బీఆర్‌ఎస్‌కు ఆదరణ | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు ఆదరణ

Feb 7 2026 3:00 PM | Updated on Feb 7 2026 3:00 PM

బీఆర్‌ఎస్‌కు ఆదరణ

బీఆర్‌ఎస్‌కు ఆదరణ

మాజీ మంత్రి, మహేశ్వరం

ఎమ్మెల్యే సబితారెడ్డి

చేవెళ్ల: ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ పాలనే కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితారెడ్డి అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని దామరగిద్ద 9,10, చేవెళ్లలోని 12,14,15,16, 17, 18 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి రెండేళ్లలో ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని గుర్తించాలన్నారు. ప్రజల్లో బీఆర్‌ఎస్‌కి మంచి ఆదరణ, అభిమానం కనిపిస్తున్నాయని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, ప్రభాకర్‌, పార్టీ నాయకులు, కౌన్సిలర్‌ అభ్యర్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement