breaking news
Rangareddy
-
ఎక్స్అఫీషియోగా ఎమ్మెల్యే వీర్లపల్లి నమోదు
షాద్నగర్: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ పరోక్ష పద్ధతిలో సోమవారం జరగనుంది. షాద్నగర్ నుంచి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎక్స్అఫీషియోగా తన ఓటు హక్కును నమోదు చేసుకున్నట్లు కమిషనర్ సునీత తెలిపారు. మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 15 స్థానాల్లో కాంగ్రెస్, 11 చోట్ల బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 స్వతంత్రులు గెలుపొందారు. చైర్మన్ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను కాంగ్రెస్ ఇప్పటికే అందుకుంది. ఎమ్మెల్యే ఎక్స్అఫీషియోగా నమోదు చేసుకోవడంతో ఆ పార్టీ బలం 16కు చేరింది. దీంతో సునాయసంగా చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకుంటుంది. మొయినాబాద్: ‘ఊళ్లో ఇప్పటి వరకు ఇజ్జత్తో బతికినం.. మా తమ్ముడికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది.. కౌన్సిలర్గా గెలిచాడు.. ఇంటికొచ్చి జులూస్ చేద్దామనే లోపే నడీ రోడ్డుపై నుంచి మా తమ్మున్ని కాంగ్రెసోళ్ల ఎత్కపోయి మా ఇజ్జత్ తీస్తున్నారు. మా తమ్మున్ని మా దగ్గరకు పంపిస్తారా.. లేక మేము ఆత్మహత్య చేసుకోవాలా’ అంటూ 8వ వార్డు కౌన్సిలర్ మంచె శంకరయ్య సోదరులు మంచె పోచయ్య, మంచె సత్తయ్య, కుమారుడు మంచె నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అజీజ్నగర్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. డబ్బులు ఆశ పెట్టి ఎత్తుకెళ్లడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వెంటనే పంపిచాలని, లేదంటే కుటుంబ సభ్యులందరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. షాద్నగర్రూరల్: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా కొందుర్గులో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18న పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం ప్రజా సంఘాల నాయకులు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మిస్తే షాద్నగర్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. పెన్షనర్స్ భవనంలో నిర్వహించే సదస్సుకు ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, నర్సింహారెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టీజీ శ్రీనివాస్, అర్జునప్ప, రవీంద్రనాథ్, తిరుమలయ్య, శ్రీకాంత్, ఈశ్వర్, రాంచందర్, సత్యనారాయణ, ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: దండుమైలారంలోని ప్రాచీన శివాలయంలో ఆలయ ధర్మకర్తలు రావినూతల వంశీధర్ ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్ కుటుంబసభ్యులతో కలసి స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అబిడ్స్: జనవరి 1న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైన 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్) ఆదివారం ముగిసింది. 46 రోజుల పాటు కొనసాగిన నుమాయిష్లో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వస్తువుల ప్రదర్శనతో పాటు విక్రయించారు. చివరి రోజు 75 వేల మంది సందర్శించారని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్.సుఖేష్రెడ్డి, కార్యదర్శి బీఎన్ రాజేశ్వర్ తెలిపారు. గత ఏడాది 20 లక్షల మంది రాగా.. ఈసారి మొత్తం 23.25 లక్షల మంది సందర్శించారని వారు వివరించారు. -
ఎవరో పురాధీశులు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తికానుంది. ఇప్పటికే క్యాంపులకు వెళ్లిన అభ్యర్థులు నేరుగా మున్సిపాలిటీలకు చేరుకోనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఇక మ్యాజిక్ ఫిగర్ దాటక హంగ్ ఏర్పడిన మొయినాబాద్లో ఇప్పటికీ అదే ఉత్కంఠ కొనసాగుతోంది. స్వతంత్రు ల మద్దతుతో చేజిక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ సంపూర్ణ మెజార్టీతో చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోబోతోంది. ఆమనగల్లులో రాజకీయ సమీకణాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యేందుకు యత్నిస్తున్నాయి. హస్తం గుప్పిట్లో ఆ స్వతంత్రులు మొయినాబాద్ పరిస్థితి రసవత్తరంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు రూ.కోట్లు ఖర్చు చేసినా ఇక్కడి ప్రజలు మాత్రం ఏ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు. 26 వార్డుల్లో 10 అధికార కాంగ్రెస్ గెలుపొందగా, ఏడు బీఆర్ఎస్, నాలుగు బీజేపీ విజయం సాధించాయి. ఐదు స్థానాల్లో స్వతంత్రులు (ముగ్గురు బీజేపీ రెబల్స్, ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్) గెలుపొందారు. ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ అనివార్యమైంది. పాలకమండలి ఏర్పాటులో స్వతంత్రులే కీలకంగా మారారు. 8వ వార్డు కౌన్సిలర్ మంచె శంకరయ్యను అదేరోజు అధికార పార్టీ సభ్యులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ క్యాంపులో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ రెబల్ 22వ వార్డు సభ్యుడు గరుగు రాజు సహా 21 వార్డు సభ్యురాలు అనసూయ, 11వ వార్డు సభ్యుడు మహేశ్ సైతం అధికార పార్టీకి మద్దతిచ్చేందుకు అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు సైతం తిరిగి హస్తం గూటికి చేరుకున్నట్లు సమాచారం. ఎక్స్ అఫీషియో ఓటుతో అవసరం లేకుండానే అధికార పార్టీ ఈ పీఠాన్ని కై వసం చేసుకోబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎక్స్ అఫీషియో ఓటు కలిగిన స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య మొయినాబాద్లో కాకుండా శంకర్పల్లిలో ఓటు హక్కు నమోదు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. తేలనున్న భవితవ్యం అధికార కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులంతా ఆయా స్థానిక ఎమ్మెల్యేల మద్దతుదారులే కావడంతో చైర్మన్ పీఠం ఖరారు అంశం వారికి పెద్ద తలనొప్పిగా మారింది. నాకంటే.. నాకే ఇప్పించాల్సిందిగా వారు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తుండటంతో వారు ఎటూ తేల్చుకోలేక ఆ బాధ్యతను అధిష్టానానికి అప్పగించినట్లు తెలిసింది. ఖరారైన రిజర్వేషన్లకు అనుగుణంగా ఇప్పటికే చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులపై ఓ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. సీల్డ్ కవర్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం సోమవారం మధ్యాహ్నంలోపు తేలిపోనుంది. నేటితో ఉత్కంఠకు తెర సీల్డ్ కవర్లలో చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు మొయినాబాద్లో ‘అధికారా’నికే స్వతంత్రుల మద్దతు కారు ఖాతాలోనే ఇబ్రహీంపట్నం ఆమనగల్లులో మారుతున్న సమీకరణాలు -
బస్సు.. రాదేం బాసూ!
సాక్షి, సిటీబ్యూరో: ఆరాంఘర్ చౌరస్తాలోని బస్టాప్. శనివారం రాత్రి 9 గంటలు దాటింది. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ మీదుగా ఉప్పల్కు రాకపోకలు సాగించే సిటీబస్సు (రూట్ 300) కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. గంట సేపట్నుంచీ పడిగాపులు కాస్తున్నారు. చాలాసార్లు ఆఖరి బస్సు రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణం చేయడం షరామామూలుగా మారింది. ఈ ఒక్క రూట్లోనే కాదు.. నగర శివారు కాలనీలకు, దూర ప్రాంతాలకు సకాలంలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేకించి రాత్రి 9 గంటల తర్వాత, శని, ఆదివారాల్లో, సెలవు రోజుల్లో సిటీ బస్సులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకొనే నెపంతో పలు డిపోల్లో ఆఖరి ట్రిప్పులను నిలిపివేస్తున్నారు. మరోవైపు కొన్ని డిపోలు నైట్ హాల్ట్ సర్వీసులకు సైతం స్వస్తి చెబుతున్నాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ప్రధానంగా మహిళలు, విద్యార్థులు, ఆలస్యంగా విధులు ముగించుకొని ఇళ్లకు చేరుకొనే ప్రయాణికులు అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇదే అదనుగా ఆటోవాలాలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ● ప్రతిరోజూ తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 11 గంటల వరకు, కొన్ని రూట్లలో ప్రయాణికుల డిమాండ్, రద్దీ మేరకు రాత్రి 12 తర్వాతా ఆఖరి ట్రిప్పులు తిరగాలి. కానీ.. కొన్ని రూట్లలో ప్రయాణికులు లేరనే సాకుతో డ్రైవర్లు, కండక్టర్లే ఆఖరి ట్రిప్పులను రద్దు చేస్తున్నారు. మరికొన్ని డిపోల పరిధిలో బస్సుల నిర్వహణ ఖర్చును తగ్గించుకొనే నెపంతో ట్రిప్పుల్లో కోత విధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, బాచుపల్లి, గండిమైసమ్మ, మొయినాబాద్, శామీర్పేట్, తదితర ప్రాంతాల్లో చుట్టుపక్కల కాలనీలు, గ్రామాలకు రాత్రి వేళల్లో ట్రిప్పులను నిలిపివేస్తున్నారు. నైట్హాల్ట్ సర్వీసులను కూడా అధికారులు రద్దు చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నైట్డ్యూటీ సిబ్బందికి అదనపు అలవెన్సులను భారంగా భావించడంతోనే నైట్హాల్ట్ సర్వీసులు నిలిచిపోతున్నాయని డ్రైవర్లు, కండక్టర్లు చెబుతున్నారు. నిత్యం 20 లక్షల మంది ప్రయాణికులు గ్రేటర్ పరిధిలో 25 డిపోల నుంచి నిత్యం సుమారు 2,850 బస్సులకుపైగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఆర్టీసీ అంచనా ప్రకారం 20 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. కానీ మహా నగర విస్తరణకు అనుగుణంగా సిటీబస్ సేవలు విస్తరించకపోవడంతో ప్రజా రవాణా సదుపాయం తగ్గుముఖం పడుతోంది. బస్సు ట్రిప్పుల కొరత మరింత ఆజ్యం పోస్తోంది. ఆర్టీసీ అధికారులూ.. జర ఆలకిస్తారా? సిటీ బస్సులతో ప్రయాణికులు పిటీ రాత్రి తొమ్మిది దాటితే పడిగాపులే నగర శివార్లకు భారీగా ట్రిప్పులు రద్దు ఆలస్యమైతే ఇంటికి చేరడం కష్టమే -
వ్యక్తిగత విమర్శలు తగవు
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణ ప్రజలు కాంగ్రెస్కు అండగా నిలిచారని పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్రెడ్డి అన్నారు. శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఇబ్బందులు లేకుండా జరిగాయన్నారు. విజేతలకు అభినందనలు తెలిపారు. రిజర్వేషన్ అనుకూలించడంతో మా పార్టీ నాయకుల కోరిక మేరకు అనన్య వచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆధారాల్లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. స్పీకర్పై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. వికారాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఇప్పటికే మున్సిపల్లో టీయూడీఎఫ్సీ కింద రూ.60 కోట్లు, ఎస్డీఎఫ్ కింద రూ.18 కోట్లు, హెచ్యండీఏ నుంచి రూ.180 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. సంక్షేమంలో భాగంగా పట్టణంలోని పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరక్టర్ కిషన్నాయక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు చిగుళ్లపల్లి రమేష్కుమార్, సురేష్, కౌన్సిలర్ అనంత్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు షరీఫ్, మాజీ కౌన్సిలర్ మురళి, కిష్టారెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి -
ఓట్లు వేయలేదని.. రోడ్డు బంద్!
● షాద్నగర్ 4వ వార్డులో ఘటన ● పోలీసుల జోక్యంతో సద్దుమనిగిన వివాదం షాద్నగర్: ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని ఓ పార్టీకి చెందిన నాయకుడు రాత్రికి రాత్రే కాలనీకి వెళ్లే రోడ్డును పూర్తిగా బంద్ చేసిన ఘటన షాద్నగర్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ కౌన్సిలర్ రాజేందర్రెడ్డి తల్లి పుష్పమ్మ ఓటమి పాలయ్యారు. అయితే వార్డు పరిధిలోని సబ్బులోల్ల కాలనీకి చెందిన వారు తమ కు ఓటు వేయకపోవడంతోనే ఓటమి చెందామని ఆరోపిస్తూ రాజేందర్రెడ్డి శుక్రవారం రాత్రి తమ కాలనీకి వచ్చి, రోడ్డుకు అడ్డంగా సిమెంట్ పలకలు వేయించి, రహదారిని మూసేశారని కాలనీ వాసు లు తెలిపారు. తమకు ఓట్లు వేయలేదని దౌర్జన్యం చేశారని వాపోయారు. ఈ విషయమై పీఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసుకులు అక్కడికి చేరుకు ని రోడ్డును క్లియర్ చేయించారు. -
స్వతంత్రుల సత్తా
● ప్రధాన పార్టీల అభ్యర్థులకు షాక్ ● భారీగా ఖర్చుపెట్టిన వార్డుల్లో ఇండిపెండెంట్ల గెలుపు మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చుపెట్టిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు సైతం ఓటమి తప్పలేదు. ఐదు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థుల చేతుల్లో ఓటమి చవిచూశారు. సురంగల్ 13వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు భారీగా ఖర్చుపెట్టారు. ఈ వార్డులో వీరు ఖర్చు చేసిన మొత్తం సుమారు రూ.10 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో బీఫాం తీసుకుని పోటీ చేయగా, ముందు నుంచి టికెట్పై ఆశలు పెట్టుకున్న అభ్యర్థి గడ్డం లక్ష్మి వెంకట్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. మున్సిపల్ పరిధిలోనే అత్యధికంగా ఖర్చుపెట్టిన ఈ వార్డులో బీజేపీ అభ్యర్థి గుమ్మళ్ల శ్రావణిపై ఇండిపెండెంట్ గడ్డం లక్ష్మి 81 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి నిర్దుల అనిత మూడో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి యాలాల లావణ్య నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. 21, 22 వార్డుల్లోనూ.. చిలుకూరులోని 22వ వార్డులోనూ స్వతంత్ర అభ్యర్థి గరుగు రాజు విజయం సాధించారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థితోపాటు బీజేపీ అభ్యర్థి గున్నాల గోపాల్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గున్నాల సుధాకర్రెడ్డి భారీగా డబ్బు వెచ్చించారు. అయినా ఓటర్లు స్వతంత్ర అభ్యర్థి వైపే మొగ్గు చూపారు. 21వ వార్డులోనూ ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కన పెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థి గౌర అనసూయను గెలిపించారు. ఈ వార్డులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి సిద్దెంతి స్వప్నపై స్వతంత్ర అభ్యర్థి గౌర అనసూయ 136 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 11వ వార్డులో హోరాహోరీ ఎనికేపల్లిలోని 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అమ్డాపూర్ సునీల్, స్వతంత్ర అభ్యర్థి మద్యపాగు మహేశ్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. బీఆర్ఎస్ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి 22 ఓట్ల తేడాతో గెలుపొందారు. హిమాయత్నగర్లోని 3వ వార్డులో సైతం ఓటర్లు స్వతంత్ర అభ్యర్థికే పట్టం కట్టారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి పైలి రమాదేవిపై స్వతంత్ర అభ్యర్థి బిల్లపాటి కవిత 130 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గడ్డం లక్ష్మి, 13వ వార్డు బిల్లపాటి కవిత, 3వ వార్డు మధ్యపాగ మహేష్, 11వ వార్డు -
ప్రధాన పార్టీకి 12 ఓట్లు!
ఇబ్రహీంపట్నం: పట్టణంలోని 24వ వార్డులో 133 చెల్లని ఓట్లు, నోటాకు 56 ఓట్లు పడ్డాయి. 15వ వార్డులో నోటాకు ఒక్క ఓటు కూడా పడలేదు. 18వ వార్డులో చెల్లని ఓట్లు నమోదుకాలేదు. ఇదిలా ఉండగా, 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కర్నె అరవింద్కు కేవలం 12 ఓట్లు రావడం గమనార్హం. బీజేపీ పట్టణ అధ్యక్షుడి రాజీనామా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నిర్ణయం షాద్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ పటేల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్కు రాజీనామా పత్రం అందజేసినట్లు తెలిపారు. సాధారణ కార్యకర్తగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి పాటుపడుతానని ప్రకటించారు. ఇదిలా ఉండగా షాద్నగర్లోని 10వ వార్డు నుంచి పోటీచేసిన అతని భార్య భాగ్యలక్ష్మి ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ హరిభూషణ్ పటేల్కు సంబంధించిన ఓ వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హ్యాట్రిక్ విజేత ఓటమి తాండూరు: వరుసగా మూడు సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచి, హ్యాట్రిక్ సాధించిన బొబ్బిలి శోభారాణి శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఓటమి పాలయ్యారు. 15వ వార్డు అంబేడ్కర్ నగర్ నుంచి ఏకధాటిగా 15 ఏళ్ల పాటు కౌన్సిలర్గా కొనసాగిన ఆమె కాంగ్రెస్ అభ్యర్థి దివిటి ఎల్లప్ప చేతిలో ఓటమి చవి చూశారు. ఈవార్డు నుంచి శోభారాణితో పాటు మైనార్టీ నాయకుడు బషరత్ బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. బీఫామ్ దక్కకపోవడంతో రెబల్ అభ్యర్థిగా నిలిచారు. కౌంటింగ్లో శోభారాణికి 314 ఓట్లు రాగా, బషరత్కు 559 ఓట్లు వచ్చాయి. వీరిద్దరి పోరుతో కాంగ్రెస్ అభ్యర్థి ఎలప్ప 582 ఓట్లు సాధించి, విజయకేతనం ఎగరేశారు. యువకుడిపై దాడి కుల్కచర్ల: ఇచ్చిన అప్పు చెల్లించాలని కోరిన ఓ యువకుడిని మరో ఇద్దరు యువకులు దాడి చేసి గాయరిచారు. ఈ ఘటన కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండీడు మండలం కొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఘణాపూర్ గేటు వద్ద ఉన్న సమయంలో అంతారం గ్రామానికి చెందిన మనోజ్, విష్ణులు అతడితో గోడవ పడ్డారు. శ్రీకాంత్కు తీవ్రంగా గాయాలైయ్యాయి. ఇచ్చిన అప్పు చెల్లించాలని కోరగా తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. -
చైర్మన్గిరిపై సోషల్ అలజడి!
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ ఫలితాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇబ్రహీంపట్నంలో గెలుపొందిన స్వతంత్ర కౌన్సిలర్తో కలిపి బీఆర్ఎస్కు చెందిన 14 మంది, కాంగ్రెస్కు చెందిన 8 మంది అభ్యర్థులు వేర్వేరు క్యాంపుల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ శిబిరంలో చైర్మన్గిరీపై అలజడి మొదలైందని కాంగ్రెస్ శ్రేణులు, హస్తం శిబిరంలో లుకలుకలు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి శిబిరాలకు సంబంధించిన ఫొటోలను వారు పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు తమతో టచ్లో ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ విజేతలు మావైపు వస్తారని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. అయితే, ఇవన్నీ వదంతులేనని తెలుస్తోంది. -
ఆసక్తిపురం
శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని చేవెళ్ల, శంకర్పల్లి, షాద్నగర్ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ సాధించింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తమ ఖాతాలో వేసుకోగా, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు మున్సిపాలిటీలను ప్రతిపక్ష బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. సంపన్నుల విడిదిగా పేరొందిన మొయినాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇక్కడ హంగ్ అనివార్యమైంది. 26 వార్డుల్లో పది కాంగ్రెస్ గెలుచుకోగా, ఏడు బీఆర్ఎస్ గెలుపొందింది. మరో నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించింది. చైర్మన్ పీఠం అధికార పార్టీకి దక్కాలంటే మరో నాలుగు స్థానాలు తప్పనిసరి. గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్.. ● ఆరు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించగా మొత్తం 437 మంది బరిలో నిలిచారు. అధికార కాంగ్రెస్ పార్టీ 126 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టగా, 54 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ, వాకటి శ్రీహరి, సీతక్క సహా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వయంగా అభ్యర్థుల తరఫున ప్రచారం చేసినా ఆశించిన స్థానాలు గెలుచుకోలేక పోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లకు భారీ మొత్తంలో తాయిలాలు అందజేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. ● ప్రతిపక్ష బీఆర్ఎస్ మొత్తం 122 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. ఏకంగా 47 మందిని గెలిపించుకుంది. మిగిలిన చోట్ల అధికార కాంగ్రెస్కు గట్టిపోటీ ఇచ్చింది. ఇబ్రహీంపట్నంలో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి సైతం చివరికి బీఆర్ఎస్లో చేరడం విశేషం. ● బీజేపీ 109 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, పార్టీ జాతీయ నేతలు అభ్యర్థుల తరఫున ప్రచారం చేసినా ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. కేవలం 16 స్థానాలతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఆమనగల్లు సిట్టింగ్ చైర్మన్ స్థానాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అధికారపార్టీ క్యాంపులో ఇద్దరు స్వతంత్రులు మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 వార్డులు ఉండగా, వీటిలో పది స్థానాలను అధికార కాంగ్రెస్ గెలుచుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏడు స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ నాలు గు స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రు లు ఐదు చోట్ల గెలుపొందారు. చైర్మన్ పీఠం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 13 స్థానాలు దాటాలి. కాగా కాంగ్రెస్కు పది స్థానాలు మాత్రమే దక్కాయి. స్వతంత్రుల్లో కాంగ్రెస్ రెబల్స్ ఇద్దరు, బీజేపీ రెబల్స్ మరో ముగ్గురు ఉన్నారు. ఎలాగైనా చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే గెలుపొందిన అభ్యర్థులను అదే ప్రాంతంలోని మాజీ ఎంపీ ఫాంహౌస్లో ఏర్పాటు చేసిన క్యాంపునకు తరలించింది. ఈ క్యాంపులో ఇద్దరు స్వతంత్రులు సైతం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారి డిమాండ్లకు అధికార పార్టీ తలొంచినట్లు సమాచారం. ఒక స్వతంత్ర అభ్యర్థికి వైస్ చైర్మన్ పదవిని ఆఫర్ చేయగా, మిగిలిన అభ్యర్థులకు భారీ మొత్తంలో నగదు నజరానా ప్రకటించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధాన పార్టీలతో పాటు ఈ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు స్థానాల్లో, బీఎస్పీ మూడు స్థానాల్లో, సీపీఐ రెండు, సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేశాయి. ఎంఐఎం ఒకచోట మాత్రమే పోటీ చేసింది. జనసేన ఏకంగా తొమ్మిది స్థానాల్లో బరిలో నిలిచింది. ఇతర పార్టీల నుంచి మరో నలుగురు, స్వతంత్రులు 57 మంది పోటీలో ఉన్నారు. జనసేన, బీఎస్పీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ సహా ఇతర పార్టీల అడ్రస్ గల్లంతైంది. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్రులుగా బరిలోకి దిగిన వారిలో ఏకంగా తొమ్మిది మంది విజయం సాధించడం గమనార్హం. ఉత్కంఠకు తెరపడింది.. పురపోరులో అభ్యర్థుల భవితవ్యం వెల్లడైంది.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ హోరాహోరిగా తలపడ్డాయి.. ఫలితాలు సైతం నువ్వానేనా అన్నట్టుగా వచ్చాయి.. అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించాయి.. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో మూడు చోట్ల హస్తం పార్టీ పై‘చేయి’ సాధించగా.. రెండు చోట్ల ‘కారు’ హవా కొనసాగింది.. మరోచోట హంగ్ ఏర్పడి స్వతంత్రులు కింగ్మేకర్లుగా మారారు.. ఉత్కంఠ రేపిన ఫలితాలు చేవెళ్ల, షాద్నగర్, శంకర్పల్లి ‘హస్త’గతం ఇబ్రహీంపట్నం, ఆమనగల్లులో కారు జోరు మొయినాబాద్లో హంగ్.. స్వంత్రులే కింగ్ మేకర్లు వికసించని కమలం, జాడలేని వామపక్షాలు మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ స్వతంత్రులు ఆమనగల్లు 15 01 08 06 – ఇబ్రహీంపట్నం 24 08 13 02 01 షాద్నగర్ 28 15 11 01 01 శంకర్పల్లి 15 09 04 – 02 మొయినాబాద్ 26 10 07 04 05 చేవెళ్ల 18 11 04 03 – మొత్తం 126 54 47 16 9 -
షాద్నగర్లో అలా..
షాద్నగర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. గతంలో రెండు కౌన్సిలర్ స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి అత్యధిక స్థానాల్లో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ అందుకుంది. 28 వార్డులకు గాను 15 వార్డుల్లో కాంగ్రెస్, 11 స్థానాల్లో బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 స్వతంత్రులు గెలుపొందారు. కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోనుంది. పట్టణంలోని 8వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో స్వతంత్రంగా బరిలోకి దిగిన సుధీర్ 550 ఓట్లు సాధించి బీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతిపై 86 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 25వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెంటయ్య సమీప బీఆర్ఎస్ పార్టీకి చెందిన నక్కల వెంకటేశ్గౌడ్పై 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పెంటయ్యకు 501 ఓట్లు పోలవగా, వెంకటేశ్కు 493 ఓట్లు వచ్చాయి. 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందె మోహన్ 673 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బచ్చలి నర్సింహపై విజయం సాధించారు. 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కొప్పునూరు ప్రవీణ్ 636 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వర్ రాజుపై గెలుపొందారు. 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నందారం అశోక్ కాంగ్రెస్ అభ్యర్థి రాజుగౌడ్పై 546 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో 17వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి గా గెలుపొందిన సర్వర్పాషా ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తన భార్య నాజియా బేగంను గెలిపించుకున్నారు. గతంలో 21వ వార్డు నుంచి జీటీ శ్రీనివాస్ గెలుపొందగా, ప్రస్తుత ఎన్నికల్లో ఆయన సతీమణి వసంత విజయం సాధించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున బీఎస్ శాంతమ్మ గెలుపొందగా, ఈసారి ఆమె కుమారుడు బీఎస్ సుధీర్ స్వంతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అలాగే 2014 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి భీమమ్మ గెలుపొందగా ఈసారి ఆమె కొడుకు పెంటయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. మున్సిపల్ పరిధిలోని పలువురు నాయకులు రెండోసారి కౌన్సిలర్లుగా విజయం సాధించారు. 11వ వార్డులో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పిల్లి శారద, కాంగ్రెస్ పార్టీ నుంచి 24వ వార్డులో పోటీచేసిన అగ్గునూరు విశాల, 10వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన నడికూడ శ్రావణి రెండోసారి గెలుపొందారు. 2వ వార్డులో విజ యం సాధించిన కాంగ్రెస్పార్టీ అభ్యర్థి బచ్చలి నరేష్ విజయం సాధించ డంతో ఆనందంతో ఆనందభాష్పాలు రాల్చారు. ఆయనకు 924 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి 634 ఓట్లు సాధించారు. షాద్నగర్ -
క్యాంపు రాజకీయాలు షురూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఆయా పార్టీలు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో బిజీగా మారాయి. ఎన్నికై న అభ్యర్థులు చేజారిపోకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని రహస్య ప్రదేశాల్లోని క్యాంపులకు తరలించాయి. కుటుంబ సభ్యులు సహా ఇతర పార్టీలకు టచ్లోకి వెళ్లకుండా వారి వద్ద ఉన్న ఫోన్లు సైతం తీసుకుని స్విచ్ఛాఫ్ చేసినట్లు సమాచారం. కొంత మంది గోవా, బెంగళూరు క్యాంపులకు తరలివెళ్లగా, మరికొంత మంది మొయినాబాద్, మహేశ్వరం సమీపంలోని ఫాం హౌసుల్లోని క్యాంపులకు తరలినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు ఆయా మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. శనివారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ నెల 16న మధ్యాహ్నం 12 గంటలకు ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్లను ఎంపిక చేయనుంది. ఇప్పటికే ఒక్కో మున్సిపాలిటీకి ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించింది. ఆయా పార్టీల నుంచి గెలుపొందిన అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్ అఫీషియో ఓటర్లుగా చైర్మన్ ఎన్నికలో భాగస్వాములు కానున్నారు. అప్రమత్తమైన అన్ని పార్టీలు షాద్నగర్ కాంగ్రెస్ అభ్యర్థులు గట్టుపల్లి సమీపంలోని ఓ రిసార్ట్కు తరలివెళ్లగా.. మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాజీ ఎంపీ రంజిత్రెడ్డి ఫాంహౌస్లోని క్యాంపునకు తరలి వెళ్లారు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థు లను బెంగళూరుకు తరలించినట్లు తెలిసింది. మొయినాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నట్లు సమాచారం. ఇక బీజేపీ అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యే రత్నం ఇంట్లో మకాం వేసి కూర్చొన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం క్యాంపునకు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు బీజేపీ గాలం వేస్తున్నట్లు తెలిసింది. చైర్మన్ పీఠాన్ని అప్పగించేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. అభ్యర్థులు చేజారిపోకుండా ఆయా పార్టీలు జాగ్రత్త వహిస్తున్నాయి. అభ్యర్థుల ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయించాయి. పూర్తిగా వారిని తమ ఆధీనంలోకి తీసుకుని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. స్వతంత్రులకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఎరగా వేస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థులు చేజారకుండా జాగ్రత్తలు ఫాంహౌసుల్లో అధికారపార్టీ అభ్యర్థులు ఇతర రాష్ట్రాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల తరలింపు 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు -
శివాజీ విగ్రహం ఏర్పాటులో ఉద్రిక్తత
మహేశ్వరం: ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు వివాదానికి కారణమైంది. మహేశ్వరం మండల కేంద్రంలో డా.బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్రామ్ చౌరస్తాలో స్థానిక బీజేపీ నాయకులు వీధి లైట్లు, సీసీ కెమెరాలు బంద్ చేసి శివాజీ విగ్రహాన్ని బుధవారం అర్ధరాత్రి ఏర్పాటు చేసేందుకు యత్నించారు. క్రైన్ సహాయంతో విగ్రహాన్ని దించుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని నాయకులకు చెప్పారు. అర్ధరాత్రి లైట్లు, సీసీ కెమెరాలు బంద్ చేసి విగ్రహం పెట్టడం సరికాదన్నారు. అప్పటికే విగ్రహం ఏర్పాటు చేయడంతో గురువారం ఉదయం విషయం తెలుసుకున్న దళిత సంఘాలు నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల పక్కన శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. తాము ఛత్రపతి శివాజీకి వ్యతిరేకం కాదని చెప్పారు. కాకపోతే వేరే అనువైన చోట పెట్టాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బీజేపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహం పక్కన శివాజీ ప్రతిమ ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పెద్దఎత్తున ఇరువర్గాలు నినాదాలు చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని శివాజీ విగ్రహాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం జరుగుతున్న శివగంగ రాజరాజేశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాక గ్రామ పాలకవర్గం ఆమోదంతో శివాజీ విగ్రహానికి అనువైన చోటు నిర్ణయించనున్నారు. ఈలోపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మహేశ్వరం జోన్ అడిషనల్ డీసీసీ సత్యనారాయణ, ఏసీపీలు జానకిరెడ్డి, రాజు, సీఐ వెంకటేశ్వర్లు భారీగా పోలీసులను మోహరించారు. విద్వేషాలు, హింసను ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. -
కదం తొక్కిన ఎర్రదండు
తుర్కయంజాల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల శ్రమ శక్తిని నిలువునా దోపిడీ చేసే సాధనాలుగా మారాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య ధ్వజమెత్తారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం ఆదిబట్ల సర్కిల్ పరిధి తుర్కయంజాల్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దశాబ్దాల పోరాట ఫలితంగా వచ్చిన 8 గంటల పని విధానానికి స్వస్తి పలికి యజమానుల లాభాల కోసం పని భారాన్ని విపరీతంగా పెంచేలా ఈ చట్టాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల కొనుగోలు శక్తిని తగ్గించడం వల్ల దేశాభివృద్ధితో పాటు సామాన్యుల జీవితాలను దుర్భరం చేస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి. కిషన్, నాయకులు శివ ప్రసాద్, మాల్యాద్రి, శంకరయ్య, రోజా, భాస్కర్, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆడారు.. సత్తాచాటారు
స్థానికం● సీఎం కప్లో క్రీడాకారుల ప్రతిభ ● 38 విభాగాల్లో జరిగిన పోటీలు ● రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధమైన విజేతలు హుడాకాంప్లెక్స్: శారీరక ధృడత్వానికే కాదు.. మానసికోల్లాసానికి తోడ్పడే క్రీడా పోటీలకు ప్రస్తుతం ప్రాధాన్యత పెరుగుతోంది. యువత పలు అంశాల్లో తమ ప్రతిభ చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి కప్–2026 పేరుతో పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసింది. ఇందులో భాగంగా జనవరి 17 నుంచి 18 వరకు మండల స్థాయి, ఈనెల 9 నుంచి 12 వరకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించింది. ఈ పోటీలకు సరూర్నగర్ స్టేడియం వేదికై ంది. 8 నియోజకవర్గాలు.. 1,500 మంది క్రీడాకారులు జిల్లాలోని ఆమనగల్లు, షాద్నగర్, చేవెళ్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాలకు చెందిన సుమారు 1,500 మంది యువ క్రీడాకారులు 38 అంశాల్లో పాల్గొని తమ ప్రతిభ చాటుకున్నారు. బాలురు, బాలికల విభాగంలో విజేతలుగా, రన్నర్స్గా నిలిచారు. వీరంతా ఈనెల 20 నుంచి 24 వరకు గచ్చిబౌలి స్టేడియం కేంద్రంగా నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. జిల్లా స్థాయి విజేతలు వీరే.. అభినందనీయం క్రీడాకారుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగ పడతాయి. ప్రభుత్వం సీఎం కప్ పేరుతో మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలు నిర్వహించడం అభినందనీయం. రాష్ట్ర స్థాయిలో రెండుసార్లు పాల్గొని విజయం సాధించాను. ఐదు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆడాలన్నదే తపన. – వేదాన్ష్, చెస్ జాతీయ క్రీడాకారుడు విజయవంతంగా నిర్వహించాం జిల్లా స్థాయి సీఎంకప్ 2026 పోటీలు విజయవంతంగా నిర్వహించాం. విజేతలు ఈనెల 20నుంచి గచ్చిబౌలిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. యువ క్రీడాకారులు ఉత్సహంగా పాల్గొనడం అభినందనీయం. ప్రతి విద్యార్థి నచ్చిన క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలి. అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలి. అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. – వెంకటేశ్వర్ రావు, జిల్లా యువజన క్రీడాధికారి -
ఎవరి పురమో!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉన్న అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలై.. మధ్యాహ్నం రెండు గంటల్లోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్, తర్వాత వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే పోలింగ్ బూతుల వారీగా నమోదైన ఓట్లపై అభ్యర్థులు ఓ అంచనాకు వచ్చారు. గెలిచి తీరుతామనే ధీమాతో ఉన్న వాళ్లు ఫలితం వెలువడిన వెంటనే భారీ విజయోత్సవాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోటాపోటీ ఉన్న వార్డుల్లో మాత్రం అభ్యర్థులు టెన్షన్తో తలపట్టుకుంటున్నారు. ఓటరు మహాశయులు ఎటువైపు మొగ్గు చూపారో తెలియక అయోమయంలో ఉన్నారు. కనిపించిన దేవుడికల్లా ముడుపులు కట్టేసి ఎలాగైనా తమను గెలిపించాలని వేడుకున్నారు. సిబ్బంది నియామకం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉండగా, వీటిలో 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు మొత్తం 437 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,76,023 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,39,044 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 68,725 మంది పురుషులు, 70,318 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. షాద్నగర్లో 14 టేబుళ్లు, మొయినాబాద్లో 14, ఇబ్రహీంపట్నంలో 12, శంకర్పల్లిలో 10, చేవెళ్లలో 9, ఆమనగల్లులో 5 చొప్పున మొత్తం 64 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 265 మందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత అన్ని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలులో ఉంటుందని ఫ్యూచర్సిటీ కమిషనర్ జి.సుధీర్బాబు ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమికూడటం నిషేధమని తెలిపారు. శాంతి భద్రతల కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ కసరత్తు ప్రారంభం కానుంది. ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ఉంటుంది. ఇందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో అధికారిని ఇన్చార్జిగా నియమించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే వీరు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, శంకర్పల్లి, చేవెళ్ల మున్సిపాలిటీలు జనరల్కు రిజర్వు కాగా, షాద్నగర్ బీసీ జనరల్కు, మొయినాబాద్ ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయ్యాయి. జనరల్ స్థానాల్లోనూ మహిళలకు అవకాశం కల్పించాలనే ఆలోచనతో అధికార పార్టీ ఉన్నట్లు తెలిసింది. మొయినాబాద్: కౌంటింగ్ సెంటర్ వద్ద సూచనలు చేస్తున్న అధికారులు నేడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు 64 టేబుళ్లు.. 265 మంది సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుమున్సిపాలిటీల వారీగా నమోదైన పోలింగ్ మున్సిపాలిటీ వార్డులు మొత్తం ఓటర్లు పోలైనవి ఆమనగల్లు 15 16,984 14,403 చేవెళ్ల 18 25,371 20,661 ఇబ్రహీంపట్నం 24 25,993 20,392 మొయినాబాద్ 26 32,871 26,377 శంకర్పల్లి 15 21,401 16,498 షాద్నగర్ 28 53,403 40,713 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇవే.. ఆమనగల్లు బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ చేవెళ్ల ఫర్హా ఇంజనీరింగ్ కాలేజీ ఇబ్రహీంపట్నం శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీ మొయినాబాద్ మ్యాక్ ఫార్మసీ కాలేజీ షాద్నగర్ మినీ స్టేడియం శంకర్పల్లి మున్సిపల్ ఆడిటోరియం బిల్డింగ్ -
చెల్లి పెళ్లికి భూమి అమ్మడం లేదని..
కన్న తండ్రినే కడతేర్చిన తనయుడు షాద్నగర్రూరల్: చెల్లి పెళ్లికి డబ్బుల కోసం భూమి అమ్మడం లేదని కన్న తండ్రిని కొడుకు హతమార్చాడు. మండల పరిధిలో జరిగి ఈ దారుణ ఘటన వివరాలను సీఐ విజయ్కుమార్ వెల్లడించారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని దేవునిబండతండాకు చెందిన పాత్లావత్ బాలు(43) కుమారుడు పాత్లావత్ మోహన్ అలియాస్ గుండు తన చెల్లికి పెళ్లి చేయాలనుకున్నాడు. చెల్లి పెళ్లికి డబ్బుల కోసం తన తండ్రి బాలు పేరుపై ఉన్న 5గుంటల భూమిని అమ్ముదామనగా తండ్రి ఒప్పుకోలేదు. భూమి విషయంలో తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరిగేవి. ఎలాగైనా తండ్రిని చంపి భూమిని అమ్మి సోదరి పెళ్లి చేయాలని అనుకున్నాడు. దీంతో ఈ నెల 8న మద్యం తాగుదామని తండ్రిని కొడుకు తన ఆటోలో ఎక్కించుకొని షాద్నగర్కు వచ్చాడు. మధ్యరాత్రి వరకు మద్యం తాగి అదే ఆటోలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మండల పరిధిలోని నేరెళ్లచెరువు గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రిని చెరువు గుంతలో పడేసి చనిపోయాడని నిర్ధారించుకొని వెళ్లిపోయాడు. బాలు కనిపించడంలేదని అతని సోదరి మెగావత్ సోనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పట్టణంలోని కేశంపేట బైపాస్ సమీపంలో నిందితుడు ఆటోలో పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి ఆటో, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. -
సర్పంచ్ సస్పెన్షన్ అన్యాయం
● కలెక్టర్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి ● గిరిజన సంఘాల నేతల డిమాండ్ పంజగుట్ట: మోకిలతండా సర్పంచ్ శాంతమ్మను సస్పెండ్ చేయడం అన్యాయమని, కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉప సంహరించుకోవాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి గౌరవాధ్యక్షుడు బానోతు మంగీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని స్పష్టంచేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవిచందర్ చౌహాన్, తొలగింపునకు గురైన సర్పంచ్ శాంతాబాయితో కలిసి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 12వేల మంది సర్పంచ్లు ఉండగా ఎలాంటి కారణం లేకుండా ఒక గిరిజన మహిళా సర్పంచ్ను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్ను కేవలం పంచాయతీ పరిధిలో చెట్లను తొలగించారన్న కారణంతో పదవి నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై గిరిజన మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి స్పందించి వెంటనే సస్పెన్షన్ను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శాంతమ్మ మాట్లాడుతూ.. తనపై కక్షగట్టి ఇలా చేశారన్నారు. తాను ఎంతో కష్టపడి ఇండిపెండెంట్గా గెలిచానని, సస్పెన్షన్ను రద్దు చేసి, న్యాయం చేయాలని కోరారు. కలెక్టరేట్ వద్ద నిరసన శంకర్పల్లి: మోకిల తండా సర్పంచ్ వర్త్య శాంతమ్మ విధులు దుర్వినియోగం చేశారని ఇటీవల కలెక్టర్ నారాయణరెడ్డి ఆమెను ఆరునెలల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై భారతీయ గోర్ బంజారా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవిచందర్ చౌహాన్ తీవ్రంగా స్పందించారు. సర్పంచ్గా గెలిచి మూడు నెలలు కాక ముందే గిరిజన మహిళను పదవి నుంచి తొలగించడం బాధాకరమని అన్నారు. సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సరైన విచారణ లేకుండానే కలెక్టర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, దీనిపై త్వరలో రాష్ట్ర, జాతీయ నాయకులను కలవనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు బాబునాయక్, నారియా, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
యూట్యూబ్లో చూసి..చోరీ చేసి..!
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్లో ఉన్న నందగిరిహిల్స్లో నివసించే ప్రముఖ వ్యాపారి రవీంద్రశర్మ ఇంట్లో ఈ నెల 5న భారీ చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆద్యంతం పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన ఈ ముఠా రవీంద్ర ఇంట్లో ఉన్న లాకర్ ఎలా పగులకొట్టాలనే అంశాన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసింది. అందులో పేర్కొన్నట్లే రాడ్లు వినియోగించి పగులకొట్టడంతో పాటు అందులో ఉన్న రూ.1.2 కోట్ల సొత్తు, సొమ్ము ఎత్తుకుపోయింది. ఈ గ్యాంగ్లోని నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. కీలకంగా వ్యవహరించిన భార్యభర్తలు.. నేపాల్కు చెందిన జీవన్ చాంద్, తన భార్య బీమ్లాతో కలిసి కొన్నేళ్లుగా నగరంలో నివసిస్తున్నాడు. గతంలో పని మనిషిగా చేరి ఆ ఇంట్లోనే చోరీలు చేసిన చరిత్ర ఇతడికి ఉంది. నేపాల్కు చెందిన భూపేందర్ సాహి అలియాస్ భువన్ను నగరానికి పిలిపించే జీవన్... కోకాపేటకు చెందిన మదన్ ఖత్రి ద్వారా రవీంద్ర శర్మ ఇంట్లో గత నెల 18న పని మనిషిగా చేరుస్తాడు. నేపాల్ నుంచి వచ్చి నవీ ముంబైలో నివసిస్తున్న లలిత్ బహదూర్ వద్ద ఉంటున్న నేపాలీలు కృష్ణ కాంత్, కమల్ చాంద్లతో భువన్కు పరిచయం ఉంటుంది. జీవన్, బీమ్లా సూచనల మేరకు రవీంద్ర శర్మ ఇంటిని రెక్కీ చేసిన భువన్ చోరీ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని కృష్ణ, కమల్లకు చెప్పి ఇంటితో పాటు పరిసరాలను వీడియో తీసి షేర్ చేస్తాడు. ఈ వీడియోలో వారింట్లో ఉన్న లాకర్ను చిత్రీకరిస్తాడు. లక్డీకపూల్లోని లాడ్జిలో మకాం.. రవీంద్ర శర్మ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్న భువన్ ఈ నెల 3న కృష్ణ, కమల్లను నగరానికి రప్పించాడు. లక్డీకపూల్లోని ఓ లాడ్జిలో బస చేసిన ఈ ద్వయం విషయాన్ని జీవన్కు చెప్పింది. తనపై అనుమానం రాకుండా ఆ వెంటనే అతగాడు నేపాల్ వెళ్లిపోయాడు. అక్కడకు వచ్చాక సొత్తు పంచుకుందామని వీరికి చెప్పాడు. ఈ నెల 5 రాత్రి రవీంద్రశర్మ కుటుంబం ఫంక్షన్కు వెళ్లడంతో అదే రోజు నేరం చేయాలని నిర్ణయించుకుంటారు. భువన్ నుంచి సమాచారం అందుకున్న కృష్ణ, కమల్ వేర్వేరుగా బయలుదేరి నందగిరిహిల్స్కు చేరుకుని భువన్ను కలుస్తారు. రెండు క్యాబ్లు మారి అక్కడకు వస్తారు. మార్గమధ్యంలో రవీంద్ర ఇంట్లో ఉన్న లాకర్ లాంటి వాటిని ఎలా పగులకొట్టాలో యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. చికెన్లో సాధ్యం కాక జ్యూస్లో.. ఆ సమయంలో రవీంద్ర ఇంట్లో ఉన్న వాచ్మెన్తో పాటు అతడి భార్యకు మత్తుమందు ఇవ్వాలని ఈ త్రయం పథకం వేస్తుంది. కొన్ని మత్తు మాత్రలు సంగ్రహించిన వీళ్లు తొలుత చికెన్లో కలిపి ఇవ్వాలని భావిస్తారు. దీనికోసం ఆ సమీపంలోని ఓ దుకాణాకి వెళ్లే ముగ్గురూ చికెన్ కొంటారు. దుకాణదారుడికి చెల్లించడానికి తమ వద్ద సొమ్ము లేకపోవడంతో దుకాణంలో స్కానర్ను ఫొటో తీసే భువన్ దాన్ని లలిత్కు పంపగా అతడు చెల్లిస్తాడు. చివరకు జ్యూస్లో కలిపిన మత్తు మందు ఇస్తారు. నేరం చేసిన తర్వాత భువన్ ఒకవైపు, మిగిలిన ఇద్దరూ మరో వైపు పారిపోయి నవీ ముంబై చేరతారు. దీనిపై సమాచారం అందుకున్న బీమ్లా సైతం నేపాల్ పారిపోతుంది. ఇలా పారిపోయే ప్రయత్నాల్లో నందగిరిహిల్స్లోనే భువన్ ఫోన్ పడిపోయింది. ఇటీవల జూబ్లీహిల్స్లోనేరం చేసిన గ్యాంగ్ స్కానర్ ఇచ్చిన క్లూ ఆధారంగా కేసు కొలిక్కి పోలీసుల దర్యాప్తులోవెలుగులోకి కీలకాంశాలు ఈ ఫోన్ స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు అందులో ఉన్న స్కానర్ ఫొటో ఆధారంగా లలిత్ ఆచూకీ కనిపెడతారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కథ మొత్తం బయటకు వస్తుంది. దీంతో నేపాల్ సరిహద్దుల్లో కాపుకాసిన నగర అధికారులు ఎస్ఎస్బీ సహకారంతో నిందితులను పట్టుకుంటుంది. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న జీవన్, బీమ్లా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వీళ్లు ప్రస్తుతం నేపాల్లో ఉండటంతో ఇక్కడకు రప్పించే మార్గాలను అన్వేషిస్తున్నారు. లలిత్ను పట్టుకోగా గుట్టురట్టు... -
భూసేకరణ.. ఆందోళన!
యాచారం: భూసేకరణ అన్నదాతల్లో కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఫ్యూచర్సిటీ, హైస్పీడ్ రైల్, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణాల పేరుతో ఎప్పుడు.. ఏ గ్రామంలోని భూమిని సేకరిస్తుందోనని ఆందోళనతో కాలం వెల్లదీస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీకి యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో 19,333 ఎకరాల అసైన్డ్, పట్టా భూమి సేకరించడానికి నిర్ణయించి 14,500 ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం ఆ భూముల్లోనే కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్సిటీ నిర్మాణానికి సంకల్పించింది. మరో నాలుగు వేల ఎకరాల భూమి పరిహారం అథారిటీలో జమ చేయడం, కోర్టు కేసులతో వివాదం నెలకొంది. ఏళ్లుగా భూములను నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న రైతులకు భూసేకరణతో ఉపాధి కోల్పోతామనే భయం పట్టుకుంది. అనువైన భూములు ఉన్నందునే.. ఫ్యూచర్సిటీకి యాచారం మండలంలోనే అనువైన భూములున్నట్లు అధికారులు గుర్తించారు. మండలంలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, చింతుల్ల, నందివనపర్తి, మొండిగౌరెల్లి, చింతపట్ల, నల్లవెల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూములు అధికంగా ఉండడం భూ సేకరణకు కలిసొస్తోంది. ఇప్పటికే మొండిగౌరెల్లిలో 822 ఎకరాల అసైన్డ్, పట్టా భూముల సేకరణకు నోటిఫికేషన్లు వేయగా, కొత్తపల్లిలో 2,200 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూమి సేకరణకు సర్వే చేసి, హద్దులు పాతి, గ్రామసభ ఏర్పాటు చేశారు. నందివనపర్తిలోని దేవాలయానికి చెందిన 1,100 ఎకరాల భూమిని సేకరించడానికి నిర్ణయించారు. యాచారం, చింతుల్ల, నల్లవెల్లి, చింతపట్ల తదితర గ్రామాల్లో మరో పది వేల ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూమిని సేకరించడానికి అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూమి ఉందనే భరోసా లేకుండా పోతోంది. ఎప్పుడు దేని కోసం తీసుకుంటారో అంతుపట్టడం లేదు. – జుట్టు శ్రీశైలం, రైతు, చౌదర్పల్లి 822 ఎకరాల అసైన్డ్, పట్టా భూమితో పాటు డీటీసీపీ వెంచర్ చేసిన భూమికి నోటిఫికేషన్ వేశారు. ఇంత వరకు పరిహారం తేల్చ లేదు. –కోలన్ మల్లారెడ్డి, రైతు, మొండిగౌరెల్లి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ముందుకు వెళ్తున్నాం. పరిహారం ఇచ్చే అంశం సర్కార్ పరిధిలో ఉంటుంది. – అయ్యప్ప, తహసీల్దార్, యాచారం అసైన్డ్, పట్టా భూముల సేకరణపై సర్కార్ నజర్ ఫ్యూచర్సిటీ, హైస్పీడ్ రైల్, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం.. కంటికి కునుకు లేకుండా గడుపుతున్న రైతులు -
సమాజంలో బాధ్యతగా మెలగాలి
మణికొండ: సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలిగాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ అన్నారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ ఆ విర్భావ దినోత్సవం సందర్భంగా నార్సింగి సైకిల్ట్రాక్ వద్ద యువతకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించటంతో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసు శాఖ అనేక భద్రతా చర్యలు, సామాజిక బాధ్యతలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా గాయకులు పాడిన పలు పాటలకు యువకులతో పాటు కమీషనర్ సైతం స్టెప్పులేశారు. అనంతరం యువకులతోతో కలిసి సైక్లింగ్ చేశారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, సీఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సాయి మనోహర్, ఏడీసీపీలు, ఏసీపీలు, పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. -
ముగిసిన ఓటింగ్
చేవెళ్ల/మొయినాబాద్:: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని 274 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాతంగా ముగిసాయని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఓటర్లు క్యూలో వేచియుండే పరిస్థితి లేకుండా ఒక్కో బూత్లో 500–600ల మంది ఓటర్లు ఉండేలా కేటాయించామన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను పోలీస్ బందోబస్తు మద్య స్ట్రాంగ్రూమ్లకు తరలిస్తామన్నారు. 13వ తేదీన ఆయా మున్సిపాలిటీలకు కేటాయించిన కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆయన వెంట జెడ్పీ డిప్యూటీ సీఈఓ రంగారావు, చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం, చేవెళ్ల తహసీల్దార్ కృష్ణ, పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాతంగా జరగుతున్నాయని ఫ్యూచర్సిటీ కమిషనర్ సుధీర్బాబు అన్నారు. బుధవారం ఆయన చేవెళ్ల మున్సిపలిటీలోని 16, 17, 18 వార్డుల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్రూమ్లకు తరలిస్తారన్నారు. అక్కడ మూడంచల భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కౌటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలకు అనుమతి ఉండదని చెప్పారు. చేవెళ్ల డివిజన్ డీసీసీ యోగేశ్గౌతమ్ చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సీపీ వెంట చేవెళ్ల ఏసీపీ కిషన్, సీఐ భూపాల్శ్రీధర్, సిబ్బంది, తదితరులు ఉన్నారు. మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ చిలుకూరు, హిమాయత్నగర్, పెద్దమంగళారం, మొయినాబాద్, అజీజ్నగర్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
మున్సిపోల్ 78.99%
● అత్యధికంగా ఆమనగల్లులో 84.08% పోలింగ్ ● షాద్నగర్లో అత్యల్పంగా 76.24 శాతం నమోదు ● ఆరు మున్సిపాలిటీల్లో 36,979 మంది ఓటింగ్కు దూరం ● రేపు తేలనున్న భవితవ్యం ప్రశాంతంగా ముగిసిన రెండో సాధారణ ఎన్నికలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: చెదురు మదురు ఘటనలు మినహా మున్సిపల్ ఎన్నికలు ప్రశాతంగా ముగిసాయి. బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ.. సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చేవెళ్ల, హిమాయత్నగర్ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ నారాయణరెడ్డి సహా ఫ్యూచర్సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సందర్శించగా, జిల్లా ఎన్నికల పరిశీలకుడు మయాంక్ మిట్టల్ శంకర్పల్లి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలించారు. రెండో సాధారణ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 36,979 మంది ఓటింగ్కు దూరం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉండగా, 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,76,023 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,39,044 మంది(78.99 శాతం)తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 68,725 మంది పురుషులు ఉండగా, 70,318 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 36,979 మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. బ్యాలెట్ బాక్సులను పోలింగ్ సిబ్బంది ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసి, పోలీసు భద్రత నడుమ ఎంపిక చేసిన స్ట్రాంగ్రూమ్లకు తరలించారు. పెచ్చులూడిపడి ఓటరుకు గాయాలు ఇదిలా ఉంటే తనకు అనుకూలంగా ప్రచారం చేయలేదనే కోపంతో షాద్నగర్ మున్సిపాలిటీ 27వ వార్డులో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళ ఇంట్లోకి ప్రతిపక్ష పార్టీ నేతలు చొరబడి ఆమెతో ఘర్షణకు దిగారు. అదే విధంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆమనగల్లు మున్సిపాలిటీ ముర్తుజపల్లి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓ మహిళా ఓటరుపై పైకప్పు పెచ్చులూడిపడటంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ఆమె తలకు కట్టుకట్టి ఆస్పత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడ 15వ వార్డుకు చెందిన క్యామ పారిజాత తన ఓటును వేరే వాళ్లు వేశారని ఆరోపించారు. బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి కావడంతో జిల్లా ఎన్నికల అధికారులు కౌటింగ్ కేంద్రాలపై దృష్టి సారించారు. ఆమనగల్లు మున్సిపాలిటీ వార్డుల్లోని బ్యాలెట్ బాక్సులను బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లోని స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. చేవెళ్ల మున్సిపాలిటీలోని బ్యాలెట్ బాక్సులను అదే ప్రాంతంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనంలో భద్రపరిచారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని బ్యాలెట్ బాక్సులను శేరిగూడలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీలో భద్రపరిచారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని బ్యాలెట్ బాక్సులను మ్యాక్ ఫార్మసీ కాలేజీలో, షాద్నగర్ మున్సిపాలిటీ బ్యాలెట్ బాక్సులను మిని స్టేడియంలో, శంకర్పల్లి మున్సిపాలిటీ బ్యాలెట్ బాక్సులను టీఎస్ మోడల్ స్కూల్ భవనంలో భద్రపరిచారు. మొదట్లో మందకొడిగా సాగిన ఓటింగ్.. మధ్యాహ్నం ఒక్కసారిగా ఊపందుకుంది. ఉదయం తొమ్మిది గంటల వరకు 11.75 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. 11 గంటల వరకు 30.11 శాతం మించలేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 52.57 శాతం నమోదైంది. మూడు గంటలకు 68.77 శాతం, సాయంత్రం ఐదు గంటల వరకు 78.52 శాతం నమోదైంది. రాత్రి ఏడు గంటల వరకు 78.99 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో 78.56 శాతం పురుషులు ఉండగా, 79.42 శాతం మహిళలు ఉన్నారు. యువతీ, యువకులు ఉత్సాహంగా ఓటు వేశారు. వృద్ధులు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన బాధితులను వీల్చైర్లలో తీసుకొచ్చి ఓటు వేయించారు. షాద్నగర్: షాద్నగర్ మున్సిపల్ ఎన్నికల ఓటింగ్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ పరిధిలో 28 వార్డుల్లో 53,403 మంది ఓటర్లు ఉండగా 40,713 ఓటింగ్లో పాల్గొన్నారు. వీరిలో 26,679 మంది పురుషులు, 267,23 మంది మహిళలు ఓటేశారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 78.45 శాతం పోలింగ్ నమోదవగా ప్రస్తుత ఎన్నికల్లో 76.24 శాతానికే పరిమితమైంది. తగ్గిన పోలింగ్ శాతంతో ఎవరికి మేలు చేస్తుంది.. ఎవరికి నష్టం చేకూరుతుందో రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఇక 13న అదే కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం 64 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా షాద్నగర్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, అత్యల్పంగా ఆమనగల్లో ఐదు టేబుళ్లను సిద్ధం చేశారు. ఒక్కో టేబుల్కు సగటున నలుగురు చొప్పున మొత్తం 254 మందిని ఓట్ల లెక్కింపునకు నియమించారు. మధ్యాహ్నం రెండు గంటల్లోగా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి, పూర్తి ఫలితాలను వెల్లడించాలనే కృతనిశ్చయంతో జిల్లా ఎన్నికల అధికారులు ఉన్నారు. 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ఉంటుంది. ఇందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో అధికారిని ఇన్చార్జిగా నియమించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే వీరు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మున్సిపాలిటీల వారీగా పోలింగ్ శాతం మున్సిపాలిటీ వార్డులు పోలింగ్ కేంద్రాలు మొత్తం ఓటర్లు ఓటేసిన వారు శాతం ఆమనగల్లు 15 30 16,984 14,403 84.08 చేవెళ్ల 18 37 25,371 20,661 81.44 ఇబ్రహీంపట్నం 24 48 25,993 20,392 78.45 మొయినాబాద్ 26 52 32,871 26,377 80.24 శంకర్పల్లి 15 31 21,401 16,498 77.09 షాద్నగర్ 28 76 53,403 40,713 76.24 -
పురపోరులో ధన ప్రవాహం
● ఓటు వేయడానికి వెళ్లే వరకు నగదు పంపిణీ చేసిన అభ్యర్థులు ● ఒక్కరోజే సుమారు రూ.వంద కోట్లు పంపిణీ! మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికలు ‘మనీ’పోల్స్గా మారాయి. ఎన్నికల్లో చివరి వరకు డబ్బుల వరద పారింది. ఓటు వేయడానికి వెళ్లే చివరిక్షణం వరకు ఓటర్లకు అభ్యర్థులు డబ్బుల పంపిణీ చేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు సుమారు రూ.వంద కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగా డబ్బులు పంచారు. వారం రోజులుగా పంపిణీ చేసిన వస్తువులకు అదనంగా చివరి రోజు డబ్బుల పంపిణీ జరిగింది. అభ్యర్థులు ఒకరికంటే ఒకరు ఎక్కువ డబ్బులు ఇస్తూ కొందరికి రెండు సార్లు సార్లు డబ్బులు ముట్టజెప్పారు. కొందరు అభ్యర్థులు మంగళవారం రాత్రి డబ్బులు పంచి మళ్లీ బుధవారం ఉదయం ఓటు వేయడానికి వెళ్లే ముందు ఇళ్లలోకి వెళ్లి నగదు ఇచ్చారు. ప్రతి ఇంటికి రూ.లక్షల్లో డబ్బు చేరింది. డబ్బులతో తారుమారు మున్సిపల్ ఎన్నికల్లో ధన ప్రభావం అభ్యర్థుల భవితవ్యం తారుమారు చేసే పరిస్థితి నెలకొంది. అభ్యర్థులంతా తగ్గేదేలే అన్నట్లుగా నగదు పంచారు. డబ్బులు తీసుకున్న ఓటర్లు ఎవరికి ఓటు వేశారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎవరి ఓట్లు ఎవరికి మారుతాయో.. ధన ప్రభావం ఎవరికి కలిసొస్తుందోనని అభ్యర్థుల్లోనూ గుబులు పుట్టుకుంది. -
ముగిసిన పుర పోరు
● పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ● షాద్నగర్లో 76.24 శాతం పోలింగ్ షాద్నగర్, షాద్నగర్ రూరల్: చిన్నపాటి సంఘటనలు మినహా షాద్నగర్లో పురపాలిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని 10వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వాదనలకు దిగారు. 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి భర్త సాధిక్ పోలింగ్ కేంద్రంలోకి ఎందుకు వెళ్తున్నాడని బీఆర్ఎస్ అభ్యర్థి మహేశ్వరి భర్త నరేందర్ వాగ్వాదానికి దిగారు. 9వ వార్డులో హాజిపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలతో గొడవకు దిగారు. ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్కుమార్ వెంటనే ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ పూర్తయింది. దొంగ ఓట్లు వేశారని ఆరోపణ పట్టణంలోని 8వ, 9వ వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు వారి తరఫు నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుని వాగ్వాదానికి దిగారు. 9వ వార్డులో బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ తన ఓటు వేరే వాళ్లు వేశారని, చాలెంజ్ ఓటు వేస్తామని చెప్పి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించడంతో కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఇలా.. ఉదయం 7–9 గంటల వరకు 11.84 శాతం పోలింగ్ నమోదవగా 11గంటలకు 32.05, ఒంటిగంట వరకు 52.43శాతం, 3వరకు 65.25, పోలింగ్ పూర్తయ్యే సరికి 76.24 శాతం నమోదైంది. సీపీ పరిశీలన పట్టణంలోని 1వ వార్డులో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఫ్యూచర్సిటీ కమిషనర్ సుధీర్బాబు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యల గురించి డీసీపీ శిరీషను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది తగు సూచనలు చేశారు. -
కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కవిత ● నేటి దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు కడ్తాల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.కవిత డిమాండ్ చేశారు. అందుకు సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈనెల 12 నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి జీపు జాతను బుధవారం మండల కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాల రాసిందన్నారు. వీటి స్థానంలో నాలుగు కోడ్లను తీసుకొచ్చిందన్నారు. అవి పెట్టుబడిదారి వ్యవస్థకు అనుకూలంగా, కార్మికుల హక్కులకు భంగం కలిగించేలా రూపొందించారని ఆరోపించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని రూపు మాపి, 12 గంటలకు పెంచుతున్నారన్నారు. తక్షణమే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాఽధి హామీ స్థానంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ జీరామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని, 2025 విద్యుత్ సవరణ చట్టాన్ని ఉప సంహరించుకోవాలన్నారు. సమ్మెకు కార్మికులందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, శేఖర్, ఆశావర్కర్స్ మండల అధ్యక్షులు జ్యోతి, ప్రధాన కార్యదర్శి లావణ్య, కోశాధికారి సబిత, వివిధ సంఘాల నాయకులు అభి, శేఖర్, బాలు, జంగయ్య, రమేశ్, బుజ్జమ్మ పాల్గొన్నారు. -
‘ముద్ర రుణం’ పేరిట మోసం
సాక్షి, సిటీబ్యూరో: ‘ముద్రా లోన్ సర్వీసెస్’ పేరుతో రుణాలు ఇస్తామంటూ ఎర వేసి మోసాలకు పాల్పడుతూ ఢిల్లీలో స్థిరపడిన ఐదుగురు రాష్ట్ర వాసుల్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీళ్లు లోన్ ఆఫీసర్లుగా నటిస్తూ టోకరా వేశారని డీసీపీ వి.అరవింద్బాబు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఈ స్కామ్కు పాల్పడే సూత్రధారులు తెలుగు వారిని మోసం చేయడానికి వీరిని వినియోగించుకున్నట్లు ఆయన వివరించారు. వరంగల్ జిల్లాకు చెందిన బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్ స్నేహితులు. వీళ్లు తమ చదువును మధ్యలోనే ఆపేసి కూలీ పనులు ప్రారంభించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఫేస్బుక్ ప్రకటనల ద్వారా పరిచయమైన ఢిల్లీ వాసి రాహుల్తో జట్టుకట్టారు. అతడి ద్వారా ఢిల్లీ, కోల్కతాల్లో ఉన్న అక్రమ కాల్ సెంటర్లలో చేరారు. కిట్టు అనే మేనేజర్ వీరికి కొన్నాళ్లు కోల్కతాలో వసతి కల్పించి, మోసం చేసే విధానంపై శిక్షణ ఇచ్చాడు. సూత్రధారులు ముద్రా లోన్లు, ఇతర రుణాల పేరుతో సోషల్మీడియాలో ప్రకటన ఇచ్చేవారు. ఎటువంటి వడ్డీ, ముందస్తు చెల్లింపులు లేకుండానే మంజూరు చేస్తామని నమ్మించారు. ఆసక్తి చూపిన వారి డేటాను సేకరించి, రాష్ట్రాల వారీగా విభజించి, తెలుగు డేటాను ఈ ఐదుగురికీ ఇచ్చేవాడు. వీరిలో ఒక్కోక్కరూ ప్రతిరోజూ 180 నుంచి 200 కాల్స్ చేస్తూ బాధితులను నమ్మించే వారు. ఆపై ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్, ఇన్కమ్ టాక్స్ చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసేవారు. అలా దోచుకున్న మొత్తం నుంచి ఈ నిందితులకు 30 శాతం కమీషన్ లభించేది. నగరానికి చెందిన ఓ మహిళ (36) గత ఏడాది నవంబర్ 6న ఇన్స్ట్రాగామ్లో లోన్ ప్రకటన చూసి ఆసక్త చూపారు. మరుసటి రోజు ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. ‘ముద్రా లోన్ సర్వీసెస్’ అధికారి కిలా పవనర్ కుమార్గా పరిచయం చేసుకున్న మోసగాడు... ఆమె పేరు మీద రూ.3 లక్షల రుణం మంజూరైందని చెప్పాడు. ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదని నమ్మించి, అర్హత కోసం ఆధార్, పాన్కార్డ్ వివరాలు తీసుకున్నాడు. ఆపై ఇన్సూరెన్స్ ఛార్జీల పేరుతో రూ.7,200, టీడీఎస్ పేరుతో రూ.15 వేలు డిమాండ్ చేశాడు. ఇలా రకరకాల పేర్లు చెప్పి రూ.1,08,274 వసూలు చేశాడు. దీంతో బాధితురాలు తనకు లోన్ వద్దని... ఇప్పటికి ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరగా, క్యాన్సిలేషన్ ఫీజు పేరుతో మరింత మొత్తం డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఇన్స్పెక్టర్ పి.శివచంద్ర నేతృత్వంలోని బృందం ఐదుగురినీ అరెస్టు చేసింది. వీరి నుంచి ఎనిమిది ఫోన్లు, పది సిమ్కార్డులు స్వాధీనం చేసుకుంది. సైబర్ సూత్రధారుల పంథా వెలుగులోకి గుట్టురట్టు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు -
పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత
అడిషనల్ డీసీపీ సత్యనారాయణ ఆమనగల్లు: మున్సిపల్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మహేశ్వరం జోన్ అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ బి.వి.సత్యనారాయణ చెప్పారు. ఎన్నికలలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాలులో మంగళవారం మున్సిపల్ ఎన్నికల బందోబస్తు విధుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల బందోబస్తు విధులపై సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. విధుల్లో సిబ్బంది ఎక్కడా అలసత్వానికి తావు ఇవ్వరాదని సూచించారు. సమావేశంలో మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, ఆమనగల్లు సీఐ జానకిరాంరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటు.. చాలా హాటుగురూ!
మొయినాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకం. పాలకులను ఎన్నకోవడంలో ఎంతో విలువైనది. ప్రస్తుతం అది మరింత ‘విలువైనది’గా మన నాయకులు మార్చేశారు. బంగారం రేటు పెరిగినట్లు ఓటు వ్యాల్యూ సైతం అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు ఓట్లకోసం కల్లు, సారా పంచేవారు. కొంత కాలం క్రితం వరకు మద్యం బాటిళ్లు, ఓటుకు రూ.500 ఇచ్చేవారు. గత ఎన్నికల్లో మందు, బిర్యాని, రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వెచ్చించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పంపిణీ మరింత పెరిగింది. ఓటుకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పంపకాలు చేశారు. దీనికి తోడు మద్యం, కూలర్లు, టీవీలు, ఉంగరాలు, ఫ్రిజ్లు, కుక్కర్లు, బియ్యం, నూనె డబ్బాలు పంచిపెట్టారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు విలువ ఏకంగా రూ.లక్ష మార్కుకు చేరుకుంది. కొందరు అభ్యర్థులు అంతపెద్ద మొత్తం పంచడం చర్చనీయాంశంగా మారింది. ఎవరూ తగ్గేదేలే అంటూ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు మద్యం, బిర్యానీ, బియ్యం, సిలిండర్లు, స్టౌలు, కుక్కర్లు, టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మిషన్లు, చీరల వంటి వస్తువులతోపాటు అదనంగా డబ్బులు సైతం పంపిణీ చేశారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి కాదు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఇదే తరహాలో ప్రలోభాలకు పాల్పడ్డారు. ఓటర్లు సైతం ఎవరు ఏమిచ్చినా వద్దనకుండా తీసుకున్నారు. కొందరైతే మాకెందుకు ఇవ్వరంటూ అడిగి మరీ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే అసలు ఓటు విలువ ఎంత.. ప్రజాస్వామ్యం ఎటు పోతోందో అర్థం కాని పరిస్థితి నెలకొందని పలువురు వాఖ్యానించారు. -
పొరపాట్లకు తావీయొద్దు
ఇబ్రహీంపట్నం: పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని.. ఏ ఒక్క పొరపాటుకు అవకాశమివ్వొద్దని కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎన్నికల పరిశీల కుడు మయాంక్ మిట్టల్ సూచించారు. శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు కళాశాలలో ఎన్నికల నిర్వహణ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ నిష్పక్షపాతంగా విధులను నిర్వర్తించాలన్నారు. ఏ చిన్న తప్పిదం జరగకుండా ఆర్వోలు ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించామ న్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయి వెంటనే కట్టుదిట్ట మైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించాలన్నారు. ఏమైనా లోపాలుంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాల న్నారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందో బస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శేరిగూడలోని పోలింగ్ కేంద్రాలను, ఇందు కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, ఏసీపీ కేపీవీ రాజు తదితరులు పాల్గొన్నారు. -
అచ్చం అలాగే..
నగరానికి డిజిటల్ ప్రతిరూపం ● మహా ప్రణాళికలో సరికొత్త సాంకేతికత ● త్వరలో కన్సల్టెన్సీ ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగర సమగ్ర ప్రణాళిక– 2050 రూపకల్పనకు త్రీడీ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని వినియోగించేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో నగరాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆవిష్కరించవచ్చు. నగరాభివృద్ధికనుగుణంగా పట్టణ ప్రణాళికలు, రహదారులు, మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు అవకాశముంటుంది. త్రీడీ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ సాయంతో మహా నగరం మ్యాపింగ్ను రూపొందించేందుకు త్వరలో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ మ్యాప్తో.. డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అనేది నిజమైన నగర ప్రతిరూపాన్ని సృష్టించే ఆధునిక సాంకేతిక విధానం. నగరంలోని రహదారులు, భవనాలు, డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా, విద్యుత్ నెట్వర్క్, ట్రాఫిక్ పరిస్థితులు వంటి అన్ని అంశాలను డిజిటల్ ప్లాట్ఫాంపై త్రీడీ రూపంలో పొందుపరచి, రియల్ టైమ్ సమాచారంతో అనుసంధానం చేస్తారు. డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలు, జీఐఎస్, ఐఓటీ సెన్సర్లు, కృత్రిమ మేధ (ఏఐ) సహకారంతో డిజిటల్ మ్యాప్ను రూపొందిస్తారు. ప్రతి అంగుళాన్నీ వీక్షించే వీలు ● కొత్తగా రూపొందించనున్న మాస్టర్ప్లాన్ –2050కు అనుగుణంగా త్రీడీ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని వినియోగిస్తారు. దీనిద్వారా ప్రతి ప్రాంతం వెడల్పు, పొడవు, ఎత్తు లను పరిగణనలోకి తీసుకొని మూడు డైమెన్షన్లలో మ్యాపింగ్ చేస్తారు. ఇందుకోసం లైడార్ ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఈ టెక్నాలజీతో ఔటర్రింగ్ రోడ్డు వరకు నగరంలోని ప్రతి అంగుళాన్ని రియల్ టైమ్లో ఉన్నది ఉన్నట్లుగా వీక్షింవచ్చు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం, ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక సదుపాయాలు వంటి సేవలను సత్వరమే అందజేసే అవకాశం ఉంటుంది. అక్రమ నిర్మాణాలపై నిఘా డిజిటల్ మ్యాపింగ్ సహాయంతో అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాలను గుర్తించడం సులభమవుతుంది. భవనాల ఎత్తు, విస్తీర్ణం, రోడ్ల ఆక్రమణ వంటి అంశాలు డిజిటల్ డేటాతో సరిపోల్చి తక్షణమే చర్యలు తీసుకునే వీలుంటుంది. చక్కటి ప్రణాళికలతో నగరాన్ని నిర్మించేందుకు, విస్తరించేందుకు ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. -
దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
షాద్నగర్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈనెల 12న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షుడు ఎన్.రాజు కోరారు. పట్టణంలోని దేవీ గ్రాండ్ హోటల్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు దివాళా తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాల్సి ఉందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల పద్ధతులను నిరసిస్తూ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్, నాయకులు ఈశ్వర్, శ్రీకాంత్, శివ, భుజంగరెడ్డి, రాజు నాయక్, మహ్మద్ బాబు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యాప్ ద్వారానే యూరియా పంపిణీ కందుకూరు: ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నే రైతులకు యూరియా పంపిణీ జరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష సూచించారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంతో పాటు ఫర్టిలైజర్ షాపుల్లో యాప్ ద్వారా చేపట్టిన యూరియా పంపిణీ ప్రక్రియను మంగళవారం ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాప్ ద్వారా రైతులు క్యూకట్టే పద్ధతి, పడిగాపులు కాసే పరిస్థితి ఉండదన్నారు. నిర్ధారించిన పంట ఆధారంగా బుక్ చేసుకుంటే ఐడీ వస్తుందని, దాంతోనే బుక్ చేసుకున్న షాపుకు వెళ్లి 48 గంటల్లోపు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. యాప్ ద్వారా బుక్ చేసుకోవడం రాని రైతులు ఏఈ ఓలు లేదా డీలర్ల వద్దకు వెళ్లి అక్కడ ఉండే వలంటీర్ల సాయం తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ లావణ్య, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డిపై ఫిర్యాదు ఇబ్రహీంపట్నం: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభివృద్ధి పనులను పరిశీలించడం నియమావళిని ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఎన్నికల ప్రధాన కమిషనర్, కలెక్టర్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. షర్ఫూద్దీన్ బాబా సేవలో మాజీ మంత్రి సబితా రెడ్డి పహాడీషరీఫ్: పహాడీషరీఫ్లోని బాబా షర్ఫూద్దీన్ దర్గా 760వ ఉర్సులో భాగంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మంగళవారం పూలు, చాదర్ సమర్పించారు. దర్గాకు విచ్చేసిన ఆమె తలపై బుట్టలో పూలు, చాదర్తో వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఆమెకు ఆశీస్సులు అందజేశారు. ఆమె వెంట నాయకులు షేక్ అఫ్జల్, బర్కత్ అలీ, మక్దూం పటేల్, అబ్బాస్, ఇద్రీస్ తదితరులు ఉన్నారు. రాత్రిపూట నీటి సరఫరా నివారణకు ప్రత్యేక ప్రణాళిక సాక్షి, సిటీబ్యూరో: బోరబండ, రహ్మత్నగర్లలో రాత్రిపూట నీటి సరఫరాతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల పరిష్కారానికి రూ.2.5 కోట్లతో ఫీడర్ మెయిన్ పైపులైన్ పనులు చేపట్టినట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఎస్పీఆర్ హిల్స్లో పైపులైన్ నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి ఉగాది నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నగరంలో రాత్రి వేళల్లో నీటి సరఫరా అయ్యే ప్రాంతాలను గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. ఉదయం, సాయంత్రం సర ఫరా చేసేలా చూడాలని చెప్పారు. -
ఒక్కటై కదులుదాం.. బాధ్యతను నిర్వర్తిద్దాం
షాద్నగర్: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. సకల సమస్యలకు పరిష్కారమార్గం.. నవభారత నిర్మాణానికి పునాది లాంటిది అంతటి ప్రాముఖ్యం ఉన్న ఓటును సక్రమంగా వినియోగించుకోవాలి. మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు నిద్రాహారాలు మాని ప్రచారం చేసిన నేతల భవిత వ్యం బ్యాలెట్ పత్రం రూపంలో ఎన్నికల డబ్బాలో పదిలమవుతుంది. ఐదేళ్ల కాలానికి తమను పాలించేదెవరో ఓటరు దేవుడు నిర్ణయించబోతున్నారు. రాజకీయ పక్షాలతో పాటుగా ఈ ఎన్నికలు అధికార యంత్రాంగానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు పావులు కదిపితే.. పోలింగ్ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా అధికారులు సిద్ధమయ్యారు. ఓటు పోటెత్తాలి ఒక్క ఓటుతోనే నాయకుల తలరాతలు మారుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటు విలువకు ఉన్న ప్రాధాన్యత, విలువ చాలా మందికి తెలియడం లేదు. పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గుతుంది. ఫలితంగా నిర్ణయాత్మక శక్తి తగ్గి పోతుంది. పల్లె ఓటర్లు చైతన్యం కనబరుస్తున్నా పట్టణ ప్రజలు పోలింగ్ కేంద్రానికి వెళ్లడానికి బద్దకిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం పెరిగితేనే ఓటు శాతం పెరుగుతుంది. ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలి. ఒకటితో తారుమారు ఐదేళ్లకోసారి తమను పరిపాలించే నాయకులను ఎన్నుకునే అవకాశం ఓటు రూపంలో లభిస్తుంది. ఒక్క ఓటే కదా వేయకపోతే ఏమవుతుందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎన్నికల ఫలితాల్లో ఒకటి, రెండు ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజల బాగోగులు పట్టించుకునే వారికి పదవి కట్టబెట్టి, మాయమాటలు చెప్పే వారికి బుద్ధి చెప్పే విలువైన వజ్రాయుధం ఓటు అని అందరూ గుర్తించాలి. ఓటు హక్కును ఉపయోగించుకొని భావితరాల అభివృద్ధికి బాటలు వేసే గురుతర బాధ్యతను స్వీకరించాలి. గెలుపు నీదే ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం ఓటు హక్కు ద్వారా కల్పించింది. నేతల భవిష్యత్తును ఓటు హక్కు ద్వారా తేల్చవచ్చు. సమర్థుడైన నేతను ఎన్నుకునే మార్గం ప్రజలకు ఓటు రూపంలో ఉంటుంది. మంచి నేత ను ఎన్నుకుంటే ఓటరుదే చివరికి గెలుపు అవుతుంది. అసమర్థుడిని, అవినీతి పరుడికి ఓటు వేస్తే ఓట మి ఓటరుదే అవుతుంది. ఓటర్లు చైతన్య వంతులై నేతలకు ఓటుతో కనువిప్పు కలిగించాలి. ప్రలోభాలను పటాపంచలు చేసి ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ఐదేళ్ల పాలన సక్రమంగా సాగాలంటే మన చేతుల్లోనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం ఎన్నికలు అనే రణ రంగంలో ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిన సమయం ఆసన్నమైంది. పట్టణ ఓటర్లు తిరుగులేని నేతను పుర పాలకుడిగా ఎన్నుకోవాలి. అందరూ ఒక్కటై కదులుదాం.. ఎన్నికల పోరులో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకుందా.. రండి.. కదలిరండి.. ఓటింగ్లో పాల్గొందాం... వందశాతం పోలింగ్ నమోదు చేద్దాం. చైతన్యంతోనే పోలింగ్ శాతం పెరుగుదల పుర ఎన్నికల్లో అంతిమ తీర్పు ఓటరుదే మార్మోగిన సోషల్ మీడియా శంకర్పల్లి: మున్సిపల్ ఎన్నికలకు 48గంటలకు ముందే మైకులు మూగబోయాయి. అయితేనేం సోషల్ మీడియా ఉంది కదా. అభ్యర్థులు చివరి రెండు రోజులు సోషల్ మీడియాని ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నారు. తాము గెలిచేందుకు విరివిగా ఎడిట్ చేసిన ప్రచార వీడియోలు, పాటలు, కరపత్రాలను పెద్ద ఎత్తున వాట్సాప్, ఇన్స్ట్రాగాం, ఎక్స్, ఫేస్బుక్లలో పోస్ట్ చేస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో తేలాల్సి ఉంది. -
ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
హుడాకాంప్లెక్స్: జిల్లా స్థాయి సీఎం కప్–2026 క్రీడా పోటీలు మంగళవారం సరూర్నగర్ స్టేడియంలో ఉత్సాహంగా కొనసాగాయి. వాలీబాట్, బాక్సింగ్ పోటీల్లో సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వాలీబాల్ బాలుర విభాగంలో కల్వకుర్తి టీం విజేతగా, షాద్నగర్ టీం రన్నర్గా నిలిచింది. బాలికల విభాగంలో కల్వకుర్తి టీం విజేతగా, ఇబ్రహీంపట్నం రన్నర్గా నిలిచాయి. విజేతలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎస్టేట్ ఆఫీసర్ పద్మావతి, జిల్లా క్రీడలశాఖ అధికారి వెంకటేశ్వర్రావు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిచిన క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నారు. -
బెదిరింపుతోనే అభ్యర్థి ఆత్మహత్య!
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ రెడ్డి తాండూరు టౌన్: కాంగ్రెస్ నాయకుల బెదిరింపులతోనే మక్తల్ మున్సిపల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన తాండూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో హత్యా రాజకీయాలతో పాటు.. అభ్యర్థులను బెదిరించడం, దూషించడం, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం లాంటివి ఉండేవన్నారు. కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయని, మళ్లీ కాంగ్రెస్తో పునరావృతమయ్యే ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పట్టు కోల్పోతున్నామని వచ్చిన ఇంటలిజెన్స్ రిపోర్టుతో అధికార పార్టీ నాయకులు ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో పోలీసులు కల్పించుకొని, బీజేపీ అభ్యర్థులకు రక్షణ కల్పించి, ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్, మున్సిపల్ ఎన్నికల సహ ఇన్చార్జి వడ్ల శ్రీధర్, తాండూరు కన్వీనర్ మనోహర్ రావు, సహ కన్వీనర్ పటేల్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉరుకులు.. పరుగులు
● గాజులరామారంలో 3 సెకన్లు కంపించిన భూమి ● ఎలాంటి ప్రకంపనలు నమోదు కాలేదు: ఇన్కాయిస్ అధికారులు సుభాష్నగర్: గాజులరామారంలోని మెట్కానిగూడ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. మంగళవారం ఉదయం 10. 20 గంటల సమయంలో మెట్కానిగూడ, హెచ్ఏఎల్, ఓక్షిత్ ఎన్క్లేవ్, ఆదర్శనగర్ కాలనీల్లో ఒక్కసారిగా భారీ శబ్దంతో భూమి కంపించడంతో అపార్ట్మెంట్లు, ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. గేటెడ్ అపార్ట్ మెంట్ వాసులు, స్థానికులు రోడ్డుపైకి వచ్చి గుంపులుగా చేరారు. భూమి కంపించడంతో స్థానిక పాఠ శాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. కొద్దిసేపటి దాకా ఇళ్లలోకి పోయేందుకు స్థానికులు భయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న సూరారం పోలీసులు భూకంపమా..? లేక ఇతర పేలుడు పదార్థాల కారణంగా వచ్చిన శబ్దమా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. చివరికి ఏ విష యమూ అంతు చిక్కలేదని సూరారం సీఐ సుధీర్ కృష్ణ తెలిపారు. ప్రగతి నగర్లోని ఇన్కాయిస్ అధికారులకు సంప్రదించగా.. ఎలాంటి భూ ప్రకంపనలు నమోదు కాలేదని పేర్కొన్నారు. -
న్యాయం చేయాలని నిరసన
చేవెళ్ల: అడ్వకేట్ స్వప్న హత్యపై తక్షణం న్యాయం చేయాలని చేవెళ్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. మంగళవారం చేవెళ్ల బార్ అసోసియేషన్, సంగారెడ్డి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డిల పిలుపు మేరకు హైకోర్టు వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేసి హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమాకంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి పోలీస్ భద్రత కల్పించకపోవటం, వివాదాస్పద భూములను నిషేధిత జాబితాలో చేర్చడం లాంటి నిర్లక్ష్యానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో చేవెళ్ల న్యాయవాదులతోపాటు తెలంగాణ న్యాయవాదుల ఫెడరేషన్ సభ్యులు, బార్ కౌన్సిల్ మెంటర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. -
చేతిలోని ఫోన్ను కొట్టేసిన దొంగలు
మీర్పేట: ఇంటి ముందు నిలబడ్డ వ్యక్తి వద్ద నుంచి సెల్ఫోన్ను లాక్కెళ్లిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వినాయకహిల్స్ కాలనీకి చెందిన జంపాలా రమేశ్ సెలూన్ షాపు నిర్వహిస్తున్నారు. సోమవారం ఆయన పని నిమిత్తం అంబర్పేటకు వెళ్లి అర్ధరాత్రి 1.40 గంటలకు తిరిగి వచ్చి ఇంటి ముందు ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇందులోనే ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి చేతిలో ఉన్న సెల్ఫోన్ను లాక్కుని పారిపోయారు. అనంతరం తేరుకున్న ఆయన వెంబడించినప్పటికీ వారు దొరకలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గృహిణి అదృశ్యం పహాడీషరీఫ్: కుటుంబ కలహాల కారణంగా గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కడారి నరేష్, శరణ్య(33) దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. దంపతుల నడుమ చిన్న చిన్న గొడవలున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీన సాయంత్రం వేళ బయటికి వెళ్లొస్తానని పిల్లలకు చెప్పి వెళ్లిన శరణ్య తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో, నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మట్టి టిప్పర్ల పట్టివేత కేశంపేట: టిప్పర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా పోలీసులు అడ్డుకొని సీజ్ చేసిన సంఘటన మండల పరిధిలోని బైర్కాన్పల్లి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం కల్వకోలు గ్రామానికి చెందిన లక్ష్మణ్ బైర్కాన్పల్లి గ్రామ శివారులోని తట్టెకుంటతండా సమీపంలో మట్టిని తోడి అదే గ్రామంలో మరోచోటుకు తరలిస్తున్నారు. ఈ మేరకు పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను తనిఖీ చేయగా.. ఎలాంటి అనుమతులు లేవని తేలింది. దీంతో వాహనాలను స్వాధీనం చేసుకొని ఠాణాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరహరి తెలిపారు. -
నేడే మున్సిపల్స్
ఓటింగ్కు సర్వం సిద్ధం సాక్షి, రంగారెడ్డిజిల్లా: పుర పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై.. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, 437 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 126 మంది, బీఆర్ఎస్ నుంచి 122, బీజేపీ నుంచి 109 మందితో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మరో 57 మంది ఉన్నారు. మొత్తం 1,76,023 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటింగ్ కోసం 274 పోలింగ్ కేంద్రాలను సిద్దం చేశారు. 2.10 లక్షల బ్యాలెట్ పేపర్లను ముద్రించి, ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ విధుల్లో 1,800 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మంగళవారం సాయంత్రానికే వీరంతా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రూ.కోట్ల కుమ్మరింత ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన రహదారులపై వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిఘా వర్గాల కళ్లుగప్పి ఎన్నికల ముందు రోజైన మంగళవారం రాత్రి అభ్యర్థులు మద్యం,నగదును భారీగా పంపిణీ చేశారు. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, శంకర్పల్లిలోని కొన్ని వార్డుల్లో ‘భారీగా’ పంపిణీ చేసినట్టు సమాచారం. ఓటరు స్లిప్పులతో పాటు మద్యం బాటిళ్లు, రూ.కోట్ల నగదు కుమ్మరించారు. పోలింగ్ జరిగే మున్సిపాలిటీలు : 6 మొత్తం వార్డులు : 126 పోలింగ్ కేంద్రాలు : 274 బరిలో ఉన్న అభ్యర్థులు : 437 మొత్తం ఓటర్లు : 1,76,023 విధుల్లో ఉన్న సిబ్బంది : 1,800 పోలింగ్ సమయం : ఉదయం 7 నుంచి సాయంత్రం 5 -
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
● 14 నుంచి మైసిగండి కాశీవిశ్వనాథస్వామి ఉత్సవాలు ● వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం చేసిన అధికారులు కడ్తాల్: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మైసిగండి పరిధిలో కొలువైన శివాలయంలో ఈనెల 14 నుంచి నిర్వహించనున్న కాశీ విశ్వనాథస్వామి బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ కాశీవిశ్వనాథస్వామి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇవి శనివారం ప్రారంభమై సోమవారం వరకు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు జిల్లాతో పాటు సమీప జిల్లాల నుంచి భక్తులు తరలిరానుండటంతో శివాలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరిస్తున్నారు. అందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మైసిగండిలో ప్రస్తుత శివాలయ, రామాలయ క్షేత్రాలు రుగ్వేద కాలంలో గంగా గుళ్లుగా పిలువబడేదని ఆలయ చరిత్ర తెలుపుతోంది. ఆలయాల్లో గోల్కొండ నవాబుల కాలంలో అక్కన, మాదన్నల మహామంతుల్రుగా ఉన్న సమయం నుంచి పూజలు జరిగేవి. తర్వాతి కాలంలో ఆలయాన్ని వైభవంగా పునర్నిర్మించారు. కార్యక్రమాల వివరాలు ఉత్సవాల్లో మొదటిరోజు శనివారం విఘ్నేశ్వరపూజ, ధ్వజారోహణం, మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం, 15వ మహాశివరాత్రిని పురస్కరించుకొని శివపార్వతుల కల్యాణ మహోత్సవం, రాత్రికి ప్రత్యేక అభిషేకం, అనంతరం రథోత్సవం, 16న స్వామివారికి ఏకాదశ కలశాభిషేకం, వసంతోత్సవం, పూర్ణహూతి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో స్నేహలత, ఆలయ ట్రస్టీ శిరోలీ పేర్కొన్నారు.ఇబ్బంది కలగనీయం మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మైసిగండి శివాలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు తాగునీటి వసతి, సౌకర్యాలను కల్పిస్తున్నాం. మూడు రోజుల పాటు నవగ్రహ, గణపతి హోమం నిర్వహిస్తారు. – స్నేహలత, ఈఓ, మైసిగండి -
మదర్ డెయిరీ జీఎంపై సస్పెన్షన్ వేటు
హయత్నగర్: నల్లగొండ– రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (నార్ముల్ మదర్ డెయిరీ)లో చోటుచేసుకున్న పరిణామాలు ఇక్కడ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన జనరల్ మేనేజర్ కృష్ణ సస్పెన్షన్కు దారి తీశాయి. కృష్ణ అవకతవకలకు పాల్పడ్డారని, చైర్మన్కు చెప్పకుండా ఫైల్స్ టాంపరింగ్ (దిద్దడం) చేశారన్న ఆరోపణలపై ఇన్చార్జి ఎండీ లింగారెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డెయిరీ పరిధిలోని పాల శీతలీకరణ కేంద్రాలను పర్యవేక్షించకపోవడం, పాల విక్రేతలకు ట్రాన్స్పోర్ట్ కమీషన్ చార్జీలను ఏకపక్షంగా పెంచడం వంటి చర్యలతో డెయిరీకి తీవ్ర నష్టాలు వచ్చాయని సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి ఎండీ స్పష్టం చేశారు. బోర్డు నిర్ణయాలనే అమలు చేశాం.. మదర్ డెయిరీలో ఏ నిర్ణయమైనా పాలక మండలి ద్వారానే జరిగింది. వాటినే నేను అమలు చేశా అని జీఎం కృష్ణ తెలిపారు. సేల్స్ను పెంచేందుకు నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారని, కమిటీ ప్రతిపాదించిన ధరలనే బోర్డు నిర్ణయించిందని, కమీషన్ పెంచడంతో సేల్స్ బాగా పెరిగిందన్నారు. ప్రస్తుత చైర్మన్ తమను చిల్లింగ్ సెంటర్ల తనిఖీకి వెళ్లనిచ్చే వారు కాదని స్పష్టంచేశారు. డెయిరీలో జరుగుతున్న కుర్చీల ఆటలో తనను బలిపశువును చేశారని, ఎలాంటి వివరణ తీసుకోకుండా, తనను సస్పెండ్ చేయడాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. -
వీ–హబ్తో కేఎల్హెచ్ ఒప్పందం
మొయినాబాద్: విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా అవకాశాలు కల్పించేందుకు కేఎల్హెచ్ యూనివర్సిటీ వీ–హబ్తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ఎంఓయూపై ప్రిన్సిపల్ రామకృష్ణ, వీ–హబ్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సీత పల్లచొళ్ల అధికారికంగా సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రతిభకు అవకాశాలు కల్పించే వాతావరణాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తోందని యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్ అభిప్రాయపడ్డారు. ఫాంపాండ్ల నిర్మాణంతో నీటి వృథాకు చెక్ కడ్తాల్: ఫాంపాండ్ల నిర్మాణంతో నీటి వృథాను అరికట్టవచ్చని సర్పంచ్ సేవ్యానాయక్ అన్నారు. సోమవారం ఆయన గానుగుమార్లతండా పంచాయతీ పరిధిలోని కానుగుబావితండాలలో బీక్యానాయక్ పొలంలో రూ.3 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న ఫాంపాండ్ నిర్మాణ పనులను ఉప సర్పంచ్ లక్పతినాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈజీఎస్ పనులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రఘుగౌడ్, మాజీ ఉప సర్పంచ్ పాండునాయక్, వార్డు సభ్యులు, నాయకులు శ్రీను, రాజు, శక్రు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీను తదితరులు ఉన్నారు. జయంతి వేడుకలను జయప్రదం చేయండి సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్పతినాయక్ కడ్తాల్: గిరిజనుల ఆరాధ్యదైవం, బంజారాల ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జర్పుల లక్పతినాయక్, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు నరేశ్నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం వారు మండల కేంద్రంలోని గిరిజన భవన్లో సేవాలాల్ జయంతి వేడుకల నిర్వాహణపై గిరిజన నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 15న జయంతి వేడుకలను విజయవంతం కోరారు. శంకర్నాయక్, హరిచంద్నాయక్, దేవుజానాయక్, పాండునాయక్, జైపాల్నాయక్, శ్రీనునాయక్, గణేశ్, నాగార్జున, శ్రీధర్, గోపాల్, కోట్యా, టిక్లాల్, స్వామి శివనాయక్, తేజు పాల్గొన్నారు. -
ఉత్తమ పరిశోధన అవార్డు
అబ్దుల్లాపూర్మెట్ : కవాడిపల్లి శివారులోని దేశ్ ముఖిలో గల సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో హెచ్ఓడీగా విధులు నిర్వర్తిస్తున్న నామ హరికుమార్కు భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను ఉత్తమ పరిశోధనా అవార్డు –2025 అందజేశారు. ఈ మేరకు సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ ఎస్వీఎస్ నాగేశ్వర్ రావు, ఓయూ భౌతికశాస్త్రం అధిపతి ఎం.ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ మేరకు సెయింట్ మేరీస్ కళాశాల చైర్మన్, సెక్రటరీ, డైరెక్టర్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు హరికుమార్కు అభినందనలు తెలిపారు. పరీక్షలంటే భయం వీడాలి కడ్తాల్: త్వరలో జరుగనున్న పదో తరగతి పరీక్షల్లో వసతిగృహ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఎస్ఐ వర ప్రసాద్ విద్యార్థులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమశాఖ బాలుర వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలని, క్రమశిక్షణతో చదవాలని, టైంటేబుల్ పాటించాలని, మానసిక ధైర్యంతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రశేఖర్, వసతిగృహ సంక్షేమాధికారి రాములు, సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు. విద్యార్థిని అదృశ్యం పహాడీషరీఫ్: పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పీ ఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన సంజయ్ కుమార్తె సీమల్ (16) పద్మశాలిపు రం జెడ్పీపీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతోంది. ఈ నెల 8న ట్యూషన్ వెళ్లేందుకు కాలనీలోని ఓవెన్ బేకరీ వద్ద ఆమె సోదరుడు సోహమ్ బైక్పై దించాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ట్యూషన్ వద్ద వాకబు చేయగా అక్కడికి రాలేదని తెలిసింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేక పోయింది. ఆమె తల్లి సునీత కుకూడ్కర్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచూకీ తెలిసి న వారు ఠాణా లో గానీ, 87126 62367 నంబర్లోగానీ సమాచారం ఇవ్వాలన్నారు. -
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా సహాయ ఎన్నికల అధికారి శంకర్ ఆమనగల్లు: మున్సిపాలిటీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సహాయ ఎన్నికల అధికారి, ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్ శంకర్నాయక్ అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల కోసం 150 మంది సిబ్బంది, ఏడుగురు చొప్పున ఆర్ఓలు, ఏఆర్ఓలను నియమించి రెండు దఫాల శిక్షణ ఇచ్చామన్నారు. బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఓటర్లు ఇబ్బందులు పడ కుండా పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. దివ్యాంగులు, వృద్ధులకు వీల్చైర్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు. మహిళలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని చెప్పారు. ప్రతీ ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పొలం పనులు చేస్తూ కూలీ మృతి కేశంపేట: వ్యవసాయ పనులు చేసేందుకు కూలి పనులకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం... కేశంపేట గ్రామంలో మఠం శేఖర్ వ్యవసాయ పొలంలో కూలి పనులకు ఆదివారం అదే గ్రామానికి చెందిన ఢిల్లీ శేఖర్ (45) వెళ్లాడు. మొక్కజొన్న పంటకు నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. మృతుడి అన్న సత్యనారాయణ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. -
ఆలోచించి హస్తం గుర్తుకు ఓటేయండి
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఓటర్లను కోరారు. పదేళ్ల దోపిడి పాలనకా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో చేస్తున్న నిర్లక్ష్యానికా.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. సోమవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి, ఆమనగల్లు పట్టణంలోని వివిధ వార్డుల్లో టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్, కార్పొరేటర్ విజయారెడ్డిలతో కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం చేపట్టారు. గాంధీచౌక్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి అంటే ఎంటో ఆమనగల్లు మున్సిపాలిటీలో చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు నర్సింహ, కేశవులు, జగన్, ప్రభాకర్రెడ్డి, బిచ్చానాయక్, మండ్లి రాములు, విజయ్, అనంతరెడ్డి, నారాయణ, కాంగ్రెస్ అభ్యర్థులు విజయ, రాజేశ్వరి, కృష్ణయాదవ్, ఒగ్గు మహేశ్, కృష్ణనాయక్, మానయ్య, అనిత, అంజలి, శారద, మల్లయ్య, రేవతి తదితరులు పాల్గొన్నారు. -
ఓట్ల బేరం!
● జోరందుకున్న ప్రలోభాల పర్వం ● పది రోజులుగా యథేచ్ఛగా మద్యం సరఫరా శంకర్పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అభ్యర్థులు సైతం తమను గెలిపిస్తే చేసే పనులు, హామీలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్నారు. బంగారం.. నగదు.. ఆర్థికసాయం అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి నిత్యం మద్యం, రెండు, మూడు రోజులుగా డబ్బుల పంపిణీ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు మాట్లాడుతున్నారని మున్సిపల్ వాసులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అమలయ్యేనా! ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తమ అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే పలు వార్డుల్లో అభ్యర్థులు తమ మెనిఫెస్టోలను విడుదల చేసి, వార్డులో పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, మరొకరు రూ.లక్ష నగదు ఇస్తామని, ఇంకొకరు పూర్తి ఖర్చు భరిస్తాం అని, సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు, యువజన సంఘాల భవనాలు, తాగునీరు, అంత్యక్రియలకు ఆర్థిక సాయం అంటూ విచ్చలవిడిగా హామీలు ఇస్తున్నారు. వీళ్లు ఇచ్చే హామీలు అసలు అమలవుతాయా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. మొదటి దఫా పూర్తి రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థుల సీట్ల కేటాయింపు నుంచే ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు తమ వార్డుల్లో ఇప్పటికే రూ.5వేలు, రూ.10వేలు, కొన్ని చోట్ల వెండి నాణేలు, చీరలు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. మలి దఫాలో మరింత డబ్బును వెదజల్లే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మూడు, నాలుగు రోజుల నుంచి నడుస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నిత్యం ఓటర్ల ఇంటికి మద్యం సరఫరా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నా పోలీసులు కంటితుడుపు చర్యగా కొన్ని బాటిళ్లను పట్టుకుని మిగిలినవి వదిలేస్తున్నారనే అపవాదు ఉంది. సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా? పలువురు అభ్యర్థులు తమ వార్డుల్లోని ఓటర్లకు ముందే భారీ మొత్తంలో డబ్బులను ముట్టజెప్పారు. ఆ సమయంలో వారి మత గ్రంథాలపై ప్రమాణం చేపించుకుని తమకే ఓటు వేయాలని మాట్లాడించుకున్నట్లు సమాచారం. మరికొన్ని వార్డుల్లోని నాయకులు తమ చతురతతో కంట నీరు పెడుతూ, ఓటర్లకు సెంటిమెంట్ డైలాగులతో, కాళ్ల మీద పడి ఈ ఒక్కసారి గెలిపించండి అంటూ వేడుకుంటున్నారు. -
హోరాహోరీ పోరు.. ఎవరిదో జోరు
● ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ● ఆమనగల్లులో త్రిముఖ పోరు ● వలస ఓటర్లపై గురి ఆమనగల్లు: మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. మున్సిపాలిటీలో ప్రస్తుతం త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడున్న 15 వార్డుల్లోనూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తలపడుతున్నాయి. మెజార్టీ కౌన్సిలర్లను గెలిపించుకుని చైర్మన్ కుర్చీ దక్కించుకుని తమ ఆదిపత్యం చాటుకోవాలని మూడు పార్టీలు పట్టుతో ఉన్నాయి. ఆమనగల్లు మున్సిపాలిటీని దక్కించుకునేందుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పట్టుదలగా ఉన్నారు. సిట్టింగ్ మున్సిపల్ పదవిని కాపాడుకునేందుకు కాషాయదళం ప్రయత్నిస్తోంది. ఈ దఫా మున్సిపల్ పీఠం తమదేనని బీఆర్ఎస్ చెబుతోంది. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియగా ఆయా పార్టీలు ప్రలభోలా పర్వానికి తెరలేపాయి. ఈ హోరాహోరీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. అభివృద్ధి మంత్రం ఆమనగల్లు మున్సిపాలిటీ అబివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో పోరాడుతుంది. గత బీజేపీ పాలకవర్గం ఆమనగల్లు అభివృద్ధిని పట్టించుకోలేదని కేవలం కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ నేతలు ప్రచారం సాగించారు. అధికార కాంగ్రెస్ను గెలిపిస్తే ఆమనగల్లు అభివృద్దికి నోచుకుంటుందని ఓటర్లకు వివరించారు. తమను గెలిపిస్తే ఆమనగల్లులో అన్ని డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు అవుతాయని చెబుతున్నారు. దీనికితోడు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధికి ఎన్ని నిదులైన తీసుకువస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మరోసారి పీఠం మాదే ఆమనగల్లు మున్సిపాలిటీ ఏర్పాటు అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకుని చైర్మన్ పదవిని దక్కించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో బీజేపీ తమకు మరో అవకాశం ఇవ్వాలంటూ ప్రచారం చేపట్టింది. బీజేపీతోనే ఆమనగల్లు అభివృద్ధి జరుగుతుందని ఆ నేతలు వివరించారు. బీజేపీ జాతీయ నేత ఆచారి అన్ని తానై మున్సిపల్ పీఠం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి మున్సిపాలిటీని దక్కించుకుంటామని ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్లో జోష్ ఆమనగల్లు మున్సిపాలిటీని దక్కించుకోవడానికి బీఆర్ఎస్ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసింది. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాపిశెట్టి రాము బీఆర్ఎస్లో చేరి కౌన్సిలర్గా పోటీ చేయడంతో బీఆర్ఎస్లో నయా జోష్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ప్రచారాన్ని హోరెత్తించింది. -
స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడి మృతి
మొయినాబాద్: స్విమ్మింగ్ పూల్లో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మృగవని రిసార్ట్స్లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నగరంలోని బాగ్లింగంపల్లికి చెందిన ప్రకాశ్సింగ్ సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి రిసార్ట్లో ఏర్పాటు చేసిన బంధువుల సంగీత్ వేడుకకు వచ్చారు. ప్రకాశ్సింగ్ కుమారుడు సూర్యప్రకాశ్(10) ఆడుకుంటూ రిసార్ట్లోని స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్లి అందులో పడి నీటమునిగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీసి స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా, రిసార్ట్స్, ఫాంహౌస్లలోని స్విమ్మింగ్ పూల్లలో ఎలాంటి రక్షణ చర్యలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొయినాబాద్ ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు -
మాటల్లేవ్..!
ముగిసిన పుర ప్రచారంరాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ ప్రచార కార్యక్రమాలపై నిషేధం విధించి నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్లో ఎవరూ బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదని ఆదేశించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలు, పోలీసు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం సాయంత్రం 5 నుంచి బుధవారం ఎన్నికలు ముగిసే వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈనెల 10 నుంచి సెలవు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు రోజు 13న ఉదయం 6 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు మద్యం షాపులు మూసి వేయబడతాయని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు ప్రకటించారు. -
ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
హుడాకాంప్లెక్స్: జిల్లా స్థాయి సీఎం కప్–2025–26 క్రీడా పోటీలు సోమవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. అథ్లెటిక్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఖోఖో విభాగాల్లో పోటీలు జరిగాయి. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖో–ఖో బాలుర విభాగంలో ఎల్బీ నగర్ జట్టు విజేతగా, ఇబ్రహీంపట్నం జట్టు రన్నర్గా నిలిచింది. బాలికల విభాగంలో ఇబ్రహీంపట్నం జట్టు విజేతగా, ఎల్బీనగర్ జట్టు రన్నర్గా నిలిచింది. బాస్కెట్ బాల్ పోటీల్లో ఎల్బీనగర్ జట్టు విజేతగా నిలిచింది. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు, జట్లు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. విజేతలకు జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా క్రీడల విభాగం అధికారి వెంకటేశ్వర్రావు, అసోసియేషన్ కార్యదర్శులు రవికుమార్, రాఘవరెడ్డి, రామచంద్రుడు, షబ్సీర్ సహా పలువురు కోచ్లు, ఫిజికల్ డైరెక్టర్లు పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. -
ప్రజల చూపు బీఆర్ఎస్ వైపు
చేవెళ్ల: రాష్ట్రంలో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారని, తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి జోస్యం చెప్పారు. మున్సిపల్ పరిధిలో 3, 5, 6, 7 వార్డుల్లో సోమవారం కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిందని, ఇచ్చిన హమీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాగా మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పి.కార్తీక్రెడ్డి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు. -
పక్కాగా మున్సిపల్ ఎన్నికలు
చేవెళ్ల: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకుఅన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. చేవెళ్లలోని ఫరా కళాశాలలో సోమవారం పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్రూమ్, కౌంటింగ్ కేంద్రాలను డిప్యూటీ సీఈఓ రంగారావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతో కలిసి పరిశీలించారు. అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది సమాయానికి ఆయా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని చెప్పారు. ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి శంకర్పల్లి: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. మున్సిపాలిటీలో ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రం వద్ద ఇతరులెవరూ లోపలికి ప్రవేశించకుండా పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి ముందే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ యోగేశ్, తహసీల్దార్ సురేందర్, మున్సిపల్ మేనేజర్ అంజన్కుమార్, ఆర్ఐ తేజ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమాన్ని చూసి ఓటెయ్యండి
మొయినాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటెయ్యాలని శాసన మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని సురంగల్ 13, 14వ వార్డుల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి చెయ్యిగుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందన్నారు. మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అభ్యర్థులు యాలాల లావణ్య, బ్యాగరి రాజు, సీనియర్ నాయకులు రవీందర్రెడ్డి, జైపాల్రెడ్డి, మోత్కుపల్లి రత్నం, దారెడ్డి కృష్ణారెడ్డి, మాధవరెడ్డి, జంగారెడ్డి, భాస్కరాచారి, విజయభాస్కర్రెడ్డి, యాదగిరి చారి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
షాద్నగర్: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఫైనా న్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. పట్టణంలో ని 14వ వార్డులో సోమవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందె మోహన్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. గ్రామాలు, పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్నారన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందించడంతో పాటు మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన పాలకులు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి రాచరికపు పాలన కొనసాగించారని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి రెండేళ్ల పాలన చూసి ఓటు వేయాలని కోరారు. -
ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
షాద్నగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీపీ శిరీష తెలిపారు. పట్టణంలోని మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బృందాలతో భద్రత నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ ముగిసిన వెంటనే అత్యంత భద్రత నడుమ బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్రూంకు తరలించనున్నట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూం వద్ద నిరంతరం మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓట్ల లెక్కింపు రోజు అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్కుమార్ పాల్గొన్నారు. రేడియల్ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు కొందుర్గు: కొత్వాల్గూడ ఓఆర్ఆర్ నుంచి పరిగి మండలం చిట్యాల వరకు చేపడుతున్న రేడియల్రోడ్డు సర్వేను సోమవారం మండలంలోని ముట్పూర్, చుక్కమెట్టు గ్రామాల రైతులు అడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణం కోసం తమ పొలాలను తీసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎలాంటి హామీ ఇవ్వకుండా సర్వేచేస్తే ఊరుకునేదిలేదన్నారు. హెచ్ఎండీఏ అధికారులు, సర్వే సిబ్బందిని సర్వే చేయకుండా నిలువరించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అజాంఅలీ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించినా ఫలితం లేకపోయింది. తాతల కాలం నుంచి సాగుచేసుకొని జీవనం సాగించే తమ భూములను లాక్కుంటే ఎలా బతకాలని నిలదీశారు. పరిహారం తేల్చకుండా సర్వే చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీంతో అధికారులు వెనుదిరిగి వెళ్లారు. ప్రకృతి వ్యవసాయానికి మద్దతు ఇవ్వాలి కడ్తాల్: విత్తన జాతుల మధ్య జన్యుమార్పిడిపై పూర్తి నిషేధం విధించాలని, మొక్కల రకాలపై స్థానిక సమాజలకుండే హక్కులను కాపాడాలని కౌన్సిల్ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీజీఆర్ పర్యావరణ సంస్థ, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన వార్షిక విత్తన పండుగ ముగింపు సమావేశంలో ఆమోదించిన తీర్మానాలపై సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బయో పైరసీని నిరోధించా లని, వాణిజ్య పంటల కంటే స్థానికంగా తగిన పోషకాహార పంటలకు ప్రాధాన్యతనిస్తూ ప్రకృతి వ్యవసాయానికి మద్దతునివ్వాలని పేర్కొంది. విత్తన, జీవావరణ పద్ధతులతోనే జీవవృద్ధి చెందుతుందని, వాటి పునరుజ్జీవ కార్య క్రమాల నిర్వహణకు తమ మద్దతు ఉంటుందని విత్తన పండుగలో రైతులు, పర్యావరణ వేత్తలు, విద్యావేత్తలు, స్వచ్చంధ సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని వివరించింది. అన్యాయాలపై ప్రశ్నించే గొంతుక మజ్లిస్ షాద్నగర్: ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించే గొంతుక మజ్లిస్ పార్టీ అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్థి గౌస్ సోమవారం పట్టణంలోని 1వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వాలను ఎంఐఎం పార్టీ నిలదీస్తుందని అన్నారు. ఎంఐఎంకు అండగా నిలబడి గౌస్ను గెలిపించాలని కోరారు. -
ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం
తుర్కయంజాల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో విఫలం అవుతున్నాయని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఓరుగంటి యాదయ్య ఆరోపించారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ ఆదిబట్ల సర్కిల్ అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వాలు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక భద్రత బలోపేతానికి ఎలాంటి విధానాలను అమలు చేయడం లేదన్నారు. దేశ భవిష్యత్ అయిన యువతను విస్మరించి దేశాభివృద్ధిని నిర్మించలేమన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికై న సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పి.శివకుమార్గౌడ్, సర్కిల్ కార్యదర్శి కాటం రాజు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఏఐవైఎఫ్ ఆదిబట్ల సర్కిల్ అధ్యక్షుడిగా ఏనుగంటి శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా ఓరుగంటి వంశీకృష్ణ, గణేష్, మహేష్, కార్యదర్శిగా ఎన్.రాజుగౌడ్, సహాయ కార్యదర్శుగా శివ, వివేక్, కార్యవర్గ సభ్యులుగా రాజు, లోకేష్, రాహుల్నాయక్ తదితరులను ఎన్నుకున్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యాదయ్య -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై యాచారం మండల కేంద్రంలో ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం శ్రీ వేంకటేశ్వరతండాకు చెందిన జాటోత్ హర్యానాయక్(48) ఆదివారం ఉదయం వ్యక్తిగత పని మీద బైక్పై మండల కేంద్రానికి వచ్చారు. స్థానికంగా మొండిగౌరెల్లి మార్గం నుంచి హైవే పైకి వస్తుండగా ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వైపు వెళ్తున్న దేవరకొండ డిపోనకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఆయన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పైనుంచి బస్సు చక్రం కిందకు వెళ్లగా, హర్యానాయక్కు తీవ్ర గాయాలై ఎగిరి రెండు మీటర్ల దూరంలో పడిపోయారు. తలకు తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు 108 అంబులైన్స్లోకి ఎక్కిస్తుండగానే ఆయన మృతి చెందారు. మృతుడికి భార్య సుగుణతో పాటు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికుల ఆగ్రహం సాగర్రోడ్డుపై దేవరకొండ ఆర్టీసీ బస్సుల అతివేగంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. అతివేగం, డ్రైవర్లు ఫోన్లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సులను నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు మృతి చెందుతున్నారని ప్రజలు మండిపడ్డారు. కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. వ్యభిచార గృహంపై దాడి వెంగళరావునగర్: మధురానగర్ పోలీసులు వ్యభిచార కేంద్రంపై దాడిచేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. మధురానగర్కాలనీలో ఇద్దరు మహిళలు ఓ గదిని అద్దెకు తీసుకొని వ్యభిచారం చేస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో శనివారం సాయంత్రం దాడిచేసి ఓ విటుడిని, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళ పరారీలో ఉంది. -
తగ్గేదేలే!
ఇబ్రహీంపట్నం: దేనికి తగ్గేదేలేదన్నట్లుగా పుర పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో కాంగ్రెస్ అన్ని స్థానాలకు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ 23 స్థానాలకు, బీజేపీ 20 స్థానాల్లో బరిలో ఉంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఈ ఎన్నికల్లో ఖర్చుకు వెనకాడటంలేదు. ఈ మున్సిపాలిటీలో ఇరు పార్టీల మధ్య నువ్వానేనా అనే రీతిలో ఈ పోరు సాగుతోంది. నాలుగైదు వార్డుల్లో బీజేపీ కూడా తన సత్తా చాటేందుకు యత్నిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన తనయుడు అభిషేక్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఆయన తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డిలు కష్టపడుతున్నారు. మున్సిపాలిటీలో నిర్వహించిన మహిళా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు ఇరుపార్టీలు ఎత్తులుజిత్తులు వేస్తూ ముందుకు వెళుతున్నాయి. ప్రచార రథాలు, వాహనాలకు మైకులు పెట్టి అభ్యర్థుల ఫ్లెక్సీలు కట్టి హోరెత్తిస్తున్నారు. డప్పు వాయిద్యాల మోత డబ్బుతోనే ఎన్నికలు ముడిపడిపోయాయి. జనాలు వచ్చేందుకు రూ.300 నుంచి 500 వరకు ఇచ్చి జెండాలను చేత పట్టిస్తూ ప్రచారం చేయిస్తున్నారు. గల్లీగలీ, వీధివీధి డప్పు వాయిద్యాలు, సౌండ్ రికార్డులతో మార్మోగుతున్నాయి. ప్రచారంలో ప్రధాన పార్టీలు డబ్బులకు వెనుకడగుకు వేయడంలేదు. సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఎక్కడ చూసిన మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది. సాయంత్రం అయిందంటే ఆయా అభ్యర్థుల అనుచరులు, మద్దతుదారులు ఇళ్లకు మందును పంపిణీ చేస్తున్నారు. అంతేగాక మటన్, చికెన్లను కూడా ఆదివారం పంపిణీ చేయడం గమనార్హం. తిన్నోడికి తినంత.. తాగినోడికి తాగినంత అన్నట్లు ఉంది. నేడు ప్రచారం సమాప్తం నిత్యం తమ చుట్టూ ఉండే వాళ్లకు రోజు లెక్క ఒక పక్క డబ్బులిస్తుంటే.. గంప గుత్తుగా ఆయా సంఘాలకు ఇస్తున్నారు. రూ.వేయి నుంచి రూ.రెండు వేల వరకు పంచడం షురూవైంది. చీరలు, ఆహార వస్తువుల కిట్లు పంపిణీ, మహిళా సంఘాలతో రహస్య సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ముందు రోజు ఓటుకు ఇంత అని చెల్లించేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం సమాప్తం కానుంది. 11న పోలింగ్, 13న ఫలితాల వెల్లడి కానుంది. డబ్బు మయంగా మారిన వైనం విచ్చల విడిగా మద్యం, దావత్లు -
నిందితులను శిక్షించాలని కొనసాగుతున్న దీక్ష
చేవెళ్ల: ఇటీవల అడ్వకేట్ స్వప్నను ఆస్తి కోసం సోదరుడు దారుణంగా హత్య చేయించిన సంఘటనలో న్యాయంకోసం కోర్టు ఎదుట న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్ష ఆదివారం కూడా కొనసాగుతోంది. ఇందులో బార్ కౌన్సిల్ కంటెస్టింగ్ మెంబర్స్ తేజస్వినిరెడ్డి, జక్కుల వంశీకృష్ణలు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరారు. దీనికి కారణమైన దీని వెనక ఉన్న వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాండురంగారెడ్డి, శంసోద్దీన్, బాలస్వామి, సత్యానందం, రాజశేఖర్, ఉదయ్, శివరాజ్, సాయిరాం, ఆనంద్, అభిలాస్రెడ్డి, శ్రావణ్, జ్యోతి, విఠల్, వినయ్, సందీప్, రవీందర్, స్నేహ, చందు తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరం షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిధిలోని బుచ్చిగూడలో మాజీ ఎంపీ శేషయ్య వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కమ్మ సమైక్య వేదిక అధ్యక్షుడు సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ శేషయ్యనగర్ కమ్యూనిటీ హాలులో నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని వివ ఆస్పత్రి వైద్యులతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరంలో 150 మందికి ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశ్గౌడ్, ఉపసర్పంచ్ మహేశ్యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నారీ.. పతుల భేరి
● సతుల గెలుపునకు పతుల వ్యూహాలు ● జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ● ప్రధాన పార్టీల్లో పెరిగిన ఉత్కంఠ చేవెళ్ల: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. గడువు ముగుస్తుండంతో ఎలాగైనా గెలవాలనే కాంక్షతో వినూత్నంగా ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు వార్డుల వారీగా మేనిఫెస్టోలు విడుదల చేశారు. మరి కొందరైతే ప్రజల సమస్యలను తెలుసుకొని సొంత ఖర్చులతో పరిష్కరిస్తున్నారు. ఇప్పటికే మందు, విందులతో ఓట్లు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. రాజకీయంలో అవకాశాల కోసం ఎదురుచేసే వారికి వార్డు రిజర్వేషన్లు మహిళలకు రావటంతో వారి భార్యలను బరిలో దింపారు. రాజకీయంలో ఎలాంటి అనుభవం లేకపోయిన భార్తల ప్రోత్సాహంతో పోటీ చేస్తున్నారు. దీంతో వారి గెలుపు కోసం భర్తలు కంకణం కట్టుకొని దూసుకుపోతున్నారు. ప్రచారంలో వ్యూహాలు, ప్రణాళికలు, ఓటర్లను ఎలా కలవాలి, ఎలా ప్రచారం చేయాలి అని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. అభ్యర్థులుగా భార్యలు ముందు కనిపిస్తున్నా తెర వెనుక మొత్తం భర్తల పెత్తనమే నడుస్తోంది. చేవెళ్ల మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉంటే ఇందులో 9 వార్డుల్లో మహిళ రిజర్వేషన్ కింద ఉన్నాయి. కాంగ్రెస్లో మహిళకే అవకాశం చేవెళ్ల మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ అయింది. మెజార్టీ స్థానాల్లో మహిళలకే రిజర్వేషన్లు వచ్చాయి. దీంతో చైర్మన్ పీఠం కూడా అతివలకే దక్కుతుందని ప్రచారం సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే చైర్మన్ అభ్యర్థిగా 16వ వార్డులో పోటీ చేస్తున్న దేవర సమతావెంకట్రెడ్డి పేరు మాత్రం వినిపిస్తోంది. అధిష్టానం సైతం వారికే మొగ్గు చూపిస్తుండటంతో మెజార్టీ అభ్యర్థులు గెలిస్తే మున్సిపల్ చైర్పర్సన్గా సమతావెంకట్రెడ్డికే అవకాశం రానుంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి చైర్మన్ అభ్యర్థులుగా ఇంకా ఎవరనేది తేలలేదు. కౌన్సిలర్లు మెజార్టీ సాధిస్తే అప్పుడు ఎవరనేది నిర్ణయించుకునే అవకాశం ఉంది. కాళ్లు మొక్కి..ఓట్లు అడిగి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు దండం పెట్టడం, కాళ్లు మొక్కేందుకు కూడా వెనుకాడడం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ఓటరు కనిపిస్తే చాలు అన్నా, అక్కా, తమ్మీ, జర ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడుతున్నారు. రాజకీయ అవకాశం కోసం అభ్యర్థులు ఓటర్ల దగ్గర రోజుకో తీరులో ప్రచారం చేస్తున్నారు. ఆదివారం సైతం ప్రధాన పార్టీల నుంచి మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. రిజర్వేషన్ల పుణ్యమా అని ‘నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అనే పాటలో మాదిరిగా మున్సిపల్ ఎన్నికల్లో అతివలు బరిలో నిలిచారు. వారికి పతులు తోడుగా ఉంటూ ఓట్లు రాబట్టేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు, వారి కుటుంబీకులు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. -
కంప్రెషర్ యూనియన్ అధ్యక్షుడి నియామకం
తుర్కయంజాల్: గ్రేటర్ హైదరాబాద్ కంప్రెషర్ యూనియన్ అధ్యక్షుడిగా కుంచెపు రాజును ఆదివారం ఆదిబట్ల సర్కిల్ పరిధి తొర్రూర్ డివిజన్ కమ్మగూడలోని పూసల భవనంలో తుర్కయంజాల్ వడ్డెర సంఘం అధ్యక్షుడు నర్ర పాండు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కోశిక ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికై న అధ్యక్షుడిని సన్మానించారు. అనంతరం ఐలయ్య మాట్లాడుతూ కంప్రెషర్ వాహనాల యజమానులు ఐకమత్యంతో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వరికుప్పల శేఖర్, మహేష్, వెంకటయ్య, చంద్రయ్య, వెంకటయ్య, కృష్ణ, యాదయ్య, రాంబాబు, శ్రీకాంత్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
సాధనే లక్ష్యం వైపు నడిపిస్తుంది..
ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ పంజగుట్ట : ప్రతి మనిషిలోనూ ఏదో సాధించాలన్న తపన ఉండాలని, ఆ నమ్మకమే వారిని గొప్పవారిగా తీర్చిదిద్దుతోందని ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ అన్నారు. క్రికెట్లో సత్తా చాటుతున్న నల్లగొండ జిల్లా, బొడ్డుపల్లికి చెందిన కుమారి స్రవంతికి మైత్రి సేవ ఫౌండేషన్ సంస్థ క్రికెట్ కిట్, సంవత్సరం పాటు పౌష్టికాహారం అందించేందుకు ఆర్థికసాయంతో పాటు లక్ష రూపాయల చెక్కును సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం అందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయోజకులు కావాలన్న తాపత్రయంతో నానా కష్టాలు పడుతూ పట్టణల్లో పిల్లల్ని చదివిస్తుంటే, కొంతమంది చెడువ్యసనాలకు బానిసలు కావడం బాధాకరమన్నారు రామ్, లక్ష్మణ్. తన కోసం, తన కుటుంబం కోసం చూడకుండా ఓ ప్రైవేట్ కాలేజీలో 2004 బ్యాచ్ కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్థులు ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఫౌండేషన్ వైస్ చైర్మన్ తిరుపతయ్య, ఆర్గనైజర్స్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే లక్ష్యం.. క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న స్రవంతి తన 11వ ఏట నుండే క్రికెట్ నేర్చుకుంటోంది. అండర్ 15 స్టేట్, అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేషనల్ లెవల్లో ఆడింది. కృష్ణా జిల్లా టీంకు కెప్టెన్గా వ్యవహరించింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న స్రవంతి మున్ముందు భారత మహిళా క్రికెట్ టీంలో ఆడాలన్నదే లక్ష్యమని చెబుతోంది. -
ప్రచార జోరు
సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026పుర పోరు..సాక్షి, రంగారెడ్డిజిల్లా: మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఎక్కడి ప్రచార రథాలు అక్కడే నిలిచిపోనున్నాయి. ఇప్పటి వరకు వీధులు, కాలనీల్లో మార్మోగిన మైకులు మూగబోనున్నాయి. ప్రచారానికి తెరపడనుండటంతో అభ్యర్థులు వేగం పెంచారు. ఉన్న కొద్ది గంటల్లో ఆయా కాలనీలు, అపార్ట్మెంట్లను చుట్టేస్తున్నారు. తమకే ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచే పంపకాలకు తెర తీయనున్నారు. పోలింగ్ బూతుల వారీగా ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి నియమించి, వారికి కావాల్సినవి సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, మున్సిపల్ కేంద్రాల్లో మకాం వేసిన ఇన్చార్జిలు, ముఖ్య నేతలు సాయంత్రం 5 తర్వాత మున్సిపాలిటీని విడిచి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 11న జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 2.10 లక్షల బ్యాలెట్ పేపర్లు రెడీ ఒకవైపు రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతుండగా మరోవైపు ఎన్నికల సంఘం ఓటింగ్ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. 126 వార్డుల్లో 1,75,974 మంది ఓటర్లు ఉండగా, వీరి కోసం 274 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 500 నుంచి 800 మంది ఓటర్లు ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 23 మంది జోనల్ ఆఫీసర్లు, 18 మంది అధికారులతో ఆరు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 63 మంది రిటర్నింగ్ అధికారులు, 63 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, 359 మంది పోలింగ్ ఆఫీసర్లు, 359 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, 1,070 మంది పోలింగ్ క్లర్క్లను ఎంపిక చేసింది. ఇప్పటికే వారికి శిక్షణ ఇచ్చింది. 620 బ్యాలెట్ బాక్సులు సహా 2.10 లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించి, ఓటింగ్కు సిద్ధంగా ఉంచింది. ఒక్కో వార్డుకు 50 చొప్పున మొత్తం 2,000 పోస్టల్ బ్యాలెట్లను రెడీ చేసింది. 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుంది. తొలి రోజు ఓటింగ్ వాయిదా పడిన సమస్యాత్మక కేంద్రాల్లో 12న రీపోలింగ్ నిర్వహించి, 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇందుకోసం ఆయా మున్సిపాలిటీల్లో ఆరు కౌంటింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది. కౌంటింగ్ కోసం మొత్తం 64 టేబుళ్లను ఏర్పాటు చేయగా, వీటిలో అత్యల్పంగా ఆమనగల్లులో ఐదు, షాద్నగర్లో 14 సిద్ధం చేసింది. ఓట్ల లెక్కింపు కోసం 254 మంది అధికారులను నియమించింది. మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తి ఫలితాలు వెల్లడించేలా ఎన్నికల కమిషన్ ప్లాన్ చేసింది. ఇబ్రహీంపట్నం ఏసీపీపై ఫిర్యాదు ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందాయి. కాంగ్రెస్లో రెబల్స్కు సహా ప్రతిపక్ష పార్టీ నేతలకు నేరుగా ఫోన్లు చేసి, రౌడీషీట్ ఓపెన్ చేయిస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై ఎన్నికల కమి షన్ విచారణ చేపట్టనుంది. నయా నిజాంలా రేవంత్రెడ్డి పాలన వేగం పెంచిన అభ్యర్థులు కాలనీలు, వీధులు, ఇంటింటినీ చుట్టేస్తున్న నేతలు నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారపర్వం మూగబోనున్న మైక్లు.. పంపకాలకు సిద్ధం పోలింగ్ ఏర్పాట్లలో ఎన్నికల సంఘం -
మైసిగండి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తులు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ స్నేహలత, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహరెడ్డి, ప్రధాన అర్చకుడు యాదగిరిస్వామి ఉన్నారు. హయత్నగర్: కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి డిమాండ్ చేశారు. ఈనెల 12న నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం పెద్దఅంబర్పేట్ డివిజన్ కుంట్లూర్ రావినారాయణరెడ్డి కాలనీలో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కార్మిక వ్యతిరేక విదానాలను అవలంబిస్తోందని, ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్మిక సంఘా లు చేస్తున్న సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు అధికంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆజ్మీరా హరిసింగ్ నాయక్, సీపీఐ రాష్ట్ర కౌన్సి ల్ సభ్యుడు మత్యాల యాదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బతి లక్ష్మణ్ పాల్గొన్నారు. మొయినాబాద్: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయిముద్దీన్ ప్రశ్నించారు. మొయినాబాద్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కులేదన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 1.85 లక్షల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. రెండు సార్లు ఎంపీగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, టీపీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, ఉపాధ్యక్షుడు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు అజీజ్నగర్, ఎనికేపల్లి, మొయినాబాద్లో మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహాడ్డి, మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి తదితరులు అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతగిరి: కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి ప్రజాప్రభుత్వానికి అండగా ఉండాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కోరారు. ఆదివారం ఆయన వికారాబాద్లోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం, రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనంతగిరిని టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తానన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయా ణం, వడ్డీలేని రుణాలు అందించి సంక్షేమ పాలన అందిస్తున్నామని వివరించారు. మున్సిపల్ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. -
తీర్మానాల మేరకే బిల్లుల చెల్లింపు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పంచాయతీలకు నిధుల వరద పారుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు జనవరిలో విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాకు తొలి విడతలో రూ.11.10 కోట్లు మంజూరయ్యాయి. సోమవారం రెండో విడత నిధులు మంజూరు కానున్నాయి. మరో పదిహేను రోజుల్లో మూడు, నాలుగో విడత నిధులు సైతం మంజూరయ్యే అవకాశం ఉంది. పాలక మండళ్లు లేక రెండేళ్లగా నిధులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన పనులకు సంబంధించి రూ.32 కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు అంచనా. కొత్త పాలక మండళ్ల తీర్మానం ద్వారానే ఈ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఆయా పంచాయతీల్లో పాలకమండళ్లు ప్రత్యేకంగా సమావేశమై నిధుల ఖర్చుపై చర్చించనున్నాయి. 526 జీపీలు.. రూ.11.10 కోట్లు జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా, ఒకటి మినహా మిగిలిన వాటికి ఇటీవల ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. 15వ ఆర్థిక సంఘం నుంచి తొలి విడత నిధుల మంజూరులో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని 14 పంచాయతీలకు రూ.39.53 లక్షలు, ఆమనగల్లు పరిధిలోని 13 పంచాయతీలకు రూ.22.77 లక్షలు, చేవెళ్ల పరిధిలోని 25 గ్రామాలకు రూ.49.20 లక్షలు, ఫరూఖ్నగర్ పరిధిలోని 47 గ్రామాలకు రూ.82.55 లక్షలు, ఇబ్రహీంపట్నం పరిధిలోని 14 గ్రామాలకు రూ.46.23 లక్షలు, చౌదరిగూడ మండలంలోని 24 గ్రామాలకు రూ.43.94 లక్షలు, కడ్తాల్ పరిధిలోని 24 గ్రామాలకు రూ.50.56 లక్షలు, కందుకూరు పరిధిలోని 35 గ్రామాలకు రూ.75.75 లక్షలు, కేశంపేట పరిధిలోని 29 గ్రామాలకు రూ.59.31 లక్షలు, కొందుర్గు మండలంలోని 22 గ్రామాలకు రూ.40.05 లక్షలు, కొత్తూరు పరిధిలోని 12 గ్రామాలకు రూ. 28.22 లక్షలు, మాడ్గుల పరిధిలోని 34 గ్రామాలకు రూ. 67.92 లక్షలు, మహేశ్వరం పరిధిలోని 30 గ్రామాలకు రూ.60.18 లక్షలు వచ్చాయి. మంచాల మండలంలోని 23 గ్రామాలకు రూ. 62.72 లక్షలు, మొయినాబాద్ పరిధిలోని 19 గ్రామాలకు రూ.38.87 లక్షలు, నందిగామ పరిధిలోని 19 గ్రామాలకు రూ.43.78 లక్షలు, షాబాద్ పరిధిలోని 41 గ్రామాలకు రూ.71.25 లక్షలు, శంషాబాద్ పరిధిలోని 21 గ్రామాలకు రూ.45.45 లక్షలు, శంకర్పల్లి పరిధిలోని 24 గ్రామాలకు రూ.53.18 లక్షలు, తలకొండపల్లి పరిధిలోని 32 గ్రామాలకు రూ.58.37 లక్షలు, యాచారం పరిధిలోని 24 గ్రామాలకు రూ.68.57 లక్షల చొప్పున మంజూరయ్యాయి. ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులు, నిధుల్లేక మధ్యలో వదిలేసిన పనులు, కొత్తగా చేపట్టాల్సిన పనులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పనుల ప్రాధాన్యతను బట్టి 15 రోజుల్లోనే బిల్లుల చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ–గ్రామ స్వరాజ్ పోర్టర్లో నమోదు ఈ బిల్లుల చెల్లింపులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సర్పంచులు, కార్యదర్శులకు సూచించింది. ఇప్పటికే పూర్తి చేసిన పనులు, వాటి బిల్లుల చెల్లింపు సహా కొత్తగా చేపట్టే పనులకు సంబంధించిన వివరాలపై ఓ ప్రణాళిక సిద్ధం చేసి ఈ–గ్రామ స్వరాజ్ పోర్టర్లో నమోదు చేయాలని సూచించింది. పనుల పూర్తి, నిధుల చెల్లింపుపైనే అధనపు నిధుల మంజూరీ ఆధారపడి ఉందని జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ స్పష్టం చేశారు. నిధుల చెల్లింపు, ఖర్చులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిందిగా సూచించారు. నేడు పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు 15వ ఆర్థిక సంఘం నిధులపై చర్చ ఇప్పటికే చేపట్టిన పనులకు బిల్లులు మధ్యలో నిలిచిన, కొత్త వాటిపై చర్చ -
ఘనంగా బాలఏసు ఊరిపండుగ
● తరలివచ్చిన భక్తులు ● ప్రత్యేక ప్రార్థనలు తుర్కయంజాల్: కమ్మగూడలోని బాలఏసు వార్షిక మహోత్సవంలో భాగంగా ఆదివారం ఊరిపండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ముందుగా గోవిందు ఆరోగ్య స్వామి దివ్యబలిపూజ తెలుగులో, 5 గంటలకు బోనగిరి బాల ఆంథోని, 6 గంటలకు కూరపాటి జయ ప్రతాప్ ఇంగ్లిష్లో, 7 గంటలకు ఈరిపాల్ ప్రభాకర్ తెలుగులో, 8 గంటలకు పాస్టర్ ఏ.ఎస్.టోని తమిళంలో దివ్య బలిపూజలు నిర్వహించారు. 9.30 గంటలకు బాలఏసు మహోత్సవ దివ్య బలిపూజ ఇంగ్లిష్లో తాతిరెడ్డి జయరాజ్ రెడ్డి, 11.30 గంటలకు సిరిల్ తెలుగులో నిర్వహించారు. ఉదయం 6 గంటలకు నగరంలోని బోయిగూడ నుంచి బాలఏసు తేరు ప్రదక్షిణ ప్రారంభం కాగా, 11 గంటలకు తుర్కయంజాల్కు చేరుకుంది. చర్చి కమిటీ సభ్యులు, భక్తులు స్వాగతం పలికారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన భక్తులు వేల సంఖ్యలో బాలఏసును దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఆదిబట్ల సర్కిల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా వనస్థలిపురం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపింది. -
ఓటు మీది.. నిధులు తెచ్చే బాధ్యత మాది
చేవెళ్ల: ‘మీరు ఓటు వేసి గెలిపిస్తే.. అభివృద్ధికోసం ముఖ్యమంత్రి ద్వారా నిధులు తెచ్చే బాధ్యత మాది’ అని శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 12, 13, 14, 15,16, 18వ వార్డుల్లో ఆదివారం ఆయన మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి పామెన భీంభరత్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా నిధులు అందిస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించారని, మనం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని వెళ్తే చాలు అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చింపుల సత్యనారాయణరెడ్డి, వీరేందర్రెడ్డి, మాణిక్యరెడ్డి, వసంతం, ఎం.బాల్రాజ్, దేవర వెంకట్రెడ్డి, ఆగిరెడ్డి, గోనే ప్రతాప్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, పెంటయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం శంకర్పల్లి: మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, సీఎంతో మాట్లాడి అవసరమైన నిధులు తెస్తామని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఫత్తేపూర్ 8వ వార్డులో ఆదివారం డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు ప్రకాశ్, మండల అధ్యక్షుడు జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి -
హామీలు మరిచి గాలిమాటలు
● కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న రేవంత్రెడ్డి ● మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సబితారెడ్డిమొయినాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ గాలిమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం, మొయినాబాద్, సురంగల్, అప్పోజీగూడ, చిలుకూరు, హిమాయత్నగర్లోని వార్డుల్లో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమమే ఇప్పటికీ కనిపిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రజలకు ఏం చేసిందో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని నిలదీశారు. ప్రజలను మోసం చేస్తున్న పార్టీకి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జిలు జయసింహ, అమృత్లాల్ చౌహాన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు ఆంజనేయులు, స్వప్న, నరోత్తంరెడ్డి, మహబూబ్, జగన్మోహన్రెడ్డి, వెంకట్రెడ్డి, రవూఫ్, జయవంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘పర్యావరణ నిర్లక్ష్యం జాతి మనుగడకు అత్యంత ప్రమాదకరం’
పర్యావరణాన్ని మనం ఎంతగా నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానాలు మానవ జాతి మనుగడకు అంత ప్రమాదకరంగా పరిణమిస్తాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పాత వ్యవసాయ పద్ధతులను పరిరక్షించుకోవడం వల్ల భూసారం, మనుషుల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రజలు చైతన్యం పెంచుకోవాలని కోరారు.పశు సంపదను పెంచు కోలేకపోతే వచ్చే 5 ఏళ్లలో మన భూమి, మన వ్యవసాయం మనకు కాకుండా పోతాయని ఆయన హెచ్చరించారు.రంగారెడ్డి జిల్లా kadtal మండలం అన్మాసుపల్లిలోని ఎర్త్ సెంటర్ లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తాద్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగ ముగింపు సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు సమావేశంలో జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ మాజీ అధ్యక్షుడు అచలేందర్ రెడ్డి తదితర ముఖ్యులు పాల్గొన్నారు.పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... దేశీ విత్తనాల గ్రేడింగ్ తో ప్రకృతి వ్యవసాయం లో కూడా అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ... దేశీ విత్తనాలు దేశ సంపద అని, వాటి విస్తృత వినియోగానికి ప్రోత్సాహం ఇచ్చే రీతిలో ప్రణాళికా బద్దమైన ప్రభుత్వ విధానాలు అవసరం అన్నారు. రైతు ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఈ విధానాలు రూపొందాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు తగిన ప్రాధాన్యత ఇస్తేనే ప్రకృతి వ్యవసాయ పద్ధతు ల వినియోగం పెరుగుతుందన్నారు.ప్రభుత్వ విధానాలలో మార్పు వచ్చినప్పుడే ప్రకృతి వ్యవసాయం సాధ్యమవుతుందని ఏపీ మాస్ వ్యవస్థాపకులు సీఎస్ రెడ్డి ఆన్నారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు ఈ ఉద్యమం లో కీలక పాత్ర ఉందన్నారు. దేశీ విత్తనాల తో పంట దిగుబడి తగ్గుతుందనేది కేవలం ఒక అపోహేనని , వాటి వినియోగం వల్ల భూమి, మనుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయానికి అనుగుణమైన ప్రత్యామ్నాయ విత్తన వ్యవస్థ ను బలోపేతం చేయాలన్నారు.ప్రముఖ పర్యావరణ వేత్త దొంతి నర్సింహా రెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం దేశంలో హైబ్రిడ్, దేశీ విత్తన వ్యవస్థల మధ్య సంఘర్షణ జరుగుతుందన్నారు. అనేక రాష్ట్రాల్లో కార్పొరేట్ ప్రయోజనాలతో కూడిన విత్తన వ్యవస్థను రైతులు సవాలు చేస్తూ ప్రకృతి వ్యవసాయ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయ భాగస్వామ్యం తో విత్తన పండుగను విజయవంతంగా నిర్వహించామన్నారు. లక్ష్యం దిశగా ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా ఉందని, మరింత స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు సాగుతామని ఆమె చెప్పారు -
కిలో వెండి, నాలుగు తులాల బంగారం, రూ.15 వేల నగదు అపహరణ
తాళం వేసిన ఇంటికి కన్నం శంకర్పల్లి: తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన శంకర్పల్లి ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని భవానీనగర్కు చెందిన శ్రీనివాస్, అరుంధతి దంపతులు శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లారు. ఈ సమయంలో పక్కింటి వారికి ఇంటిని పరిశీలిస్తుండండని చెప్పి వెళ్లారు. శనివారం ఉదయం 7గంటలకు పక్కింటి వారికి ఫోన్ చేసి ఇంటిని పరిశీలించండి అని చెప్పగా వారు తాళం పగులగొట్టి ఉందని చెప్పారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించి బీరువా ధ్వంసం చేసి ఉందన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్టీం వివరాలు సేకరించింది. కిలో వెండి, నాలుగు తులాల బంగారం, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు అరుంధతి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
హోటల్లో అధికారుల తనిఖీలు
● మహిళా అధికారిపై దురుసుగా ప్రవర్తించిన యాజమాన్యం ● ఇబ్రహీంపట్నం ఠాణాలో ఫిర్యాదు ఇబ్రహీంపట్నం రూరల్: సాహస్ అర్బన్ డైన్ ఇన్ హోటల్లో ఆదిబట్ల సర్కిల్ శానిటేషన్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోటల్ యజమానులు మహిళా అధికారి విధులకు ఆటంకం కల్గించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగిని ఇబ్బందులకు గురి చేసి ఫోన్ లాగేసుకున్నారని ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని మంగళ్పల్లిలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. ఆదిబట్ల సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్గా చేస్తున్న ఎన్.వనిత శనివారం మంగళ్పల్లి గేటు వద్ద ఉన్న సాహస్ అర్బన్ డైన్ ఇన్ హోటల్లోని కిచెన్ పరిశీలించారు. బిర్యాని హండీని పరిశీలించి రంగులు వేసి ఆహారం తయారు చేసినట్లు గుర్తించారు. ఇలా చేయడం నేరమని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హండీ పడేశారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై ఆగ్రహించారు. ఆహారం రుచికరంగా ఉండేందుకు టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. శుభ్రత పాటించడం లేదని హెచ్చరించారు. దీంతో యాజమాన్యం ఫోన్లో అధికారిని వీడియోలు తీశారని, మీరు అధికారులు కాదని ఇలా చేయడం తగదని బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ముక్క.. సుక్క!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్ చైర్మన్ పీఠాలను ఆశిస్తున్న ఆశావహులు తమ వార్డుల్లో ఎలాగైనా గెలుపొందాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రకరకాల హామీలు ఇవ్వడంతో పాటు ప్రతి రోజూ మద్యం, మాంసం సరఫరా చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుండటం, నేడు ఆదివారం కావడంతో అభ్యర్థులు ఓటర్లకు ఇంటికి కిలో మటన్/ చికెన్ సహా ఓటర్ల సంఖ్యను బట్టి బాస్మతి రైస్, అర బాటిల్ మద్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. భారీగా మద్యం, మాంసం పంపిణీ జరుగుతున్నా.. ఎన్నికల నిఘా వర్గాలు అటువైపు కన్నెత్తి చూడటమేలేదన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.20 లక్షకుపైనే.. అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.లక్ష దాటకూడదనే నిబంధన ఉంది. కానీ ఇప్పటికే ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.20 లక్షలు దాటినట్లు సమాచారం. కాలనీ, అపార్ట్మెంట్ సంక్షేమ, కుల, కార్మిక సంఘాలు, వివిధ వర్గాల ఓటర్లతో గెట్ టు గెదర్ పార్టీలు ఏర్పాటు చేసి కావాల్సినవన్నీ సమకూర్చుతున్నారు. ఒకరిని చూసి మరొకరు పంపకాలకు తెర తీయడంతో ఖర్చులు రెట్టింపవుతున్నాయి. మరోవైపు ఓటర్లు ‘మా ఓటు మీకే’ అంటూ వచ్చిన ప్రతి అభ్యర్థికీ హామీలివ్వడం గమనార్హం. సండే స్పెషల్ ఎన్నికల దావత్ కిలో చికెన్.. బాస్మతి రైస్.. అర బాటిల్ మద్యం పోటాపోటీగా పంకాలకు సిద్ధం ఖర్చుకు వెనుకాడని అభ్యర్థులు -
ఎన్నికల నిధులు పక్కదారి..!
మొయినాబాద్: మున్సిపాలిటీలో అక్రమాల బాగోతం బయటపడింది. ఎన్నికల న్విహణకోసం కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అర్హులకు కాకుండా తమకు అనుకూలమైనవారికి పనులు కట్టబెట్టడంపై ఓ అధికారి, ఉన్నతాధికారిని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం షోకాజ్ నోటీస్లు ఇచ్చేంత వరకు వెళ్లింది. ఎన్నికల విధుల్లో భాగంగా ఓటరు జాబితా తయారీ, అవగాహన కార్యక్రమాలు, ఫ్లెక్సీలు, స్ట్రాంగ్ రూంల ఏర్పాటు, టెంట్లు, ఫొటోగ్రాఫీ, వీడియోగ్రాఫీ వంటి పనులకు కేటాయించిన నిధులు గోల్మాల్ అవుతున్నట్లు సమాచారం. ఈ విధులను మున్సిపల్ అధికారులు అర్హులైనవారికి కాకుండా తమకు అనుకూలమైన వారికి కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. పనిచేసిన కూలీలకు సైతం సక్రమంగా వేతనాలు ఇవ్వకుండా ఓ ఉన్నతాధికారి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారి ఇష్టారాజ్యం..? మున్సిపాలిటీలో ఓ డీఈ స్థాయి అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ అండతో అంతా తానై కిందిస్థాయి సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్ల ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న అవగాహనతోనే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిధులు పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మున్సిపల్ కింది స్థాయి అధికారులు, సిబ్బంది గుసగుసలాడుకుంటున్నా విషయాన్ని బయటకు పొక్కకుండా అధికారులు వారిపై ఆంక్షలు పెడుతున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల నిధులు పక్కదారి పడుతున్న విషయాన్ని గమనించిన సీనియర్ అసిస్టెంట్ ప్రశ్నించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ బాగోతం బయట పడుతుందని భావించిన ఉన్నతాధికారులు అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో కలత చెందిన అధికారి మూడు రోజులుగా ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ను వివరణ కోరగా ఎన్నికల నిర్వహణకు కేటాయించిన నిధుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని.. దీనిపై జిల్లా కలెక్టర్కు పూర్తి నివేదిక ఇచ్చామన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీలో అక్రమాలు ఎన్నికల ఖర్చుల పేరుతో నిధులు మళ్లించినట్లు ఆరోపణలు సీనియర్ అసిస్టెంట్కు షోకాజ్ నోటీస్ -
ఒగ్గు కథ కళాకారిణి మృతి
యాచారం: ప్రముఖ ఒగ్గు కథ కళాకారిణి జమ్మ మల్లారి(85) శనివారం మృతి చెందారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన ఆమె ఒగ్గు కథలపై మక్కువ పెంచుకుంది. ఆమె ఉమ్మడి రాష్ట్రంలో గొల్ల, కురుమల కుటుంబాల్లో శుభాకార్యాలు నిర్వహించేవారు. తల్లీకుమారుడు అదృశ్యం కడ్తాల్: మహిళ అదృశ్యమైన ఘటన మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. సీఐ గంగాధర్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎర్రోళ్ల సరస్వతి బాలరాజు దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి రెండేళ్ల కుమారుడు శ్రీచరణ్ ఉన్నాడు. నెల రోజుల క్రితం సరస్వతి తన కుమారుడిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన బాలరాజు సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికాడు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా బాలరాజు మొదటి భార్య చనిపోయిన తర్వాత సరస్వతిని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ముగ్గురు కుమారులు సంతానం. రాజేంద్రనగర్: పోక్సో కేసులో తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని రాజేంద్రనగర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ ప్రకారం.. సన్సిటీ ప్రాంతానికి చెందిన మహ్మద్ షాహీద్ (48) 2023లో మైనర్ బాలికపై అఘాత్యానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సమ్మెను జయప్రదం చేయాలి
హుడాకాంప్లెక్స్: దేశవ్యాప్తంగా ఈనెల 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు పిలుపునిచ్చారు. పార్టీ సరూర్నగర్ మండల కార్యాలయంలో శనివారం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలుతో కార్పొరేట్ సంస్థల సులభతర వ్యాపారానికి ద్వారాలు తెరిచిందని, వారి ప్రయోజనాలు పెంచేందుకే అమలుకు నోటిఫికేషన్ జారీ చేసిందని ఆరోపించారు. దీన్ని పూర్తిగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తోందని అన్నారు. నాలుగు లేబర్ కోడ్ను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, వీబీజీ రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో వందశాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేవారు. కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు చెప్పారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు జిల్లాల కృష్ణ, గ్యార క్రాంతి, రమావత్ సక్రు నాయక్, ఎండీ మహబూబ్, మండల కార్యదర్శి బాతరాజు నరసింహ, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి పి.వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పట్టని పార్టీలకు బుద్ధి చెప్పండి
ఆమనగల్లు: మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోని బీజేపీ, బీఆర్ఎస్లకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ పధిలోని వివిధ వార్డులకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున శనివారం వారు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఆమనగల్లు మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అన్నారు. రాబోయే రోజుల్లో రూ.100 కోట్లతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి అయిల శ్రీనివాస్గౌడ్, హైదరాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, జెఈడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్, పార్టీ మండల అధ్యక్షుడు డోకురు ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి -
మాణికేశ్వరీ మాత ఆలయంలో చోరీ
శంకర్పల్లి: మండల పరిధిలోని కొత్తపల్లి మాణికేశ్వరీ మాత ఆలయంలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. శంకర్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన ప్రకారం.. రోజుమాదిరిగానే ఆలయ పూజారి రాత్రి 10 గంటలకు గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం 7 గంటలకు వచ్చి చూడగా.. తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి పరిశీలించగా.. హుండీలోని నగదు, నాలుగు పెద్ద దీపాలు చోరీ అయినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. పశు శిబిరాలను వినియోగించుకోవాలి మొయినాబాద్రూరల్: ఉచిత పశుగర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ సీహెచ్ మల్లేశ్వరి అన్నారు. మండలంలోని అప్పారెడ్డిగూడలో శనివారం నిర్వహించిన శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పశువైద్య అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాస్రావు, సంస్థ డిప్యూటీ డైరెక్టర్ శ్రావణ్కుమార్, పశువైద్య అధికారులు వెంకట్యాదవ్, అరుణ్శ్రీ, శ్రావణ్కుమార్, దేవిరెడ్డి, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. పశువైద్యాధికారులు అందుబాటులో ఉండాలి షాబాద్: పశువైద్యాధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ డి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పశువైద్యశాలను శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహద పడేమేలు రకపు పశుగ్రాసాల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో షాబాద్ పశువైద్యాధికారి డాక్టర్ స్రవంతి, సిబ్బంది ఉన్నారు. మహిళ ఆత్మహత్యాయత్నం దాయాదుల దాడికి భయపడేనని ఫిర్యాదు ధారూరు: దాయాదుల దాడికి భయపడి ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్పహ కోల్పోయిన ఆమెను కుటుంబ సభ్యులు వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘటన మండల పరిధిలోని శేరిగడ్డతండాలో శుక్రవారం చోటుచేసుకోగా శనివారం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తండాకు చెందిన లోక్యానాయక్, పాండునాయక్ దాయాదులు. వీరి మధ్య ఇంటి స్థలం, వ్యవసాయ పొలాలకు సంబంధించిన గొడవలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న తన భార్య రేణుకపై దాయాది పాండునాయతో పాటు అతని తల్లి రుక్కిబాయి, భార్య బుజ్జిబాయి, చెల్లెలు బుజ్జిబాయి కలిసి దాచేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మూకుమ్మడి దాడితో హడలిపోయిన తన భార్య తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగిందని ఫిర్యాదు ఇచ్చారు. -
దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్
షాద్నగర్రూరల్: దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వెనుకబాటు తనానికి, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయానికి ప్రధాన కారణం ఆ పార్టీ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం షాద్నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలో అవినీతి, దుర్మార్గపు పాలన పోవాలని గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారం ఇచ్చారని అన్నా రు. బీఆర్ఎస్ ఏ రకంగా అవినీతికి పాల్పడిందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. మూడున్నర లక్షల కోట్లతో రాష్ట్రానికి హై స్పీడ్ రైలు కారిడార్ రాబోతోందని, ప్రధాని మోదీ ప్రభుత్వం ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే రైల్వే మీద రూ.50 వేల కోట్లు ఖర్చు చేయబోతోందని, ఇందులో షాద్నగర్ ప్రాంతం భాగస్వామ్యం కాబోతోందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్, రాష్ట్ర అభివృద్ధికి జరుగుతున్నవి కాబట్టి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీవర్దన్రెడ్డి, అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, కక్కునూరి వెంకటేశ్గుప్తా, డాక్టర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పురం.. పిరం!
అంచనాలు మించుతున్న ఖర్చుసాక్షి, రంగారెడ్డిజిల్లా/హుడాకాంప్లెక్స్: పురఎన్నికలు ఖరీదయ్యాయి.. నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ప్రచార పర్వం మొదలవడంతో అభ్యర్థుల ఖర్చు అంచనాలు మించిపోతోంది.. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచితీరాలనే సంకల్పంతో అభ్యర్థులు ఎంతైనా వెచ్చించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. మెజార్టీ అభ్యర్థులు సంపన్నులే అయినప్పటికీ.. చేతిలో ఉన్న కొద్దిపాటి నగదు నామినేషన్కు ముందే ఖర్చవడంతో నిధుల వేటలో నిమగ్నమయ్యారు. అయినవారి వద్ద ఆస్తుల కుదువ ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎల్బీనగర్, మీర్పేట, బడంగ్పేటలోని బంధువులు, స్నేహితులు, పరిచయస్తులను ఆశ్రయిస్తున్నారు. చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్ బరిలో నిలిచిన వారు నార్సింగి, మణికొండ, కోకాపేట్, రాజేంద్రనగర్ పరిసరాల్లోని తెలిసినవారిని కలుస్తున్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆరాంఘర్, అత్తాపూర్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోని బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల పంచన చేరుతున్నారు. వీరిలో కొంత మంది ప్లాట్లు, ఇళ్లు, బంగారు ఆభరణాలు అమ్ముకుంటుండగా, మరికొందరు ఆస్తులను కుదువపెడుతున్నారు. బ్యాంకుల్లో అప్పు చేస్తే లెక్క చెప్పాల్సి వస్తుందనే భయంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఎలాగైనా గెలవాలని.. జిల్లాలో ఎన్నికలు జరిగే ఆరు మున్సిపాలిటీల్లోని 126 వార్డుల్లో 437 మంది పోటీలో ఉన్నారు. వీరిలో బీజేపీ నుంచి 109 మంది, బీఆర్ఎస్ నుంచి 122, అధికార కాంగ్రెస్ నుంచి 126 మంది బరిలో నిలిచారు. వీరు కాకుండా బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, జనసేన, ఎంఐఎం, ఇతర పార్టీలతో పాటు మరో 57 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో వీరంతా ఆయా వార్డుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఏ అభ్యర్థి ఎంత ఖర్చు చేయగలడు అనే అంశాన్ని ముందు నిర్ధారించుకున్న తర్వాతే అధికార, ప్రతిపక్ష పార్టీలు బీ ఫారాలు చేతికిచ్చాయి. కానీ అప్పటికే సమకూర్చుకున్న నగదు చాలా వరకు ఖర్చవడంతో గెలుపు కోసం ఎంత ఖర్చుకై నా సిద్ధపడుతున్నారు. నిద్రపోతున్న నిఘా వ్యవస్థ నామినేషన్కు ముందు రోజే ప్రత్యేక అకౌంట్ను తెరిచి రోజువారీ ఖర్చులను ఈ ఖాతా నుంచే చెల్లించాల్సి ఉంది. ఏఒక్క అభ్యర్థి దీన్ని పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీల్లో ప్రత్యేక అబ్జర్వర్లు, నిఘా బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేదు. మున్సిపాలిటీ ప్రధాన రాహదారులపై పోలీసు పికెట్లు పెట్టి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నా ధన ప్రవాహాని మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. మరి ఇంత చేస్తున్నా విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి. అప్పుడే మొదలైన ధన ప్రవాహం నిజానికి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.లక్షకు మించకూడదు. క్షేత్రస్థాయిలో కరపత్రాలు, వాల్ పోస్టర్లు, ప్రచార సామగ్రి కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ప్రచారపర్వం మొదలు కావడం, జెండాలు పట్టి ప్రచారంలో కలిసివచ్చిన కార్యకర్తలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం మద్యం సరఫరాకే రోజుకు కనీసం రూ.లక్షకుపైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్కు ముందురోజు క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి ఒక్కో ఓటుకు సగటున రూ.2 వేల నుంచి రూ.10 వేలు వెచ్చించేందుకు సైతం వెనుకాడడం లేదని సమాచారం. -
పరికరాలపై అవగాహన పెంచుకోండి
రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య సికింద్రాబాద్: వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లి ఓ వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే పోలీస్ సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కే.నారాయణ తెలిపిన మేరకు.. తమిళనాడు చిదంబరానికి చెందిన ఏ.సుందరమూర్తి (43) సైనిక్పురిలోని ఒక ప్రైవేటు కంపెనీలో లీడ్ ఆడిటర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 6న మధ్యాహ్నం అమ్ముగూడ–నేరేడ్మెట్ రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్ రైలుకు ఎదురెళ్లి ఆత్యహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
చెరువు భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
తుక్కుగూడ: చెరువు శిఖం భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని శంషాబాద్ ఇరిగేషన్ డీఈఈ సతీష్ అన్నారు. మంఖాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 614,615లో ఉన్న రాయ్కుంట చెరువును శుక్రవారం ఆయ న సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..స్థానికుల ఫిర్యాదు మేరకు చెరువును సందర్శించినట్టు తెలిపారు. శిఖం భూమిలో రియల్టర్లు బయటి నుంచి మట్టి తెచ్చి పోశారని, ఖా ళీ చేయాలని నోటీసులు జారీ చేశామన్నారు. అనంతరం భౌగోళిక సరిహద్దులు నిర్ణయించారు. కార్యక్రమంలో మహేశ్వరం ఏఈ ప్రభాకర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా పాండు కందుకూరు: ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడి గా మండల పరిధిలోని తిమ్మాపూర్కు చెందిన మంద పాండు నియ మితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం హర్యా నా మా జీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హ్యూమన్ రైట్స్ నేషనల్ అధ్యక్షుడు కటకం శ్రీనివాస్ చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా పాండు మా ట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పదవీ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మానవ హక్కుల సాధన కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. విధుల్లో అలసత్వం వహించొద్దు శంకర్పల్లి: బ్యాలెట్ పత్రాలు, బాక్స్లను జాగ్రత్తగా ఉపయోగించాలని సహాయ జిల్లా ఎన్నికల అఽధికారి, మున్సిపల్ కమిషనర్ యోగేశ్, ఎన్నికల స్పెషలాఫీసర్ నర్సిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ప్రిసైడిండ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల విధులపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల సామగ్రి తీసుకునేందుకు అధికారులు నిర్ణీత సమయానికి పంపిణీ కేంద్రాలకు చేరుకోవడం, బ్యాలెట్ పత్రాలను ఉపయోగించిన తర్వాత వాటిని భద్రపరిచే విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విధుల్లో అలసత్వం వహించొద్దని, అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ అధికారుల కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నెలాఖరుకు టిమ్స్ పనుల పూర్తికి వికాస్రాజ్ ఆదేశాలు వెంగళరావునగర్: ఈ నెలాఖరులోగా టిమ్స్ ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ సూచించారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రిని శుక్రవారం ఆయన సందర్శించి మాట్లాడారు. ఎమర్జెన్సీ విభాగానికి అవసరమైన 200 ఆక్సిజన్ లైన్లు, 65 నర్సింగ్ స్టేషన్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి వెంటనే ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. లాండ్రీ సేవలు, కర్టెన్లు, ఐసీయూ, ఎమర్జెన్సీ బెడ్ రెయిలింగులు, సైన్బోర్డులు వంటి సహాయక వసతులు సిద్ధం చేయాలన్నారు. ఆయనవెంట వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ నరేంద్రకుమార్, ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ రాజేశ్వర్రెడ్డి, ఎస్ఈ విశ్వకుమార్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ మహబూబ్ఖాన్ తదితరులు ఉన్నారు. వచ్చే మార్చిలో టిమ్స్ అందుబాటులోకి రానుండటంతో నగరంలో మరో కీలక ప్రభుత్వ వైద్య సంస్థగా నిలవనుందని, ఈ నెల 12 నుంచి 28 మధ్య తొలిదశలో 100 మంది వైద్య, పారా వైద్య, హౌస్కీపింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకురానున్నట్లు అధికారులు చెప్పారు. -
ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం
చేవెళ్ల: పదేళ్లలో గత పాలకులు భ్రష్టు పట్టించిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే ప్రజా జీవితాల్లో మార్పుకోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, అభివృద్ధి సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. చేవెళ్లలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే ఎజెండా కింద పనిచేస్తున్నా యని తెలిపారు. రెండేళ్లుగా పాలనను ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నామని.. పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని వివరించారు. తెలంగాణ రైజింగ్ పేరుతో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. చేవెళ్ల పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ ముధుసూదన్రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణరెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ అనితారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీంభరత్, నాయకులు బొంతు రామ్మోహన్, గౌరీ సతీష్, ఎం.బాల్రాజ్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిలు నర్సారెడ్డి భూపతిరెడ్డి, ఫయూం, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్కు ఆదరణ
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి చేవెళ్ల: ప్రజలు మళ్లీ బీఆర్ఎస్, కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద 9,10, చేవెళ్లలోని 12,14,15,16, 17, 18 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి రెండేళ్లలో ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని గుర్తించాలన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్కి మంచి ఆదరణ, అభిమానం కనిపిస్తున్నాయని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, ప్రభాకర్, పార్టీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
రసీదులు తప్పనిసరి
షాబాద్: రైతులకు కావాల్సిన యూరియా, నాణ్యమైన విత్తనాలు విక్రంచాలని షాబాద్ మండల వ్యవసాయశాఖ అధికారి దండెం విజయచంద్ర అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణాంలో యూరియా సేల్స్ రిజిస్టర్స్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. రైతులు కొనుగోలు చేసే ఎరువులు, విత్తనాలకు రసీదులు ఇవ్వాలన్నారు. ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి షాపు ముందు స్టాక్ బోర్డు పెట్టాలని, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. కాలంతీరిన పురుగు మందు, విత్తనాలు విక్రయించొద్దన్నారు. -
బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి
చేవెళ్ల: బీజేపీ అభ్యర్థులకు ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధిచేసి చూపిస్తారని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో అభ్యర్థి కె.మహేందర్, దేవునిఎర్రవల్లి 3 వార్డులో పత్తి మీనాక్షి సత్యనారాయణ తరఫున శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీతోనే దేశం, రాష్ట్రం, గ్రామా లు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ప్రజల్లో బీజేపీకి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. చేవెళ్ల పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో పార్టీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం,డాక్టర్మల్గారి వైభవ్రెడ్డి, మాణిక్యరెడ్డి, జయశంకర్, కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సారిక చౌదరి అన్నారు. మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్ కంజర్ల మాల్లో శుక్రవారం బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె దిశానిర్దేశం చేశారు. అనంతం మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలన్నారు. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో వివరించాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, పార్టీ రాష్ట్ర నాయకులు కంజర్ల ప్రకాష్, సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, స్థానిక నాయకులు మోర నర్సింహారెడ్డి, శ్రీనివాస్గౌడ్, అభ్యర్థులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
సాంప్రదాయ విత్తనాలను కాపాడుకోవాలి
సాక్షి, కడ్తాల్: అంతరించి పోతున్న దేశీయ, సాంప్రదాయ విత్తనాలను కాపాడుకుంటూ, వాటి నిర్వహణను కంపెనీలు, కార్పొరేట్ల గుప్పిట్ల నుంచి రైతు అజమాయిషీలోకి తీసుకు రావాలని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పిలుపు నిచ్చారు. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అది రైతు హక్కు అని తెలిపారు. ఈరోజు బహుళ జాతి కంపెనీలు హైబ్రిడ్ విత్తన వ్యాపారంతో రాష్ట్ర ప్రభుత్వాలను శాసిస్తున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయ విత్తనాలతోనే వాటికి చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.శుక్రవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాసుపల్లి లోని ఎర్త్ సెంటర్ లో సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్), భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ మూడు రోజుల పాటు నిర్వహిస్తోన్న తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ... బహుళ జాతి కంపెనీలు దేశంలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా ఐటీ, మార్కెట్ ఫీజు మినహాయింపు పొందుతున్నాయన్నారు. ప్రభుత్వం నిషేధించిన విత్తనాలను కూడా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయని విమర్శించారు. కలుపు మందులు చాలా విష పూరితమని, అయినా ఎరువుల దుకాణాలలో దొరకడం శోచనీయం అన్నారు.మనకు వనరులు, అవకాశం ఉన్నప్పటికీ సాంప్రదాయ విత్తనాలను పండించడం లేదని, ఇప్పటికయినా మేల్కొనకపోతే ఒకవంక వాతావరణ మార్పుల దుష్ప్రభావం, మరో వంక బహుళ జాతి కంపెనీల చేతిలో ఇబ్బందుల పాలవుతామని కోదండరెడ్డి హెచ్చరించారు. సాంప్రదాయ విత్తనాల వినియోగానికి, రైతుల హక్కులు కాపాడడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందన్నారు కోదండ రెడ్డి. అనంతరం విత్తన స్టాళ్లను ఆయన ప్రారంభించి, సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ.. ఆహారం లోనే ఆరోగ్యం ఉందని, దురదృష్టవశాత్తు ఆ ఆహారం కల్తీ అయ్యిందన్నారు. రాబోయే తరాల కోసం సాంప్రదాయ విత్తనాలను రక్షిద్దామని పిలుపు నిచ్చారు.సీజీఆర్ వైస్ ప్రెసిడెంట్, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ... మానవ సమాజానికి రైతు చేస్తున్న సేవలో విత్తన పండుగ కూడా ఒకటని అన్నారు. గత ఏడాది CGR నిర్వహించిన విత్తన పండుగలో 50 స్టాళ్లు ఏర్పాటు చేయగా, ఈసారి 75 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఆహార వ్యవస్థలో తీవ్ర మైన మార్పులు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా జన్యు సంపద ప్రమాదంలో పడిందని, వాటిని కాపాడటమే విత్తన పండుగ ప్రధాన ఉద్దేశ మని పర్యావరణ వేత్త, కార్యక్రమ కన్వీనర్ దొంతి నర్సింహారెడ్డి తెలిపారు.రైతు కమిషన్ సభ్యుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... కల్తీ మందులు, విత్తనాలతో పక్షి జాతులు అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ... సమస్య చాలా తీవ్రంగా ఉందని, జీవ వైవిధ్యం నశించి పోతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు తలవంచుతున్నాయని విమర్శించారు.‘నాబార్ఢ్’ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్ మాట్లాడుతూ... రాష్ట్రం లోని 13 జిల్లాలలోని 180 స్కూళ్ళలో ట్రెడిషనల్ గార్డెన్స్ ఏర్పాటు చేసి విద్యార్ధులకు సాంప్రదాయ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న సీజీఆర్ కార్యక్రమం ‘వైఇఎల్పీ’కి నాబార్డు మద్దతిస్తున్నట్టు చెప్పారు. సాంప్రదాయ విత్తనాల వాడకం కోసం సీజీఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. CGR కు తమ సహకారం ఉంటుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ కన్వీనర్ జాకోబ్, జిల్లా అటవీ శాఖాధికారి రోహిత్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.చదవండి: సేంద్రియ ఆహారంతో ఆరోగ్యానికి మేలేనా? -
కేసీఆర్ గుర్తులు ఎవరూ చెరపలేరు
మొయినాబాద్: మాజీ సీఎం కేసీఆర్ గుర్తులు లేకుండా చేయడం సీఎం రేవంత్రెడ్డి తరం కాదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్, ఎనికేపల్లిలో గురువారం బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో భారీ ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పేరుతో ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఉచిత బస్సు అంటున్నారు.. కానీ బస్టాపుల్లో బస్సులు ఆపడంలేదు. రైతు భరోసా అన్నారు.. ఇప్పటికీ ఎవరికీ వేస్తలేరని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని.. బిల్లులు ఇవ్వడంలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రజలకు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. అభివృద్ధి జరగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న, సమన్వయ కమిటీ సభ్యుడు వెంకట్రెడ్డి, నరోత్తంరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు కొత్త మాణిక్రెడ్డి, లావణ్య పాల్గొన్నారు. సత్తా చాటాలి చేవెళ్ల: వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని, తప్పకుండా మెజార్టీ స్థానాలు గెలుస్తామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని 8, 11 వార్డుల్లో గురువారం రాత్రి ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.మున్సిపల్ ప్రచారంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
కఠినంగా శిక్షించాలి
యువ న్యాయవాది స్వప్న హత్యోదంతం ఎంతగానో బాధించిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం కేతిరెడ్డిపల్లికి వచ్చిన ఆమె, స్వప్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వప్న మృతిపై సీఎం రేవంత్రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు సత్వరం శిక్ష పడేలా చూడాలన్నారు. ఆమె వెంట స్థానిక సర్పంచ్ గొడుగు యాదయ్య, ఉప సర్పంచ్ అనితరెడ్డి, మాజీ సర్పంచ్ గోటికె రమేశ్ తదితరులు ఉన్నారు. -
ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయండి
షాద్నగర్రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీసీపీ శిరీష అన్నారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో గురువారం పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిభధ్రతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. ప్రజలు భయాందోళన చెందకుండా, ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐలు విజయ్కుమార్, నర్సయ్య, శ్రీనివాస్, నరహరి, డీఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు సుశీల, రాంచందర్, శ్రీకాంత్, ప్రణయ్ పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం సహించేది లేదు
శంకర్పల్లి: ఎన్నికల విధుల్లో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, అలాంటివి దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్, స్ట్రాంగ్ రూంలను గురువారం ఎన్నికల పర్యవేక్షకుడు మయాంక్ మిట్టల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, వెలుతురు సరిగ్గా ఉండేలా లైట్లు, ఇతర సౌకర్యాలను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. వారివెంట మున్సిపల్ కమిషనర్ యోగేశ్, తహసీల్దార్ సురేందర్, ఎంపీడీఓ వెంకయ్య, సీఐ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
మాదే గెలుపు.. కాదు మాదే
ఆమనగల్లులో గురువారం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆచారి 14వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఇదే సమయంలో ఇద్దరూ ఎదురుపడ్డారు. ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఎందుకు టెన్షన్ పడుతున్నారంటూ ఎమ్మెల్యే అనడంతో మున్సిపాలిటీలో గెలిచేది బీజేపీ మేమెందుకు టెన్షన్ పడతామంటూ ఆచారి సమాధానం ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది చూడు అంటూ కసిరెడ్డి బదులిచ్చారు. ఇద్దరి సరదా సంభాషణను ఇరు పార్టీల నాయకులు ఆసక్తిగా వీక్షించారు. – ఆమనగల్లు -
ఆస్తి కోసమే హత్య
● న్యాయవాది స్వప్న హత్య కేసు వివరాలు వెల్లడించిన డీసీపీ యోగేష్గౌతమ్ ● నలుగురు నిందితుల అరెస్టు, రిమాండ్కు తరలింపుమొయినాబాద్రూరల్: ఆస్తి వివాదమే న్యాయవాది స్వప్న హత్యకు దారితీసిందని డీసీపీ యోగేష్గౌతమ్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం మొయినాబాద్ ఠాణాలో వివరాలు వెల్లడించారు. కేతిరెడ్డిపల్లిలోని నాలుగు ఎకరాల పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదంలో స్వప్న సొంత అన్నయ్య జి.రాజు, మరో ముగ్గురు ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో స్వప్న తల్లితో కలిసి కేతిరెడ్డిపల్లిలోని సర్వే నంబర్ 339లోని భూమి వద్దకు వెళ్లారు. సర్వే పూర్తయిన తర్వాత వెంకటాపూర్ నుంచి నక్కలపల్లికి వెళ్లే రోడ్డు వైపు తిరిగి వస్తుండగా రాజు మరో ముగ్గురితో కలిసివచ్చి కారుతో ఢీకొట్టారు. స్వప్న గుంతలో పడిపోగా పెద్ద కర్రలు, రాళ్లతో దాడి చేసి, కత్తితో గొంతు కోశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను హత్య చేయాలని రెండుమూడు సంవత్సరాల నుంచే పథకం పన్నుతున్నారు. ఈ మేరకు గురువారం రాజుతోపాటు నిందుతులైన ఎర్రోళ్ల సందీప్, వడ్డె వీరేష్, కావలి శివనుంచి కారు, స్కూటీ, నాలుగు మొబైల్ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ పవన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చేసింది విత్తన పండుగ
కడ్తాల్: దేశీ విత్తనాల సంరక్షణే లక్ష్యంగా తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగకు అన్మాస్పల్లి పంచాయతీ పరిధిలోని ఎర్త్ సెంటర్ ముస్తాబైంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమై ఈనెల 8వ తేదీ వరకు కొనసాగనుంది. విత్తనాలను ఎంచుకోవడం, పంచుకోవడం, పరిరక్షించుకునే చిరకాల సంప్రదాయాలను పునర్నిర్మించడంతో పాటు సంప్రదాయ విత్తన వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విత్తన పండుగకు పెద్ద ఎత్తున వ్యవసాయ, పర్యావరణ నిపుణులతో పాటు విధాన నిపుణులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తరలిరానున్నారు. మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర 14 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విత్తన నిపుణులు పాల్గొననున్నారు. ప్రదర్శనలకు 74 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జయప్రదం చేయండి తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగను జయప్రదం చేయాలని పాలసీ నిపుణుడు దొంతి నర్సింహారెడ్డి, సీజీఆర్ చైర్పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, సమాచారహక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఎర్త్ సెంటర్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పర్యావరణ వేత్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంప్రదాయ విత్తన జ్ఞానాన్ని పంచుకోవడానికి, రైతుల, విత్తన సంరక్షకుల అనుభవాలను ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడానికి, పరస్పర సహకారం, సామూహిక బలాన్ని పెంచేందుకు ఈ వేడుక దోహదపడుతుందన్నారు. ప్రారంభోత్సవానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్, ఎంపీ మల్లురవి, వివిధ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులు హాజరుకానున్నట్లు తెలిపారు. నేటినుంచి 8వ తేదీ వరకు.. అన్మాస్పల్లి ఎర్త్ సెంటర్ వేదిక పలు రాష్ట్రాలకు చెందిన దేశీ విత్తనాల ప్రదర్శన ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు -
బీజేపీతోనే అభివృద్ధి
శంకర్పల్లి: తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్రం ఇస్తున్నట్లు చెప్పుకోవడం బాధాకరమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలో గురువారం ఆయన బీజేపీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై బీజేపీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్రెడ్డి, నాయకులు ప్రభాకర్రెడ్డి, పరమేశ్వర్రెడ్డి, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటనే మున్సిలిటీలు అభివృద్ధి చెందుతాయని రాజ్యసభ సభ్యురాలు, ఆ పార్టీ హర్యానా నేత రేఖశర్మ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 9,10 వార్డుల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. దేశం మొత్తం బీజేపీ వైపు ఉందన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నాయని చెప్పారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయకులు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి, జయశంకర్, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
దూకుడు ఇక మిగిలింది నాలుగు రోజులే
మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. జిల్లాలోని మెజార్టీ స్థానాలు కై వసం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు తమ అనుచరుల గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు. ● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ● ఇప్పటికే ఇన్చార్జులను నియమించిన బీఆర్ఎస్ ● తాజాగా కాంగ్రెస్ జాబితా ప్రకటన ● రంగంలోకి ఇటు ఎమ్మెల్యేలు, అటు ముఖ్య నేతలు ● వేడెక్కిన మున్సిపల్ రాజకీయం సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్ ప్రచారం వేడెక్కింది. ఇటు ఎమ్మెల్యేలు, అటు ఆయా పార్టీల ముఖ్య నేతలు పోటీలో ఉన్న అభ్యర్థులను వెంటేసుకుని కాలనీలు, అపార్ట్మెంట్లు కలియతిరుగుతున్నారు. ఉదయం ఇంటింటా ప్రచారం చేసి, మధ్యాహ్నం పట్టణ కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం కుల, కాలనీ సంక్షేమ, కార్మిక సంఘాలతో భేటీ అవుతున్నారు. శనివారం పరిగి కేంద్రంగా నిర్వహించే సీఎం బహిరంగ సభకు జిల్లా నుంచి భారీగా జనసమీకరణ చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం చేవెళ్లలో డీసీసీ చీఫ్ చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన మాజీ ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మున్సిపాల్టీలను చుట్టేస్తున్న ఎమ్మెల్యేలు షాద్నగర్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్నగర్లో మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఆమనగల్లు మున్సిపాలిటీ ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ నేత ఆచారి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అదే వార్డుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేరుకున్నారు. ఓ ఇంట్లో ఆచారి ఉన్న విషయం తెలిసి ఆయనతో మాటామంతి కలిపారు. ఇద్దరు నేతల కలయికను బీఆర్ఎస్ తన పార్టీ సోషల్ మీడియాలో ప్రచారాస్త్రంగా వాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కో ఆర్డినేటర్ల నియామకం బలమైన అభ్యర్థులను బరిలోకి దించిన అధికార పార్టీ తాజాగా ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో ఆర్డినే టర్ను నియమించింది. ఇబ్రహీంపట్నం కోఆర్డినేటర్గా వి.జగదీశ్వర్గౌడ్, చేవెళ్లకు ఎన్.భూపతిరెడ్డి, మొయినాబాద్కు ఎంఏ ఫయీం, శంకర్పల్లికి బొంతు శ్రీదేవి, షాద్నగర్కు టి.ప్రకాష్గౌడ్, ఆమనగల్లు మున్సిపాలిటీకి పి.విజయారెడ్డిని ఇన్ చార్జిలుగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా మున్సిపాలిటీల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జిలను నియమించింది. వీరంతా ప్రచార రంగంలోకి దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అన్నీ తానై వ్యవహరిస్తుండగా, మాజీమంత్రి సబితారెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్నగర్లో, మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆమనగల్లులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తమ అనుచరులకు పార్టీ బీ ఫారాలను ఇప్పించుకోవడంతో పాటు వారి గెలుపు కోసం విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. పార్టీ తరఫున బీ ఫారాలు దక్కకపోవడంతో నామినేషన్లు ఉపసంహరించుకున్న ఆశావహులను కూడా కలుపుకుపోయి, అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే రెండు రోజులు పూర్తయింది. ఇక నాలుగు రోజులు మాత్రమే మిగలడంతో అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రచారం ముమ్మరం చేశాయి. -
బైక్ దొంగ రిమాండ్
ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు షాద్నగర్రూరల్: తాళం వేసి పార్కు చేసిన బైక్లను దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. గురువారం షాద్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో డీసీపీ శిరీష వివరాలను వెల్లడించారు. ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామపంచాయితీ పరిధిలోని మహాల్ ఎలికట్ట గ్రామానికి చెందిన జక్కుల శివలింగం బైక్ దొంగతనాలను పాల్పడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇంటి ముందు, షాపుల వద్ద తాళం వేసి పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోతాడు. పట్టణానికి చెందిన నడికూడ రాఘవేందర్యాదవ్ ఈ నెల 3న పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల త్రిశూల్ వైన్స్ షాపు ముందు తన బైక్ను పార్కింగ్ చేసి వెళ్లినాడు. తిరిగి వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. దీంతో ఈ నెల 4న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిన పోలీసులు శివలింగం నుంచి ఐదు బైక్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. నిందితుడు 30 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్ల్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను డీసీపీ శిరీష అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, క్రైం డీఎస్ఐ శివారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
432 ఎకరాలే పెండింగ్
యాచారం: ఫార్మాసిటీ భూసేకరణ పూర్తయినట్లేనని, కోర్టు పరిధిలో ఉన్న 432 ఎకరాల పట్టా భూమికి సంబంధించిన వివాదం మాత్రమే పెండింగ్లో ఉందని అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లోని పది గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం 19,333 ఎకరాల భూసేకరణకు అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో సింహభాగం యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్దలో పది వేల ఎకరాల అసైన్డ్, పట్టా భూమిని సేకరించడానికి నిర్ణయించింది. ఇందులో ఏడు వేల ఎకరాలకుపైగా భూమిని(ప్రస్తుతం ఈ భూముల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది) సేకరించారు. అయితే, 2,200 ఎకరాల పట్టా భూములకు సంబంధించిన రైతులు ఫార్మాసిటీకి భూములు ఇచ్చేది లేదంటూ కోర్టుకు వెళ్లారు. దీంతో రాత్రికి రాత్రే అవార్డులు పాస్ చేసిన అధికారులు 800 మందికి పైగా రైతుల సుమారు 1,800 ఎకరాల పట్టా భూముల పరిహారాన్ని అథారిటీలో జమ చేశారు. వీరి పేర్లపై ఉన్న భూరికార్డులను టీజీఐఐసీకి బదలాయించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు యాచారం తహసీల్దార్ ఈ పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు పూర్తయిన ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియ పరిహారం డబ్బులు అథారిటీలో జమ మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతులకు ప్లాట్ల పంపిణీ రైతులు ఆగం కావద్దు ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులు ఇతరుల మాటలు విని ఆగం కావద్దు. మీ పరిహారాన్ని అథారిటీలో జమ చేశాం. ఇక మా చేతుల్లో ఏమీ లేదు. మీరే వెళ్లి డబ్బులు తెచ్చుకోవచ్చు. పరిహారం పెంచే విషయం అథారిటీ జడ్జి నిర్ణయిస్తారు. కేవలం 432 ఎకరాలే వివాదంలో ఉన్నట్లు గుర్తించాం. రిజిస్ట్రేషన్లు చేసిన రైతులకు త్వరలోనే ప్లాట్ల డాక్యుమెంట్లను పంపిణీ చేస్తాం. – అనంత్రెడ్డి, ఆర్డీఓ ఇబ్రహీంపట్నం -
పాలనలో పైచేయి
● షాద్నగర్ మున్సిపాలిటీ ప్రస్థానం ● 37 ఏళ్లు పాలించిన ఒకే కుటుంబం మొదట మున్సిపాలిటీగా ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీగా ఎన్నెన్నో మలుపులు చూసింది. తిరిగి మున్సిపాలిటీగా మారి మూడో విడత ఎన్నికలను చూస్తోంది. పాలన ప్రస్థానంలో షాద్నగర్ చరిత్ర ఇది.. షాద్నగర్: స్వాతంత్య్రం అనంతరం పాలన వ్యవస్థ ఏర్పాటయ్యాక 1952లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి నారాయణపేట కాగా, మరొకటి షాద్నగర్, మొదటి మున్సిపల్ చైర్మన్ మాదిరాజు సుదర్శన్రావు పని చేశారు. 1959లో జవహర్లాల్ నెహ్రూ ప్రధాని హోదాలో ఇక్కడికి వచ్చి పంచాయతీ వ్యవస్థను రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేశారు. దేశంలోనే షాద్నగర్ రెండో పంచాయతీ రాజ్ వ్యవస్థ. ఈ క్రమంలో షాద్నగర్ను మేజర్ పంచాయతీగా గుర్తించారు. అప్పటినుంచి 2011 వరకు గ్రామపంచాయతీగా కొనసాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి కృషితో షాద్నగర్ 2011లో మున్సిపాలిటీగా ఏర్పాటైంది. రెండేళ్ల పాటు అధికారుల పాలనలో కొనసాగింది. 2014లో జరిగిన మొదటిసారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అగ్గనూరు విశ్వం మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2020లో బీఆర్ఎస్ విజయం సాధించింది. చైర్మన్గా కొందూటి నరేందర్ బాధ్యతలు చేపట్టారు. ఆ కుటుంబానిదే ఆధిపత్యం అగ్గనూరు రాచప్ప కుటుంబంలో ఇప్పటివరకు ముగ్గురు పట్టణాన్ని పాలించారు. తండ్రి అగ్గనూరు రాచప్ప, కొడుకు అగ్గనూరు విశ్వం, కోడలు అగ్గనూరు విశాలలు సర్పంచ్, మున్సిపల్ చైర్మన్ పదవులు చేపట్టారు. షాద్నగర్ గ్రామ పంచాయతీ, మున్సిపల్ పాలనలో ఇప్పటివరకు 67 ఏళ్ల పాటు కొనసాగింది. అయితే అందులో అగ్గునూరు కుటుంబ సభ్యులు షాద్నగర్ను 37 ఏళ్ల పాటు పరిపాలించడం విశేషం. ప్రతిసారి జరిగే ఎన్నికల్లో అగ్గనూరు కుటుంబం ప్రత్యేకమైన ముద్రను కనబరుస్తూ వస్తుంది. ఎప్పుడు గెలిచారంటే.. ● 1964–1980 వరకు షాద్నగర్ తొలి సర్పంచ్గా అగ్గనూరు రాచప్ప ఎన్నికయ్యారు. ● 1988లో జరిగిన ఎన్నికల్లో తిరిగి రాచప్ప సర్పంచ్గా గొలుపొందారు. ● షాద్నగర్ పంచాయతీ సర్పంచ్ పదవికి 1990లో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఉప ఎన్నికల్లో ఆకుల మాణయ్య సర్పంచ్గా గెలుపొందారు. ● 1995లో జరిగిన ఎన్నికల్లో అగ్గనూరు విశ్వం సర్పంచ్గా ఎన్నికయ్యారు. ● 2008 ఎన్నికల్లో అగ్గనూరు విశాల సర్పంచ్గా గెలుపొందారు. షాద్నగర్ మున్సిపాలిటీ ఏర్పాటు అయ్యే వరకు అంటే 2011 ఆగస్టు 24 వరకు పదవిలో కొనసాగారు. ● 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్గనూరు విశ్వం కౌన్సిలర్గా ఎన్నికై చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకున్నారు. -
స్మార్ట్గా దూసుకెళ్తూ
‘ప్రజాసేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించండి.. ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తా’ అంటూ మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉండే అభ్యర్థులు ఆకర్షణీయంగా కరపత్రాలు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం తెగ ప్రచారం చేస్తున్నారు. షాద్నగర్: మున్సిపాలిటీ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులు స్మార్ట్గా ఆలోచిస్తున్నారు. చాలా మంది స్మార్ట్ ఫోన్లలో అన్లిమిటెడ్ డేటాను ఉపయోగిస్తుండటంతో దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వార్డుల వారీగా వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. హామీల కరపత్రాలను తయారు చేసి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం వంటి సామాజిక మాధ్యమాల సహాయంతో ప్రతి ఓటరుకు చేరవేస్తున్నారు. అభ్యర్థుల మద్దతుదారులు వార్డుల వారీగా ఉంటే ఓటర్లకు సంబంధించిన సెల్ ఫోన్ నంబర్లను సేకరించి వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కూర్చున్న చోటు నుంచే అభ్యర్థులు ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారు. ఓటరు జాబితా చేరవేత కొంత మందికి ఓటరు జాబితాలో పేరు ఉందోలేదో అన్న విషయం తెలియదు. ఓటు ఎక్కడ వేయాలో అవగాహన ఉండదు. దీంతో ఓటరు జాబితాలతో పాటుగా పోలింగ్ స్టేషన్ల వివరాలను వాట్సాప్లలో పంపిస్తున్నారు. ఓటు ఏ వార్డులో ఉంది. ఏ కేంద్రంలో ఓటు వేయాలన్న విషయాలను కూడా అభ్యర్థులు ఓటర్లకు వాట్సాప్ల ద్వారా ఇప్పటి నుంచే సూచిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి పోస్టులు తయారు చేసుకునేందుకు ఇంటర్ నెట్లో పలు యాప్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆకర్షణీయంగా ప్రచార పత్రాలను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ పని తీరు చేసిన అభివృద్ధి అంశాలను జోడించి సందేశాలు, వీడియోలు రూపొందిస్తున్నారు. కొత్తగా పోటీ చేసే అభ్యర్థులు హామీలు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎన్నికల బరిలో సామాజిక మాధ్యమాలు హామీలకు వేదికలుగా మారాయి. ప్రచారంపై పదును పెడుతున్న నేతలు హామీలకు వేదికలుగా మారిన సామాజిక మాధ్యమాలు అన్లిమిటెడ్ డేటాను సద్వినియోగం చేసుకుంటున్న నేతలు -
ఫుడ్ కోర్టులో అగ్ని ప్రమాదం
మీర్పేట: షార్ట్ సర్క్యూట్తో ఫుడ్ కోర్టులోని ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్పేటకు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న టెస్టీ ఫుడ్ కోర్టులో గురువారం తెల్లవారుజామున విద్యుత్ మీటర్ల వద్ద ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి. అందులో పనిచేసే ఓ యువకుడు గమనించి మొదట నీళ్లు పోసినా మంటలు అదుపులోకి రాకపోగా కోర్టులోని అన్ని షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఫుడ్ కోర్టులోని ఫర్నిచర్, నిల్వ ఉంచిన బిల్డింగ్ మెటీరియల్, విద్యుత్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయని, సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మీర్పేట ఎస్ఐ నాగభూషణం చెప్పారు. రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం -
రెబల్స్పై చర్యలు తప్పవు
శంకర్పల్లి: కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పార్టీ సమాయత్తమవుతోందని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి స్పష్టంచేశారు. శంకర్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 15మంది అభ్యర్థులతో గురువారం పట్టణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ పామెన భీంభరత్ పాల్గొని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అన్ని వార్డుల్లో గెలిచిరావాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతిఒక్కరికీ పదవులు వస్తాయని, అధైర్య పడాల్సిన అవసరం లేదని నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సమావేశంలో పార్టీ కో ఆర్డినేటర్ బొంతు శ్రీదేవి, శంకర్పల్లి అధ్యక్షుడు ప్రకాశ్గుప్తా, నాయకులు ఉదయ్ మోహన్రెడ్డి, వెంకట్రెడ్డి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనురాధను గెలిపించండి.. మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మహేందర్రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి అనురాధ గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, పార్టీ నుంచి అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మొయినాబాద్లోని చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద గురువారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు స్వామివారిని దర్శించుకుని, పూజలు చేశారు. సాయంత్రం హిమాయత్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలన్నారు. ప్రతీ ఓటరును కలిసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జ్ భీంభరత్, మండల అధ్యక్షుడు మాణయ్య, నాయకులు కంజర్ల భాస్కర్, వెంకట్రెడ్డి, రవీందర్రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ● 15వార్డుల్లో గెలిచి, కాంగ్రెస్ సత్తాచాటాలి ● శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి -
ఠాణాకు బ్యాలెట్ బాక్స్లు
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్స్ బాక్స్లు ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో గురువారం భద్రపరిచారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో ఓటర్ల ఈ బ్యాలెట్ పేపర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీంతో బాక్స్లకు సీల్ వేసి భద్రంగా పోలీస్ కస్టడీలో ఉంచారు. మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, సీఐ మహేందర్రెడ్డి, ఎన్నికల అధికారుల శ్రీనివాస్గౌడ్, లింగం తదితర సిబ్బంది ఉన్నారు. నేటి నుంచి పోస్టల్ ఓట్లు మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగం శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. ఎన్నికల విధుల్లో ఉండి వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి రోజు శుక్రవారం అక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడి నుంచి మార్చి ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 10వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. -
గ్రామీణ ‘పురపాలిక’
మొయినాబాద్: పురపాలిక అంటే ఎటు చూసినా పెద్ద పెద్ద భవనాలు, సిమెంటు రోడ్లు, ఒకదానికొకటి కలిసిపోయిన కాలనీలు, వ్యాపార సముదాయాల సమూహమని అందరూ అనుకుంటారు. నిజమే పురపాలికలు అంటే అలాగే ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఏడాది క్రితం కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ మున్సిపాలిటీ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పురపాలికగా ఏర్పడినా ఇంకా ఇక్కడ గ్రామీణ వాతావరణమే కనిపిస్తోంది. హైదరాబాద్ మహానగరానికి అతి చేరువలో ఉండి గ్రామీణ వాతావరణంలో కొనసాగుతున్న మొయినాబాద్ పురపాలికపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 111 జీవో అమలు మొయినాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చని ప్రశాంతమైన వాతావరణం. దీనికి ప్రధాన కారణం ఈ ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియాలో ఉండటం. జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్(గండిపేట), హిమాయత్సాగర్ల మధ్యలో మొయినాబాద్ మున్సిపాలిటీ ఉంది. జలాశయాల ఎగువ ప్రాంతంలో పది కిలోమీటర్ల దూరం వరకు 111 జీవో అమలులో ఉండటంతో ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటు నిషేధం. అందుకే ఈ ప్రాంతం నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కాంక్రీట్ జంగల్గా మారలేదు. ఏడాది క్రితం మున్సిపాలిటీ ఏర్పాటు ఏడాది క్రితం కొత్తగా మొయినాబాద్ మున్సిపాలిటీ ఏర్పడింది. మండలంలోని తొమ్మిది గ్రామ పంచాయతీలు(మొయినాబాద్, పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, హిమాయత్నగర్, అజీజ్నగర్, ఎనికేపల్లి, ముర్తూజగూడ, సురంగల్)లను విలీనం చేసి మొయినాబాద్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. దీని విస్తీర్ణం 74.56 చదరపు కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీ జనాభా 27,653 మంది. మండలంలో 10,017 ఎకరాల సాగుభూమి ఉండగా 8,009 మంది రైతులు ఉన్నాట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ తిరుపతిగా ప్రాచుర్యం పొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం ఈ మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది. తొమ్మిది గ్రామాలు విలీనం మున్సిపాలిటీగా ఏర్పడినా ఇప్పటికీ గ్రామీణ వాతావరణంలోనే ఉంది. విలీనమైన 9 పంచాయతీలతోపాటు రెండు అనుబంధ గ్రామాలు అమీర్గూడ, చిన్నషాపూర్ దూర దూరంగానే ఉన్నాయి. మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంతో ఏ ఒక్క గ్రామం పూర్తిగా కలవలేదు. మొయినాబాద్ నుంచి పెద్దమంగళారానికి ఒక కిలోమీటర్, చిలుకూరు రెండు కిలోమీటర్లు, అప్పోజీగూడ నాలుగు కిలోమీటర్లు, హిమాయత్నగర్ మూడు, అజీజ్నగర్ ఐదు, ఎనికేపల్లి నాలుగు, ముర్తూజగూడ రెండు, సురంగల్ మూడు, అమీర్గూడ ఒక, చిన్నషాపూర్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మున్సిపాలిటీలోని గ్రామాలన్నీ దూరం దూరంగానే ఉండటంతో అన్ని వేర్వేరు గ్రామాలుగానే కనిపిస్తాయి. ఫాంహౌస్లు అధికం విలీనమైన అన్ని గ్రామాల్లో వ్యవసాయం కొనసాగుతోంది. యాభై శాతం మంది ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అధికంగా పూలు, కూరగాయాలు, ఆకు కూరలు, వరి తదితర పంటలు సాగు చేస్తున్నారు. గ్రామాల్లో పచ్చని పంటపొలాలు, పూలతోటలు కనువిందు చేస్తుంటాయి. ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు, ఫాంహౌస్లు అధికంగానే ఉన్నాయి. కొన్ని ఫాంహౌస్లు విందులు, వేడుకలకు వేదికలుగా నిలుస్తుంటే.. వ్యవసాయ క్షేత్రాల్లో మాత్రం పండ్లతోటలు దర్శనమిస్తాయి. పన్నులు పెరిగాయి మున్సిపాలిటీ చేయడంతో ఎవరికి లాభమో తెలియదుగాని.. మేము మాత్రం వ్యవసాయమే చేసుకొని బతుకుతున్నాం. మాకు పన్నుల భారం పెరిగింది. గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ఏ పనికై నా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది. పంచాయతీ ఉంటే అన్ని పనులు గ్రామంలోనే చేసుకునేవాళ్లం. – పెద్దింటి స్రవంతి, పెద్దమంగళారం ప్రయోజనం లేదు మొయినాబాద్ ప్రాంతం పూర్తిగా పట్టణీకరణ జరగలేదు. ఇంకా గ్రామీణ వాతావరణంలోనే ఉంది. మున్సిపాలిటీలో విలీనం చేసిన గ్రామాలన్నీ దూరంగానే ఉన్నాయి. గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేయడంతో పెద్ద ప్రయోజనం ఏమి లేదు. ఇంకో పదేళ్ల వరకు గ్రామ పంచాయతీలుగానే ఉంచి ఆ తరువాత మున్సిపాలిటీ చేస్తే బాగుండేది. – కమ్మరి శ్రీనివాస్చారి, సురంగల్ వ్యవసాయమే ఆధారం మున్సిపాలిటీ ఏర్పాటుతో ప్రజలకేమీ లాభంలేదు. కొందరు ప్రజాప్రతినిధు లు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మొయినాబాద్ను మున్సిపాలిటీగా మార్చా రు. హైదరాబాద్–బీజాపూర్ రహదారికి ఆనుకుని ఉన్న అజీజ్నగర్, హిమాయత్నగర్ గ్రామాల్లో మాత్రమే వ్యాపార సముదాయాలున్నాయి. మిగతా గ్రామాల్లో వ్యవసాయమే ఆధారం. – ఎల్గని స్వామి, సురంగల్ మొయినాబాద్లో నేటికీకొనసాగుతున్న వ్యవసాయం నగరానికి అతిచేరువలో ఉన్నా పల్లె వాతావరణమే గ్రామాలు దూరంగా ఉండడంతో కనిపించని పట్టణ జాడ -
ఒడిశా కార్మికులకు విముక్తి
ఇబ్రహీంపట్నం రూరల్: ‘పగలు, రాత్రి తేడా లేకుండా పని చేయించుకుంటూ శ్రమ దోపిడీ చేస్తున్నారు. వీరి ఒత్తిడితో తెలంగాణలో ఉండలేకపోతున్నాం మాకు విముక్తి కల్పించండి’అని ఒడిశా కూలీలు వేడుకున్నారు. ఒడిశాకు చెందిన 14మంది కార్మికులు కుటుంబాలతో కలిసి ఆదిబట్ల సమీపంలో మమ్మరాజిగూడలోని పీవీసీ ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారని, రాత్రి 12 గంటల వరకు పనిచేసినా, పొద్దున మూడు గంటలకే నిద్రలేపి నరకం చూపుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని ఒడిశా చెందిన వారికి చెప్పుకోవడంతో పాటు తెలంగాణ డీజీపీ, సీఐడీ, జిల్లా కలెక్టర్, పోలీస్, జాతీయ మానవ హక్కుల సంఘం, ఒడిశా ప్రభుత్వాలకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు, ప్రభుత్వం.. నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్ నారాయణరెడ్డికి ఆదేశాలు అందాయి. దీంతో అక్కడికి వెళ్లిన అధికారులు కార్మికుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని ఆదిబట్ల పీఎస్కు తరలించారు. అనంతరం వారి స్వస్థలాలకు పంపించారు. ఎక్స్లో పోస్ట్కు స్పందించిన ఉన్నతాధికారులు -
హక్కులు కల్పించండి
యాచారం: నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూములపై హక్కులు కల్పించి పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయాలని కౌలు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో కౌలు రైతులు యాచారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఓంకారేశ్వరాలయ భూములను టీజీఐఐసీకి తీసుకోవడాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా సాగులో ఉన్నాం.. 37 ఏ సర్టిఫికెట్లు సైతం ఉన్నాయని కౌలు రైతులు తెలిపారు. 38ఈ సర్టిఫికెట్లు ఇచ్చి పట్టాదారు, పాసుపుస్తకాలు ఇవ్వకుండా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని యాచారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య, నస్దిక్సింగారం సర్పంచ్ బోడ కృష్ణ, కౌలు రైతులు పాల్గొన్నారు. ● ఓంకారేశ్వరాలయ భూములకు పాసుపుస్తకాలు ఇవ్వాలి ● తహసీల్దార్ కార్యాలయం ఎదుట కౌలు రైతుల ధర్నా -
రెండేళ్లలో చేసింది శూన్యం
చేవెళ్ల: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరింగిందేమీ లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఊరెళ్ల, మొండివాగు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ అభ్యర్థులు దూత మల్లేశ్, సువర్ణచందుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు పదేళ్ల కేసీఆర్ మళ్లీరావాలని కోరుకుంటున్నారన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెకెక్కిన కాంగ్రెస్కు ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
గెలుపే ప్రధానం!
● మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ● అభ్యర్థుల గెలుపు కోసం రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, ఎంపీలుమున్సిపల్ ఎన్నికల సమరంలో మూడు పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మెజార్టీ వార్డులు సహా చైర్మన్ పీఠాలను ఎట్టిపరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దని భావిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి వారి మద్దతు కూడగట్టే పనిలో అధికార కాంగ్రెస్ నిమగ్నం కాగా, ప్రభుత్వ వైఫల్యాలను, నిలిచిపోయిన సంక్షేమ పథకాలను, జరిగిన నష్టాలను ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారాస్త్రాలుగా వినియోగిస్తున్నాయి. దాదాపు అన్ని వార్డుల్లోనూ ముక్కోణపు పోటీ నెలకొని ఉండడంతో ఆ మేరకు ఆయా పార్టీలు అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. మున్సిపల్ పీఠాలపై హస్తం గురి అధికార కాంగ్రెస్ ఆరు మున్సిపల్ పీఠాలపై గురి పెట్టింది. 126 స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించింది. పరిగి కేంద్రంగా ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ సభను ఏర్పాటు చేసి, అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మొయినాబాద్లో సన్నాహాక సమావేశం నిర్వహించారు. బహిరంగ సభ విజయవంతం సహా అభ్యర్థుల గెలుపు కోసం అంతా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠం జనరల్కు రిజర్వ్ కాగా, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ ఎన్నికను ప్రతిషాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపిక, బీ ఫాంల జారీలోనూ ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. షాద్నగర్ మున్సిపల్ పీఠం బీసీకి రిజర్వ్ అయింది. మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని, మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగరేసి షాద్నగర్ గడ్డపై తనకు తిరుగులేదని నిరూపించాలని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భావిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే ఇక్కడ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి కొంత నష్టం చేకూర్చిపెట్టే అవకాశం లేకపోలేదు. చేవెళ్లలో చేతులు కలిసేనా..? చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, శంకర్పల్లి జనరల్ కేటగిరికి రిజర్వ్ కాగా, మొయినాబాద్ ఎస్సీ జనరల్కు రిజర్వు అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు మున్సిపల్ స్థానాల్లోనూ పార్టీ జెండాను ఎగరేసి తీరాలని అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్ఎస్లో గెలుపొంది, ఆ తర్వాత అధికార కాంగ్రెస్లో చేరారు. పార్టీ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన భీంభరత్ వర్గం ఆయన చేరికను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ రెండు వర్గాలుగా చీలిపోయి ఉప్పు నిప్పులా చిటపటలాడుతోంది. కొన్ని వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ గందరగోళం తలెత్తింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి రంగంలోకి దిగి ఇరు వర్గాలను సముదాయించినప్పటికీ.. అంతర్గత విబేదాలు పూర్తిగా సమిసి పోలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అభ్యర్థుల గెలుపు కోసం ఇక్కడి పార్టీ కేడర్ చేతులు కలిపి పని చేస్తుందా? అంటే అనుమానమే. ఆరు మున్సిపాలిటీల పరిధిలో బీఆర్ఎస్ 122 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ మంత్రి సబితారెడ్డి ప్రచారం చేస్తుండగా, ఇబ్రహీంపట్నంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై నప్పటికీ.. ఆయన పట్నం గడప దాటలేదు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి సబితారెడ్డి బుధవారం చేవెళ్లలోని ఒకటి, రెండు వార్డుల్లో ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కల్వకుర్తిలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రజనీసాయిచంద్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తుండగా, షాద్నగర్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య ప్రచారం చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకుని పార్టీ పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున మొత్తం 109 మంది బరిలో నిలిచారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో ఆ పార్టీ జాతీయ నాయకుడు ఆచారి అన్నీ తానై వ్యవహరిస్తుండగా, చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్ మున్సిపాలిటీల్లో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం ఆయన చేవెళ్లలోని ఐదు, ఆరు, ఏడు వార్డుల్లో ప్రచారం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత భారత్ లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా నిలువాల్సిన జిల్లా అధ్యక్షుడు క్షేత్రస్థాయిలో పెద్దగా కనిపించడం లేదు. దీంతో గెలుపు కోసం అభ్యర్థులే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది. -
పారిశుద్ధ్యం.. ప్రజలకు దూరం
● మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు ● రోడ్లపైనే పారుతున్న మురుగునీరు ● పట్టించుకోని అధికార యంత్రాంగం చేవెళ్ల: మున్సిపాలిటీల్లో అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించడం లేదు. చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రానికి వార్డులకు దూరం ఎక్కువగా ఉండటంతో కార్మికులు విడతల వారీగా వస్తున్నారు. దీంతో పలు వార్డుల్లో శుభ్రత కనిపిస్తే.. మరికొన్ని వార్డుల్లో అపరిశుభ్రతలు దర్శనమిస్తున్నాయి. కొత్త మున్సిపాలిటీ కావటంతో ప్రజలకు సైతం అవగాహన లేకపోవటంతో ఎవరిని అడగాలో తెలియటం లేదు. వీధి దీపాలు సైతం వెలగడం లేదు. వేసినప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా వెలుగుతున్నాయని, ఆగిపోతే మాత్రం పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. ఇళ్ల పక్కన ఉండే ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారాలు పేరుకుపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. వెలగని వీధి దీపాలు శంకర్పల్లి: మున్సిపాలిటీలోని శంకర్పల్లి చౌరస్తా నుంచి బుల్కాపూర్ వరకు ఉన్న నాలుగు వరుసల రహదారికి వీధి దీపాలను ఏర్పాటు చేయగా.. అవి అంతంత మాత్రంగానే వెలుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే పురవాసులు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిధులు, విద్యుత్ శాఖ నుంచి సహకారం లేకపోవడంతో ఆ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. మున్సిపాలిటీలో నిత్యం 12 నుంచి 14 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దీనిని తరలించేందుకు ట్రాక్టర్లు, ఆటోలు వినియోగించి డంపింగ్కి తరలిస్తున్నారు. అయితే డంపింగ్ యార్డు నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అక్కడ ఆకతాయిలు చెత్తకు నిప్పు పెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి, చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతుంది. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. పట్టించుకునేవారు లేరు మండల కేంద్రానికి దూరంగా ఉన్న మా గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపి అన్యాయం చేశారు. ఏ సమస్య వచ్చినా మున్సిపల్ కేంద్రంలో ఫిర్యాదు చేయాలంటున్నారు. పంచాయతీ అయితే అందుబాటులోనే ఉండేది. డ్రైనేజీలు సక్రమంగా లేక రోడ్లపైనే మురుగు పారుతోంది. వీధీ లైట్లు సక్రమంగా వెలగటం లేదు. రాత్రిళ్లు ఇబ్బంది పడుతున్నాం. – విఠల్, మొండివాగు వార్డు, చేవెళ్ల -
‘ఫ్యూచర్’తో గుర్తింపు
● ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక ● వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి స్థల పరిశీలన ● స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలని నిర్వాసితులకు సూచన యాచారం: ఫ్యూచర్సిటీ నిర్మాణంతో ప్రపంచస్థాయి గుర్తింపు తథ్యమని ఎఫ్సీడీఏ(ప్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ) కమిషనర్ శశాంక అన్నారు. బుధవారం ఆయన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి, తక్కళ్లపల్లి సర్పంచ్ మారెడ్పల్లి నరేందర్రెడ్డి, టీజీఐఐసీ, రెవెన్యూ, రోడ్డు భవనాల శాఖల ఉన్నతాధికారుల బృందంతో కలిసి సాగర్ హైవే తక్కళ్లపల్లి గేట్ నుంచి నక్కర్తమేడిపల్లి శివారు హెచ్జీపీసీ (హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ) లే అవుట్ వరకు చేపట్టే వంద అడుగుల రోడ్డు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. 5.9 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మార్గంలో పది మంది రైతులకు చెందిన వ్యవసాయ భూమి ఉండగా మిగిలినది ప్రైవేట్ వ్యాపారులకు చెందిన వెంచర్ భూమి కోల్పోనున్నట్లు గుర్తించారు. సర్పంచ్ నరేందర్రెడ్డి రోడ్డు మార్గంలో కోల్పోయే తన వ్యవసాయ భూమిని ఇవ్వనున్నట్లు కమిషనర్కు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన్ను అభినందించారు. వంద అడుగుల రోడ్డు మార్గం కమర్షియల్ కేంద్రంగా మారబోతుందని.. ఈ ప్రాంతంలో వ్యాపారాభివృద్ధికి ఆసక్తి చూపే వారికి పన్నుల చెల్లింపు, వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు మినాహాయింపు ఇస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వాలని కోరారు. అధికారుల వెంట యాచారం తహసీల్దార్ అయ్యప్ప తదితరులు ఉన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
షాద్నగర్రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని డీసీపీ శిరీష హెచ్చరించారు. బుధవారం ఆమె మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫరూఖ్నగర్ ఉన్నత పాఠశాల, గౌతమి పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన వసతులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు, ప్రలోభాలకు గురి కాకుండా నిస్వార్థంగా ఓటు వేయాలని అన్నారు. పోలింగ్ సక్రమంగా నిర్వహించేందుకు ప్రజలు తమవంతు సహాయ సహకారాలను అందించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలవద్ద అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీసీపీ కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్సిటీ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్కు డీసీపీగా శిరీషను నియమించారు. పట్టణంలో డీసీపీ కార్యాలయ భవనం లేక ప్రస్తుతం ఏసీపీ కార్యాలయంలోనే కొనసాగుతోంది. డీసీపీ కార్యాలయం కోసం పట్టణ సమీపంలోని మిలీనియం టౌన్షిప్ కాలనీలో తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. డీసీపీ కార్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి పట్టణంలోని ఆర్అండ్బీ ప్రభుత్వ అతిథిగృహం ఆవరణలో డీసీపీ శిరీష స్థల పరిశీలన చేశారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఆమె వెల్లడించారు. స్థల పరిశీలనలో తహసీల్దార్ నాగయ్య, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్కుమార్ ఉన్నారు. డీసీపీ శిరీష -
గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి
మొయినాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా పనిచేయాలని శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం మొయి నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్న విషయాలను ఇంటింటికి ప్రచారం చేయాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పకొట్టాలన్నారు. ఈ నెల 7న పరిగిలో జరిగే సీఎం సభను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్, అధికార ప్రతినిధి గౌరి సతీష్, పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, నాయకులు వెంకట్రెడ్డి, భాస్కర్, రవీందర్రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి -
అశ్లీల పదజాలంతో ఇన్స్టాలో పోస్ట్
● పోలీసులను ఆశ్రయించిన సినీనటి ఇషారెబ్బ ● నిందితుడిపై కేసు నమోదు బంజారాహిల్స్: తన ఇన్స్ట్రాగామ్ పోస్టులపై అసభ్యకరమైన కామెంట్స్ పెట్టాడని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సినీనటి ఇషారెబ్బ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇటీవల ఇషారెబ్బ తన ఇన్స్టాలో ఓ ప్రముఖ దర్శకుడి డైరెక్షన్లో పని చేయాలని ఉందని పోస్ట్ చేశారు. రీల్ మాయ అనే అకౌంట్తో ఉన్న వ్యక్తి ఇన్స్టాలో ఆమె ప్రతిష్టను దెబ్బతీసేలా అసభ్యకర పోస్టులు పెట్టాడు. ఒక సినిమా ప్రచార కార్యక్రమం సందర్భంగా సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇషారెబ్బ ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోద చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
సంక్షేమానికి కేరాఫ్.. కాంగ్రెస్
● ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో ఆమనగల్లుకు మహర్దశ ● రాష్ట్ర పశుసంవర్ధక, కీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆమనగల్లు: సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర పశుసంవర్ధక, కీడాశాఖమాత్యులు వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం ఆయన కాంగ్రెస్ అభ్యర్థులు గుర్రం కేశవులు, కృష్ణనాయక్, వస్పుల మానయ్యకు మద్దతుగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్గౌడ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. పేదలకు సొంతింటి కళ నెరవేర్చామన్నారు. పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం, వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీతో ఆమనగల్లు ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంతుందని చెప్పారు. ఆమనగల్లు అభివృద్ధికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాడన్నారు. ఆమనగల్లులోని 15 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ అనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్, ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రవికాంత్గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు భిక్షపతి, జవహర్లాల్నాయక్, నాయకులు హన్మానాయక్, గుజ్జల మహేశ్, కొండల్రెడ్డి, బొజ్జ సాయిరెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బరిలో భార్యాభర్తలు
షాద్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో భార్యాభర్తలు ఒకే పార్టీ నుంచి వేర్వేరు వార్డుల్లో పోటీ చేస్తున్నారు. పట్టణంలోని 28వ వార్డు గాంధీనగర్ కాలనీ బీసీ మహిళకు రిజర్వు అయింది. దీంతో ఆ వార్డులో చేగూరి లక్ష్మీ ప్రసన్న, 9వ వార్డు బీసీ జనరల్కు కేటాయించగా.. ఆమె భర్త వేణుగోపాల్ బరిలో నిలిచారు. దంపతులు బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంలు దక్కించుకొని ఎన్నికల ప్రచారంలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఒక్క ఎంట్రీతో ఓటర్ల వివరాలు షాద్నగర్: బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ టికెట్లు ఇచ్చే మిషన్ చూశారా.. కరెంటు బిల్లు చేతికి ఇచ్చేటప్పుడు విద్యుత్ సిబ్బంది చేతిలో మిషన్ చూశారా.. అలాంటి ఒక చిన్న మిషన్ ఇప్పుడు ఎన్నికల వేళ అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేకంగా ఒక యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఓటరు మొబైల్ నంబర్ను అందులో ఎంట్రీ చేస్తే చాలు మన కుటుంబంలో ఓట్ల వివరాలు.. ఏ పోలింగ్ స్టేషన్లో మన ఓట్లు ఉన్నాయనే వివరాలు సమస్తం తెలుస్తాయి. ఫోన్ ద్వారా చిన్న యంత్రం సహాయంతో అప్పటికప్పుడే అభ్యర్థులు ఓటర్లకు పోల్ చిట్టీ లాంటి పేపర్ను ప్రింటింగ్ చేసి ఇస్తున్నారు. ఇది చూసి జనం దీన్ని మిషన్ పురపాలికగా అభివర్ణిస్తున్నారు. ఈ యంత్రాలు షాద్నగర్ మున్సిపాలిటీలో విరివిగా అందుబాటులో ఉన్నాయి. -
కన్నతల్లి చూస్తుండగానే చెల్లిని చంపిన అన్న
మొయినాబాద్ రూరల్: భూ పంపకం విషయంలో అన్నాచెల్లి మధ్య నెలకొన్న మనస్పర్థలు.. చెల్లి హత్యకు కారణమయ్యాయి. రక్తం పంచుకుపుట్టిన సొంతచెల్లిని అన్న దారుణంగా చంపేశాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిధిలోని కేతిరెడ్డిపల్లిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సత్తయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మల్లమ్మకు సంతానం లేకపోవడంతో వెంకటమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు కొడుకు రాజు, కూతుళ్లు సరస్వతి, స్వప్న ఉన్నారు. సరస్వతికి వివాహం కాగా, స్వప్న (34) న్యాయవాదిగా కొనసాగుతున్నారు. నెల రోజుల్లో ఆమె వివాహం జరగనుంది. వెంకటమ్మకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఆరెకరాలు రాజుకు, నాలుగెకరాలు స్వప్నకు ఇవ్వాలంటూ గతంలోనే తీర్మానం చేసుకున్నారు. దీంతో ప్రైవేటు ఓ సర్వేయర్ను రప్పించిన స్వప్న బుధవారం ఉదయం 9 గంటలకు తల్లి వెంకటమ్మతో కలిసి భూమి కొలుస్తున్నారు. అక్కడే ఉన్న రాజు, మరో వ్యక్తితో కలిసి వచ్చి చెల్లి తలపై రాయితో కొట్టాడు. కన్నతల్లి చూస్తుండగానే కత్తితో గొంతుకోసి ఇద్దరూ పరారయ్యారు. చుట్టు పక్కల వారి సాయంతో స్వప్నను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. నిందితుడు రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.న్యాయవాదుల ఆందోళనజూనియర్ న్యాయవాది స్వప్న హత్యకు గురైందనే విషయం తెలుసుకున్న పలువురు న్యాయవాదులు వివరాలు తెలుసుకునేందుకు మొయినాబాద్ పీఎస్కు వెళ్లారు. ఈ సమయంలో పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై వారు ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ జామ్ కావడంతో డీసీపీ యోగేశ్ గౌతమ్ న్యాయవాదులతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీసీపీకి వినతిపత్రం అందజేశారు. -
రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలు
మూసాపేట: మార్కెట్లు, మాల్స్, జాతర వంటి రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న ముగ్గురు మహిళలు కూకట్పల్లి పోలీసులకు చిక్కారు. ఎస్హెచ్ఓ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట, ప్రగతినగర్కు చెందిన లోపెట్టి నాగమణి గత నెల 13 వ తేదీ రాత్రి స్థానిక మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తుండగా గుర్తు తెలియనివ్యక్తులు ఆమె హ్యాండ్బ్యాగ్ను అపహరించారు. అందులో రూ. 40 వేలు ఉన్నట్లు బాధితురాలు జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూకట్పల్లి వై జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫతేనగర్, సనత్నగర్కు చెందిన బండారి శాలిని(34), గంబు మహేశ్వరి (43), ఉప్పు సరిత(38)లను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మత్తుకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వారు విచారణలో అంగీకరించారు. 1,500 నగదును స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించారు. అప్పటికే శాలినిపై 7, మహేశ్వరిపై 2, సరితపై 2 కేసులు నమోదై ఉన్నాయి. ముగ్గురు మహిళల అరెస్టు -
షాద్నగారా మోగేదెవరిదో
షాద్నగర్: పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. పుర బరిలో ఎవరు నిలిచారన్నది ఖరారైంది. అభ్యర్థులకు గుర్తులు సైతం కేటాయించడంతో, గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు గెలిచేదెవరో వేచి చూడాల్సిందే. ఆరు రోజులు కీలకం పురపాలిక ఎన్నికలు ఈనెల 11న జరగనున్నాయి. నిబంధనల ప్రకారం ఈనెల 9న సాయంత్రం ఐదుగంటలకు ప్రచారం ముగించాలి. ఈలెక్క మరో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అభ్యర్థులందరూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కేండెట్లు.. 1 వార్డు మహ్మద్ ఇర్ఫాన్, 2– బచ్చలి నరేష్, 3– ఆలోనిపల్లి రాజుగౌడ్, 4– చేగూరి పుష్పమ్మ, 5– సింగపాగ శిరీష, 6– రాజునాయక్, 7– కొప్పునూరి ప్రవీణ్, 8– జయప్రకాశ్గౌడ్, 9– గోద మాధవులు, 10– నడికూడ శ్రావణి, 11– గుడిపల్లి వినోద, 12– కలంకార్ దిలీప్, 13– రిజ్వాన్ బేగం, 14– అందెమోహన్, 15– మరియా బేగం, 16– వన్నాడ లావణ్య, 17– నాజియా బేగం, 18– సంతోషిబాయి, 19– ఆఫ్రీన్ బేగం, 20– డాకన్నగారి మనీష్, 21– నాగమణి, 22– దిద్యాల శోభ, 23– అగ్గునూరు బస్వం, 24– అగ్గునూరు విశాల, 25– పెంటయ్య, 26– జామ మంజుల, 27వ వార్డు మురళీమోహన్, 28వ వార్డు కాటం భాగ్యలక్ష్మి, బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే 1వ వార్డు గౌస్ జానీ, 2– చెట్ల నర్సింహ్మ, 3–నందారం అశోక్, 4– పాండురంగారెడ్డి, 5– అశ్విన్, 6– రాజేందర్సింగ్, 7– ఈశ్వర్ రాజు, 8– భిక్షపతి, 9– చేగూరి వేణుగోపాల్, 10– చెర్క అఖిల, 11– పిల్లి శారద, 12– ఎంఎస్ నట్రాజన్, 13– కొండ లక్ష్మి, 14– బచ్చలి నర్సింహ్మ, 15 కొందూటి మహేశ్వరి, 16– ఒగ్గు జయలక్ష్మి, 17– గౌసియా బేగం, 18– ప్రేమలత, 19– అల్ఫాబేగం, 20– పినమోని గోపాల్, 21– జీటీ వసంత, 22– నడికూడ అనిత, 23– ఈగ వెంకట్రాంరెడ్డి, 24– జయంతి, 25– నక్కల వెంకటేశ్, 26– ఎస్పీ శివ, 27– జూపల్లి శంకర్, 28వ వార్డు చేగూరి లక్ష్మీప్రసన్న. నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తి పార్టీ బీఫాంలు అందజేసిన అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రచారానికి మిగిలింది ఆరు రోజులే వ్యూహాలకు పదును పెడుతున్న నేతలు -
నిత్యం మూడు లక్షల లీటర్ల కొరత
శంకర్పల్లి: మున్సిపాలిటీలో తాగు నీటి సరఫరాకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీ 28 లక్షల లీటర్ల మంచినీరు అవసరం కాగా.. బయట నుంచి ప్రస్తుతం కేవలం 25లక్షల లీటర్ల నీరు మాత్రమే వస్తుంది. మిగిలిన మూడు లక్షల లీటర్లను బోర్లు, ట్యాంకర్ల ద్వారా భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా అమృత్ 2.0లో భాగంగా మున్సిపాలిటీకి ఆరు మంచినీటి ట్యాంకులు మంజూరయ్యాయి. అవి నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తయిన తర్వాత శంకర్పల్లి మున్సిపాలిటీకి నీటి కష్టాలు తగ్గే అవకాశం ఉంది. -
బీఫాంలపై వీడిన ఉత్కంఠ
కాంగ్రెస్ నుంచి 13వ వార్డు అభ్యర్థి రాముగౌడ్ చేవెళ్ల: అధికార పార్టీలో బీ ఫారాల పంచాయితీ కుంపటి రాజేసింది. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు రసవత్తరంగా మారింది. మున్సిపాలిటీలోని 13 వార్డులో ఆ పార్టీ ఒక్కరికి ముందుగా బీ ఫాం ఇస్తే, దాన్ని రద్దు చేస్తూ మరొకరు టికెట్ తెచ్చుకున్నారు. ఆ వార్డులో కాంగ్రెస్కు చెందిన అభ్యర్థులు కాసుల రమేశ్గౌడ్, కాసుల రాముగౌడ్ పోటీ పడ్డారు. టికెట్ నాకంటే నాకే వస్తుందనే ధీమాతో నామినేషన్లు వేశారు. పార్టీ పెద్దలు నచ్చజెప్పినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. చివరకు సోమవారం పార్టీ అధిష్టానం రమేశ్గౌడ్కు బీ ఫాం ఇచ్చింది. దీంతో మరో అభ్యర్థి రాముగౌడ్ కన్నీరు పెట్టుకుంటూ ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్తో చర్చించారు. రాముగౌడ్ రెబల్గా పోటీ చేస్తే పార్టీకి భారీగా నష్టం జరుగుతదని భావించినా నాయకులు మొదట ఇచ్చిన బీ ఫారంను రద్దు చేశారు. మంగళవారం రాముగౌడ్ కాంగ్రెస్ పార్టీ బీ ఫాంతో ఎన్నికల అధికారులకు సమర్పించారు. కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్నగర్: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అన్ని వార్డుల్లో పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేశామని, షాద్నగర్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో పార్టీ అభ్యర్థులకు ఆయన బీఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల పాలనలో తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, క్షణం విరామం లేకుండా పనిచేస్తూ పట్టణాభివృద్ధికి ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు మంజూరు చేయించినట్లు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు పట్టణంలో రెండేళ్ల కాలంలో తాము చేసిన పనులను చూపిస్తూ గౌరవంగా ఓట్లు అడగాలన్నారు. ఎన్నికల్లో ఎవరి సిఫారసు లేకుండా పాదర్శకంగా సర్వేల ఆధారంగా వార్డుల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. టికెట్లు ఆశించి భంగపడిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రజలంతా కాంగ్రెస్వైపే ఉన్నారని, షాద్నగర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్ల కాలంలో పట్టణం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేయిస్తున్నారన్నారు. సమావేశంలో నాయకులు శ్యాంసుందర్రెడ్డి, బాబర్ఖాన్, విశ్వం, బస్వం, వన్నాడ ప్రకాష్గౌడ్, రఘునాయక్, తిరుపతిరెడ్డి, దామోదర్రెడ్డి, దంగు శ్రీనివాస్ యాదవ్, విశాల తదితరులు పాల్గొన్నారు. -
హస్తంలో రెబెల్స్.. గుబుల్
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ పోరులో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. బరిలో ఉండే అభ్యర్థుల లెక్క తేలింది. ఆయా పార్టీల బీఫాంలను అందజేయడంతో టికెట్లు దక్కని ఆశావహులు నిరసన గళం వినిస్తున్నారు. ఇన్ని రోజులు పార్టీని నమ్ముకున్న తమకు మొండి చేయే చూపించారని అధికార పార్టీకి చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఏకంగా పార్టీలు మారుతున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ నుంచి 6వ వార్డు టికెట్ను ఆశించి జలమోని రవీందర్ భంగపడ్డారు. పార్టీ బీ ఫాం ఇతరులకు ఇవ్వడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్కు చెందిన జమాల్పూర్ శ్యాం కొన్నేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా 1వ వార్డు టికెట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. వీరిద్దరూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 3, 14 వార్డుల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్గా వీరు పోటీ చేస్తున్నారు. పలువురు కాంగ్రెస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే కిషన్రెడి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఏదిఏమైనా అధికార పార్టీకి రెబల్స్ బెడద తప్పడం లేదు. -
ఫ్యూచర్ సిటీకి ‘అసైన్డ్’
యాచారం: ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఫ్యూచర్సిటీకి తీసుకోవడం కోసం అధికారయంత్రాంగం రంగం సిద్ధం చేసింది. మండల పరిధిలోని కొత్తపల్లిలో టీజీఐఐసీ పర్యవేక్షణలో 2,200 ఎకరాలు సేకరించి ఫ్యూచర్సిటీకి అప్పగించేలా కార్యాచరణకు దిగింది. ఇందులో భాగంగా పక్షం రోజులుగా గ్రామంలోని 32,178,182,222,242,317 సర్వే నంబర్లలో ప్రభుత్వ, అసైన్డ్ భూమిని సర్వే చేసింది. రైతుల ఆందోళన అధికారులు సేకరించాలనుకున్న భూమిలో 600 నుంచి 700 ఎకరాలకు పైగా సాగుకు అనువుగా ఉంది. దాదాపు 200 మందికి వరకు పేద రైతులు సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే భూ పంపిణీ పథకం కింద గ్రామంలోని అర్హులైన పేద రైతులకు అసైన్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇందిరజలప్రభ, ఉపాధి హామీ పథకం కింద పంపిణీ చేసిన భూముల్లో రూ.లక్షలాధి నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. బోరుబావులు తవ్వించడం, కూరగాయల, పండ్లతోటల పెంపకం కోసం రైతులు రుణాలు కూడా పొందారు. పాడిపశువులు, గొర్రెల, మేకల పెంపకం కోసం రుణాలు తీసుకుని షెడ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం అవే భూములను సర్కార్ తీసుకుంటుండడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిహారం ఇచ్చేది తేల్చకుండానే భూసేకరణ ప్రక్రియ చేపట్టడంపై మండిపడుతున్నారు. సర్వే చేయడం, హద్దురాళ్లు పాతడం వంటి పనులు చకచకా చేస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. పరిహారం తేల్చకుండానే పనులా.. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో గుంతలు తీసి టీజీఐఐసీ బోర్డులు పాతడానికి మంగళవారం రెవెన్యూ సిబ్బంది యత్నించడంతో గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. పరిహారం ఇవ్వకుండా ఏ విధంగా బోర్డులు పాతుతారని నిలదీశారు. సమాచారం అందుకున్న సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధు సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. ఆందోళనకారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినిపించుకోలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీజీఐఐసీ బోర్డులు, ఇతక బాక్స్లను పంచాయతీ కార్యాలయానికి తరలించారు. భూముల సేకరణకు కసరత్తు ఇప్పటికే సర్వే చేసిన అధికారులు సాగులో ఉన్న రైతుల ఆందోళన పరిహారం తేల్చకుండా పనులపై ఆగ్రహం తాజాగా అధికారులను అడ్డుకున్న వైనం గ్రామంలోని భూములను దేని కోసం తీసుకుంటున్నారు.. సేకరించే భూములకు పరిహారం ఎంత చెల్లిస్తారు.. అనే విషయమై ఎవరూ ఏమీ చెప్పడం లేదు. పరిహారం తేల్చకుండానే హద్దురాళ్లు పాతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. – కావలి జగన్, మాజీ ఉప సర్పంచ్, కొత్తపల్లి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే పూర్తి చేశాం. హద్దురాళ్లు పాతితే ఆ ప్రక్రియ పూర్తవుతుంది. పరిహారం ఎంత ఇచ్చేది అనే విషయం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. మేం చెప్పలేం. – అయ్యప్ప, తహసీల్దార్, యాచారం -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
కడ్తాల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దుబ్బ చెన్నయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 12న చేపట్టనున్న దేశ వ్యాప్త సమ్మైపె మంగళవారం సీఐటీయూ మండల కన్వీనర్ పెంటయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలు పెట్టుబడిదారి వ్యవస్థకు అనుకూలంగా ఉందన్నారు. కార్మికులు తమ హక్కులు కోల్పోయే విధంగా చట్టాలు రూపొందించారని విమర్శించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని ఎత్తేసి, 12 గంటలు అమల్లోకి తెస్తున్నారని చెప్పారు. ఈ లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అంగన్వాడీ ఆశా, మాధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. దేశవ్యాప్త సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు జహంగీర్, లక్ష్మమ్మ, మహేశ్, రమేశ్, వీరేశ్, కొండల్, జ్ఞానేశ్వరి, వనిత, లావణ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నయ్య -
పురవాసుల గొంతెండుతోంది
పురపాలిక సంఘాల్లో తాగునీటి కష్టాలు ప్రజలను పీడిస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట మిషన్ భగీరథ నీటి పైపులైన్లు పగలడంతో సరిపడా నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నులు కట్టేటప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారులు నీటి సమస్య పరిష్కారానికి మాత్రం చొరవ చూపడం లేదని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నీటి సమస్యపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. మొయినాబాద్: మున్సిపాలిటీలో తాగు నీటి కష్టాలు తీరడంలేదు. మున్సిపల్ కేంద్రంలోని పలు కొత్తకాలనీలతోపాటు కొన్ని గ్రామాల్లో బోర్లు, వాటర్ ట్యాంకులే ఆధారమవుతున్నాయి. మొయినాబాద్లోని భరద్వజ్ కాలనీ, సహార కాలనీ, మహబూబ్కాలనీ, ముస్తాఫాహిల్స్, స్టార్ కాలనీ, విజయనగర్ కాలనీ, శివానగర్ కాలనీ, రాజీవ్ గృహకల్ప కాలనీల్లో మిషన్ భగీరథ నీళ్లు అందడంలేదు. ఆయా కాలనీలకు మిషన్ భగీరథ పైప్లైన్లే వేయలేదు. దీంతో అక్కడి ప్రజలంతా బోర్లు, వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. హిమాయత్నగర్లో నిత్యం మిషన్ భగీరథ పైప్లైన్లు పగులుతుండడంతో నీటి సమస్య తలెత్తుతోంది. వారంలో రెండు మూడుసార్లు స్థానికులు వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పోయించుకుంటున్నారు. సురంగల్, పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, అజీజ్నగర్, ఎనికేపల్లి, ముర్తూజగూడ గ్రామాల్లో సైతం మిషన్ భగీరథ నీళ్లు సరిపోకపోవడంతో బోర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. సరిపడా తాగునీరు రాకపోవడంతో ఇబ్బంది పలుకాలనీలకు అందని మిషన్ భగీరథ నీరు బోర్లు, వాటర్ ట్యాంకులపైనే ఆధారపడుతున్న ప్రజలు పట్టించుకోని అధికార యంత్రాంగం నీళ్లు రావడంలేదు మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడంలేదు. నీళ్లు కొద్దిసేపే వదలడంతో సరిపోవడంలేదు. అవి కూడా రెండు రోజులకోసారి వస్తున్నాయి. నెలలో ఒకటి రెండు సార్లు పైప్లైన్లు పగిలిపోతున్నాయి. కాలనీల్లో బోర్ల ద్వారానే నీళ్లు వాడుకునే పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడంలేదు. – బాలమణి, సురంగల్, మొయినాబాద్ -
గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి
ఇబ్రహీంపట్నం: బీటెక్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శేరిగూడలోని శ్రీదత్త కళాశాలలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న సాయిగణేశ్(22), ఇదే గ్రామంలోని సాయిసూర్య హాస్టల్ ఉంటున్నాడు. కళాశాల నుంచి హాస్టల్ రూమ్కు వచ్చిన విద్యార్థి ఉన్నట్టుండి కిందపడిపోయాడు. గమనించిన రూమ్మేట్స్ 108కు ఫోన్ చేసి, వనస్థలిపురం ఏరియా అస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి స్వగ్రామం సూర్యాపేట కాగా, అతని తల్లిదండ్రులు మీర్పేట్లో నివాసం ఉంటున్నట్లు సీఐ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేశామని వెల్లడించారు. మతిస్థిమితం లేని వ్యక్తిని కుటుంబీకులకు అప్పగింత కడ్తాల్: మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తిని గుర్తించిన కడ్తాల్ పోలీసులు కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించారు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం గుడిబండతండాకు చెందిన బాణవత్ రాంచందర్ ఇటీవల మానసిక పరిస్థితి సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మండల కేంద్రంలో అన్మాస్పల్లి కూడలిలో తిరుగుతున్నాడు. పోలీస్ సిబ్బంది అతన్ని క్షేమంగా పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆయన్ని అప్పగించారు. -
కాంగ్రెస్, బీజేపీలను ఓడించండి
ఆమనగల్లు: మున్సిపాలిటీ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలను ఓడించాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రజనీసాయిచంద్ పిలుపునిచ్చారు. ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని పేర్కొన్నారు. పట్టణంలో మంగళవారం అభ్యర్థులకు బీఫారాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలు కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించి బడా వ్యాపారవేత్తలకు తొత్తుగా మారిందని విమర్శించారు. ఈ ఎన్నికలలో ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్యానాయక్, నాయకులు రాము, నిర్మల, దశరథ్నాయక్, ఎల్ఎన్రెడ్డి, శ్రీనునాయక్, సయ్యద్ ఖలీల్, నిరంజన్గౌడ్, జగదీశ్, ఆంజనేయులు, జగన్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్.. మిక్చర్
శంకర్పల్లి: మున్సిపాలిటీలో మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం 3గంటలలోపు తమ బీ ఫాంలను, ఉపసంహరణ చేసుకునే వాళ్లు సైతం 3గంటల లోపు చేసుకోవాల్సి ఉంది. మున్సిపాలిటీలోని 7వ వార్డు రామంతపూర్కి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండ్లగూడెం శ్రీనివాస్కి ఆఖరి నిమిషాల్లో బీ ఫాం చేతికి అందింది. దీంతో ఆయన చివరి పది నిమిషాల్లో ఎన్నికల కేంద్రంలోకి ఉరుకులు పరుగుల మీద వెళ్లి అధికారికి బీఫాం అందజేశారు. ఈ వార్డుకి సంబంధించి ఇప్పటికే మరో అభ్యర్థికి పార్టీ బీఫాం కేటాయించిందని, చివరి నిమిషంలో మార్పు చేసి శ్రీనివాస్కి ఇవ్వడంతో జాప్యం జరిగినట్లు తెలిసింది. ఆమనగల్లు: మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో మంగళవారం బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాంలు పంపిణీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎన్నికల ఇన్చార్జి రజనీ సాయిచంద్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి వచ్చారు. ఒక్కో వార్డుకు అభ్యర్థులను ప్రకటించి బీఫాంలు అందించారు. 14వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులుగా వస్పుల సాయిలు, వస్పుల సుగుణ నామినేషన్ వేశారు. వస్పుల సాయిలును ప్రకటించి బీఫాం అందిస్తుండగా వస్పుల సుగుణకు చెందిన వర్గీయులు పెద్ద ఎత్తున గొడవ చేశారు. జైపాల్యాదవ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కుర్చీలను ఎత్తి కింద పడేశారు. దీంతో వచ్చిన నేతలు బయటకు వెళ్తుండగా ఓ కార్యకర్త విసిరిన కుర్చీ జైపాల్యాదవ్ కాలికి తగిలింది. అక్కడే ఉన్న కొందరు నాయకులు గొడవకు దిగిన కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. షాద్నగర్: గత మున్సిపల్ ఎన్నికల్లో 23వ వార్డు నుంచి పోటీచేసిన గెలుపొందిన అగ్గునూరు విశాల ఈసారి 24వ వార్డు బరిలో నిలిచారు. 23వ వార్డు జనరల్కు రిజర్వ్ కావడంతో తన చిన్నమామయ్య కొడుకైన అగ్గునూరు బస్వం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలో తాను 24వ వార్డులో తలపడేందుకు సిద్ధమైన ఆమె, 23వ వార్డు బీఫామ్ను మరిదికి ఇప్పించారు. -
దంగల్
బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026మున్సిపల్.. పుర బరిలో ‘కీ’లక సమరం మొదలుకానుంది.. నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియకు మంగళవారంతో తెరపడింది.. బీఫారాల లొల్లి ముగిసిపోయింది.. అన్ని పార్టీల్లోనూ రె‘బెల్స్’ మోగిస్తున్నారు.. పోటీలో మిగిలిందెవరో తేలిపోయింది.. ఇక అసలు యుద్ధానికి అభ్యర్థులు రె‘ఢీ’ అంటున్నారు.. ప్రచారంపై ఫోకస్ పెట్టారు.. ● ఆలోచించి ఓటు వేయండి ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ తీరు తెన్నులను నిశితంగా పరిశీలించాలని మైక్రో అబ్జర్వర్లకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చూడాలని మంగళవారం కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్కు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకొని పోలింగ్ సిబ్బందికి అందించే సామగ్రి సక్రమంగా అందిందా లేదా చూసుకోవాలని తెలిపారు. పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్స్టేషన్కు చేరుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా మాక్పోల్, అనంతరం పోలింగ్ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా జరుగుతుందా లేదా పరిశీలన చేయాలని సూచించారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, విద్యాధికారి సుశీందర్రావు, మాస్టర్ ట్రైనర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. మహారాష్ట్ర ఐటీ మంత్రి అశిష్ షెలర్ చేవెళ్ల: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మహారాష్ట్ర ఐటీశాఖ మంత్రి అశిష్ షెలర్ పిలుపునిచ్చారు. చేవెళ్లలో మంగళవారం పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు బూత్స్థాయి నుంచి పార్టీ క్యాడర్ బలంగా పనిచేయాలని సూచించారు. దేశంకోసం, పేదలకోసం బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసేలా వివరించాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ప్రకాశ్రెడ్డి షాద్నగర్రూరల్: బీజేపీ పాలమూరులోని ఏవీఎస్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించనున్న విజయ సంకల్పసభను విజయవంతం చేద్దామని పార్టీ రాష్ట్ర నాయకుడు, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి డాక్టర్ ప్రకాశ్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణానికి చెందిన పార్టీ నాయకుడు మణికొండ రంగయ్యగౌడ్ స్వగృహంలో ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రకాశ్రెడ్డి హాజరై మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న నితిన్నబీ పాలమూరులో నిర్వహించే విజయ సంకల్పసభలో పాల్గొంటారన్నారు. తెలంగాణ రాజకీయాలకు కొత్త దిశ, ఊపిరివచ్చే సంకల్పం పాలమూరు సభ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి పాలమూరు గడ్డపై పార్టీ సత్తాచాటాలని కోరారు. సమావేశంలో నాయకులు శ్రీవర్ధన్రెడ్డి, అందె బాబయ్య, చెంది మహేందర్రెడ్డి, డాక్టర్ విజయకుమార్, కక్కునూరి వెంకటేశ్గుప్తా, దేపల్లి అశోక్గౌడ్, నర్సింహ, కుర్మయ్య, లక్ష్మికాంత్రెడ్డి, సురేశ్, రాజు, అరవింద్, హరిభూషణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలోని 126 వార్డులో ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో అధికార కాంగ్రెస్ నుంచి 126 మంది బరిలో నిలిచారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి 122 మంది, బీజేపీ నుంచి 109 మంది పోటీలో ఉన్నారు. జనసేన నుంచి తొమ్మిది మంది, బీఎస్పీ నుంచి ముగ్గురు, సీపీఎం, సీపీఐ నుంచి ఇద్దరు చొప్పున, ఎంఐఎం నుంచి ఒకరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఇద్దరు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి నలుగురు సహా మరో 57 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. బుధవారం నుంచే వీరంతా ముఖ్య నేతలతో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. ఏళ్లుగా పార్టీని నమ్ముకుని, సంక్షోభ సమయంలోనూ పార్టీ అభివృద్ధి కోసం పాటు పడినప్పటికీ బీ ఫారాలు దక్కని ఆశావహులు అధినేతలపై తిరుగుబావుటా ఎగరేశారు. కొంతమంది ఏకంగా పార్టీ మారగా, మరికొంత మంది ఏకంగా స్వపక్షంలోనే విపక్షంలా తయారయ్యారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఐదో వార్డుకు చెందిన అల్లం శ్రీనివాసరెడ్డి బీ ఫారం దక్కలేదనే కారణంతో అధికార కాంగ్రెస్ను వీడి, ప్రతిపక్ష బీఆర్ఎస్లో చేరారు. ఇబ్రహీంపట్నం ఆరో వార్డుకు చెందిన జెలమోని రవీందర్ కాంగ్రెస్ను వీడారు. అదే వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీల వారీగా ఇదీ లెక్క.. మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు ఆమనగల్లు 15 15 15 15 09 చేవెళ్ల 18 18 18 18 05 ఇబ్రహీంపట్నం 24 24 23 20 16 మొయినాబాద్ 26 26 26 23 17 షాద్నగర్ 28 28 28 19 17 శంకర్పల్లి 15 15 12 14 16 సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అగ్ని ప్రమాదాల నివారణకు హైడ్రా అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. నాంపల్లిలోని ఫర్నిచర్ షోరూంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంతో పాటు ఇతర ఘటనల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి చర్యలు తీసుకుంది. నిబంధనలు తప్పనిసరిగా పాటించేందుకు నెల రోజులు గడువు ఇస్తూనే అవగాహన చేపట్టింది. మంగళవారం పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. విలేకరులతో మాట్లాడుతున్న చైర్మన్ మధుసూదన్రెడ్డి ఉద్యోగుల వాగ్వాదం చేవెళ్ల మూడో వార్డులో బీఆర్ఎస్ పార్టీకి, ఆరో వార్డులో కాంగ్రెస్ పార్టీకి రెబల్ బెడద తప్పలేదు. బీఆర్ఎస్ బీ ఫాంపై ఆ పార్టీకి చెందిన నాగమణి నామినేషన్ దాఖలు చేయగా, ఇదే పార్టీకి చెందిన లక్ష్మి ఇదే వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ బీ ఫాం నుంచి సుచిత పోటీ చేయగా, అదే పార్టీకి చెందిన సంధ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆమనగల్లు మున్సి పాలిటీ 15వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా సీతమ్మ బరిలోకి దిగగా, ఆమెకు పోటీగా అదే పార్టీకి చెందిన ఝాన్సీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇబ్రహీపట్నం మున్సిపాలి టీలో కాంగ్రెస్ పార్టీకి స్వపక్షంలో విపక్ష బెడద తప్పలేదు. ఒకటి, మూడు, ఆరు, 14వ వార్డుల్లో రెబల్స్ పోటీ తప్పలేదు. బీ ఫారం దక్కక పోవడంతో ఇప్పటికే కొంత మంది పార్టీని వీడటం, మరికొంత మంది ఇదే బాటలో ప్రయాణిస్తుండటం అధికార పార్టీకి మింగుడుపడడం లేదు. శంకర్పల్లి మున్సిపాలిటీ ఏడో వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేశారు. బీ ఫారంపై బండ్లగూడెం శ్రీను బరిలో నిలవగా, అదే పార్టీకి చెందిన మధు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 8వ వార్డులో అధికారకార పార్టీ గుర్తుపై అనురాధ పోటీ చేస్తుండగా, అదే పార్టీకి చెందిన అఖిల స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 9వ వార్డులో అధికార పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్టీ బీఫారంతో గణేశ్, రాథోడ్ నరేష్కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు. 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా తౌఫిక్ను ప్రకటించగా, టి.శ్రీధర్ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. ఒకటో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా ఆనంద్ బరిలో నిలవగా, అదే పార్టీకి చెందిన ప్రతాప్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో అధికార కాంగ్రెస్ నుంచి ఇద్దరు బరిలో నిలిచారు. వీరిలో పార్టీ బీఫాంతో యాలాల లావణ్య పోటీకి దిగగా, ఇదే పార్టీకి చెందిన గడ్డం లక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 22వ వార్డులో బీజేపీకి రెబల్స్ బెడద తప్పలేదు. పార్టీ బీ ఫారంపై గున్నాల గోపాల్రెడ్డి నామినేషన్ వేయగా, అదే పార్టీకి చెందిన గరుగు రాజు స్వతంత్ర అభ్యర్థిగా దిగారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని 8వ వార్డులో అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు రెబల్ పోటు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ బీ ఫారంతో జయప్రకాష్ పోటీ చేయగా, అదే పార్టీకి చెందిన వర్ష స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫారంతో భిక్షపతి పోటీ చేయగా, అదే పార్టీకి చెందిన సుధీర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా మంగళవారం 178 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వీరిలో బీజేపీ నుంచి 19 మంది, సీపీఎం నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి 78 మంది, బీఆర్ఎస్ నుంచి 45 మంది, ఎంఐఎం నుంచి ముగ్గురు, సీపీఐ, జనసేనల నుంచి ఒక్కొక్కరు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి నలుగురు, స్వతంత్రులు 22 మంది ఉన్నారు. ఇక అసలు సమరం ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఆయా పార్టీల నుంచి అభ్యర్థుల ఖరారు పలుచోట్ల తిరుగుబావుటా స్వతంత్రులుగా బరిలోకి.. నేటి నుంచి ప్రచారంపై ఫుల్ ఫోకస్ నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి -
ఆడుకునేందుకు వెళ్లి అనంతలోకాలకు..
రంగారెడ్డి జిల్లా: చెరువు ఒడ్డున ఆడుకుంటూ అందులో జారిపడిన ఇద్దరు చిన్నారులు శవాలుగా తేలారు. సీఐ వెంకటేశ్వర్లు, స్థానికుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొత్వాల్చెరువుతండాకు చెందిన జాటోత్ బద్రీనాథ్ (8), జాటోత్ మోహన్రామ్ (రిషీ 7), కరణ్టోత్ శోభిత్ ముగ్గురూ స్నేహితులు. వీరు ఆదివారం సాయంత్రం తండా సమీపంలోని కొత్వాల్చెరువు వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు. చెరువు ఒడ్డుమీద ఉన్న బండరాయిపై కూర్చుని ఆడుకుంటుండగా బద్రీనాథ్, మోహన్రామ్ నీటిలో పడిపోయారు. ఇది గమనించిన శోభిత్ భయంతో ఏడుస్తూ తండాకు పరుగెత్తి, తల్లిదండ్రు లకు చెప్పాడు. వెంటనే చెరువు వద్దకు చేరుకున్న స్థానికులు మహేశ్వరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా ఆదివారం అర్ధరాత్రి వరకూ ఆచూకీ దొరక లేదు. సోమవారం ఉదయాన్నే మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా, రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. బద్రీనాథ్ తండాలోనే మూడో తరగతి, మోహన్రామ్ ఒకటో తరగతి చదువుతున్నారు. ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సబితారెడ్డి నివాళి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి చిన్నారుల మృతదేహాలకు నివాళులరి్పంచారు. బాధిత తల్లిదండ్రులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చెరువు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. -
20 రోజుల్లో కూతురు పెళ్లి.. అంతలోనే మృత్యు ఒడికి
రంగారెడ్డి జిల్లా: కూతురి పెళ్లి ఘనంగా చేసి మురిసిపోదాం అనుకున్న ఆ తండ్రి కల చెదిరిపోయింది. మరో 20 రోజుల్లో పెళ్లి ఉందనగా రోడ్డు ప్రమాదం పొట్టనపెట్టుకుంది. ఈ విషాదకర సంఘటన సోమవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం తంగడుపల్లి గ్రామానికి చెందిన రవీందర్గౌడ్ (42) ప్రైవేటు ఉద్యోగి. భార్య లలిత, కూతురు ఉంది. కొడుకు ఏడాదిన్నర క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు పటాన్చెరు మండలం ముత్తంగిలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే రవీందర్గౌడ్ కూతురి వివాహం నిశ్చయం కాగా.. ఈనెల 22న పెళ్లి ఉంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కూతురి వివాహ పనుల నిమితం తన ద్విచక్రవాహనంపై సిమెంటు బస్తా వేసుకొని సొంత గ్రామానికి బయలుదేరాడు. బైక్ ఎర్వగూడ గేటు వద్ద ఉండగా.. ఎదురుగా వికారాబాద్ వైపు నుంచి వస్తున్న కారు అతివేగం, అజాగ్రత్తగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్ గౌడ్ తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 20 రోజుల్లో పెళ్లి ఉందనగా ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వికసిత భారత్ దిశగా..
ఆర్థికవృద్ధి, ఉపాధి సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి అనే మూడు కీలక అంశాలను కేంద్రంగా పెట్టి దేశ భవిష్యత్తును రూపకల్పన చేసింది. వికసిత భారత్ దిశగా దూరదృష్టి గల నాయకత్వంలో ఈ బడ్జెట్ రూపొందింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి, ముఖ్యంగా రైల్వేలు, జాతీయ రహదారులు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ అభివృద్ధికి పెద్దపీట వేయడం ద్వరా పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడింది. కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. – బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు -
గుంతలమయం
చేవెళ్ల: మండల కేంద్రంతోపాటు చుట్టున్న 11 గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. చేవెళ్ల మున్సిపాలిటీలోని కాలనీలు, వార్డుల్లో అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారటంతో వాటిని ఎవరూ పట్టించుకోవటం లేదు. నూతన మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా చూడాలి. ఇబ్బందులు పడుతున్నాం రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదు. పంచాయతీగా ఉన్న కాలంలోనే నిధులు లేని కారణంగా రోడ్లు బాగు చేయించలేకపోయారు. ఇప్పుడు మున్సిపాలిటీగా ఏర్పాటైంది. నిధులు ఎక్కువగా వస్తాయని ఆశిస్తున్నాం. వార్డులకు వెళ్లే అంతర్గత రహదారులను బాగు చేయించాలి. – మల్లేశ్, ఇబ్రహీంపల్లి వార్డు స్పందించడం లేదు మున్సిపాలిటీ ఏర్పాటుతో సమస్యలు పెరుగుతున్నాయే కానీ పరిష్కారం రావటం లేదు. చేవెళ్ల నూతన మున్సిపాలిటీ కావటంతో పలు కాలనీల్లో సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారు. గతంలో పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచులకు చెబితే వెంటనే పనులు చేయించేవారు. ఇప్పుడు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదు. – రామస్వామి, హౌసింగ్ బోర్డు కాలనీ -
పోస్టర్లు అతికిస్తే ఓడిపోతారట
షాద్నగర్: ఫరూఖ్నగర్లో పాత జాతీయ రహదారికి ఆనుకొని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి 330 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని వనపర్తి సంస్థాన రాజు సవై పెద్ద వెంకట్రెడ్డి తన తల్లి పెద్ద జానమ్మ కోరిక మేరకు నిర్మించారు. అయితే ఇక్కడ పెద్ద రథశాల ఉంది. దేవాలయానికి ఎదురుగా ఖాళీ స్థలం ఉండటంతో దైవసన్నిధిలో ఉంటుందనే ఉద్దేశంతో గతంలో వివిధ పార్టీల నాయకులు ఇక్కడ సమావేశాలు నిర్వహించేవారు. అయితే పాత జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ రథశాలపై రాతలు రాయాలన్నా, పోస్టర్టు అతికించాలన్నా భయపడుతారు. అలా చేస్తే ఎన్నికల్లో ఓడిపోతారనే సెంటిమెంటు ఉంది. అందుకే ఈ రథశాల గోడలపై ఎవరు రాతలు రాయరు, పోస్టర్లు కూడా అతికించరు. షాద్నగర్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఈ రథశాలను అందరు చర్చించుకుంటారు. -
వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
పహాడీషరీఫ్: ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుది. ఎస్సై దయాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద గోల్కొండ నుంచి తుక్కుగూడకు వచ్చే ఔటర్పై 125 కిలోమీటర్ బోర్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి తల పూర్తిగా నుజ్జునుజ్జుగా మారి ఛిద్రమైంది. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి వయసు 35–40 ఏళ్ల నడుమ ఉంటుందని, మృతుడి నడుముకు మొలతాడు ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పొలం విషయంలో ఘర్షణ దాయాదుల చేతిలో గాయపడి వ్యక్తి మృతి కొందుర్గు: దాయాదుల మధ్య పొలం విషయంలో గొడవపడి ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయిన సంఘటన ఆదివారం మండలంలోని ఉమ్మెంత్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాలపురం భీమయ్యకు లాలయ్య, పోచయ్య, రామయ్య ముగ్గురు కుమారులు, అయితే భీమయ్యకు సంబంధించి చింతలపల్లి గ్రామ శివారులో 5.07 ఎకరాల భూమి ఉంది. కాగా అతడి ముగ్గురు కుమారుల వారసుల్లో పోచయ్య, రామయ్య కుమారులు వారి భాగాల ప్రకారం పట్టా మార్పడి చేసుకున్నారు. లాలయ్యకు సంబంధించిన భూమి అతడి కుమారుడు నర్సింలు పేరున పట్టా మార్పిడి కాలేదు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య తరచుగా గొడవ జరిగేది. ఈ విషయమై నెలకొన్న గొడవలో రపోచయ్య, రామయ్య వారసులైన యాదయ్య, నర్సింలు, రమేష్, జంగమ్మ, మంజుల కలిసి ఆదివారం లాలయ్య కుమారుడు నర్సింలుపై దాడి చేయగా తలకు బలమైన గాయం అయింది. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో షాద్నగర్ తరలించగా నర్సింలు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయమై మృతుడి భార్య లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చెరువులో పడి ఇద్దరి విద్యార్థుల గల్లంతు ● ఆడుకుంటుండగా జారిపడి పడిన వైనం ● కొనసాగుతున్న గాలింపు చర్యలు మహేశ్వరం: చెరువు ఒడ్డున సరదాగా ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన మహేశ్వరం మండల పరిధిలోని కొత్వాల్ చెర్వు తండా(కేసీ తండా)లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్వాల్ చెర్వు తండాకు చెందిన జాటోత్ రిష్విత్(7), జాటోత్ శ్రీకాంత్(10), కరన్టోత్ శోభిత్ ముగ్గురు స్నేహితులు. ఆదివారం స్కూల్కు సెలవు కావడంతో సాయంత్రం ముగ్గురు కలిసి తండా సమీపంలో ఉన్న కొత్వాల్ చెరువు వద్దకు వెళ్లారు. ఒడ్డున బండపైన సరదాగా ఆడుకుంటుండగా ముందుగా ఉన్న రిష్విత్, శ్రీకాంత్లు ప్రమాదవశాత్తు జారిపడి చెరువు గుంతలో పడిపోయారు. వీరి వెనుక ఉన్న శోభిత్ ఏడుస్తూ భయంతో ఇంటికి పరుగులు తీశాడు. తల్లిదండ్రులు, స్థానికులు చెరువు దగ్గరకు చేరుకొని వెతకడం మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ, కానిస్టేబుళ్లతో చేరుకొని గల్లంతైన విద్యార్థుఽల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. రిష్విత్ స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి, శ్రీకాంత్ మూడో తరగతి చదువుతున్నారు. మరింత మంది గత ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని సీఐ తెలిపారు. గల్లంతైన విద్యార్థులు తల్లిదండ్రులు, బంధువులు చెరువు వద్ద బోరున విలపిస్తున్నారు. -
ఒంటరి పోరుకే సై
● బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు ● రసవత్తరంగా త్రిముఖ పోటీ ● చైర్మన్ ఎన్నికలో సయోధ్యకు ఛాన్స్ పరిగి: మున్సిపల్ ఎన్నికల పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ గెలిచేందుకు శాయశక్తులు ఒడ్డుతున్నాయి. ఈసారి పరిగి మున్సిపాలిటీలో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అన్ని వార్డుల్లో పోటీ ఉండటంతో పాటు రెండు స్థానాల్లో సీపీఎం సైతం బరిలో నిలిచింది. ఏవైనా రెండు పార్టీలు కలిసి పుర పోరులో పోటీ చేస్తాయని భావించిన పట్టణ ప్రజలకు అందరూ బరిలో నిలవడంతో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఆయా పార్టీలో టికెట్లు ఆశించి భంగపడ్డ వారిని తమ పార్టీలో చేర్చుకొని మద్దతు కూడగట్టేందుకు రాజకీయ పక్షాలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. త్రిముఖ పోటీలో ఏదో ఒక పార్టీ చైర్మన్ ఎన్నికల సమయంలో కింగ్మేకర్ కానుందని చర్చించుకుంటున్నారు. మూడు పార్టీలు ఒంటరిగా పోటీకి సిద్ధం కావడంతో గెలుపు అవకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. చైర్మన్ పీఠంపై గురి! పరిగి చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని కాంగ్రె స్, బీఆర్ఎస్ యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా అత్యధిక శాతం ఓట్లు ఉన్న వర్గాల మద్దతు కూడగట్టే పనిలో ముఖ్య నాయకులు పడ్డారు. రెండు పార్టీలు మైనార్టీ ఓట్లను తమ వైపునకు తిప్పుకోవా లని పథకాలు రచిస్తున్నాయి. బీజేపీ కొన్ని వార్డుల పై ఆశలు పెట్టుకుంది. గెలిచే స్థానాలపై ప్రత్యేక గు రి పెట్టి కచ్చితంగా మూడు నాలుగు వార్డులను కై వ సం చేసుకోవాలని భావిస్తోంది. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎంపిక సమయంలో బీజేపీ మద్దతు కచ్చితంగా ఏ పార్టీకై నా కావాల్సి ఉంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అన్ని వార్డుల్లో గట్టి పోటీ ఇవ్వనుంది. కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్ ముఖ్య నా యకులను బరిలో దించడంతో వారి గెలుపు అని వార్యం కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓట్లు చీల్చనున్న బీజేపీ బీజేపీకి పట్టణ కేంద్రంలో దాదాపు పది శాతంపైగా ఓట్లు ఉన్నాయి. ఇటీవల ఆ పార్టీలో పలువురు ముఖ్య నాయకులు చేశారు. ముకుంద నాగేశ్ తన అనుచరులతో పార్టీ కండువా కప్పుకొన్నారు. దీంతో బీజేపీకి కొత్త ఊపు వచ్చింది. అంతేకాక ఎక్స్ అఫీషియో ఓటు ఉండటంతో ఈ ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చని భావిస్తున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి బీజేపీ 16 వార్డుల్లో పోటీకి దిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం బీజేపీకి వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల కాషాయ పార్టీలోకి జోరుగా చేరికలు జరుతున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో భారీగా ఓట్లు చీల్చనుంది. ఇందులో ఏ పార్టీకి నష్టం, లాభం చేకూరుతుందో వేచి చూడాలి. పుర పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒంటరిగా తలపడుతున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించేందుకు నూతన ఎత్తుగడలతో ఆయా పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వాస్తవ పరిస్థితులను అంచనా వేసి అసంతృప్తుల మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నాయి. -
బీఫాం.. తెలుసుకుందాం
షాద్నగర్: ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు ఎక్కడ విన్నా ఒకే చర్చ.. బీఫాం ఎవరికి వస్తుందని.. పార్టీ ప్రాతిపదిక జరిగే ఎన్నికలు కావడంతో అభ్యర్థులు బీఫాం పొంది బరిలో దిగాల్సి ఉంటుంది. బీఫాం లేకుండా పోటీ చేస్తే ఎన్నికల అధికారులు వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తారు. మరి ఈ బీఫాం అంటే ఏమిటో ఓసారి తెలుసుకుందాం.. ● బీఫాం అంటే గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రతిపాదిస్తూ ఎంపిక చేసిన వారికి ఇస్తారు. నామినేషన్ సమర్పించే సమయంలో అభ్యర్థులు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఇచ్చిన బీఫాంను దాఖలు చేస్తే ఆ అభ్యర్థికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ గుర్తులను కేటాయిస్తారు. పార్టీ అధ్యక్షుడు లేదా పరిశీలకుడు సదరు అభ్యర్థిని ఎంపిక చేసి వారికి బీఫాం అందజేస్తారు. ● ఏఫాం కలిగిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీఫాం ఇచ్చే పూర్తి అధికారాలు ఉంటాయి. బీఫాం ఇచ్చే ముందు పార్టీ అధ్యక్షుడు ఆమోదిస్తూ ప్రతిపాదించిన వ్యక్తి తన పేరు అందజేసిన ఏ ఫాంను ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారికి అందజేయాల్సి ఉంటుంది. పోటాపోటీ పార్టీల తరఫున ఎన్నికల బరిలో ఉండాలనుకునే ఆశావహులు బీఫాం కోసం పోటీపడుతుంటారు. పార్టీ ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకొని బీఫాం పొందేందుకు నానా తంటాలు పడుతుంటారు. నామినేషన్ల చివరి ఘట్టం వరకు బీఫాం ఎవరికి ఇస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంటుంది. పార్టీ నాయకులు గెలుపు గుర్రాల కోసం మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిస్థాయి కసరత్తు చేసి బీఫాం అందజేస్తున్నారు. -
కేసీఆర్పై కక్షసాధింపు
మీర్పేట: ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించడానికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ అక్రమ కేసులో విచారణకు పిలిచారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు మీర్పేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే జిల్లెలగూడ, మీర్పేట, అల్మాస్గూడ, బడంగ్పేట మీదుగా బాలాపూర్ చౌరస్తా వరకు నిర్వహించిన బైకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలాపూర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై వేధింపులకు దిగుతోందని విమర్శించారు. చరిత్ర సృష్టికర్తల జోలికి వస్తే చివరికి చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో మీర్పేట, బడంగ్పేట బీఆర్ఎస్ అధ్యక్షులు అర్కల కామేశ్రెడ్డి, రామిడి రాంరెడ్డి, నాయకులు అర్కల భూపాల్రెడ్డి, అనిల్యాదవ్, పెండ్యాల నగేష్, దీప్లాల్ చౌహాన్, సిద్దాల అంజయ్య, సునీత, స్నేహలత తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
పైపులైన్లకు తవ్వారు
సీసీ రోడ్లు వేసినా పైప్లైన్లు, నల్లాల కోసం తవ్వారు. తిరిగి సరిగా పూడ్చకపోవడంతో గుంతలు ఏర్పడ్డాయి. రోడ్లపై మురుగునీరు పారుతూ గుంతలు పడటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోడ్ల గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఓట్లు వేయమని తిరుగుతున్నారు. – గోపాల్, పెద్దమంగళారం, మొయినాబాద్ పట్టించుకోవడంలేదు మున్సిపాలిటీలోని అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారాయి. రోడ్లపై వాహనాలు వెళితే కుదుపులకు నడుము నొప్పులు వస్తున్నాయి. మున్సిపాలిటీ ఏర్పాటై ఏడాది అవుతున్నా రోడ్లపై దృష్టి పెట్టడంలేదు. మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదు. – రమేశ్, సురంగల్, మొయినాబాద్ ● -
ఒకే వార్డులో ముగ్గురు రిపోర్టర్లు
మొయినాబాద్: మున్సిపాలిటీలోని 14వ వార్డులో మూడు ప్రధాన పార్టీల నుంచి విలేకరులు పోటీ పడుతున్నారు. సురంగల్ పరిధిలో ఉన్న వార్డులో అదే గ్రామానికి చెందిన బ్యాగరి శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థిగా, కర్రోళ్ల శ్రీధర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా, బేగరి రాజు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. ముగ్గురు వేరువేరు వార్త పత్రికల్లో రిపోర్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన విలేకరులు ఒకే వార్డు నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎవరు గెలిచినా రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి కౌన్సిలర్గా మున్సిపాలిటీలో అడుగుపెట్టనున్నారు. -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
తుక్కుగూడ: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలే లక్ష్యంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్ డిమాండ్ చేశారు. డివిజన్ కేంద్రంలో ఆదివారం కార్మిక సంఘాల జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో హాజరై సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి కవిత, శివ, సుజాత, పానుగంటి పర్వతాలు, దత్తునాయక్, రుద్రకుమార్, చందు యాదవ్, సత్యానారాయణ, మల్లేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. మొయినాబాద్: ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ ఒలింపియాడ్లో మొయినాబాద్లోని మెలోహా స్కూల్ విద్యార్థిని సహస్ర సత్తా చాటింది. ఇటీవల సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ ఒలింపియాడ్లో మెలోహా స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న సహస్ర ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ ఘనత సాధించిన సహస్రను, ఆమె తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీసాయిచంద్ ఆమనగల్లు: మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఎన్నికల బీఆర్ఎస్ ఇన్చార్జి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీసాయిచంద్, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆమనగల్లు పట్టణంలోని శ్రీకాంత్ కాలనీలో ఆదివారం 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ ఖలీల్కు మద్దతుగా వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు తీసుకు వచ్చారన్నారు. అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీ నాయకులకు ము న్సిపల్ ఎన్నికలలో బుద్ధి చెప్పాలన్నారు. దొంగ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికలలో ఓటమి తప్పదన్నారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు అర్జున్రావ్, మాజీ ఎంపీపీ నిర్మల, నాయకులు కుమార్, శ్రీనివాస్, నిరంజన్గౌడ్, బాలస్వామి, హాజీపాషా తదితరులు ఉన్నారు. ఎయిర్పోర్టులోకి లేజర్ కిరణాలు శంషాబాద్: విమానాశ్రయంలో లేజర్ కిరణాలు పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం రాత్రి ఎయిర్పోర్టులోని రన్వే–09ఆర్కు దక్షిణ ప్రాంతం నుంచి రంగురంగుల లేజర్ కిరణాలు ప్రసరించడంతో అధికారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. లేజర్ కిరణాలు ఎక్కడి నుంచి పడ్డాయన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. -
జిల్లాకు అన్యాయం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. పేదలకు చేకూరే మేలు ఏమాత్రం లేదు. ఇది పూర్తిగా పెద్దలకు దోచిపెట్టే బడ్జెట్లా మిగిలిపోయింది. కనీసం జిల్లా పేరు కానీ, కీలక ప్రాజెక్టుల ప్రస్తావన గానీ తీసుకురాకపోవడం అన్యాయం. ప్రభుత్వ సొమ్మును కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా ఉంది. యువతకు ఉద్యోగాలు లేవు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ఏ ఒక్క చర్య లేదు. ఇది పూర్తిగా ప్రజావ్యతిరేక బడ్జెట్. – చల్లా నర్సింహారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు -
ప్చ్.. లాభం లేదు
కీలక ప్రాజెక్టులకు మొండిచేయి ● మెట్రోరైల్ విస్తరణ ఊసెత్తని వైనం ● నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్ సాక్షి, రంగారెడ్డిజిల్లా: కేంద్ర ప్రభుత్వం ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ జిల్లావాసులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్సిటీ ప్రస్తావన లేదు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, అటు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రోరైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా జిల్లాలో కీలకమైన ఈ ప్రాజెక్టుకు కూడా పైసా కేటాయించలేదు. మూసీ ప్రక్షాళనకు నిధుల కేటాయింపు లేదు. ఫ్యూచర్సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్, రావిర్యాల నుంచి ఆమనగల్లు వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ సహా రీజినల్ రింగ్రోడ్డు నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులకు పైసా విదల్చలేదు. ఇదిలా ఉంటే దేశంలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు 2047 వరకు టాక్స్ హాలీడే ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో జిల్లాకు మరికొన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఒక బాలికల హాస్టల్ను మంజూరు చేయడం, విద్యుత్ వాహనాలకు రాయితీలు ప్రకటించడం వాహన కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశం. కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ మాత్రం జనరంజక బడ్జెట్గా అభివర్ణించింది. -
ఉద్యోగులకు నిరాశే
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసింది. వారికి లబ్ధి చేకూర్చే ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదు. విద్యా వ్యవస్థకు పెద్దగా కేటాయింపులు లేవు. రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యా రంగానికి కేవలం రూ.13,289 కోట్లు మాత్రమే(2.6 శాతం) కేటాయించింది. గత ఏడాది కేటాయించిన బడ్జెట్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ప్రభుత్వ విధానాలు పేదలను విద్యకు దూరం చేసేలా ఉన్నాయి. ఉద్యోగుల నుంచి ఆదాయపన్ను ముక్కుపిండి వసూలు చేస్తుంది. – వై.కరుణాకర్రెడ్డి, ఎస్టీయూటీఎస్, కార్యదర్శి -
ఏకగ్రీవం కాకుండా బీజేపీ చెక్
శంకర్పల్లి: మున్సిపాలిటీలో నామినేషన్ల సమయానికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. 12వ వార్డు స్థానానికి బీఆర్ఎస్ నుంచి దండు సంతోష్, కాంగ్రెస్ నుంచి యంసాని ప్రకాశ్ గుప్తా నామినేషన్ దాఖలు చేశారు. ఆఖరి నిమిషంలో బీఆర్ఎస్ అభ్యర్థి సంతోష్ తండ్రి రాజేశ్వర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని నామినేషన్ వేశారు. అప్పటికే హస్తం పార్టీ నుంచి బరిలో ఉన్న ప్రకాశ్గుప్తా సైతం రాజేశ్వర్తో కలిసి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే అప్రమత్తమైన బీజేపీ నాయకులు వార్డు స్థానాన్ని ఏకగ్రీవం కాకుండా సిరిగన్నగారి శ్రీకాంత్రెడ్డిని బరిలో నిలిపి, ఆయన్ని నగరంలోని క్యాంపునకు తరలించారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు అక్కడే ఉంచనున్నట్లు సమాచారం. మహిళ అదృశ్యం మొయినాబాద్ రూరల్: ఇంటి నుంచి పని కోసం వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుండే ప్రవళిక స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం ఆస్పత్రికి పని కోసం వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ కోవా పట్టివేత ఇద్దరి అరెస్టు తాండూరు టౌన్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ కోవా తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ అన్వర్పాషా తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణంలో కల్తీ కోవా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. కల్తీ కోవా ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన ప్రకాష్ విష్ణు అనే వ్యక్తి హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మాన్ వద్ద కల్తీ కోవా తెచ్చి పలు స్వీటు షాపులకు విక్రయిస్తుంటాడు. ప్రకాష్ విష్ణు ఇంటిపై దాడి చేయగా 120 కిలోల కల్తీ కోవా దొరికిందన్నారు. హైదరాబాద్లో మహ్మద్ సల్మాన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి పట్టణ పోలీసులకు అప్పగించామన్నారు. భవనంపై నుంచి జారిపడి వాచ్మెన్ మృతి గచ్చిబౌలి: భవనంపైనుంచి జారిపడిన ఓ వాచ్మెన్ మృతి చెందాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. కొండాపూర్ రాజరాజేశ్వరీనగర్లో నివాసముండే అడబాల శ్రీనివాస్(29) ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. శుక్రవారం డ్యూటీకి వెళ్లి తిరిగి రాలేదు. కుమారుడు సత్యనారాయణ అపార్ట్మెంట్ ప్రాంతంలో గాలించగా సెల్లార్లో పడిపోయి తలకు, కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు గుర్తించాడు. సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
15 ఏళ్లుగా పట్టణపాలన
● స్వాతంత్య్రం తొలినాళ్లలోనే మున్సిపల్గా షాద్నగర్ ● 1964లో గ్రామ పంచాయతీగా ఏర్పాటు ● 47 వసంతాలు కొనసాగిన సర్పంచుల హవా ● 2011లో రెండోసారి పురపాలికగా రూపాంతరం షాద్నగర్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే షాద్నగర్ మున్సిపాలిటీగా ఉండేది. అభివృద్ధికి నిధులు లేకపోవడంతో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. 47 ఏళ్ల పాటు గ్రామ పాలనే కొనసాగింది. ఈ వ్యవస్థకు నాటి ప్రభుత్వం స్వస్తి చెప్పి తిరిగి రెండోసారి మున్సిపాలిటీగా మార్చింది. ప్రస్తుతం జరిగే పుర పోరులో అధికార కాంగ్రెస్, విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ తమ ఉనికిని కొనసాగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ప్రచారానికి వ్యూహాలు రచించి, ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాయి. చరిత్ర ఇదే.. 1869 నుంచి 1911 మధ్యకాలంలో ఆరో నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ షాద్నగర్ను స్థాపించారు. జానంపేటకు చెందిన మహారాజా కృష్ణప్రసాద్ ఈ ప్రాంతాన్ని పాలించేవారు. ఈయన ‘షాద్’ అనే కలంతో ప్రసిద్ధి చెందారు. అందుకే షాద్నగర్గా పేరు వచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభానికి ముందు 1954 ప్రాంతంలో షాద్నగర్ మున్సిపాలిటీగా ఉండేది. ఈ పట్టణ కేంద్రంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాగ్గా ఏర్పడింది. షాద్నగర్లో నిర్వహించిన ఎన్నికల్లో తొలి మున్సిపల్ చైర్మన్గా మాదిరాజు సుదర్శన్రావు ఎన్నికయ్యారు. 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైంది. 1964లో షాద్నగర్ మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. రెండోసారి మున్సిపాలిటీగా.. నాడు అభివృద్ధికి సరిగా నిధులు లేకపోవడంతో మున్సిపాలిటీగా ఉన్న షాద్నగర్ను 1964లో ప్రభు త్వం రద్దు చేసింది. మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి పాలనను కొనసాగించారు. 1964 నుంచి 2011 వరకు 47 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీగా కొనసాగిన షాదనగర్ను తిరిగి 2011 ఆగస్టు 24న గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. గత 15 ఏళ్లుగా ఇక్కడ మున్సిపాలిటీ పాలన కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ 28 వార్డులున్నాయి. పట్టణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆంగ్లేయుల బానిస సంకెళ్ల నుంచి భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న సమయంలో షాద్నగర్ పురపాలక సంఘంగా కొనసాగింది. నాటి పరిస్థితులకు తగ్గట్టు నిధులు లేకపోవడంతో అనంతరం గ్రామ పాలనలోకి వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కొనసాగిన బూర్గుల రామకృష్ణారావు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆ చరిత్రేంటో ఓసారి లుక్కేద్దాం. -
పతంగులు ఎగరేస్తూ బావిలో పడిన చిన్నారులు
● తమ్ముడి దుర్మరణం● ప్రాణాలతో బయటపడిన అన్న ● కొంషెట్పల్లిలో విషాదం మర్పల్లి: సరదాగా గాలిపటాలు ఎగరేసేందుకు పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడ్డారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కొంషెట్పల్లిలో శనివారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా మరో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మహ్మద్ సైజొద్దీన్, ఉమ్రాబేగంకు ఓ కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు శనివారం ఓ పని నిమిత్తం మరో గ్రామానికి వెళ్లారు. అయితే, స్థానిక ఊర్దూ మీడియం పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు సైఫాన్ (9), ఒకటో తరగతి చదువుతున్న సోహైల్(6) ఉదయం స్కూల్కు వెళ్లలేదు. తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద లేకపోవడంతో అన్నదమ్ములిద్దరూ గాలి పటాలు ఎగరేసేందుకు పొలాల బాట పట్టారు. పతంగి కోసం పరుగెత్తుతున్న క్రమంలో బావిని గమనించని సోహైల్ అందులో పడిపోయాడు. తమ్ముడిని కాపాడే క్రమంలో సైఫాన్ కూడా బావిలోకి జారాడు. సాగుడుగా ఉన్న పాత బావిలోని ఓ చెట్టు కొమ్మ వద్ద చిక్కుకున్న సైఫాన్ కాపాడమంటూ కేకలు వేశాడు. ఇది గమనించిన ఓ మహిళ, అక్కడే ఉన్న ఉపాధి కూలీలకు సమాచారం ఇవ్వడంతో పరుగున వచ్చి, సైఫాన్ను బయటకు లాగారు. సోహైల్ ఆచూకీ లభించకపోవడంతో నాలుగు మోటార్ల ద్వారా బావిలోని నీళ్లను బయటకు తోడేస్తున్నారు. ఫైరింజన్ను వచ్చి గాలింపు చర్యలు చేపట్టినా బావిలో నీటి మట్టం తగ్గకపోవడంతో చిన్నారి ఆచూకీ లభించలేదు. పాడుబడిన బావి అడుగులో భారీగా ఉన్న చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కున్నాడు. అతికష్టం మీద రాత్రి 10గంటల తర్వాత చిన్నారి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టానికి తరలించారు. -
చెరువులో పడి వృద్ధురాలి మృతి
ఆమనగల్లు: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సహదేవి సముద్రం చెరువులో వెల్లాలకు చెందిన వడ్డె బాలమ్మ(60) చేపల కోసం శుక్రవారం వెళ్లింది. చీకటి పడినప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు సమీపంలో, గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా సహదేవి సముద్రంలో శనివారం మధ్యాహ్నం మృతదేహం స్థానికులకు కనిపించగా వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీయగా బాలమ్మగా గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. -
నాయకులు నారాజ్
● సర్వే అనుకూలంగా లేదని టికెట్ల నిరాకరణ● బీఫారం ఇవ్వకపోవడంతో గరం ● అధికార పార్టీలో పెరిగిన అసంతృప్తులు పరిగి: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉండి జెండా మోసి నిలబెట్టిన తమకే టికెట్(బీ ఫా రం) ఇవ్వడం లేదని అధికార పార్టీ చెందిన కొంతమంది నేతలు నారాజ్ అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి రోజురోజుకూ అసంతృప్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల్లో అలకలు పెరిగినట్లు సమాచారం. అధికారంలో లేనప్పటి నుంచి అసల్ సిసల్గా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులను పక్కన పెట్టి కొందరికి టికెట్లను కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే అనుకూలంగా లేదని ఎన్నికల బరిలో ఉండరాదని ముక్కుసూటిగా చెప్పడంతో బీఫారం రాని నేతలు అయోమయస్థితిలో పడ్డారు. అధికార పార్టీ నుంచి ఎంతో మంది ఎన్నికల బరిలో నిలవాలని భావించినా కొందరికే ఆ అవకాశం దక్కనుంది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒకటి రెండు తప్పా ఎక్కడ రెబల్ బెడదా కనిపించడం లేదు. నాలుగు వార్డుల్లో ప్రభావం పరిగి మున్సిపల్లో 18 వార్డులున్నాయి. మొత్తం వార్డుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 46 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి 30 సెట్ల నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి 31, స్వతంత్రులు 18 మొత్తంగా 158 నామినేషన్ సెట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. అధికార పార్టీలో అసంతృప్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రెండు నుంచి నాలుగు వార్డుల్లో సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. పార్టీ కోసం పనిచేస్తే ముఖంపైనే టికెట్ ఇచ్చేది లేదని చెప్పడంతో కొందరు నాయకులు నారాజ్ అవుతున్నారు. టికెట్లు ఆశించి రానివారు సొంత పార్టీలోనే ముసలం కానున్నారు. వారి నుంచి పార్టీకి పెద్ద దెబ్బపడనుందని చర్చించుకుంటున్నారు. అసంతృప్తులను గుర్తించి వారిని శాంతపరచకుంటే ఫలితాలు తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది. టికెట్ల కోసం కొట్లాట ఓ పార్టీకి చెందిన నాయకులు నామినేషన్ల రెండో రోజు టికెట్ల కోసం కొట్లాడుకున్నట్లు పట్ణణంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకే పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయాయి. మీరు పలానా నేతలకు చెందిన వారని అందుకే టికెట్లు ఇవ్వడం లేదని చెప్పడంతో కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలైంది. అధికార పార్టీలో టికెట్ల కోసం కోట్లాడటం చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్లో మాత్రం టికెట్లు రాని వారు రెబల్గా బరిలో నిలుస్తామని చెబుతున్నారు. ఏది ఏమైన ఏ పార్టీకి రెబల్ బెడదా, అసంతృప్తులు ఎక్కువ ఉంటారో వారికే ఎన్నికల్లో ముప్పు రానుంది. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న బీజేపీ దాదాపుగా 16 వార్డుల్లో నామినేషన్లను దాఖలు చేయడంతో అక్కడ కూడా ఆశలు చిగురిస్తున్నాయి. రెండు మూడు సీట్లు గెలిచి కింగ్మేకర్ కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
కుక్కల భద్రత యజమానులదే
యాచారం: కుక్కల దాడులతో ప్రజల్లో భయాందోళన ఉందని, గొర్రెలు, మేకలు, పశువులపై దాడులు చేసి చంపేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం యాచారంలో వీధి కుక్కలను విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపేయడం సంచలనంగా మారడంతో స్పందించిన ఆయన శనివారం పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుక్కలను చంపడం సరైంది కాదన్నారు. భద్రత చేపడుతూనే మిగతా వారికి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యజమానులదేనని స్పష్టం చేశారు. కోతులతో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ పొలాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం నాబార్డు నుంచి రుణాలు అందజేసేలా రైతు కమిషన్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్పంచ్ మస్కు అనితశరణం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తహసీల్దార్ అయ్యప్ప, మండల ప్రత్యేధికారి మాధవరావు, డీఎల్పీఓ సాధన, ఎంపీఓ శ్రీలత, పశువైద్యాధికారులు రేఖ, కిరణ్కుమార్, మండల వ్యవసాయాధికారి రవినాథ్, ఎస్ఐ మధు, పంచాయతీ కార్యదర్శి కిషన్ తదితరులు పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడలు ముఖ్యం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ క్రీడాపోటీలకు హాజరైన ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రోత్సహించారు. గ్రామీణా ప్రాంత విద్యార్థులు, యువత క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి -
నిర్లక్ష్యానికి తావీయొద్దు
బావిలో పడిన చిన్నారులు సరదాగా గాలిపటాలు ఎగరేసేందుకు పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడ్డారు.● ఎన్నికలు సజావుగా నిర్వహించాలి ● కలెక్టర్ నారాయణరెడ్డి షాద్నగర్: మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ, స్ట్రాంగ్ రూంల ఎన్నికల పర్యవేక్షకుడు మయాంక్ మిట్టల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యానికి తావివ్వొద్దని, సజావుగా.. ప్రశాంతమైన వాతావరణలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. బ్యాలెట్ బాక్స్ల భద్రత, ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు విధిగా పాటించాలని, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రచారాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సరిత, మున్సిపల్ కమిషనర్ సునీత, తహసీల్దార్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిహామీని నీరుగార్చే కుట్ర
మంచాల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. మండల పరిధిలోని లోయపల్లిలో శనివారం ఉపాధిహామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పథకానికి పేరు మార్చి, నిర్వీర్యం చేసి కూలీల పొట్ట కొట్టే విధంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. ప్రతి జాబ్కార్డుకు 200 రోజులు పనిదినాలు కల్పించాలని, దినసరి కూలి రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశా రు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 12న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య, మండల కార్యదర్శి రావుల జంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస్రెడ్డి, పి.అంజయ్య, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ


