Rangareddy
-
నేడు చేగూరుకు హరీశ్రావు రాక
కొత్తూరు: నందిగామ మండలం చేగూరులో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయ పూజా కార్యక్రమానికి బుధవారం మాజీ మంత్రి హరీశ్రావు హాజరుకానున్నారు. ఈ మేరకు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హరీశ్రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉదయం 9.30 గంటలకు తిమ్మాపూర్ వద్ద ఏర్పాటు చేసే స్వాగత కార్యక్రమంలో పాల్గొని విజయంతం చేయాలని ఆయన కోరారు. కొందుర్గు: ప్రస్తుత సమాజంలో హిందూ సంస్కృతి, సంప్రదాయాలు సన్నగిల్లుతున్నాయని, కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అంబాత్రేయ పీఠాధిపతి ఆధిత్య పరాస్వామి అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లేడ్ చౌదరిగూడ మండలం లాల్పహాడ్ వేదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ, గురు నిలయం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేదగిరి గుట్ట గిరి ప్రదక్షిణ చేస్తే తనకు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసిన అనుభూతి కలిగిందన్నారు. వేదగిరిగుట్ట అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వేదగిరి వ్యవస్థాపకుడు మర్రి కృష్ణారెడ్డి, సర్పంచ్ రామచంద్రయ్య, నాయకులు కృష్ణా రెడ్డి, అందె బాబయ్య, శ్రీవర్దన్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, రాజు, కుర్మయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా ఊటు యశ్వంత్ ఎన్నికయ్యారు. రాష్ట్ర టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి హుస్సేన్ ఆదేశాల మేరకు మంగళవారం నాంపల్లి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర టీఎన్జీ కేంద్ర సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ ముత్యాల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా యశ్వంత్, అసోసియేట్ ప్రెసిడెంట్గా మాధవ్గౌడ్ (హెచ్డబ్ల్యూఓ), వైస్ ప్రెసిడెంట్ రంగయ్య (అగ్రికల్చర్), అంజాద్ అలీ (వైద్య), రాజశేఖర్ (రెవెన్యూ), వాణి (ప్రణాళిక), కార్యదర్శి శ్రీనివాస్రావు (మెడికల్), జాయింట్ సెక్రట్రీలుగా శ్రీనివాస్, గాయత్రి, కార్తీక్, అమృత, ట్రెజరరీ ఆనంద్సింగ్ (రెవెన్యూ), ఆర్గనైజింగ్ కార్యదర్శి గంగాధర్, పబ్లిక్ సెక్రట్రీ శివకుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా మల్లేష్గౌడ్, నసీరుద్దీన్, వెంకట్రెడ్డి, విజిత శేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న యశ్వంత్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. షాద్నగర్రూరల్: బీసీ జనసేన రాష్ట్ర అధ్యక్షుడిగా పసుపుల ప్రశాంత్ నియమితులయ్యారు. పట్టణంలోని కార్యాలయంలో బీసీ జనసేన జాతీయ అధ్యక్షుడు కత్తి చంద్రశేఖరప్ప ఆధ్వర్యంలో మంగళవారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్కు నియామక పత్రం అందజేశారు. అనంతరం ప్రశాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలందరినీ ఏకంచేసి బీసీ జనసేనను ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ జనసేన నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జక్కుల జలజ, పట్టణ అధ్యక్షురాలు కాటం రాజ్యలక్ష్మి గౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్, నాయకులు సత్యం, రాములు, వెంకటయ్య, సాయి, తరుణ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి కనిపించడం లేదని..
మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య మీర్పేట: గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిన తండ్రి తిరిగి రాలేదన్న మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కేశంపేటకు చెందిన బుయ్యకారి చంద్రశేఖర్రావు (26) ప్రైవేటు ఉద్యోగి. గత నెల 24న తన తండ్రి రవీందర్తో గొడవ జరిగింది. మరుసటి రోజు తండ్రి యథావిధిగా విధులకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కేశంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తండ్రిని వెతికేందుకు ఈ నెల 3న నగరానికి వచ్చాడు. మధ్యలో తల్లికి ఫోన్ చేసి ఇంటికి వచ్చాడా లేదా అన్న సమాచారం అడిగి తెలుసుకునేవాడు. ఈ నెల 11న చంద్రశేఖర్రావు బడంగ్పేటలోని దుర్గా వైన్స్ సమీపంలో పెట్రోల్ పోసుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి శోభారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పహాడీషరీఫ్: బాలుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రంగ నాయకుల కాలనీకి చెందిన శివ కుమారుడు రాకేష్(24) ఈ నెల 11న మధ్యాహ్నం తల్లి ఎల్లమ్మ డ్యూటీకి వెళ్లే సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. రాత్రి వచ్చి చూడగా కనిపించలేదు. అతని ఆచూకీ కోసం స్థానికంగా వాకబు చేయగా తుక్కుగూడ వైపు ఆటోలో వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై తల్లి మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జాడ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గానీ, 87126 62367 నంబర్లోగానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. షాబాద్: రెండు దుకాణాల్లో చోరీ జరిగి రూ.లక్ష వరకు నష్టం జరిగింది. ఈ సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్లోని రెండు పాన్షాపుల్లో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు పగులగొట్టి కౌంటర్లలో ఉన్న నగదుతోపాటు, వస్తువులన్నీ తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుల్కచర్ల: బెంగళూరులో జరిగిన చోరీ సొత్తును మండల కేంద్రమైన కుల్కచర్లలో రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుల్కచర్లలో బుడ్డరాం, సురేష్, కై లాస్ నగల దుకాణం నిర్వహిస్తున్నారు. సురేష్, కై లాస్ రాజస్థాన్కు చెందిన మరో ముగ్గురు బెంగళూరు కమిషనరేట్ పరిధిలోని బెలున్ఘట్ ప్రాంతంలో ఏప్రిల్ 27న ఓ నగల దుకాణంలో 70కిలోల వెండిని చోరీ చేశారు. అక్కడి పోలీసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వారు కుల్కచర్లకు చెందిన సురేష్ను అదుపులోకి తీసుకొని విచారించారు. చోరీ చేసిన వెండిని కుల్కచర్లలోని కేసరియా జ్యువెలర్స్, బుడ్డరాం ఇంటిలో స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో 4 కిలోల 600 గ్రాములు, దుకాణంలో మరో 6కిలోలు లభ్యమైంది. -
భీమయ్య బాట.. రక్షణ కోట
మోమిన్పేట: హెల్మెట్ ధరించకుండా బైకులు నడుపుతూ ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న, గాయాలపాలవుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ చాలా మంది హెల్మెట్ వినియోగాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ మండల పరిధిలోని అంరాధికలాన్కు చెందిన చాకలి భీమయ్య ఎక్కడికై నా సైకిల్పై వెళ్తూ విధిగా హెల్మెట్ ధరిస్తున్నారు. సైకిల్కు హెల్మెట్ తప్పనిసరి కాదు కదా అని అడగగా.. నా సైకిల్పై నేను నిదానంగా వెళ్తున్నా.. ఎదుటివారు అడ్డదిడ్డంగా వచ్చి ఢీకొడితే హెల్మెట్ కాపాడుతుందని బదులిచ్చారు. ద్విచక్ర వాహనదారులు ఇతన్ని స్ఫూర్తిగా తీసుకుంటే ప్రమాదాల్లో ప్రాణనష్ట తీవ్రతను తగ్గించవచ్చు. -
ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి
రెండు బైకులు ఢీ అతివేగంతో వచ్చిన బైక్ మరో బైక్ను ఢీకొట్టడంతో జేసీబీ డ్రైవర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం రూరల్: ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిరిసిల్ల రాజయ్య, సభ్యులకు అదనపు కలెక్టర్ కిరణ్మయి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. నగర పాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా, వీధి దీపాలు, తడి, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు సక్రమంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. సదస్సులో ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, ఎస్.సుధీర్ రెడ్డి, దక్షిణ జిల్లాల అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, ఫణీంద్రరెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, డీపీఓలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, పంచాయతీ సెక్రట్రీలు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య -
మట్టి అక్రమ రవాణాపై పోలీసుల దాడులు
● మూడు టిప్పర్లు స్వాధీనం ● అడ్డుకున్న వారిపై కేసు నమోదు కేశంపేట: అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. టిప్పర్లతో పాటు పోలీస్ విధులకు ఆటంకం కల్పించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంగెం గ్రామ శివారులో సోమవారం రాత్రి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. మూడు టిప్పర్లు మట్టిని తరలిస్తున్నట్టు గుర్తించి వాటిని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. మార్గమాధ్యలో నందిగామ మండల పరిధిలోని సంఘీగూడ గ్రామానికి చెందిన టిప్పర్ యజమానితో పాటు అతడి స్నేహితుడు చంద్రయ్య, సురేష్ వేములనర్వ గ్రామ శివారులో టిప్పర్లను అడ్డుకున్నారు. పోలీసులు అక్కడి నుంచి టిప్పర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. టిప్పర్ డ్రైవర్లు శ్యామ్కుమార్ సాహు, అమరేందర్ కుమార్, అజయ్కుమార్ యాదవ్తో పాటు విధులకు ఆటంకం కలిగించిన చంద్రయ్య, సురేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ నరహరి తెలిపారు. -
పీఐసీ చైర్మన్కు ఘన సన్మానం
తుర్కయంజాల్: రైతు సేవా సహకార సంఘం పీఐసీ చైర్మన్గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన కొత్తకుర్మ సత్తయ్య, డైరెక్టర్ వంగేటి లక్ష్మారెడ్డిని మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ నాయకులు ఘనంగా సన్మానించారు. రైతులకు మొరుగైన సేవలు అందించాలని, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగ్ విష్ణువర్ధన్ రావు, ఉపాధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కారింగుల నరేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క జంగయ్య గౌడ్, బీజేపీ నాయకులు బచ్చిగళ్ల రమేష్, తూళ్ల నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
డబ్బులకోసం ప్రాణం తీశాడు
● హత్య కేసును ఛేదించిన పోలీసులు ● ఇద్దరు నిందితులకు రిమాండ్ షాద్నగర్రూరల్: రెండు రోజుల క్రితం జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను మంగళవారం డీసీపీ శిరీష వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం పోమాల్ గ్రామానికి చెందిన పల్లెకేశవులు, పద్మ దంపతులు షాబాద్ మండలం సర్దార్నగర్లోని శ్రీనివాసరావుకు చెందిన ఫాంహౌస్లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. సొంత ఊరిలో పొలానికి సంబంధించిన కేసును మాట్లాడేందుకు ఈ నెల 9న పల్లెకేశవులు యజమాని వద్ద రూ.50వేలు తీసుకొని పరిగి వెళ్లి కేసు విషయంలో రూ.40 వేలు ఇచ్చి తిరిగి రాత్రికి షాద్నగర్ బస్టాండ్కు చేరుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా గంజిపేటకు చెందిన పుల్లగోయి బజారన్న కొంతకాలం క్రితం పట్టణానికి వచ్చి కూలీ పనులు చేస్తూ పరమేశ్వర థియేటర్ సమీపంలో నివసిస్తున్నాడు. కేశవులు బస్టాండ్ ఎదురుగా ఉన్న వైన్స్ పర్మిట్ రూంలో మద్యం తాగేందుకు వెళ్లాడు. అక్కడే ఉన్న బజారన్న పరిచయమయ్యాడు. ఇద్దరు బయటకు వస్తున్న సమయంలో ఓ మహిళ మద్యం తీసుకునేందుకు వైన్స్ షాపు వద్దకు వచ్చింది. ఆమెతో గడిపేందుకు తీసుకురావాలని బజారన్నకు జేబులో నుంచి డబ్బుల తీసి ఇవ్వడానికి ప్రయత్నించాడు. కేశవులు వద్ద ఎక్కువ డబ్బులు ఉన్నాయనే విషయాన్ని గమనించిన అతను మహిళతో కలిసి ఎలాగైనా వాటిని కాజేయాలనుకున్నాడు. తన బైక్పై కేశవులు, మహిళను ఎక్కించుకొని పట్టణ సమీపంలోని వెంచర్లోకి తీసుకెళ్లాడు. కేశవులు వద్ద ఉన్న డబ్బును లాక్కునేందుకు ప్రయత్నించాడు. అతను ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న రాయితో ముఖం, తలపై బలంగా కొట్టడంతో అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి వద్ద ఉన్న రూ.7,500 తీసుకొని ఇద్దరూ పరారయ్యారు. బజారన్న సొంత గ్రామానికి వెళ్లి రెండు రోజుల తరువాత తన గదిలోని సామాను తీసుకెళ్లేందుకు పట్టణానికి వచ్చాడు. అనుమానాస్పదంగా కనిపించిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. మరో నిందితురాలిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3,900 నగదు, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
పొడుపు కథ.. మెదడుకు మేత
చిన్నారులను ఉత్సాహపర్చే ప్రశ్నలు ●ఆలోచనా శక్తిని పెంచే జవాబులు ●సరదాతో పాటు విజ్ఞానాన్ని పంచే పొడుపు కథలు నోరులేదు కాని మాట్లాడగలను, పాడగలను నాపేరు చెప్పుకోండి చూద్దాం? జవాబు: రేడియో – దైవిక్, పరిగి ఎప్పుడు చూసినా ఒక్కకాలు మీదే నిలబడి ఉంటుంది, ఏమిటది? జవాబు: గొడుగు – వి.మమత, పరిగి రెక్కలు, తోక ఉన్నా.. పక్షిని కాను, ఆకాశంలో ఎగురుతాను కానీ విమానం కాను, మరి నేనెవరిని ? జవాబు: గాలిపటం – మాన్విత కిటకిట తలుపుల కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు కావు? జవాబు: కంటి రెప్పలు – శివకుమార్ కందనెల్లి ●అమ్మానాన్నకు ఆసరాగా.. దుద్యాల్: వేసవి సెలవుల వేళగ్రామీణ విద్యార్థులు తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. స్నేహితులతో కలిసి ఆడిపాడుతూనే.. అమ్మానాన్నలకు ఆసరాగా ఉంటున్నారు. కొడంగల్ సమీపంలోని గంధంబావితండా వద్ద ధాన్యం ఆరబోస్తున్న తల్లిదండ్రులకు సాయం చేస్తున్న బాలుడిని సాక్షి తన కెమెరాలో బంధించింది. బొంరాస్పేట: ‘పొదుపు కథలనెవరు పొందుగా పఠియించి విప్పిచెప్పుకున్న విమలమైన బుద్ధి వృద్ధియౌను భూలోక జనులందు కలుగు చురుకు ధనము గలుగు శుభము!’ అంటూ సాహితీకారులు పొదుపుకథల ప్రాముఖ్యతను గొప్పగా చాటుతూనే ఉన్నారు. ఇవి చిన్నారుల ఆలోచనా శక్తికి పదును పెడుతాయి. వింతగా, వినోదంగా ఉంటూ చిన్నారులకు గిలిగింతలు పెట్టిస్తాయి. వినోదం, వికాసంతో పాటు లోకజ్ఞానం, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పరోక్షంగా ప్రశ్నలు వేస్తూ చిన్నారులకు నాయనమ్మలు చెప్పేకథలు, తాతయ్యలు విప్పి చెప్పే కల్పిత కథలు ఎంతో ఆనందాన్నిస్తూ నిద్రొచ్చే వరకూ జోకొడుతుంటాయి. కాగా మన నిత్యజీవితంలో చుట్టూ ఉండే అన్ని రకాల అంశాలపై పరోక్షంగా ప్రశ్నలు వేస్తూ విషయావగాహన కల్పించేవే పొడుపు కథలు. ప్రశ్నోత్తరాలతో కూడిఉండి చిన్నారుల్లో తెలుసుకోవాలనే జిజ్ఞాసను కల్పిస్తాయి. ప్రశ్నల్లో ఉండే మర్మము తెలిస్తేనే జవాబును పట్టేస్తారు. ఇలాంటి పొడుపు కథలు తెలగు భాష పరిరక్షణకు సైతం పాటుపడుతాయని సాహితీవేత్తలు చెబుతున్నారు. సెలవుల వేళ పిల్లల్లో వీటిపై ఉన్న ఆసక్తిని చూపించే క్రమంలో ‘సాక్షి’ చేస్తున్న చిరు ప్రయత్నం ఇది.. పొడుపు శతకం బొంరాస్పేట మండల పరిధిలోని వడిచర్లకు చెందిన కవి, తెలుగు ఉపాధ్యాయుడు వడిచర్ల సత్యం రచించిన ‘విప్పిచెప్పుబాల’ అనే 116 పొడుపు కథల పుస్తకం జిల్లా విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంటోంది. సర్వశిక్షా అభియాన్లో భాగంగా ప్రభుత్వం ఈ పుస్తకాన్ని ముద్రించింది. ఇందులోని 116 పొడుపు కథలు పాఠశాల విద్య చదువుతున్న బాలబాలికల నోళ్లలో నానుతుంటాయి. ‘జతను వీడిపోరు జగడమాడరువారు అందమంతయేరి ఆరగించి కలిసి మెలిసిఉన్న కనరొకరినొకరు విప్పిచెప్పు బాల వినయశీల!’అంటూ.. ‘రెండు కళ్లు’ గురించి చెప్పిన పొడుపు కథలతోపాటు నమస్కారం, శుభాకాంక్షలు, మంగళసూత్రం, కుంకుమబొట్టు, పక్షులు, జంతువులు, క్రిములు, లోహాలు, యంత్రాలు, ఇంట్లోవాడే వస్తువులు, కూరగాయలు, పండ్లు, సెల్ఫోన్, గడియారం, రేడియో, కంప్యూటర్, అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలు వంటి అనేకరకాల పొడుపుకథల పుస్తకం ప్రతి సర్కారుబడి, అంగన్వాడీల్లో దర్శనమిస్తున్నాయి. ●చెట్టు నీడన క్రికెట్టు! మంచాల: ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక, ఎండ వేడిమికి ఆరు బయట ఆడుకోలేక అవస్థలు పడుతున్న చిన్నారులు.. చల్లని చెట్ల నీడలను ఆశ్రయిస్తున్నారు. మంగళవారం నోముల గ్రామంలో చెట్ల కింద క్రికెట్ ఆడుతున్న పిల్లలను సాక్షి కెమెరా క్లిక్మనిపించింది. తెల్లటిపొలంలో నల్లటి విత్తనాలు? జవాబు: పుస్తకంలోని అక్షరాలు – సుశాంత్, దిర్సంపల్లితండా -
‘ఇందిరమ్మ’ నిబంధనలు సడలించాలి
● మంత్రులను కోరిన ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ● నగరంలో ఉమ్మడి జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో సమావేశం తాండూరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉన్న నిబంధనలను సడలించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి కోరారు. మంగళవారం నగరంలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, స్పీకర్ ప్రసాద్కుమార్, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లపై చర్చించారు. తాండూరు పట్టణ శివారులో అసంపూర్తిగా ఉన్న డబుల్ ఇళ్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. స్పందించిన మంత్రి ఈ నెల 25న తాండూరుకు వస్తానని, అప్పటిలోగా సీసీ రోడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బషీరాబాద్ మండలంలో నీళ్లపట్టి – మైల్వార్ అటవీ ప్రాంతంలో ఆక్రమణకు గురైన వందలాది ఎకరాల భూములను కర్ణాటక వాసుల చెర నుంచి విముక్తి కల్పించాలని కోరారు. స్పందించిన వారు సర్వే చేసి నివేదిక అందజేయాలని డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. -
ప్రయాణికుల సమస్యలు పరిష్కరిస్తాం
షాద్నగర్రూరల్: ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని డీఎం ఉష అన్నారు. మంగళవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎంకు పలువురు ప్రయాణికులు ఫోన్ చేసి సమస్యలు ఆమె దృష్టికి తెచ్చారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన డీఎం ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం షాద్నగర్ డిపోకు చెందిన రెండు డీలక్స్ బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. హైదరాబాద్–ఆత్మకూరు, హైదరాబాద్–జూరాల డీలక్స్ బస్సుల అప్ అండ్ డౌన్ కోసం ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవచ్చని సూచించారు. డయల్ యువర్ డీఎంలో షాద్నగర్ డీఎం ఉష -
హోంగార్డ్ బలవన్మరణం
దోమ: ఇంటి స్థలం (ప్లాట్) విషయంలో జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన ఓ హోంగార్డ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. మండల పరిధిలోని బాస్పల్లికి చెందిన తలారి వెంకటయ్య(47) వికారా బాద్ ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామంలోని తమ ఇంటి వెనక ఉన్న అరవై గజాల స్థలాన్ని వెంకటయ్య తండ్రి నలభై ఏళ్ల క్రితం ఇదే ఊరికి చెందిన కుందేళ్ల చంద్రయ్య వద్ద కొనుగోలు చేశాడు. ఇప్పటివరకు సదరు స్థలానికి ఫెన్సింగ్ వేయలేదు. ఇటీవల వెంకటయ్య కడీలు పాతుతుండగా చంద్రయ్య మనమడు మల్లేశ్ అడ్డుకున్నాడు. స్థలం తమదేనని గొడవపడటంతో పాటు కడీలను ధ్వంసం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటయ్య పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అనంతయ్య పోలీసులకు సమాచారం అందించగా, మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య విజయలక్ష్మి, ముగ్గురు కూతుళ్లు ఉండగా, పెద్ద కూతురు అశ్విని వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు వైష్ణవి, అక్షిత ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మల్లేశ్పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వసంత్జాదవ్ తెలిపారు. -
మాటామాటా పెరిగింది
● మర్డర్కు దారి తీసింది ● యువకుడి హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ పహాడీషరీఫ్: యువకుడి హత్య కేసులో ముగ్గురు నిందితులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్తో కలిసి వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆదిత్ పాండే (24) కుర్మల్ గూడలో నివాసం ఉంటూ వాహనాల రికవరీ ఏజెంట్గా పని చేస్తున్నాడు. ఆ రాష్ట్రానికే చెందిన మున్నా అలియాస్ సయ్యద్ ఇఫ్తేకార్ (25) కూడా ఇదే వృత్తి కొనసాగిస్తున్నాడు. ఒకే ప్రాంతంలో ఇద్దరం పని చేయకూడదంటూ ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు నెలకొన్నాయి. శనివారం అర్ధరాత్రి అనంతరం మాట్లాడుకుందామంటూ మున్నా తన అనుచరులు మహ్మద్ సాహిల్ (20), అబ్దుల్లా బిన్ ఆమెర్ (20)తో కలిసి పాండేను పిలిచి మద్యం మత్తులో ఉస్మాన్నగర్కు రప్పించాడు. అక్కడ మాటామాటా పెరిగి పాండేను గ్రానైట్ రాళ్లు, ఇనుప రాడ్తో హత్య చేశారు. నిందితుల నుంచి సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. -
నేర్చుకుందాం రా..!
● సమ్మర్ క్యాంపుల వైపు చిన్నారుల చూపు ● ఆసక్తి ఉన్న కళలను నేర్చుకునేందుకు పరుగులు సమ్మర్ క్యాంప్లతో నైపుణ్యాలకు మెరుగు చేవెళ్ల: వేసవి శిక్షణ శిబిరాలతో విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి అన్నారు. ఎంఈఓ పురందాస్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి సోమవారం మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు శిబిరాలు చక్కటి వేదిక అన్నారు. ఇందులో చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, యోగా కరాటే, కంప్యూటర్ శిక్షణ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైన్స్, క్విజ్ తదితర అంశాలపై తర్ఫీదునిస్తారన్నారు. ఎంఈఓ మాట్లాడుతూ.. మండలంలోని 6నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చిన్నపురెడ్డి, కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు. యుద్ధ విద్యలో శిక్షణ పొందుతున్న చిన్నారులు ● కరాటే, కుంగ్ఫూపై ఆసక్తి షాద్నగర్: శరీరాన్ని విల్లులా వంచుతూ.. మెరుపు వేగంతో కదులుతూ.. ప్రత్యర్థుల నుంచి రక్షణ పొందేందుకు బాలబాలికలు యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారు. ప్రత్యేకమైన డ్రస్ ధరించి, నడుముకు బెల్టులు కట్టుకొని, తాము నేర్చుకున్న కళల్ని ప్రదర్శిస్తూ అబ్బురపరుస్తున్నారు. కరాటే, కుంగ్ఫూలో శిక్షణ పొందుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా తరగతులకు పంపిస్తున్నారు. పట్టణానికి చెందిన కరాటే మాస్టర్ ఎత్తిన చెన్నయ్య, మాస్టర్ శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాఠశాలలు, వివిధ కాలనీల్లోని మైదానాల్లో చిన్నారులకు యుద్ధ విద్యలు నేర్పిస్తున్నారు. శిక్షణ ఇలా.. కరాటే, కుంగ్ఫూ నేర్చుకునే ఆసక్తి ఉన్న చిన్నారులకు మొదట కొద్ది రోజుల పాటు సాధారణ వ్యాయాలు నేర్పిస్తారు. క్రమక్రమంగా కరాటే, కుంగ్ఫూలో బేసిక్స్ చెబుతారు, ఆతర్వాత యుద్ధ విద్యలో మెలకువలు నేర్పిస్తారు. ప్రత్యర్థులు దాడికి వస్తే ఎలా అడ్డుకోవాలి.. ఇందుకు ఎలాంటి టెక్నిక్స్ వాడాలన్న విషయాలపై ట్రైనింగ్ ఇస్తారు. ప్రత్యర్థుల కదలికలను గమనించడం, వారు దాడి చేసే విధాన్ని పసిగట్టి, డిఫెన్స్ చేయడం వంటి అంశాలపై తర్ఫీదునిస్తారు. వివిధ రకాల మూవ్మెంట్స్ యుద్ధ విద్యల్లో ప్రత్యర్థుల దాడిని దీటుగా ఎదుర్కోవడంలో అనేక మూవ్మెంట్లను నేర్పిస్తారు. ఇందులో ఈగల్ మూవ్మెంట్, టైగర్, స్నేక్, మంకీ, వంటి ఎనిమిది కటాస్ విభాగాలున్నాయి. అలాగే ఆయుధాలైన నాన్చాక్, తల్వార్, స్టిక్స్ వంటివి వినియోగించడంలో శిక్షణ ఇస్తున్నారు. ప్రతిభ ఆధారంగా బెల్టులు కుంగ్ఫూ నేర్చుకుంటున్న విద్యార్ధులకు ఒక్కో దశలో ఒక్కో బెల్డులను అందజేస్తారు. వారి ప్రతిభ ఆధారంగా బెల్టులు ప్రదానం చేసి ప్రోత్సహిస్తారు. ఇందులో ఎల్లో, ఆరేంజ్, గ్రీన్, బ్లూ, బ్రౌన్లో మూడు రకాలు, చివరగా బ్లాక్ బెల్టు ఉంటుంది. బ్లాక్ బెల్టులు సాధించిన వారు మాస్టర్లుగా తయారై శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎత్తుకు పైఎత్తు బొంరాస్పేట: పిల్లల మేధోసంపత్తికి ఉపయోగపడే క్రీడల్లో చదరంగం ఒకటి. ప్రత్యర్థి ఎత్తులను చిత్తుచేస్తూ ఎత్తుకు పైఎత్తు వేస్తూ సాగే ఈక్రీడ వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంచుతుంది. ఎండలు మండుతున్న వేళ ఇంట్లోనే కూర్చుని ఆడుకునే వెసులుబాటున్న ఆట చదరంగం. బొంరాస్పేటలో చెస్ ఆడుతున్న చిన్నారులు యశ్వంత్, దైవిక్, రేవంత్, మన్విత్ను సాక్షి కెమెరా క్లిక్మనిపించింది. సందడే.. సందడి!తాండూరు టౌన్: సెలవుల వేళ పట్టణంలోని చిన్నారులు సమ్మర్ క్యాంపుల వైపు మొగ్గు చూపుతున్నారు. సెయింట్ మార్క్స్ పాఠశాల ఆవరణలో సహారా క్రికెట్ అకాడమీ కోచ్ జగన్నాథ్రెడ్డి, సతీష్, శరత్సింగ్ క్రికెట్ కోచింగ్ ఇస్తున్నారు. స్థానిక శివం గ్రామర్ స్కూల్ మైదానంలో మాస్టర్ మనోహర్, కుషాల్ ఆధ్వర్యంలో బాలబాలికలకు తైక్వాండో నేర్పిస్తున్నారు. తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఎస్ఎస్ డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో మాస్టర్లు రమేష్, హన్మంతు చిన్నారుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా శిబిరాలు విద్యార్థులతో సందడిగా కనిపిస్తున్నాయి. హైస్కూల్లో సమ్మర్ క్యాంప్ బడంగ్పేట్: సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని బడంగ్పేట్ సర్కిల్– 16 డీసీ సమ్మయ్య విద్యార్థులకు సూచించారు. స్థానిక పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ క్యాంప్లో కరాటే, యోగా, మ్యాఽథ్స్, ఫిజిక్స్ చిట్కాలు, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాప్ట్, ధ్యానం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు. టెన్త్లో ఫెయిలైన వారికి సంబంధిత సబ్జెక్టులు బోధిస్తారని స్పష్టంచేశారు. శిబిరానికి వచ్చే వారికి స్నాక్స్, భోజన సదుపాయం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ, హెచ్ఎం సుజాత, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ దేవి, ఉపాధ్యాయులు స్వామి, ప్రతాప్రెడ్డి, రాజశేఖర్, సురేందర్రెడ్డి, పరమేష, సంతోష, వనజ తదితరులు ఉన్నారు. ఆత్మరక్షణకు.. ఆత్మరక్షణకు యుద్ధ ఎంతో ఉపయోగపడతాయి. విద్యార్ధులకు చదువు ఎంత ముఖ్యమో కళలు కూడా అంతే ప్రధానం. వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. శిక్షణ పూర్తి చేసిన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించి బెల్టులు అందజేస్తున్నాం. – ఎత్తిన చెన్నయ్య, కరాటే మాస్టర్, షాద్నగర్ -
కొత్తపేట నుంచి విద్యావారోత్సవాల సభకు..
కేశంపేట: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ చంద్రశేఖర్ అన్నారు. కొత్తపేట పీఎంశ్రీ పాఠశాల అవరణలో సోమవారం క్యాంప్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం పాఠశాల చైర్మన్లతో కలిసి హైదరాబాద్లో నిర్వహించిన విద్యావారోత్సవాల సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్రెడ్డి, ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి, ఎంపీఓ కిష్టయ్య, ఏపీఓ అజీజ్, సీఆర్పీలు పాల్గొన్నారు. ఆగి ఉన్న కారును ఢీకొట్టి.. మరోకారు బోల్తా: ఒకరికి గాయాలు మొయినాబాద్: అతివేగంతో వచ్చిన ఓ కారు ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్నగర్ రెవెన్యూలో ఉన్న అయానా కన్వెన్షన్ హాల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఓ ఫంక్షన్కు నగరానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు కారు (ఏపీ 39 జీపీ 0045)లో వచ్చారు. కుటుంబ సభ్యులంతా కారు దిగి ఫంక్షన్కు వెళ్లారు. అదే కుటుంబానికి చెందిన ఓ బాలుడు సరదాగా కారు తీసుకుని బయటకు వెళ్లాడు. అతివేగంతో కారు నడుపుతూ రోడ్డుపై ఉన్న మట్టికుప్పను తప్పించబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు (ఏపీ 13 ఎల్ 6196)ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న కారు డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. రెండు కార్లు బాగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని మొయినాబాద్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రెడ్డి తెలిపారు. పరిగి: ఆర్టీసీ డ్రైవర్పై దంపతులు దాడికి పాల్పడిన ఘటన పరిగి బస్టాండ్లో సోమ వారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కాండ్లాపూర్కు చెందిన నర్సింలు పరిగి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన నడుపుతున్న బస్సు హైదరాబాద్ నుంచి పరిగి బస్టాండ్కు చేరుకుని ప్రయాణికులను దింపి డిపోనకు వెళ్తోంది. ఈ క్రమంలో గడిసింగాపూర్కు చెందిన దంపతులు నస్కంటి కుమార్, స్వాతి బస్ ఎక్కడికి వెళ్తుందని డ్రైవర్ను అడిగారు. డిపోనకు వెళ్తుందని చెప్పినప్పటికీ వినకుండా బస్సులో ఎక్కారు. దీంతో డ్రైవర్, దంపతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన దంపతులు డ్రైవర్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో డ్రైవర్ గాయపడడంతో గమనిచిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన దంపతులపై డ్రైవర్ నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రిచ్కిడ్ ట్రాప్ కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ స్నేహితుడు జే జితేందర్ అలియాస్ జితిన్ (22)పై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. పోక్సో యాక్ట్ కింద ప్రస్తుతం రిమాండ్లో ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ను సంపన్న యువతులను ట్రాప్ చేయడంలో ప్రేరేపించినందుకు 10 రోజుల క్రితం జితేందర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్పై బయటకు వచ్చాడు.అయితే ఆ తరువాత కూడా జితేందర్ తాను ట్రాప్ చేసి ప్రేమించిన మైనర్ బాలిక (17)కు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు వీడియోలను ఇన్స్ట్రాగామ్తో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన ప్రతిష్టతకు భంగం కలిగించడమే కాకుండా ప్రేమ పేరుతో తనతో తిరిగి శారీరిక వాంఛలు తీర్చుకుని లక్షలాది రూపాయలు వసూలు చేసిన నిందితుడు జితేందర్పై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తామిద్దరం కలిగి ఉన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలోనూ, తన స్నేహితులకు పోస్ట్ చేయడమే కాకుండా స్టేటస్లో కూడా పెట్టుకున్నారని, దురుద్దేశపూర్వకంగా తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని, తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని బాధిత మైనర్ బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
హుడాకాంప్లెక్స్: యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వ హించిన మెగా జాబ్మేళాను ఆయన ప్రా రంభించారు. 123 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. 4,318 మంది ఆన్లైన్లో పేర్లు నమో దు చేసుకున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 3,716 మంది నిరుద్యోగులు హాజ రయ్యారు. వీరిలో 1,645 మందిని షార్ట్లిస్ట్ చేసి 779 మందికి ఆయా కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదన్నారు. ప్రైవేటు ఫార్మా, ఉత్పత్తి రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఈఈటీ నిరుద్యోగులు, పరిశ్రమలకు మధ్య వారధిగా పని చేస్తుందని చెప్పారు. కంపెనీల్లో ఖాళీల సమాచారాన్ని యువతకు చేరవేసి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తోడ్పడుతుందన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. స్కిల్ వర్సిటీ ద్వారా యువతకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.కిరణ్మయి, రాష్ట్ర రోడ్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, ఉమ్మడి జిల్లాల పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్లు శ్రీలక్ష్మి, వినయ్కుమార్, మహేశ్, డీఈఈటీ డైరెక్టర్ జె.రాజేశ్వర్రెడ్డి, టాస్క్ సీఈఓ నితిన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
షెడ్లతో మొదలు.. బిల్డింగ్లతో పూర్తి!
శంకర్పల్లి: ప్రభుత్వం పేద ప్రజల కోసం కేటాయించిన ప్లాట్లు మెల్లమెల్లగా అక్రమార్కులు చేతుల్లోకి వెళ్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ తతంగం ఏళ్ల నుంచి కొనసాగుతున్నా శంకర్పల్లి రెవెన్యూ, నార్సింగి గ్రేటర్ సర్కిల్ అధికారులు పట్టవన్నట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పేదల కోసం భూ కేటాయింపు 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో జన్వాడ రెవెన్యూ గ్రామంలోని మిర్జాగూడలో (ప్రస్తుతం ఈ రెండు గ్రామాలు గ్రేటర్లో విలీనమై నార్సింగి సర్కిల్లో ఉన్నాయి.) సర్వే నంబర్ 192లో 102 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. దానికి ఇంద్రారెడ్డి నగర్గా నామకరణం చేశారు. ఒక్కొక్కరికి 60గజాల చొప్పున ప్లాట్లను ఇచ్చారు. దీనిలో జన్వాడ, మిర్జాగూడ గ్రామస్తులకు 1,525 ప్లాట్లతోపాటు మణికొండలో గుడిసెలు వేసుకున్న వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించి ఇక్కడ పునరావాసం కింద 494 ప్లాట్లు కేటాయించారు. మొత్తంగా 2019 ప్లాట్లు కేటాయించి అధికారికంగా లే అవుట్ చేశారు. రింగు రోడ్డుతో ప్లాట్లకు రెక్కలు ప్రభుత్వం చేసిన లే అవుట్కి అనుకొని రీజినల్రింగు రోడ్డు వెళ్లడంతో ఇంద్రారెడ్డి నగర్లోని ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది. దీంతో అక్రమార్కులు అధికారులతో చేతులు కలిపి లే అవుట్కి సంబంధం లేకుండా ఉన్న ఖాళీ స్థలాలే లక్ష్యంగా ప్లాట్లు చేశారు. వాటికి ధృవీకరణ పత్రాలు సైతం సృష్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుట్టగొడుగుల్లా నిర్మాణాలు ఇంద్రారెడ్డి నగర్లో ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లు 2019 కాగా.. ప్రస్తుతం అక్కడ రెట్టింపు సంఖ్యలో ఇళ్లు ఉండడం గమనార్హం. లే అవుట్ చేసిన సమయంలో ప్రజా అవసరాల నిమిత్తం కేటాయించిన భూమిని కబ్జాదారులు కబ్జా చేయడం ప్రారంభించారు. ముందు చిన్నచిన్న రేకుల షెడ్లు వేసి, తర్వాత రెండేళ్లు, మూడేళ్లకు వాటిని కూల్చి భవనాలను నిర్మించుకుంటున్నారు. దీనికి కొంతమంది అధికారులు ఇంటి నంబర్లు ఇవ్వడం, వారికి మద్దతు తెలపడం గమనార్హం. తహసీల్దార్, ఆర్డీఓకు ఫిర్యాదులు ఇంద్రారెడ్డి నగర్లో అక్రమ కట్టడాలపై మిర్జాగూడ, జన్వాడలకు చెందిన పంతం మల్లేశ్, సంజీవ, వెంకటేశ్, భిక్షపతితో పాటు పలువురు గ్రామస్తులు ఇటీవల శంకర్పల్లి తహసీల్దార్ సురేందర్, చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. అక్రమార్కులు బిల్డింగ్లు కట్టి, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, అదే విధంగా ప్లాట్లు, ఇళ్లు తమవే అని చెప్పి దౌర్జన్యంగా అమ్ముకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చర్యలు తీసుకుంటాం ఇంద్రారెడ్డి నగర్లో అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలకు సంబంధించిన విషయమై ఇప్పటికే పలువురు ఫిర్యాదు చేశారు. అధికారులను పంపి, దర్యాప్తు చేయిస్తాం. ఆక్రమణలు నిజమని తెలితే, వాటిని కూల్చివేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – సురేందర్, తహసీల్దార్, శంకర్పల్లి -
మామిడి.. దోపిడీ!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆరుగాలం శ్రమించి పంట పండించిన మామిడి రైతుకు మార్కెట్లో ఆశించిన ‘మద్దతు’ లభించడం లేదు. వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మార్కెటింగ్ అధికారులు కుమ్మక్కై నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. బోర్డుపై ఉన్న ప్రభుత్వ మద్దతు ధరలకు.. క్షేత్రస్థాయిలో దక్కుతున్న ధరకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. మామిడికాయ సైజు, రకాన్ని బట్టి ధరలు నిర్ణయించాల్సింది పోయి సిండికేట్గా మారి డిసైడ్ చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు వారు చెప్పిన రేటుకే విక్రయించి వెనుదిరగాల్సి వస్తోంది. టన్నుకు పది నుంచి ఇరవై కిలోల వరకు తరుగు పేరుతో మోసం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కేజీ ధర రూ.100పైగా పలుకుతుంటే.. ఈ హోల్సేల్ మార్కెట్లో మాత్రం రూ.40కి మించడం లేదు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు ఎగుమతి బాటసింగారం పండ్ల మార్కెట్కు 2004లో మార్కెట్కు 1,11,107 టన్నుల మామిడి రాగా వీటి ద్వారా రూ.2.70 కోట్ల ఆదాయం సమకూరింది. 2025లో 1,43,979 టన్నులు రాగా, వీటి ద్వారా రూ.3 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వ రకు 70 వేల టన్నుల మామిడి వచ్చింది. ప్రస్తు తం మార్కెట్లో 25 నుంచి 30 మంది కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. వీరిలో 15 నుంచి 20 మంది ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. మార్కె ట్కు వచ్చిన పంటలో 70 శాతం మామిడిని ఢిల్లీ, మధ్య ప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగు మతి అవుతోంది. కేవలం 30 శాతం పంట మాత్ర మే స్థానిక అవసరాలకు వినియోగం అవుతోంది. మౌలిక సదుపాయాలు కరువే.. బాటసింగారం పండ్ల మార్కెట్కు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి రోజుకు కనీసం 1000 నుంచి 1,200 వాహనాల్లో మామిడి వస్తోంది. రైతులతో పాటు వాహనదారులు, కూలీలు, వ్యాపారులతో మార్కెట్ కిక్కిరిసిపోతోంది. పండ్ల అమ్మకాల ద్వారా ఏటా రూ.మూడు కోట్ల ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న మార్కెట్లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. తాగేందుకు మంచినీరు, సేద తీరేందుకు అవసరమైన విశ్రాంతి గదులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఒంటికి, రెంటికి బహిరంగ ప్రదేశాల్లోకే పరుగులు తీయాల్సి వస్తోంది. ఆశించిన స్థాయిలో షెడ్లు లేకపోవడంతో రైతులు తమ పంటను ఆరుబయట ఎండలో కుప్పలుగా పోసి అమ్ముకోవాల్సి వస్తోంది.సాయంత్రం ఈదురు గాలితో కూడిన వర్షాలకు ఎగువ నుంచి వచ్చేవరదతో బొప్పాయి,ఖర్బూజా, వాటమిలాన్, పైనాపిల్ వంటి పండ్లు దెబ్బతింటున్నాయి. రైతుకు కరువైన ‘మద్దతు’ నాణ్యతను బట్టి ధర కాయ రకం, నాణ్యతను బట్టి ధరలు నిర్ణయిస్తున్నాం. ఏదైనా మంగుమచ్చ, గ్రేడింగ్ చేయకుండా మిక్సింగ్తో వచ్చే కాయ తూకంలో రైతుల అంగీకారంతోనే కొంత తరుగు తీస్తుండొచ్చు. నాణ్యమైన కాయలో ఎలాంటి తరుగు ఉండదు. వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు సిండికేట్ అయ్యారనే ఆరోపణల్లో వాస్తవం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లభించని మద్దతు ధర ఇక్కడే లభిస్తోంది. అందుకే రైతులు ఈ మార్కెట్కు ఎక్కువగా వస్తుంటారు. మద్దతు ధర విషయంలో ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు. రైతులకు నష్టం వాటిళ్లకుండా చూస్తున్నాం. – శ్రీనివాస్, మార్కెట్ కమిటీ కార్యదర్శి, గడ్డిఅన్నారం సిండికేటై ధరలు తగ్గిస్తున్నారు కొల్లాపూర్ నుంచి మామిడిలోడు తీసుకొచ్చాను. టన్నుకు వంద కేజీల వరకు తరుగు తీస్తున్నారు. వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తున్నారు. రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. షెడ్లు లేకపోవడంతో కాయలను ఓపెన్ప్లేసులో పోయాల్సి రావడంతో కాయలు పాడైపోతున్నాయి. మార్కెట్లో కనీస సదుపాయాలు కూడా లేవు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు రోజంతా ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. తాగేందుకు కనీసం మంచినీటి సదుపాయం కూడా లేదు. దాహమేస్తే బాటిళ్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. – రాములు, మామిడి రైతు -
సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో వివిధ ప్రాంతా ల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి నేరుగా అర్జీ లు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజావాణి కార్యక్రమంలో ప్రజ లు అందించే వినతులను సంబంధిత శాఖ ల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో పెట్టకూడదని సూచించారు.ఈ వారం 85 ఫిర్యా దు లు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివి ధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు తీసుకోండి ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చేరాలని మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్రెడ్డి కోరారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీపాద శర్వాణి, లెక్చరర్లు పాల్గొన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు దరఖాస్తుల ఆహ్వానం ఇబ్రహీంపట్నం రూరల్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతాపూర్, బేగంపేటలో 1వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లంబాడ–4, ఎరుకల –1, ఇతర గిరిజన తెగలు–1 (బాలురు 3, బాలికలు 3) చొప్పున ఖాళీలు ఉన్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు చెందినవారై ఉండాలని, తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు లోపు ఉండాలన్నారు. కులం, ఆదాయం, నివాస, జనన ధ్రువీకరణ పత్రాలు జతపర్చాలని చెప్పారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు కలక్టరేట్లోని జిల్లా గిరిజనాభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు లభిస్తాయన్నారు. అభ్యర్థి 1 జూన్ 2019 నుంచి 31 మే 2020 మధ్య కాలంలో జన్మించి ఉండాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులు గిరిజనాభివృద్ధి కార్యాలయంలో ఈ నెల 18 సాయంత్రం 5 గంటల లోపు పంపించాలన్నారు. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ విధానం ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మహిళలకు స్వయం ఉపాధిలో శిక్షణ మొయినాబాద్:జిల్లాలోని గ్రామీణ ప్రాంత మ హిళలకు స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్ష ణ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ ఆర్సెటీ డైరెక్టర్ మ హ్మద్ అలీఖాన్ సోమవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని చిలుకూరు లో ఉన్న ఎస్బీఐ ఆర్సెటీ కేంద్రంలో నెల రో జుల పాటు మగ్గం వర్క్స్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. 18–50 సంవత్సరాల వ యసు ఉండి పదో తరగతి చదివిన మహిళలు మంగళవారం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఎస్ఎస్సీ మెమో,రేషన్కార్డ్, ఆధా ర్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జతచేయాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్ వసతి, భోజన సౌకర్యంతోపాటు యూనిఫాం,టూల్కిట్స్ అందజేస్తామన్నారు. వివరాలకు 850016 5190 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సనత్నగర్: బీన్స్ ధర ౖపైపెకి ఎగబాకింది. రైతుబజార్లోనే కిలో రూ.145 ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.180–200 వరకు పలుకుతోంది. వెజ్ బిర్యానీలో ప్రధానంగా ఉపయోగించే బీన్స్ ధర అమాంతం పెరగడంతో అటు హోట ళ్ల యజమానులు, ఇటు గృహ నివాసితులు కొనాలంటే ఒకింత ఆలోచనలో పడుతున్నారు. డిమాండ్కు తగ్గట్లుగా దిగుబడి రాకపోవడంతో వ్యాపారులు ధరను భారీగా పెంచేశారు. -
టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
సాక్షి, సిటీబ్యూరో: టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగులు విధుల్లో మార్పులకు శ్రీకారం చుట్టాలని ఎకై ్సజ్శాఖ రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ సూచించారు. ఆబ్కారీ భవన్లో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రంగారెడ్డి ఎకై ్సజ్ డివిజన్లోని శంషాబాద్, సరూర్నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ ఎకై ్సజ్ జిల్లాల్లో అవసరమైన మార్పులకు అందరూ సిద్ధం కావాలని కోరారు. రెవెన్యూ పెంచాలని, పెండింగ్ బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సత్ఫలితాలను సాధించాలన్నారు. గతంలో సారా పైనే ఎక్కువ దృష్టి సారించాల్సి వచ్చేదని, ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం విస్తృతంగాపని చేయాల్సి వస్తోందన్నారు. ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ టీమ్లు బాగా పని చేయాలన్నారు. సమావేశంలో శంషాబాద్, సరూర్నగర్, మేడ్చల్, మాల్కాజిగిరి, వికారాబాద్ ఎకై ్సజ్ సూపరింటెండ్లు కృష్ణప్రియ, ఉజ్వల రెడ్డి, ఫయాజొద్దీన్, నవీన్, విజయ భాస్కర్ గౌడ్, ఏఈఎస్లు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు కిలోన్నర తరగు తీస్తామని చెప్పి నాలుగు కిలోలు తీస్తున్నారని మండిపడ్డారు. రైస్మిల్లర్ల యాజమాన్యం 4 కిలోల తరుగు తీస్తున్నారని, 8 కిలోల తరుగు పేరుతో దోపిడీ కొనసాగుతోందన్నారు. ఈ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. తేమ పేరుతో రోజుల తరబడి వడ్లను ఆరబోసే విధానానికి స్వస్తి చెప్పి కొనుగోలు సెంటర్లకు వచ్చిన ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లర్లకు తరలించాలన్నారు. కొలతలు వేసిన ధాన్యానికి వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని చెప్పారు. గన్నీ బ్యాగులను రైతులకు అందుబాటులో ఉంచాలని, వడ్లు ఆరబోయడానికి పడాలు ఉచితంగా ఇవ్వాలని, కొనుగోలు కేంద్రా ల్లో టెంట్లు వేసి నీడ సౌకర్యం కల్పించాలని కోరా రు. ఎండల్లో పని చేసే రైతులకు మంచినీరు, మజ్జి గ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిప త్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు సామేలు, రాంచందర్, కాడిగళ్ల భాస్కర్, జగదీష్, చంద్రమోహన్, కందుకూరి జగన్, నర్సింహ, కవిత తదితరులు పాల్గొన్నారు. -
పాలు కల్తీ చేస్తున్న వ్యక్తిపై కేసు
పాలు పాడవకుండా హైడ్రోజన్ పెరాకై ్సడ్ వినియోగిస్తున్నట్లు గుర్తింపుకందుకూరు: పాలను కల్తీ చేస్తున్న ఓ డెయిరీపై పోలీసులు దాడి చేశారు. కల్తీకి ఉపయోగిస్తున్న కెమికల్తో పాటు కల్తీ అయిన పాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ పరుశురామ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని దాసర్లపల్లిలో యాదవ డెయిరీ మిల్క్ బూత్లో పాలను కల్తీ చేస్తున్నారనే సమాచారంతో ఉదయం పోలీసులు వెళ్లి తనిఖీ చేశారు. దీంతో అక్కడ ఉన్న హైడ్రోజన్ పెరాకై ్సడ్ బాటిల్ను గుర్తించారు. ఎందుకు ఉపయోగిస్తారని నిర్వాహకుడు మారమోని శ్రీశైలంను ప్రశ్నించగా, పాలు చెడిపోకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతామని దీంతో ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదని చెప్పాడు. నెలకు రూ.7–రూ.8 వేల వరకు విద్యుత్ చార్జీలు ఆదా అవుతాయని చెప్పాడు. హైడ్రోజన్ పెరాకై ్సడ్ లీటర్ బాటిల్ రూ.150కే దొరుకుతుండటంతో దాన్ని వాడుతున్నట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు హైడ్రోజన్ పెరాకై ్సడ్ కలిపిన 80 లీటర్ల పాలతో పాటు 300 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాకై ్సడ్ ఉన్న బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. -
కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు
● పట్టించుకోని నిర్వాహకులు ● సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య ఇబ్రహీంపట్నం: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గోసపడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన దండుమైలారంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పంటను విక్రయించుకునేందుకు వచ్చిన రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తరుగు పేరుతో క్వింటాల్కు ఐదు కేజీల కోత పెడుతున్నారని, పడాల అద్దె, హమాలీ చార్జీల భారం రైతులపైనే పడుతున్నాయని, ధాన్యాన్ని తూర్పార బట్టి శుభ్రం చేసే ఎనిమిది మిషన్లలో కేవలం మూడు మాత్రమే పనిచేస్తున్నాయని, వాటికి సంబంధించిన వైర్లను రైతులే తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తోందని విమర్శించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం భాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైస్ మిల్లర్లకు, రైతులకు మధ్యవర్తిగా ప్రభుత్వం మారి వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. కోతలు విధించకుండా ధాన్యం కొనుగోలు చేసి, కనీస సౌకర్యాలను కొనుగోలు కేంద్రాల వద్ద కల్పించాలని డిమాండ్ చేశారు. నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న అవకతవకలకు నిరసనగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేయనున్నట్లు సీపీఎం కార్యదర్శి యాదయ్య తెలిపారు. రైతులంతా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకలు సామెల్, బుగ్గరాములు, ముసలయ్య, జగన్, జంగయ్య, లింగస్వామి, యాదగిరి, వెంకటేశ్, రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నిషిద్ధ భూముల్లో నిర్మాణాలు
తుర్కయంజాల్: ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్, హార్డ్వేర్ పార్కు భూముల్లో అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా టౌన్ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భూములను 2004లో అప్పటి ప్రభుత్వం హార్డ్వేర్ పార్కుకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అప్పటికే పలు సర్వే నంబర్లలోని భూమిని పంచాయతీ లే అవుట్గా మార్చారు. అయినప్పటికీ ప్రభుత్వం భూములను తీసుకుంటున్నట్లు ప్రకటించి ప్రొహిబిటెడ్ లిస్ట్లో చేర్చడంతో నిర్మాణాల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్లు నిలిపేసినా.. అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్ రెవె న్యూ పరిధిలోని సర్వే నంబర్లు 495, 500, 502, 505, 506, 508,509, 515, 517, 518, 519, 523, 526, 527, 528, 530, 533, 536, 538, 542, 543, 544, 546, 547, 550, 554, 556, 653, 656, 657, 658, 659, 660, 661, 662 లోని భూమి అర్బన్ ల్యాండ్ సీలింగ్తో పాటు, హార్డ్వేర్ పార్క్కు కేటాయించారు. వీటి మొత్తం విస్తీర్ణం సుమారు 323 ఎకరాలు. గడిచిన కొన్నేళ్లుగా ఈ సర్వే నెంబర్లు ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నప్పటికీ యథేచ్చగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించారు. వీటి పరిధిలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అదనంగా డబ్బులు తీసు కుంటూ రిజిస్ట్రేషన్లు చేశారు అనే గుసగుసలు వినిపించేవి. ఈ క్రమంలో ఇటీవల ఈ సర్వే నంబర్ల పరిధిలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్ నిలిపివేశారు. అయినప్పటికీ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. ఇటీవల కొందరు అధికారులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్చగా నిర్మాణాలను చేపడుతున్నారు. పదికి పైగా రిసార్ట్లు, క్రికెట్ గ్రౌండ్లను నిర్మించినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీటిని ప్రారంభ దశలోనే అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో వీటికి అడ్డుకట్ట వేసే వారే కరువయ్యారు. కేవలం నోటీసులను జారీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించిన ఈ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నా చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హార్డ్వేర్ పార్క్, సీలింగ్ భూముల్లో చేపడుతున్న నిర్మాణాలు హార్డ్వేర్ పార్క్, సీలింగ్ భూముల్లో రిసార్ట్లు, క్రికెట్ గ్రౌండ్లు పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసుల జారీతో చేతులు దులుపుకొంటున్న వైనం హార్డ్వేర్ పార్కు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టొద్దు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా చేపడితే చట్టరీత్యా చర్యలు తప్పవు. ఇప్పటికే పలు నిర్మాణాలకు నోటీసులు జారీ చేశాం. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – కిరణ్, టీపీఓ, ఆదిబట్ల సర్కిల్ -
ప్రతీ పల్లెకు సురక్షిత తాగునీరు
టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి ఆమనగల్లు: ప్రతీ పల్లె, ప్రతి తండాకు సురక్షిత తాగునీరు అందించడమే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి అన్నారు. ఆమనగల్లు, తలకొండపల్లి, వెల్దండ మండలాల్లో శనివారం సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమనగల్లులో నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణ కేంద్రంలో అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను అందజేశారు. అనంతరం పోచమ్మగడ్డ తండాలో రూ.1.50 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరి ఆరోగ్యం కోసం సురక్షిత తాగునీరు ఎంతో అవసరమన్నారు. పల్లెలు, తండాల్లో సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మహిపాల్, గోపాల్, గన్యానాయక్, రమేశ్నాయక్, నాయకులు పంతులునాయక్, శ్రీరామ్, హనుమంతు, వెంకట్నాయక్, సేవ్యానాయక్, జైపాల్, తిరుపతి, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, జైపాల్రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తికి తీవ్ర గాయాలు యాలాల: వేగంగా, అజాగ్రత్తగా వెళుతున్న ఓ ఇసుక ట్రాక్టర్ బైక్ను ఢీకొంది. ఈ ఘటన మండలంలోని దౌలాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన ప్రకారం.. తాండూరు పట్టణానికి చెందిన మహ్మద్ మోయిజ్ పని నిమిత్తం దౌల్తాబాద్ మండలం హుస్నాబాద్కు వెళ్లి మధ్యాహ్నం తన బైక్పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దౌలాపూర్ సమీపంలోకి రాగానే అగ్గనూరు గ్రామానికి చెందిన రవిగౌడ్కు చెందిన ట్రాక్టర్ ఇసుక లోడ్తో వేగంగా వెళ్తుండగా ముందు టైరు పేలింది. ఈ క్రమంలో ఎదురుగా బైక్పై వస్తున్న మోయిజ్ను ట్రాక్టర్ ఢీకొనడంతో ఎడమకాలికి, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మోయిజ్ను నగరానికి రిఫర్ చేశారు. క్షతగాత్రుడి కొడుకు ఫాజిల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 16, 18న ఇంటర్లో చేరేందుకు కౌన్సెలింగ్ కొడంగల్ రూరల్: గిరిజన గురుకుల విద్యాలయాల్లో ఇంటర్లో చేరేందుకు మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 16న బాలురకు, 18న బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కె.నాగార్జునరావు ఆదివారం ఓ ప్రకనటలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి రోడ్లోని గిరిజన గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 10గంటల నుంచి కౌన్సెలింగ్కు హాజరుకావాలని తెలిపారు. 10వ తరగతి మార్కుల మెమో, బదిలీ ధ్రువపత్రం, స్టడీ, కండక్ట్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, 2026–27 ఆదాయ ధ్రువీకరణ పత్రంఆధార్ జిరాక్స్, స్పోర్ట్స్, పీహెచ్సీ ధ్రువీకరణ పత్రం, మూడు కలర్ ఫొటోలు, రెండు జతల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. క్యాష్ ఇన్చార్జ్ కాజేసినట్లు కేసు నమోదు శ్రీనగర్ కాలనీ: యూసుఫ్గూడ ఎస్బీఐలో రూ.23 లక్షలు మాయమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. యూసుఫ్గూడ ఎస్బీఐలో క్యాష్ ఇన్చార్జ్గా అబ్బిరెడ్డి యాదగిరిరెడ్డి పని చేస్తున్నారు. గతేడాది అక్టోబర్ 7న యూసుఫ్గూడ బ్రాంచిలోని పాత ఏటీఎం స్థానంలో ఎస్పీఆర్ మిషన్ను ఏర్పాటు చేయాలని బ్యాంకు నిర్ణయించింది. రికార్డులో రూ 27.5 లక్షలు ఎంట్రీ చేశారు. బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీయ కుండానే తీసినట్లుగా బోగస్ ఎంట్రీలు సృష్టించారు. మరుసటి రోజు యాదగిరిరెడ్డి ఇతర సిబ్బందితో కలిసి ఏటీఎంలోని డబ్బు పెట్టెలను బ్యాంకు స్ట్రాంగ్ రూంకు తరలించారు. అధికారులు డబ్బు పెట్టెలను లెక్కించి రూ.23 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. సీసీ పుటేజీలు పరిశీలించి యాదగిరిరెడ్డి డబ్బును కాజేసినట్లు బ్యాంకు అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఎస్బీఐ చీఫ్ మేనేజర్ కిరణ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేడే మెగా జాబ్మేళా
● సరూర్నగర్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు ● పాల్గొననున్న 150 కంపెనీలు హుడాకాంప్లెక్స్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రజా పాలన–ప్రగతి పణాళిక’99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా భారీ జాబ్మేళాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 150 కంపెనీలు ఈ జాబ్మేళాలో పాల్గొననున్నాయి. జాబ్మేళాలో భాగంగా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. ఇండస్ట్రియల్, ఫార్మా, రిటైల్, బ్యాకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, సేవా రంగాలకు సంబంధించి న కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈ వేదికగా భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఎంపికై న అభ్యర్థులకు ఉపాధితో పాటు మంచి జీతం. రవాణా సదు పాయాలను ఆయా కంపెనీలు కల్పించనున్నాయి. ఇప్పటికే 5వేల మంది రిజిస్ట్రేషన్ ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ సహా ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసుకుని, ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువత కోసం ఈ జాబ్మేళాను ఏర్పాటు చేశారు. ఆఫీస్ రిసెప్షనిస్టు మొదలు.. ఐటీ ఎంప్లాయి పోస్టు వరకు అన్ని రకాల జాబ్ అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఇప్పటి వరకు 5వేల మంది నిరుద్యోగులు జాబ్మేళాలో పేర్లు నమోదు చేసుకున్నారు. అర్హత, అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వేతనాలు చెల్లించనున్నాయి. ఇంటర్వ్యూలో ఎంపికై న అభ్యర్థులకు వెంటనే ఆయా కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇవ్వనున్నాయి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు తాగునీరు, బిస్కెట్లు, మజ్జిగను అందజేయనున్నారు. -
సెలవుల్లో ప్లానింగ్..
కంప్యూటర్ ట్రైనింగ్షాబాద్లోని కంప్యూటర్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులుమొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ప్రస్తుతం వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు.. ఇందులో భాగంగా కొంతమంది అటు సరదాగా గడుపుతూనే, ఇటు కంప్యూటర్ విద్యపై ఆసక్తి చూపిస్తున్నారు. సెలవులను సద్వినియోగం చేసుకునే దిశగా శిక్షణ పొందుతున్నారు. పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ఉదయం, సాయంత్రం కంప్యూటర్ కేంద్రాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. – షాబాద్ -
ప్రాణం తీసిన వ్యాపార వివాదాలు
పహాడీషరీఫ్: వ్యాపార లావాదేవీల విషయంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్న్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆదిత్య పాండ్యే (24) వాహనాల రికవరీ ఏజెంట్గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మున్నా అదే వ్యాపారం సాగిస్తున్నాడు. వ్యాపార విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు నెలకొన్నాయి. శనివారం రాత్రి మాట్లాదామంటూ మున్నా మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఉస్మాన్నగర్కు రప్పించి ఇంట్లో కర్రలు, రాళ్లతో దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి సోదరుడు సౌరబ్ పాండ్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైకు ఢీకొని వృద్ధురాలి మృతి హయత్నగర్: రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని వేగంగా వచ్చిన బైకు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. బైకు నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన బీర్ల జంగయ్య భార్య లక్ష్మమ్మ (80) తొర్రూర్ గ్రామంలో జరుగుతున్న బీరప్ప పండుగకు బంధువుల ఇంటికి వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా మునుగనూరు వైపు నుంచి వేగంగా వచ్చిన బైకు (టీఎస్ 07 జీఎఫ్0071) లక్ష్మమ్మను ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బైకు నడుపుతున్న పవన్కు గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ రూరల్: ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణిస్తున్న వారిని స్నేహితులతో కలిసి బెదిరించి నగలు, నగదు దోచుకున్న ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రిన్సికుమార్ కొత్తూరులోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఇతడి స్నేహితులు అభిషేక్కుమార్, రోషన్కుమార్ హైదరాబాద్ను చూసేందుకు ఈ నెల 7వ తేదీన సొంతూరు నుంచి చెర్లపల్లికి వచ్చారు. అదేరోజు రాత్రి వీరిని తీసుకుని ఆటోలో కొత్తూరు వస్తున్నాడు. ఆటో డ్రైవర్ అబ్దుల్ యాషిన్ మార్గమధ్యలో ఈ ఆటోలో మరో ముగ్గురిని ఎక్కించుకున్నాడు. ఆటో ఘాంసిమియాగూడ వద్దకు చేరుకోగానే.. ఆటో డ్రైవర్తో పాటు మార్గ మధ్యలో ఆటోలో ఎక్కిన వారు ప్రిన్సికుమార్, అతడి స్నేహితులను కత్తితో బెదిరించారు. వారి వద్ద ఉన్న రూ.1,800 నగదు, రెండు వెండి గొలుసులు, రెండు ఉంగరాలతో పాటు రెండు మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. దీంతో పాటు గూగుల్పే ద్వారా రూ.5 వేలు ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. నిందితులైన ఆటో డ్రైవర్తో పాటు చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ మోసిన్, అబ్దుల్ మోసిన్, అతిఫ్ఖాన్ను అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితుల నుంచి నగలు, నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆటోను సీజ్ చేశారు. -
16 నుంచి హెచ్పీపీఎల్ లీగ్
గన్ఫౌండ్రీ: నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రైవేట్ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని విశ్రాంత డీజీపీ గోపాల్రెడ్డి అన్నారు. ఆదివారం ఆదర్శ్నగర్లోని బిర్లా ప్లానిటోరియంలో హైదరాబాద్ ప్రొఫెషనల్ ప్రీమియర్ లీగ్ (హెచ్పీపీఎల్) సీజన్ వన్ జెర్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు మధురానగర్లోని స్పోర్ట్స్ ఎరీనాలో మ్యాచ్లు జరుగుతాయని నిర్వహకులు తెలిపారు. కార్యక్రమంలో సినీ నటుడు సత్యం రాజేష్, లీగ్ నిర్వహకులు పుట్టపర్తి నవ్యజోతి, విక్రమ్ రెడ్డి, భూపాల్ రెడ్డి, చగన్ లాల్ తదితరులు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి
జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ జాబ్మేళాలో పాల్గొననున్నాయి. ఆయా కంపెనీలు తమకు అవసరమైన మ్యాన్పవర్ను ఈ వేదికగా ఎంపిక చేసుకోనున్నాయి. ఇక్కడ ఎంపికై న వారికి మంచి జీతం, ఉపాధి అవకాశం లభిస్తుంది. జిల్లాలోని నిరుద్యోగ, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అభ్యర్థులు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. – శ్రీలక్ష్మి, జీఎం, జిల్లా పరిశ్రమలశాఖ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా నిర్వహిస్తున్న ఈ జాబ్మేళాకు ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశాం. కంపెనీల వారీగా స్టాళ్లు ఏర్పాటు చేయిస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థుల రిజిస్ట్రేషన్లు, ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. అభ్యర్థులతో పాటు కంపెనీల ప్రతినిధులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. – స్వర్ణలత, డీఎస్డీఓ -
ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం
● కంటైనర్ను ఢీకొట్టిన కారు ● ఇద్దరు షార్ట్ఫిల్మ్ యాక్టర్ల దుర్మరణంఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు షార్ట్ ఫిల్మ్ యాక్టర్లు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నోయల్రాజ్ తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా వేదాయపాలెంకు చెందిన కత్తి భరత్కాంత్(31), గూడ సాయి త్రిలోక్(31) షార్ట్ఫిల్మ్ యాక్టర్లు. శనివారం సాయంత్రం నెల్లూరు నుంచి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు వెళ్తున్నారు. బొంగ్లూర్ ఎగ్జిట్–12 సమీపంలో కారు డ్రైవర్ అతివేగంగా వెళ్లడంతో వాహనం అదుపుతప్పి ఎదరుగా వెళ్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న కత్తి భరత్కాంత్, గూడ సాయి త్రిలోక్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం తెల్లవారు జామున 3.20గంటల సమయంలో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ అధికారి శ్రీకాంత్ ఇచ్చిన సమాచారం మేరకు ఆదిబట్ల పోలిసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. భరత్ కాంత్ (ఫైల్) గూడ సాయి త్రిలోక్ (ఫైల్) -
నల్లబెల్లం, పటిక పట్టివేత
కడ్తాల్: నాటు సారా తయారీ కోసం ఉపయోగించే నల్లబెల్లం, పటికను ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ.. సీఐ బద్యానాథ్ చౌహాన్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని పలు గ్రామాలకు నల్లబెల్లం, పటికను సరఫరా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మండల కేంద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఎకై ్సజ్ పోలీసులు వాహన సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఆమనగల్లు వైపు నల్లబెల్లం, పటికతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా 750 కిలోల నల్లబెల్లం, 80 కిలోల పటిక లభ్యమైంది. ఈ మేరకు వాహనంతో పాటు, రెండు సెల్ఫోన్లు సీజ్ చేశారు. నిందితులు కేతావత్ మోహన్, డేరంగుల నరేశ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తనిఖీల్లో ఎస్ఐ స్వప్న, ఎకై ్సజ్ కానిస్టేబుల్స్ రామిరెడ్డి, ఉపేందర్, అహ్మద్, లింగయ్య, శివప్రసాద్, సాయి శ్రీజ, ఆమని తదితరులు పాల్గొన్నారు. -
నిజాయతీ చాటుకున్న కండక్టర్
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కండక్టర్ నిజాయతీ చాటుకున్నారు. దిల్సుఖ్నగర్ నుంచి ఆదివారం ఇబ్రహీంపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు హడవుడిగా దిగుతూ బ్యాగు మరిచిపోయింది. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్ ఆ బ్యాగును గుర్తించారు. అందులో రెండున్నర తులాల బంగారు గొలుసు, ఆధార్, ఏటీఎం కార్డులున్నాయి. ఆధార్ కార్డులోని ఫోన్ నంబర్ ఆధారంగా సదరు ప్రయాణికురాలికి సమాచారం ఇచ్చారు. తిరిగి బొంగుళూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వారి కుటుంబసభ్యులు రాగా బ్యాగును వారికి అందజేశారు. విలువైన వస్తువులు మళ్లీ దక్కడంతో వారు కండక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ సుజాత కండక్టర్ సీతారాం నిజాయతీని అభినందించారు. శంషాబాద్ రూరల్: వాగులో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన శంషాబాద్ మండలం ననాజీపూర్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా ఈదులనాగులపల్లికి చెందిన బ్యాగరి హనుమంతు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 8న ననాజీపూర్లో బంధువుల గృహ ప్రవేశానికి వచ్చారు. మరుసటి రోజు ఆయన కుమారుడు శ్రీచరణ్ (17) బహర్భూమి కోసం బైక్పై వెళ్లాడు. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో పలు చోట్ల వెతికినా ఆచూకీ తెలియలేదు. ఆదివారం ననాజీపూర్ శివారులోని వాగు నీళ్లలో శ్రీచరణ్ మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు వాగునీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఇంటికొస్తానన్నాడు.. అంతలో హతమయ్యాడు
షాద్నగర్రూరల్: వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన షాద్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సీతారాం కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం పోమాల్ గ్రామానికి చెందిన పల్లెకేశవులు (39) పద్మ దంపతులు. షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్లో శ్రీనివాస్రావుకు చెందిన ఫాంహౌస్లో పని చేయడంతో పాటు వ్యవసాయంచేస్తూ పిల్లతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. ఈ నెల 9న (శనివారం) తన సొంత ఊరులోని భూమికి సంబంధించిన కేసు విషయం మాట్లాడేందుకు వెళ్లాలని పల్లెకేశవులు యజమాని వద్ద రూ.50 వేలు తీసుకొని వెళ్లిపోయాడు. అదేరోజు తన సోదరులతో కలిసి పరిగి వెళ్లి అక్కడ అడ్వకేట్తో కేసు విషయం మాట్లాడి రాత్రి తిరుగు పయనమయ్యారు. రాత్రి 9.30 గంటల సమయంలో షాద్నగర్ బస్టాండ్కు వచ్చాను, ఇంటికి వస్తాను అని భార్య పద్మకు ఫోన్చేసి చెప్పాడు. ఇంటికి చేరుకోలేదు. పట్టణ సమీపంలోని వీర్లపల్లి రోడ్డులోగల వెంచర్లో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం ఉన్నట్లు ఆదివారం ఉదయం వెంచర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ సీతారాం సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలపై తీవ్ర గాయాలు ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న సమయంలో మృతుడి సెల్ఫోన్కు భార్య ఫోన్ చేయడంతో విషయాన్ని ఆమె తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆమె హత్యకు గురైంది తన భర్తనే అని తెలిపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.మధ్యలో ఏం జరిగిందో ఏమో? -
పరిజ్ఞానం తప్పనిసరి
ఇంటర్ చదువుతున్నాను. ప్రతీరోజు ఉదయం షాబాద్లో కంప్యూటర్ సెంటర్కు వచ్చి పీజీడీసీ ఏలో శిక్షణ పొందుతున్నా. ఇంటర్ పూర్తయ్యే వరకు డీటీపీ, పీజీడీసీఏ కోర్సులు పూర్తి చేస్తా. వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుంటున్నాం. – పల్లవి, నరెడ్లగూడ, షాబాద్ మండలం కంప్యూటర్ శిక్షణ కోసం ప్రతీరోజు ఉదయం బ్యాచ్లో వస్తున్నా. డీసీఏ నేర్చుకుంటున్నా. ప్రస్తుతం కంప్యూటర్ పరిజ్ఞానం తప్పని సరైంది. ఉన్నత చదువులు చదివినా కంప్యూటర్ కోర్సులు వచ్చి ఉండాలి. – వికాస్, కుమ్మరిగూడ, షాబాద్ మండలం డీసీఏ నేర్చుకుంటున్నా.. -
నీటి సంపులో పడి చిన్నారి మృతి
శంకర్పల్లి: అప్పటిదాక అందరితో ఆడుతూ అల్లరి చేసిన చిన్నారిని అనుకోని ప్రమాదం వెంటాడింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. ఈ విషాద సంఘటన ఆదివారం మోకిల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. జన్వాడకు చెందిన కాట్నే శేఖర్, మేఘన దంపతులకు ఒక కుమారుడు, కూతురు ప్రియాన్షు(3) ఉన్నారు. శేఖర్ ప్రైవేటు ఉద్యోగి. ఉదయం శేఖర్ వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లగా.. తల్లి ఇంట్లో పనులు చేస్తుంది. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ప్రియాన్షు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడింది. కాసేపటికి చిన్నారి ఎక్కడ అని వెతికిన తల్లికి.. చివరికి సంపులో తేలియాడుతూ విగతజీవిగా కనిపించింది. చిన్నారి మృతి చెందడంతో కుటుంబం, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.ఢిల్లీకి చెందిన వ్యక్తి అరెస్టు తాండూరు టౌన్: ప్రేమ పేరుతో బాలికను ట్రాప్ చేసి ఢిల్లీ ఎత్తుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తాండూరు టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపిన ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఆదీమ్(28) ఆరె నెలల క్రితం బతుకు దెరువు నిమిత్తం తాండూరుకు వచ్చాడు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఢిల్లీ సెలూన్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఓ బాలిక(16)కు ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పాడు. శనివారం ఎవరికీ తెలియకుండా బాలికను తీసుకుని ఢిల్లీకి పారిపోయేందుకు యత్నించాడు. బాలిక కనపడక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదీమ్పై కిడ్నాప్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వివాదాల ‘హౌస్లు’
● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా ఫాంహౌస్లు ● డ్రగ్స్, పేకాట, కోడి పందేలు, వ్యభిచారం, రేవ్, ముజ్రా పార్టీలు ● యథేచ్ఛగా గంజాయి, హుక్కా, మద్యం వినియోగం ● తరచూ వార్తల్లో నిలుస్తున్న వైనం మొయినాబాద్: సరదాలు, వారాంతపు విడిదిలకోసం నిర్మించుకున్న ఫాంహౌస్లు తరచూ వివాదాల్లో నిలుస్తున్నాయి. తప్పుడు పనులకు, అక్రమాలకు అడ్డాలుగా మారి తరచూ వార్తల్లోకెక్కుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై పోక్సో కేసు పెట్టడంతో మరోసారి ఫాంహౌస్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. సరదా పార్టీలు, మందు పార్టీలు, రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు, ముజ్రా పార్టీలతోపాటు వ్యభిచారం వంటి గలీజు వ్యవహారాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడిచేసి గుట్టు రట్టు చేస్తున్నా వీటికి అడ్డుకట్ట మాత్రం పడటంలేదు. పలు రకాల సెటిల్మెంట్లు, రాజకీయ నేతల రహస్య బేటీలు సైతం ఫాంహౌసుల్లోనే జరుగుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. లీజుకు.. అద్దెకు మహానగర శివారుల్లోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర, శామీర్పేట్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో చాలా మంది ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు. హైదరాబాద్కు అతి చేరువలో ఉన్న ఈ ప్రాంతాల్లో చాలా మంది 10 గుంటల నుంచి ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్ నిర్మిస్తున్నారు. 11 జీవో పరిధిలో ఉన్న మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి ప్రాంతాల్లో మరీ ఎక్కువ ఫాంహౌస్లు ఉన్నాయి. ఫాంహౌస్ల్లో చాలా వరకు రాజకీయ, సినిమా, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు, వీఐపీలవి ఉన్నాయి. వీకెండ్స్లో పిల్లలతో వచ్చి ఆనందంగా గడపడానికంటూ ఫాంహౌస్లు నిర్మించుకుని.. కొందరు వాటిని ఇతరులకు లీజుకు, అద్దెకు ఇస్తున్నారు. అడ్డగోలు దందాలు ఫాంహౌస్లను అద్దెకు తీసుకుంటున్న నిర్వాహకులు వాటిలో అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్టుగెదర్ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు, బర్త్డేలు అంటూ రోజువారీగా అద్దెకిస్తున్నారు. వీటితోపాటు రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు, పేకాట, కోడి పందేలు సైతం నిర్వహిస్తున్నారు. ఫాంహౌస్లకు వచ్చే యువకులను ఆకర్షించే విధంగా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఫాంహౌస్ల్లో నిర్వహించే పార్టీల్లో అక్రమంగా మద్యం తాగడం, హుక్కా, గంజాయి, డ్రగ్స్ వినియోగం జరుగుతోంది. కొన్ని ఫాంహౌస్ల్లో పేకాట, కోడి పందేలు సైతం జోరుగా ఆడుతున్నారు. ప్రముఖుల ఫాంహౌస్ల్లో.. శివారుల్లో ఉన్న ప్రముఖుల ఫాంహౌస్ల్లో తరచూ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. నగరానికి అతి చేరువలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్ 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు ఒప్పందానికి వేదికగా మారింది. పోలీసులు దాడి చేసి గుట్టును రట్టుచేశారు. గత మార్చి 14న రోహిత్రెడ్డి ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా ఈగల్ టీం పోలీసులు అక్కడకు చేరుకోగానే గన్ ఫైరింగ్ జరిగింది. ఈ కేసులో రోహిత్రెడ్డితోపాటు మరో ఇద్దరు జైలుకు వెళ్లారు. డ్రగ్స్ పార్టీలో ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. ● ఏడాది క్రితం తోలుకట్టలోని ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. పోలీసులు దాడి చేసి పందేలు నిర్వహించిన ఏపీ మంత్రి నారా లోకేష్ సన్నిహితుడు శివకుమార్తోపాటు 64 మందిని అరెస్టు చేశారు. 55 కార్లు, 84 కోళ్లు, రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వెలుగుచూస్తున్న వరుస ఘటనలు ● ఏడాది క్రితం కనకమామిడి రెవెన్యూలోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మహిళలను ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ● ఏడాదిన్నర క్రితం నజీబ్నగర్ రెవెన్యూలోని ఓ ఫాంహౌస్ ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ముజ్రా పార్టీ నిర్వాహకులతోపాటు ఆరుగురు యువకులు, నలుగురు యువతులను పట్టుకున్నారు. ● రెండేళ్ల క్రితం కనకమామిడి రెవెన్యూ పరిధిలోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఫాంహౌస్పై దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ● ఏడాది క్రితం అజీజ్నగర్ సమీపంలోని ఓ ఫాంహౌస్లో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ● ఏడాది క్రితం ఎత్బార్పల్లిలోని ఫాంహౌస్లో బర్త్డే పార్టీ పేరుతో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. 13 మంది యువకులు, ఏడుగురు యువతులను పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి, హుక్క పాట్స్, మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ● కొంత కాలం క్రితం చేవెళ్లలోని ఓ రిసార్ట్స్లో ప్రముఖ సింగర్ మంగ్లీ అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహిస్తూ మద్యం వినియోగించడంతో పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. ● ఆరు నెలల క్రితం పెద్దమంగళారంలోని ఓ ఫాంహౌస్లో ‘ట్రాప్ హౌస్ 9 ఎంఎం’ పేరుతో నిర్వహించిన మత్తు పార్టీని భగ్నం చేసి 62 మందిని పట్టుకున్నారు. అందులో 22 మంది మైనర్లు ఉండటం విశేషం. -
శ్మశానవాటిక సమస్యను పరిష్కరించండి
ఇబ్రహీంపట్నం: క్రైస్తవుల శ్మశానవాటికలకు స్థలాన్ని కేటాయించి, సమస్యను పరిష్కరించాలని క్రిష్టియన్ అసోసియేషన్ పాస్టర్లు డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ క్రిష్టియన్ పాస్టర్ అసోసియేషన్ కో–ఆర్డినేటర్ చెరుకూరి రాజు, విక్టర్ సన్నుత్, పాస్టర్లు కరుణాకర్, దేవకుమార్, సైమన్ పీటర్లు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని నలువైపులా పది ఎకరాల చొప్పున శ్మశానవాటికలకు స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించారు. శ్మశానవాటికలు లేక క్రిస్టియన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్రైస్తవ సమాజం ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. క్రైస్తవుల అభ్యున్నతికి వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం తమకు సహాయసహకారాలు అందిస్తుందని, అదేవిధంగా శ్మశాన వాటికలకు ఆయా ప్రాంతాల్లో భూమిని కేటాయించాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి, క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్జాన్లు ప్రత్యేక దృష్టిని సారించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, పాస్టర్లు మధుకర్, ఆశీర్వాదం, శ్రీను, మహేందర్, కృష్ణపాల్, మోషే, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. క్రిష్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు -
శ్రామికులకు హక్కులపై అవగాహన అవసరం
షాద్నగర్: శ్రామికులు తమ హక్కులను విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శంషాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని లేబర్ అడ్డాలో కూలీలకు వారి హక్కులు బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెక్కాడితే గాని డొక్కాడని శ్రమ జీవులు అనునిత్యం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారన్నారు. రోజు పనిచేస్తేనే కానీ వారి కడుపునిండని పరిస్థితి నెలకొందన్నారు. శ్రామికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వాటిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా కార్మికులు ప్రసూతికి రూ.20వేల చొప్పున పొందే హక్కు ఉందని చెప్పారు. అదేవిధంగా కార్మికులు ప్రమాదాల బారిన పడినప్పుడు ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం అందిస్తోందని తెలిపారు. అదేవిధంగా కార్మికుల కోసం వృత్తి శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. కార్మికులు ఏదైనా న్యాయ సహాయం అవసరం అయితే రాష్ట్ర న్యాయ సేవా సాధికార సంస్థను ఆశ్రయించవచ్చని సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్రెడ్డి -
యువ వైద్యులకు న్యూరోసైన్స్స్లో శిక్షణ
గాంధీఆస్పత్రి: వైద్యరంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, అత్యాధునిక చికిత్స విధానాలపై యువ వైద్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్నీ భవనంలో న్యూరోసైస్సెస్ మాస్టర్ శిక్షణ సదస్సు నిర్వహించారు. తెలంగాణ న్యూరోసైస్సెస్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ థైర్యవాన్, కార్యదర్శి ప్రతాప్కుమార్, రెనోవా గ్రూప్ఆఫ్ హస్పిటల్స్ సీఈఓ రవీంధ్రనాథ్ శనివారం సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఎంకే మూర్తి, టీవీఆర్కే మూర్తి, సయ్యద్అమీర్బాషాలు మాట్లాడుతూ.. న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాల్లో పీజీ చదువుతున్న వైద్య విద్యార్ధులు, రెసిడెంట్ వైద్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మాస్టర్ శిక్షణ ద్వారా క్లినికల్ నైపుణ్యాలు మెరుగుపర్చి, ప్రాధమిక పరీక్షవిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కేస్ డిస్కషన్, మాక్ ఎగ్జామినేషన్లు నిర్వహించనున్నట్లు వివరించారు. -
కష్టాలు ‘డబుల్’
షాద్నగర్: మూడు వారాలుగా డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద స్థానికులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.. నీరు సమృద్ధిగా ఉన్నా నేరుగా నల్లాలోకి రావడం లేదు. సంపులో ఉన్న నీటిని తోడుకుంటూ జనం అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ శివారులో నిరుపేదల కోసం 1,700 డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించారు. తాగునీటి కోసం కింద పెద్ద సంపులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా భవనాలపైన ఉండే ట్యాంకులకు సరఫరా అవుతోంది. అయితే భవనాలపై ఉన్న కొన్ని ట్యాంకులు చోరీకి గురికాగా మరికొన్ని పగిలిపోయాయి. కింద ఉండే సంపు నుంచి సరఫరా కావడం లేదు. దీంతో ఇక్కడ నివసించే వారు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. సంపుల నుంచినీటిని తోడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మిషన్ భగీరథ నీరు పుష్కలంగా ఉన్నా నేరుగా ట్యాంకుల్లోకి వెళ్లకపోవడంతో తిప్పలు తప్పడం లేదు. కొన్ని రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. సంపు నుంచి నీటిని తోడుకొని బిందెల ద్వారా తీసుకెళ్తున్నాం. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – మధు, షాద్నగర్ -
పొదుపు మహిళల ఆందోళన
ఇబ్రహీంపట్నం: రాయపోల్ మహిళా సహకార పొదుపు సంఘంలో అవకతవకలు జరిగాయంటూ మహిళలు, గ్రామస్తులు శనివారం ఆ సంఘం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆఫీసుకు తాళం వేసి నిరసన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రాయపోల్ సేవా పరస్పర సహాయక సహకార పొదుపు(పరిమిత) సంఘం ముప్పై ఏళ్లుగా కొనసాగుతోంది. ఇందులో సుమారు రెండు వేల మంది సభ్యులు డబ్బు పొదుపు చేస్తూ, అవసరాలకు రుణాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొదుపు సంఘం మేనేజర్ ఓం ప్రకాశ్ మహిళల చేత పొదుపు డబ్బులు కట్టించుకుంటున్నారే తప్ప.. ఇటీవల కొత్త రుణాలు ఇవ్వడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. రుణాలు ఎలాగూ ఇవ్వడంలేదు.. తాము జమ చేసిన డబ్బులైనా చెల్లించాలని డిమాండ్ చేశారు. పలువురు స్థానికులు నచ్చజెప్పడంతో ఆదివారం ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ వద్ద చర్చించేందుకు అంగీకరించారు. సంఘంలో అవకతవకలు జరిగాయని ఆరోపణ కార్యాలయానికి తాళం వేసి నిరసన నేడు పంచాయతీ వద్ద చర్చకు అంగీకారం -
తిప్పలు పడుతున్నీరు
ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026మున్సిపాలిటీలు తాగునీటికి గోస పడుతున్నాయి.. వేసవిలో సమస్య మరింత తీవ్రంగా మారింది.. మిషన్ భగరీథ ద్వారా సరఫరా చేసే నీళ్లు అన్ని వార్డులకు సరిపోవడం లేదు.. బోర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.. కొత్త పైప్లైన్లు, మరమ్మతులు, లీకేజీల పేరుతో వచ్చే నీటికి కోత పెడుతున్నారు. కొన్ని పట్టణాల్లో ఇళ్ల యజమానులే స్వయంగా ట్యాంకర్లు తెప్పించుకుంటుండగా, మరికొన్ని చోట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. కుటుంబాలు, జనాభా సంఖ్య నానాటికీ పెరుగుతున్నా ఆ మేరకు పంపిణీ కావడం లేదు. దీంతో తాగునీటికి తంటాలు తప్పడం లేదు. మున్సిపాలిటీల్లో తాగునీటి గోస ● పైప్లైన్ పనులు, మరమ్మతులు, లీకేజీల పేరిట కోత ● రోజు విడిచి రోజు అరకొరగా సరఫరా ● ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ● ఇబ్బందుల్లో ‘పుర’ ప్రజలు ఇబ్రహీంపట్నం: మహిళలను ఆర్థికంగా తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడాన్ని హర్షిస్తూ నియోజకవర్గంలోని ఐకేపీ ఏపీఎంలు, సీసీలు, పొదుపు సంఘాల మహిళలు తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రుణపరిమితిని రెట్టింపు చేయడంతో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో తోడ్పడుతుందన్నారు. గ్రామీణ మహిళల కళ్లలో వెలుగు చూసేందుకు డ్వాక్రా వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం అంకెలగారెడీ కాదని.. అతివల ఆత్మగౌరవం, ఆర్థిక స్వేచ్ఛకు అసలైన హామీగా అభివర్ణించారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని .. రైజింగ్ తెలంగాణలో భాగస్వాములు కావాలని సూచించారు. అబ్దుల్లాపూర్మెట్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు మండలంలోని బాటసింగారం జెడ్పీహెచ్ఎస్ తొమ్మిదో తరగతి విద్యార్థి మండారి ధనాంజనేయులు ఎంపికయ్యాడు. ఈ నెల 7న సరూర్నగర్ ఇండోర్ ప్రధాన అథ్లెటిక్స్ మైదానంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి 16 ఏళ్ల లోపు బాలుర విభాగంలో జావెలిన్ త్రో ఈవెంట్కు అర్హత సాధించాడు. ఆదివారం హనుమకొండ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ ప్రధాన అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించే పోటీలో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఉపాధ్యా యులు, సర్పంచ్ గౌరిశంకర్చారి, ఉప సర్పంచ్ వెంకటేశ్యాదవ్, ఎంపీడీఓ శ్రీవాణి, ఎంఈఓ జగదీశ్ తదితరులు విద్యార్థిని అభినందించారు. సాక్షి, సిటీబ్యూరో: నగరం నుంచి వరంగల్, హన్మకొండ, జనగామ, తొర్రూరు, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల వైపు వెళ్లే జిల్లా బస్సుల స్టాప్ను వీటీ కమాన్ దగ్గరున్న ఉప్పల్ బస్టాండ్కు తరలించే ఆలోచనలో ఉన్నారు అధికారులు. ఉప్పల్ బస్టాండ్ వద్దే జిల్లా బస్సుల రాకపోకలకు తగిన సదుపాయాలు కల్పించడం ద్వారా ఉప్పల్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందనే అభిప్రాయంతో ఇందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి సర్వే, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తదితర పనుల కోసం కన్సల్టెంట్లను ఆహ్వానిస్తూ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) అధికారులు టెండర్లు పిలిచారు. సర్వేతోపాటు ఉప్పల్ బస్టాండ్ వద్ద డిజైన్లు, డ్రాయింగ్స్, స్ట్రక్చరల్ డీటైల్స్, ఎస్టిమేట్స్ తదితర పనులు కూడా చేయాల్సి ఉంది. మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని హిమాయత్నగర్లో 2, 3, 4, 10వ వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో నీటి సరఫరా అగమ్యగోచరంగా మారింది. పంచాయతీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పథకం కింద గ్రామం మొత్తంలో పైప్లైన్లు వేసి, ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేశారు. ఆ నల్లాల్లో మిషన్ భగీరథ నీళ్లు మాత్రం ఇప్పటి వరకు రావడంలేదు. గ్రామానికి మిషన్ భగీరథ నీరు తక్కువగా రావడంతో సంపులో నింపుతున్నారు. గతం నుంచి ఉన్న బోరుబావుల నీటిని సైతం నింపి.. రెండూ కలిపి పాత పైప్లైన్ల ద్వారానే సరఫరా చేస్తున్నారు. దీంతో మిషన్ భగీరథ నల్లాలు వృథాగా మారాయి. ఎండలు పెరగడంతో.. ఇటీవల ఎండల తీవ్రత పెరగడంతో నాలుగు వార్డుల్లో నీటి సరఫరా తగ్గింది. రెండు రోజులకోసారి గంటపాటు వదులుతున్నారు. ఆ సమయంలో కొందరు మోటార్ల ద్వారా నీటిని తోడేస్తుండడంతో చాలా ఇళ్లకు సరిగా రావడంలేదు. కొంత మంది ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. మరోవైపు మున్సిపాలిటీ ద్వారా సరఫరా చేసే నీటిని ఇంటి అవసరాలకే వినియోగించుకుంటున్నారు. తాగడానికి మాత్రం ఫిల్టర్, మినరల్ వాటర్ను కొనుగోలు చేస్తున్నారు. ఆమనగల్లు: మున్సిపాలిటీలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో సకాలంలో నీరు సరఫరా కావడం లేదు. పైప్లైన్ నిర్మాణ పనులు చేపడుతుండడంతో ఆ సమయంలో కొన్ని కాలనీలకు నీటి సరఫరా జరగడం లేదు. దీంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వాటర్ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్నారు. నిత్యం 30 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా మిషన్ భగీరథ పథకం ద్వారా 20 లక్షల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో ఇంటింటికీ రోజువిడిచి రోజు పంపిణీ జరుగుతోంది. మున్సిపల్ పరిధిలోని బోర్ల ద్వారా ఏడు లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. 3 లక్షల లీటర్ల నీరు తక్కువగా సరఫరా అవుతుండటంతో ప్రతిరోజు కొన్ని కాలనీలకు ఇక్కట్లు తప్పడం లేదు. ముఖ్యంగా పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ, నుగులబండ, పద్మశాలీ కాలనీ, గుర్రంగుట్ట కాలనీ, ఉదయనగర్ కాలనీలో నీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పట్టణంలో వాటర్ట్యాంక్లు, నూతన పైప్లైన్ల నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం ద్వారా అమృత్ 2.0 పథకం కింద రూ.30 కోట్లు మంజూరు కాగా కొన్ని నెలల క్రితం పనులు ప్రారంభించారు. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట పైప్లైన్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల ఆదర్శనగర్ కాలనీలో పనులు జరగడంతో 15 రోజులు పాటు సరఫరా నిలిచిపోయింది. చేవెళ్ల: మున్సిపల్ పరిధిలోని హౌసింగ్బోర్డు, మల్కాపూర్, దామరగిద్ద, ఊరేళ్ల, రామన్నగూడ తదితర వార్డుల్లో నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేసవిలో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. మల్కాపూర్ 12వ వార్డులో మిషన్భగీరథ నీరు సక్రమంగా రావడం లేదు. హౌసింగ్ బోర్డు కాలనీలో సైతం ఇదే పరిస్థితి. మరమ్మతులు, లీకేజీలు అంటూ సక్రమంగా సరఫరా కాని మిషన్భగీరథ నీటితో జనం ఇబ్బంది పడుతున్నారు. రోజువిడిచి రోజు సరఫరా అవుతున్న నీళ్లు సరిపోవడం లేదు. అధికారులను ఎప్పుడు అడిగినా పైపులైన్ మరమ్మతులు ఉన్నాయని చెబుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇబ్రహీంపట్నం: అవసరానికి తగ్గట్టు మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంతో మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో నీటి ఎద్దడి తలెత్తుతోంది. వేసవిలో నీటి వినియోగం పెరుగుతోంది. దానికి తగ్గట్టు పంపిణీ జరగాల్సిందిపోయి నిత్యం వచ్చే నీటినే తగ్గించడంతో జనం అవస్థలు పడుతున్నారు. మున్సిపాలిటీకి మిషన్ భగీరథ ద్వారా నిత్యం 42 లక్షల లీటర్ల పంపిణీ జరిగేది. ఇటీవల 35 లక్షల లీటర్లకు తగ్గించారు. పెరిగిన కుటుంబాలు, జనాభా మేరకు 50 లక్షల లీటర్లు అవసరమవుతాయి. గతంలో రోజు విడిచి రోజు 40 నిమిషాల పాటు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం 25 నుంచి 30 నిమిషాలు మాత్రమే నీటిని వదలుతున్నారు. ఆయా బస్తీల్లో 95 బోర్లు పనిచేస్తున్నాయి. వాటిపైనే ఆధారపడి సర్దుబాటు చేసుకుంటున్నారు. అనంతగిరి: హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం నుంచి భారీ నిధులు వస్తున్నట్లు తెలిపారు. రైల్వే, రోడ్లు, పలు అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టి అజేయ శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు. నేడు అన్ని వర్గాల ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా కన్వీ నర్ కరణం ప్రహ్లాదరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవరెడ్డి, శివరాజు, రమేష్కుమార్, మిట్ట పరమేశ్వర్, పాండుగౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, అసెంబ్లీ కోర్డినేటర్ వడ్ల నందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్, సీనియర్ నాయకులు మల్లేశం, నరోత్తంరెడ్డి, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: జనగణన– 2027కు సంబంధించి స్వీయ గణనకు ఆదివారం చివరి రోజు. నగర పౌరులు ఇంటి, కుటుంబ వివరాల్ని ఆన్లైన్లో స్వీయ గణన చేసి జనగణన సజావుగా, వేగంగా జరిగేందుకు సహకరించాలని ప్రధాన జనగణన అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీఎంసీ కమిషనర్ జి.సృజన, ఎంఎంసీ కమిషనర్ టి.వినయకృష్ణారెడ్డి సూచించారు. స్వీయ గణన చేశాక సంబంధిత ఐడీని గణన అధికారి మీ ఇంటికి వచ్చినప్పుడు చూపించాలని పేర్కొన్నారు. se.census.gov.in ద్వారా మొబైల్/ల్యాప్టాప్/కంప్యూటర్ నుంచి స్వీయగణన చేసుకోవచ్చని తెలిపారు. వాట్సాప్ గ్రూపులకు ఈ విషయాన్ని చేరవేసి, ఎక్కువమంది స్వీయగణన చేసేలా సహకరించాలన్నారు. స్నేహితులు, బంధువులు, సహోద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. రావాల్సిన మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. 35 లక్షల లీటర్లు మాత్రమే నిత్యం పంపిణీ జరుగుతోంది. ఆయా బస్తీల్లో బోర్లు పనిచేస్తుండంతో కొంతమేర వెసులుబాటు అవుతోంది. నీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – బాబురావు, మంచినీటి విభాగం అధికారికొత్తూరు: మున్సిపాలిటీలో 12 వార్డులు, సుమారు 23 వేల జనాభా, 8 వేల కుటుంబాలు, 3 వేల ఇళ్లు ఉన్నాయి. 25 ఓవర్హెడ్ ట్యాంకులు, బోర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం 1.80 ఎంఎల్డీ నీటి డిమాండ్ ఉండగా 1.50 మిషన్ భగీరథ, మిగిలినవి స్థానికంగా ఉన్న బోర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని వార్డుల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా జరుగుతోంది. ఇబ్బందులు తలెత్తితే స్థానికంగా ఉన్న బోర్ల ద్వారా సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. – బాలాజీ, మున్సిపల్ కమిషనర్, కొత్తూరు. -
నెట్ఇంట్లో కథల పొట్లం!
నీతి కథలు, మహనీయులు, సాహస వీరుల చరిత్రలు, పాటలు, కవిత్వాలు, పొడుపు కథలు వంటివి చిన్నారులు మేధోవికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. సంస్కృతి, సంప్రదాయాలు, సమాజం పట్ల అవగాహనను పెంపొందిస్తాయి. గురువులు, పెద్దలపై గౌరవ భావాలను ఇనుమడింపజేస్తాయి. ప్రస్తుత కాలంలో చిన్నారులు సరదాగా, విరివిగా వినియోగిస్తున్న సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు వారి విజ్ఞానాన్ని పెంచేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. షాద్నగర్: నేటి తరం చిన్నారులు అన్ని రంగాల్లో వేగంగా దూసుకెళ్తున్నారు. సెల్ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్లను వినియోగిస్తూ వారికి కావాల్సిన ఆటలు ఆడుతూ, పాటలు వింటూ ఆనందంగా గడుపుతున్నారు. అయితే వారికి ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు అప్పగించి వదిలేయకుండా ఏం చూస్తున్నారు..? ఏం వింటున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనిస్తూఉండాలి. విచ్చలవిడిగా సైట్లు తెరవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారుల మేధస్సుకు ఉపయోగపడే అంశాలు మాత్రమే వాటిలో ఓపెన్ అయ్యేలా చర్యలు తీసుకోవడం మేలు. చందమామ రావే.. జాబిల్లి రావే చందమామ కథలకు ఓ ప్రత్యేకత ఉంది. రాత్రి వేళ చిన్నారులు అన్నం తినకుండా మారాం చేస్తే వెంటనే బయటికి తీసుకెళ్లి ఆకాశంలోని చంద్రున్ని చూపిస్తూ.. చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పాట పాడుతూ.. తల్లులు తమ పిల్లలకు గోరు ముద్దలు తినిపించేవారు. ఇప్పుడు కూడా ఇలాంటి కథలు పెట్టి సెల్ఫోన్ చేతికిస్తే కానీ ఏడాది పిల్లాడు సైతం ముద్ద మింగడం లేదు. జానపద పాటలు, సాహిత్యం, హాస్యం వంటి కథలు చందమామ.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. పరమానందయ్య శిష్యుల కథలు చిన్నారులను అమితంగా ఆకట్టుకునేవి, కడుపుబ్బానవ్వించే కథల్లో పరమానందయ్య శిష్యుల కథలు ప్రధానమైనవి. ఈ కథల్లో జీవిత పాఠాలకు సంబంధించిన అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. వీటిని చూడటం, వినడం పిల్లల భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. పెదరాసి పెద్దమ్మ కథలు, చిన్నారి చిట్టి కథలు వంటివి ఇంటర్నెట్లో మంచి పుస్తకం.ఇన్లో చూడవచ్చు. యానిమేషన్ చిత్రాలతో.. చిన్నారుల కథలు చదవాలన్నా, వాటివైపు ఆకర్షితులు కావాలన్నా యానిమేషన్ చిత్రాలు తప్పనిసరి. ఇవి లేకుండా ఇంటర్నెట్లో కథలు చూడలేరు. యానిమేషన్తో కూడిన అనేక కథలు బాలవినోదం బ్లాగ్ స్పాట్.ఇన్లో ఉన్నాయి. వీరీవీరీ గుమ్మడి పండు.. పిల్లలతో పాటు పెద్దలను కట్టిపడేసే పంచతంత్ర కథలు, తెలుగు వీడియో కథలు తెలుగు రైమ్స్.కామ్లో ఉన్నాయి. తెలుగు క్విజ్, ఆటల వీడియోలు పిల్లలను ఎంతో ఆకర్షిస్తాయి.వీరీవీరీ గుమ్మడి పండు.. వీరి పేరేమి, దాగుడు మూతల దండాకోర్ ఎక్కడి దొంగలు అక్కడ్నే వంటి అనేక రకాల వీడియోలు ఇక్కడ చూడొచ్చు. సంస్కృతిని తెలియజెప్పేవి.. కథలు చూడటంలో, వినడంలో చిన్నారుల అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి. కొందరు పాశ్చాత్యానికి సంబంధించి కథలు వింటే మరికొందరు ప్రాచీన కథలు, ఇతిహాసాలు, కవితలు, పాటలు వినేందుకు ఆసక్తి కనబరుస్తారు. భారతీయ సంస్కతిని ప్రతిబింబించే కవితలు, కథలు, పాటలు అనేక వెబ్సైట్లో లభిస్తాయి. ఇందులో కథలు.వర్డ్ప్రెస్.కామ్ వెబ్ సైట్ ఒకటి. బొంరాస్పేట: అమ్మ ఒడిలో అల్లారుముద్దుగా పెరిగే చిన్నారులకు వేసవి వేళ ఉల్లాసం కలిగించేది ఉయ్యాల. ఎన్కేపల్లి యూపీఎస్ ఉపాధ్యాయురాలు జ్యోతి పరమేశ్వరి, బాలు దంపతులకు రియాన్షిక, రుద్రాణి అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వేసవి సెలవుల్లో బంధువుల ఊరైన చౌడాపూర్లోని మామిడితోటలో ఇలా.. తల్లి చీరలను కొమ్మలకు కట్టించుకుని ఊయల ఊగుతూ సరదాగా గడుపుతున్నారు. చిన్నారులను అలరిస్తున్న ఆటలు, పాటలు మేధస్సును పెంచే కథలు, మహనీయుల చరిత్రలు సెల్ఫోన్, కంప్యూటర్లతో గడిపేస్తున్న బాలబాలికలు మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ కందుకూరు: మండలంలోని నేదునూరు పరిధిలోని మోడల్ స్కూల్లో ఈ నెల 11నుంచి 25వ తేదీ వరకు విద్యార్థులకు సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ విష్ణుప్రియ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని 6నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. క్యాంపులో డ్యాన్స్, సంగీతం, పాటలు, ఆటలతో పాటు క్రియేటివ్ యాక్టివిటీస్, చిత్రలేఖనం, అవుట్ డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్పై తర్ఫీదు ఇస్తారని తెలిపారు. నిత్యం ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని, ఆసక్తి ఉన్నవారు స్కూల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పీఎంశ్రీ హైస్కూల్లో శిబిరం బడంగ్పేట్: సర్కిల్లోని బడంగ్పేట పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 11 నుంచి సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు హెచ్ఎం సుజాత తెలిపారు. పదిహేను రోజుల పాటు కొనసాగే శిబిరంలో వ్యక్తిత్వవికాసం, యోగా, ధ్యానం, సంగీతంతో పాటు వివిధ కళలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. 6నుంచి 9వతరగతి చదివే విద్యార్థులను క్యాంప్నకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని మేరినాట్స్ గ్రౌండ్లో కరాటే సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. మాస్టర్ జపాన్ షోటోకాన్ కరాటే డూ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో గత నెల 28న ప్రారంభమైన శిబిరం ఈనెల 26 వరకు కొనసాగుతుందని మాస్టర్ ఖాజాపాషా తెలిపారు. ఉదయం 6 నుంచి 8గంటల వరకు క్లాస్ చెబుతున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు కరాటే, ఉషు, వెపన్స్, సెల్ఫ్ డిఫెన్స్, వెయిట్ లాస్, ఫిట్నెస్ వంటివి నేర్పిస్తున్నారు. చిన్నారులు ఆయా కళల్ని ఉత్సాహంగా ఆకళింపు చేసుకుంటున్నారు. -
షార్ట్ సర్క్యూట్తో మొబైల్ షాప్ దగ్ధం
పూడూరు: షార్ట్ సర్క్యూట్తో మొబైల్ షాప్ దగ్ధమైన ఘటన మండలంలోని కంకల్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రదీప్ కంకల్ ప్రధాన రహదారి పక్కన రేకుల షెడ్డులో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం దుకాణం నుంచి దట్టమైన పొగలు వస్తుండటంతో స్థానికులు ప్రదీప్కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే షాప్లోని వస్తువులు, ఫోన్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.7 లక్షల వరకు నష్టం జరిగిందని ప్రదీప్ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరింది. -
బలోపేతం చేస్తామండి
సర్కార్ బడుల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.. ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే మరోవైపు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా అడుగులు వేస్తోంది.. ఈ మేరకు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. సర్కార్ స్కూళ్లపై ప్రభుత్వం నజర్ షాద్నగర్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల నమోదును పెంచేందుకు కృషి చేస్తోంది. అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలను నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు రోజు వారీగా కార్యక్రమాలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. ఏ రోజు ఏం చేస్తారంటే.. -
త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ
రాయదుర్గం: రాష్ట్రంలో త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్రంజన్ పేర్కొన్నారు. నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని అపోలో ఆస్పత్రిలో క్రీడాగాయాలకు సంబంధించిన ప్రత్యేక కేంద్రాన్ని అధికారులు, సన్రైజర్స్ హైదరాబాద్ క్రీడాకారులతో కలిసి ప్రారంభించారు. క్రీడల్లో గాయపడ్డ వారికోసం ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. వరుణ్ అరుణ్ సూచనలు తీసుకోవాలి సన్రైజర్స్ జట్టు బౌలింగ్ కోచ్ వరుణ్ అరుణ్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని జయేష్రంజన్ సూచించారు. అతను జహీర్ఖాన్, ఉమేష్యాదవ్, ఆశిష్నెహ్రల కంటే వేగంగా వేసే ఫాస్ట్ బౌలరని, కానీ ఎప్పుడూ ఫిట్గా ఉండేవాడన్నారు. నేటి సన్రైజర్స్ ఆటగాళ్ళు, ఇతర ఫాస్ట్ బౌలర్లు కూడా అతని ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఆటలో ఎలా గాయాలపాలు కాకుండా ఉండాలో నేర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు.ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ దీప్తి నందన్రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం సన్రైజర్స్ క్రీడాకారులతో ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్రంజన్ -
దేవదేవుని ఆదేశంతోనే..
శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారంకొడంగల్: ఆ దేవదేవుని ఆదేశం మేరకు కొడంగల్లో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఈ జన్మకు వచ్చిన గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి 2027 డిసెంబర్ లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నవీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.110 కోట్ల వ్యయంతో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. తిరుమల తరహాలో నాలుగు మాఢ వీధులు, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ మండపం, ధ్వజ స్తంభం, ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, క్యూలైన్, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, పార్కింగ్, ప్రసాద కౌంటర్ల నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. తిరుమల నుంచి వచ్చిన అర్చకులు వైదిక కార్యక్రమాలను వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన యాగశాలలో హోమం తదితర పూజలు నిర్వహించారు. ఉదయం కుంభారాధన, చతుర్వేద శిలలకు అభిషేకం, హోమాలు, పుర్ణా హుతి జరిపించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రథమ శిలేష్టికాన్యాస (శంకుస్థాపన) కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దుద్యాల్ మండలం లగచర్లలో 430 పడకల ఆస్పత్రికి, కోస్గిలో వేణుగోపాల స్వామి ఆలయానికి, దౌల్తాబాద్లోని వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఇక్కడే శిలాఫలకాలకు పూజ చేశారు. కొడంగల్ను నందనవనంగా తీర్చిదిద్దాలి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. 55 ఏళ్ల క్రితం నందారం కుటుంబీకులు నిర్మించిన కొడంగల్ ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే తిరుమలకు వెళ్లి వచ్చి న పుణ్యం వస్తుందన్నారు. శ్రీవారి ఆలయానికి ఎంతో సేవ చేసిన టీటీడీ వైఖానస ఆగమ శాస్త్ర సలహాదారులు, దివంగత సుందర వరధ భట్టాచార్యుల పేరును ఏదో ఒక ప్రాంగణానికి పెట్టాలని అధికారులకు సూచించారు. గడి గుడి ఏకమై కొడంగల్ను నందనవనంగా తీర్చిదిద్దాలన్నారు. తిరుమల తరహాలో నిత్య పూజలు, కైంకర్యాలు జరుగుతున్నాయని చెప్పారు. నారాయణపేట ఎత్తిపోతల పథకం, కృష్ణా – వికారాబాద్ రైల్వే లైన్, కొడంగల్ మండలంలో సిమెంట్ ఫ్యాక్టరీ పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, బుయ్యని మనోహర్రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యారు, కలెక్టర్ దీపక్ తివారి తదితరులు పాల్గొన్నారు. సీఎం సభ సైడ్ లైట్స్ -
ఎండతో ఆటలొద్దు
దుద్యాల్: పాఠశాలలకు సెలవులు కావడంతో గ్రామాల్లోని చిన్నారులు ఆటపాటలతో సరదాగా గడుపుతున్నారు. కొంత మంది ఇండోర్ ఆటలు ఆడుతుండగా.. మరికొందరు అవుట్ డోర్ గేమ్స్లో బిజీగా కనిపిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం చెట్టుపల్లితండాలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. మండుటెండలో వినోదం ఒక్కోసారి ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. ఆరుబయట ఆడుకునే ఆటలకు ఉదయం, సాయంత్రం వేళలే మేలు. పిల్లలూ.. ఎండతో కాస్త జాగ్రత్త. చెట్టుపల్లితండాలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులు -
పీవీఆర్ ఎక్స్ప్రెస్ వేపై లేజర్ గన్లు
రాజేంద్రనగర్: ఆరాంఘర్ చౌరస్తా నుంచి మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వరకు ఉన్న పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై వాహన వేగాన్ని తగ్గించి ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 11.6 కిలోమీటర్ల మేర పీవీఆర్ ఎక్స్ప్రెస్ వేతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లే వారికి ఎంతో సౌలభ్యంగా ఉంది. ఫ్లైఓవర్పై కార్లకు మాత్రమే అనుమతి ఉంది. ప్రస్తుతం వాహనాలు వేగంగా వస్తూ నిత్యం ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న ప్రాంతాలను గుర్తించి 80 కి.మీ వేగంతో మాత్రమే వెళ్లాలంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఇరువైపులా లేజర్ గన్లను ఏర్పాటు చేశారు. 80 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి చలానాలు వేస్తున్నారు. ప్రతిరోజు 120 నుంచి 150 వాహనాలకు చలానాలు విధిస్తు న్నారంటే.. ఫ్లై ఓవర్పై వాహనాలు ఎంత వేగంగా వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. -
డంపింగ్యార్డులో చెలరేగిన మంటలు
ఆమనగల్లు: డంపింగ్యార్డులో మంటలు చెలరేగాయి. పట్టణ సమీపంలోని నివాసాల మధ్య డంపింగ్యార్డు ఉంది. శుక్రవారం సాయంత్రం సిబ్బంది చెత్తను కాల్చడానికి నిప్పు అంటించినట్లు తెలుస్తోంది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి విపరీతమైన పొగ రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే కల్వకుర్తి ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది డంపింగ్యార్డు వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. కేశంపేట: ప్రమాదవశాత్తు మంటలు వ్యాప్తి చెంది మొక్కజొ న్న పంట దగ్ధమైంది. ఈ సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన తలసాని రంగారెడ్డి తమ వ్యవసాయ పొలంలో 5 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేశాడు. శుక్రవారం పంటతో పాటు డ్రిప్ పైపులకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.10 లక్షల వరకు నష్టం జరిగింది. కేశంపేట: మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కర్నెకోట అరణ్తేజ్ క్రికెట్తో పాటు చదువుల్లో రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఏపీ తరఫున అండర్ 19 క్రికెట్ అడుతున్న అరుణ్తేజ్ బెంగళూర్లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఐఐటీఎం ప్రవేశ పరీక్షలో మూడో ర్యాంకులో నిలిచి, మద్రాసు ఐఐటీలో సీటు సాధించాడు. క్రీడలతో పాటు చదువులోనూ రాణిస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పరిగి: పరిగి పట్టణానికి చెందిన రిషికేష్ క్రీడా పాఠశాలకు ఎంపికయ్యాడు. శుక్రవారం విడుదలైన రాష్ట్రస్థాయి ఎంపిక ఫలితాల్లో పరిగి 13వ వార్డుకు చెందిన ఆర్ రిషికేష్ ప్రతిభ కనబరిచారు. 4వ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించారు. కుల్కచర్ల నుంచి అక్షర కుల్కచర్ల: క్రీడా పాఠశాలకు మండల విద్యార్థిని అక్షర ఎంపికయ్యారు. చెల్లాపూర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన అక్షర క్రీడా పాఠశాలకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాడుడు ఆనంద్కుమార్, తోటి విద్యార్థినులు అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. -
పశువుల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి
షాద్నగర్: పాడి రైతులు శాసీ్త్రయ పద్ధతులను పాటించడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంతో పాటు పాల దిగుబడిని పెంచి అధిక లాభాలు పొందొచ్చని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఫరూఖ్నగర్ మండలం పీర్లగూడలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణాను సరైన నిష్పత్తిలో అందించాలని సూచించారు. పాల దిగుబడి పెరగడానికి పశుగ్రాసంలో ఖనిజ లవణాల మిశ్రమాన్ని తప్పనిసరి కలపాలన్నారు. పశువుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని, గొంతువాపు, జబ్బవాపు, గాలికుంట వ్యాధుల నివారణకు సకాలంలో టీకాలు వేయించాలన్నారు. క్రమ తప్పకుండా నట్టల నివారణ మందు తాగించాలన్నారు. జిల్లాలోని 30 గ్రామాల్లో పాడి రైతుల కోసం అవగాహన కార్యక్రమాలు, పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జిల్లా పశుగణాభివృద్ధిశాఖ అధికారి డాక్టర్ అరుణశ్రీ, ఏడీఏ విజయ్కుమార్రెడ్డి, మండల పశువైద్యాధికారి డాక్టర్ ముక్కంటి రాజ్, సర్పంచ్ షమీమ్ బేగం తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్.. పరేషాన్
ఇబ్రహీంపట్నం: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. బుధవారం నుంచి కార్యాలయానికి వచ్చే ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారు. నిత్యం 60 నుంచి 80 వరకు రిజిస్ట్రేషన్లతోపాటు ఈసీ, సీసీ ప్రతులకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్లకు కార్యాలయానికి వందలాది మంది వస్తుంటారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన చలాన్లు కట్టి, స్లాట్ బుక్ చేసుకొని కొనుగోలు, అమ్మకందారులతోపాటు ఇద్దరు సాక్షులు, మధ్యవర్తులు దూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వస్తే ఇంటర్నెట్ పనిచేయడంలేదని అధికారులు చావు కబురు చల్లగా చెబుతున్నారు. కార్యాలయానికి రెండు ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయి. బుధవారం వైర్లు తెగిపోయి మొరాయించాయి. దీంతో మూడు రోజులుగా ఇబ్బందులు తప్పడం లేదు. నెట్వర్క్ సమస్య పరిష్కారానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కార్యాలయానికి వచ్చేవారుకోరుతున్నారు. నెట్వర్క్ పనిచేయడం లేదు ఇంటర్నెట్ పనిచేయని కా రణంగా మూడు రోజులు గా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. సంబంధిత సిబ్బందికి సమాచారం ఇచ్చాం. నెట్కు సంబంధించిన వైర్లు కట్ అయినట్లు చెబుతున్నారు. శనివారంలోపు సమస్య పరిష్కారం అవుతుంది. – రాకేష్, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్, ఇబ్రహీంపట్నం చలాన్ కట్టి మూడు రోజులైంది ఇబ్రహీంపట్నంలోని 284 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్కు బుధవారం రూ.51 వేల చలాన్ కట్టాను. మూడు రోజులుగా రిజిస్ట్రేషన్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా. ఇంటర్నెట్ పనిచేయడంలేదని చెబుతున్నారు. – ఆకుల ఆనంద్కుమార్, ఇబ్రహీంపట్నం -
ఆమనగల్లు ఎంపీడీఓకు పదోన్నతి
ఆమనగల్లు: ఎంపీడీఓగా పనిచేస్తున్న కుసుమమాధురికి పదోన్నతి లభించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆమెనువికారాబాద్ జిల్లా డీఆర్డీఏ డీవీఓగా ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రితో భేటీ మాడ్గుల: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డిని శుక్రవారం రాష్ట్ర గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్గా నియమితులైన సూదిని రాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని సీఎం నివాసంలో సీఎంని కలిసి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. తనను చైర్మన్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్రెడ్డి, కాంగ్రెస్పార్టీ నాయకులు తాండ్ర సాయిరెడ్డి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
తుర్కయంజాల్: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం పీఐసీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆదిబట్ల సర్కిల్ పరిధి కొహెడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్వింటాలుకు రూ.500 బోనస్ అందజేస్తామని తెలిపారు. రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోవద్దని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వంగేటి లక్ష్మారెడ్డి, కొత్త రాంరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు రానీయొద్దు శంకర్పల్లి: వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ అన్నారు. శంకర్పల్లి, మో కిలలోని ట్రాఫిక్ కూడళ్లను శుక్రవారం చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీశ్తో కలిసి పరిశీలించా రు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. కూ డళ్ల వద్ద ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలకు అనుగుణంగా వెళ్లేలా పోలీసులు చొరవ తీసుకోవాలని తెలిపారు. రద్దీ ఉండే సమయం, ప్రాంతాల్లో కచ్చితంగా కానిస్టేబుళ్లను కేటాయించాలన్నారు. బైక్పై వెళ్లే వారు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు తప్పనిసరి ధరించేలా చూడాలని చెప్పా రు. నిత్యం డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని, నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు చేవెళ్ల: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ అన్నారు. చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను శుక్రవారం ఆయన సందర్శించారు. ట్రాఫిక్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీష్తో కలిసి ప్రధాన చౌరస్తాలను పరిశీలించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట చేవెళ్ల ట్రాఫిక్పోలీసులు, సిబ్బంది ఉన్నారు. దోస్త్ ఐడీతో నేరుగా డిగ్రీలో ప్రవేశాలు షాద్నగర్రూరల్: గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో దోస్త్ ఐడీతో నేరుగా ప్రవేశాలు పొందొచ్చని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో ఫేజ్లో జరుగుతున్న ప్రవేశాల్లో గిరిజన విద్యార్థినులు తక్షణమే నేరుగా కళాశాలలో ఆఫ్లైన్ ప్రక్రియద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చని తెలిపారు. అన్ని సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలన్నారు. మీసేవ, ఆన్లైన్లో ఎలాంటి ఫీజు చెల్లించకుండా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం గిరిజన విద్యార్థినులకు మాత్రమే సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సులు బీజెడ్సీ, ఎంజెడ్సీ, బీఏ, బీకాం, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు 97034 41345, 81252 14019, 80085 90318, 99595 25459 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం అండ ఇబ్రహీంపట్నం రూరల్: ఆక్వా రైతులకు ప్రభు త్వం అండగా నిలుస్తుందని, ఇందుకోసం అనే క రకాల పథకాలను తీసుకొచ్చిందని జిల్లా మ త్స్యశాఖ అధికారి పూర్ణిమా సింగ్ పేర్కొన్నా రు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రగతి ప్రణాళికలో భాగంగా మత్స్య ప్ర గతిపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఆర్ఏఎస్ పద్ధతిలో చే పల పెంపకం బాగుందన్నారు. చేపలను చెరువుల్లో పెంచే విధానంపై అవగాహన కల్పించారు. చెరువులు కాలుష్యానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్య క్రమంలో ఇరిగేషన్, హార్టికల్చర్, భూగర్భ జలశాఖ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రావేత్తలు, మత్స్యకారులు, ఆక్వా రైతులు పాల్గొన్నారు. -
ఎన్ఎంఎంఎస్ పనితీరు పరిశీలన
ఇబ్రహీంపట్నం: ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) యాప్ పనితీరును పరిశీలించేందుకు రాయపోల్ గ్రామ పరిధిలో ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశాన్ని శుక్రవారం అడిషనల్ డీఆర్డీఓ సుభాషిణి సందర్శించారు. ముఖకవళికలు గుర్తించే ఈ యాప్ ద్వారా ఉపాధి పనికి వచ్చే కూలీల ఫొటోలు తీసుకుంటారు. పనికి వచ్చిన నాలుగు గంటలకు 40 నుంచి 50 మంది కూలీల మరో గ్రూప్ ఫొటోను తీయాలని తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సాంకేతికంగా ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఆమె ఈ ప్రాంతాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఫొటోల గుర్తింపులో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆమె కూలీలను ప్రశ్నించారు. ఫొటోలకే సమయం పడుతోందని, టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయని కూలీలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఆమె వెంట ఉపాధి హామీ ఏపీఓ చారి, ఫీల్డ్ అసిస్టెంట్లు, మెట్లు ఉన్నారు. -
ఉల్లంఘనులు దండి.. ఆదాయానికి గండి!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కోకాపేటలోని ప్రభుత్వ భూమిలో ఓ నిర్మాణ సంస్థ ఏకంగా 15 లక్షల క్యూబిక్ మీటర్ల మైనింగ్ చేసింది. కానీ ప్రభుత్వానికి పైసా కూడా రాయల్టీ చెల్లించలేదు. కోహెడలో ఓ నిర్మాణ సంస్థ గుట్టను తొలిచి, అక్కడే అక్రమంగా క్రషర్ను ఏర్పాటు చేసింది. రూ.5కోట్ల జరిమానా విధించినా నేటికీ పైసా వసూలు చేయలేకపోయారు. శంషాబాద్, కొత్వాల్గూడ, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, శంకర్పల్లి (111జీఓ పరిధి) పరిసర ప్రాంతాల్లో 20పైగా మొబైల్, ఫిక్స్డ్ క్రషర్లు, రెడీమిక్స్(ఆర్ఎంసీ)ప్లాంట్లు ఉన్నాయి. వీటికి రెవెన్యూ, మైనింగ్, పీసీబీ, స్థానిక సంస్థల నుంచి కనీస అనుమతులు లేవు. కళ్లముందే ఎత్తైన కొండలను ఏళ్లుగా పిండి చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ఇక బండరావిర్యాలలో, చిన్నరావిర్యాల, కొత్తూరు, యాచారం, తలకొండపల్లిలోని లీజుదారులు ఒకే ట్రాన్సిట్ పాస్, వే బిల్లును పదేపదే ఉపయోగిస్తున్నట్లు ఫిర్యాదులు లేకపోలేదు. బాలాపూర్ దేవతలగుట్టపై సైతం అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. క్వార్జ్, ఫ్లెడ్స్పార్, స్టోన్ మెటల్స్, లేటరేట్, గ్రావెల్, కలర్ గ్రానైట్ వంటి విలువైన ఖనిజాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా గనుల తవ్వకాలపై దృష్టిసారించాల్సిన మైనింగ్ విభాగం అధికారులు లీజుదారులతో కుమ్మకై ్క.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఫలితంగా 2023–24లో జరిపిన మైనింగ్ తవ్వకాలు, రాబడితో పోలిస్తే.. 2024–25లో భారీ వ్యత్యాసం నమోదైంది. అనుమతులకు మించి తవ్వకాలు జిల్లాలో 279.854 హెక్టార్ల విస్తీర్ణంలో 51 క్వార్జ్మైన్స్, ఇక 496.83 హెక్టార్ల విసీ్త్రర్ణంలో 84 స్టోన్ అండ్ మెటల్స్ మైన్స్, 22.9 హెక్టార్ల విసీ్త్రర్ణంలో 12 బ్లాక్ గ్రానైట్ మైన్స్, ఐదు హెక్టార్ల ప్రభుత్వ భూమిలో కలర్ గ్రానైట్ మైన్ ఉంది. 53.490 హెక్టార్ల ప్రభుత్వ భూమిలో మూడు లేటరైట్ గనులు ఉన్నాయి. మెజార్టీ లీజుదారులు అనుమతులకు భిన్నంగా తవ్వకాలు జరిపి, అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. కొండంత తవ్వకాలు చేపట్టి.. లీజు, రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి అంతంతే చెల్లిస్తున్నారు. తవ్వకాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిన మైనింగ్ అధికారులు లీజుదారులతో కుమ్మకై ్క.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ విభాగం విచారణలోనూ ఇదే అంశం స్పష్టమైంది. అక్రమ మైనింగ్, లైసెన్సులు లేని క్రషర్ మిషన్లు, ఆర్ఎంసీ ప్లాంట్లపై చర్యలకు ఆదేశించడంతో గౌలిదొడ్డి, వట్టి నాగులపల్లి, గోపన్పల్లి, శంషాబాద్, కొత్వాల్గూడలోని ఎనిమిది క్రషింగ్ యూనిట్లు, 12 రెడీమిక్స్ ప్లాంట్లను హైడ్రా కూల్చివేసింది. అయితే ఓఆర్ఆర్కు సమీపంలో అజీజ్నగర్లోని పది ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న అక్రమ రెడీ మిక్స్ప్లాంట్పై చర్యలు తీసుకోకుండా వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులకు మించి తవ్వకాలు.. రాయల్టీ ఎగవేత జిల్లాలో భారీగా అక్రమ మైనింగ్..పట్టించుకోని వైనం 2023తో పోలిస్తే భారీగా పడిపోయిన ఆదాయం ఖనిజం 2022–23 2023–24 2024–25 క్వార్ట్జ్ 3,27,450 3,25,043 3,37,616 ఫ్లెడ్స్పార్ 3,46,257 3,16,572 1,76,710 స్టోన్ మెటల్స్ 50,12,278 26,13,916 20,51,031 లేటరైట్ 3,16,019 5,04,212 4,71,628 గ్రావెల్ 1,80,091 1,50,325 2,59,032 కలర్ గ్రానైట్ – 25.826 46.627 తాత్కాలిక అనుమతులు ద్వారా స్టోన్ అండ్ మెటల్ 2,36,500 4,71,000 9,61,450 మట్టి తవ్వకాలు 8,80,700 3,02,500 8,46,430 ఖనిజం 2022–23 2023–24 2024–25 క్వార్ట్జ్ 287.27 586.92 363.83 ఫ్లెడ్స్పార్ 358.89 643.06 493.84 స్టోన్ మెటల్స్ 3661.20 3240.41 3259.54 లేటరైట్ 395.04 1230.80 1144.79 గ్రావెల్ – 1230.80 1144.79 బ్లాక్ గ్రానైట్ 59.87 41.62 2.14 కలర్ గ్రానైట్ – 28.52 0.02 తాత్కాలిక అనుమతుల ద్వారా స్టోన్ అండ్ మెటల్ 154.37 551.07 1083.67 మట్టి తవ్వకాలు 886.94 108.90 35.34స్టోన్ అండ్ మెటల్స్ 84 క్వార్ట్జ్ అండ్ ప్లెడ్స్పార్ 51 లేటరైట్ 03 గ్రానైట్ 12 మొత్తం 150 -
సిద్ధాపూర్లో డంపింగ్యార్డు వద్దు
కొత్తూరు: సిద్ధాపూర్ గ్రామ శివారులో ప్రభుత్వం సేకరించిన పొలాల్లో డంపింగ్యార్డు ఏర్పాటు చేయొద్దని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్రెడ్డి పలువురు సర్పంచ్లతో కలిసి గురువారం ఆర్డీఓ సరితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు సేకరించిన పొలాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అంతేతప్పా హైదరాబాద్ పరిసర ప్రాంత చెత్త, వ్యర్థాలను తెచ్చి డంపింగ్యార్డు ఏర్పాటు చేస్తామంటే మాత్రం వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. డంపింగ్యార్డు ఏర్పాటు చేస్తే సమీపంలోని కొడిచర్ల, ఎస్బీపల్లి, ఇతర తండాలు కాలుష్య భరితంగా మారుతాయన్నారు. ఇక్కడి ప్రజలు అనారోగ్యాలు, ఇతర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు ఎర్రొళ్ల జగన్, గోవింద్నాయక్, బాసునాయక్, శ్రీరాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అజీజ్నగర్కు గుడిమల్కాపూర్ మార్కెట్
మొయినాబాద్: నగరంలోని గుడిమల్కాపూర్ మార్కెట్ అజీజ్నగర్కు తరలిరానుంది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారికి ఇరుపక్కల అజీజ్నగర్, హిమాయత్నగర్ రెవెన్యూలో 42.32 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు ఇటీవల కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే మార్కెటింగ్ శాఖకు భూమి అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ట్రాఫిక్ అంతరాయం తగ్గించేందుకు నగరంలోని మెహదీపట్నం సమీపంలో ఉన్న గుడిమల్కాపూర్లో 1992లో నాటి ప్రభుత్వం అప్పటి అవసరాలకు అనుగుణంగా కూరగాయలు, పూల మార్కెట్ నిర్మించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల మార్కెట్, 11 ఎకరాల్లో పూలమార్కెట్ కొనసాగుతున్నాయి. నిత్యం వేల మంది రైతులు కూరగాయలు, పూలు తీసుకుని మార్కెట్కు వెళ్తున్నారు. ప్రతి రోజు 20–25 టన్నుల కూరగాయలు, 30–40 టన్నుల పూలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. రైతులతోపాటు, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే కూరగాయలు, పూలను లారీలు, డీసీఎంలలో తీసుకొస్తుంటారు. కూరగాయలు, పూలు కొనడానికి వచ్చేవారు సైతం వాహనాల్లోనే వస్తారు. మార్కెట్ స్థాయికి మించి వాహనాలు వస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. పండుగల సమయంలో మార్కెట్ వద్ద గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుంటాయి. దూర ప్రాంతాల నుంచి మార్కెట్కు వచ్చే రైతులు ట్రాఫిక్ సమస్యతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు మార్కెట్లో దళారులు ఎక్కువై రైతులు నష్టపోతున్నారు. మౌలిక సదుపాయాలు సైతం సరిగా లేవు. ఈ పరిస్థితులను అధిగమించడానికే మార్కెట్ను నగర శివారు ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ప్రభుత్వం మొదలు పెట్టింది. ఓఆర్ఆర్కు చేరువలో... సమీకృత మార్కెట్ ఏర్పాటుకు మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్, హిమాయత్నగర్ రెవెన్యూల్లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. అజీజ్నగర్ రెవెన్యూలోని సర్వేనెంబర్ 176, హిమాయత్నగర్ రెవెన్యూలోని సర్వేనెంబర్ 151లో మొత్తం 60 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. వీటిలో కొంత భూమిపై కోర్టు కేసులు ఉండడంతో క్లియర్గా ఉన్న 42.32 ఎకరాల భూమిని మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సమీకృత మార్కెట్ ఏర్పాటుకు 42.32 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతం ఔటర్ రింగ్రోడ్డుకు కేవలం రెండు కిలో మీటర్ల దూరంలో.. హైదరాబాద్–బీజాపూర్ రహదారికి ఇరువైపులా ఉండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారితోపాటు స్థానిక రైతులకు అనువుగా ఉంటుంది. భూకేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే మార్కెటింగ్ శాఖకు భూమి అప్పగించే అవకాశం ఉంది. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైతులకు మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. ఓఆర్ఆర్ పక్కనే ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తవు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. – సోనియాదర్శన్, మున్సిపల్ చైర్పర్సన్, మొయినాబాద్ అజీజ్నగర్, హిమాయత్నగర్ రెవెన్యూల్లోని సర్వేనెంబర్ 176, 151లో మొత్తం 60 ఎకరాల ప్రభుత్వ భూమిని సమీకృత మార్కెట్ ఏర్పాటుకోసం పరిశీలించి సర్వే చేశాం. కోర్టు కేసులు లేకుండా ఉన్న 42.32 ఎకరాల భూమికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక పంపాం. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో దీన్ని కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే మార్కెటింగ్ శాఖకు భూమిని అప్పగిస్తాం. కోర్టు కేసులు పరిష్కారం తర్వాత మిగిలన భూమి ఇస్తాం. – గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్ హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు 42.32 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే మార్కెటింగ్ శాఖకు భూమి అప్పగింత -
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు: సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
మంచాల: సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాయతీలు అందిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అన్నారు. ప్రజాపాలన’–ప్రగతి ప్రణాళ/క కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులకు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సోలాలర్ విద్యుత్ వినయోగంలోకి తెచ్చేందుకు విశేషంగా కృషి చేస్తోందన్నారు. సౌరశక్తి నిరంతరం లభించే స్వచ్ఛమైన హరిత శక్తి అన్నారు. రాష్ట్రంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి 10,642 మెగా వాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. 2029–30 నాటికి 29, 645 మెగావాట్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని వివరించారు. పీఎం కుసుమ్–ఎ పథకం ద్వారా రైతులు తమ భూముల్లో 0.5 మెగా వాట్ల–2.0 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఒక మెగా వాట్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 3.5ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు. చిన్న, సన్నకారు రైతులు ఇద్దరు లేదంటే ముగ్గురు కలిసి గ్రూపులగా ఏర్పడి సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. సోలార్ ఆధారిత డెమో పంప్సెట్లు, సౌర విద్యుత్ ప్లాంట్లను పరిశీలన చేసి రైతులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీజీ ఎస్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అనంతరెడ్డి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉష, ఏఓ వెంకటేశ్, విద్యుత్ శాఖ డీఈఈ నరేశ్ కుమార్, ఏడీఏ సుజాత, ఏడీఈ సీతారాములు, ఏఈఈలు బాజీసింగ్, అఖిలేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
షాద్నగర్ డీసీపీకి పీసీఏ నోటీసులు
షాద్నగర్: తప్పుడు కేసుల నమోదుపై వెంటనే విచారణ చేపట్టాలని షాద్నగర్ డీసీపీకి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ(పీసీఏ) బుధవారం నోటీసులు జారీ చేసింది. వివరాలు... తమపై తప్పుడు కేసులు పెట్టి నందిగామ పోలీసులు వేధిస్తున్నారని మార్చి 23వ తేదీనన నందిగామ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కొంగర మహేశ్, యాదమ్మ, శేఖర్, వెంకటేశ్ పీసీఏను ఆశ్రయించారు. తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఫిర్యాదు తేదీలను తారుమారు చేయడం, ఫోర్జరీ సంతకాలతో చార్జిషీట్ దాఖలు చేయడమే కాకుండా బాధితుల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో నిందితులకు కొమ్ముకాస్తూ తాము ఆధారాలు సమర్పించినా కేసు నమోదు చేయకుండా తమపైనే కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన పీసీఏ క్రైం నెంబర్ 112/2025 రిజిస్ట్రేషన్ చార్జిషీట్ సమర్పించిన పరిస్థితులు, బాధితులు గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, లంచాల వసూలు, ఫోర్జరీ సంతకాలపై పోలీసుల పాత్ర వంటి అంశాలపై విచారణ జరిపించి ఈనెల 15 తేదీలోగా నివేదిక అందించాలని షాద్నగర్ డీసీపీకి నోటీసులు జారీ చేశారు. కడ్తాల్: నూతన మండలముగా ఏర్పడిన కడ్తాల్లో ప్రభుత్వాస్పత్రి, 108 వాహనం ఏర్పాటు చేయాలని ఏవీబీవీ మండల అధ్యక్షుడు దోనాదుల మహేశ్ కోరారు. బుధవారం ఆయన రాజ్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సివిల్ డిఫెన్స్ మంత్రి ధరంవీర్ ప్రజాప్రతిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రి, 108 వాహనం లేక మండల వాసులు పడుతున్న ఇబ్బందులను గవర్నర్కు వివరించారు. ఆయన వెంట జాపాల సుధాకర్, కాసుల సురేశ్, హరిబాబు, రవి, ఎగిరిశెట్టి రాజు, ఈశ్వర్, నరేశ్, తదితరులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్ పదవులకు ఇద్దరు రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం పీఏసీఎస్ సీఈఓ గణేశ్కు రాజీనామా లేఖలను అందజేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికై న టేకుల సుదర్శన్రెడ్డి, కౌన్సిలర్గా గెలుపొందిన క్యామా శంకర్ పీఏసీఎస్ డైరెక్టర్లుగా ఉన్నారు. జోడి పదవులు ఉండకూడదని రాజీనామా చేసినట్లు తెలిపారు . సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి కొడంగల్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష చేశారు. సభా వేధిక, ప్రాంగణం, పార్కింగ్, ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు జగన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, ఆర్ఐఈ రాములు, డీపీఆర్ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
భగ్గుమన్న పాత కక్షలు
కొండా చెక్కిన కమలం ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న మోదీ బహిరంగ సభను విజయవతం చేసేందుకు బీజేపీ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్లలో గోడపై కమలం పువ్వు గుర్తుకు రంగులద్దారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. – చేవెళ్ల దాడిలో గాయపడిన శంకర్ నాయక్, రోదిస్తున్న భార్యవికారాబాద్ అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్ అనంతగిరి: నగరంలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 11న నిర్వహించే మెగా జాబ్మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో యువజన విభాగం, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాబ్మేళాకు హాజరయ్యే యువతి, యువకులు వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కబిషనర్ విక్రం సింహారెడ్డి, జిల్లా క్రీడల శాఖ అధికారి సత్తార్ తదితరులు పాల్గొన్నారు. కర్రలతో దాడి చేసుకున్న ఇరు కుటుంబాలు తొమ్మిది మందికి రక్త గాయాలు, ఒకరి పరిస్థితి విషమం 14 మందిపై కేసు నమోదు నీళ్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం -
లయన్స్క్లబ్ చొరవతో నేత్రదానం
ఆమనగల్లు: పట్టణానికి చెందిన రమేశ్ బుధవారం మృతిచెందడంతో లయన్స్క్లబ్ సహకారంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో మరో ఇద్దరికి దృష్టిభాగ్యం కల్పించారు. మృతిచెందిన రమేశ్ కుటుంబ సభ్యులను లయన్స్క్లబ్ జిల్లా చైర్మన్ అర్థం మనోహర్, అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యుల అంగీకారంతో రమేశ్ కళ్లను హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అప్పగించారు. నేత్రదానం చేసిన రమేశ్ కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో లయన్స్క్లబ్ సభ్యులు గంప శ్రీనివాస్, పాషా, దివంగత రమేశ్ కుటుంబ సభ్యులు పారిజాత, లక్ష్మీశ్రీనివాస్, వంశిత, నరేందర్, నవీన్, రంజన తదితరులు ఉన్నారు. -
తెలంగాణ వికాసమే బీజేపీ లక్ష్యం
షాద్నగర్: తెలంగాణ వికాసమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో కుటుంబ పాలనకు కాలం చెల్లిందన్నారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కుటుంబ పార్టీలను ప్రజలు ఇంటికి పంపించారని అన్నారు. తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని.. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఆరంభం మాత్రమేనని అన్నారు. వికసిత తెలంగాణ లక్ష్యంగా ద్యేయంగా కేంద్రం పని చేస్తోందన్నారు. ఈ నెల 10న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్బంగా సభకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి రాజభూపాల్, నాయకులు అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, కక్కునూరి వెంకటేష్గుప్తా, దేపల్లి అశోక్, చెంది మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి -
మోదీ పాలనలో పెరిగింది పేదరికమే
చేవెళ్ల: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టాక పేదరికం, నిరుద్యోగం పెరిగిందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కె.రామస్వామి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ధరల నియంత్రించాలనే డిమాండ్తో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందన్నారు. వికసిత్భారత్ లక్ష్యం ధరల పెంచడమేనా అని ఎద్దేవా చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్తిరెడ్డి, ప్రభులింగం, వడ్ల సత్యనారాయణ, మక్బూల్, మంజుల, పాపయ్య, కార్మికులు మల్లయ్య, వెంకయ్య, యాదమ్మ, నర్సింలు, వెంకటమ్మ, రాజు, శేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామస్వామి -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
మీర్పేట: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం ఆమె ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బడంగ్పేట సర్కిల్ ప్రశాంతిహిల్స్ డివిజన్లోని క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ సమ్మర్ క్యాంపును టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధికి క్రీడలు దోహదపడతాయని, కాలనీల్లోని ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేసి కబడ్డీ, షటిల్, టెన్నిస్ కోర్టులను ఏర్పాటు చేసి పిల్లలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. అనంతరం చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని, ప్రజల వద్దకు వెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 99 రోజుల ప్రణాళిక కార్యక్రమానికి నిర్వహిస్తున్నారని చెప్పారు. విద్యతో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 20 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ముందు చూపుతో మీర్పేట ప్రాంతంలో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన చెప్పారు. డీసీ సమ్మయ్య మాట్లాడుతూ క్యాంపులో కబడ్డీ, కరాటే, ఖోఖో తదితర క్రీడల్లో అనుభవజ్ఞులైన కోచ్లతో శిక్షణ ఇస్తామని వివరించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ సంతోశ్, ఏఎంహెచ్ఓ డాక్టర్ ప్రవీణ్, ఏఈ గంగాప్రసాద్, ఎస్.హరీశ్, సౌజన్య, నాయకులు అర్కల భూపాల్రెడ్డి, చల్లా బాల్రెడ్డి, అనిల్యాదవ్, దోమలపల్లి రాజ్కుమార్, అర్కల కామేశ్రెడ్డి, సిద్దాల శ్రీశైలం, భూపేశ్గౌడ్, నర్సిరెడ్డి, మాదరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సబితారెడ్డి -
కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించండి
ఇబ్రహీంపట్నం రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు బోసుపల్లి ప్రతాప్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ మండల అధ్యక్షుడు గోదల శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో దండుమైలారంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట ఎక్కువ తూకం వేస్తున్నారని ఆరోపించారు. మిల్లర్లు ధాన్యం అన్లోడ్ చేయకపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారన్నారు. దండుమైలారం ఐకేపీ సెంటర్లో సీజన్కి 80 వేల నుంచి లక్షా బస్తాలు కొనుగోలు చేస్తుండగా సూమారుగా 640 క్వింటాళ్ల ధాన్యం అదనంగా రైతుల నుంచి ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, అధికారులు, మిల్లర్లతో కుమ్మకై ్క రైతులకు రూ.25 లక్షల వరకు నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చొరవ తీసుకొని సౌకర్యాలు కల్పించాలని కోరారు. లేదంటే కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొండ రమణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నెర్రపల్లి సర్పంచ్ శ్రీహరి, వేణుగోపాల్రెడ్డి, తదితరులు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రతాప్ -
రైతు ప్రయోజనాలే లక్ష్యం
అబ్దుల్లాపూర్మెట్: పంటలకు గిట్టుబాటు ధరను కల్పించడంతో పాటు రైతులను ఆదుకోవడంలో ప్రజాప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో రైతువారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు వాటి అమలు తీరుపై అవగాహన కల్పించారు. రైతు సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర చారి, సభ్యులు బండి మధుసూదన్ రావు, మచ్చేందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, నర్సింహ,అంజయ్య, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి -
హనుమ
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026భూములుసాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు.. రామనామం జపించని వాడ ఉండదనే నానుడి. ఇలా ఊరిని కాపాడే అంజన్న భూమలకే నేడు రక్షణ కరువైంది. భగవంతునికి, భక్తులకు అనుసంధానంగా ఉండాల్సిన పూజారి కుటుంబం, ప్రభుత్వ పెద్దలు, అధికారులతో కలిసి ఏకంగా దేవుడికే శఠగోపం పెడుతున్నారు. అడ్డదారుల్లో ఓఆర్సీ(ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్)లు సృష్టించి.. విలువైన భూములను గుట్టుగా అమ్మకానికి పెట్టింది. బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.కోటి పలికే ఈ భూములను అగ్గువకే కొట్టేసేందుకు ప్రభుత్వంలోని పెద్దలు, రియల్టర్లు తెరవెనుక పావులు కదుపుతున్నారు. తీరా ఈ విషయం బయటికి పొక్కి.. గ్రామస్తులు ఆందోళనకు దిగడం, భూములను రక్షించుకునేందుకు హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. దేవుడికే శఠగోపం మాడ్గుల మండలం ఆర్కపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 88, 241, 242, 283లలో మొత్తం 33.20 ఎకరాల భూమి ఉంది. ఆలయ నిర్వహణకు ఈ భూములు కేటాయించారు. ఇక్కడ లక్ష్మయ్య అనే పూజారి చాలాకాలం పని చేశారు. దీంతో అప్పటి రెవెన్యూ అధికారులు ‘కాస్తు’కాలంలో లక్ష్మయ్య పేరును నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన వారసులు హైదరాబాద్ వెళ్లారు. నాటి నుంచి ఈ గుడి బాధ్యతలను గ్రామస్తులే చూసుకుంటున్నారు. రెవెన్యూ ‘కాస్తు’ కాలంలో పూజారి లక్ష్మయ్య పేరు నమోదు చేసి ఉండటాన్ని వారసులు అవకాశంగా తీసుకున్నారు. అప్పటికే ఈ భూములపై కన్నేసిన అధికారపార్టీ పెద్దలు, రియల్ మాఫియా పరోక్షంగా వారసులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందు కు రెవెన్యూ యంత్రాంగం చేయి కలిపింది. దీంతో నకిలీ ఓఆర్సీలు బయటికి వచ్చాయి. ఓఆర్సీ ఇనాం భూములకు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. కానీ పూజారి కుటుంబానికి ప్రభుత్వం కానీ, దేవాదాయశాఖ కానీ ఎలాంటి ఓఆర్సీలు జారీ చేయలేదు. నివేదిక బయటికి రాకుండా.. 1854–1954 సర్వే సెటిల్మెంట్ నుంచి ఈ భూమి ఆంజనేయ స్వామి ఆలయం పేరిటే ఉంది. ప్రస్తుత భూ భారతి పోర్టల్లోనూ ఇదే పేరుతో నమోదై ఉంది. ఈ భూమి పూర్తిగా దేవాదాయశాఖకు చెందినదిగా స్పష్టమవుతోంది. కానీ ఆ పూజారి కుటుంబం దేవుడి ప్రసాదం తినమంటే ఏకంగా దేవుడి భూములనే మింగేందుకు యత్నిస్తోంది. 50 ఏళ్ల క్రితం ఊరును వదిలేసి వెళ్లిన సదరు పూజారి కుటుంబానికి భూభారతి పోర్టల్కు భిన్నంగా ఓఆర్సీ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అప్పటి ఇబ్రహీంపట్నం ఆర్డీఓ పనితీరుపై స్థానికులు రెవెన్యూ, సహా ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ నేతృత్వంలోని రెవెన్యూ ట్రిబ్యునల్ ఇప్పటికే ఈ అంశంపై విచారణ పూర్తిచేసింది. కాగా ఇప్పటి వరకు నివేదికను బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్కపల్లి ఆంజనేయ స్వామి ఆలయంఆలయ మాన్యం అమ్మకానికి కుట్ర పూజారి కుటుంబం, అధికార పార్టీ నేతల మాయాజాలం కొంతమంది అధికారుల సహకారంతో నకిలీ ఓఆర్సీల సృష్టి హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు ఆర్కపల్లి ఆంజనేయస్వామి భూముల ఓఆర్సీ జారీ అంశంపై విచారణ చేపట్టాం. 2014 పహానీల్లో ఆంజనేయస్వామి ఆలయం పేరున నమోదై ఉంది. అయితే అంతకు ముందు పహానీల్లో మాత్రం ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఈ అంశాన్ని దేవాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్లాం. ఆ శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అప్పటి వరకు విచారణ నివేదికను పెండింగ్లో పెట్టాలని భావించాం. వివాదాస్పద భూముల్లో అగ్రిమెంట్లు జరిగిన విషయం నాకు తెలియదు. భూభారతి పోర్టల్లోనూ ఈ భూములను ఆంజనేయస్వామి పేరునే నమోదు చేసి ఉంచాం. – అనంతరెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
వీధి కుక్కల దాడిలో జింక మృతి
యాచారం: వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందింది. వివరాలు.. మండల పరిధిలోని మాల్–కొత్తపల్లి గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిలోని గుట్టల ప్రాంతం నుంచి బుధవారం ఓ జింక కిషన్పల్లి సమీపంలోకి వచ్చింది. ఇది గమనించిన వీధి కుక్కలు జింకను వెంటాడి దాడి చేసి చంపేశాయి. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి కళేబారాన్ని అటవీ ప్రాంతంలో ఖననం చేశారు. ఇద్దరు డ్రైవర్లపై కేసు షాబాద్: నాగర్గూడ ఈసీ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. షాబాద్ ఎస్ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి నాగర్గూడ సమీపంలోని ఈసీ వాగునుంచి ఇసుకను తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని జేసీబీ సాయంతో ట్రాక్టర్లు, టిప్పర్ల ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన డ్రైవర్లు అక్కడ నుంచి తప్పించుకున్నారు. జేసీబీని ఠాణాకు తరలించి సీజ్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. సైబరాబాద్,హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 98 మందికి పాజిటివ్ సాక్షి, సిటీబ్యూరో: శాంతి పరిరక్షణలో భాగంగా సైబరాబాద్ పోలీసు శాఖ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా ఘర్షణలు, దాడులకు దిగేవారిపై రౌడీ షీట్లను తెరుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రౌడీ షీటర్లకు బుధవారం ఆకస్మిత డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 128 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ టెస్ట్లు నిర్వహించగా.. 11 మందికి పాజిటివ్ వచ్చింది. మిగతావారికి 117 మందికి నెగిటివ్ వచ్చింది. కాగా.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 204 మంది రౌడీషీటర్లకు పరీక్షలు నిర్వహించగా.. 87 మంది డ్రగ్స్ సేవించినట్లు (పాజిటివ్) నిర్ధారణ అయింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
● యువకుడికి తీవ్ర గాయాలు ● తలకొండపల్లి వద్ద బైక్ను లారీ ఢీకొట్టడంతో ఘటనఆమనగల్లు: తలకొండపల్లి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తలకొండపల్లి ఎస్హెచ్ఓ జానకిరాంరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగరావ్పల్లికి చెందిన కుమార్ తన అత్త జంగమ్మ(50)ను తీసుకుని బైక్పై తలకొండపల్లికి వెళ్తుండగా కాటన్మిల్లు వద్ద ఎదురుగా వచ్చిన లారీ అంతివేగంతో ఢీకొట్టింది. ఘటనలో జంగమ్మ మృతిచెందింది. తీవ్ర గాయాలపాలైన కుమార్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ జానకిరాంరెడ్డి తెలిపారు. -
పునర్ నవీకరణ పూజలు ప్రారంభం
కొడంగల్: పట్టణంలోని బాలాజీ నగర్లో వెలిసిన పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్ నవీకరణ పూజలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తిరుమల అర్చకులు భగవత్ ప్రార్థన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, వాస్తు మండల పూజ, వాస్తు హోమం, పూర్ణాహుతి, హలయుగలాంగల పూజాకర్షణ తదితర వైదిక కార్యక్రమాలను వైఖానస ఆగమ శాస్త్రోకంగా నిర్వహించారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన యాగశాలలో హోమం తదితర పూజలను వైభవంగా చేశారు. గురువారం ఉదయం పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, వాస్తు హోమం, గోగణ పూజ, గోగణ నివేదన, పూర్ణాహుతి, యాగశాల వాస్తు, అంకురార్పణ అగ్ని ప్రతిష్ఠ, చతుర్వేద శిలాశుద్ధి, మహాశాంతి హోమం ఉంటాయని తెలిపారు. 8వ తేదీ ఉదయం 7.10 గంటల నుంచి 8.20 గంటల మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రథమ శిలేష్టికాన్యాస కార్యక్రమం నిర్వహిస్తారు. పూజల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని అర్చకులు కోరారు. పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, ఆలయ ధర్మకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నమూనా మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ నమూనాను అధికారులు సిద్ధం చేశారు. ఆలయ విస్తరణ ప్రభుత్వం రూ.110 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు ప్రారంభమయ్యాయి. తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా నాలుగు మాఢ వీధులు, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ మండపం, ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, క్యూలైన్, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మిస్తారు. -
డీసీఎం బోల్తా
● రోడ్డుకు అడ్డంగా పడిపోయిన మొక్కజొన్న బస్తాలు ● భారీగా ట్రాఫిక్ జామ్ కందుకూరు: మొక్కొజొన్న లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తూ ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్ నుంచి మొక్కజొన్న లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం శ్రీశైలం రహదారిపై దెబ్బడగూడ గేట్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. మొక్కజొన్న సంచులు రోడ్డుపై పడిపోవడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ ద్వారా వాహనాన్ని పక్కకు జరిపారు. జేసీబీతో మొక్కజొన్న సంచులను రోడ్డు పక్కకు తరలించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీంతో వాహనదారులు ఊపిరి తీసుకున్నారు. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య తాండూరు రూరల్: ‘నేను చనిపోతున్నా.. నన్ను క్షమించండి నాన్న’ అంటూ ఓ యువుకుడు వీడియోకాల్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం రేగొండి గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శరత్(30).. మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని రుక్మాపూర్– తాండూరు రైల్వే పట్టాల వద్ద గూడ్స్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకు ముందు మృతుడు.. తండ్రి వెంకటయ్యకు వీడియో కాల్ చేసి, అఘాయిత్యానికి పూనుకున్నాడు. వెంటనే స్పందించిన కుటుంబీకులు రేగొండి సమీపంలోని రైలు పట్టాల పరిసరాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. రుక్మాపూర్ సమీపంలో తనువుచాలించాడు. శరత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే హెడ్ కానిస్టేబుల్ వీరేశం తెలిపారు. మృతుడికి భార్య విజయలక్ష్మి, ఏడాది బాలుడు ఉన్నారు. చావుకు కారణాలు తెలియరాలేదు. హైడ్రా ప్రజావాణికి 4 వారాల విరామం సాక్షి, సిటీబ్యూరో: హైడ్రా ప్రజావాణికి నాలుగు వారాల పాటు విరామం ప్రకటిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలాదిగా వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మిగిలిన అర్జీలను పూర్తిగా క్లియర్ చేయడానికి మరో నాలుగు వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నామన్నారు. జూన్ 8 నుంచి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై అత్యవసరమైతే కార్యాలయానికి వచ్చి కలవవచ్చని ఆయన సూచించారు. జీపీ ట్రాక్టర్ చోరీ కేసులో ట్విస్ట్ మాజీ సర్పంచ్కు రిమాండ్ యాలాల: గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చోరీ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ మాజీ సర్పంచ్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని, రిమాండ్కు తరలించారు. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బషీర్మియాతండా ట్రాక్టర్ను డ్రైవర్ సుభాష్ ఎప్పటిలాగే ఈ నెల 3న గ్రామ సమీపంలోని వాటర్ ట్యాంకు వద్ద పార్క్ చేశారు. కాగా మరుసటి రోజు నుంచి అది కనిపించలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శి వెంకట్రెడ్డి మంగళవారం ట్రాక్టర్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. తండా నుంచి వెళ్లే మార్గాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. ట్రాక్టర్ ఘట్కేసర్ ప్రాంతం వైపు వెళ్లినట్లు గుర్తించారు. వాహనం ఉన్న ప్రాంతానికి వెళ్లి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోరీ గురించి ఆరా తీయగా, ప్రధాన సూత్రధారిగా మాజీ సర్పంచ్ మిత్రు ఉన్నట్లు గుర్తించారు. అతనితో పాటు అతని బంధువులు రాథోడ్, కిరణ్ ఉన్నట్లు పేర్కొన్నారు. -
శ్రీవారి ఆలయ అభివృద్ధికి సర్వం సిద్ధం
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్లో వెలిసిన పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నవీకరణ పూజలు నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. రూ.110 కోట్ల వ్యయంతో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 8వ తేదీ ఉదయం 7.10 నుంచి 8.20 గంటల మధ్యలో శంకుస్థాపన చేస్తారు. సీఎం దంపతులు ప్రథమ శిలేష్టికాన్యాస (శంకుస్థాపన, భూమి పూజ) కార్యక్రమం నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. తిరుమల తరహాలో నాలుగు మాఢ వీధులు, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ మండపం, ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, క్యూ లైన్, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మించనున్నారు. కార్యక్రమ వివరాలు ● 6వ తేదీ(బుధవరం) ఉదయం భగవత్ ప్రార్థన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, వాస్తు మండల పూజ, వాస్తు హోమం, పూర్ణాహుతి, హలయుగలాంగల పూజాకర్షణం నిర్వహిస్తారు. ● 7వ తేదీ(గురువారం) పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, వాస్తు హోమం, గోగణ పూజ, గోగణ నివేదన, పూర్ణాహుతి, యాగశాల వాస్తు, అంకురార్పణ అగ్ని ప్రతిష్ఠ, చతుర్వేద శిలాశుద్ధి, మహాశాంతి హోమం ఉంటాయి. ● 8వ తేదీ(శుక్రవారం) ఉదయం కుంభారాధన, చతుర్వేద శిలలకు అభిషేకం, హోమాలు, పుర్ణాహుతి, ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రథమ శిలేష్టికాన్యాస (శంకుస్థాపన) కార్యక్రమాలు ఉంటాయి. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి బహిరంగ సభ ప్రాంగణం, యాగశాల, ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఏర్పాట్లు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి పునర్నవీకరణ పూజలు 8న సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం -
సంచార జాతులకు వెసులుబాటు
కొడంగల్: రాష్ట్ర ప్రభుత్వం డీఎన్టీ సర్టిఫికెట్ జారీతో సంచార జాతి కులాలకు మేలు చేకూరుతుందని బైలు కమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ సూర్యవంశీ, రాష్ట్ర సంచార జాతుల ఉపాధ్యక్షుడు మోహన్ చవాన్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం తమ కులాలకు న్యాయం చేశారని కొనియాడారు. మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంచార జాతుల సంక్షేమం, గుర్తింపు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. బీసీ ఏ గ్రూపులో ఉన్న 49 కులాలు, బీసీ ఈ గ్రూపులో ఉన్న 2 కులాలను కలిపి మొత్తం 51 కులాలను సంచార జాతులుగా గుర్తించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల తరహాలో ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంచార జాతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బైలు కమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ సలోంకి, శివాజీ, కృష్ణ, భీమయ్య, కొడంగల్ బైలు కమ్మర సంఘం అధ్యక్షుడు ఆనంద్ పవార్, జనరల్ సెక్రటరి శివాజీ, విజయ్, సంజు, బాబు చవాన్ తదితరులు పాల్గొన్నారు. -
రుణాలు చెల్లించరే!
యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పర పతి సంఘం (పీఏసీఎస్)లో దీర్ఘకాలిక రుణాలు పొంది, తిరిగి చెల్లించని వారి ఆస్తుల జప్తునకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సిద్ధమవుతోంది. యాచారం పీఏసీఎస్లో 1,500 మంది రైతులకు పైగా తమ పట్టాదారు, పాసుపుస్తకాలను మార్టిగేజ్ చేసి రూ.50 కోట్లకు పైగా లాంగ్టర్మ్ లోన్లు పొందారు. వీరంతా పౌల్ట్రీ, డెయిరీఫాం, మేకలు, గొర్రెల పెంపకం చేపట్టారు. తీసుకున్న రుణాలను ఏటా మార్చి 30లోపు వాయిదాలతో కూడిన రుణం, వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. 550 మందికి పైగా రైతులు ఏటా సక్రమంగా వాయిదాలు చెల్లిస్తూ పీఏసీఎస్కు సహకరిస్తున్నారు. మిగిలిన వారు మొండికేశారు. దీంతో అధికారులు వీరి ఇళ్లు, వ్యవసాయ బావుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హెచ్డీసీసీ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పీఏసీఎస్ అధికారులు పలుమార్లు రైతులను కలిసి బకాయిలు చెల్లించాలని హెచ్చరికలు చేసినా మార్పు రావడం లేదు. లీగల్ నోటీసులు అందజేత యాచారం పీఏసీఎస్లో మూడేళ్లుగా 932 మంది రైతులు సక్రమంగా వాయిదాలు చెల్లించడం లేదు. వీరికి లీగల్ నోటీసులు పంపినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో రుణాల కోసం తాకట్టు పెట్టిన పొలాల జప్తునకు అధికారులు రెడీ అయ్యారు. ఈనెల 15న ఉదయం 11 గంటలకు యాచారం పీఏసీఎస్లో అసలు, వడ్డీతో కలిపి అప్పులు చెల్లించాలని, లేదంటే వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హెచ్డీసీసీ జాయింట్ రిజిస్ట్రార్ మనోజ్ కుమార్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లేని పక్షంలో ఈ నెల 30 లోపు తీసుకున్న అప్పు మొత్తంతో పాటు అపరాధ రుసం కలిపి, ఆస్తులు జప్తు చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. చింతపట్ల, నల్లవెల్లి, మంతన్గౌరెల్లి, తమ్మలోనిగూడ, నందివనపర్తి, యాచారం, చౌదర్పల్లి, మంతన్గౌరెల్లి, నక్కర్తమేడిపల్లి, నస్దిక్సింగారం తదితర గ్రామాల్లో మొండి బకాయిలు అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించినా స్పందన లేదన్నారు. కొత్త వారికి అందని రుణాలు దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు యాచారం పీఏసీఎస్ను బ్లాక్ లిస్టులో పెట్టింది. వసూళ్ల సేకరణలో అప్పటి పాలకవర్గంతో పాటు సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించింది. దీంతో మూడేళ్లుగా యాచారం పీఏసీఎస్కు రూపాయి కూడా కేటాయించలేదు. ఇదిలా ఉండగా, వివిధ గ్రామాలకు చెందిన సుమారు వంద మందికి పైగా రైతులు లాంగ్టర్మ్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రుణాలు అందకపోవడంతో చాలా మంది తమ అప్లికేషన్లను వెనక్కి తీసుకుని, కమర్షియల్ బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్నారు. మూడేళ్లుగా రుణాల వసూలు పరిస్థితి ఏడాది టార్గెట్ వసూలైంది బకాయి 2023– 24 రూ.26 కోట్లు రూ.10 కోట్లు రూ.16 కోట్లు 2024– 25 రూ.34 కోట్లు రూ.13 కోట్లు రూ. 21 కోట్లు 2025– 26 రూ.32 కోట్లు రూ.12 కోట్లు రూ.20 కోట్లు మొండి బకాయిలతో పీఏసీఎస్కు అవస్థలు ఈనెల 15లోపు చెల్లించాలని నోటీసులు రైతులు స్పందించాలని సూచన లేదంటే ఆస్తులు జప్తుచేస్తామని హెచ్చరిక -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
● రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన గ్రామ అధికారి ఆమనగల్లు: ఇంటి స్థలం పేరు మార్పి డి కోసం ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు తీసుకుంటూ తలకొండపల్లి మండలం వెల్జాల కార్యదర్శి శరత్కుమార్ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వెల్జాలకు చెందిన ఓ వ్యక్తి గ్రామంలోని ఓ పాత ఇంటిని కొనుగోలు చేసి, తన తల్లిపేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇటీవల ఇంటిని కూల్చేసి, ఖాళీ స్థలాన్ని విక్రయానికి పెట్టాడు. ఇందుకోసం వాల్యుయేషన్, నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వాలని జీపీ సెక్రటరీ శరత్కుమార్ను కోరగా రూ.30 వేలు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత స్థానిక వార్డు సభ్యుడు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో సర్టిఫికెట్లు అందజేశాడు. అనంతరం సదరు వ్యక్తి స్థలాన్ని విక్రయించగా, తనకు రూ.30 వేలు ఇవ్వాలని సెక్రటరీ డిమాండ్ చేశాడు. రూ.20 వేలు ఇస్తానని చెప్పిన బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు వెల్జాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శరత్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతని స్వస్థలమైన నాగర్కర్నూల్లోని ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. ● సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం ● ఇద్దరు చేవెళ్ల వాసుల మృతి ● శోకసంద్రంలో కుటుంబాలు చేవెళ్ల: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. తుల్జాపూర్లోని భవాని మాత దర్శనానికి కారులో వెళ్లి వస్తుండగా మంగళవారం జహీరాబాద్ వద్ద ఆగిఉన్న టాటా ఏసీ వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మున్సిపల్ పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన కాసుల మహేశ్గౌడ్ (27), ఆలూరుకు చెందిన రోహిత్ (15) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు కేసారం, ఇటు ఆలూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇసుక డంప్ సీజ్ బషీరాబాద్: మండలంలోని జీవన్గీ గ్రామ శివారు కాగ్నానది ఒడ్డున నిల్వ చేసిన భారీ ఇసుక డంపును రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. నదీ పరీవాహక గ్రామాలైనా క్యాద్గీరా, జెట్టూరు గ్రామాల సర్పంచులు జైపాల్రెడ్డి, వెంకట్రెడ్డి, రైతులు సూర్య ప్రకాశ్ రెడ్డి, మల్లికార్జున్, బల్రామ్ మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఇసుక డంపు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రంగంలోకి దిగిన జీపీఓలు అస్లాం, మధు, రికార్డు అసిస్టెంట్ మున్నెప్ప అక్కడికి చేరుకొని 15 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. ఈ ఇసుక మహబూబ్నగర్కు చెందిన ఓ మాజీ ఎంపీకి చెందినదిగా ఫిర్యాదు పేర్కొన్నారు. గోశాల నిర్మాణం కోసం డంపు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. -
ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతగా పని చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మను చౌదరి మాట్లాడుతూ.. ఈ నెల 10న మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో కూడా పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అధికారులు తమకు నిర్దేశించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ఎక్కడా ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, పోలిస్ శాఖ, విద్యుత్, ట్రాన్స్పోర్టు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మను చౌదరి -
రైతు సంక్షేమమే ధ్యేయం
రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి యాచారం: మహానగరం, కొత్తగా ఏర్పాటయ్యే ఫ్యూచర్సిటీకి సరిపడే కూరగాయలు, పండ్లను జిల్లా రైతులు అందించాలన్నదే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. ఆ దిశగా ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి రైతు వారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూరగాయల పంటలు, పండ్లతోటలు పెంపకం చేసే రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల, పండ్ల తోటల మార్కెట్లో దళారీ వ్యవస్థను రూపుమాపడం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో యాచారంలో రెండు ఎకరాల్లో మోడల్ కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేస్తామన్నారు. పలువురు శాస్త్రవేత్తలు పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ కార్యదర్శి గోపాల్, ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ సరోజినిదేవి, జిల్లా వ్యవసాయాధికారి ఉష, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారి సురేష్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత, యాచారం తహసీల్దార్ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. -
రంగారెడ్డికి సేవారత్న అవార్డు
షాద్నగర్: వృద్ధుల సేవాశ్రమం నిర్వహిస్తూ 25 ఏళ్లుగా సేవలందిస్తున్న పట్టణానికి చెందిన రంగారెడ్డి దాసరి నారాయణరావు సేవారత్న అవార్డు అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న పలువురికి నిర్వాహకులు దాసరి నారాయణ రావు సేవారత్న అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో 25 ఏళ్లుగా నవోదయ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ వృద్ధులకు సేవ చేస్తున్న రంగారెడ్డి సేవారత్న అవార్డుకు ఎంపికయ్యారు. సాంస్కృతిక శాఖ డైరక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కందుకూరు: విద్యార్థులకు విద్యాబోధనతో పాటు ఉత్తమ సేవలు అందిస్తున్న మండల పరిధిలోని సాయిరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అండేకార్ నాగరత్నం రాష్ట్రస్థాయిలో ప్రశంసా పత్రం అందుకున్నాడు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు వారికి నాణ్యమైన విద్య అందించడం, సమాజంలో మంచి పౌరులుగా ఎదిగేలా తర్ఫీదు ఇవ్వడం, తన సొంత పిల్లలను కూడా అదే పాఠశాలల చదివించి ఆదర్శంగా నిలవడం, కోర్టులు, ఇతర ప్రభుత్వ శాఖల పని తీరును తెలుసుకునేలా విద్యార్థులను నేరుగా తీసుకెళ్లడం లాంటి చేస్తుండడంతో ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఐఏఎస్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ.నవీన్ నికోలస్ ఆయనను సన్మానించి ప్రశంసా పత్రం అందించారు. ఎమ్మెల్సీ కవితను కలిసి ఫార్మా భూ బాధితులు యాచారం: ఫార్మాసిటీ భూ బాధితులు మంగళవారం ఎమ్మెల్సీ కవితను నగరంలోని ఆమె నివాసంలో కలిశారు. గత బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం బలవంతపు భూసేకరణ చేస్తోందని, 40 రోజులకు పైగా రైతులు దీక్షలు చేస్తున్నా చలనం లేదన్నారు. ఫార్మాసిటీ పేరుతో రైతుల పేర్లపై ఉన్న భూ రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేసి, పరిహారాన్ని అథారిటీలో జమ చేసి ఆ భూములు సర్కార్వేనని భయపెట్టాలని చూస్తున్నారని వాపోయారు. దీంతో స్పందించిన ఆమె త్వరలోనే కుర్మిద్ద తండాలో గిరిజన రైతులు చేస్తున్న దీక్ష వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామా ల రైతులతో పాటు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కవుల సరస్వతి, నేనావత్ శ్రీకాంత్నాయక్, కిషన్ నాయక్ పాల్గొన్నారు. కందుకూరు: సిటిజన్ విజిలెన్స్, మానిటరింగ్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో మంగళవారం దళిత, గిరిజన, ఆదివాసి, ప్రజాసంఘాలు, మేధావులు, విలేకరులు, న్యాయవాదులు, డీవీఎంసీ సభ్యులు సమావేశమై కమిటీని ఎన్నుకుని ప్రకటించారు. జిల్లా కన్వీనర్గా బోడ కృష్ణ, కో కన్వీనర్గా జోగు రమేష్, సభ్యులుగా దివ్యశ్రీ, కంబాలపల్లి సంతోష, దరువుల శంకర్, మిన్నాల డేవిడ్, మమత, రఘు, రాములు, యాచారం మండల కన్వీనర్గా బడే భాగ్యమ్మను ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డీబీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు గండు నరసింహ, హైకోర్టు అడ్వకేట్ దివ్యశ్రీ, అంబేడ్కర్ జాతర ఫౌండర్ జి.సుధాకర్, ప్రజా సంఘాల నాయకులు నరసింహ, శేఖర్, యాదయ్య, భగవంతు, బాలమణి, కుమార్, సంతోష్, తాండ్ర యాదయ్య, గోరేటి జగన్ పాల్గొన్నారు. -
ఓఆర్సీలు ఇవ్వండి
ఇనాం భూములకు చేవెళ్ల: ఆలూరులో ఏళ్ల తరబడిగా సాగు చేసుకుంటున్న ఇనాం భూములకు సంబంధించి రైతులకు ఓఆర్సీలు ఇవ్వాలని గ్రామ రైతులు, నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీఓ పార్థసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ బోర్డు భూములపై రైతుల పక్షాన హైకోర్టులో వచ్చిన ఆర్డర్ను జత చేసి ఓఆర్సీలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న 1,248 ఎకరాల భూములను తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నట్టు తెలిపారు. పట్టాలు లేకపోవడంతో ఇవి వక్ఫ్బోర్డు భూములుగా ప్రాచుర్యం పొందాయన్నారు. కొన్నేళ్ల కిత్రమే పలువురు రైతులు ఇవి వక్ఫ్ బోర్డు భూములు కావని, ఇనాం భూములని చట్ట ప్రకారం రావాల్సిన ఓఆర్సీ పట్టాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, కోర్టు ఆదేశాల ప్రకారం ఓఆర్సీ పట్టాలు ఇవ్వాలని కోరారు. స్పందించిన ఆర్డీఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
మరోసారి ఎల్ఆర్ఎస్
ప్లాట్ల క్రమబద్ధీకరణ గడువు పెంపు పరిగి మండలంలో అనుమతులు లేకుండా చేసిన వెంచర్వికారాబాద్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తీపికబురు అందించింది. 2024లో అప్పటి ప్రభుత్వం మొదటిసారి ప్లాట్ల రెగ్యులరైజేషన్కు అవకాశం కల్పించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 33వేల మందికి లబ్ధి చేకూరే అవకాశం లభించింది. 20 నెలలుగా అనేక మార్లు గడువు పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరో రెండు నెలలు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అనేక సంవత్సరాలుగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో డీటీసీపీ అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తూ వచ్చారు. రియల్టర్లు కొనుగోలుదారుల ఇబ్బందులను పట్టించుకోకుండా ప్లాట్లు విక్రయిస్తూ వెళ్లారు. 2020లో అప్పటి ప్రభుత్వం టీఎస్ బీపాస్ నిబంధన అమలులోకి తెచ్చింది. అనుమతిలేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు షాక్కు గురయ్యారు. ఇంటి నిర్మాణ అనుమతులు పొందాలంటే ప్లాట్లు, వెంచర్లకు అనుమతులు తప్పనిసరి చేశారు. దీంతో విధిగా క్రమబద్ధీకరణ చేసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఆరేళ్ల క్రితం అప్పటి సర్కారు ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరించింది. తదనంతర ప్రక్రియను విస్మరించింది. అనుమతులు లేనివే అధికం జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని లే అవుట్లే అధికంగా ఉన్నాయి. దాదాపు 550 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు కనీస రుసుం చెల్లించి ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆరేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపి వేసింది. దీంతో నాలుగు నెలల పాటు వ్యవసాయేతర భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 20,968, గ్రామ పంచాయతీల్లో 12,745 దర ఖాస్తులు వచ్చాయి. వీటిలో కొన్నింటిని క్రమబద్ధీకరించగా మెజార్టీ అర్జీలు పెండింగ్లోనే ఉన్నాయి. మరో రెండు నెలలు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం 25శాతం రాయితీ కూడా.. నాలుగు మున్సిపాలిటీల్లో 20,968 దరఖాస్తులు గ్రామ పంచాయతీల్లో 12,745 అర్జీలు పరిశీలనకు త్రిసభ్య కమిటీలుతరచూ గడువు పొడిగింపుతో.. అక్రమ లేఅవుట్లు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫమైందనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్ల క్రమబద్ధీకరణ గడువును తరచూ పొడిగిస్తుండటంతో ఎవరూ ముందుకు రావడంలేదు. తాజాగా రెగ్యులరైజ్ చేసుకునేందుకు 25 శాతం ఫీజు రాయితీ కూడా ప్రకటించింది. గతంలో రూ. 1,000 చెల్లించి దరఖాస్తు చేసుకోగా.. మరి కొందరు రూ.10వేలు చెల్లించి అర్జీ పెట్టుకున్నారు. ఇందులో రూ.1,000 చెల్లించిన వారికి ప్రభుత్వం అవకాశం ఇవ్వగా రూ.10 వేలు చెల్లించిన వారు ఎదురుచూస్తున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు మూడు శాఖల అధికారులతో త్రిసభ్య కమిటీలు వేశారు. -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు
ఇబ్రహీంపట్నం: వరి ధాన్యం కొనుగోలును తక్షణమే ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. మండలంలోని రాయపోల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగి కోతలు పూర్తికావస్తున్నా ఇంకా ధాన్యం కొనుగోలును ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం ఉండటంతో వర్షాలు పడితే రైతులు నష్టపోయే ప్రమాదముందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడాల్సివస్తోందన్నారు. కిరాయికి పట్టాలు తెచ్చుకొని ధాన్యం ఆరబోసుకుంటున్నారని.. ప్రభుత్వమే ఉచితంగా పట్టాలు ఇవ్వాలన్నారు. తేమ, తాలు పేరుతో క్వింటాలుకు నాలుగైదు కిలోల తరుగు తీస్తున్నారని.. ఇది రైతులను దోచుకోవడమేనని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. రాయపోల్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఇటీవల వడదెబ్బకు గురై మృతి చెందిన రైతు గౌరయ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.30 లక్షల ఎక్స్గ్రేషియా ప్రటించాలని జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, కార్యదర్శివర్గ సభ్యుడు సామెల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దుబ్బాక రామంచందర్, సీహెచ్ బుగ్గరాములు, పి.జగన్, సీహెచ్ జంగయ్య, ఎ.నర్సింహ, సీహెచ్ ముసలయ్య, భిక్షపతి, యాదగిరి, నర్సింహ, అశోక్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
చిన్నారులు ఉన్నతస్థాయికి ఎదగాలి
హుడాకాంప్లెక్స్: చిన్నారులు క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదగాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ సుజాత ఆకాంక్షించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. శిక్షణ పొందుతున్న చిన్నారులతో నేరుగా మాట్లాడి, వారి ప్రదర్శనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె కోచ్లకు పలు సలహాలు, సూచనలు చేశారు. శిక్షణలో మరింత నాణ్యత పెంచాలని సూచించారు. జిల్లా యువజన క్రీడల అధికారి స్వర్ణలత మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కోచింగ్ క్యాంపులో నమోదు చేయించి వారి క్రీడా భవిష్యత్కు పునాదులు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ శిబిరంలో బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, క్రికెట్, స్విమ్మింగ్, స్కేటింగ్, బాస్కెట్బాల్, లాన్ టెన్నిస్, అథ్లెటిక్స్, వాలీబాల్, బాక్సింగ్, కబడ్డీ, కరాటే, టేబుల్ టెన్నిస్ తదితర విభాగాల్లో శిక్షణ ఇసున్నట్టు తెలిపారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ప్లాస్టిక్ గోదాంలో మంటలు
పహాడీషరీఫ్: ప్లాస్టిక్ గోదాంలో అంటుకున్న మంటలు పక్కనే ఉన్న బిస్కట్ కంపెనీకి అలుముకున్న సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట గాలిబ్ కాలనీలో మంగళవారం మధ్యాహ్నం ప్లాస్టిక్ కవర్ల స్క్రాప్ గోదాములో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో ఆ మంటలు దానిని ఆనుకొని ఉన్న అత్తార్ బేకరీ ప్రొడక్ట్స్ (బిస్కట్ మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్)కు అంటుకొని అందులోని ముడిసరుకు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మూడు ఫైరింజన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బేకరీ యజమాని సయ్యద్ ఇబ్రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
కొత్వాల్గూడలో ‘హైడ్రా’మా!
సాక్షి, హైదరాబాద్: కొత్వాల్గూడ్లో హైడ్రా హడావిడి చేస్తోంది. స్థానికంగా ఓ క్రషర్స్ మిషన్స్ను కూల్చివేస్తోంది. ఇది ఓ మంత్రికి సంబంధించిందంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండడం గమనార్హం. వట్టినాగులపల్లిలో అనుమతి లేని క్రషర్లను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. మొత్తం ఐదు ప్రాంతాల్లో అక్రమ క్రషింగ్ యూనిట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో ఉన్న ఈ క్రషర్ల చుట్టూ ఉన్న వివాదాలు నెలకొన్నాయి. జీవో నెంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ.. అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్స్ కంపెనీ క్రషర్లను నడుపుతోందని ఆరోపణలు వచ్చాయి. హిమాయత్సాగర్ క్యాచ్మెంట్ ఏరియా (111 జీవో పరిధి)లో ఈ క్రషర్లు పనిచేస్తున్నాయని, గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని స్థానికులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే..తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. 15 స్టోన్ క్రషర్లకు (పరిధిలోని వివిధ ప్రాంతాలు) జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం. అయితే సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ లిస్ట్లో లేదని స్థానిక అధికారులు తెలియజేశారు. ఆ వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. -
అక్కడ విజయం.. ఇక్కడ సంబరం
మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026● ప్రజావాణికి అధికారులు విధిగా హాజరవ్వాలి ● అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి కడ్తాల్లో..కందుకూరులో..ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి సంబురాలు జరుపుకొన్నారు.నిర్లక్ష్యాన్ని సహించేది లేదు ప్రశాంతంగా ఎంసెట్ మొయినాబాద్:ఎంసెట్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల, జేబీఐఈటీ కళాశాల, చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీల్లో పరీక్ష కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో పరీ క్షలు జరిగాయి. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
షాబాద్: 108 వాహనంలో ఓ తల్లి ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. షాబాద్ 108 సిబ్బంది రాజేశ్, భూపాల్ సెల్పులు తెలిపిన ప్రకారం బిహార్కు చెందిన ఓ జంట ఎలికట్ట గ్రామంలో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో కుమారికి మధ్యాహ్నం పురిటి నొప్పులురావడంతో ఆమె భర్త 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్లో ఆమెను షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువవడంతో సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం షాద్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. -
హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్కు రిమాండ్
మీర్పేట: హిట్ అండ్ రన్ కేసులో కారు డ్రైవర్ను రిమాండ్కు తరలించారు. ఈ ఘటన మీర్పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ నెల 1వ తేదీన రాత్రి గాయత్రీ నగర్ వద్ద మీర్పేటకు చెందిన తండ్రీకొడులు జిలానీ, ఫైజల్ బైక్ వెళ్తున్నారు. సింగరేణి కాలనీకి చెందిన కారు డ్రైవర్ నీలకంఠం సత్యనారాయణ బైక్కు సైడ్ ఇవ్వకపోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సత్యనారాయణ కారులో కూర్చుని ఫైజల్ను తోసేయడంతో డివైడర్పై పడి గాయపడ్డాడు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు యత్నించగా జిలానీ బైక్ను కారుకు అడ్డుగా పెట్టాడు. ఆయన్ను ఢీకొట్టడంతో బానైట్పై పడ్డాడు. కారు ఆపకుండా రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సత్యనారాయణను రిమాండ్కు తరలించారు. కడ్తాల్: న్యామతాపూర్లోని ఓ వ్యవసాయ పొలం వద్ద గ్రామానికి చెందిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుడు నల్లవోతుల లక్ష్మయ్య (30) గ్రామంలోని మద్దూరు రామిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈనెల 2న శనివారం ఉదయం పనికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం ఊరి శివారులోని ఓ బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు లక్ష్మయ్యగా గుర్తించడంతో బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి వివాహం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ సైదిరెడ్డి తెలిపారు. 40 అడుగుల లోతున్న బావిలో నుంచి శవాన్ని తీసేందుకు పోలీసులకు సహకరించిన స్థానికులు తానేషా, రాములును పీఎస్కు పిలిపించి సన్మానించడంతో పాటు నగదు అందించారు. ఎస్ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్ ఉన్నారు. మొయినాబాద్: బంధువుల రిసెప్షన్కు వెళ్లి తిరిగి వచ్చి ఇంట్లో పడుకున్న యువతి తెల్లవారే సరికి కనిపించకుండా పోయింది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని అజీజ్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అజీజ్నగర్కు చెందిన డప్పు చంద్రయ్య కుటుంబం ఆదివారం రాత్రి బంధువుల రిసెప్షన్కు వెళ్లి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు చంద్రయ్య నిద్ర లేచి చూడగా కూతురు చందన(19) కనిపించలేదు. పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మర్రి చెట్ల తొలగింపు.. భారీగా ట్రాఫిక్ జాం
మొయినాబాద్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మొయినాబాద్ సమీపంలో మర్రి చెట్లు తొలగిస్తున్నారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మొయినాబాద్ సమీపంలోని తాజ్ సర్కిల్ వద్ద సోమవారం సాయంత్రం నుంచి జేసీబీలతో తవ్వి మర్రిచెట్లను మరో చోట ట్రాన్స్లొకేట్ చేసేందుకు తరలిస్తున్నారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రాత్రి 8 గంటల వరకు భారీగా వాహనాలు నిలిచిపోయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శంకర్పల్లి: పట్టణానికి చెందిన ఓ టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) నాయకుడు సోమవారం నిర్వహించిన తన కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. -
పంట భూముల జోలికి రావద్దు
● రైతు వారోత్సవాల్లో కర్షకుల ఆందోళన ● ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ మొయినాబాద్ రూరల్: కూరగాయలు, పూల మార్కెట్ నిర్మిస్తామంటూ తమ భూముల జోలికి రావొద్దని అజీజ్నగర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రైతు వారోత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సోనియాదర్శన్, కమిషనర్ జాకీర్ అహ్మద్, మండల వ్యవసాయ, అభివృద్ధి అధికారులకు విన్నవించారు. సర్వే నంబర్లు 151, 176లోని భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వాపోయారు. ఈనిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చనివెల్లి అమరేందర్రెడ్డి, చాకలి యాదగిరి, మాణిక్యం, శంకరయ్య, రైతులు మాడి రాంచంద్రారెడ్డి, సుధాకర్రెడ్డి, రాంభూపాల్, నరేందర్యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వైద్యరంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి
చేవెళ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యరంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ మధన్మోహన్రెడ్డి, కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రమేశ్రెడ్డి అన్నారు. చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి జనరల్ ఆస్పత్రిలో సోమవారం వైద్యకళాశాల విద్యార్థులె ‘ట్రోయ్ జియాంజ్’ పేరుతో గ్రాడ్యుయేషన్ ఘనంగా నిర్వహించారు. వేడుకలను శాసనమండలి చీఫ్ విఫ్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, ఎస్ఆర్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ వరదారెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డితో కలిసి ముఖ్యఅతిథులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్యవృత్తి చెప్పటిన విద్యార్థులు వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా సేవలు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వైద్యంలో అగ్రగామిగా నిలుస్తోందని చెప్పారు. ప్రతి విద్యార్థి నిరంతర పరిశోధకుడిగా ముందుకు సాగాలని, తల్లిదండ్రులు కష్టాన్ని మరిచిపోవద్దని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, సంతోష్రెడ్డి, ప్రిన్సిపాల్ జోయారాణి, మెడికల్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ గౌరి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
షాద్నగర్రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టిందని ఆర్డీఓ ఆర్ఎన్ సరిత అన్నారు. మండల పరిధిలోని లింగారెడ్డిగూడ సమీపంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతంలో తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజలు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వెళ్లాల్సివచ్చేదని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం డివిజన్ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయాల్లోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. డివిజన్ స్థాయిలోని అన్నిశాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు, దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ డీఈ సురేష్, ఆర్అండ్బీ ఏఈ రాజశేఖర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికే ప్రజావాణి చేవెళ్ల: ప్రజా సమస్యల పరిష్కారంకోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి అన్నారు. చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అర్జీలను పరిశీలించి ఆయా శాఖల ద్వారా తక్షణమే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ ప్రజావాణిలో ఏడు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో హౌసింగ్ శాఖకు సంబంధించి 4, పెన్షన్ కోసం 1, ఎస్సీ కార్పొరేషన్ రుణాలకోసం 2 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో అన్నిశాఖలకు సంబంధించి అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు ఇబ్రహీంపట్నం: డివిజన్ స్థాయి ప్రజావాణిని సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీవో అనంతరెడ్డి నిర్వహించారు. రాష్ట్ర ప్రజావాణి కో–ఆర్డినేటర్ రాకేష్రెడ్డి సందర్శించి పిటిషనర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో పొందుపరిచి, ఆయా శాఖల అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భూ భారతికి సంబంధించి 27, ఇందిరమ్మ ఇళ్లకు 4, ఇనామ్ భూములకు 4, సాదాబైనామా 3, విద్యుత్ శాఖకు సంబంధించి 3 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీవో అనంతరెడ్డి వెల్లడించారు. కార్యక్రమానికి విద్యుత్ శాఖ డీఈఈ నరేష్కుమార్, డీఎల్పీఓ సాధన, సీడీపీఓ వినీత, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
సేంద్రియ పద్ధతిలో సాగు మేలు
మంచాల: వ్యవసాయ పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో సోమవారం నిర్వహించిన రైతు వారోత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పంటల సాగు విషయంలో నూతన పద్ధతులు అవలంబించాలన్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూసార పరీక్షలు చేయించుకొని నేలలో పోషకాల లోపాలను గుర్తించాలని, తదనుగుణంగా ఎరువులు వాడాలన్నారు. లైసెన్స్ ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు నానో యూరియా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పచ్చి రొట్ట ఎరువులు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సుజాత, ఏఓ వెంకటేశ్, సర్పంచ్ మానస వినయ్, వ్యవసాయాధికారులు వనజాత, హరినాథ్, నవీన, లింగస్వామి, నిఖిత, సాయిసిరి, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
విషాదం నింపిన ప్రమాదం
● శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఇద్దరు యువ ఫొటోగ్రాఫర్ల దుర్మరణం ● శోకసంద్రంలో మృతుల కుటుంబాలు మంచాల: పొట్టకూటి కోసం ఇంటి నుంచి బయలు దేరిన ఫొటోగ్రాఫర్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులకు తీరని విషాదం నింపారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదల కుటుంబాలు. ఇప్పుడిప్పడే యువకులు చేతికి వచ్చి కుటుంబానికి ఆసరా ఉంటున్నారు. రోడ్డు ప్రమాదం వారి ఇళ్లలో చీకట్లు నింపింది. ఆదివారం సిద్దిపేటలోని శివం గార్డెన్లో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రజ్ఞాపూర్ రింగ్రోడ్డు వద్ద కారు అదుపుతప్పడంతో మండల పరిధిలోని తిప్పాయిగూడకు చెందిన గ్యార గౌతమ్(21), ఆగాపల్లికి చెందిన అన్నారం అఖిల్(23) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శోకసంద్రంలో తిప్పాయిగూడ తిప్పాయిగూడకు చెందిన గ్యార పెంటయ్య–మనోహర దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు గౌతమ్ ఇప్పుడిప్పుడే పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. సాఫీగా సాగుతున్న వీరి ప్రయాణంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎదిగిన కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే దేవుడు తీసుకెళ్లాడంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఆగాపల్లికి చెందిన అన్నారం సంతోష–శేఖర్ దంపతులకు ఒక్కగాను ఒక్క కొడుకుడు అఖిల్(23) కొన్ని రోజులుగా ఫొటోగ్రాఫర్ వృత్తిలో పని చేస్తున్నాడు. పనికి వెళ్లిన కొడుకు శవమై తిరిగిరావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడు మేము ఎవరి కోసం బతకాలని రోదిస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే అఖిల్ మృతితో ఆగాపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం మృతుల అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆగాపల్లికి చెందిన అనిరుద్ ప్రస్తుతం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్యార గౌతం (ఫైల్) అన్నారం అఖిల్ (ఫైల్) -
రాంగ్ రూట్లోనే వస్తా.. ఏం చేసుకుంటావో చేసుకో..!
రంగారెడ్డి: ‘నేనెవరో తెలుసా.. రాంగ్ రూట్లోనే వస్తా.. ఏం చేసుకుంటావో చేసుకో’.. అంటూ ఓ నాయకుడు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన షాద్నగర్ పట్టణంలోని చటాన్పల్లి రైల్వేగేట్వద్ద చోటు చేసుకుంది. వివరా లిలా ఉన్నాయి.. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో పట్టణంలోని చటాన్పల్లి రైల్వేగేట్వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. దీంతో ఆదివారం ట్రాఫిక్ నియంత్రణకు మహిళా కానిస్టేబుల్ తిరుపతమ్మ విధులు నిర్వర్తిస్తున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. అదే సమయంలో ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తన వాహనంపై రాంగ్ రూట్లో వచ్చాడు. ఎదురుగా వచ్చిన వాహనాలకు తీవ్ర అంతరాయం కలగడంతో ట్రాఫిక్ జాం అయింది. రాంగ్ రూట్లో వాహనదారులకు ఇబ్బంది కలుగుతోందని, సరైన మార్గంలో రావాలని మహిళా కానిస్టేబుల్ సూచించారు. దీంతో నేనెవరో తెలుసా, నేను మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిని, నా ఇష్టం వచ్చినట్లు రాంగ్రూట్లోనే వస్తా, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ దురుసుగా ప్రవర్తించాడు. అలాగే రాంగ్రూట్లో వెళ్లిపోయాడు. సదరు మహిళా కానిస్టేబుల్ విధులు ముగిసిన తర్వాత పోలీస్స్టేషన్కు వచ్చి విషయాన్ని తోటి సిబ్బందికి చెప్పి విలపించారు. అనంతరం పట్టణంలోని చటాన్పల్లి రైల్వే గేటు వద్ద తన విధులకు ఆటంకం కలిగించాడని చటాన్పల్లికి చెందిన నాగరాజుపై మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ తిరుపతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడం, దురుసుగా ప్రవర్తించడంతోపాటు దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నాగరాజుపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సీతారాం తెలిపారు. సదరు నాయకుడు గత శివరాత్రి సందర్భంగా మండల పరిధిలోని రామేశ్వరంలో విధుల్లో ఉన్న పోలీసులపై సైతం ఇలాగే జులుం ప్రదర్శించాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు నాయకుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు
ప్రమాదంలో రైతు దుర్మరణం చేవెళ్ల: ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డిగూడ బస్స్టేజీ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుండాల అనుబంధ గ్రామమైన లక్ష్మీగూడ గ్రామానికి చెందిన కొలన్ దివాకర్రెడ్డి(26) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయనకు భార్య పూజ, ఓ కుమారుడు ఉన్నారు. ఆదివారం సాయంత్రం తన కారులో స్వగ్రామం నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దివాకర్రెడ్డి కారులో ఇరుక్కు పోయి త్రీవంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గమనించి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో కారులో ఉన్న ఇద్దరికి స్వల్పగాయలు కావడంతో ప్రమాదాన్ని చూసి భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలియడంతో గుండాల, లక్ష్మీగూడ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబానికి ఆధారంగా ఉండాల్సిన వ్యక్తి మృతితో భార్య, కొడుకు ఆగమవుతారని గ్రామస్తులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పట్టాల పక్కన నిద్రించి.. చేయిపోగొట్టుకొని ఆస్పత్రి పాలైన కార్మికుడు తాండూరు రూరల్: తాగిన మైకంలో రైల్వే ట్రాక్పక్కన నిద్రించిన కార్మికుడు.. తన చేయిని పట్టాలపై పెట్టాడు. ఈ సమయంలో చేయిపై నుంచి రైలు వెళ్లడంతో చేయి తెగి పడింది. ఈ సంఘటన మండల పరిధి మిట్ట బాసుపల్లి గుంతబాసుపల్లి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం కోటబాసుపల్లి అనుబంధ కాలని వడ్డెర కాలనీకి చెందిన పరమేష్, జగదీష్లు నాపరాతి గనుల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇరువురు చంద్రవంచ దర్గా వద్ద కల్లు తాగడానికి వెళ్లారు. తిరిగి గ్రామానికి వస్తూ.. మిట్టబాసుపల్లి– గుంత బాసుపల్లి గ్రామాల సరిహద్దు సిమెంట్ కర్మాగారంలోకి వెళ్లేందుకు ఉన్న రైలు మార్గం పక్కన చెట్టుకింద నిద్రించారు. నిద్రలో పరమేష్ తన కుడి చెయ్యి రైలు పట్టాల మీద పెట్టాడు. గూడ్స్ రైలు అతని చేయిపై నుంచి వెళ్లడంతో చేయి తెగి పడింది. వెంటనే అతన్ని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం బాధితున్ని నగరంలోని గాంధీకి తీసుకెళ్లారు. కూలీ పనులు చేసుకొని జీవించే పరమేష్.. చేయి కోల్పోయి జీవనోపాధి కోల్పోయాడని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. దుద్యాల్: ప్రమాదవశాత్తు పశువుల పాక దగ్ధం అయింది. ఈ సంఘటన మండల పరిధి పోలేపల్ల అనుబంధ గ్రామమైన పల్లెగడ్డలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తడకలి కృష్ణయ్య ఎప్పటిలాగే తన పొలం వద్ద ఉన్న షెడ్డులో రెండు ఆవులు, రెండు దూడలను కట్టేశాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు 7 గంటలకు పాకలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన సమీప రైతులు.. వెంటనే పాకలోని ఆవులు, దూడలను కాపాడగా.. వాటికి స్వల్పంగా కాలిన గాయాలు అయ్యాయి. అనంతరం 25 కిలో మీటర్ల దూరంలోని కొడంగల్ ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా.. సిబ్బంది వచ్చేలోగా కొట్టం కాలి బూడిదయింది. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కృష్ణయ్య కోరారు. కాగా.. పాక ప్రమాదశాత్తు తగల బడిందా, లేక ఎవరైనా నిప్పు పెట్టారా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. -
హిందువులంతా సంఘటితమవ్వాలి
కుల్కచర్ల: హిందూ సంస్కృతి, సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలని వక్తలు ప్రథమేశానంద, యాదగిరి, హైందవి అన్నారు. శనివారం రాత్రి కుల్కచర్ల మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హిందూమత రక్షణ మనందరి భాధ్యత అన్నారు. అన్యమతస్తులు లౌకికవాదమంటూ హిందూమతాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హిందువులపై జరుగుతున్న దాడులను హిందువులు సైతం మన దగ్గర కాదులే, మనకు ఎందుకులే అనే విధానం అవలంబించడంతో ఐక్యత దెబ్బతిన దాడులు పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ, ఆర్ఎస్ఎస్ సంఘ నాయకులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘సైబరాబాద్’లో గందరగోళం
● 65 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలకు బ్రేక్● రాత్రి బదిలీల ఉత్తర్వులు.. ఉదయం నిలిపివేత ● రాజకీయ ఒత్తిళ్లే కారణమంటున్న పోలీసు వర్గాలు ● పైరవీకారులకే కీలక పోస్టింగ్లంటూ విమర్శలు సాక్షి, సిటీబ్యూరో: పోలీసు అధికారుల బదిలీల్లో రాజకీయ నాయకుల ప్రమేయం, ఒత్తిళ్లు మరోసారి బయటపడ్డాయి. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఒకేసారి 65 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వెలువడిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి. ఈ ఉత్తర్వులు హోల్డ్లో పెడుతున్నట్లు స్వయంగా కమిషనర్ ఆదివారం ఉదయం మౌఖికంగా చెప్పడంతో బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు గందరగోళంలో పడ్డారు. ఉత్తర్వులు ఇచ్చిన పోలీసు బాసే ఆ పోస్టింగ్ల్లో ఎవరూ బాధ్యతలు తీసుకోవద్దని చెప్పడంతో ఈ బదిలీలపై రాజకీయ నాయకుల ప్రమేయం, ఒత్తిళ్లు ఉన్నాయని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్నాయి. సైబరాబాద్లోని 54 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ.. మరో పదకొండు మందిని మల్టీజోన్–2కు సరెండర్ చేస్తూ మొత్తం 65 మందిని బదిలీ చేస్తూ పోలీసు కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కానీ.. ఆదివారం ఉదయం పొలిటికల్ దెబ్బకు ఈ బదిలీలన్నీ నిలిచిపోయాయి. ఎంత ఖర్చు పెట్టయినా.. మరోవైపు ఈ బదిలీలు సక్రమంగా జరగలేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జోన్ స్థాయి అధికారులకు సన్నిహితంగా ఉండి.. వారు చెప్పినట్లు పనిచేసిన వారికి, నచ్చిన వారికి కీలక పోస్టింగ్లు దక్కాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా సైబరాబాద్లో ఖరీదైన జోన్గా పేరున్న ఆ ప్రాంతంలో ఇన్స్పెక్టర్ల పోస్టింగ్లకు తీవ్ర పోటీ ఉండటంతో, ఎంత ఖర్చు పెట్టయినా సరే పోస్టింగ్ దక్కించుకోవాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు అధికారులైతే ఏకంగా ముఖ్య నేతలతో చెప్పించుకునే ప్రయత్నాలూ చేస్తున్నారు. రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నవారికే కీలక పోస్టింగ్లు దక్కాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా పనిచేసే వారికి కాకుండా పైవీకారులకు పెద్దపీట వేశారని పోలీసు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదిగో పరిష్కార వేదిక
షాద్నగర్: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది. సమస్యలను విన్నవించేందుకు అధికారుల వద్దకు వెళ్లాలంటే సుదూర ప్రాంతాలకు చెందిన వారు ఎన్నో వ్యయప్రయాసలకు గురి కావాల్సి వస్తోంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 3 జారీ చేసింది. ఈ నెల 4 నుంచి ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో .. ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా ప్రజావాణి సేవలను క్షేత్ర స్థాయికి విస్తరించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రజావాణి కార్యక్రమం జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో జిల్లా పరిధిలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, రాజేంద్రనగర్, షాద్నగర్ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సోమవారం నుంచి ప్రజావాణి ప్రారంభం కానుంది. నోడల్ అధికారిగా ఆర్డీఓ జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు. కలెక్టర్తో పాటుగా జిల్లా స్థాయి అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఆయా ఫిర్యాదులను శాఖల వారీగా విభజిస్తూ పరిష్కారానికి పంపిస్తుంటారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. హాజరు కానున్న డివిజన్ అధికారులు ప్రజావాణికి డివిజన్ పరిధిలోని ఆయా శాఖల అధికారులు హాజరుకానున్నారు. డివిజన్ స్థాయి వైద్యాధికారి, పంచాయతీ, వ్యవసాయ విస్తరణ, గృహ నిర్మాణ, ఆర్అండ్బీ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, మంచినీటి శాఖలతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమానికి హాజరవుతారు. వీరు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు, దరఖాస్తులను స్వీకరించి 30 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. లేదంటే తిరస్కరణ, పెండింగ్కు సంబంధించిన స్పష్టతను తప్పనిసరి దరఖాస్తుదారుడికి ఇవ్వాల్సి ఉంటుంది. స్వీకరించిన దరఖాస్తులను ప్రజావాణి పోర్టల్ నమోదు చేసి దరఖాస్తుదారుకు రసీదు అందజేస్తారు. దరఖాస్తుకు సంబంధించిన పరిస్థితిని ప్రజావాణి పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేయొచ్చు. సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సరిత, ఆర్డీఓ, షాద్నగర్ ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్టు ఆర్డీఓ అనంతరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమానికి డివిజన్ స్థాయి అధికారులు డీఎల్పీఓ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఏడీఏ, డీఈఈ (ఆర్అండ్బీ), డీఈఈ (ఆర్డబ్ల్యూఎస్), సీడీపీఓ, ఏఎస్సీడీఓ, ఏటీడీఓ, ఏబీసీడీఓ, ఏఎండబ్ల్యూఓ, ఇతర శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. ప్రజలు ఇచ్చే అర్జీలు స్వీకరించి తక్షణం పరిష్కారం చూపుతారని చెప్పారు. అధికారులు హాజరయ్యే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత చేరువగా ప్రజావాణి నేటినుంచి డివిజన్ కేంద్రాల్లో కార్యక్రమం ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహణ క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారం -
సిగరెట్ పెట్టెల్లో 5.8 కిలోల గంజాయి
● శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టివేత శంషాబాద్: సిగరెట్ పెట్టెల్లో ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన హైడ్రోపోనిక్ గంజాయిని ఎయిర్ ఇంటెలి జెన్స్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు. ఏకే 69 విమానంలో కౌలాలంపూర్ నుంచి శనివారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మోహన్ కందన్ అనే వ్యక్తి విలేజ్ అరైవల్ వద్ద అనుమానాస్పదంగా కనిపించాడు. క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో బ్యాగేజీలో సిగరేట్ పెట్టెల్లో 5.8 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని కనుగొన్నారు. నిందితుడు మోహన్ కందన్తో పాటు గంజాయిని తీసుకునేందుకు వచ్చిన రిసీవర్ తమిళనాడుకు చెందిన సిద్దిఖ్ అలీ అనే వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు నిమిత్తం వారికి కస్టమ్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. -
మూగజీవాలు తరలిస్తున్న ముఠా అరెస్ట్
బొంరాస్పేట: కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారిపై కొంత కాలంగా మూగజీవాల తరలింపు, అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, కర్ణాటక రాష్ట్రం సేడం తదితర ప్రాంతాల నుంచి మేకలు, గొర్రెలను అపహరించి ఆయా పట్టణాలకు తరలించే అక్రమాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున బొంరాస్పేట చెరువు వద్ద ఎర్టిగా కారు నిలిపి ఉండడంతో మఫ్టీలో ఉన్న పోలీసులు అనుమాతంతో ఆరా తీశారు. వాహనంలో ఉన్న సంజయ్కుమార్, జగత్పాల్, రోషన్, టైగర్ను అరెస్టు చేసి విచారించగా వారు నేరం అంగీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రామ్ కరణ్ రెండు నెలల క్రితం తన భార్య రాధ(20), కుమార్తె నైనాతో కలిసి జల్పల్లి ఆర్.ఆర్.ఫాం హౌస్ ఎదురుగా ఉన్న ఓంకార్ పశువుల దాణా కంపెనీలో కార్మికుడిగా చేరి, అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నెల 1న పని మీద బయటికి వెళ్లిన రామ్ కరణ్ మధ్యాహ్నం వచ్చి చూడగా కుమార్తె ఏడుస్తూ కనిపించింది. భార్య కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డీసీఎం ఢీకొని యువకుడి దుర్మరణం షాబాద్: డీసీఎం ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డిగూడ స్టేజీ వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన మనీష్దాస్(22) మల్లారెడ్డిగూడ స్టేజీ సమీపంలో అద్దె గదిలో ఉంటూ సీతారాంపూర్ సమీపంలోని సోలార్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు ఉండడంతో మధ్యాహ్నం స్థానికంగా కూరగాయలు తీసుకొని రోడ్డు దాటుతుండగా చేవెళ్ల వైపు నుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం అతన్ని ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. డీసీఎం డ్రైవర్ ఆపకుండా వెళ్తుండగా షాబాద్ పోలీసులు సర్ధార్నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న ఆకాశ దాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చిట్టీల పేరుతో మోసం భార్యాభర్తలపై బాధితుల ఫిర్యాదు మీర్పేట: చిట్టీల పేరుతో భార్యాభర్తలు మోసం చేసిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. బడంగ్పేట వైష్ణవికాలనీకి చెందిన సురేష్కుమార్, సౌజన్య దంపతులు స్థానికంంగా కొన్నేళ్ల నుంచి చిట్టీల పేరుతో కొంతమంది వద్ద నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. చిట్టీల గడువు ముగిసినా డబ్బులు చెల్లించకపోవడంతో చేసేది లేక దాదాపు 26 మంది బాధితులు ఆదివారం మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సురేష్కుమార్, సౌజన్యలు దాదాపు రూ.రెండు కోట్ల వరకు డబ్బులు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు మరో భూ సర్వే
దుద్యాల్: గ్రామ శివారు 363 సర్వే నంబర్లో 85 మంది రైతులకు సంబంధించి 144 ఎకరాల అసైన్డ్ భూములకు అధికారులు సోమవారం ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కిషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దుద్యాల్ శివారులోని నెమళ్ల కుచ్చ అనే ప్రాంతంలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 2025 డిసెంబర్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల ఆ భూములకు సంబంధించిన రైతుల అభిప్రాయా లు సేకరించారు. వారు భూములిచ్చేందుకు అంగీకారం తెలపడంతో ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. భూము లు కోల్పోతున్న రైతులు కాస్తులో ఉన్న భూముల దగ్గర ఉండి సర్వే చేయించుకోవాలని సూచించారు. భూములు ఇవ్వడానికి వెనకాడని రైతులు తాండూరు ఆర్డీఓ అనిత, తహసీల్దార్ కిషన్ భూములు కోల్పోతున్న 85 మంది రైతులతో ఏప్రిల్ 10న అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన రైతులు భూము లు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. కాస్తులో ఎక్కువ ఉండి రికార్డుల్లో తక్కువ ఉందని, రికా ర్డులో ఎక్కువ ఉండి కాస్తులో తక్కువ ఉన్న రైతులు చాలా మంది ఉన్నారని చెప్పారు. పరిహారం అందజేతకు ముందే వాటిని సరి చేయాలన్నారు. అందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో అంగీకారం తెలిపిన రైతులు 144 ఎకరాల అసైన్డ్ భూముల అనుభవదారుల గుర్తింపునకు ఎంజాయ్మెంట్ సర్వే -
కో ఆప్షన్ ఎన్నిక ఎప్పుడో!
చేవెళ్ల: మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరించినప్పటికీ సభ్యుల ఎన్నిక మాత్రం జరగడం లేదు. మైనార్టీ కోటా విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం లేక వాయిదా పడుతూ వస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తరువాత నలుగురు కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు అన్ని మున్సిపాలిటీలకంటే ముందుగానే చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ మార్చి 10న నోటిఫికేషన్ జారీ చేసి నామిషన్లు సైతం స్వీకరించారు. మొత్తం నలుగురు సభ్యుల్లో ప్రత్యేక అనుభవం కలిగిన ఇద్దరు, అల్పసంఖ్యాక వర్గం (మైనార్టీ) నుంచి ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంది. మొత్తం పది మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రత్యేక అనుభవం ఉన్న కోటా నుంచి ఒకటి జనరల్, ఒకటి మహిళకు కేటాయించాలని స్పష్టత ఉన్నా, మైనార్టీ కోటాలో ఉన్న రెండు స్థానాలకు సంబంధించి నామినేషన్లు ఎక్కువగా రావడంతో పోటీ ఏర్పడింది. మైనార్టీ నేతల పట్టు పార్టీ తరఫున ఎవరిని బలపరిచాలని, ఎవరికి మద్దతు తెలపాలనే దానిపై కౌన్సిలర్లకు పార్టీ పెద్దలు నిర్ణయం చెప్పకపోవడంతో వాయిదా వేశారు. మార్చి 30న తేదీని ఖరారు చేసినప్పటికీ పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. తదుపరి తేదీని ప్రకటిస్తామని చెప్పి నెలరోజులు దాటినా ఇప్పటికీ ఎలాంటి ప్రకటన లేదు. తాము పార్టీకోసం పనిచేశామని తమకే కేటాయించాలని మైనార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. దీంతో ఒకరికి ఇస్తే మరొకరు పార్టీకి వ్యతిరేకంగా మారతారనే ఆలోచనతో నచ్చజెప్పేందుకు పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై పార్టీ నాయకులు, ఎమ్మెల్యే కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఎవరూ సమయం కేటాయించకపోవడంతో ఆలస్యం అవుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ నామినేషన్ల స్వీకరణ పూర్తి నెలరోజులు దాటినా జరగని ఎన్నిక ప్రక్రియ మైనార్టీ కోటాలో కుదరని ఏకాభిప్రాయం పార్టీ పెద్దల నిర్ణయం కోసం ఎదురుచూపులుకోఆప్షన్ సభ్యుల ఎన్నికను త్వరలోనే పూర్తి చేస్తాం. ఇప్పటికే నామినేషన్లు పూర్తయ్యాయి. మైనార్టీ కోటకు సంబంధించి పలువురు పోటీ పడుతుండటంతో ఆలస్యమైంది. వారితో చర్చించి, ఎమ్మెల్యేతో మాట్లాడి ఎంపికను పూర్తి చేస్తాం. అంతా కలిసి మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతాం. – దేవర సమతావెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, చేవెళ్ల -
ఎందుకో.. ఏమో..!
● ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ విభాగం పరిస్థితి ఇదీ ● కమిషనరేట్ మొత్తానికి షాద్నగర్ సెంటర్లోనే సిగ్నల్ ● రోడ్డు భద్రత అవగాహనపైనే పోలీసుల దృష్టి సాక్షి, సిటీబ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ. ఈ నాలుగో నగరిలో ప్రజలకు రక్షణ, పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు గతేడాది డిసెంబర్లో ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిషనరేట్ మొత్తానికి కేవలం షాద్నగర్ సెంటర్లో ఒక్కటే ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. ఈ సిగ్నల్ ఉన్న ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ విభాగంలో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్పెక్టర్లు సహా 150 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. రోడ్డు భద్రత అవగాహనకే ప్రాధాన్యత.. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) మొత్తం 760 చ.కి.మీ. మేర విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం ఇందులో మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల మూడు శాంతి భద్రతల జోన్లు ఉండగా.. కమిషనరేట్ మొత్తం ఒకటే ట్రాఫిక్ జోన్గా ఉండగా.. షాద్నగర్, మహేశ్వరం రెండు డివిజన్లు, షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నాలుగు ట్రాఫిక్ ఠాణాలున్నాయి. దీంతో కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం ఎన్ఫోర్స్మెంట్కు బదులుగా ట్రాఫిక్, రహదారి భద్రతపై అవగాహనకే ప్రాధాన్యమిస్తోంది. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో స్థానికులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమ నిబంధనలు, ఉల్లంఘనలకు జరిమానాలు, ఇతరత్రా అంశాలపై విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఇతరత్రా ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. వెబ్సైట్కూ దిక్కేలేదు.. ఒక ట్రాఫిక్ సిగ్నల్.. విధుల్లో 150 మంది -
కార్ఖానా కుంటను కాపాడండి
హయత్నగర్: చెరువులను కాపాడాల్సిన హైడ్రా అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యే మెప్పు కోసం పనిచేస్తూ కాలనీ ప్రహరీని కూల్చి వేస్తారా అంటూ ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. నాగోల్ సర్కిల్ పెద్దఅంబర్పేట్ డివిజన్ కుంట్లూర్ పరిధిలోని ప్రజయ్ గుల్మోర్ కాలనీ ప్రహరీని హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేశారు. కూల్చి వేసిన ప్రహరీని ఆదివారం మంచిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడున్నర ఎకరాల్లో పక్కనే ఉన్న కార్ఖానా కుంట చెరువు కబ్జాకు గురై రెండు ఎకరాలు మాత్రమే మిగిలిందని అన్నారు. దానిని కాపాడలేని హైడ్రా అధికారులు 241 ఇళ్లు ఉన్న ప్రజయ్ గుల్మోర్ ప్రహరీని కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రహరీ కూల్చివేతతో కాలనీకి భద్రత లేకుండా పోయిందన్నారు. హైడ్రా పద్ధతి మార్చుకోకపోతే తగిన విధంగా స్పందిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో కాలనీ నాయకులు కృపాసాగర్, శివరామకృష్ణ, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మొయినాబాద్: దేశ రక్షణకోసం అసువులుబాసిన వీర సైనికుల త్యాగాలు మరువలేనివని కల్నల్ శ్రీనివాస్ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో వచ్చే నవంబర్లో జరగనున్న 201 మద్రాసు ఇంజనీరింగ్ రెజిమెంట్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల సన్నాహక సమావేశం ఆదివారం మున్సిపల్ పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. 1971లో ఇండియా–పాకిస్తాన్ యుద్ధ సమయంలో తాను కమాండింగ్ ఆఫీసర్గా స్వయంగా పాల్గొన్న సందర్భాన్ని గుర్తుచేశారు. సైనికులు, మాజీ సైనికులు రెజిమెంట్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు. హుడాకాంప్లెక్స్: వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్–యూజీ) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. సరూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లోని పరీక్ష కేంద్రంలో మొత్తం 240 మందికి 240 మంది పరీక్ష రాశారు. వంద శాతం హాజరు నమోదైంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపాల్ అనురాధ తెలిపారు. పరీక్ష రాయలేక విద్యార్థిని కన్నీటి పర్యంతం హయత్నగర్: నీట్ హాల్ టికెట్లో చిరునామా గందరగోళం కారణంగా ఓ విద్యార్థిని పరీక్షకు హాజరు కాలేకపోయిన ఘటన హయత్నగర్లో ఆదివారం జరిగింది. యాదాద్రి– భువనగిరి జిల్లాకు చెందిన కరకల రమేష్ కూతురు దుర్గా మీనాక్షి నీట్ పరీక్ష రాసేందుకు సిద్ధమైంది. తనకు ఇచ్చిన హాల్ టికెట్పై మాణిక్యమ్మ కాలనీ రాజేంద్రనగర్ హయత్నగర్ రంగారెడ్డి జిల్లా అని ఉంది. దీంతో ఈ అడ్రస్ హయత్నగర్లో ఉండవచ్చని భావించిన రమేష్ కూతురును తీసుకుని భువనగిరి నుంచి హయత్నగర్కు వచ్చారు. చివరి 20 నిమిషాల్లో హయత్నగర్లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సెంటర్కు చేరుకున్నారు. ఈ సెంటర్ నెంబర్ ప్రకారం రాజేంద్రనగర్లో ఉందని నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో చివరి నిమిషంలో పరీక్షకు హాజరు కాలేక పోయిన విద్యార్థిని ఆమె తండ్రి కన్నీరు పెట్టుకున్నారు. -
ఇరువర్గాల ఘర్షణ.. అంబులెన్స్పై దాడి
కుల్కచర్ల: ఇరువర్గాల గొడవలో అంబులెన్స్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది, పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శంకర్నాయక్, నారాయణ కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో శంకర్నాయక్ కుటుంబీకులు 108కి ఫోన్ చేసి తాము గాయపడ్డామని చెప్పడంతో అంబులెన్స్ వచ్చి వారిని కుల్కచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఈ క్రమంలో నారాయణ కుటుంబీకులు అంబులెన్స్ రాకముందే ఆస్పత్రికి చేరుకుని శంకర్ నాయక్ కుటుంబీకులపై దాడికి ప్రయత్నించారు. దీంతో వారు వాహనంలో ఉండిపోయారు. ఇది గమనించిన నారయణ కుటుంబీకులు ఇటుకలతో అంబులెన్స్పై దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. అంబులెన్స్పై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు -
శతం.. గురుకులం సొంతం
కొడంగల్ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో సర్కారు పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు అత్యున్నత ప్రతిభ చూపారు. చాలా బడుల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల చిన్నారులు శతశాతంతో ప్రభంజనం సృష్టించారు. బీసీ గురుకుల ప్రిన్స్పాల్ కె.నగేష్, సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్ బి.రామదాసు, ఉపాధ్యాయ సిబ్బంది సమష్టి కృషి, విద్యార్థుల పట్టుదల ఇందుకునిదర్శనమని పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెన్నుతట్టి.. ప్రోత్సహించి బోధన సిబ్బంది.. ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తూ, విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తూ ప్రోత్సహించారు. వెనకబడిన వారిని వెన్నుతట్టారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి, సందేహాలను నివృత్తి చేస్తూ మెరికలుగా తీర్చిదిద్దారు. బీసీ గురుకులంలో 68 మందికి 68 మంది, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 65 మందికి 65 మంది ఉత్తమ మార్కులతో వంద శాతం పాసయ్యారు. పాఠశాలలో 500లకు పైగా మార్కులను 16 మంది విద్యార్థులు సాధించారు. సోలోమన్ 540, పి.సన్ని 537, భవాని ప్రసాద్, వరుణ్ సందేష్లు 533 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ బి.రామదాసు తెలిపారు. పది ఫలితాల్లో ప్రభంజనం తోడ్పడిన ప్రత్యేక తరగతులు హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక తరగతులు ఎంతగానో తోడ్పడ్డాయి. ఉపాధ్యాయులు వె న్నంటి ఉంటూ.. ప్రోత్సహించారు. సందేహాలను నివృత్తి చేస్తూ భయాందోళన చెందకుండా చేశారు. ఆందోళన చెందకుండా 540 మార్కులు సాధించాను. – సోలోమన్, సాంఘిక సంక్షేమ గురుకులం, కొడంగల్సమష్టి కృషితో సాధ్యం ఉపాధ్యాయుల సమష్టి కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రత్యేక తరగతు లు నిర్వహిస్తూ.. వెనకబడిన వారికి సబ్జెక్టుపై అవగాహన కల్పించాం. వారితో మమేకమై ఆందోళన చెందకుండా చేశాం. పట్టుదలతో చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ చూపారు. – బి.రామదాసు, సాంఘిక సంక్షేమ గురుకుల, ప్రిన్సిపాల్, కొడంగల్ -
ఆరు బైకులు స్వాధీనం
బైక్ల దొంగల అరెస్టు మొయినాబాద్రూరల్: కొన్ని నెలలుగా ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మొయినాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఆరు బైక్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మొయినాబాద్–సురంగల్ రోడ్డు లో క్రైమ్ టీమ్ పోలీసులు గస్తీ తిరుగుతుండగా మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం గోవింద్పల్లికి చెందిన హరిజన రామకృష్ణ, అదే మండలం కొంరెడ్డిపల్లికి చెందిన బద్దుల విజయ్కుమార్లు యమహా బైక్పై అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో గత ఐదు నెలలు గా మొయినాబాద్లో నాలుగు బైకులు, చేవెళ్ల, కూకట్పల్లిలో ఒక బైక్ చొప్పున చోరీ చేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. చోరీకి గురైన ఆరు బైకులను స్వాధీనం చేసుకుని ఆదివారం రిమాండ్కు తరలించారు. -
డ్రంకెన్ డ్రైవ్తో ప్రమాదం
ధారూరు: మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమైన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాఘవేందర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలు.. శనివారం రాత్రి రుద్రారం గ్రామానికి చెందిన బంటు వెంకటయ్య, అతని బావ పాండుతో కలిసి వికారాబాద్కు వెళ్లి స్వగ్రామానికి వస్తున్నారు. ధారూరు సమీప ట్రాక్టర్ గ్యారేజీ సమీపంలో వీరి బైక్ను కారు ఢీకొట్టింది. కారు డ్రైవింగ్ చేస్తున్న పెద్దెముల్ గ్రామానికి చెందిన ద్యావరి జయవర్దన్రెడ్డి మద్యం మత్తులో బైక్ను ఢీకొట్టి పక్కనే ఉన్న గుంతలోకి ఈడ్చుకెళ్లాడు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. క్షతగాత్రుడి తండ్రి బంటు కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్పై కేసు -
ఢీకొట్టి.. ఈడ్చుకెళ్లి
గ్రేటర్లో బెంబేలెత్తిస్తున్న హిట్ అండ్ రన్ ప్రమాదాలు● అతివేగం, మద్యం మత్తులో దారుణాలు ● ద్విచక్ర వాహనదారులు, పాదచారులే బాధితులుసాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో హిట్ అండ్ రన్ (వాహనంతో ఢీకొట్టి పారిపోవడం) ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వెనక, పక్క నుంచి వాహనంతో ఢీ కొట్టి ఘటనా స్థలం నుంచి జారుకునే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అతివేగం, అలసట, మద్యం తాగి వాహనాలు నడపడంతోనే హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మానవత్వం మరిచి.. సాధారణంగా హిట్ అండ్ రన్ కేసుల్లో ఎక్కువగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులే బాధితులవు తుంటారు. ఈ తరహా కేసులలో నిందితులు బాధితులను వెనకాల నుంచి ఢీ కొట్టేసి కనీసం క్షతగాత్రులు ఎలా ఉన్నారని చూడకుండా, మానవత్వం లేకుండా నాలుగైదు కిలో మీటర్ల వరకూ ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. చాలా వరకు హిట్ అండ్ రన్ కేసులు సీసీటీవీ కెమెరాలు లేని నిర్మానుష్య ప్రాంతంలో, రాత్రి వేళల్లో జరగడంతో ఈ తరహా కేసులు దర్యాప్తు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులపై, నిర్మానుష్య ప్రాంతాలలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువగా అవుతుంటాయి. సాధారణ రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే హిట్ అండ్ రన్ కేసులలో మరణాల శాతం ఎక్కువ. హిట్ అండ్ రన్ కేసుల్లో నిందితులు క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా, ఘటనా స్థలం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో బాధితులు మరణిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఇలా.. . మీర్పేటలోని గాయత్రినగర్ నుంచి ఎల్బీనగర్ వైపు ద్విచక్ర వాహనంపై తండ్రీ కొడుకులు జిలానీ, ఫైజల్లు వెళుతుండగా.. వేగంగా వచ్చిన ఓ కారు వారిని వెనక నుంచి ఢీకొట్టింది. కారు డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించగా.. జిలాని కారును ఆపేందుకు యత్నించాడు. అతడు కారు బానెట్పై ఉండగానే కారు ఆపకుండా డ్రైవర్ సుమారు 2 కి.మీ దూరం లాక్కెళ్లాడు. మందమల్లమ్మ చౌరస్తా వద్ద ప్రయాణికులు అడ్డుకోవడంతో పరారయ్యాడు. ● దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అతివేగంగా వచ్చిన బెంజ్ కారు ఢీ కొట్టడంతో బ్రిడ్జిపై శ్యాంరాజ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు మహ్మద్ అబ్దుల్ నవీద్ను పోలీసులు ఊటీలో పట్టుకున్నారు. ● గచ్చిబౌలిలో మద్యం మత్తులో కారు నడుపుతూ తరుణే అనే వ్యక్తి మరొక వాహనాన్ని ఢీ కొట్టాడు. ఘటనాస్థలి నుంచి పరారవుతున్న తరుణ్ను నిలువరించేందుకు యత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులును ఢీకొట్టి.. కిలో మీటరు దూరం వరకూ కారు బానెట్పై ఈడ్చుకుంటూ వెళ్లాడు. ● 2022లో జూబ్లీహిల్స్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మహ్మద్ రహీల్ ఆమీర్ తన ఇద్దరు స్నేహితులు సయ్యద్ అఫ్నాన్ అహ్మద్, మోహిత్ ఖాన్లు ప్రయాణిస్తున్న ఎస్యూవీ కారు.. బెలూన్ విక్రయించే మహిళ కాజల్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కాజల్కు తీవ్ర గాయాలు కాగా.. ఆమె రెండున్నర నెలల బాబు మరణించాడు. హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదాలు తీవ్రమైన నేరాలు. ఈ ప్రమాదాలలో కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ కేసులను ప్రత్యేక కార్యాచరణతో దర్యాప్తు చేస్తున్నాం. – వి.శ్రీనివాసులు, డీసీపీ, మల్కాజిగిరి ట్రాఫిక్– 2 -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
మహేశ్వరం: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర అర్బన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో శనివారం నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుతు సత్యనారాయణ, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, డీఎల్పీఓ సాంభిరెడ్డి, జీహెచ్ఎంసీ బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, జల్పల్లి డిప్యూటీ కమిషనర్ వెంకట్రాం, మహేశ్వరం మండల ప్రత్యేకాధికారి సుభాషిణి, మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్ తహసీల్దార్లు చిన్న అప్పల నాయుడు, గోపాల్, ఇందిరా దేవి, మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహరెడ్డి -
రేపటి నుంచి డివిజన్స్థాయి ప్రజావాణి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: డివిజినల్ స్థాయిలో ఈ నెల 4 నుంచి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి సంబంధిత ఆర్డీఓలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీవో నంబర్ 3 ప్రకారం ఆర్డీఓల ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బూత్ స్థాయి అధికారులు మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి 18 ఏళ్ల పైబడిన వారి వివరాలు సేకరించాలన్నారు. నిబంధనల ప్రకారం మ్యాపింగ్తో డూప్లికేట్ ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాలను గుర్తించి ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పరిశీలించి వివరాలను ధ్రువీకరించి తొలగింపు లేదా సవరణ చేపట్టాలని తెలిపారు. ఆమనగల్లు: పట్టణంలోని కోర్టులో జూనియర్ సివిల్జడ్జిగా శనివారం నారం అరుణ్కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. కోర్టు జడ్జిగా ఉన్న కాటం స్వరూప బదిలీ కాగా హైదరాబాద్లోని సిటీ సివిల్కోర్టులో అసిస్టెంట్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న అరుణ్కుమార్ ఇక్కడికి వచ్చారు. పదవీ బాధ్యతలు తీసుకున్న ఆయనకు ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు, తలకొండపల్లి ఎస్హెచ్ఓ జానకిరాంరెడ్డి, కడ్తాల ఎస్హెచ్ఓ సైదిరెడ్డి, మాడ్గుల ఎస్హెచ్ఓ వేణుగోపాల్ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసు అధికారులతో జడ్జి సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పీపీ కార్తీక్, సిబ్బంది పాల్గొన్నారు. సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో మే, జూన్ నెలల గోధుమల కోటా పంపిణీ ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుందని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి ఎం.రాజిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో మొత్తం 8,40,345 కుటుంబాలకు 8,81,497 కుటుంబాలు 104.90 శాతం మూడు నెలల బియ్యం కోటాను డ్రా చేసినట్లు వివరించారు. హైదరాబాద్ జిల్లాకు కేటాయించిన 71,382.977 మెట్రిక్ టన్నుల బియ్యంలో 62,373.682 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. గోధుమల కోటా విషయంలో ఒక నెల కోటా మాత్రమే ఇప్పటివరకు పంపిణీ చేశారని, మిగతా రెండు నెలల కోటా పదిహేను రోజుల వరకు కొనసాగుతుందన్నారు. కొత్తగా రేషన్ కార్డులు పొందినవారు సహా అందరూ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని రాజిరెడ్డి సూచించారు. సాక్షి, సిటీబ్యూరో: ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్ నుంచి జవహర్లాల్ పోర్టుకు (జేఎన్పీటీ) ప్రాణ రక్షణ ఔషధాలను రవాణా చేసే శీతలీకరించిన కాన్కోర్ కంటైనర్ రేక్ ‘ఔషధి ఎక్స్ప్రెస్’ను దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ శనివారం సనత్నగర్ ఇన్ల్యాండ్ కంటైనర్ డిపో నుంచి ప్రారంభించారు. ప్రాణరక్షక ఔషధాలు, ఇతర సున్నితమైన వస్తువులను సురక్షితంగా రవాణా చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ను రూపొందించారు. దేశ ఫార్మాస్యూటికల్ సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదం చేస్తుంది. నగరంలోని కీలక ఫార్మా ప్రాంతాలైన జీనోమ్ వ్యాలీ, జీడిమెట్ల, పటాన్చెరు, ముచ్చర్ల నుంచి జేఎన్పీటీ కారిడార్కు ఔషధి ఎక్స్ప్రెస్ మందులను సరఫరా చేయనుంది. కార్యక్రమంలో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎండీ సంజయ్ స్వరూప్, ద.మ.రైల్వే ఉన్నతాధికారులు కె.పద్మజ, ఈటీ పాండే, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్. గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. -
ఔటర్పై పల్టీకొట్టిన కారు
పహాడీషరీఫ్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘటన మరువక ముందే తుక్కుగూడ ఔటర్పై శనివారం ఉదయం మరో ప్రమాదం చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నర్సింహ అనే వ్యక్తి ఐదుగురితో కలిసి కారులో (టీజీ 08 ఏఏ 4704) ఔటర్పై శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపు వస్తున్నాడు. ఉదయం 11.55 గంటల సమయంలో తుక్కుగూడ ఎగ్జిట్ నంబర్–14 సమీపంలో ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా ఆపడంతో, డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేక డివైడర్ను ఢీ కొట్టడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు మరొకరు గాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందని కారణంగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఇద్దరికి గాయాలు -
సమన్వయంతోనే అభివృద్ధి
చేవెళ్ల: పరస్పర సహకారంతో అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం మండలకేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పార్టీలు ఉండాలని, తరువాత అభివృద్ధికోసం అందరూ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజలకోసం ఎవరు మంచి పనిచేసినా అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులు వివరించారు. అనంతరం మహిళా సంఘాలకు వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఐదు మండలాల ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మహిళాసంఘాల సభ్యులు పాల్గొన్నారు. ప్రొటోకాల్ పాటించలేదని సర్పంచుల అసహనం సమావేశంలో ప్రొటోకాల్ పాటించలేదని పలువురు సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. సభావేదికపైకి మున్సిపల్ కౌన్సిలర్లను పిలిచి సర్పంచులను మాత్రం ఆహ్వానించలేదన్నారు. తాము కూడా ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చామని, తమను ఒక విధంగా కౌన్సిలర్లను ఒక విధంగా చూడడం సరికాదన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య -
అండర్పాస్ ఏర్పాటు చేయాలి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి వినతి చేవెళ్ల: మండలంలోని ఖానాపూర్ గేట్ను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్–బీజాపూర్ రాహదారి విస్తరణలో సర్వీస్ రోడ్లు, అండర్పాస్లు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చేయాలని ఖానాపూర్, నాంచేరి, రేగడిఘనాపూర్, దేవరంపల్లి, కిష్టాపూర్, ఇంద్రారెడ్డినగర్ గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఎన్హెచ్ఏఐ అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్లతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా నాంచేరి సర్పంచ్ అశోక్, బీజేపీ నాయకుడు జయశంకర్గౌడ్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు అంతా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ రోడ్డు అభివృద్ధిని చూసి ఆనందించాలో లేక ఏర్పడుతున్న ఇబ్బందులతో బాధపడాలో తెలియటం లేదని వాపోయారు. అండర్పాస్ లేకుండా రోడ్డును ఎత్తుగా వేస్తుండటంతో ఈ గేట్ వద్ద దాదాపు ఐదారు గ్రామాల ప్రజలు, రైతులతోపాటు అటు షాబాద్ మండలానికి, ఇటు వికారాబాద్జిల్లాలోని పలు గ్రామాలకు ఉన్న లింక్రోడ్డులు తెగిపోతున్నాయన్నారు. ఖానాపూర్, నాంచేరి, కిష్టాపూర్, రేగడిఘనాపూర్, దేవరంపల్లి గ్రామాలకు వెళ్లే మార్గం లేదన్నారు. ఇక్కడ అండర్పాస్ అవసరం ఉందన్నారు. దీంతో పాటు ఈరోడ్డుకు రెండు వైపులా సర్వీస్ రోడ్డు ఉంటేనే హైవే రోడ్డు పక్కల ఉన్న రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎంపీ అధికారులు, కాంట్రాక్టర్తో మాట్లాడి ఇక్కడి ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా రోడ్డు ఉండేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, చేవెళ్ల బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్రెడ్డి, నాయకులు మాణిక్యరెడ్డి, శర్వలింగం, ఉమాశంకర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల ఎదుగుదలపై దృష్టి సారించాలి
షాద్నగర్: పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులతో నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సరికొత్త సవాళ్ల నుంచి రక్షించాలని సూచించారు. సెల్ఫోన్లకు అతుక్కపోకుండా నియంత్రిస్తూ వారి భవిష్యత్తును దృష్టికొని పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సైబర్ నేరాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. 14 ఏళ్లు దాటిన బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణలో భాగంగా హెచ్పీవీ టీకా తప్పనిసరి వేయించాలని చెప్పారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, మహిళా సంఘాలకు అందిస్తున్న వడ్డీ లేని రుణాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు తమ కాళ్ల తాము నిలబడేందుకు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమానికి పాటు పడుతోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను నిర్మిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు తాము తయారు చేసిన వస్తువులకు సంబంధించిన స్టాల్స్ను ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆర్డీఓ సరిత, మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అందె మోహన్, ఏసీపీ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ సునీత, ఏంఈఓ మనోహర్, ఎంపీడీఓ బన్సీలాల్, తహిసీల్దార్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్మయి -
పథకాలు అమలైతేనే ప్రజాపాలనకు అర్థం
ఇబ్రహీంపట్నం రూరల్: అర్హులైన ప్రజలకు నూరు శాతం సంక్షేమ పథకాలు అందజేసే బాధ్యత అధికారులపై ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థాయి సమావేశం బొంగ్లూర్లోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తేనే ప్రజాపాలనకు అర్థం ఉందన్నారు. అఽధికారులు కొందరు బాగా పని చేస్తున్నారని, మరి కొందరు చేయడం లేదన్నారు. అందరూ సమన్వయంతో పని చేస్తే బాగుంటుందన్నారు. గ్రామాలకు వెళ్లాలని, కార్యాలయాల్లో ఉంటే సరిపోదన్నారు. కబ్జా చేసిన భూములు లాగి పేదలకు పంచుతా.. పేదవాడు 60 గజాల జాగలో ఇళ్లు కట్టుకుంటే కూల్చివేస్తారు. కానీ నేడు పదుల ఎకరాల్లో భూములు కబ్జాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే మల్రెడ్డి అన్నారు. అలాంటి వారు ఎక్కడున్నా చెప్పండి వారి నుంచి గుంజుకొని పేదలకు పంచుతానన్నారు. కబ్జాదారులు సీఎం పేరు చెప్పినా, మంత్రుల పేరు చెప్పినా, తన పేరు చెప్పినా సహించేది లేదన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడైన పేదలకు దక్కేలా చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, హౌసింగ్ పీడీ చంప్లానాయక్, తహసీల్దార్ సునీత, వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక మధుసూదన్రెడ్డి, గురునాథ్రెడ్డి, జీహెచ్ఎంసీ ఆదిబట్ల సర్కిల్ కమిషనర్ సత్యనారయణరెడ్డి, ఇబ్రహీంపట్నం కమిషనర్ సుదర్శన్, డీఎస్ఓ వనజాత, నాయకులు ఈసీ శేఖర్గౌడ్, పాండురంగారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
డివైడర్ నుంచి దూసుకెళ్లి బైక్ను ఢీకొట్టి..
ప్రమాదంలో ఒకరి మృతి చేవెళ్ల: డీసీఎం డ్రైవర్ అతివేగం అజాగ్రత్తతో డివైడర్ నుంచి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొన్న ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. షాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన మల్కని నర్సింలు (45) నగరంలోని విద్యానగర్లో ఉంటూ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామంలో భార్య సువర్ణ కుటుంబసభ్యులు ఉంటున్నారు. వారంలో ఒకరోజు, సెలవు ఉన్న సమయంలో గ్రామానికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం మేడే సందర్భంగా సెలవు ఉండడంతో తన బైక్పై ఇంటికి వచ్చిన అతడు శనివారం ఉదయం తిరిగి నగరానికి బయలుదేరాడు. మార్గమధ్యలో చేవెళ్ల మండలం పామెన బస్స్టేజీ వద్దకు రాగానే ఎదురుగా చేవెళ్ల వైపు నుంచి వస్తున్న డీసీఎం అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ నుంచి దూసుకెళ్లి రోడ్డు అవతల వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న నర్సింలు ఎగిరి దూరంగా పడడంతో కాలు విరిగి తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నా రు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి
ఆమనగల్లు: మత్తు పదార్థాలకు అందరూ దూరంగా ఉండాలని ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ కోరారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు మత్తుపదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. విద్యార్థులు కొత్తగా వచ్చే స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలని, వారు మంచివారా చెడ్డవారా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలని సూచించారు. ఎక్కడైనా మత్తుపదార్థాలు విక్రయించినా, మత్తు పదార్థాలతో పార్టీలు జరిగినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. అనుమతి లేకుండా మద్యం పార్టీలు చేసినా, డ్రగ్స్ తీసుకున్నా చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్ఐలు అరుణ్ కుమార్, స్వప్న, సిబ్బంది చిన్నాగౌడ్, శ్రీను, శివప్రసాద్, లింగం, సాయి శ్రీజ తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ -
రెడ్డి భవన్ నిర్మాణానికి రూ.కోటి విరాళం
బడంగ్పేట్: బాలాపూర్కు చెందిన పీపీరెడ్డి గ్రూప్ ఆఫ్ చైర్మన్, యాదాద్రి రెడ్డి సంఘం అధ్యక్షుడు పన్నాల పర్వతాల్రెడ్డి రెడ్డి భవన్ నిర్మాణానికి రూ.కోటి విరాళాన్ని ప్రకటించి అందజేశారు. తిరుపతిలో నిర్మించే ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ రెడ్డి భవన్ నిర్మాణానికి భారీ విరాళం అందజేయడంపై రెడ్డి సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపీరెడ్డిని శనివారం అభినందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మురళీకృష్ణారెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, వినయ్కుమార్రెడ్డి, నరోత్తంరెడ్డి, కొలన్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. -
జాతరలో జంతుబలిపై కేసు నమోదు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల బీరప్ప జాతరలో జరిగిన జంతుబలిపై కేసు నమోదైంది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శివరాత్రి వెంకటేశ్ కథనం ప్రకారం.. ఆదిబట్లలో ఏప్రిల్ 27న బీరప్ప జాతరలో భాగంగా గొర్రె పొట్టేళ్లను దేవాలయం ముందు బలిచ్చారు. ఈ వీడియోలను కొందరు యువకులు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. వీటిని చూసి చలించిన స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జీఓ క్రూయాలిటీ ప్రివెన్షన్ మేనేజర్ అడులపురం గౌతమ్ అనే వ్యక్తి ఏప్రిల్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జాతర నిర్వాహకులైన 15 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. భిక్షాటన చేస్తూ మృతి కందుకూరు: అనారోగ్యంతో ఓ భిక్షగాడు మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పులిమామిడిలోని కోటమైసమ్మ దేవాలయం సమీపంలో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన వివరాల ఆధారంగా అతను వెంకటయ్యచారి అలియాస్ పెంటయ్యచారి (60), ఆదిలాబాద్ జిల్లాగా గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా గ్రామ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ, మద్యం తాగుతూ రోడ్డు పక్కనే నివసించేవాడు. తరచూ ఫిట్స్ కూడా వచ్చేవి. శుక్రవారం రాత్రి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి పూర్తి వివరాలు తెలిస్తే 87126 62687, 87126 62409, 87126 62369 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 11 నుంచి వేసవి శిబిరం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సహకారంతో గోషామహల్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చిన్నారుల కోసం ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 11 నుంచి 16 వరకు ఈ శిక్షణ ఉంటుంది. ట్రాఫిక్పై అవగాహన, రోడ్డు భద్రతతోపాటు ఆత్మరక్షణ, డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, కార్టూనింగ్, చేతిరాత మెరుగుపరచుకోవడం, వ్యక్తిత్వ వికాసం, ప్రాథమిక అత్యవసర వైద్యచికిత్స వంటి అంశాలపై శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్లు ఈ నెల 3 నుంచి ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాల కోసం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్పెక్టర్ జి.హరీశ్ 87126 60655, లేదా కార్యాలయ అసిస్టెంట్ 98480 63345 నంబర్లలో సంప్రదించవచ్చు. 5 నుంచి చిత్రలేఖనంపై శిక్షణ నాంపల్లి: వేసవి సెలవుల్లో కిడ్స్ ఆర్ట్ క్యాంపు పేరిట ఆన్లైన్లో చిన్నారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. తరగతులు మే 5న ప్రారంభమై జూన్ 5వ తేదీన ముగుస్తాయని, వారానికి రెండురోజులు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. 7 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కోరారు. జేఎన్ఎఫ్ఏయూలో తర్ఫీదు పొందినవారు డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్స్ అనే అంశాలపై శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఫోన్: 63043 66780. -
బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
మీర్పేట: డీజిల్ పోసుకుని బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మీర్ పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సారంగపాణి కథనం ప్రకారం.. మహబూబ్నగర్కు చెందిన మాలగరి గీత భర్త చనిపోవడంతో కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం బడంగ్పేట శ్రీమారుతీనగర్ కాలనీకి వచ్చి స్థానికంగా కూరగాయలు విక్రయిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె కీర్తి (21) గండిపేటలోని ఎంజీఐటీ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. రోజు మాదిరిగా శనివారం కళాశాలకు వెళ్లి మధ్యా హ్నం ఇంటికి వచ్చింది. కుటుంబ సభ్యులు సమీపంలోని జయశంకర్కాలనీలో నివాసముండే బంధువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న కీర్తి 4.30 గంటల సమయంలో డీజిల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసు కుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సోదరుడు క్యాబ్ డ్రైవర్ కావడంతో ఇంట్లో డీజిల్ను నిల్వ చేసినట్లు తెలుస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో ఎల్ఆర్ఎస్–2020 దరఖాస్తుల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి పని చేస్తాయి. దరఖాస్తుల స్థితి, అనుమతులకు సంబంధించి గైడెన్స్, షార్ట్ఫాల్స్, చెల్లింపులకు సంబంధించి వివరాలు అందిస్తారు. ఎల్ఆర్ఎస్ పోర్టల్ వినియోగంపై సహకారం, అవసరమైన వారికి ప్రత్యక్ష హెల్ప్లైన్ సేవలు ఉంటాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పౌరులు 25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ చార్జీలు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
అదనపు కలెక్టర్ వెంకటాచారి పరిగి: పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటాచారి సూచించారు. శనివారం ఆయన పరిగి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలపై వచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలంలో భూ సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమయపాలన పాటిస్తూ రెవెన్యూ అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామాల దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలన్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ అధికారం కల్ల
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో భూ కుంభకోణాలు, అరాచకాలు మినహా ప్రజలకు చేసిందేమీ లేదు. ఆ పార్టీ అరాచకాలు చూసి ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేసే అవకాశం లేదు. ఆ పార్టీ మరో 20 ఏళ్ల వరకు అధికారంలోకి రావడం కల్ల’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయింది. అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కమిషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తుంది. మంత్రులే స్వయంగా రంగారెడ్డి జిల్లాలో భూముల ఆక్రమణతోపాటు మైనింగ్ కుంభకోణాలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసింది’అని దుయ్యబట్టారు. శనివారం నందినగర్లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నేతలతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎక్కడికక్కడ నిరసనలు: ‘ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ విధంగా ఉంటే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది. వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ.వెయ్యి పెంచింది. అడ్డగోలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ వస్తున్న బీజేపీ నిర్వాకం వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడ్డగోలు నిర్ణయాలపై బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. మరోసారి ఈ ధరలు పెంచకుండా ఉండేందుకు ప్రజలను జాగృతం చేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం త్వరలో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, తర్వాత జరిగే కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను కేటీఆర్ పార్టీ నేతలకు వివరించారు. ‘రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో బీఆర్ఎస్ చురుకైన పాత్ర పోషించబోతోంది. కాంగ్రెస్, బీజేపీ చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. ప్రతీ ఒక్క యువతీ, యువకుడికి ఓటు హక్కు కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలి. కాంగ్రెస్, బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది. ప్రజల ఓటు హక్కుకు బాధ్యతగా భరోసాగా నిలవాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు త్వరలో మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఆ ఎన్నికలకు సమాయత్తం కావాలి’అని కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
పెట్టుబడి పేరిట రూ.50 లక్షలకు టోకరా
బోగస్ చెక్కులతో బురిడీ.. ఇద్దరు స్కూల్ డైరెక్టర్ల అరెస్టు బంజారాహిల్స్: అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడి పేరిట డబ్బులు తీసుకుని బోగస్ చెక్కులు ఇచ్చిన ఇద్దరు స్కూల్ డైరెక్టర్లను బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఎస్ఐ విజయ్ కొట్టూర్ కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని ఇందిరానగర్–కమలాపురికాలనీలో బడ్స్ అండ్ ఫ్లవర్స్ పాఠశాల ఉంది. చనుబోయిన గోవింద్, ఆయన భార్య చనుబోయిన శ్రీదేవి డైరెక్టర్లుగా, కలిగెట్ల లక్ష్మీ ప్రసన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నారు. తమ పాఠశాలను బ్రాంచీలుగా విస్తరిస్తున్నామని, పెట్టుబడి పెడితే అధిక లాభాలిస్తామని గోవింద్, శ్రీదేవి చెప్పడంతో ఎస్ఎస్రెడ్డి అనే వ్యాపారి రూ.50 లక్షల పెట్టుబడి పెట్టాడు. లాభాల విషయమై వారు దాటవేస్తుండటంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు గోవింద్, శ్రీదేవిలను కోరాడు. ఈ మేరకు వారు గత నెల మొదటివారంలో ఆయనకు ఆరు చెక్కులు ఇచ్చారు. వాటిని బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి వెళ్లగా అవి బ్లాక్ అయిన బ్యాంక్ అకౌంట్ చెక్కులని తేలింది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు గోవింద్, శ్రీదేవిలను కలవడానికి పలుమార్లు స్కూల్కు వెళ్లగా బౌన్సర్లతో అడ్డుకుని దాడులు చేయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘పాలమూరు–రంగారెడ్డి’ని పూర్తి చేయాలి
షాద్నగర్రూరల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి తక్షణమే చర్యలు చేపట్టాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు కనీసం లక్ష ఎకరాలకు నీళ్లవ్వలేదని, ప్రాజెక్టు 90శాతం పూర్తయిందని ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీఎం రేవంత్రెడ్డి 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన తరువాతే మిగతా ప్రాంతాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల జేఏసీ నాయకులు అర్జునప్ప, టీజీ శ్రీనివాస్, నర్సింలు, రాము, సత్యం, రవికుమార్, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. -
మట్టి టిప్పర్ల పట్టివేత
కేశంపేట: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోల్కోనిగుట్ట తండా పంచాయతీ పరిధిలో అక్రమంగా మట్టి తరలిస్తున్నట్టు గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్ల డ్రైవర్లు ఉమేష్, విక్రమ్తో పాటు యజమాని రాఘవేందర్పై కానిస్టేబుల్ శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. -
కల్లు తాగొద్దన్నందుకు..
ఉరివేసుకొని బలవన్మరణం శంకర్పల్లి: కల్లుకు బానిసైనా ఓ వ్యక్తి.. దాన్ని తాగొద్దన్నందుకు మనస్తాపంతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిఽధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని గోపులారం గ్రామానికి చెందిన శ్రీశైలం (46) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏళ్ల నుంచి కల్లు తాగే అలవాటు ఉండగా ఆరోగ్యం పాడవుతుందని మానేయాలని కుటుంబసభ్యులు చెబుతూ వచ్చారు. దీంతో మూడు రోజుల నుంచి కల్లు మానేసిన ఆయన అప్పటి నుంచి ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. అక్కడ చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేశంపేట: ఆర్ఎంపీ వైద్యుడు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట గ్రామానికి చెందిన భూయాకర్ రవీందర్ గ్రామంలోనే ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. కుటుంబంతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నారు. గతనెల 24న ఇంట్లో పెద్ద కుమారుడితో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన రవీందర్ మరుసటి రోజున ఇంట్లో నుంచి క్లినిక్కు వెళ్లి అక్కడి నుంచి ఆమనగల్లు వైపు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. బంధువులు, తెలిసిన చోట వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం భార్య శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. కేశంపేట: ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని వేములనర్వ గ్రామానికి చెందిన కుమ్మరి అంతమ్మ (70) కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఏప్రిల్ 30న పింఛన్ డబ్బులు తీసుకుంది. వాటితో శుక్రవారం మద్యం తాగి పొలానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఉన్న చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. ఈ మేరకు మృతురాలి కుమారుడు సత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యుఏ) భద్రతా వ్యవస్థల క్రమబద్ధమైన నిర్వహణ, పారదర్శక పాలన,ఉమ్మడి స్థలాలపై దృష్టి పెట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. నారెడ్కో తెలంగాణ, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(ఎఫ్టీసీసీఐ), యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (యు–ఫెర్వాస్) సంయుక్తంగా ఫెడరేషన్ హౌస్లో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించాయి. ఆయన మాట్లాడుతూ.. స్వీయ జనగణనకు మద్దతు ఇవ్వాలని నివాసిత సంఘాలను కోరారు. హైదరాబాద్లో బహుళ అంతస్తుల నివాస సముదాయాలు, గేటెడ్ లేఅవుట్లు, వాణిజ్య సముదాయాలు గణనీయంగా పెరిగాయని, ఎప్పటికప్పుడు చట్టబద్ధమైన పునరుద్ధరణలు, భద్రతా నిబంధనలను పాటించాలన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డీజీ విక్రంమాన్ సింగ్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. -
ఔటర్పై ఆగితే అంతే ..
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై వాహనం రకం, వేగాన్ని బట్టి లేన్ (వరుస) డ్రైవింగ్ను నిర్ణయించారు. కానీ.. చాలా మంది వాహనదారులు లేన్ డ్రైవింగ్ నిబంధన పాటించకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఔటర్పై అతి వేగంగా వస్తున్న వాహనాలు ముందు ఆగి ఉన్న వాహనాలను అంచనా వేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు అతివేగం, నిర్లక్ష్యం కూడా ఔటర్పై రోడ్డు ప్రమాదాలలో కారణమేనని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం తుక్కుగూడ నుంచి శంషాబాద్ వస్తున్న కారు పెద్దగోల్కొండ ఔటర్పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొని.. కుటుంబంలోని ఆరుగురు సభ్యులు అక్కడికక్కడే అసువులు బాశారు. లేన్ డ్రైవింగ్ పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైంది. ఔటర్పై అతివేగంగా వెళ్తూ తరచూ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా రహదారి భద్రతా నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. ప్రమాదాలకు ఇవీ కారణాలే.. ● 158 కిలోమీటర్ల ఔటర్పై రోజూ 15 లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఎక్కువ మంది వాహనదారులకు ఏయే లేన్లలో ప్రయాణించాలనే విషయంపైనే అవగాహన ఉండదు. సగటున 65 శాతం వాహనాలు లేన్ డ్రైవింగ్ (వరుస క్రమం) పాటించడంలేదని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. ● ఓఆర్ఆర్పై రాత్రి దాటాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహన డ్రైవర్లు అవగాహన లోపంతో పక్కన నిలిపేస్తుంటారు. అతివేగంతో ముందు ప్రాంతాన్ని అంచనా వేయలేని కొందరు వీటిని ఢీకొట్టి.. మృత్యువాతపడుతున్నారు. ● కొన్నిసార్లు వెనుక నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని అదుపుచేయలేక.. నెమ్మదిగా వెళ్లే ముందున్న వాహనాలను ఢీకొడుతున్నాయి. ఇంకొన్నిసార్లు వాహనాలు అదుపుతప్పి డివైడర్లను ఢీకొట్టుకుంటున్నాయి. ఇలా వెళ్తే సేఫ్ జర్నీ ● ఔటర్ రింగురోడ్డుపై ఒక్కోవైపు నాలుగు వరుసల చొప్పున రహదారులున్నాయి. నిబంధనల ప్రకారం 1,2 లేన్లలో కార్లు, 3,4 వరుసల్లో లారీలు, ఇతర భారీ వాహనాలు మాత్రమే ప్రయాణించాలి. ఈ నిబంధన అతిక్రమించిన సందర్భాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. 1, 2 లేన్లలో ప్రయాణించే వాహనాలు కనిష్ఠంగా 100 నుంచి గరిష్టంగా 120 కిలోమీటర్లు, 3, 4 వరుసల్లో కనిష్ఠంగా 80 నుంచి గరిష్టంగా 100 కి.మీ. వేగంతో ప్రయాణించాలి. ● లేన్లపై వాహనాలు అడ్డదిడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. ఒకవేళ వాహనాలు లేన్లు మారాలనుకుంటే అకస్మాత్తుగా తీసుకోకుండా.. కచ్చితంగా ఇరువైపులా, వెనుక గమనించాలి. వెనుక నుంచి వచ్చే వాహనదారులు అప్రమత్తమ య్యేలా ఇండికేటర్లు, ఇతర సంజ్ఞలు వేయాలి. ఇవేవీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పక్కలేన్లలోకి దూసుకెళ్లకూడదు. ఔటర్పై జరిగే 50 శాతం ప్రమాదాలకు అడ్డదిడ్డంగా లేన్లు మారడమే కారణం. అతివేగంతో అదుపు చేయలేక.. ఔటర్పై వేగం పెరిగే కొద్దీ ప్రమాదశాతం పెరుగుతున్నట్లు వాహనదారులు గుర్తించాలి. సాధారణంగా ఔటర్ చూసేందుకు ఖాళీగా వేగంగా దూసుకెళ్లేందుకు అనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా వాహనాన్ని అదుపుచేసే అవకాశాలు 90 శాతం తక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ముందు వెళ్తున్న వాహనం వేగం తగ్గితే అదుపు చేయలేక ఒక్కసారిగా ఢీకొడతాయి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాహనం నిలపాలనుకుంటే పూర్తిగా ఎడమవైపు సర్వీ స్ లేన్పైనే ఆపాలి. ఇందుకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలున్నాయి. పార్కింగ్ లైట్లు ఆన్లోనే ఉంచాలి. రాత్రివేళ ఎక్కువ సమయం వాహనాన్ని నిలపకూడదు. అలాగే ఓఆర్ఆర్ ప్రవేశం, నిష్క్రమణ మార్గాల్లో రాంగ్ రూట్లో ప్రయాణించకూడదు. ఓఆర్ఆర్పై నిలిపి ఉంచుతున్న వాహనాలు ఎక్కువ ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం ముందు వాహనానాన్ని అంచనా వేయలేకపోతున్న డ్రైవర్లు లేన్ డ్రైవింగ్ చేయకపోవడం, అతివేగం, నిర్లక్ష్యం ప్రాణాలను బలిగొంటున్నా చర్యలు శూన్యం పెద్దగోల్కొండ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం కుటుంబంలో విషాదం నింపిన ఘోర ప్రమాదం -
అభివృద్ధిని చూసి చేరికలు
షాబాద్: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొమరబండ సర్పంచ్ కుక్కల పద్మమ్మ గోపాల్, గ్రామస్తులు బసిలింగం, చిన్న శేఖర్, హరీష్, రాము, హరీష్, తదితరులు శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పదవులు వస్తాయన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, నాయకులు ధర్మభిక్షం, గంధం అంజయ్య, మంగలి రాములు, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
నకిలీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నకిలీ విత్తన విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో నకిలీ విత్తనాల నిర్మూలన అంశంపై జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తన రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో మూడు, డివిజన్ స్థాయిలో ఆరు, మండల స్థాయిలో 26 టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ, సీడ్ కార్పొరేషన్, పోలీసు, రెవెన్యూ, రవాణాశాఖల సమన్వయంతో ఈ బృందాలు పని చేస్తాయని చెప్పారు. జిల్లాలో 474 రిటైల్ విత్తన దుకాణాలు, తొమ్మిది సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 224 లైసెన్సు కలిగిన విత్తన హోల్డర్లు ఉన్నారని అన్నారు. పత్తి, మిర్చి పంటల్లో నకిలీ విత్తనాల సమస్య ఎక్కువగా ఉందని, దీన్ని పూర్తిగా నియంత్రించేందుకు కట్టదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా తయారు చేసిన విత్తనాలు సహా అనధికారికంగా విక్రయించేవి, సరైన లేబులింగ్ లేని ప్యాకెట్లు, గడువు ముగిసిన విత్తనాలు, తక్కువ నాణ్యతతో కూడిన విత్తనాలను నకిలివీగా గుర్తించనున్నట్లు ప్రకటించారు. విత్తనాల నమూనాల సేకరణ, పరీక్షలు సహా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 420, ఈసీయాక్ట్ 1955, సీడ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. రైతులు విధిగా లైసెన్సు ఉన్న దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, అనధికారిక విక్రేతల వద్ద కొనొద్దని సూచించారు. సమావేశంలో హెర్బిసైడ్ టాలరెంట్ (హెచ్టీ) పత్తి విత్తనాలపై కూడా చర్చించారు. ఈ విత్తనాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించని జన్యుమార్పిడి (జీఎం) విత్తనాలు కావడంతో వాటి సాగు చట్ట విరుద్ధమని, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం శిక్షార్హమని చెప్పారు. గ్లైఫోసేట్ వంటి రసాయనాల వినియోగం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరమని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఉష పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం
అబ్దుల్లాపూర్మెట్ : విద్యుత్ తీగలు అల్లుకోవడంతో వచ్చిన నిప్పుతో గడ్డివాము దగ్ధమైంది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాటసింగారం గ్రామంలోని సింగరేణికాలనీలో శుక్రవారం మధ్యాహ్నం రెండు విద్యుత్ తీగలు తగలడంతో నిప్పు రవ్వలు చెలరేగి సమీపంలో ఉన్న దర్నమోని లోకనాథంకు చెందిన ఎండు గడ్డి వాముపై పడ్డాయి. దీంతో గడ్డివాము కాలిబూడిదైంది. వెంటనే అప్రమత్తమైన బాధితుడు సమీపంలోనే ఉన్న పశువులకు ఎలాంటి హాని జరగకముందే దూరంగా తీసుకెళ్లాడు. ఉద్యోగాల పేరుతో మోసం మేడిపల్లి: ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం... అమీన్పూర్కు చెందిన వినయ్ రెడ్డి, బంధువు రిషితారెడ్డిలకు బోడుప్పల్కు చెందిన యశ్వంత్ రెడ్డి 2025 ఆగస్టులో లింక్డ్ఇన్ ద్వారా పరిచయమయ్యాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికిన యశ్వంత్రెడ్డి వారి వద్ద నుంచి రూ.8 లక్షలు వసూలు చేశాడు. అనంతరం కొన్నిరోజులు శిక్షణ పేరుతో నమ్మకం కలిగించాడు. నెల జీతం కూడా చెల్లించాడు. ఆ తరువాత మొహం చాటేశాడు. ఫోన్ చేస్తే స్పందించడం మానేశాడు. చివరకు వారి ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసి పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం మేడిపల్లి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కుమార్తైపె అఘాయిత్యం కేసులో తండ్రికి 20 ఏళ్ల శిక్ష
జీడిమెట్ల: కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి మేడ్చల్ ఫాస్ట్ట్రాక్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.35 వేల జరిమానా విధించింది. వివరాలు... బీహార్కు చెందిన అస్గర్ అలీ(36) భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి 2019లో నగరానికి వలస వచ్చి సుభాష్నగర్లోని గంపలబస్తీలో ఉంటున్నాడు. అస్గర్ దినసరి కూలీ కాగా, అతడి భార్య ఇళ్లల్లో పనిమనిషి. గతేడాది మే నెలలో అస్గర్ అలీ పెద్దకుమార్తె(15)పై లైంగికదాడికి పాల్పడగా చిన్న కుమార్తె గమనించి తల్లికి చెప్పింది. 2025 మే 6న బాధితురాలి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు పోక్సోతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అదే నెల 8న కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం చార్జ్షీట్ దాఖలు చేయగా, మేడ్చల్ పాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి కె.వెంకటేష్ విచారణ జరిపి నిందితుడిని దోషిగా తేల్చారు. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం మంజూరు చేశారు. పోలీస్ కస్టడీకి నిందితుడు బంజారాహిల్స్: సంపన్న కుటుంబాలకు చెందిన యువతులను ప్రేమపేరుతో మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసిన నిందితుడి జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. వివరాలు.. జూబ్లీహిల్స్కు చెందిన ఓ యువతిని ప్రేమపేరుతో లోబర్చుకుని రూ.13 లక్షల దాకా వసూలు చేశాడు. మణికొండకు చెందిన మరో యువతి వద్ద కూడా బంగారం తీసుకుని మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇటీవల నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో ఆయన సోదరుడు రాజీవ్ను కూడా మూడు రోజుల క్రితం రిమాండ్కు తరలించారు. అన్నదమ్ములిద్దరూ మరో 10 మంది స్నేహితులతో కలిసి ఇన్స్ట్రాగామ్లో అమ్మాయిలను ఆకర్షించి లక్షల రూపాయల మేర వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఎంతమంది యువతులను మోసం చేశారనే విషయం విచారణలో తేలనుంది. నిందితుడితోపాటు పబ్లు, హోటళ్లకు వెళ్తూ అమ్మాయిలకు వల వేస్తున్న మరికొంతమంది యువకులపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కారు ఢీకొని యువకుడి దుర్మరణం మర్రిగూడ(చింతపల్లి): అత్తగారింటి వద్ద తన కుమార్తె పురుడుకు వచ్చి వెళ్తుండగా కారు ఢీకొని యువకుడు మృతిచెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం గేట్ వద్ద జరిగింది. స్థానిక ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్దఅంబర్పేట్ గ్రామానికి చెందిన ఆవుల రవితేజ (22)కు ఇటీవల కుమార్తె జన్మించింది. గురువారం రవితేజ అత్తగారి ఊరైన నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం రోళ్లకల్లులో తన కుమార్తె పురుడు చేశారు. కార్యక్రమానికి మధు, అతడి స్నేహితుడు చేవెళ్ల సుజిత్కుమార్ కలిసి ద్విచక్ర వాహనంపై వచ్చారు. పురుడు అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్తుండగా.. మార్గమధ్యలో చింతపల్లి మండలం మదనాపురం గేటు వద్దకు రాగానే కారు రాంగ్రూట్లో అతివేగంగా వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవితేజ, సుజిత్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిద్దరినీ మాల్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రవితేజ శుక్రవారం మృతిచెందాడు. సుజిత్కుమార్ చికిత్స పొందుతున్నాడు. రవితేజ తండ్రి ఆవుల నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్తంభానికి కట్టి.. దారుణంగా కొట్టి.. కుత్బుల్లాపూర్: నిర్మాణ సంస్థకు చెందిన సైట్ ఇంజనీర్, మరో నలుగురు కూలీలు కలిసి ఓ వ్యక్తిని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టడంతో అతడు మృతి చెందాడు. పేట్బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం... ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సునీల్రామ్(35) కుటుంబంతో కలిసి కుత్బుల్లాపూర్ పరిధిలోని గోదావరి హోమ్స్కు వలస వచ్చి స్థానికంగా పాల్మీరా మిడోవ్స్ ప్రైడ్ ఇన్ఫ్రాలో కూలీగా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 30వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో సునీల్రామ్ వ్యక్తిగత విషయాలపై తన భార్యతో గొడవ పడసాగాడు. సమాచారం అందుకున్న సైట్ ఇంజనీర్ ప్రసాద్, మరో నలుగురు కూలీలు అక్కడికి చేరుకుని సునీల్రామ్ను బలవంతంగా అక్కడ నుంచి బయటకు తీసుకువెళ్లారు. అనంతరం అతనిపై దాడి చేసి స్తంభానికి కట్టేసి వెళ్లిపోయారు. శుక్రవారం సునీల్ రామ్ భార్య అక్కడికి వెళ్లి చూడగా అతడు మృతి చెంది ఉన్నాడు. సైట్ ఇంజనీర్, నలుగురు కూలీల వల్లే తన భర్త మృతి చెందాడని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విజయ్కుమార్కు దళితరత్న అవార్డు
చేవెళ్ల: మున్సిపల్ నూతన కమిషనర్గా బి.యాదగిరి బదిలీపై వచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఉన్న వెంకటేశం బదిలీ కావడంతో ఆయన స్థానంలో కొల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి బి.యాదగిరి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహాయ సహకారాలతో మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. షాబాద్: పంట మార్పిడితో అధిక లాభాలు వస్తాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు భద్రు, కిరణ్బాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని తాళ్లపల్లి రైతు వేదికలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం ఒకే పంట సాగు చేయకుండా మార్పిడి చేయాలని అన్నారు. పత్తిలో హెడీపీఎస్ పద్ధతిన సాగు చేస్తే దిగుబడి వస్తుందన్నారు. సేంద్రియ ఎరువులతో సాగు చేయాలన్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులను అనుసరించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని చెప్పారు. రైతులు సాగు ఖర్చులను తగ్గించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి దండెం విజయచంద్ర, సర్పంచులు తాళ్ల స్వాతి మాణిక్యంగౌడ్, కుమార్, నర్సింలు, ఉపసర్పంచ్ ఆంజనేయులు, ఏఈఓ గీత తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం
బహదుర్పురా: తాడ్బన్ వద్ద మూడు షాపుల్లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయణికులు సమాచారం ఇవ్వడంతో బహదుర్పురా పోలీసులు వెంటనే 8 ఫైరింజన్లతో సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసుల కథనం ప్రకారం... అబ్దుల్ సలీం, అబ్దుల్ హై, అలీలు తాడ్బన్లో కొంతకాలంగా ఉడ్ వర్క్, ఫైబర్ షీట్ షీల్డ్, ఏషియన్ పెయింట్ పాపులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో షాపులను యధావిధిగా మూసివేశారు. అయితే 11.30 గంటల ప్రాంతంలో పాపుల నుంచి పెద్ద ఎత్తున మంటలు రావటాన్ని స్థానికులు, ప్రయణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఐదు గంటలు శ్రమించి ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు, బహదుర్పురా ఎమ్మెల్యే మహ్మద్ మోబిన్, స్థానిక కార్పొరేటర్లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై ఆరా తీశారు. ఒక షాపు నుంచి మరో రెండు షాపులకు మంటలు విస్తరించడంతో ప్లైవుడ్స్, పెయింట్, ఇతర ఫైబర్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. శుక్రవారం సాయంత్రం మళ్లీ పొగలు వ్యాపించడంతో చందులాల్ బారాదరి ఫైర్ అధికారులు మొగల్పురా నుంచి ఫైరింజన్ తెప్పించి అదుపుచేశారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న ఏషియన్ పెయింట్ యాజమని అలీ షాక్కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో రూ.10 లక్షలకుపైగా ఆస్తి నష్టం జరిగినట్లు షాపుల యాజమానులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నారు. షాపు యజమానులపై కేసు.. ఫైర్ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని గతంలో పోలీసులు షాపుల యాజమనులకు సూచించినా పెడ చెవిన పెట్టారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు యజమానులు అబ్దుల్ సలీం, అలీ, అబ్దుల్ హైపై కేసు నమోదు చేశారు. 5 గంటలు శ్రమించి మంటలను ఆర్పివేసిన పోలీసులు, ఫైర్ సిబ్బంది తాడ్బన్లో ఘటన.. రూ.లక్షల్లో ఆస్తినష్టం -
నియోజకవర్గ సభలను జయప్రదం చేయాలి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నియోజకవర్గ స్థాయిలో శనివారం నిర్వహించే సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సంబంధిత అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గం స్థాయి సభలు సమర్థవంతంగా నిర్వహించాలన్న ప్రభుత్వ సూచన మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పాఠశాల/మండల కార్యలయం/బహిరంగ ప్రదేశం/ఏదైనా ఇతర అనువైన వేదికను ఏర్పాటు చేసి ఉదయం 10 గంటలకు మండల స్థాయి సభలను ప్రారంభించాలని తెలిపారు. సభల్లో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. సభలను రాష్ట్ర గీతంతో ప్రారంభించాలని, ముఖ్యమంత్రి సందేశం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చదివి వినిపించాలని సూచించారు. ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై చర్చించాలని, సభల్లో ఆర్డీఓలు, తహసీల్దార్, ఎంపీడీఓ, వార్డు సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, రైతులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఉండేలా చూడాలన్నారు. మహిళలు, వృద్ధులు కూర్చునేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రదర్శన కోసం స్క్రీన్, ప్రొజెక్టర్ ఏర్పాటు చేయాలని, పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తాగునీరు, నీడ కోసం ఏర్పాట్లు చేయాలని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం స్థాయి సభ బ్యానర్ ప్రదర్శించాలని వివరించారు. టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) చంద్రారెడ్డి, (స్థానిక సంస్థలు) కిరణ్మయి, ఆర్డీఓలు, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, సీపీఓ సౌమ్య, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ‘నీట్’ను పకడ్బందీగా నిర్వహించాలి ఈ నెల 3న నీట్ పరీక్ష నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థులను ఉదయం 11 నుంచి కేంద్రాలకు అనుమతిస్తారని, మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూయడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ విధానం ద్వారా తీసుకోవడం జరుగుతుందని, ఏదైనా సమస్య తలెత్తి ధ్రువీకరణ పూర్తి కాకపోయినా, అభ్యర్థిని పరీక్ష గదిలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారన్నారు. అయితే లిఖిత పూర్వక హామీ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. హామీ పత్రం నమూనా పరీక్ష కేంద్రంలో అందిస్తారన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి డిజిటల్ పరికరాలు అనుమతించరని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల రవాణాపై పోలీస్, రెవెన్యూ, తపాలా శాఖల అధికారుల సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టాలని, పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్ష ముగిసిన తరువాత ఓఎంఆర్ పత్రాల తరలింపు పకడ్బందీగా చేపట్టాలన్నారు. పరీక్ష సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, వైద్య–ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించి ఓఆర్ఎస్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. కలెక్టర్ నారాయణ రెడ్డి -
బంక్లు మూసి ఇబ్బంది పెట్టొద్దు
ధారూరు: ఉద్దేశ పూర్వకంగా బంక్లను మూసేసి, వాహనదారులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని తహసీల్దార్ సాజిదాబేగం హెచ్చరించారు. హరిదాస్పల్లి సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్లో స్టాక్ ఉన్నప్పటికీ గురువారం సాయంత్రం మూసి ఉండడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బంక్ మూసి ఉండటాన్ని గమనించిన డీసీసీ కార్యదర్శి మమ్మద్ బాబాఖాన్ పెట్రోల్, డీజిల్ ఉన్నా బంక్ ఎందుకు మూసేశారని నిలదీశారు. రాత్రి వేళ బ్లాక్ మార్కెట్కు తరలించి, సొమ్ము చేసుకునే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు సిబ్బంది లేక తెరవలేదని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవిషయాన్ని వెంటనే తహసీల్దార్తో పాటు ధారూరు సీఐ రఘురామ్కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ హెచ్చరికలతో బంక్ తెరిచిన నిర్వాహకులు ప్రెట్ల్, డీజిల్ పంపిణీ చేశారు. తహసీల్దార్ సాజిదాబేగం -
బేస్బాల్ విజేత జిల్లా జట్టు
డిచ్పల్లి (నిజామాబాద్రూరల్): రాష్ట్రస్థాయి బేస్బాల్ టోర్నమెంట్ బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్ ద్వితీయ, నిజామాబాద్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు విజేతగా నిలిచింది. నల్లగొండ జిల్లా జట్టు ద్వితీయ, జనగామ జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన 6వ రాష్ట్ర బేస్బాల్ సబ్జూనియర్ టోర్నమెంట్ పోటీలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ పవన్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులు మే 24 నుంచి 28 వరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో జరిగే జాతీయ సబ్ జూనియర్ బేస్బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ఒలింపిక్ అబ్జర్వర్ లింగన్న, రాష్ట్ర బేస్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్వేత, కోశాధికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులకు రాజేంద్రనగర్ జోన్ జోనల్కమిషనర్ శ్రీనివాస్రెడ్డి సూచించారు. గురువారం రాజేంద్రనగర్లోని జోనల్ కార్యాలయంలో యూసీడీ అధికారులతో కలిసి ఆయన సమావేశమయ్యారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచి మరిన్ని ఎస్హెచ్జీ గ్రూపులను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ‘‘99 డేస్ ఆఫ్ యాక్షన్ ప్లాన్’కార్యక్రమం కింద ఇప్పటి వరకు జోనల్లో మొత్తం 198 గ్రూపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు జోనల్ కమిషనర్కు వివరించారు. ఈ సంఖ్యను మరింత పెంచడానికి వార్డు స్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఎస్హెచ్జీలు కీలకంగా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్హత గల కుటుంబాన్ని భాగస్వామ్యం చేయాలని కమిషన పేర్కొన్నారు. -
ఽభూముల ధరలు పెరుగుతాయ్
● అమ్ముకుంటే నష్టపోతారు ● రెండో హైదరాబాద్గా.. వికారాబాద్ ● స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ధారూరు: భవిషత్తులో వికారాబాద్ రెండో హైదరాబాద్గా అభివృద్ధి చెందనుందని, ఎవరూ కూడా తమ భూములు విక్రయించవద్దని శాససనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం ధారూరు మండలం గురుదోట్ల గ్రామ పంచాయతీ పరిధి వెనకతండా, కుక్కిందలో తొలుత లబ్ధిదారు ఇందిరమ్మ ఇంటిని, అనంతరం నాగసమందర్లో నూతనంగా నిర్మించిన చర్చిని ప్రారంభించి మాట్లాడారు. వికారాబాద్ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధు లు సమకూర్చి, అభివృద్ధి చేస్తానని చెప్పారు. దీంతో మన ప్రాంతంలో భూముల ధరలు పెరిగే అవ కాశం ఉందని తెలిపారు. ఇప్పుడు భూములు అ మ్ముకుంటే.. ఆ తరువాత చింతించాల్సి వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో రా ష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దు తూ సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాన్సింగ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, వాలీబాల్ అసోసియేష న్ జిల్లా అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, కుక్కింద, గురుదోట్ల సర్పంచు లు మణెమ్మ, రాములు, కాంగ్రెస్ కమిటీ జిల్లా కా ర్యదర్శి మహ్మద్ బాబాఖాన్, నాయకులు పాల్గొన్నారు. -
మేయర్కు ఓటు!
సాక్షి, సిటీబ్యూరో: క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పాలకమండళ్లకు జరగబోయే ఎన్నికల్లో మేయర్లను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారా? అంటే.. కాదనలేమనే సమాధానమే అధికారుల నుంచి వస్తోంది. పది లక్షల జనాభా దాటిన నగరాల కార్పొరేషన్ల మేయర్ల ఎన్నికను ప్రత్యక్షంగా నిర్వహించడంతోపాటు వారికి కార్యనిర్వాహక అధికారాలు కల్పించాలని సూచిస్తూ నీతి ఆయోగ్ ఇటీవల కేంద్రానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చ సాగుతోంది. ‘మూవింగ్ టువార్డ్స్ ఎఫెక్టివ్ సిటీ గవర్నమెంట్– ఎ ఫ్రేమ్ వర్క్ ఫర్ మిలియన్ ప్లస్ సిటీస్’పేరిట అందజేసిన ఈ నివేదికలో మేయర్కు అధికారాలుండాలని సూచించింది. మేయర్ పదవికి స్థిరమైన కాలపరిమితి నిర్ణయించడంతోపాటు ప్రజలే నేరుగా ఎన్నుకోవాలని పేర్కొంది. పారిశుధ్యంతోపాటు నీటి సరఫరా, పబ్లిక్ రవాణా వంటి విభాగాలు కార్పొరేషన్ పరిధిలో ఉండాలని కూడా సూచించింది. పెద్ద నగరాల్లో నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండటంతోపాటు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. హైదరాబాద్తోపాటు చాలా కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికల ద్వారా మేయర్లను ఎన్నుకుంటున్న విషయం తెలిసిందే. తద్వారా కౌన్సిల్లో బలం కోసం పార్టీల మధ్య పొత్తులు, పదవీకాలం పంచుకోవడం వంటివి నగర ఓటర్లకు అనుభవమే. ఇలాంటి ఇబ్బందులు లేని స్థిరమైన పదవీకాలం, స్వతంత్ర నిర్ణయాలు మేయర్కు ఉంటే జవాబుదారీతనంతోపాటు నగర పాలనలో స్థిరత్వం, వేగం కూడా ఉంటాయనేది నీతి ఆయోగ్ అభిప్రాయం. న్యూయార్క్, టోక్యో, లండన్ వంటి నగరాల్లో శక్తివంతమైన మేయర్ వ్యవస్థ వల్ల అభివృద్ధి సాధ్యమైందని ప్రస్తావించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు సందర్భాల్లో న్యూయార్క్, లండన్ వంటి నగరాలతోనే హైదరాబాద్ పోటీ అని ప్రస్తావించడం తెలిసిందే. సిటీకి కొత్త కాదు.. హైదరాబాద్ నగరానికి ప్రత్యక్ష మేయర్ ఎన్నిక కొత్తకాదు. జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందకముందు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)కు 2002లో జరిగిన మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్కు ఒక ఓటు, మేయర్కు మరొక ఓటు చొప్పున ఓటర్లు రెండు ఓట్లు వేశారు. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి మేయర్గా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీ ఏర్పాటైన తర్వాత 2009–14 పాలకమండలిలో కాంగ్రెస్ –ఎంఐఎం పొత్తులో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని పంచుకున్నాయి. కాంగ్రెస్ తరఫున బండ కార్తీకరెడ్డి, ఎంఐఎం తరఫున మాజిద్ హుస్సేన్లు మేయర్లుగా పదవీకాలాన్ని కూడా పంచుకున్న విషయం తెలిసిందే. కార్పొరేషన్ పరిధిలోనే తాగునీరు, డ్రైనేజీ, రక్షణ తదితర విభాగాలుండాలనే ఆలోచనలు గతంలోనూ జరిగాయి. ప్రస్తుతం క్యూర్ పరిధిలోని కార్పొరేషన్లు, పోలీసు, వాటర్, రెవెన్యూ, విద్యుత్ విభాగాలు వంటివి ఒకే ప్రాంగణంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటుండటం గమనార్హం. క్యూర్లోని మూడు కార్పొరేషన్లలో ప్రత్యక్ష ఎన్నికపై చర్చ నీతి ఆయోగ్ సంస్కరణల నేపథ్యం.. కార్పొరేటర్కు ఒకటి, మేయర్కు మరో ఓటు పొత్తులు, పదవీకాలం పంచుకోవడానికి చెక్ -
నామినేటెడ్ ఆశలు
పరిగి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం నామినేట్ పద్ధతిలో నియమించనుంది. పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు సభ్యుల నియామకానికి నిర్ణయం తీసుకుంది. దీంతో అధికార పార్టీ నాయకుల్లో పదవులపై ఆశలు మొదలయ్యాయి. గతంలో ప్రతీ సహకార సంఘానికి 13 మంది చొప్పున డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరిగేవి. సంఘ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునేవారు. ఇలా ఎన్నికై న వారంతా కలిసి ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్ చైర్మన్గా నియమించేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ విధానానికి స్వస్తి పలికినట్లయింది. ఇప్పటికే పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది దాటింది. ఈనేపథ్యంలో పాత సంఘాలను రెండుసార్లు పొడిగించింది. ఆతర్వాత పలువురు చైర్మన్లు, వైస్ చైర్మన్లపై అవినీతి ఆరోపణలు రావడంతో గత డిసెంబర్ నుంచి ఇన్చార్జ్ అధికారులను కొనసాగిస్తోంది. ఎన్నికలపై స్పష్టత కరువు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు గానూ పరిగి, పూడూరు, దోమ, కుల్కచర్లకు సహకార సంఘాలున్నాయి. నూతనంగా ఏర్పడిన చౌడాపూర్ విషయంలో స్పష్టత రాలేదు. నామినేటెడ్ పద్ధతిలో ఒక్కో సంఘానికి ఎంత మందిని ఎంపిక చేస్తారనేది కూడా కచ్చితంగా తెలియడం లేదు. ఒక్కో సంఘానికి ముగ్గురిని, ఐదుగురిని ఎంపిక చేసి వారిలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక విధివిధానాలు రావాల్సి ఉంది. నామినేటెడ్ చేసే సభ్యులలో జనరల్, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు మహిళా వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఎంపిక ఎమ్మెల్యేలదే.. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పరపతి కల్పనలో ప్రాథమిక సహకార సంఘాలు కీలకంగా పని చేస్తున్నాయి. పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాల సబ్సిడీలు, సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రైతు వర్గాల్లో కీలకంగా ఉన్న ఈ పదువులు నియోజకర్గ పరిధిలో ఎమ్మెల్యేలు సూచించిన వారికే దక్కే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ కమిటీ పాలకవర్గాల తరహాలో సహకార సంఘాల్లోనూ ఇదే తీరుగా కొనసాగనుంది. దీంతో ఈ పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్న నాయకులు స్థానిక ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికార పార్టీ నాయకులకు అవకాశాలు దక్కనున్నాయి. పీఏసీఎస్లలో పదవుల భర్తీపై నేతల్లో ఉత్కంఠ పైరవీలు ప్రారంభించిన ఆశావహులు ఎమ్మెల్యే సూచించిన వారికే పోస్టులు దక్కే అవకాశం -
ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్ బదిలీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ సుధాకర్ బండారి ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థిపై ఆయన 28 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఓటింగ్ నిర్వహించారు. డాక్టర్ అనురాగిణిరెడ్డి, డాక్టర్ వినోద్, డాక్టర్ వినయ్, డాక్టర్ చంద్రకృష్ణ, డాక్టర్ శ్రీలత, డాక్టర్ రాకేష్, డాక్టర్ శ్రీకర్, డాక్టర్ గాయిత్రీలతో కూడిన వైద్య బృందం ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించింది. హుడాకాంప్లెక్స్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 11వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో 162 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్టు తెలిపారు. ఐటీ, హెల్త్ కేర్, ఇండస్ట్రియల్, ఫార్మా, రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, సేవా రంగం తదితర అనేక విభాగాలకు చెందిన సంస్థలు పాల్గొంటాయని చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ వంటి అర్హతలతో ఉన్న అభ్యర్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయన్నారు. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంపిక చేసుకుని, అదే రోజున ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. అర్హులైన నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. https://satg. `telangana.gov.in/prajapalana/ వెబ్ లింక్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తమ బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాల్సిందిగా కోరారు. -
‘ఆపరేషన్ ఆక్టోపస్’తో కదిలిన కేంద్రం
రెండు దఫాల్లో నిర్వహించిన హైదరాబాద్ పోలీసులు ● దీంతో బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలు బహిర్గతం ● కీలక సమావేశం ఏర్పాటు చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ● రాష్ట్రం నుంచి హాజరైనహైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సాక్షి, సిటీబ్యూరో: నగర కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ ఆదేశాల మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్’ నిర్వహించారు. ఇది బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడంతో ఆయా అంశాలను వివరిస్తూ సజ్జనర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) లేఖ రాశారు. దీంతో కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి వీసీ సజ్జనర్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సమావేశంలో పాల్గొన్న ఆయన పలు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారు. సైబర్ నేరాలను నిరోధించాలంటే లోపాలు అధ్యయనం చేసి, మూలాల్లోకి వెళ్లాలని భావించిన సజ్జనర్ దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ ఆక్టోపస్ను డిజైన్ చేశారు. తొలుత ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఆక్టోపస్–1’ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు 16 రాష్ట్రాల్లో సోదాలు చేసి 117 మందిని అరెస్టు చేశారు. వీరిలో సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలు అందించిన వారు (మ్యూల్ అకౌంట్ హోల్డర్స్), దళారులు ఉన్నారు. వీరి విచారణలో కొందరు బ్యాంకు అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో రెండో విడతగా ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ను ఏప్రిల్లో చేపట్టారు. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు వినియోగించిన 350 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటికి దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉందని, ఈ ఖాతాల ద్వారా దాదాపు రూ.150 కోట్ల మేర అమాయకుల ధరాన్ని లూటీ చేశారని వెల్లడైంది. బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని తేలింది. దీంతో బ్యాంకు అధికారుల పనిపట్టడానికి గత నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ చేపట్టారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన 16 ప్రత్యేక బృందాలు రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, బీహార్ల్లో దాడులు నిర్వహించాయి. ఫలితంగా పట్టుబడిన 52 మందిలో 32 మంది బ్యాంకు అధికారులు కాగా... 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బ్యాంకు అధికారుల్లో వివిధ బ్యాంక్లకు చెందిన మేనేజర్లు, కేవైసీ అప్రూవర్లు, రిలేషన్షిప్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, క్లర్కులు ఉన్నారు. వీరి విచారణలో వెలుగులోకి వచ్చిన, దర్యాప్తులో గుర్తించిన అంశాలతో సజ్జనర్ ఆర్బీఐకి లేఖ రాయగా దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ సమస్య పరిష్కారం కోసం గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎం.నాగరాజు, ఉన్నతాధికారులు, సీబీఐ డైరెక్టర్, ఇండియన్ సైబర్ క్రైౖ మ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్, వివిధ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు హైదరాబాద్ కొత్వాల్ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు. -
’కారా’ ద్వారా పిల్లల దత్తత మేలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పిల్లలను దత్తత తీసుకోవాలని భావించే వారు విధిగా కారా (సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ) పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి కొమ్మిశెట్టి సూచించారు. ఇతర మార్గాల ద్వారా పిల్లలను దత్తత తీసుకోవడం ద్వారా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో లీగల్ అడాప్షన్ పోస్ట్ కేర్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దత్తతపై సరైన అవగాహన లేక చాలా మంది తప్పుడు మార్గంలో పిల్లలను తెచ్చుకుని పెంచుకుంటున్నారని, ఆ తర్వాత ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు. చట్టబద్ధమైన దత్తత కోసం కేంద్ర ప్రభుత్వం కారా పోర్టల్ను తీసుకొచ్చిందని చెప్పారు. ఔత్సాహికులు ముందుగా ఈ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుని, లీగల్గా దత్తత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి శ్రీలత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
ధర్మ రక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
చేవెళ్ల: హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యతని వేదాంత గీత ఫౌండేషన్(నంద్యాల) సభ్యుడు అభినవ శంకరానందస్వామి, ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్క చంద్రశేఖర్, మహిళా వక్త సరస్వతీ శిశు మందిర్ సంభాగ్ సమితి సభ్యురాలు శారదా దయానిధి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కనే బుధవారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సమాజా నిర్మాణంలో హిందూ సమాజం, మహిళల పాత్ర, కుటుంబ విలువలపై ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. ఆధునిక కాలంలో పాశ్యాత్య ప్రభావాల నడుమ మన సంప్రదాయలను మరిచిపోతున్నారని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమ్మేళనంలో భక్తిగీతాలు, ధార్మిక నినాదాలు కార్యక్రమానికి మరింత ఉత్సవం నింపాయి. స్థానిక భక్తులు, యువకులు, మహిళలు, సామాజిక కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
చదవలేక.. రాయరాక!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రూరల్ ఏరియాలోని విద్యార్థులతో పోలిస్తే.. అర్బన్ ఏరియాలోని విద్యార్థులు మాతృభాషపై పట్టుసాధించలేకపోతున్నారు. ఇక్కడ చదువుతున్న వారిలో మెజార్టీ విద్యార్థులు మొదటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. దీనికి బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు/కార్మికుల పిల్లలు తోడయ్యారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలను విశ్లేషిస్తే హిందీ, ఇంగ్లిష్తో పోలిస్తే తెలుగులోనే ఎక్కువ మంది ఫెయిలయ్యారు. హిందీలో కేవలం 94 మంది ఫెయిల్ అయితే.. ఇంగ్లిష్లో 761 మంది ఫెయిల్ అయ్యారు. ఇక తెలుగులో ఏకంగా 862 మంది ఫెయిల్ కావడం గమనార్హం. ఇంగ్లిష్, హిందీపై ఉన్న పట్టు మాతృభాషపై ఉండటం లేదు. అదే గ్రామీణ ప్రాంత ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంగ్లిష్లో తప్పిన వారిలో మెజార్టీ ఈ ప్రాంత వాసులే. ఇక గణితంలో 1,892 మంది, సైన్స్లో 1,737 మంది విద్యార్థులు ఫె యిల్ అవ్వడం విశేషం. రూ.లక్షల్లో ఫీజులు చెల్లించినా.. జిల్లాలో 1,024 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 52,946 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 49,217 మంది ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్/ ప్రైవేటు స్కూల్స్ నుంచి అత్యధికంగా 35,307 మంది హాజరు కాగా, వీరిలో 33,977 మంది ఉత్తీర్ణులయ్యారు. మరో 1,330 మంది ఫెయిల్ అయ్యారు. వీరిలో మెజార్టీ విద్యార్థులు తెలుగు సబ్జెక్టులోనే ఉన్నారు. రూ.లక్షల్లో ఫీజులు చెల్లించి, ప్రత్యేక తరగతులు బోధించినా వందశాతం ఫలితాలు సాధించలేకపోయాయి. 708 స్కూల్స్లో 262 మాత్రమే వందశాతం ఫలితాలు సాధించాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే ఉత్తీర్ణతలో జిల్లా వెనుకబాటుకు ఇది కూడా మరోకారణమని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అర్బన్ మండలాల్లోనే అత్యధికం జిల్లాలోని రూరల్ మండలాలతో పోలిస్తే.. నగరానికి అతిసమీపంలో ఉన్న అర్బన్ మండలాల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు తేలింది. మెజార్టీ విద్యార్థులు తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టుల్లోనే ఫెయిల్ అయినట్లు ఫలితాల విశ్లేషణను బట్టి అర్థమవుతోంది. శంషాబాద్ మండల పరిధిలో 1,700 మంది పరీక్షకు హాజరైతే 1,495 మంది మాత్రమే ఉత్తీర్ణత (87.94 శాతం) సాధించారు. ఇక్కడ 205 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. శంకర్పల్లిలో 1,140 మంది పరీక్షకు హాజరైతే 1,010 మంది మాత్రమే (88.60 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 130 మంది ఫెయిల్ అయ్యారు. అబ్దుల్లాపూర్మెట్లో 1,998 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1,776 మంది ఉత్తీర్ణత(88.89శాతం) సాధించారు. ఇక్కడ మొత్తం 222 మంది ఫెయిల్ అయ్యారు. రాజేంద్రనగర్లో 5,267 మంది పరీక్షకు హాజరు కాగా, 4,691 మంది ఉత్తీర్ణత (89.06శాతం) సాధించారు. ఇక్కడ ఏకంగా 576 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం విశేషం. మహేశ్వరంలో 1,613 మంది పరీక్షకు హాజరు కాగా 1,437 మంది ఉత్తీర్ణత (89.09 శాతం) సాధించారు. మొయినాబాద్లో 1,143 మంది పరీక్షకు హాజరు కాగా 1,028 మంది ఉత్తీర్ణత (89.94 శాతం) సాధించారు. గండిపేటలో 2,836 మంది పరీక్షకు హాజరు కాగా 2,566 మంది ఉత్తీర్ణత (90.48 శాతం) సాధించారు. శేరిలింగంపల్లిలో 6,266 మంది పరీక్షకు హాజరు కాగా 5,722 మంది ఉత్తీర్ణత (91.32 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలాపూర్లో 3,706 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 3,393 మంది (91.55 శాతం) ఉత్తీర్ణత సాధించారు. తెలుగులో 862 మంది విద్యార్థులు ఫెయిల్ హిందీలో 94, ఇంగ్లిష్లో 761 మంది.. పదో తరగతి ఫలితాల్లో వెల్లడి అర్బన్ ఏరియాలో అధ్వానం మాతృభాషపై కోల్పోతున్న పట్టు -
అంబులెన్స్లలోఉద్యోగ అవకాశాలు
ఇబ్రహీంపట్నం రూరల్: కొంగరకలాన్లో హైడ్రా అధికారులు పర్యటించారు. ఓ కన్వెన్షన్ హాల్ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని మంగళవారం హైడ్రా ఇన్స్పెక్టార్ సైదులు పరిశీలించారు. భూ పరిరక్షణ సమితి ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్యటించినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తుక్కుగూ: డివిజన్ పరిధిలోని ఇమూమ్గూడలో ఉన్న గ్రేస్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.లలితాదేవి ఆదేశాల మేరకు కందుకూరు డివిజన్ ఉప వైద్యధికారి డాక్టర్ గీత మంగళవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆస్పత్రి నిర్వహణ, రోగుల సేవల విషయంలో లోపాలను గుర్తించామన్నారు. యాజమాన్యానికి పలుమార్లు నోటీసులు జారీ చేసినా సరి చేయలేదన్నారు. దీంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శంకర్పల్లి: మోకిల సీఐ వీరబాబును బదిలీ చేస్తూ ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్బాబు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనని కమిషనరేట్లోని క్రైం విభాగానికి బదిలీ చేయగా.. ఆయన స్థానంలో శ్రీనివాస్రెడ్డిని నియమించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశామని, ప్రజలు సైతం మంచి సహకారాన్ని అందించారని వీరబాబు గుర్తు చేసుకున్నారు. నూతన సీఐ శ్రీనివాస్ రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతగిరి: అనంత పద్మనాభస్వామి ఆలయ భూములను కౌలుకు ఇచ్చేందుకు గాను మే 2న వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త ఎన్ పద్మనాభం, ఈఓ టీ నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందని తెలిపారు. వేలం హక్కులు పొందిన వారు మూడేళ్ల పాటు(మే 05 నుంచి ఏప్రిల్ 30 2029 వరకు) వ్యవసాయం చేసుకోవచ్చని తెలిపారు. వికారాబాద్ మండలం గుడుపల్లి సర్వే నంబర్ 65లో 328 ఎకరాలు, కొత్తగడి గ్రామ సర్వే నంబర్ 175లో 219 ఎకరాలు, మరో సర్వే నంబర్ 176లో 324 ఎకరాలు, పులుసుమామిడి గ్రామ సర్వే నంబర్ 180లో 228 ఎకరాలు, మరో సర్వే నంబర్ 181లో 110 ఎకరాలు, నారాయణపూర్ సర్వే నంబర్ 135లో 1,334 ఎకరాలు, పరిగి మండలం బిజ్వారం గ్రామ సర్వే నంబర్ 169/ఆలో 206 ఎకరాలు, తాండూరు మండలం అంతారం గ్రామ సర్వే నంబర్ 205లో 25ఎకరాలు, మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం కేశ్వాపూర్ గ్రామ సర్వే నంబర్ 105లో 803 ఎకరాల భూములు ఉన్నట్లు తెలిపారు. వీటికి కౌలు హక్కు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులు రూ.2 వేలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన వచ్చని వారు తెలిపారు. -
వలస బతుకులు ఛిన్నాభిన్నం
శంకర్పల్లి: పొట్టకూటి కోసం.. కుటుంబ పోషణ కోసం.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి బతుకున్న కార్మికుల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. మండలంలోని మహాలింగపురం ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం ఐదుగురు కార్మికులను బలితీసుకున్న విషయం తెలిసిందవే. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పింటు (30) తలకు బలమైన గాయాలు కావడంతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. పవన్ కుమార్ (26) రెండు కాళ్లు విరిగాయి. వీర బహదూర్ (25)కు తుంటి ఎముకతో పాటు, పక్కటెముకలు విరగ్గా.. మిఽథున్(26)కు పాదంలో చీలిక వచ్చింది. మిగిలిన ఎనిమిది మందికి ఎముకల్లో ఎయిర్ గ్యాప్తో పాటు పాక్షికంగా గాయాలయ్యాయి. చనిపోయిన ఐదుగురు కార్మికుల మృతదేహలకు మంగళవారం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు తరలించారు. ప్రమాణాలు పాటిస్తున్నారా? ఎన్సీసీ ఫ్యాబ్రికేషన్ కంపెనీలో జరిగిన ప్రమాదం అందరినీ షాక్కి గురి చేసింది. కంపెనీపై మొదటి నుంచీ అనుమానాలు ఉన్నాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కంపెనీ ప్రతినిధులు చాలాసేపటి వరకు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని వెళ్లిన మీడియా ప్రతినిధులను లోనికి అనుమతించకపోవడం, దర్యాప్తు అధికారులు వచ్చినప్పుడు సైతం అలాగే వ్యవహరించడం సందేహాలకు తావిస్తోంది. కంపెనీ యాజమాన్యం కార్మికుల భద్రత కోసం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దర్యాప్తు ప్రారంభం.. ఎన్సీసీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై కార్మిక శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహన్బాబు, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మనోహర్రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రతిమ కంపెనీకి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీసి, పరిసరాలను పరిశీలించారు. ఈదురుగాలుల కారణంగా 75నుంచి 80టన్నులు ఉండే మూవబుల్ గ్యాండ్రీ క్రేన్లు అసలు ఎలా కదిలాయని, ఆ అవకాశం ఉందా, ఇంకేదైనా టెక్నికల్ సమస్య కారణమా.. అని విచారిస్తున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులతో కలిసి కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని ఎమ్మెల్యే యాదయ్య వెల్లడించారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.25 లక్షలచొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున, పాక్షిక గాయాలైన వారికి రూ.50 వేల పరిహారంతో పాటు పూర్తి వైద్య ఖర్చులు కంపెనీయే భరిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా మరణించిన వ్యక్తి ఉద్యోగ విరమణ కాల పరిమితి వరకూ నెల వేతనం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. కార్మికులకు అందించే నష్టపరిహారానికి సంబంధించిన ప్రకటనపై మంత్రి, కలెక్టర్తో చర్చించినట్లు తెలిపారు. ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రమాదం ఘటన కార్మికుల కుటుంబాల్లో విషాదం ఐదుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు గాయపడిన కార్మికులకు మంత్రి వివేక్ పరామర్శ


