breaking news
Rangareddy
-
రైతులపైనే రవాణా!
తాండూరు రూరల్: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి. ఓ పక్క ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు కురవక, ఎరువులు దొరకక ఇబ్బందులు పడుతుండగా, ప్రస్తుతం యూరియా బస్తాలపై రవాణా ఛార్జీలు పెంచడం మరింత భారంగా మారింది. ప్రస్తుతం సాగు చేసిన వరి, పత్తి పంటలకు యూరియా వేయడం అత్యవసరం. కానీ ప్రభుత్వం ఎరువులు పొందేందుకు కొత్త యాప్ ఎఫ్ఎఫ్ఎస్(ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్)ను తీసుకొచ్చింది. చాలా మంది రైతుల వద్ద పాత యూరియా యాప్ మాత్రమే ఉంది. కొత్త యాప్పై ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాలేదు. దీంతో యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కొంత మంది కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకున్నా.. అందులో తాండూరు ప్రాంతంలోని దుకాణాల్లో యూరియా కొరత, స్టాక్ లేదని చూపిస్తోందని చెబుతున్నారు. ఒక్కో బస్తాపై రూ.43 అదనం ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కో యూరియా బస్తా ధర రూ.267 నిర్ణయించింది. గతంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ప్రభుత్వమే చెల్లించేది. దీంతో ఎరువుల దుకాణం యజమానులు మద్దతు ధరకే యూరియాను విక్రయించేవారు. తాజాగా జూలై 15నుంచి ట్రాన్స్ఫోర్ట్ ఛార్జీలను రైతులే చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కో యూరియా బస్తాపై రూ.43 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈలెక్కన బస్తా ధర రూ.310కి పెరిగింది. సాగు సంకటంగా మారిన ప్రస్తుత తరుణంలో రైతులపై అదనపు భారం మోపడం సరికాదని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని పేర్కొంటున్నారు. దూరాన్ని బట్టి.. దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారులోని మేడ్చల్, మూసాపేట్, తిమ్మాపూర్ ప్రాంతాల నుంచి జిల్లాలోని వివిధ సొసైటీ కార్యాలయాలతో పాటు, ఫెర్టిలైజర్ దుకాణాలకు ఎరువులు వస్తాయి. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు పెంచారు. వికారాబాద్ ప్రాంతంలో ఒక్కో ఎరువు బస్తాపై రూ.28, కొడంగల్ నియోజకవర్గం హస్నాబాద్లో రూ.44, తాండూరులో రూ.43, బషీరాబాద్కు రూ.51 ధర నిర్ణయించారు. ఈమొత్తాన్ని రైతుల నుంచే వసూలు చేస్తున్నారు. ఒక్కో బ్యాగుపై రూ.28 నుంచి రూ.51 అదనం ప్రభుత్వ నిర్ణయంపై అన్నదాతల ఆందోళన ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ఎరువుల బస్తాల రవాణా ఛార్జీలను గతంలో ప్రభుత్వమే చెల్లించేది. తాజాగా జూలై 15నుంచి రైతుల వద్దే వసూలు చేయాలని నిర్ణయించింది. దూరాన్ని బట్టి ఛార్జీలు అమలవుతున్నాయి. తాండూరులో ఒక్కో యూరియా బస్తాపై రూ.310 ధర ఉంది. – కొమురయ్య, తాండూరు ఏఓ సరైన నిర్ణయం కాదు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను రైతుల నుంచి వసూలు చేయడం సరైన నిర్ణయం కాదు. గతేడాది అతివృష్టి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు లేక పంటల దిగుబడి కష్టంగా ఉంది. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్నాం. రవాణా ఛార్జీలు మోపడం అన్యాయం. – భద్రు, రైతు, సిరిగిరిపేట్ -
ప్రమాదకరంగా బీటీ రోడ్లు
బొంరాస్పేట: సీఎం రేవంత్రెడ్డి చొరవతో, లక్షల, కోట్ల నిధులతో మండలంలోని ప్రతి గ్రామానికి, గిరిజనతండాలకు సైతం బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్లు కొన్ని చోట్ల ఆదరబాదరాగా పనులు పూర్తి చేసి, బిల్లులు తీసుకుంటున్నారు. పలుచోట్ల ఇటీవల నిర్మించిన బీటీ రోడ్లకు ఇరువైపులా వేసిన మట్టి వర్షాలకు కొట్టుకుపోయింది. ఇలా మూడుమామిళ్లతండా, బీక్యానాయక్తండాల మధ్య సైడ్బర్మ్లు కోతకు గురవడంతో ప్రమాదకరంగా మారాయి. అధికారులు స్పందించి క్షేత్ర సందర్శన చేసి మట్టి పనులు చేపట్టాలని ఆయా గ్రామాల, గిరిజన తండాల ప్రజలు, వాహనాదారులు కోరుతున్నారు. ● జూబ్లీహిల్స్ సంపన్నుల పిల్లల కేసులో ఇద్దరి అరెస్టు బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లో సంచలనం సృష్టించిన ‘రిచ్ కిడ్స్’ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న కోడూరి మీనాకుమారి (41), వినీల్చౌదరి అలియాస్ వినీల్బాబు (38)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అరెస్టయిన వారిలో మీనా కుమారి సామాజిక సేవా రంగంలో ఉన్నట్లు, వినీల్చౌదరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసులో ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్న పోలీసులు, దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ధారూరు: ఇంటి స్థలాన్ని దాయాది ఆక్రమించడంతో మనస్థాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. నగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధిచిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గడ్డమీది గంగారం గ్రామానికి చెందిన శాంత్కుమార్(20) ఇంటి ముందు ఉన్న స్థలాన్ని దాయాది మల్కప్ప ఆక్రమించాడు. ఈ నెల 2న శాంత్కుమార్ గ్రామంలో పంచాయితీ పెట్టించాడు. మల్కప్ప, మంగమ్మ, మల్లయ్య కలిసి ప్రశాంత్కుమార్, అతని తల్లి భూమని నిర్మలమ్మపై గొడవకు దిగారు. దీంతో మనస్థాపం చెందిన శాంత్కుమార్ పురుగు మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని నగరంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తల్లి నిర్మలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్ల మరమ్మతు, ఫ్రీ లెఫ్ట్లపై దృష్టి సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వర్షాకాల సన్నద్ధత, ట్రాఫిక్ నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండాముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్ ఎం.రమేష్ వివిధ విభాగాల అధికారుల్ని కోరారు. సోమవారం గచ్చిబౌలిలోని కమిషన రేట్లో ట్రాఫిక్ నిర్వహణపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దెబ్బతిన్న రోడ్లు, గుంతలకు మరమ్మతు లతోపాటు ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అవసరమైన చోట్ల కొత్తగా ఫ్రీ లెఫ్ట్ల ఏర్పాటు, ఉన్న వాటి అభివృద్ధి, కీలక కూడళ్లలో కొత్త ట్రాఫిక్ సిగ్నళ్ల అమరిక, పని చేయనివాటి పునరుద్ధరణపై చర్చించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని నిర్ణయించారు. పాదచారుల భద్రత కోసం అవసరమైన ప్రాంతాల్లో ఫుట్పాత్ల అభివృద్ధి, మరమ్మతులపై దృష్టి సారించారు. పెండింగ్లో ఉన్న పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని సీఎంసీ కమిషనర్ సృజన అన్నారు. తరచూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే, ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గితే సురక్షిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. వాటర్బోర్డ్ ఎండీ అశోక్రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి.పాటిల్, టీజీఐఐసీ వీసీ కె.శశాంక పాల్గొన్నారు. -
చెప్పినట్లు వినలేదని చితకబాదారు
ఉప్పల్లోని ఓ డిగ్రీ కాలేజీలో ఘటన ● తోటి విద్యార్థిపై ముగ్గురి దాడిఉప్పల్: ఉప్పల్లోని ఓ డిగ్రీ కాలేజీలో తోటి విద్యార్థి చెప్పినట్లు వినలేదనే సాకుతో ముగ్గురు విద్యార్థులు తోటి విద్యార్థిపై దాడిచేశారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో నాగోల్ ప్రాంతానికి చెందిన భువన మోహిత్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదుతున్నాడు. అదే కళాశాలకు చెందిన ఛత్రీష్, యశ్వంత్, వినయ్లు చెప్పినట్టు వినలేదని మోహిత్పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ నెల 3 కళాశాల వాష్రూమ్లోకి తీసుకెళ్లి దాడి చేశారు. అతని మొబైల్ ఫోన్ను విసిరి కొట్టారు. ఈ సంఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. గతంలో కూడా పలుమార్లు ఆ విద్యార్థితో దురుసుగానే ప్రవర్తించినట్లు బాధితుడు తెలిపారు. అయినప్పటికీ కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బాధితుడి తండ్రి తెలిపారు. ఈ నెల 4న ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై కళాశాల ప్రిన్సిపల్ను వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు. ‘పది’విద్యార్థుల పైశాచికంజవహర్నగర్: ఓ కార్పొరేట్ పాఠశాల హస్టల్లో పదోతరగతి విద్యార్థిపై తోటి విద్యార్ధులు దారుణంగా దాడిచేశారు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ స్కూల్లో చోటుచేసుకుంది.తల్లిదండ్రులు, ఏసీపీ చక్రపాణి తెలిపిన మేరకు...కామారెడ్డికి చెందిన ఓ విద్యార్థి (15) దమ్మాయిగూడలోని కార్పొరేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 7న అర్ధరాత్రి విద్యార్థిపై 9 మంది తోటి విద్యార్ధులు కర్రలతో కొట్టి, బూట్లతో ముఖంపై దారుణంగా కొట్టారు. దీంతో స్పృహతప్పిపడిపోయాడు. వార్డెన్ గమనించి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మెట్ల కిందపడి గాయాలయ్యాయని చెప్పారు. దీంతో వారు కుమారుడిని తీసుకెళ్లి కామారెడ్డిలోని ఆస్పత్రిలో చేర్పించారు. ర్యాగింగ్ పేరుతో దాడి చేసినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా కుమారుడిని చంపినా ఇంతేనా ..? కార్పొరేటర్ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిస్తారని నమ్మకంతో చేర్పించామని.. తోటి విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టి హింసించినా యాజమాన్యం పట్టించుకోకపోవడంపై విద్యార్ధి తల్లి శోభ మండిపడ్డారు. మా వాడిని చంపినా ఇంతేనా?అని వాపోయారు. సీసీ కెమెరాలను చూపించాలని చెప్పినా అవి పనిచేయడం లేదని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిచేసిన విద్యార్థులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
క్విట్ ఇండియా స్ఫూర్తితో పోరాడుదాం
ఇబ్రహీంపట్నం: పేదలు, కార్మికులు, కర్షకుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని రైతు వ్యవసాయ, సీఐటీయూ సంఘాల దేశవ్యాప్త పిలుపు మేరకు సోమవారం జైల్భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగర్ రహదారిపై బైఠాయించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్శక్తులు, మతోన్మాదం నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు క్విట్ ఇండియా స్ఫూర్తితో తెగించి పోరాడాలని పిలుపునిచ్చారు. అందుకు జైలుకై నా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సామేల్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్, ఉపాధ్యక్షుడు కిషన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంచందర్, ఉపాధ్యక్షుడు ముసలయ్య, సహాయ కార్యదర్శి బుగ్గరాములు, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి కె.జగన్, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షురాలు శారద, కార్యదర్శి గణేశ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య -
గుప్త నిధుల పేరుతో రూ.7.5 లక్షలు స్వాహా
రాజేంద్రనగర్: ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.7.5 లక్షలు తీసుకొని కనిపించకుండా పోయిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. గుడిమల్కాపూర్కు చెందిన మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36), జవహర్ నగర్ ఫర్హాన్ నగర్కు చెందిన సయ్యద్ అలీ అష్రఫ్ (40), బాలాజీ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ హాజీ (25), కీసర మండలం యాదగిరిపల్లికి చెందిన బైక్ మెకానిక్ మహ్మద్ సల్మాన్ (29)లు స్నేహితులు. మునావర్ పాత నేరస్థుడు. కార్ల పెయింటింగ్, డెంటింగ్ పనుల్లో వచ్చే ఆదాయం సరిపోక.. సులభంగా డబ్బు సంపాదించాలని కుట్రపన్నాడు. ఈ ఏడాది మార్చి 26న రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఆసిఫ్ను నిందితులు కలిశారు. జగిత్యాలలో నివాసం ఉండే ఆసిఫ్ స్నేహితుడు ఇమ్రాన్ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించారు. వాటిని తీయడానికి రూ.7.5 లక్షలు తీసుకొని కనిపించకుండా పోయారు. దీంతో ఆసిఫ్ ఈ నెల 7వ తేదీన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం మహ్మద్ మునావర్, అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కార్లు, ఆటో, రెండు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లను, నకిలీ బంగారు నాణేలు, బొగ్గును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు వివిధ ప్రాంతాల్లో 11 మందిని ఇలాగే మోసం చేసి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె. రవి, సబ్ ఇన్స్పెక్టర్లు మన్సూర్ అలీ, నర్సింగ్ రావు, ఎస్. శేషు, టాస్క్ఫోర్స్ సిబ్బంది, రాజేంద్రనగర్ పోలీసుల సహకారంతో ఈ ముఠాను పట్టుకున్నారు. నలుగురి అరెస్ట్ -
సర్కారు బడి.. రూపురేఖలు మారి!
మొయినాబాద్ రూరల్: తళుక్కున మెరిసే గోడలు, సర్వాంగ సుందరమైన తరగతి గదులు, నిగనిగలాడే బ్లాక్ బోర్డులు, పక్కన మహనీయుల వ్యాఖ్యలు.. ఇవన్నీ వింటుంటే ఇదేదో కార్పొరేట్ పాఠశాలలా ఉంది కదూ.. అలాంటిది కానే కాదు.. సకల హంగులతో మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాలలో ఇవన్నీ చూడవచ్చు. స్థానిక సర్పంచ్, దాతల సహకారంతో సర్కారు బడి రూపురేఖలే మారిపోయాయి. దాదాపు రూ.5–6 లక్షలు వెచ్చించి పాఠశాలలో గోడలకు రంగులతో పాటు బ్లాక్ బోర్డులు, బొమ్మలు, కొటేషన్లు, మెరుస్తున్న పెయిటింగ్లు వేశారు. ఇవే కాకుండా ఫర్నిచర్, టాయిలెట్ల సౌకర్యం తదితర వసతులు సమకూర్చారు. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రాథమిక పాఠశాల కళకళలాడుతోంది. దాతల సహకారంతో పాఠశాలలకు కొత్త హంగులు పాఠశాల అభివృద్ధే లక్ష్యం ప్రభుత్వంతో పాటు తమ వంతుగా పాఠశాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. ప్రైవేటుకు దీటుగా అన్ని వసతులు కల్పించాం. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోంది. ఇంటింటికి తిరిగి పిల్లలను చేర్పించాం. గతేడాది కంటే ఈసారి ఎక్కువ విద్యార్థులు చేరారు. – పద్మసంజీవరెడ్డి, సర్పంచ్, నాగిరెడ్డిగూడ -
రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ మృతి
అనంతగిరి: రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతిచెందిన ఘటన వికారాబాద్లో చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ హరిప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి రెండు గంటలకు టాటానగర్ యశ్వంతపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఇంజన్కు గుర్తుతెలియని మహిళ మృతదేహం చిక్కుకొని ఉండటాన్ని లోకో పైలట్ గమనించాడు. ఈ విషయాన్ని వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి వయ స్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని, చామనఛాయ కలిగి ఉందని, తలపై నలుపు మరియు తెలుపు రంగు జుట్టు పురుషుల మాదిరిగా కత్తిరించి ఉందని తెలిపారు. బాడీని వికారాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని, ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. -
బ్రహ్మంగారిమఠంలో జిల్లావాసి మృతి
బ్రహ్మంగారిమఠం : వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఉట్లపల్లి విల్లగె వాసి మృతి చెందాడు. గ్రామానికి చెందిన అనంతయ్య కుమారుడు చిన్న శ్రీనివాస్ (50) కొంతకాలంగా అక్కడే ఉంటూ తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. సోమవారం అకస్మాత్తుగా మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అదుపుతప్పి లారీ బోల్తా కొడంగల్ రూరల్: మండల పరిధిలోని ఉడిమేశ్వరం గేటు సమీపంలో ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన సోమవారం చోటుచేసుకొంది. వివరాలు.. తాండూరు– మహబూబ్నగర్ హైవే పనులు కొనసాగుతుండగా, తాండూరు నుంచి కొడంగల్ వైపు సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ ఉడిమేశ్వరం సమీపంలోని కల్వర్టు వద్ద బోల్తాపడింది. గమనించిన పరిసరవాసులు డ్రైవర్, క్లీనర్ను లారీ క్యాబిన్ నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏఎస్ఐ యాదయ్య తెలిపారు. ఇరువర్గాల ఘర్షణ అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో ఇరువర్గాలు గొడవ పడగా, పలువురిపై కేసు నమోదైనట్లు సీఐ రఘుకుమార్ తెలిపారు. శనివారం రాత్రి బోనాల పండుగలో గొడవ జరుగుతోందనే సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి, ఇరువర్గాలను చెదరగొట్టామన్నారు. ఇందుకు కారణమైన పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
12,86,720
ఓటరు జాబితా నుంచి ఓట్లు తొలగించే అవకాశం సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్–2026)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, కరెక్షన్, డిజిటలైజేషన్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో మొత్తం 36,99,743 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 24,10,850 మంది (65.16 శాతం) మాత్రమే తమ ఎన్యూమరేషన్ పత్రాలను అందజేయగా, బీఎల్ఓలు వాటిని డిజిటలైజేషన్ చేశారు. మరో 12,86,720 (34.78 శాతం) మంది ఫారాలు సమర్పించలేదు. దీంతో వారి ఓట్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో.. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 3,93,060 ఓట్లు, ఎల్బీనగర్లో 2,70,530, రాజేంద్రనగర్లో 2,47,244, మహేశ్వరంలో 2,35,714 ఓట్లు రద్దయినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నంలో 84,458, చేవెళ్లలో 55,610, కల్వకుర్తిలో 28,482, షాద్నగర్లో 35,317 ఓట్లు రద్దయ్యే అవకాశం ఉంది. మెజార్టీ ఓటర్లు ఒక చోట నుంచి మరో చోటికి వలస పోవడం.. అందుబాటులో ఉన్నవారు తమ ఓటును సొంతూళ్లకు బదిలీ చేయించుకోవడం.. చనిపోయిన వారు, డూప్లికేట్ ఓట్లు సైతం అదే స్థాయిలో ఉండటమే ఇందుకు కారణమని తెలిసింది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ ఈ నెల 17న ఉంటుంది. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య, భౌగోళిక పరిస్థితులు, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టనున్నారు. పోలింగ్ కేంద్రాలపై దృష్టి జిల్లాలో 3,501 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వీటి పేరు మార్పు, స్థల మార్పు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల విలీనం అనే నాలుగు అంశాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. ఓటర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండే ప్రత్యామ్నాయ భవనం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల స్థల మార్పునకు ప్రతిపాదనలు రూపొందిస్తుంది. నిర్దేశిత పరిమితికి మించి ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై పరిశీలన చేస్తుంది. గతంలో 1,400 మంది ఓటర్ల పరిమితి ఉండగా, ప్రస్తుతం అది 1,200కు తగ్గిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తుంది. తగినంత ఓటర్ల సంఖ్య లేని పోలింగ్ కేంద్రాలను సమీపంలోని ఇతర పోలింగ్ కేంద్రాలతో విలీనం చేసే ప్రతిపాదనలను సైతం సిద్ధం చేసింది. గేటెడ్ కమ్యూనిటీలకు సమీపంలో లేదా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తుంది. ముగిసిన ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువు జిల్లాలో నియోజకవర్గాలు: 8 మొత్తం ఓటర్ల సంఖ్య: 36,99,743 ఫారాలు సమర్పించింది : 24,10,850 డిజిటలైజేషన్ పూర్తి: 65.16% ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ: ఈనెల 17న అభ్యంతరాల స్వీకరణ: సెప్టెంబర్ 16 వరకు తుది ఓటరు జాబితా ప్రచురణ: అక్టోబర్ 19న -
యమ డ్రింకరులు!
గుప్త నిధుల పేరుతో .. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి రూ.7.5 లక్షలతో ఉడాయించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో ‘నిషా’చరులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి యమ‘డ్రింకరులు’ మృత్యుశకటాలపై అడ్డూ అదుపు లేకుండా తిరుగుతూ అమాయకుల బతుకుల్లో చీకట్లు నింపుతున్నారు. సోమవారం తెల్లవారుజామున నార్సింగి, బాలాపూర్, మాదాపూర్ పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిన మూడు ప్రమాదాల్లో మాజీ జవాన్, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోగా పలువురు క్షతగాత్రులయ్యారు. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. రికార్డుల్లోకి ఎక్కని ఇలాంటి ఉదంతాలు నిత్యం ఎన్నో ఉంటున్నాయి. ఈ మందుబాబుల్ని కట్టడి చేయడంలో ప్రభుత్వ విభాగాలు ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. అది మూడో కేటగిరీ వైలేషన్.. ట్రాఫిక్ ఉల్లంఘనల్ని తీవ్రత ఆధారంగా మూడు రకాలుగా విభజించారు. వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదమైతే మొదటి.. ఎదుటి వారికి జరిగితే రెండోదిగా పరిగణిస్తారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు ఎదుటి వారికీ ప్రమాదం జరిగితే తీవ్రమైన మూడో కేటగిరీలోకి చేరుస్తారు. హెల్మెట్, సీట్బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటివి మొదటి కేటగిరీలో ఉంటే డ్రంకెన్ డ్రైవింగ్, రాంగ్రూట్ తదితరాలు మూడో కేటగిరీలోకి వస్తాయి. నిరూపించడమూ సవాలే.. మద్యం మత్తులో ప్రమాదాలు చేసిన కేసుల్లో ‘నిరూపణలు’ కష్టసాధ్యంగా మారుతున్నాయి. ఘటనా స్థలంలో నిందితులు దొరికితే బ్రీత్ అనలైజర్ల ద్వారా శ్వాస పరీక్షలు చేసి.. మద్యం తాగినట్లు నిరూపించడానికి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు నిందితులు ఘటనా స్థలి నుంచి పారిపోతున్నారు. వీరు చిక్కేటప్పటికి 24 నుంచి 48 గంటలు గడిచిపోతున్నాయి. దీంతో సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని నిరూపించడం గగనంగా మారుతోంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద స్థలికి వెళ్లేది, కేసుల్ని దర్యాప్తు చేసేది శాంతిభద్రతల విభాగం పోలీసులు కాగా.. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో చర్యలు తీసుకొనేది ట్రాఫిక్ పోలీసులు కావడం గమనార్హం. వీరి మధ్య సమన్వయ లోపం అనేక ఇబ్బందులకు కారణమవుతోంది. ఎస్ఓపీ లేక మరిన్ని ఇబ్బందులు ఈ తరహా కేసుల నమోదు, దర్యాప్తులోనూ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) లేకపోవడం సైతం మందుబాబులకు అనుకూలంగా మారుతోంది. ఈ కారణంగానే పోలీసులు ఒక్కో కేసును ఒక్కో రకంగా నమోదు చేయడంతో పాటు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ప్రమాదాల్లో వాహనంలో ఉన్న వారంతా మద్యం తాగినప్పటికీ... కేవలం వాహనం నడిపిన వ్యక్తిపై మాత్రమే కేసు నమోదు చేస్తున్నారు. మరికొన్నింటిలో డ్రైవింగ్ చేసిన వ్యక్తితో పాటు వాహనంలో ఉన్న ఇతరులనూ అరెస్టు చేస్తున్నారు. ఈ కేసుల నమోదు, దర్యాప్తులు ఒక్కో కమిషనరేట్లో ఒక్కో రకంగా ఉంటున్నాయి.రాజధానిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఇలా..ఏడాది హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి 2023 37,866 52,124 16,594 2024 59,572 18,959 15,390 2025 49,732 15,706 17,760 అర్ధరాత్రి వాహనాలతో రోడ్లపై రెచ్చిపోతూ.. అమాయకుల ప్రాణాలు తీస్తున్న ‘నిషా’చరులు ఒకే రోజు మూడో చోట్ల ప్రమాదాలు ఇద్దరి మృతి..పలువురికి గాయాలుమద్యం మత్తులో వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై కఠిన చర్యలు లేకపోవడం సైతం ‘నిషా’చరులు పెరగడానికి ఓ కారణంగా మారుతోంది. డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వారి వాహనాలు స్వాధీనం చేసుకునే విధానం ఉండేది. న్యాయస్థానం ఆదేశాల మేరకు దీనికి బ్రేక్ పడింది. చలాన్ జారీ చేసి కోర్టులో హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తున్నారు. నిందితులకు జైలుశిక్షలు, జరిమానాలు పెంచడం, డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయడం, కుటుంబీకులకూ కౌన్సెలింగ్ చేయడం, మందుబాబుల డేటాబేస్ను అనుసంధానించడం తదితర కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితాలు ఉంటాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. -
నోటీసులేనా.. రికవరీనా!
కొత్తూరు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020లో మండలంలోని సిద్ధాపూర్లో టీజీఐఐసీకి కేటాయించిన భూసేకరణలో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్డీఓ, తహసీల్దార్ల తీరును నిరసిస్తూ అప్పట్లోనే రైతులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు. అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి భూ పరిహారం డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేరుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి భూసేకరణలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు. స్పందించిన రెవెన్యూ అధికారులు పారదర్శకంగా విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ చివరిదశకు చేరడంతో అప్పటి అధికారులతో పాటు వారికి సహకరించిన ప్రజా ప్రతినిధులకు రికవరీ భయం పట్టుకుంది. ఇదీ భూసేకరణ.. గత ప్రభుత్వం 2020లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం సిద్ధాపూర్లోని 252, 278, 361 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములు 330.34 ఎకరాలు సేకరించి టీజీఐఐసీకి బదలాయించింది. ఇందులో సుమారు 97.24 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 160 ఎకరాలు అసైన్డ్, మిగతా 73.1 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం అసైన్డ్ రైతులకు ఎకరానికి రూ.10. 50 లక్షలు పరిహారంగా అందజేసింది. నకిలీల గుర్తింపు పూర్తి గత ఏడాది ఆగస్టులో రెవెన్యూ అధికారులు సిద్ధాపూర్ భూసేకరణ పరిహారంలో పలు ఆరోపణలు ఉన్న 80 మందికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న రైతులు మూడు రోజుల్లోగా తాము పరిహారం పొందిన పొలం, ఇతర వివరాలను రెవెన్యూ అధికారులకు వివరించాలని సూచించారు. రికార్డుల ఆధారంగా రైతులు చెప్పే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అధికారులు పరిహారం పొందిన రైతు అర్హుడా..? అనర్హుడా..? అనే వివరాలు గుర్తించారు. నోటీసులు ఇచ్చి విచారణ పూర్తి చేసి అనర్హులుగా గుర్తించిన రైతుల నుంచి పరిహారం రికవరీ చేయడానికి జాబితా రూపొందించారు. ఒకవేళ పరిహారం పొందిన రైతులు తిరిగి ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వని పక్షంలో వారు పొందిన డబ్బులకు సమానమైన వారి ఆస్తిని సైతం అటాచ్మెంట్ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. భూసేకరణలో సుమారు రూ.8 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారని సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం సేకరించిన పొలాల్లో డంప్యార్డు ప్రతిపాదన రావడంతో నిధుల రికవరీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్ల కోసం సేకరించిన పొలాలు సిద్ధాపూర్ భూసేకరణలో అవకతవకలు భూ పరిహారం కాజేశారని అప్పట్లోనే ఆరోపణలు అధికారుల తీరుపై ఆందోళనలు ఆరోపణలు ఎదుర్కొన్న 80 మందికి నోటీసులు పరిహారం రికవరీకి జాబితా రూపకల్పన డంప్యార్డు ప్రతిపాదనతో విషయం పక్కదారి ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్కోసం సేకరించిన మొత్తం 330.34 ఎకరాల్లో కేవలం 150 నుంచి 160 ఎకరాల్లో అసైన్డ్ రైతులు ఉన్నారు. ఈ విస్తీర్ణానికి మాత్రమే రైతులకు పరిహారం అందించాలి. అధికారులు మాత్రం 240 ఎకరాలకు పరిహారం అందించినట్లు రికార్డుల్లో పేర్కొంటున్నారు. వాస్తవంగా సుమారు 15 మంది అసైన్డ్ రైతులకు సాగు చేస్తున్న 25 ఎకరాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. వారు నేటికీ ఇదే పొలాల్లో సాగుచేస్తూ కబ్జాలో ఉన్నారు. మరికొంత మంది రైతులకు రికార్డు ప్రకారం 3 ఎకరాలు ఉంటే ఎకరానికి మాత్రమే పరిహారం అందించినట్లు తెలుస్తోంది. అసైన్డ్ పట్టాలు, కబ్జాలో లేని వారికి మాత్రం రెండు, మూడెకరాలకు సైతం పరిహారం అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల తీరుతో నిజమైన అసైన్డ్ రైతులకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. -
మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు
శంకర్పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని సోమవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలోని శివ లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కుమార్ వారికి శేషవస్త్రం కప్పి, ఆలయ ఫొటోను బహూకరించారు. షాబాద్: గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని చేవెళ్ల ఏసీపీ కిషన్ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెదవేడులో షాబాద్ సహకార సంఘం డైరెక్టర్ దేవేందర్రెడ్డి, సర్పంచ్ రాజసులోచన సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామ రక్షణ కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించి ముందుకు రావాలని కోరారు. సీసీ కెమెరాలతో ఇప్పటివరకు పలు కేసులు ఛేదించినట్లు తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో సీఐ డీకే లక్ష్మీరెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ దేవేందర్రెడ్డి, సర్పంచ్ రాజ సులోచన, ఎస్ఐ చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 108 అంబులెన్స్లో ప్రసవంతల్లీబిడ్డలు క్షేమం కడ్తాల్: మండల పరిధిలోని నేరెళ్లకోళ్లతండాకు చెందిన చెంచు లక్ష్మి (20)కి సోమవారం పురిటి నొప్పులు రావడంతో, కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. తండాకు చేరుకున్న సిబ్బంది గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్లోనే ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డలను క్షేమంగా కల్వకుర్తి ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో స్పందించి, ప్రసవం చేసిన సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఖాతాదారుకు తెలియకుండా నగదు బదిలీ న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు కొత్తూరు: ఖాతాదారుకు తెలియకుండానే అతడి అకౌంట్ నుంచి నగదు మరో ఖాతాకు బదిలీ అయింది. ఆలస్యంగా గుర్తించిన బాధితుడు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన చెన్నయ్య గ్రామంలో హెయిర్కటింగ్ సెలూన్ నిర్వహిస్తున్నాడు. గత నెల 1న అతడి ఖాతా నుంచి రూ.98 వేలు మరో అకౌంట్కు బదిలీ అయ్యాయి. ఆలస్యంగా నగదు బదిలీ జరిగిన విషయాన్ని గుర్తించిన చెన్నయ్య సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
అసలే లేటు.. ఆపై లోటు
వానలు సరిగాలేక తూర్పు గొంతెండుతోంది.. సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో వాన విచిత్రం.. పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో జోరుగా కురవగా, నగరానికి తూర్పు దిక్కుల్లో విస్తరించి ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలులేవు. ఈ సీజనల్లో ఆలస్యంగా వర్షాలు మొదలుకాగా, అందులోనూ లోటు వర్షపాతం నమోదైంది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో నమోదవాల్సిన సగటు వర్షపాతంలో తూర్పు వైపున గణనీయమైన లోటు కనిపిస్తోంది. ఆకాశంలో మేఘాలు దట్టంగా పడుతున్నా, గాలి మళ్లిపోవడమో, లోకల్ మైక్రో–కై ్లమేట్ ప్రభావమో చినుకులు నేలను తాకకుండానే దాటిపోతున్నాయి. దీంతో ఈ ప్రాంత భూగర్భజలాలకు ఆశించిన స్థాయిలో నీటిచేరిక లభించలేదు. రుతుపవన మేఘాల గమనం పశ్చిమ నియోజకవర్గాల మీదుగా సాగడం వల్ల ఈ దిక్కుల్లో జలకళ తొణికిసలాడుతోంది. గచ్చిబౌలి, శంషాబాద్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, హైటెక్ సిటీ, మాదాపూర్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్ను ఆనుకుని ఉన్న పరిసరాల్లో కురిసిన భారీ వర్షాలు సగటు నమోదును’అధిక’కేటగిరీకి చేర్చాయి. రానున్న రోజుల్లో నగరంలో తుఫాను ద్రోణి గమనంలో మార్పులు వస్తే తప్ప తూర్పు ప్రాంతంలోని లోటు భర్తీ అయ్యే అవకాశం లేదని వాతావరణ నిపుణులు అంటున్నారు. నగరం మొత్తం సగటు వర్షపాతం గణాంకాల ప్రకారం సాధారణ స్థాయికి సమీపంలో కనిపించినప్పటికీ, భౌగోళికంగా చూస్తే మాత్రం తూర్పు దాహం తీరాల్సి ఉంది. మహానగరంలో లోటు వర్షపాతం సెం.మీ.లలో ఇలా.. ప్రాంతం సాధారణం కురిసింది లోటు శాతందుండిగల్ 35.77 19.71 45 మేడ్చల్ 32.85 19.35 41 ఘట్కేసర్ 34.25 20.19 41 కీసర 31.08 18.59 40 తిరుమలగిరి 33.70 21.03 38 కాప్రా 29.28 18.99 35 అల్వాల్ 30.00 19.54 35 మల్కాజిగిరి 30.10 19.74 34 ఉప్పల్ 33.41 22.29 33 ఇంకా 27 శాతం తక్కువ వర్షపాతం సాధారణ స్థితిలో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు -
ఈ– కేవైసీతోనే సిలిండర్
● లేదంటే గ్యాస్ బండ రావడం కష్టమే ● గ్రేటర్లో లక్షల మంది దూరంగానే.. ● గడువు మరో వారం రోజులే ● ఎస్ఎంఎస్లు పంపుతున్న సంస్థలుసాక్షి, సిటీబ్యూరో: పంజాగుట్టకు చెందిన సుమతి గత నెల 25న ఆన్లైన్లో ఎల్పీజీ సిలిండర్ బుక్ చేశారు. 15 రోజులైనా రాలేదు. ఈ– కేవైసీ పూర్తి చేయకపోవడంతో డెలివరీ నిలిపివేసినట్లు తెలిసింది. వెంటనే ఏజెన్సీకి వెళ్లి ఈ–కేవైసీ చేసుకోవడంతో మరుసటి రోజే సిలిండర్ వచ్చింది. ప్రస్తుతం నగరంలో చాలామంది వినియోగదారులు ఈ–కేవైసీ ప్రక్రియతో ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నెల 16లోగా ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని చమురు మార్కెటింగ్ కంపెనీలు గడువు విధించాయి. ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ కంపెనీలు నేరుగా వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాయి. గడువు మించితే సిలిండర్లు అందవని స్పష్టం చేశాయి. నేరుగా ఏజెన్సీ వద్ద, యాప్ల ద్వారా మొబైల్లో లేదా ఇంట్లోనే బయోమెట్రిక్ ద్వారానూ ఈ–కేవైసీ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ మహా నగరంలో ఇంకా లక్షలాది మంది ఈ పని చేయలేదు. కాగా.. కంపెనీల అధికారిక యాప్లు, వెబ్సైట్ల ద్వారానే ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఆధార్, ఓటీపీలు ఎవరితోనూ పంచుకో వద్దని హెచ్చరిస్తున్నాయి. ఈ– కేవైసీ చేసుకునేదిలా.. ఇండియన్ ఆయిల్ (ఇండేన్): ప్లేస్టోర్ నుంచి ‘ఇండియన్ ఆయిల్ వన్ ఆధార్ ఫేస్ ఆర్డీ’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. లింక్ అయిన ఫోన్ నంబరు, మెయిల్తో పాస్వర్డ్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వాలి. మొదటిసారి యూజర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. గ్యాస్ క్యాష్ మెమో లేదా సబ్స్క్రిప్షన్ ఓచర్పై ఉన్న 16 అంకెల ఎల్పీజీ ఐడీని లింక్ చేయాలి. అందులో కస్టమర్ వివరాలు కనిపిస్తాయి. లాగిన్ అయ్యాక హోమ్ పేజీలో ప్రొఫైల్పై క్లిక్ చేస్తే ఆధార్ లింక్ అండ్ ఈ–కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. పచ్చ రంగు టిక్ మార్క్ ఉంటే మీ కేవైసీ పూర్తయినట్లు. కాకపోతే అక్కడే రీ–అథెంటికేషన్ బటన్ నొక్కి మీ ముఖాన్ని స్కాన్ చేసి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఒకవేళ మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయి ఉంటే మొదట దాన్ని అన్లాక్ చేయాలి. భారత్ గ్యాస్: ప్లేస్టోర్ నుంచి ‘హలో బీపీసీఎల్ ఆధార్ ఫేస్ ఆర్డీ’ యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబరుతో ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి లాగిన్ కావాలి. యాప్ హోమ్ పేజీలోనే ఈ–కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి మరోసారి ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. అనంతరం ప్రాసెస్కు సూచనలు చేస్తుంది. వాటిని పాటించాలి. హెచ్పీ గ్యాస్ : ప్లేస్టోర్ నుంచి ‘హెచ్పీ పే’తో పాటు ‘ఆధార్ ఫేస్ ఆర్డీ’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ తెరిచాక రిజిస్టర్డ్పై క్లిక్ చేసి అకౌంట్ లింకింగ్ కోసం మొబైల్ నంబరు నమోదు చేయాలి. ఓటీపీ వెరిఫై చేసి లాగిన్ కావాలి. హోమ్ పేజీలో ‘మై హెచ్పీ గ్యాస్’ సెక్షన్కు వెళ్లి ‘ఎల్పీజీ’ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అక్కడ ఈ–కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి స్క్రీన్పై కనిపించే సూచనలు పాటించాలి. అనంతరం కెమెరా ఫేస్పై క్లిక్ చేస్తే కొన్ని సూచనలు చేస్తుంది. ముఖాన్ని స్కాన్ చేస్తే ఈ–కేవైసీ పూర్తవుతుంది. -
ఆదివాసీలను ఆదుకోవాలి
హయత్నగర్: దేశంలో అటవీ సంపదను కాపాడుతూ, సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్నది ఆదివాసీలే అని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం అబ్దుల్లాపూర్మెట్టు మండల గిరిజన సమాఖ్య కార్యదర్శి శంకర్నాయక్ ఆధ్వర్యంలో కుంట్లూరు రావినారాయణరెడ్డి కాలనీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నారని, కనీసం బడి మొకం చూడని తండాలు, గూడేలు ఉండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. రాజ్యాంగ బద్ధంగా అందాల్సిన సంక్షేమ పథకాలు, సౌకర్యాలు అందించాలని, పల్లెల్లో విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సమాఖ్య అధ్యక్షుడు బానావత్ భిక్షం నాయక్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్, ఆజ్మీరా హరిసింగ్ నాయక్, కేతరాజు నర్సింహ, సరిలాల్, లచ్చూనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అర్బన్ పార్క్కు వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
నర్సాపూర్ రూరల్: మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి దుర్మరణం చెందారని నర్సాపూర్ ఎస్సై రంజిత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్కు చెందిన షేక్ హసిన్ మెహతా(19) బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. స్నేహితులు వెంకటగిరీష్, చంద్ర, దేవ సునందన్ సాయితో కలిసి మియాపూర్ నుంచి ఆదివారం ఉదయం నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్క్ సందర్శనకు బైక్లపై వచ్చారు. అనంతరం తిరుగుప్రయాణంలో కొండాపూర్ సమీపంలోని టర్నింగ్ వద్ద బైక్ అతివేగంగా రెయిలింగ్ను ఢీకొట్టగా హసిన్ మెహతాకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా రోడ్డు ప్రమాదంలో నగర విద్యార్థి దుర్మరణం -
ఆలయానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు బుగ్గి
లంగర్హౌస్: ఆలయానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు బూడిద అయింది. ఈవీ చార్జింగ్ సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లంగర్హౌస్ బాపునగర్లో మూడంతస్తుల భవనంలో దశరథ్గౌడ్ కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నివసిస్తున్నారు. కింద పార్క్ చేసిన ద్విచక్రవాహనానికి రెండో అంతస్తు నుంచి కేబుల్ వైర్తో చార్జింగ్ పెట్టారు. ఆదివారం ఆషాడమాసం బోనాల వేడుకల్లో అందరూ అమ్మవారి ఆలయానికి బోనంతో వెళ్లారు. కొద్దిసేపటికి ఈ చార్జర్ వల్ల రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. నిమిషాల్లోనే మంటలు వ్యాపించి ఆ అంతస్తు పూర్తిగా దగ్ధం అయింది. మంటలు పక్క ఇళ్లలోకి వ్యాపించే సమయంలో స్పందించిన మురళి అనే స్థానికుడితోపాటు మరో వ్యక్తి కలిసి పక్క భవనం నుంచి దూకి ప్రాణాలకు తెగించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే వేడిగా మారిన రెండు సిలిండర్లను పోలీసులు జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించారు. దాదాపు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈవీ చార్జింగ్తో అగ్నిప్రమాదం -
ఫోన్ చోరీ.. నగదు బదిలీ
కొత్తూరు: ఓ కార్మికుడి మొబైల్ ఫోన్ చోరీ చేయడమే కాకుండా ఫోన్ అన్లాక్ చేసి ఆన్లైన్లో నగదు అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో నివాసం ఉంటున్న లింగాల జగన్గౌడ్ గత నెల 21న విధులు నిర్వర్తించే పరిశ్రమకు వెళ్లేందుకు కొత్తూరు బస్టాండ్లో బస్సు ఎక్కే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి అతడి సెల్ఫోన్ దొంగిలించాడు. అనంతరం గత నెల 23 నుంచి 26వ తేదీ వరకు సుమారు రూ.1.55 లక్షలు ఆయా అకౌంట్లు, ఆన్లైన్ ద్వారా బదిలీ చేసుకున్నాడు. ఆలస్యంగా విషయం గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై తక్కళ్లపల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వార్డు సభ్యుడు మృతి చెందారు. వివరాలివీ.. కొత్తపల్లి గ్రామ పంచాయతీ పదో వార్డు సభ్యుడు పొలె శివ (40) ఆదివారం సాయంత్రం యాచారం నుంచి స్కూటీపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. తక్కళ్లపల్లి గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా మాల్ వైపు నుంచి అతి వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య మమత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రమాదానికి కారకులైన వారు మాడ్గుల మండల కేంద్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఘటన గాంధీఆస్పత్రి: నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి చెందినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు. గాంధీ మెడికల్ కాలేజీ హాస్టల్ భవన నిర్మాణ పనుల్లో బీహార్ రాష్ట్రం ముజఫరాపూర్, పరూఖస్బాతొల గ్రామానికి చెందిన మహ్మద్ ముస్తాఫా(44) కార్మికుడు. శనివారం సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో క్రేన్ మోటార్లు తడిసిపోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ పరదా తీసుకుని ఏడో అంతస్థుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. తోటి కార్మికులు గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకువెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య షెహనాజ్ ఖాతూన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారంపోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి కాంట్రాక్టు సంస్థ నష్టపరిహారం చెల్లించి అన్నివిధాలా ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఓయూలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్యాంపస్లో ర్యాలీ చేపట్టి, ఆర్ట్స్ కాలేజీ ఎదుట సంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం దూరవిద్య కేంద్రం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ప్రొ.నాగేశ్వర్రావు అధ్యక్షత వహించగా సామాజికవేత్త ప్రొ.హరగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందిన ఆదివాసీల జీవితాల్లో మార్పు రాలేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ స్టూడెంట్ ఫెరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్, నాయకులు రాంబాబు, రాజశేఖర్, పాపయ్య, వెంకటరమణ, గౌతందొర తదితరులు పాల్గొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే ఆర్పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) బ్యాండ్ బృందం 80వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ఆదివారం కాచిగూడ రైల్వేస్టేషన్లో 12 మంది సభ్యులతో అద్భుతమైన సంగీత ప్రదర్శనను నిర్వహించింది. అనేక దేశభక్తి గీతాలతోపాటు ప్రజాదరణ పొందిన పాటలతో ప్రయాణికులు, ఆహూతులను అలరించింది. కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు. -
విద్యార్థులకు ఉపకారం
తుక్కుగూడ: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. నిరుపేదలు ఉన్నత విద్యను చదువుకునేందుకు ఈ ఉపకార వేతనం ఎంతో ఉపయోగపడనుంది. ఆర్థిక కారణాలతో ఉన్నత చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ స్కాలర్ షిప్ను తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రోత్సాహకంగా ఉపకార వేతనం ఇస్తుంది. అర్హతలు ఇవీ.. ● ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ● ఏడో తరగతిలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ● తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి. ● కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. ● అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో ఫారాలను డీఈఓ కార్యాలయంలో అందజేయాలి. ఇంటర్ సెకండియర్ వరకు.. ప్రభుత్వ ఎయిడెడ్, మోడల్, గురుకుల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పొందిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. ఆన్లైన్లో పరీక్ష రుసుం పరీక్షకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులు రూ.50 పరీక్ష రుసుం ఆన్లైన్లో చెల్లించి www.bse.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు ఈనెల14 తేదీ వరకు గడువు ఉంది. అక్టోబర్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో రాసే వెసులుబాటు కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కేంద్రం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ప్రవేశపెట్టింది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులను పరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ప్రతిభ చాటిన వారికి ప్రోత్సాహకంగా ఉపకార వేతనం అందించనుంది. వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహకం ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 14వ తేదీ తుది గడువు.. అక్టోబర్లో పరీక్ష ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న వారు అర్హులు ఎంపికై న స్టూడెంట్స్కు ఏడాదికి రూ.12వేల స్కాలర్షిప్ -
నేటితో ఆఖరు ‘సర్’
ఇబ్రహీంపట్నం: ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ జాబితాకు (సర్) గడువు సోమవారంతో ముగియనుంది. జూన్ 25 నుంచి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మొదలుపెట్టగా ఫారాలు పూరించి ఇచ్చేందుకు రెండు దఫాలు గడువు పెంచిన సంగతి తెలిసిందే. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 3,44,584 ఓటర్లు, 359 పోలింగ్ కేంద్రాలు ఉండగా సర్ ప్రక్రియ కోసం 359 బీఎల్వోలు, 39 మంది సూపర్వైజర్లు, ఏడుగురు ఏఈఆర్వోలను ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు 2,57,627 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బీఎల్వోలకు అందజేశారు. ఎక్కడ ఎంత శాతం అంటే.. యాచారం మండలంలో 84.8 శాతం, మంచాల మండలంలో 89.4, ఇబ్రహీంపట్నం రూరల్ 90.6, అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో 76.9, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో 71.6, ఆదిభట్ల సర్కిల్–15 పరిధిలో 64.6, పెద్ద అంబర్పేట సర్కిల్ 11 పరిధిలో 65.7 శాతంతో నియోజకవర్గంలో 74.8 శాతం ప్రక్రియ పూర్తి చేసుకుంది. మ్యాపింగ్ కానివి 17,675, అన్ కలెక్టబుల్గా 77,814 ఓటర్లు ఉన్నారు. చనిపోయిన, స్థానికంగాలేని, అడ్రసు దొరకని శాశ్వతంగా వెళ్లిపోయిన ఓటర్లు 14,603 మంది ఉన్నారు. 42,246 మంది ఓట్లు ఇతర ప్రాంతాల్లో సైతం ఉండటంతో వారు తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్వోలకు దాఖలు చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. పల్లెలకే ప్రాధాన్యత సర్ ప్రక్రియతో రెండు చోట్ల ఓట్లున్న వారు ఏదో ఒకచోట ఓటును పొందే అవకాశం ఉంటుంది. పట్టణాల్లో ఉండే ఓటర్లు ఎక్కువ శాతం స్వగ్రామాలకే మొగ్గు చూపారు. దీంతో అర్బన్ ప్రాంతాల్లో ఓట్ల శాతం తక్కువగా నమోదైంది. మరోసారి గడువు పొడిగించే అవకాశాలు లేకపోవచ్చని అధికారవర్గాలు అంటున్నాయి. సోమవారంతో గడువు ముగుస్తుండడంతో ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని ఓటర్లను బీఎల్వోలు సంప్రదించనున్నారు. సరిచేసుకునే అవకాశం ఈ నెల ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించినప్పటి నుంచి సెప్టెంబర్ 16 వరకు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్ 15 వరకు జాబితా వివరాల్లో తేడాలు కలిగిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచి సమస్యను పరిష్కరించనున్నారు. ఈసీ నిర్దేశించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా చూపించి ఓటు ఉండేలా సరిచేసుకోవచ్చు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తొలగిపోవద్దని, అనర్హత కలిగిన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండొద్దని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలపై దృష్టి ఒక పోలింగ్ స్టేషన్లో 1,200 మంది ఓటర్ల కంటే ఎక్కువగా ఉంటే ఆ ఓట్లను పక్క పోలింగ్ బూత్లోకి మార్చడం, అవసరమైతే కొత్త పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసే అంశంపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. పోలింగ్ కేంద్రాల పేరు మార్పు, స్థల మార్పు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, విలీనం అంశాలపై పరిశీలిస్తున్నారు. వేలల్లో ఓట్లు తగ్గే అవకాశం నియోజకవర్గంలో డబుల్ ఓట్లు, అడ్రసు దొరకని, చనిపోయిన, శాశ్వతంగా వెళ్లిపోయిన వారి ఓట్లను తొలగిస్తే సుమారు 60 వేలకుపైగా ఓట్లు తగ్గే అవకాశం ఉందని పరిశీలకులంటున్నారు. నగరానికి అతి సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గంలో వేర్వేరు ప్రాంతాల వారు ఉద్యోగ, ఉపాధి రీత్యా ఇక్కడ స్థిరపడ్డారు. ఏదో ఒకచోట ఓటు హక్కు ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముగియనున్న సమగ్ర ఓటరు జాబితా సవరణ గడువు ఇప్పటికే రెండు దఫాలు గడువు పెంపు ‘పట్నం’ నియోజకవర్గంలో 74.8 శాతం ప్రక్రియ పూర్తి స్వగ్రామాలవైపే అధికశాతం ఓటర్ల మొగ్గు అర్బన్ ప్రాంతాల్లో తగ్గిన ఓట్ల శాతం -
లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
హయత్నగర్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హయత్నగర్లోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి గాను తాత్కాలిక లెక్చరర్స్గా పని చేసేందుకు అర్హత గల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయ లలిత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియంలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని, సంబంధిత సబెక్టుల్లో పీజీతో పాటు బీఎడ్ అర్హత గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11న ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్ మానస హెల్త్ భవనంలోని జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావాలన్నారు. వివరాలకు 83099 31449 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఇబ్రహీంపట్నం: డా.బీఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ 2026–27 ప్రవేశాల గడువును సెప్టెంబర్ 9 వరకు పెంచినట్లు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాధిక, సెంటర్ కో–ఆర్డినేటర్ శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ఓపెన్ స్టడీ సెంటర్–172లో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో కోర్సుల్లో చేరేందుకు అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఎస్ఎస్సీ ఉత్తీర్ణులై, రెండేళ్ల ఐటీఐ కోర్సు చేసిన విద్యార్థులు సైతం ప్రవేశాలకు అర్హులని చెప్పారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజులను సకాలంలో చెల్లించాలన్నారు. మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్ పోచమ్మ ఆలయం హుండీలో ఓ భక్తుడు అమెరికన్ డాలర్ వేశారు. ఆదివారం బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా కొందరు అమ్మవారి హుండీలో కానుకలు సమర్పించారు. ఓ భక్తుడు అమ్మవారి హుండీలో ఒక డాలర్ వేశాడు. సాయంత్రం ఆలయ నిర్వాహకులు హుండీ తెరిచి లెక్కించడంతో డాలర్ బయటపడింది. అది హుండీలో ఎవరు వేశారోనని స్థానికంగా చర్చ జరుగుతోంది. పరిసర ప్రాంతాల్లోని ఫాంహౌస్ల్లో ఉన్నవారు వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. హుడాకాంప్లెక్స్: హైడ్రా ఉద్యోగాల ఎంపికకు అనూహ్యంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరుకావడంతో దేహదారుఢ్య పరీక్షల గడువును ఈ నెల 11 వరకు పొడిగించారు. తొలుత రెండు రోజులపాటు నిర్వహించాల్సిన ఈవెంట్స్కు వేలాదిమంది తరలిరావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 100 డీఆర్ఎఫ్ అసిస్టెంట్, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు మాత్రమే ఉన్నప్పటికీ.. హాజరైన ప్రతి అభ్యర్థికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జూ పార్క్లో ఘనంగా సింహాల దినోత్సవం బహదుర్పురా: ప్రపంచ సింహాల దినోత్సవాన్ని నెహ్రూ జులాజికల్ పార్క్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంతు సంరక్షకులు జూ సందర్శకులకు వన్యప్రాణులపై అవగాహన కల్పించడంతో పాటు సింహాలపై టాక్ షో నిర్వహించారు. వాటి ఆహార అలవాట్లు, ప్రవర్తన, సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జూ పార్కులో ఆసియా, ఆఫ్రికన్ సింహాలు ఉన్నాయని డిప్యూటీ క్యూరేటర్ మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్లు నజియ తబస్సుమ్, లక్ష్మణ్, పీఆర్వో హనీఫ్, జూ పార్క్ ఎడ్యుకేషన్ అధికారి దీపక్ తరుణ్, యానిమల్ కీపర్ అయూబ్ కౌసర్ తదితరులు పాల్గొన్నారు. -
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు
ఇబ్రహీంపట్నం: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఎంఆర్ఆర్ ఫౌండేషన్, మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో మల్రెడ్డి అభిషేక్రెడ్డి నేతృత్వంలో పోలీసు ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ యువతకు ఇచ్చే ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆదివారం ఇబ్రహీంపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగార్థులు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మన జిల్లాకు పోలీసు ఉద్యోగాల పోస్టులు లేవని ఆందోళన చెందొద్దని.. కొన్ని కారణాలతో ఇక్కడి ప్రక్రియ ఆగిందని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అప్పటి వరకు చదువుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రాయపోల్ గ్రామంలో మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో రూ.20 లక్షలతో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిరించనున్న సీసీ రోడ్డు, రూ.50లక్షల హెచ్ఎండీఏ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డుకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహిపాల్, పాండురంగారెడ్డి, ఈసీ శేఖర్గౌడ్, జయమ్మ, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరాచారి, కౌన్సిలర్లు ఇందూరి శ్రీనివాస్, బాను, రాందాసు, రాయపోల్ సర్పంచ్ మమత శ్రీశైలం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంఖాల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
థాయిలాండ్ నుంచి ఖుష్ఖుషీగా!
ఓజి ఖుష్ స్మగ్లింగ్కు కేంద్రంగా బ్యాంకాక్సాక్షి, సిటీబ్యూరో: మట్టి అవసరం లేకుండా పెంచే హైడ్రాఫోనిక్ గంజాయి ఓజి ఖుష్ అక్రమ రవాణా థాయిలాండ్ కేంద్రంగా మారింది. బ్యాంకాక్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి ఈ సరుకు చేరుతోంది. ప్రధానంగా రెండు విమానాల ద్వారానే వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 2024 నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఆర్జీఐఏ విమానాశ్రయంలో వెలుగులోకి వచ్చిన 33 కేసుల్లో... 28 ఉదంతాలకు మూలం థాయిలాండ్ అని బయటపడింది. ప్రతి 10 కేసుల్లో ఏడు కేసులు బ్యాంకాక్–హైదరాబాద్ మధ్య నడిచే రెండు విమానాలకు సంబంధించినవేనని దర్యాప్తులో తేల్చారు. భారత్, థాయిల్యాండ్లకు చెందిన ఆ రెండు విమాన సర్వీసులను వినియోగించి 22 మంది ట్రాన్స్పోర్టర్లు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో వాటి ద్వారా రాకపోకలు సాగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని నిర్ణయించారు. ఈ 22 కేసుల్లో అధికారులు 134.2 కిలోల ఓజి ఖుష్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 33 కేసుల్లో కలిపి 40 మంది నిందితులుగా ఉన్నారు. స్మగ్లర్లు ఈ రెండు విమానాలనే ఎంచుకోవడానికి డైరెక్టు విమానాలు కావడం, అధిక సర్వీసులు ఉండటంతో పాటు వాటి రాకపోకల సమయాలే కారణమని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. స్వదేశీ విమానయాన సంస్థ విమానంలో స్మగ్లింగ్ సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదు కాగా.. అత్యధిక పరిమాణంలో సరుకు దొరికింది మాత్రం థాయ్ల్యాండ్ విమానంలోనే. ఈ అంతర్జాతీయ విమానానికి సంబంధించిన 10 కేసుల్లో 77.8 కిలోల గంజాయి స్వాధీనమైంది. సరాసరిన ఒక్కో కేసులో 7.8 కిలోలు లభించినట్లైంది. భారత్కు చెందిన విమానయాన సంస్థకు చెందిన విమనంలో రవాణా అయిన గంజాయికి సంబంధించిన 12 కేసుల్లో 56.4 కిలోల గంజాయి స్వాధీనం కాగా, ఒక్కో కేసులో సగటున 4.7 కిలోలు లభించినట్లు అయిందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. గంజా యిని పంపే ముఠాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఒక రోజు పంపాలని భావించిన సరుకును ఒకరికే ఇచ్చి, ఒకే విమానంలో తరలించకుండా వేర్వేరుగా పంపిస్తున్నారు. గత ఏడాది జనవరి 24న తియొట్టిల్ అష్రఫ్ షౌక్కతలి, మహత్ కార్కి అనురాధ, మహత్ ఆశ అనే ప్రయాణికుల నుంచి 8.4 కిలోల ఓజి ఖుష్ స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు మరో కేసులో ముబష్షిర్ అబ్బాస్ సయ్యద్, షబ్బార్ రజా రిజ్వీ అనే కొరియర్లను థాయ్లాండ్కు చెందిన అంతర్జాతీయ విమానంలో 13.9 కిలోల సరుకుతో పట్టుకున్నారు. దీని విలువ రూ.13.9 కోట్లుగా అంచనా వేస్తున్నారు. బ్యాంకాక్ నుంచి నేరుగానే కాకుండా అబుదాబి, కౌలాలంపూర్, హనోయ్ మీదుగానూ హైదరాబాద్కు ఈ సరుకును చేరుస్తున్నారు. కొన్ని కేసుల్లో హైదరాబాద్కు ఓజి గంజాయి చేర్చడానికి ముంబైని ట్రాన్సిట్ పాయింట్గా ఉపయోగిస్తున్నారు. అధిక శాతం ఓజి ఖుష్ను చెక్–ఇన్ లగేజీలో ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరలు, వ్యాక్యూమ్–సీల్డ్ ప్యాకెట్లు లేదా వస్తువుల ప్యాకేజింగ్లో దాచినట్లు గుర్తించారు. కార్న్ఫ్లేక్స్ డబ్బాలు, కుకీ బాక్సులు, ఆహార పదార్థాల ప్యాకెట్లు, దుస్తుల మధ్య గంజాయి ప్యాకెట్లను దాచిపెట్టి తరలిస్తున్నారు. కొరియర్లుగా పిలిచే ఈ ఓజి ట్రాన్స్పోర్టర్లకు ప్రధాన సూత్రధారులు ఒక్కో ట్రిక్కు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లిస్తున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు. అక్కడ నుంచే నగరానికి వస్తున్న ఈ గంజాయి ఆ రెండు విమానాల ద్వారానే అత్యధికం స్మగ్లింగ్ నిఘా ముమ్మరం చేసిన కస్టమ్స్, డీఆర్ఐ టీమ్స్ -
ఆలయాలు హిందూ చరిత్రకు మూలం
కుల్కచర్ల: ఆలయాలు హిందూ చరిత్రకు మూలమని బీజేపీ రాష్ట్ర నాయకుడు కరణం ప్రహ్లాదరావు అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని ఘనపూర్లో శివరామగుర్గా క్షేత్రంలో ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన ఆలయాలను మనమే పరిరక్షించుకోవాలని, హిందూ ధర్మానికి చరిత్రకు ఆలయాలే మూలాధారమన్నారు. అనంతరం బుయ్యని విజయలక్ష్మీవెంకటరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఘణపురం వెంకటయ్య, కుల్కచర్ల సర్పంచ్ అంజిలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, ఘనపూర్ మాజీ సర్పంచ్ విజయలక్ష్మిగోపాల్, దిశ కమిటీ జిల్లా సభ్యుడు జానకిరాం, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా కార్యవర్గసభ్యులు మైపాల్, కాటనిపల్లి అంజిలయ్య, పీఎన్పీఎస్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేంధర్ గౌడ్, నాయకులు అంజనేయులు, రాంచంద్రయ్య, సాయికిరణ్, చంద్రయ్య, జి.మైపాల్, డి.అంజిలయ్య, మోహన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రహ్లాదరావు -
సొంత భవనాలకు తాళం..అద్దె గూటికి గురుకులం
మొయినాబాద్: కళాశాల విద్యార్థుల వసతి గృహం కోసం రూ.కోట్లు ఖర్చుచేసి ప్రభుత్వ భవనం నిర్మించారు. ఇందులో వసతి గృహానికి బదులుగా సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు. కొంత కాలం పాటు గురుకులాన్ని నడిపించి సరిపడా వసతులు లేవని అదనపు గదులు, ప్రహరీ నిర్మించారు. చివరికి ఈ భవనాన్ని వదిలి గురుకులాన్ని ప్రైవేటు భవనంలోకి మార్చారు. అక్కడ రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తూ.. ప్రభుత్వ భవనాలను వృథాగా వదిలేశారు. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ అధికారుల పనితీరు. రూ.2 కోట్లు వెచ్చించి.. మొయినాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పదేళ్ల క్రితం కళాశాల విద్యార్థుల(బాలికల) వసతిగృహాన్ని నిర్మించారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రూ. కోటి నిధులతో భవనాన్ని నిర్మించి ప్రారంభించారు. కానీ కళాశాల బాలికల హాస్టల్ను మాత్రం అందులో ఏర్పాటు చేయలేదు. అంతలోనే ప్రభుత్వం కొత్త గురుకులాలు ఏర్పాటు చేయడంతో శంకర్పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఈ భవనంలో ప్రారంభించారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడంకోసం ఈ భవనంపై విడతలవారీగా అదనపు గదులు, వంటశాల, ల్యాబ్ నిర్మించారు. మరో రూ.కోటితో ప్రహరీ నిర్మించారు. ఏడాది క్రితం వరకు శంకర్పల్లి గురుకులం ఇక్కడే కొనసాగింది. గతేడాది శంకర్పల్లి గురుకులాన్ని ఇక్కడి నుంచి పెద్దమంగళారం సమీపంలోని ఆజాద్ కళాశాలకు చెందిన ప్రైవేటు భవనంలోకి మార్చారు. రూ.లక్షల్లో అద్దె చెల్లింపు ప్రభుత్వ భవనాలను వదిలి ప్రైవేటు భవనంలోకి గురుకులాన్ని తరలించిన అధికారులు అక్కడ నెలకు రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్నారు. ప్రస్తుతం శంకర్పల్లి గురుకులం కొనసాగుతున్న ఆజాద్ కళాశాల భవనానికి నెలకు రూ.5 లక్షలకు పైగా అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు భవనాల యజమానులు ఇచ్చే కమీషన్లకు ఆశపడే అధికారులు గురుకులాలను వాటిలోకి మారుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొయినాబాద్ మండలంలో వివిధ ప్రాంతాలకు చెందిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు ప్రైవేటు కళాశాలలకు చెందిన అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వృథాగా మారిన ప్రభుత్వ భవనాలు శంకర్పల్లి బాలికల గురుకులాన్ని ప్రైవేటు అద్దె భవనంలోకి మార్చడంతో ప్రభుత్వ భవనం వృథాగా మిగిలిపోయింది. ఏడాది క్రితమే ఇక్కడ ల్యాబ్ నిర్మించారు. వాటిని పూర్తిస్థాయిలో వినియోగించకుండానే నిరుపయోగంగా వదిలేశారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసి నిర్మించిన ప్రభుత్వ భవనాలను నిరుపయోగంగా మార్చిన అధికారుల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు భవనానికి నెలకు రూ.5 లక్షల పైనే కిరాయి చెల్లింపు నిరుపయోగంగా మారిన సర్కార్ భవనాలు అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం ఏడాది క్రితం వరకు గురుకుల పాఠశాలను మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయం వెనకాల ఉన్న ప్రభుత్వ భవనంలోనే కొనసాగించాం. గురుకుల సొసైటీ సెక్రటరీ సూచన మేరకే గురుకులాన్ని ఆజాద్ కళాశాలకు చెందిన భవనంలోకి మార్చాం. గత ఏడాది ఆ భవనంలో ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. శిక్షణ పూర్తయిన తరువాత భవనం ఖాళీగా ఉంది. ఈ ఏడాది కూడా ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. – కృష్ణవేణి, ప్రిన్సిపాల్, శంకర్పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల -
11 వరకు ‘దోస్త్’ స్పెషల్ డ్రైవ్
ఇబ్రహీంపట్నం: డిగ్రీలో ఇప్పటి వరకు అడ్మిషన్ పొందని విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించిందని ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాధిక తెలిపారు. ఈనెల 11వ వరకు స్పెషల్ డ్రైవ్ ఫేజ్లో దోస్త్ రిజిస్ట్రేషన్లకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే విద్యార్థులు (దోస్త్ కోడ్ 12038) వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలని తెలిపారు. బీఏ, బీ.కాం(కంప్యూటర్ అప్లికేషన్స్), బీఎస్సీ, (లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, డెయిరీ, క్రాప్ ప్రొడక్షన్) కోర్సులు ఉన్నాయని చెప్పారు. ఈఏడాది కొత్తగా బీ.కాం.(ఫెనాన్స్) కోర్సును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. వినోబానగర్లోని నూతన డిగ్రీ కళాశాల భవనంలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని, అసక్తి ఉన్న విద్యార్థులు నేరుగా సంప్రదించవచ్చునని చెప్పారు. ఇబ్రహీంపట్నం: బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ను శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పరామర్శించారు. ఇటీవల క్యామ మల్లేశ్ స్వల్ప అస్వస్థతకు గురై వనస్థలిపురంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు శనివారం హరీశ్రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మీర్పేట: టీకేఆర్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘క్వాంటం అరీనా హ్యాకథాన్’ జాతీయ స్థాయి కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ తీగల హరినాథ్రెడ్డి, కోశాధికారి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 1,500 విద్యార్థులు, డెవలపర్లు పాల్గొని సరికొత్త ఆలోచనలతో డిజిటల్ పరిష్కారాలైన అప్లికేషన్లు, వెబ్సైట్లు, ఏఐ మోడల్స్ కనిపెట్టే కోడింగ్ పోటీలతో పాటు మెషిన్ లెర్నింగ్, వెబ్, యాప్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి నూతన సాంకేతికతలపై టాస్క్లు ఇవ్వడం జరిగిందన్నారు. 36 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగి తక్కువ సమయంలో ఎక్కువ బృందాలుగా ఏర్పడి కొత్త ఆవిష్కరణలను సృష్టించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామస్వామిరెడ్డి, వివిధ విభాగ అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. కొత్తూరు: మేకగూడ సింగిల్విండో చైర్మన్గా ఎస్బీపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయనతో పాటు నూతనంగా ఎన్నికై న డైరెక్టర్లకు నియామకపు పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన కార్యాలయంలో పాలకవర్గంతో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే ప్రతీ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో పదవిని అప్పగించడం పట్ల ఆయన ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘రేడియల్’ రయ్ రయ్
● డిసెంబర్ నాటికి రావిర్యాల– ఆమన్గల్ రోడ్డు మొదటి దశ పూర్తి ● భూసేకరణ, నిర్మాణ పనులపై హెచ్ఎండీఏ కమిషనర్ సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: రేడియల్ రోడ్డు పనులపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సీరియస్గా దృష్టి సారించింది. రావిర్యాల నుంచి ఆమన్గల్లు వరకు చేపట్టిన మొదటి దశ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ అనుబంధ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్)లో అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. అక్కడక్కడా అడ్డంకులు.. ఓఆర్ఆర్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్సిటీ మీదుగా ఆమన్గల్ వరకు రెండు దశల్లో నిర్మించనున్న 41.5 కి.మీ రేడియల్ రోడ్డు కోసం భూసేకరణ తుది దశకు చేరుకున్నా.. అక్కడక్కడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. కొన్ని చోట్ల న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. భూసేకరణలో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు రెవెన్యూ తదితర విభాగాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, సకాలంలో నిర్మాణ పనులను చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్లోబల్ సమ్మిట్ నాటికి పురోగతి.. వచ్చే డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ నాటికి రేడియల్ రోడ్డు మొదటి దశ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు 6–లేన్లతో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే చేపట్టి 8– లేన్లకు విస్తరించనున్నారు. మొదటి దశలో రావిర్యాల్ నుంచి మీర్ఖాన్పేట్ వరకు 19.2 కి.మీ అంచనా వ్యయం రూ.1,282.30 కోట్లు. రెండో దశలో మీర్ఖాన్పేట్ నుంచి ఆమన్గల్లు వరకు 22.3 కి.మీ.ఉంటుంది. దీని అంచనా వ్యయం రూ.1,538.31 కోట్లు. భూసేకరణ పూర్తి కాగానే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో బుద్వేల్– కొడంగల్కు టెండర్లు.. ఓఆర్ఆర్ బుద్వేల్ ఎగ్జిట్ నుంచి కొడంగల్ వరకు నిర్మించనున్న సుమారు 81 కి.మీ రేడియల్ రోడ్డు–2 ప్రాజెక్టు డీపీఆర్లను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో ఆన్లైన్ బిడ్డింగ్ నోటిఫికేషన్ను వెలువరించనున్నట్లు హెచ్జీసీఎల్ అధికారులు తెలిపారు. ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు వివిధ ప్రాంతాల్లో 16 చోట్ల ఈ తరహా రేడియల్ రోడ్లను దశలవారీగా నిర్మించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది. -
బాల ప్రతిభకు ‘ఇన్స్పైర్’
కేశంపేట: రాష్ట్రపతి భవన్లో ఆతిథ్యం.. దేశ ప్రథమ పౌరుడితో అభినందనలు.. కేంద్ర మంత్రులతో ప్రశంసలు.. దేశ దిగ్గజ శాస్త్రవేత్తలతో సమాలోచనలు.. ఇలాంటి అరుదైన అవకాశం ఎవరు కాదంటారు? ఇవి కావాలంటే తెలివికి పదును పెట్టాలి.. అలాంటి ఆలోచనలు ఉన్న విద్యార్థుల కోసమే ఈ ఇన్స్పైర్ మనక్. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు నడిపించి, వారిలో వినూత్న ఆలోచనలకు పదును పెట్టి భవిష్యత్లో భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’(ఇన్స్పైర్) పథకంను సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి ఇన్స్స్పైర్ మనక్ అవార్డులను అందిస్తోంది. 2026–27కు గాను 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే 10 నుంచి 17 ఏళ్ల వయస్సులో ప్రతిభ కలిగిన విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా నామినేషన్లను స్వీకరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మిలియన్ మంది విద్యార్థుల ఆలోచనలు, ఆవిష్కరణలకు పదును పెట్టడమే ఇన్స్పైర్ మనక్ లక్ష్యం. అర్హులు వీరే.. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, గురుకుల, మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలలో 6 నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయుడి గైడ్లైన్స్ పాటిస్తూ ప్రయోగం చేసే వివరాలను క్లుప్తంగా నమోదు చేస్తూ ఆన్లైన్ ద్వారా నామినేషన్లకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానం ● ఇన్స్పైర్కు నామినేషన్లో పాల్గొనేందుకు పాఠశాల వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. గత విద్యా సంవత్సరంలో లాగిన్ అయిన పాఠశాలలు పాత యూజర్ ఐడీ, పాస్వర్డ్తో ఎంట్రీ కావొచ్చు. ● ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ● www.inspireawards&dst.gov.in వెబ్సైట్లో న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ● పాఠశాల వివరాలను నమోదు చేసుకుని సేవ్ చేసుకోవాలి. ఇట్టి దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళ్తుంది. ● వీరు ఆమోదిస్తే విద్యార్థికి పొందుపర్చిన మొయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. ● లింక్తో యూజర్ ఐడీకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ● విద్యార్థి తన సమాచారం, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ● విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టును సంక్షిప్తంగా వెబ్సైట్లో నమోదు చేయాలి. ● ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం విద్యార్థి ఖాతాలో రూ.పది వేలు జమ చేస్తారు. ● రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టు ఎంపికై తే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అందిస్తారు. ● ఆన్లైన్లో ఉచితంగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సెప్టెంబర్ 15 గడువు విద్యార్థులు తమ పేర్లను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 15 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి ఆన్లైన్ నమోదు చేసుకోవాలి. గత విద్యా సంవత్సరంలో... 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లా స్ధాయికి 1,889 నామినేషన్లు ఎంపికయ్యాయి. వీటి నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 108 నామినేషన్లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. రాష్ట్ర స్థాయి నుంచి కాకతీయ పాఠశాల విద్యార్థులు చేసిన ప్రయోగం సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్కు, బాలాపూర్ జెడ్పీహెచ్ఎస్, నాగార్జున హైస్కూల్ వనస్థలిపురం, విద్యా వికాస్హైస్కూల్, సైబర్ఎడ్జ్ హైస్కూల్ విద్యార్థులు చేసిన ప్రయోగాలను జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. జాతీయ స్థాయికి ఎంపికై న ఆయా పాఠశాలల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.25వేలు అందజేసి వరంగల్లోని ఎన్ఐటీలో ఓరియంటేషన్ ప్రోగాంను అందించారు. వీరు ఈ విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో నిర్వహించే సైన్స్ఫెయిర్లో తమ ప్రయోగాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. విద్యార్థుల ఆవిష్కరణలకు ఆహ్వానం ప్రాజెక్టు తయారీకి రూ.పది వేలు జమ ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు పురస్కారాలువిద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఇన్స్పైర్ ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుల సహకారంతో పోటీల్లో పాల్గొని ప్రతిభను ప్రదర్శించాలి. ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రయోగాలకు తగ్గకుండా విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలి. – వై.శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
మహేశ్వరం: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం జిల్లా కార్యదర్శి మునావత్ దేవేందర్నాయక్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్తో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఆగస్టు 15 లోపు విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు శివ, రాహుల్, అభిలాష్, కె.సాయి, శారద వొకేషనల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శి దేవేందర్ నాయక్ -
వసతిగృహంలో సమస్యలు పరిష్కరించాలి
చేవెళ్ల: పట్టణ కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలికల వసతిగృహానికి నూతన భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నాయకులు వసతిగృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వార్డెన్తో మాట్లాడి వసతిగృహంలోని సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అరుణ్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి నూతన హాస్టల్ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. హాస్టళ్ల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తల్లిదండ్రులను వదిలి చదువుకోవడానికి హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల నుంచి హాస్టళ్లకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, అవి ఏ స్థాయిలో అమలవుతున్నాయో అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల బీసీ హాస్టల్లో రాత్రి భోజనంలో పురుగులు వచ్చిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే హాస్టళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్కుమార్ -
మిగిలింది మూడు రోజులే
10లోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలి సాక్షి, రంగారెడ్డిజిల్లా: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం తుది దశకు చేరుకుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 10తో గడువు ముగియనుందని, జిల్లాలోని అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ ఎన్యూమరేషన్ ఫారాలను సంబంధిత బీఎల్ఓకు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. అసంపూర్ణంగా, తప్పుగా నింపిన ఫారాలతో దరఖాస్తుల పరిశీలనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సరైన సమాచారంతో ఫారాలు నింపాలని సూచించారు. ఏవైనా పొరపాట్లు ఉంటే గడువు ముగిసేలోపు మార్పులు చేయించుకోవచ్చన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి, ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, సందేహాల నివృత్తి, వివరాల సవరణ వంటి సేవలు అందిస్తున్నారని తెలిపారు. కొందుర్గు: ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిబద్ధతతో మెలగాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఈఓ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. చౌదరిగూడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, గైర్హాజరైన ఉపాధ్యాయులు, డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను హెచ్ఎం సునీతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా, భోజనంలో నాణ్యత ఉంటుందా అని ఆరా తీశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఆమనగల్లు: మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మసున కృష్ణయ్య రాష్ట్ర చేనేత జౌలిశాఖ అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్లోని పీపుల్స్ప్లాజాలో శుక్రవారం చేనేత జౌలిశాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క చేతుల మీదుగా కృష్ణయ్య పురస్కారం అందుకున్నారు. పురస్కారంతో పాటు రూ.25 వేలు చెక్కు, ప్రశంసాపత్రం, మెమొంటో అందించారు. రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న కృష్ణయ్యను పద్మశాలీసంఘం మండల నాయకులు అశోక్, శ్రీనివాస్ తదితరులు అభినందించారు. కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం తూంపల్లి గ్రామ యువకులు శుక్రవారం రోడ్డుపై వరినాట్లు వేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారిందని, ఈ విషయం అధికారులు, పాలకులకు తెలిపినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై గుంతలు పడి వర్షపునీళ్లతో చెరువును తలపిస్తోందని అన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్, చందు, గణేశ్, రమేష్, యాదయ్య, రాకేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మాసిటీకి భూములిచ్చేది లేదు
కందుకూరు: ఫార్మాసిటీ కోసం గతంలో పెద్ద ఎత్తున భూములు కోల్పోయామని, మళ్లీ ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేదే లేదని రైతులు తేల్చి చెప్పారు. ఫార్మాసిటీ కోసం మండల పరిధిలోని ముచ్చర్ల రెవెన్యూ సర్వే నంబర్లు 115, 121,122, 135 నుంచి 138, 141 నుంచి 154 వరకు 200 మంది రైతులకు సంబంధించిన 283.22 ఎకరాలు సేకరించడానికి వాణిజ్య శాఖ 21/2017 చట్టంలోని 10–ఏ కింద జూన్ 4న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం ఆ భూముల సేకరణ కోసం గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ గోపాల్, నాయబ్ తహసీల్దార్ రాజు, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, టీజీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ ఉమామహేశ్ హాజరై గ్రామ సభను ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, ఊటు మహేందర్ తదితరుల ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, రైతులు, స్థానిక నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఫార్మాసిటీ కోసం గ్రామ పరిధిలోని 2,371 ఎకరాలు ఇచ్చామని, మళ్లీ అదనంగా ఇవ్వాలంటే కుదరదని స్పష్టం చేశారు. తమ భూముల జోలికి వస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరిస్తూ సభను బహిష్కరించారు. సభ ముందు తమ భూములు ఇవ్వమని తెలిపేలా బ్యానర్లు ప్రదర్శించారు. దీంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు. తేల్చి చెప్పిన ముచ్చర్ల రైతులు -
పాముకాటుతో వలస కూలీ మృతి
కొందుర్గు: పొట్టకూటి కోసం వందల మైళ్లు దాటుకొని వచ్చి జీవన పోరు సాగిస్తున్న ఓ వలస కూలీని పాముకాటు బలిగొంది. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కొందుర్గులో చోటుచేసుకుంది. ఎస్సై రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన శాంతమ్మ(45), రంగస్వామి దంపతులు. వీరితోపాటు మరో పదిమంది వారం రోజుల క్రితం కూలి పనుల కోసం లూర్దునగర్కు చెందిన పోతిరెడ్డి శౌరెడ్డి వద్దకు వచ్చారు. శుక్రవారం అందరూ కలిసి ఉమ్మెంత్యాల గ్రామంలో శౌరెడ్డికి చెందిన కౌలుకు తీసుకొని సాగుచేసిన పత్తి పంటలో కలుపు తీయడానికి వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం శాంతమ్మను పెంజర పాము కాటు వేసినట్లు తోటి కూలీలు గమనించారు. వెంటనే చికిత్స కోసం కొందుర్గు పీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్రం
తుర్కయంజాల్: జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 10న జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ కోరారు. శుక్రవారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూర్, తుర్కయంజాల్ డివిజన్లలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కరపత్రాలను అందజేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం రాగన్నగూడలోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నయా ఉదారవాద సంస్కరణలను వేగంగా అమలు చేస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను తొలగించారని మండిపడ్డారు. వాటి స్థానంలో కార్పొరేట్లకు, పరిశ్రమల యాజమాన్యాలకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు ఫైనల్ రూల్స్ నోటిఫై చేసిందని పేర్కొన్నారు. రోజువారి పనిదినాన్ని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుకునేందుకు యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా నాయకుడు అరుణ్కుమార్, కార్మికులు కృష్ణ, సాలయ్య, రవి, వెంకట్రెడ్డి, గోపాల్, సంతోష్ పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కిషన్ -
గీత కార్మికులపై ప్రభుత్వం చిన్నచూపు
మాడ్గుల: ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ కోరారు. మండలానికి శుక్రవారం చేరిన గీతన్నల చైతన్య బస్సుయాత్రకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. కల్లుగీత వృత్తిదారుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తాటిచెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు మృతి చెందిన గీత కార్మికులకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని, గతంలో మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.20 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 55 ఏళ్లు నిండిన గీత కార్మికులకు రూ.4వేల పెన్షన్, గీత కార్మికులందరికీ కాటమయ్య కిట్లు అందజేయాలన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం మండల నాయకులు మల్లేష్, రమేష్, యాదయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. మొయినాబాద్: మున్సిపల్ పరిధిలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అజీజ్నగర్, హిమాయత్నగర్, ఎనికేపల్లి ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అజీజ్నగర్ చౌరస్తా, మృగవని పార్కు ఎదుట, హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై వర్షం నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. -
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
మంచాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మంచాల మండలం జాపాలకు చెందిన వట్టి పాండుయాదవ్(36) వ్యవసాయ కూలీ. గురువారం సాయంత్రం బైక్పై ఆరుట్ల గ్రామానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ప్రభుత్వ పాఠశాల సమీపంలో అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఇతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాండు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో జంగయ్య, సత్తమ్మ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
గర్భిణులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి
షాద్నగర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు విధిగా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించాలని హెచ్ఐవీ, ఎయిడ్స్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి అన్నారు. షాద్నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ పనితీరును, ల్యాబ్లో గర్భిణులు, సాధారణ రోగులకు నిర్వహిస్తున్న హెచ్ఐవీ పరీక్షలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు తప్పనిసరి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్గా తేలితే వారి వివరాలను గోప్యంగా ఉంచి సంబంధింత రోగికి మాత్రమే సమాచారం అందించాలని సూచించారు. సకాలంలో చికిత్స అందిస్తే తల్లి, శిశువు, ఆరోగ్యంగా ఉంటారన్నారు. గ్రామాల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్ అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, జిల్లా హెచ్ఐవీ ప్రోగ్రాం మేనేజర్ నరేందర్, సూపర్వైజర్ రమేష్, ఐసీటీసీ కౌన్సిలర్ శ్యాం తదితరులు పాల్గొన్నారు.హెచ్ఐవీ, ఎయిడ్స్ కంట్రోల్ జేడీ డాక్టర్ జయలక్ష్మి -
పట్టుదలతో చదివితే ఉజ్వల భవిష్యత్
కొందుర్గు: పట్టుదలతో చదివితే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ ఏడాది పదో తరగతిలో టాపర్గా నిలిచిన భరత్ తేజ్కు నగదు పురస్కారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన అమ్మమ్మ సత్యమ్మ జ్ఞాపకార్థం ఇటీవల తాను అందించిన రూ.లక్ష విరాళం బ్యాంకులో జమచేసి, వాటిపై వచ్చే వడ్డీ డబ్బులను ఏటా స్కూల్ టాపర్కు నగదు పురస్కారం అందించాలని హెచ్ఎం కృష్ణకు సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల సౌకర్యార్థం సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్, ఎంఈఓ కిరణ్కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
దండుమైలారంలో ఉద్రిక్తత
ఇబ్రహీంపట్నం: ఆక్రమణలో ఉన్న దండుమైలారం గ్రామకంఠం భూమిపై మండల పరిషత్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. భూసాధన కమిటీ ఆధ్వర్యంలో 14 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సర్పంచ్ ఈదులకంటి నరేష్గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నాకు దిగారు. నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అదే సమయంలో కార్యాలయం నుంచి బయటకు వెళ్తున్న ఎంపీడీఓ ప్రమీలనాయక్ను అడ్డుకున్నారు. దీంతో ఆమె తన చాంబర్లోకి పిలిపించుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. అదే క్రమంలో అక్కడికి వచ్చిన సీఐ మహేందర్రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడుతున్న తరుణంలో ఒక్కసారిగా వాగ్వాదం చోటుచేసుకుంది. సర్పంచ్ ఈదులకంటి నరేష్గౌడ్ తనకు ప్రాణహాని ఉందని, తనను చంపడంటూ చొక్కా చింపుకోవడం, సమస్యను పరిష్కరించకుంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎంపీడీఓ టేబుల్పై పరిచి ఉన్న గ్లాసు అద్దాన్ని ఆందోళకారులు పగులగొట్టడం, పగిలిన అద్దాన్ని చేతపట్టుకోవడంతో సర్పంచ్ చేతికి గాయాలయ్యాయి. ఆయన ఒక్కసారిగా కిందపడిపోవడంతో గందరగోళంగా మారింది. సమాచారం అందుకున్న ఏసీపీ కేపీవీ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. గ్రామకంఠం భూమిపై జిల్లా ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు, సర్వే జరిపి, వివాదాన్ని పరిష్కరిస్తామని ఎంపీడీఓ వెల్లడించడంతో ఆందోళనకారులు శాంతించారు. సర్పంచ్కు పరామర్శ ధర్నాలో గాయపడిన సర్పంచ్ నరేష్గౌడ్ను ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజ్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామకంఠం భూమిపై గ్రామస్తులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామస్తుల ధర్నా పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం కిందపడిపోయిన సర్పంచ్, చేతికి గాయం అధికారుల హామీతో శాంతించిన వైనం -
ధర్మన్నగూడలో స్వల్ప ఉద్రిక్తత
యాచారం: మండల పరిధిలోని ధర్మన్నగూడలో శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉప సర్పంచ్ నాగరాజు గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన బండ చెన్నయ్య, శ్రీశైలం, శ్రీనివాస్లు పనులను అడ్డుకుని ఉప సర్పంచ్తో వాగ్వాదానికి దిగారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ నాగరాజుపై దాడికి పాల్పడ్డారు. కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది. సమాచారం మేరకు యాచారం పోలీసులు గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. దాడిపై ఉప సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
నేర నియంత్రణకు నిరంతరం కృషి
మహేశ్వరం: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం తుక్కుగూడలోని మహేశ్వరం జోన్ డీసీపీ కార్యాలయంలో ఏసీపీలు, సీఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించి నేరరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన పాత పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో చార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, మహిళలపై నేరాలు, పీడీ యాక్ట్, రౌడీషీటర్ల వ్యవహారాలు, సైబర్ నేరాలు, సీసీటీవీ కవరేజ్, కాల్ డిటైల్ రికార్డులు (సీడీఆర్), గ్రేవ్ కేసుల దర్యాప్తును ప్రాధాన్యతగా పూర్తి చేయాలని సీఐలను ఆదేశించారు. అలవాటుగా నేరాలకు పాల్పడే వ్యక్తులపై సమర్థవంతమైన నిఘా, సీసీటీవీ వ్యవస్థల బలోపేతం, విజిబుల్ పోలీసింగ్ అమలు, శాంతిభద్రతల కట్టుదిట్టమైన నిర్వహణపై అన్ని ఎస్హెచ్ఓలకు దిశానిర్దేశం చేశారు. కేసుల ఛేదన రేటును పెంచేందుకు వృత్తిపరమైన, ఫలితాల ఆధారిత దర్యాప్తు విధానాన్ని అనుసరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, మహేశ్వరం జోన్కు చెందిన సీఐలు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి -
తుమ్మలూరు సెక్రటరీపై విచారణ
మహేశ్వరం: మండల పరిధిలోని తుమ్మలూరు పంచాయతీ కార్యదర్శి అలివేలుపై శుక్రవారం డీఎల్పీఓ సాంబిరెడ్డి విచారణ నిర్వహించారు. గ్రామంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ సర్పంచ్, ఉప సర్పంచ్, సభ్యులతో పాటు పలువురు నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ.. అధికారిక కార్యక్రమాల్లో సెక్రటరీ భర్త పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే వైకుంఠధామం సూచిక బోర్డును తొలగించి మరోచోట ఏర్పాటు చేయించారని డీఎల్పీఓకు వివరించారు. ఆమెను తొలగించకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. కార్యదర్శి అలివేలు మాట్లాడుతూ.. సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్, అధికార కాంగ్రెస్, బీజేపీ నాయకుల అవినీతికి అడ్డు చెప్పడంతోనే తనపై కుట్ర పూరితంగా తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. తాను ఇక్కడి నుంచి వెళ్లిపోయినా, కొత్తగా వచ్చే కార్యదర్శిని సైతం ఇలాగే వేధిస్తారని ఆవేదన వ్యక్తంచేశారు. అందరి అభిప్రాయాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని డీఎల్పీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మటి అండాలు, ఉప సర్పంచ్ సంగారెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని పాలకవర్గం ఆరోపణ తనపై తప్పుడు ఫిర్యాదు చేశారన్న కార్యదర్శి జీపీ వద్ద విచారణ చేస్తున్న డీఎల్పీఓ -
క్రాప్ ప్లాన్ అమలు చేయండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని పలువురు మంత్రులు జిల్లా అధికారులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసిన సాధారణం కంటే తక్కువ వర్షపాతం పరిస్థితుల దృష్ట్యా అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో రూపొందించిన కంటింజెన్సీ క్రాప్ ప్లాన్ను వెంటనే అమలు చేయాలని, రైతులు అధిక నీటి అవసరమున్న వరి సాగుపై అధికంగా ఆధారపడ కుండా తక్కువ నీటితో సాగు చేయగల పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగా యలు, ఉద్యాన పంటల సాగు వైపు ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అటవీ శాఖ అధికారి శివ ఆశిష్ సింగ్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారులు వనజాత, హరీష్, జిల్లా వ్యవసాయాధికారి సుజాత తదితరులు పాల్గొన్నారు. అత్యంత పకడ్బందీగా జనగణన హ్యాండ్ బుక్ను రూపొందించాలని, చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వొద్దని రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకురాలు భారతి హోళికేరీ జిల్లా అధికారులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా జనగణన హ్యాండ్బుక్ (డిస్ట్రిక్ట్ సెన్సెస్ హ్యాండ్ బుక్–డీసీహెచ్బీ) రూపకల్పన కోసం క్షేత్రస్థాయిలో నాణ్యమైన, కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. జనగణన హ్యాండ్బుక్ జిల్లా అభివృద్ధి, ప్రణాళికల రూపకల్పన, ప్రభుత్వ విధానాల అమలు, పరిశోధనలు, పరిపాలనా అవసరాలకు అత్యంత ప్రామాణిక ఆధార గ్రంధంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. విద్య, వైద్యం, తాగు నీటి సదుపాయాలు, పారిశుద్ధ్యం, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, రుణ సదుపాయాలు, విద్యుత్, ఇంధన వనరులు, భూమి, సాగునీటి వినియోగం, వ్యవసాయం, చేతివృత్తులు, గ్రామాలకు సంబంధించిన ప్రత్యేక అంశాలు, స్థానిక పరిశీలనలు తదితర తొమ్మిది ప్రధాన విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని సంపూర్ణంగా సేకరించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధికారులతో మంత్రులు -
చేనేతల సమస్యలు పరిష్కరించాలి
హుడాకాంప్లెక్స్: చేనేతలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ రాయబండి పాండురంగం అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం డాక్టర్స్ కాలనీ డివిజన్లో శ్రీ భక్త మార్కండేయ చేనేత సంఘం అధ్యక్షుడు నామ దుర్గయ్య, సంఘం మార్గదర్శకుడు కుంట్ల ఆంజనేయులు నేత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేతల జనాభాకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లో అంత వాటా కేటాయించాలని కోరారు. డబుల్బెడ్రూం ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని, చేనేత పరిశ్రమ ద్వారా ప్రతి చేనేత బిడ్డకురూ.10 లక్షలు బ్యాంకుతో నిమిత్తం లేకుండా ఆర్థిక తోడ్పాటు అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ చేనేతలు నేసిన దుస్తులు వాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
పంచాయతీ కార్మికుడిపై దాడి
కొందుర్గు: మండలంలోని ఉమ్మెంత్యాల గ్రామంలో రోడ్డుకు అడ్డంగా నిలిపిన ట్రాక్టర్ను తొలగించాలని కోరిన గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు బేగరి యాదయ్యపై దాడి జరిగిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. చెత్త సేకరణ కోసం ట్రాక్టర్తో గ్రామంలోకి వెళ్లిన యాదయ్యకు, కబీరు భూషయ్య తన ట్రాక్టర్ను రోడ్డుపై నిలిపి ఎరువుల బస్తాలు దింపుతున్నాడు. బస్తాలు దింపిన అనంతరం కూడా ట్రాక్టర్ను తొలగించకపోవడంతో యాదయ్య దానిని పక్కకు తీసేయాలని కోరాడు. దీంతో భూషయ్య, అతని కుమారుడు వీరేశం కలిసి యాదయ్యపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికుడిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు పోలీసులకు వినతిపత్రం అందజేశారు. -
కామన్ పాసు..
ఆర్టీసీకి, మెట్రోకు ఇక ఒకటే పాస్ కమాన్ బాసూ!సాక్షి, సిటీబ్యూరో: ఒకే పాస్పై రెండు ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రోరైల్ కార్యాచరణ చేపట్టాయి. లాస్ట్మైల్ కనెక్టివిటీ కోసం సిటీబస్సులకు అనుబంధంగా ఆర్టీసీ ప్రవేశపెట్టనున్న ఈ– ఆటోరిక్షాల్లోనూ కామన్ పాస్లను వినియోగించుకోవచ్చు. మెట్రో రైళ్లలో వివిధ రకాల పాస్లను ప్రవేశపెట్టాలని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. చార్జీల నిర్ధారణ, పాస్ల రూపకల్పన తదితర అంశాలపై ఆర్టీసీ, హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్టీ మెట్రో అధికారులు రెండు రోజుల క్రితం బస్భవన్లో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల బస్పాస్లనే మెట్రోరైళ్లకు కూడా పొడిగించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ నుంచి మెట్రోకు, మెట్రో నుంచి ఆర్టీసీకి నిరాటంకమైన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఒకే పాస్ను వినియోగించడంతో చార్జీల భారమూ తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. కామన్ పాస్ల చార్జీలపైనే స్పష్టత రావాల్సి ఉంది. మూడు రకాలుగా.. ప్రస్తుతం ఆర్టీసీలో డైలీ, మంత్లీ పాస్లు ఉన్నాయి. ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సులకు వివిధ ధరల్లో వీటిని విక్రయిస్తున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు వీక్లీ పాస్లను ప్రవేశపెట్టలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో వీక్లీ పాస్లను కూడా ప్రవేశపెట్టనున్నారు. మూడు రకాల పాస్లే మెట్రోలోనూ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో నెలవారీ పాస్లు రూ.1600, మెట్రో ఎక్స్ప్రెస్లలో రూ.1,800, డీలక్స్ బస్సుల్లో రూ.2,200 చొప్పున లభిస్తున్నాయి. డైలీపాస్ రూ.150గా ఉన్నాయి. ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్లను ప్రవేశపెడితే ఒకే పాస్పై మెట్రో రైళ్లతో పాటు ఈ మూడు రకాల బస్సుల్లో పయనించవచ్చు. ‘సిటీ బస్సుల్లో నిత్యం సుమారు 22 లక్షల మంది పయనిస్తున్నారు. మెట్రో రైళ్లలో 4.7 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఉమ్మడి పాస్లు అందుబాటులోకి వస్తే మెట్రోల్లో, సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.’ అని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రయాణికులకు లాస్ట్మైల్ కనెక్టివిటీ కూడా లభిస్తుందని చెప్పారు. ఎల్అండ్టీ కసరత్తు ఉమ్మడి పాస్లపై ఆర్టీసీ చార్జీల్లో స్పష్టత ఉండగా.. మెట్రో చార్జీలపైనే స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో కామన్ పాస్లతో పాటు ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్నట్లు మెట్రో రైళ్లకే పరిమితమయ్యే పాస్లను కూడా ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ మేరకు మెట్రో రైళ్లలో డైలీ, వీక్లీ, మంత్లీ పాస్లను రూపొందించడంతో పాటు కామన్ పాస్లపై ఎల్అండ్టీ మెట్రో రైల్కు బాధ్యతలను అప్పగించారు. మెట్రో, కామన్ పాస్ల చార్జీలను త్వరలో ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో మరో సమావేశం కామన్ పాస్లతో పాటు హుమ్టా ప్రతిపాదించిన ఉమ్మడి మొబైల్యాప్పై ఈ వారంలో మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమావేశంలో అన్ని రకాల పాస్ల చార్జీలపై స్పష్టమైన అవగాహన ఏర్పడనుంది.‘ డైలీ, వీక్లీ, మంత్లీ పాస్ల చార్జీలు ఏ మేరకు ఉండాలనేది ఖరారైన వెంటనే ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు. డైలీ, వీక్లీ, మంత్లీ వారీగా ప్రణాళిక సిటీ బస్సు, మెట్రో రైలులో ప్రయాణం చార్జీల చెల్లింపుపై త్వరలో స్పష్టత హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్టీ మెట్రో, ఆర్టీసీల మధ్య సమన్వయం -
15 రాష్ట్రాల్లో 49 మంది అరెస్టు
జూలై నెల సైబర్ క్రైమ్ ఠాణా గణాంకాలు విడుదలసాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత నెలలో దేశంలోని 15 రాష్ట్రాల్లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా 49 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అదనపు సీపీ (నేరాలు) ఎం.శ్రీనివాసులు శుక్రవారం ప్రకటించారు. ఈ కాలంలో 70 కేసులు నమోదు చేసి రూ.98,89,202 రీఫండ్ చేసినట్లు పేర్కొన్నారు. ట్రేడింగ్ మోసాల్లో 29 మంది, సోషల్ మీడియా నేరాల్లో ఐదుగురు, డిజిటల్ అరెస్ట్ కేసుల్లో ముగ్గురు, వాట్సాప్ డీపీ ఫ్రాడ్స్లో ముగ్గురు, మ్యాట్రిమోనియల్ మోసాల్లో ఇద్దరు, ఏపీకే ఫ్రాడ్, క్రిప్టో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, జాబ్, పోక్సో, పాత నాణేల కొనుగోలు మోసాల్లో ఒక్కోక్కరిని అరెస్టు చేశామని అన్నారు. గత నెలలో ట్రేడింగ్ ఫ్రాడ్కు సంబంధించి 25 కేసుల్లో రూ.11,75,83,416 నష్టం వాటిల్లగా రూ.58,23,217 రిఫండ్ చేయించారు. ఏపీకే ఫ్రాడ్స్లో రూ.13,19,218లకు రూ.8,75,386, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో రూ.1,50,79,585కి రూ.12,78,136, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్లో రూ.9,36,816కి రూ.5,14,713 రిఫండ్ చేయించామని శ్రీనివాసులు తెలిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాల్లో రూ.4,27,824, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్లో రూ.3,60,768, జాబ్ ఫ్రాడ్స్లో రూ.50,000, వాట్సాప్ డీపీ మోసాల్లో రూ.5,59,158 రికవరీ చేశామని వివరించారు. సైబర్ పెట్రోలింగ్ ద్వారా ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ల్లో అశ్లీల కంటెంట్, నకిలీ ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్లను ప్రచారం చేస్తున్న 128 ప్రొఫైళ్లు, 36 పెయిడ్ యాడ్లను గుర్తించి బ్లాక్ చేయించామని అదనపు సీపీ చెప్పారు. ఇలా ఇప్పటివరకు మొత్తం 1,086 ప్రొఫైళ్లు, 2,553 ప్రకటనలను తొలగించి, వీటికి సంబంధించి తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. కొత్తూరు: మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ శివారులో ఉన్న ఇండియన్ ఆయిల్ బాట్లింగ్ ప్లాంట్లో శుక్రవారం ఆక్టోఫస్, ఇతర భద్రత బలగాలు మాక్డ్రిల్ చేపట్టారు. అనుకోని సందర్భాల్లో అనుమానితులు ప్లాంట్లోకి చొరబడితే, ఇతర అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయా శాఖల పరస్పర సహకారంతో ఎలా స్పందించాలో కార్మికులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వీర్రాజు డీఎస్పీ(ఎస్ఓసీ), చార్లీ స్వాట్ టీం, ఆక్టోఫస్, షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, ఫైర్, స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు దోస్తు ద్వారా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు గాను ఈనెల 11వ తేదీలోపు విద్యార్థులు దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకొని కళాశాల ఆప్షన్స్ ఎంచుకోవాలని తెలిపారు. 14న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. 18వ తేదీ వరకు కళాశాలలో సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. బీఎస్సీ లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బీఏ తెలుగు, ఇంగ్లిష్ మీడియం, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ ఫార్మాస్యూటికల్ సైన్స్, బీకాం రిటైల్స్ ఆపరేషన్స్, ఏఈడీపీ కోర్సుల్లో సీట్లు మిగిలి ఉన్నట్లు తెలిపారు. చికిత్స కోసం వచ్చి.. ఏఆర్ కానిస్టేబుల్ మృతి ● వికారాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన అనంతగిరి: ఛాతిలో మంట రావడంతో చికిత్స కోసం వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన నరేష్(33) షాద్నగర్లో ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన సాయంత్రం స్నేహితులతో కలిసి నవాబుపేటకు వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా ఛాతిలో మంట రావడంతో మధ్యాహ్నం వికారాబాద్లోని మేడిక్యూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం నరేష్ను వైద్యులు డిశ్చార్ చేశారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన వైద్యులు పీసీఆర్ చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే నరేష్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న వికారాబాద్ సీఐ రఘుకుమార్, డీఎస్పీ అంజయ్య ఘటనా స్థలానికి చేరుకుని బాధితులు, వైద్యులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
విద్యార్థుల భోజనంలో పురుగులు
చేవెళ్ల: పట్టణ కేంద్రంలోని బీసీ హాస్టల్లో రాత్రి భోజనంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు శుక్రవారం రాత్రి హాస్టల్ వద్దకు చేరుకున్నారు. పురుగులు వచ్చిన భోజనాన్ని విద్యార్థులు వారికి చూపించారు. ప్రతి రోజు ఇలాగే వస్తున్నాయని వాపోయా రు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్కుమార్ అధికారుల తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులు ఉండే హాస్టళ్లకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటిబియ్యం అందిస్తున్న వారిపై చర్యలు తీసు కోవాలని, హాస్టళ్ల పరిస్థితిపై కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చందు, అశోక్ పాల్గొన్నారు. -
టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం
పహడీషరీఫ్: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడిని టిప్పర్ వెనుక నుంచి ఢీకొనడంతో తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పహడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన యెద్దుల ఇంద్రారెడ్డి(23) నగరంలోని టీకేఆర్ కమాన్ వద్ద నివాసముంటూ ఆర్జీఐ విమానాశ్రయంలో టెక్నీషియన్గా విధులు నిర్వహి స్తున్నారు. కాగా ఇంద్రారెడ్డి శుక్రవారం తెల్లవారుజామున ఎల్బీనగర్ నుంచి ఆర్జీఐ విమానాశ్రయానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. మార్గమధ్యలో విద్యాదయాని కళాశాల వద్ద రాగానే వెనుక నుంచి వేగంగా నిర్లక్ష్యంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన ఇంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంటుతో ఆటలొద్దు
● రైతులు, వినియోగదారులు స్వీయ మరమ్మతులు చేయొద్దు ● అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అవగాహన కల్పించాలి ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఏ సమయంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయో తెలియదు. తప్పని పరిస్థితిలో కొంత మంది రైతులు ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, మోటార్ల వద్ద స్వయంగా మరమ్మతులు చేస్తుంటారు. అలా చేయకుండా అవగాహన కల్పించాలి. – అర్జున్రెడ్డి, రైతు, శివారెడ్డిపల్లి జాగ్రత్తలు తప్పనిసరి కరెంటు సమస్యల పరిష్కారానికి ఎక్కడికక్కడ లైన్మెన్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. పొలాల్లో తీగలు వేలాడినా, కిందికి జారిపడినా, ట్రాన్స్ఫార్మర్ నడవకపోయినా వెంటనే సమాచారం ఇవ్వాలి. రైతులు నేరుగా మరమ్మతులు చేయడం ప్రమాదకరం. – అహ్మద్, విద్యుత్ ఏఈ, దోమ దోమ: వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో కరెంటు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇళ్ల వద్ద, పంట పొలాల్లో విద్యుత్ వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బోరుబావులు, వాగులు, పొలాల వద్ద విద్యుత్ మోటర్ల ద్వారా రైతులు పంటలకు నీళ్లు అందిస్తారు. విద్యుత్ వినియోగంలో ఏ చిన్న పొరపాటు జరిగినా.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. మూడింటికే పరిహారం విద్యుత్ సంస్థలు కేవలం ప్రాణ నష్టాలకు మాత్రమే పరిహారం అందిస్తాయి. మనుషులు, పశువులు మరణిస్తే ఆర్థిక సాయం అందుతుంది. కానీ గాయాలపాలైతే ఎలాంటి పరిహారం రాదు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మనుషులు చనిపోతే రూ.8 లక్షలు, ఆవులు, గేదెలు మృతి చెందితే రూ.45 వేలు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడితే రూ.5 వేల చొప్పున పరిహారం అందిస్తాయి. ప్రమాద స్థలంలోని ఫొటోలతో పాటు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు, శవ పంచనామా రిపోర్ట్ను సంబంధిత శాఖ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. మూగజీవాలకై తే ఫొటోలతో పాటు వెటర్నరీ డాక్టర్ పోస్టుమార్టం నివేదిక తప్పనిసరి. పరిహారం వీరికే.. ● అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తెగి కింద పడినప్పుడు వాటికి తగిలి మనుషులు, పశువులు మరణిస్తే నష్ట పరిహారం అందిస్తారు. ● ట్రాన్స్ఫార్మర్లు తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు వాటికి తగిలి మృతి చెందిన ఘటనల్లోనూ పరిహారం అందుతుంది. ● తక్కువ ఎత్తులో వేలాడుతున్న తీగలు తగిలి మృత్యువాత పడినా ఇది వర్తిస్తుంది. పాటించాల్సిన జాగ్రత్తలు ● బావిలోని మోటర్లను నేలపై కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెలపై ఏర్పాటు చేసుకోవాలి. ● స్టార్టర్ బోర్డు తడవకుండా చూసుకోవాలి. ● మోటార్లు నడవకపోయినా, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురైనా సంబంధిత మెకానిక్లను పిలిపించి, బాగు చేయించాలి. ● సర్వీస్ వైర్లు, మోటర్కు నాణ్యమైన తీగలు వాడాలి. ● వైర్లు దెబ్బతింటే వెంటనే వాటికి టెపు వేసేలా చర్యలు తీసుకోవాలి. ● సబ్ మెర్సిబుల్ మోటార్లలో వైరు తెగితే పైన ఉండే వస్తువుల వరకూ విద్యుత్ సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. పైన ఉండే పైపులు, స్టార్టర్ డబ్బాలను నేరుగా పట్టుకోకుండా, చేతితో తాకి పరీక్షించాలి. -
కిచెన్ షెడ్ ఆధునీకరణకు రూ.4 కోట్లు
కొడంగల్: పట్టణంలో హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ కిచెన్ షెడ్ ఆధునీకరణకు అరబిందో ఫార్మా కంపెనీ విరాళం అందించింది. ఈ మేరకు కంపెనీ మేనేజింగ్ ట్రస్టీ నిత్యానందరెడ్డి అరబిందో ఫార్మా కంపెనీ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.10 కోట్ల చెక్కును సీఎం రేవంత్రెడ్డికి గురువారం హైదరాబాద్లో అందజేశారు. ఈ మొత్తంలో రూ.4కోట్లు కొడంగల్ కేంద్రీయ వంటశాలకు, మిగిలిన రూ.6 కోట్లు సంగారెడ్డికి ఇచ్చారని హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. -
అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్
● రెండు షాపులపై దాడులు ● కేసు నమోదు చేసిన మోకిల పోలీసులు శంకర్పల్లి: రెండు వేర్వేరు ఘటనల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేయడంతో పాటు, పైపులు అమ్ముతున్న వారిపై గురువారం మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మోకిల గ్రామంలో మెగ్వాల్ పరాశురాం అనే వ్యక్తి గత కొంతకాలంగా గ్యాస్ సిలిండర్లలో అక్రమంగా రీ ఫిల్లింగ్ చేయడంతో పాటు, సిలిండర్లు, పైపులు విక్రయిస్తున్నాడు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం షాపుపై దాడులు నిర్వహించారు. 30 చిన్న, 9 పెద్ద సిలిండర్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. అదే విధంగా ఇంద్రారెడ్డి నగర్లోని జై భవాని స్టీల్ సెంటర్లో నకిలీ రెగ్యూలేటర్లు, పైపులు అమ్ముతున్నట్లు సమాచారం రాగా.. పోలీసులు దాడులు చేశారు. 6నకిలీ రెగ్యూలేటర్లు, 25గ్యాస్ పైపులను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలుంటాయని ఎస్ఐ సురేశ్ హెచ్చరించారు. సాగుకు అడ్డు తగులుతున్న వ్యక్తి అరెస్ట్ మోమిన్పేట: పంట సాగుకు అడ్డు పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ భరత్భూషణ్ గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నా యి. మండలంలోని బూర్గుపల్లికి చెందిన మేక ల శ్రీనివాస్, మేకల నగేశ్, మేకల శోభరాణి గత నెల 27న అదే గ్రామానికి చెందిన మంతెన కృష్ణం రాజు భూమిలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ కలహాలు.. వ్యాపారి ఆత్మహత్య రాజేంద్రనగర్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యాపారి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదర్గూడ లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ శర్మ (38) నగరంలో ముత్యాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఆరేళ్ల క్రితం భార్యాభర్తలు విడిపోయారు.అప్పటినుండి ఆశిష్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చిన ఆశిష్ శర్మ గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆక్రమణలకు రాచమార్గం!
