆర్పీ శ్రీనివాస్రావు అభినందించారు. బ్యాంకు ఉద్యోగులతో పోలీస్ కమిషనర్ సజ్జనర్ గన్ఫౌండ్రీ: ప్రతి బ్యాంకు ఉద్యోగి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. శుక్రవారం రవీంద్ర భారతిలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రజల ధనానికి బ్యాంకు ఉద్యోగులు రక్షకులు అనే విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేశారు. సమావేశంలో ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయికుమార్, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్బాబు, బ్యాంక్ ఆఫ్ బరోడా బీనా వాహిద్, జోనల్ హెడ్ సుధాకర్, డీజీఎం ఆర్.మురళీకృష్ణ, సాయిబాబు పాల్గొన్నారు. -
2 గంటలు నరకయాతన
ఉప్పల్: స్కైవాక్ లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో ఓ యువకుడు దాదాపు బతుకుజీవుడా సుమారు 2 గంటల పాటు అందులో చిక్కుకుని విలవిలలాడాడు. లిఫ్ట్ తలుపులు తెరుచుకుంటాయా.. లేదా? అని తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఎట్టకేలకు టెక్నీషియన్ వచ్చి చర్యలు చేపట్టడంతో ఊపిరిపీల్చుకున్నాడు. ఈ ఘటన ఉప్పల్ స్కైవాక్పై గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాహుల్ (22) అనే యువకుడు ఉప్పల్లో ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని హాస్టల్కు బయలుదేరాడు. ఉప్పల్ రోడ్డు దాటడానికి ౖస్కైవాక్ వంతెన ఎక్కి కిందకు దిగడానికి లిఫ్ట్–6లో వస్తున్నాడు. ఈ క్రమంలో లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడంతో ఆందోళనకు గురైన రాహుల్ 100, 108 అధికారులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైడ్రా అధికారులు సమాచారం ఇచ్చారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. లిఫ్ట్ల మె యింటెనెన్స్ చూస్తున్న హెచ్ఎండీఏ సిబ్బంది స్పందించకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. లిఫ్ట్లోని రాహుల్ అరుపులు, కేకలు పెట్టినా ఫలితం లేకుండాపోయింది. దాదాపు 2 గంటల తర్వాత ఎట్టకేలకు టెక్నీషియన్ రావడంతో కథ సుఖాంతం అయ్యింది. రాత్రి 11.30 నుంచి 1.15 నిమిషాల వరకు రాహుల్ యువకుడు బిక్కుబిక్కుమంటూ లిఫ్ట్లోనే గడపాల్సి వచ్చింది. తాను హార్ట్ పేషెంట్నని, లిఫ్ట్లోనే ఇరుక్కుపోవడంతో భయాందళోనకు గురైనట్లు రాహుల్ ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం. జడుసుకుంటున్న జనం ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఉప్పల్ స్కైవాక్ ఎక్కడానికి ప్రయాణికులు జంకుతున్నారు. అందులోనూ లిఫ్ట్లు ప్రమాదకరంగా మారాయంటున్నారు. మొదట్నుంచీ లిఫ్ట్లు మొరాయిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్ వంతెనకు ఎనిమిది లిఫ్ట్లు, నాలుగు ఎస్కలేటర్లు 24 గంటల పాటు పని చేస్తుంటాయి. రోజూ వేలాది మంది స్కైవాక్ ఎక్కి దిగుతుంటారు. లిఫ్ట్లు, ఎస్కలేటర్ల పర్యవేక్షణ అత్యంత ఆవశ్యకమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. లిఫ్ట్లోఉన్న వారు తలుపులను బలవంతంగా తెరవడం, అటూ ఇటూ లాగడం వల్ల సెన్సార్లు పని చేయవని, గురువారం రాత్రి అదే జరిగిందని హెచ్ఎండీఏ అధికారులు వివరణ ఇచ్చారు. చివరకు టెక్నీషియన్ వచ్చిన తర్వాతే లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయని స్పష్టం చేశారు. మధ్యలోనే ఆగిపోయిన లిఫ్ట్ అందులో చిక్కుకున్న యువకుడు అరుపులు, కేకలతో ఆందోళన టెక్నీషన్ రాకతో కథ సుఖాంతం ఉప్పల్ స్కైవాక్పై అర్ధరాత్రి ఘటన -
913 పాయింట్లలో ముంపు ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లలో 913 వాటర్ లాగింగ్ ఏరియాలను గుర్తించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన తొలకరి వర్షానికి నగరం నీట మునిగిందని.. ఊహించని విధంగా పడుతున్న వర్షాలకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలన్నారు. శుక్రవారం డీఆర్ఎఫ్ బృందాలతో ఆయన భేటీ అయ్యారు. వర్షాకాల సన్నద్ధతపై వారికి దిశానిర్దేశం చేశారు. వర్షం పడితే ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయనే దానిపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. వాటర్ లాగింగ్ ఏరియాల్లో 257 తీవ్రమైన సమస్య ఉన్న ప్రాంతాలు ఉన్నాయని, ఆ పాయింట్ల వద్ద డీఆర్ఎఫ్ బృందాలు అనునిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. 51 డీఆర్ఎఫ్ టీమ్స్కు తోడు త్వరలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ (మెట్), స్టాటిక్ టీమ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. వర్షాకాలంలో తలెత్తే సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వామ్యం చేసి వారి సహకారం తీసుకోవాలని హైడ్రా కమిషనర్ డీఆర్ఎఫ్ బృందాలకు సూచించారు. మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద స్థానికులతో కలసి కమిటీలను ఏర్పాటు చేసి సమస్య పరిష్కారంలో వారిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ నెల 9న ఒక్కసారిగా కురిసిన వర్షానికి నీట మునిగిన ప్రాంతాల పైనా రంగనాథ్ సమీక్షించారు. ఒక్క రోజు నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తితే రూ.400 కోట్ల వరకూ నష్టం జరుగుతుందని నిపుణులు అంచనా వేశారని వివరించారు. అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, అడిషనల్ కమిషనర్ ఆర్.సుదర్శన్ వర్షాకాల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు. వర్షాకాల సన్నద్ధతపై డీఆర్ఎఫ్ బృందాలకు రంగనాథ్ దిశానిర్దేశం -
పట్టు వీడని కాళ్లాపూర్ రైతులు
పరిగి: ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కాళ్లాపూర్ రైతులు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. భూములు ఇచ్చేది లేదని మరోమారు స్పష్టం చేశారు. బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఆత్మహత్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. దీక్ష విరమించాలని పోలీసులు కోరినా రైతులు వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని ప్రకటించారు. చావనైనా చస్తాం కానీ భూములు మాత్రం ఇవ్వమని తెగేసి చెప్పారు. మాకు ఎలాంటి పరిశ్రమలు వద్దని పొలాలు ఉంటే చాలన్నారు. పోలీసులు గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు వాటిని తొలగించారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని రైతులు స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అరెస్ట్ రైతులకు మద్దతు తెలిపేందుకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని పరిగి పోలీసులు రంగాపూర్ గేట్ వద్ద అడ్డంగించి అదుపులోకి తీసుకున్నారు. దీంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహేశ్రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను చన్గోముల్ పోలీస్స్టేషన్కు తరలించారు. రైతుల కోసం వెళ్తుంటే అక్రమంగా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారారని ఆరోపించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, రైతుల పక్షాన పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మహేశ్రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు దీక్షలో కూర్చున్న కాళ్లాపూర్ రైతులు -
ప్రాజెక్టులు గడువులోపు పూర్తిచేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ పునరావాసం, పునర్ఉపాధి భూసేకరణ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్కు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ఓ అనంతరెడ్డి, ఏఓ సునీల్ ఘన స్వాగతం ఫలికారు. అనంతరం మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం తదితర ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. భూ సేకరణ, అవార్డుల జారీ, పరిహారం చెల్లింపు, పునరావాస చర్యలు, పెండింగ్ కేసుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో కందుకూరు, ఇబ్రహీంపట్నం డివిజన్ల ఆర్డీఓలు, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆమనగల్లు, మాడ్గుల తహసీల్దారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన రోబోటిక్స్ వర్క్షాప్
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల పరిధిలోని ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 11,12 తేదీల్లో నిర్వహించిన జాతీయస్థాయి ఇంట్రడక్షన్ టు రోబోటిక్స్ వర్క్షాప్ శుక్రవారం విజయవంతంగా ముగిసింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. రోబోటిక్స్, ఎంబయోడెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్ రంగాలకు సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ పొందారు. కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ప్రారంభించగా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ అబ్దుల్ నబీ, రీసెర్చ్ డెవలప్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ధనలక్ష్మి రోబోటిక్స్ విద్య, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా క్విజ్, ఫీడ్బ్యాక్ సెషన్ నిర్వహించారు. -
‘సైబర్’ పోలీస్.. స్పెషల్ ఆపరేషన్
● దేశవ్యాప్తంగా మేలో 74 మంది అరెస్టు ● అత్యధికులు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ నిందితులే ● 25 కేసుల్లో రూ.68 లక్షలు బాధితులకు రీఫండ్ ● వివరాలు వెల్లడించిన అదనపు సీపీ శ్రీనివాసులుసాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ కేసులకు సంబంధించి మే నెలలో దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్స్లో 74 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో అత్యధికులు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసుల్లో నిందితులే ఉన్నట్లు అదనపు సీపీ శ్రీనివాసులు శుక్రవారం ప్రకటించారు. మరోపక్క 25 కేసుల్లో బాధితులు కోల్పోయిన మొత్తంలో రూ.68.27 లక్షలు రీఫండ్ చేసినట్లు వివరించారు. ● ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో 33 మంది, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్లో 12 మంది, ట్రేడింగ్ ఫ్రాడ్స్లో ఏడుగురు, ఓటీపీ ఫ్రాడ్స్లో ఐదుగురు, సోషల్ మీడియా కేసుల్లో నలుగురు, జాబ్–ఏపీకే ఫ్రాడ్స్లో ముగ్గురు చొప్పున, లోన్ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టు ఫ్రాడ్స్లో ఇద్దరు, డేటింగ్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్లో ఇద్దరు చొప్పున, కస్టమర్ కేర్, బిజినెస్ ఫ్రాడ్స్లో ఒకరు చొప్పున అరెస్టు అయ్యారు. ● నిందితుల్లో తెలంగాణకు చెందిన వారు 19 మంది, ఏపీకి చెందిన వారు 16 మంది, కర్ణాటక నుంచిఆరుగురు, యూపీ నుంచి ఏడుగురు, తమిళనాడు, గుజరాత్ల నుంచి ఐదుగురు చొప్పున, మహారాష్ట్ర నుంచి నలుగురు, ఢిల్లీ నుంచి ముగ్గురు, మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు, ఒడిశా నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. ● వీరినుంచి పోలీసులు 43 మొబైల్ ఫోన్లు, 32 సిమ్ కార్డులు, 19 ల్యాప్టాప్లు, పదుల సంఖ్యల బ్యాంక్ పాస్బుక్స్, ఓ చెక్ బుక్ స్వాధీనం చేసుకున్నారు. ● నర్మదా సాగర్ కంపెనీ పేరిట సీడ్స్ తయారీ ● ముగ్గురు నిందితుల అరెస్టు ● రూ.30 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్కు చెందిన నర్మదా సాగర్ కంపెనీ పేరుతో నకిలీ సీడ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టు చేశారు. న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీ ఎండీ యెరువ బాలశౌరి రెడ్డితో పాటు మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి శుక్రవారం ఈ వివరాలు వెల్లడించారు. న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీ పేరుతో విత్తన వ్యాపారం చేస్తున్న బాలశౌరి.. గ్రాఫిక్ డిజైనర్లు కపర్తి బెంజిమెన్, దొంగ శ్రీనుల సహాయంతో గుజరాత్కు చెందిన నర్మదా సాగర్ కంపెనీని పోలిన పౌచ్ డిజైన్ తయారు చేయించాడు. మేడ్చల్ జిల్లా బహదూర్పల్లిలోని ’ట్రూప్యాక్ ఫ్లెక్సిబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ లో వీటిని ముద్రించారు. సుమారు 2 వేల కిలోల నకిలీ విత్తనాలను బండ్లగూడలోని తన ఆఫీసులో నిల్వ ఉంచాడు. వీటిని నకిలీ పౌచ్లలో ప్యాక్ చేసి విక్రయించడమే వీరి లక్ష్యం. ఈ మేరకు నర్మదా సాగర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ సోలంకే యశ్వంత్ రావు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు బోయినపల్లి వెజిటబుల్ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్నారని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాల పౌచ్లు, బండ్లగూడలోని ఆఫీసులో రూ.30 లక్షలు విలువైన 2 వేల కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు బాలశౌరి రెడ్డిపై గతంలో షాద్నగర్, రాజేంద్రనగర్, మహబూబ్నగర్లోని భూత్పూర్ ఠాణాలలో కేసులున్నాయి. -
టిప్పర్ టైర్ కింద నలిగి..
తల్లి మృతి, కుమారుడికి తీవ్ర గాయాలు యాచారం: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆరోగ్యం బాగా లేక కొడుకుతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తూ తల్లి అనంతలోకాలకు వెళ్లగా, కొడుకు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. కందుకూరు మండలం బేగరికంచె గ్రామానికి చెందిన ఢిల్లీ భారతమ్మ (45), ఆమె కుమారుడు అఖిల్కుమార్ శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో మోటార్సైకిల్పై ఆకులామైలారం గ్రామానికి వచ్చారు. తిరిగి గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో అధిక బరువుతో వస్తున్న టిప్పర్ (టీజీ07ఎక్స్–1400) డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని వెనక్కు తీస్తూ ఢీకొట్టాడు. టిప్పర్ తల్లీకొడుకులపై నుంచి వెళ్లడంతో భారతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ అఖిల్కుమార్ను చికిత్స నిమిత్తం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
మంచాల: ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కపల్లి పెంటయ్య అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010కి ముందు న్యాయబద్ధంగా నోటిఫికేషన్వచ్చి నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని స్పష్టంగా పేర్కొనడం జరిగిందని తెలిపారు. తరువాత డీఎస్సీ నోటిఫికేషన్లో టెట్ అర్హత ఆధారంగానే నియామకాలు జరుగుతున్నాయన్నారు. దీంతో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రస్తుతం అన్యాయం జరుగుతోందని, వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్రం కేంద్రాన్ని ఒప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర బాధ్యుడు సత్తారి రాజిరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాశిరావు, పూజరి రమేష్, ఉపాధ్యక్షులు కరుణాకర్రెడ్డి, కృష్ణ, మండల అధ్యక్షుడు రావుల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు స్వయం ఉపాధిలో శిక్షణ
మొయినాబాద్: జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ ఆర్సెటీ డైరెక్టర్ మహ్మద్ అలీఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని చిలుకూరులో ఉన్న ఎస్బీఐ ఆర్సెటీ కేంద్రంలో నెల రోజుల పాటు మగ్గం వర్క్స్లో ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. 18–50 సంవత్సరాల వయసు ఉండి, పదో తరగతి చదివిన మహిళలు శనివారం ఆర్సెటీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఎస్ఎస్సీ మెమో, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జతచేయాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్ వసతి, భోజన సౌకర్యంతోపాటు యూనిఫాం, టూల్ కిట్స్ అందజేస్తామన్నారు. వివరాలకు 85001 65190, 95506 06019 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. మంచాల: మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ల తుది జాబితా విడుదల చేశారు. పాఠశాల హెడ్ ఆఫ్ ది స్కూల్ గిరధర్ గౌడ్ ఆధ్వర్యంలో పేరెంట్స్ కమిటీ సమక్షంలో శుక్రవారం డ్రా తీశారు. మొత్తం 1,200 మంది దరఖాస్తు చేసుకోగా లాటరీ పద్ధతిలో 300 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలలో అందుబాటులో ఉంచారు. త్వరలో అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు. చేవెళ్ల: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీఎస్ఎన్ఎల్ 5జీ విస్తృత సేవలు, నెట్వర్క్ సమస్యల తొలగింపు కోసం కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి సుమారు రూ.14 కోట్ల వ్యయంతో ఏడు సెల్ఫోన్ టవర్లు మంజూరైనట్లు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. ఎంపీ కార్యాలయంలో శుక్రవారం ఆయనతో కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి.భాస్కరరావు, డీజీఎం అశోక్, లక్ష్మణ్కుమార్, గణేశ్ తదితరులు సమావేశమయ్యారు. టవర్ల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలున్న గ్రామాలను గుర్తించి సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మంజూరైన సెల్ఫోన్ టవర్లను త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విన్నవించిన వెంటనే స్పందించిన కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సిందియా, బీఎఎస్ఎన్ఎల్ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ రత్నకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. మొయినాబాద్: ప్రజల జీవితాలతో మమేకమైన కళలు, సాహిత్యం సమాజ మార్పునకు శక్తివంతమైన ఆయుధాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాకురాలు విమలక్క అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మొయినాబాద్లోని ఓ ఫాంహౌస్లో రెండు రోజులపాటు నిర్వహించిన సాంస్కృతిక శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు పాల్గొని ప్రజా సాంస్కృతికోద్యమ కర్తవ్యాలు, శాసీ్త్రయ సోషలిజం, ఆదివాసీ కళలు, సాహిత్యం, సాంస్కృతిక ఆధిపత్య సిద్ధాంతం వంటి అంశాలపై చర్చించారు. కళాకారులకు డప్పు, పాట, నాటకం వంటి ప్రజా కళారూపాలపై శిక్షణ ఇచ్చారు. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విమలక్క మాట్లాడుతూ.. శిక్షణ పొందిన కళాకారులు తమ కళలను సమాజ మార్పుకోసం ఉపయోగించాలన్నారు. -
లోపాలు సరిదిద్దుతాం
కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరించే స్వచ్ఛ వెళ్లడం లేదు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లలోనూ (జీవీపీ) చెత్తను సకాలంలో తరలించకపోవడం మా దృష్టికి వచ్చింది. ఐటీ ఆధారిత సేవల ద్వారా సీఅండ్డీ వేస్ట్ గురించి ఫిర్యాదు చేసిన వారు వాటి పరిష్కారాన్ని కూడా ఆన్లైన్లో ట్రాక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెస్తాం. ఎక్కడెక్కక లోపాలున్నాయో గుర్తించి సరిచేస్తాం. – ఆర్వీ కర్ణన్, జీహెచ్ఎంసీ కమిషనర్ మూడు నాలుగు నెలల్లో పరిష్కరిస్తాం సీఎంసీలోని ఎక్కువ ప్రాంతాల్లో వీధిదీపాల సమస్య నెలరోజుల్లో పరిష్కరిస్తాం. మూడు కార్పరేషన్లకు కలిపి ఇప్పటికే టెండర్లు పిలిచారు. మిగతా వాటిల్లో దెబ్బతిన్న రోడ్లు, ఫుట్పాత్లు, తదితరమైనవి ఉన్నాయి. పారిశుద్ధ్యం తదితర సమస్యలను మూడు నాలుగు నెలల్లోగా పరిష్కరిస్తాం – జి. సృజన, సీఎంసీ కమిషనర్ పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాలు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు స్వచ్ఛ ఆటోలు వెళ్ళని ఇళ్లకు ఆ సదుపాయం కలిగేలా చేశాం. జీవీపీల వద్ద చెత్త ఎప్పటికప్పుడు తొలగించే చర్యలు తీసుకున్నాం. నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాలు తరలించేందుకు ప్రజలే చార్జీలు చెల్లించేలా అవగాహన కల్పించి తగు చర్యలు తీసుకున్నాం. కొత్తగా పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయగలిగాం. – వినయ్ కృష్ణారెడ్డి, కమిషనర్ ఎంఎంసీ -
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి అనంతరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎన్.రాజు, కార్యదర్శి గ్యార పాండు మాట్లాడుతూ.. పంచాయతీ సిబ్బందికి ప్రతీ నెల 1న వేతనాలు చెల్లించడం లేదన్నారు. వేతనాలు గ్రీన్ చానల్ ద్వారా చెల్లించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో నంబర్ 51ని సవరించి మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనం తక్షణమే ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలన్నారు. ప్రమాదం జరిగి మరణిస్తే రూ.20 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జగన్ పోల్కంపల్లి, పోచమోని కృష్ణ, కోశాధికారి దేవదాస్, శేఖర్, మాధవి, యాదయ్య, జగన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలి
కొత్తూరు: వర్షాకాలం కావడంతో అండర్పాస్ వద్ద వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ఉపాధ్యాయ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అండర్పాస్ను శుక్రవారం ఆయన పరిశీలించారు. రాయికల్ టోల్ప్లాజా ప్రాజెక్టు మేనేజర్ విశ్వనాథ్రాజుతో మాట్లాడి పలు సూచనలు చేశారు. 40హెచ్పీ మోటారుతో అండర్పాస్లోకి వస్తున్న వర్షపు నీటిని తీసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు టోల్ప్లాజా మేనేజర్ వివరించారు. అనంతరం ట్రాఫిక్ డీసీపీ మాట్లాడుతూ.. వర్షాకాలం కావడంతో అండర్పాస్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ శంకరయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
తుర్కయంజాల్: పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ డిమాండ్ చేశారు. గురువారం రాగన్నగూడలోని ఆదిబట్ల సర్కిల్ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ.. 71 మంది కార్మికులు, గతంలో మున్సిపాలిటీలుగా ఉన్న సమయం నుంచి పనిచేస్తున్నారని, జీహెచ్ఎంసీలో విలీనం అయినప్పటి నుంచి వేతనాలు రావడం లేదని వాపోయారు. అనంతరం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి.సత్యనారాయణ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సాలయ్య, కృష్ణ, రవి, స్వప్న, జయ, దీవెన, జ్యోతి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పూజారికి కేటాయించిన స్థలాన్ని తీసుకోవద్దు
యాచారం: గ్రామ పూజారికి కేటాయించిన గది స్థలంలో మహిళా సంఘం భవనాన్ని నిర్మించొద్దని యాచారం గ్రామ పంచాయతీ ఒకటో వార్డు సభ్యుడు మారోజ్ ప్రదీప్చారి గురువారం మండల పంచాయతీ అధికారి శ్రీలతకు ఫిర్యాదు చేశారు. గ్రామ ఉప సర్పంచ్ మంగతో పాటు మరో ఐదుగురు వార్డు సభ్యులు, వంద మందికి పైగా గ్రామస్తుల సంతకాలతో కూడిన ఫిర్యాదును ఎంపీఓకు అందజేశారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే పూజారికి కేటాయించిన గదిని కూల్చి మహిళా సంఘం భవనాన్ని నిర్మించాలని చూడడం సరైంది కాదన్నారు. గతంలో పిల్లర్లు వేసిన స్థలంలోనే డ్వాక్రా సంఘం మహిళా భవనం నిర్మిస్తే గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రచారం తుర్కయంజాల్: ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడమే బడిబాట లక్ష్యమని కోహెడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మీలా విజయ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో ఆదిబట్ల సర్కిల్ పరిధి సంఘీనగర్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి వీధిలో ఇంటింటికి వెళ్లి, తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని వివరించారు. కేవలం విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, క్రమశిక్షణ, సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తాయన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా కో కన్వీనర్గా విష్ణుగౌడ్ అబ్దుల్లాపూర్మెట్: బీజేపీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఓబీసీ మోర్చా కో–కన్వీనర్గా మండలంలోని బాటసింగారం ఎంపీటీసీ మాజీ సభ్యుడు బండిగారి విష్ణుగౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విష్ణుగౌడ్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసంతో నియోజకవర్గ ఓబీసీ మోర్చా కో–కన్వీనర్ పదవి ఇచ్చినందుకు సంతోషంగా ఉందని, ఓబీసీలంతా బీజేపీ వైపు మొగ్గు చూపే విధంగా కృషి చేస్తానన్నారు. జ్యూట్ బ్యాగుల పంపిణీ మంచాల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ను నిషేధించాలని మండలంలోని రంగాపూర్ సర్పంచ్ బాలకృష్ణ సూచించారు. గురువారం రంగాపూర్ అనుబంధ గ్రామం జలాల్మీయా పల్లెలో బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు జ్యూట్ బ్యాగులు, యువకులకు టీం షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణతో పాటు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ను నిషేధించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాదగిరి, వార్డు సభ్యులు అశోక్, మనిత, దివ్య, పంచాయతీ కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మాజీ ఉప సర్పంచ్లు జంగారెడ్డి, బాబయ్య, అంగన్ వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, వీఓఏలు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్యపరిష్కరించాలని డిమాండ్ తుక్కుగూడ: మంఖాల్ డివిజన్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు కోటకాడి శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం మంఖాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు నెలల నుంచి డివిజన్లో సరిపడా నీరు రావడం లేదన్నారు. దీంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్ల నుంచి వేల రూపాయలు ఖర్చు చేసి నీటిని కొనుగోలు చేస్తున్నారన్నారు. నీటి సమస్యపై పలుమార్లు జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి మంఖాల్లో సరిపడా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో శంషాబాద్ జోనల్ సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి
అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని బాటసింగారం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి ధన ఆంజనేయులు 12వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం దాసరి ప్రతాప్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ధన ఆంజనేయులు ఈ నెల 7న సరూర్నగర్లో నిర్వహించిన జిల్లా స్థాయి లాంగ్జంప్ ఈవెంట్లో సత్తాచాటి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడని చెప్పారు. ఈ సందర్భంగా బాటసింగారం పాలకవర్గం. పాఠశాల ఉపాధ్యాయ హర్షం వ్యక్తం చేస్తూ ఆంజనేయులను అభినందించారు. మైలార్దేవ్పల్లి: కారు చక్రాల కింద పడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మైలార్దేవ్పల్లి ఎస్ఐ విశ్వనాథ్రెడ్డి తెలిపిన ప్రకారం.. పల్లెచెరువులో గోబింద్రామ్ కుటుంబం నివాసముంటోంది. అతని కుమారుడు షియంకుమార్(3) బుధవారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా విజయ్ నేహా పాలిమర్స్ కంపెనీకి చెందిన డ్రైవర్ అరవింద్(30) కారులో వేగంగా వచ్చాడు. బాలుడిపై కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా గురువారం ఉదయం మృతి చెందాడు. బాలుడి మృతికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని గురువారం కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున విజయ్ నేహా పాలిమర్స్ కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకొని మాట్లాడి సర్దిచెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
జంట హత్యల కేసు ప్రధాన నిందితురాలి మృతి
తాండూరు/తాండూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలైన కరీమాబీ(50) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ విషయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాండూరులోని రాజీవ్గృహకల్ప కాలనీలో నివాసం ఉండే కరీమాబీ తనకు పరిచయమున్న మహిళల వద్ద అప్పులు తీసుకుంది, డబ్బుల కోసం ఒత్తిడి చేసిన వారిని అంతమొందించేందుకు పథకం వేసింది. ఈక్రమంలో తాండూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబ్బీ(58), బషీరాబాద్ మండలం కాశీంపూర్కు చెందిన అంగన్వాడీ ఆయా అబేదాబేగం(60)లను మొయినాబాద్లోని ఓ ప్రైవేటు ఫాంహౌస్లో హత్య చేసి, అక్కడే పూడ్చిపెట్టింది. ఇందుకు రహ్మాన్, నయీం అనే ఇద్దరు వ్యక్తుల సాయం తీసుకుంది. మహిళల మిస్సింగ్పై విచారణ చేపట్టిన పోలీసులు కాల్డాటా ఆధారంగా నిందితులను పట్టుకుని, విచారించారు. వాష్రూమ్ క్లీనర్ తాగి.. తాండూరులోని సీఐ కార్యాలయంలో గత నెల 17న పోలీసులు కరీమాబీని విచారించారు. ఈ సమయంలో వాష్రూమ్కి వెళ్తానని చెప్పిన ఆమె అక్కడే ఉన్న బాత్రూమ్ క్లీనర్(ఫినాయిల్) తాగింది. వెంటనే తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం నగరానికి తరలించారు. 25 రోజులుగా చికిత్స పొందిన కరీమా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో నిమ్స్ ఆస్పత్రిలో చనిపోయింది. ఆమె మృతదేహానికి తాండూరులో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉండటంతో బాధిత కుటుంబ సభ్యులు బాడీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు.. జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కరీమాబీ ఆత్మహత్యాయత్నం చేయడాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ స్నేహ మెహ్ర గత ఆదివారం కానిస్టేబుళ్లు సునీత, బస్వరాజ్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఏం జరిగిందంటే.. తాండూరు మున్సిపల్ పరిధిలోని రాజీవ్గృహకల్పకు చెందిన కరీమాబీ ఇదే కాలనీకి చెందిన అబ్దుల్ రహ్మాన్తో సహజీవనం చేసేది. వీరిద్దరూ అధిక వడ్డీ ఆశచూపి అమాయక మహిళల వద్ద అప్పులు చేశారు. ఈ సొమ్ముతో జల్సాలు చేస్తూ గడిపారు. వాయిదా ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఒత్తిడి చేయగా, వీరి పక్కనే ఉండే మహబూబ్బీని హత్య చేయాలని పథకం వేశారు. మొయినాబాద్ సమీపంలోని ఓ ఫామ్హౌస్కు వస్తే డబ్బులు ఇస్తామని నమ్మించారు. నయీంపాష అనే మరో వ్యక్తితో కలిసి మార్చి 27న ఆమెను హత్యచేశారు. అనంతరం కాశీంపూర్ గ్రామానికి చెందిన అబేదాబేగంను సైతం ఫామ్హౌస్కు రమ్మని మే 5న హతమార్చారు. మృతుల సెల్ఫోన్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. పోలీసు వర్గాల్లో ఆందోళన కరీమాబీ మృతి పోలీసు వర్గాలను ఆందోళన కలిగిస్తోంది. ఆమెకు మెరుగైన చికిత్స అందేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. సొంత ఖర్చులతో కార్పొరేట్ ఆస్పత్రిలో ఖరీదైన వైద్యానికి సైతం వెనకాడలేదని తెలుస్తోంది. కరీమాబీ చనిపోతే తమ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుందనే కారణంతో ఇదంతా చేశారని సమాచారం. కానీ ఆమె మృతితో కథ మొదటికి వచ్చినట్లైంది. -
మత్తుపదార్థాలతో జీవితం చిత్తు
శంకర్పల్లి: మాదకద్రవ్యాల వినియోగంతో యువ త బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని మోకిల ఎస్ఐ సురేశ్గౌడ్ అన్నారు. గురువారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. చిరు వ్యాపారుల దుకాణాల్లో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ.. ఇటీవల మత్తు పదార్థాలను యువత పెద్ద మొత్తంలో ఉపయోగిస్తుందని, దీంతో తమ ఆరోగ్యంతో పాటు జీవితం ప్రమాదంలో పడుతుందని చెప్పారు. మాదక ద్రవ్యాలు కొనే, అమ్మేవారిపై పటిష్ట నిఘా ఉంటుందని, తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. -
సీఎం ఇలాకాలో విత్తన దోపిడీ!
● నాలుగు మండలాల్లో విచారణ ● వెలుగు చూసిన వ్యవసాయ శాఖ అక్రమాలు ● నేరుగా రైతులను కలిసిన పంచాయతీ కార్యదర్శులు ● 90శాతం మంది వేరుశనగ విత్తనాలు తీసుకోలేదని వెల్లడి కొడంగల్/బొంరాస్పేట/దౌల్తాబాద్: సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో వ్యవసాయాధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాలను దోచేశారు. బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గురువారం కొడంగల్, దుద్యాల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు విచారణ చేపట్టారు. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాల్లో అక్రమాలు జరిగినట్లు బహిర్గతం అయింది. వంద, యాభై శాతం సబ్సిడీపై పంపిణీ చేయాల్సిన విత్తనాలను వ్యవసాయాధికారులు గట్టు చప్పుడు కాకుండా అధిక ధరలకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. కలెక్టర్ దీపక్ తివారి ఆదేశాలతో విచారణ చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విచారణ జరిగింది. పంచాయతీ కార్యదర్శులు రైతుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. 90 శాతం మందికి పైగా విత్తనాలు తీసుకోలేదని తెలిసింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు రైతుల నుంచి సంతకాలు తీసుకున్నారు. అక్రమాల నేపథ్యంలో దుద్యాల్ ఏఓ, ఇద్దరు ఏఈఓలపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దుద్యాల్, రేగడిమైలారం ఏఈఓల దగ్గర ఉన్న రికార్డులను జిల్లా విచారణ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బొంరాస్పేట్ మండలం మెట్లకుంట, బుర్రితండా, కాకర్లగండి తండా, బురాన్పూర్, మదన్పల్లి, లోతికుంటతండా, కొత్తూరు, సాలిండాపూర్, వడిచర్ల గ్రామాల్లో జీపీ కార్యదర్శులు విచారణ చేపట్టారు. దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాద్, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో విత్తన అక్రమాలపై ఫిర్యాదులు అందాయి. ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు వివరాలు సేకరించారు. -
స్కూల్.. ఫుల్!
తెలంగాణ పబ్లిక్ స్కూల్కు విశేష ఆదరణ ● నో అడ్మిషన్ బోర్డు పెట్టేసిన సిబ్బంది మంచాల: విద్యార్థులు లేక పలు ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్న ప్రస్తుత తరుణంలో.. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్కు విశేష ఆదరణ లభిస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇందులో చేరడంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ ప్రవేశాలు రావడంతో ఉపాధ్యాయులు సైతం చేతులెత్తేశారు. ● మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో 1,605 మంది చదువుతున్నారు. ● ప్రీ ప్రైమరీ పాఠశాలలో 150 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పించడానికి నలుగురు ఉపాధ్యాయులు, నలుగురు ఆయాలను నియమించారు. ● ఒకటి నుంచి 5వ తరగతి వరకు 495 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క తరగతిలో 3 సెక్షన్లు, ఒక్క సెక్షన్కు 33 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి చదువు చెప్పడానికి 18 మంది ఉపాధ్యాయులను నియమించారు. ● ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు 960 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్క తరగతిలో 4 సెక్షన్లు, ఒక్కో సెక్షన్లో 40 మంది చొప్పున 160 మంది విద్యార్థులున్నారు. వీరికి బోధించేందుకు 28 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ● ప్రస్తుతం మంచాల మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్న 37 గ్రామాల నుంచి ఇక్కడికి చదువు కోసం వస్తున్నారు. వీరి రాకపోకల కోసం ఐదు బస్సులు నడిపిస్తున్నారు. ● ఎక్కువ మందిని చేర్చుకోవడం పాఠశాల నిబంధనలకు విరుద్ధమే కాకుండా, నిర్వహణ కష్టంగా మారుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల వద్ద నోఅడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విద్యార్థులను చేర్చుకున్నాం. ప్రస్తుతం 1,605 మందికి పైగా ఉన్నారు. మరింత మందిని తీసుకుంటే బోధన కష్టమవుతుంది. అందుకే నో అడ్మిషన్ బోర్డు పెట్టాం. – జి. గిరిధర్ గౌడ్ (హెడ్ ఆఫ్దీ స్కూల్)నాణ్యమైన, సృజనాత్మక విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటాం. – జహీర్, ఉపాధ్యాయుడు -
సుస్థిర వ్యవసాయానికి ప్రాధాన్యం
మంచాల: గ్రామాల్లో సుస్థిర వ్యవసాయానికి రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ అన్నారు. గురువారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని బండలేమూర్ గ్రామంలో సుస్థిర వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రోజురోజుకూ ఆహార పదార్థాల కలుషితం అధికమవడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. సాగులో రసాయన ఎరువులు వాడకం తగ్గించాలన్నారు. పచ్చిరొట్ట, వర్మీ కంపోస్టు, జీవ ఎరువులు వాడాలన్నారు. నేలలో పోషకాలను గుర్తించి తదనుగుణంగా ఎరువులను ఉపయోగించాలన్నారు. విత్తన శుద్ధితో మెరుగైన ప్రయోజనాలు ఉంటాయన్నారు. ప్రధానంగా పర్యావరణం కాపాడుకొని పంటలను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు సుధీర్, అకిల, సర్పంచ్ పి.శ్రీనివాస్, ఉప సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి పాండు రంగారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్లపై నీరు నిల్వకుండా ముందస్తు చర్యలు
మీర్పేట: వర్షాకాలంలో ప్రధాన రహదారులపై నీరు నిల్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని బడంగ్పేట సర్కిల్ డీఈ హరిణి తెలిపారు. ఎమ్మెల్యే సబితారెడ్డి ఆదేశాల మేరకు గురువారం 58, 60 డివిజన్లలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాదరి రమేశ్, విజయ్, ట్రాఫిక్, హై డ్రా అధికారులతో కలిసి డీఈ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బాలాపూర్ ఎక్స్రోడ్డు, ఆర్సీఐ ప్రధాన రహదారి, విశాల్మార్ట్ పరిసరాలు, చందన చెరువు, ఎస్వైఆర్ కన్వెన్షన్ వద్ద వర్షపునీరు నిలిచే ప్రాంతాలను గుర్తించామన్నారు. వర్షాకాలం దృష్ట్యా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రహదారులపై నీరు నిల్వకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా హైడ్రా, ట్రాఫిక్ శాఖలను సమ న్వయం చేసుకొని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూ స్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్కిల్ ఏఈ సౌమయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, హైడ్రా అధికారి మహ్మద్ జమీల్ ఉన్నారు. -
ఇళ్ల నిర్మాణాలకు సహకారం
మాడ్గుల: మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురి ఇళ్ల నిర్మాణాలకు ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ చేయూతనందించారు. బక్కమ్మ, సుజాత, సంజీవ్ల ఇంటి నిర్మాణాలకు అవసరమైన సిమెంట్ను వెంకటేశ్ సమకూర్చగా గురువారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు అందించారు. కార్యక్రమంలో నాయకులు గోవింద్, శ్రీధర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే అజిలాపూర్ గ్రామానికి చెందిన కలకొండ యాదమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీలును ఉప్పల వెంకటేశ్ తరఫున బీఆర్ఎస్ నేతలు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత ఆమనగల్లు: తలకొండపల్లి మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన కాలె రుక్కమ్మ అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ.1.50 లక్షల ఎల్ఓసీ చెక్కు మంజూరైంది. గురువారం బాధితురాలికి ఎల్ఓసీ చెక్కును సర్పంచ్ భారతమ్మ అందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జ్యోతి ప్రదీప్రెడ్డి, నాయకులు గోపాల్, మహేశ్, చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కృష్ణయ్య, బసవలింగం, మల్లేశ్, రామస్వామి తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్లో పలువురి చేరిక
ఆమనగల్లు: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడ్తాల్ మండల కేంద్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో తలకొండపల్లి గ్రామానికి చెందిన ఉప్పనమోని తిరుపతయ్య, పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి స్వచ్ఛందంగా వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, ప్రభాకర్రెడ్డి, అంజయ్యగుప్తా, అజీం, వెంకట్రెడ్డి, అజీజ్, కృష్ణ, రవీందర్యాదవ్, రామకృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. ధర్మన్నగూడ సర్పంచ్.. యాచారం: మండల పరిధిలోని ధర్మన్నగూడ సర్పంచ్ పండుగ పద్మావతి గురువారం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామాభివృద్ధి కోసమే తాను బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరుతున్నట్లు సర్పంచ్ ప్రకటించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్రెడ్డి, నాయకులు శ్రీశైలం, వెంకటేశ్వర్లు, బాల్రాజ్, అంజయ్య, మల్లేష్, కృష్ణ, చెన్నయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పచ్చని పల్లెల్లో మైనింగ్ ప్రక్రియలు చేపడితే పర్యావరణం పాడవడంతో పాటు ప్రజా జీవనానికి ముప్పు వాటిల్లనుందని ఆయా గ్రామాల ప్రజలు తిరగబడుతున్నారు. ముక్తకంఠంతో గనుల తవ్వకం చేపట్టొద్దని ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
మంచాల: మండలంలోని చిత్తాపూర్ రెవెన్యూ పరిధిలో 92 సర్వే నంబర్లో 270 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అందులో 36 మందికి 237 ఎకరాలు ప్రభుత్వం సర్టిఫికెట్లు పంపిణీ చేయగా మరో 33 ఎకరాలు మిగులు భూమి ఉంది. అందులో ఉన్న తొల్చగుట్టను ప్రభుత్వం సేవియర్ మైన్స్ అండ్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మైనింగ్కు కేటాయించింది. రూ.3 కోట్లతో 15.378 హెక్టార్లలో క్వారీ మైనింగ్ తీసుకునేందుకు అనుమతులు సైతం వచ్చాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసులు జారీ చేసింది. బుధవారం ఫ్యూఛర్ సీటీలో ముఖ్యమంత్రి బహిరంగ సభ నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మైనింగ్ రద్దుకు పోరాటం ఏళ్ల తరబడి వెనుకబాటుకు గురైన గ్రామాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయి. భూముల రేట్లు పెరిగాయి. తొల్చగుట్టలో మైనింగ్ ఏర్పాటుతో చిత్తాపూర్తో పాటు ఆప్రాంతం అనుసరించి ఉన్న తిప్పాయిగూడ, తాళ్లపల్లి గూడ గ్రామాల ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రజలు వాపోతున్నారు. ఈ మైనింగ్ ఏర్పాటు తమ భూములు రేట్లు పడిపోవడంతో పాటు వ్యవసాయం దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాజకీయాలకు అతీతంగా సమావేశాలు ఏర్పాటు చేసి మైనింగ్ రద్దు చేయాలని పోరాటాలకు పిలుపునిచ్చారు. పదేళ్ల క్రితమే చైతన్యం పదేళ్ల క్రితం మండలంలోని ఆరుట్ల రెవెన్యూ పరిధిలోని 1,363 సర్వే నంబర్లో మైనింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. పర్యావణవేత్త దొంతి నర్సింహారెడ్డి, సరస్వతి కవుల తదితరులు ప్రజలను చైతన్యంచేశారు. దీంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఆందోళన చేపట్టి మైనింగ్ను అడ్డుకున్నారు. చిత్తాపూర్లో మైనింగ్ మంట 15.378 హెక్టార్లలో గనుల తవ్వకానికి అనుమతిచ్చిన ప్రభుత్వం రూ.3 కోట్లకు సేవియర్ మైన్స్ అండ్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయింపు బుధవారం ముఖ్యమంత్రి మీటింగ్ కారణంగా ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న ప్రజలు -
ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్
యాచారం: గృహ నిర్మాణ రంగంలో జీవితాలను వెల్లదీస్తున్న తమను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తాపీమేసీ్త్రల సంఘం నేతలు పేర్కొన్నారు. మండల పరిధిలోని తాపీమేసీ్త్రలు గురువారం యాచారంలో సమావేశమయ్యారు. సిమెంట్, ఇటుక, రాయి, ఇతర ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగిన దృష్ట్యా నిర్మాణ రంగంలో కూడా యజమానులు ధరలు పెంచాలన్నారు. తాపీమేసీ్త్రలకు ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు, రేషన్కార్డులు, ఎలాంటి షరతుల్లేకుండా బ్యాంకుల్లో రుణాలు అందజేయాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని, జిల్లా స్థాయి అధికారులను కలిసి విన్నవిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కిరణ్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సంఘం నేతల నిరసన కడ్తాల్: హక్కుల సాధన కోసం మండల కేంద్రంలో బాలాజీ తాపీమేసీ్త్ర సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తాపీమేసీ్త్రలు మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణదారులు, భవన నిర్మాణ కాంట్రాక్టర్లు పెరిగిన సెంట్రింగ్ కూలీల ధరలకు నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా ఇళ్లను నిర్మించే వారు తమ ధరలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చంద్రయ్య, శ్రీరాములు, వెంకటేశ్, జంగయ్య, శ్రీను, బాబు, మల్లేశ్, కోటయ్య, మల్లేశ్, కృష్ణ తదితరులు ఉన్నారు. భవన నిర్మాణ పనులు బంద్ ఇబ్రహీంపట్నం: తాపీమేసీ్త్రలకు నిర్దిష్టమైన రేట్లను నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ పనులను బంద్ పెడుతున్నట్లు ఇబ్రహీంపట్నంలోని వరసిద్ధి వినాయక భవన నిర్మాణ కార్మిక సంఘం గురువారం పిలుపునిచ్చింది. ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. తాపీమేసీ్త్రల రేట్లను పెంచాలని ఈనెల 16వ తేదీ వరకు పనులను బంద్ పెడుతున్నట్లు తెలిపారు. సంఘం నిబంధనలు అతిక్రమించి ఎవరైన పనిచేస్తే రూ.20 వేల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో ఆసంఘం అధ్యక్షుడు బాలరాజు, సభ్యులు రఘు, దశరథ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పునఃప్రారంభానికి సిద్ధం
ఇబ్రహీంపట్నం రూరల్: వేసవి సెలవుల గడువుకు ముగింపు దగ్గర పడుతోంది. బడులు ప్రారంభం కావాల్సిన సమయం రానే వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఏటా జూన్ 12వ తేదీన విద్యాసంస్థలు పునఃప్రారంభం అవుతాయి. కానీ ఈసారి ఎండల ప్రభావం ఎక్కువగా ఉండటంతో మూడు రోజులు ఆలస్యంగా బడులు ప్రారంభిస్తున్నారు. 15వ తేదీన బడులు తెరుచుకోనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పాఠ్యపుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరుకున్నాయి. 89 శాతం పుస్తకాలు పంపిణీ ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి ముందుగానే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్ సిద్ధం చేయాల్సి ఉంది. గత, నేటి ప్రభుత్వాలు ఇదే విధంగా పనులు చేపడుతున్నాయి. మండలంలో 46 ప్రభుత్వ పాఠశాలలు, మూడు రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. వీటిలో 7,210 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఏటా బడులు తెరుచుకోవడానికి ముందే పాఠ్యపుస్తకాలు అందజేస్తారు. ఈసారి 42,052 పుస్తకాలు మండల విద్యాధికారి కార్యాలయం నుంచి ఆయా బడులకు చేరవేశారు. 89 శాతం పుస్తకాలు అందించారు. ప్రభుత్వం చెప్పినట్లుగా ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు నోట్బుక్స్ కూడా 43,000 అందజేశారు. గతంలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు మాత్రమే వర్క్ బుక్స్ ఇచ్చేది. కానీ ఈ సారి అన్ని తరగతుల విద్యార్థులకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అల్పాహారం ఎప్పుడు సీఎం రేవంత్రెడ్డి విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని అల్పాహారం తీసుకొస్తామని చెప్పారు. కానీ నేటికి దానిపై ఉలుకు పలుకు లేదు. అలాగే విద్యార్థి కిట్ పేరుతో 9 రకాల సామగ్రి అందజేస్తామని ప్రకటించారు. ఈ పథకం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ నుంచి ప్రారంభిస్తామని అన్నారు. అందులో భాగంగా యూనిఫాం, బ్యాగు, ష్యూ, టై, బెల్టు, ఐడీ కార్డు, సాక్సులు, ప్లేటుతో పాటు స్టేషనరీ సామగ్రి ఇస్తామని పేర్కొన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మరోవైపు ప్రైవేటు బడుల్లో ఫీజుల పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. 15న తెరుచుకోనున్న విద్యాసంస్థలు ఇప్పటికీ పత్తాలేని యూనిఫాంలు బడులకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు నేటికీ అందని విద్యార్థుల కిట్లు స్కూల్ డ్రస్సుల జాడేది? అన్ని బాగానే ఉన్నా యూనిఫాం(ఏకరూప దుస్తులు) విషయంలో స్పష్టత లేదు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వం యూనిఫాంలు కుట్టించి సిద్ధం చేసేది. ప్రతి విద్యార్థికి రెండు జతల చొప్పున స్కూల్ దుస్తులు అందజేస్తుంది. కానీ ఈసారి సమయం దగ్గర పడుతున్నా కనీసం క్లాత్ కూడా పాఠశాలకు చేరుకోలేదు. కొలతలు తీసుకునేది ఎప్పుడు.. కుట్టేది ఎప్పుడు.. పిల్లలకు ఇచ్చేది ఎప్పుడని వాపోతున్నారు. ముందస్తుగా పంపిణీ చేయకుండా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘ ఎండకాలం సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 15న తెరుచుకోనున్నాయి. పాఠ్యపుస్తకాల పంపిణీ సక్రమంగా జరుగుతున్నా యూనిఫాం విషయంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. పుస్తకాలు చేరవేశాం ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్ప టికే బడులకు పుస్తకాలు చేరవేశాం. అల్పాహారం, స్టూడెంట్ కిట్లు పథకం అమలు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి బలోపేతం చేయండి. మధ్యాహ్న భోజనం, స్కూల్ డ్రస్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ ఉచితంగా ఇస్తాం. – హీర్యానాయక్, ఎంఈఓ, ఇబ్రహీంపట్నం -
22 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
ఇద్దరు మహిళలపై కేసు షాద్నగర్ రూరల్: నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు మహిళలపై కేసు నమోదయింది. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని లాల్సింగ్ తండాలో గురువారం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఏఓ రాజేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. లాల్సింగ్ తండాకు చెందిన కవిత ఇంట్లో కొందుర్గు మండలం పాత ఆగిర్యాలకు చెందిన రాజేశ్వరి నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలు నిల్వ చేసింది. ఈ విత్తనాలు అదే తండాలో విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు 22 కిలోల నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకుని వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించారు. ఇన్చార్జి ఏఓ రాజేందర్రెడ్డి ఫ/ర్యాదు మేరకు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రణయ్ తెలిపారు. యువకుడికి రిమాండ్ కడ్తాల్: ప్రేమ పేరుతో యువతిని వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన కడ్తాల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదిరెడ్డి తెలిపిన ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన మూడ చరణ్ ఓ యువతిని కొంత కాలంగా ప్రేమ పేరిట వేధిస్తూ పెళ్లి చేసుకోవాలని ఒత్తి చేస్తున్నాడు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించసాగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారన్నారు. షాబాద్: డ్యాన్స్ నేర్పించేందుకు వెళ్లిన మాస్టర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన షాబాద్ ఠాణా పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన ప్రకారం.. షాద్నగర్కు చెందిన డాకూరి భాస్కర్ కుమారుడు మధు(19) షాద్నగర్ రాక్ డ్యాన్స్ స్కూల్లో డ్యాన్స్ మాస్టర్. రోజు మాదిరిగానే ఈ నెల 10న ఇంట్లో డ్యాన్స్ క్లాస్కు వెళ్తున్నాని చెప్పాడు. అదే రోజు రాత్రి 9 గంటలకు షాబాద్ మండలం మన్మర్రి గ్రామంలో స్నేహితుడు జశ్వంత్ వాళ్ల అక్క కొడుకు తొట్టెల ఫంక్షన్లో ఉన్నానని వీడియో కాల్ చేశాడు. ఉదయం ఇంటికి వస్తానని చెప్పాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు మధుకు ఫోన్ చేశారు. దీంతో మిత్రులు ఫోన్ లేపి ఈతకు వచ్చామని మధుకు ఈత రాక చనిపోయాడని చెప్పారు. తమ కుమారుడికి ఈత వచ్చని జశ్వంత్, అతని స్నేహితులపై తమకు అనుమానం ఉందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
16న యువ సమ్మేళనం
మంచాల: నగరంలోని కొత్తపేట్లో ఈనెల 16న జరిగే యువ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి రావుల జంగయ్య కోరారు. గురువారం మండలంలోని ఆరుట్ల గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. సామాజిక బాధ్యతగా దేశ భక్తితో నడుచుకోవాలన్నారు. యువ సమ్మేళనం నిర్వహణ కోసం నిధుల సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బుగ్గరాములు, గోపాల్, బుచ్చయ్య, యూసుఫ్ అలీ, మల్లేష్, అంజయ్య, వీరేష్, గణేష్, విజయ్, రాజు, గాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ విధానాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు
ఆమనగల్లు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతున్నాయని పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని మార్కెట్యార్డు ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లు ప్రజల ఓట్లను దోచుకుని రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు రాజ్యసభ సీట్లను కాజేసే స్థాయికి దిగజారిందని విమర్శించారు. బీజేపీ పాలనలో ప్రతిపక్షాల గొంతును నొక్కివేయడం, రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతను దెబ్బతీయడం పరిపాటిగా మారిందన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక దురదృష్టకర ఘటన అని అభివర్ణించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, పార్టీ మండల అధ్యక్షుడు జగన్, పట్టణ అధ్యక్షుడు మానయ్య, నాయకులు కేశవులు, గూడురు శ్రీనివాస్రెడ్డి, కసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్ -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
అబ్దుల్లాపూర్మెట్: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని చెప్పారు. గురువారం అబ్దుల్లాపూర్మెట్ రెవెన్యూ మండల పరిధిలో 400 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పెద్దఅంబర్పేటలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు వివరాలు ఇలా ఉన్నాయి. తుర్కయంజాల్ జోన్కు 153 మంది, పెద్దఅంబర్పేట్లో 140, అబ్దుల్లాపూర్మెట్ మండలానికి చెందిన 107 మందికి చెక్కులు మంజూరు కాగా రూ.4.46 కోట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీవాణి, పలువురు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 180 మందికి చెక్కుల అందజేత కడ్తాల్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో 180 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని అన్నారు. పేదల పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తోందన్నారు. ఖానాపూర్ శివారులో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్గౌడ్, గీత, భాస్కర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నర్సింహ, బీచ్యానాయక్, ప్రభాకర్రెడ్డి, భిక్షపతి, కేశవరెడ్డి, వెంకటేశ్, తహసీల్దార్ జయశ్రీ, ఎంపీడీఓ సుజాత, పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
ఇదే 'ఫ్యూచర్'
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి ఓ దిక్సూచిగా మారబోతోంది. గ్రీన్ఫార్మా, స్పోర్ట్స్, హెల్త్, ఎడ్యుకేషనల్, డేటా సెంటర్లు, ఏఐ, ఫార్చ్యూన్– 500 కంపెనీలతో విరాజిల్లబోతోంది. టోక్యో, సింగపూర్, న్యూయార్క్ వంటి గొప్ప నగరాలతో పోటీ పడబోతోంది. 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి వేదికగా నిలవబోతోంది’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో పోటీ పడేలా ఎనిమిదేళ్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసుకోవాలని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. బుధవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట వేదికగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కార్యాలయ భవనాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఎఫ్సీడీఏ విజన్ ఇన్ యాక్షన్ ప్లాన్ పోర్టల్, లోగోను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలి.. ‘150 రోజుల్లో ఎఫ్సీడీఏ భవనాన్ని పూర్తి చేసుకున్నాం. ఇది మా పనితనం. మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి. అభివృద్ధి పథం వైపు నడవాలి. స్థానికుల అభ్యర్థన మేరకు కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపాం. భవిష్యత్తులో ఈ నగరం మరింత రాణిస్తుంది. అడ్డుపడ్డోళ్లను అడ్డంగా తొక్కుకుంటూ ముందుకు వెళ్తాం. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహితనగరంగా రాణిస్తుంది చిన్న వర్షానికే వరదలు నగరంలోని వీధులను తరచూ ముంచెత్తుతున్న వరదలకు, ట్రాఫిక్ అంతరాయానికి నాటి పాలకుల పాపమే కారణం. నగరంలో పెద్ద వర్షం పడలేదు. చిన్నపాటి వర్షానికే వరద ఏరులై పారింది. ట్రాఫిక్ స్తంభించింది. రెండు కిలోమీటర్ల ప్రయాణానికి రెండు గంటలు పట్టింది. పదేళ్లలో అభివృద్ధి చేశాం. వంద కోట్లకు ఎకరం అమ్మామని చెప్పడం కాదు. నిన్నటి ట్రాపిక్ సమస్యకు కారణం ఎవరో చెప్పాలి. కబ్జాలపై మరింత కఠినంగా.. గత ప్రభుత్వంలోని దుర్మార్గులు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. చెరువులను చెరబట్టి, అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే చెరువులు, కుంటలోŠల్ ఉండాల్సిన వరద నీరు రోడ్లపైకి వస్తోంది. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్కు కారణమవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ఆక్రమణలు తొలగించి, చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తున్నాం. వాటి చుట్టూ పార్కులు, మార్కెట్లు తీసుకొచ్చి లేక్ ఎకానామీ సృష్టించబోతున్నాం. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల కబ్జాలపై మరింత కఠినంగా వ్యవహరించబోతున్నాం. కబ్జాలకు పాల్పడిన వాళ్లను వదలం. వారి వెనుక ఉన్నవాళ్ల తోకలు కట్ చేయడానికి కూడా వెనకాడం. అదేమైనా మీ తాత జాగీరా? బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్రెడ్డి 15 ఎకరాలు కబ్జా చేశాడు. దీన్ని కేసీఆర్ ఆయనకు రాసిచ్చాడు. అదేమైనా మీ తాతా జాగీరా? ఆడబిడ్డలు ఆడుకునే బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరబడితే నిర్దాక్షిణ్యంగా ఆక్రమణలను తొలగించాం. కుంటకు మళ్లీ జీవం పోశాం. గండిపేట, హిమాయత్సాగర్ ఆక్రమణలను తొలగించే పని చేస్తున్నాం. ఇవన్నీ మా కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసమే..’ అని సీఎం చెప్పారు. తెలంగాణ ముఖ చిత్రమే మారింది ‘హైదరాబాద్కు గొప్ప చరిత్ర ఉంది. ఆనాటి కులీకుతుబ్షాలు, నిజాం నవాబులు హైదరాబాద్ నగరాన్ని విస్తరింపజేశారు. ప్రపంచ పటంలో హైదరాబాద్కు ఒక మంచి గుర్తింపు వచ్చింది. చార్మినార్ నుంచి గుల్జార్హౌస్ వరకు, మొజాంజాహీ మార్కెట్ నుంచి ఖబూతర్ఖానా వరకు విస్తరించకపోతే చరిత్రలో గుర్తింపు వచ్చేదా? 200 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ విస్తరణతో జంటనగరాలుగా వెలుగొందుతున్నాయి. సైబరాబాద్ సాంకేతిక విప్లవం. 60 శాతం ఆదాయం అందిస్తుంది. ఇక్కడ ఎకరం రూ.200 కోట్లు పలుకుతోంది. తెలంగాణ ముఖ చిత్రమే మారింది. బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ అధికం. కుట్రలు, కుతంత్రాలు చేసినవాళ్లూ ఉన్నారు.. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తి వేలాది మంది చనిపోతే నిజాం చలించారు. మూసీ, ఈసీలు ఉప్పెనై కమ్మేయకుండా జంట జలాశయాలు నిర్మించారు. ఆనాడు సైబరాబాద్, హైటెక్సిటీ అంటే నవ్వినోళ్లు ఉన్నారు. ఔటర్ రింగ్రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రాయాన్ని అడ్డుకున్నారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టు వద్దే వద్దు అన్నోళ్లూ ఉన్నారు. ఈ నగరం అభివృద్ధి చెందకూడదని కుట్రలు, కుతంత్రాలు చేశారు. కానీ ఆనాటి ముఖ్యÐమంత్రులు హైటెక్ సిటీ, ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, జీనోమ్ వ్యాలీ, ఐటీ సంస్థలు, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలను తీసుకురాకపోతే.. పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవా?..’ అని రేవంత్ ప్రశ్నించారు. వచ్చేసారి ప్రతిపక్ష హోదాకూడా రాదు.. ‘ఆనాడు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లు.. నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహుడు, శుక్రాచార్యుడు ఉన్నారు. శుక్రాచార్యుడు ఫాంహౌస్లో పండిండు. మారీచుడు, సుబాహులను మనపై వదిలాడు. పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసుడు కలిసి ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటామంటున్నారు. అమెరికా వెళ్లి ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెబుతున్నారు. కానీ మీకు గతమే ఉంది. భవిష్యత్తు లేదు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు..’ అని సీఎం ఎద్దేవా చేశారు. విషం చిమ్ముతున్న బీఆర్ఎస్: భట్టి ఆనాటి ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో ఈ ప్రాంతాన్ని కలుషితం చేయాలని చూసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి, గ్రీన్ ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చిందని అన్నారు. కానీ ఓటమితో నిరాశా నిస్పృహలతో ఉన్న బీఆర్ఎస్ విషం చిమ్ముతోందని విమర్శించారు. కొన్ని గ్రామాలను ఎఫ్సీడీఏలో విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.హైటెక్ సిటీకి దీటుగా..: శ్రీధర్బాబు హైటెక్ సిటీకి దీటుగా కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచనతో రెండున్నరేళ్లుగా అహరి్నశలు శ్రమిస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఈ ప్రాంతవాసుల జీవనశైలిలో మార్పులు రాబోతున్నాయని, కాలుష్యం లేని పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక తదితరులు మాట్లాడారు. కొత్త శక్తిని నింపుకోవడానికి కలిసి రండి – ‘ఎక్స్’లో సీఎం రేవంత్రెడ్డి ‘భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఒక నిజం. మనం విదేశాలకు వెళ్లి గొప్ప నగరాలను చూసినప్పుడల్లా.. ఇంతటి ఆధునిక, ప్రణాళికాబద్ధమైన, అద్భుతంగా నిర్వహించే నగరం మన దేశంలో కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకున్నాం. భారతీయులందరి సామూహిక కోరికకు సమాధానమే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ. దీని కార్యాలయ భవనాన్ని ఆరు నెలల్లోనే ప్రారంభించుకున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో దీని ప్రాముఖ్యత కారణంగా ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది..’ అని సీఎం రేవంత్రెడ్డి బుధవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీని భూగోళంపైనే అత్యంత గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దే వరకు శ్రమించేలా కొత్త శక్తిని నింపుకోవడానికి నాతో కలిసి రండి..’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. -
తనిఖీలతో ప్రమాదాలకు చెక్
విద్యుత్ లైన్లు, సరఫరా వ్యవస్థ, భద్రతా ప్రమాణాలు మెరుగుపడ్డాయిసాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘వరుస తనిఖీలతో పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, బహుళ అంతస్తుల భవనాల్లో విద్యుత్ ప్రమా దాలు తగ్గాయి. అధికారుల నిషిత పరిశీలనతో కొత్తగా ఏర్పాటు చేసే సంస్థల్లో విద్యుత్ లైన్లు, సరఫరా వ్యవస్థ, భద్రతా ప్రమాణాలు మెరుగుపడ్డాయి’ అని చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ఆఫ్ తెలంగాణ కె.నందకుమార్ స్పష్టం చేశారు. సీ ఈఐజీగా బాధ్యతలు స్వీకరించి, ఆగస్టుతో ఏడా ది కాలం పూర్తి కాబోతోంది. ఆయన పనితీరుకు గుర్తింపుగా ప్రభుత్వం పదవీకాలన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’ పలుకరించింది. ఆయన మాటల్లోనే.. ఖర్చుతో పోలిస్తే.. ఆదాయం అధికం గతంలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలు, కొత్త కనెక్షన్లకు అనుమతుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఒక్క హెటీ కనెక్షన్ల ద్వారానే రూ.16 కోట్లు, సినిమాహాల్స్ ద్వారా రూ.7 కోట్ల రాబడి వచ్చింది. ఇక పీరియాడికల్ ఇన్స్పెక్షన్ల ద్వారా మరో రూ.3 కోట్లు వచ్చాయి. సీఈఐజీ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులకు ఏటా రూ.9 కోట్లు ఖర్చవుతోంది. ఈ విభాగానికి చేస్తున్న ఖర్చుతో పోలిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే అధికం. పారదర్శకతను పెంచాం సీఈఐజీ విభాగంలో పారదర్శకతకు పెద్దపీట వేశాం. 89 మంది ఉద్యోగులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు అంతా కలిసి రోజూవారీ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నాం. ఎవరు ఏ కంపెనీలో తనిఖీలకు వెళ్లారు.. గుర్తించిన లోపాలు వంటి అంశాలను రిజిస్టర్లో రికార్డు చేయిస్తున్నాం. వారంలో నాలుగు రోజుల్లో జిల్లాల్లో పర్యటించి, ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. తోటి ఉద్యోగుల పనితీరులోనూ మార్పు తీసుకొచ్చాం. అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. మధ్యవర్తుల ప్రమోయం లేకుండా నిర్దేశిత గడువులోగా ఫైళ్లు క్లియర్ చేయిస్తున్నాం. దరఖాస్తు సహా విద్యుత్ లైన్లలో ఏదైనా షార్ట్ఫాల్ ఉంటే.. ముందే గమనించి, వాటిని సరి చేయిస్తున్నాం. వినియోగదారుల కోసం ఫోన్ నంబర్ 040–23450367 పునరుద్ధరించాం. ప్రమాదాలు నివారిస్తున్నాం హెచ్టీ కనెక్షన్ల కోసం అనుమతులు కోరుతూ ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తున్నాం. వినియోగదారుడు ఎంపిక చేసుకున్న లోడుకు తగ్గ ప్రమాణాల మేరకు లైన్లు, కేబుళ్లు, ఏబీ స్విచ్ బోర్డులు, ఎర్తింగ్ సిస్టం, ప్యానల్ బోర్డులు, ఫ్యూజ్ బాక్సులు, డీటీఆర్, బ్రేకర్, కండక్టర్ ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే అనుమతులు జారీ చేస్తున్నాం. క్షేత్రస్థాయి తనిఖీల్లో గుర్తించిన లోపాలను సరిచేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. మార్పులు, చేర్పులు చేసిన తర్వాతే అనుమతులు జారీ చేస్తున్నాం. ఆయా పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో విద్యుత్ ప్రమాణాలను పెంచి, ప్రమాదాలను నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం. వినియోగదారులకు సూచనలు ● ఇళ్లలో విధిగా ఎంసీబీ, ఎసీసీబీ, ఆర్సీసీబీలు వాడటం ద్వారా ఏదైనా ఫాల్ట్ వస్తే వెంటనే ట్రిప్పై సరఫరా నిలిచిపోతుంది. ప్రమాదాన్ని నివారిస్తుంది. ● విద్యుత్ పరికరాలను ఎర్తింగ్ చేయడం ద్వారా షాక్ తగలకుండా నియంత్రిస్తుంది. ● ప్రస్తుతం వంటకు ఎలక్ట్రిక్ స్టవ్ల వాడకం పెరిగింది. స్విచ్లు, సాకేట్లను ఆ మేరకు మార్చుకోవాలి. ● అపార్ట్మెంట్స్లోని ప్యానల్, పంపు గదుల్లో స్నోక్డిటెక్టర్లు, ఫైర్ డిటెక్టర్లు విధిగా వాడాలి. ఇండస్ట్రీస్లో కెపాసిటర్లను తప్పనిసరి వినియోగించాలి. ఆటోమేటిక్ కేపాసిటర్ మరింత సురక్షితం. ● ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్లు ఉన్న ప్రదేశాల్లో అగ్నిమాపక యంత్రాలు ఉండాలి. ● ఏసీలు, గ్రీజర్లు, ఇతర పరికరాలు వాడుకలో లేనప్పుడు స్విచ్ఛాఫ్ చేయాలి. ● బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ల వద్ద ప్రాపర్ ఎర్తింగ్ చేయాలి. లిథియం బ్యాటరీలు చాలా ప్రమాదకరం. ఫైర్సేఫ్టీ తప్పనిసరి. ● స్నానాల గదిలో స్విచ్, సాకెట్స్ అమర్చొద్దు. విద్యుత్ పరికరాల వద్ద మండే స్వభావం గల వస్తువులు ఉంచొద్దు. కప్బోర్డుల్లో లైటింగ్ ప్రమాదకరం. పారదర్శకతకు పెద్దపీట ఉద్యోగులతో వాట్సాప్ గ్రూప్ నిర్దేశిత గడువులోపు ఫైళ్లు క్లియర్ కొత్త కనెక్షన్లతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం ‘సాక్షి’తో సీఈఐజీ నందకుమార్ -
అక్రమ నిర్మాణం కూల్చివేత
త్వరలో హద్దులు నిర్ణయించి, ఫెన్సింగ్ వేసేందుకు నిర్ణయం పహాడీషరీఫ్: బాలాపూర్ మండల పరిధిలోని జల్పల్లి గ్రామ బిజాన్గుట్ట ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయమై సాక్షి దినపత్రికలో ‘బిజాన్గుట్టపై అక్రమార్కుల కన్ను’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి ఆదేశానుసారం ఆర్ఐలు జమీల్, సుధాకర్లు జీపీవోలతో కలిసి ఉదయమే బిజాన్గుట్టకు చేరుకున్నారు. అధికారుల రాక విషయం తెలుసుకున్న వ్యక్తులు ప్రొక్లెయినర్ను అక్కడి నుంచి తరలించారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రీ కాస్ట్ వాల్ ప్రహరీని ఈ సందర్భంగా కూల్చివేశారు. త్వరలోనే స్థలానికి హద్దులు నిర్ణయించి, కబ్జా బారిన పడకుండా శాశ్వత ఫెన్సింగ్ నిర్మిస్తామని అధికారులు తెలిపారు. ఈ భూమిలో ఎవరైనా కబ్జాకు పాల్పడినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. -
తాగునీటి కోసం ట్యాంకు ఎక్కి నిరసన
మీర్పేట: తాగునీటి సదుపాయం కల్పించాలని లెనిన్నగర్ డబుల్ బెడ్రూం వాసులు మంగళవారం ఖాళీ బిందెలతో ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా మంచినీటి సౌకర్యం కల్పించలేదని, కార్పొరేషన్గా ఉన్నప్పుడు జిల్లా, స్థానిక ఎమ్మెల్యే, హౌసింగ్ బోర్డు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఇటీవల ఉన్న ఒక్కగానొక్క బోరు కూడా పాడైపోయిందన్నారు. ఆనుకునే మిషన్ భగీరథ ట్యాంకు ఉన్నప్పటికీ మంచినీరు తాగే భాగ్యం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. వెంటనే మంచినీటి సరఫరాకు సంబంధించి పైపులైన్ పనులు ప్రారంభించి కనెక్షన్ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలారవినాయక్, స్థానిక బీజేపీ అధ్యక్షుడు భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్, చెవ్వ శ్రవణ్, తిరుపతిరెడ్డి, పూజారి శంకర్, బాలునాయక్ పాల్గొన్నారు. -
అనురూప్రెడ్డికి నివాళి
అబ్దుల్లాపూర్మెట్: అమెరికాలోని సెబాన్ నదిలో ముగ్గురిని కాపాడి, ప్రాణాలు కోల్పోయిన అనురూప్రెడ్డి మృతదేహానికి మంగళవారం భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి రాసిన సంతాప పత్రాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మండలంలోని కవాడిపల్లికి చెందిన కోడూరు రాజేందర్రెడ్డి, దుర్గాభవాని దంపతుల చిన్న కుమారుడు అనురూప్ రెడ్డి మృతదేహం పది రోజుల తర్వాత స్వగ్రామానికి చేరుకొంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ప్రైవేట్ బడుల్లో అధిక ఫీజులు
ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పవన్ కల్యాణ్ మొయినాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు పుస్తకా లు, యూనిఫాంలు, ఇతర సామగ్రిని విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పవన్ కల్యాణ్ అన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం మండల వన రుల కేంద్రంలో విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి.. అధిక ఫీజులు వసూ లు చేస్తున్న విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసి.. మౌలిక వసతులు కల్పించాలన్నారు. వినతిపత్రం అందజేసినవారిలో సంజయ్, చందు, వినయ్, చరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
నేను చనిపోతున్నా.. బతకాలని లేదు
భార్యకు వీడియో కాల్ చేసి భర్త ఆత్మహత్య పహాడీషరీఫ్: ‘నేను చనిపోతున్నా.. నాకు బతకాలని లేదు’ అంటూ ఓ వ్యక్తి తన భార్యకు వీడియో కాల్ చేసి, ఆత్మహత్య చేసుకున్న సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం జకినాలపల్లికి చెందిన పెరుమాళ్ల నరేష్(37) జీహెచ్ఎంసీలో పనిచేస్తూ తుక్కుగూడలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి పదిహేనేళ్ల క్రితం శంషాబాద్కు చెందిన శ్రీలతతో వివాహం జరగగా ఇద్దరు కుమారులు ఉన్నారు. పది రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడడంతో శ్రీలత తన పెద్ద కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి తనతో పాటే ఉన్న చిన్న కుమారుడిని నరేష్ ఈనెల 8న భార్య వద్ద వదిలేసి వచ్చాడు. రాత్రి 12:30 గంటలకు శ్రీలతకు వీడియో కాల్ చేసి ‘నేను చనిపోతున్నా.. నాకు బతకాలని లేదు’ అని ఫోన్ కట్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె నరేష్ మేనమామ రవీందర్కు చెప్పి, తుక్కుగూడకు వెళ్లి చూడగా అప్పటికే ఇంట్లోని ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రూ.2 వేల కోట్ల భూమి సర్కార్దే..
సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 41/12, 41/13, 41/14లో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన 15 ఎకరాలు సర్కార్వేనని హైకోర్టు తేల్చిచెప్పింది. హక్కులు కోరుతూ ఐటినా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. పిటిషనర్ల చూపిన పట్టా సర్టిఫికెట్లు నకిలీవని, కల్పిత పత్రాల ఆధారంగా ప్రభుత్వ భూములను కాజేసే కుట్ర జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు ఆధారంగా చూపిన 1972, 1973 సంవత్సరాల పట్టా సర్టిఫికెట్లపై రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయ ముద్ర ఉందని..ఆ కార్యాలయం 1978లో మాత్రమే ఏర్పడిందని పేర్కొంది. పిటిషనర్ల హక్కులన్నీ ఈ పట్టాలపైనే ఆధారపడ్డాయని.. అనుమానాస్పదంగా ఉన్న వాటిని నిజమైనవని నిరూపించే బాధ్యత పూర్తిగా వారిపైనే ఉందని వ్యాఖ్యానించింది. కానీ వారు అది నిర్వర్తించలేకపోయినందున నకిలీ పట్టాల ఆధారంగా జరిగిన తదుపరి లావాదేవీలు, రెవెన్యూ ఎంట్రీలు, విక్రయాలు కూడా చట్టబద్ధ హక్కులను సృష్టించలేవని స్పష్టం చేసింది. అక్రమాలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సీఐడీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణ ముగించింది. కార్యాలయ ముద్ర అనుమానాస్పదం ఖానామెట్లోని 15 ఎకరాల భూమి తమదేనని, అధికారులు దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ హైకోర్టులో ఐటినా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మాజీ సైనికులకు కేటాయించిన భూమిని వారి వారసుల నుంచి 2006లో పిటిషనర్ కొనుగోలు చేసింది. పట్టా భూముల్లో అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్రెడ్డి ఈ వాదనలను తప్పుబట్టారు. పిటిషనర్లు ఆధారంగా చూపిన 1972, 1973 సంవత్సరాల పట్టా సర్టిఫికెట్లపై ‘తహసీల్దార్, రాజేంద్రనగర్’ కార్యాలయ ముద్ర ఉందని, కానీ ఆ కార్యాలయం 1978లోనే ఏర్పడిందన్నారు. ఆ సర్టిఫికెట్లు అసలైనవిగా ఉండే అవకాశం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని తేల్చేశారు. తహసీల్దార్ జారీ చేయాల్సిన ఆదేశాలను ‘రికార్డింగ్ ఆఫీసర్’ పేరిట జారీ చేసినట్లు చూపడం అనుమానాస్పదమని, ఆ పత్రాలు కూడా కల్పితమైనవేనని అభిప్రాయపడ్డారు. నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా జరిగిన లావాదేవీలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. పిటిషన్ను కొట్టివేస్తూ, పిటిషనర్కు రూ.5 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి చెల్లించాలని ఆదేశించారు. ఖానామెట్ భూములపై ఐటినా ప్రాపర్టీస్ పిటిషన్ కొట్టివేత అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు సీఐడీ దర్యాప్తునకు ఆదేశం -
సీఎం సభకు భారీగా ఏర్పాట్లు
కందుకూరు: ఫ్యూచర్సిటీలో నిర్మించిన ఎఫ్సీడీఏ భవనం ప్రారంభోత్సవంతో పాటు ఆ సమీపంలో బుధవారం సాయంత్రం నిర్వహించనున్న సీఎం బహిరంగ సభకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు. ఎఫ్సీడీఏ భవనంలో పచ్చదనం కనిపించేలా మొక్కలు నాటడం, గడ్డిపరిచే పనులు చేపట్టారు. భవనం వెనుక వైపు ఉన్న ప్రాంతంలో సభ కోసం పెద్దపెద్ద షెడ్లు వేస్తున్నారు. మరోవైపు జనాలు భారీగా సభకు వచ్చేలా కాంగ్రెస్ పెద్దలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫ్యూచర్సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఏఫ్సీడీఏ భవనంతో పాటు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఆర్టీషీ
వికారాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమయ్యాక ఆక్యుపెన్సీ రేటు భారీగా పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలు, ట్రాన్స్ జెండర్లకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. జిల్లాలో మూడు డిపోలు(వికారాబాద్, పరిగి, తాండూరు) ఉండగా వీటి పరిధిలో 200 బస్సులు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 5.68కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.209.33 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో బస్సులో రోజుకు సగటున 300 నుంచి 350 మంది ఉచితంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల్లో 70 శాతానికి పైగా నారీమణులే ఉంటున్నారు. మహాలక్ష్మి పథకంతో.. గడచిన దశాబ్ద కాలంలో ఆర్టీసీ అనేక సంస్కరణలు చేపట్టినా ఆక్యుపెన్సీ పెరిగిన దాఖలాలు లేవు. మహాలక్ష్మి పథకం అమలయ్యాక ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సీ్త్రలతోపాటు పురుషుల సంఖ్య కూడా పెరిగింది. ఇది ఆక్యుపెన్సీ రెండింతలు అవడానికి దోహదం చేసింది. గతంలో 50 నుంచి 60 లోపే నమోదయ్యే ఆక్యుపెన్సీ పథకం ప్రారంభమైన కొద్ది రోజులకే 95 నుంచి 120 శాతానికి చేరింది. స్టాపుల్లో ఆగని బస్సులు బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో సిబ్బందికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. బస్సుల్లో నిలుచుకోవడానికి కూడా స్థలం ఉండని పరిస్థితి నెలకొంది. గతంలో చెయ్యెత్తిన చోట బస్సు ఆపేవారు. ఆడిగిన చోట దించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సగం స్టాపుల్లో బస్సులు ఆపకుండానే వెళ్తున్నారు. ఇదిలా ఉండగా మహిళా ప్రయాణికులను కండక్టర్లు, డ్రైవర్లు చిన్న చూపు చూస్తున్నారు. వారికి పురుష ప్రయాణికులు గొంతు కలుపుతున్నారు. కుటుంబ సభ్యులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. మహిళలకు కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలనే స్లోగన్ ఇప్పుడు మచ్చుకై నా కనిపించడంలేదు. మహిళల సీట్లలో పురుషులే కూర్చుంటున్నారు. డబ్బులు ఇచ్చి టికెట్ కొంటున్నారంటూ కండక్టర్లు సైతం వారికే సపోర్టు చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం బస్సుల్లో వారు ఎదుర్కొంటున్న బాధలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సులన్నీ రద్దీగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన ఆక్యుపెన్సీ -
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన బొల్లు బుచ్చయ్య కుటుంబం తుక్కుగూడ బసవగూడ తండాకు నెల క్రితం వలస వచ్చి కూరగాయల ఫామ్లో పని చేస్తున్నారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి నిద్రించగా, మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచి చూడగా అతని చిన్న కుమార్తె సునీత (21) కనిపించలేదు. పరిసరాల్లో గాలించినా లాభం లేకుండా పోయింది. కుల్కచర్లకు చెందిన రమేష్ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ బుచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేకాట స్థావరాలపై దాడులు కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం లాల్పహాడ్లో పేకాట స్థావరాలపై మంగళవారం పోలీసులు దాడులు చేపట్టారు. పేకాట ఆడుతున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఈ దాడుల్లో రూ.60,800 నగదు, ఏడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరు సుడాన్ దేశస్తులకు ఎబోలా నెగెటివ్ గాంధీ ఐసోలేషన్ నుంచి డిశ్చార్జి గాంధీఆస్పత్రి: ఎబోలా వైరస్ అనుమానితులకు నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రావడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు నుంచి వారిని మంగళవారం డిశ్చార్జీ చేశారు. గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ఎబోలా స్క్రీనింగ్ పరీక్షల్లో సూడాన్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తుల్లో ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్యసేవలు అందించారు. వారి నుంచి నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించగా, నిర్ధారణ పరీక్షల్లో ఎబోలా నెగెటివ్ వచ్చినట్లు పుణే వైరాలజీ ల్యాబ్ అధికారికంగా ధ్రువీకరించిన సంగతి విధితమే. ఈ నేపధ్యంలో 48 గంటల తర్వాత మరోమారు శాంపిల్స్ సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపగా, రెండోసారీ ఎబోలా నెగెటివ్ రావడంతో సెల్ఫ్ మానిటరింగ్ చేసుకోవాలని, అందుకు అవసరమైన విధానాలు, పద్ధతులు, జాగ్రత్తలు చెప్పి వారిని డిశ్చార్జీ చేశారు. ప్రస్తుతం గాంధీ ఐసోలేషన్ వార్డులో ఎబోలా అనుమానితులెవరూ లేరు. -
మట్టిపోసి.. మూసేసి!
చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలుఓవైపు చెరువులు, కుంటలను కాపాడుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వాటిని పరిరక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అవుతున్నాయి. శిఖం భూముల్లో మట్టి పోసి చెరువులను మూసివేస్తూ.. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. – మొయినాబాద్హైదరాబాద్ మహానగరానికి అతి చేరువలో ఉన్న మొయినాబాద్ మండలంలో రియల్ వ్యాపారులు పాగా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో 111 జీవో అమల్లో ఉండటంతో పక్కనే ఉన్న గండిపేట మండలంతో పోలిస్తే భూముల ధరలు సుమారు 10 రెట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో రియల్ వ్యాపారులు ఇక్కడ తక్కువ ధరలో భూములు కొనుగోలు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల సమీపంలో భూములు కొని వాటిని కబ్జా చేస్తున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీతోపాటు మండలంలో సుమారు 48 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా చెవులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలు, పూడ్చివేతలు కొనసాగాయి. కాపాడాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. శిఖంలో మట్టితో పూడుస్తున్న వైనం ఆనవాళ్లు లేకుండా చేస్తున్న అక్రమార్కులు నోటీసులతో సరిపెడుతున్న అధికారులుపరిశీలించి చర్యలు తీసుకుంటాం అమ్డాపూర్ పటేల్కుంటలో మట్టి పోస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే సిబ్బందిని పంపించి పరిశీలించాం. శిఖంలో మట్టిపోస్తే చర్యలు తీసుకుంటాం. మండలంలోని చెరువులు, కుంటలను పరిశీలించి ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో గుర్తిస్తాం. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటాం. – గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్ -
అభివృద్ధిని ధ్వంసం చేయడమే మార్పా?
మొయినాబాద్: మార్పు అంటే అభివృద్ధిని ధ్వంసం చేయడమేనా అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్ రెవెన్యూలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న డంపింగ్ యార్డును మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హిమా యత్నగర్ రెవెన్యూలోని ప్రభుత్వ భూమిలో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం, వన నర్సరీ ఏర్పాటు చేసిందని తెలిపారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి చెత్తనంతా క్రీడా ప్రాంగణం, పల్లెప్రకృతి వనం, నర్సరీలో వేస్తూ డంపింగ్ యార్డుగా మార్చేశారన్నారు. దుర్వాసన, ఈగలు, దోమలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రోడ్డుపై వెళ్లేవారు ముక్కమూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓవైపు మూసీ ప్రక్షాళన చేపడుతూ గండిపేట, హిమాయత్సాగర్ జలాశయాల పక్కనే చెత్త డంపింగ్ చేయడం ఏమిటని నిలదీశారు. వర్షం పడితే డంపింగ్ యార్డులోని నీరంతా జలాశయాల్లో చేరుతుందన్నారు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలి యదా అంటూ ధ్వజమెత్తారు. మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్తో ఫోన్లో మాట్లాడి నెల రోజుల్లో డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తొ లగించాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ ఆఽ ద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హె చ్చరించారు. ఆమె వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయ కులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రవూఫ్, కౌన్సిలర్ శ్రీధర్, మాజీ సర్పంచ్లు మంజుల, శ్రీహరియాదవ్, మహేందర్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మోర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
ప్రమాదవశాత్తు కింద పడి యువకుడి మృతి
శంకర్పల్లి: నిర్మాణ కంపెనీలో పని చేస్తు న్న ఓ యువకుడు ప్ర మాదవశాత్తు గుంత లో మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం మోకిల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అనంతవరం గ్రామానికి చెందిన రాజు, రేణుక దంపతులు. వీరికి ఇద్దరూ కుమారులు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్పల్లి మండలం మోకిలకి వచ్చి నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. వీరి పెద్ద కొడుకు అశోక్(25) స్థానికంగా ఎస్ఎస్ఐ బహుళ నిర్మాణ కంపెనీలో పని చేస్తున్నారు. మధ్యాహ్నం ఆయన పని చేస్తుండగా బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశాత్తు కింద ఉన్న కుంటలో పడ్డాడు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మురుగు కాలువలో మృతదేహం లభ్యం పహాడీషరీఫ్: మురుగు కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై దయాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద డ్రైనేజీ మురుగు కాలువలో యువకుడి మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన మున్సిపల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, మృతుడి వయసు 35–40 ఏళ్ల నడుమ ఉంటుందని, మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండడాన్ని గమనించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
రేషన్షాపుల్లో 14 రకాల సరుకులు ఇవ్వాలి
● సివిల్ సప్లయిస్ కార్యాలయం వద్ద ఐద్వా నిరసనపంజగుట్ట: రేషన్షాపుల్లో బియ్యంతోపాటు 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, స్కూల్ ఫీజులు పెరుగుతుండటంతో సామాన్యుల జీవనం భారంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆహార భద్రత, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి బియ్యంతోపాటు, పప్పు, మంచినూనె, మొక్కజొన్నలు రెండు కేజీల చొప్పున, చక్కెర కేజీ, కారం 500 గ్రాములు, పసుపు 250 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, పామాయిల్ లీటర్, కొబ్బరి నూనె 250 గ్రాములు, ఆవాలు, జొన్నలు, పల్లీలు, సబ్బులను రేషన్ షాపుల ద్వారా అందించాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయకార్యదర్శులు కేఎన్ ఆశాలత, కె.నాగలక్ష్మి, పి.శశికళ, వై.వరలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బట్టుపల్లి అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్సిటీ
కందుకూరు: ఫ్యూచర్సిటీని అత్యంత ప్రమాణాలతో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు అన్నారు. ఫ్యూచర్సిటీలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఎఫ్సీడీఏ భవనంతో పాటు సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఏఐ సిటీతో పాటు డాటా సెంటర్ల వంటివి ఏర్పాటు కానున్నాయన్నారు. ఇక్కడ నెలకొల్పే సంస్థలో పని చేయడానికి నైపుణ్య శిక్షణ కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఫ్యూచర్సిటీలో నెలకొల్పే ప్రతి సంస్థ కాలుష్యరహితంగానే పని చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు ఎంత అడ్డు తగులుతున్నా ఇక్కడి ప్రజల కోసం చేపట్టిన నగర నిర్మాణాన్ని ఆపేదిలేదన్నారు. భవిష్య నగరానికి పునాదులు వేస్తున్నామని, అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఎఫ్సీడీఏ భవనం ప్రారంభోత్సం, అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి, టీజీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక, టీపీసీసీ ప్రధానకార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్రెడ్డి, సరికొండ మల్లేష్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్బాబు -
మచ్చుకు కొన్ని..
● సురంగల్ రెవెన్యూలోని దర్గ చెరువు సుమారు 15 ఏళ్ల క్రితమే పూర్తిగా కబ్జాకు గురైంది. చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ప్రస్తుతం చెరువు ఆనవాళ్లే లేకుండా పోయాయి. ● పెద్దమంగళారం రెవెన్యూలోని ఎల్లమ్మకుంట శిఖం భూమిలో పదేళ్ల క్రితం వెంచర్ చేసి ప్లాట్లు విక్రయించారు. ప్రస్తుతం శిఖం భూమిలో చేసిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ● సురంగల్ రెవెన్యూలోని మామిళ్ల కుంట కట్టను తొలగించి ఆనవాళ్లు లేకుండా చేశారు. శిఖంలో మొత్తం ప్లాట్లు చేసి విక్రయించారు. ప్రస్తుతం నిర్మాణాలు సైతం జరుగుతున్నాయి. ● అమ్డాపూర్లోని పటేల్ కుంట శిఖం భూమిలో అక్రమంగా మట్టిపోసి పూడుస్తున్నారు. నాలుగైదు రోజులుగా టిప్పర్ల ద్వారా మట్టి తెచ్చి పూడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ● చిలుకూరు పెద్ద చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. గత ఏడాది భారీ వర్షాలకు పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి శిఖంలో చేపట్టిన నిర్మాణాల్లోకి నీళ్లు వెళ్లాయి. ప్రస్తుతం శిఖంలో మట్టిపోసి ఎత్తు పెంచుతున్నారు. ● పెద్దమంగళారం పెద్ద చెరువు శిఖంలో మట్టిపోసి ఎత్తు పెంచుతున్నారు. ● పెద్దమంగళారం బిజినికుంట శిఖం భూమిలో ప్రీకాస్ట్ గోడలు నిర్మించారు. ● పెద్దమంగళారం ఊరుముందు కుంటలో అక్రమ నిర్మాణాలు జరిగాయి. ● కేతిరెడ్డిపల్లి రెవెన్యూలో ఉన్న కంచిమోనిగూడ కుంటను ఆనవాళ్లు లేకుండా చేసి ప్లాట్లు చేసి విక్రయించారు. అందులో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ● చిలుకూరు అంతప్పచెరువు శిఖంలో ప్రీకాస్ట్వాల్స్, షెడ్లు నిర్మించారు. ● చిలుకూరు పడమటి చెరువులో నుంచి ప్రైవేటు వెంచర్లోకి రోడ్డు వేశారు. ● మేడిపల్లిలోని ఊరుముందు కుంట, కుమ్మరికంట, ఎర్రకుంటలో అక్రమ నిర్మాణాలు, షెడ్లు నిర్మించారు. ● కనకమామిడిలోని దమ్మాయి కుంటలో ప్రీకాస్ట్ వాల్స్ నిర్మించారు. ● బాకారంలోని జంబుల కుంట శిఖంలో ఆక్రమణలు జరుగుతున్నాయి. ● నాగిరెడ్డిగూడలోని అబ్బుకుంట శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. చెరువులోనుంచే ప్రైవేటు వ్యక్తులు రోడ్డు వేశారు. ● నజీబ్నగర్లోని సింగారం చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు జరిగాయి. చెరువు అలుగు కింది భాగంలో కాలువకు అడ్డంగా ప్రహరీ నిర్మించారు. దీంతో గతంలో చెరువు కట్ట తెగిపోయింది. ఇటీవలే సుమారు రూ.40 లక్షలు మంజూరు కావడంతో గండిని పూడ్చి మరమ్మతులు చేశారు. అలుగు కిందిభాగంలో నిర్మించిన ప్రహరీ తొలగించకపోవడంతో వర్షాలు పడి చెరువు నిండితే మళ్లీ కట్ట తెగే ప్రమాదం ఉంది. ● కేతిరెడ్డిపల్లిలోని వెంకటమ్మ చెరువు శిఖంలో ఫాంహౌస్లు, భవనాలు నిర్మించారు. ● హిమాయత్నగర్లోని బూరుగుకుంట శిఖంలో మట్టి నింపి నిర్మాణాలు చేపట్టారు. -
ఊరుముందు కుంటను అభివృద్ధి చేస్తాం
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం ఊరుముందు కుంటను అభివృద్ధి చేసి, సుందరీకరణ పనులు చేపడతామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కుంటను పరిశీలించి మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, డీఈ జిరంజీవులు, కౌన్సిలర్లు మమతారెడ్డి, అరుణ, స్థానికులతో కలిసి అభివృద్ధిపై చర్చించారు. తన సొంత నిధులతో గుర్రపుడెక్కను తొలగిస్తానని చెప్పారు. అనంతరం చందానగర్–కవేలిగూడ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర నాయకులు అంజన్కుమార్గౌడ్, కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ రామకృష్ణగౌడ్ తదితరులు ఉన్నారు. యాచారం: పీఏసీఎస్లో దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు ఇప్పటికై నా అప్పులు చెల్లించాలని డీసీసీబీ జాయింట్ రిజిస్ట్రార్ మనోజ్కుమార్రెడ్డి సూచించారు. రుణాలు పొంది సకాలంలో చెల్లించని 300 మందికి మంగళవారం ఆయన నోటీసులు జారీ చేశారు. మూడేళ్లుగా యాచారం పీఏసీఎస్లో రుణాలు సక్రమంగా వసూలు కావడం లేదని, దీంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న కొత్త రైతులు అవకాశం కోల్పోతున్నారని అన్నారు. ఈనెల చివరి లోపు అప్పులతో కూడిన బకాయిలు చెల్లిస్తేనే సరి లేదంటే ఆస్తుల జప్పు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈఓ నాగరాజు, సిబ్బంది ఉన్నారు. చేవెళ్ల: మొయినాబాద్ మండలంలోని కనకమామిడి ఫామ్హౌస్ కేసులో కొడిచెర్ల సాయికుమార్ మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు నరేందర్, జిల్లా కార్యదర్శి శివశంకర్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఏసీపీ కిషన్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సంఘటన జరిగి 20 రోజులు అవుతున్నా ఈ కేసులో ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు కల్పించుకొని, నిందితులను అరెస్ట్ చేసి బాధితకుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఊరెంట ప్రవీణ్, నరేశ్, ప్రేమ్సాగర్, నగేశ్, రాజు, తదితరులు ఉన్నారు. వెల్జర్లలో విషాదఛాయలు షాద్నగర్: బిడ్డ బంగారు భవిష్యత్తును ఆశించిన తల్లిదండ్రుల ఆశ నెరవేర లేదు. బంగారు భవిష్య త్తు కోసం రెక్కలు ముక్క లు చేసుకొని కొడుకును చదివిస్తే అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో షాద్నగర్ పరిధిలోని వెల్జర్లకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బాలమణి, కృష్ణయ్యల కుమారుడు కార్తీక్ (26) పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్లో ఉంటూ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం తోటి స్నేహితులు గుర్తించి వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. తండ్రి కృష్ణయ్య సోమ వారం ఉదయమే కొడుకును హాస్టల్లో విడిచిపెట్టివచ్చాడు. కార్తీక్కు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియరాలేదు. మృతదేహాన్ని మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
రోడ్డు నిబంధనలు తప్పనిసరి
నందిగామ సీఐ ప్రసాద్ షాద్నగర్: ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించి, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని నందిగామ సీఐ ప్రసాద్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చేగూరులో సర్పంచ్ మంకాల శ్రీశైలం అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సైదులు, సీఐ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కారు నడిపేవారు సీట్బెల్టు, ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. అతివేగం ప్రమాదకరమన్నారు. తహసీల్దార్ సైదులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోందని, దశలవారీగా పనులు చేపట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. -
మురుగుతో పరేషాన్ !
డ్రైనేజీ నుంచి ఉప్పొంగుతున్న మురుగు ● నివారణ చర్యల్లో తీవ్ర జాప్యంపై ప్రజాగ్రహంమన్సూరాబాద్–ఆటోనగర్ రోడ్డు కేబీఆర్ కన్వెన్షన్ ఎదురుగా కొన్ని రోజులుగా డ్రైనేజీ నుంచి మురుగు పొంగి రోడ్డుపై వరదలా పారుతోంది. సుమారు 15 కాలనీలవాసులు ఈ మురుగు వరదనీటి నుంచి నడవాల్సిన దుస్థితి నెలకొంది. నివారణ చర్యలు తీసుకోవడంలో సీవరేజీ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శైలజాపురి కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన స్పందించి మురుగుకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. – మన్సూరాబాద్ మన్సూరాబాద్–ఆటోనగర్ రోడ్డు కేబీఆర్ కన్వెన్షన్ వద్ద డ్రైనేజీ నుంచి పొంగిపొర్లుతున్న మురుగు -
సీఎం పర్యటనను విజయవంతం చేయండి
హుడాకాంప్లెక్స్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా ఈ నెల 10న ఎఫ్సీడీఏ భవనం, స్కిల్ యూనివర్సిటీ భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తపేటలోని ఓ హోటల్లో రామకృష్ణాపురం, ఎన్టీఆర్నగర్, సరూర్నగర్, డాక్టర్స్కాలనీ డివిజన్లముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం నుంచి కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ మేరకు నాయకులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోయిని మహేందర్యాదవ్, నాయకులు శంకర్యాదవ్, గణేశ్నేత, ముప్పిడి లింగస్వామి గౌడ్, దయాకర్రెడ్డి, రామకృష్ణగౌడ్, బొడ్డుపల్లి మహేందర్, యాదవరెడ్డి, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దు బడంగ్పేట్: తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సరికాదని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మల్లాపూర్లోని వైఏఆర్ గార్డెన్లో మీర్పేట్, నందిహిల్స్, జిల్లెలగూడ, బడంగ్పేట్, నాదర్గుల్, బాలాపూర్ డివిజన్ల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేఎల్ఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 10న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ), స్కిల్ యూనివర్సిటీ భవనాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విచ్చేసి ప్రారంభిస్తారన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజస్థాయి నమ్మకం కలిగేలా ఫ్యూచర్ సిటీని నిర్మించి అభివృద్ధి చేస్తామన్నారు. కాలుష్యం లేని మహానగరంగా మార్చేందుకు గ్రీన్ ఫార్మా, పర్యావరణహితమైన సంస్థలకే అనుమతులు ఇస్తున్నట్లు కేఎల్ఆర్ తెలిపారు. సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్రెడ్డి, అమరేందర్రెడ్డి, బోయపల్లి రాఘవేందర్డ్డి, మార్కెట్ డైరెక్టర్ గోవర్ధన్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సుదర్శన్రెడ్డి, సామిడి గోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ -
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
కొత్తూరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలని సర్పంచ్ ఎర్రొళ్ల జగన్ కోరారు. మండలంలోని పెంజర్ల గ్రామంలో చంద్రమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని సోమవారం ఆయన పలువురితో కలిసి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా చంద్రమ్మకు దుస్తులు అందజేశారు. విడతల వారీగా గ్రామంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌస్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తడి, పొడి చెత్తపై అవగాహన మొయినాబాద్రూరల్: ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా వ్యాధులు ధరిచేరవని సర్పంచ్ పాషా అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మండల పరిధిలోని కుత్బుద్దీన్గూడలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇళ్లల్లోని చెత్తను ప్రభుత్వం సూచిస్తున్న విధంగా నాలుగు విధాలుగా వేరుచేసి గ్రామ పంచాయతీ ద్వారా సేకరిస్తున్న చెత్త బండిలో వేయాలని సూచించారు. ప్రజలందరూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి భూపాల్, పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య, ఉపసర్పంచ్ ఆలూరి రవీందర్, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన క్రికెట్ టోర్నీ షాద్నగర్: నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామంలో గత వారం రోజులుగా నిర్వహించిన చేగూరు జూనియర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో చైన్నె, బెంగుళూరు జట్ల మధ్య పోటీ జరిగింది. ఉత్సంఠ భరితంగా సాగిన పోటీలో బెంగుళూరు జట్టు విజయం సాధించగా.. రూ.10వేల నగదు, రన్నర్ జట్టుకు రూ.5వేల నగదుతో పాటు నిర్వాహకులు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో చేగూరు ఉపసర్పంచ్ శివశంకర్, వెంకమ్మగూడ సర్పంచ్ అశోక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి చేవెళ్ల: పట్టణ కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్రెడ్డి డిమాండ్ చేశారు. చేవెళ్లలోని ఆర్డీఓ కార్యాలయం ప్రజావాణిలో, విద్యుత్శాఖ కార్యాలయంలో సోమవారం బీజేపీ నాయకులతో కలిసి ఆయన విద్యుత్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. విద్యుత్ ఏడీ సాయినాథ్ స్పందిస్తూ వెంటనే సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీనిచ్చారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్గారి వైభవ్రెడ్డి, శర్వలింగం, సత్యనారాయణ, శ్రీకాంత్రెడ్డి ఉన్నారు. రోడ్డు పనులు ప్రారంభం షాబాద్: మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామ శివారు నుంచి మక్తగూడ శివారు వరకు పంట పొలాల వెంబడి చేపడుతున్న రోడ్డు పనులను సోమవారం గ్రామస్తులతో కలిసి సర్పంచ్ మంగమ్మ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేందర్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. శంకర్పల్లి: ఎమ్మెల్యే కాలె యాదయ్యను సోమవారం ప్రొద్దటూరు గ్రామస్తులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రొద్దటూరు–మేడిపల్లి, ప్రొద్దటూరు–టంగటూరు గ్రామాలను కలిపే రెండు రోడ్ల నిర్మాణానికి గాను ఎమ్మెల్యే కృషితో రూ. 5.50కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి, శాలువా కప్పి సన్మానించారు. పనులను సత్వరమే ప్రారంభించి, పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, గ్రామాభివృద్ధికి మున్ముందు ఎమ్మెల్యే ఇలానే సహాయ సహకారాలు అందించాలని సర్పంచ్ బండ లక్ష్మినర్సింహా కోరారు. -
పరిసరాల శుభ్రతతో వ్యాధులు దూరం
మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం షాద్నగర్: పరిసరాలను పరిశుభ్రతతో వ్యాధులు ధరిచేరవని మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 2, 9, 18, 21, 26, 27 వార్డుల్లో వార్డుసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వర్షాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని చెప్పారు. అదేవిధంగా కాలనీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ సునీత, వైస్ చైర్మన్ అందె మోహన్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ భూసేకరణపై సమీక్ష
షాద్నగర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా షాద్నగర్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్కు సంబంధించిన భూసేకరణపై సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ ఈఈ దయానంద్, ఎస్ఈ రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రిజర్వాయర్ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ, నిర్మాణ పనులు, పరిపాలనా అనుమతుల గురించి అధికారులతో చర్చించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 19 నుంచి 21 చేపట్టే పనుల వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకొన్నారు. జడ్చర్లలోని ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కొందుర్గు పరిధిలోని లక్ష్మీదేవిపల్లి వరకు కాల్వలు, టన్నెల్ నిర్మాణాలకు మొత్తం 2,919 ఎకరాల భూమి అవసరం అవుతుందని అధికారులు తెలిపారు. భూసేకరణకు సుమారు రూ.350కోట్లు వ్యయం అంచనా వేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు త్వరగా పూర్తి చేసి.. పరిపాలన, ఆర్థిక అనుమతులు ప్రభుత్వం నుంచి పొందేందుకు తగిన చర్యలు చేపట్టాలని, నిర్ణీత గడువులోపు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. -
పర్యావరణ పరిక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరం
నాగోలు: పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలని, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. నాగోలు–బండ్లగూడ ఐకాన్ వాకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై సోమవారం బండ్లగూడ నుంచి నాగోలు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ... బండ్లగూడ ప్రాంతాలకు చెందిన ఐకాన్ వాకర్స్ గ్రూప్ సభ్యులు ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రకృతి పరిరక్షణ పర్యావరణ అవగాహన లక్ష్యాలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. రోజూ నడక అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రకృతిని ప్రేమిద్దాం–పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే సందేశంతో ఐకాన్ వాకర్స్ గ్రూప్ సభ్యులు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పిస్తూ, మొక్కలు నాటడం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం, ఆరోగ్య పరిరక్షణకు నడక ఆవశ్యకతను వివరించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఐకాన్ వాకర్స్ గ్రూప్ అధ్యక్షుడు చెరుకు ప్రశాంత్ గౌడ్, జనరల్ సెక్రటరీ రమేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి రమేష్, జాయింట్ సెక్రటరీ పెంటారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, సలహాదారులు ప్రతాప్ రెడ్డి, తూర్పాటి చిరంజీవి, చెరుకు చిరంజీవి, ఈశ్వర్ గౌడ్, సీతారాములు పాల్గొన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి -
రైతుబజార్లో కూరగాయల ధరలు
హుడాకాంప్లెక్స్: సరూర్నగర్లోని రైతుబజార్లో కూరగాయల ధరలు(కిలో.. రూపాయల్లో).. టమాటా 43, వంకాయ 23, బెండకాయ 37, పచ్చిమిర్చి 40, కాకర 43, బీర 35, కాలిఫ్లవర్ 18, క్యాబేజీ 18, క్యారెట్ 40, దొండ 41, ఆలు 17, ఉల్లిగడ్డ 22, గోకర 33, దోసకాయ 18, సోరకాయ 13, పొట్లకాయ 18, చిక్కుడు 55, చామ 28, బీట్రూట్ 25, కీర 35, ఫ్రెంచ్బీన్స్ 75, క్యాప్సికం 65. బీజేపీ దళిత మోర్చా మండల కార్యవర్గం ఎన్నిక మహేశ్వరం: బీజేపీ దళిత మోర్చా మండల నూతన కార్యవర్గాన్ని పార్టీ మండల అధ్యక్షుడు యాదిశ్ ఆదేశానుసారం దళిత మోర్చా అధ్యక్షుడు గొల్లూరు మాధవ్ సోమవారం ప్రకటించారు. ఉపాధ్యాక్షులుగా జెన్నపల్లి రాజు, గజ్జెల శ్రీనివాస్, బొమ్మనబోయిన జంగయ్య, గట్టగళ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా దాసరి సుదర్శన్, రంగుల రవి, కార్యదర్శులుగా ఎర్ర ప్రశాంత్, నత్తి జంగయ్య, బండి మోహన్రాజు, తొంట శివలింగం, కోశాధికారులుగా బండి ప్రవీణ్, జెన్నపల్లి రమేశ్, కార్యవర్గ సభ్యులుగా ఏర్పుల ప్రశాంత్, కల్వకోల్ యాదగిరి, మంత్రి శ్రీకాంత్, కొండని సురేష్, మంద యాదగిరిని నియమించారు. మండలంలోని ప్రతి గ్రామంలో బీజేపీ బలోపేతం కోసం కృషి చేయాలని, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంపై పోరాడాలని గొల్లూరు మాధవ్ సూచించారు. మృగశిర కార్తె సందడి కందుకూరు: వానాకాలానికి స్వాగతం పలికే మృగశిర కార్తె రోజు చేపలు ఆరగించడం ఆనవాయితీ. దీంతో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో చేపల విక్రయాలు జోరందుకున్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు కిలో రూ.200 పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. శాఖాహార ప్రియులు బెల్లం, ఇంగువ తినడంతో పాటు అడవుల్లో, పొలాల్లో దొరికే ఆదొండ కాయలతో ప్రత్యేకంగా కూర చేసుకోవడం ఆనవాయితీ. బహిరంగ సభను విజయవంతం చేయండి కందుకూరు: ఫ్యూచర్ సిటీలో ఈ నెల 10న సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారని, వాటిని తిప్పికొట్టేలా ప్రతి గ్రామం నుంచి పెద్దఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు తరలిరావాలన్నారు. ఈ ప్రాంత భవిష్యత్ అంతా ఫ్యూచర్ సిటీపైనే ఆధారపడి ఉందన్నారు. ఆ రోజు సాయంత్రం సీఎం చేతుల మీదుగా ఎఫ్సీడీఏ భవనం, స్కిల్స్ యూనివర్సిటీ భవనాలను ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. వనస్థలిపురం పోస్టాఫీస్లో ఆధార్ సేవలు వనస్థలిపురం: వనస్థలిపురం సర్కిల్ పరిధిలోని పోస్టాఫీసులో ఆధార్ నమోదు కేంద్రాన్ని సబ్ పోస్ట్మాస్టర్ దుర్ాగ్య నాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు ఆధార్ సేవలను మరింత సులభంగా అందించాలనే ఉద్దేశంతో పోస్టాఫీసులో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఈ ఆధార్ కేంద్రం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తుందన్నారు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకునేవారు, పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, జనన తేదీ తదితర వివరాలను సవరించుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన పోస్టల్ సేవలు అందించడానికి పోస్టల్ శాఖ కట్టుబడి ఉందని అన్నారు. ఎంపీ ఈటల రాజేందర్కు అభినందన నాగోలు: ఈటల రాజేందర్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం బీజేపీ ఎల్బీనగర్ నియోజకవర్గ డివిజన్ల అధ్యక్షులు కలిసి ఆయనకు జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజాసేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బీజేపీ నాగోలు డివిజన్ అధ్యక్షులు పంగా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటడం అందరి బాధ్యత
మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్కుమార్ శంకర్పల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్కుమార్, కమిషనర్ యోగేశ్ అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 1, 9, 10వ వార్డుల్లో వార్డుసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి సరఫరా, తడి, పొడి చెత్త సేకరణ, మురుగు నీటి కాలువల శుభ్రత తదితర అంశాలపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, గణేశ్, ఆనంద్, వసంత, పీఏసీఎస్ డైరెక్టర్ మహేందర్రెడ్డి, మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమార్, నాయకులు చంద్రమౌళి పాల్గొన్నారు. -
దొంగ ఓట్లు తొలగించాలంటూ వినతి
కందుకూరు: దొంగ ఓట్లను తొలగించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గం బీఎల్ఏ–1 అంబోజి శ్రీనివాస్ మాట్లాడారు. మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పహాడీషరీఫ్, షహీన్నగర్, జల్పల్లి డివిజన్లలో కుప్పలు తెప్పలుగా దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. రోహింగ్యాల ఓట్లను సైతం గుర్తించామని, కేవలం 26 బూత్లలోనే 9,960 దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఈ నెల 25న ప్రారంభం కానున్న ఎస్ఐఆర్లో భాగంగా అనుమానాస్పద ఓట్లపై పూర్తిస్థాయిలో బీఎల్ఓల సహకారంతో విచారణ జరిపించి, దొంగ ఓట్లను తొలగించాలని కోరారు. అందుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ సాధ మల్లారెడ్డి, నాయకులు ముఖేశ్ముదిరాజ్, రావుల మల్లేశ్ పాల్గొన్నారు. -
కుసుమ పంట కొనుగోలు సంతోషకరం
కందుకూరు: కుసుమ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం సంతోషకరమని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద కుసుమ పంట కొనుగోలు కేంద్రాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. రైతులు ఆయనను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. నేదునూరు రైతులు కుసుమ పంట కొనుగోలు సమస్యపై తన వద్దకు రాగా.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రైతుల సమస్యను గుర్తించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని కొనియాడారు. రైతుల విషయంలో రాజకీయాలు చేయకూడదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తేరటి లక్ష్మణ్ముదిరాజ్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు పల్లె కృష్ణగౌడ్, మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు సోమరాజు వెంకటేశ్, గంగుల కృష్ణారెడ్డి, గంగుల వెంకట్రెడ్డి, సురసాని భూమిరెడ్డి, మైసయ్య, వరుణ్, నర్సింహ, నవీన్ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి -
ఇంకుడు గుంతలతో భూగర్భజలాలు పెంపు
ఎంపీడీఓ ప్రవీణ్కుమార్ శంకర్పల్లి: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయని ఎంపీడీఓ ప్రవీణ్కుమార్ అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మండలంలోని కొండకల్లో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. అవసరం ఉన్నా, లేకున్నా నీటి వినియోగం పెరిగిందని, అందుకు అనుగుణంగానే భూగర్భ జలవనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అదేవిధంగా గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త ఆటోల్లో వేయాలని, ఎల్లప్పుడూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రభుత్వం సూచించిన రోడ్డు భద్రత నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సతీశ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మోకిల సీఐ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ శేఖర్, ఉపసర్పంచ్ సీతారాంరెడ్డి, ఎస్ఐ సాయికృష్ణ, ఏపీఓ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
భూసార పరీక్షలతో రైతులకు మేలు
మండల వ్యవసాయాధికారి అనురాధారెడ్డి మొయినాబాద్రూరల్: రైతులు భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య పోషక యాజమాన్యం చేపడితేనే సాగు ఖర్చులు తగ్గి, నికర ఆదాయం పెరుగుతుందని మండల వ్యవసాయ అధికారి అనురాధారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని రైతులకు కేత్ బచావో అభియాన్ కార్యక్రమంపై కేవీకే విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సేంద్రియ ఎరువుల వినియోగం, భూసార పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందన్నారు. రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని సూచించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే నిపుణులు డాక్టర్ చంద్రకాంత్, డాక్టర్ కృష్ణ, సుధీర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఉపసర్పంచ్లకు ప్రభుత్వ అండ
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్నగర్రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసర్పంచ్లకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో మండల ఉపసర్పంచ్ల సంఘం నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. ఉపర్పంచ్లకు గౌరవ వేతనం అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సర్పంచ్లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. గౌరవ వేతనాల విషయాన్ని ప్రభుత్వానికి వివరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో మండల ఉపసర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షుడు ఎర్రోళ్ల అశోక్, అధ్యక్షుడు ప్రకాశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి మహేశ్యాదవ్, కార్యనిర్వాహణ అధ్యక్షుడు సయ్యద్జావెద్, ఉపాధ్యక్షుడు శ్యామ్లాల్, కార్యదర్శులు శివశంకర్, సుమన్గౌడ్, ప్రచార కార్యదర్శి రమేశ్, కోశాధికారి గంగాధర్, ప్రధాన సలహాదారుడు నవీన్రెడ్డి, గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. -
ఎంపీడీఓ అపర్ణ
గ్రామాల అభివృద్ధే ధ్యేయం షాబాద్: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభలు నిర్వహిస్తోందని ఎంపీడీఓ అపర్ణ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని నాగర్కుంట గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమాల్లో గ్రామస్తులందరూ భాగస్వాములు కావాలని సూచించారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపైప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, జల సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఎస్ఐఆర్పై గ్రామస్తులకు వివరించారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాలమాకుల మల్లయ్య, ఉపసర్పంచ్ బుగ్గ రాములు, పంచాయతీ కార్యదర్శి జగదీశ్, వార్డుసభ్యులు, అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
బడంగ్పేట్: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఏఐసీసీ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్రెడ్డి అన్నారు. సోమవారం బడంగ్పేట్ సర్కిల్–16లోని నాదర్గుల్ డివిజన్ అల్మాస్గూడ శేషాద్రినగర్కాలనీలో కాలనీ అధ్యక్షుడు సోమయ్యతో కలిసి నాయకులు రాఘవేందర్రెడ్డి, నవారు మల్లారెడ్డి సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీరోడ్ల నిర్మాణానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్ సహకారంతో జనరల్ ఫండ్ కింద రూ.87 లక్షలు మంజూరయ్యాయన్నారు. కాంగ్రెస్తోనే గ్రామాలు, పట్టణాల అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు దిండు శ్రీనివాస్గౌడ్, కాలనీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్గౌడ్, కాలనీవాసులు శంకర్, రాకేష్, శంకర్, లక్ష్మీకాంత్రెడ్డి, జగత్రెడ్డి, మహేష్, వెంకటేష్గుప్త, చంద్ర శేఖర్ తదితరులున్నారు. ఏఐసీసీ కో–ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్రెడ్డి -
చెరువులో వ్యర్థాల తొలగింపు
మన్సూరాబాద్: పెద్దచెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ పెద్దచెరువు ప్రాంగణం, చెరువులో ఉన్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలకు గత మూడు రోజులుగా స్వచ్ఛంద సేవకులు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. చెరువులోని ట్రక్కుల కొద్ది చెత్తను బస్తాల్లో వేసి మరో ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ... రానున్న వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని చెరువులోని వ్యర్థాలను తొలగించామని, వరదనీటితోనే చెరువును నింపి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశ్యంతో ముందుకు పోతున్నామన్నారు. వరదకాలువలోకి డ్రైనేజీ మురుగును కలుపుతుండటంతో చెరువులోకి మురుగు నీరు చేరి దుర్వాసన వస్తుందని పేర్కొన్నారు. వరద నీటికి, డ్రైనేజీ మురుగుకు ప్రత్యేకంగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వర్షపు నీరు మాత్రమే చెరువులోకి చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు వేమారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాంపల్లి రామేశ్వర్, కవితారెడ్డి, చంద్రశేఖర్రెడ్ది, ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. -
కూలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య అ‘పూర్వ’ సమ్మేళనం మొయినాబాద్రూరల్: మండల పరిధిలోని అమ్డాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005–06లో పదో తరగతి చదివిన విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వారందరూ ఒకచోట చేరి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోజంతా సందడి చేశారు.షాద్నగర్రూరల్: ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉపాధి కూలీలతో కలిసి ఆయన ఆర్డీఓ సరితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని, అందులో భాగంగానే జీరామ్జీగా పేరు మార్చిందన్నారు. ఉపాధి కూలీలకు ఫొటోల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఫొటో యాప్ను రద్దు చేసి, కూలీలకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి రమేశ్యాదవ్, మండల అధ్యక్షుడు జంగయ్య, నాయకులు చిన్నచంద్రయ్య, దామోదర్రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
మ్యాన్హోల్ కుంగి.. ప్రమాదకరంగా మారి
జిల్లెలగూడ స్వాగత్ గ్రాండ్ నుంచి నందనవనం వెళ్లే ప్రధాన రహదారిపై మ్యాన్హోల్ కుంగి ప్రమాదకరంగా మారింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డుపై మ్యాన్హోల్ కుంగిపోయి, దగ్గరకు వచ్చేవరకు కనిపించకుండా ఉండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదం బారినపడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంజినీరింగ్ విభాగం వారు మూతను ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని రోజుల్లోనే యథాస్థితికి చేరుకుందని తెలిపారు. తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. –మీర్పేట -
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి పద్మావతి చేవెళ్ల: ప్రజాసమస్యల పరిష్కారం, వార్డుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికను అమలు చేస్తోందని మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇబ్రహీంపల్లి, రామన్నగూడ, దామరగిద్ద వార్డుల్లో కౌన్సిలర్లు పి.మధుసూదన్రెడ్డి, దయాకర్, నర్సింలు ఆధ్వర్యంలో వార్డుసభలు నిర్వహించారు. ఈ సభలకు ముఖ్య అతిథులుగా ప్రత్యేకాధికారి పద్మావతి, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, చైర్పర్సన్ దేవర సమతారెడ్డి, ఎస్ఐ శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో వారు పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు అందించేలా కృషి చేయాలని కౌన్సిలర్లకు సూచించారు. అభివృద్ధి పనుల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సమావేశాల్లో కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, ప్రజలు నాయకులు పాల్గొన్నారు. -
వీరన్నగుట్టను దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతాం
మన్సూరాబాద్: వీరన్నగుట్టపై ఉన్న భద్రకాళి రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ యువనేత జక్కిడి రఘువీర్రెడ్డి ఆధ్వర్యంలో క్షేత్ర అభివృద్ధి పనులపై సమీప కాలనీలవాసులతో కలిసి ఆదివారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ... వీరన్నగుట్ట ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కల్గిన పుణ్యక్షేత్రమని అన్నారు. ఈ క్షేత్రానికి విచ్చేసే భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్షేత్రాన్ని అప్పటి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని పిలిపించి అభివృద్ధికి రూ. 18 కోట్ల నిధులను మంజూరు చేయించామని ఆయన గుర్తుచేశారు. మొదటి విడతగా రూ. 5.5 కోట్లతో గుట్ట చూట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టామన్నారు. వివాదాల కారణంగా కొత జాప్యం జరిగినా ప్రభుత్వం మారడంతో అభివృద్ధి కుంటుపడిందని వివరించారు. వీరన్నగుట్ట క్షేత్రం కమిటీ సభ్యుల సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి దివ్యమైన క్షేత్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. శివరాత్రి పర్వదినం రోజు రెండు లక్షల మంది భక్తులు వచ్చిన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. క్షేత్రం అభివృద్ధికి 3డీ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. డ్రైనేజీ, టాగునీటి వసతి కల్పించిన అనంతరం సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతామన్నారు. మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, మాజీ కౌన్సిలర్ కళ్లెం రవీందర్రెడ్డి, నాయకులు శ్రీధర్గౌడ్, రవీందర్గౌడ్, కొసనం ధనలక్ష్మి, రమేష్గౌడ్, శంకర్రెడ్డి, కేకేఎల్ గౌడ్, నాగభూషణం, సోమనాథ్, యాదగిరిస్వామి, సీతారాం, వెంకన్న, సత్యం, రఘునాథరెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి -
రైతుబజార్లో కూరగాయల ధరలు
ఆర్థిక సాయం మన్సూరాబాద్: గాలి దుమారానికి లెక్చరర్స్ కాలనీ డివిజన్ పరిధి విరన్నగుట్ట బస్తీకి చెందిన రమేష్ ఇంటిపై పక్కనే నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇంటి రేకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ యువనేత జక్కిడి రఘువీర్రెడ్డి ఆదివారం ఇంటిని సందర్శించి బాధిత కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. నాయకులు చంద్రారెడ్డి, కేకేఎల్ గౌడ్, నర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు. రేపు పాస్టర్స్, క్రైస్తవ సంఘాల సమావేశం మలక్పేట: మలక్పేట నియోజకవర్గ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధర్యంలో ఈ నెల 9న పాస్టర్స్, క్రైస్తవ సంఘాల నాయకుల సమావేశం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రోళ్ల మాణిక్యం అబ్రాహాం తెలిపారు. మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల ముఖ్య అతిథిగా హజరవుతారని వెల్లడించారు. రాక్ చర్చి సీనియర్ పాస్టర్ బిషప్ తిమోతి కొల్లబత్తుల, బాప్టిస్టు చర్చి సినీయర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ బోడ సాల్మన్ వాఖ్యోపదేశం చేస్తారని తెలిపారు. దిల్సుఖ్నగర్ బాప్టిస్టు చర్చిలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి అందరూ సకాలంలో హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత చంపాపేట: కాలనీల పరిశుభ్రతలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంఎంసీ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ చిత్రం సురేష్ కోరారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో చంపాపేట డివిజన్ సూర్యానగర్ కాలనీలో గడప గడపకూ వెళ్లి తడి పొడి చెత్తను విఽధిగా వేరు చేసి స్వచ్ఛ ఆటోవాలాలకు అందజేయాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొందరు చెత్తను ఆటోవాలాలకు అందజేయకుండా అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా రహదారులపై డంపింగ్ చేస్తున్నారని తెలిపారు. దీంతో కాలనీవాసులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు కృష్ణారెడ్డి, గౌతమ్రెడ్డి, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. కుక్కలు, కోతులతో ఇబ్బంది పడుతున్నారా? లింగోజిగూడ: ఎల్బీనగర్ జోనల్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో కాలనీల్లో కుక్కలు, కోతులతో ప్రజలు ఇబ్బంది పడితే వెటర్నరీ అధికారులను సంప్రదించాలని ఉన్నతాధికారులు సూచించారు. నాగోలు, హయత్నగర్ సర్కిల్ అధికారి డాక్టర్ పి.శ్యాంసుందర్ (ఫోన్: 90634 21353), సరూర్నగర్, ఎల్బీనగర్ సర్కిల్ అధికారి డాక్టర్ భుక్యానాయక్ (ఫోన్: 90638 36131)లను సంప్రదించాలని తెలిపారు. -
అవసరం లేకున్నా అతిగా కొని..
మొయినాబాద్: మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించడంలో మీన మేషాలు లెక్కిస్తున్న అధికారులు.. అవినీతిలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్ని వస్తువులు అవసరం లేకున్నా అతిగా కొనుగోలు చేసి అందులో వాటాలు దండుకుంటున్నారు. మున్సిపాలిటీలో ఇటీవల అధికారులు సున్నం బస్తాలు కొనుగోలు చేశారు. ఒక్కో గ్రామంలో సుమారు 300ల బస్తాలను వార్డు కార్యాలయాల్లో వేశారు. బ్లీచింగ్ పౌడర్లో కలిపి రోడ్లపక్కన చల్లడానికి వాటని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఏడాది మొత్తానికై నా సుమారు వంద బస్తాలు కూడా వినియోగించే అవకాశం లేదని.. వారు తమ కమీషన్ల కోసం ఎక్కువ కొనుగోలు చేసి వార్డు కార్యాలయాల్లో వృథాగా పడేశారని మున్సిపల్ సిబ్బందే వాపోతున్నారు. సున్నం బస్తాలు సరఫరా చేసే కాంట్రాక్టర్తో మున్సిపాలిటీలోని ఇద్దరు ముగ్గురు అధికారులు కుమ్మకై ్క ఒకేసారి తెప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుపై కొందరు కౌన్సిలర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిధులు లేవని చెప్పే అధికారులు.. అనవసర ఖర్చులు చేసి కమీషన్లు దండుకుంటున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సున్నం బస్తాల కొనుగోలులో అధికారుల చేతివాటం -
మహాసభలు విజయవంతం చేయండి
ఇబ్రహీంపట్నం: షాద్నగర్లో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ పిలుపునిచ్చారు. స్థానిక పాషా నరహరి స్మారక కేంద్రంలో ఆదివారం ఇబ్రహీంపట్నం మండల వ్యవసాయ కార్మిక సంఘం మహాసభను నిర్వహించి, మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్యచరణను ఈ మహాసభల్లో రూపొందించనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రెండు పూటల కూలీల హాజరు పద్ధతిని రద్దు చేసి, ఒకేసారి హాజరు తీసుకునే విధానాన్ని తీసుకురావాలన్నారు. ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి బడ్జెట్లో కోత విధించడం సరైనదికాదన్నారు. కూలీలకు 200 పనిదినాలు కల్పించి రోజుకి రూ.800 ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన కమిటీ ఎన్నిక వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని 17 మందితో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా కాకి రమేష్, కార్యదర్శిగా చాతళ్ల జంగయ్య, సహాయ కార్యదర్శులుగా గణేశ్, ఆనంద్, ఉపాధ్యక్షులుగా మమత, ప్రేమలత, కమిటీ సభ్యులుగా దానయ్య, వెంకటేశ్, భార్గవ్, ప్రశాంత్, శ్రీనివాస్, బీరయ్య, భారతమ్మ, ఐలమ్మ తదితరులను నియమించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జగన్ -
వార్డు సభలను విజయవంతం చేయండి
షాద్నగర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీలోని 2, 9, 18, 21, 26, 27వ వార్డుల్లో సోమవారం వార్డుసభలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సునీత తెలిపారు. ఉదయం 9 గంటలకు సభలు ప్రారంభమవుతాయని, ఆయా వార్డుల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం షాద్నగర్: ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రీప్రైమరీ తరగతులు మంజూరైనట్లు ఎంఈఓ మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని వెలిజర్లతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్కాలనీ, క్రిస్టియన్కాలనీ, ఆర్టీసీకాలనీ, వెంకటేశ్వర కాలనీల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఇన్స్ట్రక్టర్ ఇంటర్, ఆయాల కోసం 7వ తరగతి అర్హత కలిగి ఉండాలని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ సాయంత్రం వరకు మండల విద్యావనరుల కేంద్రంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మరిన్నీ వివరాలకు 96035 54546 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. చిన్నారి కుటుంబానికి అండగా ఉంటా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్నగర్: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో గత నాలుగు నెలల క్రితం మల్లన్న జాతరలో జరిగిన ఘటనలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. చిన్నారి తల్లిదండ్రులు గణేశ్, మౌనిక ఆదివారం షాద్నగర్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండేళ్ల చిన్నారి జాతరలో మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. చిన్నారి మృతిని కొన్ని పార్టీల నాయకులు రాజకీయం చేశారన్నారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేయకముందే కొందరు నాయకులు రాద్దాంతం చేశారే తప్పా ఎవరూ ఆదుకోలేదన్నారు. తాను అండగా ఉంటానని, తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వారికి హామీనిచ్చారు. డిప్యూటీ ఖాజీగా మహమ్మద్ రఫీఖ్ కేశంపేట: మండల డిప్యూటీ ఖాజీగా చౌలపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీక్ ఎంపికయ్యారు. ఈ మేరకు షాద్నగర్ ఖాజీ సయ్యద్ ఇఫ్తేఖార్ అలీ చేతుల మీదుగా ఆదివారం ఆయన నియామకపత్రం అందుకొన్నారు. మైనార్టీ వక్ఫ్బోర్డు పరిధిలో పనిచేస్తూ ముస్లింలకు సంబంధించిన వివాహాలు, విడాకుల వ్యవహారాలతో పాటు ధార్మిక వ్యవహారాలను చేపట్టాలని ఈ సందర్భంగా ఇఫ్తేఖార్ అలీ సూచించారు. ఎస్ఎఫ్సీ సభ్యుడికి సన్మానం కడ్తాల్: స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా నియామకమైన మండల కేంద్రానికి చెందిన ఎండీ ఆసీఫ్ అలీని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్పతినాయక్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అలీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యాదయ్య, రాజునాయక్, జహంగీర్అలీ, రమేశ్ తదితరులు ఉన్నారు. మంచాల: సీపీఎం జిల్లా నాయకుడు కర్నాటి శ్రీనివాస్రెడ్డి మాతృమూర్తి(ప్రమీళ) ఇటీవల మృతి చెందడంతో వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. ఆదివారం రంగాపూర్లో ఆమె చిత్రపటం వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి, డీజీ.నర్సింగ్రావు, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు జంగారెడ్డి, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, అలాగే కాంగ్రెస్ నేతలు రాష్ట్ర రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, మర్రి నిరంజన్రెడ్డి, రాంరెడ్డి నివాళుల ఆర్పించి శ్రీనివాస్రెడ్డిని ఓదార్చారు. -
విద్యార్థికి సన్మానం
షాద్నగర్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో షాద్నగర్ పరిధిలోని మొగిలిగిద్ద కేజీబీవీకి చెందిన విద్యార్థిని బడావత్ అఖిల 831వ ర్యాంకు సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను అఖిలను ఆదివారం బీజేపీ నాయకులు అందె బాబయ్య, శ్రీవర్ధన్రెడ్డి ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ప్యాట అశోక్, నాయకులు వంశీకృష్ణ, రఘునాథ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కార్యవర్గం ఎన్నిక యాచారం: మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం 12వ మండల మహాసభ జరిగింది. ఈ సభకు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగన్, అంజయ్యలు హాజరయ్యారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు, ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం చేసిన రాజీలేని పోరాటాలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఇదే మాదిరి ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మానించారు. అనంతరం మండల నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్ పుష్ప, కావలి జగన్లను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా లాజర్, జంగయ్య, సహాయ కార్యదర్శిగా కుమార్, కార్యవర్గ సభ్యులుగా రాములు, జంగయ్య, సత్యనారాయణ, సురేష్, సత్యం, జగన్, ఇంద్రమ్మ, అంజయ్య, శివ, రాములను ఎంపిక చేశారు. ఈ నెల 14న షాద్నగర్లో జరిగే జిల్లా మహా సభలకు యాచారం మండలం నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని నిర్ణయించారు. స్వయం ఉపాధి మేలు కడ్తాల్: యువత స్వయం కృషితో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్గుప్తా, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో నిరుద్యోగులు ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయలను స్థానిక నాయకులతో కలిసి వారు ప్రారంభించారు. యువత తల్లిదండ్రులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భిక్షపతి తదితరులున్నారు. ఆమనగల్లు: స్థానిక ఎస్ఐగా కోటేశ్వర్రావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని మోకిల పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఆయన బదిలీపై ఆమనగల్లుకు వచ్చారు. ఆదివారం ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకిరెడ్డి, ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. -
చదువుతోనే పేదరికం మాయం
యాచారం: చదువుతోనే పేదరికం మాయమవుతుందని, ఆ దిశగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కష్టపడి చదవాలని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ సూచించారు. ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన యాచారం మండలం గడ్డమల్లయ్యగూడం గ్రామానికి చెందిన గౌర జాహ్నవి, మంచాల మండల కేంద్రానికి చీర మనస్వినిలను నగరంలోని ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు. తలా రూ.పది వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం మాయం కావాలన్నా.. ప్రజల్లో గుర్తింపు పొందాలన్నా కేవలం చదువు ఒక్కటే పరిష్కారామన్నారు. నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పుల కోసం అంబేడ్కర్ అడుగు జాడలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ -
10న అధిక ధరలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన
నాగోలు: కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని, అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇ.టి నరసింహ తెలిపారు. సీపీఐ నాగోలు డివిజన్ సాయి నగర్ (గుడిసెలు) ప్రాంత జనరల్ బాడీ సమావేశం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కాంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నర్సింహ మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల ప్రయోజనాలే లక్ష్యంగా పెట్రో ధరలు పెంచాయన్నారు. తద్వారా దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం అయిందని అన్నారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్ మాట్లాడుతూ... ముందుగా నాగోలు చౌరస్తా నుంచి సీపీఐ కార్యకర్తలు జెండాలు చేతపట్టుకుని సాయినగర్ సీపీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నాగోలు డివిజన్, సాయినగర్ ఏరియా శాఖల కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ -
నిషేధంపై నిర్లక్ష్యం!
కొత్తూరు: ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినడం.. భూతాపం పెరగడంతో పాటు పలు విపత్తులకు కారణమయ్యే నాణ్యత లేని పాలిథిన్(ప్లాస్టిక్) ఉత్పత్తులపై ప్రభుత్వం విధించిన నిషేధం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక వ్యాపారులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి తీర్మానం చేసి ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు నోటీసులు సైతం జారీ చేశారు. కానీ అధికారుల నిఘా కొరవడడంతో కొందరు వ్యాపారులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. యథేచ్ఛగా వాడకం.. మండల కేంద్రంతో మొదలుకొని అన్ని పంచాయతీలు, అనుబంధ గ్రామాలు, గిరిజన తండాల్లో సైతం నాణ్యత లేని పాలిథిన్ కవర్లు, ఇతర ఉత్పత్తుల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, అల్పాహారం, కిరాణ, కూరగాయలు, పండ్లు, ఇతర చిరు దుకాణాల్లో వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. 40 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న పాలిథిన్ కవర్లను తయారు చేయడం.. ఉపయోగించడాన్ని గతంలో ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ మండలంలో పాలిథిన్ సంచుల నాణ్యతను గుర్తించే యంత్రాలు లేకపోవడం.. సంబంధిత శాఖ అధికారుల అలసత్వం కారణంగా మండలంలో వ్యాపారులు యథేచ్ఛగా కవర్లు వాడుతున్నారు. మండలంలో రోజుకు సగటున 60 నుంచి 80 కిలోల వరకు పాలిథిన్ సంచుల విక్రయం సాగుతోంది. గ్రామాల్లోని పలు కాలనీల్లో వాడి పడేస్తున్న పాలిథిన్ సంచులను కొందరు ఇళ్ల సమీపంలోనే కాల్చుతున్నారు. దీంతో సమీపంలోని ఇళ్లలోకి విషపూరితమైన పొగ వ్యాపిస్తుండడంతో రోగాల బారినపడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అనర్థాలు ఇలా.. పాలిథిన్ సంచులు ఏళ్ల తరబడి భూమిలో కరిగిపోకుండా ఉండడంతో విపరీతమైన భూతాపం పెరుగుతోంది. వర్షాకాలంలో కాల్వల్లో వరద ప్రవాహాన్ని అడ్డుకొని సమస్యలను సృష్టిస్తాయి. నాణ్యత లేని పాలిథిన్ గ్లాసులు, ఇతర ఉత్పత్తుల్లో టీ, వేడి ఆహార పదార్థాలను తినడంతో పలు రకాల వ్యాధుల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిని జనావాసాల మధ్య కుప్పగా పడేసి కాల్చడంతో విషపూరితమైన వాసన కారణంగా శ్వాసకోస వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. విచ్చలవిడిగా పాలిథిన్ విక్రయాలు అవగాహన కల్పిస్తున్నా మారని తీరు తూతుమంత్రంగా అధికారుల తనిఖీలునిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే వివిధ రకాల వ్యాపారులతో సమావేశం నిర్వహించాం. నాణ్యత లేని ప్లాస్టిక్ కవర్లు, ఇతర ఉత్పత్తులను విక్రయించడం.. వినియోగించకుండా అవగాహన కల్పించాం. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు జరిమానాలు సైతం విధించాం. తరచూ చేసే తనిఖీల్లో ప్లాస్టిక్ను వినియోగించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. – బాలాజీ, మున్సిపల్ కమిషనర్, కొత్తూరు -
సంతోషంతో ఒత్తిడి దూరం
నాడు జలకళ.. నేడు వెలవెల వర్షాకాలంలో వరద పరవళ్లు తొక్కుతూ పంట పొలాలను ముంచెత్తిన ఈసీ వాగు ప్రస్తుతం ఎడారిగా దర్శనమిస్తోంది. మండలంలోని అమ్డాపూర్ సమీపంలో గల ఈసీవాగు పరివాహక ప్రాంతం వెలవెలబోయి కనిపిస్తూ చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. – మొయినాబాద్రూరల్ చేవెళ్ల: సంతోషం, ఆనందకరమైన అలవాట్లు మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఒత్తిడిని సమర్థవంతంగా దూరం చేస్తాయని మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ కళాశాల గ్రౌండ్లో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలతో కలిసి యోగ, వ్యాయామాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంతోషమే సగం బలం అనే మాట నిజం చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి యోగ, వ్యాయమాలు ఎంతో అవసరమన్నారు. దీంతో పాటు క్లీన్ చేవెళ్ల–గ్రీన్ చేవెళ్ల అనే నినాదంతో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ రాముగౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్, శైలజ, మనిషా, నాయకులు యాదిరెడ్డి, గోపాల్రెడ్డి, మున్సిపాల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి -
ఎంబీఏ పట్టభద్రులకు వీడ్కోలు
మన్సూరాబాద్: సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పట్టభద్రులు వీడ్కోలు సమావేశం మన్సూరాబాద్లోని ప్రలవి గార్డెన్స్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ జి.నాగయ్య మాట్లాడుతూ... కార్పొరేట్ రంగంలో వస్తున్న మార్పులతో నైతిక నాయకత్వానికి డిమాండ్ పెరుగుతోందన్నారు. ఎంబీఏ అధిక జీతాలిచ్చే ఉద్యోగాలకు మార్గం మాత్రమే కాదని, నిజాయితీ, నూతన ఆవిష్కరణలు, సామాజిక స్పృహతో వ్యాపారాలను నడిపించే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు అభినందించారు. ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం.కవిత, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం
షాబాద్: షాబాద్లో బొడ్రాయి ప్రతిష్ఠాపన 4వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి గ్రామస్తులు బొడ్రాయి వద్దకు బారులు తీరి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఊరేగింపులో శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుండాల అశోక్, మాజీ సర్పంచులు తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరి, రవీందర్, వెంకట్యాదవ్, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు జడల లక్ష్మీరాజేందర్గౌడ్, ఉపసర్పంచ్ దండు రాహుల్గుప్తా, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఆమనగల్లు/కడ్తాల్: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైసిగండి మాజీ సర్పంచ్ శేఖర్గౌడ్ను ఎమ్మెల్యే పరామర్శించారు. చెక్కుల పంపిణీ అనంతరం కసిరెడ్డి మాట్లాడుతూ.. పేదల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం అనేక నూతన పథకాలు అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని వివరించారు. రెండో విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికి అందిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్గౌడ్, సంధ్యారెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, మహేశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
ఉక్కపోత నుంచి ఉపశమనం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మృగశిరకు ముందే ఉమ్మడిజిల్లాను తొలకరి పలకరించింది. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనం శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షానికి వాతావరణం చల్లబడింది. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యధికంగా 5.03 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా మాడ్గులలో 4.43 సెంటీమీటర్లు నమోదైంది. శేరిలింగంపల్లిలో 4.08 సెం.మీ, కందుకూరులో 3.80 సెం.మీ, యాచారం మండలం నల్లవెల్లిలో 3.75 సెం.మీ, కడ్తాల్ మండలం ముద్వీన్లో 3.68 సెం.మీ, కొంగర కలాన్లో 3.38 సెం.మీ, మామిడిపల్లిలో 3.13 సెం.మీ, మణికొండలో 2.72 సెం.మీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్ చౌడాపూర్లో 3.68 సెం.మీ, మదన్పల్లెలో 2.80 సెం.మీ, యాలాలలో 2.65 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి విద్యుత్ లైన్లపై పడ్డాయి. వైర్లు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్ప డింది. విద్యుత్ అధికారులు వెంటనే అప్రమత్తమైన సరఫరాను పునరుద్ధరించారు. మరోవైపు వర్షం ధాన్యం రైతులను నిండా ముంచింది. రాశులపై టార్పాలిన్లు లేకపోవడంతో తడిసి ముద్దయ్యాయి. ఇబ్రహీంపట్నంలో.. ఇబ్రహీంపట్నం: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిలిచింది. కొంగరకలాన్లో 33.8 మిల్లీమీటర్లు, ఇబ్రహీంపట్నంలో 13.8 మి.మీ. మంగల్పల్లి ప్రాంతంలో 0.8 మి.మీటర్లు వర్షపాతం నమోదైంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం తాండూరులో 5.03 సెం.మీ వర్షపాతం మాడ్గులలో 4.43 సెం.మీ నమోదు ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం -
మృత్యు లోకాలకు
అమ్మమ్మ ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు, యువకుడు మృతి షాద్నగర్రూరల్: అతివేగం ఇద్దరి ప్రాణాలను హరించిన సంఘటన షాద్నగర్ పరిధిలోని లింగారెడ్డిగూడ సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫరూఖ్నగర్కు చెందిన పడకంటి జగదీశ్వర్, జయశ్రీ దంపతుల కుమారుడు అఖిల్ కుమార్(19), అక్కడే ఉండే శంకరయ్య, శామలమ్మ దంపతుల కుమారుడు నవదీప్(14) ఇద్దరు స్నేహితులు. శంకరయ్య కొన్నేళ్ల క్రితం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపాల్ గ్రామం నుంచి బతుకుదెరువు నిమిత్తం షాద్నగర్కు వలస వచ్చారు. ఆయన మేసీ్త్ర పనులు నిర్వహిస్తుండగా, శ్యామలమ్మ శంషాబాద్లోని ఆస్పత్రిలోని పని చేస్తూ జగదీశ్వర్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అఖిల్కుమార్ తన స్నేహితుడు నవదీప్తో కలిసి బైక్పై అమ్మమ్మ ఊరైన నందిగామ మండలం పిట్టలగూడ గ్రామానికి వెళుతున్నారు. మార్గమధ్యలో లింగారెడ్డిగూడ గ్రామ శివారులో క్రికెట్ మైదానం వద్ద రోడ్డు పైకి వస్తున్న జేసీబీని ఢీకొట్టారు. దీంతో ఇద్దరు రహదారిపై పడిపోయారు. అప్పుడే వెనక నుంచి వేగంగా వస్తున్న ఎంఎస్ఎన్ పరిశ్రమకు చెందిన బస్సు రోడ్డుపై పడిపోయిన నవదీప్, అఖిల్కుమార్ల పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు అఖిల్కుమార్ ఇటీవల షాద్నగర్లో ఇంటర్ పూర్తి చేశారు. నవదీప్ కొందుర్గు మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి మరణంతో ఆస్పత్రి ఆవరణలో వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం, ట్రాఫిక్ సీఐ శంకరయ్యతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
ప్రీకాస్ట్ మాటున గంజాయి సాగు
నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు చేవెళ్ల: సిమెంట్ ప్రీకాస్ట్ పలకల తయారీ కేంద్రంగా నిర్వహిస్తున్న అక్రమ దందా గుప్పుమంది. గుట్టుగా గంజాయి మొక్కలు పెంచుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పట్టణ కేంద్రంలో హైదరాబాద్ రోడ్డుకు సమీపంలో సిమెంట్ ప్రీకాస్ట్ పలకలు, ఇటుకలు తయారు చేసే కేంద్రంలో అక్రమంగా గంజాయి మొక్కలను పెంచుతున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో వారు దాడులు చేశారు. అక్కడ బిహార్కు చెందిన నగరాజిత్ యాదవ్, దిశేసర్ యాదవ్, లాల్బాబు యాదవ్, గణేశ్కుమార్ గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించారు. తహసీల్దార్ కృష్ణయ్య, ఏఓ శంకర్లాల్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. దాదాపు 3.1 కిలోల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని నలుగురుపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
జవహర్నగర్ దోపిడీ ముఠా
20 రోజుల పాటు పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ ● నలుగురి అరెస్ట్కంటోన్మెంట్: జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భారీ దోపిడీ కేసును మల్కాజి పోలీసులు ఛేదించారు. నేపాలీ ముఠాకు చెందిన ప్రధాన నిందితులు మీనా, రాజేష్, డేనియల్ చారో, చాంగ్ కిరణ్లను అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ తెలిపిన మేరకు.. కౌకూర్లో నివాసముంటున్న మురళీ మోహన్ నరసిపురం ఇంట్లో మే 11న రాత్రి దోపిడీ జరిగింది. నేపాలీ కార్మికులు మీనా, రాజేష్లు దోపిడీకి పథకం రచించారు. సబీనా అనే మహిళను బాధితుడి ఇంట్లో పనిమనిషిగా చేర్పించారు. మే 11న మీనా పుట్టినరోజు వేడుకల పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు వృద్ధ దంపతులను బంధించి మత్తు పదార్థం ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం ఇనుప రాడ్లతో బెదిరించి అల్మారాలు పగులగొట్టి సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి వస్తువులు, 3 వేల అమెరికన్ డాలర్లు సహా విలువైన వస్తువులను దోచుకొని పరారయ్యారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మల్కాజ్గిరి పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 255 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించి, బెంగళూరు, ఢిల్లీ, ముంబైతో పాటు నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. నేరం జరిగిన ఐదు రోజుల్లోనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం మరో 20 రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మీనా, రాజేష్లు గతంలో పలుచోరీ కేసుల్లో నిందితులని వివరించారు. ఇదిలా ఉండగా కమిషనరేట్ పరిధిలో 1,276 మంది నేపాలీ జాతీయులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
షార్ట్ సర్క్యూట్తో షాపులో మంటలు
మొయినాబాద్: షార్ట్ సర్క్యూట్తో ఓ బట్టల షాపులో మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటన మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్లో జరిగింది. స్థానికంగా ఉండే అనురాధ తన ఇంట్లోనే బట్టల షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో అకస్మాత్తుగా మంటలు అంటుకొని భారీగా పొగలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బకెట్లతో నీళ్లు పోశారు. ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చింది. స్థానికులు, ఫైర్ సిబ్బంది కష్టపడి పూర్తిగా మంటలు ఆర్పేశారు. అప్పటికే చాలా బట్టలు కాలిపోయాయి. సుమారు రూ.4 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధితురాలు తెలిపారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ మొయినాబాద్రూరల్: ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని కాశీంబౌలిలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. సర్పంచ్ మాడి రాజేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ.. మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దన్నారు. సెల్ఫోన్ డ్రైవింగ్తో ప్రమాదాలు జరుగుతాయన్నారు. ట్రాఫిక్ నియయాలు పాటించాలని సూచించారు. అనంతరం ఎంపీఓ వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఇళ్లల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయవద్దన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సతీష్, ఎస్సై శివరాణి, వార్డు సభ్యురాలు స్వాతివిజయేందర్రెడ్డి, గ్రామస్తులు భూపాల్రెడ్డి, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రకుంట వాగు పరిశీలన
● స్పందించిన రెవెన్యూ అధికారులు ● ప్రహరీ నిర్మాణం కోసం తవ్విన పునాది పూడ్చివేత మొయినాబాద్: వాగులు కాలువలను కబ్జాచేస్తే కఠిన చర్యలు తప్పవని మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలోని సురంగల్ రెవెన్యూలో ఉన్న ఎర్రకుంట వాగును కబ్జాచేస్తూ ప్రహరీ నిర్మాణానికి చేపట్టిన తవ్వకాలపై ‘వాగులైనా వదలం’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. శనివారం తహసీల్దార్ గౌతమ్కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేష్, సర్వేయర్ జలజ, సిబ్బందితో కలిసి ఎర్రకుంట వాగును పరిశీలించారు. ప్రహరీ నిర్మాణంకోసం తవ్వని పునాదిని మట్టిపోసి పూడ్చివేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. వర్షం నీరు ప్రవహించే వాగులు, కాలువలను కబ్జాచేస్తే సహించేది లేదన్నారు. కాలువలు, వాగులు సహజసిద్ధంగా పట్టాభూముల్లో నుంచి ఉన్నా వాటిని వదిలేయాలని చెప్పారు. సర్వేకు దరఖాస్తు చేశాం సురంగల్ ఎర్రకుంట వాగుకు ఆనుకుని ఉన్న సర్వేనంబర్ 332లో 1.01 ఎకరాలు తమ పట్టాభూమి ఉందని.. వర్షాలు పడినప్పుడు వరద వచ్చి తమ పట్టాభూమి కోతకు గురికాకుండా ప్రహరీ నిర్మించడానికి పునాది తీశామని మాజీ సర్పంచ్ భర్త, మాజీ ఉపసర్పంచ్ గడ్డం అంజిరెడ్డి తెలిపారు. తమ భూమిని సర్వే చేసి హద్దులు చూపించాలని తహసీల్దార్కు దరఖాస్తు చేశామని.. సర్వే చేసిన తరువాతే ప్రహరీ నిర్మించుకుంటామన్నారు. అధికారులు త్వరగా సర్వే చేయాలని కోరారు. -
అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త
యాచారం: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు సూచించారు. మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడలో శనివారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో చోరీలు జరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బంధువుల ఇళ్లకు, శుభాకార్యాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలు నడిపే వారు రోడ్డు నిబంధనలు పాటించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ నందీశ్వర్రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీలత, గ్రామ సర్పంచ్ అచ్చెన మంగ పాల్గొన్నారు. కొందుర్గు: డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం కృషిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని తంగెళ్లపల్లిలో సర్పంచ్ చందన అధ్యక్షతన శనివారం ఏర్పాటుచేసిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వాటిని అరికట్టే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఆన్లైన్ గేములకు ఆకర్శితులై మోసపోవద్దని సూచించారు. తహసీల్దార్ ఆజంఅలీ భూదార్కార్డులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనువాసు, ఎస్ఐ రవీందర్, ఏఎస్ఐ చత్రినాయక్ పాల్గొన్నారు. ఫ్యూచర్సిటీతో కందుకూరు: ఫ్యూచర్సిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందనుందని మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అన్నారు. ఫ్యూచర్సిటీలో నిర్మించిన ఎఫ్సీడీఏ భవనాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ వైపు ఒత్తిడి తగ్గేలా సీఎం రేవంత్రెడ్డి ఫ్యూచర్సిటీ ఏర్పాటుకు రూపకల్పన చేశారన్నారు. ప్రపంచంలోనే మేటి నగరంగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని తెలిపారు. ఇక్కడ అన్ని రంగాలకు ప్రాధాన్యం కల్పించేలా భూములు కేటాయించనున్నట్టు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్సిటీని రద్దు చేస్తామని ప్రతిపక్ష నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి రాజకీయాలను పక్కనపెట్టి కలిసిరావాలన్నారు. ఈ నెల 10న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఎఫ్సీడీఏ, స్కిల్స్ యూనివర్సిటీ భవనాల ప్రారంభోత్సవం జరగునుందని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణానాయక్, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు సరికొండ మల్లేష్, ఎస్.వెంకట్రాంరెడ్డి, సీనియర్ నాయకులు చిర్ర సాయిలు, సురేందర్, యుగంధర్గౌడ్, మదన్పాల్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, వెంకటేష్, భూపాల్రెడ్డి, నర్సింహ పాల్గొన్నారు. పరిగి: పట్టణంలోని కొత్త చెరువు కుంటను పర్యాటక కేంద్రంగా మారుస్తానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన పట్టణ కేంద్రంలోని కొత్తచెరువు కుంట మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త చెరువు కుంటను పరిగి పట్టణంలో మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దుతానని అన్నారు. గతంలో కొత్త చెరువు కుంట అన్యాక్రాంతమైందని.. ప్రస్తుతం చెరువు అభివృద్ధి పనులకు నిధులను కేటాయించామన్నారు ఎలాంటి సమస్యలున్నా తన తృష్టికి తేవాలని కోరారు. -
యువత క్రీడల్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలి
హుడాకాంప్లెక్స్: యువత క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని క్రీడాప్రాధికార సంస్థ తెలంగాణ ఉప సంచాలకుడు రవీందర్ పేర్కొన్నారు. సరూర్నగర్ ఇండోర్స్టేడియంలో శనివారం వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. వేసవి శిక్షణ శిబిరాల ద్వారా విద్యార్థులు క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడంతోపాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటారన్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ చిన్నారులు, యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడం, శారీరక దృఢత్వం, మానసిక వికాసం, జట్టు భావన పెంపొందించడమే లక్ష్యంగా సరూర్నగర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించినట్టు తెలిపారు. జిల్లా యువజన, క్రీడల అధికారి స్వర్ణలత మాట్లాడుతూ.. భవిష్యత్లో మరింతమంది యువత క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన కోచ్లు, సిబ్బంది, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ధ్రువపత్రాలు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో వివిధ క్రీడా విభాగాల కోచ్లు, సిబ్బంది, క్రీడాభిమానులు పాల్గొన్నారు. -
పోలీసు కస్టడీకి నేపాలీ గ్యాంగ్
బంజారాహిల్స్: గత నెల 8వ తేదీన ప్రశాసన్నగర్లోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య తనూజరంజన్ను దారుణంగా హత్య చేసి బంగారు నగలతో ఉడాయించిన నేపాలీ గ్యాంగ్లో ఒక నిందితుడిని, నగలు కొనుగోలు చేసిన రిసీవర్ను ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పన అలియాస్ ధర్మతో పాటు మరో ఐదుగురు పోలీసుల కళ్లుగప్పి నేపాల్లోకి అడుగుపెట్టారు. చోరీకి గురైన సొత్తులో కొంత మాత్రమే రికవరీ అయ్యింది. మిగతా సొమ్ముతో పాటు ప్రధాన సూత్రధారులైన నేపాలీ గ్యాంగ్ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఈ ఘటనకు పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ సునీల్ పెరియార్తో పాటు రిసీవర్ దిలీప్లను పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని మరింత లోతుగా విచారించనున్నారు. ఆ రోజు జరిగిన ఘటనతో పాటు హత్య చేసిన అనంతరం ఎక్కడెక్కడికి వెళ్లారు.. తదితర వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. సునీల్ దిలీప్ -
వర్షం కురిసి.. అలా ముగిసి
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్కు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన సాక్షి, రంగారెడ్డి జిల్లా/తుర్కయంజాల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంతర్జాతీయ పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం శనివారం అకస్మాత్తుగా కురిసిన వర్షం.. ఆందోళనలు.. అరెస్టుల మధ్య ముగిసింది. కోహెడ కేంద్రంగా 239 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,284.32 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన మార్కెట్ భవనాలతో పాటు నాలుగు ఎకరాల్లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. సాయంత్రం ఐదు గంటలకే ఆయన హాజరు కావాల్సి ఉండగా, స్థానికంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి, కాలె యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులతో మాట్లాడి, వారి అనుభవాలను విన్నారు. తడిసిన రైతులు.. ఖాళీ కుర్చీలు పండ్లమార్కెట్ శంకుస్థాపనకు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నల్లగొండ, నాగర్కర్నూలు, భువనగిరి జిల్లాల నుంచి సుమారు యాభై వేల మందిని తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు బస్సులను ఏర్పాటు చేశారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి రైతులు తడిపి ముద్దయ్యారు. శంకుస్థాపన ఆలస్యం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి మధ్యాహ్నం మూడు గంటలకే సభాస్థలికి చేరుకున్న రైతులు రాత్రి పొద్దుపోయే వరకు నిరీక్షించాల్సి వచ్చింది. మరికొంతమంది శంకుస్థాపనకు ముందే వెనుదిరిగారు. సభాస్థలి ముందు భాగంలో మూడు బ్లాకులు ఏర్పాటు చేయగా ఒకటి, రెండు బ్లాకుల్లో మాత్రమే జనం కనిపించారు. మూడో బ్లాక్లోని కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సరైన పార్కింగ్ లేకపోవడం, వర్షం కారణంగా వాహనాలు బురదలో ఇరుక్కుపోవడంతో వీటిని తీసేందుకు నానా తంటాలు పడ్డారు. కాగా, మల్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన మద్దతుదారులు ప్లకార్డులు ప్రదర్శించగా ఎమ్మెల్యే వారిని వారించారు. నిశ్శబ్దంగా కూర్చోవాలని సూచించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ఆలస్యంగా కార్యక్రమం సభాస్థలికి రెండు గంటలు లేటుగా వచ్చిన ముఖ్యమంత్రి శంకుస్థాపనకు ముందే వెనుదిరిగిన మెజార్టీ రైతులు మరోవైపు కొనసాగిన ఆందోళనలు.. అరెస్టులు -
విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలి
పహాడీషరీఫ్: విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. స్పోర్ట్స్ ఎరీనాలో భాగంగా జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని ఏరోసిటీ మామిడిపల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్మించిన పలు నూతన నిర్మాణాలను స్కూల్స్ గ్రూప్స్ చైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్యతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, అగ్రికల్చర్, ఎడ్యూకేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాకేష్ చంద్ర అగర్వాల్, కన్హా శాంతి వనం ఓఎస్డీ డాక్టర్ నర్సిరెడ్డితో కలిసి రన్నింగ్ ట్రాక్, మినీ ఫుట్బాల్ కోర్ట్, స్విమ్మిగ్ పూల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో మానసిక పరిపక్వత పెంపొందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు క్రీడారంగంలో రాణించేలా అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి -
ఫ్యూచర్సిటీకి భూములిచ్చేదిలేదు
కందుకూరు: ఫ్యూచర్సిటీకి భూములు ఇచ్చేదేలేదని మండల పరిధిలోని ముచ్చర్ల రైతులు తీర్మానించారు. శనివారం స్థానిక సర్పంచ్ ఊటుపద్మ, ఉప సర్పంచ్ తేరటిరవి, సీనియర్ నాయకుడు ఊటు మహేందర్ ఆధ్వర్యంలో గ్రామంలో రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే ఫార్మా పేరుతో గత ప్రభుత్వం భూములు తీసుకుందని అన్నారు. మళ్లీ అదనంగా తీసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చారని, రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా ఇష్టానుసారంగా జీఓ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో 200 మంది రైతులు పట్టా భూములు కోల్పోయే అవకాశం ఉందన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే తమకు ఒక్క గుంట భూమి కూడా మిగల్చరా అని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తేరటి లక్ష్మణ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బక్క మల్లేష్, మాజీ ఉప సర్పంచ్ ఆర్.రవీందర్, వార్డు సభ్యులు రమేష్, వెంకటేశ్, అశోక్, కృష్ణగౌడ్, చెన్నయ్య, రైతులు శ్రీనివాస్రావు, రాజేందర్రెడ్డి, వెంకటేశ్వర్రావు, శ్రీరాములు, రవి, శ్రీనివాస్, వెంకటేశ్, రాజు, శేఖర్, హరి, నిరంజన్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ముచ్చర్ల రైతుల తీర్మానం -
గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్, సునీతాదేవి(30) దంపతులు పిల్లలతో కలిసి నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం జల్పల్లి శ్రీరామ కాలనీకి వలస వచ్చారు. రోజు మాదిరిగానే కుటుంబం నిద్రించగా 1వ తేదీన ఉదయం నిద్ర లేచి చూడగా సునీత కనిపించలేదు. ఎనిమిది నెలల క్రితం నితిన్ అనే వ్యక్తితో వెళ్లిపోయిన సునీత తిరిగి వచ్చిందని, ఇప్పుడు కూడా అతనితోనే వెళ్లిపోయి ఉంటుందని ఆమె భర్త పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొయినాబాద్లో షూటింగ్ సందడి మొయినాబాద్: మొయినాబాద్ ప్రాంతం షూటింగ్ స్పాట్గా మారింది. నగరానికి చేరువలో ఉండడంతోపాటు ఇక్కడ ఫాంహౌస్లు, దేవాలయాలు ఉండటంతో నిత్యం షూటింగ్ లు జరుగుతున్నాయి. ప్రధానంగా టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్ షూటింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. శనివారం కనకమామిడిలోని వేంకటేశ్వర దేవాలయం వద్ద ‘రుణానుబంధం’ సీరియల్ షూటింగ్ జరిగింది. ఆలయానికి వెళ్తున్నట్లు, ఆలయ పరిసరా ల్లో తిరుగుతున్న సన్నివేశాలను చిత్రీకరించా రు. సీరియల్ షూటింగ్ను ఆలయానికి వచ్చి న భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. -
అమ్మమ్మ ఇంటికి వెళ్తూ అతివేగం ఇద్దరి ప్రాణాలను హరించిన ఘటన షాద్నగర్ పరిధిలోని లింగారెడ్డిగూడ సమీపంలో జరిగింది.
రైతుల అంగీకారం లేకుండా, కనీస నష్టపరిహారం కూడా చెల్లించకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారని స్థానికులు, బాధితులు కొంతకాలంగా నిలదీస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సర్కారు తీరుపై అంతా గుర్రగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి కార్యక్రమంలో అలజడి సృష్టించే అవకాశం ఉందని అనుమానించిన పోలీసులు భూ బాధిత రైతులతో పాటు పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. వీరిలో ఇద్దరు అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా ఉండటం గమనార్హం. అరెస్టు చేసి, అటు ఇటు తిప్పి.. అరెస్టులను తప్పుబడుతూ కొంతమంది నిరసనకారులు కోహెడలో సీఎం రేవంత్రెడ్డి సహా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి, సీఎంతో పాటు, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి, గంటల తరబడి రోడ్లపై తిప్పుతూ.. చివరకు నాగోల్ పీఎస్కు తరలించారు. పోలీసులు, సర్కారు తీరుపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. రైతుల అంగీకారం లేకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.


