Rangareddy
-
అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి చోరీ
కొత్తూరు: బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వచ్చేలోగా గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మురళీగౌడ్ తెలిపిన ప్రకారం.. కాలనీలో నివాసం ఉంటున్న యువజన కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు వన్నాడ శివశంకర్గౌడ్ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి షాబాద్లో బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యాడు. సాయంత్రం ఇంటికి వచ్చే వరకు తాళాలు పగులగొట్టి ఉండడంతో అనుమానంతో పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బీరువాలో ఉన్న రూ.15 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పో లీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. రూ.15లక్షల నగదు అపహరణ -
నర్సింగ్ హోం సీజ్
చేవెళ్ల: ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటనలో చేవెళ్లలోని విజయ్ నర్సింగ్ హోం (ప్రజావైద్యశాల)ను వైద్యాధికారుల బృందం శుక్రవారం సీజ్ చేసింది. మున్సిపల్ పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన కల్లెంల నర్సింలుకు విజయ్నర్సింగ్హోంలో ఆపరేషన్ చేశారు. వైద్య వికటించడంతో ఆయన గురువారం మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనల చేపట్టారు. వైద్యాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు జిల్లా వైద్యాధికారులు చేవెళ్ల డిప్యూటీ డీఎంహెచ్ఓ వైద్య బృందాన్ని తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు నర్సింగ్ హోంకు వచ్చిన అధికారులు ఆస్పత్రికి తాళం వేసినట్లు గుర్తించారు. ఫోన్ సంప్రదించేందుకు యత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో వైద్యాధికారుల బృందం ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రి వైద్యాధికారుల విచారణ పూర్తయ్యే వరకు తాళం తీయొద్దని హెచ్చరించారు. గతంలోనూ ఈ నర్సింగ్హోంను వైద్యాధికారులు తనిఖీ చేసిన సమయంలో కాలం చెల్లిన మందులు ఉన్నాయని నోటీసులు జారీ చేసిన ఇప్పటీ వరకు స్పందించలేదన్నారు. ఈ తనిఖీల్లో మొయినాబాద్ వైద్యాధికారి అన్నపూర్ణ. చేవెళ్ల సబ్సెంటర్ వైద్యురాలు వేదశ్రీ తదితరులు ఉన్నారు. -
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీ యాక్ట్
అబ్దుల్లాపూర్మెట్: నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు విక్రయించి రైతులను మోసం చేసే డీలర్లపై కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత హెచ్చరించారు. శుక్రవారం రైతువేదికలో వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని అధీకృత డీలర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. డీలర్లు విధిగా రికార్డులు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారిణి పల్లవి, ఎస్ఐ భద్యానాయక్, డీలర్లు పాల్గొన్నారు. రైతులకు రసీదులు ఇవ్వాలి మహేశ్వరం: ఎరువులు, విత్తనాల దుకాణాదారులు రైతులకు అధిక ధరలకు విక్రయించరాదని మహేశ్వరం వ్యవసాయ శాఖ ఏడీఏ సుధారాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎరువులు, విత్తనాల దుకాణాదారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాల డీలర్లు స్టాక్, బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించాలన్నారు. రైతులు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. అనుమతిలేని మందులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవపాయాధికారి నాగమణి, డివిజన్ టెక్నికల్ అధికారి యాదగిరిగౌడ్, డీలర్లు పాల్గొన్నారు. వ్యవసాయశాఖ ఏడీఏ సుజాత -
ప్రాణం కాపాడిన హైడ్రా
సాక్షి, సిటీబ్యూరో: హైడ్రా ఆధీనంలోని డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (డీఆర్ఎఫ్) బృందాలు శుక్రవారం ఓ నిండు ప్రాణాన్ని కాపాడాయి. ఒకే సమయంలో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు జరగడంతో ఎక్కడికక్కడ ఈ బృందాలు రంగంలోకి దిగాయి. అమీర్పేటలో జరిగిన ప్రమాదం నుంచి రాజేష్ను (25) సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం అమీర్పేట, పటాన్చెరుల్లో ఒకే సమయంలో అగ్గి రాజుకుంది. సారథి స్టూడియో సమీపంలోని ఐదు అంతస్తుల దివ్య శక్తి అపార్ట్మెంట్స్ రెండో ఫ్లోర్లో మధ్యాహ్నం 3.30 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి ఓ డబ్బింగ్ స్టూడియోలో మంటలు అంటుకోగా... సమాచారం అందుకున్న హైడ్రా కంట్రోల్ రూమ్ డీఆర్ఎఫ్ బృందాలను హుటాహుటిన ఆ ప్రాంతానికి పంపింది. ఏసీ యూనిట్కు సంబంధించిన కంప్రెషర్ పేలడంతోనే మంటలు వ్యాపించినట్లు గుర్తించాయి. స్టూడిలో చిక్కుకుపోయిన రాజేష్ చౌదరిని బయటకు తీసుకువచ్చాయి. ఈ మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది నిలువరించారు. స్టూడియోలో చిక్కుకున్న రాజేష్ను ల్యాడర్ ద్వారా వెళ్లి కాపాడిన డీఆర్ఎఫ్ సభ్యుడు శ్రీకాంత్ను కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందించారు. అలాగే... పటాన్చెరు పారిశ్రామికవాడలోని పాటి గ్రామంలో అను ఫర్నీచర్ గోదాంలోనూ అదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడికి చేరుకున్న మూడు డీఆర్ఎఫ్ బృందాలు మంటల వ్యాప్తిని నిలువరించాయి. శుక్రవారం ఒకేసారి రెండుచోట్ల అగ్ని ప్రమాదాలు సమాచారం అందటంతోనే రంగంలోకి డీఆర్ఎఫ్ అమీర్పేటలో రాజేష్ అనే యువకుడి రెస్క్యూ -
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
షాద్నగర్రూరల్: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులోగల బీబీజీ వెంచర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ దేవరాజ్ తెలిపిన ప్రకారం.. బీబీజీ వెంచర్లోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ(28) మృతదేహం ఉన్నట్లు వెంచర్ నిర్వాహకులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ దేవరాజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటం, ఎముకలు తేలిపోవడం చూస్తుంటే 10 రోజుల క్రితమే మహిళ మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు పాల్పడిందా..? గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువచ్చి హత్య చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వెంచర్ సూపర్వైజర్ ఇంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వృద్ధ్దుడి అదృశ్యం పహాడీషరీఫ్: అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పహాడీషరీఫ్కు చెందిన షేక్ మహబూబ్(70), షానవాజ్ బేగం దంపతులు దర్గా వద్ద నివాసం ఉంటున్నారు. ఐదు నెలలుగా మహబూబ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెల క్రితం చివరగా కుమారుడు ముజఫర్తో ఫోన్లో మాట్లాడిన మహబూబ్ అనంతరం అందుబాటులోకి రాలేదు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై ముజఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. -
మినీ సిలిండర్తో మోది యువకుడి హత్య
రాజేంద్రనగర్: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తన భార్య తన నుంచి దూరమయ్యేందుకు కారణమని భావించిన ఓ యువకుడు మరో యువకుడిని మినీ సిలిండర్తో తలపై మోది హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మామిడి కిశోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రాంతానికి చెందిన సాయి కార్తీక్ (31), నవీన్ స్నేహితులు. ఇద్దరూ ఓ నెట్వర్క్ కంపెనీలో పని చేస్తూ అద్దె గదిలో ఉంటున్నారు. అదే ప్రాంతంలో సిద్ధార్థ్ రెడ్డి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. సిద్ధార్థ్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. సిద్ధార్థ్ రెడ్డి, సాయి కార్తీక్, నవీన్లకు స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం సాయి కార్తీక్ సిద్ధార్థ్ రెడ్డి నుంచి రూ. 8 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా కాలయాపన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ రెడ్డి భార్య గత నెలలో అతడితో గొడవ పడి వెళ్లిపోయింది. సాయి కార్తీక్ ఇందుకు కారణమని సిద్ధార్థ్ రెడ్డి భావించాడు. గురువారం రాత్రి ముగ్గురు కలిసి సాయి కార్తీక్ రూమ్లో మద్యం తాగారు. ఈ సందర్భంగా సాయి కార్తీక్, సిద్ధార్థ్ రెడ్డి మధ్య మాట మాట పెరిగింది. దీంతో నవీన్ జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి మళ్లీ వైన్స్ షాప్ వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి గదికి వచ్చి మద్యం తాగారు. అనంతరం మరోసారి సాయి కార్తీక్, సిద్ధార్థ్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్ సముదాయించేందుకు ప్రయత్నించగా సిద్ధార్థ్ రెడ్డి అతడిని బయటికి పంపించాడు. అర గంట తర్వాత నవీన్ రూమ్ గదికి వెళ్లి చూడగా సాయి కార్తీక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కనే కూర్చుని ఉన్న సిద్ధార్థ్ రెడ్డిని ఏం జరిగిందని ప్రశ్నించగా మినీ సిలిండర్తో కొట్టి చంపేశానని... నిన్ను కూడా చంపుతానని దాడి చేసేందుకు ప్రయత్నించగా నవీన్ బయటికి పరుగులు తీశాడు. బుద్వేల్ ప్రధాన రహదారిపైకి వచ్చి స్థానికులకు ఈ విషయం చెప్పాడు. దీంతో వారు అక్కడికి వెళ్లి సిద్దార్థ్ రెడ్డిని పట్టుకుని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహన్ని మార్చురీకి తరలించారు. సిద్ధార్థ్ రెడ్డిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.61లక్షలు టోకరా!
రూ.21 వేలతో మొదలుపెట్టిఆన్లైన్ ద్వారా ఎరవేసిన సైబర్ నేరగాళ్లుసాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి ఆన్లైన్ ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ పేరుతో నిండా ముంచారు. భారీ లాభాలు వస్తాయంటూ ఆశపెట్టి, రూ.21 వేలతో మొదలుపెట్టి, వర్చువల్ ఖాతాలో బ్యాలెన్స్ చూపించి రూ.61 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్కు చెందిన బాధితుడికి (68) ఆన్లైన్లో వచ్చిన ఎక్స్పర్ట్స్ ప్రో లిమిటెడ్ ప్రకటన కనిపించింది. బులియన్ మార్కెట్.కామ్ అనే వెబ్సైట్ ద్వారా ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలు ఉంటాయని అందులో ఉంది. దీనికి ఆకర్షితుడైన అతను ఆ సంస్థకు చెందిన యాప్ను లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకున్నారు. దీని ద్వారా వర్చువల్ ట్రేడింగ్ అకౌంట్ తెరిచాడు. తొలిసారిగా ఈ ఏడాది మార్చి 27న రూ.21 వేలు పెట్టుబడి పెట్టారు. ఆపై బాధితుడితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిన నేరగాళ్లు స్థానిక మార్కెట్ కాకుండా అంతర్జాతీయ ట్రేడింగ్ చేస్తే డాలర్లలో లాభాలు వస్తాయని, అందుకు అవసరమైన సలహాలు సూచనలు తామే ఇస్తామని నమ్మించారు. ఇలా కొంత పెట్టుబడి పెట్టించిన తర్వాత ఆయా స్టాక్లకు సంబంధించిన మార్జిన్ వాల్యూస్ పడిపోతున్నాయని, లాభాలు పొందటంతో పాటు ఉన్న నిధులు కోల్పోకుండా ఉండాలంటే మరికొంత మొత్తం పెట్టుబడిగా పెట్టాలని భయపెట్టారు. ఆ మొత్తం పెట్టిన బాధితుడు తనకు ట్రేడింగ్లో ఆసక్తి లేదని, తనకు ఉన్న నిధులు డ్రా చేసుకుని నిష్క్రమించాలని భావిస్తున్నట్లు నేరగాళ్లకు చెప్పాడు. దీనికి అనుమతించని వారు మరికొంత పెట్టుబడి పెట్టాలని బెదిరించారు. తన వద్ద ఉన్న మొత్తం ఇన్వెస్ట్ చేసిన బాధితుడు ఇకపై తాను పెట్టుబడి పెట్టలేనని స్పష్టం చేశాడు. అయినా వారి ఫోన్లు, ట్రేడింగ్ కొనసాగింది. ఈ నెల 21న బాధితుడు తన కుటుంబంతో కలిసి వేరే ఊరు వెళ్లారు. అలా వెళ్తున్న విషయం నేరగాళ్లకు చెప్పి, తన ట్రేడింగ్ ఖాతా నిర్వహించమని కోరారు. అందుకు అంగీకరించిన వారు అతను తిరిగి వచ్చేలోపు అనేక ఫోన్లు చేశారు. ఇంటికి చేరుకున్న బాధితుడు వారిని సంప్రదించగా... అత్యవసరంగా రూ.10 లక్షలు చెల్లించకపోతే ట్రేడింగ్ ఖాతానే కోల్పోవాల్సి వస్తుందని బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి బాధితుడు చెల్లింపులు ఆపేశాడు. కొన్ని రోజులకు బాధితుడికి ఫోన్ చేసిన మరో నేరగాడు కోల్పోయిన నిధులను తిరిగి వచ్చేలా చేస్తానని నమ్మించాడు. దీనికోసం నామమాత్రం పెట్టుబడి పెట్టాలని, ట్రేడింగ్ యాప్లో 75 వేల అమెరికన్ డాలర్లు (రూ.64.16 లక్షలు) ఉన్నాయని చూపించాడు. కొన్నాళ్లుగా ట్రేడింగ్ చేయకపోవడంతో ఆ ఖాతా లాక్ అయిందని, ఆ మొత్తం విత్డ్రా చేసుకోవాలంటే అన్లాక్ చేయించాలన్నాడు. ఈ పేరుతో మరికొంత మొత్తం స్వాహా చేశారు. ఇలా మొత్తం రూ.61.95 లక్షలు సైబర్ నేరగాళ్లకు చెల్లించిన బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించారు. దీంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆన్లైన్లో ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ట్రేడింగ్లో లాభాలంటూ మోసం యాప్లో బ్యాలెన్స్చూపిస్తూ వ్యవహారం కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు -
ప్రపంచానికి భారత్ సత్తా తెలిసింది
మీర్పేట: ఆపరేషన్ సిందూర్తో ప్రపంచానికి భారత్ సత్తా తెలిసిందని రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ అన్నారు. వీర జవాన్లకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం కార్పొరేషన్ పరిధి లెనిన్నగర్ నుంచి బాలాపూర్ చౌరస్తా వరకు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ పేరిట ప్రధాని మోదీ సారథ్యంలో దేశంలో తయారు చేసిన యుద్ధ యంత్రాలు, విమానాలు, ఆయుధాలు, ఆకాశ్, బ్రహ్మోస్ లాంటి క్షిపణులు, మిస్సైల్స్ ప్రపంచ దేశాలను అబ్బురపరిచాయని తెలిపారు. ఉగ్రవాదాన్ని యుద్ధనీతితో అంతం చేయాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో మన సైనికులు వీరోచితంగా పోరాటం చేసి విజయం సాధించారన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా మతాలు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటిచెప్పడానికి చేపడుతున్నదే తిరంగా ర్యాలీ అని వివరించారు. ప్రధాని మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీరీలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు పర్యాటకాన్ని అభివృద్ధి చేసి సుందర నగరంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ర్యాలీలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్గౌడ్, నాయకులు బొక్క నర్సింహారెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్, కొలన్ శంకర్రెడ్డి, మీర్పేట–1,2 అధ్యక్షులు భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్, గాజుల మధు, విక్కీసాగర్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ -
పెద్దఅంబర్పేటలో మరో పంచాయతీ విలీనం
అబ్దుల్లాపూర్మెట్: పెద్దఅంబర్పేట పురపాలక సంఘంలో మరో గ్రామ పంచాయతీ విలీనం అయ్యింది. ఈ మున్సిపాలిటీకి ఆను కుని ఉన్న యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలానికి చెందిన సాయినగర్ను తెలంగాణ మున్సిపల్ చట్టం –2025ను అనుసరించి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం విలీనం చేసినట్లు కమిషనర్ రవీందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయంలోని రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. పంచా యతీ భవనానికి ఉన్న పేరును తొలగించి పెద్దఅంబర్పేట పురపాలక సంఘం వార్డు కార్యాలయంగా బోర్డును ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా విలీనం అయిన సాయినగర్ పంచాయతీతో కలిపి పెద్దఅంబర్పేట పురపాలక సంఘంలో మొత్తం 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. -
దోపిడీ లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
చేవెళ్ల: దేశంలో దోపిడీలేని సమాజ నిర్మాణమే లక్ష్యమని జనసేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేశ్ అన్నారు. చేవెళ్లలోని సత్యసాయి పాఠశాల ఆవరణలో సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జనసేవాదళ్ శిక్షణ తరగతుల్లో భాగంగా శుక్రవారం సభ్యులకు లక్ష్యాలు, కర్తవ్యాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా జనసేవాదళ్ సభ్యులను తయారు చేస్తోందని తెలిపారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే ముగింపు సభకు పదివేల మంది హాజరయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సామాజిక అంశాలతోపాటు ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు సేవా కార్యక్రమాలు చేపట్టేలా కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. పేద ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించే విధంగా పార్టీకి ముందుండే నడిపించే సైనికుల్లా తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు, నియోజకవర్గం ఇన్చార్జి కె.రామస్వామి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, నాయకులు వండ్ల మంజుల, మురళీమోహన్, కరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని విజయవంతం చేయాలి చేవెళ్లలో కొనసాగుతున్న శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో నాయకులు ప్రభులింగం, సత్యనారాయణ, సత్తిరెడ్డి, మంజుల, మక్బుల్, మీనాక్షి, శివ, అంజయ్య తదితరులు ఉన్నారు. జనసేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేశ్ -
‘ఉపాధి’ని నిర్వీర్యం చేసే కుట్ర
ఇబ్రహీంపట్నం రూరల్: పేద ప్రజలకు ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద దేశంలో 30 కోట్ల మంది పేద ప్రజలు పని చేస్తున్నారని, మరో 65 లక్షల మంది పనికోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పేదలకు ఉపాధి కల్పించే చట్టాని నిర్వీర్యం చేయాలని చూస్తే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఉపాధి చట్టాన్ని రక్షించుకోవాలని, పెండింగ్ బిల్లులు ఇవ్వాలన్నారు. చట్టం ప్రకారం ప్రతి కూలీకి 100 రోజులు పని కల్పించాల్సిన ప్రభుత్వం 40 నుంచి 50 రోజులు మాత్రమే కల్పిస్తోందన్నారు. దేశంలో పనులు చేసే వారు లేరని మోదీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పని కోసం దరఖాస్తు చేసుకున్న 65 లక్షల మందికి ఎందుకు పనులు కల్పించడం లేదని ప్రశ్నించారు. దినసరి కూలీ రూ.307 చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు నేటికీ అమలు చేయడం లేదన్నారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక పేదల కష్టాలు తీరుతాయనుకుంటే భూస్వాములు, పెట్టుబడిదారులకు దాసోహం అవుతున్నారని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న రూ.12వేల ప్రస్తావన లేదని, మహిళలకు రూ.2,500 మాటలేదని, ఆడబిడ్డ పెళ్లి కానుక తులం బంగారం మరిచిపోయారన్నారు. హామీలు అమలు చేయడం చేతకాని సీఎం ఎందుకని, కుర్చీ దిగిపోవాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామేలు, డి.జగదీష్, కందుకూరి జగన్, జిల్లా నాయకులు నర్సింహ, కిషన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్యారంటీల ఊసేలేదు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు
వానాకాలం ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘మాన్సూన్’ పేరిట వంద రోజుల ప్రణాళికకు సిద్ధం కావాలని ఆదేశించింది. డివిజన్ల వారీగా ఆయా కార్యక్రమాలు చేపడుతూ సమస్యలు పరిష్కరించాలని పేర్కొంది. ఈ మేరకు అధికారులకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. మీర్పేట: రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద రోజుల ప్రణాళికకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా ముందస్తుగా మురుగు కాలువలు, నాలాలు, ఓపెన్, భూగర్భ డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో డ్రైనేజీలు శుభ్రం చేయడంతో పాటు పాడైపోయిన మ్యాన్హోళ్లను గుర్తించి మరమ్మతులు చేపట్టనున్నారు.ప్రజలకు ముందస్తుగా అవగాహనవంద రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. బస్తీలు, కాలనీలు, రహదారులు, ఇళ్ల మధ్యలోని ఖాళీ స్థలాల్లో ప్రతిరోజు బ్లీచింగ్ చేయడం, ఫాగింగ్ చేయడం, చెరువుల్లో దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా ద్రావణాన్ని వేయడం చేయనున్నారు. వర్షాకాలంలో అంటురోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యం, వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలకు ముందుస్తుగా అవగాహన కల్పించనున్నారు.ఉమెన్ అమృత మిత్ర 2.0మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వన మహోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు ‘ఉమెన్ అమృత మిత్ర 2.0’ కార్యక్రమంలో ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక ప్రదేశాన్ని గుర్తించి ‘ఉమెన్ ఫర్ట్రీ పేరిట’ మహిళలతో మొక్కలు నాటించి సంరక్షించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో పాటు మున్సిపాలిటీల్లోని అన్ని పార్కులు, ఇళ్ల వద్ద, చెరువు కట్టలు, వాకింగ్ ట్రాక్లు, శ్మశానవాటికలు, క్రీడా ప్రాంగణాలు, ప్రభుత్వ భవనాల వద్ద ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు.అన్ని చర్యలు తీసుకుంటాంప్రభుత్వ ఆదేశాల మేరకు కార్పొరేషన్లో వంద రోజుల ప్రణాళిక యాక్షన్ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేశాం. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే దానిపై అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశాం. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. అంటు రోగాలు ప్రబలకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తాం.– జ్ఞానేశ్వర్, కమిషనర్, మీర్పేట మున్సిపాలిటీజిల్లాలోని మున్సిపాలిటీలుమీర్పేట, బడంగ్పేట, బండ్లగూడ జాగీర్ఆదిబట్ల, ఆమనగల్లు, చేవెళ్ల, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, మణికొండ, మొయినాబాద్, నార్సింగి, పెద్దఅంబర్పేట, షాద్నగర్, శంషాబాద్, శంకర్పల్లి, తుక్కుగూడ, తుర్కయంజాల్ కార్పొరేషన్లు. -
మక్తల్ ఎమ్మెల్యే వాహనాన్ని ఢీకొన్న కారు
షాద్నగర్రూరల్: నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద చోటుచేసుకుంది. వివరాలివీ.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం తన కారులో హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్వైపు వెళ్తున్నారు. జడ్చర్లవైపు నుంచి షాద్నగర్వైపు వెళ్తున్న మరో కారు టోల్ప్లాజాలోని వేరే లైన్కు మారేందుకు డ్రైవర్ పక్కకు తిప్పాడు. ఎమ్మెల్యే వాహనం టోల్ప్లాజాను దాటి వెళ్తున్న సమయంలో పక్కనుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి స్థానిక నేతలు గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి మరో వాహనంలో పంపించారు. -
గ్రామాల్లో బిహార్ బృందం పర్యటన
కందుకూరు: బిహార్ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధుల బృందం మండల పరిధిలో పర్యటించింది. అక్కడి ప్రజాప్రతినిధులు 126 మంది హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ(డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం)లో శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని దాసర్లపల్లి, ముచ్చర్ల గ్రామాల్లో పర్యటించారు. దాసర్లపల్లిలో ఫాంపాండ్, ముచ్చర్లలో శ్మశానవాటిక, కంపోస్టు యార్డ్, పల్లె ప్రకృతి వనం, గ్రామ పంచాయతీ భవనం, ప్రాథమిక పాఠశాల, నర్సరీ, పౌల్ట్రీ షెడ్ తదితరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారు.. పంచాయతీలో మౌలిక సదుపాయాలు ఏవిధంగా సమకూరుస్తున్నారు.. ఇంటి పన్నులు ఏవిధంగా వసూలు చేస్తున్నారు.. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఎలా వినియోగించుకుంటున్నారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి అభివృద్ధి పనులు బాగున్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, ఎంపీఓ గీత, ఏపీడీ చరణ్, ఏపీఓ రవీందర్రెడ్డి, ఎంసీఆర్హెచ్ఆర్డీ ఫ్యాకల్టీ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు లావణ్య, రమేష్, ఇంద్రసేన్, మహేశ్, ఈశ్వరి, రాజేష్, ఎఫ్ఏ వెంకటేశ్ పాల్గొన్నారు. -
రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం
మొయినాబాద్: కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అప్పోజీగూడ, రెడ్డిపల్లి గ్రామాల కిసాన్ కవన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ అస్పద చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సహకారంతో రైతులకు మందులు పిచికారీ చేసే సమయంలో వేసుకునే కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలకు ప్రభుత్వం మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. పంటల సాగుతోపాటు మందుల పిచికారీలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, జిల్లా నాయకుడు గున్నాల గోపాల్రెడ్డి, మాజీ సర్పంచ్లు గొర్కంటి రాజు, వినిత, శ్రీ అస్పద చారిటబుల్ ఫౌండేషన్ కో ఫౌండర్ టీవీ దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.డిగ్రీ అడ్మిషన్లకు సెకండ్ ఫేజ్ ‘దోస్త్’షాద్నగర్రూరల్: ఇంటర్మీడియెట్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్లకు సెకండ్ ఫేజ్ దోస్త్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఔత్సాహిక విద్యార్థులు జూన్ 9 వరకు రిజిస్ట్రేషన్ చేసేకునేందుకు ఆవకాశం ఉందన్నారు. ఎంపీసీ, ఎంజెడ్సీ, బీజెడ్సీ, ఎంపీసీఎస్, బీఏ, బీకాం, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 63050 51490, 98850 03390, 97034 41345 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత పాటించాలిమొయినాబాద్రూరల్: ఈసీ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు నాణ్యతతో ఉండాలని జిల్లా పంచాయతీరాజ్ ఎస్సీ శ్రీనివాస్రెడ్డి, ఈఈ శ్రీరాములు, సీఈ జోగిరెడ్డి అన్నారు. నక్కలపల్లి–హైతాబాద్ మధ్యలో ఈసీ వాగుపై కొనసాగుతున్న వంతెన పనులను శుక్రవారం వారు మండల డిప్యూటీ డీఈ విజయ్కుమార్తో కలిసి పర్యవేక్షించారు. ఈసీవాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం గత ప్రభుత్వం సీఆర్ఆర్ (కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్) కింద రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు విజయ్కుమార్ అధికారులకు తెలిపారు. పనులు జరుగుతున్న తీరును వారికి వివరించారు. అధికారులు మాట్లాడుతూ.. వంతెన నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతతో నిర్మించేలా చూడాలని సూచించారు.పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నిరంజన్రెడ్డిఇబ్రహీంపట్నం రూరల్: పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా ఆదిబట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మర్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కమిటీలో చోటు కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఇందిరమ్మ ఇల్లు ఇక రాదని..
యాచారం: ఇందిరమ్మ ఇల్లు తనకు ఇక రాదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (45) ప్లంబర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామంలో ఆయనకు ఇంటి స్థలం లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు అర్హుడైనప్పటికీ స్థలం లేకపోవడంతో మొదటి విడతలో ఇల్లు మంజూరు కాలేదు. ఈ నెల 23న స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి యాచారంలో లబి్ధదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసే సమయంలో లిస్టులో తన పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.ఆ రోజు నుంచి మనోవేదనకు గురయ్యాడు. ‘స్థానిక కాంగ్రెస్ నేతలు ఇల్లు రాకుండా అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యేకు చెప్పుకొందామంటే కలవనీయరు. పిల్లలు పెద్దవుతున్నా సొంత ఇల్లు లేదాయే’అంటూ కొద్ది రోజులుగా ఇక తాను చస్తానని గ్రామస్తులతో చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో తనకు ఇల్లు రాకపోవడానికి, తన చావుకు కారణం స్థానిక కాంగ్రెస్ నాయకుడు, తన బావ యాదయ్యనేనని చేతిపై రాసుకుని శుక్రవారం ఉదయం అద్దెకుంటున్న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్దామనే సరికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతదేహంతో ఆందోళన అశోక్ మృతికి సర్కారే కారణం అంటూ అతని కుటుంబీకులు, గ్రామస్తులు మృతదేహంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ నందీశ్వర్రెడ్డి, తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీడీఓ శైలజ గ్రామానికి చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి సూచన మేరకు మృతుడు అశోక్ కుటుంబానికి గ్రామంలో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, ముగ్గురు కూతుళ్ల చదువు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని తహసీల్దార్ అయ్యప్ప హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. -
ఠాణా ఎదుట మహిళ హల్చల్
ఇబ్రహీంపట్నం రూరల్: ‘నేను చచ్చిపోతేనే న్యాయం జరుగుతుంది.. ఎవరి వద్దకు వెళ్లినా ప్రయోజనం లేదు.. అధికారులెవరూ న్యాయం చేయడం లేదు’ అంటూ ఓ మహిళ ఆదిబట్ల ఠాణా ఎదుట హల్చల్ చేసింది. మహబూబ్నగర్ జిల్లా మూలమడ్తా తండా యోట్టం ప్రాంతానికి చెందిన కేతావత్ బుజ్జి, రామ్సింగ్ దంపతులు. 2021లో కుర్మల్గూడలో 100 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. బడంగ్పేట్ మున్సిపాలిటీ అనుమ తులతో ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు ఉందని అక్కడ ఉన్న 20కిపైగా నిర్మాణాలను స్థానిక రెవెన్యూ అధికారులు ఏడాది క్రితం కూల్చివేశారు. అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మీకు ప్లాటు అమ్మి న వారి మీద కేసు పెట్టండి అని ఆర్డీఓ చెప్పడంతో పలుమార్లు పోలీస్స్టేషన్ చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బుజ్జి తన భర్త రామ్సింగ్ చంటి బిడ్డతో కలిసి వచ్చింది. తనకు ఒక్కతే కూతురు అని, ఆమె కోసమే రూ.లక్షలు పెట్టి ప్లాటు కొనుగోలు చేశామని పేర్కొంది. తనకు కిడ్నీ సమస్య ఉందని, తిరగలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం జరగడం లేదు.. చచ్చిపోతా అంటూ తన సంచిలో ఉన్న డబ్బా తీసి ఒంటిపై పోసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాక్కొని పడేశారు. తర్వాత అవి నీళ్లు అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎస్ఐ వెంకటేశ్ కలగజేసుకుని సర్దిచెప్పారు. చచ్చిపోతా అంటూ హైడ్రామా సంచిలోంచి డబ్బాతీసి ఒంటిమీద పోసుకున్న మహిళ నీళ్లు అని తేలడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు -
అడుగులోతులో.. అక్రమాలు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గ్రేటర్లో భూగర్భ కేబుళ్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. అంచనాలకు భిన్నంగా పనులు చేయడంతో పాటు ప్రతిపాదిత మార్గానికి భిన్నంగా లైన్లు తవ్వుతుండటం.. నిర్ధేశిత ప్రమాణాలకు భిన్నమైన కేబుళ్లు, విద్యుత్ పరికరాలు వాడుతుండడంతో లైన్లు వేసిన కొద్ది రోజులకే దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఐటీ, అనుబంధ కంపెనీలకు, భారీ గృహ, వాణిజ్య సముదాయాలకు నిలయమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చేపడుతున్న భూగర్భ కేబుల్ (యూజీ) పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రైవేటు కాంట్రాక్టర్లతో ఇంజనీర్లు కుమ్మకై.. ఆయా రియల్ ఎస్టేట్ డెవెలపర్స్, వినియోగదారులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాస్తవ ఖర్చుకు భిన్నంగా అంచనాలు రూపొందించడంతో పాటు అడ్డగోలుగా లైన్లు వేస్తున్నారు. నాసిరకం పనులు చేపడుతుండటంతో వేసిన కొద్ది రోజులకే ఆయా లైన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే కాన్సులేట్ కార్యాలయానికి చేపట్టిన యూజీ కేబుల్ పనులు సహా కొండాపూర్, ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, సరూర్నగర్, కందుకూరు, బంజారాహిల్స్, కూకట్పల్లి, మేడ్చల్, జీడిమెట్ల, హబ్సిగూడ డివిజన్ల పరిధిలో చేపడుతున్న యూజీ కేబుల్ పనులను శ్రీకేబుల్ టెస్టింగ్ వ్యాన్ల ద్వారా తనిఖీ చేపడితే అక్రమాలన్నీ బయటపడే అవకాశం ఉంది.ఓ డెవలపర్స్కు నోటీసులుపుప్పాల్గూడ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు డెవలపర్స్ సంస్థ రెండేళ్ల క్రితం విద్యుత్ సరఫరా కోసం దరఖాస్తు చేసుకుంది. డిస్కం ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనాలు రూపొందించారు. సదరు సంస్థకు 9,951 కిలోవాట్స్ సామర్థ్యంతో కూడిన డిమాండ్ అవసరం ఉన్నట్లు గుర్తించారు. సమీపంలోని సబ్స్టేషన్ నుంచి భూగర్భ కేబుల్ లైన్ వేసుకోవాల్సిందిగా సూచించి, ఆ మేరకు ఏ సబ్స్టేషన్ నుంచి ఏ మార్గంలో లైను వేయాలి? ఎన్ని అడుగుల లోతు తవ్వాలి? ఎంత సామర్థ్యంతో కూడిన కేబుల్ వేయాలి? కేబుల్ రక్షణ కోసం ఎంత పరిమాణంలో ఇసుక పోయాలి? కేబుళ్లపై ఏ సైజులో ఉన్న షాబాద్ బండలు పరచాలి? వంటి అన్ని అంశాలను ఎస్టిమేషన్లో పొందుపర్చారు. పనులు దక్కించుకున్న ప్రైవేటు కాంట్రాక్టర్ అంచనాలకు భిన్నంగా కేబుల్ పనులు చేసినట్లు గుర్తించారు. నిజానికి 1.5 మీటర్ల లోతులో వేయాల్సిన కేబుళ్లను భూమిపైనే పరిచ్చారు. కేబుల్ కింది భాగంలో 50 ఎంఎం, పై భాగంలో 250 ఎంఎం మందం ఇసుక పోయాలి. ఆర్వాత కేబుల్కు రక్షణగా 40 ఎంఎం షాబాద్ బండలు అమర్చాల్సి ఉంది. కానీ సదరు కాంట్రాక్టర్ పూర్తి నాసిరకంగా పనులు చేపట్టినట్లు గుర్తించారు. అంతేకాదు అధికారులు సూచించిన ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతం నుంచి స్ట్రంచ్ తవ్వినట్లు నిర్ధారించారు. కేబుళ్ల మధ్య ప్రతి మూడు మీటర్లకు ఇటుకలతో హారిజంటల్ లైన్ ఏర్పాటు చేయాలి. సదరు కాంట్రాక్టర్ ఇవేవీ పట్టించుకోలేదు. నాసిరకం పనులతో తరచూ కేబుళ్లు దెబ్బతినడం, విద్యుత్ లీకేజీ సహా షార్ట్సర్క్యూట్లు తలెత్తి ఆయా భవన సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు ప్రమాదవశాత్తు లైను మీదుగా వెళ్లేవారు షార్ట్సర్క్యూట్తో ప్రమాదానికి గురై మృతి చెందే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ పనులను నిలిపివేయాల్సిందిగా ఇప్పటికే డిస్కం సదరు డెవెలపర్స్కు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.ఆ భవనాలకు కుచ్చుటోపీభూగర్భ కేబుల్ కాంట్రాక్టర్లు అదే ప్రాంతంలోని ఓ ప్రముఖ ఆస్పత్రి సహా బ్యాంకు, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలను మోసం చేశారు. ఆర్సీపురం 130 కేవీ సబ్స్టేషన్ నుంచి ఓ బ్యాంకు కోసం వేసిన భూగర్భ కేబుల్ లైన్ పనులు అంచనాలకు భిన్నంగా ఉన్నట్లు తెలిసింది. ఏకంగా 55 శాతం లెస్తో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆ తర్వాత క్షేత్రస్థాయి ఇంజనీర్లతో కుమ్మక్కు..రివర్స్ టెండరింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడినట్లు సమాచారం. అదే విధంగా ఓ ప్రముఖ బహుళ అంతస్తుల భవనం సహా ఆస్పత్రి లైన్లను కూడా అంచనాలకు భిన్నంగా వేశారు. రెండు సంస్థల నుంచి వేర్వేరు చార్జీలు వసూలు చేసి, సింగిల్ స్ట్రంచ్ నుంచే కేబుల్స్ వేశారు. యూజీ కేబుల్ లైన్లపై దరఖాస్తుదారులకు కానీ, డెవెలపర్లకు కానీ సరైన అవగాహన లేకపోవడం కూడా కాంట్రాక్టర్లకు కలిసి వస్తోంది. భూగర్భ కేబుల్ పనులన్నీ ప్రైవేటు కాంట్రాక్టర్లే చేస్తున్నప్పటికీ.. ఆయా పనులను సంబంధిత డివిజన్ ఇంజనీర్లు పర్యవేక్షించాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడి వారు నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. తీరా పనులు పూర్తయిన తర్వాత కేబుళ్లు భూమిపై తేలి కన్పిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏదో ఒక పేరుతో ఆయా మార్గాల్లో తరచూ తవ్వకాలు చేపడుతుండటం.. కేబుల్ లైన్లపై ఎలాంటి హెచ్చరికల బోర్డులు లేకపోవడం.. భారీ వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండటంతో వేసిన కొద్ది రోజులకే కేబుళ్లు దెబ్బతింటున్నాయి. షార్ట్ సర్క్యూట్లు తలెత్తి ఆయా సంస్థలకు సరఫరా నిలిచిపోతోంది. విషయం తెలియక ఆయా భవనాల్లోని వినియోగదారులు ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా డిస్కంపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులనే డిస్కం ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోంది. -
ఫ్యూచరా.. ఫార్మానా..?
ఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీనా లేక ఫోర్త్ సిటీనా ఫార్మాసిటీనా అనేదానిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేదని మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఫార్మాసిటీతో పాటు జిల్లాలోని వివిధ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో కలిసి గురువారం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మా కోసం 14వేల ఎకరాల భూములు సేకరించిందని గుర్తు చేశారు. రైతులకు మంచి పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు పొజిషన్ చూపించాలన్నారు. పొజిషన్లో ఉండి కాగితాలు లేని రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. పట్టా భూములు సేకరించిన రైతులకు నేటికీ పరిహారం ఇవ్వలేదని, కలెక్టర్ను అడిగితే కోర్టులో జమ చేశామని చెబుతున్నారని వెంటనే ఆ సమస్య తీర్చాలన్నారు. లేదంటే రైతులకు పట్టా భూములు విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. కబ్జాలో ఉన్న రైతులకు కూడా న్యాయం చేయాలన్నారు. చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు తప్ప పరిహారం ఇవ్వడం లేదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని పనులు చేస్తే ఊరుకోబోమని, బలవంతంగా భూసేకరణ చేస్తే సహించబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే ఫార్మా రద్దు చేస్తాం, మీ భూములు మీకిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. వెంటనే భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుర్రంగూడ భూసేకరణ సందర్భంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ పొజిషనల్ చూపడం లేదన్నారు. కాంగ్రెస్ది రెండు నాల్కల ధోరణి ఫార్మా విషయంలో కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. కోర్టుల్లో ఫార్మా అని ప్రభుత్వం సమర్పించి రైతులకు, ప్రజలకు మాత్రం ఫోర్త్ సిటీ అని చెప్పడం రెండు నాల్కల ధోరణి కాదా అని ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వకుండానే రోడ్డు ప్రారంభించడం తగదన్నారు. పరిహారం విషయంలో చాలా మందికి అన్యాయం జరిగిందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. రైతులకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రమేష్గౌడ్, బాష, రామిడి రాంరెడ్డి, ప్రభాకర్, రాజు నాయక్, గోవర్థన్నాయక్, శేఖర్ గుప్తా, గుర్రం సాయికిరణ్రెడ్డి, హరికిషన్రెడ్డి , రమష్, శ్రీధర్రెడ్డి, అబీబుద్దీన్, బుగ్గరాములు పాల్గొన్నారు. ప్రభుత్వం స్పష్టతనివ్వాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి -
చెరువులోకి చేరేదెన్నడో!
షాద్నగర్: వర్షాకాలంలో నిండిన చెరువులతో రైతులు సాగుబాట పడితే.. అవే చెరువులను మత్స్యకారులు జీవనోపాధిగా మలుచుకుంటున్నారు. మత్స్యకారుల ఉపాధిని ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఊసేలేదు. దీంతో ఈసారి చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదీ పరిస్థితి జిల్లాలోని 27 మండలాల్లో మొత్తం నీటి వనరులున్న చెరువులు, కుంటలు వెయ్యి వరకు ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 15వేల హెక్టార్ల వరకు ఉంటుంది. జిల్లాలో 210 పైగా మత్స్యసహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో మత్స్యకారులు 10వేల మంది, మత్స్యకార వృత్తిపై సుమారు 15వేల మంది చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. 2016–17లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. గత ఏడాది చేప పిల్లల పంపిణీ కోసం రూ.93 లక్షలు కేటాయించి అక్టోబర్లో సుమారు 400 చెరువుల్లో మాత్రమే చేపపిల్లలను వదిలారు. గత ప్రభుత్వ హయంలో మత్స్యశాఖపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రస్తుతం చేప పిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. ఊసేలేని టెండర్ ప్రక్రియ ప్రతి ఏడాది మేలోనే చేప పిల్లల కొనుగోలు కోసం ప్రభుత్వం టెండర్లను పిలిచేది. వర్షాలు కురిసి చెరువుల్లో నీరు చేరితే ఆగస్టులో మత్స్యకారులకు ఆ శాఖ అధికారులు వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేసేవారు. ఈ ఏడాది మే నెల పూర్తి కావస్తున్నా నేటికీ చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చేప పిల్లల కొనుగోలుకు టెండర్ పిలవాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్ట లేదు. దీంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు వర్షాలు ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావడంతో వర్షాలు ప్రారంభం అయ్యాయి. జలాశయాల్లో నీరు చేరే సమయానికి ఉచిత చేప పిల్లలను వదిలే అవకాశం ఉంటుందో లేదో అన్నది అనుమానంగా ఉంది. ఈ ఏడాది నేటికీ చేప పిల్లల టెండర్ ప్రక్రియ మొదలు కాకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏటా జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలలో చేప పిల్లల పంపిణీ జరిగేది. అప్పటి వరకు వర్షాలు పుష్కలంగా కురిసి చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉంటాయి. ఆ సమయంలో చేప పిల్లలు వదిలితే అవి చక్కగా ఎదిగేందుకు అవకాశం ఉండడంతో పాటు ఎదిగిన చేపల విక్రయాల ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది. ఆలస్యం చేస్తే చేపలు ఎదగడం కష్టంగా మారుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు నాసిరకం చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారని, దీంతో చేప పిల్లలు సరిగా ఎదగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
గోవాలో క్యాసినో సెక్యూరిటీ గార్డు హత్య
సాక్షి, సిటీబ్యూరో: పేకాట కోసం హైదరాబాద్ నుంచి గోవా వెళ్లిన ఓ రౌడీషీటర్ బుధవారం అర్థరాత్రి రెచ్చిపోయాడు. పనాజీలోని కంపాల్లో ఉన్న ఓ క్యాసినోలో వీరంగం సృష్టించాడు. స్వల్ప వివాదం నేపథ్యంలో విచక్షణ కోల్పోయి కర్రతో సెక్యూరిటీ గార్డులపై విరుచుకుపడ్డాడు. ఈ ఉదంతంలో ఓ సెక్యూరిటీ గార్డు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గోవా నుంచి పారిపోవడానికి దబోలిం విమానాశ్రయానికి వెళ్తుండగా సదరు రౌడీషీటర్ను పనాజీ పోలీసులు మార్గమధ్యంలో గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. చార్మినార్లోని మిశ్రీగంజ్కు చెందిన అబ్దుల్ అల్తాఫ్కు నేరచరిత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే ఇతడిపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మైలార్దేవ్పల్లి పోలీసులు రౌడీషీట్ తెరిచారు. పేకాట కోసం తరచు గోవా వెళ్లివచ్చే ఇతగాడు రెండు రోజుల క్రితం అలానే వెళ్లాడు. బుధవారం రాత్రి గోవా రాజధాని పనాజీలోని కంపాల్లో ఉన్న క్యాసినో కార్నివాల్ అనే క్యాసినోకు వెళ్లాడు. అర్థరాత్రి దాటిన తర్వాత స్వల్ప విషయమై క్యాసినో నిర్వాహకులతో అల్తాఫ్కు వివాదం ఏర్పడింది. యాజమాన్యం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆ క్యాసినో సెక్యూరిటీ గార్డులు అల్తాఫ్కు సర్దిచెప్పడంతో పాటు అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో విచక్షణ కోల్పోయిన అల్తాఫ్ క్యాసినోలోని ఇంటర్నల్ స్టెయిర్ కేస్కు సంబంధించిన బ్లస్టర్ (పక్కన ఉండే కర్ర) విరగ్గొట్టి, దాన్ని తీసుకుని సెక్యూరిటీ గార్డులపై దాడి చేశాడు. ఈ బ్లస్టర్కు కింది భాగంలో ఇనుప తొడుగు ఉండటంతో మధ్యప్రదేశ్ నుంచి వెళ్లి గోవాలో పని చేస్తున్న ధీరు శర్మ, సౌత్ గోవాలోని షిరోడాకు చెందిన సత్యం గోవాన్కర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సహచర సెక్యూరిటీ గార్డులు బాంబోలింలోని గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధీరు శర్మ చనిపోగా... సత్యం పరిస్థితి విషమంగా ఉంది. అదును చూసుకుని ఆ క్యాసినో నుంచి బయటపడిన అల్తాఫ్ తాను బస చేసిన హోటల్ గదికి వెళ్లాడు. అక్కడ నుంచి తన లగేజీ తీసుకుని నార్త్ గోవాలోని దబోలిం విమానాశ్రయానికి బయలుదేరాడు. విషయం పోలీసుల వద్దకు వెళ్లి, కేసు నమోదయ్యే లోపు హైదరాబాద్ వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని భావించాడు. క్యాసినో కార్నివాల్లో జరిగిన ఈ ఘాతుకంపై గురువారం తెల్లవారుజామున 3.10 గంటలకు పనాజీ పోలీసులకు సమాచారం అందింది. తక్షణం అప్రమత్తమైన నార్త్ గోవా ఎస్పీ రాహుల్ గుప్తా నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. క్యాసినోలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడు అల్తాఫ్గా గుర్తించారు. అతడు విమానాశ్రయానికి వెళ్తున్నాడని తెలుసుకుని మార్గమధ్యంలో అరెస్టు చేశారు. ఈ నేరాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్న గోవా పోలీసులు అల్తాఫ్ అక్కడకు ఎందుకు వచ్చాడు? వివాదానికి కారణం ఏంటి? అనే విషయాలు ఆరా తీస్తున్నారు. స్వల్ప వివాదం నేపథ్యంలో చంపేసిన నగర వాసి నిందితుడు మైలార్దేవ్పల్లిఠాణా రౌడీషీటర్ అల్తాఫ్ దబోలిం ఎయిర్పోర్టు దారిలోపట్టుకున్న పనాజీ పోలీసులు -
ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి
చేవెళ్ల: ఆపరేషన్ వికటించి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గురువారం చేవెళ్లలో చోటుచేసుకుంది, పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని కేసారానికి చెందిన కల్లెంల నర్సింలు (50) వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. ఇతనికి కడుపులోని బొడ్డు వద్ద గడ్డ ఉందని వైద్యులు గుర్తించారు. ఈక్రమంలో గత బుధవారం విజయ్ నర్సింగ్హోంకు వెళ్లి డాక్టర్ విజయ్కుమార్ను కలిశాడు. చిన్న ఆపరేషన్ ద్వారా తొలగించేద్దామని చెప్పడంతో ఆస్పత్రిలో చేరాడు. సాయంత్రం వేళ శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం నర్సింలు నోరు తడి ఆరిపోతోందని, పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు డాక్టర్కు చెప్పారు. ఏమీ కాదని చెప్పిన ఆయన గ్లూకోజ్ పెట్టినా, ఎక్కకపోవడంతో అనుమానం వచ్చి మహేందర్రెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే నర్సింలు చనిపోయాడని ఆరోపిస్తూ అతని బంధువులు మృతదేహంతో వచ్చి విజయ్ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అప్పటికే డాక్టర్లందరూ వెళ్లిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.చేవెళ్లలో ఘటన విజయ్ నర్సింగ్హోం ఎదుట బాధితుల ఆందోళన కేసు నమోదు చేసిన పోలీసులు -
ఆలయంలో బంగారు నగల చోరీ
యాచారం: మండల పరిధి నస్దిక్సింగారంలోని సీతారామాంజనేయస్వామి దేవాలయంలో బుధ వారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. దుండగులు దేవాలయంలోని తలుపులను పగులగొట్టి దేవతామూర్తుల మెడలో ఉన్న రూ.లక్ష లోపు విలువ జేసే బంగారు ఆభరణాలు, హుండీలో ఉన్న నగదును అపహరించారు. స్థానికుల సమాచారం మేరకు గురువారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధులు సీతారామాంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి చోరీకి పాల్పడిన తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్తో హోటల్ దగ్ధం
షాద్నగర్రూరల్: షార్ట్ సర్క్యూట్తో ఓ హోటల్ దగ్ధమైన సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్టలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలిచంద్రయ్య హోటల్ నిర్వహిస్తూ జీవనోపాధిని పొందుతున్నాడు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే హోటల్ను మూసివేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తరువాత షార్ట్ సర్క్యూట్ కావడంతో హోటల్లోని సామగ్రి, వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గురువారం తెల్లవారుజామున చంద్రయ్య చూడగా దట్టమైన పొగతో నిండిపోయింది. హోటల్లోని ప్రిడ్జ్లు, కౌంటర్లు, కంప్యూటర్, ప్రింటర్, సీసీ కెమెరాల ఎక్విప్మెంట్, ఫ్యాన్లు, కుర్చీలు, కూల్ డ్రింక్, వాటర్ బాటిళ్లు పూర్తిగా కాలిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న ఆర్ఐ సలీం, పంచాయతీ కార్యదర్శి తేజస్విని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ షార్ట్ సర్క్యూట్తో దాదాపు రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు హోటల్ యజమాని చంద్రయ్య తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. -
రూ.11 లక్షలకు రైతుబజార్ వేలం
పహాడీషరీఫ్: జల్పల్లి మున్సిపాలిటీ రైతుబజార్ వేలంలో రూ.11,03,500కు పలికింది. మున్సిపాలిటీ కమిషనర్ బి.వెంకట్రామ్ సమక్షంలో గురువారం నిర్వహించిన ఈ వేలంలో ఆరుగురు సీహెచ్ నవీన్ గౌడ్, మహ్మద్ అలీ, ఎస్.కె.అమీర్, బి.నాగభూషణం, ఎండీ జ మీయువద్దీన్లు ముందుకు రావడంతో వేలం నిర్వహించగా రూ .11,03,500లకు మహ్మద్ అలీ దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా కమిషన ర్ మాట్లాడుతూ.. రైతుబజార్ దక్కించుకున్న వారు వచ్చే ఏడాది మే 31వ తే దీ వరకు వీధి వ్యాపారుల వద్ద రుసుంను వసూలు చేసుకునేందుకు అవకా శం ఉంటుందన్నారు. తాము సూచించనంత మేరకే వ్యాపారుల నుంచి డ బ్బులు వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి జ్యో తి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భానుచందర్, మహ్మద్ మస్తాన్ వలీ పాల్గొన్నారు. బెదిరిస్తున్న యువకుడిపై ఫిర్యాదు ఫిలింనగర్: నన్ను కాదంటే నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తానంటూ బెదిరించిన మాజీ ప్రియుడిపై ఓ యువతి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..షేక్పేట ఓయూ కాలనీలో నివసించే ప్రముఖ డిజైనర్ (26) ఓ బొటిక్ నడుపుతున్నది. ఆమెకు 2024లో అభిలాష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. అయితే ఇద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అప్పటి నుంచి నిందితుడు అభిలాష్ ఆమెను బ్లాక్మెయిల్ చేయసాగాడు. ఆమె ఫొటోలను స్నేహితులకు పంపుతూ ప్రతిష్టను దిగజార్చసాగాడు. ఆమె ఫ్లాట్ వద్ద అనుమానాస్పదంగా తిరగడంతో పాటు జుమాటో డెలివరీ బాయ్గా అపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తూ ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చి డెలివరీ ఆర్డర్ తీసుకోవాలంటూ వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె రెండు రోజుల క్రితం అభిలాష్ సోదరుడి దృష్టికి తీసుకువెళ్లింది. వారు పట్టించుకోలేదు. తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ అభిలాష్ మళ్లీ బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్కు పాల్పడసాగాడు. నిందితుడి వల్ల తాను బొటిక్ నడపలేకపోతున్నానని, వ్యాపారం దెబ్బతిన్నదని, పూర్తి నష్టాల్లో ఉన్నానని, తన పెళ్లి కూడా ఇతని చేష్టల వల్ల ఇబ్బందులకు గురవుతున్నదని ఆరోపిస్తూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు నిందితుడు అభిలాష్పై బీఎన్ఎస్ సెక్షన్ 78 (2), 336 (4), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకోపోతే సూసైడ్ చేసుకుంటానంటూ బెదిరింపు ఫిలింనగర్: తనను పెళ్లి చేసుకోపోతే సూసైడ్ చేసుకుంటానంటూ ఓ యువకుడు బెదిరించడమే కాకుండా ఆమె కళ్లముందే బ్లేడ్తో చేతిని కట్ చేసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..యూసుఫ్గూడ ఎల్ఎన్ నగర్లో నివసించే యువతి (24) జూబ్లీహిల్స్లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ వెంకటగిరికి చెందిన ఎన్.అరవింద్ అనే దూరపు బంధువుతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా..వారి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో రెండు కుటుంబాలు ఒప్పుకోకపోతే తాను పెళ్లి చేసుకోనని యువతి చెప్పింది. ఆగ్రహించిన అరవింద్ గత మూడు నెలలుగా ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె తిరస్కరిస్తూ వస్తున్నది. దీంతో ఆమె పనిచేస్తున్న ఆస్పత్రి వద్దకు కూడా రోజూ వెళ్తూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయసాగాడు. బుధవారం రాత్రి ఆమె విధులు ముగించుకుని ఆస్పత్రి పార్కింగ్ స్థలంలోకి వచ్చి స్కూటీ తీసుకుంటుండగా, అక్కడికి వచ్చిన అరవింద్ ఆమెను అడ్డుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని మరోసారి ఒత్తిడి చేశాడు. ఆమె కుదరదని చెప్పడంతో జేబులో ఉన్న బ్లేడ్ తీసి చేతిని కోసుకున్నాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ఇక్కడే సూసైడ్ చేసుకుంటానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 78 (2), 351 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘అవాస్తవాలప్రచారం సరికాదు’
ఇబ్రహీంపట్నం: తాను కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నట్లు ప్రచారం చేయడం సరికాదని ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటనర్సప్ప గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నట్లు చెప్పారు. తనపై ఉద్దేశ పూర్వకంగా కొందరు అవాస్తవాలు ప్రచారం చేసి, కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు సూచనల మేరకే వ్యవహరిస్తున్నట్లు వివరించారు.విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతిషాబాద్: విద్యుదాఘాతంతో ఓ పాడి ఆవు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చర్లగూడలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నక్కల కిష్టయ్యకు చెందిన ఆవు మేత మేస్తూ మీరాపూర్ సమీపంలో విద్యుత్ టాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కొట్టి అక్కడిక్కడే మృతి చెందింది. దాని విలువ సుమారు రూ.లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.త్వరితగతిన ఎస్టీపీల పనులుసాక్షి, సిటీబ్యూరో: ఎస్టీపీల పనుల్లో వేగంపెంచి తుదిదశలో ఉన్న వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఈడీ మాయాంక్ మిట్టల్తో కలిసి అంబర్పేట్, అత్తాపూర్ ఎస్టీపీలను సందర్శించారు. తొలుత అంబర్పేట్ ఎస్టీపీకి వెళ్లిన ఆయన.. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. చిన్న చిన్న సివిల్ వర్క్లు, గార్డెనింగ్, పెయింటింగ్, అంతర్గత రోడ్ల నిర్మాణంలాంటి పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఎస్టీపీని ప్రారంభానికి సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అనంతరం అత్తాపూర్ ఎస్టీపీని సైతం సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించిన ఎండీ మిగిలిపోయిన పనుల్ని సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం సుజాత, ఎస్టీపీ ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచానికి సైనిక సత్తా చాటాం
షాద్నగర్రూరల్: ఆపరేషన్ సిందూర్తో మన సైనికుల సత్తాను ప్రపంచ దేశాలకు చాటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ.. మన సైనికులు దేశ ప్రజలకోసం పోరాడుతున్నారన్నారు. పాకిస్తాన్పై భారత సైనికులు చేసింది ఆపరేషన్ మాత్రమేనని యుద్ధం కాదన్నారు. యుద్ధానికి దిగితే పాకిస్తాన్ కనుమరుగువుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అందె బాబయ్య, శ్రీవర్ధన్రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, మహేందర్రెడ్డి, రమేష్, వెంకటేష్గుప్తా, వెంకటేష్, హరిభూషణ్ పటేల్, శ్రీనివాస్రెడ్డి, నాగవర్దన్రెడ్డి, యువసత్తా లక్ష్మణ్కుమార్, శ్రీనివాస చారి, ప్రశాంత్, చంద్రశేఖరప్ప, వరలక్ష్మి, జలజ, శ్రీనివాస్, వంశీ, అశోక్, కుర్మయ్య, మనోహర్, శ్రీకాంత్, శంకర్, మమత తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్ -
మైనింగ్ ఏర్పాటు వద్దు
● పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ● సమావేశానికి బయటి వ్యక్తులను తీసుకువచ్చిన నిర్వాహకులు కందుకూరు: మైనింగ్ ప్రాజెక్టు ఏర్పాటుకు బుధవారం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనల నడుమ ముగిసింది. కందుకూరు రెవెన్యూ సర్వే నంబర్ 338, 339లో 4.75 హెక్టార్ల భూమిలో మెస్సర్స్ గాంగే మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మైనింగ్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. అందుకు సంబంధించి పర్యావరణ అనుమతులకు కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటనర్సయ్య, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ గోపాల్ సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కాగా ఆ భూమికి చుట్టు పక్కల ఉన్న రైతులు మైనింగ్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఎస్.పాండు, మాజీ ఉప సర్పంచ్ జి.సుధాకర్రెడ్డి, రైతులు జగన్, బీరప్ప, విలాసిత్రెడ్డి తదితరులు మా ట్లాడుతూ.. 20 ఏళ్లుగా తమ భూముల పక్కనే మైనింగ్కు అనుమతులు ఇవ్వడంతో చాలా ఇబ్బందులు పడ్డా మని తెలిపారు. బ్లాస్టింగ్లతో బోర్లలో మోటార్లు కూరుకుపోవడం, పొలాల్లో రాళ్లు వచ్చి పడడం, దు మ్ము, ధూళితో పంట నష్టపోయామని వాపోయా రు. మైనింగ్ ఏర్పాటు చేయవద్దని తేల్చి చెప్పా రు. కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మైనింగ్ ఏర్పాటు చేయాలని, మరికొందరు మాత్రం రైతులకు ఇబ్బందులు కలుగకుండా వారిని ఒప్పించాలని సూచించారు. సమీప గ్రామం తిమ్మాయిపల్లికి చెందిన కొందరు మా త్రం మైనింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలోసంబంధం లేని వ్యక్తులు కాగా పర్యావరణ ప్రజాభిప్రాయం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బుధవారం ఉదయం మైక్ ద్వారా దండోరా వేయించడం గమనార్హం. దీంతో చాలా మందికి అక్కడ అభిప్రాయ సేకరణ ఉందనే విషయమే తెలియదు. మరోపక్క మైనింగ్ కంపెనీ నిర్వాహకులు మాత్రం ముందు జాగ్రత్తగా బయటి ప్రాంతాల నుంచి సంబంధంలేని వ్యక్తులను తీసుకువచ్చి కూర్చోపెట్టారు. వారితో తమకు అనుకూలంగా చెప్పించుకునే ప్రయత్నం చేశారు. విషయాన్ని గుర్తించిన స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తం చేసిన అంశాలను పైఅధికారులకు నివేదిస్తామని ఈ సందర్భంగా ఆర్డీఓ తెలిపారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ రాజు, ఆర్ఐ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
అధికంగా పాలిచ్చే పశువుల వివరాలు నమోదు చేయాలి
జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ అధికారి అరుణశ్రీ మొయినాబాద్: సురభి చయాన్ శ్రకల కార్యక్ర మంలో భాగంగా పది లీటర్లకు పైగా పాలిచ్చే ఆవులు, గేదెల వివరాలను భారత్ పశుధన్ యాప్లో నమోదు చేయాలని జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ అరుణశ్రీ గోపాల మిత్రలకు సూచించారు. బుధవారం మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్ మండలాల్లోని గోపాలమిత్ర కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణశ్రీ మా ట్లాడుతూ.. దేశంలో ఎక్కువ పాలిచ్చే జ న్యు వులు ఉన్న ఆవులు, గేదెలను గుర్తించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తద్వా రా పశుపోషకదారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తుందన్నారు. గ్రామాల్లో పర్యటించి అధికంగా పాలిచ్చే ఆవులు, గేదెలను గుర్తించి భారత్ పశుధన్ యాప్లో వివరాలను నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో గోపాల మిత్రలు శ్రీనివాస్, యాదయ్య, బాలకిష్టయ్య, విద్యాసాగర్, రాజేశ్, నరేశ్ పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన రైతులు
● ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వండి ● లేదంటే డీఎల్ఐ ప్రాజెక్టు రద్దు చేయండి మాడ్గుల: డిండి లిఫ్ట్ ఇరిగేషన్(డీఎల్ఐ) ప్రాజెక్టు రద్దు చేయాలని కోరుతూ ఇర్విన్, నల్లచెరువు, రెడ్డిపల్లి రైతులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాల్ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా రైతులకు నీరందించేందుకు నిర్మించిన తలపెట్టిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్తో తా ము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.8లక్షల పరిహారం చెల్లిస్తున్నారని..ఆ పరిహారంతో గుంట భూమి దొరికే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఎంత భూమి కోల్పోతే అంత భూమి లేదా ఎకరాకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెల్లించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులకు సమాచారం లేకుండానే పరిహారం జమ చేయడం సరికాదన్నారు. ప్రాణాలు పోయినా భూములిచ్చేది లేదంటూ భీష్మించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి తహసీల్దార్ వినయ్సాగర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
నిరుపేదలకు నాణ్యమైన విద్య
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మంచాల: నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం ఆయన జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, ఎస్డీఎఫ్ సభ్యురాలు పద్మజతో కలిసి మంచాల జెడ్పీహెచ్ఎస్ను సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందంతో కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందడం కష్టతరమైందని.. భవిష్యత్ తరాలకోసం ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలలను మరింత అభివృద్ధి దిశగా తీసుకుపోవాలన్నారు. ఈ మేరకు జూన్ 6వ తేదీన మంచాల గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వారి వెంట ఎంఈఓ రాందాస్, ఉపాధ్యాయులు ఉన్నారు. ‘ఉపాధి హామీ’ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర సీపీఎం కార్యదర్శి పగడాల యాదయ్య యాచారం: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. బుధవారం ఆయన చింతపట్ల, నల్లవెల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ రక్షణ కోసం ఈ నెల 30న కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న ధర్నా ను విజయవంతం చేయాలన్నారు. కూలీల పొట్టకొడుతున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కోట్లాది రూపాయల రుణమాఫీ చేస్తోందని మండిపడ్డారు. ఉపాధిహామీ చట్టా న్ని కాపాడకునేందుకు సమష్టి పోరాటం చేయా లని పిలుపునిచ్చారు. వేలాది మంది కూలీలు తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, నాయకులు సత్యం, జంగయ్య, గిరి, శ్రీశైలం, ప్రభాకార్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. విజయలక్ష్మి ఆస్పత్రిపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆస్పత్రిపై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కు బాధితుడు గణేశ్ బుధవారం ఫిర్యాదు చేశాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈనెల 4న విజయలక్ష్మి ఆస్పత్రిలో పురిటిలోనే పసికందులు మృత్యువాత పడ్డారని బాధితుడు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి సంబంధిత వైద్యురాలు అనూషరెడ్డిపై చర్యలు తీసుకుని ఆస్పత్రి లైసెన్స్ను రద్దు చేయాలని ముఖ్యమంత్రికి, కలెక్టర్, డీఎంహెచ్ఓలకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు వివరించారు. 8న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ హిమాయత్నగర్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిన గౌడ్స్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. బుధవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దివంగత బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిన అమర్నాథ్ గౌడ్ మాట్లాడారు. మృగశిర కార్తె అయిన జూన్ 8న ఆదివారం ఉదయం 10 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. దేశ, విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని, ఎవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపిణీ సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని వివరించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మున్సిపాలిటీ, పోలీస్, విద్యుత్ శాఖలతో పాటు మత్య్సశాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉన్నామన్నారు. -
అవినీతి జలగలు!
రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో తిష్ట సాక్షి, రంగారెడ్డి జిల్లా: కార్యాలయాల ఆవరణలో అవినీతి రహిత సేవలంటూ తాటికాయంత పెద్ద అక్షరాలతో ప్రకటనలు.. లోపల అడుగు పెడితే గుప్పుమనే అవినీతి వాసనలు. ఇదీ.. అక్రమ వసూళ్లకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిన ప్రభుత్వ కార్యాలయాల్లోని పరిస్థితి. ఇందులో దొరికిన వారే దొంగలు.. దొరకని వారు దర్జాగా దండుకుంటున్నారు. జిల్లాలోని రెవెన్యూ సహా రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో అవినీతి జలగలెన్నో తిష్టవేసి కూర్చున్నాయి. ఆయా శాఖలకు తీరని మచ్చను తెచ్చిపెడుతున్నాయి. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఒకరి తర్వాత మరొకరు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అక్రమార్కులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నా.. వైఖరిలో మాత్రం మార్పురాకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అదనపు కలెక్టర్ ఘటన మరువక ముందే.. 14 గుంటల భూమికి పాసుపుస్తకం కోసం గుర్రంగూడకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలు డిమాండ్ చేసి, ఏసీబీ కేసులో జైలుకు వెళ్లిన అదనపు కలెక్టర్ ఎంవీ భూపాల్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్రెడ్డిల వ్యవహారాన్ని పూర్తిగా మరువక ముందే.. తాజాగా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆఫీసులో మరో తిమింగలం ఏసీబీ వలకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. ఏడు గుంటల భూమికి పాసు పుస్తకం జారీకి రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి.కృష్ణ రూ.12 లక్షలు డిమాండ్ చేయడంతో ఆదిబట్లకు చెందిన ఓ బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో బుధవారం ఆయన్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రెవెన్యూలో మచ్చుకు కొన్ని.. ఐదేళ్ల క్రితం కేశంపేట తహసీల్దార్ లావణ్య, అప్పటి వీఆర్ఓ అనంతయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. రెవెన్యూ రికార్డులో పేరు మార్పిడికి రూ.9 లక్షలు డిమాండ్ చేసి రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. తనిఖీల్లో భాగంగా ఆమె ఇంటి నుంచి రూ.93 లక్షల నగదు, భారీగా బంగారు ఆభరణాలు పట్టుబడటం అప్పట్లో సంచలనం రేపింది. మూడేళ్ల క్రితం కందుకూరు మాజీ ఎంపీఓ సహా పంచాయతీ మాజీ కార్యదర్శి సైతం ఏసీబీ వలకు చిక్కారు. నిషేధిత జాబితాలో ఉన్న వివాదాస్పద 98 దరఖాస్తులు తన ప్రమేయం లేకుండా ఆమోదం పొందాయని పేర్కొంటూ అప్పటి కలెక్టర్ భారతి హోళీకేరీ ఆదిబట్ల ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఇద్దరు ఆపరేటర్లను అరెస్టు చేశారు. విద్యుత్, ఇరిగేషన్లోనూ..జిల్లా నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్, అసిస్టెంట్ ఇంజనీర్ కె.కార్తీక్, ఎస్ఈ ఆఫీసులోని ఏడబ్ల్యూ సెక్షన్ ఏఈ హెచ్.నిఖేష్కుమార్, గండిపేట మండల సర్వేయర్ పి.గణేశ్ ఏడాది క్రితం ఏసీబీకి చిక్కారు. వీరు బఫర్జోన్లలో నిర్మాణాలకు ఎన్ఓసీ జారీ చేసే విషయంలో నెక్నంపూర్కు చెందిన బొమ్మ నరేందర్రెడ్డి నుంచి రూ.2.50 లక్షలు డిమాండ్ చేసి మే 31న ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇదే కేసులో పట్టుబడిన ఓ ఏఈ ఆస్తులు ఏకంగా వంద కోట్లకుపైగా ఉన్నట్లు గుర్తించారు. విద్యుత్ శాఖలోనూ పెద్ద సంఖ్యలోనే పట్టుబడ్డారు. గోపన్పల్లిలోని ఓ బహుళ అంతస్తుల భవనానికి ట్రాన్స్ఫార్మర్ సహా సిటీమీటర్ జారీ కోసం కాంట్రాక్టర్ శివారెడ్డి నుంచి రూ.50 వేలు తీసుకుంటూ గచ్చిబౌలి డివిజన్ ఏడీఈ సతీశ్ ఇటీవల ఏసీబీకి చిక్కారు. అంతకు ముందు ఇదే డివిజన్లో పని చేసిన ఏడీఈ రాములు, కొండాపూర్ డీఈ వెంకటరమణ ఇదే కేసుల్లో పట్టుబడ్డారు. ఇక గొర్రెల పంపిణీ పథకం స్కాంతో సంబంధం ఉన్న జిల్లాకు చెందిన అప్పటి పశు సంవర్థకశాఖ అధికారి అంజలప్ప, అప్పటి భూగర్భ జలవనరులశాఖ అధికారి రఘుపతి రెడ్డిలను ఏసీబీ అరెస్టు చేసింది. జిల్లాలో తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు అడ్డంగా పట్టుబడి జైలుకు వెళ్తున్నా మారని తీరు -
పరిహారం.. పరిహాసం
● కేసు పెండింగ్లో ఉన్నా పట్టించుకోని అధికారులు ● అసలు పట్టాదారుకు కాకుండా మరొకరికి రూ.1.25కోట్లు, ఐదు ప్లాట్ల సర్టిఫికెట్ల అందజేత ● గ్రామస్తులతో కలిసి ఆర్డీఓని ఆశ్రయించిన బాధిత రైతు కందుకూరు: కోర్టులో కేసు.. అధికారుల వద్ద పూర్తి సమాచారం ఉన్నప్పటికీ ఫార్మాసిటీ భూ పరిహారం మాత్రం అసలు పట్టాదారుకు కాకుండా మరొకరికి అందింది. రూ.1.25 కోట్లతో పాటు అదనంగా ఐదు ప్లాట్ల సర్టిఫికెట్లు అందించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన ప్రకారం. మండల పరిధిలోని ముచ్చర్ల రెవెన్యూ సర్వే నంబర్ 288/1క్యూలో ముచ్చర్ల అనుబంధ గ్రామం ఊట్లపల్లికి చెందిన బొర్ర బుచ్చయ్యకు వారసత్వంగా వచ్చిన ఐదెకరాల పట్టా భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన కుందేళ్ల రాములు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క 2006–07లో తప్పుడు ప్రొసీడింగ్ నంబర్ 1621/1992తో తన పేరిట నమోదు చేయించుకున్నాడు. రాములు మృతి చెందడంతో 2011లో ఆయన భార్య జంగమ్మ తన పేరిట విరాసత్ చేయించుకుంది. ఆలస్యంగా గుర్తించిన బుచ్చయ్య రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నాడు. ఫలితం లేకపోవడంతో ఇబ్రహీంపట్నం కోర్టును ఆశ్రయించాడు. అనంతరం కేసు పరిశీలించిన జేసీ 2015లో రికార్డులు అసలు పట్టాదారుకు అనుకూలంగా మార్చాలంటూ ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ మార్చలేదు. ఈ క్రమంలో 2016లో ఫార్మాసిటీ కోసం ఆ సర్వే నంబర్లోని భూములను ప్రభుత్వం సేకరించే పనులు ప్రారంభించింది. దీంతో పరిహారం తనకే చెల్లించాలని కోరుతూ అసలు పట్టాదారు బుచ్చయ్య హైకోర్టును ఆశ్రయించాడు. ఈ భూవివాదం పెండింగ్లో ఉండగానే 2023 అక్టోబర్ 19న కుందేళ్ల జంగమ్మకు ఎకరాకు రూ.25 లక్షల చొప్పున రూ.1.25 కోట్లు పరిహారం చెల్లించి ఎకరాకు 121 గజాల చొప్పున ఐదు ప్లాట్లు కేటాయిస్తూ సర్టిఫికెట్లు జారీ చేశారు. విషయాన్ని గుర్తించిన అసలు పట్టాదారు గ్రామస్తులతో కలిసి బుధవారం ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డిని కలిసి తన గోడు వెల్లబోసుకున్నాడు. కోర్టులో కేసుండగా పరిహారం ఎలా ఇస్తారంటూ ప్రశ్నించాడు. ఇందుకు స్పందించిన ఆర్డీఓ పూర్తి సమాచారం కలెక్టర్కు నివేదిస్తానని.. ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు ఎందరో! కాగా ఫార్మాసిటీ పరిహారం చాలా మంది రైతులకు ఇంకా పెండింగ్లోనే ఉంది. మరోపక్క అధికారులు భూములకు ఫెన్సింగ్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమకు న్యాయం చేసిన తర్వాతే ఫెన్సింగ్ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మరోపక్క గతంలో పరిహారం ఇచ్చే సమయంలో బోర్లకు, షెడ్లకు, చెట్లకు ఇస్తామని చెప్పిన అధికారు లు పరిహారం చెల్లించే సమయంలో ఆ ఊసేలేదు. దీంతో రైతులు అధికంగా నష్టపోవాల్సి వచ్చింది. -
ఒక్కరి కోసం.. ఆరుగురు
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో చివరి రోజు బుధవారం చేవెళ్ల పరీక్ష కేంద్రంలో ఒకే విద్యార్థినితో పరీక్ష కేంద్రం కొనసాగింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సులకు సంబంధించి చివరి పరీక్ష ఉండగా ఆదర్శ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఒకే విద్యార్థిని హాజరవడంతో నిబంధనల ప్రకారం చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, ఎగ్జామినర్, సిట్టింగ్ స్క్వాడ్, కానిస్టేబుల్,ఏఎన్ఎం విధులకు హాజరయ్యారు. – చేవెళ్ల -
ప్రజల పక్షాన ఉద్యమించాలి
● ఉపాధి అవకాశాలు లేకనే కుటుంబ వ్యవస్థలు ఛిన్నాభిన్నం ● సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బీఎస్ఆర్ మోహన్రెడ్డి చేవెళ్ల: గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి అవకాశాలు సన్నగించడంతోనే కుటుంబ వ్యవస్థలు ఛిన్నాభిన్నమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యు డు, చైతన్య విజ్ఞాన సమితి కార్యదర్శి బీఎస్ఆర్ మోహన్రెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి జన సేవాదళ్ శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జన సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేశ్ అధ్యక్షతన మూడో రోజు బుధవారం భారత ఆర్థిక వ్యవస్థ–పరిణామాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్ఆర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాల్గవ స్థానానికి తీసుకెళ్లామని గొప్పలు చెబుతున్న బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించడంలో విఫలమవుతున్నాయని మండిపడ్డారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దేశం అభివృద్ధి చెందుతోందని చెబుతూనే.. 80 కోట్ల మంది పేదలకు రేషన్ షాపుల నిత్యావసర సరుకులను అందిస్తున్నామని ప్రకటిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ విధ్వంసానికి గురి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడం లేదన్నారు. జన సేవాదళ్ సభ్యులు ప్రజల పక్షాన ఉద్యమించేందుకు సిద్ధమవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, జాతీయ జన సేవా ఇన్స్పెక్టర్ మురళి, జి.విష్ణు, గోస్కా మోహన్, ఎం.అనిల్కుమార్, సిద్దినేని కర్ణకుమార్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రామస్వామి, ప్రభులింగం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయ ణ, నాయకులు సత్తిరెడ్డి, జంగయ్య, మక్బూల్, అంజయ్య, శివ, మంజుల, మినాక్షి, బాబురావు, జన సేవాదళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలు
కందుకూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన వివరాలు.. కడ్తాల్ గ్రామానికి చెందిన కడారి శివరాజ్(66) మంగళవారం ఉదయం మండల పరిధిలోని కొత్తూర్లో బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి తన స్కూటీపై గూడురు వైపు వెళ్తుండగా శ్రీశైలం హైవే కొత్తూర్ గేట్ వద్ద కందుకూరు వైపు నుంచి వేగంగా వచ్చిన పల్సర్ బైక్ ఢీకొట్టింది. దీంతో శివరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో పోలీసులు, స్థానికులు అతన్ని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పరమేశ్ తెలిపారు. రైలు ఢీకొని కార్మికుడి మృతి నందిగామ: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన నందిగామ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హైడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన రమేష్(40) కొంత కాలం క్రితం కొత్తూరు మండలం తిమ్మాపూర్కు వలస వచ్చి స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం అతని మృత దేహాన్ని నందిగామ మండల పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మాస్టర్ రహమాత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రమాదవశత్తు రైలు ఢీ కొట్టిందా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం ఢీ : తీవ్ర గాయాలు నందిగామ: ముందు వెళ్తున్న బైక్ను వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీ కొట్టడంతో బైక్పై ఉన్న వ్యక్తి తీవ్ర గాయాలకు గురైన ఘటన మండల పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి (బైపాస్)పై చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నందిగామ మండలం బండకుంట తండాకు కొన్నేళ్ల క్రితం వలస వచ్చాడు. స్థానికంగా ఓ జామ తోటలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన బైక్పై మంగళవారం షాద్నగర్ వైపునకు వెళ్తుండగా ఎంఎస్ఎన్ పరిశ్రమ సమీపంలో వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై నుంచి ఎగిరిపడ్డ వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు చికిత్స నిమిత్తం షాద్నగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుమారుడు పరుశురారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీల దొంగ దొరికాడు కేశంపేట: మండలంలో ఇటీవల చోరీ అయిన బ్యాటరీలను పోలీసులు రికవరీ చేశారు. మండల పరిధిలోని లేమామిడి, కేశంపేట, బైర్కాన్పల్లి గ్రామాల్లో ఇటీవల వాహనాల బ్యాటరీలతో పాటు జనరేటర్ బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఇదే విషయమై బాధితుల నుంచి పోలీసులకు నాలుగు ఫిర్యాదులు అందాయి. పోలీసులు బ్యాటరీ దొంగతనాలను ఛేదించేందుకు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమోరాల్లో నమోదైన పుటేజీలతోపాటు వివిధ కోణాల్లో సమాచారం సేకరించారు. హైదరాబాద్ విద్యానగర్లోని లక్ష్మీ అపార్ట్మెంట్లో నివసిస్తున్న మేగిశెట్టి నాగేశ్వర్రావు బ్యాటరీలను దొంగిలించినట్టు గుర్తించారు. అతడి నుంచి 12 బ్యాటరీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం నవాబుపేట: ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టిగిద్ద గ్రామానికి చెందిన బక్కని ఏసు కొడుకు సందీప్(23), వికారాబాద్లో ఐటీఐ చదువుతున్నాడు. ఏడాది క్రితం పట్టణానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారింది. అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన సందీప్ గత సోమవారం సాయంత్రం తమ పొలంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. -
మట్టితో పూడ్చేసి!
నాలాపై కన్నేసి..ఇబ్రహీంపట్నం రూరల్: దాతర్చెరువు కాల్వపై కన్నేసిన అక్రమార్కులు మట్టితో నింపి కబ్జా చేశారు. అర కిలోమీటర్ మేర నాలాను ఆక్రమించి రెండున్నర ఎకరాల భూమిని కొల్లగొట్టారు. ప్రస్తుత మార్కెట్లో దీని విలువ రూ.కోట్లలో ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిబట్ల మున్సిపల్ పరిధి కొంగరకలాన్లోని దాతర్ చెరువు నిండితే.. అలుగు పారి పులందరి వాగులోకి చేరుతుంది. దాతర్ చెరువును ఆనుకుని ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్ వేసింది. ప్రస్తుతం దీని పక్కనే ఉన్న భూములను కొనుగోలు చేస్తోంది. దాతర్ చెరువు నాలా రెండు కిలోమీటర్ల మేర ఉంటుంది. భారీ ప్రవాహం ఉండే చారిత్రక ఆనవాళ్లు కలిగిన నాలాను కొంతమంది రాత్రికి రాత్రే చెరబట్టారు. వేలాది ట్రిప్పుల మట్టి నింపి దాదాపు 500 మీటర్ల పొడవునా కాల్వను కనుమరుగు చేశారు. చెరువు కట్టను సైతం చీల్చి దాదాపు రెండున్నర ఎకరాల భూమిని కబ్జా చేశారు. మార్కెట్లో దీని విలువ రూ.10 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వందల ఏళ్ల నాటి కాల్వను పూడ్చేసిన అక్రమార్కులు ప్రత్యామ్నాయంగా కొత్త కాల్వ తవ్విస్తున్నారు. దీనికి ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి ఎలాంటి అనుమతి లేదు. ఫిర్యాదుతో విచారణ కబ్జా విషయమై కొంగరకలాన్కు చెందిన నీళ్ల హరిబాబు అనే వ్యక్తి ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఏఈ హరిత క్షేత్ర సందర్శనకు వచ్చారు. గ్రామ నక్షా, కాలువ విస్తీర్ణం తదితర అంశాలను పరిశీలించారు. విచారణ అనంతరం నివేదిక రూపొందించి, ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. రాత్రికి రాత్రే దాతర్చెరువు కాల్వ ఆక్రమణ రెండున్నర ఎకరాల భూమికి ఎసరు పూర్తిస్థాయి విచారణకు ఇరిగేషన్ డీఈఈ ఆదేశం కబ్జా నిజమని తేలితే.. నాలా ఆక్రమణ విషయమై మాకు ఫిర్యాదు అందింది. అధికారులు, సిబ్బందిని ఫీల్డ్ విజిట్కు పంపించాం. పూర్తి స్థాయి విచారణ, సర్వేకు ఆదేశించాం. కాల్వను పూడ్చారని, కబ్జా వాస్తవమేనని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – చెన్నకేశవరెడ్డి, ఇరిగేషన్ డీఈఈ -
సైనికుల త్యాగాలు మరువలేనివి
కందుకూరు: జాతీయవాదాన్ని గుండెల నిండా నింపుకొని పోరాడుతున్న మన సైనికుల త్యాగాలు మరువలేనివని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎన్.అంజిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. యుద్ధంలో గెలవడమే కాదు ప్రత్యర్థులను సైతం తన వైపు తిప్పుకొన్న గొప్ప నేత ప్రధాని మోదీ అని కొనియాడారు. భారత్ ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక శక్తిగా ఎదగడానికి మోదీ పాలనతోనే సాధ్యమైందన్నారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్, కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, రాష్ట్ర నాయకుడు కడారి జంగయ్య మాట్లాడుతూ.. ఓటు రాజకీయాలను పక్కన పెట్టి దేశం కోసం అంతా ఏకమై సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపుదామన్నారు. నియోజకవర్గంలో 20 వేలకు పైగా రోహింగ్యాలు ఉన్నారని, వారిని గుర్తించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు బస్వ పాపయ్యగౌడ్, మిద్దె సుదర్శన్రెడ్డి, పి.కృష్ణగౌడ్, జిట్టా రాజేందర్రెడ్డి, ఎస్.మల్లారెడ్డి, కె.జంగారెడ్డి, మాజీ ఎంపీపీ అశోక్గౌడ్, టి.జగదీశ్వర్రెడ్డి, ఎ.సత్తయ్య, బి.మల్లేష్, బి.సత్యనారాయణరెడ్డి, ఎన్.నర్సింహారెడ్డి, ఊటు మహేందర్, ఎ.యాదగిరి తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
పల్లె మెరిసేలా..
పచ్చదనం పెంపొందేలా.. షాద్నగర్: పల్లెల్లో స్వచ్ఛదనం, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. పంచాయతీల్లో పారిశుద్ధ్య సమస్యలు పెరిగిపోవడం, సరిపడా కార్మికులు లేక పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదని గుర్తించింది. ఈ మేరకు పారిశుద్ధ్య జోన్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇంటింటా చెత్త సేకరణ.. తడి, పొడి వ్యర్థాల నిర్వహణ.. మురుగు కాల్వలు, అంతర్గత రహదారుల పరిశుభ్రత వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుంటోంది. జోన్ల విభజన ఇలా.. జిల్లాలోని 19 మండలాల్లో 531 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులు అందుబాటులో లేరు. ప్రతి గ్రామంలోని ఇళ్లు, గ్రామ విస్తీర్ణం, కార్మికుల సంఖ్యకు అనుగుణంగా జోన్లుగా విభజిస్తున్నారు. పెద్ద పంచాయతీలైతే గరిష్టంగా నాలుగు, చిన్న పంచాయతీలైతే రెండు జోన్ల చొప్పున ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జోన్లను సూచిస్తూ పారిశుద్ధ్య మ్యాపును ఏర్పాటు చేస్తారు. జోన్ల పరిఽధిలో ఉండే ఇళ్లు, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల పొడవు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలను మ్యాపులో పొందుపరుస్తారు. ఫొటోలు తీసి.. అప్లోడ్ షెడ్యూల్ ప్రకారం ఒక జోన్ పరిధిలో కార్మికులతో పారిశుద్ధ్య పనులు పూర్తి చేయించి, సమస్యను పరిష్కరిస్తారు. మరుసటి రోజు మరో జోన్లో ప్రారంభిస్తారు. ఇలా జోన్ల ప్రకారం నాలుగు రోజులకు తగ్గకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్ఆర్)లో జోన్లలో చేస్తున్న పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. దీంతో ఏ జోన్లో పనులు ఏమేరకు జరిగాయో సులభంగా తెలుసుకోవచ్చు. ఎరువుల తయారీ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా ఇళ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేయనున్నారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయనున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో కంపోస్టు షెడ్లు ఖాళీగా ఉన్నాయి. వాటిలో తడి చెత్త వేయడం ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసి నర్సరీల్లోని మొక్కలకు వేయడం లేదా విక్రయించడం చేస్తారు. ఆదాయం పెంపునకు చర్యలు పొడి చెత్త నుంచి సేకరించిన ప్లాస్టిక్, గాజు ఇతర వస్తువులను తుక్కు దుకాణాలకు పంపించి ఆదాయం పొందనున్నారు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్కు జమ చేయనున్నారు. ఇందు కోసం ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను ఎంపీఓ, డీఎల్పీఓ, డీపీఓ, స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పల్లె ప్రగతి యాప్లో అప్లోడ్ చేస్తారు. ప్రభుత్వం స్వచ్ఛ ప్రణాళిక పంచాయతీల్లో పారిశుద్ధ్య జోన్లు చెత్త సమస్యకు సత్వర పరిష్కారం పల్లె ప్రగతి యాప్లో ఎప్పటికప్పుడు ఫొటోల అప్లోడ్ జనాభా ఆధారంగా.. పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. పంచాయతీల్లో జనాభా ఆధారంగా జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పారిశుద్ధ్య పనితీరు మరింత మెరుగుపడుతుంది. – సురేష్ మోహన్, జిల్లా పంచాయతీ అధికారి పల్లెలు పరిశుభ్రం గ్రామ పంచాయతీల్లో జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా పారిశుద్ధ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించవచ్చు. పల్లెలు పరిశుభ్రంగా ఉంటాయి. – బన్సీలాల్, ఎంపీడీఓ, ఫరూఖ్నగర్ -
గురుకుల విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో గురుకుల పూర్వ విద్యార్థులకు వృతి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2017 నుంచి కమ్మదనం గురుకుల బాలికల కళాశాలలో విద్యనభ్యసించి ఇప్పటి వరకు ఉద్యోగం లేని విద్యార్థినులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. శిక్షణ ఇచ్చేందుకు ఉన్నతి ఫౌండేషన్ ముందుకు వచ్చినట్టు తెలిపారు. 19–25 ఏళ్ల మధ్య వయసు కలిగిన గురుకుల పూర్వ విద్యార్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు వెంటనే కమ్మదనం గురుకుల కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట షాద్నగర్ః కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎఫ్సీ) చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ అన్నారు. మైనార్టీ మహిళా శక్తి పథకంలో భాగంగా పట్టణంలోని మండల పరిషత్ సమావేశశ మందిరంలో మంగళవారం 258 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలుస్తోందని తెలిపారు. పేద మహిళలను ప్రోత్సహించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోందని, మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు బాబర్ఖాన్, రఘు నాయక్, కొంకళ్ల చెన్నయ్య, చెంది తిరుపతిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, జమృద్ఖాన్, సర్వర్పాషా, ఇబ్రహీం, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. మైసిగండి మైసమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత ఆలయ హుండీ ఆదాయాన్ని జిల్లా దేవాదాయ శాఖ తూర్పు విభాగ ఇన్స్పెక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. మొత్తం 60 రోజులకు గాను రూ.11,77,715 ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని కడ్తాల్ కెనరాబ్యాంక్లో డిపాజిట్ చేయనున్నట్లు ఈవో స్నేహలత తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శిరోలీ, అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సభ్యులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. సాగులో సేంద్రియ పద్ధతులు మేలు మొయినాబాద్: రైతులు పంటల సాగులో సేంద్రియ పద్ధతులు అవలంబించి అధిక లాభాలు పొందొచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్థాస్ జానయ్య అన్నారు. మున్సిపల్ పరిధిలోని చిన్నషాపూర్లో మంగళవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగు పద్ధతులు, భూసారం పెంపు, నీటి వనరులు, పర్యావరణ పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువుల వాడకాన్ని పెంచాలన్నారు. తద్వారా భూమిలో భూసారం పెరిగి నేల ఆరోగ్యంగా ఉంటుందన్నారు. కూరగాయ పంటలకు డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, మల్చింగ్ పేపర్ వాడుకోవడం ద్వారా నీటి వృథాను తగ్గించి కలుపు నివారించుకోవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణకోసం మొక్కలు పెంచాలని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం నోడల్ అధికారి వేణుగోపాల్రెడ్డి, శాస్త్రవేత్తలు నీలిమ, రేవతి, మండల వ్యవసాయాధికారి అనురాధ, ఏఈఓ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే
పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్యషాద్నగర్రూరల్: ప్రస్తుతం దేశంలో మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్య ఆరోపించారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని ముఖ్యకూడలిలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు, ఆదివాసులను అత్యంత పాశవికంగా హతమార్చడం దారుణమని అన్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువులకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను పోలీసులే కాల్చివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలు జీవించే హక్కులను కూడా హరిస్తోందని మండిపడ్డారు. మావోయిస్టులు, ఆదివాసులపై హత్యాకాండను వెంటనే విరమించుకోవాలని, లేదంటే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసి, గిరిజన కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘు, బీఆర్ఎస్ నాయకుడు రాజావరప్రసాద్, బీఎస్పీ నాయకుడు దొడ్డి శ్రీనివాస్, సీపీఎం నాయకుడు ఈశ్వర్నాయక్, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
గడువులోగా యూనిఫాం అందించాలి
కేశంపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గడువులోగా యూనిఫాం అందించాలని డీఆర్డీఏ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యారావు అన్నారు. మండల కేంద్రంలోని మండల మహిళ సమాఖ్య భవనంలో మంగళవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు షర్టుల కోసం వచ్చిన క్లాత్ను కట్టింగ్ చేస్తున్న విధానాన్ని, మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో కుడుతున్న టైలరింగ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభంలోగా అందుబాటులో ఉంచే విధంగా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా టైలరింగ్ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఈపీఎం బాలరాజ్, ఏపీఎం భగవంతు, సీసీలు పాల్గొన్నారు. -
ఎప్పటికో పరిష్కార ‘మార్గం’!
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారి మృత్యుమార్గంగా మారింది. ఎప్పుడు ఏచోట ప్రమాదం జరుగుతుందో.. ఎవరి ప్రాణాలు గాలిలో కలుస్తాయో తెలియడం లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు తరచూ రాకపోకలు సాగించడం, స్థానికులు వస్తూ పోతుండడంతో ఈ రోడ్డు రద్దీగా మారింది. మహానగరం నుంచి ఉద్యోగ, వ్యాపారరీత్యా నిత్యం యాచారం, మాడ్గుల్, కడ్తాల్, ఆమన్గల్లు మండలాల ప్రజలే కాకుండా నల్లగొండ జిల్లా దేవరకొండ, మర్రిగూడ, పల్లెపల్లి, చింతపల్లి, మిర్యాలగూడ తదితర మండలాల నుంచి వేలాది మంది ప్రయాణికులు కార్లు, బైక్లు, ఇతర వాహనాలపై రాకపోకలు సాగిస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ బస్సులు రవాణా సాగిస్తుంటాయి. సాగర్రోడ్డు సమీపంలోని యాచారం, కడ్తాల్, ఆమన్గల్లు, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లోని కొన్ని గ్రామాలను ఫ్యూచర్సిటీలో కలపడంతో ఈ రోడ్డుపై వీఐపీల రాకపోకలు అధికమయ్యాయి. ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. సాగర్రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడానికి గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రోడ్డు భవనాల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రేవంత్రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల క్రితం హెచ్ఎండీఏ, రోడ్డు భవనాలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని అధికారుల బృందం విస్తరణపై ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాదారుల అభిప్రాయాలు సైతం సేకరించింది. 99 శాతం మందికి పైగా నాలుగు లేన్లుగా విస్తరించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం సమీపంలోని ఖానాపూర్ గేట్ నుంచి మాల్ సమీపంలోని తమ్మలోనిగూడ గేట్ వరకు 23 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లుగా విస్తరించడానికి నిర్ణయించారు. ప్రస్తుతం పది మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డును 17 మీటర్లకు విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మధ్యలో డివైడర్, పాదచారుల ప్రయాణ సౌకర్యార్థం విస్తరణ చేపట్టాలని రోడ్డు భవనాల శాఖ నిర్ణయించింది. తర్వాత సర్కార్ దృష్టి సారించకపోవడంతో విస్తరణకు గ్రహణం పట్టింది. ఆరునెలల వ్యవధిలోనే.. ఆరు నెలల వ్యవధిలోనే ఖానాపూర్ గేట్ నుంచి మాల్ గ్రామాల మధ్య జరిగిన ప్రమాదాల్లో పది మందికిపైగా ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. 25 మందికి పైగా తీవ్ర గాయాలతో క్షతగాత్రులుగా మిగిలారు. తాజాగా యాచారంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు, చింతపట్ల గేట్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యధికంగా గునుగల్ గేట్ సమీపంలోని ఓ డెయిరీ, ఆగాపల్లి స్టోన్ క్రషర్, యాచారంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో, గునుగల్ అటవీ ప్రాంతం, యాచారం పోలీస్ స్టేషన్ సమీపంలో, చింతపట్ల, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి గేట్ల వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారి విస్తరణ చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. సాగర్రోడ్డుపై వాహనాల రద్దీ తరచూ ప్రమాదాలు గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు విస్తరణకు నోచుకోని రహదారినిధులు మంజూరు కాగానే.. నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు మొదలుపెడుతాం. – రవీందర్గౌడ్, రోడ్డు భవనాల శాఖ డీఈఈ, ఇబ్రహీంపట్నం డివిజన్ అవగాహన కల్పిస్తున్నాం ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం పీఎస్ల పరిధిలో తరచూ వాహనాల తనిఖీలు చేపట్టి నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. అతి వేగం ప్రమాదకరమని సూచిస్తున్నాం. జరిమానాలు సైతం విధిస్తున్నాం. రోడ్డు విస్తరణ జరిగితే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. – కేపీవీ రాజు, ఏసీపీ ఇబ్రహీంపట్నం -
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
మొయినాబాద్ రూరల్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు అన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీరి అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చేగూరి రాజు, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్చారి, గణేశ్, సుదర్శన్, బుచ్చన్న, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు. -
సినిమా రంగంలోకి కొత్తతరం రావాలి
చేవెళ్ల: సినిమా రంగంలోకి కొత్త తరం రావాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. నగరంలోని ఆయన నివాసంలో మంగళవారం చేవెళ్ల ప్రాంతానికి చెందిన నిర్మాతలు మల్లికార్జున్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి కలిశారు. ఏఆర్ ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మిస్తున్న ‘కలివి వనం’ సినిమాకు సంబంధించిన పోస్టర్ను డైరెక్టర్ రాజ్నరేంద్రతో కలిసి కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. పూర్తిగా పల్లెటూరు నేపథ్యంలో.. అచ్చమైన తెలంగాణ సినిమాగా.. కలివి వనం చిత్రాన్ని ఒక మంచి సందేశంతో తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ మట్టి వాసన నేపథ్యంలో వచ్చిన చిత్రాల మాది రిగానే తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు పట్నం అవినాష్రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
అడ్డుకునేందుకు వెళితే హత్య చేశాడు..
ఉప్పల్: బార్లో మద్యం సేవిస్తున్న యువకుల మధ్య జరిగిన గొడవ ఓ అమాయకుడి ప్రాణాలు తీసింది. పక్క పక్క టేబుళ్లలో మద్యం సేవిస్తున్న యువకుల మద్య వివాదం చెలరేగడంతో అడ్డుకోబోయిన యువకుడి తలపై బీరు సీసాతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజి పేట గ్రామానికి చెందిన భాస్కర్ నగరానికి వలసవచ్చి అంబర్పేట్, బాపూజీ నగర్లో నివాసం ఉంటూ కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడి కుమారుడు పవన్(26) డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి అతను తన స్నేహితుడు రిషికేష్తో కలిసి రామంతాపూర్లోని గుడ్ డే బార్కు వెళ్లాడు. మద్యం సేవిస్తుండగా పక్క టేబుల్లో కూర్చున్న అంబర్పేట, పటేల్ నగర్ ప్రాంతానికి చెందిన శ్రావణ్ కుమార్ గౌడ్ హరికృష్ణ అనే వ్యక్తితో గొడవ పడి అతడిపై బీరు సీసాతో దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న పవన్ కుమార్ దీనిని అడ్డుకునేందుకు యత్నించడంతో శ్రావణ్ కుమార్ బీరు సీసాతో పవన్ తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందడంతో ఉప్పల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పవన్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. దాదాపు అరగంట పాటు బార్లో గొడవ జరుగుతున్నా నిర్వాహకులు అడ్డుకోకపోవడమేగాక, పోలీసులకు సమాచారం అందించనందునే తన కుమారుడు మృతి చెందాడని మృతుడి తండ్రి భాస్కర్ ఆరోపిస్తున్నాడు. బార్ నిర్వాహకులతో పాటు తన కుమారుడిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బార్లో యువకుల వీరంగం బీరు సీసాలతో దాడి అడ్డుకునేందుకు వెళ్లిన యువకుడి మృతి -
నక్సలిజం ఒక సిద్ధాంతం
ఘనంగా తిరంగాఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. దేశరక్షణకు ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు అంజలి ఘటిస్తూ ఆమనగల్లు పట్టణంలో సోమవారం తిరంగా ర్యాలీ చేపట్టారు. – ఆమనగల్లు చేవెళ్ల: నక్సల్ ఫ్రీ ఇండియా అనేది ఔట్డేటెడ్ మాట అని కేంద్ర మంత్రి అనడం సరికాదని.. నక్సల్స్తో శాంతి చర్చలు జరపడమే పరిష్కారమార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. పట్టణంలోని సత్యసాయి పాఠశాల ఆవరణలో సోమవారం ఆయన సీపీఐ జనసేవాదళ్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీపీఐ వందేళ్ల పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా 50 వేల మంది జన సేవాదళ్ కార్యకర్తలను సిద్ధం చేయాలనే లక్ష్యంతో పార్టీ ముందుకెళ్తోందని తెలిపారు. పేదల ఉద్యమాన్ని, పార్టీని రక్షించుకునేందుకు వీరు సైనికుల్లా పనిచేస్తారన్నారు. నక్సలిజం అనేది ఒక సిద్ధాంతమని.. ఎంతమందిని చంపినా అంతకు మించి పుట్టుకొస్తారని తెలిపారు. దీన్ని తీవ్రవాద సమస్యగా పరిగణించకూడదని సూచించారు. టెర్రరిస్టులు, పాకిస్తాన్ వంటి విదేశీయులతో శాంతిచర్చలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం నక్సల్స్తో శాంతి చర్చలకు ముందుకు రాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ తుపాకీ, నక్సల్ తుపాకీ వల్ల సమస్యలు పరిష్కారం కావని, వెంటనే అడవుల్లో సీజ్ ఫైర్(కాల్పుల విరమణ) ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు హేమంతరావు, జనసేవ రాష్ట్ర కన్వీనర్ రమేశ్, రాష్ట్ర నాయకులు మోహన్, అనిల్కుమార్, శంకర్, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు నర్సింగ్రావు, రాష్ట్ర సమితి సభ్యులు పి.పర్వతాలు, కె.రామస్వామి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభులింగం, సత్యనారాయణ, నాయకులు సత్తిరెడ్డి, చందు, బాతరాజు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. తీవ్రవాద సమస్యగా పరిగణించొద్దు కేంద్రం వెంటనే కాల్పుల విరమణప్రకటించాలి జన సేవాదళ్ శిక్షణ శిబిరంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మణికొండ: గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట ఎగ్జిట్ వద్ద సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. కోకాపేట సెక్టార్ ఎస్ఐ మురళీధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోకాపేట ఎగ్జిట్ వద్ద ఓ వ్యక్తి రోడ్డుపై గాయాలతో పడి ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అతడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లు గుర్తించారు. అతని వివరాలు తెలియకపోవటంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
● పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్య షాద్నగర్: శవాల అప్పగింత పై హైకోర్టు ఉత్తర్వు లు జారీ చేసినా.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్య దర్శి తిరుమలయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని దేవీ గ్రాండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వేములనర్వకు చెందిన విజయలక్ష్మి అలియాస్ భూమిక మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఛత్తీస్గఢ్ పోలీసులు అంబులెన్స్లను సీజ్ చేస్తామని డ్రైవర్లను బెదిరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో టీపీఎఫ్ నాయకులు అర్జునప్ప, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రవీంద్రనాథ్, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ ప్రభాకర్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్ నాయక్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా భూమిక మృతదేహాన్ని పోలీసులే ఖననం చేసినట్లు సాయంత్రం విషయం తెలిసింది. -
పేరుకే పార్కు!
ఎక్కడికక్కడపేరుకుపోయిన సమస్యలు ● ఆహ్లాదం పంచని అర్బన్ ఫారెస్టులు ● కరువైన కనీస మౌలిక సదుపాయాలు ● ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని అభివృద్ధి పనులు ● సందర్శకుల ఆదరణకు నోచుకోని ఉద్యానాలు పట్టణ ఉద్యానాలు ఇలా.. సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎటూ చూసినా ఎత్తయిన భవనాలు.. ఇరుకై న రోడ్లు.. అంతా కాంక్రీట్ మయం. వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. వాహనాల రద్దీకి తోడు విపరీతమైన కాలుష్యం.. వెరసీ.. జనం స్వచ్ఛమైన గాలికి దూరమైన పరిస్థితి. ఈ విపత్కర స్థితి నుంచి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏటా కోటి మొక్కల చొప్పున నాటుతూ వస్తున్నారు. నగర వాసులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పంచేందుకు ఔటర్ చుట్టూ ఉన్న ఫారెస్టులను అర్బన్ ఫారెస్టులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 21 వేల ఎకరాల విస్తీర్ణంలో 26 పట్టణ ఉద్యానాలను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించి, ఆ మేరకు అటవీశాఖ, హెచ్ఎండీఏలకు బాధ్యతలను అప్పగించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంతో సందర్శకుల ఆదరణకు నోచుకోలేకపోతున్నాయి. ఎటుచూసినా అర్బన్ ఫారెస్టులు ఎవరూ లేక వెలవెలబోతున్నాయి. గుర్రంగూడలోని సంజీవని, గండిపేట లేక్వ్యూ, కొత్వాల్గూడ ఎకో పార్కు మినహా మిగిలిన చోట్ల ఇప్పటికీ గేట్లు కూడా తెరుచుకోవడంలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పనులు అసంపూర్తిగానే.. ● కందుకూరు మండలం లేమూరులో 58.78 హెక్టార్లలో మన్యంకంచె పార్కు అభివృద్ధి కోసం రూ.24.9 కోట్ల అంచనాలు రూపొందించారు. ఇప్పటికీ లెవలింగ్ సహా ప్రహరీ, ప్రధాన గేటు పనులు పూర్తికాలేదు. బెంగళూరు జాతీయ రహదారిపై ఓఆర్ఆర్కు 30 కిలోమీటర్ల దూరంలోని షాద్నగర్ మండలం కమ్మదనంలో 32.82 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.65.61 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. తుక్కుగూడ సమీపంలోని సిరిగిరిపురంలో 102.39 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.20.26 కోట్లతో అంచనాలతో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ● అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడెం రెవెన్యూ పరిధిలో 437.25 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.55.80 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అంబర్పేట్ అర్బన్ కలాన్ పార్కు అభివృద్ధి పనులది ఇదే పరిస్థితి. మహేశ్వరం మండలం హర్షగూడ సమీపంలో 87.41 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.25.24 కోట్ల అంచనా వ్యయంతో హెచ్ఎండీఏ ఈ పార్కును అభివృద్ధి చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్–14 (తుక్కుగూడ) నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పార్కుకు చేరుకోవ చ్చు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. మహేశ్వరం మండలం నాగారం వద్ద 556.69 హెక్టార్లలోని అర్బన్ ఫారెస్ట్ పార్కు సహా 526 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.8 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన శ్రీనగర్ పార్కు అసంపూర్తిగానే మిగిలిపోయింది. ప్రాంతం ఉద్యానం పేరు విస్తీర్ణం (ఎకరాల్లో) గుర్రంగూడ సంజీవని పార్కు 464.99 శంషాబాద్ గొల్లూరు 867.00 మహేశ్వరం మసీదుగడ్డ 445.00 చిల్కూరు మృగవని పార్కు 1210.96 శంషాబాద్ పంచవటి 166.00 శంషాబాద్ గండిగూడ 108.03 మహేశ్వరం తుమ్మలూరు 350.16 పెద్ద అంబర్పేట్ పెద్ద అంబర్పేట్ కలాన్ 1080.45 -
థాంక్యూ సర్!
● రంగనాథ్ను కలిసినపీర్జాదిగూడ వాసులు ● శ్మశాన స్థల సమస్య తీర్చినందుకుకృజ్ఞతలు సాక్షి, సిటీబ్యూరో: శ్మశాన స్థలాన్ని కబ్జా కోరల నుంచి విడిపించినందుకు పీర్జాదిగూడ వాసులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయానికివచ్చిన పలువురు రంగనాథ్తో పాటు హైడ్రా అధికారులు హేమ మాలిని, సైదులు, బాచిరెడ్డిలను సత్కరించారు. ఎన్నో ధర్నాలు, ఆందోళనలు చేసినా తమకు న్యాయం జరగలేదని, హైడ్రాకు ఫిర్యాదు చేసిన 24 గంటల్లో పరిష్కారం లభించిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. -
డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్య
మియాపూర్: కుటుంబ సమస్యలతో పాటు ప్రేమ విఫలమై ఓ డ్యాన్స్ మాస్టర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ కై లాసపూరికి చెందిన సాగర్ కుమార్ (17) ఇంటర్ వరకు చదువుకున్నాడు. కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చిన అతను మియాపూర్లోని గ్లోకుల్ ప్లాట్స్ని డెలయిట్ డాన్స్ స్టూడియోలో డ్యాన్స్ మాస్టర్గా పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 25న రాత్రి స్టూడియో మూసివేసిన తర్వాత స్టూడియో యజమాని పరమేష్ అతడికి ఫోన్ చేసి స్టూడియో డోర్లను లాక్ చేయాలని సూచించాడు. సోమవారం మధ్యాహ్నం యజమాని పరమేష్ స్టూడియోకు వెళ్లి చూడగా సాగర్ కుమార్ ఓ గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాగర్ కుమార్ స్టూడియోకు వచ్చినప్పటి నుంచి బాధపడుతూ ఉండేవాడని పది రోజుల క్రితం స్టూడియో యజమాని వంగాల పరమేష్ ఈ విషయమై అతడిని ప్రశ్నించగా కుటుంబ సమస్యలు ఉన్నాయని, ఓ అమ్మాయిని ప్రేమించి విఫలమైనట్లు తెలిపాడన్నారు. స్టూడియో యజమాని పరమేష్ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న తెలిపారు. -
తల్లి మందలించిందని
బాలుడి ఆత్మహత్య సైదాబాద్: చదువుకోకుండా టీవీ, మొబైల్ ఫోన్ చూస్తుండటంతో తల్లి మందలించినందుకు మనస్తాపానికి లోనైన ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఐఎస్సదన్ డివిజన్, రాధే రెసిడెన్సీ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న వెంకటయ్య, సుజాత దంపతులు అదే అపార్ట్మెంట్ సెల్లార్లో ముగ్గురు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి పెద్ద కుమారుడు రిషి (16) ఇటీవల 10 తరగతి ఫెయిల్ అయ్యాడు. తల్లిదండ్రులు అతనికి ధైర్యం చెప్పి సప్లిమెంటరీకి సిద్ధం కావాలని ట్యూషన్లో చేర్పించారు. అయితే గత మూడు రోజులుగా అతను టీవీ చూడటం, మొబైల్ ఫోన్లో ఆటలాడుతుండటంతో తల్లి అతడిని మందలించింది. పరీక్షల కోసం చదువుకోవాలని చెప్పింది. దీంతో మనస్తాపానికి లోనైన రిషి సోమవారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ టెర్రస్కు ఉన్న ఇనుప మెట్లకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడి తల్లి సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సైదాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులను శాఖల వారీగా సమీక్షించాలి
అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను శాఖల వారీగా సమీక్షించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం కలెక్టర్లోని సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె డీఆర్ఓ సంగీతతో కలిసి ఫిర్యా దులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదన పు కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజావాణికి వచ్చిన 56 ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల ఆహ్వానం ఇబ్రహీంపట్నం: చార్మినార్ జోన్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని తెలంగాణ సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో తాత్కాలిక ప్రాతిపదికన విద్యాబోధనకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జోనల్ అధికారి నిర్మల, జిల్లా సమన్వయ అధికారి బి.వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిలుకూరు బాలుర గురుకుల విద్యాలయంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, స్పెషల్ టీచర్లు, హైల్త్ సూపర్వైజర్లు, పీఈటీ, పీడీ, లైబ్రేరియన్ పోస్టులకు ఈనెల 30న, వృక్ష, జంతు శాస్త్రం, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబెక్ట్లకు ఈ నెల 31న ఉదయం 10 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ.. అనంతరం డెమో ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో హాజరు కావాలన్నారు. బాలికల విద్యాలయాల్లో మహిళలు మాత్రమే అర్హులన్నారు. జూనియర్ లెక్చరర్కు నెలకు రూ.23,400, పీజీటీ, టీజీటీ ఉపాధ్యాయులకు రూ.18,200 వేతనం చెల్లిస్తారని వివరించారు. మహేశ్వరం ఏసీపీగా జానకీ రెడ్డి పహాడీషరీఫ్: మహేశ్వరం డివిజన్ ఏసీపీగా ఎస్.జానకీ రెడ్డి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేసిన లక్ష్మీకాంత రెడ్డి బదిలీ కావడంతో ఆయన స్థానంలో, హెచ్ఎండీఏలో డీఎస్పీగా ఉన్న 1998 బ్యాచ్కు చెందిన జానకీ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. డివిజన్ పరిధి లోని కందుకూరు, మహేశ్వరం, పహాడీషరీఫ్, బాలాపూర్ ఠాణాల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ఫిర్యాదుదారులు ఠాణాలకు వచ్చి ఫిర్యాదు చేసేలా ప్రశాంత వాతావరణం కల్పిస్తామన్నారు. 31న మందకృష్ణకు స్వాగతోత్సవం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ షాద్నగర్: పద్మశ్రీ అవార్డు అందుకున్న మందకృష్ణ మాదిగ ఈ నెల 31న వరంగల్ రానున్న నేపథ్యంలో స్వాగతోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ తెలిపారు. సోమవారం పట్టణంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాగతోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వరంగల్ తరలిరాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు నాగభూషణం, బాలరాజు, శ్రావణ్కుమార్, ప్రవీణ్, లింగం, వెంకటేష్, దశరథ తదితరులు పాల్గొన్నారు. జూన్ 6న ఖైరతాబాద్ మహాగణపతి కర్ర పూజ ఖైరతాబాద్: ప్రతి యేటా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులను జూన్ 6న నిర్జల ఏకాదశి రోజు కర్రపూజ నిర్వహించి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
సీసీ కెమెరాలు పట్టించాయి
● రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యక్తి అరెస్ట్ ● తానే కారు నడిపినట్లు పోలీస్ స్టేషన్కు వచ్చిన మరో వ్యక్తి ● సీసీ ఫుటేజీతో నిజం వెలుగులోకి.. బంజారాహిల్స్: మద్యం మత్తులో కారు నడుపుతూ ప్రమాదానికి కారకుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... అంబర్పేట డీడీకాలనీకి చెందిన శిరీష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి కోకాపేటలోని స్నేహితుడితో కలిసి విందుకు హాజరైన అతను మద్యం సేవించాడు. ఆదివారం తెల్లవారుజామున కోకాపేట నుంచి ఇంటికి వెళుతుండగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45లోని సినీ హీరో బాలకృష్ణ ఇంటి వద్ద మలుపు తిప్పే క్రమంలో మద్యం మత్తులో డివైడర్ను ఢీకొట్టాడు. బెలూన్లు ఓపెన్ కావడంతో కారు నడుపుతున్న శిరీష్ క్షేమంగా బయటపడ్డాడు. అయితే పోలీసులు కేసు పెడతారనే భయంతో కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. నెంబర్ ప్లేట్ ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కారు వివరాలను ఆరా తీయగా డి.కృష్ణశాస్త్రి అనే పేరుతో ఉన్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా పరారీలో ఉన్న కారు నడిపిన వ్యక్తి కోసం గాలిస్తుండగా సోమవారం ఉదయం ఓ వ్యక్తి పోలీస్స్టేషన్కు వచ్చి కారు తానే నడిపినట్లు చెప్పాడు. అయితే అప్పటికే సీసీ కెమెరాలను పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రమాదానికి కారకుడైన కారు నడుపుతున్న వ్యక్తికి, పోలీస్స్టేషన్కు వచ్చి లొంగిపోయిన వ్యక్తికి తేడా ఉండటంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు నిందితుడు బయటపడ్డాడు. కారు నడుపుతున్న వ్యక్తిని గాలించి అరెస్టు చేసి స్టేషన్కు తీసుకువచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా ఒక రోజు గడిచిన తర్వాత కూడా మద్యం సేవించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ మేరకు శిరీష్తో పాటు కారు తానే నడిపానంటూ అబద్దం ఆడిన వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. తాను మద్యం సేవించి తెల్లవారుజామున ఇంటికి బయలుదేరానని అంగీకరించిన శిరీష్ అరెస్టు చేస్తారనే భయంతో తన స్థానంలో మరొకరిని పోలీస్స్టేషన్కు పంపినట్లు తెలిపాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అసలు నిందితుడిని గుర్తించి అరెస్టు చేయగలిగారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
నిబంధనల సాకుతో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని.. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మార్కెట్ యార్డుకు చేరుకుని ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలసుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి మార్కెట్ యార్డు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని లేదంటే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాంపాల్నాయక్, మాజీ వైస్ చైర్మన్ దుర్గయ్య, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు విక్రంరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పద్మ అనిల్, లక్ష్మణ్, భగీరథ్, మహేశ్, శ్రీధర్, చెన్నకేశవులు, పెద్దయ్యయాదవ్, రెడ్యానాయక్, కుమార్, ప్రభాకర్, అమర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేయండి
● హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై రైతుల ధర్నా ● సంఘీభావంగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు ● పోలీసుల అత్యుత్సాహంతో ఓ రైతుకు అస్వస్థత ఆమనగల్లు: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళన కారులను పోలీసులు బలవంతంగా స్టేషన్కు తరలించారు. పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు వరి ధాన్యం విక్రయానికి తీసుకువచ్చారు. తేమ ఉండడంతో ధాన్యం కొనుగోలు చేయలేదు. దీంతో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి పలువురు రైతుల ధాన్యం తడిసింది. దీంతో వారు సోమవారం తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలు సుకున్న ఆమగనల్లు సీఐ జానకిరాంరెడ్డి, ఎస్ఐలు వెంకటేశ్, సీతారాంరెడ్డి సిబ్బంది ఆందోళన విరమించాలని రైతులకు నచ్చజెప్పినా వినలేదు. ఆందోళనకారులను పక్కకు తొలగించిన పోలీసులకు బీఆర్ఎస్ నాయకులను స్టేషన్కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్ స్టేషన్ ఆవరణలోనే నిరసనదీక్ష చేపట్టాడు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, కడ్తాల్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్నాయక్, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, కడ్తాల, ఆమనగల్లు బీఆర్ఎస్ అధ్యక్షులు పరహేశ్, అర్జున్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి స్టేషన్కు చేరుకున్నారు. పత్యానాయక్ దీక్ష విరమింపజేసిన జైపాల్యాదవ్ మార్కెట్ యార్డుకు చేరుకుని రైతులతో మాట్లాడు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల అత్యుత్సాహం జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ రైతు ను ఆమనగల్లు సీఐ జానకిరాంరెడ్డి, పోలీసులు బలవంతంగా లేపి పక్కన పడేయడంతో ఆ రైతు అస్వస్థతకు గురికావడంతో ఒకింత ఉద్రిక్తత నెలకొంది. పలువురు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. -
తిరంగా ర్యాలీని విజయవంతం చేయండి
షాద్నగర్రూరల్: ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన సందర్భంగా ఈ నెల 28న పట్టణంలో నిర్వహించనున్న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్లో నిర్వహించిన సమామేశానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్రెడ్డి, అందె బాబయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. పహల్గాం దాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్తో ఉగ్రావాద శిబిరాలను మట్టుబెట్టి మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిందన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా బుధవారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి శివాజీ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ర్యాలీకి పట్టణ ప్రజలు పె ద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరా రు.ఈ సమావేశంలో నాయకులు వెంకటేష్ గుప్తా, అశోక్, వంశీకృష్ణ, మురళి, శ్రీనివాస్, హరిభూషణ్, సురేశ్, రాధిక, రాజు, రణధీర్, లక్ష్మీకాంత్రెడ్డి, మ హేందర్రెడ్డి,నర్సింహ,కుర్మయ్య,రఘురాం,శంకర్ ,నర్సింలు, మహేశ్, గణేశ్, హన్మంతు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీవర్ధన్రెడ్డి -
భూమికగా ఎలా మారిందంటే..?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు విజయలక్ష్మి (36) అలియాస్ భూమిక మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, బంధువులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఎన్కౌంటర్లో నంబాల కేశవరావుతో పాటు కేశంపేట మండలం వేములనర్వకు చెందిన విజయలక్ష్మి కూడా చనిపోయింది. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం రాత్రి షాద్నగర్ నుంచి బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ నారాయణపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. పోస్టుమార్టం తర్వాత పలువురి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. విజయలక్ష్మి మృతదేహాన్ని మాత్రం ఇప్పటికీ అప్పగించకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్గఢ్ పోలీసులకు స్థానిక పోలీసుల నుంచి ఆదేశాలు అందకపోవడమే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన భూమిక 12 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లింది. ఓయూ నుంచి అబుజ్మడ్ వరకు వేములనర్వ గ్రామానికి చెందిన వన్నాడ సాయిలు, రాధమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. ముగ్గురూ ఆడపిల్లలే. మూడో సంతానమైన విజయలక్ష్మి పుట్టిన ఏడాదికే తల్లి పాముకాటుతో చనిపోయింది. ఇంటరీ్మడియెట్ వరకు కేశంపేటలోనే చదువుకుంది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. మహబూబ్నగర్ ఎన్టీఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత 2009–10లో ఓయూ పీజీ కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్లో చేరింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. పలు మార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇదే సమయంలో పోలవరం ముంపు గ్రామాలను సందర్శించి, ఆదివాసీల కష్టాలను చూసి చలించిపోయింది. ఈ ఘటన ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది. 2013–14 మధ్య కాలంలో విజయలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లింది. మావోయిస్టు పారీ్టలో చేరిన మొదటి రోజు విషయాలను ‘వసంత మేఘం’ అనే వెబ్సైట్లో ‘కొత్త బంగారులోకం’ అనే శీర్షికతో ఓ కథను కూడా రాసింది. తానెందుకు గెరిల్లాగా మారాననే అంశాలతో పాటు ఓయూ కేంద్రంగా కొనసాగిన తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంది. 12 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పని చేసి, చివరికి ప్రధాన కార్యదర్శి నంబాల రక్షణ బృందంలో పని చేస్తూ మరణించింది. భూమికగా ఎలా మారిందంటే..? విజయలక్ష్మి కేశంపేటలో ఇంటరీ్మడియెట్ (2001–2003) పూర్తి చేసింది. అదే సమయంలో ‘ఒక్కడు’ సినిమా విడుదలైంది. ఆ సినిమాలోని హీరోయిన్ భూమిక పోలికలు కలిగి ఉండటంతో స్నేహితులంతా ఆమెను భూమికతో పోల్చుతూ అదే పేరుతో పిలిచేవారు. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత కూడా అదే పేరుతో కొనసాగినట్లు సమాచారం. చిన్నప్పటి నుంచి ఆమెకు సంగీతం, వ్యాసరచన అంటే ఇష్టం. ఇతరులకు సాయపడాలనే తపన బలంగా ఉండేది. ఇదే భావన మావోయిస్టు పార్టీ వైపు మళ్లించింది. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత ఆమె ఎప్పడూ ఇంటి ముఖం చూడలేదు. ఇప్పటికీ ఛత్తీస్గÉŠ ఆస్పత్రిలోనే విజయలక్ష్మి మృతదేహం అక్కడికి చేరుకుని పడిగాపులు కాస్తున్న కుటుంబీకులు -
నూతన కమిటీ నియామకం
మంచాల: ముస్లిం మైనార్టీ కమిటీ ఆరుట్ల గ్రామం నూతన అధ్యక్షుడిగా మండల మాజీ కో ఆష్షన్ సభ్యుడు ఎండీ యూసుఫ్ అలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం గ్రామంలోని నూర్ మసీద్లో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడిగా యూసుఫ్, గౌరవ అధ్యక్షులుగా జానీపాష, సలాంబాయ్, ప్రధాన కార్యదర్శిగా బాబు మీయా, ఉపాధ్యక్షులుగా ఇస్మాయిల్, ఫయాస్, ఆసీఫ్ ఖాన్, ప్రధాన సలహాదారులు జిలానీ బాయ్, అక్బర్ బాయ్, సోషల్ మీడియా కార్యదర్శులుగా ఖాజా, హఫేజ్, కోశాధికారిగా జహంగీర్, మరో 11 మందిని సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. వైభవంగా బీరప్ప పండుగ యాచారం: మండల పరిధి మల్కీజ్గూడ గ్రామంలో ఆదివారం శ్రీబీరప్పస్వామి, కమరావతి దేవీల పండుగ ఘనంగా జరిగింది. కుర్మ సంఘం ఆధ్వర్యంలో భక్తులు నెత్తిన బోనంతో పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా వెళ్లి, స్వామివారికి నైవేద్యం సర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటిరమేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాష, గ్రామస్తులు వెంకట్రెడ్డి, శంకర్, మల్లేశ్, బోడ అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంపీ పరామర్శ ఆమనగల్లు: మండల పరిధి ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన వల్లపుదాసు బాలకిష్టయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి.. ఆదివారం బాధితున్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కేశవులు, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్ తదితరులు ఉన్నారు. మురుగు నిలిచి.. దుర్గంధం వ్యాపించి కేశంపేట: మండల పరిధిలోని బైర్కాన్పల్లి గ్రామ శివారులోని తెట్టేకుంటతండాలో మురుగునీరు ఇళ్ల మధ్యలో చేరి దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మురుగు నిలిచే ప్రదేశంలోనే గ్రామ పంచాయతీకి సంబంధించిన బోర్ కూడా ఉంది. వ్యర్థ జలాలు బోర్లోకి వెళ్లే ప్రమాదం ఉందని, ఆ నీటినే తాగుతున్నామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇళ్ల మధ్యలోనే మురుగునీరు నిలవడంతో దుర్గంధంతో పాటు దోమబెడద పెరుగుతోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి మురుగునీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు. ‘సైనికులను అవమానించడం బాధాకరం’ మొయినాబాద్రూరల్: సైనికులను అవమానించడం బాధాకరమని బీజేపీ ఓబీసీ సెల్ జిల్లా కన్వీనర్ ఎలగని వెంకటేశ్గౌడ్ అన్నారు. ఆదివారం హిమాయత్నగర్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. భారత సైనికులను అవమానపరిచేలా.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఇతర నాయకులు హేళన చేస్తూ మాట్లాడడం బాధాకరమన్నారు. దేశాన్ని రక్షించుకునేందుకుపార్టీలు ముఖ్యం కాదని, ఐకమత్యంగా ఉన్నప్పుడే సైనికుల్లో ధైర్యం నింపగలుగుతామన్నారు. ఇకనైనా దేశ రక్షణలో ఉన్న వారిపై ఎవరు విమర్శలు చేయొద్దని కోరారు. -
‘ఉపాధి’ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
మాడ్గుల: ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి కందుకూరి జగన్లు ఆరోపించారు. అదివారం మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి మహాధర్నా కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వ్యవసాయానికి వ్యతిరేకంగా కేంద్రం మూడు నల్ల చట్టాలు తెచ్చిందని, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తుందని విమర్శించారు. ఉపాధి కూలీలకు రూ.307లు చెల్లించాలని చట్టం చేసిందని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా రూ.200 మాత్రమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ప్రతి కూలీకి రూ.350లు తప్పని సరిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. కొలతలతో సంబంధం లేకుండా రూ.700 వేతనం ఇవ్వాలని కోరారు. పని ప్రదేశంలో కూలీలకు సౌకర్యాలు అందడం లేదని, తాగునీరు,ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పనిముట్లు, మెడికల్ కిట్లువంటి సౌకర్యాల కల్పన తదితర డిమాండ్ల కోసం ఈ నెల 30న చేపట్టే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ సంఘం కార్యదర్శి పాషా, నాయకులు బుచ్చయ్య, సంధ్య, వెంకటమ్మ, కృష్ణమ్మ,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మహాధర్నాను జయప్రదం చేయండి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య -
మోక్షం కల్పించి.. వదిలేసి
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనిచందంగా మారింది వ్యవసాయ మార్కెట్లో నిర్మించిన మడిగెల పరిస్థితి. రూ.1.20 కోట్లువెచ్చించి మొదలు పెట్టిన దుకాణ సముదాయ నిర్మాణ పనులను.. తొలుత అసంపూర్తిగా వదిలేశారు. ఆ తరువాత మోక్షం కల్పించారు. అనంతరం యాక్షన్ వేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇబ్రహీంపట్నం: స్థానిక మార్కెట్ యార్డు ఖాళీ స్థలంలో 2022 సంవత్సరంలో మార్కెటింగ్ శాఖ రూ.1.20 కోట్లతో 17 మడిగెల నిర్మాణ పనులు చేపట్టింది. ఇంజినీరింగ్, విద్యుత్ అధికారుల అలసత్వం కారణంగా.. చివరి దశ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. పనుల ఆటంకం నేపథ్యంలో గతేడాది ‘సాక్షి’లో ‘మడిగెలకు మోక్షమెప్పుడో’ అనే శీర్షికన ప్రచురించిన కథనానికి.. స్పందించిన అధికారులు.. వడివడిగా మిగతా నిర్మాణ పనులను పూర్తి చేశారు. పూర్తి చేసి ఆరు నెలలు అయినా.. వాటిని ప్రారంభించి, ఓపెన్ టెండర్లను పిలిచేందుకు మార్కెట్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రారంభిస్తే.. ఏటా రూ.40 లక్షల ఆదాయం! ఇబ్రహీంపట్నం– నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై బస్టాండ్ సమీపంలోని మార్కెట్ స్థలంలో నిర్మించిన మడిగెలకు మంచి డిమాండ్ ఉంది. ఓపెన్ యాక్షన్ పెడితే ఒక్కో మడిగ రూ.20 వేలకు పైగానే పలికే అవకాశం ఉంది. దాంతో ప్రతి నెల రూ.3.50 లక్షల నుంచి 4 లక్షలు, ఏడాదికి సుమారు రూ.35 నుంచి 40 లక్షల వరకు అదనంగా మార్కెట్కు ఆదాయం సమకూరేది. ఇలా కాసులు కురిపించే దుకాణ సముదాయాన్ని త్వరగా ప్రారంభించాలన్న ఆలోచనను సంబంధిత అధికారులు విస్మరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మడిగెలకు ఓపెన్ యాక్షన్ ఎప్పుడేప్పుడాని చిన్న, పెద్ద వ్యాపారులు ఎదురుచూస్తున్నారు. వాటిల్లో ఏ వ్యాపారం చేసినా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఆశగా ఉన్నారు. గతంలో ఈ మార్కెట్ యార్డులో నిర్మించిన 53 మడిగెలకు ఆ కాలంలో నిర్వహించిన ఓపెన్ యాక్షన్లో ప్రతినెల అద్దె రూపంలో రూ.5 లక్షల ఆదాయం వస్తోంది. ఇప్పుడు పెరిగిన కిరాయి ప్రకారం కొత్త మడిగెలకు ఓపెన్ టెండర్లలో భారిగానే ఆదాయం రానుంది. ఎమ్మెల్యే గారు.. దృష్టిపెట్టండి మడిగెలను ప్రారంభించి, టెండర్లు పిలిచే అంశంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతి నెల అద్దె రూపంలో వచ్చే ఆదాయంతో వ్యవసాయ మార్కెట్ మరింత అభివృద్ధి చెందుతుందని, సంబంధిత అధికారులతో మాట్లాడి, త్వరితగతిన ప్రక్రియ పూర్తి అయ్యేలా చూడాలని సూచిస్తున్నారు. నిరపయోగంగాదుకాణ సముదాయం ఆదాయం కోల్పోతున్న వ్యవసాయ మార్కెట్ ఓపెన్ యాక్షన్ విస్మరించిన అధికార యంత్రాంగం మడిగెల కోసం ఎదురు చూస్తున్న వ్యాపారులు ఓపెన్ యాక్షన్కు సిద్ధం మడిగెల నిర్మాణం పూర్తి అయింది. ఓపెన్ యాక్షన్కు సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శాఖ నుంచి ఆదేశాలు రాగానే టెండర్ ప్రక్రియ పూర్తిచేస్తాం. వచ్చే నెలలో సముదాయం ప్రారంభం అవుతుంది. – సంతోష్కుమార్, కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్, ఇబ్రహీంపట్నం -
తొలి తెలుగు కవయిత్రి మొల్ల
ఆమనగల్లు: తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ అని, ఆమె రచించిన రామాయణం సామాన్య ప్రజలకు అర్థమయ్యేరీతిలో ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొల్లమాంబ విగ్రహాన్ని ఆదివారం ఆ సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారిలు ఆవిష్కరించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వాల్మీకి రాసిన సంస్కృత రామాయణాన్ని.. మొల్లమాంబ తెలుగులోకి సరళమైన భాషలో అనువదించారని పేర్కొన్నారు. దీంతో శ్రీ కృష్ణ దేవరాయలు మొల్లకు కవిరత్న బిరుదు ఇచ్చారని గుర్తు చేశారు. కుమ్మరి కుటుంబంలో పుట్టిన గొప్ప కవయిత్రి మొల్ల అని కొనియాడారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్రావ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయానంద్, రాష్ట్ర కోశాధికారి రాజలింగం, నాయకులు తిరుమలవెంకటేశం, వీరేశం, సాయిలు, గోవర్ధన్, నరేశ్, దుర్గాపురం నగేశ్, వెంకటేశ్, మల్లేశ్, బాలయ్య, గణేశ్, మోహన్కుమార్, సుధాకర్, వీరయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మొల్లమాంబ విగ్రహావిష్కరణ -
తెరపైకి పల్లె పోరు
ఆ పంచాయతీల్లో ఎన్నికలు మండలంలోని 14 పంచాయతీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 18 గ్రామాలకు 4 పంచాయతీలను (తారమతిపేట, బాచారం, గౌరెల్లి, కుత్భుల్లాపూర్) పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలో విలీనం చేశారు. మిగతా 14 గ్రామాల్లోని కొన్నింటిని కలిపి నగర పంచాయతీగా మార్పు చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ.. మూడు మాసాల క్రితం ఎంపీటీసీ స్థానాల కోసం అధికారులు డ్రాప్ట్ నోటిఫికేషన్ వెల్లడించడంతో ఈ సారి 14 గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని జిల్లా స్థాయి అధికారి ఒకరు పేర్కొన్నారు.అబ్దుల్లాపూర్మెట్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున వస్తున్న ప్రకటనలతో పంచాయతీ పోరు తెరపైకి వస్తోంది. దీంతో పల్లెల్లో కొంతకాలంగా స్తబ్దుగా రాజకీయం.. వేడేక్కుతోంది. రాజకీయ నేతలు, ఆశావహుల్లో ఆరాటం మొదలయింది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా.. ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లాలా అని ఉవ్విళ్లూరుతున్నారు. ముందు జెడ్పీనా.. పంచాయతా? గత పాలకవర్గాల గడువు ముగిసి ఏడాదిన్నర కాలం గడిచింది. నాటి నుంచి ఇదిగో ఎన్నికలు అంటూ.. ప్రభుత్వం పలుమార్లు సంకేతాలు ఇచ్చినా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ప్రత్యేక అధికారుల పాలనతో పంచాయతీల పాలనను నెట్టుకోస్తోంది. తాజాగా వినిపిస్తున్న ప్రభుత్వ ప్రకటనలు, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్ధమేనని ఎన్నికల సంఘం చెబుతున్న మాటలతో నేతల్లో హడావుడి మొదలయింది. పోటీ చేసే అభ్యర్థుల కోసం సర్పంచ్, వార్డు సభ్యుల వారీగా గుర్తులను ఎంపిక చేయడంతో పాటు ఎంపీటీసీ స్థానాలకు డ్రాప్ట్ నోటిఫికేషన్ను కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో స్థానిక ఎన్నికల సమయం ఆసన్నమైందనే భావన ప్రస్తుతం నెలకొంది. దీంతో పీసీసీ నేతలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ శ్రేణులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ పోరు గురించి చర్చిస్తున్నారు. కాగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ముందు నిర్వహిస్తారా? పంచాయతీ ఎన్నికలు ముందు నిర్వహిస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎదురుచూపులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నేతలు తమ గ్రామంలో ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గ్రామ జనాభా ప్రకారం ఆ ఊరిలో వచ్చే రిజర్వేషన్ ఏది ఉండవచ్చు అనే సందేహాలను తీర్చుకునేందుకు ఆశావహులు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండంలోని 18 గ్రామాల్లో.. నాలుగింటిని సమీప పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలో విలీనం చేయడంతో ఆ గ్రామాల్లోని రెండు పంచాయతీల్లో గతంలో ఎస్సీ రిజర్వు ఉంది. అయితే ఆ రెండు ఎస్సీ స్థానాలను ప్రస్తుతం మిగిలిన 14 పంచాయతీల్లోని ఏ గ్రామంలో రిజర్వు చేస్తారనే సందేహంలో నేతలు ఉన్నారు. అటు రిజర్వేషన్లు ఫైనల్ కాక, మరో వైపు రిజర్వేషన్ల కోసం.. ఇంకో వైపు ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తుందోనని నేతలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనలతో నేతల్లో చిగురిస్తున్న ఆశలు పార్టీ శ్రేణులతో విస్తృత సమావేశాలు ఆశావహుల సందడి.. రిజర్వేషన్లు, నోటిఫికేషన్ కోసం ఆరా -
అర్జీలు 1600.. అర్హులు 60
కడ్తాల్: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో నిరుపేదలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కడ్తాల్ మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ, మైనార్టీ నాయకులు లాయక్అలీతో కలిసి ఆయన మాట్లాడారు. కడ్తాల్ గ్రామంలో సుమారు 1600 మంది ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా.. 60 మందిని మాత్రమే అర్హులుగా పేర్కొంటూ లబ్ధి చేకూర్చారని పేర్కొన్నారు. తిరస్కరణకు గురైన వారి వివరాలు, మిగతా వారు ఎంపిక కాకపోవడానికి కారణాలేమిటో పంచాయతీ కార్యాలయంలో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు, ఇందిరమ్మ పేరుతో మరో కొత్త నాటాకానికి తెరలేపారని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలులో సర్కారు పూర్తిగా విఫలమైందని, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అట్టడుగు స్థాయికి తెలంగాణ దిగజారిపోయిందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాంచంద్రయ్య, ఇర్షాద్, వెంకటేశ్, నాగార్జున్, మహేశ్, కృష్ణ, మహేశ్, భాస్కర్, మహేశ్ నాయక్ ఉన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలం మాజీ ప్రజాప్రతినిధులు -
లారీ ఢీకొని హెడ్కానిస్టేబుల్ దుర్మరణం
శంషాబాద్ రూరల్: రహదారిపై ఆగి ఉన్న వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తుండగా.. మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ హెడ్ కానిస్టేబుల్ను బలిగొంది. మండలంలోని పెద్దషాపూర్ సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు జాతీయ రహదారిపై షాద్నగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న లారీ పెద్దషాపూర్ శివారులో రోడ్డు కిందికి దూసుకెళ్లడంతో రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సమాచారం అందుకున్న హైవే ప్యాట్రోలింగ్ సిబ్బంది యాదయ్య, శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో శంషాబాద్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందడంతో హెడ్ కానిస్టేబుళ్లు డి.విజయ్కుమార్, డి.చెన్నయ్య కూడా అక్కడికి వెళ్లారు. రోడ్డు కిందకు వెళ్లిన లారీ డ్రైవర్తో మాట్లాడి.. ట్రాఫిక్కు నియంత్రిస్తున్నారు. అదే సమయంలో షాద్నగర్ వైపు నుంచి శంషాబాద్ వస్తున్న లారీ అతి వేగంగా రెండు పెట్రోల్ మొబైల్ వాహనాలను ఽఢీకొడుతూ.. అక్కడే నిలబడి ఉన్న పోలీసులను ఢీకొట్టింది. ఈ ఘటనలో హెడ్కానిస్టేబుల్ విజయ్కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హైవే ప్యాట్రోల్ మొబైల్ సిబ్బంది యాదయ్య, శ్రీనివాస్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తాగిన మత్తులో లారీని అతి వేగంగా నడుపుతూ ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ రమేష్ కాంబ్లెను అదుపులోకి తీసుకున్నారు. విజయ్కుమార్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెలరోజుల క్రితమే ప్రమోషన్.. ఏడాది క్రితమే శంషాబాద్ పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చిన విజయ్కుమార్కు నెల కిందట హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ వచ్చింది. అతడి మృతితో పోలీస్స్టేషన్లో విషాదచాయలు అలముకున్నాయి. రహదారిపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తుండగా ప్రమాదం పెద్దషాపూర్ శివారులో జాతీయ రహదారిపై ఘటన కన్నీటి నివాళి షాబాద్: శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దాదె విజయ్కుమార్(40) మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మండలంలోని కుర్వగూడలో పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్, ఏసీపీ శ్రీకాంత్గౌడ్, సీఐలు నరేందర్రెడ్డి, కాంతారెడ్డి, శంషాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, విజయ్కుమార్ 2006 బ్యాచ్మెంట్స్ అంత్యక్రియలో పాల్గొని కన్నీటి నివాళులర్పించారు. హెడ్ కానిస్టేబుల్ విజయ్కుమార్కు భార్య స్వాతి, ఇద్దరు కుమారులు అశ్వద్, అరిహంత్, తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, మండల ప్రజలు పెద్ద ఎత్తున్న తరలివచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
పాదచారుడిని ఢీకొట్టిన కారు
ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఓ పాదచారుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతడి కాలు విరిగిపోయింది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీ సుల కథనం ప్రకారం.. తుర్కయంజాల్లోని సూర్యనగర్ కాలనీకి చెందిన పున్న ఎల్లయ్య(73) సాగర్ హైవేపై కమాన్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. బీఎన్రెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమకాలుకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు సీఐ రాఘవేందర్రెడ్డి తెలిపారు. మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు ఇబ్రహీంపట్నం రూరల్: మహిళను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న ఓ వ్యక్తిపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజు కథనం ప్రకారం.. తుర్కయంజాల్లో నివాసం ఉండే ఓ మహిళకు ఆరేళ్ల క్రితం ఓ వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. ఆమెకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలున్నారు. ఆర్థిక సమస్యలతో 2022లో సదరు మహిళ బొంగ్లూర్లోని ఈకామ్ ఎక్స్ప్రెస్లో 8 నెలలు సెక్యూరిటీగా పని చేసింది. ఆ సమయంలో సహోద్యోగి ప్రవీణ్తో ఆమెకు స్నేహం ఏర్పడింది. అనంతరం ఆమె ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంది. కానీ ప్రవీణ్ నిత్యం ఫోన్ చేసి మాట్లాడి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆదిబట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఆమె చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణం శంకర్పల్లి: మనోవేదనకు గురైన ఓ వ్యక్తి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం శంకర్పల్లి పరిధిలో చోటుచేసుకుంది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని చిన్న శంకర్పల్లికి చెందిన జోన్నాడ బాలరాజ్(55)కు ఇద్ద రు కుమారులున్నారు. నాలుగేళ్ల క్రితం భార్య చనిపోవడంతో.. తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఆదివారం ఆయన మధ్యాహ్నం హుస్సేన్ సాగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకి ఎదురెళ్లి.. బలవన్మరణానికి పాల్పడ్డా డు. లో కోపైలట్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. లిఫ్టు అడిగి.. మృత్యు ఒడికి స్కూటర్ నుంచి జారిపడి మహిళ మృతి చేవెళ్ల: లిఫ్టు అడిగి స్కూటర్పై వెళ్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందింది. ఈ సంఘటన చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపల్లికి చెందిన మంగళి లక్ష్మి(32) చేవెళ్లలో వివేకానంద పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ఆది వారం ఉదయం ఆమె ఇంటి నుంచి పనికోసం బయలు దేరింది. ఆలస్యం కావడంతో స్కూల్ బస్సు వెళ్లిపోయింది. దీంతో ఆమె బైక్ మీద లిఫ్టుపై వెళ్తోంది. మార్గమధ్యలో చేవెళ్లకు సమీపంలోకి రాగానే స్కూటర్పై నుంచి లక్ష్మి ప్రమాదవశాత్తు జారి పడి తలకు గాయమైంది. వెంటనే స్థానికులు పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు భర్త సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో జింక మృతి కందుకూరు: రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర జంతువు జింక మృతి చెందింది. ఈ సంఘటన శనివారం రాత్రి శ్రీశైలం హైవే రాచులూరు గేట్ సమీపంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద చోటు చేసుకుంది. రాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న గుమ్మడవెల్లి అటవీ శాఖ అధికారి విజయ్భాస్కర్ సిబ్బందితో ఆ జింకను రాచులూరు పశువైద్యశాలకు తరలించారు. కా గా పశువైద్యుడు డాక్టర్ షాహీన్షేక్ ఆ జింకకు పోస్టుమార్టం నిర్వహించి, అట వీ అధికారులకు అప్పగించగా దానికి వారు అంత్యక్రియలు నిర్వహించారు. రెండు ఇళ్లలో చోరీ సనత్నగర్: తాళాలు పగులగొట్టి రెండు ఇళ్లల్లో చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి నగదు, సెల్ఫోన్ ఎత్తుకెళ్లిన సంఘటన బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేగంపేట తాతాచారి కాలనీలో మెండా కిషోర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈ నెల 23న సాయంత్రం బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి నేరుగా మొదటి అంతస్తుకు వెళ్లి నూతన ప్రసాద్ అనే వ్యక్తి ఇంటి తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. ఇంట్లో దొరికిన రూ.2 వేల నగదు అపహరించాడు. అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్కు వచ్చి అద్దెకు ఉండే సాయికిరణ్ ఇంటి తాళాలు పగులగొట్టి రూ.4 వేల నగదుతో పాటు మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు. -
క్రీడలతో మానసికోల్లాసం
పహాడీషరీఫ్: మామిడిపల్లి ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ 7వ సీజన్ విజేతగా ఆర్బీఎం వారియర్స్ జట్టు, రన్నరప్గా రెడ్బుల్స్ జట్లు నిలిచాయి. బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో మొత్తం ఏడు జట్లు మూడునెలల పాటు ఆడాయి. ఈ సందర్భంగా గ్రామ ఆలయాల కమిటీ చైర్మన్ ఎడ్ల వాసుదేవారెడ్డి విజేత జట్టుకు రూ.35వేలు, రన్నరప్ జట్టుకు మాజీ కౌన్సిలర్ ఈరంకి వేణుకుమార్గౌడ్ రూ.25వేల నగదు బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్ నిర్వహణలో మాజీ కార్పొరేటర్ సుక్క శివకుమార్, గ్రామ నాయకులు నిమ్మల నరేందర్గౌడ్, దశరథ, లిక్కి శ్రీనివాస్రెడ్డి, లిక్కి వినయ్ యోగేందర్రెడ్డి సహకారం అందించారు. ఈ సందర్భంగా వాసుదేవారెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా కూడా స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు దిలీప్కుమార్, కోట్ల కృష్ణ, పెరమోని నరేందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీలో షెడ్ల నిర్మాణం
షాబాద్: పాడి రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం పశువుల షెడ్లు నిర్మాణానికి ముందుకు వచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని పశు పోషకుల్లో జాబ్ కార్డు కలిగి ఉన్నవారు పశువుల షెడ్ల నిర్మాణం చేపట్టవచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 8 మంది రైతులు పశువుల షెడ్లు నిర్మించుకున్నారు. గరిష్టంగా పశువుల షెడ్లుకు రూ.85 నుంచి రూ.90 వేల వరకు మంజూరు చేస్తున్నారు. పశువులకు ఎండావానల నుంచి కాపాడుకునేందుకు పాడి రైతుల కు ఇదో చక్కని అవకాశంగా ఉపయోగపడుతుంది. షెడ్లకు బిల్లులు ఇలా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు పశువుల షెడ్ల నిర్మాణం కోసం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. వాస్తవంగా ఐదు నెలల్లో 35 నిర్మించాల్సి ఉన్నప్పటికి 18 మంది రైతులు షెడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చారు. దీని నిర్మాణంలో బేస్మెంట్, లెంటల్, రూఫ్ లెవల్ స్థాయిలు ఉంటాయి. వీటి ఆధారంగా రైతులకు బిల్లులు వస్తాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈజీఎస్ అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శి మొత్తం బిల్లులను లబ్ధిదారులకు అందిస్తారు. కాగా, ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తే బిల్లులు సకాలంలో రావనే ఉద్దేశంతో అనేక మంది రైతులు పశువుల షెడ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. షాబాద్ మండలంలో 90 శాతం మంది అన్నదాతలున్నారు. వారి వద్ద ఎడ్లు, ఆవులు, గేదెలు ఉన్నాయి. వారికి షెడ్లు అవసరమే కానీ ఆర్థిక ఇబ్బందులు వల్ల కూడా అనేక మంది ముందుకు రావడం లేదు. జాబ్కార్డు, తెల్లరేషన్కార్డు ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఉపాధి జాబ్ కార్డుతోపాటు తెల్లరేషన్ కార్డులు కలిగి ఉండాలి. ఐదెకరాల కంటే తక్కువగా ఉన్న చిన్న, సన్నకారు రైతులు అర్హుల. ఆవులు, ఎద్దులు, గేదెలు మూడుకన్నా ఎక్కువగా ఉండాలి. కోళ్లు అయితే 50 కన్నా ఎక్కువగా ఉండాలి. పశువుల షెడ్డు అవసరమని గ్రామ పంచాయతీ నుంచి అనుమతి, పశువులు కలిగి ఉన్నట్లు పశువైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. తెల్లరేషన్ కార్డు, జాబ్కార్డు, పంచాయతీ అనుమతి పత్రం, పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రాలతో ఉపాధి హామీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పాడి రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్న అధికారులు రైతులు వినియోగించుకోవాలి పాడి రైతులకు పశువుల షెడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారికి పశువుల షెడ్లు మంజూరు చేస్తాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. నిర్మాణ దశలను బట్టి బిల్లులు అందజేస్తాం. – వీరాసింగ్, ఏపీఓ, షాబాద్ -
సిటీలోనే ‘సైబర్ హెల్పర్స్’!
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరాది కేంద్రంగా సైబర్ నేరాలు చేసే సూత్రధారులకు సహాయం చేసే పాత్రధారులు సిటీలోనూ ఉన్నారు. బోగస్ వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి ఇవ్వడం ద్వారా సహకరిస్తూ కమీషన్లు తీసుకుంటున్నారు. రూ.8.75 లక్షలతో ముడిపడి ఉన్న ‘వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్’ దర్యాప్తులో ఈ విషయం గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరు అనేక బ్యాంకు ఖాతాలను తెరిచి, వాటి వివరాలను సూత్రధారులకు పంపినట్లు గుర్తించామని డీసీపీ దార కవిత ఆదివారం ప్రకటించారు. నగరానికి చెందిన ఓ మహిళకు ఈ ఏడాది జనవరి 2న టెలిగ్రాం యాప్ ద్వారా ఓ సందేశం వచ్చింది. అక్కర్ అడ్వాంటేజ్ ప్లస్ మార్కెటింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మానవ వనరుల విభాగం నుంచి వచ్చినట్లు అందులో ఉంది. ఈ పేరుతో ఓ నకిలీ వెబ్సైట్ను సృష్టించిన నేరగాళ్లు దాని యూఆర్ఎల్ను బాధితురాలికి పంపారు. తమ సంస్థ తరఫున వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేయాలని కోరారు. ఏ ఇబ్బంది ఉండని ఈ ఉద్యోగం ద్వారా రోజుకు రూ.17 వేల నుంచి రూ.18 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉందని నమ్మించారు. ఆమె అంగీకరించడంతో ఆన్లైన్ హోటల్ బుకింగ్కు సంబంధించిన ఓ టాస్క్ ఇచ్చారు. ఇది పూర్తయిన తర్వాత అసలు కథ మొదలెట్టిన నేరగాళ్లు తమ వద్ద కొన్ని స్కీములు ఉన్నాయని, వాటిలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. తొలుత ఆమెతో రూ.10 వేలు పెట్టుబడి పెట్టించి, మరుసటి రోజే రూ.వెయ్యి లాభం పంచారు. ఆపై రూ.17,800, రూ.45,300 చొప్పున ఇన్వెస్ట్ చేయించారు. యానివర్సరీ స్పెషల్ ఆఫర్గా ‘గోల్డ్ సూట్ బుకింగ్’ విధానం ప్రవేశపెట్టామని, రూ.7.19 లక్షలు పెట్టుబడి పెడితే రూ.15.82 లక్షలు లాభం వస్తుందని చెప్పారు. ఆ మొత్తం పెట్టుబడిగా పెట్టాక నగదు తిరిగి ఇవ్వడానికి సెక్యూరిటీ డిపాజిట్ అంటూ మరికొంత మొత్తం బదిలీ చేయించుకున్నారు. ఇలా మొత్తం రూ.8,75,148 పెట్టుబడి పెట్టించిన కేటుగాళ్లు ఆమెను మోసం చేశారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఏసీపీ ఆర్జీ శివమారుతి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ ఎం.సీతారాములు తమ బృందంతో ఈ కేసు దర్యాప్తు చేశారు. బాధితురాలు నగదు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఈ మొత్తంలో కొంత నగరానికి చెందిన కొన్ని సంస్థల పేర్లతో తయారు చేసిన ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వీటిని ఓపెన్ చేసిన నగరవాసులు మనోజ్ దివాకర్, నాగిరి విజయ్, సనపర్తి కిషోర్ బాబు, రంగారెడ్డి జిల్లాకు చెందిన టి.సంతోష్కుమార్లను అరెస్టు చేశారు. వీళ్లు సైతం టెలిగ్రాం యాప్ ద్వారానే ఆకర్షితులపై ప్రధాన సూత్రధారులతో జట్టుకట్టినట్లు వెలుగులోకి వచ్చింది. తాము ఓపెన్ చేసిన ఖాతాలకు సంబఽంధించిన వివరాలను వారికి పంపినట్లు అంగీకరించారు. ఈ నలుగురినీ అరెస్టు చేసిన పోలీసులు సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. మ్యూల్స్ ఖాతాలు తెరిచి సూత్రధారులకు సహాయం వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ దర్యాప్తులో వెలుగులోకి నలుగురిని అరెస్టు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కందుకూరు: రోడ్డు ప్ర మాదం ఓ యువకుడిని పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటన కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బేగంపేట పంచాయతీ పరిధిలోని గాజులబురుజుతండాకు చెందిన రమావత్ పాడ్య కుమారుడు దేవ్సింగ్(24) శనివారం సాయంత్రం బైక్పై కూరగాయలు తేవడానికి బేగంపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఆంజనేయస్వామి గుడి వద్ద ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ అతని బైక్ను ఢీకొట్టింది. దీంతో దేవ్సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆదివారం ఎస్ఐ పరమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి అదృశ్యం మీర్పేట: వ్యక్తి అదృశ్యమైన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సారంగపాణి కథనం ప్రకారం.. బడంగ్పేట బాలాజీనగర్లో నివాసముండే ఎస్.శ్రీకాంత్(41) వృత్తిరీత్యా డ్రైవర్. ఇతనికి భార్య కవిత, ముగ్గురు కుమార్తెలున్నారు. గతంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కవిత ముగ్గురు పిల్లలను తీసుకుని గజ్వేల్లోని కేసారమైన పుట్టింటికి సంవత్సరం క్రితం వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శ్రీకాంత్ అప్పుడప్పుడు భార్యాపిల్లల వద్దకు వెళ్లి వస్తుంటాడు. వారం రోజుల క్రితం శ్రీకాంత్ ఇంట్లో తల్లికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లి నర్సమ్మ ఆదివారం మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సబర్బన్ బస్ సౌకర్యం కల్పించండి
కడ్తాల్: హైదరాబాద్ నుంచి కడ్తాల్, ఆమనగల్లు వరకు సిటీ సబర్బన్ బస్సులు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్కు ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలో మంత్రిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యల గురించి వివరించారు. కడ్తాల్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు. షాద్నగర్– కడ్తాల్ రూట్లో షాద్నగర్ డిపోనకు చెందిన సర్వీసులు నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ఈ మార్గంలో బస్సులు తిప్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు.. నగరానికి సమీపంలోని కడ్తాల్, ఆమనగల్లు వరకు సిటీ సబర్బన్ బస్సులు ఏర్పాటు చేయాలని, తద్వారా విద్యార్థులకు, ఉపాధి రీత్యా, ఇతర అవసరాల కోసం నగరానికి వెళ్లే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని, సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని చైర్ పర్సన్ తెలిపారు. మంత్రి పొన్నంకు మార్కెట్ చైర్పర్సన్ వినతి -
ముగిసిన క్రికెట్ లీగ్
తుర్కయంజాల్: సత్యసాయి జయంతిని పురస్కరించుకుని ఆ సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి నిర్వహించిన క్రికెట్ లీగ్ మ్యాచ్ ఆదివారంతో ముగిసింది. తుది పోరులో తెలంగాణ జట్టుతో తలపడిన తమిళనాడు విజయం సాధించింది. జ్ఞాపికను సొంతం చేసుకుంది. ఈ లీగ్లో మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నార్త్, కర్ణాటక సౌత్, తమిళనాడు సౌత్, నార్త్, కేరళతో పాటు.. గ్రామం, జిల్లా, రాష్ట్రం, జోనల్ లెవల్ మొత్తం 850 జట్లు పాల్గొన్నాయని సంస్థ సభ్యులు పేర్కొన్నారు. జోనల్ లెవల్లో గెలుపొందిన జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి 17 వరకు పుట్టపర్తిలో యూనిట్ కప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ అంతర్జాతీయఎంపైర్ వి.కె.రామస్వామి. మాజీ చీఫ్ సెలక్టర్ఎం.ఎస్.కె.ప్రసాద్, సేవా సంస్థల జోనల్ అధ్యక్షుడు ముకుందన్, నేషనల్ క్రికెట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గాల్లో వేలాడుతున్న ప్రమాదం
చేవెళ్ల: విచ్చలవిడిగా వెలుస్తున్న హోర్డింగ్లు, బ్యానర్లతో ప్రమాదాలు పొంచి ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని షాబాద్ చౌరస్తాలో ఆదివారం ఓ హోర్డింగ్కు కట్టిన బ్యానర్ గాలికి చిరిగిపోయి విద్యుత్ హైటెన్షన్ వైర్లపై పడి ఇలా ప్రమాదకరంగా మారింది. ఏ మాత్రం గాలి అధికంగా వీచినా పెను ప్రమాదం సంభవించే ఆస్కారం లేకపోలేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చినిగిపోయిన బ్యానర్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. -
పాల వ్యాన్ను ఢీకొన్న బైక్
ప్రమాదంలో యువకుడి మృతి మాడ్గుల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కోల్కులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల గోపయ్య(23) శనివారం రాత్రి శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో స్నేహితుడి బైక్పై ఇంటికి వస్తున్నారు. మార్గమధ్యలో గ్రామ శివారులోని వైన్స్ సమీపంలో అదుపు తప్పి పాల వ్యాన్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గోపయ్యకు తీవ్ర గాయాలవ్వడంతో మాల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్నేహితుడు మహేశ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మరోసారి మావో చర్చ
షాద్నగర్(హైదరాబాద్): ఓవైపు కల్వకుర్తి.. మరో వైపు పాలమూరు అటవీ ప్రాంతం.. ఈ క్రమంలో మావోయిస్టుల చర్యలు.. కదలికలు ఒకప్పుడు కలవరం పుట్టించాయి.. రెండు దశాబ్దాలుగా అలాంటి ఆనవాళ్లు ఏవీ ఇక్కడ కనిపించడం లేదు.. తాజాగా మావోయిస్టు విజయలక్ష్మి అలియాస్ భూమిక ఎన్కౌంటర్ ఘటన మరోసారి షాద్నగర్లో కలకలం రేపింది. గతంలో ఇలా.. షాద్నగర్ నియోజకవర్గానికి ఆనుకొని ఉండే కల్వకుర్తి నియోజకర్గం మొదటి నుంచీ మావోయిస్టుల కార్యాకలాపాలకు కేంద్రం. ఈ క్రమంలో చాలామంది మావోయిస్టులు షాద్నగర్ను కేంద్రంగా చేసుకొని తమ కార్యాకలాపాలు కొనసాగించే వారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. షాద్నగర్కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లమల అటవీ ప్రాంతం సైతం మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. అక్కడి నుంచి కూడా ఇక్కడికి తలదాచుకునేందుకు వచ్చే వారని ప్రచారంలో ఉంది.ఎన్కౌంటర్లో హతం ఫరూఖ్నగర్ మండలం నేరేళ్ల చెరువు గ్రామానికి చెందిన జంగయ్య అలియాస్ దివాకర్ నల్లగొండ దళంలో చేరి జిల్లా కార్యదర్శిగా పని చేశాడు. 15 ఏళ్ల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలోని గోకారం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. 2005లో షాద్నగర్ పట్టణానికి చెందిన కానిస్టేబుల్ ప్రకాష్ ను మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో నక్సలైట్లు కాల్చి చంపారు. పదేళ్ల క్రితం కొందుర్గు మండల పరిధిలోని మహదేవ్పూర్, టేకులపల్లి గ్రామాల్లో, షాద్నగర్లోని మిలీనియం టౌన్íÙప్లో మావోయిస్టు సానుభూతిపరులను, ఆ తర్వాత కొందుర్గు మండలం ఆగిర్యాల గ్రామంలో మావోయిస్టు మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటనలు ఉన్నాయి. అప్పట్లో వారి నుంచి విప్లవ సాహిత్య పుస్తకాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఇలా తరచూ ఏదో ఒక సంఘటనకు షాద్నగర్ వేదికగా మారింది. ఇరవై ఏళ్లుగా మావోయిస్టులకు సంబంధించి ఎలాంటి కదలికలు లేవు.మరోసారి ఉలికిపాటు మావోయిస్టుగా పేరు మోసిన విజయలక్ష్మి ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా సరిహద్దు అబూజ్మడ్ అడవుల్లో గత బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన ఆమె విద్యార్థి దశలో ఉద్యమాల పట్ల ఆకర్షితు రాలైంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లి నక్సలిజం వైపు అడుగులు వేసింది. ఎన్కౌంటర్లో మృతి చెందడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వేములనర్వలో విషాదఛాయలు కేశంపేట: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో వేములనర్వ కు చెందిన విజయలక్ష్మి (38) మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఉదయం నుంచే గ్రామస్తులు విజయలక్ష్మి తల్లిదండ్రులు సాయిలు గౌడ్, సరస్వతిని పరామర్శించారు. మరోవైపు విజయలక్ష్మి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చేందుకు కుటుంబ సభ్యులు ఆసక్తి చూపకపోవడంతో అంత్యక్రియల్లో జాప్యం ఏర్పడింది. మరోవైపు ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విజయలక్ష్మిపై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. 2019, 2021లో కేసులను నమోదు చేయగా కొద్దిరోజుల క్రితం వారెంట్ ఇష్యూ చేసినట్టు సమాచారం. ఇంట్లో నుంచి వెళ్లినప్పటి నుంచి విజయలక్ష్మితో సంబంధాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి రాతపూర్వకంగా తెలియజేసినట్టు సమాచారం. -
కల్వకుర్తికి ఎనిమిది సబ్స్టేషన్లు
ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గానికి నూతనంగా ఎనిమిది సబ్స్టేషన్లు, 300 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన పట్టణంలోని మానసాగర్డెన్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు, విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాడైన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవాటి ఏర్పాటుకు ప్రభుత్వం రూ.2.3 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. 26న డిప్యూటీ సీఎం రాక తలకొండపల్లి మండలం ఖానాపూర్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఈ నెల 26న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్నారని చెప్పారు. అనంతరం ఖానాపూర్లో బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. భారీ ఎత్తున జనసమీకరణ చేసి సభ విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీసింగ్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్, ఆమనగల్లు ఏఎంసీ చైర్పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, చెంచు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండ్లి రాములు, మాజీ ఎంపీపీ విజయ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, మండల అధ్యక్షుడు జగన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మానయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి
● కేశంపేట ఎంపీడీఓ కిష్టయ్య ● పలు గ్రామాల్లో ఇందిరమ్మఇళ్లకు భూమిపూజకేశంపేట: ఇందిరమ్మ ఇళ్లను నాణ్యంగా నిర్మించుకోవాలని ఎంపీడీఓ కిష్టయ్య లబ్ధిదారులకు సూచించారు. మండల పరిధిలోని నిర్దవెళ్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్గౌడ్, గ్రామస్తులతో కలిసి శుక్రవారం ఆయన ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. కొండారెడ్డిపల్లిలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, పాపిరెడ్డిగూడలో మాజీ సర్పంచ్ శివయ్య, బోధునంపల్లిలో మాజీ ఉప సర్పంచ్ నీల పాండు ఇందిరమ్మ నిర్మాణాలను ప్రారంభించారు. నిర్దవెళ్లిలో ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. విడతల వారీగా ఇళ్ల బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమవుతాయని స్పష్టంచేశారు. మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మొద్దని సూచించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో నాయకులు గుండే రాణి, అబ్బి సుందరయ్య, చెవెళ్ల నర్సింలు, తాండ్ర కృష్ణారెడ్డి, సత్యంగౌడ్, ప్రభాకర్జీ, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
విస్తరణ లేదు.. వంతెన రాదు!
అబ్దుల్లాపూర్మెట్: పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా విజయవాడ జాతీయ రహదారి విస్తరణ చేపట్టాలని వచ్చిన ప్రతిపాదనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. విస్తరణకు పచ్చజెండా ఊపింది. ఏడాదిన్నర పాటుగా పనులు కొనసాగుతున్నాయి. తుది దశకు చేరుకున్నాయి. కానీ మధ్యలో ఉన్న అబ్బుల్లాపూర్మెట్ కూడలిని విస్మరించారు. విస్తరణ చేస్తారో? పై వంతెనలు నిర్మిస్తారో తెలియదు కానీ.. ఏళ్లు గడుస్తున్నా రహదారి విస్తరణ పనుల్లో స్పష్టత రావడం లేదు. చౌరస్తాలో ఇక్కట్లు ఎల్బీనగర్ నుంచి దండుమల్కాపూర్ వరకూ 24 కిలో మీటర్ల రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల విస్తరణ పనులకు రూ.600 కోట్లను కేంద్రంమంజూరు చేసింది. కోవిడ్, గుత్తెదారుల సమస్యలతో నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతూ.. నిర్విరామంగా కొనసాగింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. హయత్నగర్ చివరి నుంచి దండుమల్కాపూర్ వరకూ రోడ్డు పనులు పూర్తి అయినప్పటికీ, అబ్దుల్లాపూర్మెట్ కూడలిలో సుమారు రెండు కిలో మీటర్ల విస్తరణ పనులు చేపట్టలేదు. దీంతో చౌటుప్పల్ వైపు నుంచి హైదరాబాద్కు, నగరం నుంచి చౌటుప్పల్కు వెళ్లే వాహన దారులు.. అబ్దుల్లాపూర్మెట్ కూడలిలో ఇబ్బంది పడుతున్నారు. ఇరుకుగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ జాం అవుతోంది. వాహనాల రద్దీ.. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిత్యం రద్దీగా ఉండే విజయవాడ జాతీయ రహదారిపై చేపడుతున్న పనుల్లో 8 ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాల్లో పై వంతెనలు పూర్తయ్యాయి. ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ రోడ్డు విస్తరణలో వనస్థలిపురం పనామా కూడలి వద్ద, హయత్నగర్లో కుంట్లూర్ రోడ్డు వద్ద, అబ్దుల్లాపూర్మెట్ కూడలిలో ఘట్కేసర్ రోడ్డు, అనాజ్పూర్ రోడ్డు వద్ద మినహా.. పెద్దఅంబర్పేటలో పసుమాముల రోడ్డు, కొహెడ రోడ్డు వద్ద,ఇనాంగూడ, బాటసింగారం కూడళ్ల వద్ద బ్రిడ్జిలు పూర్తి కాగా.. వాహనాల రాకపోకలకు అనుమతించారు. అబ్దుల్లాపూర్మెట్లో గండిమైసమ్మ దేవాలయం నుంచి మయూరి కాంట వరకు రెండు వైపులా నిలిచిన రోడ్డు విస్తరణ చేపడితే.. 24 కిలోమీటర్ల రహదారి విస్తరణ పూర్తవుతుందని, అప్పుడు కూడలిలో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోతాయని స్థానికులు పేర్కొంటున్నారు. అభివృద్ధికి నోచుకోని కూడలి ఇరుకు రోడ్డుతో వాహనదారుల ఇబ్బంది మూడు వరుసలతో హైవే నిర్మాణం పూర్తి అబ్దుల్లాపూర్మెట్లో నిలిచిన పనులు -
సమన్వయంతోనే ప్రమాదాల నియంత్రణ
సాక్షి,సిటీబ్యూరో: అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విద్యుత్, టౌన్ప్లానింగ్, హైడ్రా, ఫైర్సేఫ్టీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుల్జార్హౌస్ తదితర అగ్నిప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా విభాగాలు ప్రజలకు తగిన సూచనలివ్వాలన్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో వ్యాపార సముదాయాల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా నిరోధించే చర్యలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. హెరిటేజ్ భవనాలతో సహా అన్ని భవనాల్లోనూ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి పరికరాలు వాడాలో విద్యుత్ అధికారులు ఎలక్ట్రిక్ పనులు చేసేవారికి, ఎలక్ట్రిక్ షాపులు నిర్వహించే వారికి దశలవారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిస్కమ్ సీఈకి సూచించారు. టౌన్ప్లానింగ్ అధికారులు, ట్రేడ్లైసెన్స్ జారీ చేసే అధికారులు ఫైర్సేఫ్టీ మెజర్స్ తప్పనిసరిగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నెలలో ఒకరోజు ఫైర్ సేఫ్టీపై అవగాహనకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ, శిథిలావస్థలో ఉన్న భవనాలను సర్వే చేయనున్నట్లు చెప్పారు. వ్యాపార భవనాల్లో ఫైర్సేఫ్టీకి సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ, ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్, పోలీస్ శాఖలకు మాత్రమే సమాచారం వెళ్తుందని , రెవెన్యూ సంబంధిత శాఖలకు కూడా సమాచారం ఇవ్వాలన్నారు. తద్వారా జిల్లా యంత్రాంగం తరఫున అంబులెన్న్స్, ఆసుపత్రిలో చికిత్స సదుపాయాలు, డాక్టర్లు, బెడ్స్ సిద్ధం చేయడం వంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 15 మీటర్ల లోపు ఉన్న హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఆఫీస్ బిల్డింగ్స్,లాడ్జింగ్, హోటల్, బిజినెస్ మాల్స్, స్టోరేజీ బిల్డింగ్లు తప్పని సరిగా ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలన్నారు. తప్పని సరిగా స్మోక్ డిటెక్టర్ తో పాటు అలారం కూడా ఉండాలని, ప్రజలు కూడా వీటిని గమనించాలన్నారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం జూలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వేంకటేశ్వరస్వామి విగ్రహ, ద్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్చకులు శ్రీనివాసమూర్తి, నర్సింహమూర్తి ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి, మహాగణాధిపతి, జయ విజయుల విగ్రహ ప్రతిష్ఠ, ద్వజస్తంభ ప్రతిష్ఠను నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిపించారు. ఉత్సవానికి జూలపల్లి గ్రామ ప్రజలు తలంబ్రాలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, మార్కెట్ చైర్పర్సన్ గీత, పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్లు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో తలకొండపల్లి సింగిల్విండో చైర్మన్ కేశవరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకుడు శ్రీనివాస్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ రఘురాములు, నాయకులు జైపాల్రెడ్డి, రమేశ్యాదవ్, శ్రీను, యాదయ్య, రాజేందర్రెడ్డి, అజీజ్, రేణురెడ్డి,అంజయ్య, శ్రీశైలంగౌడ్, రాఘవేందర్గౌడ్, విష్ణు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సొంతింటి కల సాకారమే లక్ష్యం
యాచారం: నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అర్హులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానన్నారు. యాచారం మండల కేంద్రం రైతు వేదికలో శుక్రవారం 441 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలే కీలకమని, అందరూ లబ్ధిపొందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి, నియోజకవర్గానికి అదనంగా మొదటి దఫాలో 20 వేల ఇళ్లు వచ్చేలా చూస్తానని తెలిపారు. ఇళ్ల కేటాయింపులో రాజకీయ ప్రభావం ఉండరాదని, కులమత వివక్ష ఉండదని స్పష్టంచేశారు. మంజూరు పత్రాలు అందుకున్న వారు..వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించుకుని, దసరా రోజున గృహప్రవేశం చేసుకోవాలని సూచించారు. నింబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టాలని స్పష్టంచేశారు. పద్ధతి మార్చుకోండి పంచాయతీ కార్యదర్శులు కొందరు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్లే భావిస్తున్నారని, ఇందిరమ్మ కమిటీలను లెక్కచేయడం లేదని ఫిర్యాదులు అందాయని తెలిపారు. అది మంచిది కాదని, వ్యవహార శైలి మార్చుకోవాలని ఆదేశించారు. మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ వ్యక్తిగతంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఇన్చార్జి ఎంపీడీఓ శైలజ, తహసీల్దార్ అయ్యప్ప, మండల పంచాయతీ అధికారి శ్రీలత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి 10వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ శంకర్నాయక్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు పలువురు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీధర్నాయక్, శ్రీనివాస్రెడ్డి, సురేశ్నాయక్, రవినాయక్, వెంకటేశ్వర్రెడ్డి, మల్లేశ్, బాలు, మురళీ, లక్ష్మీరెడ్డి, దావిద్, మాజీ సర్పంచ్ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తా లబ్ధిదారులు దసరాకుగృహప్రవేశం చేయాలి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి 441 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల అందజేత బీసీలకు రూ.5 లక్షలు, ఎస్సీలకు రూ.6 లక్షలు కడ్తాల్: పేద ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాటగీత, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు, బాలాజీనగర్ గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలు అందజేశారు. ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వం అర్హులందరికీఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తుందన్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉండి, ఇల్లులేని నిరుపేద బీసీలకు రూ.5లక్షలు, ఎస్సీలకు రూ.6 లక్షలతో ఇంటి నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, సింగిల్విండో డైరెక్టర్ వెంకటేశ్ సేవాదళ్ అధ్యక్షుడు లక్ష్మయ్య, నాయకులు రాజేశ్, షాబుద్దీన్, మల్లేశ్గౌడ్, ముత్తికృష్ణ, జహంగీర్అలీ, జహంగీర్బాబా, రవి, ఇమ్రాన్బాబా, రాంచందర్, శ్రీను, భిక్షపతి, మల్లయ్య, ఎంపీఓ లాలయ్య, కార్యదర్శి అల్లాజీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. -
ట్రాఫిక్ సమస్య తీరేదెన్నడు?
శంకర్పల్లి: పట్టణం నడిబొడ్డున ఉదయం పూట వందలాది మంది కూలీలు రోడ్డుపైకి వచ్చి నిలబడుతున్నారు. దీంతో రహదారి సగం మేర రాకపోకలు సాగించలేకుండా నిండిపోతోంది. ఫలితంగా శంకర్పల్లిలో నిత్యం ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. పాఠశాలలు, కళాశాలలు ఉన్న రోజుల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పోలీసులు, అధికారులు పరిష్కారం చూపడం లేదు. ఫలితంగా వివిధ పనుల నిమిత్తం ఉదయాన్నే రోడ్లపైకి వెళ్తున్న వారికి ఇబ్బంది తప్పడం లేదు. ఇప్పటికై నా పోలీసులు ఈ అంశంపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు. -
హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలోని పలు హాస్టళ్లపై ఫుడ్సేఫ్టీ, టౌన్ప్లానింగ్, హెల్త్, తదితర విభాగాల అధికారులతో ఏర్పాటైన స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. నగరంలోని పలు హాస్టళ్లు నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కనీస పరిశుభ్రత పాటించకపోవడంతో హాస్టళ్లలో ఉంటున్న వర్కింగ్ మెన్, ఉమెన్, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. పార్కింగ్ సెల్లార్లను ఇతర అవసరాలకు వినియోగించడం, భారీ హోర్డింగులతో వ్యాపారం చేయడం, ఇరుకు గదుల్లో ఎక్కువ మందిని కుక్కడం, తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడం, కనీస ఫైర్సేఫ్టీ లేకపోవడం, శుభ్రత, నాణ్యత లేని ఆహారం సరఫరా ,ఇతరత్రా లోపాలు కోకొల్లలు. పలు మార్లు హెచ్చరించినా యాజమాన్యాల్లో మార్పు రావడం లేదు.ఈ నేపథ్యంలో స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. అశోక్నగర్, దిల్సుఖ్నగర్, అమీర్పేట ప్రాంతాల్లోని ని 58 హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకున్నాయి. ● అశోక్నగర్ ప్రాంతంలో 20 హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి ఫుడ్లైసెన్సు లేకుండా, అపరిశుభ్రతతో ఆహారం తయారు చేస్తున్న రెండింటిని మూసివేశారు. ట్రేడ్ లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న ఎనిమిదింటికి నోటీసులు జారీ చేశారు. 9 హాస్టళ్లకు రూ.37,500 పెనాల్టీ విధించారు. ● దిల్సుఖ్ నగర్లో 23 హాస్టళ్లను తనిఖీ చేసి ఫుడ్సేఫ్టీ లైసెన్సులేని రెండింటిని మూసివేశారు. ఏడింటికి నోటీసులు జారీ చేశారు. ట్రేడ్లైసెన్సులు లేని 11 హాస్టళ్లకు రూ.23వేల పెనాల్టీ విధించారు. ● అమీర్పేటలో 15 హాస్టళ్లను తనిఖీ చేసి దేనికీ ట్రే డ్ లైసెన్సు లేకపోవడాన్ని గుర్తించి నోటీసులు జారీ చేయడంతో పాటు రూ.1.85 లక్షల పెనాల్టీ విధించారు. ఫుడ్సేఫ్టీ లైసెన్సు లేని ఒక కిచెన్ను మూసివేశారు. నిబంధనల ఉల్లంఘనల గుర్తింపు రూ. 2,45,500 పెనాల్టీ విధింపు 30 హాస్టళ్లకు నోటీసులు.. కొన్నింటి మూసివేత -
మా పిల్లలను సర్కారు బడిలో చేర్పిస్తాం
మంచాల: ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలనుచేర్పిస్తామని పలువురు ముస్లింలు ప్రకటించారు. శుక్రవారం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నిర్వహించిన మనఊరు– మనబడి కార్యక్రమంలో భాగంగా అంబేడ్కర్ చౌరస్తాలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆరుట్ల పాఠశాలను దత్తత తీసుకొని, రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి, బంగారు భవిష్యత్ను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆరుట్ల పాఠశాల ఎస్ఎంసీ కమిటీ సభ్యులు కంభాలపల్లి భాస్కర్, మండల మాజీ కో– ఆప్షన్ సభ్యులు ఎం.డీ. సలాం, యూసుఫ్ బాయ్, మైనార్టీ ముస్లిం నాయకులు ఖాజాబాయ్, గాలిబ్బాయ్, షబ్బిర్బాయ్, జంజీర్బాయ్, సద్దాం, ఖలీల్, జహీర్ తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో ధాన్యం కొంటున్నాం..
ఆమనగల్లు: రైతులకు ఇబ్బంది కలగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి గింజ సేకరిస్తామని, రైతులు దళారులకు ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. సన్నాలకు రూ.500 బోనస్ తీసుకోవాలని కోరారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో చైర్పర్సన్ యాట గీత ఏర్పాటు చేసిన రైతులకు ఉచిత భోజన వసతికార్యక్రమాన్ని శ్రీశైలం ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, సూపర్వైజర్ రాజ్యలక్ష్మి, సిబ్బంది వినోద్, కిరణ్, శరత్, కాంగ్రెస్ నాయకులు సుదర్శన్, గౌస్, విజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి
కడ్తాల్: ప్రకృతిని పరిరక్షిస్తూ, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ.. అధిక దిగుబడులు సాధించాలని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ అనిత, డాక్టర్ సుప్రజ, డాక్టర్ శిరీష, డాక్టర్ బాలునాయక్ అన్నారు. వ్యవసాయ శాఖ, విశ్వవిద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారంముద్వీన్, వాస్దేవ్ పూర్ గ్రామాల్లో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. రసాయన ఎరువులు వాడటం వలన భూమిఫలదాయకత తగ్గిపోతుందని, భూములు నిస్సారమై బీడు భూములుగా మారే ప్రమాదముందని తెలిపారు. అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు వర్మి కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు వాడటం ఉత్తమమని, జీలుగ, జనుము కలియదున్నడం ద్వారా భూసార పరిరక్షణ సాధ్యమని పేర్కొన్నారు. నీటీ ఎద్దడి పెరుగుతుండటంతో బిందు, తుంపర సేద్యంపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఎరువులు, విత్తనాల కొనుగోలు అనంతరం రసీదులు తీసుకోవాలని, పంట చేతికి వచ్చే వరకు వాటిని భద్రపర్చుకోవాలన్నారు. తద్వారా ఆపత్కాలంలో సరైన నష్ట పరిహారం పొందవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా సుస్థిర వ్యవసాయ పద్ధతులు, సాగులోని మెలకువలు, నీటి యాజమాన్యం, భూసారం పెంపు, రసాయన ఎరువుల వాడకం, సాగు ఖర్చులు తగ్గించడం, పంట మార్పిడి, పర్యావరణ రక్షణ తదితర ఆంశాలపై సమగ్రంగా వివరించారు. వెటర్నరీ వైద్యశాలలో లభిస్తున్న పలు స్కీంల గురించి తెలిపారు. కార్యక్రమంలో ఏఓ శ్రీలత, ఏఈఓలు అభినవ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, కశ్యఫ్, అనూష, వర్షిత్ ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. పచ్చిరొట్ట సాగుతో భూసారం మెరుగు బిందు, తుంపర సేద్యంౖపైరెతులు దృష్టి సారించాలి ప్రొఫెసర్ జయశంకర్విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పంటమార్పిడితో ప్రయోజనం ఆమనగల్లు: నీటి ఎద్దడి నేపథ్యంలో బిందు, తుంపర సేద్యం ద్వారా నీటిని ఆదా చేయవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ సుచరితాదేవి, డాక్టర్ నిర్మల, స్వప్నశ్రీ, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్గౌడ్లు అన్నారు. ఆమనగల్లు మండలం మంగళపల్లి గ్రామంలో విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. రసాయన ఎరువుల కారణంగా భూ సారం తగ్గిపోతుందన్నారు. జీవామృతం, వర్మి కంపోస్ట్, నీమ్ కేక్ వాడటం ద్వారా భూసారాన్ని పెంచవచ్చని సూచించారు. అంతరపంటలు, పంటమార్పిడి పద్ధతులతో మట్టి ఆరోగ్యం మెరుగవుతుందని, ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ కేదార్, పలువురు రైతులు పాల్గొన్నారు. -
మాజీ ఉప సర్పంచ్ మృతి
కడ్తాల్: మండల పరిధి సాలార్పూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కేతావత్ బీచ్యానాయక్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి శుక్రవారం.. బీచ్యానాయక్ పార్థీవదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సభవట్ బీచ్యానాయక్, నాయకులు శంకర్నాయక్ తదితరులు ఉన్నారు. గర్భిణులకుమెడికల్ కిట్ల పంపిణీ ఆమనగల్లు: తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సమకూర్చిన మెడికల్ కిట్లను శుక్రవారం గర్భిణులకు బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులుచంద్రశేఖర్రెడ్డి, అశోక్గౌడ్, రాజు, కృష్ణయ్య, శరత్చంద్ర, అనిల్, రాజు, మల్లేశ్గౌడ్, విజేందర్, పవన్ తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ కాని వారు దరఖాస్తు చేసుకోండి మంచాల: మంచాల పీఏసీఎస్ బ్యాంకులో రుణమాఫీ వర్తించని రైతులు.. వారం రోజుల వ్యవధిలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఏసీఎస్లో చాలా మంది రైతుల వివరాలు తప్పుగా నమోదు కావడంతో మాఫీ కాలేదని పేర్కొన్నారు. లబ్ధిపొందని వారు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా నంబర్లు, పట్టా పాసుపుస్తకాల జిరాక్స్లు అందించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణకు సూపర్వైజర్లు ఇన్చార్జి ఎంపీడీఓ జంగయ్యగౌడ్ ఇబ్రహీంపట్నం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పర్యవేక్షణకు మండలంలో తొమ్మిది మంది సూపర్ వైజర్లను నియమి ంచామని ఇబ్రహీంపట్నం మండల ఇన్చార్జి ఎంపీడీఓ యెల్లంకి జంగయ్యగౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక అధికారి నవీన్కుమార్రెడ్డి నేతృత్వంలో వీరిని నియమించామన్నారు. మండలానికి మంజూరైన 437 ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాలవారీగా.. మండల వ్యవసాయ అధికారి విద్యాధరిని, ఏఈ(గ్రిడ్) రూప కప్పపహాడ్. మండల ఏఈ(పీఆర్) ఉస్మాన్ చర్లపటేల్గూడ, కర్ణంగూడ, పోచారం. ఐసీడీఎస్ సూపర్వైజర్ సరళ ఎలిమినేడు, ఉప్పరిగూడ. ఏఈఈ(ఆర్డబ్లూఎస్) రజిత తుర్కగూడ, తులేకలాన్. ఎంపీఓ రఘు పోల్కంపల్లి, నెర్రపల్లి. ఏఈఓ స్రుజన ముకునూర్, నెర్రపల్లి. ఐసీడీఎస్ సూపర్వైజర్ పల్లవి దండుమైలారం. మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ వెంకటకృష్ణను రాయపోల్ గ్రామానికి నియమించామని వెల్లడించారు. ఈ అధికారులు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తూ, పరిశీలిస్తారని ఆయన పేర్కొన్నారు. మృతురాలి నేత్రాలు దానం ఆమనగల్లు: గుండెపోటుతో మృతిచెందిన వివాహిత మాధవి కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేశారు. హైదరాబాద్లోని మారుతీనగర్కు చెందిన ఆమె గురువారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు అర్థం మనోహర్, పీఆర్ఓ పాషా తదితరులు మాధవి భర్త అశోక్తో పాటు విదేశాల్లో ఉన్న ఆమె కుమారులను ఫోన్లో సంప్రదించారు. నేత్రదానం చేయాలని కోరడంతో కుటుంబ సభ్యులు ఇందుకు అంగీకరించారు. దీంతో ఎల్వీప్రసాద్ ఆస్పత్రి వైద్యులు మాధవి కళ్లను సేకరించారు. పాఠశాలకు ప్రహరీ నిర్మించరూ! నందిగామ: మండల పరిధిలోని మామిడిపల్లి అనుబంధ గ్రామం నసురుల్లాబాద్ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయం ఆసన్నమైనందున అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పాఠశాలకు ప్రహరీ నిర్మించడంతో పాటు, మరుగుదొడ్లు మరమ్మతు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఎమ్మెల్యేను కలిసిన ఏసీపీ
షాద్నగర్: మహబూబ్నగర్ నుంచి షాద్నగర్ ఏసీపీగా బదిలీపై వచ్చిన లక్ష్మీనారాయణ శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన వీర్లపల్లి శంకర్కు పుష్పగుచ్ఛం అందజేశారు. తీర్థయాత్రకు వచ్చిన వ్యక్తి అదృశ్యం మొయినాబాద్: తీర్థయాత్రలు తిరుగుతూ చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం మోజయపేటకు చెందిన ఊరిటి దేముడు(56) నలభై మంది బృందంతో ఈ నెల 14న తీర్థయాత్రలకు బయలుదేరారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో మున్సిపల్ పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న తరువాత భూమహాలక్ష్మి ట్రస్టుకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో దేముడు అదృశ్యమయ్యాడు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం మొయినాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. అనుమానాస్పద స్థితిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతి ఇబ్రహీంపట్నం: అనుమానస్పద స్థితిలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సీఐ జగదీశ్ తెలిపిన ప్రకారం.. గుంటూరు జిల్లా గురుజాల గ్రామానికి చెందిన నాగిరెడ్డి(32) మంగళ్పల్లి పరిధిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడు నెలల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అదే కళాశాలలో పనిచేసే శివకృష్ణారెడ్డితో కలిసి సమీపంలోని సుప్రియ హాస్టల్లో ఉంటున్నాడు. ఆరురోజుల రూమ్మెంట్ శివకృష్ణారెడ్డి తన స్వగ్రామానికి వెళ్లాడు. మద్యానికి బానిసైన నాగిరెడ్డి శనివారం నుంచి గదిలోనే మద్యం సేవిస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఆయన తలపై మంచానికి(బెడ్)కు ఉన్న ఐరన్ పైపు తలపై పడటంతో గాయమై తీవ్ర రక్తస్రామైంది. క్షతగాత్రుడు మత్తులోనే మృతి చెందినట్లు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం హాస్టల్ గదికి వచ్చిన శివష్ణారెడ్డి విషయం గమనించి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారాన్ని ఇచ్చాడు. మృతుడి బావమరిది వెంకటకృష్ణారెడ్డి ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు ●ఒకరి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు ●ఇద్దరి పరిస్థితి విషమం బీబీనగర్: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బీబీనగర్ సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన ప్రకారం.. మొయినాబాద్కు చెందిన చేగూరి రామస్వామిగౌడ్(60), లక్ష్మి దంపతులు వారి కోడళ్లు భూమిక, మనీషతోపాటు వీరి పిల్లలు అక్షిత్, అక్షయ్, శ్రీయాంక, సహస్రలతో కలిసి గురువారం సాయంత్రం కారులో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహ స్వామి దర్శనానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. బీబీనగర్కు రాగానే జాతీయ రహదారిపై ఉన్న ఫ్లైఓవర్ సమీపంలో కారు అదుపు తప్పి సర్వీస్ రోడ్డుపైకి పల్టీ కొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసం కాగా.. వాహనంలోని ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను బయటకు తీశారు. నేషనల్ హైవే అంబులెన్స్లో వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా రామస్వామి, లక్ష్మితోపాటు, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రామస్వామి మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. ఆరు కిలోల గంజాయి సీజ్ నిందితుడికి రిమాండ్ చేవెళ్ల: బస్టాండ్లో గంజాయి సంచితో అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఒడిశాకు చెందిన కరుణాకర్ గౌడ సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం అక్కడ నుంచి చేవెళ్ల బస్స్టేషన్కు వచ్చాడు. అతడి సంచిలో గంజాయి పెట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. విశ్వసనీయ సమచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అతని కదలికలు గమనిస్తూ చేవెళ్ల పోలీసులతో కలిసి వ్యక్తిని పట్టుకుని ఆరుకిలోల గంజాయి ప్యాకెట్లను సీజ్ చేశారు. శుక్రవారం రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు... నల్గొండ జిల్లా చందంపేటకు చెందిన కృష్ణ(32) గురువారం అర్ధరాత్రి బైక్పై యాచారం నుంచి మాల్ వైపు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో చింతపట్ల గేట్ వద్ద తుఫాన్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో కృష్ణకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. -
289 మంది పోకిరీలకు కౌన్సెలింగ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో యువతులు, మహిళల్ని వేధిస్తూ ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్య షీ–టీమ్స్కు చిక్కిన 289 మంది పోకిరీలకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. బషీర్బాగ్లోని ఓల్డ్ కమిషనరేట్లో స్వచ్ఛంద సంస్థలతో కలిసి డీసీపీ డాక్టర్ ఎన్జేపీ లావణ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. కౌన్సెలింగ్కు హాజరైన వారిలో 271 మంది మేజర్లు, 18 మంది మైనర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ తరహా వేధింపులపై 100కు కాల్ చేసి లేదా 9490616555కు వాట్సాప్ ద్వారా సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. -
ఏపీఎంపై డీఆర్డీఓకు ఫిర్యాదు
నందిగామ: నందిగామ మండల మహిళా సమాఖ్యలో ఏపీఎంగా పనిచేస్తున్న యాదగిరి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీసీ యాదయ్య జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వీర్లపల్లి సంఘంలో ఎలాంటి తీర్మానాలు లేకుండా రూ.3 లక్షలు చెక్కురూపంలో నిధులను మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే క్లస్టర్లో సీసీగా పనిచేస్తున్న తనకు ఈ విషయం తెలియడంతో ఏపీఓను ప్రశ్నించగా తననే దూషించారన్నారు. ఈ విషయమై డీఆర్డీఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై ఏపీఎం యాదగిరిని వివరణ కోరగా.. అందులో తన ప్రమేయం లేదని, బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, నిజానిజాలు విచారణలో తేలుతాయని స్పష్టంచేశారు. ఇబ్రహీంపట్నం ఎస్ఐపై వేటు ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాస్పై వేటు పడింది. ఆయనను మల్టీజోన్ రేంజ్ ఆఫీస్కు సరెండర్ చేస్తూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో మంచాల ఎస్ఐగా విధులు నిర్వర్తించిన శ్రీనివాస్ ఓ యాక్సిడెంట్ కేసును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై, విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈక్రమంలో రెండు రోజుల క్రితమే ఆయన ఇబ్రహీంపట్నం పీఎస్ నుంచి రిలీవ్ అయినట్లు సమాచారం. కడ్తాల్ ఎస్ఐకి ఉత్తమ పోలీసు అధికారి అవార్డు కడ్తాల్: నేర పరిశోధన విభాగం 2024 సంవత్సరానికి సంబంధించి, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కడ్తాల్ ఎస్ఐ వరప్రసాద్ ఉత్తమ పోలీస్ అధికారిగా అవార్డు అందుకున్నారు. పీఎస్ పరిధిలో నమోదైన పలు కేసులను వేగంగా దర్యాప్తు చేయడంతోపాటు ఉత్తమ సేవలకు గానూ బుధవారం డీజీపీ జితేందర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఎస్ఐ వరప్రసాద్తో పాటు బెస్ట్ హోంగార్డుగా అవార్డు తీసుకున్న పాండును సీఐ గంగాధర్, పోలీసులు అభినందించారు. ప్రేమ పేరుతో మోసం సాఫ్ట్వేర్ ఉద్యోగికి రిమాండ్ ఇబ్రహీంపట్నం రూరల్: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆదిబట్ల సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరువూరుకు చెందిన దుబ్బాక సాగరిక ఆదిబట్ల టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. 2022లో కోల్కటా టీసీఎస్లో పని చేసిన సమయంలో సహోద్యోగి పత్లావత్ సంజీవతో ఆమెకు పరియచం ఏర్పడింది. ప్రస్తుతం వీరిద్దరూ ఆదిబట్ల టీసీఎస్లో ఉద్యోగం చేస్తూ సహజీవనంలో ఉన్నారు. ఈక్రమంలో సాగరిక గర్భం దాల్చింది. దీంతో సంజీవ ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మొహం చాటేశాడు. ఈ విషయమై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, బుధవారం అతన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. సాగరికకు అబార్షన్ చేసిన తుర్కయంజాల్లోని మహోనియా ఆస్పత్రి యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. జనావాసాల్లోకి వచ్చి.. గేటులో తల ఇరుక్కుని కుల్కచర్ల: జనావాసాల్లోకి వచ్చిన ఓ జింక ప్రహరీకి ఏర్పాటు చేసిన గేటులో తల ఇరుక్కపోయి ప్రజలకు చిక్కింది. ఈ ఘటన చౌడాపూర్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్మన్కాల్వ అటవీ ప్రాంతం నుంచి సాయంత్రం ఓ జింక మరికల్ సమీపంలోని రామాలయం వద్దకు వచ్చింది. అక్కడ ఓ వ్యక్తి తన స్థలానికి ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేశాడు. అందులో జింక తల పెట్టి చిక్కుకుపోయింది. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని గేటుకు ఉన్న ఇనుప చువ్వలను తొలగించి జింకను మహబూబ్నగర్లోని పిల్లలమర్రి పార్కుకు తరలించామని బీట్ ఆఫీసర్ ఆంజనేయులు తెలిపారు. -
కుంట్లూర్ కంటతడి
సైకిళ్ల అందజేత లయన్స్ క్లబ్ సౌజన్యంతో దెబ్బడగూడకు చెందిన పేద విద్యార్థినులకు ఈ–సైకిళ్లు అందజేశారు.8లోuహయత్నగర్: పెద్దఅంబర్పేట్ మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారని తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కుంట్లూరు– పసుమాముల రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సీఐలు శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. పోస్టుమార్టం అనంతరం ఒకేసారి మూడు మృతదేహాలు కుంట్లూర్కు రావడంతో బంధువులు, స్థానికులు, మృతుల స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకేసారి ముగ్గురికి అంత్యక్రియలు జరపడంతో వందల సంఖ్యలో ప్రజలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. నేతల పరామర్శ.. యువకుల మృతి సమాచారం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గ్రామానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీఆర్ఎస్ నాయకుడు క్యామ మల్లేశ్ తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ముగ్గురు యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు రోడ్డు ప్రమాద స్థలంలో భారీగా ట్రాఫిక్ జామ్ బాధితులను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి -
నేరాల నియంత్రణకే కొత్త ఠాణాలు: సీవీ ఆనంద్
గోల్కొండ: నగరంలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం కొత్త ఠాణాలను ఏర్పాటు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన టోలిచౌకీ పోలీస్స్టేషన్ను బుధవారం ఆయన సందర్శించారు. ఇక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ తొలి ప్రతిని ఫిర్యాదుదారుకు అందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. నగరంలో నేరగాళ్ల పాలిట పోలీసులు సింహస్వప్నంలా మారారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూనే.. నేర నియంత్రణలోనూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. చోరీకి గురైన సెల్ఫోన్లను నగర పోలీసులు దేశంలోనే రికార్డు స్థాయిలో రికవరీ చేశారన్నారు. కార్యక్రమంలో సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ జి.చంద్రమోహన్, టోలిచౌకీ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్నాయక్ తదితరులున్నారు. -
ఎవరికీ లంచాలివ్వొద్దు
ఇబ్రహీంపట్నం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరికీ లంచాలు ఇవ్వొద్దని.. ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా తనకు ఫోన్ చేయాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని పథకం లబ్ధిదారులకు బుధవారం మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాభవన్లో ఆయన మాట్లాడుతూ.. పేదోల్లంతా మనోల్లే.. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తారతమ్యాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేశామని తెలిపారు. ఇళ్లు మంజూరైన వారు మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. బేస్మెట్ పూర్తవగానే రూ.లక్ష, గోడలు కట్టిన తర్వాత మరో రూ.లక్ష, స్లాబ్ వేశాక రూ.2 లక్షలు, నిర్మాణం పూర్తవగానే మరో రూ.లక్ష ఇలా నాలుగు విడతల్లో బిల్లులు వస్తాయని వివరించారు. కొలతలు, ఇంటి నిర్మాణం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాలన్నారు. హామీలను నెరవేరుస్తున్నాం.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. అయినప్పటికీ పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను నెరవేరుస్తున్నారని తెలిపారు. ఐదేళ్ల కాలంలో నియోజకవర్గం వ్యాప్తంగా 20 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చాంప్లానాయక్, ఎంపీడీఓ యెల్లంకి జంగయ్యగౌడ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్రెడ్డి, వైస్ చైర్మన్ మంఖాల కరుణాకర్, పీఏసీఎస్ చైర్మన్ పాండు రంగారెడ్డి, అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇబ్బంది పెడితే నేరుగా ఫోన్ చేయండి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత -
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
తుక్కుగూడ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రేవంత్ సర్కార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక ఉచిత హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలల గడుస్తున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో హామీలు నెరవేర్చలేదన్నారు. ఆడపిల్లలకు కల్యాణలక్ష్మితో పాటు, తులం బంగారం అందజేస్తామన్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరికీ బంగారం అందలేదని గుర్తు చేశారు. కేవలం ఎన్నికల సందర్భంగా అడ్డగోలుగా వాగ్దానాలు ప్రకటించారని మండిపడ్డారు. కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, మున్సిపల్ కమిషనర్ వాణి, ఏఎంసీ చైర్మన్ కృష్ణానాయక్, మాజీ కౌన్సిలర్లు, ఆయా పార్టీల నాయకులు, లబ్ధిదారులు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సబితారెడ్డి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ -
సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధం
కరోనా వైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంఽధీ ఆస్పత్రిలో సర్వం సిద్ధం చేశాం. ఓపీ భవనం రెండో అంతస్తులో 30 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు చేశాం. నిష్ణాతులైన వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారు. యాంటివైరల్ డ్రగ్స్, వైరాలజీ ల్యాబ్, రీఏజెంట్స్ (ద్రావకాలు) ఇతర మందులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. తెలంగాణ ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించారు. కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందులు వంటి రుగ్మతలకు గురైనవారు స్వీయ సంరక్షణ పాటిస్తూ, వైద్యుల సలహా మేరకు మందులు వేసుకోవాలి. జన సమూహ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. – ప్రొఫెసర్ సునీల్కుమార్, గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ -
ఆధునిక పద్ధతుల్లో బోధన చేపట్టాలి
కొత్తూరు: మారుతున్న విద్యావ్యవస్థ, పాఠ్యాంశాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన పద్దతుల్లో మార్పులు చేసుకోవాలని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏఎస్పీడీ) రమేశ్ సూచించారు. బుధవారం ఆయన పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్లో సీఆర్పీ, ఎస్జీటీ ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుపై మరింత ఆసక్తి, శ్రద్ధ పెంచేందుకు ఉపాధ్యాయులు బోధనలో సాంకేతికతను వినియోగించాలన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి వారికి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. బడిబాటలో భాగంగా బడిఈడు పిల్లను బడుల్లో చేర్పించేలా ఉపాధ్యాయులకు స్థానికులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ అంగూర్నాయక్, ఉపాధ్యాయులు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. సమగ్రశిక్ష ఏఎస్పీడీ రమేశ్ -
కర్షకుల కష్టం వర్షార్పణం!
యాచారం: నిబంధనల సాకు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. వెరసి కర్షకుల కష్టం వర్షార్పణం అవుతోంది. పండించిన ధాన్యం విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రోజులు గడుస్తున్నా.. కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో రైతులు వడ్ల కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాలకు వడ్లను కాపాడుకునేందుకు భగీరథ యత్నం చేస్తున్నారు. యాచారం మండలం మల్కీజ్గూడ, యాచారం, చౌదర్పల్లి గ్రామాల రైతులు తమ ధాన్యాన్ని యాచారం కొనుగోలు కేంద్రానికి తెచ్చారు. అధికారులు సేకరించకపోవడంతో బుధవారం కురిసిన వర్షానికి తడిసిపోయింది. ధాన్యంపై కవర్లు కప్పినప్పటికీ.. భూమి పదునుతో ధాన్యం మొలకెత్తే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపి వానలు కురిస్తే ధాన్యంపై ఆశలు వదులుకోవాల్సిందేనని వాపోతున్నారు. -
పచ్చిరొట్ట పైర్లతో భూసారం పెంపు
మొయినాబాద్: రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రాస్త్రవేత్త ఎస్జీ మహదేవప్ప అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. నేల ఆరోగ్యం, నీటి వినియోగం, పర్యావరణ రక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చిరొట్ట పైర్లు సాగుచేసి భూమిలో కలియదున్నడంతో భూసారం పెరుగుతుందన్నారు. ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ఖర్చులు తగ్గించాలని.. నీటి వృథాను అరికట్టేందుకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ విధానాలను అవలంబించాలన్నారు. పర్యావరణ రక్షణకు చెట్లను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త రమేష్, మండల వ్యవసాయాధికారి అనురాధ, ఏఈఓ సునీల్కుమార్, సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్త ఎస్జీ మహదేవప్ప -
త్వరలో మాన్సూన్ టీమ్స్!
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాల సమస్యలను ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా జీహెచ్ఎంసీ దాదాపు 400 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ను ఏర్పాటు చేయనుంది. వచ్చే జూన్ ఆరంభం నుంచి వర్షాకాలం ముగిసేంత వరకు (అక్టోబర్ నెలాఖరు వరకు) ఈ టీమ్స్ పని చేస్తాయి. ఇందుకుగాను దాదాపు రూ. 45 కోట్లు ఖర్చు చేయనున్నారు. వర్షాకాలంలో వానొస్తే రోడ్లు, కాలనీలు నీటి నిల్వలతో చెరువులుగా మారడం, మ్యాన్హోళ్లు, క్యాచ్పిట్లు పొంగిపొర్లడం తెలిసిందే. ఈ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఈ టీమ్స్ పనిచేస్తాయి. నగరంలో ప్రతియేటా నీరునిల్వ ఉండే ప్రాంతాలు జీహెచ్ఎంసీలోని సంబంధిత అధికారులకు తెలుసు. అలాంటి ప్రాంతాల్లో స్టాటిక్ టీమ్స్ నియమిస్తారు. నిల్చిపోయే నీటిని ఎప్పటికప్పుడు టీమ్స్లోని కార్మికులు తోడి పోస్తారు. వీటితో పాటు వాహనాలతో కూడిన మొబైల్ టీమ్స్ కూడా ఉంటాయి. ఇవి కాలనీలు, బస్తీలతో పాటు ఎక్కడ నీరు నిలిచినా వెళ్లి తొలగిస్తాయి. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు అందే ఫిర్యాదులను బట్టి ఆయా ప్రాంతాలకు వెళ్లి నిల్వ నీటిని తొలగిస్తాయి. షిఫ్టులవారీగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పని చేస్తాయి. ఈ టీమ్స్లోని కార్మికులు నీరు తోడిపోసేందుకు, అవసరమైన ప్రాంతాల్లో స్వల్ప మరమ్మతులు చేసేందుకు యంత్ర సామగ్రిని కలిగి ఉంటారు. వీటి ఏర్పాటు కోసం జోన్లలో సర్కిళ్ల వారీగా సంబంధిత ఈఈలు టెండర్లు పిలుస్తున్నారు. మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్ ఇలా.. ఒక్కో టీమ్కు వాహనం, నలుగురు కార్మికులు, నీటిని తోడి పోసేందుకు పరికరాలు ఉంటాయి. షిఫ్టుల వారీగా ఈ టీమ్స్ పనిచేస్తాయి. ఇలాంటి టీమ్స్ దాదాపు 150 వరకు ఉంటాయి. స్టాటిక్ టీమ్స్ నీరు అధికంగా నిలిచిపోయి రోడ్లు చెరువులుగా మారే ప్రాంతాల్లో, క్యాచ్పిట్ల వద్ద ఒకరు లేదా ఇద్దరు కార్మికులతో ఈ టీమ్స్ ఉంటాయి. వీటిల్లోని కార్మికులు నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తోడిపోస్తారు.ఇలాంటి టీమ్స్ దాదాపు 250 ఉంటాయి. జీహెచ్ఎంసీ అని తెలిసేలా.. మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్ వాహనాలకు జీహెచ్ఎంసీ లోగోతో బోర్డు పెట్టాలని, టీమ్కు నేతృత్వం వహించే వారి ఫోన్ నంబర్లను అన్ని పోలీస్స్టేషన్లకు అందజేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇటీవల జరిగిన వర్షాకాల సన్నద్ధత సమావేశంలో ఆదేశించారు. వర్షాల సమయంలో ఇంజినీర్లు సైతం 24 గంటల పాటు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. అంతేకాకుండా వాటర్ లాగింగ్ సమస్యల పరిష్కారంపైనా దృష్టి సారించిన కమిషనర్ బేగంపేటలో నీటి నిల్వకు కారణాన్ని గుర్తించి పై నుంచి వచ్చే నీటిని నియంత్రించేందుకు స్లూయిస్ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించడం తెలిసిందే. వర్షాకాల ఇబ్బందుల పరిష్కారానికి.. టెండర్లు ఆహ్వానిస్తున్న జీహెచ్ఎంసీ -
గాంధీ ఆస్పత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు
గాంధీ ఆస్పత్రి : మరోసారి వేగంగా వ్యాపిస్తున్న కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యనిపుణులు సూచించారు. రాష్ట్ర నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేశామని, కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. థర్డ్వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్– 1 ప్రస్తుతం వ్యాప్తిలో ఉందని, కానీ.. ఇది ప్రమాదకారి కాదన్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాండమిక్, ఎపిడమిక్, ఎండమిక్ మూడు స్టేజ్లు ఉంటాయని, కరోనా వైరస్ వీటిలో చివరిదైన ఎండమిక్ స్టేజ్లో ఉందన్నారు. రెస్పరేటరీ వైరస్లలో కోవిడ్ పాజిటివ్ కేసులు 60శాతం ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. కోవిడ్ వైరస్ను ప్రాణాంతకమైన మహమ్మారిలా చూసే పరిస్థితి లేదని, జలుబు, దగ్గు వంటి సాధారణ రుగ్మతగానే వచ్చిపోతుందని, గతంలో వేసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం తగ్గిపోయినప్పటికీ, ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందన్నారు. చిన్నారుల్లో నమోదు కావడం లేదు ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్తో పాటు మన దేశంలోని మహారాష్ట్రలో వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్–1 వైరస్ చిన్నారుల్లో నమోదు కావడంలేదు. ఒమిక్రాన్ బీఏ.2.86 నుంచి రూపాంతరం చెందిన జేఎన్–1లో మూడు సబ్ వేరియంట్లు ఎన్బీ.1.8.1, పీసీ.2.1, ఎక్స్ఈసీ.25.1లు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నట్లు ఐసీఎంఆర్ గుర్తించింది. మహారాష్ట్రలో జేఎన్–1 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కానీ ఇది ప్రమాదకారి కాదు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మాస్క్లు ధరించి అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ మెడిసిన్ -
అదుపుతప్పి కారు బోల్తా
మొయినాబాద్: అతివేగంతో వెళ్లిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ రోడ్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం జేబీఐటీ కళాశాల వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న క్వాలీస్ కారు అతివేగంతో వెళ్తూ అమ్డాపూర్ గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. అతనికి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. వృక్తి అదృశ్యం యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. పీఎస్ పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన మల్కాపురం నర్సింహ(50) ఈ నెల 7న పని కోసం వెళ్తున్నానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాలు, బంధువుల ఇళ్ల వద్ద వెతికారు. అయినా జాడలేదు. దీంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపారు. లయన్స్ క్లబ్ సౌజన్యంతో సైకిళ్ల అందజేత కందుకూరు: లయన్స్ క్లబ్ సౌజన్యంతో దెబ్బడగూడకు చెందిన పేద విద్యార్థినులు సురక్షిత, ప్రవీణకు బుధవారం ఈ–సైకిళ్లు అందజేశారు. లయన్స్ క్లబ్ జి ల్లా వైస్ గవర్నర్ జి.మహేంద్రకుమార్రెడ్డి చేతుల మీదుగా బాలికలకు అందించి ఒక్కో సైకిల్ ధర రూ.10 వేలు ఉంటుందని కోశాధికారి కె.వెంకటేశ్వర్లుగుప్తా తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి తాళ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి కడ్తాల్: విద్యుదాఘాతంతో పాడి ఆవు మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని పుల్లేర్బోడ్తండాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. తండాకు చెందిన నేనావత్ గోపాల్నాయక్కు ఉన్న పాడి ఆవు మేత మేసుకుంటూ పక్క పొలంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లింది. దీంతో విద్యుత్ తీగకు తగలడంతో అక్కడికక్కడే మృత్యువాత పడినట్లు బాధిత రైతు తెలిపారు. ఆవు విలువ రూ.లక్ష ఉంటుందని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. -
ఇరిగేషన్ శాఖ డీఈఈ ఆత్మహత్య
శంషాబాద్: పురుగుల మందు తాగి నీటి పారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం ఆర్జీఐఏ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బాలరాజు తెలిపిన ప్రకారం.. కొత్వాల్గూడ చౌడమ్మ దేవాలయ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్జీఐఏ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. పర్సులో లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా అతడు నాగోల్లో నివాసముంటున్న నేరెళ్ల వెంకటరామరాజు(63)గా గుర్తించారు. నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పని చేస్తున్నట్లు ఉంది. అతడి వద్ద లభ్యమైన ఫోన్ నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా తాము తిరుపతిలో ఉన్నట్లు తెలిపారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి
ఏసీపీ రంగస్వామి షాద్నగర్: పండుగలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ రంగస్వామి సూచించారు. హనుమాన్ జయంతి శోభాయాత్ర, బక్రీద్ పండుగ, సందర్భంగా పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో మంగళవారం శాంతి సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ రంగస్వామి మాట్లాడుతూ.. ప్రత ఒక్కరు పరమత సహనం పాటించాలన్నారు. బక్రీద్, హనుమాన్ జయంతి వేడుకలు హిందూ, ముస్లింలు సోదరభావంతో ఐకమత్యంగా జరుపుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ విజయ్కుమార్, ఎస్ఐ విజయ్కుమార్, నాయకులు బాబర్ఖాన్, ఇబ్రహీం, వెంకటేశ్, జమృద్ఖాన్, సిరాజుద్దీన్ పాల్గొన్నారు. -
ఏఎంసీ చైర్మన్ వర్సెస్ డైరెక్టర్లు
చేవెళ్ల: చేవెళ్ల మార్కెట్ కమిటీలో చైర్మన్, డైరెక్టర్ల మధ్య సయోధ్య కుదరక రచ్చకెక్కుతున్నారు. తాను మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తుంటే తనపై కుట్రతో ఆరోపణలు చేస్తున్నారని.. డైరెక్టర్లు మార్కెట్ కార్యదర్శి మహేందర్కు ఫోన్ చేసి ప్రతీ నెలా డబ్బులివ్వాలని బెదిరిస్తున్నారంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్ ఆరోపిస్తుంటే.. చైర్మన్ తమను పట్టించుకోవడం లేదని.. మార్కెట్ కార్యదర్శితో కలిసి అవినీతికి పాల్పడుతున్నారంటూ మార్కెట్కమిటీ డైరెక్టర్లు ఆరోపణలతో వివాదం మొదలైంది. అభివృద్ధికి సహకరించాలి చేవెళ్ల మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ రాములు, కార్యదర్శి మహేందర్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కె ట్ కమిటీ డైరెక్టర్లు అసత్య ఆరోపణలతో మార్కెట్ను బదనాం చేస్తున్నారని.. వారి సొంత నిర్ణయాలను ప్రశ్నిస్తే ఆరోపణలు చేస్తున్నా రని మండిపడ్డారు. మార్కెట్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సహకారంతో రూ.2 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. కొందరు డైరెక్టర్లు చిన్న విషయాలను రాద్దాంతం చేస్తున్నారన్నారు. సెక్రటరీకి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడడం, డబ్బులు డిమాండ్ చేయడం, కమీషన్ ఏజెంట్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నామంటూ అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. అవి నిజమైతే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. పాలకవర్గ సమావేశంలో తీర్మానాలు చేసిన డైరెక్టర్లే తాము చేయ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికై నా డైరెక్టర్లు మార్కెట్ అభివృద్ధికి కలిసిరావాలన్నారు. పదవులకు రాజీనామా చేస్తాం: డైరెక్టర్లు మార్కెట్ అభివృద్ధి కోసం చైర్మన్ను ప్రశ్నిస్తే తమపై కార్యదర్శితో ఆరోపణలు చేయించడం సరికాదని డైరెక్టర్లు జనార్ధన్, మల్లేశ్, నరేందర్, సత్యనారాయణ, హనీఫ్ అన్నారు. మార్కెట్ అభివృద్ధికి సంబంధించిన వివరాల లెక్కలు అడిగితే తమై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య జన్మదిన వేడుకలకు పాలకవర్గాన్ని పట్టించుకోకుండా చైర్మన్ ఒక్కరే తన ఫొటోతో ఫ్లెక్సీలు వేయించుకుని పాలకవర్గాన్ని దూరం పెట్టాడన్నారు. డైరెక్టర్లు లేకుండానే మార్కెట్ కమిటీ సమావేశం నిర్వహించి తాము హాజరైనట్లు రికార్డు చేశారని ఆరోపించారు. కమీషన్ ఏజెంట్లు తక్పట్టీలు ఇవ్వడం లేదని చెబితే పట్టించుకోవడం లేదన్నారు. తక్ పట్టీలు ఇవ్వకుండా చైర్మన్, కార్యదర్శి కలిసి అడ్డుకుంటున్నారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే డైరెక్టర్లు డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపిస్తున్నారని అన్నారు. అవసరమైతే తమ డైరెక్టర్ల పదవులకే రాజీనామాలు చేస్తామన్నారు. చేవెళ్ల మార్కెట్ కమిటీ పాలకవర్గంలో మనస్పర్థలు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు -
ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి
తుర్కయంజాల్: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. పురపాలక సంఘం పరిధిలోని తొర్రూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడంతో దళారులకు క్వింటా రూ.1,700 రైతులు అమ్ముకుని రూ.600 నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కరువయ్యాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నోముల దయానంద్ గౌడ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బచ్చిగళ్ల రమేష్, మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహా రెడ్డి, నాయకులు కందాల బల్దేవ్ రెడ్డి, పోరెడ్డి అర్జున్ రెడ్డి, కొత్త రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం ● ఐదు కార్లు దగ్ధం ● రూ.20 లక్షల నష్టం షాద్నగర్: మరమ్మతుల కోసం తీసుకువచ్చి న కారు నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించి ఐదు కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఫరూఖ్నగర్ మండలం దూసకల్ గ్రామానికి చెందిన గణేష్ యాదవ్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో జాతీయ రహదారి పక్కన మెకానిక్ షెడ్ నిర్వహిస్తున్నాడు. మరమ్మతుల కోసం వచ్చిన కార్లను షెడ్లోఉంచి తాళం వేసి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4గంటల ప్రాంతంలో షెడ్లో ఉన్న ఓ కారు బ్యాటరీ నుంచి మంటలు వ్యాపించి ఐదు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలార్పారు. సుమారు రూ.20లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫాంహౌస్లో హుక్కా పార్టీ పోలీసుల అదుపులో పది మంది యువకులు, ఇద్దరు మైనర్లు శంషాబాద్ రూరల్: ఫాంహౌస్లో హుక్కా పార్టీ జరుపుకుంటున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన కొందరు యువకులు గండిగూడ శివారులోని ఎంఆర్జీ ఫాంహౌస్లో హుక్కా పార్టీ చేసుకుంటున్నారు. మంగళవారం ఉదయం స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ చేసుకుంటున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం. హుక్కా పరికరాలను స్వాఽధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
యాచారం: ఉపాధి పనుల్లో అవకతవకలు పరిపాటయ్యాయి. మంగళవారం మండల కేంద్రంలో 16వ ఈజీఎస్ సామాజిక తనిఖీ మండల ప్రజావేదిక నిర్వహించారు. డీఆర్డీఓ శ్రీలత, అంబుడ్స్మెన్ సునీత, విజిలెన్స్ అధికారి కొండయ్య, ఏపీడీ చరణ్, ఇన్చార్జి ఎంపీడీఓ శైలజ, ఎంపీఓ శ్రీలత, ఏపీఎం లింగయ్య ఆధ్వర్యంలో ఈ ప్రజావేదిక కొనసాగింది. మండల పరిధిలోని 24 పంచాయతీల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31వరకు రూ.5.5 కోట్లకు పైగా నిధులు వెచ్చించి కూలీలకు ఉపాధి కల్పించినట్లు గుర్తించారు. పలు గ్రామాల్లో సక్రమంగా రికార్డులు నమోదు చేయకపోవడం, కూలీలు చేసిన పనులకు సకాలంలో డబ్బులు జమ కాకపోవడం, ఒకరి పేరు మీద రికార్డులు మరొకరి పేరిట నమోదు చేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా డీఆర్డీఓ శ్రీలత మాట్లాడుతూ.. ఉపాధి పనులు కల్పించే విషయంలో గాని, కూలీలకు డబ్బులు ఇచ్చే విషయంలో గాని, స్లిప్పులు అందజేసే విషయంలోగాని తప్పులు చేసిన వారిని వదలమని హెచ్చరించారు. కూలీలకు చేతినిండా పని కల్పించి సకాలంలో డబ్బులు అందించాలన్నదే సర్కార్ లక్ష్యమని చెప్పారు. ఏ గ్రామంలో ఏ తప్పు జరిగిందో.. ఆడిట్ సిబ్బంది గుర్తిస్తున్నారని వివరించారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు గాను సాయంత్రం వరకు కేవలం పది గ్రామాల వివరాలనే ఆడిట్ సిబ్బంది వెల్లడించారు. గోప్యంగా ప్రజావేదిక సభ ఈజీఎస్ సామాజిక తనిఖీ మండల ప్రజా వేదిక సభ మండల పరిషత్ సమావేశ మందిరంలో పెట్టడంపై కూలీలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు అంజయ్య మాట్లాడుతూ.. ప్రజావేదిక సభ తేదీని ఈజీఎస్ అధికారులు గోప్యంగా ఉంచారన్నారు. గతంలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై ఎంత మంది మీద చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పనులు చేసి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు రావడం లేదని.. కూలీలు పనులు చేసి పస్తులుంటున్నారని.. పలుమార్లు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనలు, ధర్నాలు చేపట్టినా ఫలితం లేదన్నారు. అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆందోళన డీఆర్డీఓ శ్రీలత హామీతో శాంతించిన కూలీలు, ఆందోళన కారులు -
ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
ఆమనగల్లు: కాంగ్రెస్పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 27న హైదరాబాద్లోని ఇందిరాపార్క్లో ఆటో ఆకలి కేకల మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేయాలని కోరుతూ 25 రోజులుగా నిర్వహిస్తున్న ఆటో రథయాత్ర మంగళవారం ఆమనగల్లుకు చేరుకుంది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆటో రథయాత్రకు స్థానిక ఆటో జేఏసీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మహాసభ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంద రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటోడ్రైవర్లకు ఉపాధి కరువైందని అన్నారు. 83 మంది ఆటోడ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని, ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు రూ.12 వేలు అందించాలని, ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 27న జరిగే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. -
పీఏసీఎస్ల సేవలు భేష్
నందిగామ: మండల పరిధిలోని చేగూరు పీఏసీఎస్ను మంగళవారం ఇండోనేషియా వ్యవసాయ అధికారుల బృందం సందర్శించింది. ఇండోనేషియా జాతీయ అభివృద్ధి ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఉప మంత్రి బాపక్ లీనార్డో, టాగ్ సంబాడో ఆధ్వర్యంలో 15 మంది సీనియర్ అధికారుల బృందం రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పీఏసీఎస్ల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరా, ఆధార్ ఆధారిత పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణ, పారదర్శకత తదితర వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఏసీఎస్ల నిర్వహణ, రైతులకు అందిస్తున్న సేవలు ప్రేరణాత్మకంగా ఉన్నాయని కితాబిచ్చారు. వ్యవసాయ రంగంలో ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రశంసించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, ఇన్చార్జి ఏడీఏ నిశాంత్ కుమార్, ఏడీఏ మాధవి, ఏఈఓ రవి, డీసీసీబీ షాద్నగర్ మేనేజర్ మంకాల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇండోనేషియా అధికారుల బృందం కితాబు -
హై లెవల్ చేతికి పరిహారం!
యాచారం: ప్రజాప్రయోజనాల నిమిత్తం, వివిధ సంస్థలకు అప్పగించే భూసేకరణకు సంబంధించి సర్కార్ హై లెవల్ కమిటీని నియమించడానికి నిర్ణయించింది. ఇక నుంచి ఈ కమిటీ నిర్ణయం మేరకే భూములిచ్చే రైతులకు పరిహారం అందజేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని పది గ్రామాల్లో ఫార్మాసిటీ కోసం 19,333 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించడానికి నిర్ణయించి 14 వేల ఎకరాలు సేకరించింది. పట్టా భూములకు అందజేసిన పరిహారం విషయంలో ఇబ్బందులు రానప్పటికీ అసైన్డ్పట్టాలు, ప్రభుత్వ భూముల్లో కబ్జాలున్న రైతులకు అందజేసిన పరిహారం చెల్లింపులో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మొదట్లో అసైన్డ్ భూములకు సాగు యోగ్యమైన భూమికి మాత్రమే పరిహారం అందజేశారు. తర్వాత కొందరు అధికారులతో కుమ్మకై ్క పట్టాదారు, పాసుపుస్తకాల్లో ఉన్న భూమికి మొత్తం నకిలీ పేర్ల మీద పరిహారం కాజేశారు. దీంతో నిజమైన అసైన్డ్దారులకు అన్యాయం జరిగింది. అన్యాయానికి గురైన అసైన్డ్దారులు నేటికీ తమను ఆదుకోవాలని కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అన్నీ నిర్ధారించాకే.. పరిహారం అందజేతలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. ఇక నుంచి జిల్లాలోని ఏ మండలం, ఏ గ్రామంలోనైనా ప్రజాప్రయోజనాలు, ప్రముఖ సంస్థలకు భూములు అప్పగించే విషయంలో హై లెవల్ కమిటీ నిర్ణయం మేరకే ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ, పరిహారం అందజేత, రైతులతో మాట్లాడి నచ్చజెప్పడం వంటి చర్యలు తీసుకోనుంది. కలెక్టర్ సారథ్యంలో ఏర్పాటయ్యే కమిటీలో అడిషనల్ కలెక్టర్, సర్వేశాఖ జిల్లా అధికారి, ఆర్డీఓ, తహసీల్దార్ ఉండనున్నారు. నిజమైన రైతులకు పరిహారం అందజేత విషయంలో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం, రెవెన్యూ రికార్డుల పరిశీలన, భూమికి సంబంధించి సర్వే మ్యాప్, హద్దుల నిర్ధారణ ద్వారా పరిహారం అందజేస్తారు. 250 ఎకరాలకు పైగా .. యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లోని 250 ఎకరాలకుపైగా పరిహారం అందజేసేలా అధికారులు నిర్ణయించారు. ఫార్మాసిటీకి సేకరించిన భూములకు సంబంధించి తాజాగా అధికార యంత్రాంగం సర్వే, ఫెన్సింగ్ పనులు నిర్వహిస్తోంది. ఆయా గ్రామాల్లోని అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న రైతులు తమకు పరిహారం అందలేదని పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆయా గ్రామాల్లోని అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా కబ్జాలో ఉన్న భూముల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో 80 మందికి పైగా రైతులు 250 ఎకరాలకుపైగా అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు సర్కార్కు నివేదిక అందజేశారు. పరిహారం విషయంలో మరోసారి పొరపాట్లు జరగకుండా కలెక్టర్ సారథ్యంలో హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసి తర్వాతే బాధిత రైతులకు అందజేసేలా సర్కార్ దృష్టి సారించింది. అవకతవకలు, అక్రమాలకు చెక్ పెట్టేలా సర్కార్ చర్యలు కలెక్టర్ సారథ్యంలో ప్రత్యేక కమిటీ బృందంలో మరో నలుగురు.. ఇక నుంచి వారి నిర్ణయం మేరకే పరిహారం చెల్లింపు అన్యాయం జరగకుండా చూస్తాం ఫార్మాసిటీకి భూములు సేకరించిన గ్రామాల్లో కొందరికి పరిహారం అందలేదని గుర్తించాం. త్వరలో కలెక్టర్ సారథ్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటవుతుంది. కమిటీ నిర్ణయం ప్రకారం బాధిత రైతులకు పరిహారం అందజేస్తాం. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చూస్తాం. – అనంత్రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
పంటల సాగులో అవగాహన తప్పనిసరి
యాచారం: ప్రభుత్వ గుర్తింపు కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ అల్థాస్ జానయ్య అన్నారు. మండల పరిధిలోని మాల్ రైతు వేదికలో మంగళవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. పంటల సాగులో రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని, తక్కువ శ్రమతో అధిక దిగుబడి వచ్చే పంటలపై దృష్టి పెట్టాలని తెలిపారు. నీటి ప్రాముఖ్యత, వినియోగం సమర్థత, వరిలో వైవిధ్యీకరణ అవసరంపై తెలియజేశారు. వానాకాలం ప్రారంభం కాగానే ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు మేలైన వివిధ రకాల విత్తనాలను ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించారు. రైతులు అవగాహన పొంపొందించుకోవడానికి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం ఎంతో దోహదపడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శ్రీనివాస్, రామకృష్ణబాబు, సునీత, ఇబ్రహీంపట్నం ఏడీఏ సుజాత, యాచారం మండల వ్యవసాయాధికారి రవినాథ్, పీఏసీఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి షాబాద్: ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తామని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గందె సురేష్గుప్తా పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘంలో సభ్యత్వం లేని వారు నూతనంగా నమోదు చేయించుకోవాలని తెలిపారు. వృద్ధాప్య భృతి కోసం 60 ఏళ్ల పైబడిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆర్యవైశ్యులకు సంఘం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దండు రాహుల్గుప్తా, ట్రెజరర్ నీల రవీందర్గుప్తా, జిల్లా కార్యదర్శి చొక్కంపేట రాకేష్ గుప్తా, షాబాద్, ఫరూఖ్నగర్ మండలాల అధ్యక్షులు పాపిశెట్టి సాయిరాంగుప్తా, నారాయణ, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ మలిపెద్ది శ్రీనివాసులు, ఫరూఖ్నగర్ మండల మాజీ అధ్యక్షుడు మురళి, సంఘం సభ్యులు గడ్డం రమేష్గుప్తా, ఉప్పు శ్రీనివాస్గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను వేగిరం చేయండి ఆమనగల్లు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి సూచించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల అధికారులంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. ఈనెల 25లోపు ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు బిల్లులు గ్రౌండింగ్ చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ కుసుమమాధురి, మున్సిపల్ కమిషనర్ శంకర్నాయక్, హౌసింగ్ డీఈ సురేశ్, ఎంపీఓ వినోద, ఏఈ అభిషేక్ పాల్గొన్నారు. నేడు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన మున్సిపల్ పరిధిలోని సంకటోనిపల్లి, మండల పరిధిలోని సీతారాంనగర్తండాలో బుధ వారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శంకర్నాయక్, ఎంపీడీఓ కుసుమమాధురి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేస్తారని, అనంతరం లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వు పత్రాలు పంపిణీ చేస్తారని తెలిపారు. -
మృత్యుఘోష
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025పెళ్లింట..పరిగి/షాబాద్: హైదరాబాద్– బీజాపూర్ రహదారి రక్తసిక్తమైంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లింట నిర్వహించిన చిన్నవిందుకు హాజరై వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పెళ్లికూతురు, పెళ్లికొడుకుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల్లో షాబాద్ మండలం సీతారాంపూర్కు చెందిన మల్లేశ్(35), ఇదే మండలం సోలిపేట్కు చెందిన బాలమ్మ (60), చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత(32), ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్కు చెందిన సందీప్(28) ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ సంతోష్కుమార్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరిగి ఆస్పత్రికి అక్కడి నుంచి తాండూరు, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిగి ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎలా జరిగిందంటే.. వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన రామకృష్ణ, స్వప్న దంపతుల కూతురు మల్లేశ్వరిని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లికి చెందిన సతీష్కు ఇచ్చి ఈనెల 16న పరిగిలో వివాహం జరిపించారు. 19న చిన్న విందు ఏర్పాటు చేయడంతో పెళ్లి కొడుకు బంధువులు సుమారు 50 మంది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రాత్రి 8.30 గంటలకు చందనవెల్లి నుంచి పరిగికి చేరుకు న్నారు. బస్సును పార్కింగ్ చేసి వస్తానని వెళ్లిన డ్రైవర్.. ఇదే ట్రావెల్స్కు చెందిన మరో బస్సు పాడవడంతో అందులో ఉన్నవారిని పరిగి నుంచి వారి గమ్యస్థానంలో వదిలేసి, తిరిగి అర్ధరాత్రి 1.20 గంటలకు పరిగికి చేరుకున్నాడు. పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో పాటు బంధువులతో కలిసి చందనవెల్లి బయలుదేరారు. పది నిమిషాలు కూడా గడవకముందే రంగాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీకి సైడ్ ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కన ఎడమ వైపు నిలిపి ఉన్న సిమెంట్ లోడ్ లారీని బలంగా ఢీకొట్టింది. తల్లి మృతి, ప్రాణాపాయంలో కూతురు ప్రమాద స్థలంలో మృతిచెందిన హేమలత కూతురు మోక్షిత(5)కు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మిగిలిన వారిని వికారాబద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సుజాత, నీరజ, నిహారి, మహేశ్, అరుణ, సాహితికి కాళ్లు, చేతులు విరిగాయి. ప్రియాంక, కార్తీక్, రమేశ్, లక్ష్మి, రాములు, మంజుల, సుజాత, నవనీతకు స్వల్ప గాయాలయ్యాయి. ఏఎంసీ చైర్మన్ వర్సెస్..చేవెళ్ల మార్కెట్ కమిటీలో చైర్మన్, డైరెక్టర్ల మధ్య సయోధ్య కుదరక రచ్చకెక్కుతున్నారు. పరస్పరం ఆరోపణలకు దిగుతున్నారు.8లోuన్యూస్రీల్ చిన్నవిందుకు హాజరై వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే నలుగురు మృతి, 20 మందికి గాయాలు పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘటన మృతుల్లో పెళ్లికొడుకు బావ, మేనబావపెళ్లి కొడుకు బావ మృతి పెళ్లికొడుకు సతీష్ బావ (అక్క భర్త) మల్లేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతని భార్య, ముగ్గురు పిల్లలు సైతం ఇదే బస్సులో ఉన్నారు. మృతుల్లో కిషన్నగర్కు చెందిన సందీప్కు ఆరు నెలల క్రితమే వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం నాగుపల్లికి చెందిన మహేశ్వరితో వివాహం జరిగింది. పెళ్లికుమారుడికి మేనబావ కావడంతో ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇతని తండ్రి గతంలోనే మృతిచెందగా ఒకేఒక్క కుమారుడైన సందీప్ అకాల మృతితో అతని కుటుంబం విలవిల్లాడుతోంది. -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
మహేశ్వరం: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని రాచకొండ సీపీ సుధీర్బాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని తుమ్మలూరు మ్యాక్ ప్రాజెక్టులో బీటీఆర్ విల్లాస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 320 ఐపీ సీసీ కెమెరాలను మంగళవారం ఆయన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా సీపీ మాట్లాడుతూ.. విల్లాస్, అపార్ట్మెంట్లు, కాలనీలు, గ్రామాల్లో నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతోగానో దోహదపడతాయని తెలిపారు. వీటితో కేసుల పరిష్కారం సులభతరం అవుతుందని, నేర శోధన, నేర నివారణకు ఎంతగానో తోడ్పడతాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బీవీ సత్యనారాయణ, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, గురువారెడ్డి, మ్యాక్ బీటీఆర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్.ప్రతాప్రెడ్డి, కోశాధికారి నాదేళ్ల రాఘవేందర్, జాయింట్ సేక్రటరీ డా.కె.అనిల్కుమార్, సభ్యులు తదిత రులు పాల్గొన్నారు. రాచకొండ సీపీ సుధీర్బాబు -
హిందూ ధర్మ పరిరక్షణకు కృషి
షాద్నగర్: హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామంలో రామాలయం, శివాలయం ప్రారంభోత్సవాలను వైభవంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా బొడ్రాయి, విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాల చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. అదేవిధంగా గ్రామ దేవతలను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారమన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, అందెబాబయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్, నాయకులు సుధాకర్రావు, వంశీకృష్ణ, మురళీ, వెంకటేష్, మోహన్సింగ్, శ్యాంసుందర్, బాల్రాజ్, శ్రీనివాస్, లష్కర్ నాయక్, రంగయ్యగౌడ్, రాజు, అశోక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
ఆక్రమణలకు హైడ్రా చెక్
రెండు ప్రాంతాల్లో ఆపరేషన్స్ పుప్పాలగూడ, హైదర్నగర్లో ఆక్రమణల తొలగింపు డాలర్ హిల్స్లోనూ ఇదే తరహా కథ పుప్పాలగూడలోని డాలర్ హిల్స్లోనూ ఆక్రమణల్ని హైడ్రా తొలగించింది. సర్వే నం. 104/1, 106, 113ల్లో సంతోష్రెడ్డి, ఆయన మిత్రులకు 60 ఎకరాల భూమి ఉంది. ఇందులోని 30 ఎకరాల్లో 1998లో డాలర్ హిల్స్ లే ఔట్ వేశారు. హెచ్ఎండీఏ ప్రిలిమినరీ లేఔట్తో మొత్తం 80 శాతం ప్లాట్లు అమ్మేశారు. ఆపై లేఔట్ రద్దయ్యేలా ప్రయత్నించి 2005లో చేయించారు. ఆపై స్థల యజమానులు కుమక్కై వ్యవసాయ భూమిగా మార్చుకున్నారు. ఈ విషయం అప్పటికే ప్లాట్లు కొన్న వారికి తెలీదు. ఎల్ఆర్ఎస్తో అనుమతులు తీసుకుని కొందరు ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. సంతోష్రెడ్డి తదితరులు ఈ లేఔట్లోని రెండు ఎకరాల పార్కు, రహదారులతో పాటు కొన్ని ప్లాట్లను కలిపి పక్కనే ఉన్న 30 ఎకరాల భూమికి జోడించారు. దీన్ని ఎన్సీసీ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు అమ్మేశారు. 2016 నుంచి ఈ వివాదం కోర్టులో ఉన్నప్పటికీ అనుమతులు తీసుకోకుండా ఎన్సీసీ నిర్మాణాలు చేపడుతోందని నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కమిషనర్ రంగనాథ్ ఈ నెల 14న క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా హైడ్రా సోమవారం అక్కడి నిర్మాణాలు తొలగించింది. అనుమతి లేకుండా సెల్లార్లు తవ్వడం, పేలుడు పదార్థాలను వినియోగించడాన్ని తీవ్రంగా పరిగణించింది. పార్కులు, రహదారులు ఆక్రమించిన కేసుల్లో ఇంప్లీడ్ అవ్వాలని హైడ్రా నిర్ణయించింది. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సోమవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఆక్రమ ణలు తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయి విచారణ చేసిన అధికారులు ఆక్రమణలుగా తేల్చి కూకట్పల్లిలోని హైదర్నగర్లో ఉన్న డైమండ్ హిల్స్, మణికొండలోని పుప్పాలగూడలో ఉన్న డాలర్ హిల్స్ల్లో కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా ఈ రెండు చోట్లా బోర్డులు ఏర్పాటు చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. హైదర్నగర్ సర్వే నం.145లోని 9 ఎకరాల్లో డైమండ్ హిల్స్ పేరుతో లేఔట్ వేశారు. 79 ప్లాట్లతో కూడిన 2000 సంవత్సరం నాటి దీనికి హెచ్ఎండీఏ అనుమతి ఉంది. 2007లో అన్ రిజిస్టర్డ్ అసైన్మెంట్ డీడ్తో డాక్టర్ ఎన్ఎస్డీ ప్రసాద్ అనే వ్యక్తి ఆక్రమణలు మొదలెట్టారు. ప్లాట్ యజమానులు పార్టీ కాని కేసుల్లో ఎక్స్ పార్టీ డిక్రీ తీసుకుని బైలీఫ్ ద్వారా వ్యవసాయ భూమి అని చూపుతూ ఏడెకరాలు ఆక్రమించారు. ఆ కేసులో ప్లాట్ యజమానులను పార్టీ చేయకుండా కోర్టును తప్పుదోవ పట్టించి పొందిన బైలీఫ్ అర్డర్తో ఈ లే ఔట్లోని స్విమ్మింగ్పూల్, రహదారులు, పార్కులు, ప్లాట్లు హద్దులు,పునాదులను చెరిపేసి ఆక్రమించారని ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 9న హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రసాద్ ఖాళీ చేయడం లేదని వాపోయారు. ఆ భూమిని వివిధ సంస్థలకు పార్కింగ్ కోసం అద్దెకు ఇస్తూ నెలకు రూ.50 లక్షలకు పైగా ఆర్జిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లేఔట్లోని మిగతా రెండు ఎకరాల్లో ఉన్న ప్లాట్లకు వెళ్లడానికి వీలు లేకుండా ఫెన్సింగ్ కూడా వేశారని తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ గత బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆక్రమణలు నిర్ధారించి సోమవారం వాటిని తొలగించే చర్యలు తీసుకున్నారు. ఓ ప్రాంతంలో రోడ్డు, పార్కుల్లో ఉన్నవి కూల్చివేత మరోచోట 9 ఎకరాల హెచ్ఎండీఏ భూమి సంరక్షణ న్యాయస్థానం ఆదేశాల మేరకే చర్యలు: కమిషనర్ -
చర్యలు తీసుకుంటున్నాం..
విజయవాడ జాతీయ రహదారిపై వేగనియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు పేర్కొన్నారు. పాదచారుల సౌకర్యార్థం విజయవాడ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో ఎఫ్ఓబీలు ఏర్పాటు చేయాలని జీహెచ్సీఎంసీ, జాతీయ రహదారుల సంస్థకు లేఖలు రాశామని హయత్నగర్ వర్డ్అండ్డీడ్ దగ్గర ఫుట్ ఓవర్బ్రిడ్జి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. హయత్నగర్లోని భాగ్యలతకాలనీ దగ్గర కూడా ఫుట్ ఓవర్బ్రిడ్జిని నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని పలు కారణాలతో పనులు జరగడం లేదన్నారు. పాదచారులు రోడ్డు దాటేలా ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తామన్నారు. -
ఆమనగల్లులో ఇనుపయుగపు ఆనవాళ్లు
ఆమనగల్లు: పట్టణంలో దాదాపు మూడు వేల ఏళ్ల నాటి ఇనుపయుగపు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లిచ్ ఇండియా సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. పట్టణంలోని జాతీయ రహదారి పక్కన సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న సమాధులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో దాదాపు మూడు వేల ఏళ్లనాటి సమాధులు ఉన్నాయని, గతంలో వంద వరకు ఉండగా ప్రస్తుతం నాలుగు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం నాలుగు సమాధుల్లో మూడు ఆనవాళ్లు సరిగా లేనప్పటికీ ఒకటి మిగిలిఉందన్నారు. ఆయన వెంట స్థపతి భీమిరెడ్డి వెంకటరెడ్డి, శిల్పులు సాయికిరణ్రెడ్డి, తెలుగు ఎల్లయ్య ఉన్నారు. గొప్ప పోరాటయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య షాద్నగర్: పుచ్చలపల్లి సుందరయ్య గొప్ప పోరాటయోధుడని సీఐటీయూ జిల్లా అధ్యక్షు డు ఎన్.రాజు అన్నారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ డివిజన్ కార్యదర్శి శ్రీను నాయక్ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ సుందరయ్య వర్దంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం రాజు మాట్లాడుతూ.. సుందరయ్య నిరాడంబర జీవి అని, దేశానికి గొప్ప ఆదర్శ నాయకుడని అన్నారు. దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అని కొనియాడారు. పేదలకు భూమి కావాలని, వెట్టిచాకిరి నుంచి విముక్తి కలగాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి పదిలక్షల ఎకరాల భూ మిని పంపిణీ చేయించారని గుర్తు చేశారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామాల్లో పోరాటం చేశారని, దళిత వాడల ఏర్పాటుకు కృషి చేశా రని అన్నారు. సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకొని హక్కుల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు చంద్రమౌళి, ఆంజనేయులుగౌడ్, కావలి రాజు, కుర్మయ్య, మహ్మద్ బాబుపాల్గొన్నారు. బాటసింగారం భూములపై విచారణ జరపండి ● ఎక్స్ వేదికగా రెవెన్యూ అధికారులకు భువనగిరి ఎంపీ సూచన అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని బాట సింగారంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ప్రచారాలపై రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి తన ఎక్స్ వేదిక ద్వారా కోరారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లు నిర్ధారణ జరిగితే తక్షణమే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆక్రమించుకున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమనగల్లువాసికి కీర్తిరత్న పురస్కారం ఆమనగల్లు: పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ప్రముఖ కవి దాస ఈశ్వరమ్మను కీర్తిరత్న పురస్కారం వరించింది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన శ్రీగౌత మేశ్వర సాహితి కళాసేవా సంస్థ ఏటా సాహిత్యరంగంలో విశేష సేవలు అందించే వారికి పురస్కారాలు అందిస్తోంది. ఈ ఏడాది ఈశ్వరమ్మ అందించిన సాహిత్య సేవలకుగాను ఆమెను ఎంపిక చేశారు. మంథనిలో జరిగిన కార్యక్రమంలో ఈశ్వరమ్మకు శ్రీ గౌతమేశ్వరసాహితి కళాసేవా సంస్థ అధ్యక్షుడు దూడపాక శ్రీధర్ కీర్తిరత్న పురస్కారం అందించారు. ఈశ్వరమ్మ రాసిన కవితలకు గాను సాహితీ సౌమిత్రి అనే బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో సేవాసంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
కారులోకి దూసుకెళ్లిన క్రాష్ బారియర్
● ఔటర్పై ఘోర రోడ్డు ప్రమాదం ● అక్కడికక్కడే బెంగాల్వాసి మృతి ● గంటల తరబడి శ్రమించి మృతదేహం వెలికితీత ఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్రోడ్డుపైఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రాష్ బారియర్ను ఢీకొట్టడంతో కారులోకి పది మీటర్ల మేర దూసుకెళ్లిన ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. బెంగాల్ రాష్ట్రానికి చెందిన కితాబ్అలీ అలియాస్ హిలాల్ (35) ఘట్కేసర్ మండలం నాగారంలోని శిల్పానగర్, విశ్వసాయి బృందావనం అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. తుక్కుగూడ సమీపంలోని వివిధ కంపెనీలకు మ్యాన్పవర్ సప్లయ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే సోమవారం ఉదయం తుక్కుగూడకు వచ్చి తిరిగి నాగారం వైపు కారులో వెళ్తున్నాడు. బొంగ్లూర్ ఎగ్జిట్ 12 వద్దకు రాగానే అతివేగం అజాగ్రత్తగా వాహనం నడుపుతూ క్రాష్ బారియర్ను ఢీకొట్టాడు. దీంతో కారు అద్దంలో నుంచి క్రాష్ బారియర్ పది మీటర్ల వరకు దూసుకెళ్లింది. క్రాష్ బారియర్లోనే కారు ఉండిపోయింది. ప్రమాదంలో కితాబ్అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో క్రాష్బారియర్ ఇరక్కుపోవడంతో మృతదేహం బయటకు తీయడం పోలిసులకు కష్టతరం అయ్యింది. ఔటర్రింగ్రోడ్డు సిబ్బందిని పిలిపించి కారు పైభాగం కట్ చేయించారు. గంటల తరబడి శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. సీఐ రాఘవేందర్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
బంట్వారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందకు సిద్ధంగా ఉండాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోట్పల్లి మండల కేంద్రంలో సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలం బలగం అన్నారు. బూత్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మెజార్టీ స్థానాలు గెలుపొందడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ నందు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్రెడ్డి, కోట్పల్లి మండల అధ్యక్షుడు శివకుమార్, బంట్వారం అధ్యక్షుడు మహేష్యాదవ్ పాల్గొన్నారు. ఐటీఐని సందర్శించిన ఎంపీ అనంతగిరి: వికారాబాద్లోని ఐటీఐ కళాశాలను ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో ఉన్న ట్రేడ్లు, కోర్సులు తదితర విషయాలపై ప్రిన్సిపాల్ నరేంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడ ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేయడం గొప్ప విషయమన్నారు. ● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
మంచి మాటలు చెప్పినందుకు...
మేడ్చల్: మద్యానికి బానిసై సంసారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నావ్ మంచిగా ఉంటూ భార్యా పిల్లలను బాగా చూసుకో అంటూ నాలుగు మంచి మాటలు చెప్పినందుకు ఓ వ్యక్తి తన బావ వరుసైన వ్యక్తిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానిక సరస్వతీనగర్లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుజరాత్కు చెందిన సోలంకి మోతీలాల్(43), అతడి మేనత్త కుమారుడు శంకర్(35) కుటుంబాలతో కలిసి రైల్వె స్టేషన్ సమీపంలోని సరస్వతీ నగర్లో ఉంటూ భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. కాగా మద్యానికి బానిసైన శంకర్ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కూడా మద్యం తాగి వచ్చిన అతను కుటుంబ సభ్యులతో గొడవ పడి సమీపంలోని రైల్వే ప్లాట్ ఫారంపై పడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోతీలాల్ అక్కడికి వెళ్లి శంకర్కు నచ్చజెప్పేందుకు యత్నించాడు. అయితే మద్యం మత్తులో ఉన్న శంకర్ అతడిని దుర్బాషలాడాడు. అనవసరంగా భార్యా పిల్లలతో గొడవలు ఎందుకని అతడికి సర్దిచెప్పిన మోతీలాల్ శంకర్ను ఇంట్లో దిగబెట్టి తన ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధమైన మోతీలాల్ తన బంధువుల ఇంటి వద్దకు వెళుతుండగా అతడిని అడ్డుకున్న శంకర్ తన కుటుంబ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ అతడిని తిడుతూ దాడి చేసేందుకు వెళ్లాడు. దీంతో మోతీలాల్ ఈ విషయాన్ని శంకర్ తల్లికి చెప్పేందుకు వెళుతుండగా ఆగ్రహానికి లోనైన శంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మోతీలాల్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడే కుప్పకూలడంతో శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు మోతీలాల్ను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. సమీప బంధువు దారుణ హత్య నడి రోడ్డుపై ఘాతుకం -
కడ్తాల్లో సినిమా షూటింగ్
కడ్తాల్: సినిమా బృందం సభ్యులు కడ్తాల్లో సందడి చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా, పి.మహేశ్బాబు దర్శకత్వంలో హీరో రామ్ నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను సోమవారం మండల కేంద్రంలో చిత్రీకరించారు. స్థానిక శ్రీనివాస థియేటర్ ఆవరణలో దర్శకుడు మహేశ్బాబు పర్యవేక్షణలో నటీనటులపై చిత్రీకరణ చేశారు. కడ్తాల్లో సినిమా షూటింగ్ జరుగుతుండటంతో సినీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. కూలీ డబ్బుల కోసం ఫోన్ చేసినందుకు.. ప్లంబర్ను చితకబాదిన కాంట్రాక్టర్ బంజారాహిల్స్: తనకు రావాల్సిన కూలీ డబ్బుల కోసం ఓ ప్లంబర్ తాను పని చేస్తున్న కాంట్రాక్టర్కు తరచూ ఫోన్ చేయడంతో ఆగ్రహం పట్టలేని కాంట్రాక్టర్ సదరు ప్లంబర్ను దారికాసి చితకబాదిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–13లోని శ్రీరామ్నగర్ బస్తీకి ఆశిష్కుమార్ దాల్ ప్లంబర్గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా అతను జూబ్లీహిల్స్కు చెందిన అరుణ్కుమార్నాయక్ అనే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. ఈ నెల 17న తనకు రెండు రోజుల భత్యం రావాలంటూ పలుమార్లు అరుణ్కుమార్కు ఫోన్ చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన అరుణ్కుమార్ బైక్పై వెళుతున్న ఆశిష్కుమార్ను అడ్డగించి తనకు అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తున్నావంటూ అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి ఎడమ చేయి వేలు విరిగిపోయింది. బాధితుడి పిర్యాదు మేరకు పోలీసులు అరుణ్కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ నోట్ల మార్పిడీకి యత్నం నిందితుడి రిమాండ్ కుత్బుల్లాపూర్: నకిలీ నోట్లు అంటగట్టి ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని పేట్బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిరిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన మనీషా సావంత్ తనకు పరిచయస్తుడైన చత్తీస్ఘడ్ ప్రాంతానికి చెందిన కుంజురామ్ పటేల్కు రూ.18.5 లక్షలు ఆన్లైన్లో బదిలీ చేసింది. మనీషాకు ఇవ్వాల్సిన డబ్బులు నగదు రూపంలో ఇస్తానని, పేట్బషీరాబాద్లోని పాంటలూన్స్ షోరూమ్ వద్దకు రమ్మని చెప్పాడు. కుంజురామ్ ఆమెకు నకిలీ నోట్లు అంటగట్టేందుకు యత్నిస్తుండగా గుర్తించిన మనీషా అతడిని నిలదీసింది. దీంతో కుంజురామ్ అతని అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కుంజురామ్, అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని సోమవారం మేడ్చల్ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. -
గోడు వినండి.. గూడు కల్పించండి
దివ్యాంగ దంపతుల వేడుకోలుఇబ్రహీంపట్నం రూరల్: నడవలేని స్థితిలో కలెక్టరేట్కు వచ్చిన వీరు చంపాపేట్లో నివసించే రొండి నాగమ్మ, నాగేష్. దంపతులు ఇద్దరూ దివ్యాంగులే. పీజీ వరకు చదువుకున్నారు. వీరికి ఆరేళ్ల పాప ఉంది. ప్రస్తుతం పనులు చేయలేక ఇంట్లోనే ఉంటున్నారు. అద్దె ఇంట్లో కిరాయి సైతం చెల్లించకలేక ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేదలమైన, దివ్యాంగులమైన తమకు ప్రభుత్వ పథకం కింద ఇల్లు కేటాయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు అనేకమార్లు విన్నవించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆపసోపాలు పడుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా రు. సోమవారం కలెక్టరేట్ నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చారు. కలెక్టర్ కలవకపోవడంతో అధికారులకు అర్జీ సమర్పించారు. ఈ నెల 6న కూడా ప్రజావాణిలో మొరపెట్టుకున్నామని, అయినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. నగరం నుంచి ఇంత దూరం రావాలంటే ఇబ్బందిగా ఉందని.. జీవనోపాధికరువై, బతుకుభారమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.తమ గోడు పట్టించుకుని ఉండటానికి ఎక్కడైనా కాస్త గూడు కల్పించి ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. -
హైసిటీ పనులకు నిధుల లేమి
సాక్షి, సిటీబ్యూరో: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) పనుల కింద టెండర్లు పూర్తయినప్పటికీ, పనులు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కేబీఆర్పార్కు చుట్టూ, ఖాజాగూడ, ట్రిపుల్ఐటీ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు తదితర పనులకు సంబంధించి రూ. 1800 కోట్ల మేర పనులకు టెండర్లు పూర్తయ్యాయి. కేబీఆర్ చుట్టూ పనులకు కోర్టు వివాదాలతో ముందుకు సాగలేని పరిస్థితి నెలకొనగా, మిగతా ప్రాంతాల్లో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు భూసేకరణ పూర్తి కావాల్సి ఉంది. అందుకు అవసరమైన నిధులు జీహెచ్ఎంసీ ఖజానాలో లేవు. అవసరమైన నిధులను ప్రభుత్వం ఇస్తే తప్ప ముందుకు పోలేని పరిస్థితి. సదరు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో భాగంగా ఆస్తులు కోల్పోయే నిర్వాసితులకు చెల్లించాల్సిన దాదాపు రూ. 760 కోట్లకు సంబంధించిన పరిహారం ఖరారు, తదితరాలతో అవార్డులు పాసైనప్పటికీ, భూమిని స్వాధీనం చేసుకునేందుకు చెల్లించేందుకు నిధుల్లేవు.జీహెచ్ఎంసీకి చెందిన పబ్లిక్ డిపాజిట్ ఖాతా లోని రూ.2వేల కోట్లు సైతం ప్రభుత్వం వినియోగించుకోవడంతో జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం సిబ్బంది జీతాల చెల్లింపులకే కనాకష్టంగా మారనుంది. ప్రస్తుతానికి ‘ఎర్లీబర్డ్’ ద్వారా వచ్చిన నిధులతో ఇబ్బంది లేకపోయినప్పటికీ, మున్ముందు జీతాలకూ కటకటలాడాల్సిన పరిస్థితి తప్పదేమోనని జీహెచ్ఎంసీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల పనులు అడుగు ముందుకు పడని పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) కింద పలు ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణాలకు సైతం అప్పటి ప్రభుత్వం నయాపైసా ఇవ్వలేదు. కానీ, జీహెచ్ఎంసీ ఆర్థికపరిస్థితి, పరపతి దృష్ట్యా అప్పులు తెచ్చారు. సర్కారు కరుణిస్తేనే ముందుకు లేకుంటే అంతే సంగతులు -
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయండి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇందిరమ్మ ఇళ్ల గ్రౌడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్తో కలిసి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సరఫరాపై సంబంధిత అంశాలపై చర్చించారు. ఈనెల 25వ తేదీ వరకు గ్రౌండింగ్ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయాలని ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. రాజీవ్ యువ వికాసంపై సమీక్షిస్తూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిందన్నారు. మండలాలవారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యలు రాకుండా బాగా పని చేయడం జరిగిందని, రాబోయే 20 రోజుల వరకు ఇదే విధంగా పని చేయాలని సూచించారు. డీఆర్ఓ సంగీత, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, ఆర్డీఓలు వెంకట్రెడ్డి, అనంత్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీలత, మైనార్టీ వెల్ఫేర్ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి కేశురామ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి, ఈఈ మిషన్ భగీరథ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఫైర్ సేఫ్టీలేని భవనాలను గుర్తించండి పాతబస్తీ గుల్జార్హౌస్ అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో సంబంధిత అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ఫైర్ సేఫ్టీలేని, ప్రమాదకరమైన లైన్లు, భవనాలను గుర్తించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను సూ చించారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు గుర్తించి వా టిని వెంటనే తొలగించాలన్నారు. ఈ ప్రమా దాల నివారణ కోసం విద్యుత్, మున్సిపాలిటీ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఫైర్సేఫ్టీ, విద్యుత్శాఖల అధికారులు పాల్గొన్నారు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: వివిధ ప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఫిర్యాదుదారులు అందించే దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం రెవెన్యూ శాఖకు సంబంధించి 24, ఇతర శాఖలకు సంబంధించి 29 దరఖాస్తులు అందినట్టు తెలిపారు. -
వికారాబాద్: లారీని ఢీకొన్న పెళ్లి బస్సు.. నలుగురి మృతి
సాక్షి, వికారాబాద్ జిల్లా: పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టూరిస్టు బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చందనవెళ్లి గ్రామానికి చెందిన పలువురు టూరిస్టు బస్సులో పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
భవనాల్లేక ఇబ్బందులు
దౌల్తాబాద్: మహిళా పొదుపు సంఘాలకు సొంత భవనాలు లేక కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల నిర్వహణ కొనసాగుతుంది. స్వశక్తి సంఘాల ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు సొంత భవనాలు లేవు. ప్రతి నెలా గ్రామాల్లోని చెట్లు, సంఘం సభ్యుల నివాసాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో అతివలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేదికలు కరువు మండలంలో 33 గ్రామపంచాయతీల్లో 46 గ్రామ సమాఖ్య సంఘాలున్నాయి. ఇందులో సుమారు 806 స్వయం సహాయక సంఘాలు ఉండగా 8,300 మంది సభ్యులు ఉన్నారు. స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా మహిళలు జీవనోపాధి అవకాశాలు పెంపొందించుకుంటూనే పొదుపులో ఆదర్శంగా నిలుస్తున్నాయి. గ్రామ స్థాయిలో కార్యాలయాలు లేక మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల మంజూరు, వసూళ్లు, సభ్యుల్లో చైతన్యం పెంపొందించడంలో కీలకపాత్ర పోషించే గ్రామ సంఘాలకు సరైన వేదికలు అందుబాటులో లేకుండా పోయాయి. ఫలితంగా ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడంలేదు. వెంటాడుతున్న సమస్యలు సొంత భవనాలు లేక సంఘాల కార్యకలాపాల నిర్వహణతో పాటు మహిళా సమాఖ్యలు, మహిళా పొదుపు సంఘాల సమావేశాల నిర్వహణ, శిక్షణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్రామైక్య సంఘాల వద్దకు వివిధ పనుల కోసం వచ్చిపోయే మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులకు పల్లెల్లో మౌలిక వసతులు లేవు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల నిర్వహణ కోసం మండల కేంద్రంలో ఇందిరాక్రాంతి పథం పేరిట సొంత భవనం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో సంఘ భవనాలు నిర్మిస్తే సంఘాల నిర్వహణలో తలెత్తే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ఇప్పుడైన మహిళలకు సొంత భవనాలు నిర్మిస్తారని మహిళలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కార్యకలాపాల నిర్వహణకు ఎదురవుతున్న ఇక్కట్లు తీవ్ర అవస్థల్లో మహిళా సంఘాల ప్రతినిధులు ఉన్నతాధికారులకు నివేదించాం స్వయం సహాయక సంఘాల నిర్వహణ కోసం సొంత భవనాల నిర్మాణాల విషయమై ఉన్నతాధికారులకు వివరించాం. మండలంలో భవనాలు కావాలని ప్రతిపాదనలు కూడా పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే నూతన నిర్మాణాలు చేపడుతారు. – హరినారాయణ, ఇన్చార్జి ఏపీఎం, దౌల్తాబాద్ -
పెట్రోల్ ట్యాంకర్కు మంటలు
కుషాయిగూడ: ప్రమాదవశాత్తు పెట్రోల్ ట్యాంకర్ కు మంటలంటుకున్న సంఘటన ఆదివారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో పాటు ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. కొన్నాళ్లుగా నిలిచిపోయిన ట్యాంకర్ లారీని రిపేరు చేస్తూ ట్రయల్రన్ చేస్తున్న క్రమంలో చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఐఓసీఎల్ వద్ద ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన మెకానిక్, ఇతర డ్రైవర్లు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో ట్యాంకర్కు మంటలు వ్యాపించడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపు చేశారు. పక్కనే పార్కు చేసి ఉన్న సిలిండర్ల ట్రక్కుకు మంటల వ్యాపిస్తే పెనుప్రమాదం జరిగి ఉండేదన్నారు. ఈ విషయమై చర్లపల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ను వివరణ కోరగా చాలా రోజులుగా నిలిచిపోయిన ట్యాంకర్ ట్రయల్రన్ వేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందన్నారు. విచారణ చేపడతామని పేర్కొన్నారు. ట్రయల్ రన్ చేస్తుండగా ప్రమాదం మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది -
రూ.3.60 లక్షల విలువైన విదేశీ మద్యం పట్టివేత
52 మద్యం బాటిళ్లు స్వాధీనం..●ముగ్గురి పై కేసు నమోదు, ఇద్దరి అరెస్ట్ సాక్షి, సిటీబ్యూరో: అక్రమంగా తరలిస్తున్న 52 విదేశీమద్యం బాటిళ్లను ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆదర్శనగర్లో ఓ కారులో మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ముగ్గురిపైన కేసులు నమోదు చేసిన పోలీసులు కుమార్ అగ్రవాల్, రోహిత్కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్చేశారు. ఇన్నోవా కారును సీజ్ చేశారు. డీసీఎంను ఢీకొట్టిన కారు.. ఒకరికి గాయాలు దుండిగల్: మద్యం మత్తులో కారు నడిపి రోడ్డుపై నిలిచి ఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి గాయపడిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్ల కళావతినగర్కు చెందిన రమేష్ శనివారం సాయంత్రం తన డీసీఎంను బహదూర్పల్లిలోని మేకల వెంకటేశం ఫంక్షన్ హాల్ ఎదుట పార్కు చేశాడు. గండిమైసమ్మ నుంచి జీడిమెట్ల వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం వెనుక భాగం దెబ్బతినగా, కారు ముందు భాగం ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ప్రయాణిస్తున్న వారిని పటాన్చెరువు సాయిరామ్ కాలనీకి చెందిన అక్షిత్రెడ్డి, సిద్దిపేట జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన అభినవ్ లుగా గుర్తించారు. కాగా వారు ఇద్దరూ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. వారి కారులో లభించిన మధ్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు గాయపడిన అభినవ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డీసీఎం యజమాని రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫాస్ట్ట్యాగ్ల చోరీ
● క్యాబ్లకు విక్రయం ● ట్రైనీ కానిస్టేబుల్ అరెస్ట్ శంషాబాద్: పోలీసు వాహనాల ఫాస్ట్ట్యాగ్లను చోరీ చేసి విక్రయిస్తున్న ట్రైనీ కానిస్టేబుల్ ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గతంలో హోంగార్డుగా పనిచేసి ప్రస్తుతం శిక్షణ పొందుతున్న నిసార్ అహ్మద్ (28) అనే వ్యక్తి పోలీసు వాహనాలకు ఉన్న ఫాస్ట్ట్యాగ్లను చోరీ చేసి వాటిని క్యాబ్ డ్రైవర్లకు విక్రయించాడు. దీంతో సంబంధిత వాహనాలకు సంబంఽధించిన టోల్చార్జీలు పోలీసుల వాహనాలకు వెళుతున్నాయి. వీటిని విక్రయించిన నిసార్ అహ్మద్ వారి నుంచి నెలవారిగా ఒక్కో వాహనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. టోల్ సిబ్బంది సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన ఆర్జీఐఏ పోలీసులు నిసార్ అహ్మద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడు విక్రయించిన ఫాస్ట్ట్యాగ్లను వినియోగిస్తున్న మూడు క్యాబ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ పేరుతో వేధింపులు ఉరేసుకుని బాలిక ఆత్మహత్య శంషాబాద్ రూరల్: ప్రే మ పేరిట వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని పెద్దతూప్రలో జరిగింది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వి.జంగయ్య, అనిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు దివ్య(16)ను అదే గ్రామానికి చెందిన తెలగమల్ల రవి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 16న రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ రెండో అంతస్తులో నిద్రకు ఉపక్రమించారు. అదే రోజు రాత్రి దివ్య సెల్ఫోన్ తీసుకుని కింద అంతస్తులోకి వెళ్లింది. ఎంతసేపటికి పైకి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా గది లోపలి నుంచి గడియపెట్టి ఉన్నది. దీంతో కిటికీ నుంచి లోపలికి చూడగా.. దివ్య చున్నీతో పైకప్పు ఉక్కుకు ఉరేసుకుని కనిపించింది. తలుపులు తెరిచి లోనికి వెళ్లి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. రవి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి రవిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆదాచేస్తేనే జీరో బిల్!
నవాబుపేట: వేసవిలో ఎండతాపానికి భరించలేక జనాలు ఉపశమనం కోసమని ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అధికంగా వాడుతుంటారు. ఫలితంగా విద్యుత్ మీటర్ గిర్రున తిరుగుతుంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గృహజ్యోతి పథకం వర్తించకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 200 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత కరెంట్ ఇస్తారు. 200 యూనిట్లు దాటితే బిల్లు చెల్లించాల్సిందే. వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ పొదుపు అయి గృహజ్యోతి పథకాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మండలంలో 7,000 వేల విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. అందులో 1,000 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ఇవి పాటించాలి ● మార్కెట్లో 5స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ ఉపకరణాలు మాత్రమే వినియోగించాలి. ● ఇంట్లో టీవీ అవసరం లేకపోతే రిమోట్తో కాకుండా పూర్తిగా ఆఫ్ చేయాలి. ● చార్జింగ్ పూర్తయ్యాక ఫోన్ను ఫ్లగ్ నుంచి తొలగించాలి. ● అవసరమైతేనే ఫ్యాన్లు, కూలర్లు వేయాలి. ● రిఫ్రిజిరేటర్లో కాలానుగుణంగా ఫ్రీజర్ లెవల్స్ను మార్చుకోవాలి. ● ఏసీల ఫిల్టర్లను తరచూ శుభ్రం చేస్తూ, టైమర్ను సెట్ చేసుకోవాలి. ● వాషింగ్మెషీన్లో లోడ్కు తగిన దుస్తులు మాత్రమే వేయాలి. ● నాణ్యమైన ఎస్ఈడీ బల్బులు వాడాలి. ● అవసరం ఉన్న గదుల్లో, అవసరమైనంత సేపే లైట్లు వేసుకోవాలి. 200 యూనిట్లు దాటితేబిల్లుల మోత ‘గృహజ్యోతి’పై వినియోగదారుల సంశయం -
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ ప్రపంచ అందాల పోటీల సందర్భంగా ట్యాంక్ బండ్పై ఆదివారం సాయంత్రం సండే ఫండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ సుందరీమణుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాలను తిలకించేందుకు భారీ ఎల్
కనీస వేతనాలు అమలు చేయాలి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మోమిన్పేట: కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని పెన్నార్, కార్తికేయ, ఓల్టాగ్రీన్ కంపెనీలలో పని చేస్తున్న కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కంపెనీలలో 12 గంటలు పని చేయించుకొంటున్నా కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. దీనిపై అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రోజుకు 12 గంటలు పని చేయించుకొంటున్న యాజమాన్యం రూ.12 వేల నుంచి రూ.18 వేలు మాత్రమే అందిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలను రూ.26 వేల నుంచి రూ.32 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఈ నెల 20వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంబంధించి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. -
సీపీఆర్తో ప్రాణాలు కాపాడుకోవచ్చు
మహేశ్వరం: గుండె పోటు మరణాలు పెరుగుతున్నాయని, సీపీఆర్తో ప్రాణాలు కాపాడుకోవచ్చునని జనత హృదయాలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ మల్రెడ్డి హన్మంత్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి తుమ్మలూరు మ్యాక్ ప్రాజెక్టు బీటీఆర్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీపీఆర్ ఉచిత శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. ఎవరైనా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు, లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర చికిత్స సీపీఆర్ అని తెలిపారు. ఒక వ్యక్తికి గుండె పోటు వచ్చినప్పుడు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. ఫౌండేషన్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత శిబిరాలు నిర్వహించి, పేదలకు మేలు చేస్తున్నామని డాక్టర్ పేర్కొన్నారు. పుట్టి పెరిగిన ప్రాంతానికి ఎంతోకొంత సేవ చేయాలనే లక్ష్యంతో ఉచితంగా వైద్య శిబిరాలు, పరీక్షలు, సీపీఆర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. అంతకు ముందు నిర్వహించిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమంలో పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి ప్రాక్టికల్ శిక్షణ, థియరీ తరగతులను వివరించారు. కార్యక్రమంలో డెర్మటాలజీ వైద్యురాలు మేథినిరెడ్డి, బీటీఆర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కేర్ హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ మల్రెడ్డి హన్మంత్రెడ్డి -
రండి.. సర్కారు బడిలో చేరండి
షాబాద్: ‘సర్కారు బడి పిలుస్తోంది.. రా.. కదిలిరా..’ అంటూ ఉపాధ్యాయులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసారి సర్కారు స్కూళ్లలో మంచి ఫలితాలు రావడంతో ప్రతి ఏడాది జూన్లో నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని ఈసారి ఏప్రిల్ 23 నుంచే మొదలు పెట్టారు. విద్యాశాఖ సూచనల మేరకు ఉపాధ్యాయులు ప్రచారంలో వేగం పెంచారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూన్ 6 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ప్రైవేటుకు దీటుగా.. సర్కారు స్కూళ్లలో చదవడం ద్వారా ప్రయోజనాలు, అనుభవజ్ఞులైన టీచర్లు, ఉచిత యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం.. ఇలా అన్ని ఉపయోగాలను ప్రజలకు వివరిస్తూ ప్రైవేటుకు దీటుగా టీచర్లు ప్రచారం సాగిస్తున్నారు. తమ పాఠశాలలో విద్యార్థులు సాధించిన విజయాలను తల్లిదండ్రులకు వివరిస్తూ విద్యార్థులను చేర్పించేలా ప్రోత్సహిస్తున్నారు. గ్రామ పంచాయతీ, జన సమీకరణ ఉన్న ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, పిల్లల తల్లిదండ్రులు, అంగన్వాడీల సహకారంతో కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావడంతో తల్లిదండ్రులు కూడా సర్కార్ బడుల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు వస్తున్నారని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచేలా ‘బడిబాట’ విస్తృత ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులుతల్లిదండ్రులు ఆలోచించాలి బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలి. పేద, మధ్యతరగతి వారు ప్రైవేట్ మోజులో పడి ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞలైన ఉపాధ్యాయులు ఉన్నారు. తల్లిదండ్రులు విజ్ఞతతో ఆలోచించి సర్కారు బడుల్లో తమ పిల్లలను చేర్పించాలి. టీచర్లు మరింత అంకిత భావంతో పని చేసేలా చర్యలు చేపడతాం. – లక్ష్మణ్నాయక్, ఎంఈఓ, షాబాద్ -
క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: దేశానికి కావాల్సిన ఉత్తమ క్రీడాకారులను అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంతర్జాతీయ మాజీ కబడ్డీ క్రీడకారుడు, ఒలింపిక్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి జగదీష్ యాదవ్ పేర్కొన్నారు. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ పల్లె ఆణిముత్యాల సాధన శిబిరంలో భాగంగా ఆదివారం ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జగదీష్ యాదవ్ మాట్లాడుతూ.. క్రీడకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి దేశానికి ప్రతిభావంతులను అందించాలని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తోడ్పాటునందించాలన్నారు. ఫౌండేషన్ చైర్మన్ సదా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి సమాజానికి, దేశానికి అందించేలా కృషి చేస్తామన్నారు. అనంతరం ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేందర్రెడ్డి, నల్లగొండ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు భూలోక రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవికుమార్, సుధాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్రెడ్డి, శాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మొయినాబాద్: గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రేనట్ల మల్లేష్గౌడ్ కోరారు. ఈ మేరకు ఆదివారం నగరంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ను కలిసి విన్నవించారు. రాష్ట్రంలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గౌడ కుల పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. పిడుగుపాటుకు పాడి గేదెలు మృతి కందుకూరు: పిడుగుపాటుతో మూడు పాడి పశువులు మృతి చెందాయి. ఈ సంఘటన మండల పరిధి రాచులూరులో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నల్ల కలమ్మ పాడి పశువులతో కుటుంబాన్ని పోషించుకుంటుంది. రోజులాగే పొలం వద్ద చెట్టు కింద నాలుగు గేదెలను కట్టేసింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు, పశువుల సమీపాన పిడుగు పడటంతో మూడు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వాటి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరుతోంది. శంకర్పల్లివాసులకు దళితరత్న అవార్డులు శంకర్పల్లి: పట్టణానికి చెందిన కడమంచి మల్లేశ్, తూర్పాటి నరసింహ దళితరత్న అవార్డులు దక్కించుకున్నారు. ఈ మేరకు వారు ఆదివారం హైదరాబాద్లో బెడ బుడగ జంగం వ్యవస్థాపక అధ్యక్షుడు చింతల రాజలింగం, అంబేడ్కర్ ఉత్సవాల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న సమక్షంలో అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, తిరుమల హరి, లక్ష్మయ్య, శ్రీను, శివ, చంద్రయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. నిశ్చితార్థ వేడుకకు సీఎం, మంత్రులు, ప్రముఖులుశంకర్పల్లి: జన్వాడ శివారులోని నియో కన్వెన్షన్లో ఆదివారం సాయంత్రం నార్సింగి ఏసీపీ రమణగౌడ్ కుమారుడు పవన్రాజ్, సాయిశృతి నిశ్చితార్థ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంటను ఆశీర్వదించారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ బావబావమరుదులు అవుతారు. నిశ్చితార్థ వేడుకలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్ ఎక్కిన ఆర్టీసీ బస్సు
షాద్నగర్: ముందు వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో ఆర్టీసీ బస్సు డివైడర్ ఎక్కిన ఘటన షాద్నగర్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై రాయికల్ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం సాయంత్రం సుమారు 40 మంది ప్రయాణికులతో మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోంది. బస్సు షాద్నగర్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేయడంతో జాతీయ రహదారిపై ఉన్న డివైడర్పైకి ఎక్కి కొంత దూరం వెళ్లి ఆగింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను మరో బస్సులో తరలించారు. -
ఉపాధి కల్పనే!
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 20258లోuసాక్షి, రంగారెడ్డిజిల్లా: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో జిల్లా ఉపాధి కల్పనశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల అవసరాల మేరకు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించడంతో పాటు ఎప్పటికప్పుడు జాబ్మేళాలు నిర్వహించాల్సిన అధికారులు అటువైపు దృష్టి సారించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నోటిఫికేషన్లు భారీగా తగ్గడం, నిరుద్యోగుల నిష్పత్తి కంటే చాలా తక్కువ పోస్టులను భర్తీ చేస్తుండటం, ఒక్కో పోస్టుకు వేల సంఖ్యలో పోటీ పడుతుండటం వెరసి.. టెన్త్, ఆపై తరగతులు పూర్తి చేసుకున్న వారు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫీసులో పేరు నమోదుకు ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది 751 మందికి మించి పేర్లు నమోదు చేసుకోకపోవడం గమనార్హం. ఫలితంగా ఆఫీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పెద్దగా పని లేకుండా పోయింది. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇక్కడి ఉద్యోగులకు నిరుద్యోగ యువతకు స్కిల్ మేనేజ్మెంట్లో శిక్షణ ఇప్పించడం, జాబ్మేళాలు నిర్వహించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి పనులు అప్పగించింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై), దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (డీడీయు–జీకేవై) పథకాల కిం ద నిరుద్యోగ యువతకు వివిధ అంశాలపై శిక్షణ ఇప్పించాల్సి ఉన్నా.. ఐదేళ్లుగా ఏ ఒక్కరికీ శిక్షణ ఇచ్చింది లేదు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల సేవలో.. జిల్లాలో అనేక చిన్నతరహా, మధ్య తరహా, భారీ పరిశ్రమలతో పాటు ఐటీ అనుబంధ కంపెనీలు, ఆస్పత్రులు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలు ఉన్నాయి. వీటికి సెక్యూరిటీ సహా పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది అవసరం. మెజార్టీ సంస్థలు నేరుగా కాకుండా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నాయి. జిల్లా ఉపాధి కల్పనశాఖ నుంచి లైసెన్స్ పొందిన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తుంటారు. ఇందుకోసం 2021లో జిల్లా ఉపాధి కల్పన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 86 ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు పేర్లు నమోదు చేసుకున్నాయి. ఈ సమయంలో ఒక్కో ఏజెన్సీ రూ.లక్ష చొప్పున ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ వద్ద డిపాజిట్ చేసింది. వీరిలో కేవలం 36 ఏజెన్సీలకు ఉపాధి కల్పించింది. అడిగినంత ముట్ట జెప్పిన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తూ..మిగిలిన వారికి నిరాకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉపాధి కల్పనశాఖ ద్వారా పనులు దక్కని ఏజెన్సీలు తాము కట్టిన డీడీ మొత్తాన్ని తమకు తిరిగి ఇప్పించాల్సిందిగా కోరినా పట్టించుకోవడం లేదు. దీంతో సెట్విన్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయనకు రూ.లక్ష చెక్కు రాసిచ్చారు. తీరా బ్యాంకులో డిపాజిట్ చేయగా అకౌంట్లో నగదు లేక చెక్కు బౌన్స్ కావడంతో సదరు ఏజెన్సీ నిర్వాహకుడు ఆందోళన చెందాడు. ఇదే అంశాన్ని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టి ంచుకోవడం లేదు. న్యూస్రీల్జిల్లా ఉపాధి కల్పనశాఖ నిర్లక్ష్యం యువతకు శిక్షణ ఇప్పించడంలో విఫలం జాబ్మేళాల నిర్వహణ శూన్యం 2021లో 86 ఏజెన్సీలు దరఖాస్తు 36 ఏజెన్సీలకే పని కల్పించిన వైనం నిరుత్సాహంలో నిరుద్యోగ యువతపర్యవేక్షణ లోపం ఇదిలా ఉంటే ప్రభుత్వ విభాగాలాన్నీ ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కొంగరలో రూ.50 కోట్లకుపైగా వెచ్చించి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించింది. అప్పటి వరకు లక్డీకాపూల్లో ఉన్న కలెక్టరేట్ సహా కీలక విభాగాలన్నింటినీ రెండేళ్ల క్రితమే కొంగరకు తరలించింది. జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం మాత్రం ఇప్పటికీ మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్లోనే కొనసాగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పని దినాల్లోనూ వీరు ఆఫీసులో అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు లేకపోలేదు. -
‘అందాల’ డ్రెస్ డిజైనర్ మన స్వాతి..
అనంతగిరి: ప్రపంచ అందాల పోటీల్లో భాగంగా గురువారం భూదాన్ పోచంపల్లిలో తళుక్కుమన్న ముద్దుగుమ్మలకు డ్రెస్లు డిజైన్ చేసింది ఎవరో కాదు వికారాబాద్ జిల్లాకు చెందిన మఠం వైద్యనాథ్ కూతురు ఎం.స్వాతి. ఈమె ఆరేళ్లుగా హైదరాబాద్లో మైరీతి, తరం పేరిట డ్రెస్ డిజైనింగ్ చేస్తోంది. విదేశీ వనితలు, నటీమణులు, ఉన్నత స్థాయిలో ఉన్న వారికి వివిధ ఆకృతుల్లో అందమైన డ్రెస్లు డిజైన్ చేసి ఇస్తోంది. ఈ క్రమంలో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న 40 మంది అందెగత్తెలకు వారు కోరిన విధంగా డ్రెస్లను రూపొందించింది. పోచంపల్లి, నారాయణపేట చేనేత వస్త్రాన్ని వాడి దుస్తులు తయారు చేయడం వీరి ప్రత్యేకత. గురువారం జరిగిన కార్యక్రమంలో అందాల భామలు స్వాతి డిజైన్ చేసిన డ్రెస్లు ధరించి అలరించారు. దుస్తుల తయారీకి నెల రోజులు కష్టపడినట్లు తెలిసింది. స్వాతితోపాటు మైరీతి, తరం మరో వ్యవస్థాపకులు, మితుల్ నిర్వాహకులు ఎం.మహేంద్ర, ఎం.మానస, వారి డిజైనర్స్ మౌనిక, రమ్య ఇతర సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. -
ఆయువు తీసిన ఆట వస్తువు
మీర్పేట: ఓపెన్జిమ్ పరికరం తలపై పడటంతో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మీర్పేటలో చోటు చేసు కుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జిల్లెలగూడలోని దాసరి నారాయణ కాలనీకి చెందిన ప్రసాద్ కుమారుడు నిఖిల్ (5) గురువారం సాయంత్రం స్థానికంగా ఉండే పిల్లలతో కలిసి రోజూ మాదిరిగానే ఆడుకునేందుకు పక్కనే ఉన్న చిల్డ్రన్స్ పార్కుకు వెళ్లాడు. ఓపెన్ జిమ్లోకి వెళ్లి ఎయిర్ స్వింగ్ పరికరంపైకి ఎక్కాడు. దీనికి సంబంధించిన ఇనుపకడ్డీ తలపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే.. ఓపెన్ జిమ్లోని ఎయిర్ స్వింగ్ పరికరం పాడైపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేయించలేదు. పాడైన పరికరం పక్కన పడేసి ఉండగా, గుర్తు తెలి యని వ్యక్తులు దీన్ని యథా స్థితిలో పెట్టారు. ఇది తెలియని చిన్నారి ఎయిర్ స్వింగ్పైకి ఎక్కడంతో ఇనుప బొంగు నిఖిల్ తలపై పడింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని వాకర్స్, స్థానిక కాలనీలవాసులు మండిపడ్డారు. ఓపెన్ జిమ్లోని ఎయిర్స్వింగ్ పరికరం పడి చిన్నారి మృతి మీర్పేట్లోని చిల్డ్రన్స్ పార్కులో ఘటన -
ఎల్ఆర్ఎస్ అంతంతే..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అక్రమ లే అవుట్లను 25 శాతం రాయితీతో క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మే చివరి వరకు గడువు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు చెల్లించేందుకు ఎప్పటికప్పుడు గడువు పెంచుతూ వస్తున్నా.. ప్లాట్ల యజమానుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. జిల్లాలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. మూడు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,55,923 దరఖాస్తులు అందగా, వీటిలో 1,78,591 క్రమబద్ధీకరణకు అర్హత పొంది, అర్హులైన వారికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు 65,186 మంది మాత్రమే తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.255.56 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. 77,332 దరఖాస్తులకు సంబంధించిన ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో ఉన్నట్లు గుర్తించి, వాటిని రిజెక్ట్ చేశారు. మూడుసార్లు గడువు పెంచినా.. ఖాళీ ప్లాట్లు/ లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం గత ప్రభుత్వం 2020లో నోటిఫికేషన్ జారీ చేసింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుకు రూ.పది వేలు, ఖాళీ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రూ.వెయ్యి ఫీజుగా నిర్ణయించింది. ఆ మేరకు హెచ్ఎండీఏ పరిధిలోని నాలుగు జోన్లలో 3,58,464 దరఖాస్తులు రాగా, రంగారెడ్డిలోని మూడు కార్పొరేషన్లు, పదిహేను మున్సిపాలిటీల నుంచి రెండున్నర లక్షలకుపైగా, ఫరూఖ్నగర్, కేశంపేట, యాచారం, తలకొండపల్లి, కడ్తాల్, కొందుర్గు, మాడ్గుల, మంచాల, జిల్లెడు చౌదరిగూడెం మండల కేంద్రాల నుంచి 45 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. నిజానికి మూడేళ్ల క్రితమే ఈ దరఖాస్తులను స్వీకరించినప్పటికీ వివిధ కారణాలతో క్రమబద్ధీకరణ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో వన్టైన్ సెటిల్మెంట్ పథకాన్ని (ఓఎస్ఎస్) తీసుకొచ్చి 25 శాతం రాయితీ ప్రకటించింది. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం వాటి పరిశీలన కోసం రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు ఇప్పటికే ఆయా దరఖాస్తులను పరిశీలించాయి. తొలి గడువు మార్చి 31తో ముగిసింది. తర్వాత క్రమబద్ధీకరణ గడువును ఏప్రిల్ 30 వరకు పెంచింది. ఈ గడువు కూడా ముగిసిపోవడంతో మరో మూడు రోజులు అవకాశం కల్పించింది. అయినా ఆశించిన స్థాయిలో ఫీజు చెల్లింపులు కాకపోవడంతో తిరిగి నాలుగోసారి గడువును మే 31 వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు చెల్లించక పోవడానికి కారణాలివే.. ఖాళీ ప్లాట్లకు రూ.లక్షల్లో ఫీజులు ఎందుకు చెల్లించాలనే భావన యజమానుల్లో ఉంది. గృహాలు నిర్మించే సమయంలో చెల్లిస్తే వడ్డీ కలిసి వస్తుందని భావిస్తున్నారు. గతంలో భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎల్ఆర్ఎస్కు అనుమతిస్తే.. సదరు స్థలం మార్కెట్ విలువను బట్టి దరఖాస్తుదారు ఫీజు చెల్లించేవారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలనకు ముందే ఫీజు చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించడంతో ఇందుకు వారు వెనుకాడుతున్నారు. 25 శాతం రాయితీ వర్తించాలంటే మొత్తం సొమ్ము ఒకే సమయంలో చెల్లించాల్సి వస్తోంది. వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఫీజు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్న వారి ప్లాట్లు 111 జీఓ పరిధిలో ఉండటం, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయశాఖ, ప్రభుత్వ భూముల జాబితాలో నమోదై ఉండటంతో ఆ దరఖాస్తులు క్రమబద్ధీకరణకు నోచుకోలేకపోతున్నాయి. గడువు పొడిగిస్తున్నా స్పందన నామమాత్రమే 25 శాతం రాయితీ ఇచ్చినా ప్రభావం కొంతే.. క్రమబద్ధీకరణకు ఆసక్తి చూపని యజమానులు ఆశించిన ఆదాయం రూ.600 కోట్లకుపైగా ఇప్పటి వరకు సమకూరింది రూ.255 కోట్లే ఈ నెలాఖరు వరకు మరోసారి అవకాశం -
హోర్డింగ్లపై హైడ్రా నజర్
మీర్పేట: శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొన్నేళ్లుగా ఎలాంటి అనుమతులు పొందకుండా ఏర్పాటు చేస్తున్న వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్లపై హైడ్రా దృష్టి సారించింది. మీర్పేటతో పాటు చాలా వరకు మున్సిపాలిటీల్లో ఎలాంటి అనుమతులు పొందకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అడిగేవారు లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినా స్థానిక టౌన్ప్లానింగ్ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో హోర్డింగ్లు ఏర్పాటు చేసే సంస్థలు, భవనాల యజమానులకు కొంత కాలంగా లబ్ధి చేకూరుతోంది. ఈ క్రమంలో స్థానిక మున్సిపల్ టౌన్ప్లానింగ్ విభాగంతో కలిసి హైడ్రా అక్రమ హోర్డింగ్లను గుర్తించి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. యుద్ధ ప్రాతిపదికన తొలగింపు మీర్పేట కార్పొరేషన్ పరిధి బాలాపూర్ చౌరస్తాలో రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఏ ఒక్క హోర్డింగ్కు అనుమతి లేకపోవడం గమనార్హం. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఈ ప్రాంతంలో ప్రముఖ సంస్థల వ్యాపార ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్లు ఉన్నాయి. కార్పొరేషన్లో సగం కంటే ఎక్కువ హోర్డింగ్లకు అనుమతులు లేవని హైడ్రా అధికారులు గుర్తించారు. మున్సిపాలిటీల్లో ప్రభుత్వ అనుమతులు పొందకుండా ఏర్పాటు చేసుకున్న హోర్డింగ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించనున్నట్టు తెలిపారు. మీర్పేట ప్రాంతంలో హోర్డింగ్లతో పాటు బస్ షెల్టర్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పలు విద్యాసంస్థలు, ఇతర సంస్థల ఫ్లెక్సీలను సైతం తొలగిస్తున్నట్టు చెప్పారు. మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి గుర్తించే పనిలో అధికారులు తొలగింపు ప్రక్రియ షురూమరోవైపు కొత్తవి ఏర్పాటు ఓవైపు హైడ్రా అధికారులు అనుమతులు లేని హోర్డింగ్లపై కొరడా ఝులిపిస్తుండగా, మరోవైపు అవేమీ పట్టించుకోకుండా కొత్తవి ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. మున్సిపల్ కార్యాలయం వద్ద మీర్పేట కూడలిలో ఎలాంటి అనుమతులు పొందకుండా తాజాగా భారీ హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. అక్రమ హోర్డింగ్లపై హైడ్రా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కూడలిలో హోర్డింగ్లు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
పెన్షన్దారుల సమస్యలు పరిష్కరిస్తాం
కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: పెన్షన్దారుల సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం పెన్షన్ ఆదాలత్, జీపీఎఫ్ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 27 ప్రభుత్వ శాఖల్లో పని చేసిన 93 పెన్షన్ పెండింగ్ దరఖాస్తులు 39 మంది పెన్షనర్లు, జీపీఎఫ్ చందాదారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. సంబంధిత అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా సమస్యలు లేకుండా చూస్తామని చెప్పారు. దరఖాస్తులను అకౌంటెంట్ జనరల్ హైదరాబాద్ తెలంగాణ వారికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ ఎంఎస్ చందా పండిట్, అభయ్, సోనార్కర్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పద్మావతి, జిల్లా రెవెన్యూఅఽధికారి సంగీత, డిప్యూటీ డైరెక్టర్ రాజు, సంబంధిత శాఖల అధికారులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ నెల 21 వరకు ‘దోస్త్’ షాద్నగర్రూరల్: ఇంటర్మీడియెట్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు దోస్త్ రిజిస్ట్రేషన్ ద్వారా డిగ్రీలో చేరేందుకు ఈ నెల 21 వరకు గడువు ఉందని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ అడ్మిషన్లకు దోస్త్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేరుకోవాలని తెలిపారు. ఈ నెల 29న తొలి అడ్మిషన్ల కేటాయింపు జాబితా కళాశాలకు విడుదల అవుతుందని చెప్పారు. ఈ నెల 30 నుంచి జూన్ 6 వరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే విద్యా ర్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 63050 51490, 98850 03390, 97034 41345 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి ఆమనగల్లు: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో భాగంగా బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని టీఎస్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బకాయి ఉన్న దాదాపు రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. రీయింబర్స్మెంట్ బకాయిలు ఓటీఎస్ కింద సెటిల్చేసి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చెల్లిస్తామని గతంలో సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. వెంటనే బకాయిలు చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. సమావేశంలో టీఎస్ఎస్ఓ నాయకులు వంశీ, సుదర్శన్, చిక్కి, సందీప్ తదితరులు ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో రూ.15.2 లక్షలు స్వాహా సాక్షి, సిటీబ్యూరో: పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.15.2 లక్షలు స్వాహా చేశారు. వివరాలివీ.. నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి గత నెల 9న వాట్సాప్ కాల్ వచ్చింది. తమ సూచనలతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు. తమ కంపెనీ పేరు ‘ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్’ అని, తమకు సెబీ అనుమతి కూడా ఉందని నమ్మించారు. ఐసీఐసీఐ సెక్యూరిటీ ట్రేడింగ్ పేరుతో ఉన్న యాప్ను లింక్ ద్వారా షేర్ చేసిన సైబర్ నేరగాళ్లు దాన్ని ఇన్ స్టల్ చేసుకుని, యాక్టివేట్ చేసుకోవాలని సూచించారు. అలా చేసిన బాధి తుడు దాని ద్వారానే నేరగాళ్ల ఖాతాల్లోకి రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.8.2 లక్షల చొప్పున బదిలీ చేశారు. ఈ మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లు, లాభాలతో కలిపి బ్యాలెన్స్ రూ.91.21 లక్షలకు చేరినట్లు యాప్లో బాధి తుడికి కనిపించింది. ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. నగదు వెనక్కు తీసుకోవాలంటే మరో రూ.4.3 లక్షలు డిపాజిట్ చేయాలంటూ నేరగాళ్లు చెప్పారు. అంత మొత్తం తన వద్ద లేదని బాధితుడు చెప్పగా.. విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదంటూ నేరగాళ్లు స్పష్టం చేశారు. త్వరలోనే తమ యాప్లోని ఖాతా కూడా బ్లాక్ అయిపోతుందని బెదిరించారు. దీంతో తాను రూ.15.2 లక్షల మేర మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాఫిక్ చలాన్ల సమస్య నివారించాలి
లక్డీకాపూల్ : గ్రేటర్ పరిధిలోని చర్చిల వద్ద ట్రాఫిక్ చలాన్ల సమస్యను నివారించాలంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, సీఎం ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జీ. చిన్నారెడ్డి పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన డీజీపీకి లేఖ రాశారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చర్చిల వద్ద ప్రతి ఆదివారం ప్రార్థనలకు వచ్చే క్రిష్టియన్లు రోడ్డు పక్కన వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బిషప్స్, పాస్టర్స్, క్రిస్టియన్ సంఘం ప్రతినిధులు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన చిన్నారెడ్డి చర్చిల వద్ద చలాన్ల సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. క్రిస్టియన్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనే సాల్మన్ రాజ్ నేతృత్వంలో ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరరయ్యారు. సీఎం ప్రజావాణిలో బిషప్లు, పాస్టర్ల వినతి డీజీపీకి లేఖ రాసిన ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డి -
ఔత్సాహిక ఆలోచన పెరగాలి
మొయినాబాద్: భారత దేశ యువతలో ఔత్సాహిక ఆలోచన ధోరణిని పెంపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న అరిస్టాటిల్ పీజీ కళాశాలలో ‘సుస్థిర ప్రపంచం కోసం ఔత్సాహిక, ఆవిష్కరణలు’ అనే అంశంపై రెండు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత సుస్థిర అభివృద్ధిపై ఆసక్తి పెంచుకుని.. ఆ దిశగా ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచడం కోసం మేనేజ్మెంట్ విద్యలో ఆ అంశాన్ని చేర్చాలని సూచించారు. యూఎస్ఏ స్కైలైన్ యునివర్సిటీ ప్రతినిధి శ్రీమహేష్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల పరిశ్రమల ఏర్పాటు వైపు యువత అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శాసీ్త్రయ రచనల సావనీర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ డీన్ రాములు, కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.శ్రీనివాస్రెడ్డి, కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నర్సయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకృష్ణారెడ్డి -
సేంద్రియ సాగుతో అధిక లాభాలు
మొయినాబాద్: సేంద్రియ వ్యవసాయంతో రైతులకు అధిక లాభాలు కలుగుతాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఏ.మాధవి, పి.లీలారాణి అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్లో పంటల సాగు, భూసార పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేంద్రియ పద్ధతిలో పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులతోపాటు నేల ఆరోగ్యాన్ని, భూసారాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. భూసార పరీక్షలు చేయించి నేల స్వభావాన్ని బట్టి తగిన మోతాదులో జీవన ఎరువులు వాడాలని సూచించారు. పంటల సాగులో రైతులు శాసీ్త్రయ పద్ధతులను అవలంబించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ అనురాధ, పీహెచ్డీ విద్యార్థులు రాజ్కుమార్, నవ్య, అశోక్, ఏఈఓ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.వర్సిటీ శాస్త్రవేత్తలు మాధవి, లీలారాణి -
రోడ్డును ఆక్రమించి..షెడ్డు నిర్మించి
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ డివిజన్, షేక్పేట మండలం, జూబ్లీహిల్స్ రోడ్ నెం.78 నవ నిర్మాణ్నగర్ కాలనీ వెనక ఉన్న ప్రభుత్వ స్థలంలో..ఉమ్మడి ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో పని చేసే సిబ్బంది కోసం క్వార్టర్లు నిర్మించారు. సర్వే నెం.403లో ఒక్కొక్కరికి 50 గజాల చొప్పున ఈ క్వార్టర్స్ నిర్మాణం చేపట్టారు. 1999 ప్రాంతంలో చంద్రబాబు ఇంట్లో పని చేసే సిబ్బంది కోసం ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వ స్థలంలోనే ఈ క్వార్టర్లు నిర్మించి ఇందులో ఆరుగురికి పట్టాలు కూడా ఇచ్చారు. మరో ఆరు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే చంద్రబాబు ఇంట్లో దోభీ, తోటమాలి తదితరులు ఖాళీగా ఉన్న ప్లాట్లలో ఉంటున్నారు. ప్లాట్ నెంబర్.1లో ఎలాంటి పట్టా లేకుండా సీహెచ్.మూర్తి అనే దోభీ కొంత కాలంగా అక్రమంగా నివసిస్తుండటమే కాకుండా..క్వార్టర్స్ ముందు రోడ్డును ఆక్రమించి షెడ్డు నిర్మించాడు. దీంతో స్థానికులు రాకపోకలు స్తంభించాయి. ఈ విషయమై కొంత కాలంగా పట్టాలు ఉండి అధికారికంగా ఉంటున్న వారికి, పట్టాలు లేకుండా ఖాళీ ప్లాట్లలో ఉంటున్న వారికి మధ్య రోడ్డు గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇక్కడ సీవరేజి పైప్లైన్, మంచినీటి పైప్లైన్ మంజూరు కావడంతో పాటు జీహెచ్ఎంసీ రోడ్డు పనులు కూడా ప్రారంభించాల్సి ఉంది. అయితే దోభీ మూర్తి ఆక్రమించిన స్థలంలో షెడ్డు నిర్మాణం వీటికి అడ్డుగా ఉంది. సదరు షెడ్డును తొలగిస్తే పనులు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణంపై స్థానికులు షేక్పేట తహసీల్దార్కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ అనితారెడ్డి క్వార్టర్లను పరిశీలించారు. వారి వద్ద ఉన్న పట్టాలు, ఖాళీగా ఉన్న ప్లాట్లపై ఆరా తీశారు. రోడ్డు ఆక్రమించి షెడ్డు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామని, అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు రెండు రోజుల గడువు ఇస్తున్నామని ఆమె హెచ్చరించారు. మరో వైపు పట్టాలు లేకుండానే కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వం నిర్మించిన ఈ క్వార్టర్లలో తిష్టవేసి వీటిని శాశ్వతంగా కాజేసేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఈ విషయంపై స్పందించి అక్రమార్కులను ఖాళీ చేయించి క్వార్టర్స్ అన్యాక్రాంతం కాకుండా చూడటంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో సిబ్బందికి క్వార్టర్లు వాటిలో తిష్టవేసిన అక్రమార్కులు రెవెన్యూ అధికారుల పరిశీలన అక్రమ నిర్మాణాలుతొలగించాలని ఆదేశం -
భక్తిభావాన్ని అలవర్చుకోవాలి
షాబాద్: ప్రతి ఒక్కరూ భక్తిభవాన్ని అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హైతాబాద్ గ్రామంలో శ్రీ సీతారాముల, లక్ష్మణ, భరత, శత్రజ్ఞ, హనుమంతుని విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిమ్స్లో స్లిట్ ల్యాంప్ ఏర్పాటు
లక్డీకాపూల్: నిమ్స్లో రుమటాలజీ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక స్లిట్ ల్యాంప్ను ఏర్పాటు చేశారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహకారంతో సమకూర్చిన ఈ స్లిట్ ల్యాంప్ను శుక్రవారం డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుమటాలజీ క్లినిక్లో ప్రతి మంగళవారం పిల్లలకు స్లిట్ ల్యాంప్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రుమటాలజీ రోగుల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ రూ. 4 లక్షల విలువైన ఆధునిక స్లిట్ ల్యాంప్ను సమకూర్చిందన్నారు. క్లినికల్ ఇమ్యునాలజీ, రుమటాలజీ విభాగంలో ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో రుమటాలజీ విభాగం హెచ్ఓడీ డా.లీజా రాజశేఖర్, ఎల్వీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా.ప్రసాంత్ గర్గ్, యూవైటిస్ నిపుణులు డా. బసు, పీడియాట్రిక్ రుమటాలజీ నిపుణుల డా.కీర్తి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యావకాశాలు
మంచాల: భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యావకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కార్యదర్శి అజిత్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దనున్న ఆరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం సాయంత్రం ఆయన రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో అజిత్రెడ్డి మాట్లాడుతూ.. ఆరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచుతామన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలి పారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యా శాఖ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు, చారకోన వెంకటేశ్, జోష్నా రెడ్డి, డీఈఓ సుశీందర్రావు, మండల విద్యాధికారి రాందాస్, ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లెక్సీ రాజేసిన చిచ్చు
మహేశ్వరం: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి కట్టిన ఫ్లెక్సీ అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చిచ్చు రాజేసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు గులాబీ రంగు బ్యానర్ను ఎలా వాడతారని కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గేటు వద్ద ఎమ్మెల్యే సబితారెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఆహ్వానం పలుకుతూ గులాబీ రంగుతో కూడిన బ్యానర్ కట్టారు. అధికారిక కార్యక్రమం వద్ద పార్టీ ఫ్లెక్సీ ఎందుకు కట్టారని బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ నాయకులు మాటల యుద్ధానికి దిగారు. ఎమ్మెల్యే సబితారెడ్డి కారు దిగగానే కాంగ్రెస్ నేతలు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఫ్లెక్సీని చించేశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. వెంటనే మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఇరువర్గాలను చెదరగొట్టి నచ్చజెప్పారు. పరస్పరం ఇరు పార్టీల నేతలు ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం 180 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సబితారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫ్లెక్సీ విషయంలో రాజకీయాలు చేయడం తగదన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నేరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. తులం బంగారం ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని చురకలంటించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణా నాయక్, వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ దేవరంపల్లి వెంకటేశ్వరరెడ్డి, తహసీల్దార్ సైదులు, ఎంపీఓ రవీందర్రెడ్డి, ఆర్ఐలు స్వర్ణకుమారి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వాగ్వాదం