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఖాళీ జాగా కనిపిస్తే చాలు కొంతమంది ‘పెద్దలు’ గద్దల్లా వాలిపోతున్నారు. అమాయక పేద రైతులను ముందుంచి తెరవెనుక భారీ భూ దందాకు తెగబడుతున్నారు. తర్వాత తమ అధికారం, ఆర్థిక బలాన్ని అడ్డు పెట్టుకుని ఏ దారి లేని ఇనాం పట్టా భూములకు ప్రభుత్వ భూముల నుంచి రాచమార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కళ్లముందే ఖరీదైన భూములు కరిగిపోతున్నా అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోందే తప్ప.. ఆక్రమణలను అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. కలెక్టరేట్కు కూతవేటు దూరంలో.. మహేశ్వరం మండలం కొంగరకుర్దు–ఎ (కలెక్టరేట్కు అత్యంత సమీపం)లో భూ ఆక్రమణల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇప్పటికే కొంత మంది తమ బినామీల పేరున వివాదాస్పద వక్ఫ్/ ఇనాం, లావుణి, ఎక్స్ సర్వీస్మెన్ భూములను కొనుగోలు చేశారు. వీటికి నకిలీ ఓఆర్సీలు సృష్టించి మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు చేయించారు. ఖాళీ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయాలు చేస్తున్నారు. ఈ రెవెన్యూ పరిధిలోని దాదాపు అన్ని సర్వే నంబర్లపై ఒకవైపు హైకోర్టులో కేసు కొనసాగుతుండగా.. మరోవైపు అగ్రిమెంట్లు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా ఓ ఇద్దరు రైతుల నుంచి భూములను ఇటీవల కొనుగోలు చేసిన ఓ రియల్టర్ ఏకంగా ప్రభుత్వ భూమి నుంచి యథేచ్ఛగా తన వెంచర్కు రహదారి (12 మీటర్ల వెడల్పు, 1,545 మీటర్ల పొడవు) వేస్తున్నాడు. లే అవుట్ పర్మిషన్ కోసం మూడు నెలల క్రితం హెచ్ఎండీఏను ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ భూముల్లో లే అవుట్కు అనుమతి ఇవ్వాలంటే కనీసం 30 ఫీట్ల రోడ్డు ఉండాలనే నిబంధన ఉంది. ఎలాగైనా తన వెంచర్ అనుమతులకు మార్గం సుగమం చేసుకోవాలని భావించిన సదరు రియల్టర్ ఇనాం రైతుల ముసు గులో ముందు భాగంలో ఉన్న రైతులు దీనికి అడ్డుతగులకుండా కోర్టు నుంచి ఓ ఆర్టర్ తీసుకొచ్చినట్లు సమాచారం. రియల్టర్ వేస్తున్న రోడ్డుతో ప్రభుత్వం సుమారు రూ.120 కోట్ల విలువ చేసే పది ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తోంది. టీజీఐఐసీ సేకరించిన భూమి సర్వే నంబర్ 289లో 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పారిశ్రామిక అవసరాల పేరుతో ప్రభుత్వం ఇప్పటికే ఈ సర్వే నంబర్లోని మొత్తం భూమిని టీజీఐఐసీ ద్వారా సేకరించింది. అప్పటి వరకు పొజిషన్లో ఉన్న అసైన్డ్ రైతులకు నష్టపరిహారం సైతం చెల్లించింది. దీనికి ఆనుకుని కింది భాగంలో ఉన్న మరికొంత మంది ఇనాం రైతులను ఓ రియల్టర్ సాకుగా చూపించి.. త్వరలో రూపుదిద్దుకోబోతున్న తన వెంచర్కు రేడియల్ రోడ్డు మీదుగా కొత్తగా మరో దారిని ఏర్పాటు చేసుకునేందుకు యత్నిస్తున్నాడు. ఎవరైనా పేదలు గజం ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తేనే అడ్డుపడే అధికారులు అదే కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఖరీదైన భూమి హారతి కర్పూరంలా కరిగిపోతున్నా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీజీఐఐసీ సేకరించిన ఈ భూమిని కాపాడాలని కోరుతూ ఇప్పటికే పలువురు స్థానిక రైతులు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేయడం గమనార్హం. ఓ రియల్టర్ తన వెంచర్కు ప్రభుత్వ భూమి నుంచి వేస్తున్న రహదారి జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి కొంగరకుర్దులో కబ్జాల పర్వం ఇప్పటికే ఫేక్ ఓఆర్సీలతో మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు వివాదాస్పద వక్ఫ్, ఇనాం, లావుణి భూముల్లో వెంచర్లు సర్వే నంబర్ 289 నుంచి దర్జాగా ప్రైవేటు వెంచర్కు రోడ్డు పట్టించుకోని అధికార యంత్రాంగం రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు అవసరమైన నక్షబాట ఇప్పటికే ఉంది. దీని నుంచి ఎవరైనా రాకపోకలు సాగించొచ్చు. సర్వే నంబర్ 291, 292లో భూములు కొనుగోలు చేసిన కొంత మంది తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సర్వే నంబర్ 289లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి యథేచ్ఛగా రోడ్డు వేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – రచ్చ లక్ష్మణ్, కొంగరకుర్దు నివాసి -
నెల రోజుల్లో ఎనిమిది నేరాలు!
సాక్షి, సిటీబ్యూరో: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ దేరంగుల హరిబాబు అలియాస్ నాని జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్కు చిక్కాడు. ఇద్దరు అనుచరులు, రిసీవర్ సహా నలుగురిని పట్టుకున్న పోలీసులు వీరి నుంచి రూ.12 లక్షలు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నేరచరితుడైన నాని నెల రోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చాడని, ఈ కాలంలో గౌరారం, సంగారెడ్డి టౌన్, పోచారం ఐటీ కారిడార్, నాగోల్, కుషాయిగూడ, మేడిపల్లి, వనస్థలిపురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఎనిమిది చోరీలు చేశాడని డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ గురువారం వెల్లడించారు. సూరారంలోని దయానంద కాలనీకి చెందిన నిరుద్యోగి నాని తన సోదరుడైన ఘరానా దొంగ గజను చూసి అదే బాటపట్టాడు. రాత్రి వేళ్లలో కాలనీల్లో తిరుగుతూ తాళం వేసున్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని నేరాలు చేసే ఇతడిపై ఇప్పటికే 27 కేసులు నమోదు కాగా... వీటిలో మూడింటిలో వాంటెడ్గా ఉన్నాడు. పోలీసులు ఇతడిని ఈ ఏడాది ఏప్రిల్లో అరెస్టు చేసి జైలుకు పంపగా... జూన్లో బెయిల్పై బయటకు వచ్చాడు. సూరారంలోని సంతోష్నగర్కు చెందిన తన్నీరు సూర్య అలియాస్ సూరి (నిరుద్యోగి), నాగోలు మమతనగర్ కాలనీకి చెందిన నరాల రాహుల్లతో (ఇన్వర్టర్ టెక్నీషియన్) కలిసి ముఠా కట్టాడు. ఇప్పటికే సూరిపై 13, రాహుల్పై మూడు చోరీ కేసులు ఉన్నాయి. జూన్ నుంచి జూలై వరకు ఈ త్రయం ఎనిమిది చోట్ల పంజా విసిరింది. నాని తాళం పగులకొట్టి, ఇంట్లోకి వెళ్లి చోరీ చేస్తుంటే మిగిలిన ఇద్దరూ బయట కాపుకాసేవారు. కొన్ని సందర్భాల్లో వీళ్లు కూడా లోపలకు వెళ్లి పాలు పంచుకునే వారు. ఈ చోరీ సొత్తును మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన సబావత్ రవికి విక్రయించి ముగ్గురూ పంచుకునే వాళ్లు. ఓసారి నేరం చేసి, చేతిలో డబ్బు పడిన తర్వాత జల్సాలు చేస్తూ ఆ మొత్తం ఖర్చయ్యే వరకు మరో నేరం చేసేవాళ్లు కాదు. జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్ యాదేందర్ నేతృత్వంలో ఎస్సై డి.రవిరాజ్తో కూడిన బృందం రంగంలోకి దిగింది. గురువారం ముగ్గురినీ పట్టుకుని 80 గ్రాముల బంగారం, 258 గ్రాముల వెండి, నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు చోరీకి వినియోగించే సెంట్రింగ్ రాడ్డు, స్క్రూడ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసుస్టేషన్కు అప్పగించారు. ఘరానా దొంగ హరిబాబు వ్యవహారమిది రిసీవర్ సహా నలుగురి అరెస్టు, సొత్తు స్వాధీనం -
గ్రామ కంఠాలకు కబ్జా ఉచ్చు!
● పుట్టుకొస్తున్న కొత్త వారసులు ● భూములు తమవేనంటూ పంచాయితీలు ● దాడులు, కేసుల వరకూ వెళ్తున్న వైనం మంచాల: పల్లెల్లోని గ్రామ కంఠం భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. వీటిపై కన్నేసిన కొంతమంది కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు. ఈక్రమంలో చాంద్ఖాన్గూడ, ఆగాపల్లి గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని అస్మత్పూర్ పంచాయతీ అనుబంధ గ్రామమైన చాంద్ఖాన్గూడకు చెందిన పలు ముస్లిం కుటుంబాలు కొన్నేళ్ల క్రితం ఊరిని వదిలి వెళ్లిపోయాయి. ప్రస్తుతం వీరు ఎక్కడున్నారో కూడా తెలియదు. గ్రామంలోని వీరి ఇళ్లు శిథిలావస్థకు చేరి ప్రస్తుతం నేలమట్టమయ్యాయి. ఇలా పెద్ద సంఖ్యలో స్థలాలు ఖాళీగా మారాయి. వీటిపై కొంతమంది స్థానిక ముస్లింల కన్ను పడింది. ఈ నేపథ్యంలో సదరు స్థలాలను కబ్జా పెట్టి మాదంటే మాదంటూ గొడవలు పడుతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి హంగామా చేస్తున్నారు. మరికొంత మంది సదరు భూములు తమ బంధువులవని, రక్త సంబంధీకులవని అవి తమకే చెందుతాయని ముందుకు వస్తున్నారు. ఇలా గ్రామ కంఠం భూముల విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయం జిల్లా స్థాయి అధికారుల దృష్టికి వెళ్లడంతో బుధవారం విచారణ నిర్వహించారు. ఈ సమయంలో పలువురు వర్గాలుగా విడిపోయి అధికారుల ముందే దాడులు చేసుకున్నారు. అనంతరం పీఎస్ను ఆశ్రయించి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఆగాపల్లిలో ఆక్రమణ ఆగాపల్లిలోని పశువుల దవాఖానా ఎదుట ఉన్న గ్రామ కంఠం భూమి కబ్జాకు గురవుతోందని పాలకవర్గం, స్థానిక ప్రజలు పోలీసులు, మండల అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న గ్రామ కంఠం భూమిని ప్రజల అవసరాల కోసం వినియోగించాలని పాలకవర్గం భావించింది. ఈస్థలాన్ని ఎవరూ కబ్జా చేయొద్దని సూచిస్తూ నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. దీన్ని తొ లగించిన కొంతమంది, భూమి తమదంటూ కబ్జా కు ప్రయత్నిస్తున్నారని సర్పంచ్ ఉమ, ఉప సర్పంచ్ యాట రమేశ్ ఆరోపించారు. వాస్తవాలను నిర్ధారించి, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
భూ భారతిపై అవగాహన అవసరం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూభారతి సిస్టంపై పూర్తి అవగాహనతో ప్రజలకు సమర్థవంతమైన సేవలందించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి సిస్టమ్ ద్వారా భూ రికార్డుల నిర్వహణ మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే ప్రతి జూనియర్ అసిస్టెంట్ భూభారతి సిస్టమ్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణలో వివరించిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా నేర్చుకుని, రోజువారీ విధుల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. భూ సంబంధిత దరఖాస్తుల స్వీకరణ, రికార్డుల నమోదు, ధ్రువీకరణ తదితర ప్రక్రియల్లో కచ్చితత్వాన్ని పాటిస్తూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లా టెక్నికల్ మేనేజర్ రఘు భూభారతి సిస్టమ్లోని వివిధ మాడ్యూల్స్, విధానాలు, సాంకేతిక అంశాలపై జూనియర్ అసిస్టెంట్లకు సమగ్ర శిక్షణ అందించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి (ఏఓ) సునీల్, సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి -
సమయం లేదు సర్!
ఇబ్రహీంపట్నం: సర్ ప్రక్రియకు సమయం లేదు, తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు వెంటనే బీఎల్వోలకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ సూచించారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ జాబితా కార్యక్రమంపై అఖిలపక్ష నేతలు, బీఎల్వోలు, అధికారులతో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియకు ఈనెల 10న చివరి తేదీ కావడంతో ఆలోపు ఫారాలను అందజేయాలని లేకుంటే ఓటర్ జాబితాలో పేరుండదని తెలిపారు. మున్సిపాలిటీ ఓటర్ జాబితాలో 26,410 మంది ఉంటే అందులో 70.8 శాతం ఓటర్లే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటశివలింగం, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, బీఎల్ఓలు పాల్గొన్నారు.ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలి -
నేడు జాబ్ మేళా
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నల్లకంచెలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రాధిక గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్కేఎస్ఎస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్మేళాకు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటో, బ్యాంక్ అకౌంట్ తదితర పత్రాలతో హాజరుకావాలని సూచించారు. అభ్యర్థుల అర్హతను బట్టి కంపెనీలోని ఆయా ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందని తెలిపారు. చేవెళ్ల: సబ్రిజిస్ట్రార్ కార్యాలయంకోసం అధికారులు స్థలాన్ని పరిశీలించారు. చేవెళ్లలోని సర్వే నంబర్ 86లో ఉన్న ప్రభుత్వ భూమిని గురువారం హౌసింగ్ డీఈ జ్యోతి, ఏఈ శ్రీనివాస్, రెవెన్యూ సర్వేయర్ అంజనేయులు బృందం వేర్వేరుగా పరిశీలించారు. బైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఈ స్థలం అనువుగా ఉందని గుర్తించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం: ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల్లో కోత విధిస్తే సహించేదిలేదని మున్సిపల్ కార్మికులు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 1181 జీవోతో తమ నెలవారీ వేతనాల్లో రూ.4వేలు కోత పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్న తమ పొట్ట కొట్టొద్దన్నారు. 1181 జీవోను రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, స్థిరమైన వేతనాలు అందించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సుదర్శన్కు వినతిపత్రం సమర్పించారు. కందుకూరు: పామాయిల్ సాగులో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని కేంద్ర నీతి అయోగ్ సభ్యుడు కేవీ రాజు అన్నారు. గుమ్మడవెల్లిలోని రైతు బి.మనీష్రెడ్డికి చెందిన పామ్ ఆయిల్ తోటను గురువారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి వారికి పామాయిల్ పంటపై ఉన్న అవగాహన తెలు సుకున్నారు. అనంతరం అగర్మియాగూడలో రైతు ఆదిబ్అహ్మద్ చేపట్టిన కూరగాయల సాగు, పశువుల పెంపకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఒకే రకం పంటను కాకుండా, సమగ్ర వ్యవసాయ విధానం చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట నీతి అయోగ్ స్టేట్ యంగ్ ప్రొఫెషనల్ ఆష్ణాశర్మ, డైరెక్టర్ ఎకనామిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రూఫూస్, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ సరోజిని, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్, డివిజన్ ఉద్యాన శాఖ అధికారి సౌమ్య, పామాయిల్ ఏరియా మేనేజర్ సుమంత్, హెచ్ఈఓ శ్రవణ్, ఎఫ్ఓ మల్లేష్ పాల్గొన్నారు. షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు దోస్తుద్వారా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 11వరకు దోస్త్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కళాశాల ఆప్షన్ ఇచ్చుకోవాలని తెలిపారు. 14న సీట్ల కేటాయింపు ఉంటుందని, సమాచారాన్ని విద్యార్థుల ఫోన్కు చేరవేయడం జరుగుతుంద న్నారు. 14 నుంచి 18 వరకు సెల్ఫ్, కళాశాలలో రిపోర్ట్ చేయాలన్నారు. బీఎస్సీ లైఫ్సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీఏ తెలుగు మీడియం, ఇంగ్లిష్ మీడియం, బీకాం కంప్యూటర్ అప్లికే షన్స్, ఉద్యోగ ప్రాధాన్యత కలిగిన బీఎస్సీ ఫార్మాస్యూటికల్ సైన్స్, బీకాం రిటైల్ ఆపరేషన్స్వంటి కోర్సుల్లో సీట్లు మిగిలాయన్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియను పక్కాగా చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఈ మేరకు గురువారం రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లిలోని దుర్గాకన్వెన్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. సమావేశానికి రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్లమెంట్ ఇన్చార్జులు, డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, పట్టభద్రుల్లో ఓటరు నమోదు ప్రాముఖ్యతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నమోదు ప్రక్రియలో ఎక్కడా.. ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. నాయకులు పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని, పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా నియోజకవర్గాల్లో ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లు, అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్షులు బాధ్యత తీసుకొని ప్రతి గ్రాడ్యుయేట్ను కలవాలని మంత్రి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలని తెలిపారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
పంచాయతీ కార్యదర్శుల నిరసన
మంచాల: తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అవమానానికి గురిచేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. జాపాల పంచాయతీ కార్యదర్శి మురళీమోహన్చారి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అవమానపర్చిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తక్షణమే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త జీఓతో వేతనాలు తగ్గాయ్ ● మున్సిపల్ సిబ్బంది ఆవేదన ● స్పీకర్ ప్రసాద్కుమార్కు వినతిపత్రం అనంతగిరి: ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన కొత్త జీఓలో తమ వేతనాలను తగ్గించిందని మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం వికారాబాద్ వచ్చిన స్పీకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో నీటి సరఫరా, ఎలక్ట్రికల్ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, శానిటరీ జవాన్ల వేతనాలను తగ్గించిందని తెలిపారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీఓతో నీటి సరఫరా సిబ్బంది, సూపర్వైజర్లు, ఆఫీస్ సబార్డినేట్లకు రూ.1,000 చొప్పున, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.4,250, వర్క్ ఇన్స్పెక్టర్లకు 3,900 చొప్పున తక్కువ జీతం వచ్చిందన్నారు. అసలే చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న తమకు వేతనాలను తగ్గించడం ఏమిటని వాపోయారు. పంద్రాగస్టు నాటికి యూనిఫాంల పంపిణీ బషీరాబాద్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి యూనిఫాంలు అందజేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి తెలిపారు. గురువారం బషీరాబాద్ ఎంపీపీఎస్లో టీచర్లతో కలిసి విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే తొలి జత యూనిఫాంల పంపిణీ పూర్తయిందని, రెండో జత కుట్టు పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని వివరించారు. ప్రభుత్వం సరఫరా చేసిన వస్త్రంతో ఒక్కో విద్యార్థికి రూ.74 వ్యయంతో మహిళా సంఘాలే యూనిఫాంలను కుట్టి అందిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అస్మాఖతామ్, ఉపాధ్యాయులు చంద్రకళ, ఐఆర్పీ జ్యోతి, మహిళా సంఘాల ప్రతినిధి భాగ్యలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. -
11 నెలలు..8 విడతలు
సాక్షి, సిటీబ్యూరో: ఎవరైనా ఒకటి రెండుసార్లు సైబ ర్నేరాల బారినపడితేనే అప్రమత్తం అవుతారు. అదీ ఒకేరకమైన వేదికల కేంద్రంగా జరిగితే వాటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. షేక్పేటకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి (48) మాత్రం 11 నెలల కాలంలో ఎనిమిది విడతల్లో రూ.5.1 లక్షలు మోస పోయాడు. ప్రతి సందర్భంలో సైబర్ నేరగాళ్లు ఫేస్ బుక్, ఇన్స్ట్రాగాం ద్వారానే.. నగదు రికవరీ, విదేశీ ఉద్యోగాల పేరుతోనే ఎర వేసి టోకరాలు వేయడం గమనార్హం. పూర్తి వివరాలు లేకపోయినా.. ఈ ఎని మిది విడతలకు ముందూ ఓసారి ఇతడు బాధితుడిగా మారినట్లు ఫిర్యాదు ఆధారంగా తెలుస్తోంది. 2025 ఆగస్టు నుంచి 2026 జూన్ వరకు జరిగిన ఈ ‘సీరియల్ సైబర్ క్రైమ్’పై ఎట్టకేలకు బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ను ఆశ్రయించడంతో గురువారం కేసు నమోదైంది. క్రిప్టోకరెన్సీ రిక వరీ పేరుతో రూ. 2,83,500, దుబాయ్ స్టోర్ కీపర్ వీసా పేరుతో రూ. 19,050, ఢిల్లీ పోలీసుల సంబంధాల పేరుతో రికవరీ ట్రేడింగ్ ద్వారా రూ. 27,653, సింగపూర్ ఉద్యోగ వీసా ప్రాసెసింగ్ పేరుతో రూ. 25,000, ఐ4సీ, హ్యాకర్ల ద్వారా డబ్బు రికవరీ చేస్తా మని రూ. 31,500, అమెరికా ఫ్రూట్ పికింగ్ ఉద్యోగ వీసా పేరుతో రూ. 69,200, కెనడా ఫుడ్ ప్యాకింగ్ ఉద్యోగం పేరుతో రూ.35,000, యూకే సంస్థ పేరుతో బ్యాంక్ వెరిఫికేషన్ రికవరీ కోసం రూ. 23,400 సైబర్ నేరగాళ్లు బాధితుడి నుంచి స్వాహా చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పదేపదే మోసపోయిన షేక్పేటవాసి -
ప్రతీ మహిళకు చదువుకునే హక్కుంది
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి ప్రతి మహిళకు చదువుకునే హక్కు ఉందని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. ఉల్లాస్, టాస్ కార్యక్రమం విజయవంతం కోసం గురువారం కలెక్టరేట్ నుంచి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ.. శుక్రవారం 10.30 నుంచి 12.30 గంటల వరకు మండల విద్యాధికారి కార్యాలయంలో ప్రతి మండల రిసోర్స్ సెంటర్లో ఉల్లాస్, టాస్పై అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు. సెర్ప్ ఏపీఎంలు, జీహెచ్ఎంసీ టీఎంసీలు హాజరై ప్రతి స్వయం సహాయక సంఘం నుంచి ఒక మహిళను ఉల్లాస్ తరగతులకు సమీకరించాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఉల్లాస్ అక్షరాస్యత అభ్యసన కేంద్రాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఎంఈఓలు గ్రామీణ, పట్టణ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు పాఠశాల అనంతరం సాయంత్రం 3.30 నుంచి 4 గంటల వరకు నిత్యం ఉల్లాస్ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. దీని ద్వారా జిల్లా అక్షరాస్యత పెంచాలన్నారు. ప్రతి మండల మహిళా సమాఖ్యలో ఉల్లాస్ పుస్తకాలు, టీఎల్ఎం అందుబాటులో ఉన్నాయని, వీటిని క్షేత్రస్థాయి వరకు అందించాలన్నారు. దాతలు ముందుకు రావాలి తుక్కుగూడ: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ర్థులకు మౌలిక వసతుల కల్పన కోసం దాతలు ముందుకు రావాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. తుక్కుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సర్దార్నగర్ గ్రామానికి చెందిన ఈదులకంటి చిరంజీవిగౌడ్ రూ.25 లక్షల విలువైన బస్సును బహూకరించారు. ఈ బస్సును గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ కస్నానాయక్, హెచ్ఎం భాస్కర్రెడ్డి, పాఠశాల చైర్మన్ వనిత, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి -
ఆర్టీసీ విలీనం టీఎంయూతోనే సాధ్యం
షాద్నగర్ రూరల్: టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ)తోనే సాధ్యమని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీఎంయూ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ సమస్యలపై ఏనాడూ మాట్లాడలేదని ఆరోపించారు. తమ సంఘం ఆందోళనల నేపథ్యంలో చర్చలు మొదలుపెట్టిందని తెలిపారు. త్వరలోనే జరిగే ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ఆర్టీసీ విలీనంతో ఈ ఎన్నిక ముడిపడి ఉందని తెలిపారు. కార్మికులు తమ ప్రయోజనాలకోసం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నూతన కమిటీ ఎన్నిక అనంతరం డిపో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా వెంకటయ్యగౌడ్, ఉపాధ్యక్షుడిగా ఎంఎస్ రెడ్డి, కార్యదర్శులుగా మాకం నర్సింలు, జాయింట్ సెక్రటరీగా మక్సూద్, ప్రచార కార్యదర్శిగా రుషికుమారి, రీజినల్ కమిటీ సభ్యుడిగా అర్జున్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు రఘునాయక్, నాయకులు తిరుపతయ్య, రవీందర్ గౌడ్, డీవీ.స్వామి, రాకేష్, బాల్రాజ్, జీవీఎం రావు, జహంగీర్, వెంకటేశ్, పావని, స్వప్న పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి -
ట్రాఫిక్కు పెట్టాలింక చెక్!
తుర్కయంజాల్: గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పలు ప్రధాన రహదారులను కలుపుతూ లింక్ రోడ్లు నిర్మించాలని భావించిన ప్రభుత్వం ఇప్పటికే పలుచోట్ల సర్వే పూర్తి చేసింది. కన్సల్టెన్సీలు ఇచ్చిన సర్వే రిపోర్టు ఆధారంగా టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు మరోసారి క్షేత్ర స్థాయి పరిశీలన చేపడుతున్నారు. సర్వే నివేదిక ఆధారంగా నష్టపోతున్న నిర్మాణాలు, ప్లాట్లు, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులపై మరోసారి నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా శంషాబాద్ జోన్ పరిధిలోని ఆదిభట్ల సర్కిల్ పరిధిలో గురువారం అసిస్టెంట్ సిటీప్లానర్ శ్రీధర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి వెంకట్ రఘునాథ్ నాగార్జున సాగర్ రహదారి నుంచి తొర్రూర్ వరకు సర్వే పూర్తయిన రోడ్డును పరిశీలించారు. ప్రత్యామ్నాయ మార్గాలుగా.. నగరంతో పాటు, శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ప్రధాన జంక్షన్లకు ప్రత్యామ్నాయ మార్గాలుగా స్లిప్ రోడ్లు ఉపయోగపడనున్నాయి. మొదటి సారిగా 2019లో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం వీటికి రూపకల్పన చేసింది. మొత్తం రెండు దశల్లో కలిపి 31 రహదారులను పూర్తి చేశారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు విముక్తి లభించింది. కొత్తగా వేసే రోడ్లతో రియల్ ఎస్టేట్ పుంజుకోనుంది. ఆదిభట్ల సర్కిల్లో.. మూడో విడతలో భాగంగా శంషాబాద్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ జోన్ల పరిధిలో మొత్తం 18 రోడ్లు వేయాల్సిన అవసరం ఉందని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఒక్క శంషాబాద్ జోన్లోనే పది రోడ్లు ఉన్నాయి. తుర్కయంజాల్లోని నాగార్జున సాగర్ రహదారి నుంచి తొర్రూర్ వరకు 1.6 కి.మీ మేర 100 ఫీట్లతో రోడ్డు నిర్మించనున్నారు. సర్వే నంబర్ 212 నుంచి ప్రారంభమై, మస్కతి డెయిరీకి చెందిన భూముల్లో నుంచి హైటెన్షన్ లైన్ కింద నుంచి రోడ్డు నిర్మించనున్నారు. ఇంజాపూర్లోని బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి దిలావర్ఖాన్ చెరువు మీదుగా మునగనూర్ వరకు 2 కి.మీ మేర రోడ్డు వేయాలని నిర్ణయించారు. రోడ్డు వేయనున్న ప్రాంతాలు (కి.మీ.లలో) ● నాగార్జున సాగర్ రోడ్డు నుంచి తొర్రూర్ వరకు: 1.6 ● ఇంజాపూర్ నుంచి మునగనూర్: 2 ● బడంగ్పేట– నాదర్గుల్ మెయిన్ రోడ్డు నుంచి నాదర్గుల్ వరకు: 2.6 ● నాదర్గుల్ రామాలయం మీదుగా బడంగ్పేట ప్రధాన రహదారి నుంచి తుర్కయంజాల్ వరకు: 3.8 ● మల్లాపూర్ క్రాస్ రోడ్డు నుంచి కుర్మల్గూడ: 3.2 ● కుర్మల్గూడ నుంచి నాదర్గుల్: 3.3 ● ఆర్సీఐ ఎక్స్ రోడ్డు నుంచి శ్రీశైలం హైవే: 2.6 ● శంషాబాద్ రైల్వే క్రాసింగ్ నుంచి ధర్మగిరి రోడ్డు: 5 ● శంషాబాద్ బస్టాప్ నుంచి రాళ్లగూడ రోడ్డు:4 ● ఎన్హెచ్ 44 తొండుపల్లి నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు: 3 రాజేంద్రనగర్ జోన్ పరిధిలో.. ● బైరారిగూడ నుంచి నార్సింగి వరకు: 0.85 ● ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి చేవెళ్ల రోడ్డు వయా కిస్మత్పూర్: 5.5 ● కిస్మత్పూర్ నుంచి ఆర్అండ్బీ రోడ్డు ప్రెస్టీజ్ విల్లాస్: 2.05 ● దర్గా నుంచి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్: 0.85 ● ఫార్మాయిష్ హోటల్ నుంచి తారామతి బారాదరి వరకు: 2.5 ● బాపుఘాట్ బ్రిడ్జి నుంచి పీఅండ్టీ కాలనీ వరకు ఈస్ట్ నుంచి ఇసా రివర్ వరకు: 2.1 ఖైరతాబాద్ జోన్ పరిధిలో.. ● గ్రీన్ ల్యాండ్ జంక్షన్ నుంచి నెక్లస్రోడ్డు జంక్షన్ వరకు: 1.6 ● నెక్లస్రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి పాటిగడ్డ వరకు: 1 ప్రత్నామ్నాయ మార్గాలు ప్రధాన రహదారులను కలుపుతూ లింక్ రోడ్ల నిర్మాణం ఇప్పటికే కన్సల్టెన్సీల ద్వారా పలుచోట్ల సర్వే క్షేత్రస్థాయి పరిశీలనలో టౌన్ప్లానింగ్ అధికారులు ఒక్క శంషాబాద్ జోన్లోనే పది రోడ్లు -
‘పట్టభద్రుల ఓటర్ల నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి’
సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను బూత్ స్థాయిలో పార్టీ పట్టును బలోపేతం చేసే కార్యక్రమంగా భావించి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.గురువారం రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలోని దుర్గా కన్వెన్షన్ హాల్లో ఆయన అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. రాబోయే "హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్" పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు, సర్ ప్రక్రియ పురోగతిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించి క్యాడర్కు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు.పాత, కొత్త నాయకులు సమన్వయంతో వ్యవహరించి ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. పట్టభద్రుల్లో ఓటరు నమోదు ప్రాముఖ్యతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఓటరు నమోదును చేపట్టాలని, బూత్ స్థాయిలోని ప్రతి గ్రాడ్యుయేట్ను పార్టీ శ్రేణులు కలిసేలా కార్పొరేషన్ల చైర్మన్లు, అసెంబ్లీ, పార్లమెంట్ బాధ్యులు, జిల్లా అధ్యక్షులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులతో పాటు సంబంధిత పార్టీ బాధ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఉంటుందని, ఈ విషయంలో తుది నిర్ణయం హై కమాండ్దేనని తేల్చి చెప్పారు.ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో చేరేలా మరియు తప్పులను సరిదిద్దేలా సర్ ప్రక్రియపై పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రకాష్ గౌడ్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, అరికెపూడి గాంధీ, కార్పొరేషన్ ఛైర్మన్లు మల్ రెడ్డి రాంరెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బండి రమేష్, డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, నర్సింహా రెడ్డి, ధారా సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
నన్ను ఏ క్షణమైనా చంపేస్తారు: ఎమ్మెల్యే కుమారుడు
హైదరాబాద్: తన ప్రాణాలకు ముప్పు ఉందని, ఏ క్షణమైనా తనను చంపేస్తారని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ తెలిపారు. ఉంటున్న ఇంటిపై కొంత మంది వ్యక్తులు దాడి చేశారని గురువారం మీడియాకు వెల్లడించారు. తనకు ఏమైనా అయితే వారిదే బాధ్యత అని అన్నారు. వారి వివరాలు మీడియాకు ఇస్తానని అన్నారు. తన ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. తాను ప్రేమించిన యువతి ఇంట్లో నెల రోజులుగా ఉంటున్నట్టు ఆయన వెల్లడించారు.ప్రాణాల మీద ఆశ వదులుకుని, చావుకు తెగించి మీడియా ముందుకు వచ్చాను. నన్ను ఎప్పుడైనా చంపేయొచ్చు. పోలీస్ స్టేషన్కు వెళ్లే దారిలో కూడా చంపేయొచ్చు. మీడియాతో మాట్లాడిన తర్వాత నేను బతికి ఉంటానో, లేదో తెలియదు. నేను శ్రియశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. జూలై 8న మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇదంతా మా తల్లిదండ్రులకు తెలుసు. మా పెళ్లి చేయడానికి వారు ఇష్టపడలేదు. మా అత్తమ్మ కుటుంబంతో కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. ఒక నెల నుంచి మా అత్తమ్మ వాళ్ల ఇంట్లోనే ఉంటున్నాను.నిన్న 40 మంది వ్యక్తులు వచ్చి నేను ఉంటున్న ఇంటిపై దాడి చేశారు. నా ప్రేమ వ్యవహారం కారణంగానే ఇదంతా జరుగుతోంది. ముందు నుంచి మా ప్రాణాలు ముప్పు ఉంది. మేం ముగ్గురం చనిపోతే వాళ్లదే బాధ్యత. వారి కాల్డేటా వివరాలు మీడియాకు ఇస్తానని సంతోష్ గౌడ్ తెలిపారు. కాగా, తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని, ఈ నేపథ్యంలోనే దాడి జరిగిందని వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పందించాల్సి ఉంది.పోలీస్ స్టేషన్లో కానీ, కోర్టులో కానీ నాకు న్యాయం జరుగుతుందని నేను అనుకోవడం లేదు.చావుకు తెగించి మీతో మాట్లాడుతున్నా... నన్ను ఎప్పుడైనా చంపేయొచ్చు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే (ప్రస్తుతం కాంగ్రెస్) ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్.తాను ప్రేమించిన యువతిని వివాహం… pic.twitter.com/cVk9oXD3yK— greatandhra (@greatandhranews) August 6, 2026 -
15 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
రూ.75,400 నగదు, పది సెల్ఫోన్లు స్వాధీనం కడ్తాల్: మద్యం సేవిస్తూ పేకాడుతున్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ సైదిరెడ్డి తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన కొంత మంది వ్యక్తులు బుధవారం మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయ సమీపంలోని ఓ హాల్లో పేకాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 15 మందిని అరెస్ట్ చేసి రూ.72,400 నగదు, పది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ ఆమనగల్లు: పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా తలకొండపల్లి పోలీసులు పట్టుకున్నారు. తలకొండపల్లి సీఐ జానకిరామ్రెడ్డి తెలిపిన ప్రకారం.. ఆమనగల్లు మండలం మేడిగడ్డతండాకు చెందిన నేనావత్ మణిపాల్, తలకొండపల్లి మండలం చుక్కాపూర్ రేషన్ డీలర్ మల్లయ్య కలిసి రేషన్బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు బుధవారం బియ్యాన్ని తరలిస్తుండగా చుక్కాపూర్ సమీపంలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా మహేంద్ర మినీ ట్రక్ వాహనంలో 40 సంచులలో 20 క్వింటాళ్ల రేషన్బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకుని వాహనాన్ని సీజ్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆచారంలో ప్రచారం.. భక్తుల విచారం! కేశంపేట: మండల పరిధిలోని సంగెం గ్రామంలో బుధవారం నిర్వహించిన బోనాల వేడుకల్లో పోతురాజు వేషధారణ చర్చనీయాంశమైంది. వేషం ధరించిన వ్యక్తి నుదుటిపైన బీఆర్ఎస్ అని రాసుకోవడంపై భక్తులు, గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తంచేశారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా, అనాది ఆచారంగా జరుపుకొంటున్న పండుగలో పార్టీల ప్రస్తావన తేవడం తగదని సూచించారు. ఇలాంటి చర్యలు భక్తులు, ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తాయని సూచించడంతో సదరు వ్యక్తి తన నుదుటిపై రాసుకున్న బీఆర్ఎస్ అనే అక్షరాలను చెరిపేశారు. -
శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం
కొత్తూరు: అంత్యక్రియలు నిర్వహించిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దివ్యాంగుడైన పాత్లావత్ నరేశ్(27) జేపీదర్గాలో భిక్షాటన చేస్తూ జీవించేవాడు. గత నెల 15న దర్గా నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఉస్మానియాకు తరలించారు. బాధితుడి అన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత పోలీసులు, ఆస్పత్రి వర్గాలకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు నరేశ్ను ఇంటికి తీసుకురాగా, రెండు రోజుల క్రితం మృతిచెందాడు. దీంతో అతని అంత్యక్రియలు పూర్తి చేశారు. నరేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తంకావడంతో పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మంగళవారం ఉస్మానియా నుంచి వచ్చిన నలుగురు వైద్యుల బృందం పూడ్చిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించింది. ఫాక్స్కాన్ ఉద్యోగుల గదుల్లో చోరీ దొంగతనాలకు పాల్పడుతున్న డార్మిటరీ సూపర్వైజర్ ఇబ్రహీంపట్నం రూరల్: ఫాక్స్కాన్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న వియత్నాం దేశానికి చెందిన ప్రతినిధుల గదుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రమేశ్ తెలిపిన ప్రకారం. రోచీష్మతి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వియత్నాం దేశానికి చెందిన ఫాక్స్కాన్ ఉద్యోగుల గదుల్లో అదే డార్మిటరీ సూపర్వైజర్గా పని చేస్తున్న మారినేని చిన్న వెంకటరావు నగదు దొంగిలిస్తున్నాడు. ఓ ఉద్యోగి పెట్టిన స్పై కెమెరాలో చోరీకి పాల్పడిన వీడియో రికార్డయింది. రూ.7 వేలు నగదు దొంగిలిస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని నిందితుడిని పోలీసులకు అప్పగించారు. అపార్ట్మెంట్లోని ఆరు ఇళ్లలో రూ.లక్ష వరకు నగదు అపహరించాడని బాధితులు ఫిర్యాదు చేశారని.. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాచిగూడ: ప్రజాభిప్రాయం మేరకు ఫార్మాసిటి / ప్యూచర్ సిటి ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయాలని ఫార్మాసిటీ జ్యూరీ కమిటీ ప్రతినిధులు సీనియర్ జర్నలిస్టు వసంత లక్ష్మీ, మానవహక్కుల వేదిక అధ్యక్షుడు ఎస్.జీవన్కుమార్, రిటైర్డ్ తహసీల్దార్ వి.బాలరాజ్, డాక్టర్ జి.విజయ్ డిమాండ్ చేశారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాభిప్రాయ సేకరణ జ్యూరీ నివేదికను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ సహాయంతో తాము మరికొంత మందితో కలిసి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లు తెలిపారు. అనేక గ్రామాల్లోని, తండాల్లో రైతులను కలవడం జరిగిందని వారు ఫార్మా సిటీకి భూములు ఇవ్వడానికి అంగీకరించడం లేదని, రైతుల భూములన్నింటిని భూసేకరణ నుంచి పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేశారు. భూములు ఇవ్వని రైతుల పేర్లను వెంటనే భూభారతి అన్లైన్ రికార్డులలో పునరుద్ధరించాలని, వారి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ హక్కులను కల్పించాలని అన్నారు. కోర్డు ఆదేశాల ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం సేకరించిన భూములను స్వాధీనం చేసుకోరాదని, గ్రామాల నుంచి భారీ యంత్రాలను తొలగించాలని, గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని అన్నారు. కార్యక్రమంలో కన్నెగంటి రవి, కవుల సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026
నిర్వహణ లోపంతో తరచూ ప్రమాదాలు ● మృత్యువాతపడుతున్న అమాయకులు ● పట్టించుకోని పాలకులు ‘జూన్ 27న మీర్పేట్ హనుమాన్నగర్లో అపార్ట్మెంట్లోని లిఫ్ట్ నాలుగో అంతస్తు నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే నెలలో ఖైరతాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ లేకపోయినా తలుపు తెరుచుకోవడంతో మనువడితో కలిసి ఓ మహిళ లిఫ్ట్ షాప్ట్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, చిన్నారి తీవ్ర గాయాలతో బయటపడింది. మూడు నెలల క్రితం ఆర్సీపురంలోని ఓ అపార్ట్మెంట్లో పని చేయని లిఫ్ట్లో చిక్కుకున్న నాలుగున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు’ ‘వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన దాడి శ్రీనివాస్ తన భార్య అనసూయ(45)తో కలిసి రెండు రోజుల క్రితం చందానగర్ అన్నపూర్ణ ఎన్క్లేవ్లోని చాట్వాజ్ మాన్షన్ అపార్ట్మెంట్లో ఉంటున్న బంధువుల వద్దకు వచ్చాడు. రెండో అంతస్తులో ఉన్న బంధువుల ఇంటికి చేరుకునేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ రిపేరులో ఉండటం, ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం, ఈ విషయం తెలియక అందులో ఆమె కాలు పెట్టిన వెంటనే డోర్ మూయకుండానే కదలడంతో లిఫ్ట్ మధ్యలో కాలు ఇరుక్కుపోయి మృతి చెందింది’. ‘ఝూర్ఖండ్కు చెందిన బిల్దుఘోష్ గౌలిదొడ్డిలోని మహి ఉమెన్స్ పీజీ హాస్టల్లో వంటమనిషిగా పని చేస్తున్నాడు. అతని ఐదేళ్ల కుమార్తె బిస్టూఘోష్తో కలిసి అదే హాస్టల్లో ఉంటున్నాడు. మే 13న బిస్దూఘోష్ ఆడుకుంటూ లిఫ్ట్లో ఐదో అంతస్తుకు చేరుకుంది. తిరిగి కిందకు వస్తుండగా, తల వెనుక భాగం గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుని తల నుజ్జునుజ్జయి పాప చనిపోయిుుంది.’ ‘గతేడాది మే 27న నాగోల్లోని ఓ హోటల్లో లిఫ్ట్ కేబుల్ తెగి ఎనిమిది మంది గాయపడ్డారు. జులై 27న తుకారాం గేట్లో 68 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. జులై 15న హఫీజ్పేటలో లిఫ్ట్ వైరు తెగిపడి ఒకరు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఆగస్టు 26న గుడిమల్కాపూర్లో లిఫ్ట్ పైకప్పు కూలి 65 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. మార్చి 12న సంతోష్నగర్లోని ఓ అపార్ట్మెంట్లోని లిఫ్ట్లో చిక్కుకుని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.’ సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిత్యం ఏదో ఒక చోట లిఫ్ట్/ఎస్కలేటర్ ప్రమాదాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అనేక మంది మృత్యువాతపడుతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్ నియంత్రణ, నిర్వహణ పాలసీని తీసుకురాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెగిపడుతున్న వైర్లు.. మధ్యలో ఆగిపోతున్న లిఫ్ట్లు నిర్మాణ ఖర్చులు తగ్గించుకునేందుకు కొంత మంది బిల్డర్లు తక్కువ ధరకు లభించే లిఫ్ట్ పరికరాలను అమర్చుతున్నారు. వీటిపై సరైన నియంత్రణ, నిర్వహణ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మెజార్టీ భవనాల్లో ఇన్వర్టర్లు లేకపోవడం, అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో లిఫ్ట్ మధ్యలో ఆగిపోతోంది. లిఫ్ట్ లోపల బాడీ చుట్టూ స్టీలు రేకు కవర్ అమర్చుతుండడం, లోపల సరైన గాలి, వెలుతురు లేకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసినా అందుబాటులో ఎవరూ ఉండక పోవడం, సామర్థ్యానికి మించి బరువును లిఫ్ట్లో ఎక్కిస్తుండడంతో వైర్లు తెగిపడుతున్నాయి. డోర్లు తెరుచుకునే సమయంలోనూ సెన్సార్లు పని చేయక లిఫ్ట్ ఎక్కే వారు మధ్యలో ఇరుక్కుపోతున్నారు. కొంత మంది మృత్యువాతపడుతుంటే.. మరికొందరు కాళ్లు, చేతులు కోల్పోతున్నారు. ముసాయిదా బిల్లుకు మెరుగులు ఈ ప్రమాదాలకు చెక్ పెట్టాలని భావించిన ప్రభుత్వం ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీలో అమల్లో ఉన్న లిఫ్ట్ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. అధ్యయనం, ముసాయిదా రూపకల్పనకు రెండేళ్ల క్రితం ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఆ బాధ్యతను తెలంగాణ విద్యుత్ తనిఖీ విభాగం చేపట్టింది. 2015లో ప్రభుత్వానికి పంపిన ముసాయిదాను పరిశీలించింది. తెలంగాణ లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్ యాక్ట్–2025ని రూపొందించాలని నిర్ణయించింది. అయితే ఆ బిల్లు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఏటా పది వేలల్లో అమ్మకాలు అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యూపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) ఇవ్వడానికి పురపాలకశాఖ జారీ చేస్తున్న జీఓ 168లో లిఫ్ట్ ఏర్పాటు ప్రస్తావన ఉన్నా.. నాణ్యత, నిర్వహణ, నియంత్రణపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఇది లిఫ్ట్ తయారీ యంత్రాల కంపెనీలకు కలిసి వచ్చింది. తెలంగాణ ఎలివేటర్స్ అండ్స్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా పదివేలకుపైగా ఎలివేటర్ల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. వీటిలో 20 శాతం మాత్రమే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు ఉన్నట్లు అంచనా. తయారీ సంస్థల వద్ద ఐదారేళ్లు పని చేసిన కార్మికులు.. సొంతంగా ఎలివేటర్లను తయారు చేస్తున్నారు. వీరు బిల్డర్ల వద్ద తక్కువ ధరకు కాంట్రాక్టులు తీసుకుని, నాసిరకం పరికరాలను అమర్చుతున్నారు. బీఐఎస్ నిబంధనల ప్రకారం లిఫ్ట్ను నిర్మించే సమయంలో ఎంత మంది ప్రయాణించొచ్చు? ఎంత బరువు మోయగలదు? వంటి అంశాలను స్పష్టం చేయాల్సి ఉంది. ప్రమాణాల మేరకు విద్యుత్ సరఫరా ఉందా? నాణ్యమైన ఆటోమెటెక్ డోర్లు, అత్యవసర ఫోన్, అగ్ని నిరోధక పరికరాలు, అత్యవసర బ్రేకింగ్ సిస్టం వంటి వాటిని ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా.. ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. 20 ఏళ్లు పైబడిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. సాంకేతిక నిపుణులతో పీరియాడికల్ ఇన్స్పెక్షన్లు చేయించాాల్సి ఉన్నా.. పట్టించుకోక పోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. -
పంద్రాగస్టుకై నా అందేనా?
● యూనిఫాంల కోసం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఎదురుచూపు ● ఇందిరా మహిళా శక్తి సెంటర్లకు కుట్టు బాధ్యతలు ● నాలుగు క్లస్టర్లలో కొనసాగుతున్న పనులు ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ పాఠశాలు తెరిచి నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంలు అందలేదు. దీంతో సాధారణ దుస్తులు ధరించి స్కూళ్లకు వెళ్తున్నారు. కనీసం పంద్రాగస్టు నాటికై నా స్కూల్ డ్రెస్లు అందుతాయో.. లేదో..? తెలియని పరిస్థితి నెలకొంది. మారిన యూనిఫాం .. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఏటా రెండు జతల దుస్తులు అందిస్తున్నారు. మండలంలోని 24 స్కూళ్లలో 2,192 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో బాలురు 1,106 మంది, బాలికలు 1,086 మంది ఉన్నారు. వీరికి కొత్త యూనిఫాంలు అందకపోవడంతో గతేడాది ఇచ్చిన దుస్తువులతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో మెరున్ కలర్ ప్యాంట్, తెలుపు మెరున్ కలర్ చెక్స్ కలిగిన డ్రెస్లు అందించారు. ప్రస్తుతం బ్లాక్ ప్యాంట్, బ్లూ కలర్ షర్టు పంపిణీ చేయనున్నారు. ఒకటి నుంచి మూడో తరగతి బాలికలకు గౌను మాదిరి, ఒకటి నుంచి ఐదో తరగతి బాలురకు షార్ట్, షర్టు, నాలుగు, ఐదు తరగతుల బాలికలకు స్కర్ట్, షర్టు, ఆరు నుంచి 12వ తరగతి బాలికలకు ప్యాంట్, షర్టు, వాస్కోట్, బాలురకు ప్యాంట్, షర్ట్ ఇవ్వనున్నారు. రంగు మార్చి కాన్వెంట్ స్కూల్ డ్రస్సు మాదిరిగా కనిపించేలా ఏర్పాటు చేశారు. నాలుగు క్లస్టర్లలో కుట్టు కేంద్రాలు.. యూనిఫాంలు కుట్టే బాధత్యలను మండలంలోని స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. కటింగ్తో పాటు డ్రస్ కుట్టి, కాజాలు వేసి, ఇసీ్త్ర చేస్తే ఒక్కో డ్రస్కు రూ.75, కటింగ్ చేసి ఇస్తే రూ.50 చెల్లిస్తారు. ప్రస్తుతం నాలుగు ఇందిర మహిళా శక్తి కేంద్రాల్లో కుట్టు పనులు ప్రారంభమయ్యాయి. రాయపోల్, తులేకలాన్, దండుమైలారం, ఉప్పరిగూడ క్లస్టర్ల వారీగా పనులు కొనసాగుతున్నాయి. ఐకేపీ అధికారులు 45 మంది టైలర్లను గుర్తించగా ప్రస్తుతం 20 మంది పని చేస్తున్నారు. మొదటి దశలో ఒక్కో విద్యార్థికి ఒక్కోటి చొప్పున 2,192 డ్రస్సులు కుట్టి ఇవ్వాలి. మరో జత ఎప్పుడిస్తారనే విషయంలో స్పష్టత లేదు. విద్యార్థులకు ఒకేసారి రెండు జతలు ఇవ్వాలి కానీ, ప్రస్తుతం ఒక్కటైనా ఇవ్వాలని భావిస్తున్నారు. ఒక్క జతైనా ఇచ్చేలా.. ఆగస్టు 15 నాటికి విద్యార్థులందరికీ యూనిఫాంలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు పనులను వేగవంతం చేశారు. జెండావందనం నాటికి కనీసం ఒక్కో డ్రస్ అయినా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఏదిఏమైనా రెండు రోజుల ముందే విదవిద్యార్థులకు దుస్తులు అందించేలా ఐకేపీ అధికారులు ముందుకు సాగుతున్నారు. ముందుగానే ఇచ్చేస్తాం ప్రభుత్వం ఇచ్చిన గుడువులోపు యూనిఫాంలు సిద్ధం చేస్తాం. ఆగస్టు 13నాటికి కుట్టడం పూర్తయ్యేలా చూస్తున్నాం. ఇప్పటివరకు సగం పనులు పూర్తయ్యాయి. మరికొంత మంది టైలర్లను సమకూర్చి పనుల్లో వేగం పెంచుతాం. – సాంబశివుడు, ఐకేపీ ఎంపీఎం త్వరగతిన పూర్తి చేయాలి గడువులోపు విద్యార్థులందరికీ యూనింఫాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొత్త యూనిఫాంలతో జెండా వందనం చేసేలా ముందుకు సాగుతున్నాం. – హీర్యానాయక్, ఎంఈఓ -
ఫాంల్యాండ్స్లో హద్దురాళ్ల తొలగింపు
యాచారం: అక్రమ ఫాంల్యాండ్స్పై పంచాయతీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు రోజుల క్రితం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ‘ఫ్యూచర్సిటీలో రియల్ దందా’అనే కథనంపై జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్ వివిధ మండలాల పంచాయతీ అధికారులకు ఫోన్లు చేసి అక్రమ ఫాంల్యాండ్స్ను ధ్వంసం చేయాలని ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు బుధవారం పంచాయతీ సిబ్బంది చౌదర్పల్లిలోని అక్రమ ఫాంల్యాండ్స్లో పాతిన హద్దురాళ్లు, బోర్డులు, స్తంభాలను తొలగించారు. ఫాంల్యాండ్స్ పేరుతో మామిడి తోటలోని వ్యవసాయ భూమిని గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేసిన విషయాన్ని గుర్తించారు. అక్రమ ఫాంల్యాండ్స్ పేరిట సోషల్ మీడియాలో ప్రచారం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. నక్కర్తమేడిపల్లి, తక్కళ్లపల్లి, నందివనపర్తి తదితర గ్రామాల్లో వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన ఫాంల్యాండ్స్పై మండల పంచాయతీ అధికారి శ్రీలత వివరాలు సేకరించారు. అక్రమ ఫాంల్యాండ్స్ను కూల్చివేయాలని ఆయా గ్రామాల పంచాయతీ అధికారులను ఆదేశించారు. -
‘జైల్ భరో’ను విజయవంతం చేయండి
ఇబ్రహీంపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు, కార్మిక, వ్యవసాయ కూలీల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంచందర్ పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో బుధవారం నిర్వహించిన సీపీఎం అనుబంధ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్లకు అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 10వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే జైల్ భరో కార్యక్రమానికి కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. అందుకు గ్రామగ్రామాన ప్రచారాన్ని నిర్వహించాలని ఆయా సంఘాల నేతలను కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు జంగయ్య, జగన్, వెంకటేశ్, ముసలయ్య, ఎల్లేశ్, యాదగిరి, మహేశ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంచందర్ -
చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు
ఎంఆర్ఐ ప్రేమ్ కుమార్ తుర్కయంజాల్: వరుస వివాదాలకు కారణమైన అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్ సర్వే నెంబర్ 338లోని భూమిని స్వాధీనం చేసుకున్నామని ఎంఆర్ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మా ట్లాడుతూ.. ఈ భూమి పూర్తిగా రెవెన్యూ విభాగం ఆధీనంలో ఉందని.. ఎవరైనా ప్రవేశించినా, స్థలాన్ని కొనుగోలు, విక్రయాలు చేసినా, అనుమతి లేని నిర్మాణాలు చేపట్టిన చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్, పోలీస్శాఖల అధికారులతో కలి సి పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకు ని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అధిక వడ్డీ పేరుతో మోసం మణికొండ: తమ వద్ద రూ.లక్షల్లో అప్పు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని పలువురు బీఆర్ఎస్ మహిళా నేత ఇంటివద్ద ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ మణికొండ పాత మున్సిపాలిటీ మాజీ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి పుప్పాలగూడలోని తిరుమలహిల్స్లో నివాసం ఉంటున్నారు. ఏళ్ల క్రితం అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటంతో బుధవారం బాధితులు ఆమె ఇంటికి వచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే కాలనీకి చెందిన రాణి అనే మహిళ తన వద్ద రూ.9లక్షలు తీసుకుని కొద్ది నెలల్లోనే అసలుతో పాటు 30శాతం అధికంగా ఇస్తామని చెప్పి తీసుకుందని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోవటం, ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యిందని, తమను దుర్బాషలాడటంతో పా టు చంపేస్తానని బెదిరించిందని ఆమె ఫిర్యా దులో పేర్కొన్నారు. రూపారెడ్డి ఇంటికి వచ్చి న వారిలో ఓ మహిళ అస్వస్థతకు గురైంది. తన కుమార్తెకు ఎమ్మెల్యే కుమారుడితో వివా హ నిశ్చితార్థం జరిగినందున తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని, తనకు బీఆర్ఎస్ నాయకులు అండగా నిలవాలని, పోలీసులు భద్రత కల్పించాలని రూపారెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. స్పందించిన పోలీసులు వెంటనే ఆమె ఇంటికి వచ్చిన బాధితులను సముదాయించారు. బాధితురాలు రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
చదువుతోనే.. గౌరవం, గుర్తింపు
ప్రిస్క్రిప్షన్ లేకుండా.. డాక్టర్ ప్రిస్క్రిప్సన్ లేకుండా..అక్రమంగా ట్రమడాల్ మాత్రలు విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంకర్పల్లి: చదువుతోనే ప్రతీ ఒక్కరికి గౌరవం, గుర్తింపు లభిస్తోందని అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ‘అమ్మకు అక్షరమాల–ఉల్లాస్’కార్యక్రమం నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన అమ్మమ్మ భూమి అమ్మి.. తన తల్లిని చదవించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని చేసిందని గుర్తు చేసుకున్నారు. నిరక్షరాస్యులైన ప్రతీ మహిళ వయస్సుతో సంబంధం లేకుండా చదువు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. చదువుకున్న మహిళలు ఉన్న కుటుంబం నైపుణ్యత, ఆర్థికంగా రాణిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మకు ‘అక్షరమాల–ఉల్లాస్’కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మున్సిపాలిటీలో పని చేస్తున్న 81మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు రోడ్లు, డ్రైన్లు పూర్తి నాణ్యతతో నిర్మించాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమ్మకు అక్షరమాల–ఉల్లాస్ ప్రాజెక్టు జిల్లా డైరెక్టర్ అనిత, మెప్మా పీడీ వెంకటనారాయణ, శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యోగేశ్, వైస్ చైర్పర్సన్ శ్వేత, మేనేజర్ అంజన్ కుమార్, పర్యావరణాధికారి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. ‘ఉల్లాస్’లో ఆదర్శ జిల్లాగా నిలపాలి ఇబ్రహీంపట్నం రూరల్: ఫంక్షనల్ లిటరసీ అసెస్మెంట్ టూల్స్(ఎఫ్ఎల్ఏటీ)–ఓపెన్ స్కూల్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి సూచించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత జిల్లా అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెప్టెంబర్లో నిర్వహించనున్న ఎఫ్ఎల్ఏటీ ఓపెన్ స్కూల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఉల్లాస్ అభ్యాసకులంతా పరీక్షకు హాజరై ఉత్తీర్ణులయ్యేందుకు అవసరమైన చర్యలు సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ప్రతీ అభ్యాసకుడికి పరీక్షపై పూర్తి అవగాహన కల్పించి, లెర్నింగ్ సెంటర్లలో క్రమం తప్పకుండా తరగతులు నిర్వహిస్తూ ప్రత్యేక శిక్షణ అందించాలని తెలిపారు. పరీక్షకు సంబంధించిన హాజరునమోదు, రవాణా, పరీక్షా కేంద్రాల నిర్వహణ, అభ్యాసకులకు సమాచారం చేరవేత తదితర అంశాలపై సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగస్వామ్యమైన అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేసి జిల్లాను ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యుమరసీ అసెస్మెంట్ టెస్ట్(ఎఫ్ఎల్ఎన్ఏటీ)–నేషన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓస్) పరీక్షల్లో ఆదర్శ జిల్లాగా నిలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, మెప్మా పీడీ వెంకటనారాయణ, వయోజన విద్యాశాఖ జిల్లా అధి కారి అనిత, జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్మయి -
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
శంకర్పల్లి: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి కొండకల్ శివారులో చోటు చేసుకుంది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం.. కొండకల్ సమీపంలోని రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి(40) మృతదేహం పడి ఉంది. గమనించిన లైన్మెన్ వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించి, వికారాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కదులుతున్న రైలు నుంచి పడి మృతి చెందినట్లుగా రైల్వే పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. కేసు దర్యాప్తులో ఉంది. కారు ఢీకొని.. అబ్దుల్లాపూర్మెట్: రోడ్డు పక్కన నిల్చున్న వ్యక్తిని అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని టాటా మోటార్స్ ఎదురుగా విజయవాడ జాతీయ రహదారి పక్కనే బుధవారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి (45) నిలబడి ఉన్నాడు. అదే సమయంలో విజయవాడ–హైదరాబాద్ మార్గంలో వెళ్తున్న ఓ కారు డ్రైవర్ అతి వేగంగా వచ్చి అతని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికులు చెత్త ఏరుకుని జీవనం సాగించే రమేశ్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికికి తలరించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
శంకర్పల్లి: సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మోకిల సీఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ‘సైబర్ జాగ్రుక్తా దివస్’లో భాగంగా ప్రాచీన్ గ్లోబల్ స్కూల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లను వినియోగించడంతో సైబర్ నేరాలు జరగుతున్నాయన్నారు. అపరిచితులు మాయమాటలు చెప్పి బ్యాంకు ఖాతాల నుంచి కోట్లు కొల్లగొడుతున్నట్లు స్పష్టం చేశారు. ఫోన్లకు వచ్చే ఓటీపీ, కాల్స్కి స్పందించొద్దని, ఇంటి పరిసరాల్లో అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మోకిల ఎస్ఐ సురేశ్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. సీఐ శ్రీనివాస్రెడ్డి -
ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్రమడాల్ విక్రయం
సాక్షి, సిటీబ్యూరో/మాదాపూర్: డాక్టర్ ప్రిస్క్రిప్సన్ లేకుండా..అక్రమంగా ట్రమడాల్ మాత్రలు (అధిక మోతాదు పెయిన్ కిల్లర్స్) విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద 6568 మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపిన మేరకు..విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సాయినగర్లోని ప్రైమ్ ఫార్మసీపై దాడి చేశారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్లు, చట్టబద్ధమైన రికార్డులు లేకుండా ట్రమడాల్ హైడ్రోక్లోరైడ్ మాత్రల్ని అక్రమంగా విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ప్రైమ్ ఫార్మసీ యజమాని తొర్రి వెంకటేశం, డెలివరీ బాయ్ బర్లకాడి శ్రీకాంత్లను అరెస్ట్ చేశారు. నారాయణ ఖేడ్కి చెందిన మరో నిందితుడు రాథోడ్ ప్రకాశ్ పరారీలో ఉన్నాడు. ఇతను మాత్రలను అక్రమంగా సేకరించి ఫార్మసీలోనూ..డెలివరీ బాయ్ ద్వారా వినియోగదారులకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. సుమారు 100 నుంచి 150 మంది వినియోగదారులకు ఈ మాత్రల్ని సరఫరా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిని అధిక మత్తుకోసం డ్రగ్స్లా వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. ఫుడ్ లైసెన్స్ ముసుగులో హెచ్ కేటగిరీ మందుల తయారీ ఆహారం, న్యూట్రాస్యూటికల్ ముసుగులో హేబిట్యువల్ డ్రగ్స్(హెచ్ కేటగిరీ) తయారీని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ)అధికారులు గుర్తించా రు. బుధవారం మలక్పేట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా మేడ్చల్ మల్కాజ్గిరి ఫేజ్–2లోని గోతిక్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో గబాజెన్ మాత్రలు తయారు చేసి, నగరానికే చెందిన సిఫ్కో ఆయుస్టార్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నట్లు తేల్చా రు. తీసుకున్న లైసెన్సుకు..తయారు చేసే ఉత్పత్తికి తేడాలున్నాయి. షెడ్యూల్డ్–ఎం తయారీ పద్ధతులు, ఇండియన్ ఫార్మకోపియా నాణ్యత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని డీసీఏ అధికారులు పేర్కొన్నారు. ఫుడ్ లైసెన్స్ పేరుతో మందులు విక్రయిస్తున్నారని తేలిందని తెలిపారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ ఏడీ రాజమౌళి, మలక్పేట్ డీఐ అనిల్ పాల్గొన్నారు. ఇద్దరు నిందితుల అరెస్ట్, 6,586 టాబ్లెట్లు స్వాధీనం -
విజిబుల్ పోలీసింగ్ అమలు చేయండి
చేవెళ్ల: ప్రజలకు పోలీసుల ఉనికి తెలిసేలా విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని ప్యూచర్సిటీ సీపీ తరుణ్ జోషి అన్నారు. బుధవారం ఆయన చేవెళ్ల ఠాణాను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్లోని రికార్డులు, కేసులు, లాకప్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా దర్యాప్తు చేయాలని సూచించారు. అనంతరం పీఎస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, ఏసీపీ బి.కిషన్, సీఐ కట్టా నరేందర్రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వరావు, శిరీష, తేజశ్రీ, సిబ్బంది తదితరులు ఉన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం మొయినాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని.. వాటి పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఫ్యూచర్సిటీ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. ‘సైబర్ జాగ్రుక్తా దివస్’సందర్భంగా బుధవారం మున్సిపల్ పరిధిలోని విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. సైబర్ స్టాకింగ్, లోన్ యాప్లు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా అనేక మోసాలు జరుగుతున్నాయని.. ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్లను నమ్మి వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దన్నారు. సోషల్ మీడియా వినియోగంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని.. వ్యక్తిగత వివరాలను, ఓటీపీలు, పాస్వర్డ్లను ఎవరికీ షేర్ చేయవద్దన్నారు. బలమైన పాస్వర్డ్లు వినియోగించాలన్నారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా సైబర్ అవగాహన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సైబర్ భద్రతను ప్రోత్సహిస్తూ ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాఫ్’అంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల డీసీపీ యోగేశ్గౌతమ్, ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరెడ్డి, ఎస్ఐ వెంకన్న, కళాశాల ప్లేస్మెంట్ డైరెక్టర్ వెంకటాచలం, హెచ్ఓడీ నాగేశ్వర్రావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి -
రీ సర్వే తర్వాతే స్పష్టత
యాచారం: మొదట సర్వేనంబరు 127లోని అసైన్డ్ భూమి రీ సర్వే, ఆ తర్వాతే కబ్జా రైతులకు చెల్లించే పరిహారం చెల్లింపు స్పష్టత ఇస్తామని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో మొండిగౌరెల్లి అసైన్డ్ రైతులు, రాజకీయ పక్షాల నాయకులతో సమావేశమయ్యారు. సర్వేనంబరు 127లో కబ్జా సర్వేలో పట్టాదారు, పాసుపుస్తకాల్లో కంటే తక్కువ ఎకరాల చొప్పున లిస్టుల్లో రైతుల పేర్లు ప్రకటించారని.. రీ సర్వే నిర్వహించాలని వారం క్రితం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ రైతులతో అదనపు కలెక్టర్ సమావేశమై వెంటనే రీ సర్వే చేయిస్తానని.. ఆ తర్వాత మరోమారు సమావేశమై కబ్జా రైతుల పరిహారంపై తేల్చుతామన్నారు. భూ సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. పట్టాదారు, పాసుపుస్తకాలు కలిగిన రైతులకు న్యాయం చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం సర్పంచ్ కొలన్ రమాదేవి ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు, రైతులు, రాజకీయ పక్షాల నాయకులు కలిసి కబ్జా రైతులకు ఎకరాకు రూ.30లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి, యాచారం తహసీల్దార్ అయ్యప్ప పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి -
దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలో మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నవీన్కుమార్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కామర్స్, హిస్టరీ, కెమిస్ట్రీ, జువాలజీ, సివిక్స్ బోధనకు జూనియర్ లెక్చరర్స్, ఇంగ్లిష్, ఉర్దూ, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లు, గణితం, సోషల్ స్టడీస్, సైన్స్లో టెన్త్ గ్రాడ్యుయేట్ టీచర్లు పాటు డీఈఓ, నర్సింగ్ ఆఫీసర్, పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. డిగ్రీతో పాటు బీఈడీ, టెట్, సీటెట్ చేసిన వారు అర్హులన్నారు. ఈ నెల చివరి వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి మొయినాబాద్/మొయినాబాద్ రూరల్: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సామల మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన అజీజ్నగర్, ఎనికేపల్లి, ముర్తూజగూడ, బాకారం, అమ్డాపూర్, వెంకటాపూర్, కేతిరెడ్డిపల్లి తదితర ప్రభుత్వ పాఠశాలల్లో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ డిమాండ్లతో సెప్టెంబర్ 1న నగరంలోని ఇందిరా పార్కు వద్ద సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులంతా ధర్నాకు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులకు సభ్యత్వాన్ని అందజేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు బందయ్య, గౌరవ అధ్యక్షుడు హమీద్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శివకుమార్, సంఘం నాయకులు శివకుమార్, లక్ష్మణ్, వేణుగోపాల్, రాములుగౌడ్, బీమ్లా, జంగయ్య, వినోద్కుమార్, నారాయణగౌడ్, వేణు, రవీందర్రెడ్డి, శ్రీనివాస్, రాములునాయక్, విక్రమ్, సురేందర్రెడ్డి, రవి, భగీరథ తదితరులు పాల్గొన్నారు. పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన పోక్సో కేసులో నిందితుడికి ఎల్.బి.నగర్ న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను విధించింది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన ప్రకారం.. యూపీకి చెందిన సోనూ చక్రవర్తి (21) షాహిన్నగర్లో నివాసం ఉంటూ స్వీట్కార్న్ విక్రయిస్తుండేవాడు. 2025లో పక్కింట్లో నివాసం ఉండే నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన బాలాపూర్ పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ను విచారించిన ఫాస్ట్ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.7 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఇరిగేషన్ డీఈ ఆంజనేయులు అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని జాఫర్గూడలో ఆక్రమణకు గురవుతున్న చెరువు అలుగుతో పాటు నక్షబాటను బుధవారం ఇరిగేషన్ డీఈ ఆంజనేయులు, ఏఈ శ్రీవాణి పరిశీలించారు. నోవా విద్యాసంస్థల యాజమాన్యం చెరువు అలుగుతో పాటు, బాటను ఆక్రమించుకుంటుందని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు చెరువు పరిసరాలను పరిశీలించి అలుగు వద్ద చేపడుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలని కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. అధికారుల వెంట సర్పంచ్ ఎర్ర వెంకటేష్యాదవ్, మాజీ ఉప సర్పంచ్ దేశట్ల శేఖర్యాదవ్, నాయకులు బక్కతట్ల జంగయ్య, కోటా వెంకట్రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు. -
పర్యావరణ విద్యకు ప్రాధాన్యం అవసరం
కడ్తాల్: భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలంటే పాఠశాల స్థాయి నుండే పర్యావరణ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, సీజీఆర్ చైర్ పర్సన్ లీలాలక్ష్మారెడ్డి అన్నారు. అన్మాస్పల్లి ఎర్త్సెంటర్లో సీజీఆర్ పర్యావరణ సంస్థ–తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఎంపిక చేసిన కేజీబీవీల ఉపాధ్యాయులకు యంగ్ ఎర్త్ లీడర్ శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన అనంతరం సీజీఆర్ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణ ద్వారా 50 వేలకు పైగా విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు నీటి సంరక్షణ, అటవీ పరిరక్షణ, వ్యర్థాల నిర్వాహణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, కిచెన్గార్డెన్ల ఏర్పాటు, వనమహోత్సవం, జీవవైవిధ్యం తదితర అంశాలపై ఆచారణత్మతక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ఉపేందర్రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త ఉమామహేశ్వర్రెడ్డి, వైఈఎల్పీ స్టేట్ కోఆర్డినేటర్ వెంకట్రెడ్డి, సీజీఆర్ ఇన్చార్జి రజనీకాంత్, కార్యక్రమ అధికారి నవ్య, టెక్నికల్ అసిస్టెంట్ సాక్షి, మద్దిలేటి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు అదృశ్యం
శంకర్పల్లి: వెల్డింగ్ కార్మికుడు అదృశ్యమైన ఘటన మోకిల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపిన ప్రకారం.. కేరళం రాష్ట్రానికి చెందిన అనిల్కుమార్(45) బతుకుదెరువు నిమిత్తం మోకిలకు వచ్చాడు. మిత్రుడు హేమంత్తో కలిసి ఉంటూ కొండకల్ అపర్ణ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. హేమంత్ ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. అదృశ్యమైన బాలిక తిరుపతిలో ఉన్నానని ఫోన్ పహాడీషరీఫ్: మానసిక స్థితి సరిగ్గా లేక ఐదు నెలల క్రితం అదృశ్యమైన ఓ బాలిక, తాను తిరుపతిలో ఉన్నట్లు రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. బాలాపూర్ ఎస్ఐ సోహెల్ తెలిపిన ప్రకారం.. కాచిగూడ నింబోలి అడ్డాకు చెందిన రాజు కుమార్తె పూజ(17)కు మానసిక స్థితి సరిగ్గా లేదు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రిఫరెన్స్తో ఈ ఏడాది మార్చి మొదటివారం షాహిన్నగర్ సమీపంలోని ఐఎఫ్టీ బాలికల హోమ్లో చేర్పించారు. ఇదే నెల 10న బాలిక ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. హోమ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ తెలిస్తే బాలాపూర్ పీఎస్లో లేదా 87126 62366 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. కుటుంబ కలహాలతో యువకుడు.. మాడ్గుల: కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు అదృశ్యమైన ఘటన మాడ్గుల ఠాణా పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. సీఐ వేణుగోపాల్రావు తెలిపిన ప్రకారం.. చాంద్రాయణపల్లికి చెందిన మానుపాటి నరేశ్(24)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 3వ తేదీన సాయంత్రం జరిగిన గొడవలో మనస్థాపంతో నరేశ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో నరేశ్ తల్లి వెంకటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
టీజీఐఐసీ నిధుల వరద
యాచారం: ఫ్యూచర్సిటీ పరిధిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్డ్రైనేజీ నిర్మాణాలకు భారీగా నిధులు మంజూరవుతున్నాయి. గతంలో మట్టి రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడిన ప్రజలు ప్రస్తుతం మెరుగైన మౌలిక సదుపాయాలు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ కోసం యాచారం, కందుకూర్, కడ్తాల్ మండలాల్లోని పది గ్రామాల్లో 19,333 ఎకరాల భూమి సేకరణకు నిర్ణయించగా, సుమారు 13,500 ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లోనే టీజీఐఐసీ నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తాజాగా మండలానికి మరో రూ.పది కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. రెండేళ్లలో రూ.40 కోట్లు ఇటీవల యాచారం మండలంలోని 12 గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి మరో రూ.12 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మంతన్గౌరెల్లి, యాచారం, చింతపట్ల, మొండిగౌరెల్లి, చింతుల్ల, నందివనపర్తి, కేసీ తండా, కొత్తపల్లి తదితర గ్రామాల్లో పనులు చేపట్టనున్నారు. ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చిన 24 గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రతిపాదనల ఆధారంగా ఈ నిధులు విడుదలయ్యాయి. గత రెండేళ్లలో యాచారం మండలానికి టీజీఐఐసీ ద్వారా సుమారు రూ.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. యాచారం, నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద తదితర గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తవుతున్నాయి. ఫ్యూచర్సిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గ్రామీణ మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తోంది. యాచారం మండలానికి రూ.10 కోట్లు మంజూరు వేగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వల నిర్మాణం ఆయా గ్రామాల్లో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు.. ఫ్యూచర్సిటీని దృష్టిలో పెట్టుకుని టీజీఐఐసీ కావాల్సిన నిధులను మంజూరు చేస్తోంది. ఎమ్మెల్యే రంగారెడ్డి ఆదేశాల ప్రకారం నివేదికలు పంపిన వెంటనే నిధులు ఇస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో రూ.30 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. తాజాగా వచ్చే రూ.10 కోట్లతో మరిన్ని కార్యక్రమాలు చేపడుతాం. – శ్రీనివాస్, డీఈఈ, పంచాయతీరాజ్ శాఖ హామీ ఇచ్చారు కొద్ది రోజుల కింద మండల సర్పంచులమంతా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిశాం. గ్రామాల్లో కావాల్సిన అభివృద్ధి పనులపై వినతిపత్రాలిచ్చాం. కావాల్సిన నిధులను టీజీఐఐసీ ద్వారా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మంతన్గౌరెల్లి గ్రామానికి రూ.రెండు కోట్లకు పైగా నిధులు అడిగాను. – అరవింద్నాయక్, సర్పంచ్, మంతన్గౌరెల్లి -
జేబు దొంగల రిమాండ్
మొయినాబాద్: ఇటీవల ఓ కార్యక్రమంలో పిక్పాకెటింగ్కు పాల్పడిన ఇద్దరు జేబు దొంగలను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న మున్సిపాలిటీలోని జేపీఎల్ కన్వెన్షన్లో పట్నం రుక్కమ్మ దశదిన కర్మ కార్యక్రమం జరిగింది. దీనికి చాలా మంది ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో జేబుదొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఆరు మంది జేబుల్లో నుంచి నగదును దొంగించారు. వారంతా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేర్వేరుగా కేసులు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. లంగర్హౌస్కు చెందిన మహ్మద్ షకీల్ అలియాస్ లంగ్డా అలియాస్ మోటా, పాతబస్తీకి చెందిన దేవరకొండ దుర్గారావు అలియాస్ శ్రీనులను సోమవారం అరెస్టు చేశారు. ఇద్దరిని మంగళవారం రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు శ్రీరామ్ గోపి పరారీలో ఉన్నాడు. నిందితులపై నగరంలోని పలు పోలీస్స్టేషన్లలో దొంగతనాలు, చైన్స్నాచింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
80 కిలోల గంజాయి పట్టివేత
శంకర్పల్లి: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను సోమవారం రాత్రి శంకర్పల్లి పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం కోర్టులో హాజరు పరిచి, రిమాండ్కు తరలించారు. శంకర్పల్లి సీఐ రుధ్వీర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన ఎం.శ్రీనివాస్(21), ఎం.శ్రీనివాస్(26), జె.కిరణ్(22)లు కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడ్డారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అక్రమ రవాణాని ఎంచుకున్నారు. ఒడిశాలోని చిత్రకొండ వద్ద 80 కిలోల గంజాయి కొనుగోలు చేసి, కర్ణాటకలోని బీదర్లో విక్రయిస్తున్నారు. సోమవారం శంకర్పల్లి నుంచి సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. పట్టణంలోని మంజీరా పైప్లైన్ రోడ్డులో తనిఖీలు జరుపగా వీరు పట్టుబడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను చేవెళ్ల కోర్టులో హాజరు పరిచి, సంగారెడ్డి జిల్లా జైలుకి తరలించారు. రిమాండ్కు ముగ్గురి తరలింపు -
బడి బస్సులు ఫంక్షన్లకు ఇవ్వొద్దు.. మా పొట్ట కొట్టొద్దు
చేవెళ్ల: పాఠశాలల బస్సులను ఫంక్షన్లు, మ్యారేజీలకు పంపకూడదని తెలంగాణ టూరిస్ట్ అండ్ ట్రావెల్స్ జిల్లా కమిటీ అధ్యక్షుడు పి. సురేశ్కుమార్ అన్నారు. మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలకు మంగళవారం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టూరిస్ట్ అండ్ ట్రావెల్స్ సంఘం ఏర్పాటు చేసుకొని ట్రావెల్స్ వాహనాలను నడిపించుకుంటూ ఉపాధి పొందుతున్న యజమానులు, డ్రైవర్లు ప్రైవేటు పాఠశాలల బస్సులు ఫంక్షన్లకు పంపడం ద్వారా ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టూరిస్ట్ ట్రావెల్స్నే నమ్ముకొని జీవిస్తున్న తమకు అన్యాయం చేయొద్దన్నారు. ఈనెల 18న చేవెళ్లలో జిల్లా స్థాయిలో తెలంగాణ టూరిస్ట్ అండ్ ట్రావెల్స్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి ట్రాన్స్పోర్టు ఉన్నతాధికారులను సైతం ఆహ్వా నిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రావెల్స్ కమిటీ మండల సభ్యులు గోవర్దన్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, సత్తిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కృష్ణ, బల్వంత్, విజయ్, వెంకటేశ్, రవీందర్, బల్వంత్యాదవ్, డి.శ్రీనివాస్రెడ్డి, బస్సు ఓనర్స్, డ్రైవర్లు పాల్గొన్నారు. టూరిస్ట్, ట్రావెల్స్ జిల్లా కమిటీ అధ్యక్షుడు సురేశ్కుమార్ -
అరుణాచలం ఆర్టీసీ సర్వీసు హర్షణీయం
తాండూరు టౌన్: తాండూరు డిపో నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంకు బస్సు నడపడం అభినందనీయమని పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ అన్నారు. మంగళవారం ఆమె తొలి సర్వీస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించిందన్నారు. భక్తుల కోసం తాండూరు నుంచి అరుణాచలంకు బస్సు సర్వీసు నడపడం హర్షణీయమన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం డిపో మేనేజర్ ప్రవీ ణ్కుమార్ మాట్లాడుతూ.. అరుణాచలం ఆధ్యాత్మిక టూర్ పేరుతో భక్తుల కోసం ఈ సౌకర్యాన్ని కల్పించామన్నారు. భక్తులకు కాణిపాకంలోని వరసిద్ధి వినాయక ఆలయం, వెల్లూర్లోని గోల్డెన్ టెంపుల్తో పాటు అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తామన్నారు. ఫుల్ టికెట్ రూ.3,600, హాఫ్ టికెట్ రూ.2వేలు ఉంటుందన్నారు. ఇందుకు భక్తులు ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు. వివ రాలకు 9948947422, 8309348157 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, ట్రాఫిక్ ఇన్చార్జి వెంకటేశం, ఆర్టీసి అధికారులు పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ -
తాగునీటికి అధిక ప్రాధాన్యత
మోమిన్పేట: జిల్లాలో తాగు, సాగునీటి కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. మోమిన్పేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో తాగునీటి అవసరాల కోసం రూ.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఏ గ్రామంలో కూడా నీటి సమస్య ఉండొద్దన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు తెస్తే గత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్తో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు నీరిచ్చే అవకాశం లేదన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జూరాల నుంచి జిల్లాకు సాగునీరు ఇవ్వాలని కోరామన్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. నియోజకవర్గంలో రూ.300 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు వేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ శాఖ ఏఈఈ అందుబాటులో ఉండడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని పలువురు సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. అధికారుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు ఫోన్ చేస్తే స్పందించాలని సూచించారు. మన ఊరు – మన బడి పథకం కింద చేసిన పనులకు దాదాపు రూ.25 లక్షల బిల్లు రావాల్సి ఉందని టేకులపల్లి సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. వెంటనే మంజూరయ్యేలా చూస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలల భవనాలను కూల్చి వేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఎన్కేపల్లి సర్పంచ్ సురేందర్ కోరారు. కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. సర్పంచ్లు సభ దృష్టికి తెచ్చిన సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, జెడ్పీ సీఈఓ సుధీర్, మండల ప్రత్యేకాధికారి సదానందం, ఇన్చార్జ్ ఎంపీడీఓ రాజమల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. -
ఇక చదువులు స్పెషల్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి.. విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా విద్యా శాఖ సరికొత్త కార్యాచరణ ప్రణాళి కకు సిద్ధమైంది. 2026–27 విద్యాసంవత్సరానికి నిర్దేశించుకున్న ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు సీనియర్ అధికారు లను జిల్లాల వారీగా ‘ప్రత్యేకాధికారులు’గా (స్పెషల్ ఆఫీసర్లు) నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. నిరంతరం బడులను తనిఖీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శికి ఎప్పటిక ప్పుడు సమగ్ర నివేదికలు సమర్పిస్తూ ఎక్కడైనా లోపాలు కనిపిస్తే ఆ క్షణానే సరిదిద్దేలా ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోనున్నారు. చేరికల నుంచి మౌలిక వసతుల వరకు.. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలల స్థితిగతులపై ఈ అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బడుల్లో జరుగుతున్న సివిల్ పనులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయనున్నారు. విద్యార్ధులకు అందించే ‘మధ్యాహ్న భోజనం’తో పాటు ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ స్కీమ్ నాణ్యతను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల పంపిణీ వంద శాతం పూర్తయ్యేలా సమన్వయం చేస్తారు. టెక్నాలజీతో చెక్ సాంకేతికతను జోడించి సర్కారు చదువులను కార్పొరేట్కు పోటీగా నిలబెట్టేందుకు 19 కీలక అంశాలపై నిరంతర సమీక్ష నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పక్కాగా అమలు చేయాలని భావిస్తున్న ‘ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్’ (ముఖ గుర్తింపు హాజరు) విధానం, బడి మానేసిన పిల్లల (డ్రాపౌట్లు) గుర్తింపు, ఫౌండేషనల్ లిటరసీ ప్రోగ్రామ్లపై నిఘా పెట్టనున్నారు. దీంతో పాటు ఆన్లైన్ విద్యలో విప్లవాత్మక మార్పుల కోసం ప్రముఖ డిజిటల్ ఇనిషియేటివ్స్ ద్వారా డిజిటల్ పాఠాలు విద్యార్థులకు ఏ మేరకు అందుతున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ప్రత్యేకాధికారులు వీరే .. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాకు ఎం. రాధారెడ్డి, రంగారెడ్డి– కె.లింగయ్య, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు రమణకుమార్, సంగారెడ్డికి జి.రమేష్ను స్పెషలాఫీసర్లుగా నియమించారు.సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యపై ఫోకస్ విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా స్పెషలాఫీసర్లు హాజరు, మౌలిక వసతులు, డిజిటల్ బోధనపై నిఘా నిరంతరం ప్రత్యేకాధికారుల తనిఖీలు -
నేడు ప్లాట్ల పంపిణీ
● ఏర్పాట్లు పూర్తి చేసిన రెవెన్యూ అధికారులు ● పారిశ్రామిక వాడ భూ నిర్వాసితుల హర్షం కొడంగల్: దుద్యాల మండలంలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక వాడలో భాగంగా భూములు అప్పగించిన లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంటతండా రైతులకు ప్లాట్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. హకీంపేట్ సమీపంలో సుమారు వంద ఎకరాల్లో ప్రత్యేకంగా రూపొందించిన డీటీసీపీ లేఔట్లో ఇళ్ల స్థలాలు పంపిణీకి రెడీ అయ్యాయి. 570 మందికి బుధవారం లక్కీడిప్ విధానంలో ప్లాట్లను కేటాయించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాండూరు ఆర్డీఓ అనిత, స్థానిక తహసీల్దార్ కిషన్ తెలిపారు. కొడంగల్లోని బసిరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి ప్లాట్ల జాబితాలో పేరున్న రైతులు హాజరు కావాలని సూచించారు. ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలన్నారు. ఎకరా పట్టా భూమిని కోల్పోయిన ఒక్కో రైతుకు 150 గజాలు, ఎకరా అసైన్డ్ భూమిని ఇచ్చిన వారికి 120 గజాలు, అర ఎకరం లేదా అంతకంటే తక్కువ భూమి కోల్పోయిన వారికి 80 గజాల చొప్పున నివాస స్థలం ఇవ్వనున్నారు. ఎనిమిది ఎకరాలు ఇచ్చాం.. మా కుటుంబానికి సంబంధించి ఎనిమిదెకరాల భూమిని పారిశ్రామిక వాడ కోసం ప్రభుత్వానికి ఇచ్చాం. పరిహారం అందింది. బుధవారం ఇళ్ల స్థలాలు ఇస్తామని అధికారులు సమాచారం ఇచ్చారు. ఎకరానికి ఒకటి చొప్పున మాకు ఎనిమిది ప్లాట్లు వస్తాయి.. చాలా సంతోషంగా ఉంది. – దొరమోని అనంతమ్మ, హకీంపేట్ -
ఫ్యూచర్.. వైర్లెస్!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ బాధితుల వెంచర్ను పూర్తిగా వైర్లెస్ సిటీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఓవర్హెడ్లైన్ల స్థానంలో భూగర్భ విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ.18 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే నాటిన విద్యుత్ స్తంభాలను తొలగించింది. ప్రధాన రహదారులు, కాలనీ వీధుల్లోనే కాదు.. ఇంటి ముందు కూడా ఓవర్హెడ్ విద్యుత్ లైన్లు కన్పించకూడదని భావిస్తోంది. వాటిస్థానంలో 3.6 కిలోమీటర్ల మేర 11 కేవీ భూగర్భ విద్యుత్ కేబుళ్లు (యూజీ కేబుల్స్), 120 కిలోమీటర్ల ఎల్టీ యూజీ కేబుల్స్ సహా సుమారు 30 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మార్లు, 33/11 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు అవసరమైన బడ్జెట్ విడుదల కావడమే ఆలస్యం పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. మీర్ఖాన్పేటలో భారీ వెంచర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో కందుకూరు, యాచారం మండలాల పరిధిలోని పది గ్రామాల్లో 19,333 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఆ మేరకు కందుకూరు మండలం మీర్ఖాన్పేట, ముచ్చర్ల, పంజాగూడ రెవెన్యూల పరిధిలో 1,433 మంది రైతుల నుంచి సుమారు నాలుగు వేల ఎకరాల భూమిని, యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద, కడ్తాల్ మండల పరిధిలోని పల్లెచల్కతండా పరిధిలోని ఆరు వేల మంది రైతుల నుంచి సుమారు తొమ్మిది వేల ఎకరాల చొప్పున మొత్తం 13,500 ఎకరాలు సేకరించింది. భూములు కోల్పోయిన రైతులకు పట్టా భూమికి ఎకరానికి రూ.12.50 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు, అసైన్డ్ భూములకు రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించింది. అంతేకాదు ఎకరానికి 121 గజాల ప్లాట్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మేరకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) మీర్ఖాన్పేట్ రెవెన్యూ సర్వే నంబర్ 120 సహా పంజాగూడ రెవెన్యూ సర్వే నంబర్ 90, 91లలో 600 ఎకరాలు సేకరించి, భారీ వెంచర్ అభివృద్ధి చేసింది. 2023లో బీఆర్ఎస్ తన అధికారాన్ని కోల్పోవడం, 2024లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఫార్మాసిటీని రద్దు చేసి, దాని స్థానంలో భారత్ ఫ్యూచర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. రూ.18 కోట్లతో భూగర్భ కేబుళ్లు ఫ్యూచర్సిటీ భూ బాధితులకు ప్రత్యేకం మీర్ఖాన్పేటలో 600 ఎకరాల్లో వెంచర్ ఇప్పటికే బాధితులకు ప్రొసీడింగ్స్ జారీ వైర్లెస్ సిటీగా నిర్మాణానికి ప్రతిపాదనలులబ్ధిదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంచర్ టలోని ఖాళీ ప్లాట్లకు నంబర్లు వేసింది. విశాలమైన రోడ్లు, పార్కులు, ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసింది. ప్లాట్ల పంపిణీలో పారదర్శకత కోసం లబ్ధిదారుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహించింది. కందుకూరు మండలంలో 1,433 మంది రైతులకు 1,234 మందికి, యాచారం మండలంలోని 4,500 మంది బాధితులకు ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ఇదే సమయంలో నష్ట పరిహారం పొందిన భూ బాధితుల్లో భారీగా నకిలీలు ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటికే లబ్ధిదారుల పేరున పంపిణీకి సిద్ధం చేసిన ప్లాట్ల ప్రొసీడింగ్స్ బాధితుల చేతికి ఇవ్వకుండా తాత్కాలికంగా నిలిపివేసింది. 2025 డిసెంబర్లో ఇదే వేదికగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన ప్రభుత్వం ఫార్చూన్–500 కంపెనీలకు ఇక్కడికి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్ ఫ్యూచర్సిటీని తీర్చిదిద్దబోతున్నట్లు తెలిపింది. ఆ మేరకు ఫ్యూచర్సిటీ మొత్తం భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తొలి విడతగా లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్లలో యూజీ కేబుళ్లను ఏర్పాటు చేసి, తర్వాత వచ్చే విద్యుత్ డిమాండ్ను బట్టి ఇతర ప్రాంతాలకు పనులు విస్తరించాలని నిర్ణయించారు. -
ఇద్దరు పిల్లలతో గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మయ్య మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామ కాలనీకి చెందిన మహ్మద్ వాజిద్, వసీం బేగం(26) దంపతులకు ఇద్దరు పిల్లలు అలీనా(3), సాద్(1)లు సంతానం. గత నెల 31వ తేదీన వాజీద్ తన సొంతూరుకు వెళ్లాడు. అదే రోజు రాత్రి భార్యకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా భార్య, పిల్లలు కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై వాజిద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. వ్యవసాయ మోటార్ పరికరాల చోరీ తుక్కుగూడ: వ్యవసాయ మోటార్ పరికరాలు చోరీకి గురైన సంఘటన రావిర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. రైతులు జల్లాల రమేష్, జల్లాల పాండు, బత్తుల ఆంజనేయులు, నక్క సురేష్ వ్యవసాయ పొలం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి సమయంలో మోటార్ కేబుల్ వైర్లు, స్టార్టర్లు, ఎరువుల బస్తాలు తదితర పరికరాలను అపహరించారు. రైతులకు రూ.లక్షల్లో నష్టం జరిగింది. పోలీసులు స్పందించి చోరీ ముఠాను కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఓపెన్వర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
షాద్నగర్రూరల్: దేవస్థానాల దర్శనంకోసం ఒకరోజు దర్శనయాత్రకు ఆర్టీసీ డీలక్స్ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తోందని షాద్నగర్ డిపో మేనేజర్ కరుణశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 8న (శనివారం) అమరావతి, మంగళగిరి, విజయవాడలోని దైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు డీలక్స్ బస్సు ఏర్పా టు చేసినట్టు తెలిపారు. తెల్లవారుజామున 4గంటలకు షాద్నగర్ డిపో నుంచి బయలుదే రి అదేరోజు రాత్రి షాద్నగర్కు చేరుకుంటుందని చెప్పారు. ఈ యాత్రకు ఒకరికి రూ.1,100 టికెట్ ధర నిర్ణయించినట్టు వెల్లడించారు. అల్పాహారం, భోజనంకోసం ఎవరి ఖర్చులు వారే భరించుకోవాలన్నారు. టికెట్ బుకింగ్ కో సం 91826 45281, 94900 21433, 73828 28662, 99592 26287, 94911 66785 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
పాముకాటుకు మహిళా రైతు మృతి
కొందుర్గు: పశువులను మేపుతుండగా ఓ మహిళా రైతు పాముకాటుకు గురైంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని మహదేవ్పూర్ గ్రామశివారులో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లంకాల వెంకట్రెడ్డి, వనజ (35) దంపతులు. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. మంగళవారం వెంకట్రెడ్డి చేనుకు ఎరువులు చల్లుతుండగా వనజ పొలం సమీపంలో పశువులను మేపుతున్నారు. అదే సమయంలో తన కాలుకు ఏదో పాము కరిచినట్లు ఉందని ఆమె ఫోన్ ద్వారా భర్తకు చెప్పారు. వెంటనే వెంకట్రెడ్డి వెళ్లి చూడగా స్పృహ తప్పి పడి పోయింది. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ సహాయంతో షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మహదేవ్పూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అవస్థల ప్రయాణం
● అరకొర బస్సులతో తప్పని పాట్లు ● ఇబ్బంది పడుతున్న వృద్ధులు, దివ్యాంగులు మొయినాబాద్: అరకొర బస్సులతో వృద్ధులు, దివ్యాంగులకు పాట్లు తప్పడంలేదు. రద్దీ సమయాల్లో బస్సులు తక్కువగా ఉండటంతో సమస్య మరింత జఠిలమవుతోంది. మంగళవారం చేవెళ్ల నుంచి వచ్చిన ఓ బస్సు మొయినాబాద్ స్టాప్లో ఆగింది. వెంటనే అక్కడున్న విద్యార్థులంతా ఎగబడ్డారు. ఈసమయంలో బస్సులోనుంచి దిగుతున్న ఓ వృద్ధురాలు కిందపడిపోయింది. నిత్యం ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు, విద్యార్థులు కోరుతున్నారు. ముఖ్యంగా మొయినాబాద్ మీదుగా వందల సంఖ్యలో బస్సులు నడుస్తున్నా కిక్కిరిసిన ప్రయాణమే సాగుతోంది. ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కళాశాలలు అధికంగా ఉండటంతో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. కళాశాలల సమయంలో సరిపడా బస్సులు లేకపోవడంతో వచ్చిన బస్సు ఎక్కేందుకు విద్యార్థులు ఎగబడతారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో రద్దీ మరింత పెరిగింది. -
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు
తాండూరు: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని తాండూరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు మున్సిపల్ కమిషనర్ రాకేశ్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధి సర్వే నంబర్ 135లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అండదండలతోనే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని వాపోయారు. ఇప్పటికే సర్వేనెంబర్ 111 వివాదాస్పద భూమిలో పూర్తి స్థాయిలో ఆక్రమించి నిర్మాణాలు పూర్తి చేశారని తాజాగా సర్వేనెంబర్ 135లోను నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు షేక్ ఇర్షద్, యోగానంద్, పార్టీ నాయకుడు సంతోష్గౌడ్ ఉన్నారు. చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు -
భవనం పైనుంచి పడి బాలుడి మృతి
తాండూరు టౌన్: ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం గాంధీనగర్లోని తన తాత ఇంట్లో ఆడుకుంటున్న 18 నెలల దీక్షిత్ రెండవ అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం బాలున్ని జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి ఎంసీహెచ్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాలున్ని హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి మోమిన్పేట: ఇరవై ఏళ్లుగా ఉపాధి హామీ (వీబీజీరామ్జీ) పథకంలో పనిచేస్తున్న తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని పథకం సిబ్బంది కోరారు. ఈ మేరకు మంగళవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది, ఫీల్డ్అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. తలకు గాయమై, నోట్లోంచి రక్తం కారి.. అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి మోతీనగర్: కూకట్పల్లి ప్రాంతంలోని అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడని సీఐ ఎస్.నవీన్కుమార్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాటవరం గ్రామానికి చెందిన దండుపాటి రాము, మంగ దంపతులు పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. శ్రీ వివేకానందనగర్లో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్లో అతడు వాచ్మేన్గా పనిచేస్తూ ఓ ప్రైవేట్ స్కూలులో నివసిస్తున్నారు. అయితే రాము తరచూ తాగి రాత్రిపూట స్కూల్ బిల్డింగ్పై నిద్రించేవాడు. సోమవారం రాత్రి కూడా బిల్డింగ్పైకి ఎక్కిన రాము తెల్లవారినా కిందికి రాలేదు. అక్కడే టీ షాపు నడిపే రామారావు వచ్చి స్కూల్ పక్కన ఉన్న కార్ కేర్ సర్వీస్ సెంటర్లో రాము పడిపోయి ఉన్నాడని మంగకు చెప్పాడు. ఆమె వెళ్లి చూడగా తలకు గాయమై, నోట్లో నుంచి రక్తం కారుతూ మృతి చెంది ఉన్నాడు. మద్యం మత్తులో కారుషెడ్డు రేకుల మీద నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిషన్ అదుపు తప్పి.. మెడపై పడడంతో గాయపడిన యువకుడు మృతి అంబర్పేట: ఇంటి మరమ్మతులు చేస్తుండగా ఓ యువకుడు ప్రమాదానికి గురై మృతి చెందాడు. అంబర్పేట ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ కథనం ప్రకారం... అంబర్పేట ఆకాశ్నగర్కు చెందిన కాశీంఖాన్ కుమారుడు షాకీర్ఖాన్(21) బాగ్ అంబర్పేట తురాబ్నగర్లో ఇంటి మరమ్మతు పనికి వెళ్లాడు. కట్టింగ్ మిషన్తో పనులు చేస్తుండగా అది అదుపు తప్పి అతడి మెడ భాగంలో పడింది. తీవ్రంగా గాయపడిన అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాశీంఖాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువు అలుగు ఆక్రమణపై ఫిర్యాదు
అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని జాఫర్గూడ గ్రామం చెరువు అలుగుతో పాటు నక్షబాటను ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న నోవా కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మాజీ ఉపసర్పంచ్ దేశట్ల శేఖర్యాదవ్ మంగళవారం తహసీల్దార్ సుదర్శన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. సర్వేనంబర్ 321లోంచి ఉన్న నక్షబాటను, జాఫర్గూడ చెరువు అలుగు వద్ద అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని, దీంతో గ్రామస్తుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అడ్డుకునేందుకు యత్నిస్తున్న స్థానికులపై కిరాయి మనుషులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. -
కేటీఆర్కు కృతజ్ఞతలు
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారానికి చెందిన తెలంగాణ అమరవీరుడు మందడి యాదిరెడ్డి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. యాదిరెడ్డి తమ్ముడు ఓంరెడ్డి కూతురు భవితకు గొంతులో టాన్సిల్స్ సమస్య ఉండటంతో నెల రోజుల క్రితం శస్త్రచికిత్సకోసం కేటీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో భవితకు శస్త్రచికిత్స చేశారు. ఆమె పూర్తిగా కోలుకోవడంతో సోమవారం యాదిరెడ్డి కుటుంబ సభ్యలు, మాజీ మంత్రి సబితారెడ్డితో కలిసి నగరంలోని కేటీఆర్ నివాసానికి వెళ్లారు. ఆయన్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ను కలిసినవారిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కొత్త మాణిక్రెడ్డి తదితరులు ఉన్నారు. -
‘ముసురు’తున్నాయ్!
చాపకింది నీరులా సీజనల్ వ్యాధులు జిల్లాలోని వనస్థలిపురం, కొండాపూర్ సహా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవఖానాల ఔట్పేషంట్ విభాగాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ (వనస్థలిపురం) ఆస్పత్రిలో బయటి రోగుల సంఖ్య గతంతో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపైంది. రోగుల నిష్పత్తి మేరకు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులతో పాటు వైద్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. చేవెళ్ల, షాద్నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం కమ్యూనిటీ సెంటర్లలోనూ రద్దీ పెరిగింది. 30 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 70 బస్తీ దావఖానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆయా ఆస్పత్రుల సాధారణ ఓపీల్లో 40 శాతం మంది జ్వర పీడితులే కన్పిస్తున్నారు. కునుకు లేకుండా చేస్తున్న దోమలు ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇళ్ల చుట్టూ మురుగు నీరు చేరి, దోమలకు నిలయంగా మారుతున్నాయి. చిరుజల్లులకు రాత్రిపూట ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఇంట్లో ఫ్యాన్లు కూడా తిరకపోవడంతో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగటిపూట ఇంట్లో నిద్రించే పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. ఫలితంగా వారు విపరీతమైన జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్నారు. వీల్ చైర్లో తీసుకెళ్లేవారులేక తన భార్యను స్వయంగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తున్న భర్తవనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో రద్దీవర్షాల వెన్నంటే వ్యాధులు ముసురుతున్నాయి. పారిశుద్ధ్యలోపం, నీటి కాలుష్యం, దోమకాటుతో రోగాలు వ్యాపిస్తున్నాయి. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అనేక మంది దగ్గు, జ్వరం, వంటినొప్పులు, వాంతులు, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. – సాక్షి, రంగారెడ్డిజిల్లా ఆస్పత్రులకు క్యూ కడుతున్న జ్వరపీడితులు యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానాలు కిటకిట మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రిలో గతంలో ఓపీకి రోజుకు సగటున 500 మంది వస్తే ప్రస్తుతం 1,600 దాటింది. ఇక్కడికి వస్తున్న వారిలో మెజార్టీ బాధితులు దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న వాళ్లే. 220 పడకలు, మూడు ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ విభాగాలు ఉన్నాయి. సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిష్టం రెడీగా ఉంది. ఎంత మంది వచ్చినా చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వచ్చిన వారికి మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యసేవలు పొందొచ్చు. – డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, మహేశ్వరం మెడికల్ కాలేజీ -
రుక్కమ్మ అస్తికల నిమజ్జనం
తాండూరు: శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి సోదరులు సోమవారం కాశీలోని గంగానదిలో తమ తల్లి రుక్కమ్మ అస్తికలను నిమజ్జనం చేశారు. అనంతరం రుక్కమ్మ మనవళ్లు అవినాష్రెడ్డి, ప్రకాశ్రెడ్డి తదితరులతో కలిసి కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. ఇంట్లో పేలిన సిలిండర్ : తండ్రి, ముగ్గురు చిన్నారులకు గాయాలు మేడ్చల్ రూరల్: గ్యాస్ సిలిండర్ స్టవ్ నుంచి మారుస్తుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో తండ్రితో పాటు ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. మేడ్చల్ పోలీసులు తెలిపిన మేరకు.. ఎల్లంపేట మున్సిపాలిటీ శ్రీరంగవరం గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్(37) ఇంట్లో ఆదివారం గ్యాస్ లీకేజీ అవుతున్నట్లు గుర్తించి సిలిండర్ రెగ్యులేటర్ను మార్చేందుకు యత్నించాడు. సిలిండర్ పక్కనే దీపం ఉండడంతో గ్యాస్ లీకై మంటలు అంటుకొని సిలిండర్ పేలిపోయింది. దీంతో శ్రీనివాస్(37)తో పాటు అక్కడే నిద్రిస్తున్న కూతుళ్లు ప్రవళిక (14), హరిప్రియ(10), కుమారుడు విక్రాంత్ (6) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. -
ప్రత్యామ్నాయ పంటలు మేలు
ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు, కూరగాయల సాగు చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో సాగు మార్గదర్శక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి బదులు ఆయిల్పామ్, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు ఎంపిక చేసుకోవా లని తెలిపారు. నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శక పుస్తకం రైతులకు శాసీ్త్రయ సాగు విధానాలపై అవగాహన కల్పించి, మెరుగైన దిగుబడులు సాధించడానికి దోహదపడుతుందని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ మార్గదర్శకాలను రైతులకు విస్తృతంగా చేరవేసి, అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు. ప్రజావాణికి 120 ఫిర్యాదులు ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. ఈ వారం ప్రజావాణికి 102 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి శారద తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శిశువు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఈ ఏడాది తల్లిపాలకు ప్రాధాన్యత ఇద్దాం.. సుస్థిరమైన సహాయ వ్యవస్థలను ఏర్పాటు చేద్దాం అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేర్చేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్మయి, జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ, జిల్లా వైద్యాధికారి స్వర్ణలత, ఏఓ సునీల్, సీడీపీఓలు, డీహెచ్ఈడబ్ల్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి -
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణ
చేవెళ్ల: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిగా చేవెళ్ల ప్రాంతానికి చెందిన వడ్ల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తుక్కుగూడలో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ జిల్లా మహాసభల్లో జిల్లా నూతన అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్మికుల హక్కులకోసం, వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన సీపీఐ జిల్లా కార్య దర్శి పాలమాకుల జంగయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, కె. రామస్వామి తదితరులకు కృతజ్ఞ తలు తెలిపారు. ఇబ్రహీంపట్నం: దండుమైలారం గ్రామంలో ఆక్రమణకు గురైన గ్రామకంఠం భూ సాధనే లక్ష్యంగా చేపట్టిన రిలే దీక్షలు పదో రోజుకు చేరాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షల్లో సోమవారం యాదవ కులస్తులు కూర్చున్నారు. సర్పంచ్ ఈదులకంటి నరేష్గౌడ్ వారికి సంఘీభావం ప్రకటించారు. ఆక్రమణకు గురైన గ్రామ కంఠం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. -
మండలాల వారీగా విడుదలైన నిధులు..
బషీరాబాద్: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2024 – 25 సంవత్సరానికి గాను జిల్లాలోని 594(16 గ్రామాల మినహా) జీపీలకు రూ.24.23 కోట్లు జమయ్యాయి. ఈ నిధులను తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు. కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీలు రోజువారీ నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాగునీటి మోటార్ల మరమ్మతులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, చెత్త సేకరణ వాహనాల నిర్వహణ వంటి పనులకు నిధుల కొరత ఏర్పడింది. తాజాగా విడుదలైన గ్రాంట్లతో గ్రామాల్లో అత్యవసర పనులకు కొంత మేర పరిష్కారం లభించనుంది. ప్రధానంగా గ్రామాల్లో తాగునీటి వసతుల మెరుగుదల, పైప్లైన్ల మరమ్మతులు, బోర్లు, నీటి మోటార్ల నిర్వహణ, మురుగు కాలువలను శుభ్రం చేయించడం, చెత్త సేకరణ వ్యవస్థ బలోపేతం, పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు. 16 జీపీలకు విడుదల కాని గ్రాంట్ జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలు ఉండగా, ఈ విడతలో 578 జీపీలకే నిధులు అందాయి. మిగిలిన 16 వాటికి గ్రాంట్ అందలేదు. నిధుల విడుదల సమయంలో కొన్ని జీపీల బ్యాంక్ ఖాతాలు ఆన్లైన్ వ్యవస్థకు అనుసంధానం కాకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నిధులు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యలు పరిష్కరించిన అనంతరం తదుపరి విడతలో ఆయా గ్రామాలకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో పారదర్శకతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి రూపాయి ఖర్చుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. చేపట్టిన పనులు, చెల్లింపులు, పనుల పురోగతిని డిజిటల్ విధానంలో నమోదు చేయాల్సి ఉంటుంది. నిధులను నిబంధనలకు అనుగుణంగా వినియోగిస్తున్నారా లేదా అనే అంశంపై జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించనున్నారు. గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే పనులకే నిధులను వినియోగించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిధుల సక్రమ వినియోగంతో మౌలిక వసతులు మెరుగుపడటమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. మండలం జీపీలు నిధులు (రూ.లక్షల్లో..) బంట్వారం 11 56.63 బషీరాబాద్ 36 134.90 బొంరాస్పేట 33 118.60 చౌడాపూర్ 24 87.30 ధారూరు 33 125.65 దోమ 36 154.29 దౌల్తాబాద్ 31 143.41 దుద్యాల్ 19 70.57 కొడంగల్ 25 119.13 కోట్పల్లి 18 68.34 కుల్కచర్ల 32 137.56 మర్పల్లి 28 160.45 మోమిన్పేట 28 140.40 నవాబుపేట 32 129.50 పరిగి 32 115.26 పెద్దేముల్ 37 145.59 పూడూరు 31 136.37 తాండూరు 33 158.96 వికారాబాద్ 21 84.00 యాలాల 38 136.45 578 24.23 కోట్లు -
రిలీఫ్ ఫండ్ వెంటనే అందజేయండి
యాచారం: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం బాధితులకు అందాల్సిన రిలీఫ్ ఫండ్ను వెంటనే విడుదల చేయాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ (డీబీఎస్యూ) నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ బోడ కృష్ణ, జిల్లా అసిస్టెంట్ కోఆర్డినేటర్ బడే భాగ్యమ్మ, ఇబ్రహీంపట్నం డివిజన్ కార్యదర్శి బడే కుమార్ మాట్లాడుతూ.. బాధితులకు అందాల్సిన రిలీఫ్ ఫండ్ జిల్లాలో కొన్ని నెలలుగా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ అయిన వెంటనే వారం రోజుల్లో అందజేయాల్సిన మొదటి దఫా రిలీఫ్ ఫండ్ కూడా అంద లేదని అన్నారు. యాచారం–13, ఇబ్రహీంపట్నం–11, మంచాల–22, తలకొండపల్లి–10, మాడ్గుల–6, ఆమనగల్లు–5, కందుకూరు–8 మంది బాధితులకు రిలీఫ్ ఫండ్ అందాల్సి ఉందని తెలిపారు. జాప్యం చేయడం సరైంది కాదని తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కలెక్టర్ త్వరలో అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
‘పాలమూరు’తో సస్యశ్యామలం
● ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారు ● త్వరలో అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం ● స్పీకర్ ప్రసాద్ కుమార్ ధారూరు: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సోమవారం ధారూరు రైతు వేదికలో జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచులు నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఇళ్ల నుంచి వృథాగా పోయే నీటిని కాపాడుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వం రూ.6 వేలు ఇస్తుందని తెలిపారు. త్వరలో అసైన్డ్ భూములకు పట్టాలిస్తామన్నారు. మండలంలో ఎన్ని ఇరిగేషన్ చెరువులు, కుంటలు ఉన్నాయి.. ఏయే పనులు చేయాల్సి ఉందో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఏఈ జ్యోతిని ఆదేశించారు. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో తిష్టవేసిన ఐకేపీ సీసీలు రాజకీయం చేస్తున్నారని, వీరిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని పలువురు సభ్యులు స్పీకర్ను కోరారు. ఏపీఎం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, వెలుగు కార్యాలయంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొందని ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. కొత్త గ్రామ పంచాయతీలకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించలేదని, ఎఫ్ఏలు ఎవరి మాట వినడం లేదని పలువురు ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోందని స్పీకర్ ఆరోపించారు. అధికారులు బాధ్యతగా.. జవాబుదారీగా పనిచేయాలని ఆదేశించారు. ధారూరుకు ఇందిరమ్మ ఇళ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ ప్రమీల గౌడ్ స్పీకర్ను కోరారు. అల్లాపూర్ పాఠశాల పక్కన పెద్దగుంత ఏర్పడి విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని, వెంటనే దాన్ని పూడ్చివేయాలని సర్పంచ్ విజయలక్ష్మి కోరారు. మండలంలోని ఆరు అంగన్వాడీ కేంద్రాల్లో 16 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని సభ్యులు విన్నవించారు. ధారూరు, నాగసమందర్ గ్రామాల్లో పశు వైద్యులు లేరని, దీంతో జీవాలకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ధారూరు – పగిడాల మీదుగా దోన్నాల్, రాస్నం వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని, అసంపూర్తిగా ఉన్న ధారూరు – పీలారం రోడ్డును పూర్తి చేయాలని కోరారు. మండలానికి కొత్తగా 1,814 రేషన్ కార్డులు మంజూరైనట్లు తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. పూలు, ఉల్లి సాగు చేసే రైతులకు 50శాతం రాయితీ ఇస్తున్నట్లు ఉద్యాన వన మండల అధికారి యమున తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సుధీర్, ఎంపీడీఓ నర్సింహులు, పీఆర్ డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి సూచనలు
● పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గాల్లో తేమశాతం పెరగడంతో వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. శరీరం ఈ మార్పులకు అలవాటు పడేందుకు కొంతసమయం పడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫ్లూ కారక వైరస్లు సులభంగా వ్యాపిస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంటాయి. ఈ లక్షణాలతో కన్పించే పిల్లలను బడికి పంపకపోవడం ఉత్తమం. ● ప్రస్తుతం చెరువుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. వరదతో పాటే అనేక రకాల బ్యాక్టీరియా చేరుతోంది. సరిగా శుద్ధి చేయని ఈ నీటిని తాగడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కలుషిత నీరు పైపుల నుంచి ఇంట్లోకి సరఫరా అవుతుండడం, విషయం తెలియక వాటిని అలాగే తాగడం ద్వారా వాంతులు, విరేచనాల బారినపడుతుంటారు. ● సాధ్యమైనంత వరకు ఇంటికప్పుపై ఉన్న ఖాళీ బా టిళ్లు, కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మంచినీటి ట్యాంకులపై మూత పెట్టాలి. మస్కిటో కాయిల్స్, మస్కిటో మ్యాట్, కిటికీలకు జాలీలను ఏర్పాటు చేసుకోవడం, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం, దోమ తెరలను వాడటం వంటి స్వీయ జాగ్రత్తలతో డెంగీని దరిచేరనీయకుండా చూసుకోవచ్చు. ● సాధ్యమైనంత వరకు బయటి ఆహారాన్ని తీసుకొవద్దు. నిల్వ చేసిన ఆహారానికి బదులు ఇంట్లో అప్పుడే తాజాగా వండివార్చిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. కాచి చల్లార్చిన నీటిని తాగడం, సీవిటమిన్ పుష్కలంగా లభించే తాజా పండ్లు తినడం ద్వారా సీజనల్ వ్యాధుల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. -
ప్రభుత్వ వ్యవస్థలో పోలీసుల పాత్ర కీలకం
ఇబ్రహీంపట్నం: ప్రజలకు రక్షణ కల్పించడంలో, ప్రభుత్వ వ్యవస్థలో పోలీసుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. టీజీఎస్పీ 3వ బెటాలిలయన్ (అక్టోపస్) గేట్ నుంచి నాగన్పల్లి రహదారికి నిర్మించిన అప్రోచ్ రోడ్డును, పోలీసు క్రీడలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావం చూపే పోలీసుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది అవుతుందన్నారు. కార్యక్రమంలో 3వ బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్ బాషా, అడిషనల్ కమాండెంట్ ఎస్.శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమాండెంట్స్ వీరయ్య, పాండు, శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ అదనపు గదుల ప్రారంభం ఇబ్రహీంపట్నంలోని గ్రంథాలయంలో రూ.75 లక్షలతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, స్థానిక లైబ్రేరియన్ యాదయ్య పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ జాబితాపై (సర్పై) బీఎల్ఏలు, పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం
హుడాకాంప్లెక్స్: పుట్టిన ప్రతి బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం సరూర్నగర్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గర్భిణి కాన్పు జరిగిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు ఇవ్వాలని సూచించారు. ఈ పాలలో ఇమ్యూనిటీ ఇచ్చే ఇమ్యునోగ్లోబిన్ ఉంటుందని, ఇది బిడ్డకు సహజ యాంటీ బయోటిక్గా పనిచేస్తుందని తెలిపారు. ఇందులో బిడ్డకు సరిపోయే ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తినిపించొద్దని, కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సత్యవతి, డీఐఓ డాక్టర్ షీబా, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ అర్చన, సుష్మిత, మాస్మీడియా అధికారులు మంజుల, శ్రీనివాసులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు శ్రీనివాసులు, పరాంకుశం, ఆరోగ్య విస్తరణ అధికారులు పోల శ్రీధర్, కె.శ్రీనివాసులు, పీహెచ్ఎన్ మల్లీశ్వరి, సూపర్వైజర్లు అజయ్, ఉమ, ఇందిర, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మండలంలో పని చేస్తున్న తమకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్లు కోరారు. ఈ మేరకు సోమవారం జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఓలు, ఈసీలు, టీఏ, సీఓ సమ్మెలో పాల్గొంటే తాము విధుల్లో ఉన్నామని తెలిపారు. సమ్మెతో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అధికారులు స్పందించి వెంటనే జీతాలు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు దానయ్య, బాల్రాజ్, రామలింగం తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మా భూములపై నిఘా
యాచారం: ఫార్మాసిటీ భూముల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా టీజీఐఐసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. యాచారం, కందుకూరు మండలాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 13,500 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించారు. ఏడాది కాలంగా హద్దుల గుర్తింపు, ఫెన్సింగ్ పనులు పూర్తి చేసి ప్రస్తుతం చదును పనులు చేస్తున్నారు. రైతులకు పరిహారం చెల్లించినప్పటికీ మళ్లీ సదరు భూముల్లోకి రావడం, పంటలు సాగు చేయడం వంటి ఘటనలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రకాల పరిశ్రమలకు భూములు అప్పగించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. 28 కంటైనర్ల ఏర్పాటు ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో పటిష్టమైన నిఘా కోసం (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిసదుపాయాల సంస్థ) సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రతీ 500 ఎకరాలకు ఒకటి చొప్పున మొత్తం 28 కంటైనర్లు, వీటి వద్ద ఒక సీసీ కెమెరా (నాలుగు కెమెరాలుండే స్తంభం) ఏర్పాటు చేశారు. ప్రతీ కంటైనర్ వద్ద ఓ ప్రైవేటు ఉద్యోగిని నియమించి రూ.15 వేలకుపైగా జీతం చెల్లిస్తున్నారు. ఇందుకోసం స్థానికులనే ఎంచుకుంటున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆ భూముల్లోకి వెళ్లేందుకు రైతులు సాహసించడం లేదు. ఫ్యూచర్సిటీ పోలీసుల పర్యవేక్షణ ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో మొదటి నుంచి పోలీసుల రక్షణ వలయం ఉంది. నాటి రాచకొండ కమిషనరేట్ నుంచి ప్రస్తుత ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ వరకు గట్టి బందోబస్తు కొనసాగుతోంది. ఫార్మాసిటీ భూముల్లో టీజీఐఐసీ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఫ్యూచర్సిటీ కమిషనరేట్ సిబ్బంది అనుక్షణం పరిశీలిస్తారు. ఫార్మాసిటీ భూముల్లో ఏ చిన్న వస్తువు చోరీకి గురైనా క్షణాల్లోనే తెలిసిపోయేలా సీసీ కెమెరాలకు అలర్ట్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు టీజీఐఐసీ ఉన్నతాధికారి వరుణ్ తెలిపారు. ప్రతీ 500 ఎకరాలకు ఒక కంటైనర్, సీసీ కెమెరాల స్తంభం ప్రత్యేక సిబ్బందితో పగలు, రాత్రి పర్యవేక్షణ చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా ఏర్పాట్లు -
ఫాంల్యాండ్స్ దందాను సహించొద్దు
● ఎక్కడ ఏర్పాటైనా ధ్వంసం చేయండి ● బాధ్యులపై చర్యలు తీసుకోండి ● పంచాయతీ అధికారులను ఆదేశించిన డీపీఓ యాచారం: జిల్లాలో ఏ గ్రామంలో అక్రమంగా ఫాంల్యాండ్స్ ఏర్పాటు చేసినా తక్షణమే ధ్వంసం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ వివిధ మండలాల పంచాయతీ అధికారులను ఆదేశించారు. ‘ఫ్యూచర్సిటీలో రియల్ దందా’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. యాచారం, కందుకూరుతోపాటు ఆయా మండలాల పంచాయతీ అధికారులకు నేరుగా ఫోన్లు చేసి ఫ్యూచర్సిటీ పరిధిలోని మండలాల్లో ఫాంల్యాండ్స్ పేరుతో దందా చేస్తే చూస్తూ ఊరుకోవద్దని సూచించారు. వెంటనే ఫాంల్యాండ్స్ వ్యవసాయ భూములను గుర్తించి, అందులో వేసిన రోడ్లను ధ్వంసం చేసి, హద్దురాళ్లను తొలగించాలని ఆదేశించారు. బాధ్యులైన వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు ఫాంల్యాండ్స్కు వ్యవసాయ భూములను గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేసే తహసీల్దార్లపై కలెక్టర్ నారాయణరెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా డివిజన్ల ఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కొత్తూరు: పట్టణంలోని లిటిల్ ఎంజిల్స్ పాఠశాలలో సోమవారం రాష్ట్రస్థాయి జూనియర్ అంతర్జిల్లా చౌక్బాల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఇందులో భాగంగా సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ కనచ్చారు. రాష్ట్రస్థాయిలో రంగారెడ్డి జిల్లా జట్టు విజేతగా నిలవగా, ద్వితీయ స్థానంలో నిజామాబాద్, తృతీయ స్థానంలో మహబూబ్నగర్ జిల్లా జట్లు నిలిచినట్లు నిర్వాహకుడు వెంకటేశ్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన జట్లు అస్సాంలో అక్టోబర్ 7 నుంచి 10వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. షాద్నగర్: ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా షాద్నగర్ పట్టణానికి చెందిన నీల రవీందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గందె సురేష్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్య సంఘం యువతను సంఘటితం చేస్తూ, సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు ఎల్కుర్తి నారాయణ, నాయకులు మురళీధర్, పెండ్యాల జగదీశ్వర్, విజయ్కుమార్, యశ్వంత్ రాజ్, ఆంజనేయులు, ఆనంద్బాబు తదితరులు పాల్గొన్నారు. కేశంపేట: గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర కోశాధికారిగా మండల కేంద్రానికి చెందిన ఆదిరాల రాంచంద్రయ్య ఎంపికయ్యారు. గత నెల 26న ఖమ్మం జిల్లా రఘనాథపాలెంలో పంచాయతీ వర్కర్స్ సంఘం రాష్ట్రస్థాయి 3వ మహాసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో సంఘం రాష్ట్ర కోశాధికారిగా కేశంపేట పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్న రాంచంద్రయ్యను ఎంపిక చేస్తూ తీర్మానం చేశారు. రాష్ట్ర కమిటీ నుంచి రాంచంద్రయ్య సోమవారం నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. -
భగవద్గీత.. మానవ జీవనానికి దిక్సూచి
అనంతగిరి: భగవద్గీత మానవ జీవితానికి దిక్సూచి అని సంగారెడ్డి జిల్లా ఫసల్వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వర శర్మ సిద్ధాంతి అన్నారు. వైభవలక్ష్మి ఆలయంలో గీతావాహిని ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న భగవద్గీత పారాయణ మహోత్సవం ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతా సందేశం నేటి సమాజానికి అవసరమని అన్నారు. మహిళలు కుటుంబ వ్యవస్థకు మూలస్తంభాలన్నారు. వారి జీవన విధానం, దైవారాధనలో పాటించాల్సిన నియమాలు, పూజా విధానాలు, వివిధ వ్రతాలను శాస్త్రోక్తంగా ఎలా ఆచరించాలి, సనాతన ధర్మ సంప్రదాయాలను ఎలా పరిరక్షించాలి అనే అంశాలను వివరించారు. భక్తి, సేవ, ధర్మం, సత్సంకల్పం, నిత్య పారాయణం ద్వారా కుటుంబాల్లో శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక వికాసం కలుగుతాయని చెప్పారు. తొమ్మిది రోజులుగా పారాయణం పెద్ద ఎత్తున చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గీతావాహిని అధ్యక్షురాలు శ్రీదేవిసదానంద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జయశ్రీ, ఆలయ నిర్వాహకురాలు స్వరూప రమేశ్, అర్చకులు విక్రమ్, మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేశ్, డాక్టర్ దీప భక్తవత్సలం, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ గౌడ్, అమరేందర్ రెడ్డి, నర్సింలు, ప్రవీణ్, గీతావాహిని సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మహేశ్వర శర్మ సిద్ధాంతి -
కఠిన చర్యలు తీసుకోవాలి
రైతులను మోసం చేసి వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు మళ్లించుకున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ మోసపూరిత ఘటనలో ఎవరెవరి పాత్ర ఉందో అందరిని విచారించి చర్యలు తీసుకోవాలి. రైతులకు జవాబుదారీగా ఉండాల్సిన ఏపీఎం, ఇతర అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈ సంఘటన జరిగింది. ఇందుకు కారణమైన వ్యక్తులు, అఽధికారులపై చర్యలు తీసుకోవాలి. – మల్కయ్య, బుగ్గప్ప, ప్రజా సంఘాల నాయకులుమరొకరి ఖాతాలో ఎలా జమ చేస్తారు? జూన్ 21న రాస్నం కొనుగోలు కేంద్రంలో కాశమ్మ పేరిట 116 సంచులు(46 క్వింటాళ్లకు పైగా) వరి ధాన్యం విక్రయించాం. ఇందుకు సంబంధించి రూ.1.10లక్షలకు పైగా నగదు జమ కావాల్సి ఉంది. ప్రతి రోజు స్థానిక ఐకేపీ, వీఓఏలను అడిగినప్పటికీ సమాధానం ఇవ్వలేదు. ఇదే విషయమై ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఏపీఎంను సంప్రదించగా .. అంజిలప్ప ఫోన్ చేసి ధాన్యం డబ్బులు తన వద్దే ఉన్నాయని, సాయంత్రం ఇస్తానని చెబుతున్నాడు. మా ధాన్యం డబ్బులు మరొకరి ఖాతాలో ఎలా జమయ్యాయి? ధాన్యం డబ్బులు వచ్చి ఎన్ని రోజులైందనే విషయంలో మాకు తెలియాలి. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – అనంతయ్య, బాధిత రైతు, రాస్నం -
‘మత్తు’ వదిలిస్తాం
అనంతగిరి: మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎస్పీ స్నేహమెహ్ర అన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని సమస్యాత్మక, ఏకాంత ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో శనివారం రాత్రి పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజ, యువత భవిష్యత్కు ముప్పుగా మారుతోన్న గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మత్తు పదార్థాల సరఫరాదారులు, విక్రేతలు, వినియోగదారులపై నిఘా ఉంచి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైవ్లో భాగంగా వికారాబాద్, తాండూరు, పరిగి సబ్డివిజన్లలో నార్కోటిక్ డిటెక్షన్ కిట్లతో అనుమానితులను తనిఖీ చేశారు. పెట్రోలింగ్, వాహన తనిఖీలు, డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, తాండూరు డీఎస్పీ యాదయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట తాండూరు టౌన్: సమాజంలోని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసరాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, రైల్వే క్వార్టర్స్తో పాటు పలు నిర్మానుష్య ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు రాత్రిళ్లుగా గుంపులుగా ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారని, అలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీకటి ప్రాంతాల్లో కూర్చుని సిగరెట్లు తాగుతూ, మద్యం సేవిస్తున్న పలువురు యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామన్నారు. ఇలాంటి తనిఖీలు తరచుగా నిర్వహిస్తుంటామని, దీంతో నేరాలను అదుపు చేయవచ్చన్నారు. ఈ తనిఖీల్లో పట్టణ సీఐ పరమేశ్వర్, ఎస్ఐ నుమాన్ అలీ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ఎస్పీ స్నేహమెహ్ర -
దారి మళ్లిందా?
ధాన్యం సొమ్ము యాలాల: వరి ధాన్యం కొనుగోలు చెల్లింపుల డబ్బులు భారీ స్థాయిలో పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైతుల ఖాతాల్లోకి జమ చేయాల్సిన నగదు ప్రైవేటు వ్యక్తి ఖాతాల్లోకి మళ్లింపు చేశారంటూ బాధిత రైతులు వాపోతున్నారు. బాధిత రైతులు తెలిపిన ప్రకారం.. వేసవిలో రాస్నం గ్రామంలో మండల మహిళా సమాఖ్య(ఐకేపీ)ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో జూన్లో గ్రామానికి చెందిన ఎం.కాశమ్మ(116 సంచులు), మొల్ల మన్నాన్(103 సంచులు), రైకల అజీం(78 సంచులు), ఎన్కెపల్లి మల్లప్ప(78 సంచులు), జుబేరా బేగం(38 సంచులు), ఫైమూద బేగం(32 సంచులు) విక్రయించారు. ఇందుకు సంబంధించిన నగదు నేటికి తమ ఖాతాల్లో జమకాకపోవడంతో ఆదివారం వారు ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్కు ఫోన్ చేశారు. దీంతో వెంటనే గ్రామానికి చెందిన అంజిలప్ప బాధిత రైతులకు ఫోన్ చేసి, ధాన్యం డబ్బులు తన ఖాతాలో పడ్డాయని.. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నానని.. సాయంత్రం చెల్లిస్తానని చెప్పాడు. దీంతో నగదు తమ ఖాతాలో కాకుండా మరో వ్యక్తి అకౌంట్లో జమ కావడంపై బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రం అంజిలప్ప అన్ని తానై వ్యవహరిస్తూ పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నాడని బాధిత రైతులు ఆరోపించారు. ధాన్యం విక్రయించే సమయంలో రైతులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, రాస్నం శాఖకు చెందిన తమ ఖాతా వివరాలను విక్రయపట్టిలో నమోదు చేసినప్పటికీ మరో వ్యక్తి ఖాతాలోకి ఎలా మల్లించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి రాస్నం కొనుగోలు కేంద్రం నిర్వాహణలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన సొమ్ము విక్రయదారుల ఖాతాకు బదులుగా ప్రైవేట్ వ్యక్తి అకౌంట్లో జమ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కర్షకులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాస్నం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు! అన్నదాత బదులు మరొకరి ఖాతాలో నగదు జమ అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతుల ఆరోపణ చర్యలకు డిమాండ్ కాగా ఈ విషయమై యాలాల ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ను వివరణ కోరగా.. ఆదివారం కూడా ఇంటి వద్ద ఉండవద్దా.. రాస్నం కొనుగోలు కేంద్రంలో ధాన్యం డబ్బుల చెల్లింపుల విషయం నాకు ఏమీ తెలియదు.. ఎవరికై నా ఫిర్యాదు చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చేవెళ్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుండాల గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ (35) చేవెళ్లలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి పని ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో పామెన బస్స్టేజీ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న శ్రీనివాస్కు తీవ్ర గ్రాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వెళ్లి పరిశీలించారు. మృతుడిని గుండాలకు చెందిన శ్రీనివాస్గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుని భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నాగోలు: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీపాతి దీపారెడ్డి పార్థివదేహం ఆదివారం చంపాపేట డివిజన్ శిఖరా ఎన్క్లేవ్ కాలనీలోని ఆమె స్వగృహానికి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక కాలనీవాసులు భౌతికకాయాన్ని చూసి బోరున విలపించారు. పలు పార్టీలకు చెందిన నాయకులు, సంక్షేమ సంఘ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం చంపాపేట రెడ్డి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఆమన్గల్ మున్సిపల్ చైర్మన్ పత్యానాయ పాల్గొన్నారు. -
సంకల్ప్తో మేల్కొలుపు
నవజాత శిశు మరణాల రేటు తగ్గింపే లక్ష్యం● ఆదిలాబాద్లో పైలట్ ప్రాజెక్టు విజయవంతం ● నగరంలో అమలుకు అధికారుల సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: నవజాత శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్కు తగ్గించేందుకు ప్రభుత్వం గట్టి ‘సంకల్పం’తో ముందుకెళుతోంది. దంపతులు పిల్లల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటి నుంచి ప్రసవమై తల్లీ, బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్లేంత వరకు ఒక నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టి పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో అదే తరహాలో నగరంలోనూ అమలుకు వైద్యారోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వెయ్యి జననాల్లో 12.27 మృతుల రేటు హైదరాబాద్ జిల్లాలో ప్రతి వెయ్యి మంది పిల్లల సజీవ జననాల్లో పుట్టిన 28 రోజుల్లోపు 12.27 మంది మృతుల రేటు నమోదవుతోంది. నగరంలోని నవ దంపతులు ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడు తున్న తరుణంలో పుట్టిన బిడ్డను రక్షించుకోవడమూ కీలకంగా మారుతోంది. నవజాత శిశు మరణాల రేటును 5 శాతం కంటే దిగువకు తీసుకురావా లని హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికా రులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి క్షేత్ర స్థాయిలో ఆశా కార్యకర్త నుంచి మొదలు పెడితే బిడ్డను ప్రసవం చేసిన నిపుణులైన వైద్యుల బృందం వరకు అందరినీ ఒక లక్ష్యం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టిన 28 రోజుల వరకు ప్రతి తల్లీబిడ్డను 360 డిగ్రీల కోణంలో పర్యవేక్షించనున్నారు. ఏటా 1.20 లక్షల జననాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో విస్తరించిన గ్రేటర్ పరిధిలో ఏటా సుమారు 1.20 లక్షల జననాలు నమోదవుతున్నాయి. ఇందులో హైదరాబాద్ జిల్లాలోనే సుమారు 75 వేలకుపైగా ఉంటున్నాయి. హైదరాబాద్లో గాంధీ, పేట్లబురుజు, నిమ్స్ వంటి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కార్పొరేట్ ఆసుపత్రులు అందు బాటులో ఉన్నప్పటికీ నవజాత శిశు మరణాల రేటు ఆందోళణకు గురిచేస్తోంది. ఏం చేయనున్నారు? ఆశా కార్యకర్త గర్భిణితో నిత్యం టచ్లో ఉంటుంది. వారంలో కనీసం ఒక్కసారి అయినా గర్భిణి ఇంటికి వెళ్లి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. హైరిస్క్ కేసుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. గర్భిణి డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. నెలలు నిండిన గర్భిణి ముందస్తుగా ఆసుపత్రికి చేర్చడం, వీలైనంత వరకు సాధారణ ప్రసవానికి ప్రయత్నించాలని అధికారులు చెబుతున్నారు. శిశువు తక్కువ బరువుతో పుడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్లను నుంచి రక్షించుకునేందుకు మదర్ కేర్లో శిక్షణ ఇస్తారు. ఫలితంగా ఇన్ఫెక్షన్లు 60 శాతం వరకు తగ్గుతాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. పుట్టిన గంటలోపు బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు తాగించాలని చెబుతున్నారు. సంవత్సరం ప్రసవాలు మృతులు 2024-25 76,709 866 2025-26 75,804 868 2026-27 16,047 197 (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) -
ధర రాక.. తిరిగి తీసుకెళ్లలేక
మొయినాబాద్రూరల్: టమాటాలకు ఆశించిన ధర రాకపోవడంతో రైతులు మార్కెట్లో అమ్మలేక.. తిరిగి ఇళ్లకు తీసుకెళ్లలేక గ్రామాలకు వెళ్తూ రోడ్ల పక్కన పారబోస్తున్నారు. గుడిమల్కాపూర్, శంషాబాద్ రైతుబజార్ మార్కెట్లలో ఒక్కోపెట్టె (25 కిలోలు)కు తాజాగా ఉంటే రూ.200–220 ధర పలుకుతోంది. కూలీ.. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డు పక్కన పారబోసి ఇంటి ముఖం పడుతున్నారు. మండల పరిధిలోని చందానగర్, రెడ్డిపల్లి సమీపంలో రోడ్డు పక్కన టమాటాలు పారబోసి కనిపిస్తున్నాయి. చేవెళ్ల: విద్యారంగ సమస్యలపై ఎంఎస్ఎఫ్ (మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్) పోరాడుతుందని సంఘం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డాక్టర్ చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ అన్నారు. చేవెళ్లలో ఆదివారం ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా కో ఇన్చార్జి నాని భానుప్రసాద్మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ.. పేద వర్గాల విద్యార్థుల పక్షాన పోరాడతామని తెలిపారు. సెప్టెంబర్ 8న చలో హైదరాబాద్ మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మేడ్చల్జిల్లా కో ఇన్చార్జి శివకృష్ణ, వికారాబాద్ జిల్లా కో ఇన్చార్జి రావణ్, నాయకులు వెంకట్, జానీ, గణేశ్, ఆదిత్య, అరుణ్, తరుణ్, శ్రీకాంత్, నందు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. తుర్కయంజాల్: ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని చికెన్, మటన్ దుకాణాల్లో శంషాబాద్ జోనల్ వెటర్నరీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ అధికారి రవిచంద్ర మాట్లాడుతూ.. పలు దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయని, స్లాటర్ కేంద్రాల నుంచి కాకుండా నేరుగా కట్ చేసి మాంసం విక్రయాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఇక మీదట ఇలా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. విక్రయదారులు కూడా స్టాంప్ ఉన్న మటన్ను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. దుకాణాల యజమానులు పరిశుభ్రత పాటించడంతో పాటు, వారం రోజుల్లోగా ట్రేడ్ లైసెన్స్లను పొందాలని సూచించారు. లేని పక్షంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించి, మొదటి విడతగా నోటీసులు జారీ చేశారు. గ్రీన్ చానల్ ద్వారా ఊపిరితిత్తుల రవాణా శంషాబాద్: శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా ఊపిరితిత్తులను రవాణా చేశారు. ఆదివారం మధ్యాహ్న శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం జెమ్స్ ఆస్పత్రికి చేరిన ఊపిరితిత్తులను అక్కడి నుంచి విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఇండిగో 6ఈ– 783 విమానంలో.. అక్కడి నుంచి 4.12 గంటలకు బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్టుకు 5.11 గంటలకు చేరుకున్నాయి. సీఐఎస్ఎఫ్ అధికారులు, ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన అంబులెన్స్లో వెంటనే తీసుకెళ్లి ఆర్గాన్స్ను ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ 30 నిమిషాల్లో సికింద్రాబాద్ కిమ్స్కు చేర్చారు. -
దుకాణంలో రూ.6.40 లక్షలు చోరీ
అధిక ధరలకు విక్రయిస్తున్నారు వికారాబాద్లోని మహాలక్ష్మి ఏజెన్సీవారు డీఏపీని ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఐదు బస్తాల డీఏపీ తీసుకోగా రూ.8,400 వసూలు చేశారు. డీలర్ మా వద్ద తీసుకున్న సొమ్ము రికవరీ చేయాలి. నగదు రూపేన ఇవ్వకుండా ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగింది. – రమేశ్నాయక్, రైతు ఫిర్యాదు చేస్తే చర్యలు అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. డీఏపీ బస్తాను రూ.1,350కే విక్రయించాలి. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే రైతులు ఆధారాలతో ఫిర్యాదు చేయాలి. – వెంకటేశం, ఏడీఏ వికారాబాద్ పెట్టుబడుల పేరుతో రూ.10 లక్షలు స్వాహా ఇన్స్ట్రాగాం ద్వారా ఎర వేసి, నేరుగా కలిసి టోకరా సాక్షి, సిటీబ్యూరో: అత్తాపూర్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి పెట్టుబడుల పేరుతో ఇన్స్ట్రా గాం ద్వారా ఎర వేసిన ఓ ముఠా నేరుగా కలిసి రూ.10 లక్షలు స్వాహా చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడు గత ఏడాది సెప్టెంబర్లో తన సహోద్యోగి సయ్యద్ సర్ఫరాజ్ ద్వారా ఇన్స్ట్రాగాంలో వచ్చిన పెట్టుబడి ప్రకటనలు చూశారు. తమ స్కీముల్లో పెట్టుబడిపెడితే కేవలం 7–8 రోజుల్లోనే భారీ లాభాలు ఇస్తామని ఉండటంతో ఆకర్షితుడయ్యాడు. అందులో ఉన్న నెంబర్ ఆధారంగా బాధితుడు బతూల్ ఫాతిమా అలియాస్ సకీనా ఫాతిమాను సంప్రదించాడు. ఆమె సూచనల మేరకు అత్తాపూర్లోని ఓ హోటల్లో సమావేశానికి వెళ్లాడు. అక్కడ బతూల్ ఫాతిమా, అలీ జాన్ రజ్వీ తదితరులు తమ వద్ద రూ.10 లక్షలు పెట్టుబడిపెడితే వాటిని షేర్లలో ఇన్వెస్ట్ చేసి రెండు వారాల్లో రూ.18 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం ఏర్పాటు చేసిన ఓ వాట్సాప్ గ్రూప్లోనూ ఇతడిని చేర్చారు. బాధితుడు గత ఏడాది సెప్టెంబర్ 22, 23 తేదీల్లో వివిధ బ్యాంకు ఖాతాలు, వాలెట్ లావాదేవీల ద్వారా రూ.10 లక్షలు బతూల్ ఫాతిమా ఖాతాకు బదిలీ చేశాడు. దీనికి సంబంధించి ఆమె రసీదు ఇవ్వడంతో పాటు అదే ఏడాది అక్టోబర్ 7లోపు రూ.18 లక్షలు చెల్లిస్తామని ఒప్పందం కూడా చేసుకుంది. గడువు ముగిసినా డబ్బు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బాధితుడు నిలదీయగా... అదే ఏడాది డిసెంబర్ 16న మరో ఒప్పందం చేసుకుంటూ... డిసెంబర్ 25లోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ష్యూరిటీగా ఖాళీ చెక్కులు కూడా బాధితుడికి అందించారు. ఆ గడువు ముగిసే సమయానికీ చెల్లించకపోవడంతో వారిని సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్లు స్విచ్ ఆఫ్ అని తెలిసింది. నిందితులు తమ ఇళ్లు కూడా ఖాళీ చేసి పరారయ్యారని గుర్తించారు. దీంతో బాధితుడు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇదే పంథాలో నిందితులు అనేక మందిని మోసం చేసి సుమారు రూ.90 లక్షల నుంచి రూ.95 లక్షలు వసూలు చేసినట్లు తనకు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రకృతి అందాలు.. పరవశించిన పర్యాటకులువికారాబాద్ జిల్లా ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా అనంతగిరి హిల్స్, కోట్పల్లి ప్రాజెక్ట్కు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడవులు, కొండల మధ్య దృశ్యాలను చూస్తూ పరవశించారు. ప్రాజెక్ట్ వద్ద బోటింగ్ చేస్తూ, సెల్ఫీలు దిగుతూ సందడిగా గడిపారు. – అనంతగిరి, ధారూరునాగోలు: గుర్తు తెలియని వ్యక్తులు హోల్సేల్ మార్కెట్ క్యాష్ కౌంటర్ పగలగొట్టి షాప్లో ఉన్న రూ.6.40 లక్షల నగదు చోరీ చేశారు. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్ఘాట్కు చెందిన చిక్కొటి శివకుమార్ బైరామల్గూడ, అల్తాప్ నగర్లో శ్రీ భవానీ ట్రేడర్స్ పేరుతో హోల్సేల్ నూనె, బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్నారు. శనివారం రూ.6.40 లక్షల నగదు క్యాష్ కౌంటర్లో పెట్టి షాప్ మూసి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం షాప్ తెరిచి చూడగా క్యాష్ కౌంటర్ పగలగొట్టి ఉంది. క్యాష్ కౌంటర్ను తనిఖీ చేయగా నగదు చోరీకి గురైనట్లు నిర్ధారించుకున్నారు. దుండగులు షాప్లో ఉన్న సీసీటీవీ డీవీఆర్ పవర్ కేబుల్ తొలగించి కెమెరా యాంగిల్స్ మార్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. శివకుమార్ ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సనత్నగర్: సనత్నగర్ పారిశ్రామికవాడ ప్రాంతంలో ఎల్ఎస్డీ (లైసెర్జిక్ యాసిడ్ డైఎథైలమైడ్) మత్తు పదార్ధాలను విక్రయిస్తున్న ముఠాను సనత్నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 45 ఎల్ఎస్డీ బ్లాట్స్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్నగర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ గోదాం సమీపంలో ఎల్ఎస్డీ బ్లాట్స్ విక్రయిస్తు బైక్పై వచ్చిన అర్లికట్టె రాజేష్ అనిరుధ్ అలియాస్ డింగీ (28), కొనుగోలుదారు కే మోహిత్ (27)లను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 45 ఎల్ఎస్డీ బ్లాట్స్ (0.600 గ్రాములు) లభించాయి. విచారణలో ప్రధాన నిందితుడు ఆన్లైన్ ద్వారా విదేశీ వ్యక్తి నుంచి సింప్లెక్స్ యాప్ సహాయంతో ఎల్ఎస్డీ బ్లాట్స్ తెప్పించుకుని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. మోహిత్ కూడా గత ఏడాదిగా అతని వద్ద నుంచి ఎల్ఎస్డీ కొనుగోలు చేసి వినియోగించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు ఎన్డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదుపు తప్పి.. చెట్టును ఢీకొట్టి
షాబాద్: అతి వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ విద్యార్థి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని పోతుగల్ వద్ద చోటుచేసు కుంది. ఎస్ఐ చెన్నారెడ్డి కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం న్యాలట గ్రామానికి చెందిన పుప్పాల చరణ్ (19) స్నేహితుడు ఎడ్ల స్వాతిక్తో కలిసి ఆదివారం ద్విచక్ర వాహనంపై షాబాద్ వైపు నుంచి చేవెళ్లకు వెళ్తున్నారు. మార్గమధ్యలో పోతుగల్ సమీపంలో అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి డివైడర్ మఽ ద్యలో ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన చరణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. స్వాతిక్ను చికిత్స నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి.. కొత్తూరు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నాగార్జునరెడ్డి కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటకు చెందిన రాములు ఆదివారం తల్లి లక్ష్మమ్మ (61), కూతురు సంధ్యతో కలిసి బైకుపై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. కొత్తూరు సమీపంలోకి రాగానే పెంజర్ల కూడలి జాతీయ రహదారి వద్ద బైకు అదుపు తప్పి కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలైన లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ప్రమాదంలో ఒకరు.. కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు నుంచి ఆదివారం హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి లారీ చక్రాల కిందపడిపోయింది. దీంతో వాహనం నడుపుతున్న గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా వెనుకాల ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్పై వెళ్తున్న విద్యార్థి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు -
ఉజ్జయినీ.. జగజ్జననీ
బోనమెత్తిన లష్కర్లష్కర్ బోనమెత్తింది. భక్తజనం పోటెత్తింది. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవోపేతంగా సాగింది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాలు.. కళాకారుల ఆటాపాటలు.. ప్రముఖుల రాకతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పణతో.. ఎటూ చూసినా భక్తజన సంద్రాన్ని తలపించింది. తీర్చిదిద్దిన తీరొక్క బోనాలతో మహిళలు మహంకాళి అమ్మవారికి నివేదించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. గోల్కొండలోనూ జగదాంబిక అమ్మవారికి ఆదివారం ఆరో బోనం పూజను ఘనంగా నిర్వహించారు. – రాంగోపాల్పేట్ -
కార్మిక వ్యతిరేక విధానాలు తగవు
తుక్కుగూడ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి పూర్తిగా కాలరాసిందని విమర్శించారు. దేశంలో మోదీ ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, యువత ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వారి తీరు కారణంగానే ఢిల్లీలో గతంలో రైతులు ఉద్యమం చేపట్టారని, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహరంపై జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ పోరాటాలన్నీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. దేశంలో కార్మికుల చట్టాల అమలు కోసం పార్టీలు, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ యూసఫ్, సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, నాయకులు పానుగంటి పర్వతాలు, రామస్వామి, దత్తునాయక్, శేఖర్రెడ్డి, చందు యాదవ్, రాజు, లక్ష్మణ్, నర్సింహారెడ్డి, దేవేందర్గౌడ్, బ్రహ్మచారి, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు -
హైవే విస్తరణ పనుల పరిశీలన
మొయినాబాద్: గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యం జరిగిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మొయినాబాద్లో జరుగుతున్న హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. బీజాపూర్ జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ రోడ్డు నిజాం కాలం నాటిదని.. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం రహదారి పనులు చేపడుతోందన్నారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను తామే తెచ్చామంటూ సోషల్ మీడియాలో డబ్బాకొట్టుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు కంజర్ల ప్రకాష్, మోర నర్సింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, కౌన్సిలర్ కిషన్, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, నాయకులు ప్రభాకర్రెడ్డి, మహిపాల్, శ్రీనివాస్గౌడ్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు. -
రియల్దందా!
యాచారం: ఫ్యూచర్సిటీలో ఫాంల్యాండ్స్ దందా జోరుగా సాగుతోంది. లాభార్జనే లక్ష్యంగా రియల్ వ్యాపారులు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మండలంలోని 24 పంచాయతీలు ఫ్యూచర్సిటీ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఏర్పాటయ్యే వెంచర్లకు ఎఫ్సీడీఏ (ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ) అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతులకు భారీగా ఖర్చవుతుందనే ఉద్దేశంతో వ్యాపారులు అక్రమ మార్గాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ఫాంల్యాండ్స్ వ్యాపారం కొనసాగిస్తున్నారు. చౌదర్పల్లి, నందివనపర్తి, యాచారం, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, మాల్, గునుగల్, చింతపట్ల, నస్దిక్సింగారం, అయ్యవారిగూడెం తదితర గ్రామాల్లో ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పైగా కొనుగోలు చేసి గుంటల్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగా విక్రయిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఆగ్రహం రియల్ వ్యాపారులు కొనుగోలుదారులకు గుంటల్లో నే విక్రయాలు జరుపుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఫాంల్యాండ్స్ కోసం గుంటల్లో రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. నిత్యం 25 నుంచి 50 వరకు 121, 242, 363, 400, 500 గజాల్లో వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వీటికోసం రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఫాంల్యాండ్స్కు గుంటల్లో వ్యవసాయ భూముల విక్రయాలపై ఇటీవల జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రెవెన్యూ అధికారులపై మండిపడిన విషయం తెలిసిందే. ఏఏ గ్రామాల్లో గుంటల్లో వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లు చేస్తున్నారో నివేదిక ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డికి సూచించారు. ఫాంల్యాండ్స్ పేరిట అక్రమార్కుల వ్యాపారం వ్యవసాయ పొలాలను చూపించి గుంటల్లో విక్రయాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం తహసీల్దార్ కార్యాలయంలో జోరుగా రిజిస్ట్రేషన్లు రూ.లక్షల్లో కొనుగోలు చేసి రూ.కోట్లలో ఆర్జన గుంటల్లో రిజిస్ట్రేషన్లపై ఉన్నతాధికారుల ఆరా? ఫాంలాండ్స్ పేరుతో వ్యవసాయ భూములను గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేయడం నిలిపేశాం. నిజమైన రైతులకు అత్యవసరమనుకుంటే జీపీఓల ద్వారా వివరాలు సేకరించి రిజిస్ట్రేషన్లు చేసేలా తహసీల్దార్లకు సూచించాను. ఎఫ్సీడీఏ, హెచ్ఎండీఏ, డీటీసీపీ నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన వెంచర్లలోనే ప్లాట్లు కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. – శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
డీఏపీ.. ధరల్లో దోపిడీ
ధారూరు: డీఏపీ ఎరువులను ఎమ్మార్పీ కంటే అధికధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకోవా లని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండల పరిధి లోని డీకే తండాకు చెందిన పుల్సింగ్, రమేశ్ నాయక్, బాలరాజ్నాయక్, మాణిక్రావు, కిషిక్టబాయి, బీక్యానాయక్ ఆదివారం వికారాబాద్ లోని శ్రీమహాలక్ష్మి ఏజెన్సీలో ఒక్కొక్కరు ఐదు బస్తాల చొప్పున గత నెల 31 నుంచి ఆదివారం వరకు డీఏపీ కొనుగోలు చేశారు. బస్తాకు రూ.1,350 ఉండగా వారి నుంచి రూ.1,680 వసూలు చేశారు. రైతులు డీలర్ను రసీదు ఇవ్వాలని కోరడంతో దుకాణ వివరాలు లేని.. మొత్తం బిల్లు వేయకుండానే రసీదు ఇచ్చారంటూ ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేస్తున్నప్పటికీ డీలర్లతో కుమ్మకై ్కన వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద అధికంగా డబ్బు తీసుకున్న డీలర్ నుంచి తిరిగి ఇప్పించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సోమవారం ఇదే విషయమై కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తామన్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు -
స్నేహమేవ జయతే
హుడాకాంప్లెక్స్: ‘అల్లాయే దిగివచ్చి.. ఏమి కావాలంటే..? మిద్దెలొద్దు.. మేడలొద్దు.. పెద్దలెక్కే గద్దెలొద్దంటా.. ఉన్ననాడు.. లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే.. ఒక్క దోస్తే చాలంటా.. స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. స్నేహమేరానాకున్నది.. స్నేహమే నాపెన్నిధి’ అంటూ సినీనటుడు కై కాల, ఎన్టీఆర్ ఏళ్ల క్రితం ఆలపించిన ఆ పాట చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇదే స్ఫూర్తితో రంగారెడ్డి జిల్లా హస్తినాపురానికి చెందిన రాందేశ్పాండే 2008లో స్నేహితుల కలయిక కోసం ‘స్నేహమేవ జయతే’ సంక్షేమ సంఘాన్ని స్థాపించారు. కేవలం నలుగురు మిత్రులతో మొదలైన ఈ స్నేహ ప్రస్థానం.. ప్రస్తుతం మూడు వందల మందికిపైగా విస్తరించింది. ‘స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా’ అంటూ దోస్తీ గొప్పతనాన్ని నేటి తరానికి వివరిస్తుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆగస్టు 2న స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరంతా ఒకే వేదికపై కలుసుకుని, ఆర్థికంగా వెనుకబడిన స్నేహితులకు అండగా నిలబడటంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేస్తుంటారు. ఆ తర్వాత వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుంటారు. వీధుల్లో ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చే కార్యక్రమం సహా స్నేహం విలువను చాటి చెబుతుంటారు. పర్యావరణ పరిరక్షణ, నీటిపొదుపు, పాలిథిన్ బ్యాగుల నిషేధం, అనాథ శరణాలయాల్లో అన్నదానం జాతి నేతల గొప్పతనంపై కరపత్రాల పంపిణీ, రాఖీ రోజున ఫ్రెండ్షిప్ బాండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతూ నవతరం స్నేహితులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నలుగురితో మొదలై.. 300 మందికి విస్తరణ నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!
మొయినాబాద్: పాఠశాల విద్యార్థులను తరలించే ప్రైవేటు బస్సులు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. వీరి చర్యలతో పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో వెళ్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మొయినాబాద్లోని హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై ఎన్నో యూటర్న్లు ఉన్నా.. శ్రీచైతన్య స్కూల్ బస్సులు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో రాంగ్ రూట్లోనే ప్రయాణం సాగిస్తున్నాయి. వీరి చర్యలను చూసి మిగిలిన వాహనదారులు, స్థానికులు మండిపడుతున్నారు. పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్ల బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిత్యం రాంగ్ రూట్లో వెళ్తున్న స్కూల్ బస్సులు -
డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
హయత్నగర్: టీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హయత్నగర్–1 డిపో మేనేజర్ లావణ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెవీ వాహన లైసెన్స్ కలిగి ఉండి కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు సైజు ఫొటోను జత చేసి ఈనెల 8వ తేదీలోపు డిపోలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.షాబాద్: ఇటీవల మాతృవియోగానికి గురైన పట్నం సోదరులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శనివారం పరామర్శించారు. షాబాద్లోని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్రెడ్డి నివాసంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జి పామెన భీంభరత్, పెంటారెడ్డి, మద్దూరు మల్లేష్, సర్పంచులు అశోక్, రవికుమార్, నర్సింలు, శ్రీరాంరెడ్డి, చెన్నయ్య రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పట్నం మహేందర్రెడ్డి, నరేందర్రెడ్డి, అవినాశ్రెడ్డిని పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, శ్రీరాంరెడ్డి, మల్లేష్, దేవేందర్రెడ్డి, అరీఫ్, రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు: కొత్తూరు పోలీస్స్టేషన్ నూతన సీఐగా నాగార్జునరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఇక్కడ విధులు నిర్వర్తించిన నర్సయ్య ఫ్యూచర్సిటీ కమిషనరేట్కు బదిలీపై వెళ్లారు. ఇబ్రహీంపట్నం: దండుమైలారం గ్రామంలో ఆక్రమణకు గురైన గ్రామకంఠం భూ సాధనే లక్ష్యంగా చేస్తున్న రిలే దీక్షలు శనివారానికి ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో ఆక్రమణకు గురైన గ్రామ కంఠం భూమిని విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ ఈదులకంటి నరేష్గౌడ్ దీక్షలు చేపట్టిన వారికి సంఘీభావం ప్రకటించాడు. -
ప్రజలకు ఇబ్బందులు రానీయొద్దు
షాబాద్: ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో పట్నం మహేందర్రెడ్డి కుటుంబీకులను పరామర్శించిన అనంతరం మండలంలోని రైతులు ఆయనకు వినతులు అందజేశారు. ఎరువుల విషయంలో ఇబ్బందిగా ఉందని, ఇక్కడ రైతులు ఎక్కడికో వెళ్లి ఎరువులు తీసుకోవాల్సి వస్తుందని విన్నవించారు. యాప్ ద్వారా తీసుకోవడం మరీ అంతరాయంగా ఉందన్నారు. వెంటనే ఆ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడారు. యాప్లో కొన్ని సమస్యలు ఉన్నాయని వారు తెలపగా.. సమస్యలు ఉంటే యాప్ను ఎందుకు రైతుల ముందుకు తీసుకు వచ్చారని, రెండు మూడు రోజుల్లో సరిచేసి ఇబ్బంది లేకుండా చేయాలన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా ఇవ్వాలని తహసీల్దార్ అన్వర్ను ఆదేశించారు. స్థానిక విలేకరులకు సైతం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంత్రిని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
సర్గ్గా సద్వినియోగం చేసుకోండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) గడువు ఈనెల 10 వరకు పొడిగించిన నేపథ్యంలో లభించిన అదనపు సమయాన్ని పూర్తిగా నాణ్యత పెంపునకు వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు కె.కిరణ్మయి, చంద్రారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నవీన్కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బంది చేసిన కృషిని అభినందించారు. జిల్లాలో నిర్వహి స్తున్న ఓటరు అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని పెంచాయని ప్రశంసించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో పేర్లు గుర్తించలేకపోతున్నామని, బీఎల్వోలు అందుబాటులో లేరనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. బీఎల్వోలు ప్రజలకు పూర్తి సహకారం అందిస్తూ, ఎన్నికల ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఆయన అదనపు కలెక్టర్ కె.కిరణ్మయితో కలిసి కొంగర, బొంగులూరు, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. 63.53 శాతం మ్యాపింగ్ పూర్తి కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 63.53 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు చెప్పారు. పెండింగ్ మ్యాపింగ్, అనామలీస్, డూప్లికేట్, నో మ్యాపింగ్ కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో ఇప్పటికే విస్తృత సమావేశాలు నిర్వహించి అపోహలు తొలగించామని, అవసరమైతే మరోసారి ఈఆర్వో స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. గడువులోగా పూర్తి చేయాలి ఇబ్రహీంపట్నం రూరల్: నిర్ణీత గడువులోగా సర్ కార్యక్రమం పూర్తి చేయాలని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఆదేశించారు. కొంగరకలాన్, బొంగ్లూర్లోని పలు పోలింగ్ కేంద్రాలను శనివారం ఆయన అదనపు కలెక్టర్ కిరణ్మయి, డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి జయచంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు. బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, దరఖాస్తుల పరిశీలన, రికార్డుల నిర్వహణ, ఫీల్డ్ వెరిఫికేషన్ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రత్యేక ఓటరు సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీత, ఆదిభట్ల డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. బీఎల్ఓలు అందుబాటులో లేరనే ఫిర్యాదులు రావొద్దు ఇప్పటివరకు జిల్లా అధికారుల కృషి భేష్ కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమార్ ఓటరు జాబితా సమగ్ర సవరణపై సమీక్ష -
2 నిమిషాలు.. 1,150 బస్తాలు
మంచాల: యూరియా కొరత, అక్రమాలను నివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానంపై రైతులకు అవగాహన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మంచాల పీఏసీఎస్, బోడకొండ ఎరువుల సరఫరా కేంద్రానికి చేరుకున్న యూరియా బస్తాలు నిమిషాల్లోనే ఆన్లైన్లో అమ్ముడవ్వడంతో మొబైల్ వినియోగం రాని చాలా మంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పంటకు యూరియా ఎంతో అవసరం. ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడా ఇది దొరకడం లేదు. దీనికి తోడు ఈ వారం యూరియా సరఫరా కాలేదు. ఈ క్రమంలో శనివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి 450 బస్తాలు, బోడకొండ ఎరువుల సరఫరా కేంద్రానికి 700 బస్తాల యూరియా వచ్చింది. లారీలో నుంచి దించకముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవడంతో అమ్ముడయింది. కేవలం రెండు నిమిషాల్లోనే యూరియా అయిపోయింది. దీంతో అప్పటిదాకా వేచి ఉన్న రైతులు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. నాలుగైదు రోజులుగా యూరియా వస్తుందని ఆశతో గ్రామాల నుంచి ఇక్కడకు వచ్చిపోతున్నాం. ఆన్లైన్ పేరిట ఇక్కడ ఉన్న వారికి ఇవ్వకుండా ఎక్కడో ఉండి బుకింగ్ చేసుకున్నారని ఇవ్వడం దారుణమన్నారు. కొద్దిసేపు యూరియా విక్రయించకుండా షటర్ మూసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం అవసరాలకు సరిపడా యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు. ఆన్లైన్ బుకింగ్తో క్షణాల్లో విక్రయాలు యూరియా దొరకక రైతుల ఆగ్రహం షటర్ మూసి ఆందోళన యూరియా కావాలంటే ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకోవాలి. వచ్చిన స్టాక్ వచ్చినట్లుగా నిమిషాల్లోనే బుకింగ్ కావడం జరుగుతోంది. కచ్చితంగా బుకింగ్ చేసుకున్న వారికి ఇవ్వాల్సిందే. నిబంధనలు అందరికి ఒక్కటే. ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాలి. – వెంకటేశ్, ఏఓ, మంచాల యూరియా కోసం నాలుగైదు రోజులుగా ఎదురుచూసినా రావడం లేదు. లోడ్ రాగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి నిమిషాల్లో యూరియా ఇస్తున్నారు. చదువురాని రైతులు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు. అందరి అవసరాలకు అనుగుణంగా యూరియా ఇవ్వాలి. – ఐలయ్య, రైతు, తిప్పాయిగూడ -
మంగళ్పల్లి టు కర్మన్ఘాట్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లిలోని ఓ అద్దె భవనంలో కొనసాగుతున్న మహేశ్వరం మెడికల్ కాలేజీని కర్మన్ఘాట్లోని మరో అద్దె భవనంలోకి మార్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత అద్దె భవనంలో ఆశించిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, అనుబంధ ఆస్పత్రికి 18 కిలోమీటర్ల దూరం ఉండడం, వైద్య విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడానికి తోడు శనివారంతో ఒప్పంద గడువు కూడా ముగిసింది. ఇటీవల ఇదే అంశంపై సాక్షిలో ‘కాలేజీ..ఏ క్యాజీ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వైద్య విద్యా సంచాలకుల విభాగం స్పందించింది. ఈ మేరకు డాక్టర్ రమాదేవి, డాక్టర్ అనిల్కుమార్, డాక్టర్ నాగేందర్తో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ కర్మన్ఘాట్లోని మరో ఐదు అంతస్తుల భవనాన్ని ఇందుకు అనువైన ప్రదేశంగా గుర్తించింది. అద్దె చెల్లింపులపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తికానుంది. ఆ వేంటనే ప్రస్తుత క్యాంపస్ను ఖాళీ చేసి, కొత్తగా ఎంపిక చేసిన భవనంలోకి మార్చనున్నారు. దీంతో కాలేజీ, అనుబంధ ఆస్పత్రి మధ్య దూరం నాలుగు కిలోమీటర్లకు తగ్గిపోనుంది. ఈ కొత్త భవనంలోనే విద్యార్థులకు వసతి కల్పించే అవకాశం ఉంది. అధిక చెల్లింపులపై నోటీసులు సాధారణంగా గృహ సముదాయ భవనానికి చెల్లించే అద్దైపె ఏటా ఐదు శాతం పెంచుకునే అవకాశం ఉంది. అదే కమర్షియల్ భవనం అద్దెను పది శాతం పెంచుకోవచ్చు. కానీ మహేశ్వరం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏకపక్షంగా ఇప్పటికే 15 శాతం పెంచి, అదనంగా చెల్లిస్తోంది. ఫైనాన్స్ కమిషన్ సహా కలెక్టర్ అనుమతి లేకుండా నిర్దేశిత అద్దెకు మించి చెల్లింపులు చేయడాన్ని ప్రభుత్వ ఫైనాన్స్ విభాగం తప్పుబట్టింది. ఇదే అంశంపై ప్రిన్సిపాల్కు సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. ఒకవైపు అక్రమ చెల్లింపులపై విచారణ కొనసాగుతుండగా, మరోవైపు ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దైపె 20 శాతం అదనంగా చెల్లించాలని భవన యజమాని స్పష్టం చేశారు. బహిరంగ మార్కె ట్లో ఎక్కడా లేని విధంగా అద్దె చెల్లించి.. అసౌకర్యాల మధ్య ఉండటం కంటే.. ప్రస్తుత భవ నాన్ని ఖాళీ చేసి, మరో కొత్త అద్దె భవనంలోకి వెళ్లడమే ఉత్తమమని వైద్యశాఖ భావిస్తోంది. ఈ క్రమంలో భవనం పరిశీలన, ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా కమిటీ కర్మన్ఘాట్లోని ఓ ప్రైవేటు అద్దె భవనాన్ని పరిశీలించింది. అద్దె చెల్లింపులపై భవన యజ మానితో ఒప్పందం కుదరడమే ఆలస్యం తరగతులు సహా వసతి ఇక్కడే లభించనుంది. ‘సాక్షి’ కథనంతో వైద్య విద్యలో కదలిక మహేశ్వరం మెడికల్ కాలేజీ షిఫ్ట్ మరో ఐదు అంతస్తుల అద్దె భవనం పరిశీలన అద్దె చెల్లింపులపై స్పష్టత రాగానే మార్పు 18 నుంచి 4 కిలోమీటర్లకు తగ్గనున్న దూరభారం తీరనున్న వైద్య విద్యార్థులు, అధ్యాపకుల కష్టాలుకొత్తపేటలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) భవన నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. రూ.668 కోట్ల అంచనా వ్యయంతో వెయ్యి పడకల సామర్థ్యంతో 27 అంతస్తులు.. 123 మీటర్ల ఎత్తు సహా 11.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్పత్రికి అంత ఎత్తయిన భవనం అవసరం లేదని భావించింది. ఎత్తును 27 నుంచి 11 అంతస్తులకు తగ్గించింది. ప్లంబింగ్, కరెంట్ లైన్లు, డ్రైనేజీ వ్యవస్థ, డోర్లు, కిటికీలు వంటి ఇంటిరీయర్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరో ఆరు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. నిజానికి మహేశ్వరం మెడికల్ కాలేజీకి మీర్ఖాన్పేటలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వంద ఎకరాలు కేటాయించింది. భవన నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేసింది. వైద్య విద్యకు ఇది ఏమాత్రం అనువైన ప్రాంతం కాదని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. మీర్ఖాన్పేట నుంచి మంగళ్పల్లిలోని ఓ అద్దె భవనంలోకి మార్చింది. ప్రస్తుతం ఆ భవనంతో కుదుర్చుకున్న అద్దె గడువు ఒప్పందం కూడా ముగియడం, తాత్కాలికంగా కర్మన్ఘాట్లోని అద్దె భవనంలోకి మార్చి, ఆ తర్వాత కొత్తగా నిర్మిస్తున్న టిమ్స్లోకి మార్చాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. -
అభివృద్ధిలో నిర్లక్ష్యం సహించం
ఆమనగల్లు: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాలులో శనివారం మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అధికారులు అలసత్వం వీడాలని, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో ముందుకుసాగాలని అన్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రెండు నెలల్లో విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని విద్యుత్ ఏడీఈ బాలకృష్ణకు సూచించారు. సమావేశంలో మార్కెట్చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, ఎంపీడీఓ జయరాంవిజయ్, ప్రత్యేకాధికారి శోభారాణి, డీటీ వినోద్కుమార్, ఎంఈఓ పాండు, సీఐ వెంకటేశ్వర్లు, ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్చౌహాన్, వ్యవసాయాధికారి శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి -
ప్లాట్లను ఆక్రమించే కుట్రను అడ్డుకోండి
పహాడీషరీఫ్ పీఎస్ను ఆశ్రయించిన బాధితులు పహాడీషరీఫ్: జల్పల్లి గ్రామంలోని ఎన్ఆర్ఐ ఫస్ట్ సిటీ వెంచర్లో ఇరవై ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ బాధితులు శనివారం పహాడీషరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. జల్పల్లిలోని సర్వే నంబర్ 70, 85లో ఏర్పాటు చేసిన వెంచర్లో 602 ప్లాట్లను 2006– 07లో కొనుగోలు చేశామన్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు తమ లేఅవుట్ను ఆక్రమిస్తూ దాదాపు 120 ప్లాట్ల చుట్టూ కంచె వేసి, జేసీబీలతో అడ్డుకుంటున్నారన్నారు. ఈ విషయమై ప్లాట్ల యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రదీప్, రాహుల్, సంధ్య, డీఎం రెడ్డి, ఫరూక్లు పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో చట్టరీత్యా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలపై వీహెచ్పీ నేతల మండిపాటు హుడాకాంప్లెక్స్: పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్షాలు స్వామీజీ వేషధారణలో ప్రదర్శించిన స్కిట్ హిందూ ధర్మాన్ని, విశ్వాసాలను, మనోభావాలను కించపరిచే విధంగా ఉందని విశ్వహిందూ పరిషత్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం కొత్తపేటలో నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు చేపట్టిన నిరసన హిందూ సమాజాన్ని అవమానించే విధంగా ఉందన్నారు. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీహెచ్పీ, బీజేపీ నాయకులు సుధాకర్, సుధీర్, రామకృష్ణ, బెంగరబోయిన సురేష్, నవకాంత్, ప్రవీణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
హిందూ చైతన్యమే లక్ష్యం
మీర్పేట: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, సనాతన ధర్మం పట్ల చైతన్యం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని బీజేపీ మహేశ్వరం ఇన్చార్జి అందె శ్రీరాములు యాదవ్ అన్నారు. శనివారం జిల్లెలగూడ శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ ఆవరణలోని ఆంజనేయస్వామికి ఆయన ప్రత్యేక పూజలు చేసి స్థానిక నాయకులు గాజుల మధు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించి, సుమారు 100 ఆటోలకు అతికించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో జాతీయ భావన, సాంస్కృతిక విలువలు, హిందుత్వ చైతన్యం మరింత విస్తరించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి ఆటో ఒక సందేశం, హిందుత్వ చైతన్యమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బీజేపీ కో–ఆపరేటివ్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొలన్ శంకర్రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్రెడ్డి, కీసర గోవర్ధన్రెడ్డి, భిక్షపతిచారి, కరుణానిధి, విజయలక్ష్మీరాజు, చెవ్వ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీరాములుయాదవ్ -
రైలు కిందపడి గుర్తుతెలియని వృద్ధురాలి మృతి
శంకర్పల్లి: రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వృద్ధురాలు(60) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని మృతదేహం పడి ఉంది. గమనించిన లైన్మెన్ వెంటనే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించి, వికారాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలు కదులుతున్న రైలులో నుంచి పడి మృతి చెందినట్లుగా రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మీర్పేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బడంగ్పేటకు చెందిన ఎర్రమల్ల భీమరాజు కుమార్తె శాలిని(17) ఇంటర్మీడియట్ చదువుతోంది. గత నెల 20వ తేదీన శాలిని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం తండ్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాణ్యమైన వైద్యమే ‘అవేర్’ లక్ష్యం
యాచారం: అవేర్ మాధవన్జీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం నందివనపర్తిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అవేర్ గ్రూపు వ్యవస్థాపక చైర్మన్ మాధవన్జీ మెడికల్ క్యాంపును ప్రారంభించగా, గ్రామానికి చెందిన 200 మంది పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకున్నారు. అనంతరం మాధవన్జీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. వైద్యులు ఆషికారెడ్డి, కార్తీక్, చందన్ రోగులకు పరీక్షలు చేశారు. నెదర్లాండ్స్కు చెందిన ప్రఖ్యాత విద్యావేత్త డాక్టర్ బ్రామ్ వాన్ లూవీన్ గౌరవ్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ పి.వరుణ్, మేనేజర్ వెంకన్న, సర్పంచ్ విజయ్కుమార్ పాల్గొన్నారు. -
చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు
కుల్కచర్ల: అదుపు తప్పిన కారు చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. చెల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుల్కచర్లకు కారులో వస్తుండగా ముందు టైరు పేలడంతో రోడ్డు కిందకు వేగంగా దూసుకెళ్లింది. వాహనంలోని ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ వ్యక్తికి క్రెడిట్ కార్డు అప్గ్రేడ్ పేరుతో సందేశం పంపి, ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయించడం ద్వారా రూ.6.26 లక్షలు స్వాహా చేయడంపై సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. సైదాబాద్కు చెందిన ఓ సేల్స్మెన్కు బుధవారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఆర్బీఎల్ బ్యాంక్ రుపే క్రెడిట్ కార్డు విభాగం అధికారిగా పరిచయం చేసుకున్నాడు. బాధితుడి వద్ద ఉన్న ఆర్బీఎల్ వీసా క్రెడిట్ కార్డును ఆర్బీఎల్ రుపే క్రెడిట్ కార్డుగా అప్గ్రేడ్ చేస్తానని చెప్పాడు. దీనికి బాధితుడు అంగీకరించడంతో వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్స్తో కూడిన లింకులు పంపాడు. వాటిని ఇన్స్టాల్ చేయించి బాధితుడి బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు నుంచి రూ.6.26 లక్షలు కాజేశారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మణికొండ: దారిదోపిడీ, ఇళ్లలో దొంగతనాలు, బలవంతపు వసూళ్లు, తీవ్రమైన నేరాలతో పాటు మొత్తం 41 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న షేక్ ఇర్ఫాన్ అహ్మద్ అలియాస్ షూటర్ ఇర్ఫాన్ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 6వ తేదీన రాత్రి 10.30 గంటల సమయంలో నిందితునితో పాటు అతని సహచరులు చేతన్, అల్హాన్ హుస్సేన్, సోహెల్, మహమ్మద్ సమీర్లతో కలిసి పోలీస్ అకాడమీ రోటరీ సమీపంలో పాదచారులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడాలనే పథకం వేశారు. ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న ఇద్దరు బాధితులను బలవంతంగా అపహరించి బ్రాడ్వే హోటల్ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. కత్తులతో బెదిరించి రూ.1050 నగదు, ఆన్లైన్లో రూ. 10వేలు, రెండు పవర్ బ్యాంక్లను దోచుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు గురువారం షూటర్ ఇర్ఫాన్ను పోలీస్స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించారని పోలీసులు తెలిపారు. -
కేంద్ర పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లండి
షాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్గౌడ్ కార్యకర్తలకు సూచించారు. మండల పరిధిలోని కుర్వగూడ, నాగరగూడ, తాళ్లపల్లి గ్రామాల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాని అన్నారు. బీజేపీతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పార్టీ బలమైన శక్తిగా మారిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీశైలం, జిల్లా కార్యదర్శి శ్రీకృష్ణ, మండల అధ్యక్షుడు మద్దూరు మాణెయ్య, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్రెడ్డి, నాయకులు మహేందర్, రాము, హరీష్, కిరణ్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్గౌడ్ -
ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలి
షాద్నగర్: ప్రభుత్వం ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. సెప్టెంబర్ 16న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను శుక్రవారం పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని, వారి త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పాటైందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్, గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని కోరారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గౌరవించుకునేందుకు తెలంగాణ ఉద్యమ కారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, నాయకులు దిలీప్కుమార్, బోరెళ్లి సురేష్, రహీం, జాంగారి రవి, శ్రీనివాస్రెడ్డి, నడికూడ యాదగిరి, ఆర్ల యాదయ్య, మేకల వెంకటేశ్, రాజు, రవికుమార్, బీరప్ప, మల్లేష్, మహేందర్, విశాల తదితరులు పాల్గొన్నారు. -
చివరికి చిక్కారు
చోరీబాట పట్టారు..ఇబ్రహీంపట్నం రూరల్: తాళాలు పగులగొట్టి ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న ఘరానా దొంగను ఆదిభట్ల పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఏసీపీ ప్రదీప్రెడ్డి, సీఐ రమేష్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం జుజువార్ గ్రామానికి చెందిన ముకేష్ చౌదరి (35) హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటూ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. గతంలో యాప్రాల్లో హార్డ్వేర్ దుకాణం నిర్వహించిన అతను చెడు అలవాట్లకు లోనై వ్యాపారంలో నష్టాలు రావడంతో చోరీబాట పట్టాడు. అతనిపై పీడీయాక్ట్ కూడా నమోదైంది. ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 19న జరిగిన చోరీ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు రూ.ఆరు లక్షల విలువైన బంగారం, 30 తులాల వెండి అభరణాలు, మొబైల్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆయా పోలీస్స్టేషన్లలో 17 కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు బైక్ దొంగల అరెస్టు పార్కింగ్ చేసిన బైక్లను దొంగిలిస్తున్న యువకులను ఆదిభట్ల, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నగరానికి చెందిన సయ్యద్ ఖాసీం హుస్సేన్ (18), మహమ్మద్ కరీమ్ (19) బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. నిందితులను శుక్రవారం ఆదిభట్ల, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులను ఛేదించిన ఎస్ఐ నోయల్రాజ్, క్రైమ్టీం ఎల్.రవికుమార్, కిరణ్రెడ్డి, ఎల్లయ్య, ఉపేందర్రెడ్డి, సందీప్, శివచంద్ర, సంతోష్కుమార్, సంతోష్, భరత్కుమార్గౌడ్ను ఏసీపీ అభినందించారు. ఆయా కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్టు బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
బోనమెత్తిన లాల్దర్వాజా
సీపీ సజ్జనర్ శిఖర పూజ, ధ్వజారోహణ చాంద్రాయణగుట్ట: లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ 118వ బోనాల ఉత్సవాలు శుక్రవారం వేద పండితుల మంత్రోచ్చారణలు, డప్పు వాయిద్యాల నడుమ లాంఛనంగా ప్రారంభమయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరై శిఖర పూజ, ధ్వజారోహణ చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దేవాదాయ శాఖ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ (సీఎఫ్వో) శ్రీనివాసరావు, సౌత్ రేంజ్ అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే, చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు లాల్దర్వాజా బోనాల జాతర ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనర్ తెలిపారు. పది రోజుల పాటు వైభవంగా జరిగే బోనాలకు శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 100కు పైగా సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఇతర సాంకేతిక అంశాలతో పర్యవేక్షిస్తామన్నారు. సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా 175 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఈ బస్సులు సికింద్రాబాద్కు రాకపోకలు సాగించనున్నాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. -
సాగు కళకళ
● పొలం బాటలో అన్నదాతలు ● వరినాట్లు వేసేందుకు కరిగెట్లు ● ఆశాజనకంగా పత్తి, మొక్కజొన్న నాలుగు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి అన్నదాతలు పొలం బాట పట్టారు. ఎప్పుడెప్పుడా అని నింగి వైపు చూసిన రైతులను వరుణుడు కరుణించాడు. దీంతో వరి నాటు వేసేందుకు కరిగెట్లు చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న పంటలు కళకళలాడుతున్నాయి. – షాబాద్ నరెడ్లగూడలో పత్తి పంట మల్లారెడ్డిగూడలో కళకళలాడుతున్న మొక్కజొన్న -
ఆవరణం.. అపరిశుభ్రం!
మొయినాబాద్: ‘ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. మురుగు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి.. వీధుల్లో, రోడ్లపై చెత్తాచెదా రం వేయొద్దు.. ఇళ్ల చుట్టూ అపరిశుభ్రంగా ఉన్నా.. రోడ్డు పక్కన చెత్త వేసినా జరిమానా వేస్తాం’ అంటూ సమావేశాల్లో పరిశుభ్రత గురించి చెప్పే అధికారులు.. తమ కార్యాలయాలను మాత్రం పరిశుభ్రంగా పెట్టుకోవడంలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెత్తాచెదారం, గడ్డి, పిచ్చిమొక్కలు పెరిగినా తమకేమీ పట్టనట్లు వదిలేశారు. అన్నీ ఒకే చోట మొయినాబాద్ మండల ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అపరిశుభ్రతకు నెలవుగా మారింది. ఒకే ఆవరణలో మండల పరిషత్, తహసీల్దార్, విద్యావనరుల, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, చేవెళ్ల డీసీపీ కార్యాలయాలతో పాటు మహిళా సమాఖ్య భవనం, రైతు వేదిక, వికలాంగుల సమాఖ్య భవనాలున్నాయి. ఆఫీసుల ముందుభాగంలో కొంత వరకు శుభ్రంగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల మాత్రం గడ్డి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం ఆయా ఆఫీసులకు వస్తున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరద ద్వారా కొట్టుకువచ్చిన మట్టి మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీసీపై పేరుకుపోయి, బురద అంటుకుంటోంది. పిచ్చిమొక్కలకు నెలవుగా ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు మొయినాబాద్లో ఆఫీసుల చుట్టూ చెత్తాచెదారం దోమలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు -
ఫ్యూచర్సిటీతో ప్రపంచస్థాయి గుర్తింపు
యాచారం: ఫ్యూచర్సిటీ నిర్మాణంతో ఈ ప్రాంతానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి అధికారులు, సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు కానీ కావాల్సిన నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మాసిటీలో అక్రమార్కులు, నకిలీలకు ఎట్టి పరిస్థితుల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అర్హులైన, నిజమైన రైతులకు త్వరలో అందజేస్తామని వెల్లడించారు. కుంటలు, వరద కాల్వలు, వర్షపు నీరు పారే దారులను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫాంల్యాండ్స్ పేరుతో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డిని సూచించారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు, మండల ప్రత్యేకాధికారి మాధవరావు, పంచాయతీ రాజ్ శాఖ డీఈఈ శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఏడీ సీతారాం, ఎంపీడీఓ రాధారాణి, తహసీల్దార్ అయ్యప్ప, వివిధ గ్రామాల సర్పంచులు దెంది రాంరెడ్డి, కొలన్ రమాదేవి, నరేందర్రెడ్డి, రమేష్, నీలం ఝాన్సీ, నీలం శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే మండల పర్యటనలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాజ్యలక్ష్మి ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్ వచ్చినట్లు తెలిపారు. కాసేపటికి ఆయన కుదుటపడ్డారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
ఎలానో!
రంగారెడ్డిశనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026ఎల్నినో.. కూరలుసాక్షి, రంగారెడ్డిజిల్లా: ఒకప్పుడు టన్నుల కొద్ది కూరగాయలు అందించి నగరవాసుల అవసరాలు తీర్చిన ఉమ్మడి జిల్లా రైతులు నేడు సాధారణ పచ్చిమిర్చి కోసం పక్కచూపులు చూడాల్సి వస్తోంది. రియల్ ఎస్టేట్ కారణంగా ఇప్పటికే సాగువిస్తీర్ణం భారీగా పడిపోయింది. తాజాగా దీనికి ఎల్నినో తోడైంది. డిమాండ్ మేరకు సాగు, దిగుబడి లేకపోవడంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు రూ.1, రూ.2కే లభించిన కొత్తిమీర, పుదీన కట్టలు.. ప్రస్తుతం కనీసం రూ.10 చెల్లిస్తే కానీ చేతికి అందడం లేదు. ఒక్క ఆకుకూరలే కాదు ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ.60పైగా వెచ్చించాల్సి వస్తోంది. ఇక పూలు, పండ్ల ధరలకై తే అంతే లేదు. బహిరంగ మార్కెట్లో చామంతి, గులాబీ ఇలా దేని ధర చూసినా కేజీ రూ.400పైగా పలుకుతోంది. 800 మెట్రిక్ టన్నుల లోటు నగరంలో గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, మాదన్నపేట్, ఎల్బీనగర్ హోల్సేల్ కూరగాయల మార్కెట్లు ఉన్నాయి. వీటితో పాటు ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సనత్నగర్, సరూర్నగర్, ఫలక్నుమా, కూకట్పల్లి, మేడ్చల్ రైతుబజార్లు ఉన్నాయి. నగరవాసుల అవసరాలు తీరాలంటే రోజుకు కనీసం 3,500 మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుమతి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయా మార్కెట్లకు 2,800 మెట్రిక్ టన్నులకు మించి సరఫరా కావడం లేదు. స్థానికంగా ఆశించిన స్థాయిలో పంటసాగు విస్తీర్ణం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కర్ణాటక నుంచి మిర్చి, క్యాలీఫ్లవర్, బీన్స్ వంటి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఆగ్రా నుంచి ఆలుగడ్డ వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, మహబూబ్నగర్, కర్నూలు జిల్లాల నుంచి ఉల్లిని తెప్పించుకోవాల్సి వస్తోంది. సరఫరాకు, డిమాండ్కు మధ్య భారీ వ్యత్యాసం నమోదవుతుండటంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు రోజుకు అరకేజీ కూరలు వాడిన వారు భారీగా పెరిగిన ధరలతో ప్రస్తుతం పావు కేజీతో సరిపెట్టుకుంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూల సాగుపై ప్రభావం ఆశించిన స్థాయిలో నమోదు కాని పంటలు సరఫరాకు, డిమాండ్కు మధ్య భారీ వ్యత్యాసం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వైనం ఎల్నినో.. కేవలం వరి, పత్తి పంటలపైనే కాదు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూల సాగుపైనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, బోరుబావుల్లోని మోటార్లు ఆగిపోవడంతో ఉమ్మడిజిల్లాలో ఆయా పంటల సాగు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
షాబాద్: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన నాగరగూడ ఎక్స్ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగరగూడ ఎక్స్ రోడ్డు వద్ద షాద్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును శంషాబాద్ వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారికి నాగరగూడ శ్రీనివాస ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన నామ మమత, శంషాబాద్ మండలం సుల్తాన్పల్లికి చెందిన శిరీష, మరో ఇద్దరు ఉన్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట చేవెళ్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మధుసూదన్గుప్తా ఉన్నారు. నలుగురికి తీవ్ర గాయాలు -
నేటినుంచి తల్లిపాల వారోత్సవాలు
జిల్లా సంక్షేమాధికారి శాంతిశ్రీఇబ్రహీంపట్నం రూరల్: తల్లిపాల వారోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా సంక్షేమాధికారి శాంతిశ్రీ శుక్రవారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా మండల, గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యత, రోగ నిరోధక శక్తి, ఆరోగ్యకరమైన ఎదుగుదల, దీర్ఘకాలిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం ద్వారా నవజాత శిశు మరణాలు తగ్గించవచ్చన్నారు. దీనిపై సామాజిక, కుటుంబ భాగస్వామ్యంపై అవగాహన కల్పించాలని కోరారు. మొయినాబాద్: భాస్కర మెడికల్ కళాశాలపై విచారణ చేపట్టాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ)ను ఆదేశించింది. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రెవెన్యూలో ఉన్న భాస్కర మెడికల్ కళాశాలలో ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం పెరిగిన ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సౌకర్యాలు, ఆస్పత్రి వసతులు లేవని.. విద్యార్థులకు ఇచ్చే స్టయిఫండ్ వివరాలను బహిర్గతం చేయడంలేదని ఇటీవల ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకుడు దేవరాల రాజేష్ యాదవ్ ఎన్ఎంసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్ఎంసీ కళాశాలలో సంబంధిత అంశాలపై సమగ్ర విచారణ జరిపి, తీసుకున్న చర్యల నివేదికను వారం రోజుల్లోగా పంపాలని డీఎంఈకి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాజేష్ యాదవ్ మాట్లాడుతూ.. కళాశాలలోని సదుపాయాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమనగల్లు: మండలంలోని ఆకుతోటపల్లిలో ఏర్పాటయ్యే క్వారీ, స్టోన్ క్రషర్ స్థలాన్ని శుక్రవారం వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. గ్రామంలోని సర్వే నంబర్ 302,304లో క్రషర్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఇటీవల కలెక్టర్కు వినతిపత్రం అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలాన్ని జిల్లా మైనింగ్ అధికారి ఇందిర, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూశాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా క్రషర్ ఏర్పాటు వద్దని గ్రామస్తులు విన్నవించారు. క్రషర్ ఏర్పాటుతో దుమ్ము, ధూళితో సమీపంలో ఉన్న పొలాలు, పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని వివరించారు. నివేదికను కలెక్టర్కు అందిస్తామని అధికారులు తెలిపారు. మొయినాబాద్రూరల్: కురుస్తున్న వర్షాలతో ఈసీ వాగు వరద నీటితో ప్రవహిస్తోంది. రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతమైన వికారాబాద్, పరిగి ఆయా ప్రాంతాల నుంచి మొదలైన ఈసీవాగు శుక్రవారం ఉదయం వరద నీటితో ప్రవహిస్తోంది. హిమాయత్సాగర్లోకి నీరు చేరుతోంది. కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు ఈసీ వాగు పారుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
‘పట్నం’ కుటుంబానికి పరామర్శ
షాబాద్: శాసన మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్రెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌర్ పరామర్శించారు. మహేందర్రెడ్డి తల్లి పట్నం రుక్కమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేనరెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే రమేశ్మహరాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధూసూదన్రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, పామెన భీంభరత్, కాలె శ్రీకాంత్, పెంటారెడ్డి, సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


