breaking news
Rangareddy
-
పడుతూ.. లేస్తూ.. బడికి!
● ఆర్టీసీ బస్సులు అంతంతే.. ● ప్రైవేటు వాహనాలే దిక్కు ● విద్యార్థులకు తప్పని తిప్పలు చేవెళ్ల: చదువుల కోసం విద్యార్థులు నానా పాట్లు పడుతున్నారు. నిత్యం పాఠశాలలకు వెళ్లేందుకు అటు సరైన రవాణా సదుపాయం లేక.. ఇటు రోడ్లు బాగాలేక అవస్థలు పడుతున్నారు. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలకు వెళ్లే వారితో బస్సులు రద్దీగా ఉంటున్నాయి. కొన్ని గ్రామాల్లో సమయానికి అనుకూలంగా లేకపోవడంతో ఉన్నా ఉపయోగం లేకుండా పోతోంది. మరికొన్ని గ్రామాలకై తే కనీసం బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థుల కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తున్నారు. మరికొంతమంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మండలంలో మొత్తం 25 పంచాయతీలు, 11 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. సగానికిపైగా పంచాయతీల్లో ఆటోలను నమ్ముకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఇక రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనాల్లో ప్రయాణం ఇబ్బందిగా మారింది. నిత్యం ఈ రోడ్లపై దుమ్ముధూళితో అవస్థలు పడుతున్నారు. బస్సులు రాక.. బడికి వెళ్లలేక.. ధారూరు: పాఠశాలలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు రాక విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యం చింతకుంట, హరిదాస్పల్లి, అల్లీపూర్, అవుసుపల్లి, రుద్రారం, గట్టెపల్లి, రాంపూర్ తండా, స్టేషన్ ధారూరు నుంచి మండల కేంద్రమైన ధారూరులోని ప్రాథమికోన్నత పాఠశాలకు దాదాపు 20 మంది విద్యార్థులు వస్తుంటారు. చిన్నారులు ఎదుర్కొంటున్న బస్సు సమస్యలపై గురువారం శ్రీసాక్షిశ్రీ పరిశీలించగా పలు విషయాలు వెలుగు చూశాయి. ఉదయం అష్టకష్టాలు పడి స్కూల్కి వెళ్లిన రాంపూర్తండా విద్యార్థులు.. సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత ధారూరు చౌరస్తాలో బస్సుల కోసం దాదాపు గంట సేపు నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా బస్సు రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో గ్రామానికి వెళ్లారు. మరి కొందరు ద్విచక్ర వాహనదారులను లిఫ్ట్ అడిగి వెళ్లారు. అంతకుముందు విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రతి రోజూ బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు. ఒక్కోసారి చీకటి పడిన తర్వాత గ్రామానికి చేరుకోవాల్సి వస్తోందన్నారు. కొన్ని సందర్భాల్లో బస్సులు వచ్చినా పాయింట్ వద్ద ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధారూరు: చౌరస్తాలో బస్సుల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు చేవెళ్ల: ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్న విద్యార్థులు -
బస్తా కోసం.. కుస్తీ
యూరియా కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఉదయాన్నే క్యూ లైన్లలో నిలబడి.. టోకెన్లు తీసుకుని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.. ఒక్క బస్తానైనా దొరక్క పోతుందా అని కుస్తీ పడుతున్నారు.. గురువారం మంచాల పీఏసీఎస్ కార్యాలయానికి లోడ్ రాగానే అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. గంటల పాటు ఎదురు చూసినా కొందరికి ఒకే బస్తా దొరకగా.. మరికొంద రికి రిక్త హస్తమే ఎదురైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు సర్దిచెప్పి పంపించారు. – మంచాల -
గురుకులాల్లో పీజీ వరకు ఉచిత విద్య
యాచారం: రాష్ట్రంలోని గురుకులాల్లో పేద విద్యార్థులకు ఐదో తరగతి నుంచి పీజీ వరకు వసతితో కూడిన ఉచిత విద్య అందిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ జాయింట్ సెక్రటరీ బి.సక్రునాయక్ పేర్కొన్నారు. టీజీ సెట్ అడ్మిషన్లపై గురువారం తాడిపర్తి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1,023 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు ఉన్నట్టు తెలిపారు. వీటిలో ఏటా 55 వేల వరకు ఐదో తరగతిలో అడ్మిషన్లు జరుగుతున్నాయని అన్నారు. గురుకులాల్లో ఖాళీ సీట్ల కోసం ఈనెల 25 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకులాల్లో ఐదో నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. టీజీ సెట్ ద్వారా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారి నిర్మల, సర్పంచ్ నీలం ఝాన్సీ, ఉప సర్పంచ్ రమేష్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు లీలావతి, రామయ్య, నాగేశ్వర్రావు, శ్రీనివాస్, సీనియర్ ఫ్యాకల్టీ పాల్గొన్నారు. -
అన్ని వసతులతో డబుల్ బెడ్రూం ఇళ్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్రూం ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం ఆదేశించారు. గురవారం కర్మన్ఘాట్ నందనవనం కాలనీ, మల్లాపూర్, కుర్మలగూడ, బాటసింగారం, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఇళ్ల పనులను పరిశీలించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాల, వైద్య సదుపాయాలు, పార్కుల వంటివి కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కాలనీల్లో జీవనప్రమాణాలతో నివసించేందుకు వీలుగా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు ఉండాలన్నారు. వచ్చే రెండు నెలల్లో లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నందనవనంలో పునరావాసంలో భాగంగా నిర్మించిన 2 బీహెచ్కే 80 (2బ్లాక్లను) ఫ్లాట్లను ఆయన పరిశీలించారు. పూర్తయిన ఇళ్లను వారం రోజుల్లో లాటరీ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులకు అందించాలని సూచించారు. తర్వాత మల్లాపూర్లో నిర్మాణంలో ఉన్న 17 బ్లాక్ల్లో పనులను సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్లోని భూములు కబ్జా కాకుండా చర్యలు చేపట్టాలని, హైడ్రా అధికారుల సహాయం తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ను ఆదేశించారు. సెప్టెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి కావాల్సిందే అని స్పష్టం చేస్తూ, అందుకు తగ్గట్లుగా పనులన్నిటినీ ప్రణాళిక బద్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కుర్మల్గూడలో పూర్తి కావస్తు న్న 1,536 ఫ్లాట్స్ పనులను పరిశీలించి, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల పనులను మార్చి నాటికి పూర్తి చేయాలన్నారు. బాటసింగారంలోని 20 బ్లాక్ల నిర్మాణాలను చూసి పనులను వేగవంతంగా చేయాలని సూచించారు. అబ్దుల్లాపూర్ మెట్లో ఖాళీగా ఉన్న ఇళ్లను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఎం.చైతన్య కుమార్, పి.బలరాం, జి.విజయకుమార్, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డి.చంప్లానాయక్ జీహెచ్ఎంసీ అధికారులు పి.వి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
వినియోగం విరివిగా..
గ్రేటర్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ టీజీఎస్పీడీసీఎల్ వేసవి కార్యాచరణ సాక్షి, రంగారెడ్డిజిల్లా: గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా మార్చి మొదటి వారంలో నమోదు కావాల్సిన విద్యుత్ డిమాండ్ జనవరి మూడో వారంలోనే వెలుగు చూస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. ఏప్రిల్ చివరి నాటికి గ్రేటర్ ఫీక్ విద్యుత్ డిమాండ్ 5 వేల మెగా వాట్లకు చేరుకోనున్నట్లు డిస్కం అంచనా వేసింది. వేసవి కార్యాచరణలో భాగంగా ఇప్పటికే ఓవర్ లోడుతో ఉన్న సబ్స్టేషన్లు/ ఫీడర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, ఆ మేరకు వాటి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రతి నెలా 35 వేల కొత్త కనెక్షన్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 67.95 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 55.98 లక్షల గృహ, 9.15 లక్షల వాణిజ్య, 38 వేల పారిశ్రామిక, 1.53 లక్షల వ్యవసాయ, మరో 90 వేలకుపైగా ఇతర కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ప్రతి నెలా కొత్తగా మరో 35 వేల కనెక్షన్లు ఉంటున్నాయి. ఈసారి వేసవి ఎండలు భగ్గున మండే అవకాశం ఉండటంతో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేసింది. సబ్స్టేషన్లలోని పీటీఆర్లు, ఫీడర్లు, డీటీఆర్ల సామర్థ్యం పెంచే పనిలో నిమగ్నమైంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చూస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పష్టం చేశారు. తేదీ మెగావాట్లు 18 2675 19 3196 20 3345 21 3385 22 3375 సమ్మర్ యాక్షన్ ప్లాన్లో చేపట్టే అదనపు పనులు జోన్ల వారీగా.. అంశం మెట్రో మేడ్చల్ రంగారెడ్డి కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 716 1483 1158 పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు 36 58 69 కొత్తగా ఏర్పాటు చేయనున్న 11 కేవీ ఫీడర్లు 122 187 218 కొత్తగా ఏర్పాటు చేయనున్న 33 కేవీ ఫీడర్లు 37 28 53 -
బలవంతపు భూ సేకరణ సహించం
షాబాద్: దళిత రైతుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ అన్నారు. రేగడిదోస్వాడలో గురువారం నిర్వహించిన రైతు మహాధర్నాకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ల్యాండ్ పూలింగ్ పేరుతో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా పేదల భూములను లాక్కుంటోందని ఆరోపించారు. దళితుల భూములు ఎందుకోసం తీసుకుంటున్నారో.. ఏం కంపెనీలు పెడతారో.. ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పకుండా ఆక్రమించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాబాద్ మండలం రేగడిదోస్వాడ, తాళ్లపల్లి, మక్తగూడ, తిమ్మారెడ్డిగూడ, వెంకమ్మగూడ గ్రామాలకు చెందిన దళిత రైతుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడాన్ని వ్యతిరేకించారు. ఈశా ఫౌండేషన్ కోసం భూములు ఇవ్వడానికి పేదల భూములే దొరికాయా, ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలు కేటాయించవచ్చు కదా అని నిలదీశారు. చేవెళ్ల సాక్షిగా మల్లికార్జునఖర్గే సమక్షంలో పేదల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక లగచర్లలో అల్లుడి ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమిని లాక్కోవాలని చూశారని గుర్తు చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి పేదలకు న్యాయం జరిగేదాక పోరాడతామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు విజయ ఆర్య క్షత్రియ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, దేశమల్ల ఆంజనేయులు, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచ్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ -
ఎకరాకు రూ.30 లక్షల పరిహారం
కడ్తాల్: గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న మండలంలోని ముద్వీన్ రెవెన్యూ పరిధిలోని ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల భూ నిర్వాసితులు కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ నారాయణరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూ బాధితులు పరిహారానికి సంబంధించి తమ డిమాండ్లను కలెక్టర్కు విన్నవించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి స్పందిస్తూ.. గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు ప్రభుత్వం అందించే ప్యాకేజీని ప్రకటించారు. ఎకరాకు రూ.30 లక్షల నగదు పరిహారంతో పాటు, భూములు కోల్పోతున్న రైతులకు మైసిగండి గ్రామ సమీపంలో 120 గజాల ఇంటి స్థలం కేటాయిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని కూడా నిర్మిస్తామని చెప్పారు. అదే విధంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు ఒక్కోక్కరికి రూ.ఐదు లక్షల చొప్పున అదనపు సాయం అందిస్తామని వివరించారు. రోడ్డు బాగు చేయించండి సారూ అనంతరం మర్రిపల్లి నుంచి ఆమనగల్లు మండలం కోనాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారి, ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మర్రిపల్లి సర్పంచ్ ఈర్లపల్లి రవి కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ రోడ్డును త్వరితగతిన మరమ్మతులు చేయించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. సమావేశంలో భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు, భూ నిర్వాసితులు వీరయ్య, పెద్దయ్య, రంగారెడ్డి, శంకర్, శివ, వెంకటయ్య, శ్రీనయ్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూ బాధితులకు కలెక్టర్ హామీ -
మంచి నేలలతో ఆరోగ్యకర పంటలు
చేవెళ్ల: మంచి నేలలతోనే ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ దిలీప్, డాక్టర్ హిమబిందు అన్నారు. పట్టణ కేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నేల ఆరోగ్యం, సారవంతమైన భూమి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేల ఆరోగ్యం, పంట ఉత్పాదకతలో నేల పాత్ర గురించి వివరించారు. నేల పోషకాలు నేల సంతానోత్పత్తి నిర్వహణ, భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జి.మహేశ్వర్రావు, వినోద్కుమార్, ఏఓ శంకర్లాల్, మోడల్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు
అబ్దుల్లాపూర్మెట్: స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుకుంటున్న ఓ యువకుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన మండలంలోని కవాడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండారి సురేశ్(31) ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 3వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. గురువారం స్నేహితులతో కలిసి ఆయన కుంట్లూర్లోని ఓ క్రీడా మైదానంలో సరదాగా క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతని స్నేహితులు పక్కన కూర్చోపెట్టి విశ్రాంతి తీసుకోమన్నారు. అనంతరం కవాడిపల్లిలోని అతని ఇంటికి తీసుకువచ్చారు. అప్పటివరకూ బాగానే ఉన్న సురేశ్ మరోసారి అస్వస్థతలకు గురికావడంతో స్థానికులు అబ్దుల్లాపూర్మెట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు ఏడాది క్రితమే వివాహం అయింది. యువ నాయకుడు గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తీవ్ర అస్వస్థతతో వార్డు సభ్యుడి మృతి -
వేగంగా ఇంటిగ్రేటెడ్!
● కొందుర్గులో యంగ్ ఇండియారెసిడెన్షియల్ పాఠశాల ● కొనసాగుతున్న భవన నిర్మాణ పనులు ● అన్ని వర్గాలకు ఒకేచోట విద్యాబోధన షాద్నగర్: పల్లె ప్రకృతి ఒడిలో.. చదువుల కోవెలను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక వసతులతో కూడిన గురుకులానికి సీఎం రేవంత్రెడ్డి షాద్నగర్ పరిధిలోని కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.150 కోట్లతో నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కొందుర్గు తూర్పు శివారులోని సర్వే నంబర్ 109లో సుమారు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీనికి 2024 అక్టోబర్ 11న సీఎం రేవంత్రెడ్డి భూమి పూజ చేశారు. భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భవన నిర్మాణం చేపట్టే స్థలాన్ని చదును చేసి 10 ఎకరాల విస్తీర్ణంలో పునాదులను బేస్మెంట్ లెవల్ వరకు పిల్లర్లు పూర్తి చేశారు. మిగితా సెంట్రింగ్ పనులు కొనసాగుతున్నాయి. పనులు చురుకుగా చేపట్టేందుకు నిర్మాణం చేస్తున్న ప్రదేశంలోనే రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణం పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేస్తున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రతి నియోజకవర్గంలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాలమైన ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదులే కాకుండా అంతర్జాతీయ స్కూల్స్తో సమానంగా భవనాన్ని నిర్మిస్తున్నారు. విద్యార్థులకు ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధనతో విద్యనభ్యసించుతారు. సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు నాణ్యమైన బోధన అందనుంది. నాణ్యమైన విద్య ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలో అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన విద్య అందుతుంది. ఈ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించి సూచనలు ఇస్తున్నా. – వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్నగర్ -
పేదల భూములను లాక్కుంటే ఊరుకోం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ల్యాండ్ పూలింగ్ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్ట విరుద్దంగా పేదల భూములను లాక్కుంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. భూములు ఎందుకు తీసుకుంటున్నారంటూ నిలదీశారు. ఏం కంపెనీలు పెడతారు? ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పకుండా పేదలను మోసం చేసి అన్యాయంగా విలువైన భూములను ఆక్రమించాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేనపుడు ప్రభుత్వం పేదల భూములు సేకరించడం చట్టవిరుద్దమన్నారు. షాబాద్ మండలంలోని రేగడిదొస్వాడ, మక్తగూడెం, తాళ్లపల్లి, తిమ్మారెడండిగూడెం గ్రామాలకు చెందిన ఎస్సీల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈశా ఫౌండేషన్ కోసం భూములు ఇవ్వడానికి పేదల భూములే దొరికాయా? అందుకోసం ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలు కేటాయించవచ్చు కదా అని నిలదీశారు. ధనవంతులు విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించే ఆశ్రమాల కోసం పేద ఎస్సీల భూములు కావాలా అంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి మేమూ భూస్వాములమేనని చెప్పుకున్నారు,మరి వాల్ల భూములను ఈశా ఫౌండేషన్ వారికి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. ఈశా ఫౌండేషన్ వల్ల ఇక్కడి పేదలకు జరిగే లాభం ఏంటని అడిగారు. పేదలకు ఉద్యోగాలిస్తారా,చదువు చెప్తారా? హాస్పిటల్ నిర్మిస్తారా అంటూ ధ్వజమెత్తారు.దానివల్ల పేదలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.చేవెళ్ల సాక్షిగా మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో, పేదల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక, లగచర్లలో అల్లుడి ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమిని లక్కోవాలని చూశారని, ఇపుడు సద్గురు బాబా కోసం రేవంత్ బాబా ఎస్సీల భూములు లాక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసిఆర్ పేదలను పుట్టినప్పటి నుండి కేసిఆర్ కిట్ ఇచ్చి,గురుకులాలు పెట్టి డాక్టర్లను తయారు చేసి, పేదలకు మూడు ఎకరాల భూమి ఇచ్చి,దళిత బంధుతో వ్యాపారస్తులుగా తయారు చేయాలని చూశారన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పేదల భూములు లాక్కొని నిరాశ్రయులను చేసి,అడ్డా కూలీలుగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు.కంపెనీలు పెట్టుకోవడానికి హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూమి అందుబాటులో ఉన్నా,రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీల భూమిని లాక్కొని వారి పొట్ట కొట్టాలని చూస్తున్నారన్నారు. కంపెనీల కోసం కేటాయించిన భూములను హిల్ట్ పాలసీ కింద తక్కువ ధరకు అమ్ముకోవాలని చూస్తున్నారన్నారు ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో పెట్టే ప్రతి సంతకం, పేదలకు వ్యతిరేకంగానే చేస్తున్నారన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు పట్టా బుక్ జారీచేసి,పేదలకు భూములపై సర్వ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే షాబాద్ మండలంలోని రేగడిదోస్వాడలో భూమి సేకరణకు ప్రయత్నం చేస్తే, లగచర్ల స్పూర్తిగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం, భూమి మార్కెట్ విలువకు 3 రెట్లు నష్టపరిహారం చెల్లించాలన్నారు. అంతేకాకుండా భూమికి బదులు భూమే కావాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి పేదలకు న్యాయం జరిగేదాక పోరాడతామన్నారు. -
సురక్షిత ప్రయాణానికే ‘అరైవ్–అలైవ్’
చేవెళ్ల: సురక్షిత ప్రయాణానికే పోలీస్ శాఖ ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం చేపట్టిందని చేవెళ్ల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉపాధ్యాయ విజయ్కుమార్, తహసీల్దార్ కృష్ణయ్య అన్నారు. బుధవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో చేవెళ్ల కోర్టు, ప్రభుత్వ ఆస్పత్రి, తహసీల్దార్ కార్యాలయం వద్ద అరైవ్–అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి పూలు, పెన్నులు ఇస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, ఎస్ఐ శిరీష, పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు మెరుగైన పరిహారం ● నాగిరెడ్డిపల్లి బాధితులకు ఎకరాకు రూ.1.20 కోట్లు ● కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి మహేశ్వరం: ఐటీ పార్కు ఏర్పాటులో భూములు కోల్పోతున్న నాగిరెడ్డిపల్లి రైతులకు ఎకరాకు రూ.1.20 కోట్లతో పాటు 121 గజాల ప్లాటును పరిహారంగా అందజేస్తామని ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గ్రామంలో బాధిత రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహేశ్వరం మండల పరిధిలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 9, 10, 48, 49, 50, 51, 53, 54, 63, 66, 110, 144, 162, 163 సర్వే నంబర్లలో 195.5 ఎకరాల సీలింగ్ భూమిని సేకరిస్తున్నామని చెప్పారు. పరిహారం నేరుగా రైతుల ఖాతాలో జమచేస్తామన్నారు. ఇప్పటికే పలువురు రైతులు అంగీకారం తెలుపుతూ పత్రాలు అందజేశారని.. మిగిలిన రైతులు అందజేస్తే పరిహారం అందజేస్తామన్నారు. కాగా రైతులు పరిహారం పెంచాలని కోరగా.. ఇప్పటికే మూడింతల కంటే ఎక్కువ పరిహారం అంజేస్తున్నామని.. పెంచేందుకు వీలులేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం తహసీల్దార్ చిన్న అప్పల నాయుడు, మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్వర్ణకుమారి, జీపీఓ స్వప్న, సర్పంచ్ బామిని నాయక్, ఉప సర్పంచ్ జగన్, మాజీ సర్పంచ్లు, వార్డు సభ్యులు రైతులు పాల్గొన్నారు. జీపీఓఏటీజీ వర్కింగ్ ప్రెసిడెంట్గా భాస్కర్ మంచాల: గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ(జీపీఓఏటీజీ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా యాట భాస్కర్ నియమితులైనట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాపాలకు చెందిన ఆయన యాచారం తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. అవకాశం కల్పించిన సంఘం రాష్ట్ర, జిల్లా బాధ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
అయ్యసాగరంలో హెర్బల్ పార్క్ ఏర్పాటు
ఎఫ్ఆర్ఓ వెంకటయ్యగౌడ్ ఆమనగల్లు: అయ్యసాగరం అటవీ ప్రాంతంలో 125 ఎకరాల్లో హెర్బల్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని ఆమనగల్లు అటవీశాఖ రేంజ్ అధికారి వెంకటయ్యగౌడ్ అన్నారు. పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. డీఎఫ్ఓ రోహిత్ ఆదేశాల మేరకు పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. శ్రీశైలం నుంచి వచ్చే పర్యాటకులు, ఈ ప్రాంత ప్రజలు సేద తీరేందుకు పార్క్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ పార్క్లో 15 కిలో మీటర్లు, 4 కి.మి., 2 కి.మి దూరంలో 3 వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి వీలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. హోటల్స్ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తల్లీకుమారుల అదృశ్యం మీర్పేట: భర్తతో గొడవపడిన మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం.. బడంగ్పేట లోకాయుక్తకాలనీలో నివాసముండే రమేష్, అనూష(36)లు భార్యాభర్తలు. వీరికి ఆర్యన్(6), సూయాన్(3) కుమారులు ఉన్నారు. ఈనెల 20వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన అనూష ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి కనిపించకుండా పోయింది. ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త రమేష్ బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాలు, బ్యాంకు సేవలపై అవగాహన కందుకూరు: ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధి మీర్ఖాన్పేటలో సైబర్ నేరాలు, బ్యాంకు సదుపాయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ సైబర్ నేరాల గురించి వివరించారు. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు ఏవిధంగా జరుగుతున్నాయో అవగాహన కల్పించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఎస్బీఐ మేనేజర్ ఆర్ఎల్ఎన్ శాస్త్రి బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. 18 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వారు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద రూ.20 చెల్లించి వ్యక్తిగత ప్రమాద బీమా చేసుకోవాలని సూచించారు. రూ.436 చెల్లించి జీవన జ్యోతి బీమా పథకంలో చేరవచ్చని తెలిపారు. బీమా పొందిన వారు మృతి చెందితే రూ.2 లక్షలు నామినీకి అందుతుందన్నారు. అనంతరం ప్రమాద బీమాలో సభ్యులుగా ఉండి మరణించిన వారికి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ సైదులు, నాయకులు వై.వెంకటేశ్, మల్లేశ్ యాదవ్, ఎస్కే రఫియా, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కల్లుగీత సహకార సంఘం నియామకం కడ్తాల్: ఆమనగల్లు ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని మర్రిపల్లిలో బుధవారం కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్, ఎస్ఐ చంద్ర కిరణ్ పర్యవేక్షణలో కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం గ్రామ అధ్యక్షుడిగా యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడిగా రాములుగౌడ్, కార్యదర్శిగా ఎన్.పెద్దయ్యగౌడ్, డైరెక్టర్లుగా నర్సింహగౌడ్, జంగయ్యగౌడ్ నియమితులయ్యారు. నూతన కమిటీకి సీఐ బద్యానాథ్ చౌహాన్ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం నాయకులు నూతనకమిటీని అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేశ్గౌడ్, మల్లేశ్గౌడ్, నారాయణగౌడ్ జంగయ్యగౌడ్, హెడ్ కానిస్టేబుల్స్ శంకర్, చానాగౌడ్ పాల్గొన్నారు. -
ప్రైవేట్ బడులపై చర్యలు తీసుకోండి
తుర్కయంజాల్: వసంత పంచమి పేరుతో ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించిన కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య(ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎప్ జిల్లా కార్యదర్శి పి.శివకుమార్గౌడ్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పండుగల పేర్లను చెప్పి, ప్రజలను సెంటిమెంట్తో రెచ్చగొట్టి అడ్మిషన్లు ప్రారంభించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పూర్తిగా విస్మరిస్తూ, ఇష్టారాజ్యంగా సోషల్ మీడియా వేదికగా, భారీ ఫ్లెక్సీలతో పలు పాఠశాలలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయని గుర్తుచేశారు. వసంత పంచమి పేరుతో జరుగుతున్న అడ్మిషన్ల దందాపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరికృష్ణానాయక్, శివ, వివేక్ తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎప్ జిల్లా కార్యదర్శి శివకుమార్గౌడ్ వసంత పంచమి పేరుతో అడ్మిషన్లు చేపడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి– ఏఐవైఎఫ్ -
ఉపాధి హామీ పేరు మార్పు అన్యాయం
షాబాద్: పూర్వపు ఉపాధి హామీ పథకం స్వరూపాన్ని మార్చి కేంద్రం ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీంభరత్ ఆరోపించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ బుధవారం మండల పరిధిలోని కుర్వగూడ ఉపాధిహామీ కూలీలతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని, ఉన్న పథకాన్ని రద్దు చేయడం సరికాదన్నారు. దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అందులో భాగంగా గాంధీజీ పేరు తొలగించిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకురాళ్లు స్వరూప, అశ్విని, మహేశ్వరి, కవిత, అమృత తదితరులున్నారు. -
మాంసాహార జంతువుల గణన
వివరాలు సేకరిస్తున్న అటవీశాఖ అధికారులు యాచారం: ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా బుధవారం గునుగల్ అటవీ ప్రాంతంలో సర్వే నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని గునుగల్, ఇబ్రహీంపట్నం అటవీ ప్రాంతాల్లో రెంజ్ అధికారి శ్రీనివాస్రెడ్డి, యాచారం సెక్షన్ అధికారి నర్సింహల సమక్షంలో సర్వే చేపట్టారు. 21, 22 తేదీల్లో మాంసాహార జంతువుల సర్వే, 23, 24, 25 తేదీల్లో శాఖహార జంతువుల సర్వే చేపడుతామని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో ఏఏ జంతువులు సంచరిస్తున్నాయి. వాటి సంరక్షణ ఎలా ఉంది, ఇబ్బందులేమైన పడుతున్నాయా, రక్షణ చర్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సర్వే చేపడుతున్నారు. అటవీ ప్రాంతంలో మొత్తం జంతువుల సర్వే గణన చేపడుతామని జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్రెడ్డి తెలిపారు. శ్రీశైలం, మన్నానూర్ అటవీ ప్రాంతాలు.. రంగారెడ్డి జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాలకు లింకు ఉండడంతో చిరుత పులులేమైనా వచ్చాయా అని ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 28,627 హెక్టార్లు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో జంతువుల సర్వే గణన జరుపుతామని ఆయన వివరించారు. ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్లో.. చేవెళ్ల: జీవ వైవిధ్యాన్ని, అడవుల పరిరక్షణ లక్ష్యాలను అంచనా వేసేందుకు ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా సర్వే చేపడుతున్నట్లు చిలుకూరు–ముడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మణ్ అన్నారు. మండల పరిధిలోని ముడిమ్యాల ఫారెస్ట్లో బుధవారం మాంసాహార జంతువుల గణన చేపట్టారు. మూడు రోజులు చొప్పున లైన్ ట్రాంజెక్ట్, ట్రయల్ పాత్ సర్వే చేస్తూ డాటాను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ వివరాలు సేకరించి నివేదికను ఫారెస్ట్ ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి రవికుమార్, ఫారెస్ట్ వాచర్ విజయ్ పాల్గొన్నారు. -
గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి
మాజీ మంత్రి సబితారెడ్డి శంకర్పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఆమె నివాసంలో మాజీ కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ దండు సంతోశ్, మహేశ్ సబితారెడ్డి, యువనేత కార్తీక్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, హామీల అమలులో విఫలమైన తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీ గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో శంకర్పల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, నాయకులు నర్సింలు, ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. -
మా గ్రామంలో బెల్టుషాపులు వద్దు
కొందుర్గులో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామస్తులు కొందుర్గు: మండల కేంద్రమైన కొందుర్గులో బెల్టు దుకాణాల తొలగింపునకు గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చౌడపురం ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని కాలనీల్లో కిరాణ దుకాణాల్లో మద్యం విక్రయిస్తున్నారని, వాటిని తొలగించాలని గ్రామస్తులు కోరారు. బెల్టు షాపుల రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో బెల్టు దుకాణాలు తొలగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం వైన్స్ షాపులకు వెళ్లి బెల్టు దుకాణాలకు మద్యం విక్రయించవద్దని సూచించారు. అనంతరం తహసీల్దార్ ఆజాం అలీకి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేఖ, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
పాత సిబ్బందినే కొనసాగించండి
మంచాల: మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో కొన్నేళ్లుగా వంట చేస్తున్న కార్మికులను మాత్రమే కొనసాగించాలని సీఐటీయూ(మధ్యాహ్న భోజన పథకం యూనియన్) జిల్లా అధ్యక్షురాలు వై.స్వప్న అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రధానోపాధ్యాయుడు గిరధర్గౌడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో అన్ని పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మారిందన్నారు. అధికారులు కొత్తగా వంట సిబ్బందిని తీసుకోవాలనే నిర్ణయం విరమించుకోవాలన్నారు. పాత సిబ్బంది 20 ఏళ్లుగా అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించారని చెప్పారు. నేడు పాత వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ, మధ్యాహ్న భోజనం పథకం యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు కల్పన, సరిత తదితరులు పాల్గొన్నారు. -
టాలెంట్ టెస్టులతో మేథోశక్తి పెంపు
మొయినాబాద్: విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి మనోవిజ్ఞానాన్ని పెంపొందించేందుకు టాలెంట్ టెస్టులు దోహదపడతాయని ఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచయ్య అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల సాంఘిక శాస్త్రం ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు బుధవారం మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ టాలెంట్ టెస్ట్ విద్యార్థులకు భవిష్యత్తులో కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి టెస్టులు నిర్వహించి విద్యార్థుల్లో మనో విజ్ఞానాన్ని నింపాలన్నారు. టాలెంట్ టెస్ట్ నిర్వహించిన ఎస్ఆర్పీలు లలితారెడ్డి, సక్కుబాయ్లను అభినందించారు. మొదటి బహుమతి శిరీష, ద్వితీయ బహుమతి హమన్, తృతీయ బహుమతి శ్రీధర్, కన్సల్టేషన్ బహుమతి శాలిని గెలుచుకున్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు బందయ్య, అసోసియేట్ అధ్యక్షుడు రాములు, ఉపాధ్యాయులు వెంకట్రెడ్డి, వినోద్, పద్మ, తుకారాం, రవి, జ్యోతి, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
మల్బరీ సాగుతో సుస్థిర ఆదాయం
ఆమనగల్లు: రైతులు సంప్రదాయ పంటలతో పాటు మల్బరీ సాగు చేసి ఏడాది పొడవునా సుస్థిర ఆధాయం పొందవచ్చని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. తలకొండపల్లి మండలం కోరింతకుంటతండాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన పట్టు పరిశ్రమ రిసోర్స్ సెంటర్ను బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పండ్ల తోటలు, కూరగాయలు, పట్టు పరిశ్రమ, ఆయిల్పాం సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యాన, మల్బరీ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సబ్సిడీలు అందిస్తున్నాయని చెప్పారు. వీటిని వినియోగించుకుని రైతులు మల్బరీ సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఆరుతడి పంటలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. పట్టుసాగుతో స్వల్ప కాలంలో దిగుబడి చేతికి వస్తుందని, మార్కెటింగ్కు ఇబ్బందులు ఉండవని ఆమె సూచించారు. పట్టుసాగుపై జిల్లాలో ఇటీవల రైతులు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత, జిల్లా అధికారి సురేశ్, ఏడీ నాగరత్నం, రిసోర్స్ సెంటర్ నిర్వాహకుడు సక్రునాయక్, అధికారులు హిమబిందు, సౌమ్య పాల్గొన్నారు.రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా -
భారతి సిమెంట్తో నిర్మాణం వేగం
బడంగ్పేట్: సిమెంట్ రంగంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5 స్టార్ గ్రేడ్ను తెలంగాణలో విడుదల చేసిందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తెలిపారు. బుధవారం బడంగ్పేటలోని కనకదుర్గ స్టీల్ హౌస్లో తాపీమేసీ్త్రల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సామ్రాట్ మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫస్ట్తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందన్నారు. అల్ట్రాఫస్ట్తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జీలు, రహదారులకు సరైన ఎంపిక అని పేర్కొన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందచేస్తామని స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకు వచ్చి సహాయపడతారని తెలిపారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫస్ట్ రూ.20 రూపాయలు అధికంగా ఉంటుందన్నారు. ఈ సందర్బంగా బిల్డర్లకి రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను 20 మందికి అందజేశారు. కార్యక్రమంలో డీలర్ కొండల్రెడ్డి, కాంట్రాక్టర్లు, తాపీమేసీ్త్రలు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగిరం చేయండి మంచాల: తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధి పనులను వేగిరం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం ఆయన పాఠశాలలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళాశాల మైదానంలో అదనంగా రెండు అంతస్తుల భవనాలు, బాస్కెట్ బాల్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు అథ్లెటిక్స్కు అనుగుణంగా మైదానం ఏర్పాటు చేయాలన్నారు. మైదానంలోని విద్యుత్ స్తంభాలను తొలగించాలని సూచించారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, పాల్గొన్నారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ 56 శాతం మించలే!
15 మంది వీఏఓలకు షోకాజ్ నోటీసులు సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఫార్మర్ రిజిస్ట్రీ జిల్లాలో ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు. ఇప్పటి వరకు 56 శాతం మించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా 1.97 లక్షల మంది రైతులు ఉన్నట్లు అంచనా. వీరిలో ఇప్పటి వరకు 85 వేల మంది మాత్రమే తమ పేర్లు, భూములు, పంటల వివరాలను నమోదు చేయించారు. మెజార్టీ లబ్ధిదారులు గ్రామాల్లో ఉండకపోవడం, నగరంలో స్థిరపడటమే తక్కువ రిజిస్ట్రీకి కారణమని తెలిసింది. 60 వేల మంది రైతులు భూములను కలిగి ఉన్నప్పటికీ.. సాగుకు దూరంగా ఉన్న వాళ్లు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఫార్మర్ రిజిస్ట్రీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 15 మంది వీఏఓలకు రెండు రోజుల క్రితం జిల్లా వ్యవసాయశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడం కొసమెరుపు. ప్రస్తుత యాసంగిలో 1.57 లక్షల ఎకరాల పంట సాగు అవుతుందని అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు 1.19 లక్షల ఎకరాలు మాత్రమే సాగైనట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మొయినాబాద్రూరల్: సర్పంచ్లుగా గెలిచిన వారు గ్రామాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సూచించారు. బుధవారం సర్పంచ్ల సంఘం కమిటీ ఎంపీని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్రెడ్డి సర్పంచ్లను సన్మానించి అభినందనలు తెలిపారు. పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. ఎంపీని కలిసిన వారిలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షకుడు ప్రవీణ్రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి రాజేందర్రెడ్డి, పాషా, పద్మసంజీవరెడ్డి, పలువురు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణం డల్
గురువారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి, రంగారెడ్డిజిల్లా: నిర్మాణ ఖర్చులు ఇందిరమ్మ ఇళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరిగిన మేసీ్త్ర కూలీలు, స్టీలు, సిమెంట్, ఇసుక ధరలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముందరి కాళ్లకు బంధనాలు వేస్తున్నాయి. ఫలితంగా నిర్మాణాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నుంచి ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారుల్లో ఇప్పటికీ పలువురు ముగ్గు కూడా పోయలేదు. మెజార్టీ నిర్మాణాలు బేస్మెట్ లెవల్ కూడా దాటలేదు. ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయానికి.. క్షేత్రస్థాయిలో ఖర్చులకు పొంతన ఉండడం లేదు. దీంతో మెజార్టీ లబ్ధిదారులు చేపట్టిన నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు వెనుకాడుతున్నారు. ప్రభుత్వం జిల్లాకు మొత్తం 17,675 ఇళ్లు కేటాయించగా, వీటిలో 15,543 ఇళ్లు మంజూరు చేసింది. 13,193 ఇళ్లకు మార్కింగ్ చేసి, ఆన్లైన్ ట్యాగింగ్ ప్రక్రియ సైతం పూర్తి చేశారు. కాగా పెరిగిన ధరలకు భయపడి ఇప్పటి వరకు 2,350 మంది ముగ్గు కూడా పోయలేదు. 10,327 నిర్మాణాలు ఇప్పటికీ బేస్మెట్ లెవల్లోనే నిలిచిపోయాయి. కేవలం 355 మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు పూర్తి చేశారు. నిర్మాణాలకు వెనుకడుగు ● చేవెళ్ల నియోజకవర్గానికి 2,800 ఇళ్లు కేటాయించగా, వీటిలో 2,491 ఇళ్లకు పరిపాలనా పరమైన అనుమతులు లభించాయి. నియోజకవర్గంలోని చేవెళ్ల, నార్సింగి, శంకర్పల్లి మున్సిపాలిటీలు సహా జన్వాడ, మిర్జాగూడలో 650 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో 132 మంది లబ్ధిదారులు ఇప్పటికీ ముగ్గు పోయలేదు. 106 ఇళ్లు బేస్మెట్ లెవల్లోనే ఉన్నాయి. ఇదే నియోజకవర్గం పరిధిలోని గ్రామ పంచాయతీల్లో 2,150 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో 225 మంది లబ్ధిదారులు ముగ్గు పోయలేదు. మరో 338 నిర్మాణాలు బేస్మెట్ లెవల్ కూడా దాటలేదు. ● ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, వీటిలో 3,397 మంజూరయ్యా యి. ఆదిభట్ల, పెద్ద అంబర్పేట్, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల పరిధిలో 1,748 ఇళ్లు కేటాయించగా, మిగిలిన 1,752 ఇళ్లను గ్రామీణ ప్రాంతాలకు కేటాయించారు. వీటిలో 533 మంది లబ్ధిదారులు ముగ్గు కూడా పోయలేదు. 688 ఇళ్లు ఇప్పటికీ బేస్మెట్ స్థాయి దాటలేదు. ● కల్వకుర్తి నియోజకవర్గానికి 2,385 ఇళ్లు కేటాయించగా, 2180 మంజూరయ్యాయి. ఆమనగల్లు మున్సిపాలిటీకి 360 ఇళ్లు కేటాయించగా, మిగిలినవి రూరల్ ఏరియాలకు కేటాయించారు. ఇప్పటి వరకు ఇక్కడ 209 మంది ఇంకా ముగ్గు పోయలేదు. 437 నిర్మాణాలు కనీసం బేస్మెట్ లెవల్ దాటలేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ● మహేశ్వరం నియోజకవర్గానికి 3,390 ఇళ్లు కేటాయించగా, వీటిలో 3,205 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. బడంగ్పేట్, జల్పల్లి, మీర్పేట్, తుక్కుగూడ మున్సిపాలిటీలకు 1,018 ఇళ్లు కేటాయించగా, 862 ఇళ్లు మంజూరయ్యాయి. ఇక్కడ ఇప్పటి వరకు 836 మంది ముగ్గు కూడా పోయలేదు. 390 నిర్మాణాలు బేస్మెట్ దాటలేదు. ● రాజేంద్రనగర్ నియోజకవర్గానికి 2,100 కేటాయించగా, వీటిలో 1,001 ఇళ్లకు మాత్రమే అనుమతులు లభించాయి. ప్రొసీడింగ్స్ అందుకున్న వారిలో 42 మంది ఇప్పటికీ ముగ్గు పోయలేదు. మరో 251 నిర్మాణాలు బేస్మెట్ కూడా దాటలేదు. ఇప్పటి వరకు ఇక్కడ 31 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ● షాద్నగర్ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, 3,269 మాత్రమే మంజూరయ్యాయి. 285 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు ముగ్గు కూడా పోయలేదు. 712 నిర్మాణాలు బేస్మెట్ స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 35 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. పెరిగిన ముడిసరుకు ధరలతో పురోగతి నిల్ ఇప్పటికీ ముగ్గుపోయని 2,350 మంది లబ్ధిదారులు 10,327 నిర్మాణాలు బేస్మెట్కే పరిమితం ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు చెల్లిస్తుంది. ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటికే రూ.250 కోట్లకుపైగా జమ చేసింది. కుటుంబ సభ్యులు చనిపోయి కొంత మంది, స్థల వివాదాలతో మరికొంత మంది లబ్ధిదారులు పనులు ప్రారంభించలేదు. ఇలాంటి వారిని గుర్తించి ఒత్తిడి తీసుకొస్తున్నాం. అయినా నిరాకరిస్తే వారి ప్రొసీడింగ్స్ రద్దు చేసి, వెయిటింగ్ జాబితాలో ఉన్నవారికి కేటాయిస్తున్నాం. ఆర్థిక స్థోమత లేని పేదలకు మహిళా పొదుపు సంఘాల నుంచి లోన్లు ఇప్పిస్తున్నాం. ఇసుక, ఇటుక, స్టీలు, సిమెంట్ సమస్య లేదు. ప్రభుత్వమే ఇసుక యార్డులను నిర్వహిస్తోంది. లబ్ధిదారులు కోరిన వెంటనే సరఫరా చేస్తుంది. 600 చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి నిర్మించే ఇళ్లకు ప్రభుత్వ ఆర్థిక సహాయం నిలిపివేస్తున్నాం. – చంప్లానాయక్, పీడీ, హౌసింగ్ -
రూ.10 లక్షలు మింగేశారు
బడంగ్పేట్: పేద విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేటాయించిన పీఎం స్కీం నిధులు మాయమవుతున్నాయి. విద్యార్థుల అభివృద్ధికి కేటాయించిన రూ.10లక్షల నిధులను స్వాహా చేసి తప్పుడు బిల్లులు సృష్టించి ఆడిట్కు వచ్చిన వారిని సైతం బోల్తా కొట్టించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. ఇది గమనించిన ఓ ఉపాధ్యాయుడు సోమవారం ఆధారాలతో సహా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. విద్యార్థులను టూర్కు తీసుకెళ్లామని.. బడంగ్పేట జెడ్పీహెచ్ఎస్లో గత ఏడాది గుర్రం జగదీశ్వర్రెడ్డి ఎఫ్ఏసీ హెచ్ఎంగా పనిచేశారు. (ప్రస్తుతం తుప్రాన్పేటలో జీహెచ్ఎం) ఇదే పాఠశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడి సహకారంతో పీఎం శ్రీ నిధుల గోల్మాల్కు పథకం వేశాడు. గ్రీన్ స్కూల్ క్షేత్ర పర్యటన పేరుతో విద్యార్థులను కాలేశ్వరం టూర్కు తీసుకు వెళ్లామని.. అందుకు స్నాక్స్కు, చిలుకూరు ఉస్సేన్ ట్రావెల్స్కు, పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించామని, సైన్స్ ఫెయిర్లు ఏర్పాటు చేశామని ఇలా తప్పుడు పత్రాలు జత చేసి రూ.10లక్షలు కాజేశారు. కాగా విద్యార్థులను లక్నవరం వంతెన, జూపార్కు క్షేత్ర పర్యటన తీసుకెళ్తామని ఒక్కో విద్యార్థి నుంచి రూ.500 నుంచి రూ.వేయి వరకు వసూలుచేశారు. కాగా జగదీశ్వర్రెడ్డిని సస్పెండ్ చేసి ఖాజేసిన నిధులు రాబట్టాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘పీఎం శ్రీ’నిధులు కాజేసిన ప్రధానోపాధ్యాయుడు క్షేత్రపర్యటన పేరిట తప్పుడు రసీదులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బడంగ్పేట్ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు హెచ్ఎం జగదీశ్వర్రెడ్డిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్ -
ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫౌండేషన్ కోర్సు
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకులు రామారావు ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు నెలల పాటు నిర్వహించే ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకులు రామారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ నిర్వహించే 2025–26కు గాను స్టేట్ సర్వీసెస్, కానిస్టేబుల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు, స్టడీ మెటీరియల్స్ అందజేస్తామన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈ నెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో స్టడీ సర్కిల్ నుంచి కోచింగ్ తీసుకున్నవారు అనర్హులని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 8న అర్హత పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు ఎల్.వెంకటయ్య హనరరీ డైరెక్టర్, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నంబర్ 94405 21419లో సంప్రదించాలన్నారు. 27న హయత్నగర్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం బోధించేందుకు గెస్ట్ లెక్చరర్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు రసాయన శాస్త్రంలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. పీహెచ్డీ, ఎన్ఈటీ, ఎస్ఈటీ, ఎస్ఎల్ఈటీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 24 తేదీ లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. హయత్నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్గా జాకీర్ అహ్మద్ మొయినాబాద్: మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్గా జాకీర్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన ఆయన బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఖాజా మొయిజుద్దీన్ బైంసాకు బదిలీ మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన ఖాజా మొయిజుద్దీన్ నిర్మల్ జిల్లా బైంసాకు బదిలీ అయ్యారు. నూతన మున్సిపాలిటీకి తొలి కమిషనర్కు వచ్చిన ఆయన ఏడాదిలోనే వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్నారు. ఆగస్టు 15న వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేయకపోవడంతో చిలుకూరు వాసులు ఆయన్ను నిలదీశారు. స్థానికులపై ఆయన దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన ప్రజలు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేయడంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల పెద్దమంగళారం రెవెన్యూలో గిరిజనుల ఇళ్ల కూల్చివేతలోనూ ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలను ఎదుర్కొన్నారు. డీసీ త్రిల్లేశ్వర్రావు డీసీఎంఏ కార్యాలయానికి.. బడంగ్పేట్: సర్కిల్–16కు డీసీగా వ్యవహరిస్తున్న త్రిల్లేశ్వర్రావును బుధవారం సీడీఎంఏ కార్యాలయానికి బదిలీ చేశారు. జీహెచ్ఎంసీలో బడంగ్పేట, మీర్పేట కార్పొరేషన్లను బడంగ్పేట సర్కిల్–16 పేరుతో ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇక్కడ మొదటి డిప్యూటీ కమిషనర్గా వచ్చిన త్రిల్లేశ్వర్రావు బడంగ్పేట కమిషనర్గా ఉన్న సమయంలో అవినీతి మరకలు ఉన్నాయి. ఆయన బదిలీపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్కు ధన్యవాదాలు తెలిపారు. పట్నంకు సుదర్శన్ ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణరెడ్డి బుధవారం పదోన్నతిపై జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో దేవరకొండ మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ ఇక్కడికి రానున్నారు. -
‘ఉపాధి’ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
కడ్తాల్: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీయూఎఫ్ఐడీసీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని వీబీ జీ రామ్ జీ గాపేరు మార్చడాన్ని నిరసిస్తూ బుధవారం మండల పరిధిలోని చరికొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు 20 ఏళ్ల క్రితం ప్రధాని మన్మోహన్సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. గాంధీజీ ప్రతిష్టను దెబ్బతీసేందకు బీజేపీ ఇష్టారాజ్యంగా పేరుమార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త చట్టంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం నిధులు కేటాయించాలనే నిబంధనను తీసుకువచ్చి పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. పేదల పక్షాన కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్గౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు మహేందర్గౌడ్, కరుణాకర్గౌడ్, రవి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికాంత్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాములుగౌడ్, వెంకటయ్యగౌడ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. టీయూఎఫ్ఐడీసీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి -
వసంత పంచమికి ఏర్పాట్లు
● ముస్తాబైన జ్ఞాన సరస్వతి ఆలయం ● రేపు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామిజీ చేతులమీదుగా సామూహిక అక్షరాభ్యాసం యాచారం: నందివనపర్తిలోని జ్ఞాన సరస్వతి ఆలయం వసంత పంచమి వేడుకలకు ముస్తాబైంది. అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఇక్కడ శ్రీ పంచమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను శ్రీ జ్ఞాన సరస్వతి సేవా సమితి ట్రస్ట్, జ్ఞాన సరస్వతి సంస్థాన్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త సదా వెంకట్రెడ్డి పర్యవేక్షణలో నిర్వహిస్తారు. ఆలయ పూజారి రాఘవేంద్రశర్మ నిర్వహించే ఈ పూజలకు యువత స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం హోమం.. రాత్రి పల్లకీసేవ జ్ఞాన సరస్వతి ఆలయ ఆవరణలో రేపు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నారు. హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ చిన్నారులతో అక్షరాలు దిద్దించి దీవెనలు అందించనున్నారు. జిల్లా వాసులతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్, హైదరాబాద్ తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అక్షరాభ్యాసానికి కావాలల్సిన పలక, బలపం, అమ్మవారి ఫొటో, ప్రసాదం ఆలయ కమిటీ అందజేస్తుంది. చిన్నారుల తల్లితండ్రులు తమలపాకులు, పూలు, పండ్లు, కుడక, 1.25 కేజీల బియ్యం, పసుపు, కుంకుమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యార్థులచే శ్రీ సరస్వతి హోమంరాత్రి ఏడు గంటల నుంచి పదో తరగతి విద్యార్థులతో అమ్మవారి పల్లకీ సేవ ఉంటుంది. అక్షరాభ్యాసం ఉంటే ఉదయం ఎనిమిది గంటల లోపే ఆలయానికి చేరుకోవాలని ఆలయ ధర్మకర్త సదా వెంకట్రెడ్డి తెలిపారు. -
బకాయిలపై నజర్
30 లోపు చెల్లించండి పీఏసీఎస్లో దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు మార్చి 30లోపు అప్పు బకాయితో పాటు వడ్డీని కూడా చెల్లించండి. రైతుల్లో అవగాహన కోసం డీసీసీబీ ఉన్నతాధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. రుణాలు చెల్లించకపోతే వారి ఆస్తుల జప్తునకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. – నాగరాజు, సీఈఓ, పీఏసీఎస్ యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో రుణాలు పొందిన రైతుల నుంచి బకాయిల వసూల్ చేయడానికి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 30 లోపు బకాయిలు చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నారు. సకాలంలో చెల్లిస్తే సరే.. లేదంటే వడ్డీ పెరిగి మరింతా అప్పుకుప్పలాగా మారుతుందని తెలియజేస్తున్నారు. యాచారం పీఏసీఎస్లో 8,832 మంది రైతులు(సభ్యత్వం పొందిన) ఉన్నారు. వారిలో ఫౌల్ట్రీ, డెయిరీ, మేకల, గొర్రెల తదితర పథకాల కింద 938 మంది దీర్ఘకాలికం కింద రూ.45 కోట్ల రుణాలు పొందారు. తమ పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న భూమిని పీఏసీఎస్ మీద మార్టిగేషన్ చేసి ఒక్కో రైతు రూ.10 నుంచి రూ.20 లక్షలకు పైగానే రుణం పొందారు. రెండు నుంచి ఐదేళ్ల కాల వ్యవధిలో అప్పుతో సహా వడ్డీని చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. లక్ష్యం రూ.35 కోట్లు 2026–27 ఏడాదికిగాను వసూళ్ల టార్గెట్ లక్ష్యం రూ.35 కోట్లు పెట్టుకున్నారు. గతేడాది సైతం అనుకున్న విధంగా బకాయిలు వసూలు కాకపోవడంతో రైతులకు అపరాధ వడ్డీ అధికంగా పడింది. అంత భారాన్ని చెల్లించలేని దుస్థితికి చాలామంది వెళ్లారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని డీసీసీబీ, పీఏసీఎస్ అధికారులు సంయుక్తంగా స్పెషల్డ్రైవ్కు సంకల్పించారు. మార్చి 30 లోపు అప్పు వాయిదాతో కూడిన బకాయిని చెల్లించేలా రైతులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. అప్పు వాయిదాలు చెల్లించని రైతులకు ఆ తర్వాత నోటీసులు జారీ చేసి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది వసూల్ చేయాల్సిన టార్గెట్ రూ.35 కోట్లల్లో కనీసం రూ.20 కోట్లకు పైగా వసూల్ చేయకపోతే రుణాల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకున్న రైతులకు ఇవ్వడం కష్టమేనని అధికారులు అంటున్నారు. పంట రుణాలు అంతే యాచారం పీఏసీఎస్లో వ్యవసాయ పంట రుణాలను కూడా రైతులు తీసుకున్నారు. 1,102 మంది రైతులు రూ.13 కోట్లకు పైగా పంట రుణాలను పొందారు. రైతులు సైతం మార్చి 30 లోపు రెన్యూవల్ లేదా.. వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రెన్యూవల్ చేయించి వడ్డీ చెల్లిస్తే ఏడు శాతం, అదే గడువు దాటితే మాత్రం 13 శాతం వడ్డీ పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. మొత్తం రూ.13 కోట్ల పంట రుణాల్లో రూ.నాలుగు కోట్లకు పైగానే ఫార్మాసిటీకి భూములిచ్చిన నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద రైతులతో పాటు అసైన్డ్, పట్టా భూముల సేకరణకు నోటిఫికేషన్ వేసిన మొండిగౌరెల్లి రైతులు ఉన్నారు. పీఏసీఎస్లో అప్పు వసూలుకు స్పెషల్ డ్రైవ్ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు చెల్లించాలని సూచన రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు -
ఎకరాకు ఒక్క బస్తా మాత్రమే
కందుకూరు: యాసంగి పంటల సాగు కోసం అవసరమైన యూరియా కొనుగోలుకు రైతులు కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. మంగళవారం 450 బస్తాల యూరియా రాగా ఒక్కో ఎకరాకు ఒక బస్తా చొప్పున అధికారులు సరఫరా చేశారు. మొక్కజొన్న, వరి పంటల కోసం యూరియాను అధికంగా వినియోగిస్తారు. చాలా మంది పంటలు ఇంకా నారుమళ్ల స్థాయిలోనే ఉండగా, మున్నుందు దొరికదనే భావనలో యూరియా కొనుగోలు చేయడానికి ముందస్తుగా వస్తున్నారు. దీంతో పీఏసీఎస్ కార్యాలయంలో ఆన్లైన్లో వేలిముద్ర ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉండటంతో క్యూలో నిరీక్షిస్తున్నారు. -
చెత్త వేస్తే జరిమానా విధిస్తాం
మీర్పేట: రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు విఽధిస్తామని బడంగ్పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ త్రిల్లేశ్వరరావు హెచ్చరించారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా మంగళవారం మీర్పేట, జిల్లెలగూడ, ప్రశాంతిహిల్స్ డివిజన్లలో ఆయన పర్యటించారు. బహిరంగ ప్రదేశాలలో మల, మూత్ర విసర్జన చేయరాదని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా స్వచ్ఛ ఆటోల్లో వేయాలని ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ అవగాహన కల్పించారు. అదే విధంగా 58 డివిజన్ బాలాపూర్ చౌరస్తాలోని ప్రధాన రహదారి, 59 డివిజన్ జిల్లెలగూడ ప్రధాన రహదారి, 60వ డివిజన్లోని భారత్ పెట్రోల్ బంకు వద్ద చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించారు. కార్యక్రమంలో శానిటేషన్ డీఈ అభినయ్కుమార్, ఏఈ గంగాప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ యాదగిరి, జూనియర్ అసిస్టెంట్ నర్సింహ, పర్యావరణ ఇంజినీర్ రాము, జవాన్లు ఉన్నారు. -
రసీదు ఇచ్చి.. శాంతపరిచి
మంచాల: గ్రామాల్లో ఓ వైపు వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. మరో వైపు యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు దఫాలుగా 1,800 బస్తాల యూరియా అందజేశారు. అయినా గ్రామాల్లో చాలా చోట్ల వరి నాట్లు పడలేదు. నాట్లు పడిన పొలాల్లో కలుపు సైతం తీయలేదు. దీంతో సరిపడా యూరియా దొరకడం లేదని కర్షకులు వాపోతున్నారు. మంగళవారం తెల్లవారుజామునే గ్రామాల నుంచి వచ్చి మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్నారు. ఇస్తారనే ఆశతో గత మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. పీఏసీఎస్ సిబ్బంది రసీదులు కూడా పంపిణీ చేసింది. వాటిని చేతబట్టిన రైతులు యూరియా కోసం ఎదురు చేస్తున్నారు. ఇప్పటికై నా సకాలంలో ఎరువులు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇదే విషయంపై మండల వ్యవసాయాఽధికారి వెంకటేశంను వివరణ కోరగా.. కచ్చితంగా యూరియా వస్తుందని చెప్పారు. రాగానే అందరికీ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. యూరియా కోసం రైతుల పడిగాపులు మంచాల పీఏసీఎస్ కేంద్రంలో ఉదయం నుంచే క్యూ మూడు రోజులుగా అవస్థలు పడుతున్న కర్షకులు -
రోడ్డు భద్రతపై అవగాహన
యాచారం: రోడ్డు భద్రతపై ప్రజలు దృష్టి సారించాలని యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మాల్ మార్కెట్లో మంగళవారం రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై ప్రయాణించే సమయంలో సరైన భద్రత చర్యలు పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, హెల్మెట్ లేకుండా బైక్పై వెళ్లరాదని సూచించారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో అతి వేగంగా, నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో కూడా రోడ్డు భద్రతపై వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాచారం తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీడీఓ రాధారాణి, ఎస్ఐ మధు తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లింది.. ఫోన్ స్విచ్ఛాప్!
హైదరాబాద్: దర్గా దర్శనానికి వెళ్లిన నవ వధువు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ ఉమర్ కాలనీకి చెందిన షేక్ జమీర్ అలీ వివాహం కతీజా సాది(19)తో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ నెల 18వ తేదీనా మధ్యాహ్నం 3 గంటలకు జమీర్ అలీ తల్లి సాబేరా బేగం, వదిన అంజుమ్, భార్య కతీజా లు పహాడీషరీఫ్ దర్గా దర్శనానికి వెళ్లారు. దర్శనమనంతరం ఇప్పుడే వస్తానంటూ వెళ్లిన కతీజా తిరిగి రాలేదు. ఆమె ఫోన్ సైతం స్విచ్ఛాప్ వచ్చింది. ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో, అదే రోజు రాత్రి ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో గాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. -
మహాసభలను జయప్రదం చేయండి
యాచారం: అఖిల భారత మహిళా సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మస్కు అరుణ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చింతుల్ల గ్రామంలో మంగళవారం ఈనెల 25 తేదీ నుంచి 28వ తేదీ వరకు నగరంలో జరిగే సభలకు సంబంధించి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహా సభలను విజయవంతం చేయడం కోసం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సభలకు మాజీ ఎంపీ బృందా కారత్, అఖిల భారత మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి పీకె, ప్రధాన కార్యదర్శి ధావలే తదితరులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో మస్కు జ్యోతి, శ్యామల, పద్మజ, జంగమ్మ, సరిత, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు అరుణ -
ఆలయానికి స్థలం కేటాయించండి
మొయినాబాద్: అయ్యప్ప ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని మండలంలోని పెద్దమంగళారం గ్రామస్తులు, అయ్యప్ప భక్తులు తహసీల్దార్ గౌతమ్కుమార్కు విన్నవించారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం సర్వే నంబర్ 218 ప్రభుత్వ భూమిలో అయ్యప్ప దేవాలయం నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మంగళవారం స్థానికులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ నరోత్తంరెడ్డి, నాయకులు వెంకట్రెడ్డి, వీరారెడ్డి, ఓంరెడ్డి, ఉపేందర్రెడ్డి, అయ్యప్ప భక్తులు ఉన్నారు. రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, సెంటర్ ఫర్ నాలెడ్జ్, కల్చర్ అండ్ ఇన్నోవేషన్ స్టడీస్ అధిపతి ప్రొఫెసర్ సి.రాఘవరెడ్డికి అరుదైన అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా(ఎన్ఐఎఫ్) కొత్త ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీ సలహా కమిటీ సభ్యుడిగా ఆయనను నియమించింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలోని ఎన్ఐఎఫ్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాజ ఇంటర్ఫేస్లు, సమ్మిళిత అభివృద్ధికి సంబంధించిన సంస్థాగత విధానాల్లో ప్రొఫెసర్ రాఘవరెడ్డి నైపుణ్యాన్ని గుర్తించి ఈ అవకాశం కల్పించింది. కమిటీ చైర్మన్గా జేఎన్యూ ప్రొఫెసర్ మాధవ్ గోవింద్ని, సభ్యులుగా రాఘవరెడ్డిసహా ఆరుగురిని నియమించింది. హేట్ స్పీచ్ చట్టం తేస్తామనడం తగదు హిందూ లాయర్స్ ఫోరం పంజగుట్ట: రాష్ట్రంలో హేట్ స్పీచ్ బిల్లును తీసుకువస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించడం రాజ్యాంగం, ప్రజాస్వామిక పాలనకు విరుద్ధమని హిందూ లాయర్స్ ఫోరం పేర్కొంది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరం ప్రతినిధులు శివ స్వామి, రాధా మనోహార్ స్వామీజీ మాట్లాడుతూ సీఎం ఒక వర్గంవారిని సంతృప్తి పరిచేందుకే ఆ ప్రకటన చేశారని, ఈ బిల్లు వల్ల వర్గాల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. హేట్ స్పీచ్పై బీఎన్ఎస్ చట్టంలో ఇప్పటికే సెక్షన్లు ఉన్నాయని అన్నారు. సమావేశంలో ఫోరం బాధ్యులు, హైకోర్టు న్యాయవాదులు శ్రీకృష్ణ, గోశాల శ్రీనివాస్, కె.భానుచంద్ర, భరద్వాజిని పాల్గొన్నారు. ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’పై శిక్షణ ఏజీ వర్సిటీ: పీవీ నర్సింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయంలోని క్షేత్రస్థాయి పశువైద్యులకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, యాంటీ బయోటిక్ మందుల వినియోగంపై రెండు రోజుల శిక్షణను మంగళవారం వీసీ జ్ఞాన ప్రకాశ్ ప్రారంభించారు. సద్గురు ఫౌండేషన్, జెనెక్స్ యానిమల్ హెల్త్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు(ఏడీబీ) సహకారంతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జ్ఞాన ప్రకాశ్ మాట్లాడుతూ పశువులకు అవసరం లేకున్నా మోతాదుకు మించి యాంటీబయోటిక్ మందులు ఇవ్వడం సరికాదని, దీని వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని అన్నారు. విస్తరణ సంచాలకుడు డాక్టర్ కిషన్కూమార్ మాట్లాడుతూ పశువైద్యులు సరియైన చిక్సితా విధానాలను అవలంబిస్తేనే పశువుల ఆరోగ్యం నియంత్రణలో ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల అసోసియెట్ డీన్ మాధూరి, డాక్టర్ గోపాల్, సత్యనారాయణ, ఎం.సోనాలి తదితరులు పాల్గొన్నారు. చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి కుత్బుల్లాపూర్: బైక్ అదుపుతప్పి చెట్టును డీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన మేరకు.. రాజన్న సిరిసిల్ల జిల్లా సత్రాజ్పల్లి గ్రామానికి చెందిన అక్కినపల్లి సుజీత్(22) మైసమ్మగూడలో ఉంటున్నాడు. మంగళవారం మైసమ్మగూడ నుండి స్నేహితుడు చంద్రారెడ్డితో కలిసి మరో స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్నాడు. ఈ క్రమంలో అపెరల్ రోడ్డులో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. బైక్ వెనుక కూర్చున్న సుజిత్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. -
పైసామే పవర్!
బుధవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2026షాద్నగర్: ఎన్నికల బరిలో నిలవాలన్నా.. ప్రత్యర్థిపై గెలవాలన్నా.. మందీమార్బలంతోపాటు ఆర్థిక బలం ఉండాల్సిందే.. రూ.వేలు రూ.లక్షలు దాటి ఎన్నికల ఖర్చు రూ.కోట్లకు చేరింది. చైర్మన్ పీఠాలు, కౌన్సిలర్ పదవులు సాధించాలంటే డబ్బులు ఖర్చు చేయాల్సిందే. ఇందుకు గాను ప్రధాన పార్టీలు ఆర్థికంగా కాస్తా బలంగా ఉన్న అభ్యర్థులనే మున్సిపల్ ఎన్నికల బరిలో దింపాలని చూస్తున్నాయి. అన్ని పార్టీలు పార్టీ ఫండ్తోపాటు స్వయంగా ఖర్చు చేసే నేతల వైపు చూస్తున్నాయి. అర్థబలం, అంగబలం ఉన్న వారిని బరిలో దింపితే ఎన్నికల ఖర్చుకు వెనుకాడరనే అభిప్రాయం అందరిలో ఉంది. పదవి కోసం ఎంతైనా.. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నియోజకవర్గాల ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఖర్చు చేశారంటే అతిశయోక్తి కాదు. చాలా గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు చెల్లించిన వారు ఉన్నారు. తమ పదవి కోసం కోట్ల రూపాయలు వెచ్చించారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురుకానుంది. ఈ లెక్కన ఒక్కో వార్డులో సుమారు రూ.25 లక్షల దాకా ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక బలం ఉన్న నేతల కోసం మున్సిపల్ ఎన్నికల్లో ఆర్థిక బలం ఉన్న నేతలను బరిలో దింపేందుకు ప్రధాన పార్టీలు మొగ్గుచూపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీల నేతలు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచూతూచి వ్యవహరిస్తున్నారు. ధన బలంతో పాటు, ప్రజా బలం కూడా పరిగణలోకి తీసుకొని టికెట్లు ఇస్తామని అధిష్టానాలు స్పష్టం చేస్తున్నాయి. అన్ని రకాలుగా బలమైన వారినే బరిలోకి దింపితేనే విజయం సాధిస్తామనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రజా బలం కోసం ఆశావహులు కొందరు ఇప్పటికే కాలనీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో నిలబడుతున్నామని, తమకు మద్దతు తెలపాలని ఓటర్లను వేడుకొంటున్నారు. తమవైపు తిప్పుకొని విందులు ఇవ్వడం ప్రారంభించారు. ఆర్థిక బలం ఉంటేనే ఎన్నికల బరిలోకి.. అలాంటి అభ్యర్థులవైపే ప్రధాన పార్టీల మొగ్గు డబ్బుల సర్దుబాటు కోసం ఆశావహుల ప్రయత్నాలు షెడ్యూల్ వచ్చేసరికి పోగుచేసుకునే పనిలో నేతలు మున్సిపల్ ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎలాగైనా పోటీ చేయాలనుకునే వారు డబ్బులు సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఓవైపు టికెట్ కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్న వారు ఎక్కువ మొత్తం భరించాల్సిన పరిస్థితి నెలకొంది. క్యాంపుల ఏర్పాటు, కౌన్సిలర్ల మద్దతు కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మూడేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండటంతో చాలామంది నేతలు డబ్బుల కోసం వేట ప్రారంభించారు. షెడ్యూల్ వచ్చేలోపు డబ్బులు సిద్ధం చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
సహాయ ఉపకరణాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం రూరల్: దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లకు సహాయ ఉపకరణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాటరీ వీల్చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, హైబ్రిడ్ వీల్చైర్ అటాచ్మెంట్తో కూడిన వీల్చైర్స్, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్టాప్స్, ఉన్నత విద్య, సాంకేతిక విద్యార్థులకు ల్యాప్టాప్స్ అందించనున్నట్టు తెలిపారు. అర్హులైనవారు ఈనెల 21 నుంచి 30వ తేదీ లోపు ఓబీఎంఎంఎస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తుక్కుగూడ: గ్రామీణ క్రీడాకారులను ప్రంపచ చాంపియన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి అన్నారు. తుక్కుగూడ బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సీఎం కప్ 2025–26 గ్రామస్థాయి క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. పల్లెల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే సీఎం కప్ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. విజేతలకు ట్రోఫీలతో పాటు, నగదు బహుమతులు అందిస్తామన్నారు. కా ర్యక్రమంలో ఎంఈఓ కస్నానాయక్, హెచ్ఎం భాస్కర్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యాచారం: వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపారనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివీ.. యాచారం పంచాయతీ పరిధిలో కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు 70కిపైగా వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపారన్న సమాచారం మేరకు స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అదులాపురం గౌతమ్, నుడావత్ప్రీతి, ఈలప్రోల్ అనిత, ఈలప్రోల్ భానుప్రకాశ్రావు, మూల రజిని మంగళవారం యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మేనకాగాంధీకి సైతం ఫోను ద్వారా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆమె కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేశారు. కలెక్టర్ యాచారం సీఐకి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి కిషన్ను సంప్రదించగా తాను ఐదు రోజుల పాటు సెలవులో ఉన్నట్లు తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సాక్షి, సిటీబ్యూరో: ఐటీ సెక్టార్లోని దుర్గం చెరువు నుంచి వెలువడుతున్న దుర్గంధాన్ని దూరం చేయడంపై హైడ్రా దృష్టి పెట్టింది. మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెరువును పరిశీలించారు. సగం వరకు గుర్రపు డెక్క పెరగడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాట్ (ఎస్టీపీ) ఉన్నా వరద కాల్వ ద్వారా మురుగు నీరు నేరుగా కలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీపీల సామర్థ్యానికి మించి వచ్చే మురుగును కాల్వల్లోకి మళ్లించాలని సూచించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ శాఖ, రహేజా మైండ్స్పేస్, ఎస్టీపీల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రాంకీ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడమే దుర్గంధానికి కారణ మని పేర్కొన్నారు. అనంతరం హైడ్రా కార్యాలయంలో చెరువు పరిరక్షణ బాధ్యతలు చేప ట్టిన సంస్థలతో ఆయన సమావేశమయ్యారు. వరద కాల్వలోకి మురుగు నీరు వెళ్లకుండా పైపులైన్ డైవర్షన్ పనులు చేపట్టడానికి జలమండలికి ఉన్న ఇబ్బందులకు పరిష్కారం చూపారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్తో మాట్లాడిన రంగనాథ్ ట్రాఫిక్ మళ్లింపుల అమలుకు సహకరించాలని కోరారు. రహేజా సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఇనార్బిట్ మాల్, నెక్టర్ గార్డెన్స్ సహా చెరువు పై భాగంలో ఉన్న ఐటీ సంస్థల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులో కలవకుండా పడమరవైపు కాల్వ తవ్వేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
టైరు మారుస్తుండగా..
ఇబ్రహీంపట్నం రూరల్: పంక్చర్ అయిన టైరును మారుస్తుండగా లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఓ అభాగ్యుడిని పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్పై మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 12 వద్ద నారాయణ బాలికల హాస్టల్ సమీపంలో టాటా ఏసీ టైరు పంక్చర్ అయింది. దీంతో డైవర్ దీలిప్ వాహనాన్ని పక్కకు నిలిపి సహాయకుడు వెంకట్రెడ్డితో టైర్ మార్చుతున్నారు. అంతలోనే వెనకాల నుంచి అతివేగంగా వచ్చిన ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దిలీప్(28) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించారు. మరోవైపు వెంకట్రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని రాగన్నగూడ సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ సాగిస్తున్నారు. ● దూసుకొచ్చిన మృత్యువు ● ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం ● ఒకరి దుర్మరణం, మరొకరికి గాయాలు -
పేదలకు ‘ఉపాధి’ని దూరం చేసే కుట్ర
● అందుకే పథకానికి పేరు మార్పు ● డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ● చేవెళ్ల మండలం ఆలూరులో నిరసన చేవెళ్ల: పేదలకు ఉపాధిని అందించే ఉపాధి హామీపథకాన్ని వీబీజీ రామ్జీ పేరుతో దూరం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరులో 2004లో ఉపాధి హామీ పథకం ప్రారంభించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వేసిన పైలాన్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రతిపల్లెలో తిరిగి ఉపాధి హామీ చట్టం రద్దుతో జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు తెలియజేస్తూ, బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలంటూ అవగాహన, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఈపథకం ద్వారా సోనియాగాంధీ, రాహుల్గాంధీ కుటుంబానికి పేరు వస్తుందనే పేరు మార్చి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కొత్తగా వీబీజీ రామ్జీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కేటాయించాలనే నిబంధన తీసుకు రావాలని చెప్పడం వెనుక పథకాన్ని నీరుగార్చే ఉద్దేశం ఉందని తేటతెల్లమవుతోందన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి పామెన బీంభరత్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బి.జ్ఞానేశ్వర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగౌడ్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, పంచాయతీరాజ్ సంఘటన్ చైర్మన్ రాచమొళ్ల సిద్దేశ్వర్, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్రెడ్డి, మండల అధ్యక్షుడు వీరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిష్టానం ప్రత్యేకంగా నిర్వహించే సర్వే ఆధారంగా గెలిచే వారికే టికెట్ల కేటాయింపు ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్ల టికెట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఇన్చార్జి, ముఖ్యమంత్రి పరిశీలించి కేటాయిస్తారన్నారు. టికెట్ల కేటాయింపు కమిటీలో జిల్లా అధ్యక్షుడు కన్వీనర్గా, ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే ఇన్చార్జి, ఎంపీ, జిల్లాలో ముఖ్యనాయకులు ఉంటారన్నారు. వారంతా కలిసి అధిష్టానం నిర్వహించే సర్వే ఆధారంగా గెలిచే వ్యక్తులకే టికెట్లు కేటాయింపు చేయనున్నట్టు వివరించారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం రూరల్: పోలీసుల ఎదుటే తనపై దాడి చేసి, నానా బూతులు తిట్టి, తన కుమారుడిని ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పడాల కరాటే కళ్యాణి (సినీనటి) మంగళవారం ఆదిబట్ల పోలీసులను ఆశ్రయించింది. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం సాక్షిగా ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న కాస ప్రవీణ్, సిద్దమోని నరేందర్ అమాయకులను ఆసరాగా చేసుకొని డబ్బులు కాజేస్తున్నారని.. హిందూ ధర్మంకోసం పోరాడుతుంటే తనపై దాడికి యత్నించారని ఆవేదన వ్యక్తం చేసింది. అమాయకులను వలలో వేసుకొని లక్కీ డ్రాల పేరుతో మోసం చేస్తున్నారని ఈనెల 14న పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు బెట్టింగ్యాప్ లక్కీడ్రా నిర్వాహకుల స్థావరం గుర్తించారు. ఆదిబట్ల సమీపంలోని కొంగరకలాన్ వద్ద ఓ విల్లాలో ఉండగా పంజాగుట్ట పోలీసులతో కలిసి కరాటే కళ్యాణి వెళ్లింది. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రశ్నిస్తుండగా ఆమైపె ప్రవీణ్, నరేందర్ అనే బెట్టింగ్ నిర్వహకులు, వారి ముఠా దాడి చేసినట్లు తెలిపింది. లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇలాంటి మోసగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదిబట్ల సీఐ రవికుమార్, ఎస్ఐ సత్యనారాయణను కోరింది. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నరేందర్ క్రేజీ బాయ్స్ పేరుతో చౌటుప్పల్లో బట్టల దుకాణం నడిపిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం లక్కీ డ్రా తీస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. ఆదిబట్ల ఠాణాలో కరాటే కళ్యాణి ఫిర్యాదు -
న్యాయమైన పరిహారానికి కృషి
● భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు ● గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూ నిర్వాసితులతో సమావేశం కడ్తాల్: గ్రీన్ఫీల్డ్ రేడియడ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల నిర్వాసితులతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు, రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎకరాకు రూ.30 లక్షల పరిహారం, ఒక ప్లాట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉందని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. భూసేకరణ విధి విధానాలు, న్యాయపరమైన నష్ట పరిహారం ప్రకటించడకుండా సేకరణ చేపట్టడం తగదన్నారు. మార్కెట్ ధరకు అనుగుణంగా ఎకరాకు రూ.కోటి పరిహారం అందించాలని కోరారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటుకు కృషి చేస్తానని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయశ్రీ, ఎస్ఐ వరప్రసాద్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
టోల్ప్లాజా సిబ్బందికి శిక్షణ
కడ్తాల్: జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ప్రయాణికులతో స్నేహపూర్వకంగా మెలగాలని ఎన్హెచ్ఏఐ హెచ్ఎల్ఎఫ్పీపీటీ శిక్షణ నిపుణులు అవినాశ్ కోహ్లీ, కృష్ణమూర్తి సూచించారు. మండల కేంద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), హిందూస్థాన్ లేటెక్స్ ఫ్యామిలీ ప్రమోషన్ ట్రస్ట్ (హెచ్ఎల్ఎఫ్పీపీటీ) ఆధ్వర్యంలో టోల్ప్లాజా సిబ్బందికి మూడు రోజుల శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ఏ విధంగా నడుచుకోవాలి, హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు ఇబ్బందులు కలిగితే సేవ్ అవర్ సోల్ (ఎస్ఓఎస్) ఏ విధంగా వాడాలి, రాజ్మార్గ్ యాత్ర యాప్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టోల్ప్లాజా మెనేజర్ దయారామ్ గుర్జర్, బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
అవగాహనతో ప్రమాదాల నివారణ
మొయినాబాద్: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా, మద్యం తాగి వాహనాలు నడపడంతోపాటు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడమే అని ఎమ్మెల్సీ, మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని జేపీఎల్ కన్వెన్షన్లో మంగళవారం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ పేరుతో డ్రైవర్లు, యువతకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏటా సుమారు 26 వేల ప్రమాదాలు జరుగుతూ సుమారు 8 వేల మంది మరణిస్తునారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో 83 శాతం 18–63 ఏళ్ల వయసువారేనన్నారు. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం టాప్ 10లో ఉండటం బాధాకరమన్నారు. ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు ప్రమాదకరమైన రోడ్లను బాగుచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకోసం ద్విచక్ర వాహనదారులకు వెయ్యి హెల్మెట్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. డీసీపీ యోగేష్గౌతం మాట్లాడుతూ.. డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఉండొద్దని.. వాహనంలో ఉన్నవారితోపాటు మీ ప్రాణాలు కూడా మీచేతుల్లోనే ఉంటాయన్నారు. అనంతరం ప్రమాదాల నివారణకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, ఏసీపీలు కిషన్, చంద్రశేఖర్, జిల్లా రవాణాశాఖ అధికారి సాయి కృష్ణవేణి, ఆర్టీసీ డీఎం కృష్ణమూర్తి, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి -
పర్యావరణంపై అవగాహన పెంచాలి
కడ్తాల్: పర్యావరణంలో వాతావరణ మార్పులపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సామాజికవేత్త సూదిని పద్మారెడ్డి అన్నారు. అన్మాస్పల్లి సమీపంలోని ఎర్త్ సెంటర్లో కౌన్సిల్ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ, తెలంగాణ ఉన్నత విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీవాతవరణ మార్పులు–పర్యావరణ సుస్థిరతశ్రీ అంశంపై రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 149 డిగ్రీ కళాశాలలకు చెందిన అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లకు నిర్వహించిన అవగాహన సదస్సు మంగళవారంతో ముగిసింది. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సూదిని పద్మారెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులతో పాటు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల, కళాశాల స్థాయి నుంచే పర్యావరణ, వాతావరణ మార్పులపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలన్నారు. అనంతరం ప్రొఫెసర్లు, అధ్యాపకులకు సర్టిఫికెట్స్ అందజేశారు. సీజీఆర్ సంస్థ పర్యావరణ క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలాలక్ష్మారెడ్డి, వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, శాస్త్రవేత్త డాక్టర్ సాయిభాస్కర్రెడ్డి, సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లెనిన్బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ జగన్, డాక్టర్ వసంతలక్ష్మి, డాక్టర్ ప్రియాకుమారి, డాక్టర్ ఆనీ షీరాన్, డాక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాభివృద్ధికి శిక్షణ కీలకం
శంషాబాద్ రూరల్: గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సూచించారు. మండలంలోని ముచ్చింతల్ శివారు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆవరణలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వ్యవస్థ, పాలన విధానాలు, నిబంధనలు, నిర్వహణ అంశాల్లో పూర్తి పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. ఈ శిక్షణ గ్రామాభివృద్ధికి అత్యంత కీలకమని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ సురేశ్మోహన్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, పంచాయతీ డైరక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
● సీఐటీయూ నేతల డిమాండ్ ● కడ్తాల్లో ర్యాలీ, తహసీల్దార్కు వినతిపత్రం కడ్తాల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉప సంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లెల పెంటయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ సీఐటీయూఐ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాఽధి హామీలో తీసుకువచ్చిన వికసిత్ భారత్– జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని, 2025 విద్యుత్ సవరణ చట్టాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్మికులకు పరిశ్రమల కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, లేబర్కోడ్స్ ఉప సంహరణ, రైతాంగ సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఉపాధి హమీ చట్టం పునరుద్ధరణ డిమాండ్లతో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. హమాలీ కార్మికులకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ జయశ్రీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో హమాలీ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సౌకర్యాలు అంతంత మాత్రమే
ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రితో సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం 250 మందికి పైగా ఔట్ పేషెంట్లు వస్తున్నారు. ఇటీవల పాత ఆస్పత్రిని కూల్చివేసి రూ.17.50 కోట్లతో నూతనంగా నిర్మి స్తున్నారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో ఉన్న డాక్టర్ క్వార్టర్స్లో ఔట్ పేషెంట్లకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు మైమునాబేగం, జయశ్రీ, మంజులాదేవి రోగులకు వైద్యం చేస్తున్నారు. నిత్యం 20 నుంచి 30 మందికి రక్త పరీక్షలు నిర్వహించి వెంటనే రిపోర్టు అందిస్తున్నారు. -
సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా అన్నపూర్ణ
రాయదుర్గం: సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా అన్నపూర్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె సైబరాబాద్ సీపీ ఎం రమేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్ ఎస్పీగా, కరీంనగర్ అడిషనల్ ఎస్పీగా, పీటీసీ వరంగల్లో, మంగళగిరి, గుంటూరు డీఎస్పీగా, చిత్తూరు అడిషనల్ డీసీపీగా కూడా విధులను నిర్వర్తించారు. తాజాగా సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా ఆమె బాధ్యతలు చేపట్టారు. -
ట్రాఫిక్ రూల్స్పై అవగాహన
చేవెళ్ల: వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి, సురక్షిత ప్రయాణం చేయాలని డీసీపీ యోగేశ్గౌతమ్, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో సోమవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం, బైక్ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ద్విచక్రవాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయణించే వారు సీటుబెల్టు పెట్టుకోవాలని సూచించారు. రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనదారుడు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. అనంతరం మున్సి పాలిటీకి చెందిన మధుసూదన్గుప్తా 50 హెల్మెట్లను కొనుగోలు చేసి ఎమ్మెల్యే కాలె యాద య్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏసీపీ కిషన్, సీఐలు భూపాల్శ్రీధర్, డీఐ ఉపేందర్, ఎస్ఐలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం షాబాద్: మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కవిత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాలతో పాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లను సైతం ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఉదయం సెషన్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, మధ్యాహ్న సెషన్లో ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లకు ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. ఆబ్జెక్టివ్ టైప్ (బహుళ ఎంపిక ప్రశ్నలు) విధానంలో పరీక్ష నిర్వహిస్తారన్నారు. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ మొయినాబాద్: ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు స్వ యం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. మహిళల కు వడ్డీ లేని రుణాలు అందజేసి వారు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, ఆర్డీఓ వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మ న్ చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మోయిజుద్దీన్, నాయకులు షాబాద్ దర్శన్, హన్మంత్యాదవ్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులతో దురుసు ప్రవర్తన తహసీల్దార్ డ్రైవర్పై కేసు నమోదు యాచారం: ఓ తహసీల్దార్ కారు డ్రైవర్ దురుసు ప్రవర్తనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా పరిధిలోని ఓ మండల తహసీల్దార్, ఉప తహసీల్దార్, ఆర్ఐతో కలిసి సోమవారం సాయంత్రం కారులో నగరానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో యాచారం పోలీస్స్టేషన్ పరిధిలో సాగర్ హైవేపై సీఐ నందీశ్వర్రెడ్డి తన సిబ్బందితో కలిసి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందరు వాహనదారుల మాదిరిగానే పోలీస్ సిబ్బంది తహసీల్దార్ ప్రయాణిస్తున్న కారును ఆపి డ్రైవర్కు డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష చేశారు. ఈ క్రమంలో డ్రైవర్ వారితో దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న తహసీల్దార్ అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో సీఐకి ఫోను చేయించినా వినిపించుకోలేదు. ఈ వ్యవహారంలో డ్రైవర్పై కేసు నమోదు చేశారు. గంటపాటు తహసీల్దార్ కారులోనే ఉండిపోయారు. -
అల్ట్రాసౌండ్ సేవలు లేవు
మహేశ్వరం: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో 16 మంది వైద్యులకు గాను ప్రస్తుతం ఏడుగురు విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్, ఆప్తమాలజీ, పైతాలజీతో పాటు పలు నిపుణులు లేరు. 52 రకాల రక్త, ఇతర పరీక్షలు నిర్వహించి మూడు రోజుల్లో పరీక్షల ఫలితాలు ఇస్తున్నారు. అల్ట్రా సౌండ్ పరీక్షలు చేయడం లేదు. నిత్యం సుమారు 250 నుంచి 350 వరకు రోగులు వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. డయాలసిస్ సేవలు పెంచాలని స్థానికంగా కోరుతున్నారు. మండల పరిధిలోని దుబ్బచర్ల పీహెచ్సీలో తలుపులు, కిటికీలు, ఇతర వైద్య పరికరాలను ఆకతాయిలు ధ్వంసం చేశారు. ప్రసుత్తం మరమ్మతులు చేసి వైద్యం అందిస్తున్నారు. -
ఓటరు జాబితాను సవరించండి
ఆమనగల్లు మున్సిపాలిటీకి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఆమనగల్లు: మున్సిపాలిటీ ఓటరు జాబితాలో తప్పులను 15 రోజుల్లో పరిశీలించి సవరించాలని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పట్టణానికి చెందిన అడ్వకేట్ వస్పుల మల్లేశ్ మున్సిపాలిటీ ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు ఉన్నాయని, ఒకే ఓటరుకు సంబంధించి రెండు ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించకుండా ఎన్నికలు నిర్వహించొద్దని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ ఈనెల 4న ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్కు ఇచ్చిన పిటిషన్ను పరిశీలించి 15 రోజుల్లోగా ఓటరు జాబితాను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 9న నిర్వహిస్తామని తెలిపింది. -
పరికరాలు, పరీక్షలు లేవు
ఇబ్రహీంపట్నం: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహించే వైద్యులందరూ డిప్యూటేషన్పై వచ్చిన వాళ్లే ఉన్నారు. ఇటీవల పాత ఆస్పత్రి స్థానంలో నూతనంగా నిర్మిస్తున్నారు. అవుట్ పేషెంట్లకు చికిత్స తప్పా అడ్మిట్ చేసుకొని వైద్యం అందించే సదుపాయాలు లేవు. డీపీహెచ్ కింద ఇద్దరు, టీవీవీపీ కింద నలుగురు వైద్యులు సేవలందిస్తున్నారు. నిత్యం 10 నుంచి 15 మంది కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేస్తారు. డయాలసిస్ కేంద్రానికి నీటి కొరత ఉంది. రోజూ 250 మందికి పైగా ఔట్ పేషెంట్లు వస్తారు. ఆస్పత్రిలో ఎలాంటి శస్త్ర చికిత్సలు జరగడం లేదు. అందుకు అవసరమైన పరికరాలు, పరీక్షలు అందుబాటులో లేవు. 100 పడకల ఆస్పత్రిగా మారితేనే మెరుగైన సేవలు అందుతాయి. -
చికిత్సకు నిరీక్షణే..
ఆస్పత్రుల్లో తప్పని పడిగాపులుసాక్షి, రంగారెడ్డిజిల్లా: పల్లెకు సుస్తీ చేసింది.. చికిత్స చేసే నిపుణులు అందుబాటులో లేకపోవడం.. ఉన్న వాళ్లు కూడా నిర్దేశిత సమయానికి ఆస్పత్రికి రాకపోవడం.. వచ్చిన వాళ్లు మధ్యాహ్నం ఒంటిగంటకే తిరుగుముఖం పట్టడంతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు సహా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుకుంటున్న నిరుపేదలకు కనీస వైద్యసేవలు అందకుండా పోతున్నా యి. మెజార్జీ వైద్య సిబ్బంది వేళకు రావడం లేదు. స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆయాలే వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. నాడిపట్టి చూడటం మొదలు.. మందులు, ఇంజక్షన్లు ఇవ్వడం వరకు అన్నీ వారే కానిచ్చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలపై సోమవారం ‘సాక్షి’ బృందం విజిట్ నిర్వహించింది. మెజార్టీ ఆస్పత్రుల్లో ఆల్ట్రాసౌండ్ మిషన్లు సమకూర్చినప్పటికీ రేడియాలజిస్టులు/గైనకాలజిస్టులు లేకపోవడంతో రోగులకు ఆ తరహా సేవలు అందకుండా పోతున్నాయి. ఎక్సరే మిషన్లు ఉన్నప్పటికీ.. టెక్నీషియన్ల కొరతతో ప్రైవేటుకు వెళ్లాల్సి వస్తోంది. రోగుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపుతున్నారు. థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. నేరుగా రోగుల ఫోన్ నంబర్లకే రిపోర్టులు జారీ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ చెబుతున్నప్పటికీ..గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రోగులకు ఈ సాంకేతికతపై సరైన అవగాహన లేక ఇబ్బందులు తప్పడం లేదు. 24 గంటల తర్వాత కూడా రిపోర్టులు చేతికి అందకపోవడంతో జ్వరపీడితుల ఆరోగ్యం మరింత దెబ్బతింటున్నట్లు తేలింది. మారుమూల పల్లెల్లోనే కాదు మున్సిపాలిటీ కేంద్రాలు, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. మచ్చుకు కొన్ని.. నిరంతరం పర్యవేక్షణ మెరుగైన వైద్యసేవలు అందించాలనేదే లక్ష్యం. వైద్య సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సమయ పాలన పాటించని వైద్య సిబ్బందితో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలోనే ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలో మందుల కొరత లేదు. ఖాళీల భర్తీ కోసం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాం. – డాక్టర్ కె.లలితాదేవి, జిల్లా వైద్యాధికారి -
మహిళాభివృద్ధే లక్ష్యం
ఇబ్రహీంపట్నం: మహిళలను శక్తివంతులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా 87 డ్వాక్రా సంఘాలకు రూ.3.50 కోట్ల వడ్డీలేని రుణాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, అభివృద్ధికి రేవంత్ సర్కార్ శాయశక్తులా కృషి చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రేషన్కార్డులు తదితర సంక్షేమ పథకాలను అమలు పరుస్తోందన్నారు. ఆర్థికంగా ఎదిగేందుకే వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించానన్నారు. మభ్యపెట్టి ఓట్లు దండుకునే వారికి వచ్చే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పాండు రంగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కరుణాకర్, డ్వాక్రా సంఘాల మహిళలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వెంటనే రక్త పరీక్షల రిపోర్టు
షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతుంది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ నిత్యం 300 వందలకు పైగా ఓపీ పేషంట్లు వస్తున్నారు. రోగుల తాకిడికి సరిపడా సిబ్బంది లేరు. షాద్నగర్ గుండా జాతీయ రహదారి ఉండటంతో ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులు ఆస్పత్రికి వస్తున్నారు. ఆర్థోపెడిక్ సర్జరీలు ఇక్కడ అధికంగా నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో సరిపడా మందుల నిల్వలు ఉన్నాయని, రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రక్త పరీక్షలు చేసి ఎప్పటికప్పుడు రిపోర్టులు అందజేస్తున్నారు. -
సీహెచ్సీలో రోగుల కిటకిట
యాచారం: వాంతులు, విరేచనాలతో వచ్చిన రోగులతో యాచారం సీహెచ్సీ(సామాజిక ఆరోగ్య కేంద్రం) సోమవారం కిటకిటలాడింది. దాదాపు 250 మందికి పైగా రోగులు వచ్చారు. అందులో అత్యధికంగా వాంతులు, విరేచనాలు, జ్వరాలతో బాధపడుతున్న వారే. డాక్టర్ లలిత ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ మందులు లేక రోగులు ఇబ్బందులు పడ్డారు. రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి పంపిస్తున్నారు. సీహెచ్సీలో 24 గంటల పాటు వైద్యులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరారు. -
వసతుల్లేక.. సేవలు అందక
రాత్రిపూట సేవలు బంద్ కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో పీహెచ్సీలో పగటిపూటే సేవలు అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో సిబ్బంది, పరికరాలు లేక పోవడంతో పీహెచ్సీలో ఉదయం 9 నుంచి సాయంత్రం వరకే వైద్య సేవలు అందుతాయి. ఆస్పత్రిలో ఇద్దరు రెగ్యులర్ డాక్టర్ పోస్టులు ఉండగా, ఒక్కరు డిప్యూటేషన్పై వెళ్లారు. డాక్టర్ కిరణ్కుమార్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కుక్క, పాము కాట్లకు సైతం మందులు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 60–70 మంది ప్రజలకు ఓపీ సేవలు అందిస్తున్నట్లు సిబ్బంది తెలిసింది. ఖాళీగా ఉన్న మూడు స్టాఫ్నర్స్ పోస్టులతో పాటు, రెగ్యులర్ డాక్టర్, స్వీపర్ పోస్టులను భర్తీ చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు అరకొర వైద్య సేవలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది కొరతతో నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. సోమవారం సర్కారు వైద్యశాలలను ‘సాక్షి’ విజిట్ చేసింది. ఇందులో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. ఒక ఆస్పత్రిలో సమయం దాటినా వైద్యుడి కుర్చీ ఖాళీగా కనిపించింది. చాలా వైద్యశాలల్లో రక్త పరీక్షలు నిర్వహించే కేంద్రం లేకపోవడంతో హైదరాబాద్కు పంపిస్తున్నారు. దీంతో చికిత్స ఆలస్యం అవుతోందని రోగులు మదన పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇబ్బందులు పడుతున్న రోగులు సరిపడా సిబ్బంది, గదులు, పరికరాలు లేని వైనం అన్ని చోట్ల రక్త పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ -
ఎయిర్పోర్ట్ దాకా రయ్ రయ్
సాక్షి, సిటీబ్యూరో: విస్తరిత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ట్రాఫిక్ జాంఝాటాలు తప్పించేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ వైపుల నుంచి శంషా బాద్ ఎయిర్పోర్ట్ వెళ్లే వాహనాలు సిగ్నల్ ఫ్రీగా వెళ్లేందుకు రూ.345 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్ట్ చేపట్టేందుకు సిద్ధమైంది. హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్ట్ కింద ఆరు లేన్లతో ఎలివేటెడ్ కారిడార్(ఫ్లై ఓవర్) పనులు త్వరలో ప్రారంభించనుంది. ఈ మేరకు టెండర్లు ఆహ్వానించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్ల వద్ద ఆగకుండా రెండు వైపులా సాఫీగా ప్రయాణం సాగేందుకు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. షాద్నగర్, మహబూబ్నగర్, అత్తాపూర్, మెహిదీపట్నం వైపు వెళ్లేవారికి కూడా ఇది అనువుగా ఉంటుంది. ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు అధికారులు చెప్పారు. కాటేదాన్ జంక్షన్ వద్ద మూడు లేన్లతో డౌన్ర్యాంప్ ఉంటుంది. టెండర్ ద్వారా ప్రాజెక్ట్ దక్కించుకునే ఏజెన్సీయే సర్వే, డిజైన్, డ్రాయింగ్స్, నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. కాంట్రాక్టు అగ్రిమెంట్ జరిగినప్పటి నుంచి రెండు సంవత్సరాల్లో పనులు పూర్తి కావాలి. యుటిలిటీ షిఫ్టింగ్, ఫుట్పాత్లు, ల్యాండ్స్కేపింగ్, సైనేజీలు, లైటింగ్, పేవ్మెంట్ మార్కింగ్స్ తదితర పనులు కూడా చేయాలి. మెట్రోకు సమాంతరంగా.. ఎయిర్పోర్ట్ మెట్రోలైన్కు పక్క నుంచి ఈ ఫ్లై ఓవర్ రానుంది. ఫ్లై ఓవర్ కంటే మెట్రోమార్గం ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దీంతోపాటు టీకేర్ కాలేజ్ జంక్షన్, గాయత్రినగర్ జంక్షన్, మంద మల్లమ్మ జంక్షన్ల మీదుగా ఆరు లేన్లతో మరో ఫ్లైఓవర్ పనులకు టెండర్ల గడువు ముగిసింది. టెండర్లు ఖరారు కావాల్సి ఉంది. రూ. 345 కోట్లతో ఫ్లైఓవర్ మైలార్దేవ్పల్లి, కాటేదాన్, ఆరాంఘర్ వద్ద సిగ్నల్ ఫ్రీగా.. త్వరలో పనులు ప్రారంభం -
పంచాయతీ కుట్రను అడ్డుకోండి
మహేశ్వరం: మండల పరిధిలోని సిరిగిరిపురం సర్వే నంబర్ 72, 73 ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు పంచాయతీ పెద్దలు కుట్ర చేస్తున్నారని వడ్డెర సంఘం నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ చిన్నప్పల నాయుడుకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి ఈస్థలంలో ఖననాలు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి తదితరులు శ్మశానవాటిక చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించారని తెలిపారు. ఎంపీడీఓ శైలజ, మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లుకు సైతం ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా శ్మశానవాటిక చుట్టూ ఉన్న నక్షబాట కబ్జా కాకుండా చూడటంతో పాటు రైతుల పొలాలకు వెళ్లేందుకు రోడ్డును వెడల్పు చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు. కొంత మంది కావాలనే ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. రోడ్డు, ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా పంచాయతీ తీర్మానంతో బొందల చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించామని, ఇది గిట్టని వారు రాత్రి వేళ కూల్చివేశారని తెలిపారు. ఈ విషయమై తాము కూడా పోలీసులు, తహసీల్దార్కు ఫిర్యాదు చేశామన్నారు. తహసీల్దార్కు వినతి -
గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి
ఇబ్రహీంపట్నం రూరల్: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని అన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ప్రజావాణికి 33 ఫిర్యాదులు ఈ వారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 33 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి విన్నవించి అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అందించే వినతులను పెండింగ్లో పెట్టకుండా సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు. -
‘భూమి తీసుకుని బెదిరిస్తున్నారు’
శంకర్పల్లి: ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కు అధినేత రాందేవ్రావు తమ భూములను ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుని, డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ప్రొద్దుటూరుకు చెందిన బాధితులు సోమవారం సదరు పొలాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్ 305/2లో ఎరుకలి మల్లమ్మకు 1.20 ఎకరాలు, 305/3లో ఎరుకలి రామయ్యకు 2 ఎకరాలు, 306లో ఎరుకలి పెంటయ్యకు 1.02 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూములను 2020లో ఐదేళ్ల కోసం రూ.32 లక్షలకు లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలని పలుమార్లు రాందేవ్రావు వద్దకు వెళ్లగా బెదిరింపులకు పాల్పడున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు మలమ్మ, నర్సింలు, యాదగిరి, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. చట్టప్రకారం ముందుకెళ్తా.. ఈవిషయమై ఎక్స్పీరియం అధినేత రాందేవ్రావును వివరణ కోరగా.. 2020లో తాను భూమిని లీజుకు తీసుకున్న మాట వాస్తవమేనని, ఇందుకోసం 99 ఏళ్లకు గాను సదరు యజమానులకు రూ.13 లక్షలు ముందుగానే చెల్లించానని తెలిపారు. వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, చట్టప్రకారం ముందుకు వెళ్తానని స్పష్టంచేశారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి రాజేంద్రనగర్: ఆరాంఘర్ చౌరస్తాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ వృద్ధుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన మేరకు..భరత్నగర్కు చెందిన గంటా నాయక్ (70) సోమవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై ఆరాంఘర్ వైపు వెళుతున్నాడు. బహదూర్ఫురా నుంచి ఆర్ఎంసీ లోడ్తో వస్తున్న అశోక్ లే ల్యాండ్ వాహనం అదుపుతప్పి గంటా నాయక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు పోలీసులు మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన సుధీర్ కుమార్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మేడిపల్లిలో యువకుడు..మేడిపల్లి: కాప్రాలో నివాసముంటున్న రిషబ్ శర్మ (26) సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ నుంచి ఘటికేసర్వైపు తన ద్విచక్రవాహనంపై వెళుతుండగా మేడిపల్లి బస్టాప్ వద్ద వెనుకనుంచి అతివేగంగా వచ్చిన అయిల్ ట్యాంకర్ రిషబ్ శర్మను బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రేషన్ డీలర్పై విచారణ యాలాల: మండల పరిధిలోని నాగసముందర్ రేషన్ డీలర్ పద్మమ్మపై సోమవారం ఆర్ఐ శివచరణ్ విచారణ చేపట్టారు. లబ్ధిదారులకు ఐదు కిలోల చొప్పున బియ్యం తక్కువగా వేస్తున్నారని, నిలదీసిన వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి మహేందర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా ఆర్ఐ విచారణ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు తెలిపారు. -
అల్లుడి వేధింపులు తాళలేకే ..
● పోలీసులకు సుష్మిత తల్లి లలిత వాంగ్మూలం ● భర్త యశ్వంత్రెడ్డిని రిమాండ్కు తరలించిన పోలీసులుమీర్పేట: సంచలనం సృష్టించిన ఆత్మహత్యల కేసులో భర్తను మీర్పేట పోలీసులు రిమాండ్కు తరలించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం. ఈ నెల 8న హస్తినాపురం జయకృష్ణ ఎన్క్లేవ్లోని కుందనిక అపార్ట్మెంట్లో నివసించే సుష్మిత (27) తన 11 నెలల బాబు అశ్వంత్నందన్రెడ్డిని కడతేర్చి తాను ఆత్మహత్యకు పాల్పడగా, ఆమె తల్లి కూడా ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న సుష్మిత తల్లి లలిత పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. తన కూతురు ఆత్మహత్యకు అల్లుడు యశ్వంత్రెడ్డే కారణమని, వివాహమైన నాటి నుంచి వేధింపులు, వరకట్నం పేరుతో మానసికంగా ఇబ్బందులకు గురిచేసేవాడని తెలిపింది. దీంతో పాటు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ చిత్ర హింసలకు పాల్పడేవాడని, వేధింపులు తట్టుకోలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది. మొదట లలిత నిద్రమాత్రలు దంచి వేసుకోగా, ఆ తరువాత సుష్మిత చిన్నారి బాబు ముక్కుమూసి ఊపిరాడకుండా చేసి అనంతరం ఆమె ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లలిత వాంగ్మూలం ఆధారంగా యశ్వంత్రెడ్డిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
సర్పంచులకు శిక్షణ
సాక్షి, రంగారెడ్డిజిల్లా/యాచారం: కొత్తగా ఎన్నికై న సర్పంచులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఐదు విడతల్లో జిల్లాలోని 525 మంది సర్పంచులకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సభ్యులకు గ్రామ పంచాయతీల పాలన, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్టులోని రెండు సమావేశ మందిరాలను సిద్ధం చేశారు. గ్రామ స్వరూపం, ఇంటి నిర్మాణాలకు అనుమతుల జారీ, ఆస్తి పన్ను వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు, పార్కుల పరిరక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు, వాటిని సద్వినియోగం చేసుకునే అంశం, ప్రభుత్వాలు పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా చూడటం వంటి అంశాలపై వివరించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో 109 మందికి.. ఈనెల 19 నుంచి 23 వరకు మొదటి విడతలో షాబాద్ మండల పరిధిలోని 41 పంచాయతీలు, మొయినాబాద్ మండల పరిధిలోని 19, చేవెళ్ల మండల పరిధిలోని 25, శంకర్పల్లి మండల పరిధిలోని 24 పంచాయతీల సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడతలో 103 మందికి.. మాడ్గుల మండల పరిధిలోని 34 మంది సర్పంచులు, ఆమనగల్లు మండల పరిధిలోని 13 మంది, తలకొండపల్లి మండల పరిధిలోని 32 మంది, కడ్తాల్ మండల పరిధిలోని 24 మంది సర్పంచులకు ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నిర్వహించే రెండో విడతలో శిక్షణ ఇవ్వనున్నారు. మూడో విడతలో 113 మందికి.. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు కందుకూరు మండల పరిధిలోని 35 మంది సర్పంచులు, నందిగామ మండల పరిధిలోని 19 మందికి, మహేశ్వరం మండల పరిధిలోని 30 మందికి, కేశంపేట మండలంలోని 29 మంది సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. నాలుగో విడతలో 105 మందికి.. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు నాలుగో విడత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఫరూఖ్నగర్ మండల పరిధిలోని 47 మంది, కొత్తూరు మండలంలోని 12 మంది, కొందుర్గు మండలంలోని 22 మంది, జిల్లెడ్ చౌదరిగూడ మండల పరిధిలోని 24 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఐదో విడతలో 96 మందికి.. ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు చివరి విడతగా నిర్వహించే శిక్షణ తరగతుల్లో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని సర్పంచులకు అవగాహన కల్పించనున్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని 14 మంది సర్పంచులు, ఇబ్రహీంటపట్నం మండల పరిధిలోని 14 మంది, మంచాల మండల పరిధిలోని 23 మందికి, యాచారం మండల పరిధిలోని 24 మందికి, శంషాబాద్ మండల పరిధిలోని 21 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 27 వరకు ఐదు విడతల్లో ప్రత్యేక తరగతులు గ్రామ పంచాయతీ పాలన.. పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన ముచ్చింతల్లోని స్వర్ణభారతి ట్రస్టులో ఏర్పాట్లు జిల్లాలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రతి ఒక్కరూ కచ్చితంగా హాజరయ్యేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి ఆయా మండలాల ఎంపీడీఓ, ఎంపీఓలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలం నుంచి అన్ని గ్రామాల సర్పంచులు హాజరయ్యే విధంగా పర్యవేక్షణ చేయడం కోసం జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ అధికారిని నియమించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. శిక్షణ పొందనున్న సర్పంచులకు నిత్యం ఆన్లైన్ పోర్టల్లో హాజరు నమోదు, చివరి రోజు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. -
పుర పోరు.. సందడి షురూ
రిజర్వేషన్లు వెలువడడంతో ‘పుర పోరు’ మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులంతా టికెట్ల వేట మొదలు పెట్టారు. రిజర్వేషన్లు కలిసిరాని నాయకులు పక్కవార్డుల వైపు చూస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు సైతం గెలుపు గుర్రాలను అన్వేశించే పనిలో పడ్డాయి. షాద్నగర్/మొయినాబాద్: మున్సిపల్ సమరానికి సర్వం సిద్ధం అయ్యింది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఎన్నికల నిర్వాహణకు నేడో రేపో షెడ్యూల్ విడులయ్యే అవకాశాలు ఉన్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలు రూపొందించే దిశగా పార్టీల ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు. వీడిన ఉత్కంఠ కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. చైర్మన్ పీఠంతోపాటు, వార్డుల రిజర్వేషన్లు కలెక్టర్ ప్రకటించారు. రొటేషన్ ప్రాతిపదికన వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్ధతిలో మహి ళల స్థానాలను కేటాయించారు. దీంతో ఆశావాహుల నిరీక్షణ ఫలించింది. బలమైన అభ్యర్థుల కోసం.. ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థులను గుర్తించేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. వార్డుల్లో పోటీ చేసే ఆశావాహుల వివరాలను సేకరించే పనులు మొదలు పెట్టారు. ఒక్కో వార్డు నుంచి మూడు పేర్లు తీసుకుని అందులో ఎవరికి టికెట్ ఇవ్వాలనేదానిపై కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ఆశావహులతో అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఆర్థికంగా బలంగా ఉండి, ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న వారికి టికెట్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇందుకు గాను సర్వేల ద్వారా గుర్తించి ఎవరు మెరుగ్గా ఉంటే వారికి బీఫాం ఇవ్వాలని చూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే టికెట్లు ఎవరికి దక్కుతాయనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పొరపాట్లకు తావివ్వకుండా.. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు తిరిగి తావివ్వకుండా అన్ని పార్టీల నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు నేతల ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన మద్దతుదారులు విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ బెదడ లేకుండా అందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రధాన పార్టీల నేతలు దృష్టి సారించారు. ఆశావహుల ప్రయత్నాలు పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే బీఫాం తప్పనిసరి. దీన్ని దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు మొదలుపె ట్టారు. నేతలను ఆకర్షించేందుకు, ఓటర్ల మద్దతు కూడగట్టుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకటనతో మొదలైన హడావుడి ఎన్నికల సమరానికి పార్టీల సన్నద్ధం గెలుపు గుర్రాల కోసం వేట మరోవైపు ఆశావహుల ప్రయత్నాలు -
‘ప్రీ యాక్టివేషన్’పై యాక్షన్
సాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్లతో పాటు అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులకు కలిసి వస్తున్న ప్రీ యాక్టివేషన్ దందాకు చెక్ చెప్పడానికి నగర పోలీసు విభాగం సిద్ధమైంది. ఇందులో భాగంగా సీసీఎస్ అధీనంలోని స్పెషల్ టీమ్ పోలీసులు నగరవ్యా ప్తంగా నిఘా ఉంచారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లోని కడప నుంచి వీటిని తీసుకువచ్చి, నగరంలో విక్రయించడానికి ప్రయత్నించి ఇద్దరు పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన 184 సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం నాంపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ తరహా సిమ్కార్డుల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిబంధనలు పట్టించుకోని ఔట్లెట్స్ సెల్ఫోన్ వినియోగదారు ఏ సర్వీసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు, వేలిముద్రలు కచ్చితంగా ఇవ్వాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనేక మంది సిమ్కార్డుల విక్రేతలు తమ వద్దకు వచ్చే సాధారణ వినియోగదారులకు తెలియకుండా వారి నుంచి గుర్తింపులు తీసుకుంటున్నారు. వేలిముద్రల సేకరణ సమయంలో మొదటి ప్రయత్నం విజయవంతమైనా.. అలా కాలేదంటే మరోసారి ఫింగర్ ప్రింట్స్ తమ వద్ద ఉండే మిషన్లో తీసుకుంటున్నారు. మొదటి ప్రయత్నంతో యాక్టివేట్ చేసినవి వినియోగదారుడికి ఇచ్చేసి పంపిస్తున్నారు. ఆపై రెండో ప్రయత్నంతో యాక్టివేట్ చేసుకున్నవి తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఇద్దరు కలిసి పదుల సంఖ్యలో.. ఏపీలోని కడప జిల్లా భద్రిపల్లికి చెందిన నేనావత్ దినేష్ కుమార్ నాయక్ కడపలో లావణ్య ఎంటర్ప్రైజెస్ సిమ్స్ డిస్ట్రిబ్యూటర్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. అదే జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రణపల్లి సాయి ప్రదీప్ ఓ సర్వీస్ ప్రొవైడర్ సంస్థలో సిమ్కార్డ్స్ ప్రమోటర్గా పని చేస్తున్నారు. ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డులకు ఉన్న డిమాండ్ తెలుసుకున్న ఈ ఇద్దరూ దాన్ని క్యాష్ చేసుకోవాలని పథకం వేశారు. కొన్నాళ్లుగా లావణ్య ఎంటర్ప్రైజెస్కు సిమ్కార్డ్స్ కోసం వచ్చే వినియోగదారుల్ని టార్గెట్ చేశారు. వారికి తెలియకుండా గుర్తింపులు, వేలిముద్రలు తీసుకుని సిమ్కార్డుల్ని యాక్టివేట్ చేస్తున్నారు. వీటికి హైదరాబాద్లో డిమాండ్ ఎక్కువగా ఉందని భావించి విక్రయించడానికి వచ్చారు. దీనిపై సీసీఎస్ స్పెషల్ టీమ్కు సమాచారం అందింది. ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటేనే కట్టడి ఏసీపీ జి.వెంకటేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ డి.బిక్షపతి నేతృత్వంలోని బృందం ఆదివారం నాంపల్లి ప్రాంతంలో వల పన్ని ఇద్దరు నిందితులను పట్టుకుని 184 ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాను పూర్తి స్థాయిలో అరికట్టాలంటే సిమ్కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్కు ముందు సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. పోస్ట్పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ–పెయిడ్ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తర్వాతే యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు. అక్రమ సిమ్కార్డుల దందాపై సీసీఎస్ నజర్ వీటిని తరచూ వినియోగిస్తున్న అసాంఘిక శక్తులు ఏపీ నుంచి తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన స్పెషల్ టీమ్ -
ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా షాక్
అక్కడికక్కడే వ్యక్తి మృతి యాచారం: కూలీ డబ్బులు వస్తాయనే ఆశతో ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఫ్యూజ్ను సరిచేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని సాయిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన ముద్దం పర్వతాలు(55)కు ఆదివారం అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ పనిచేయకపోవడంతో మరమ్మతు చేయాలని, అందుకు కొంత డబ్బులు ఇస్తానని ఆశచూపాడు. దీంతో పర్వతాలు విద్యుత్ సరఫరా జరిగే ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేయకుండా ఫ్యూజ్ మరమ్మతు చేయబోయాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. న్యాయం చేసే వరకు మృతదేహన్ని తరలించే ప్రసక్తే లేదని ధర్నా చేపట్టారు. గ్రామస్తులు, పోలీసుల జోక్యం చేసుకుని కూలీ డబ్బులు ఆశ చూపిన సదరు రైతు మృతుడి కుటుంబానికి పరిహారంగా కొంత నగదు ఇస్తాననే హామీ ఇప్పించడంతో వారు శాంతించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కనీస సమాచారం ఇవ్వలేదు.. సాయిరెడ్డిగూడెంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో ఫ్యూజ్ మరమ్మతు కోసమని ఆ గ్రామ రైతులెవరూ కనీస సమాచారం ఇవ్వలేదని కందుకూరు మండల విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన వ్యక్తి కనీస అవగాహన లేకుండా, విద్యుత్ సరఫరా అవుతున్నా ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేయకుండానే ఫ్యూజ్ మరమ్మతు చేయబోయి షాక్కు గురై మృతి చెందాడని పేర్కొన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లో ఏమైనా సమస్యలుంటే గ్రామానికి సంబంధించిన విద్యుత్ సిబ్బంది లేదా మండల విద్యుత్ శాఖ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. అవగాహన లోపంతో మరమ్మతులు చేయబోయి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దన్నారు. -
సాపాటు ఎటూ లేదు.!
శంషాబాద్: నిర్మాణ రంగంతో పాటు అనే సంస్థలు, పరిశ్రమల్లో లేబర్ పనులు చేసుకునే అడ్డాకూలీలు, ప్రయాణికులు, బాటసారులు శంషాబాద్ సర్కిల్లో వేల సంఖ్యలో ఉంటారు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు ఇందిరమ్మ క్యాంటీన్ రూ.5 భోజన కేంద్రం లేదు. దీంతో పనులు లభించని వేళ కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇక్కడ రూ.5 భోజన కేంద్రం లేకపోవడానికి కారణం ఇది మున్సిపాలిటీ కావడమే. శంషాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటై ఆరేళ్లయ్యింది. ఈ ప్రాంతంలో కూలీలు ఎక్కువగా ఉండటంతో స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ రూ.5 భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చాయి. కానీ మున్సిపాలిటీ వద్ద బడ్జెట్ లేక అధికారులు వెనకడుగు వేశారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూ.5 భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. ● శంషాబాద్ మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలోకి విలీనమైన విషయం విదితమే. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నట్లే ఇప్పుడు ఇక్కడ కూడా రూ.5 భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తారా? అని స్థానిక నేతలను.. కార్మిక సంఘాల నాయకులను ఆశగా అడుగుతూ కూలీలు కనిపిస్తున్నారు. శంషాబాద్ జీహెచ్ఎంసీలో విలీనమైన నేపథ్యంలో రూ.5 భోజన కేంద్రాలు ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారోనని కూలీలు, పేదలు వేయి కళ్లతో వినిపించని ఆకలి ఆర్తనాదాలతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వేల సంఖ్యలో శంషాబాద్ సర్కిల్లోని శంషాబాద్, కొత్వాల్గూడ డివిజన్ల పరిధిలో నిర్మాణ రంగాలతో పాటు పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులు వేల సంఖ్యలో ఉంటారు. వీరితో పాటు ప్రయాణికులు, బాటసారులు అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. సర్కిల్లో రూ. భోజన కేంద్రం ఏర్పాటు చేయాలని ఐదేళ్లుగా కార్మికులతో పాటు వాటి సంఘాల నేతలు డిమాండ్ చేయడంతో పాటు మున్సిపాలిటీలో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అయితే స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో ఉండే ఈ కేంద్రానికి సంబంధించిన బడ్జెట్లో సగానికి పైగా స్థానిక సంస్థలే భరించాల్సి ఉండటంతో బడ్జెట్ భారం అనుకున్న అధికారులు, నేతలు దానిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు సాధ్యమేగా ప్రస్తుతం శంషాబాద్ జీహెచ్ఎంసీలో విలీనమై నెలరోజులు కావస్తోంది. జీహెచ్ఎంసీలో పదుల సంఖ్యలో కొనసాగుతున్న మాదిరిగానే శంషాబాద్లో లేబర్ అడ్డాలున్న చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ వెల్లువెత్తుతోంది. ప్రస్తుతం వీటి ఏర్పాటుకు బడ్జెట్ కూడా భారం కాకపోవడంతో త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రూ.5భోజన కేంద్రంతో వందల సంఖ్యలో డబ్బులు లేని వారు కడుపు నింపుకుంటారని దీనిపై అధికారులు సత్వరమే స్పందించాలనికోరుతున్నారు. దీనిపై స్థానికంగా సీపీఐ నాయకులు ఇప్పటికే అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. శంషాబాద్లో వందల సంఖ్యలో అడ్డా కూలీలు పనులు దొరకకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి గతంలో మున్సిపాలిటీగా ఉండటంతో రూ.5 భోజన కేంద్రం ఏర్పాటుకు వెనకడుగు బడ్జెట్ లేకనే ఏర్పాటు చేయలేకపోయామన్న అధికారులు జీహెచ్ఎంసీలోకి విలీనమైన నేపథ్యంలో ఏర్పాటు చేస్తారని చిగురిస్తున్న ఆశలు -
డివైడర్ ఢీకొని కారు బోల్తా
ఫిలింనగర్: మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఓ కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది.ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. పుప్పాలగూడ అల్కాపూర్ టౌన్షిప్లో నివసించే బోడ సచిన్(34) ఆదివారం ఉదయం చింతల్ బస్తీ నుంచి తన ఇంటికి వెళుతున్నాడు. ఫిలింనగర్లోని శంకర్ విల్లాస్ చౌరస్తాలో కారు అదుపు తప్పడంతో డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో సచిన్ స్వల్ప గాయాలతో బయటపడి భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్టేషన్కు తరలించారు. ఈ కారు బోడ స్వర్ణలత అనే పేరు మీద ఉండగా, సచిన్ కారు నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడు. సచిన్ను పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహించగా జీరో అని వచ్చింది. అయితే కారులో మాత్రం ఆరుకు పైగా విస్కీ బాటిళ్లు లభ్యమయ్యాయి. నిందితుడు రాత్రంతా మద్యంతాగి ఆదివారం మధ్యాహ్నం పట్టుబడడంతో డ్రంకన్ డ్రైవ్లో జీరో నమోదైనట్లు తెలుస్తున్నది. కారు డివైడర్ను ఢీకొట్టిన సమయంలో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడం, బోల్తా పడడంతో కారు నడుపుతున్న సచిన్ ప్రాణాలతో బయటపడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యానికి కారకుడైన సచిన్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. -
కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా..
స్థానికం● వేణుగోపాలస్వామి ఆలయంలో 22 నుంచి వార్షికోత్సవాలు ● 25న స్వామివారి కల్యాణం ● బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం కడ్తాల్: కడ్తాల్ మండలం మఖ్తామాధారం గ్రామంలో కొలువైన, భక్తుల ఆరాధ్యదైవం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22వ తేది గురువారం నుంచి ప్రారంభమై 27వ తేది వరకు నిర్వహించనున్నారు. ఈ ఆలయంలో ఆరు రోజుల పాటు, భక్తజన సందోహం మధ్య వైభవంగా వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలతో పాటు ఆయా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెంది, పురాతన ఆలయంగా వేణుగోపాల స్వామి ఆలయానికి గుర్తింపు ఉంది. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రకృతి రమణీయ ప్రదేశంలో ఆలయం చూడచక్కగా ఉంటుంది. వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు మంత్రముగ్దులవుతారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా..జగత్రక్షకుడిగా వేణుగోపాల స్వామి ఆలయం ఈ ప్రాంతంలో ప్రత్యేక కీర్తి గడించింది. ఉత్సవాల కోసం ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో, వివిధ రంగులు వేసి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని శోభాయామానంగా తీర్చిదిద్దుతున్నామని ఆలయ అనువంశిక అర్చక ధర్మకర్త తిరుమల వింజమూరు రామానుజాచార్యులు వివరించారు. ఉత్సవ వివరాలు ● 22న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, స్వస్తివాచనం, ఋత్విగ్వరణం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం ● 23న నిత్యవిధి, ఆదివాస హోమం, ద్వజారోహణం, బేరిపూజ దేవాతహ్వానం, పల్లకీ సేవ, ● 24న నిత్య విధి, హోమం అభిషేకం, గరుడవాహన సేవ, మోహినిసేవ ● 25న శ్రీవారి కల్యాణం. చంద్రప్రభసేవ, రథోత్సవం, అన్నదానం. ● 26వ తేదిన, గంధావళి ఉత్సవం, నిత్యవిధి, అభిసేకం, హోమం, శ్రీవారి అశ్వవాహన సేవ ● 27న నిత్యవిధి, మహా పూర్ణహూతి, చక్రస్నానం, ద్వజా అవరోహణం, దేవతా విసర్జనం, ద్వాద శారాధనం, పుష్పయాగం, సప్తవరణ మహాదాశీర్వాదం, సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇలా చేరుకోవచ్చు ప్రతి ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవాలకు తరలి వస్తుంటారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి 44 కిలో మీటర్ల మేర ప్రయాణించి కడ్తాల్ చేరుకోవాలి. అక్కడి నుంచి షాధ్నగర్ వెళ్లే రహదారి నుంచి కడ్తాల్ మీదుగా 7 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణించి మఖ్తామాధారం వేణుగోపాల స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ శ్రీశైలం రూట్లో ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం కలదు. -
పట్టా భూములకు పరిహారం పెంచండి
దుద్యాల్: పారిశ్రామిక వాడ ఏర్పాటులో భాగంగా పట్టా భూములు కోల్పోతున్న తమకు పరిహారం పెంచి ఇవ్వాలని 11 మంది బాధిత రైతులు శనివారం వికారాబాద్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ కలిసి విన్నవించారు. గత ఏడాది నవంబర్ 3న పట్టా భూముల సేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల గ్రామాల పరిధిలోకి వచ్చే 815, 816, 817 సర్వే నంబర్లలో 32 మంది రైతులకు సంబంధించిన 23.15 ఎకరాల పట్టా భూముల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. 816, 817 సర్వే నంబర్లలో 13 ఎకరాలకు చెందిన రైతులు కలెక్టర్ను కలిశారు. తమది విలువైన భూమి అని పరిహారం పెంచి ఇవ్వాలని కోరారు. ధర పెంచి ఇస్తే ఇతర ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేసి సాగు చేసుకుంటామని తెలిపారు. స్పందించిన కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు మామిళ్ల నర్సింలు, సరిత, జయమ్మ, మాణేమ్మ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
శాంతి ర్యాలీ భగ్నం
సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్బన్సీలాల్పేట్: సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ శనివారం చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. ఆందోళ నకు దిగిన బీఆర్ఎస్, లష్కర్ జిల్లా సాధన సమితి నాయకులు, ఇతరత్రా అసోసియేషన్ల ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన డిమాండ్తో మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు జి.పవన్కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సనత్నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు ఉదయం అల్ఫా హోటల్ ప్రాంతానికి తరలివ చ్చారు. రైల్వేస్టేషన్ నుంచి క్లాక్టవర్, ప్యాట్నీ చౌరస్తా, ప్యారడైజ్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ చేసేందుకు యత్నించారు. అప్పటికే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకు లను అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. దీంతో సికింద్రాబాద్ అల్ఫా హోటల్ ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు.. ఆందోళనకారుల నినాదాలతో ఈ ప్రాంతం హోరెత్తింది. లష్కర్ జిల్లా సాధన సమితి, బీఆర్ఎస్ పిలుపు మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు, మోండా మార్కెట్, సుభాష్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు పాక్షికంగా బంద్ పాటించాయి. అనంతరం వ్యాపార కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాయి. అరెస్టులు.. నిర్బంధాలు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో చేపట్టిన శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు జి.పవన్కుమార్ గౌడ్, తలసాని సాయికిరణ్ యాదవ్, తలసాని స్కైలాబ్ యాదవ్, మోండా మార్కెట్ చిల్లర వర్తకుల సంఘం ప్రధాన కార్యదర్శి కోత్మీర్ మధు, ఆకుల హరికృష్ణ తదితరులను పోలీసులు అరెస్టు చేసి రాంగోపాల్పేట్ పోలీసు స్టేషన్కు తరలించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్ను మోండా మార్కెట్ టకార బస్తీలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. కాగా.. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను, కార్పొరేటర్లను, వ్యాపార వర్గాల ప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. శాంతి ర్యాలీని అడ్డుకోవడం సరికాదు: ఎమ్మెల్యే పద్మారావు సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం కోసం చేపట్టిన శాంతి ర్యాలీని అడ్డుకోవడం సరికాదని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ అన్నారు. మోండా మార్కెట్ టకారబస్తీలోని తన నివాసం వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి అను గుణంగా నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందన్నారు. లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు జి.పవన్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటాన్ని ఆపేదిలేదన్నారు. సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని ఎస్సీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు డి.సుదర్శన్బాబు డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ నాయకుల అరెస్టు భారీగా మోహరించిన పోలీసులు.. ఉద్రిక్తత -
క్రీడాకారుల ఔదార్యం
యాచారం: సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడా పోటీల్లో గెలుపొందిన నగదును కష్టాల్లో ఉన్నవారికి అందించి మంచి మనుసును చాటుకున్నారు క్రీడాకారులు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన గోడుకొండ్ల ప్రవీణ్కుమార్ మూడు నెలల కింద రోడ్డు ప్రమాదానికి గురై ఇంట్లో మంచానికే పరిమితమయ్యారు. జీవచ్చంలా పడి ఉన్న ప్రవీణ్కుమార్ చూసి చలించిన క్రీడాకారులు కుంటి పాండుయాదవ్ తదితరులు క్రికెట్ పోటీలో గెలుపొందిన రూ.ఐదు వేలను బాధితుడికి శనివారం అందజేశారు. అదే విధంగా కుర్మిద్ద గ్రామంలో వారం కింద వలబోతు నర్సింహ అనారోగ్యానికి గురై మృతి చెందారు. అదే గ్రామంలో క్రికెట్ పోటీలో గెలుపొందిన నరేష్, మహేందర్ తదితరులు బాధిత కుటుంబ సభ్యులకు రూ.ఐదు వేల ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. రెండు గ్రామాల్లోని క్రీడాకారులు తమ ప్రైజ్ మనీని కష్టాల్లో ఉన్నవారికి అందజేసి అండగా నిలవడంపై మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నిరాధార ఆరోపణలు సరికాదు
కొడంగల్ రూరల్: ధూప దీప నైవేద్య పథకం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మపై నిట్టూరి సతీష్కుమార్ చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నట్లు డీడీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి తెలిపారు. శనివారం పట్టణంలోని శ్రీ మహాదేవుని ఆలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్చకుడే కాని సతీష్కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకోవడం సరికాదన్నారు. వాసుదేవశర్మ నాయకత్వంలో డీడీఎన్ఎస్ అర్చకులు పనిచేస్తున్నట్లు తెలిపారు. అర్చకుల బాగోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో అర్చక సంఘం నాయకులు కిట్టుస్వామి, జగదీష్ స్వామి, భానుప్రకాష్, హన్మంతు, శివకుమార్, డీ నర్సింలు, జీ నర్సింలు, జీ శ్రీను, కిష్టప్ప పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఇక పల్లెబాట
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘వీబీ జీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 1 వరకు ‘పల్లెబాట’ పట్టనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన చట్టంతో నిరుద్యోగ సమస్య పెరగడం, కూలీలపై నిర్భందం, శ్రమ దోపిడీకి గురవడం, మహిళలు ఉపాధి అవకాశాలను కోల్పోవడంతో పాటు పట్టణాలకు మళ్లీ వలసలు పెరిగే ప్రమాదం ఉందని.. దళిత, ఆదివాసీ కుటుంబాలకు తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టే చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, రాష్ట్ర రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ జంగారెడ్డి, రాష్ట్ర స్పోక్స్ పర్సన్ గౌరీ సతీష్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, శంషాబాద్ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, నర్కుడ గ్రామ సర్పంచ్ శేఖర్ యాదవ్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పేదల ఉపాధి హక్కును కాలరాస్తోందని ఆరోపించారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వం పేదలకు 100 రోజుల పని కల్పించి, వలసలను నివారించేందుకు మహాత్మాగాంధీ పేరున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని, వందశాతం నిధులను కేంద్రమే చెల్లించేదని గుర్తు చేశారు. కాంగ్రెస్కు పేరు వస్తుందనే..ఈ పథకంతో కాంగ్రెస్కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే భయంతో మోదీ ప్రభుత్వం గాంధీ పేరును తొలగించి, గాడ్సే వారసుల పేరుతో చట్టాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కూలీల పని దినాలకు 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం చెల్లించాలని మెలిక పెట్టి పథకాన్ని పేదలకు దూరం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పేద కూలీల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ వరుసగా పది రోజుల పాటు పార్టీ కేడర్ అంతా గ్రామాల్లో పర్యటించి, ఉపాధి హామీ పథకంలో పేరు మార్పుతో పేదలకు జరగనున్న నష్టాలను వివరించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు మొదలుకార్పొరేషన్ల చైర్మన్లు, సర్పంచులు, జెడ్పీటీసీ మాజీ సభ్యు లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, ఎంపీపీలు, ముఖ్య నేతలంతా ఈ పది రోజులు జనం మధ్యే ఉండాలని పిలు పునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేసి కేంద్రం వైఖరిని ఎండగట్టాలన్నారు. వీబీజీ రామ్జీ చట్టం రద్దు కోసం ప్రజలందరినీ సంఘటితం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాన్నుట్లు ఆయన ప్రకటించారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
రూ.2.20 లక్షల అపహరణ కేశంపేట: తాళం వేసి పండుగకు ఊరెళ్లిన వారి ఇంట్లో దొంగలు పడి నగదు దోచుకెళ్లిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైకని శ్రీశైలం డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టి అందుకు అవసరమైన నగదును తెలిసిన వ్యక్తుల వద్ద అప్పుగా తెచ్చి పెట్టారు. అందులో నుంచి కొంత నగదు ఇంటి నిర్మాణానికి ఉపయోగించగా మిగిలిన రూ.2.20 లక్షలను ఇంట్లో బీరువాలో భద్రపరిచారు. ఈ నెల 12న డ్రైవింగ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం వెళ్లగా అదే రోజు సాయంత్రం అతడి భార్య నిర్మల తన తల్లిగారి ఊరైన ఘనపురానికి వెళ్లారు. అయితే ఇంటి వెనుకవైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి బీరువా తెరిచి అందులో ఉన్న నగదును దొంగిలించారు. సంక్రాంతి పండుగ తర్వాత నిర్మల శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చారు. బీరువాలో ఉన్న నగదు లేకపోవడంతో భర్తకు విషయాన్నిన తెలియజేశారు. దీంతో శ్రీశైలం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ నరహరి తెలిపారు. అనుమానాస్పదంగా వ్యక్తి మృతి మర్పల్లి: అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి రావులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మోమిన్పేట్ మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన గొల్ల రమేష్ జీవనోపాధి నిమిత్తం 10 సంవత్సరాల క్రితం రావులపల్లికి వచ్చారు. గ్రామంలోని ఓ వెంచర్లో పనిచేస్తుండేవాడు. శుక్రవారం సాయంత్రం వెంచర్లో మిత్రులతో డిన్నర్ ఉందని రమేష్ ఇంట్లో కుటుంబీకులకు చెప్పి వెళ్లాడు. రాత్రి 10 గంటలు అయినా ఇంటికి రాకపోవటంతో కంగారు పడిని కుటుంబీకులు.. అతనికి ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇదే విషయమై మృతుడి మిత్రులను ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో అతని ఆచూకీ కోసం వెతకగా.. రావులపల్లి సమీపంలోని కుటుగుంట రోడ్డు పక్కన విగతజీవిగా పడున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఎస్ఐ రహూఫ్ ఘటన స్థలికి చేరుకున్నారు. వివరాలు సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. అనంతరం దేహాన్ని బంధువులకు అప్పగించారు. తన భర్త చావుకు అతని ముగ్గురు స్నేహితులే కారణమంటూ మృతుడి భార్య అనుసూజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానస్పద కేసుగా నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. చీమల్దరే ఆదర్శం మోమిన్పేట: సుపరిపాలనలో జాతీయ అవా ర్డు పొందిన చీమల్దరి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటామని గోవా రాష్ట్ర సర్పంచుల బృందం తెలిపింది. శనివారం గ్రామంలో వారితోపాటు ఎన్ఐఆర్డీ బృందం సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనం, రో డ్లు, భూగర్భ మురుగు కాల్వల నిర్మాణం, ప్రజలకు పంచాయతీ నుంచి అందుతున్న సేవలు, పన్నుల వసూలు, వీధి దీపాల ఏర్పాటు తదితర వాటిని తెలుసుకున్నారు. మారుమూల గ్రామం ఇంతలా అభివృద్ధి చెందడం, అందుకు గ్రామస్థుల సహకారం, సర్పంచ్ పని తీరును వారు కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్పన, ఎన్ఐఆర్డీ అధికారి విద్యులత, గోవా రాష్ట్ర ఎస్ఐఆర్డీ అధికారి లక్ష్మీకాంత్, ఎంపీడీఓ సృజన సాహిత్య, ఎంపీఓ యాదగిరి, ఉప సర్పంచ్ రాంచంద్రయ్య, కార్యదర్శి భరత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి గోల్కొండ: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని టోలిచౌకీ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ అన్నారు. శనివారం గోల్కొండలోని లిటిల్స్ ప్యారడైస్ స్కూల్లో పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ..చెడు వ్యసనాలకు వ్యతిరేకంగా పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. డ్రగ్స్ రహిత నగర నిర్మాణానికి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం పటిష్ట ప్రణాళికతో కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ సేవనం వల్ల తలెత్తే దుష్పరిణామాలు తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ విషయంలో పాఠశాలల కరస్పాండెంట్లు, పోలీసులకు బాగా సహరిస్తున్నారన్నారు. అనంతరం ఆయన చెడు వ్యసనాలకు దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాడెంట్ సయ్యద్ యూనుస్, అధ్యాపక బృందం ఉన్నారు. -
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
కందుకూరు: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలు కాపాడుకోవచ్చని మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీ ఎ.చంద్రశేఖర్, స్థానిక పీఎస్ సీఐ సీతారామ్ అన్నారు. అరైవ్, అలైవ్ క్యాంపెయిన్–2026లో భాగంగా శనివారం మండల పరిధిలోని కొత్తగూడ చౌరస్తాలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. రాంగ్ రూట్లో వాహనాలు నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడం, అధిక వేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి చర్యలు ఎంతో ప్రమాదకరమైనవన్నారు. అలాంటి తప్పిదాలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడంతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలన్నారు. అనంతరం సురక్షితంగా రోడ్డు దాటడం, లేన్ క్రమశిక్షణ పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ పాండు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన షాద్నగర్రూరల్: ప్రజల భద్రతే ముఖ్యమని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్టలో శనివారం పట్టణ సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో అలైవ్ –అరైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమా దాల నివారణ, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రహదారి నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజ నిర్మాణంలో భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. ఎంవీఐ వాసు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించవ చ్చని అన్నారు. రెప్పపాటులో జరిగే చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని అన్నారు. ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలను నడపడంతో ఎంతో మంది ప్రమాదాల బారిన పడి తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నవకిరణినర్సింహ్మ, ఎస్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ను కలిసిన లగచర్ల భూ నిర్వాసితులు దుద్యాల్: మండలంలోని పారిశ్రామిక వాడ భూ నిర్వాసితులు శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నగరంలోని తెలంగాణ భవన్లో కలిశారు. ఇక్కడి పరిస్థితులను ఆయనకు వివరించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించనట్లు వారు తెలిపారు. కార్యక్ర మంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, లగచర్ల సురేశ్, పులిచర్లకుంట తండా గోపాల్ నాయక్, రోటిబండ తండా రాములు నాయక్, పోలేపల్లి విశాల్, మడిగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్ ఇండియా పైలెట్గా మరియాపురం వాసి
షాబాద్: మండలంలోని మరియాపురంవాసి ఎయిర్ ఇండియా పైలెట్గా ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన కొమ్మారెడ్డి బాలశౌరిరెడ్డి ఆరోగ్య మేరీ దంపతుల కుమారుడు సిరిల్రెడ్డి ఈనెల 16న బెంగళూరులో జరిగిన ఇంటర్వ్యూలో పైలెట్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందన్నారు. జిల్లా నుంచి మొదటి పైలెట్ కావడం గర్వంగా ఉందన్నారు. చాలా సంతోషంగా ఉందని, అంకిత భావంతో పనిచేస్తానన్నారు. కాగా సిరిల్రెడ్డి ఎంపికపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
‘విలీనం’.. శాపం!
తుర్కయంజాల్: గ్రేటర్లో విలీనం చేయక ముందు సీడీఎంఏకు సంబంధించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా ఇంటి నంబర్కు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేవారు. అధికారుల పరిశీలన అనంతరం ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ జారీ అయ్యేది. విలీనం నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సాఫ్ట్వేర్లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. కేవలం పాత పీటీఐఎన్ నంబర్లు ఉండి, అసెస్మెంట్ పూర్తయిన వారికి మాత్రమే పన్నులు చెల్లించడానికి వీలు కుదురుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే సాఫ్ట్వేర్ అప్లికేషన్ను కేటాయించకపోవడంతో అసెస్మెంట్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్ విషయమై మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులకు సైతం స్పష్టత లేదు. ఎప్పటి వరకు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో చెప్పలేకపోతున్నారు. వేధిస్తున్న టెక్నికల్ సమస్యలు ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేసే బిల్డ్ నౌ సాఫ్ట్వేర్లో దొర్లిన తప్పులను సరిదిద్దే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అబ్దు ల్లాపూర్మెట్ మండలం ఆదిబట్ల సర్కిల్లోని గ్రా మాలను ఇబ్రహీంపట్నం మండలంలో చేర్చారు. దీనిపై పలువురు దరఖాస్తుదారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు వరుసగా ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు ఇబ్రహీంపట్నం మండలంలోనే చేర్చాలని చెప్పారని, వారి సూచన మేరకే ఇలా చేశామని చెప్పుకొస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు వస్తేనే చేస్తామని అప్పటి వరకు ఇంతేనని చెబుతుండటం గమనార్హం. ఈ ఒక్క సర్కిల్లోనే కాదు విలీన మున్సిపాలిటీల్లో అనేక టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. సులువుగా పరిష్కా రమయ్యే వాటిని కూడా చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బిల్డ్ నౌలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు పీటీఐఎన్ నంబర్ల జారీ ప్రక్రియను ప్రారంభించాలని కోరుతున్నారు.విలీన మున్సిపాలిటీల్లో నిలిచిన ఇంటి నంబర్లజారీ మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేసి 45 రోజులు పూర్తవుతున్నా నేటికీ పాలన చక్కబడలేదు. ఇళ్ల నిర్మాణ అనుమతుల నుంచి మొదలు ఇంటి నంబర్ల జారీ, మ్యూటేషన్, బర్త్, డెత్ సర్టిఫికెట్, వెకెంట్ ల్యాండ్ ట్యాక్సీ, ట్రేడ్ లైసెన్స్ల కోసం ప్రజలు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. వేచి చూడాల్సిందే.. గ్రేటర్లో విలీనం నుంచి కొత్త అసెస్మెంట్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిన మాట వాస్తవమే. గతంలో మున్సిపాలిటీల నుంచి పీటీఐఎన్ నంబర్లు పొందిన వారు మాత్రమే పన్నులు చెల్లించవచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా కొత్త దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇది పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. – శ్రీనివాసులు, రెవెన్యూ అధికారి, ఆదిబట్ల సర్కిల్ -
ఉపాధి చట్టం నిర్వీర్యానికి కుట్ర
● కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ అనంతగిరి: ఉపాధిహామీ చట్టం నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మ శ్రీ ఆరోపించారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 19న వికారాబాద్లో చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లేబర్కోడ్స్, వీబీ జీ రామ్జీ, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికవర్గాలను అణగదొక్కేలా చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు. ఈ విషయాల్లో ప్రజలు జాగురతా కావాలని, కేంద్రం విధానాలను ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి బుస్స చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
26లో.. దక్కింది ఐదే!
మొయినాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు రిక్త హస్తం చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 31 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతుంటే.. మొయినాబాద్ మున్సిపాలిటీలో మాత్రం బీసీలకు దక్కింది కేవలం 19 శాతం మాత్రమే. మున్సిపాలిటీలో మొత్తం 26 స్థానాలుండగా కేవలం 5 స్థానాలు మాత్రమే బీసీలకు రిజర్వు అయ్యాయి. అందులోనూ బీసీ మహిళలకు 2 స్థానాలు, బీసీ జనరల్కు 3 స్థానాలు కేటాయించారు. జనాభా పరంగా చూసినా, ఓటర్ల పరంగా చూసినా మొయినాబాద్ మున్సిపాలిటీలో బీసీలు 56 శాతానికి పైగానే ఉన్నారు. మున్సిపాలిటీ రిజర్వేషన్లలో మాత్రం కేవలం 19 శాతం మాత్రమే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీసీ సంఘాలు, బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ పదవిపై ఎమ్మెల్యే తనయుడి గురి? మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు కావడంతో ఆ పదవిపై స్థానిక ఎమ్మెల్యే తనయుడు గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొయినాబాద్ జెడ్పీటీసీగా పనిచేసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య తనయుడు కాలె శ్రీకాంత్ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఎస్సీ జనరల్కు రిజర్వు అయిన 11వ వార్డు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకు తగిన ఏర్పాట్లను ఆయన అంతర్గతంగా చేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. 11వ వార్డులో విజయం సాధించి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొంత కాలం వేచిచూడాల్సిందే. మొయినాబాద్ మున్సిపల్లో బీసీలకు 19 శాతమే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీసీ సంఘాలు తీవ్ర నిరాశలో పలు పార్టీల ఆశావహులు -
జనరల్కు జై
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల కమిషన్ మున్సిపల్ చైర్మన్/ వార్డు సభ్యులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం మున్సిపల్, కార్పొరేషన్ల చైర్మన్/ మేయర్ పోస్టులకు గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీల సమక్షంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రిజర్వేషన్లు ఖరారు చేయగా, ఆయా మున్సిపాలిటీల్లోని వార్డులకు జిల్లా ఎన్నికల అధికారులు లాట రీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా పరిధిలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా వీటిలో ఐదు జనరల్కు, ఎస్సీలు, బీసీలకు ఒక్కోటి చొప్పున రిజర్వ్ అయ్యాయి. శంకర్పల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కొత్తూరు, ఆమనగల్లు మున్సిపాలిటీలు జనరల్కు రిజర్వ్ అయ్యాయి. మొయినాబాద్ ఎస్సీ జనరల్కు, షాద్నగర్ బీసీ జనరల్కు దక్కింది. వార్డు స్థానాలకు ఇలా.. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉన్నాయి. వీటిలో ఆమనగల్లు మున్సిపల్ పరిధిలో 15 వార్డులు, చేవెళ్ల పరిధిలో 18, ఇబ్రహీంపట్నం పరిధిలో 24, మొయినాబాద్ పరిధిలో 26, షాద్నగర్ పరిధిలో 28, శంకర్పల్లి పరిధిలో 15 వార్డులు ఉన్నాయి. వీటిలో ఎస్టీ మహిళ, ఎస్సీ మహిళ, బీసీ మహిళ, అన్ రిజర్వ్డు మహిళలకు 62 స్థానాలు దక్కడం విశేషం. ఈ మేరకు కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్ మో హన్తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ప్రక్రియ పూర్తి చేశారు. ఆమనగల్లులో ఏడు, చేవెళ్లలో 9, ఇబ్రహీంపట్నంలో 12, మొయినాబాద్లో 13, షాద్నగర్లో 14, శంకర్పల్లిలో 7 వార్డుల చొప్పున మహిళలకు కేటాయించినట్లు ప్రకటించారు. కార్యక్రమానికి రాజకీయ పార్టీల నుంచి పాలమాకుల జంగయ్య, పానుగంటి పర్వతాలు (సీపీఐ), బోడ సామెల్, సీహెచ్ ఎల్లేష్ (సీపీఎం), చల్లా నర్సింహా రెడ్డి, బండారి ఆగిరెడ్డి, జంగారెడ్డి (కాంగ్రెస్), మదుపు వేణుగోపాల్, నిట్టూ జగదీశ్వర్, వెంకట్ రెడ్డి(బీఆర్ఎస్), విజయ్ కుమార్, దేవేందర్ రెడ్డి, కొండా మధుకర్ రెడ్డి (బీజేపీ) హాజరయ్యారు. వీరితో పాటు మెప్మా పీడీ వెంకటనారాయణ, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు ఎస్.వెంకటేశ్, ఎ.యోగేశ్, వి.సునీత, బి.స త్యనారాయణ రెడ్డి, ఎం.శంకర్, ఎండీ మొయినొద్దీన్ హాజరయ్యారు. ఆశావహులకు భంగపాటు ఇదిలా ఉంటే చైర్మన్, మేయర్ సహా కార్పొరేటర్ స్థానాలను ఆశించిన ఆశావహులకు భంగపాటు తప్పలేదు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్న వాళ్లు.. ఆశించిన దానికి భిన్నంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఖంగు తినాల్సి వచ్చింది. రాజకీయ పార్టీలు/ఆశావహుల అంచనాలకు తలకిందులు కావడంతో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న నేతలను వెతికి బరిలో నిలిపే పనిలో నిమగ్నమయ్యాయి. వీడిన ఉత్కంఠ -
ధర్మరక్షణ అందరి బాధ్యత
మొయినాబాద్రూరల్: దేవాలయాల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని, సనాతన ధర్మ పరిరక్షణ అత్యంత అవసరమని ఆలయ అర్చకుల సంఘం రాష్ట్ర చైర్మన్, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ అన్నారు. మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామంలో చెన్నకేశవ ఉత్సవాల్లో ఆయన శనివారం పాల్గొని మాట్లాడారు. ఆలయాలను అభివృద్ధి చేసుకున్నప్పుడే ధర్మ రక్షణలో పాల్గొన్నట్లు అవుతుందని చెప్పారు. చివరి రోజు కావడంతో స్వామివారిని రథంపై ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో టపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, నాయకులు పవన్కుమార్, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం సభను విజయవంతం చేద్దాం
కొడంగల్ రూరల్: సీపీఐ శతాబ్ది ముగింపు సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పీర్ మహమ్మద్, నియోజకవర్గ నాయకు డు గంటి సురేష్కుమార్ పిలుపునిచ్చారు. శనివా రం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని పారీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాబు,సావిత్రమ్మ, శ్యామప్ప, మల్కప్ప, శంకర్నాయక్, శైలజ, కనకప్ప పాల్గొన్నారు. -
పైగా పాలెస్
స్వర్ణ జయంతిమార్చి నాటికి హెచ్ఎండీఏ కార్యాలయం బదిలీ ● ప్యాలెస్ పునరుద్ధరణ పనులు వేగవంతం ● అన్ని విభాగాలు ఒకేచోట ఉండేలా చర్యలు టు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాలయం అమీర్పేట్ లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ నుంచి త్వరలో బేగంపేట్లోని పైగా ప్యాలెస్కు మారనుంది. ఈ మేరకు ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి. ప్రస్తుతం పైగా ప్యాలెస్లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మార్చి నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాలను ఖాళీ చేసి సొంత భవనాల్లోకి మారాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో స్వర్ణజయంతి కాంప్లెక్స్ను మరేదైనా ప్రభుత్వ విభాగానికి కేటాయించేలా పూర్వ హుడా భవనమైన పైగా ప్యాలెస్కు హెచ్ఎండీఏను బదిలీ చేయనున్నారు. దీని అన్ని విభాగాలు ఒకేచోట కొలువుదీరేందుకు అవకాశం ఏర్పడనుంది. పైగా ప్యాలెస్ లోని 4, 5వ అంతస్తులను అదనంగా అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం స్వర్ణజయంతిలో ఉండగా, డైరెక్టర్ అర్బన్ ఫారెస్ట్, ఓఆర్ఆర్ కార్యాలయాలు నానక్రాంగూడలోని హెచ్జీసీఎల్ ఉన్నాయి. బుద్ధపూర్ణి మ ప్రాజెక్టు కార్యాలయం ట్యాంక్బండ్ సమీపంలో ఉంది. ఈ మూడు విభాగాల కార్యకలాపాలను పైగా ప్యాలెస్లోనే నిర్వహించే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏకు పూర్వ వైభవం వందల ఏళ్లనాటి చారిత్రక సౌధమైన పైగా ప్యాలెస్ 2008 వరకు హెచ్ఎండీఏ కార్యాలయంగానే కొనసాగింది. అప్పటి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆ భవనాన్ని అదే ఏడాది అక్టోబర్లో అమెరికన్ కాన్సులేట్కు కేటాయించారు. 2023 మార్చిలో అమెరికన్ కాన్సులేట్ను నానక్రాంగూడలోని సొంత భవనంలోకి తరలించారు. అప్పటి నుంచి పైగా ప్యాలెస్ నిరుపయోగంగానే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పైగా ప్యాలెస్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినా.. ఆచరణలో మాత్రం ముందుకు సాగలేదు. చివరకు హెచ్ఎండీఏ కార్యాలయాన్ని అక్కడే పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఏడాది క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ పునరుద్ధరణ పనులు ముందుకు సాగలేదు. ఇటీవల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తప్పనిసరిగా అద్దె భవనాలను ఖాళీ చేసి సొంత భవనాల్లోకి మారాలని ప్రభుత్వం నిర్ణయం తీసు కోవడంతో పనులు వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. ఆకట్టుకునే ఇండో– యూరోపియన్ నిర్మాణ శైలి ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ వద్ద ప్రధానిగా పని చేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా బేగంపేట లోని రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఇండో – యూరోపియన్ శైలిలో పైగా ప్యాలెస్ను నిర్మించారు. నవాబ్ కోరిక మేరకు ఆయనకు దీనిని బహుమతిగా ఇచ్చారు. హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం ఇది రాష్ట్ర ప్రభుత్వ వారసత్వ సంపదగా మారింది. సుమారు 1981 నుంచి 2008 వరకు అంటే అమెరికా కాన్సులేట్ ఏర్పాటు వరకు ఈ భవనంలోనే హెచ్ఎండీఏ కార్యాలయం ఉండేది. తర్వాత 14 ఏళ్ల పాటు అమెకన్ కాన్సులేట్ కార్యాలయంగా కొనసాగింది. తాజాగా మరోసారి హెచ్ఎండీఏ కార్యాలయంగా పూర్వవైభవాన్ని సంతరించుకోనుంది. -
పెళ్లికి వెళ్లిన వాచ్మెన్ అదృశ్యం
మీర్పేట: స్నేహితుడి పెళ్లికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మీర్పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వినాయకనగర్కు చెందిన ముక్కల మోసెస్(32) వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 5న ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో స్నేహితుడి వివాహానికి వెళ్తున్నానని భార్య ఉషారాణికి చెప్పి బయలుదేరాడు. తిరిగి రాకపోవడంతో భార్య ఆయన బంధుమిత్రుల వద్ద వాకబు చేసింది. ఆచూకీ తెలియకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య సికింద్రాబాద్: మానసికస్థితి సరిగాలేని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు .. మేడ్చల్లోని సుచిత్రకు చెందిన నరేష్(38)కు మానసిక స్థితి సరిగా లేదు. ఈ నెల 15న రాత్రి సమయంలో డబీర్పుర రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
లాకప్డెత్పై సీబీఐ విచారణ జరిపించాలి
పంజగుట్ట: కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్డెత్ కేసును సీబీఐతో గానీ..హైకోర్టు సిట్టింగ్ జడ్జితోగానీ విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాజేష్ లాకప్డెత్ అయ్యి రెండు నెలలు గడుస్తోందని.. అప్పటి నుంచి పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగితే కోదాడ, చిలుకూరు పోలీసులు గాంధీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. గాంధీలో పోస్టుమార్టం చేయాల్సిన డాక్టర్ను రాత్రికి రాత్రి మార్చేశారని.. గాంధీలో వీడియో తీయాల్సిన వ్యక్తితో కాకుండా కోదాడ నుంచి అగ్రకులానికి చెందిన వీడియో గ్రాఫర్ను తీసుకురావడం, వైద్యునితో వారికి అనుకూలంగా రిపోర్టు రాయించడం ప్రతి ఒక్కటీ కేసు నుంచి ఎలా బయటపడదామని పోలీసులు తప్పులమీద తప్పులు చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరుకు ఇటీవల మానవ హక్కుల కమిషన్ కూడా లాకప్డెత్ కేసుల్లో పోస్టుమార్టం నిస్పక్షపాతంగా జరగడంలేదని, వైద్యులు పోలీసులకు అనుకూలంగా రిపోర్టు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాజేష్ లాకప్డెత్పై నిజాలు ప్రజలకు వివరించేందుకు ఈ నెల 18వ తేదీన సూర్యాపేటలో ఎమ్ఆర్పీఎస్, దాని అనుబంధ సంఘాల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
వ్యక్తి అదృశ్యం
ఇబ్రహీంపట్నం రూరల్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన నాదర్గుల్లో చోటుచేసుకుంది. ఆదిబట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. చింతల ప్రవీణ్కుమార్ (30 ఒగ్గు కథలు చెబుతూ జీవనం సాగిస్తాడు. ఈనెల 8న ఉదయం ఇంటి అద్దె చెల్లించాలని యజమాని అడగడంతో, బయటకు వెళ్లి తెస్తానని బయలుదేరాడు. మూడు రోజులు గడిచినా రాకపోవడంతో బంధువులు, తెలిసినవారిని ఆరా తీసినా ఫలితం కనిపించలేదు. దీంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పహాడీషరీఫ్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాం కాలనీకి చెందిన దాడి అరుణ్రెడ్డి(29) శుక్రవారం ఉదయం 9.30 గంటలకు షాప్కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ చేసి ఉంది. అతని భార్య సౌజన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు స్థానిక పీఎస్లో లేదా 87126 62367 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. యాచారం: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన కె.నర్సింహ(40)కు అతని కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పాడ్డాయి. తీవ్ర మనస్తాపంతో శుక్రవారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య భారతమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వంశీ తెలిపారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి కుత్బుల్లాపూర్: ప్రమాదవశాత్తు ఓ చిన్నారి నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి పడి మృతి చెందింది. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన మేరకు.. హర్యానా రాష్ట్రం ముంగేలి మండలం, బోధిపుర గ్రామానికి చెందిన దోమన్ బంజారా, ఆశ బాయి దంపతులు దండమూడి ఎన్క్లేవ్ ఫేజ్–2లోని వారాహి కన్స్ట్రక్షన్స్లో కూలి పనులు చేస్తున్నారు. ఈ నెల 12న భార్యాభర్తలిద్దరూ భవనం 5వ అంతస్తులో పనిచేస్తుండగా రెండవ కుమార్తె అన్షిక (3) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు భవనంపై నుండి కింద పడిపోయింది. తీవ్ర గాయాలైన చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 15వ తేది రాత్రి 9 గంటలకు మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్తాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో కారుతో బీభత్సం ● ఇద్దరికి గాయాలు మియాపూర్: మద్యంతాగి ఓ వ్యక్తి కారు నడుపుతూ భీభత్సం సృషించాడు. మియాపూర్ ఎస్ఐ వేంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. బోడ వెంకన్న (52) అనే వ్యక్తి మద్యం తాగి కేపీహెచ్బీ నెక్సెస్ మాల్ నుండి మియాపూర్ వైపు శుక్రవారం ఉదయం కారు వేగంగా నడుపుతూ వస్తున్నాడు. గోకుల్ప్లాట్స్ ప్రధాన రహదారి పై వేర్వేరు చోట్ల ఇద్దరిని ఢీకొనడంతో గాయపడ్డారు. కిరాణం దుకాణం నడుపుతున్న మాధవరావు(53)తోపాటు మరో వ్యక్తిని ఢీకొట్టాడు. కారు కొంతదూరం వెళ్లాక టైర్ బ్లాస్ట్ కావడంతో అక్కడే అగిపోయింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. -
మన సంస్కృతిని కాపాడుకుందాం
కొడంగల్ రూరల్: భిన్నత్వంలో ఏకత్వంలా ఉండే మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని ఆర్ఎస్ఎస్ జిల్లా సంపర్గ్ ప్రముఖ్ గాజుల సిద్దిరామేశ్వర్ అన్నిరు. గురువారం పట్టణంలోని శ్రీ మహాదేవుని ఆలయ ఆవరణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. పూర్వీకులు ప్రతి పండుగకూ విశేషాలను తెలియజేశారని, కాలనుగుణంగా పండుగల ప్రత్యేక ఉంటుందని, మనమంతా పాటి స్తూ ముందుతరాలకు అందించాల్సి బాధ్యత మన పై ఉంటుందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు మన దేశ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నా యని తెలిపారు. దేశ ఔన్యత్యాన్ని నిలిపేందుకు ప్ర తి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశంపై ప్రేమ, గౌ రవం, అభిమానం ఉండాలన్నారు. విభిన్న మతా లు, కులాలు, భాషలున్నా, భారతీయ సనాతన ధర్మానికి అనుగుణంగా సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హిందూవాహిని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య
కొందుర్గు: ఆర్థిక సమస్యలతో వ్యవసాయ కూలీ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని విశ్వనాథ్పూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి చంద్రయ్య (48), పద్మమ్మ దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు. చంద్రయ్య వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. పెద్ద కూతురు శ్రీదేవికి ఇటీవలే పెళ్లిచేశారు. పెళ్లి సమయంలో ఖర్చుల కోసం పలువురి వద్ద అప్పు చేశారు. చేసిన అప్పు ఎలా తీర్చాలా అని తరచూ బాధపడేవారు. ఈ క్రమంలో చంద్రయ్య శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాలేదు. పరిసర పొలాల వారు చంద్రయ్య పొలంలో పడి ఉండడం గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వెళ్లి చూడగా పురుగుల మందు తాగి కనిపించాడు. దీంతో వెంటనే 108 అంబులెన్స్లో షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు. బావ చేతిలో మరదలి హత్య జగద్గిరిగుట్ట: బావ చేతిలో మరదలు హత్యకు గురైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతరానికి చెందిన పవన్ కుమార్ గాజులరామారం చంద్రగిరి నగర్లో తన కుటుంబంతో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ టింబర్ డిపోలో పనిచేస్తున్నాడు. పవన్ కుమార్ భార్య సంక్రాంతి పండుగకు బుధవారం ఊరికి వెళ్లగా మహదేవ్పురంలో ఉండే తన మరదలు ఎర్ర శైలజ (17) అదే రోజు ఇంటికి వచ్చింది. వీరి మధ్య ఏదో విషయంలో తీవ్ర వాగ్విదాదం జరగగా పక్కనే ఉన్న రాడ్డుతో ఆమైపె దాడి చేసి అక్కడినుండి వెళ్లిపోయాడు. తిరిగి మళ్లీ గురువారం వచ్చి చూడగా శైలజ మృతిచెందినట్లు గమనించి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
జిల్లాగా మారేనా?
షాద్నగర్: దేశంలో అత్యంత పొడవైన 44వ జాతీ య రహదారి పక్కన మకాం.. రాజధానికి ముఖ ద్వా రంగా అతిపెద్ద పట్టణం.. పారిశ్రామికంగా, స్థిరా స్తి వ్యాపారాల పరంగా అగ్రగామి.. ఒకప్పటి రాజుల ఖిల్లా.. ఈ అర్హతలతో అవుతుందా జిల్లా.. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా మారిన ఈ పట్టణాన్ని జిల్లాగా మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఫ్యూచర్ సిటీలో ఉన్న పట్టణాల్లో అతిపెద్ద పట్టణంగా విస్తరించిన షాద్నగర్ జిల్లా కేంద్రంగా మారడానికి కావాల్సిన అవకాశాలు, అర్హతలు అన్నీ ఉన్నాయి. గతమెంతో ఘనకీర్తి షాద్నగర్ ప్రాంతం 16–17వ శతాబ్దాల్లో వనపర్తి సంస్థానంలో అంతర్భాగంగా ఉండేది. ఈ ప్రాంతాన్ని సవై వెంకట్రెడ్డి అనే రాజు పాలించారు. ఆయన హయాంలో ఇది జానంపేటగా గుర్తింపు పొందింది. తర్వాత నిజాంకాలంలో ఇక్కడ రాజుగా పని చేసిన ఆజం ఆలీఖాన్ దగ్గర రాజుగా పని చేసిన కిషన్ ప్రసాద్ బహదూర్ కవి కావడంతో ఆయన కలం పేరు షాద్ అని పెట్టుకున్నారు. అందరూ ఆయనను ఆపేరుతోనే పిలిచేవారు. అలా ఈ ప్రాంతాన్ని షాద్నగర్గా పిలవడం మొదలుపెట్టారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఈ ప్రాంతానికి గొప్ప పేరుంది. ఉద్యమకారులుగా పేరు పొందిన బూర్గుల రామకృష్ణారావు, శ్రీనివాసరావు, ఎన్కే రంగారావు, నర్సింగరావు తదితరులు ఇక్కడివారే. వీరిలో బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా పనిచేశారు. తొలి అసెంబ్లీ జాబితాలో.. స్వాతంత్య్రం వచ్చాక రూపొందించిన మొదటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో షాద్నగర్ కూడా ఉంది. బూర్గుల రామకృష్ణారావు ఇక్కడి నుంచి ఎమ్మె ల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. 1959లో మొదటి పంచాయతీని అప్పటి ప్రధాని నెహ్రూ ఇక్కడే ప్రారంభించారు. అప్పటి వరకు మున్సిపాలిటీగా ఉన్న ఈ ప్రాంతం తర్వాత మేజర్ పంచాయతీగా మారింది. 2011లో తిరిగి మున్సిపాలిటీగా గుర్తించారు. బీఆర్ఎస్ హయాంలో రెవె న్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏసీపీ కార్యాలయం పరిధిలో ఉన్న ప్రాంతాన్ని డీసీపీ కార్యాలయం పరిధిలోకి మార్చారు. అర్హతలు ఇలా.. 44వ జాతీయ రహదారి మీదుగా ఉన్న ఈ ప్రాంతంలో బస్స్టాండ్, రైల్వే స్టేషన్ సదుపాయాలతో పాటు కేవలం 28 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది. 1975లో పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న షాద్నగర్లో మల్టీనేషనల్ పరిశ్రమలను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి సుమారు 36వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం మినీఇండియాగా మారింది. ఇక నేషనల్ రిమోట్ ఏజెన్సీ, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, పీఆండ్జీ వంటి తదితర కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇక వ్యాపార పరంగా 2004 నుంచి రియల్ ఎస్టేట్ బాగా విస్తరించింది. రాజధానికి కేవలం 45కిలోమీటర్ల దూరంలో ఉన్న షాద్నగర్ ఆరు మండలాలతో కూడిన నియోజకవర్గం. 70వేల జనాభా కలిగిన అతిపెద్ద పట్టణం. ఏ రకంగా చూసినా జిల్లా కేంద్రంగా మార్చడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీలో భాగంగా ఉన్న షాద్నగర్ను జిల్లా కేంద్రంగా మారిస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.షాద్నగర్ వైపు అందరి చూపు అన్ని అర్హతలు ఉన్నాయి షాద్నగర్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. జిల్లా కేంద్రం ఏర్పాటుకు కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి – ఎమ్మె సంతోష్, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు, షాద్నగర్పాలన మరింత సులభం ఫ్యూచర్ సిటీలో భాగంగా ఘన చరిత్ర కలిగిన షాద్ నగర్ను జిల్లా కేంద్రంగా మారిస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పాలన మరింత సులభంగా ఉంటుంది. – కాసోజు శివకుమార్, న్యాయవాది, షాద్నగర్ -
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
● అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్టు ● బంగారు ఆభరణాలు స్వాధీనం ● రిమాండ్కు తరలింపు షాద్నగర్: తాళాలు వేసే ఇళ్లే టార్గెట్ చేసుకొని రాత్రివేళ దొంగతనాలకు పాల్పడే ఓ అంతర్రాష్ట్ర నిందితుడిని శుక్రవారం షాద్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ విజయ్కుమార్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర పుణే జిల్లా కాట్రాజ్కు చెందిన లఖాన్ అశోక్ కులకర్ణి కొంత కాలంగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకొని రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్నాడు. గత డిసెంబర్ 20న పట్టణంలోని గంజ్రోడ్డులో నివసిస్తున్న వన్నాడ అశోక్గౌడ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఆస్పత్రి నిమిత్తం హైదరాబాద్కు వెళ్లారు. తిరిగి డిసెంబర్ 23న వచ్చి చూడగా తాళం పగలగొట్టి, ఇంట్లోని బెడ్రూంలో ఉన్న కబోర్డు తాళాలు ధ్వంసం చేసి బంగారు నగలుతో పాటు రూ.ఐదు లక్షల నగదు దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతికత ఆధారంగా లఖాన్ అశోక్ దొంగతనం చేసినట్లు గుర్తించారు. అతడిపై మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో సుమారు 300 ఇళ్లలో చోరీ కేసులు ఉన్నాయని విచారణలో తేలింది. నిందితుడి నుంచి బంగారు చైన్, రెండు జతల చెవుల కమ్మలు, మూడు బంగారు ఉంగరాలు, మొత్తం 3.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించడంలో డీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివారెడ్డి, క్రైం సిబ్బంది రవీందర్, మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు, సంతోష్ కీలకంగా వ్యవహరించినట్లు సీఐ తెలిపారు. -
దోబూచులాట
కార్పొరేషన్ ఒకటేనా.. మూడయ్యేనా?సాక్షి, సిటీబ్యూరో: ఏడాది కాలంగా కొనసాగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విభజన రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. తాజాగా జీహెచ్ఎంసీ మొత్తాన్ని (300 వార్డులు) ఒకే కార్పొరేషన్గా పేర్కొంటూ ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించడంతో పలువురిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2011 జనాభా లెక్కలు, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక, తెలంగాణ మున్సిపల్ యాక్ట్– 2019 మేరకు అంటూ ప్రభుత్వం పేర్కొనడంతో.. జీహెచ్ఎంసీ ఇక ఒకే కార్పొరేషన్గా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. వార్డుల్ని 300గా పేర్కొనడం ఇందుకు ఊతమిచ్చేలా ఉంది. దాదాపు ఏడాది క్రితం నుంచే జీహెచ్ఎంసీ పరిధి పెంచి రెండు నుంచి నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయనున్నట్లు లీకులిస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికీ ఇంకా స్పష్టతనివ్వలేదు. కొరవడిన స్పష్టత.. గత నెలలో 27 స్థానిక సంస్థల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసి 150 వార్డుల్ని 300 వార్డులకు పెంచడం తెలిసిందే. పరిధి పెరిగిన జీహెచ్ఎంసీ మొత్తం ఒకటే కార్పొరేషన్గా ఉంటుందంటూ ఒకసారి.. లేదు రెండు, మూడు, నాలుగు కార్పొరేషన్లు కావచ్చంటూ వివిధ సందర్భాల్లో చర్చలు జరిగినా ప్రభుత్వం నుంచి ఔనని కానీ, కాదని కానీ స్పష్టత లేదు. వార్డుల పెంపుతో పాటు 6 జోన్లను 12 జోన్లుగా మార్చాక రెండు జోన్లకు ప్రత్యేకంగా అడిషనల్ కమిషనర్లుగా ఐఏఎస్ల నియామకం.. ఆయా విభాగాల అధికారుల బదిలీలు, పోస్టింగులు, తదితరమైన వాటితో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు ఏర్పాటు కావడం లాంఛనమేనని, ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చేనెల 10వ తేదీతో ముగియనున్నందున, 11వ తేదీనుంచే కొత్త కార్పొరేషన్లుగా పాలన మొదలు కానుందనే అభిప్రాయాలు బలపడ్డాయి. అంతేకాదు. ఈ మూడు కార్పొరేషన్లు, మూడు పోలీస్ కమిషనరేట్లతో పాటు మూడు జిల్లాల పరిధుల్లో ఉండనున్నాయనీ అధికార వర్గాలు సైతం భావించాయి. తొందరెందుకు? ప్రస్తుత పాలకమండలి గడువు ముగిశాక జీహెచ్ంఎసీని విభజించి మూడు కార్పొరేషన్లుగా చేస్తారని చెబుతున్న పరిశీలకులూ ఉన్నప్పటికీ, పాలకమండలి గడువు దాదాపు మూడు వారాలు మాత్రమే ఉంది. గడువు ముగిశాకే మూడు కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ప్రకటించవచ్చు కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్పొరేషన్ను మాత్రం జీహెచ్ఎంసీగా ఉంచి, వార్డుల్ని 300గా పేర్కొనడంతో పలు సందేహాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆయా అంశాలకనుగుణంగా రిజర్వేషన్లు ప్రకటించినా.. తర్వాత మూడు కార్పొరేషన్లుగా విభజించవచ్చని చెబుతున్న వారు కూడా ఉన్నారు. మూడు కార్పొరేషన్లుగా మారితే ప్రస్తుతం 300 వార్డులను పరిగణనలోకి తీసుకొని పేర్కొన్న రిజర్వేషన్లు.. విభజన తర్వాత ఏదైనా ఒకటి లేదా రెండు కార్పొరేషన్ల పరిధిలోకే వెళ్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. విభజనలో భాగంగా హైదరాబాద్ కార్పొరేషన్ 150 వార్డులతో, సైబరాబాద్ కార్పొరేషన్ 76 వార్డులతో, మల్కాజిగిరి కార్పొరేషన్ 74 వార్డులతో ఉంటాయన్నది ఇప్పటికే ప్రజల్లో మదిలో నాటుకుందిప్రకటన మేరకు జీహెచ్ఎంసీ రిజర్వేషన్లు ఇలా .. కార్పొరేషన్: జీహెచ్ఎంసీ వార్డులు: 300 ఎస్టీ: 5 ఎస్సీ: 23 బీసీ: 122 మహిళ (జనరల్): 76 అన్రిజర్వ్: 74త్వరలో కొత్త ప్రకటన ప్రస్తుతం జీహెచ్ఎంసీ పేరిటే 300 వార్డులకు రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ, ఇవి మారేందుకు అవకాశం ఉందని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పాలకమండలి గడువుకు అటూ ఇటూగా మూడు కార్పొరేషన్ల పేరిట వేర్వేరుగా రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి పరిస్థితి గందరగోళంగా మారింది. ఉద్యమం సైతం మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ఇక లాంఛనమనే అభిప్రాయంతోనే సికింద్రాబాద్ కార్పొరేషన్ పేరిట ఒక కార్పొరేషన్ ఉండాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్, సికింద్రాబాద్ స్థానికులతో ఉద్యమానికి సిద్ధం కావడం తెలిసిందే. -
సీఎంను కలిసిన బీజేపీ నేత ఆచారి
ఆమనగల్లు: ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్రెడ్డిని శుక్రవారం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి కలిశారు. హైదరాబాద్లో జరిగిన దివంగత కేంద్రమంత్రి జైపాల్రెడ్డి జయంతి సందర్భంగా స్ఫూర్తిస్థల్ వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎంను కలిసి కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, ఆమనగల్లులో అన్ని డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. భద్రతకు భరోసా ఆర్టీసీ హయత్నగర్: నిష్ణాతులైన డ్రైవర్లు ఉండడంతో సురక్షితమైన, భద్రమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సు ప్రతీకగా నిలుస్తుందని ఎల్బీనగర్ డీసీపీ అనూరాధ అన్నారు. రోడ్డు భద్ర తా వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం హయత్నగర్ డిపోలో నిర్వహించిన అలీవ్ అండ్ అరైవ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బస్సును నడిపే సమయంలో డ్రైవర్లు ఎంతో క్రమ శిక్షణతో పనిచేయాలని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రమాద రహితంగా బస్సులు నడిపిన డ్రైవర్లను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరావు, ఏసీపీ కాశిరెడ్డి, సీఐలు నాగరాజుగౌడ్, సంతోష్కుమార్, డీఎంలు విజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ టికెట్లకు దరఖాస్తుల ఆహ్వానం సాక్షి, సిటీబ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబర్చే పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. దరఖాస్తు ఫారాన్ని పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీ నుంచి డౌన్లోడ్ చేసుకుని.. వివరాలు పూర్తి చేసిన తర్వాత ఏఐఎంఐఎం పేరిట తీసిన రూ.3,000 డిమాండ్ డ్రాఫ్ట్తో ఈ నెల 20లోగా సంబంధిత జిల్లా టౌన్, మజ్లిస్ అధ్యక్షుడికి సమర్పించాలని సూచించాయి. అసంపూర్తి దరఖాస్తులను పరిగణనలోకి తిర స్కరిస్తామని, అభ్యర్థుల తుది జాబితాను పార్టీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటిస్తారని మజ్లిస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పతంగ్లతో 309 ఫీడర్లు ట్రిప్ సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి సందర్భంగా సరదాగా ఎగరేసిన పతంగ్లు విద్యుత్ తీగలకు షాక్ కొట్టాయి. విద్యుత్ తీగలకు పతంగ్లు తగిలి మెట్రోజోన్, రంగారెడ్డిజోన్, మేడ్చల్ జోన్ల పరిధిలో బుధవారం 309 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. గురువారం కూడా అదే స్థాయిలో లైన్లు ట్రిప్పయ్యాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తింది. మరికొన్ని ప్రాంతాల్లో అర గంటకు పైగా నిలిచిపోయింది. అధికారులు వెంటనే అప్రమత్తమై.. వైర్ల మధ్య వేలాడుతున్న పతంగ్లను తొలగించారు. హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో ఏకంగా 107 ఫీడర్ల ట్రిప్పవడం గమనార్హం. మున్సిపల్ బరిలో ఉంటాం బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ తాండూరు టౌన్: రానున్న మున్సిపల్ ఎన్ని కల్లో తాండూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్చార్జ్ అమ్జద్ అలీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనే ముఖ్య ఉద్దేశంతో బీఎస్పీ కొనసాగుతోందన్నారు. పట్టణ ప్రజలు తమ అభ్యర్థులను ఆదరిస్తారని, ఎన్నికల్లో తప్పకుండా అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్, మంచాల శ్రీకాంత్, అసెంబ్లీ ఇంచార్జి నవీన్ యాదవ్, ఉపాధ్యక్షులు కృష్ణయ్యగౌడ్, పట్టణ ఇన్చార్జ్ అమ్జద్ అలీ, ఆమీర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
అధికారిక అస్త్రం
జిల్లాలో 90వేల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములు అసైన్డ్ భూములపైసాక్షి, రంగారెడ్డిజిల్లా: అసైన్డ్ భూములపై ప్రభు త్వం అధికార అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటు పేరుతో వీటిని సేకరించనుంది. ఇప్పటికే చందనవెల్లి, ఫ్యాబ్సిటీ సహా ఫార్మాసిటీ పేరుతో 20 వేల ఎకారాలకుపైగా సేకరించిన సర్కారు.. తాజాగా మరికొన్ని భూములను సేకరించాలని నిర్ణయించింది. ఆ మేరకు రెవెన్యూ గ్రామాల్లోని సర్వే నంబర్ల వారీగా ఉన్న అసైన్డ్ భూముల వివరాలపై ఆరా తీస్తోంది. ఇటీవల మీర్ఖాన్పేట వేదికగా నిర్వహించిన రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా రూ.ఐదున్నర లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు సేకరించాలంటే ఇందుకు మరికొంత భూమి అవసరమని భావిస్తోంది. అదనంగా మరో పది వేల ఎకరాలు భవిష్యనగరం చుట్టూ ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల కోసం భారీగా భూములను సేకరిస్తోంది. వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా గత డిసెంబర్లో కందుకూరు మండలం తిమ్మా పూర్ సర్వే నంబర్ 38లో 350 ఎకరాలు, సర్వే నంబర్ 162లో 217 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లిలో ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల కోసం 198.21 ఎకరాలు అవసరమని భావించి, ఆ మేరకు 2025 ఫిబ్రవరి మొదటి వారంలో 195.05 ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్9లోని 439 మంది రైతుల నుంచి 366.04 ఎకరాలు సహా మహేశ్వరం మండలం కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 277.06 ఎకరాల భూసేకరణకు మార్చి 13న నోటిఫికేషన్ జారీ చేసింది. యాచారం మండలంలో ఇండస్ట్రియల్ పార్కు కోసం 638 మంది రైతుల నుంచి 821.11 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే సేకరించిన భూములతో పాటు అదనంగా మరో పది వేల ఎకరాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. రెవెన్యూ అధికారులు ఇటీవల యాచారం మండలం కొత్తపల్లి, తక్కళ్లపల్లి, చింతపట్ల, తదితర గ్రామాల్లోని అసైన్డ్, ప్రభుత్వ భూములను గుర్తించి, హద్దులు నిర్ధారిస్తుండటంతో ఇప్పటి వరకు ఆయా భూములపై ఆధారపడిన రైతుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో మొత్తం భూములు: 12,43,035 ఎకరాలు ప్రభుత్వ భూములు: 2,18,530.2 ఎకరాలు అటవీ భూములు: 64,803 ఎకరాలు అసైన్డ్ భూములు: 90,911 ఎకరాలు ప్రభుత్వం రైతులకు 75,450.29 ఎకరాలు అసైన్డ్ చేసింది:అసైన్డ్ భూములే టార్గెట్.. జిల్లాలో 12,43,035 ఎకరాల భూములు ఉండగా, వీటిలో 2,18,530.2 ఎకరాల ప్రభుత్వ, 64,803 ఎకరాల అటవీశాఖ భూములు ఉన్నాయి. అసైన్డ్ భూములు 90,911 ఎకరాలు ఉండగా.. వీటిలో 52,315 మంది రైతులకు 75,450.29 ఎకరాలను అసైన్ చేసింది. మరో 25,597.35 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లాయి. అసైన్డ్ చేసిన భూమిలో తర్వాత 9,815.15 ఎకరాలు చేతులు మారినట్లు సమాచారం. భూదాన్ బోర్డు పేరున 21,931.03 ఎకరాలు ఉండాల్సి ఉండగా, వీటిలో 9,678 ఎకరాలను నిరుపేదలకు పంచారు. మిగిలిన భూమి రియల్టర్ల చేతుల్లోకి వెళ్లింది. దేవాదాయశాఖ పేరున 9360.01 ఎకరాలు ఉండగా, ఇప్పటికే 1148.15 ఎకరాలు అన్యాక్రాంతమైంది. వక్ఫ్ బోర్డు పరిధిలో 14,785.17 ఎకరాలు ఉండాల్సి ఉండగా, వీటిలో 13,480.25 ఎకరాలు రియల్టర్ల చేతుల్లోకి వెళ్లింది. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం (యూఎల్సీ) పరిధిలో తొమ్మిది వేలకుపైగా ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, వీటిలో 840 ఎకరాలు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రైవేటు పట్టా భూముల సేకరణతో ఆర్థికంచీగానే కాకుండా న్యాయపరంగా పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములపై దృష్టి సారించాల్సిందిగా జిల్లా రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం మౌకిక ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లోని భూములపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
బహుజన రాజ్యం సాధిస్తాం
షాద్నగర్: తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధిస్తామని బీఎస్పీ సెంట్రల్ సెక్టార్ కో ఆర్డినేటర్ అతార్సింగ్రావు అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పుట్టిన రోజును పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని సాయిరాజ ఫంక్షన్ హాల్లో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సభకు హాజరైన అతార్సింగ్రావు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్తో ఏర్పడిన తెలంగాణ పోరాటంలో అన్నివర్గాల ప్రజలు పాల్గొన్నారన్నారు. అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన ప్రత్యేక రాష్ట్రంలో బహుజనులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని పార్టీల నాయకులు కుట్రలు పన్ని, బహుజనులను అధికారానికి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా ఎగరాల్సినవి పతంగులు కానవి, ఆత్మగౌరవ జెండాలని అన్నారు. బీఎస్పీతోనే అది సాధ్యమని స్పష్టంచేశారు. సమానత్వం, ఆర్థిక విముక్తితో సంక్రాంతి సంబురాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే బహుజనులను కాపాడుకుంటామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రవీణ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగన్న, కృష్ణ, బండి పృధ్వీరాజ్, శివప్రసాద్, నరేందర్, రాములు, రవి, అమీర్ తదితరులు పాల్గొన్నారు. -
దారుణాలు
పై ఫొటోలో కనిపిస్తున్నది నవాబుపేటమండలం చించల్పేట్, అత్తాపూర్, అక్నాపూర్ గ్రామాల మీదుగా నారేగూడకు వెళ్లే రోడ్డు.. రెండు దశాబ్దాల క్రితం పీఎంజీఎస్వై పథకం కింద చించల్పేట్ గేట్ నుంచి అక్నాపూర్ వరకు 8 కిలో మీటర్ల రహదారి వేశారు. కాలక్రమేణ గుంతల మయంగా మారింది. నాలుగేళ్ల క్రితం రూ.12 కోట్లతో రీబీటీ తోపాటు, అక్నాపూర్ నుంచి నారేగూడ వరకు నాలుగు కిలోమీటర్లు కొత్త రోడ్డుమంజూరైంది. అప్పట్లో పనులు ప్రారంభమైనా నేటికీ పూర్తి కాలేదు. 12 కిలో మీటర్లకు గాను మూడు కిలో మీటర్ల మేర రోడ్డు వేసి చేతులు దులుపుకొన్నారు. ఈ రహదారి ఎమ్మెల్యే కాలె యాదయ్య స్వగ్రామానికి వెళ్లేది కావడం గమనార్హం. వికారాబాద్: ప్రాంతాల కనెక్టివిటీకి రోడ్లు ఎంతో కీలకం. మెరుగైన రహదారి వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందుతాయి. కానీ ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూ పడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ నిధు లు మంజూరు చేసినా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప నులు పూర్తికావడం లేదు. ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతుండటంతో అంచనా వ్యయం భారీగా పెరు గుతోంది.దెబ్బతిన్న రోడ్ల కారణంగా తరచూ ప్ర మాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. జిల్లాలోని పలు గ్రామీణ రోడ్లు అధ్వాన స్థితికి చేరాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంట ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతోంది. వంతెనలు, బ్రిడ్జిల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఏటా కోట్ల రూపాయలతో రోడ్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం.. వాటి పూర్తిపై దృష్టి సారించడం లేదు. కొన్ని రోడ్లు శిలాఫలకాలతో, మరికొన్ని శంకుస్థాపనలతో ఆగిపోత్నుఆయి. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించాక నిధులు విడుదల కావడం లేదు. దీంతో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది.నిర్మాణ వ్యయం పెరిగి కాంట్రాక్టర్లు పనులను మధ్యలో వదిలేసి వెళ్లిపోతున్నా రు. కొన్ని చోట్ల పనులు చేపట్టేందుకు ముందు కు రావడంలేదు. దెబ్బతిన్న రోడ్లపై రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. దూరమై న వేరే మార్గాల్లో సొంత గ్రామాలకు వెళ్తున్నారు. నాలుగేళ్లు కావస్తున్నా.. జిల్లాకు 2020 – 21 సంవత్సరంలో పీఎంజీఎస్వై కింద 13 రోడ్లు మంజూరయ్యాయి. 93.9 కిలో మీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.56.85 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందులో కొన్నింటిని నాలుగేళ్ల క్రితం, మరికొన్నింటిని మూడేళ్లు క్రితం ప్రారంభించారు. 13కు గాను 8 రోడ్లును ఇటీవల పూర్తి చేశారు. ఐదు నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని ప్రారంభించి మధ్యలో ఆపేశారు. రోజురోజుకూ నిర్మాణ వ్యయం పెరిగిపోతుండటంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. నిధుల కొరత కారణంగా రోడ్డు పనులు అక్కడక్కడ నిలిచిపోయిన మాట వాస్తవమేనని, వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ ఈఈ ఉమేశ్ తెలిపారు. గ్రామీణ రోడ్లకు గ్రహణం -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
నందిగామ: యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మామిడిపల్లిలో నిర్వహించిన ఎంపీఎల్ లీగ్ సీజన్–10 క్రికెట్ పోటీల విజేతలకు శుక్రవారం బహుమతుల ప్రదానోత్సవం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడలను ఆసక్తి ఉన్న క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు.కార్యక్రమంలో సర్పంచ్లు హనుమంత్ రెడ్డి, చిందం పాండు, ఉప సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్లు కవిత, సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు. -
చైనామాంజా విక్రయిస్తున్న పలువురి అరెస్ట్
అంబర్పేట: వేర్వేరు ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయిస్తున్న పలువురిని సికింద్రాబాద్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.2.50 లక్షల విలువ చేసే 162 బాబిన్లు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితాకె మూర్తి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాచిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే నోముల సంతోష్కుమార్(26), నోముల పుష్ప(35), లతిత్సింగ్(39), కాశిరామ్సింగ్( 38), ఓమ్ప్రకాశ్సింగ్(45), కపిల్( 35)లు చైనా మాంజాను విక్రయిస్తుండగా దాడిచేసి అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 106 బాబిన్లు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ● దోమల్గూడ పోలీసు స్టేషన పరిధిలో నివసించే ప్రశాంత్(20), అఖిల్(19), పవన్(19), దీపక్(19), శివరాజ్లు విక్రయిస్తున్న 8 చైనా మాంజా బాబిన్లను పట్టుకున్న అరెస్టు చేశారు. అలాగే అంబర్పేట పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే కె.సునిల్కుమార్(50) చైనా మాంజా విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఇతనితో ఉన్న చరణ్, రాజేష్లు పరారీలో ఉన్నారు. వీరి వద్ద 48 బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. అందరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు. -
ఇద్దరు డ్రగ్స్విక్రేతల అరెస్ట్
అత్తాపూర్: అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు డ్రగ్స్ విక్రేతలను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తుల వద్ద నిషేధిత మాదక ద్రవ్యం ఎండిఎంంఏ ఉందనే సమాచారం పోలీసులకు అందింది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 242 వద్ద వాహనాలను నిలిపి వాహనాల తనిఖీ చేపట్టగా ఓ కారులో డ్రగ్ లభ్యమైంంది. బెంగళూర్కు చెందిన చరణ్ వద్ద నుంచి అన్వర్హుస్సేన్, బుర్రా సంపత్లు రూ.25 వేలకు ఎనిమిది గ్రాముల డ్రగ్ను కోనుగోలు చేసినట్లు తెలిపారన్నారు. డ్రగ్తో పాటు కారు, ఒక ఫోన్ను స్వాధీనం చేసుకొని ఇద్దరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ విక్రేతలు -
2 జోన్లు.. 10 ఠాణాలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీలో శాంతి భద్రతల పరిరక్షణ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కమిషనరేట్కు పటిష్టమైన ట్రాఫిక్ విభాగం ఏర్పాటు కానుంది. ఫోర్త్ సిటీలో భవిష్యత్ ట్రాఫిక్ రద్దీ, వాహనాల రాకపోకలను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ జోన్లు, డివిజన్లు, ఠాణాలను ఏర్పాటు చేయనున్నారు. మహేశ్వరం, శంషాబాద్ రెండు ట్రాఫిక్ జోన్లలో నాలుగు డివిజన్లు, మొత్తం 10 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లతో ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ విభాగం కొలువుదీరనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ట్రాఫిక్కు జాయింట్ సీపీ.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, చలాన్ల జారీతో పాటు ఫ్యూ చర్ సిటీ ట్రాఫిక్ పోలీసు విభాగం సరికొత్తగా ఆవిష్కృతం కానుంది. ట్రాఫిక్ పోలింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చడం, సమర్థ పర్యవేక్షణ నిమిత్తం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల తరహాలోనే ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్లో ట్రాఫిక్ విభాగానికి జాయింట్ కమిషనర్ ఉండనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో కొలువుదీరనున్న బహుళ జాతి సంస్థలు, పెట్టుబడిదారుల రాకపోకలు ఎలాంటి అంతరాయం కలగకుండా సాఫీగా ప్రయాణం సాగించేలా ఈ విభాగం పని చేస్తుంది. ఠాణాలివీ.. శంషాబాద్ ట్రాఫిక్ జోన్లో శంషాబాద్ డివిజన్, షాద్నగర్ డివిజన్లుంటాయి. ఈ రెండు డివిజన్లలో ఆరు ట్రాఫిక్ ఠాణాలు, మహేశ్వరం ట్రాఫిక్ జోన్లో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం డివిజన్లుంటాయి. వీటిలో నాలుగు ఠాణాలు ఉంటాయి. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్లో శాంతి భద్రతల విభాగంలో మూడు జోన్లు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ విభాగంస్వరూపమిదీ కమిషనరేట్ నేపథ్యమిదీ.. ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టరేట్లో ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఇక్కడి నుంచే కమిషనరేట్ కార్యకలాపాలు సాగించనుంది. త్వరలోనే రంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలో లేదా ప్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) పరిధిలో గానీ కమిషనరేట్కు స్థలం కేటాయించనున్నారు. ఇప్పటికే అనువైన స్థలం కోసం రెవెన్యూ అధికారులు అన్వేషిస్తున్నారు. ఔటర్ రింగ్రోడ్ వరకూ జీహెచ్ఎంసీ విస్తరణతో ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరం అవసరమని భావించింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి మధ్యలో ముచ్చెర్ల ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించింది. దీంతో కొత్తగా ఫ్యూచర్ సిటీ పరిధి వరకు పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలోనే సైబరాబాద్, రాచకొండలోని పలు ప్రాంతాలను వేరు చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. -
కేటుగాడు.. దొరికాడు
కడ్తాల్: మండల కేంద్రంతో పాటు, పరిసరా గ్రామాల ప్రజలు కుదువ పెట్టిన సుమారు రూ.కోటికి పైగా విలువైన ఆభరణాలను తన సొంత అవసరాలకు వాడుకోవడంతో పాటు తప్పించుకు తిరుగుతున్న పాన్ బ్రోకర్ను పోలీసులు బుధవారం రిమాండ్కు తరలించారు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని బేవార్ జిల్లా జైతారం మండలం రామర్ గ్రామానికి చెందిన బర్ఫా నన్నారాం అలియాస్ నవీన్, అతని సోదరుడు ధర్మారామ్ కలిసి 2023లో ఉపాధి కోసం కడ్తాల్కు వచ్చారు. ఇక్కడ గణేశ్ పాన్ బ్రోకర్స్ పేరుతో లైసెన్స్ కలిగిన నగల తాకట్టు దుకాణాన్ని ప్రారంభించారు. పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది తమ బంగారు, వెండి ఆభరణాలు కుదవ పెట్టి డబ్బులు తీసుకునేవారు. ఈసమయంలో కస్టమర్లకు తక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చేవారు. అనంతరం అదే వస్తువులను మండల కేంద్రంలోని ముత్తూట్ ఫైనాన్స్తో పాటు సిక్రిందాబాద్లోని ఉత్తమ్చంద్కు చెందిన వివేక్ పాన్ బ్రోకర్స్ వద్ద కుదువ పెట్టి, ఎక్కువ డబ్బులు తీసుకునేవారు. వచ్చిన సొమ్ముతో తమ అవసరాలు తీర్చుకునే వారు. ఇలా ప్రజలు కుదువ పెట్టిన సుమారు 500 గ్రాముల బంగారంతో గత ఏడాది సెప్టెంబర్లో షాపును మూసేసి, కుటుంబ సభ్యులతో సహా పారిపోయారు. ఈ విషయమై అప్పట్లోనే సుమారు 25 మంది బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నన్నారాం ఈనెల 13న కందుకూరు మండలం పెద్దమ్మతండాకు వచ్చాడని పోలీసులకు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సికింద్రాబాద్లో కుదువ పెట్టిన సుమారు 300 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపర్చి, రిమాండ్కుతరలించారు. ఇతని సోదరుడు ధర్మారామ్ పరారీలోనే ఉన్నాడు. వీరి నుంచి మరో 200 గ్రాముల బంగారం రికవరీ చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే స్థానిక పీఎస్లలో ఫిర్యాదు చేయాలన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ గంగాధర్, ఎస్ఐ వరప్రసాద్ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
వైభవంగా గోదాదేవి కల్యాణోత్సవం
మొయినాబాద్రూరల్: గోదాదేవి అవతారమే భూమాత అని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ అన్నారు. బుధవారం ఆలయంలోని అద్దాల మేడలో గోదాదేవి రంగనాయక స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణమహోత్సవంలో భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అమ్మవారికి పట్టువస్త్రాలు, పూ లు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో వికారాబాద్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ ముంజులరవియాదవ్, మాజీ మంత్రి సబితారెడ్డి కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
సీపీఎం పోరాట ఫలితమే రైతులకు ఇళ్ల స్థలాలు
పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తుక్కుగూడ: సీపీఎం పోరాట ఫలితంగానే ఫ్యాబ్ సిటీ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు అందాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం రావిర్యాల, జెన్నాయిగూడ రైతులు ఆయన్ను కలిసారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. 2004లో జెన్నాయిగూడలో ఫ్యాబ్సిటీ ఏర్పాటుకు 224 మంది రైతుల నుంచి 827 ఎకరాల భూమిని సేకరించారని.. తదనంతరం వారిని పట్టించుకోలేదన్నారు. దీంతో పార్టీ జిల్లా కమిటీ రైతుల పక్షాన పోరాడిందని గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించి నలుగురికి రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. మిగిలిన నిర్వాసితులకు సైతం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు డి.రామ చందర్,ఆర్.స్వామి, రైతులు నర్సింహ, ప్రశాంత్, నాగేశ్, భిక్షపతి, రాజు, అశోక్ పాల్గొన్నారు. కూలీల పొట్టకొట్టేందుకు కేంద్రం కుట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య యాచారం: కూలీల పొట్ట కొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలుపన్నుతోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధ వారం సంఘం ఆధ్వర్యంలో నందివనపర్తి, నస్దిక్సింగారం, కుర్మిద్ద గ్రామాల్లో భోగి మంటల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీ జీ రామ్ జీ జీఓ ప్రతులను వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడు తూ.. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకో కుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జంగయ్య, సురేశ్, బుగ్గ రాములు, గోపాల్, రాములు, లక్ష్మయ్య పాల్గొన్నారు. బకాయిలు సకాలంలో చెల్లించండి డీసీసీబీ డీజీఎం శైలాజారెడ్డి యాచారం: పీఏసీఎస్లో పొందిన రుణాలకు సకాలంలో బకాయిలను చెల్లించాలని డీసీసీబీ డీజీఎం శైలజారెడ్డి రైతులకు సూచించారు. యాచారం పీఏసీఎస్ పరిధిలోని యాచారం, తమ్మలోనిగూడ, మాల్ గ్రామాల్లో బకాయిలున్న రైతులను ఆమె బుధవారం కలిశారు. పీఏసీఎస్లో పౌల్ట్రీఫాం, డెయిరీఫాం, గొర్రెలు, మేకల పెంపకం కోసం తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. యాచారం పీఏసీఎస్ కింద రూ.48 కోట్ల బకాయిలున్నట్లు ప్రతీ రైతు సకాలంలో చెల్లించే విధంగా కృషి చేయాలని ఆమె కోరారు. కొందరు రైతులు అధికారులకు బకాయి చెల్లించారు. మిగిలిన రైతులకు నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యాచారం పీఏసీఎస్ సీఈఓ నాగరాజు, యాచారం డీసీసీబీ బ్యాంకు మేనేజర్ నాగలక్ష్మి ఉన్నారు. మున్సిపాలిటీలకురిజర్వేషన్లు ఖరారు పరిగి: రంగారెడ్డి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను బుధవారం ఖరారు చేసింది. ఆమనగల్లులో 15 వార్డులు ఉండగా ఎస్టీ– 4, ఎస్సీ– 2, బీసీ– 1, జనరల్– 8, ఇబ్రహీంపట్నంలో 24 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 6, బీసీ– 5, జనరల్– 12, కొత్తూర్లో 12 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 2, బీసీ– 3, జనరల్– 6, మొయినాబాద్లో 26 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 7, బీసీ– 5, జనరల్– 13, షాద్నగర్లో 28 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 2, బీసీ– 11, జనరల్– 14, శంకర్పల్లిలో 15 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 3, బీసీ– 3, జనరల్– 6 రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఏ వార్డు ఏ రిజర్వేషన్లో ఉందనే విషయం త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. -
సంప్రదాయానికి ప్రతీక ముగ్గులు
శంకర్పల్లి: భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మోకిలతండా పంచాయతీ ఆవరణలో సర్పంచ్ వర్త్య శాంతమ్మ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. న్యాయ నిర్ణేతగా విశ్రాంత ఐఏఎస్ పౌర్ణిమ వ్యవహరించి విజేతలను ప్రకటించారు. అనంతరం మొదటి విజేత సంధ్యకు రూ.50 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన ఉమకు రూ.25 వేలు, తృతీయ స్థానం సోనాలికి రూ.15 వేలు, 4వ స్థానం శివయ్య మాతకి రూ.10 వేలు, 5వ స్థానంలో నిలిచిన పార్వతికి రూ.5 వేల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అనంతరం సర్పంచ్ శాంతమ్మ పోటీల్లో పాల్గొన్న వారికి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు నాయక్, బాబు నాయక్, ప్రభాకర్రెడ్డి, పరమేశ్వర్రెడ్డి, రాములు, వాసుదేవ్ కన్నా తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ టెన్షన్
సమీపిస్తున్న పురుపోరు ఆమనగల్లు: పురపోరు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల నుంచి ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో తమకు రిజర్వేషన్లు అను కూలంగా వస్తాయా లేదో అనే టెన్షన్లో ఉన్నారు. వార్డులు, చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు మారుతాయనే చర్చలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ ఏమొచ్చినా అందుకు తగిన విధంగా ఆయా పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎలాగైనా పోటీలో ఉండాల్సిందే అని నిర్ణయించుకున్నవారు అందుకు తగి న ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వచ్చే అవకా శం ఉందంటూ ఆశావహులు లెక్కలు వేసుకుంటూ రిజర్వేషన్లపై ఓ అంచనాకు వస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్లు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు మూడు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తుది జాబితాల విడుదల ఆమనగల్లు మున్సిపాలిటీలో ఓటర్ల తుది జాబితాను మున్సిపల్ కమిషనర్, సహాయ ఎన్నికల అధికారి శంకర్ విడుదల చేశారు. ఓటర్ల జాబితాను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం తుది ఓటరు జాబితాను, పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను సైతం ప్రకటించారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో మొత్తం 16,984 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలవగా రిజర్వేషన్లపై నేటికీ స్పష్టత రాలేదు. దీంతో ఆశావహులు తమనకు అనుకూలంగా వస్తాయా లేదా అని అయోమయోనికి గురవుతున్నారు. -
అభివృద్ధి కోసం ఏ త్యాగానికై నా సిద్ధం
జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి ఆమనగల్లు: అభివృద్ధి కోసం ఏ త్యాగం చేయడానికై నా సిద్ధంగా ఉన్నానని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి అన్నారు. డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయకుండా కాంగ్రెస్కు మద్దతు తెలుపుతామని ప్రకటించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కల్వకుర్తి ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే సదావకాశం సీఎం రేవంత్రెడ్డికి దక్కిందని అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాయలసీమ ప్రాంతాన్ని, కేసీఆర్ సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలను అబివృద్ధి చేశారని అదేవిధంగా రేవంత్రెడ్డి కల్వకుర్తిని జిల్లాగా ప్రకటించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కండె హరిప్రసాద్, పట్టణ బీజేపీ అధ్యక్షుడు విక్రంరెడ్డి, మాజి కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. డంపింగ్యార్డు తొలగించాలి ఆమనగల్లు పట్టణంలో నివాస గృహాల మధ్య ఉన్న డంపింగ్యార్డును తొలగించాలని బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. నివాసాల మధ్య డంపింగ్యార్డుతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. తరలించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వారికి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కేకే శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కర్నాటి విక్రంరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దుర్గయ్య, మాజీ కౌన్సిలర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటో పెట్టాలి
బీజేపీ సాంస్కృతిక శాఖ జిల్లా కో–కన్వీనర్ నరేందర్రెడ్డి కేశంపేట: కేంద్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అర్హులకు బియ్యం అందిస్తోందని బీజేపీ సాంస్కృతిక శాఖ జిల్లా కో కన్వీనర్ కర్రెడ్ల నరేందర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సంతాపూర్లో లబ్ధిదారులకు ఇస్తున్న బ్యాగులను అయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఇస్తున్న 5 కిలోలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కిలో బియ్యం మాత్రమే అందిస్తూ సీఎం, డిప్యూటీ సీఎం, పౌరసరాఫరాల శాఖ మంత్రుల ఫొటోలతో కూడిన బ్యాగును లబ్ధిదారులకు అందిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తున్న బియ్యం బస్తాలపై ప్రధాని ఫొటోను కూడా ప్రచురించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఇందిరమ్మ ఇళ్ల ప్రహరీల కూల్చివేత
● కాళ్లు మొక్కుతామన్న కనికరించలేదన్న బాధితులు ● ప్రభుత్వ స్థలంలో నిర్మించారనే కూల్చామంటున్న అధికారులు ఇబ్రహీంపట్నం రూరల్: మాకు ఇల్లు లేదు.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లే దిక్కు.. మీ కాళ్లు మొక్కుతాం కూల్చేయొద్దు.. కూల్చితే చచ్చిపోతాం.. అని వేడుకున్నా అధికారులు కనికరించలేదు. ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని సాహెబ్గూడలో ఎల్క అండాలు అనే దళిత మహిళకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. అలాగే కొహెడ పద్మ అనే మరో బీసీ మహిళకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ అందజేశారు. దీంతో గ్రామంలో వారికి ఉన్న 60 గజాల స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నారు. చుట్టూ ప్రహరీలను సైతం పూర్తి చేశారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతా అదేశాల మేరకు మంగళవారం ఆర్ఐ సువర్ణ అధికారుల బృందంతో కలిసి వెళ్లారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జేసీబీతో కూల్చివేశారు. ప్రహరీలను నేలమట్టం చేశారు. దీంతో బాధితులు బోరున విలపించారు.ప్రభుత్వ స్థలంలో కట్టినవాటినే.. సాహెబ్గూడలోని సర్వే నంబర్ 36 ప్రభుత్వ భూమి. ఇందులో నిర్మాణాలు చేపట్టారన్న సమాచారంతో ప్రహరీలను మాత్రమే తొలగించాం. ఇళ్లను కూల్చలేదు. ప్రభుత్వ స్థలం ఆక్రమించడం తగదు. – సువర్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టార్ -
‘పట్నం’ పీఎస్లను ఒకే కమిషనరేట్లో ఉంచాలి
సీఎం, డీజీపీకి ‘మంచిరెడ్డి’ లేఖ ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పోలీస్ స్టేషన్లన్నీ ఒకే కమిషనరేట్ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డీజీపీ శివధర్రెడ్డికి లేఖ రాశారు. ఫార్మాసిటీ పీఎస్ను మేడిపల్లి లేదా కుర్మిద్దలో ఏర్పాటు చేయాలని, మహేశ్వరం డివిజన్లో కాకుండా ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలోనే కొనసాగించాలని పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్మెట్ స్టేషన్ను వనస్థలిపురం నుంచి ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలోకి తీసుకోవాలని కోరారు. ఆదిబట్ల పీఎస్ను హైదరాబాద్ కమిషనరేట్లో చేర్చడం సరికాదని, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లోనే కొనసాగించాలని సూచించారు. -
హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి జైలు శిక్ష
షాబాద్: పాత కక్షలను మనసులో పెట్టుకొని వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు జడ్జి తీర్పునిచ్చారు. ఈ సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బొబ్బిలిగామ గ్రామానికి చెందిన మోక్కొండ వెంకటయ్య అదే గ్రామానికి చెందిన చిలకమర్రి నరసింహను పాత కక్షలను మనసులో పెట్టుకొని 2014లో కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నరసింహ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. పూర్వాపరాలు పరిశీలించిన జిల్లా కోర్టు జడ్డి నిందితుడికి ఐదేళ్ల కారాగార శిక్ష, రూ.3.51 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. శివాలయంలో అర్ధరాత్రి చోరీ శంకర్పల్లి: శివాలయంలో అర్ధరాత్రి దొంగలు పడి, వెండి ఆభరణాలు, హుండీలోని నగదు దోచుకెళ్లిన సంఘటన శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని సింగాపురం శివాలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. తలుపులు పగలగొట్టి లోపల సుమారు 2కిలోల వెండి ఆభరణాలు, హుండీలోని నగదును అపహరించుకోని వెళ్లారు. అర్చకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కొంతకాలంగా పని చేయడం లేదు. మద్యానికి బానిసై చోరీల బాటదోమ: మేకను అపహరించేందుకు యత్నించిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని బుద్లాపూర్ గ్రామానికి చెందిన చాకలి ముకుంద్(37) హైదరాబాద్లో పెయింటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన ఆయన కొన్ని రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చాడు. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన బురాన్పూర్ నర్సింలు అనే వ్యక్తి మందలో ఓ మేకను అపహరించేందుకు వెళ్లాడు. ఆ మేక అరవడంతో గమనించిన నర్సింలు బయటకి వచ్చి చూశారు. ఇది గమనించి మందలోనే నక్కి కూర్చున్నాడు. స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గతంలోనూ నర్సింలు కట్టేసి ఉంచిన మేకలు అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముకుంద్ పరిగి పట్టణంలో ఓ బైక్ చోరీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
కుల అసమానతలను నిర్మూలించాలి
కొత్తూరు: సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న కుల అసమానతలను తగ్గించాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి జిల్లా కన్వీనర్ మోహనకృష్ణ అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన పలువురితో కలిసి మండలంలోని ఇన్ముల్నర్వలో అగ్రవర్ణాల చేతుల్లో దారుణ హత్యకు గురైన రోహిత్ వేముల వర్ధంతికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన హత్యకు గురై పదేళ్లు గడుస్తున్నా సందర్భంగా వర్ధంతిని హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో సంఘం సభ్యులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు అకాశ్, లక్ష్మయ్య, గోపాల్, తదితరులు పాల్గొన్నారు. సంఘం జిల్లా కన్వీనర్ మోహనకృష్ణ -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
కేశంపేట: బైక్పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని లేమామిడి గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండల పరిధిలోని లింగరావుపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ ఇసాక్ (51) గ్రామంలో కుటుంబంతో కలిసి కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం పని నిమిత్తం బైక్పై కేశంపేటకు వచ్చి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నాడు. మండల పరిధిలోని లేమామిడి శివారులో ముందు నుంచి వస్తున్న లారీని డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ బైక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇసాక్ను గ్రామస్తులు 108 అంబులెన్స్కు సమాచారం అందించి షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజ్కుమార్ తెలిపారు. మతి స్థిమితం లేని వ్యక్తి అదృశ్యం పహాడీషరీఫ్: మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్నగర్కు చెందిన మహ్మద్ షాకీర్(30)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ క్రమంలో గతేడాది జూలై 22న ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి, తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం ఎంత వెతికినా ఫలితం లేకుండాపోయింది. అతని సోదరుడు నజీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు బాలాపూర్ పోలీస్ స్టేషన్లో లేదా 87126 62366 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్ చేయండి కరన్కోట్ పీఏస్ ఎస్ఐ రాథోడ్ వినోద్ తాండూరు రూరల్: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని కరన్కోట్ పోలీస్స్టేషన్ ఎస్ఐ రాథోడ్ వినోద్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంకాంత్రి పండుగకు సొంతూరికి వెళ్లే వారు బంగారంనగదు లాకర్లలో భద్రపర్చుకోవాలన్నారు. గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఇబ్రహీంపట్నం రూరల్: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ కింద మంజూరు చేసిన యంత్ర పరికరాలను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో రైతులను అన్ని రకాలా మోసం చేసిందని విమర్శించారు. సబ్సిడీలకు మంగళం పాడి నట్టేట ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏక కాలంలో రుణమాఫీ చేసి రైతుల పక్షపాతిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు గురునాథ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత, పద్మజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు కరుణాకర్, భాస్కర్చారి, పార్టీ సీనియర్ నాయకులు ఈసీ శేఖర్గౌడ్, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
‘రంగారెడ్డి’ని ముక్కలు చేశారు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డిఅనంతగిరి: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం వికారాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ.. ఎప్పుడు ప్రజా సమస్యలపై నిలదీస్తున్న తరుణంలో సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారని మండిపడ్డారు. వారం రోజులుగా నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా అరెస్టులు, నిర్భందాలు చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే సీఎం జిల్లాల పునర్విభజన అంశం తెర మీదకు తీసుకు వచ్చారన్నారు. కేసీఆర్ తీసుకువచ్చిన జిల్లాల్లో ఏ ఒక్కటి పోయినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోబోదని, ఆ జిల్లాకు చెందిన ప్రజలు కూడా ఉద్యమిస్తారని హెచ్చరించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాను ముక్కలుముక్కలుగా చేస్తూ జీహెచ్ఎంసీలో కలిపి ఆ జిల్లా ఉనికి లేకుండా చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డి కొడంగల్ను తప్పిస్తే మిగతా ప్రాంతాలపై శీతకన్ను వేశారని ఆరోపించారు. ప్రస్తుతం వికారాబాద్లో కొనసాగుతున్న బ్రిడ్జి పనులు కూడా కేసీఆర్ హయాంలోనే మంజూరైనవే అన్నారు. వికారాబాద్లో మున్సిపల్ ఎస్టీపీ ప్లాంట్ ఏడాదిన్నరగా పనిచేయకపోవడంతో మురుగు నీరంతా మూసీలో కలుస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎడ్యుకేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, మాజీ ఏఎంసీ చైర్మన్ విజయ్కుమార్, వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు అనంత్రెడ్డి, రమేష్గౌడ్, రామస్వామి, దేవదాసు, పాండు, గిరీష్, సుభాన్రెడ్డి, విజయేందర్, పావని, ప్రవళిక, ఆయా వార్డుల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించండి కొందుర్గు: ట్రాపిక్ నియమాలు పాటించి, క్షేమంగా ఇల్లు చేరుకోవాలని డీసీపీ శిరీష సూచించారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రీమియర్లీగ్ క్రికెట్ టోర్నమెంట్కు మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, షాద్నగర్ రూరల్ సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, ఎంవీఐ వాసు, ఎస్ఐ రవీందర్ నాయక్, సర్పంచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి షాద్నగర్రూరల్: రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలందరు భాగస్వాములు కావాలని డీసీపీ శిరీష పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఫరూఖ్నగర్ మండలం రాయికల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్కుమార్, సర్పంచ్ జ్యోతి పాల్గొన్నారు. -
లిస్ట్ ఫైనల్
● మున్సిపాలిటీల ఓటరు తుది జాబితా వెల్లడి ● ఆరు మున్సిపాలిటీలు..126 వార్డులు ● మొత్తం 1,75,974 మంది ఓటర్లు ● పురుషులతో పోలిస్తే మహిళలే అధికం సాక్షి, రంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇటీవల ప్రదర్శించిన డ్రాఫ్ట్ పబ్లిషన్ అనంతరం క్షేత్రస్థాయిలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి మంగళవారం ఫైనల్ లిస్ట్ను విడుదల చేసింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు, 1,75,974 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 88,527 మంది మహిళలు, 87,444 మంది పురుషులు, ముగ్గురు ఇతరులు ఉన్నట్లు పేర్కొంది. ఓటర్లు ఇలా.. -
బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026
కందుకూరు: సాధారణంగా ఎడారి దేశాల్లో మాత్రమే పండే ఖర్జూర పంటను యూట్యూబ్లో చూసిన ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మిరెడ్డి శ్రీనివాస్రెడ్డి సరస్వతిగూడలోని తన వ్యవసాయ పొలం ఏడు ఎకరాల్లో పండిస్తున్నాడు. అచ్చంపేటలోని మరో పదెకరాల విస్తీర్ణంలో సాగు చేసి విజయం సాధించాడు. ఏడేళ్ల క్రితం యూకే నుంచి ల్యాబ్లో డెవలప్ అయిన టిష్యూ కల్చర్ బర్హీ రకం మొక్కలను దిగుమతి చేసుకుని సాగు చేయగా, ప్రస్తుతం పంటతో ఆశించిన లాభాలు అందుకుంటున్నాడు. కిలో రూ.110 నుంచి రూ.120 మధ్య హోల్సేల్గా విక్రయిస్తున్నాడు. ఈ ఏడాది ఏడు ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 24 టన్నుల వరకు దిగుబడి వచ్చిందని చెబుతున్నాడు. ఖర్చులు పోనూ ఎకరాకు సరాసరి రూ.2 లక్షల వరకు లాభాలు వచ్చాయని తెలిపాడు. ఔరా.. ఖర్జూర -
ఆడపిల్లేనని అమ్మేశారు
● రూ.3 లక్షలకు శిశువు విక్రయం ● కేసు నమోదు చేసిన పోలీసులు ● పాపను శిశువిహార్కు తరలింపుషాద్నగర్: మూడో సంతానంగా ఆడపిల్లే పుట్టిందని.. కన్నోళ్లు వద్దనుకున్నారు. అల్లాడే పసి ప్రాణంకన్నా.. కొంతమంది డబ్బే ప్రధానమనుకున్నారు. ఫలితంగా అమ్మ ఒడిలో ఉండాల్సిన ఆడ శిశువును అమ్మకానికి పెట్టారు. షాద్నగర్లో మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఫరూఖ్నగర్ మండలం ఉప్పరిగడ్డ పంచాయతీ లాల్సింగ్తండాకు చెందిన వినోద్, రేణుక భార్యాభర్తలు. రేణుక ఏడు నెలల గర్భిణిగా ఉండగా, గత నవంబర్ 9న హైదరాబాద్లోని జజ్జిఖానా ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం భార్యాభర్తలు తండాకు వచ్చి ఇంట్లోనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా తల్లి వద్ద పాప కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానిక అంగన్వాడీ టీచర్ చింటు జనవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు, ఆపరేషన్ స్మైల్ టీం బృందంతో విచారణ చేయించారు. ఈ క్రమంలో కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన గోవింద్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులు బిడ్డను విక్రయించారని తేలింది. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో మూడో పాపను వదిలించుకునేందుకు రేణుక, వినోద్ సిద్ధమయ్యారని తేలింది. జజ్జిఖానా ఆస్పత్రిలో పనిచేసే పలువురు సిబ్బందితో పాటు గోవింద్ మధ్యవర్తిత్వంలో అత్తాపూర్కు చెందిన వారికి రూ.3 లక్షలకు పాపను విక్రయించారు. డిసెంబర్ 31న షాద్నగర్ బస్టాండ్లో మధ్యవర్తులకు శిశువును అప్పగించారు. ఈ వివరాలతో పాపను స్వాధీనం చేసుకున్న పోలీసులు శిశువిహార్కు తరలించారు. శిశువు విక్రయం వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
జిల్లా అస్తిత్వాన్ని కాపాడాలి
తుక్కుగూడ: జిల్లా అస్తిత్వాన్ని కాపాడాలని జిల్లా సేవ్ టీచర్స్ ప్రతినిధులు మంగళవారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల మధుకర్గౌడ్ మాట్లాడారు. ఇప్పటికే వందలాంది మంది నాన్ లోకల్ ఉపాధ్యాయలు జిల్లాలోకి వచ్చారని, దీంతో స్థానికంగా ఉన్న ఉపాధ్యాయలకు అన్యాయం జరిగిందన్నారు. మరోసారి జిల్లా విభజన జరిగితే స్థానిక ఉపాధ్యాయులు మరింత నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బొడ్డు రవి, గౌరవ సలహాదారు నారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి తలారి సురేష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నల్లవోలు స్వప్న, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. కడ్తాల్: రైతులకు యూరియా అవసరమైన మేర విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష అన్నారు. మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఎక్వాయిపల్లి, ముద్వీన్ గ్రామాల్లో మంగళవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పీఏసీఎస్ గోదాములు, ఆగ్రోరైతు సేవా కేంద్రం, ఫెస్టిసైడ్స్ సీడ్స్ దుకాణాలను తనిఖీ చేశారు. ఆయా గోదాములు, షాపుల్లో ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, ఈ పాస్ యంత్రాన్ని పరిశీలించారు. రైతులకు అవసరమైన మేర ఎరువులు, యూరియా ఈ పాస్ మెషిన్ ద్వారానే విక్రయించాలని సూచించారు. అనంతరం ముద్విన్లో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీని, ఎక్వాయిపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఏవో శ్రీలత, ఏఈఓలు కశ్యప్, అభినవ్రెడ్డి పీఎసీఎస్ సిబ్బంది, డీలర్లు ఉన్నారు. హుడా కాంప్లెక్స్: రోడ్డు భద్రత అనేది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం అరైవ్ అలైవ్ పేరుతో సరూర్నగర్ డివిజన్లోని వెంకటేశ్వర కాలనీలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా, మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. అనంతరం సీఐ సైదిరెడ్డి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు మహేందర్, లక్ష్మణ్, నారయ్య, శిరీష, కాలనీ అధ్యక్షుడు గండు ధనం రెడ్డి, సెక్రటరీ కనకారావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్కు డాక్టరేట్ ఆమనగల్లు: తలకొండపల్లి మండ లం పడకల్ గ్రా మానికి చెందిన ప్రభాకర్ చౌటి జర్నలిజంలో డాక్టరేట్ అందుకున్నారు. భారతీయ మీడియా పరిణామాల్లో అత్యంత కీలకంగా మారిన అసహనం అనే అంశంపై సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ కె.నరేందర్ మార్గనిర్దేశకత్వంలో పరిశోధన చేశారు. దీనిపై సంతృప్తి చెందిన ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లు, ఉన్నతాధికారులు ప్రభాకర్కు డాక్టరేట్ పట్టా అందజేశారు. -
సమ్థింగ్ స్పెషల్
సాగులో..ఉన్నత చదువులు చదివిన వారు కొందరు.. విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తిచేసి వచ్చిన వారు మరికొందరు.. వ్యవసాయాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్న వాళ్లు ఇంకొందరు.. వినూత్న పంటలతో ముందుకు ‘సాగు’తున్నారు. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు.. ఆదర్శంగా నిలుస్తున్నారు.●అరుదైన పంటల సాగు ●ఆదర్శంగా నిలుస్తున్న జిల్లావాసులుపరిగి: మండల పరిధిలోని భర్కత్పల్లికి చెందిన అవుసుల అనంతయ్య, దోమ మండలం మోత్కూర్కు చెందిన శ్రీకాంత్రావు డ్రాగన్ ఫ్రూట్తో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఎకరా తోటలో ఏటా రూ.2 లక్షల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని శివారెడ్డిపల్లి, సోమన్గుర్తి గ్రామాలకు చెందిన పలువురు రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. షాబాద్: కుర్వగూడ గ్రామానికి చెందిన దాదె అమృత్రాజ్, స్వప్న దంపతులు షాద్నగర్లో చదువుకున్నారు. అమృత్రాజ్ బీఏ బీఈడీ పూర్తి చేయగా, స్వప్న ఎంఏ పీజీ చదువుతోంది. ఉన్నత చదువులు చదివినా స్వయం ఉపాధితో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయంపై మక్కువ పెంచుకున్న వీరు పదేళ్ల క్రితం గ్రామంలోని సొంత పొలం రెండు ఎకరాల్లో రూ.15 లక్షలతో పూలమొక్కల నర్సరీ ఏర్పాటు చేశారు. మరో 10 ఎకరాల వరకు పొలాన్ని కౌలుకు తీసుకుని ఆధునిక పద్ధతుల్లో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. ప్రస్తుతం 5 ఎకరాల్లో క్యాప్సికమ్ సాగు చేశారు. కోత ప్రారంభం కావడంతో మార్కెట్లో కిలోకు రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలుకుతోంది. మొత్తం రూ.4లక్షల వరకు ఖర్చు చేశారు. 8 నెలల వరకు పంట దిగుబడి రానుందని రైతు చెబుతున్నాడు. రోజుకు 30 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పంటకు మందులు వేయడం, కలుపు తీయడం, కోయడం, ఎరువులు వేయడం, నీరు పెట్టడం తదితర పనులు చేస్తుంటారు. భార్యభర్తలు పొలంలోనే పనులు చేస్తూ అక్కడే ఉంటున్నారు. ‘డ్రాగన్’.. వెల్డన్ -
క్రీడల అభివృద్ధికి కృషి
మహేశ్వరం: ప్రధాని మోదీ గ్రామీణ క్రీడల అభివృద్ధికి నిరంతరం కృషి చేయడంతో పాటు ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పెండ్యాలలో నవభారత్ యూత్ ఆధ్వర్యంలో చింతోజు సుదర్శన్చారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను మంగళవారం కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో క్రీడా సంస్కృతిని పునరుద్ధరించడానికి, క్రీడలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఖేల్ ఇండియా పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. దేశానికి అపారమైన యువశక్తి ఉందని, అది వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే ప్రధాన శక్తిగా మారనుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, తెలంగాణ రారష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేశం ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మహేందర్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్భూపాల్ గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి -
దెబ్బడగూడలో అవకాడో..
కందుకూరు: విదేశాల్లో మాత్రమే పండి అధిక డిమాండ్ ఉన్న పంటల్లో అవకాడో ఒకటి. ఆ పంటను మండలంలోని దెబ్బడగూడకు చెందిన యువకుడు జైపాల్నాయక్ సాగు చేసి శభాష్ అనిపించుకున్నాడు. యూకేలో ఎంబీఏ పూర్తిచేసి ఇండియాకు తొరిగొచ్చాడు. యూకే, ఇజ్రాయిల్లో సాగు చేసిన అవకాడోను ఇక్కడ పండించాలని నిర్ణయించుకున్నడాడు. 2012లో మొదట హాస్ రకం మొక్కలను తెచ్చి నాటి విఫలమయ్యాడు. తర్వాత బంగ్లాదేశ్లో బల్బూ రకం అధిక దిగుబడి రావడంతో పాటు ఇక్కడి ఉష్ణోగ్రతలకు తగ్గట్లుగా ఉన్నట్లు గుర్తించాడు. పట్టుదలతో ఆ రకం మొక్కలను 2021లో తెప్పించి ఎకరం 30 గుంటల విస్తీర్ణంలో సాగు చేశాడు. మూడేళ్ల తర్వాత పంట దిగుబడి ప్రారంభమైయింది. ప్రస్తుతం మొక్కకు 15 నుంచి 20 కిలోల మేర దిగుబడి సాధిస్తున్నాడు. కిలో సరాసరి రూ.200 నుంచి రూ.300 వరకు పొలం వద్దనే విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఖర్చులు పోను ఎకరాకు సుమారు ఏడాదికి రూ.2 లక్షలకు పైనే సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం అవకాడోను సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్న రైతుల కోసం తానే సొంతంగా నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు విక్రయిస్తూ, మెలకువలు నేర్పిస్తున్నాడు. -
● ఆపిల్.. జిగేల్
కందుకూరు: ఎక్కడో హిమాచల్ప్రదేశ్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో పండే ఆపిల్ పంటను మన దగ్గర సాగు చేపట్టారు. నిత్యం హోమాలు, పూజలు జరిగే పులిమామిడి శ్రీనిఖిల్ చేతనా కేంద్రంలో నిర్వాహకులు 2021 సంవత్సరంలో ఆశ్రమం అవసరాల కోసం ఆపిల్ పంటను సాగు చేశారు. హిమాచల్ప్రదేశ్ నుంచి హరిమన్ 99 రకం మొక్కలను తెప్పించి ముప్పై గుంటల విస్తీర్ణంలో సాగు చేశారు. రెండో ఏడాది నుంచే పంట దిగుబడి ప్రారంభమైంది. మూడో ఏడాది ఒక్కో మొక్క నుంచి దాదాపు 200 కాయల వరకు కాసాయి. ఏటా డిసెంబర్లో మొక్కల కొమ్మలను కత్తిరించి, ఆకులు మొత్తాన్ని తొలగిస్తే, కొత్త చిగుర్లు వచ్చి 30 నుంచి 40 రోజుల్లో పూత మొదలవుతుంది. ఏప్రిల్, మే నెలల్లో పంట కోతకు వస్తుంది. -
● సంప్రదాయ ‘తోరణం’
తాండూరు: శాస్త్రసాంకేతిక విధానంలో ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయ రంగంలో పూర్వీకుల సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక్కడి రైతు కుటుంబాలు వారసత్వ పంటలను మరవడం లేదు. తాండూరు ప్రాంతంలో తెలంగాణ, కర్ణాటక ఆచార వ్యవహారాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ప్రధానంగా కంది, శనగ, కుసుమ, పప్పు దినుసు పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ప్రాంతంలోని నేలలు కందితో పాటు జొన్న సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా జొన్న వేస్తారు. పెట్టుబడి లేకుండా మంచి దిగుబడి అందించే ఈ పంటను ధర్మం పంటగా పిలుస్తారు. అధిక పోషక విలువలుండే జొన్నలతో రొట్టెలు చేసి నిత్యం తింటారు. సంక్రాంతి సమయంలో జొన్న పంట ఇంటికి చేరుతుంది. వీటి కంకులను రైతులు గుమ్మాలకు తోరణాలుగా వేస్తారు. -
● గ్యాక్ ప్రూట్.. కొత్త రూటు
తుక్కుగూడ: మంఖాల్ డివిజన్ పరిధిలోని ఇమామ్గూడకు చెందిన బాకారం బుచ్చిరెడ్డి తనకున్న భూమిలో వియత్నాంకు చెందిన గ్యాక్ ప్రూట్ను సాగు చేస్తున్నాడు. నారును ఏపీలోని పోలవరం ప్రాంతం నుంచి తీసుకువచ్చాడు. ఎకరంలో సుమారు రూ.9 లక్షలు ఖర్చు చేసి 210 మొక్కలు నాటాడు. ప్రస్తుతం మంచి దిగుబడి వస్తోంది. మొక్క నాటిన నుంచి 4–5 నెలల్లో పూత ప్రారంభమవుతుందని, ఆడ, మగ పూతను గుర్తించి పాలినేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. పాలినేషన్ తరువాత పిందె మొదలై మూడు నెలల్లో మూడు, నాలుగు దశలు మారి పండు తయారువుతుందని చెబుతున్నాడు. ఏడు నెలల్లో విక్రయించేందుకు అనువుగా మారుతుందని, ఒక్కో పండు దాదాపు కిలో బరువు ఉంటుందన్నాడు. ప్రస్తుతం మార్కెట్లో రూ.1000 నుంచి రూ.1,200కు విక్రయిస్తున్నట్టు చెప్పాడు. -
ప్రజా జీవితాల్లో మార్పే అసలైన అభివృద్ధి
చేవెళ్ల/శంకర్పల్లి: ప్రజల జీవితాల్లో కనిపించే మార్పే నిజమైన అభివృద్ధి అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో రూ.95 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. పట్టణంలో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఆస్పత్రి నూతన భవనం అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. పలు వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, డీఎంహెచ్ఓ శ్రీలత, ఏసీఎస్ మాజీ చైర్మన్లు గోనె ప్రతాప్రెడ్డి, దేవర వెంకట్రెడ్డి, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు జానార్దన్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఆగిరెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్గౌడ్, ఎం.క్రిష్ణారెడ్డి, వీరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ జెండానే ఎగురవేయాలని మంత్రులు సూచించారు. ప్రతిపక్షాలకు చెందిన పలువురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ పాలనలో మంత్రులకు ప్రాధాన్యం అనంతరం శంకర్పల్లి మున్సిపాలిటీలో రూ.2.85 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శంకుస్థాపన చేశారు. అక్కడ వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి పాలన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనను గుర్తు చేస్తోందన్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా సంబంధిత శాఖల్లో మంత్రుల మాటే ఫైనల్గా ఉండేలా చూస్తున్నారన్నారు. కేవలం వైఎస్ పాలనలోనే మంత్రులకు ఇలాంటి ప్రాధాన్యం, స్వేచ్ఛ ఉండేదని గుర్తు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం, తీరిక తమకు లేదన్నారు. గతంలో పుష్ప– 2 సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగిన సంఘటనతో అందరూ బాధపడిన విషయం తెలిసిందేనన్నారు. అప్పుడు అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి, తాను మాట్లాడుతూ.. సినిమా టికెట్ల రేట్లను పెంచబోమని చెప్పిన విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు.ఆతర్వాత సీఎంతో పాటు మంత్రులందరూ కలిసి మాట్లాడుకున్నామని, టికెట్ల రేట్లను పెంచి, అందులో వచ్చే ఆదాయంలో 20శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించా రు. ఆ తర్వాత జీవో ఇచ్చినా, సినిమాల విషయంలో కోర్టు అభ్యంతరం తెలిపిందన్నారు. అయి తే సంక్రాంతికి విడుదలైన సినిమాలకు జీవో విడుదలైన సమయంలో తాను నల్గొండ, భువనగిరి జిల్లాల పర్యటనలో ఉండడంతో విషయం తనకు తెలియదన్నారు. సీసీ రోడ్డు పనులు ప్రారంభం మొయినాబాద్ రూరల్: మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్ డబుల్బెడ్ రూమ్ ఇళ్ల వద్ద సీసీ రోడ్డు పనులు, హిమాయత్నగర్ చౌరస్తాలో అండర్ డ్రైనేజీ మురుగు కాలువ, చిలుకూరు దేవాలయం వద్ద బాత్రూమ్ల నిర్మాణం తదితర పనులు శంకుస్థాపన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, చేవెళ్ల కాలె యాదయ్య, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రారంభించారు. -
కల్వకుర్తిని జిల్లాగా ప్రకటిస్తే పోటీ చేయం
ఆమనగల్లు: కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా, ఆమనగల్లులో వివిధ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఆయా పట్టణాల్లో బీజేపీ పోటీ చేయదని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి ప్రకటించారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కల్వకుర్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్వకుర్తి ప్రాంతానికి చెందిన రేవంత్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబాటుకు గురైందని, ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా తమ ప్రాంత అభివృద్దే ధ్యేయమని అన్నారు. అందుకే కల్వకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిస్తే మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ పోటీ నుంచి తప్పుకొంటుదని చెప్పారు. కల్వకుర్తిని వెంటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, ఆమనగల్లు పట్టణంలో ఆర్డీఓ, సబ్రిజిస్ట్రేషన్, ఆర్టీఓ, సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వీటి ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి వెంటనే అంగీకరించాలని పేర్కొన్నారు. -
హెరాయిన్ స్వాధీనం.. నిందితుడి అరెస్ట్
కేపీహెచ్బీకాలనీ: నిషేధిత మత్తు పదార్థం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు సోమవారం అరెస్టు చేసి 25 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. బీహార్ రాష్ట్రానికి చెందిన అంజనీకుమార్ ఉపాధ్యాయ (31) సిగరెట్లలో గంజాయిని సేవించేవాడు. సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రూ.25 వేలతో 25 గ్రాముల హెరాయిన్ కొనుగోలు చేసి రైలులో ఆదివారం రాత్రి సికింద్రాబాద్కు చేరుకున్నాడు. సోమవారం ఉదయం ఆటోలో కేపీహెచ్బీ బస్స్టాప్నకు చేరుకుని ఎటువెళ్లాలో తెలియక అక్కడ ఉన్న కొందరి వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న మత్తు మందును కొనుగోలు చేయాలని కోరాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద బ్యాగులో ఉన్న 25 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. పీజేఆర్కు సీఎం నివాళి ఖైరతాబాద్: దివంగత నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.జనార్థన్ రెడ్డి జయంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలో పీజేఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు.పీజేఆర్ కుమార్తె, కార్పొరేటర్ విజయారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు రాజ్ ఠాగూర్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కరెంట్’గా లెక్కిస్తాం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా గుట్టుగా ఏర్పాటు చేసిన స్టోన్ క్రషర్ల నియంత్రణ కోసం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొస్తుంది. ఇకపై క్రషర్లు వాడే విద్యుత్ ఆధారంగా రాయల్టీ వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రతి నాలుగు యూనిట్ల విద్యుత్కు ఒక మెట్రిక్ టన్ను చొప్పున లెక్కించనున్నారు. ఒక్కో మెట్రిక్ టన్ను రోబో సాండ్/కంకరకు రూ.175 చొప్పున రాయల్ట్టీ వసూలు చేయనుంది. తద్వారా అక్రమ మైనింగ్, రవాణాకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు కొత్తగా స్టోన్ క్రషర్ పాలసీని తీసుకొస్తుంది. అంతేకాదు అక్రమార్కులను గుర్తించేందుకు ఓఆర్ఆర్పై నాలుగు తనిఖీ బృందాలను కూడా ఏర్పాటు చేసింది. రాయల్టీ ఎగ్గొట్టే వాళ్లను గుర్తించేందుకు మైనింగ్/క్రషర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. వాహనాల రాకపోకలు సహా ఓవర్ లోడుతో వెళ్లే వాహనాల వివరాలు కూడా ఇట్టే తెలిసిపోతుంది. ఆదాయానికి పొంతన లేదు జిల్లాలో గ్రానైట్, క్వార్ట్జ్, లాటరేట్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్స్ క్వారీలు 150 ఉన్నాయి. అదే విధంగా 50 వరకు స్టోన్ క్రషర్లు ఉన్నాయి. మైనింగ్ లీజులు, రాయల్టీ వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.170 కోట్ల ఆదాయం సమకూరుతుంది. నిజానికి మైనింగ్శాఖ నుంచి పొందిన అనుమతులకు, క్షేత్రస్థాయిలో జరిపిన తవ్వకాలకు అసలు పొంతనే ఉండటం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో తగిన ఆదాయం రావడం లేదు. ముఖ్యంగా అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని బండరావిర్యాల, చిన్న రావిర్యాల, కొత్తూరు, కడ్తాల్, ఆమనగల్లు, యాచారం మండలాల్లో ఈ అక్రమ మైనింగ్ దందా ఎక్కువగా జరుగుతోంది. జిల్లా మైనింగ్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆయా క్వారీలు/మైన్స్లో పర్యటించి చేపట్టిన తవ్వకాలను గుర్తించి, పెనాల్టీలు వసూలు చేయాల్సి ఉంది. కానీ మైనింగ్ వ్యాపారులు ఇచ్చే నెలవారీ మామూళ్లకు అలవాటు పడిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. తనిఖీల్లో వెల్లడైన అక్రమాలు నిజానికి ఏదైనా క్రషర్ ఏర్పాటు చేయాలంటే ముందు స్థానిక సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. రెవెన్యూ అధికారుల అనుమతి పొందాలి. మైనింగ్శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాలుష్య నియంత్రణలో భాగంగా పీసీబీ నుంచి ఎన్ఓసీ పొందాలి. పరిశ్రమల విభాగం సహా లేబర్ లైసెన్సులు పొంది ఉండాలి. కానీ శంషాబాద్, మామిడిపల్లి, కొత్వాల్గూడ, నార్సింగి, జన్వాడ, మీర్జాగూడ, శంకర్పల్లిలో 22 క్రషర్లు ఉండగా, వీటిలో మెజార్టీ క్రషర్లకు అనుమతులు లేవు. ఇక అబ్దుల్లాపూర్మెట్ బండరావిర్యాల, చిన్న రావిర్యాలలో 40 మైన్లు, 17 క్రషర్లు ఉండగా, వీటిలో ఐదు క్రషర్లకు ఎలాంటి అనుమతులు లేవు. కొహెడ, మంచాల, యాచారంలో అక్రమ క్రషర్ల దందా కొనసాగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది. ఇక నుంచి స్టోన్ క్రషర్ పాలసీ అమలు రూ.220 కోట్ల ఆదాయం లక్ష్యం అక్రమ మైనింగ్ను నియంత్రించడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకే ప్రభుత్వం ఈ స్టోన్ క్రషర్ పాలసీని తీసుకొచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విద్యుత్ మీటర్ రీడింగ్ ఆధారంగా తరలించిన రోబో సాండ్, కంకర పరిణామాన్ని లెక్కించనుంది. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన తవ్వకాలకు పెనాల్టీ వేసి, వారి నుంచి వసూలు చేయనుంది. ఈ పాలసీ వల్ల ప్రస్తుతం ఏటా రూ.170 కోట్లుగా ఉన్న ప్రభుత్వ ఆదాయం రూ.220 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉంటే సెల్లార్ తవ్వకాలు, మట్టి అక్రమ అమ్మకాలపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
మహిళా ఓటర్లే అధికం
షాద్నగర్: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తిస్థాయిలో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే షాద్నగర్ మున్సిపాలిటీలో పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి. ఇదీ తుది లెక్క మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా 53,403 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 26,679 మంది కాగా, మహిళలు 26,723 మంది. ఇతరులు ఒకరు ఉన్నారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో 42,134 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 53,403 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 11,269 మంది ఓటర్లు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. అయితే ఇటీవల ముసాయిదా ఓటర్లు జాబితాను విడుదల చేసి అభ్యంతరాలను అధికారులు స్వీకరించి తుది జాబితాను విడుదల చేశారు. పోరుకు సన్నద్ధం మున్సిపల్ పోరుకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సన్నద్ధం అవుతున్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల ముఖ్య నేతలు ఆశావహులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అన్ని వార్డులను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, తిరిగి చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తన ఉనికి చాటేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ తుది ఓటరు జాబితా విడుదల మున్సిపాలిటీలో మొత్తం 53,403 మంది ఓటర్లు పట్టణంలో భారీగా పెరిగిన ఓటర్లు -
చెరువులను పునరుద్ధరించండి
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని చెరువులతో పాటు వాటికి అనుసంధానం చేసి ఉండే వరద కాలువలను కాపాడాలంటూ పలువురు హైడ్రాకు వినతులు అందించారు. జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్, ప్రగతినగర్ చెరువు, కాటేదాన్లోని నూర్ మహ్మద్కుంట, ఫిల్మ్నగర్ చెరువు ఇలా చెరువులను అభివృద్ధి చేయాలని నగరం నలువైపుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అంబర్పేటలోని బతుకమ్మకుంట, కూకట్పల్లి నల్లచెరువు, పాతబస్తీలోని బమ్రుక్ ఉద్ దౌలా చెరువులు పర్యాటక ప్రాంతాలుగా మారాయని.. తమ ప్రాంతంలో ఉన్న చెరువులను అలా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్వహించిన ప్రజావాణి ద్వారా మొత్తం 76 ఫిర్యాదులు వచ్చాయి. జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకుని ఉన్న ఫాక్స్ సాగర్ కబ్జాలను తొలగించి, మరో ట్యాంక్బండ్గా అభివృద్ధి చేయాలని అక్కడి నివాసితులు కోరారు. గౌరెల్లి గ్రామంలో సర్వే నెం.223లో ఉన్న మాలకుంట చెరువును అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారు. కొండాపూర్ సీఎంసీ లేఔట్లోని రహదారి ఆక్రమణకు గురవుతోందని నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పెద్ద అంబర్పేటలోని బాలాజీ లే ఔట్ను ఆనుకుని ఉన్న ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డును కలుపుతూ 40 ఫీట్ల రహదారిని ఆక్రమించి.. ఏకంగా నిర్మాణాలు చేపట్టారని, దీంతో ఆ లే ఔట్లోని ఇతర ప్లాట్లకు దారి లేకుండా పోయిందని ప్లాట్ యజమానులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా ప్రజావాణిలో 76 ఫిర్యాదులు -
బజాజ్ ఇంజనీరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
గోల్కొండ: విద్యార్థులు చదువుకునే కళాశాలల్లోనే వారికి ఉద్యోగసంబంధమైన స్కిల్స్ నేర్చుకునేలా ప్రణాళిక రూపొందించామని బజాజ్ ఆటోలిమిటెడ్ బజాజ్ స్కిల్లింగ్ హెడ్ వేణుగోపాల స్వామి తెలిపారు. సోమవారం షేక్పేట్లోని జి.నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన బజాజ్ ఇంజనీరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాన్ని ఆయన కళాశాల యాజమాన్య ప్రతినిధులతో మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఈ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ప్రతి సంవత్సరం 350 మంది విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు నేర్పిస్తామన్నారు. ఫార్మెడ్ డెవలప్మెంట్ కేంద్రాల వల్ల విద్యార్థుల మేధకు మరింత పదును పెట్టినట్లు అవుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో గెలుపొందేవారికే టికెట్లు
షాద్నగర్: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందే వారికే టికెట్లు ఇస్తామని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. సోమవారం షాద్నగర్ పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీలతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. స్క్రూటీని నిర్వహించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి గెలుపొందే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. షాద్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో చాలా గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు విజయం సాధించారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కలిసి కట్టుగా ముందుకు సాగాలని అన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెబాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు విజయ్కుమార్, వెంకటేష్గుప్తా, వంశీకృష్ణ, రుషికేష్, అశోక్, వెంకటేష్, శ్రీనివాస్చారి, శివకుమార్, నర్సింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విలీనం వెనక కుట్ర
మైలార్దేవ్పల్లి: రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్లో విలీనం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా బీజేపీ సమరశంఖం పూరించింది. ఆ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ కన్వీనర్ పొన్నమోని మల్లేశ్యాదవ్ అధ్యక్షతన సోమవారం ఆరాంఘర్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్భూపాల్గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్లో విలీనం చేయడమనేది కేవలం పరిపాలనా పరమైన నిర్ణయం కాదని, దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల భూములు, స్థానిక ఉపాధి అవకాశాలు, రాజకీయ ప్రాధాన్యతలను దెబ్బతీసేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాకు ఓ ప్రత్యేక సామాజిక, భౌగోళిక గుర్తింపు ఉందన్నారు. కనీసం గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని మండిపడ్డారు. జిల్లా ప్రజల హక్కుల కోసం బీజేపీ ఎంతవరకై నా పోరాడుతుందని స్పష్టంచేశారు. రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం జిల్లా ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, జిల్లాలోని అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలను నగరంలో కలిపి, గందరగోళం సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు. విలీనం జరిగితే స్థానిక సమస్యలు మరుగున పడిపోతాయని, ప్రజల స్వయం నిర్ణయ హక్కు హరించబడుతుందని తెలిపారు. ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు తోకల శ్రీనివాస్రెడ్డి, అందెల శ్రీరాములుయాదవ్, అంజన్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి పథకం నిర్వీర్యానికి కుట్ర
యాచారం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్ట కొట్టడానికి కుట్రలు చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై జారీ చేసిన జీవోల ప్రతులను సోమవారం యాచారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. ఉపాధి పథకాన్ని పూర్తిగా తీసేసే కుట్రలు చేస్తుందన్నారు. హామీ పథకానికి నిధులు తగ్గించడం, పనుల్లో పలు నిబంధనలు పెట్టడం అందుకు కారణమన్నారు. మహాత్మాగాంధీ పేరును తీసేసే జీవోలు విడుదల చేయడం సరైంది కాదన్నారు. కూలీలకు అన్యాయం చేయాలని చేస్తే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జంగయ్య, రాములు, జంగారెడ్డి, ఇందిరమ్మ, రమేశ్, నర్సింహ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు
అటవీ శాఖ డీఆర్ఓ జగన్మోహన్ షాద్నగర్: చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్(డీఆర్ఓ) జగన్మోహన్ హెచ్చరించారు. సోమవారం షాద్నగర్ పట్టణంలో పలుదుకాణాల్లో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనా మాంజాలను విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. నిషేధిత మాంజా విక్రయాలు, నిల్వలపై దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైనా మాంజాలతో పక్షులు, జంతువులు, వన్య ప్రాణులు గాయాల పాలవుతున్నాయని చెప్పారు. దుకాణాల్లో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు దూది ధారంతో పంతంగులను ఎగురవేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో అటవీశాఖ అధికారులు రవీందర్గౌడ్, అజీజ్, వినోద్కుమార్, రవీందర్రెడ్డి, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్గా ఎన్నికైతే డీలర్కు రాజీనామా చేయండి జిల్లా పౌరసరఫరాల శాఖ డీటీ మాచన రఘునందన్ ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా పంపిణీ వ్యవస్థ గొప్పదని, ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకునేందుకు చక్కటి అవకాశమని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు రేషన్ డీలర్లు సర్పంచ్లుగా పోటీ చేసి గెలుపొందారని ఇది గొప్ప పరిణామమన్నారు. కానీ సర్పంచ్లు అయ్యాక డీలర్గా కొనసాగటం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ప్రకారం రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ చేసిన రేషన్ డీలర్లు స్వచ్ఛందంగా రాజీనాయా చేయకపోతే డీలర్షిప్ రద్దుకు సిఫారసు చేస్తామన్నారు. సర్పంచ్ అయ్యాక కూడా డీలర్గా కొనసాగాలనే ఆలోచన తీసేయాలని సూచించారు. రేషన్ డీలర్షిప్ కేవలం ఒక గౌరవప్రదమైన ఉపాధి అవకాశం అని, అందుకే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కలిగిందన్నారు. బాధ్యతతో రాజీనామా చేయాలని తెలిపారు. న్యాయమైన పరిహారం ఇప్పించండి కడ్తాల్: గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న మండల పరిఽధిలోని ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, ఆయా సర్పంచ్లు సోమవారం ఎంపీ డాక్టర్ మల్లు రవిని కలిసి విన్నవించారు. భూమి కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వడం తగదని, గ్రీన్ ఫీల్డ్ మొదటి మార్గం రావిర్యాల నుంచి చివరి మార్గం ఆకుతోటపల్లి వరకు ఒకే విధంగా పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీ హామీ ఇచ్చారని భూ నిర్వాసితులు తెలిపారు. కార్యక్రమంలో అచ్చంపేట్ ఎమ్మెల్యే వంశీకృష్ణ, సర్పంచులు కరుణాకర్గౌడ్, ఈర్లపల్లి రవి, నాయకులు రవికాంత్గౌడ్, మధు, మల్లేశ్గౌడ్, దీపక్, శ్రీరాములు, రమేశ్నాయక్, నర్సింహ, హరీశ్ తదితరులుపాల్గొన్నారు. -
ఆలిండియా బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
యాచారం: మండల పరిధిలోని మంతన్గౌరెల్లి గ్రామానికి చెందిన రమావత్ పవన్నాయక్ ఆల్ ఇండియా యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ఓయూలో ఎంఏ హిస్టరీ చదువుతున్న పవన్, యూనివర్సిటీలో నిర్వహించిన అంతర్ కళాశాల టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి, ఆలిండియా టోర్నీకి సెలెక్టయ్యారు. ఈ నెల 14 నుంచి 17 వరకు తమిళనాడులో జరిగే ఆలిండియా స్థాయి పోటీల్లో ఓయూ తరఫున తలపడనున్నారు. ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి సినీనటుడు ప్రదీప్ చేవెళ్ల: విద్యార్థి దశలోనే ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని, వాటి సాధన కోసం కృషి చేయాలని ప్రముఖ వక్త, సినీ ప్రము ఖుడు కేవీ.ప్రదీప్ అన్నా రు. చేవెళ్లలోని వివేకానంద జూనియర్, డిగ్రీ కళాశాల వార్షికోత్సవం సోమవారం ప్రిన్సిపాల్ జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రదీప్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. విద్యార్థులు వివేకానందుడు చూపించిన మార్గాల్లో నడవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు, అధ్యాపకులకు, గ్రామానికి మంచి పేరుతీసుకువచ్చే విధంగా విద్యార్థులు ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డి.ప్రభాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వృద్ధురాలి కాలుకు మాంజా చుట్టుకుని గాయాలు మీర్పేట: చైనా మాంజా చుట్టుకుని ఓ వృద్ధురాలి కాలుకు గాయమైన సంఘటన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అల్మాస్గూడకు చెందిన యాదమ్మ(75) సోమవారం సాయంత్రం తెలిసిన వారి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు చైనా మాంజా కాలికి చుట్టుకుంది. వాహనం వేగంగా వెళ్తుండడంతో ఆమె కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. భక్తుడి ముసుగులో రూ.20 లక్షలు టోకరా... బంజారాహిల్స్: భక్తుడి ముసుగులో నమ్మకాన్ని సంపాదించి ఆ తర్వాత స్థలం ఇప్పిస్తానని నమ్మబలికి రూ. 20 లక్షలకు టోకరా వేసిన ప్రబుద్ధుడిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ సమీపంలో నివసించే బాలగణేష్ గత 13 సంవత్సరాలుగా హరేకృష్ణ (ఇస్కాన్) ఉద్యమానికి అనుబంధంగా ఉంటూ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో అన్నదానం వంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్నాడు. 2019లో వర్ధినీడి సత్యవెంకటరెడ్డినాయుడు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను ఆధ్యాత్మికత కలిగినవాడినని భక్తుడిగా చూపించుకుని తరచూ ఆలయానికి వచ్చి బాలగణేష్తో సన్నిహితంగా మెలుగుతూ అతని నమ్మకాన్ని సంపాదించాడు. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా నర్సాపూర్ గ్రామంలో పదెకరాల స్థలం కొనుగోలు చేస్తున్నానని అబద్దం చెప్పి ఆ భూమిలో పెట్టుబడి పెడితే భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని, తద్వారా సురిక్షితమైన లాభాలు వస్తాయని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన బాలగణేష్ 2019, డిసెంబర్ 31న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి రూ. 20 లక్షలు వ్యక్తిగత రుణం తీసుకుని, అదే రోజున నిందితుడికి అందజేశారు. కానీ అప్పటి నుంచి ఎటువంటి భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు. డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు అబద్దపు హామీలు ఇస్తూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఉద్దేశపూర్వకంగా డబ్బు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుతిరుగుతున్నాడంటూ బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సినిమా చూస్తూ గుండెపోటుతో రిటైర్డ్ ఏఎస్ఐ మృతి కేపీహెచ్బీకాలనీ: సినిమా చూసేందుకు థియేటర్కు వచ్చిన ఓ రిటైర్డ్ ఏఎస్ఐ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన మేరకు.. సోమవారం భాగ్యనగర్ కాలనీలోని అర్జున్ థియేటర్లో లింగంపల్లికి చెందిన ఆనంద్కుమార్ మన శంకర వరప్రసాద్ సినిమా చూసేందుకు వచ్చాడు. ఉదయం 11.30 గంటల షోకు సినిమా చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పక్కన సీట్లలో కూర్చున్న వారు థియేటర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సినిమా చూస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పు తీర్చలేదని.. హత్య చేశారు
కొత్తూరు: అప్పు చెల్లించమంటే కాలయాపన చేయడం.. దానికితోడు పాతకక్షలు పెట్టుకొని కొత్తూరు పట్టణంలో ఈ నెల 11న యువకుడిని తోటి స్నేహితులే హత్య చేసినట్లు షాద్నగర్ డీసీపీ శిరీషరాఘవేంద్ర పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆమె స్థానిక పోలీస్స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఆయా కాలనీల్లో నివాసం ఉంటున్న మాధవ్ బిరదర్ అలియాస్ ఆకాష్(27), మహ్మద్ ఒవైజ్, మహ్మద్ ఇర్ఫాన్, నసీర్ పాషా, షేక్ సోహైల్స్నేహితులు. కాగా మహ్మద్ ఒవైజ్ వద్ద మాధవ్ బిరదర్ తన అవసరాల కోసం రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించడం లేదు. అంతేకాకుండా మాధవ్ బిరదర్ మరో స్నేహితుడైన మహ్మద్ ఇర్ఫాన్ సోదరితో చనువుగా ఉంటున్నాడు. దీంతో వారిద్దరూ తమ మిత్రులైన నసీర్పాషా, షేక్ సోహైల్తో కలిసి మాధవ్ హత్యకు పథకం వేశారు. ఆదివారం మాధవ్ అద్దెకు నడిపే ఆటోలోనే ఐదుగురు కలిసి మద్యం కొనుగోలు చేసి కొత్తూరు శివానగర్ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి చేరుకుని తాగారు. మాధవ్ మత్తులోకి చేరుకోగానే అతడిపై బీరు బాటిళ్లు, రాళ్లు, కత్తులతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కొత్తూరు బస్టాప్ వద్ద ఆటోలో అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని గుర్తించి తమదైన శైలిలో విచారించగా మాధవ్ బిరదర్ను తామే హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి సెల్ఫోన్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి తల్లి మీనాబాయి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా మృతుడిపై రౌడీషీట్, నలుగురు నిందితులపై ఆయా పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. పాత కేసుల వివరాలను పరిశీలించి నిందితులపై పీడీయాక్ట్ నమోదు చేయడానికి పరిశీలిస్తామన్నారు. హత్యాకేసును ఒకే రోజులో ఛేదించిన కొత్తూరు సీఐ నర్సయ్య, ఇతర సిబ్బందిని డీసీపీ అభినందించారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ నర్సయ్య, ఎస్ఐలు గోపాలకృష్ణ, సత్యశీలరెడ్డి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దారి చూపిన న్యాయదేవత
జైలుకు వెళ్లిన నాన్న.. పిల్లలను వదిలేసిన అమ్మ కుషాయిగూడ: విధి ఆడిన వింత నాటకంలో ఆ చిన్నారులు అనాథలయ్యారు.. హత్యకేసులో తండ్రి జైలుకు వెళ్లగా.. తల్లి నిర్దయగా పిల్లలను వదిలి వెళ్లింది. దీంతో 40 రోజులుగా ఆ చిన్నారులు స్థానికులు ఇచ్చే ఆహారం తిని బతుకుతున్నారు. ఇలా ఎన్నాళ్లు? అని ఆలోచించిన ఓ న్యాయవాది సహకారంతో.. కోర్టు ఆదేశంతో చిన్నారుల బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీసుకుంది. సోమవారం కుషాయిగూడలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సత్తు రవీందర్, సిడబ్ల్యూసి మేడ్చల్ జిల్లా చైర్మన్ రాజారెడ్డితో కలిసి వెల్లడించారు. ● మల్లాపూర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే దంపతులకు ముగ్గురు సంతానం. కుమారుడు (13) కూతురు (9), చిన్న కూతురు (2). తండ్రి హత్య కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇక పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన తల్లి వారిని వదిలివెళ్లి అనాథలుగా మార్చింది. దీంతో అభం శుభం ఎరుగని ఆ పిల్లలు చుట్టు పక్కలవారు ఏమైన పెడితే తింటూ అర్థాకలితో గత 40 రోజులుగా కాలం గడుపుతున్నారు. ● ఇరుగు పొరుగువారు, ఇంటి యజమాని పిల్లల దుస్థితిని గోపాల్రెడ్డి అనే న్యాయవాది సాయంతో మేడ్చల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జిల్లా న్యాయమూర్తి పిల్లల బాగోగులు చూసుకోవాలంటూ మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్ రాజారెడ్డి ముగ్గురు పిల్లలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇద్దరిని హోంకు తరలించగా మరో చిన్నారి ఆరు సంవత్సరాల లోపు కావడంతో అమీర్పేట్లోని ప్రభుత్వ శిశువిహార్లో అప్పగించారు. ● ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురుదుష్టకరమని, అనాథలు, అభాగ్యులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసులను కానీ.. న్యాయసేవాధికార సంస్థలను కాని ఆశ్రయిస్తే తగిన న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్ స్పష్టం పేర్కొన్నారు. పిల్లల దీనస్థితిపై స్పందించి చేరదీసిన పెంటయ్య, శ్రీనివాస్, అనితలను అభినందించారు. 40 రోజులుగా చిన్నారుల అవస్థ అండగా నిలిచిన న్యాయ సేవాధికార సంస్థ పిల్లల బాధ్యతలు తీసుకున్న బాలల సంక్షేమ కమిటీ -
సరైన పరిహారం ఇవ్వాలి
● ఐటీ పార్క్ బాధిత రైతుల అభ్యర్థన ● కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం మహేశ్వరం: నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఐటీ పార్కు కోసం భూములు కోల్పోతున్న వారికి ఎకరానికి రూ.1.50 కోట్లు, 250 గజా ఇంటి స్థలం ఇవ్వాలని రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. మహేశ్వరం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిలో ఐటీ పార్కు కోసం సుమారు 196 ఎకరాల పట్టా, సీలింగ్ భూములను తీసుకుంటున్నారన్నారు. ఈ భూమికి ఇటీవల కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు ఎకరానికి కోటి పది లక్షల రూపాయల పరిహారం, 121 గజాల ప్లాట్ ఇస్తామని చెప్పారన్నారు. అయితే, తాము పట్టాదారుల నుంచి భూమిని కొనుగోలు చేశామని ఎకరాకురూ.1.50 కోట్ల పరిహారం, రామారావు చౌరస్తాలోని ప్రభుత్వ భూమిలో 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని ఒకేసారి అందజేయాలన్నారు. అంతకు ముందు కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అధికారులను కలిసిన వారిలో నాగిరెడ్డిపల్లి సర్పంచ్ కాట్రావత్ బామినినాయక్, ఉప సర్పంచ్ నడికూడ జగన్, మాజీ ఎంపీటీసీ నడికూడ రమేశ్, మాజీ ఉప సర్పంచ్ కాట్రావత్ దేవులానాయక్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు మిద్దె విద్యాకర్రెడ్డి, పాండునాయక్, శ్రీను, సిద్దులు తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
తుక్కుగూడ: జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్పంచుల సంఘాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివశంకర్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షురాలు మాధవిరాంరెడ్డి, ప్రధాన కార్య దర్శులుగా ఈ.రవి, పద్మకృష్ణ, ఉపాధ్యక్షులుగా గోపాల్రెడ్డి, రవీందర్రెడ్డి, గోపాల్, కార్యనిర్వాహక కార్యదర్శిగా శ్రీనుతో పాటు మరికొంత మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ చాంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ పాల్గొన్నారు. వాహనం ఢీకొని వ్యక్తి మృతి కొత్తూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామికవాడ రోడ్డుపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ గోపాలకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన హనుమంతు(44) కొంత కాలంగా తీగాపూర్ శివారులో ఉన్న ఓ పరిశ్రమలో పనిచేస్తూ క్వాటర్స్లో నివాసం ఉంటున్నాడు. కాగా శనివారం విధులకు వెళ్లకుండా పాత జాతీయ రహదారి కూడలి వద్దకు వచ్చి తిరుగు ప్రయాణంలో కాలినడకన వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతుడి ఆచూకీ తెలుసుకుని కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు. యువకుడి దారుణ హత్య నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు కొత్తూరు: గుర్తు తెలియని ఓ యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన కొత్తూరు పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని శివానగర్ కాలనీలోని ఖాళీ స్థలంలో ఓ యువకుడి మృతదేహం పడి ఉందనే స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్నట్లు తెలిపారు. కాగా ప్రాథమిక విచారణలో భాగంగా ఓ ప్యాసెంజర్ ఆటోలో ఐదుగురు యువకులు కలిసి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి మద్యం తాగి గొడవ పడ్డట్లు తెలిసిందన్నారు. గొడవలో భాగంగా ఒకరిని నలుగురు యువకులు రాయి, ఖాళీ మద్యం బాటిళ్లతో కొట్టి హత్యకు పాల్పడ్డట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియాకు తరలించినట్లు పేర్కొన్నారు. క్లూస్టీం, సాంకేతికత సహకారంతో త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. -
వడ్డెర్ల సంక్షేమానికి.. అన్ని రంగాల్లో వెనుకబడిన వడ్డెర్ల సంక్షేమా నికి కృషి చేయాలని వడ్డెర సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు కోరారు.
‘పల్లె’టూరుకు.. షాద్నగర్: పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారు కొందరు.. బంధువుల వద్దకు వెళ్లే వారు మరికొందరు.. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇంటికి వచ్చేవారు ఇంకొందరు.. సెలవులు కావడంతో సరదాగా టూర్లు వెళ్లే వారు మరికొందరు.. ఇలా అంతా ఒక్కసారిగా ప్రయాణం మొదలు పెట్టడంతో షాద్నగర్ పరిధిలోని రాయికల్ టోల్గేట్ వద్ద వేలాది వాహనాలు క్యూ కడుతున్నాయి. రహదారులపై రద్దీ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. రహదారులు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, అనంతపురం, కడప తదితర ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహబూబ్నగర్, గద్వాల వైపు వెళ్లే వారు 44వ జాతీయ రహదారి పై నుండి వెళ్తున్నారు. కొందరు హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు. దీంతో షాద్నగర్ పరిధిలో ఉన్న జడ్చర్ల ఎక్స్ప్రెస్వే టోల్ ప్లాజా వద్ద ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. నిమిషానికి 30 వాహనాలు షాద్నగర్ మీదుగా ఉన్న 44వ జాతీయ రహదారిపై పండగ సందర్భంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం సాయంత్రం నుంచి క్రమక్రమంగా సొంతూళ్లకు వెళ్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12 నుంయి ఆదివారం సాయంత్రం 5గంటల వరకు 30వేల వాహనాల టోల్ గేటు నుంచి వెళ్లాయి. అంటే నిమిషానికి సుమారు 30 వాహనాలు టోల్ గేట్ దాటినట్లు లెక్క. ఒక్కో వాహనంలో సుమారు నలుగురు ప్రయాణించినా 17 గంటల్లో 30వేల వాహనాల్లో లక్షా 20వేల మంది గమ్యస్థానాలకు చేరినట్లు అంచనా. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని టోల్గేట్ వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. 12 గేట్ల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ రుసుము చెల్లించేందుకు ప్రత్యేక గేటును ఏర్పాటు చేశారు. పండగ సందర్భంగా బస్సుల్లో వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో షాద్నగర్లోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అదనపు బస్సులు నడిపిస్తున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు పయనం రాయికల్ టోల్గేట్ వద్ద వాహనాల క్యూ కిటకిటలాడుతున్న బస్టాండ్లు -
పీఎస్లో సమాచారమివ్వాలి
సంక్రాతి పండుగకు ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజలు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. కుటుంబ సమేతంగా ఊరెళ్తుండడంతో చాలా రోజులు ఇళ్లకు తాళాలు వేసి ఉంటే చోరీలకు అవకాశం ఉంది. ముందస్తు సమాచారం ఇస్తే ప్రెటోలింగ్ సిబ్బందికి ప్రత్యేక నిఘా ఉంచుతారు. అనుమానితులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలి. – కాంతారెడ్డి, సీఐ, షాబాద్ విషయాన్ని షేర్ చేయొద్దు సంక్రాంతికి స్వగ్రామాలకు వెళుతున్న వారు పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు. ఊరెళ్లే ముందు ఇంటి ఆవరణలో ఉన్న లైట్లు వేసి వెళ్లాలి. డోరు తాళం వేసి కర్టన్ను వేయడం మర్చిపోవద్దు. తెలిసిన వారికి ఇంటిని గమనించమని చెప్పండి. – విజయ్కుమార్, సీఐ, షాద్నగర్ -
మాంజాతో మజాక్లొద్దు
షాబాద్: పతంగి ఎగురవేయడానికి వినియోగించే నిషేధిత చైనా మాంజా ప్రమాదకరంగా మారుతోంది. ఎగురవేసే వారి చేతి వేళ్లు తెగుతున్నాయి. పైగా రహదారులపై వెళ్తున్న వారి మెడకు బిగుసుకుపోవడంతో గొంతు దగ్గర గాయాలవుతున్నాయి. ఏటా రాష్ట్ర వ్యాప్తంగా మంజాతో గొంతు తెగి గాయాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ఇచ్చారు. పిల్లలు ఇప్పటి నుంచే పతంగి సంబురాలు మొదలు పెట్టారు. వాటిని ఎగరేస్తున్న సమయంలో బాలురు తమ భద్రతను మరుస్తున్నారు. సాధారణంగా పిల్లలకు ప్రమాదాలపై అవగాహన తక్కువ. ఎలా జాగ్రత్తగా ఉండాలనే విషయం తెలియక సంబురాల్లో మునిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనిపై షాబాద్ సీఐ కాంతారెడ్డి సూచనలు అందించారు. పతంగుల సందడి పతంగుల సందడి ప్రారంభమైంది. మార్కెట్లో దుకాణాలు సైతం వెలిశాయి. గాలిపటాలు అధునాతన డిజైన్లలో లభిస్తున్నాయి. దీంతో చిన్నారులు, యువకులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. గాలిపంటం సైజ్, నాణ్యతను బట్టి రూ.5 నుంచి రూ.25 వరకు అందుబాటులో ఉన్నాయి. రంగు కాగితాలతో చేసిన పతంగులను సైజ్ను బట్టి రూ.5 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ప్రత్యేకంగా క్లాత్తో తయారుచేసిన భారీ పతంగులను రూ.130 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే పతంగులను ఎగరేయడానికి ఉపయోగించే(ధారం) మాంజాలలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఇలా చేయాలి ● గాలిపటం ఎగరేయడానికి విశాల మైదానం ఎంపిక చేసుకోవాలి. ● పిల్లలంతా కలిసి గాలిపటం ఎగురవేస్తుంటే ఎవరైనా ఒకరు వారిని పర్యవేక్షించాలి. ● తక్కువ కఠినత్వం ఉన్న మాంజా లేదా ధారం ఉపయోగించినా చేతి వేళ్లకు బట్ట, గౌజ్లు వేసుకుంటే గాయం నుంచి తప్పించుకోవచ్చు. ● విద్యుత్ తీగలు, భవనాలు, వృక్షాలు.. ఇలా ఎతైన ప్రదేశాల్లో పడిన పతంగుల కోసం వెళ్లడం మానుకోవాలి. ● పతంగి ఎగురుతున్న సమయంలో ఎటూ చూసుకోకుండా పరుగెడుతూ గుంతలు, కాల్వల్లో పడకుండా, వాహనాల కారణంగా గాయపడకుండా వాటిని వదిలేయడం మంచిది. ● పెద్దవి ఫ్యాన్సీ రకం గాలిపటాలకు బదులు తేలికపాటివి వినియోగించేలా చూడాలి. పతంగి సంబురం.. కావొద్దు విషాదం పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పాలి గాలిపటాలు ఎగరేస్తున్న సమయంలో గమనించాలి జాగ్రత్తలు మరవొద్దు తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం కనిపెడుతూ ఉండాలి. భవనాలు, గోడలు, బాల్కనీల పైనుంచి గాలిపటాలు ఎగరేయొద్దు. గాలి వీచిన దిక్కు పతంగి ఎగురుతుంది. దానిపైనే శ్రద్ధ పెట్టి నడిస్తే పడిపోయే ప్రమాదం ఉంది. గల్లీలు, భారీ భవన సముదాయాలు, విద్యుత్ తీగలు, సెల్ఫోన్ టవర్ల సమీపంలో గాలి పటాలు ఎగరేసే సాహసం చేయొద్దు. పతంగి విద్యుత్ తీగలు, స్తంభాలు, వృక్షాలపై పడితే తీసుకునే ప్రయత్నం చేయొద్దు. గాలి పటాన్ని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదాలకు గురవుతున్నారు. -
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
చేవెళ్ల: రాబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని, పార్టీకోసం పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నగరంలోని ప్రగతి భవన్లో ఆదివారం చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లి వార్డుకు చెందిన బీజేపీ మాజీ సర్పంచ్ శ్యామలయ్య తన అనుచరులతో మాజీ మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి కేటీఆర్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. జిల్లాలో బలమైన నాయకురాలిగా సబితారెడ్డి మీకు అండగా ఉంటుందని చెప్పారు. సబితారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో పార్టీ నాయకులు ఐకమత్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు పి.కార్తీక్రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు. -
కురుమలు రాజకీయంగా ఎదగాలి
మీర్పేట: కురుమలు అన్ని వర్గాలను కలుపుకొని, రాజకీయంగా ఎదగాలని మాజీ ఎమ్మెల్సీ, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం అన్నారు. కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధాల దశరథ అధ్యక్షతన ఆదివారం మీర్పేటలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సంఘం భవన నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయించాలని త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడతానని అన్నారు. కొన్ని జిల్లాల్లో భవనాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో కురుమలు పోటీ చేసి కార్పొరేటర్లుగా విజయం సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానందం, ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, బాలాపూర్ మండల అధ్యక్షుడు ఇక్కె సత్యనారాయణ, మీర్పేట, జిల్లెలగూడ అధ్యక్షులు దేవరింటి వెంకటేశ్ కురుమ, సిద్ధాల జగదీష్ కురుమ, చినింగి బాలయ్య, నారి సత్యనారాయణ, అచ్చెన యాదగిరి కురుమ, మేకల ప్రశాంత్, ప్యాట నర్సింహ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం -
పండుగ పూట జరభద్రం
షాద్నగర్/షాబాద్: అసలే సంక్రాంతి పండుగ సెలవులు.. ప్రజలు ఇళ్లు విడిచి ఊరెళ్తే దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడే ప్రమాదం ఉంది. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అప్రమంతగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తే మేలు ఊరికి వెళ్తున్న వారు జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో ఉండటం లేదని చుట్టుపక్కల వారితోపాటు పోలీసులకు తెలియజేయాలి. కుటుంబ సభ్యులందరూ వెళ్తే విలువైన ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లాలి. బ్యాంకు లాకర్స్లో భద్రపర్చుకోవడం ఉత్తమం. ఇంట్లో ఎవరూ లేనప్పుడు విలువైన వస్తువులను బీరువాలో ఉంచవద్దు. ఎక్కువ మొత్తంలో నగదు లేకుండా చూసుకోవాలి. పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే రాత్రిపూట పెట్రోలింగ్ సమయంలో నిఘా ఉంచేందుకు ఆస్కారం ఉంటుంది. రాత్రిపూట గ్రామాలు, కాలనీల్లో అనుమానాస్పదంగా సంచరించే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలి. వృద్ధులు, చిన్న పిల్లలు రాత్రివేళలో ఇంట్లో ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాలి. ఇంటి బయట, హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. వాహనాలను రోడ్డుపై కాకుండా ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలి. ఇంటి తాళాలు రహస్య ప్రదేశంలో దాచిపెట్టాలి. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ సంక్రాంతి సెలవులకు ఊరెళ్తే అప్రమత్తతంగా ఉండాలని పోలీసుల సూచనలు -
వరి.. తగ్గుతోంది మరి!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వరి పంట సాగు జిల్లాలో భారీగా తగ్గింది. చెరువులు, కుంటలు, బోరు బావుల కింద యాసంగిలో 1.57 లక్షల ఎకరాలు సాగు అవుతుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ ఇప్పటి వరకు 32 వేల ఎకరాలకు మించలేదు. బోరుబావుల కింద మాత్రమే కాదు మూసీ పరీవాహక ప్రాంతాల్లోనూ సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. తగ్గిన సాగు విస్తీర్ణం జిల్లాలో 2,127 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటి కింద 71,115 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఇక బోరు బావులు, మూసీ, ఈసీ వాగులకు ఇరువైపులా మరికొంత సాగవుతోంది. 2022–23 వానాకాలంలో 4,28,479 ఎకరాల్లో పంట సాగవ్వగా, అదే యాసంగిలో 1.41,228 ఎకరాలు సాగైంది. 2023–24 యాసంగిలో 1,25,600 ఎకరాలు.. 2024 యాసంగిలో 1,39,754 ఎకరాల్లో పంట సాగైంది. ఇక 2025–26 యాసంగిలో 1.57 లక్షల ఎకరాలు సాగవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు 4,390.255 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచింది. అంచనాల మేర పంట సాగు లేకపోవడం విశేషం. నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షాలు పుష్కలంగా కురిశాయి. భూగర్భ జలాలు కూడా అనూహ్యంగా పెరిగాయి. సాగు విస్తీర్ణం పెరగక పోగా, మరింత తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఎరువుల పంపకం కోసం ప్రభుత్వం ఫెర్టియాప్ను అందుబాటులోకి తెచ్చింది. పంట సాగు చేసిన రైతులు యూరియా కోసం ఈ యాప్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 32 లక్షల ఎకరాలు మాత్రమే పంటసాగైనట్లు ఈ యాప్ ద్వారా తేలింది. కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లు.. ● ఐటీ అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో జిల్లాలోని భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ కారణంగా పంట భూములు వ్యవసాయేతర భూములుగా మారుతున్నాయి. ● నిన్నటి వరకు పచ్చని పంట పొలాలు, పండ్ల తోటలతో ఆహ్లాదంగా కనిపించిన భూములు ఎత్తయిన భవనాలతో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులుగా మారుతున్నాయి. ● కూలీల ఖర్చు పెరగడం, దిగుబడి తగ్గడం, చీడపీడల సమస్య వేధిస్తుండటంతో మెజార్టీ రైతులు సాగుకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు పండ్లు, పూలు, కాయగూరలు పండిన భూముల్లో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. ● ఇప్పటికే సరూర్నగర్, బాలాపూర్, హయత్నగర్, గండిపేట్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాలు పూర్తిగా పట్టణీకరణ జరిగిపోయాయి. ● అంతో ఇంతో పంటలు పండిన శంషాబాద్, మహేశ్వరం, అబ్దుల్లాపూర్మెట్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోనూ 80 శాతం పంట భూములు వ్యవసాయేతర భూములుగా మారాయి. కేవలం 20 శాతం భూముల్లోనే పంటలు సాగవుతున్నాయి. ● మంచాల, మాడ్గుల, ఆమనగల్లు, కేశంపేట, కొందుర్గు, షాబాద్, యాచారం మండలాల్లో మాత్రమే పంటలు సాగవుతున్నాయి. చేవెళ్ల, కొత్తూరు, నందిగామ, ఫరూఖ్నగర్, జిల్లెడు చౌదరిగూడ, మండలాల్లో 50 శాతం భూములు ఇప్పటికే వ్యవసాయానికి దూరమయ్యాయి. జిల్లాలో భారీగా పడిపోయిన సాగు అంచనాలు తలకిందులు 1.57 లక్షల ఎకరాలు అంచనా 32 వేల ఎకరాలకు మించని వైనం గణనీయంగా తగ్గిన విస్తీర్ణం పట్టా, అసైన్డ్ భూమి మొత్తం ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు. దీంతో పంటల సాగు పూర్తిగా తగ్గిపోయింది. రైతులు, వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఊరు విడిచి పట్నం వెళ్లి బతుకుతున్నాం. – బొక్కా శ్రీధర్రెడ్డి, రైతు, తాడిపర్తి, యాచారం మండలంకూలీల ఖర్చు పెరిగి పెట్టు బడి కూడా రావడం లేదు. మార్కెట్లో పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుల కంటే దళారులే ఎక్కువగా లాభం పొందుతున్నారు. గతంలో ఏడు ఎకరాల్లో పూలు, కూరగాయలు పండించే వాళ్లం. ఇప్పుడు మూడు ఎకరాల్లో వరి పంట మాత్రమే సాగు చేస్తున్నా. – నరేందర్, రైతు, చౌదరిగుడ, శంషాబాద్ -
నేడు మంత్రుల పర్యటన
చేవెళ్ల: నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో సోమవారం మంత్రుల పర్యటన ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లిలో కోట్లరూపాయల అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు జిల్లా నాయకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇటీవల గెలిచిన ఐదు మండలాల సర్పంచులకు చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో మంత్రుల చేత సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కందుకూరు: స్వామి వివేకానంద సేవారత్న పురస్కారం–2026 మండల పరిధిలోని కొత్తగూడ మాజీ సర్పంచ్ సాధ మల్లారెడ్డి అందుకున్నారు. స్వామి వివేకానంద 164వ జయంతిని పురస్కరించుకుని సమాజ సేవ, ప్రజా సేవలో విశిష్ట సేవలందిస్తున్నందుకు గాను ఆయనకు తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం (టీఐఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు చేతుల మీదుగా అవార్డు అందజేశారు. టీఐఎఫ్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ రాజనారాయణముదిరాజ్, మహ్మద్ అక్తర్అలీ, డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి, రవీందర్రెడ్డి, బీజేపీ జిల్లా నాయకుడు కొంతం జంగారెడ్డి తదితరులు మల్లారెడ్డిని అభినందించారు. ఇబ్రహీంపట్నం: దండుమైలారం గ్రామానికి చెందిన పోకల్కార్ కిషన్ప్రసాద్జీ హైదరాబాద్ సర్కిల్ ఉత్తమ పోస్ట్మాన్గా అవార్డు దక్కించుకున్నారు. రాష్ట్రంలో పోస్ట్మాన్గా ఉత్తమ సేవలందిస్తున్న 12 మందిని ఎంపిక చేశారు. అందులో వనస్థలిపురం పోస్టాఫీస్లో పోస్టుమాన్గా పనిచేసే దండుమైలారం గ్రామానికి చెందిన పి. కిషన్ప్రసాద్జీ ఎంపికయ్యారు. నగరంలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలంగాణ పోస్టు మాస్టర్ జనరల్ మేనేజర్ (పీఎంజీ) సుమిత్రఅయోధ్య, హైదరాబాద్ పోస్టల్ డిపార్టమెంట్ సీనియర్ సూపరింటెండెంట్ హేమలత చేతుల మీదుగా కిషన్ప్రసాద్ అవార్డు అందుకున్నారు. కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మను ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు యాదగిరిస్వామి, స్థానిక నాయకులు తులసీరాంనాయక్, సాయికుమార్ ఉన్నారు. మంచాల: ఉపాధ్యాయుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నట్టు తపస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఒడ్నాల రాజశేఖర్, తెల్కపల్లి పెంటయ్య అన్నారు. నగరంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తారి రాజిరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు జె.కరుణాకర్రెడ్డితో పాటు వివిధ మండలాలకు చెందిన సంఘం బాధ్యులు తపస్లో చేరారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకొని
కేశంపేట: బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వలస వచ్చిన కూలీ ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. బిహార్ రాష్ట్రంలోని బేర్కియాకు చెందిన గుడ్డు కుమార్యాదవ్(20) కేశంపేట గ్రామంలోని రాఘవేందర్ వద్ద రెండు నెలల పనులకు చేరాడు. అయితే ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడిన కుమార్యాదవ్ కూలీ డబ్బులను పోగొట్టుకునేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 6న పని చేసే ప్రదేశం నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆదివారం కేశంపేట గ్రామ శివారులోని వాగు సమీపంలో చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలను సేకరించారు. చెట్టుకు ఉరివేసుకున్న వ్యక్తి కుమార్యాదవ్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజ్కుమార్ తెలిపారు. వలస కూలీ ఆత్మహత్య


