Visakhapatnam
-
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విశాఖ,సాక్షి : విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురిని అధికారులు గుర్తించారు. యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు.సింహాచలం ఘటనపై వీహెచ్పీ ఆగ్రహం👉సింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు👉నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగింది👉సింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోంది👉ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త👉భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపని👉హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి👉పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోంది👉చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదుతిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే సింహాచలంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నాం. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగింది వరుదు కల్యాణి అన్నారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతివిశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి
విశాఖ: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా కురిసిన వానకు గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది. -
భక్తుల సౌకర్యార్థం జీవీఎంసీ ఏర్పాట్లు
డాబాగార్డెన్స్: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా జీవీఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. నగర మేయర్ పీలా శ్రీనివాస్ మంగళశారం అధికారులతో కలిసి కొండపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుధ్యం, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు. లక్షలాది మంది భక్తుల కోసం మంగళ, బుధ, గురువారాల్లో ఆరు షిఫ్టుల్లో 1,350 మంది పారిశుధ్య కార్మికులు సేవలు అందిస్తున్నట్లు మేయర్ తెలిపారు. దేవస్థానం పరిసర ప్రాంతాలన్నింటిలో పారిశుధ్య పనులు జరుగుతున్నాయని, శానిటరీ అధికారులు వీటిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. భక్తుల తాగునీటి కోసం 193 పాయింట్లలో వాటర్ క్యాన్లు, వాటర్ బాటిల్స్ సిద్ధం చేశామన్నారు. ఎండల దృష్ట్యా అదనంగా ఆరు నీటి ట్యాంకర్లను సిద్ధంగా ఉంచామని, తాగునీటి సరఫరాను పర్యవేక్షించడానికి సిబ్బందిని నియమించామన్నారు. 21 ప్రాంతాల్లో 401 తాత్కాలిక మరుగుదొడ్లు, ఐదు మొబైల్ టాయిలెట్లు, చెత్త సేకరణకు డంపర్, కంపాక్టర్ బిన్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ శివప్రసాద్రాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ పరిశీలకుడిగా కదిరి బాబూరావు
ఏయూక్యాంపస్: వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలిగా మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, అరకు పార్లమెంట్ పరిశీలకుడిగా బొడ్డేడ ప్రసాద్ నియమితులయ్యారు. వీరు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లకు అనుసంధానంగా పనిచేస్తారు. అలాగే అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
అధికార పార్టీ నేతలకే అంతరాలయ దర్శనం!
సామాన్య భక్తులకు అల్లంతదూరం● రూ.1,000 టికెట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితీ అంతే.. ● రూ.1,500 టికెట్లన్నీ కూటమి పార్టీల నేతలకే.. ● టికెట్ల జారీలో దేవాలయ ఈవోకి దక్కని స్థానం ● కలెక్టరేట్, అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే వ్యవహారం డమ్మీగా మారిన ఈవో..! ప్రస్తుత సింహాచలం దేవస్థానం ఈవో సెలవులో ఉండడంతో ఇన్చార్జిగా ఈవోగా కె.సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. అయితే, సదరు దేవాలయ ఈవోను చందనోత్సవ వ్యవహరాల్లో నామమాత్రం చేశారనే విమర్శలున్నాయి. పాసుల జారీలో కానీ.. నిర్ణయాల్లో కానీ దేవాలయ ఈవోను డమ్మీ చేశారనే ఆరోపణలున్నాయి. పెత్తనమంతా రెవెన్యూ యంత్రాంగానిదే ఉంటోందని దేవదాయ అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. దేవాలయంలో నిరంతరంగా సేవలందించే వ్యక్తులు, సంస్థలతో పాటు ఎన్జీవోలకు కూడా టికెట్లను మంజూరు చేయాలంటే కలెక్టరేట్ నుంచి ఆదేశాలు రావాల్సిందేనని దేవాలయ అధికారులు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. కనీసం వీరికి కూడా పాసులు ఇచ్చేందుకు తమ చేతుల్లో ఏమీ లేదని దేవాలయ అధికారులు పేర్కొంటున్నట్టు సమాచారం. కలెక్టరేట్కు వెళితే కనీసం ఎవరూ తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇన్చార్జిగా ఉన్న ఈవో మరో వారం, పది రోజుల్లో వెళ్లిపోయే భావనలో ఉండటంతో.. ఆయన్ని పూర్తిగా విస్మరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా దేవాలయ అధికారులను, సిబ్బందిని నామమాత్రం చేసి అంతా కలెక్టరేట్ నుంచి, అధికార పార్టీ నేతల నుంచి వచ్చే ఆదేశాలే అమలవుతున్నాయనే విమర్శలు సింహాచలం కొండల చుట్టూ ప్రతిధ్వనిస్తుండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాధారణ భక్తులకే అప్పన్న చందనోత్సవంలో పెద్ద పీట వేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన జిల్లా యంత్రాంగం.. కేవలం వీఐపీ భక్తుల సేవలోనే తరిస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించేందుకు సిద్ధమైంది. సాధారణ భక్తులు, ఆన్లైన్లో రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసిన వారికి మాత్రం అంతరాలయ దర్శనం లభించడం లేదు. కేవలం సిఫార్సులకే పెద్ద పీట వేయడం, సాధారణ భక్తులకు అంతరాలయ దర్శనం లేకపోవడం వంటి వ్యవహారాలన్నీ.. దేవాలయ ఇన్చార్జి ఈవోని డమ్మీని చేసి కలెక్టరేట్ నుంచి నడిచాయని విమర్శలు వినిపిస్తున్నాయి. టికెట్ల జారీలో కానీ, ఏర్పాట్లలో కానీ ఈవోతో సంబంధం లేకుండా వ్యవహారాలు సాగాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మొత్తంగా ఎన్నడూ లేని విధంగా వీఐపీ భక్తులకే అంతరాలయం ద్వారా నిజరూప అప్పన్న దర్శనం లభించనుండగా.. సాధారణ భక్తులు మాత్రం దూరం నుంచే హడావుడిగా దర్శనం చేసుకుని ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది. సిఫార్సులకే పెద్ద పీట ఏడాదిలో ఒక్కరోజే లభించే అప్పన్న నిజరూప దర్శనం కోసం ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈసారి 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. అయితే టికెట్లు మాత్రం సాధారణ భక్తులకు అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలున్నాయి. ఆన్లైన్ టికెట్లను కూడా ముందుగానే అధికార పార్టీ నేతలకు అప్పగించారనే ఆరోపణలున్నాయి. ఇక వీఐపీ టికెట్లతో పాటు రూ.2,500, రూ.1,500, రూ.1000 టికెట్ల జారీలోనూ కేవలం అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్ద పీట వేశారనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతలు కోరినన్ని టికెట్లు జారీ చేసిన జిల్లా యంత్రాంగం.. దేవాలయంలో నిరంతరంగా సేవలందించే వ్యక్తులు, సంస్థలు పది టికెట్లు అడిగితే కేవలం ఒకటి మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించారు. తీరా ఈ టికెట్లను తీసుకునేందుకు సదరు బ్యాంకు వద్దకు వెళితే.. తమకు ఇంకా దేవస్థానం నుంచి లేఖ రాలేదనే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో దేవస్థాన అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించిన వ్యక్తులు, సంస్థలకు కూడా కనీస గౌరవ లేకుండా చేశారని వాపోతున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారుల వ్యవహారం ఉందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
సింహాచలం: చందనోత్సవం ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ హరేందిర ప్రసాద్ పరిశీలించారు. డ్రై రన్ నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొండదిగువ కొత్త ఘాట్రోడ్డు, న్యూ గోశాలరోడ్డు, పాత గోశాల రోడ్డులో ఏర్పాట్లను పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొండదిగువ హోల్డింగ్ పాయింట్లలో వేచి ఉండేందుకు అనువుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి కొండైపెకి వెళ్లి క్యూలు, బారికేడ్లు, తాగునీరు, వైద్యశిబిరాలు, బయో మరుగుదొడ్లు ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జేసి మయూర్ అశోక్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవొ కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సింహగిరిపైన, కొండదిగువన, తొలిపావంచా వద్ద, గోశాల జంక్షన్, అడవివరం జంక్షన్, ఇతర ప్రాంతాల వద్ద భద్రతా ఏర్పాట్లను సీపీ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతాలు, సైన్ బోర్డులు, క్యూలు ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. -
క్రికెట్ బెట్టింగ్కి యువకుడి బలి
సీతమ్మధార: క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 24వ వార్డు గాంధీనగర్కు చెందిన చెక్కల పవన్ (25) ఎంవీపీ కాలనీలోని ఓ లాడ్జిలో పనిచేస్తున్నాడు. అతనికి క్రికెట్ బెట్టింగ్ అలవాటు ఉంది. ఐపీఎల్లో బెట్టింగ్ ఆడేందుకు గతంలో లాడ్జి యజమాని వద్ద రూ.30 వేలు తీసుకుని పోగొట్టుకున్నాడు. ఇటీవల అతని వద్ద మళ్లీ రూ.20 వేలు తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని కూడా కోల్పోయాడు. ఈ కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. మంగళవారం సాయంత్రం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే పవన్ ఓ యువతితో ప్రేమ విఫలమైనట్లు కూడా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
జూలో వన్యప్రాణుల ఆరోగ్యంపై దృష్టి
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కును మంగళవారం జూ ఆరోగ్య కమిటీ సందర్శించింది. జూ క్యూరేటర్ జి.మంగమ్మ, అసిస్టెంట్ క్యూరేటర్లతో కలిసి కమిటీ సభ్యులు హైదరాబాద్లో నెహ్రూ జూ పార్కు విశ్రాంతి వైద్యుడు ఎం.నవీన్ కుమార్, ఆర్ఏడీడీఎల్(పశు సంవర్ధక శాఖ) డీడీ డాక్టర్ పి.మోహిని కుమారి, వీపీసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.మహేష్ తదితరులు జూలో వన్యప్రాణులు, వాటి ఎన్క్లోజర్లను పరిశీలించారు. ఇక్కడ జంతువులు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అనంతరం జూ క్యూరేటర్ చాంబర్లో సమావేశం నిర్వహించారు. జంతువుల సంరక్షణ, వాటి సంక్షేమం, వాటికి అందించాల్సిన పోషక విలువలతో కూడిన ఆహారం గురించి చర్చించారు. ప్రస్తుతం వేసవి ఎండలు తీవ్రతను బట్టి చేపట్టదలచిన నిర్వహణ చర్యలు, వాటికి అందించాల్సిన వైద్య సేవల గురించి చర్చించారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న 19 ఏళ్ల చిరుత(హర్ష)కు అందించాల్సిన వైద్యం గురించి ప్రత్యేక దృష్టిపెట్టాలని జూ వైద్య సిబ్బందికి సూచించారు. జూలో మార్మోసెట్ కోతులు, స్కివరెల్ కోతులు, మీర్కాట్, జిరాఫీ, రాయల్ బెంగాల్ టైగర్స్, తెల్ల పులులు, సింహాలు, హైనాలు, స్లాత్ బేర్, వాటర్ మానిటర్ బల్లులు, ఆఫ్రికన్ చిలుకలు సంతానోత్పత్తికి సంబంధించిన పలు సూచనలు, సలహాలు చేశారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సబ్బవరం: మండలంలోని గొర్లివానిపాలెం జక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు సత్యవరపు శ్రీనివాసరావు(53) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. శ్రీనివాసరావు సబ్బవరం హైస్కూల్ సమీపంలో జనరల్ స్టోర్ నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం తన స్కూటీపై గోడివాడ వెళ్తుండగా, గొర్లివానిపాలెం సమీపంలో సబ్బవరం నుంచి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. బస్ టైర్ కింద ఇరుక్కుపోయి, సంఘటనా స్థలిలోనే మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దివ్య తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్ను సీజ్ చేసి, మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించామన్నారు. -
ఉర్సా కంపెనీకి భూ కేటాయింపు రద్దు చేయాలి
ఆరిలోవ: ఉర్సా కంపెనీకి కూటమి ప్రభుత్వం చేసిన భూ కేటాయింపుల్ని వెంటనే రద్దు చేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్ డిమాండ్ చేశారు. ఉర్సా కంపెనీకి కూటమి ప్రభుత్వం ఎకరా 99 పైసలు చొప్పున 59.6 ఎకరాలు భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం మద్దిలపాలెం జోన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఆ భూ కేటాయింపు రద్దు చేయాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దారు రాజేష్కు వినతి పత్రం అందించారు. అనంతరం కుమార్ మీడియాతో మాట్లాడుతూ..ఉర్సా అనేది కూటమి నాయకులకు బినామీ కంపెనీ అని తెలిపారు. విశాఖలో ఉన్న నిరు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి భూములు లేవని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఇలాంటి బోగస్ కంపెనీకి కాపులుప్పాడ ప్రాంతంలో రూ.వేల కోట్లు విలువచేసే 59.6 ఎకరాల భూమి కేటాయించడం ఆక్షేపణీయమన్నారు. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి.కృష్ణారావు, నాయకులు డి.అప్పలరాజు, వి.నరేంద్రకుమార్, పి.శంకరరావు, కె.కుమారి, నాయుడు, రాజ్కుమార్, లక్ష్మి, రమణ పాల్గొన్నారు. -
అపురూప సౌందర్యం.. అపార నిర్లక్ష్యం
కనుమరుగవుతున్న పర్యాటక వైభవంసౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం పర్యాటకులకు నిరాశ మిగుల్చుతున్న ఎర్రమట్టి దిబ్బలు భీమునిపట్నం: విశాఖకు సమీపంలో.. భీమిలి బీచ్ రోడ్డులో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు భారతదేశంలోనే ఓ విశిష్టమైన సహజ నిర్మాణం. ఇవి సుమారు 4 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. ఈ అరుదైన భౌగోళిక ప్రదేశం పర్యాటకులను ఆకర్షిస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో వాటి అందాలను ఆస్వాదించే అవకాశం లేకపోవడం విచారకరం. సముద్ర మట్టం అనేకసార్లు పెరిగి, తగ్గడం వల్ల తీరం ఇసుక, బంకమట్టితో కప్పబడింది. వాతావరణ మార్పుల ప్రభావంతో ఇసుక ఎండకు గట్టిపడి దిబ్బలుగా మారింది. ఆ తర్వాత గాలి, నీటి కోత వల్ల ప్రస్తుత రూపాన్ని సంతరించుకుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఎర్రటి మట్టితో నిండి ఉండటం వల్ల వీటికి ఎర్రమట్టి దిబ్బలు అనే పేరు వచ్చింది. సుమారు 10 నుంచి 20 అడుగుల ఎత్తుతో.. దిబ్బల మధ్య నడవడానికి వీలుగా దారితో ఇవి విస్తరించి ఉన్నాయి. పాండిచ్చేరి, ముంబయి సమీపంలోని ఇలాంటి నిర్మాణాలు ఉన్నా.. అవి కేవలం ఐదు అడుగుల ఎత్తుకే పరిమితం. ఇంతటి ఎత్తైన, విస్తారమైన ఎర్రమట్టి దిబ్బలు దేశంలో ఇక్కడ మాత్రమే ఉండటం విశేషం. ఈ దిబ్బల ప్రత్యేకత కారణంగా రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు నిత్యం వస్తుంటారు. అంతేకాకుండా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలకు చెందిన ఎన్నో చిత్రాల షూటింగ్లు ఇక్కడ జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. శిథిలావస్థలో సౌకర్యాలు గతంలో సందర్శకుల కోసం దిబ్బలకు వెళ్లే మార్గంలో కొన్ని వ్యూ పాయింట్లు, సేద తీరడానికి గుడిసెలు వంటివి ఏర్పాటు చేశారు. కనీసం వీటి వద్దనైనా పర్యాటకులు కాసేపు గడిపేవారు. అలాగే ఈ దిబ్బల ప్రాముఖ్యతను, చరిత్రను తెలిపే ఓ పెద్ద సమాచార బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయితే కాలక్రమేణా ఈ వ్యూ పాయింట్లు, గుడిసెలు పూర్తిగా పాడైపోయి నిరుపయోగంగా మారాయి. సమాచార బోర్డు కూడా కనుమరుగైపోయింది. ఒకప్పుడు దిబ్బలలోకి వెళ్లే ముందు భాగం విశాలంగా ఉండటంతో పర్యాటకులు అక్కడే ఫొటోలు, వీడియోలు తీసుకుని ఆనందించేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రదేశమంతా తుప్పలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి.. కేవలం ఇరుకై న కాలిబాట మాత్రమే మిగిలింది. దీనికి తోడు పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించే వారి వల్ల పగిలిన సీసాలు, ఇతర చెత్త పేరుకుపోయి పర్యావరణం దెబ్బతింటోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి.. ఎర్రమట్టి దిబ్బల పూర్తి అందాలను ఆస్వాదించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. నిరాశతో వెనక్కి వచ్చేశాం పలు సినిమాల్లో ఎర్రమట్టి దిబ్బలను చూశాను. ఎంతో అద్భుతంగా కనిపించాయి. వా టిని నేరుగా చూడాలన్న ఆశతో కుటుంబం సహా ఇక్కడకు వచ్చాను. కానీ లోపల వరకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది. కొద్ది దూరం వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చేశాం. ఎర్రమట్టి దిబ్బల పర్యటన నిరాశ కలిగించింది. –బి.వేణుగోపాల్, బెంగళూరు నిర్లక్ష్యం చేయవద్దు ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని సందర్శించడంలో పర్యాటకు లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని చెప్పిన అధికారు లు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఇంతటి సహజ సంపదను, పర్యాటక ఆకర్షణను అభివృద్ధి చేసే అవకాశాన్ని వదులుకోవద్దు. –కె.చంద్రశేఖర్, హైదరాబాద్ సౌకర్యాలు కల్పించాలి సందర్శకులు లోపలకు వెళ్లి రావడానికి వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు, రెస్టారెంట్లు తదితర సౌకర్యాలు కల్పించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ మేరకు ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలి. – వేదుల సాయిరాం, చిత్తూరు పర్యాటకుల నిరాశ ఎంతో ఆసక్తితో ఎర్రమట్టి దిబ్బలను చూడటానికి వచ్చే పర్యాటకులకు నిరాశే ఎదురవుతోంది. బీచ్రోడ్డును ఆనుకుని ఉన్న ఈ దిబ్బల అందాలను పూర్తిగా చూడాలంటే.. లోపలికి సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కానీ తీవ్రమైన ఎండ వేడి, కాలుతున్న ఇసుకలో అంత దూరం నడవడం కష్టతరంగా మారుతోంది. దీంతో చాలా మంది సందర్శకులు కొద్ది దూరం మాత్రమే వెళ్లి.. అలసిపోయి వెనుదిరుగుతున్నారు. పర్యాటకుల ఇబ్బందులను పరిష్కరించేందుకు గత ప్రభుత్వాలు కొన్ని ప్రకటనలు చేశాయి. సుమారు 15 ఏళ్ల కిందట నాటి పర్యాటక శాఖ ‘డిజర్ట్ విలేజ్’ పేరుతో ఒంటెల సఫారీ, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో శాండ్ స్కూటర్లు లేదా ఇతర వాహనాల ద్వారా సందర్శకులను లోపలికి తీసుకువెళ్లాలని భావించారు. కానీ ఈ ప్రణాళికలేవీ కార్యరూపం దాల్చలేదు. -
వేటకు వెళ్లిన మత్స్యకారుడి మృతి
తగరపువలస: భీమిలి పట్టణ నదీ సాగర సంగమ తీరంలో చేపల వేటకు వెళ్లిన బోయవీధికి చెందిన మత్స్యకారుడు చింతపల్లి తాతారావు(65) ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందాడు. ప్రతిరోజూ భీమిలి జోనల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో వేటకు వెళ్లడం అతనికి అలవాటు. అందులో భాగంగానే సోమవారం సాయంత్రం 4.30 సమయంలో వేటకు వెళ్లాడు. అయితే అలల తాకిడికి అతను మునిగి చనిపోయినట్టు భావిస్తున్నారు. అతని మృతదేహం మంగళవారం ఉదయం భీమిలి మండలం అన్నవరం పంచాయతీ ఎర్రయ్యపాలెం తీరానికి చేరింది. తాతారావుకు భార్య పైడమ్మ, కుమారులు పోలిరాజు, అప్పన్న, నూకరాజు, కుమార్తె నందిని ఉన్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాతారావు మృతితో బోయవీధిలో విషాదచాయలు అలముకున్నాయి. -
ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల జోనల్ కమిటీ ఎన్నిక
ఎంవీపీకాలనీ: ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల జోనల్ కమిటీ ఎన్నిక ఎంవీపీ కాలనీ మెడికవర్ హాస్పటల్లోగా జరిగింది. మంగళవారం జరిగిన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు అనంతరం సభ్యులు ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా జోనల్ కమిటీ అధ్యక్షుడిగా జంగం జోషి, ప్రధాన కార్యదర్శిగా గెద్ద చిరంజీవి, ఉపాధ్యక్షులుగా అల్లాడ త్రినాథరావు, ఏలేటి రోజా, ఎస్.శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శలుగా శ్రీనివాసరావు, సూర్యకళ, నారాయణరావు, కోశాధికారిగా పి.కనకారావు ఎన్నికయ్యారు. దీంతోపాటు ఈసీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 150 మంది గ్రామీణ వైద్యులు పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు, సీనియర్, విశ్రాంత వైద్యులు పాల్గొన్నారు. -
‘ఓమ్ని’లో పిల్లల క్యాన్సర్ విభాగం ప్రారంభం
బీచ్రోడ్డు: ఇటీవల కాలంలో పిల్లల్లో క్యాన్సర్ పెరుగుతోందని ప్రముఖ పీడియాట్రిక్ వైద్యుడు రాధాకృష్ణ తెలిపారు. ప్రముఖ క్యాన్సర్ కేర్ నెట్వర్క్ సయాన్ క్యాన్సర్ క్లినిక్స్, ఓమ్ని హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆస్పత్రిలో అత్యాధునిక పిల్లల క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోందని, మనదేశంలో కూడా ఈ సంఖ్య ఆందోళనకర రీతిలో ఉందన్నారు. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ, త్వరగా చికిత్స తీసుకోవడం ద్వారానే క్యాన్సర్ నుంచి వారిని కాపాడుకోగలమన్నారు. సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శశి సుంకర్ మాట్లాడుతూ క్రిటికల్ కేర్ నుంచి క్యాన్సర్ చికిత్స వరకు పిల్లల కోసం అవసరమైన అన్ని సేవలు ఇప్పుడు ఓమ్నిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేకించి పిల్లల కోసం రూపొందించిన మల్టీ–డిసిప్లినరీ క్యాన్సర్ చికిత్స కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. క్యాన్సర్ చికిత్సతో పాటు మానసిక ఆరోగ్యం, పోషకాహారం, జన్యు సలహా తదితర సమగ్ర సేవలు అందిస్తామన్నారు. సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ ప్రతినిధులు డాక్టర్ భారతీదేవి, డాక్టర్ రాఘవేంద్ర నాయక్, డాక్టర్ వెంకట సుష్మ, డాక్టర్ గౌరి నాయుడు, డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, సుభాష్, ఓమ్ని ఆర్కే వైద్య నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు పాలిసెట్
● 33 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ● జిల్లాలో హాజరుకానున్న 13,157 మంది విద్యార్థులుమురళీనగర్: జిల్లాలో బుధవారం జరిగే పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 33 కేంద్రాల్లో 13,157 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్, పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్, భీమిలి మహిళా పాలిటెక్నిక్ కాలేజీలను కో–ఆర్డినేటింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. విశాఖ కేంద్రం పరిధిలో 22, పెందుర్తి పరిధిలో 5, భీమిలి పరిధిలో 6 కేంద్రాలు ఉన్నాయి. విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ కో–ఆర్డినేటింగ్ ఆఫీసరుగా కె.నారాయణరావు, పెందుర్తి కోఆర్డినేటర్గా ప్రిన్సిపాల్ ఎన్.చంద్రశేఖర్, భీమిలి కోఆర్డినేటర్గా ప్రిన్సిపాల్ జి.మురళీకృష్ణ వ్యవహరిస్తారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల కోసం తాగునీరు, వైద్య సౌకర్యాలు, ఫ్యాన్లు వంటి కనీస ఏర్పాట్లు చేశారు. నిరంతర వి ద్యుత్ సరఫరా, అవసరమైతే బస్సు సౌకర్యం కోసం సంబంధిత శాఖలకు సమాచారం అందించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు విద్యార్థులు ఉదయం 9.30 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు హాల్టికెట్తో పాటు బ్లూ/బ్లాక్ బాల్పాయింట్ పెన్, రబ్బరు, పెన్సిల్, షార్ప్నర్ మాత్రమే తీసుకురావాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, కాలిక్యులేటర్లు వంటివి పూర్తిగా నిషేధం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హాల్టికెట్ రాని వారు సంబంధిత కో–ఆర్డినేటింగ్ కేంద్రాన్ని సంప్రదించాలని డాక్టర్ కె.నారాయణరావు సూచించారు. జిల్లా పరిశీలకుడు, టెక్నికల ఎడ్యుకేషన్ అకడమిక్ డిప్యూటీ డైరెక్టర్ కె.విజయభాస్కర్, విశాఖ కోఆర్డినేటింగ్ సెంటర్ పరిశీలకుడు జి.దామోదరరావు మంగళవారం ఎన్ఏడీ భాష్యం, ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా మహిళా డిగ్రీ కాలేజీ, వీఎంఆర్డీఏ పార్కు గాయత్రి విద్యాపరిషత్–ఎంఎల్బీటీ పాఠశాల తదితర కేంద్రాలను పరిశీలించారు. ఆయా కేంద్రాల ఇన్విజిలేటర్లకు పలు సూచనలిచ్చారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఉన్నందున దూర ప్రాంతాల విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. -
అదే అర్జీ మళ్లీ వస్తే.. అధికారులదే బాధ్యత
బీచ్రోడ్డు: ప్రజల నుంచి అందే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, అవి పునరావృతం కాకుండా శాశ్వతమైన, నాణ్యమైన పరిష్కారాలు చూపాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పూర్తిస్థాయి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చా రు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి, ఫిర్యాదుదారు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలన్నారు. ఒక అర్జీని పరిష్కరించామని నివేదించే ముందు సంబంధిత అధికారి తప్పనిసరిగా అర్జీదారుడితో మాట్లాడాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, జీవీఎంసీ శాఖలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నందున.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆదేశించారు. అధికారులు తమ శాఖల్లో ప్రతి రోజూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార పురోగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు. ఒకే సమస్యపై అర్జీ మళ్లీ వస్తే సంబంధిత జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. పరిష్కరించిన అర్జీలపై లబ్ధిదారుల స్పందన సేకరించి, మొబైల్ యాప్లో నమోదు చేయాలని, ‘ఎన్రోల్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ హౌస్హోల్డ్ సర్వే’కు సంబంధించిన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. 252 అర్జీల స్వీకరణ సోమవారం జరిగిన ప్రజావేదికకు మొత్తం 252 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 122, జీవీఎంసీ 57, పోలీసు శాఖ 11, ఇతర విభాగాలకు చెందిన 62 వినతులు ఉన్నాయి. కలెక్టర్తో పాటు డీఆర్వో భవానీశంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాథూర్, జీవీఎంసీ సిటీ ప్లానింగ్ అధికారి ధనుంజయరెడ్డి తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. మత్స్యకార భృతి రాలేదు నా భర్త 25 ఏళ్లుగా చేపల వేట చేస్తూ కుటుంబాన్ని పోషిస్తు న్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అందించిన వేట నిషేధ భృతి నా భర్తకు రాలేదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏటా చేపల వేట నిషేధ కాలంలో ప్రభుత్వ సాయం అందేది. ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు రాలేదు. దీనిపై విచారించి, భృతి అందేలా చూడాలి. – కె.కొర్లమ్మ, ఏగువ పేట, భీమిలి సర్టిఫికెట్ ఇప్పించండి నాకు 2023లో వెన్నుపూస ఆపరేషన్ జరిగింది. అయినా ఇంకా నడవలేకపోతున్నాను. మూత్ర విసర్జన, మాల విసర్జన కూడా సరిగ్గా అవ్వడం లేదు. దీంతో కేజీహెచ్ వైద్యులను సంప్రదించగా.. శస్త్రచికిత్స ఆలస్యం కావడమే ఇందుకు కారణమని చెప్పారు. అయితే ఆ విషయాన్ని సర్టిఫై చేసి ఓ లేఖపై రాసి ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదు. శస్త్రచికిత్స జరిగినట్లు సర్టిఫికెట్ ఇప్పించగలరు. – కె.రమణ, వేములవలస, ఆనందపురం కలెక్టర్ హరేందిర ప్రసాద్ స్పష్టీకరణ -
పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వండి!
● కొత్త మేయర్ కొంగొత్త కోరికలు ● ఆనవాయితీ లేదన్న కార్పొరేషన్ అధికారులు ● పోలీస్ కమిషనర్తో మాట్లాడుకోవాలని సూచన సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కూర్చున్న తొలి రోజే.. కొత్త మేయర్ పీలా శ్రీనివాసరావు కొంగొత్త కోరికల చిట్టా తెరమీదకు వచ్చినట్టు తెలుస్తోంది. తనకు నగర ప్రథమ పౌరుడి హోదాలో 2 ప్లస్ 2 గన్మెన్లను కేటాయించాలని జీవీఎంసీ ఉన్నతాధికారులను అడిగినట్టు సమాచారం. అయితే జీవీఎంసీ కౌన్సిల్ బుక్ను అమాంతం తిరగేసిన అధికారులు కాస్తా... అటువంటి సౌకర్యం లేదని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏదైనా ప్రాణాపాయం ఉంటే నేరుగా పోలీస్ కమిషనర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే ఇందుకయ్యే వ్యయాన్ని కూడా జీవీఎంసీ నిధుల నుంచి ఇవ్వలేమని కూడా కుండబద్దలు కొట్టినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నేప థ్యంలో తన కోరికను నెరవేర్చుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారనేది చూడాల్సి ఉంది. కూటమి గెలిచినప్పటి నుంచీ..! వాస్తవానికి సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కాబోయే మేయర్ తానేనంటూ పీలా శ్రీనివాసరావు ప్రచారం చేసుకున్నారు. అనధికారికంగా అధికారులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. స్టాండింగ్ కమిటీలతో సంబంధం లేకపోయినప్పటికీ సమావేశంలో ఏయే అంశాలను అంగీకరించాలి? వేటిని వ్యతిరేకించాలనే విషయంలోనూ జోక్యం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో స్టాండింగ్ కమిటీ సభ్యులే పార్టీలోని పెద్దలకు ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి పిలుపురావడం.. క్లాస్ పీకడం కూడా జరిగిందని సొంత పార్టీ నేతలే అప్పట్లో పేర్కొన్నారు. అయినప్పటికీ పెద్దగా మార్పురాలేదని, ఆయన తరుపున మరో ఇద్దరు వ్యక్తులు మొత్తం వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్నారని సొంత పార్టీ కార్పొరేటర్లే విమర్శలు గుప్పిస్తున్నారు. అన్ని కాంట్రాక్టు వ్యవహారాలతో పాటు ప్రాజెక్టుల విషయంలోనూ ఇద్దరు శ్రీనులు జోక్యం చేసుకుంటూ కలెక్షన్ కింగులుగా మారారనే ఆరోపలున్నాయి. ఇప్పుడు ఏకంగా మేయర్ పీఠంపై కూర్చోవడంతో తమకు ఎదురులేదనే రీతిలో వ్యవహరించే ప్రమాదం ఉందని కూటమి నేతలే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. అంతా ఆ ఇద్దరి హవానే...! సాధారణ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాగానే... మేయర్ పీఠాన్ని అధిష్టించాలని తన కోరికను ఆయన అధిష్టానం ముందు ఉంచారు. అయితే, నిబంధనల మేరకు నాలుగేళ్ల వరకూ అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం లేకపోవడంతో మిన్నకుండిపోయారు. నాలుగేళ్ల కాలపరిమితి ముగిసిన వెంటనే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ వ్యవహారాల్లో ఆయన అనుచరులుగా ఉన్న ఇద్దరు శ్రీనుల ప్రమేయం ప్రధానంగా ఉందని తెలుస్తోంది. మేయర్గా పీలా శ్రీనివాసరావు కుర్చీలో కూర్చున్నప్పటికీ... వ్యవహారాలన్నీ ఆ ఇద్దరు శ్రీనులే నడిపించనున్నారు. ఇప్పటికే అనేక వార్డుల్లో తమను పక్కనపెట్టి... వీరి పెత్తనం ఏమిటంటూ సొంత పార్టీ కార్పొరేటర్లే మండిపడుతున్నారు. ఇద్దరు శ్రీనుల వ్యవహారాలను పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రి నేరుగా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. అయినప్పటికీ వారి వైఖరిలో ఎలాంటి మార్పులేకపోగా... తాజాగా మరింత దూకుడు పెరిగినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇద్దరు శ్రీనుల్లో ఒక శ్రీను ఫోన్ చేయగా... ఒక అధికారి ఫోన్ ఎత్తలేదని ఆయనను బదిలీ చేయాల్సిందేనంటూ పట్టుబట్టినట్టు సమాచారం. తనకు ఆయన ఫోన్ నెంబరు తెలియకపోవడంతో బదులివ్వలేదని సదరు అధికారి బతిమలాడుకోవాల్సి వచ్చిందని జీవీఎంసీలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఇక ఏకంగా మేయర్ పీఠంపై తమ నేత కూర్చోవడంతో ఆ ఇద్దరు శ్రీనులను కట్టడి చేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలను జీవీఎంసీలో చూడాల్సి వస్తుందోననే ఆందోళన కూటమి నేతల్లోనే వ్యక్తమవుతోంది. -
కేజీహెచ్లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి
డాబాగార్డెన్స్: కేజీహెచ్లో 16 ఏళ్ల బాలుడికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను సోమవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నగరంలోని ఏవీఎన్ కళాశాల డౌన్ రోడ్డులో నివాసముంటున్న యశ్వంత్ రెండేళ్లుగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతని తల్లి సంతోషి కేజీహెచ్ వైద్యులను ఆశ్రయించారు. అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు జీవన్దాన్ ద్వారా కిడ్నీ మార్పిడికి సిఫార్సు చేశారు. ఈ మేరకు కేజీహెచ్లో ఆ బాలుడికి ఈ నెల 7న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ఆ బాలుడు పూర్తిగా కోలుకోవడంతో సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ శస్త్రచికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని, కేజీహెచ్లో దీన్ని ఉచితంగా నిర్వహించినట్లు డాక్టర్ శివానంద్ తెలిపారు. అలాగే రోగికి రెండేళ్ల కాలానికి రూ.2 లక్షల విలువైన మందులు కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ జి.ప్రసాద్, యురాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రాంబాబు, అనస్థీసియా డాక్టర్లు శ్రీలక్ష్మి, డాక్టర్ ప్రీతి, డాక్టర్ రమేష్, నర్సింగ్ సిబ్బంది సూర్యప్రభ, చంద్రకళ, ఇతర సహాయక సిబ్బంది ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినట్లు సూపరింటెండెంట్ వివరించారు. -
జాబితాలో ప్రజాకవుల పేర్లు లేకపోవడం దారుణం
డాబాగార్డెన్స్: తెలుగునాట మహానీయుల జయంతులు, వర్ధంతులు నిర్వహించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జాబితాలో గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గుర్రం జాషువా వంటి ప్రముఖుల పేర్లు లేకపోవడంపై సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి ఆవేదన వ్యక్తం చేశారు. డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞానకేంద్రంలో సోమవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర సాహిత్యవేత్తలు, రచయితల ఇష్టాగోష్టి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేదా కావాలనే చేశారా? అన్నది బేరీజు వేసుకోవాలన్నారు. నిజంగా కావాలని చేసి ఉంటే విచారకరమన్నారు. మతపరమైన కోణంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వాస్తవిక చరిత్రను కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తోందని, అందుకు నిదర్శనమే ఈ అధికారిక జాబితా అని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని, కేంద్రంలోని ప్రధాన మీడియా ఛానల్స్, పత్రికలను బీజేపీ ప్రభుత్వం నియంత్రిస్తూ వాస్తవాలు ప్రజలకు తెలియజేయకుండా చేస్తోందని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, సాహితీ స్రవంతి సభ్యులు చలపతి, రామారావు పాల్గొన్నారు. -
పట్టని ప్రజల గోడు.. అధికారుల తీరు చూడు
బీచ్రోడ్డు: క్షేత్ర స్థాయిలో తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందనే ఆశతో సోమవారం కలెక్టరేట్కు చేరుకున్న ప్రజలకు అక్కడ ఎదురైన దృశ్యాలు నిరాశకు గురిచేశాయి. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కొందరు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కలెక్టర్ స్వయంగా కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు వింటుండగా.. హాలులో కూర్చున్న కొందరు ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. సెల్ఫోన్లలో షార్ట్స్, రీల్స్, చివరకు సినిమాలు చూస్తూ కాలక్షేపం చేశారు. తమ గోడు చెప్పుకోవడానికి ఎంతో ఆశతో వచ్చిన ప్రజలు.. అధికారుల తీరును చూసి నివ్వెరపోయారు. ప్రజా సమస్యలను ఆలకించి, వాటి పరిష్కారానికి మార్గాలు సూచించాల్సిన ఉన్నతాధికారులు.. ప్రజల సమక్షంలోనే సెల్ఫోన్లకు అతుక్కుపోవడం వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పట్టింది. సెల్ఫోన్లలో రీల్స్, సినిమాలు చూస్తూ కాలక్షేపం -
ఆర్థిక ఇబ్బందులతో విశాఖ రియల్టర్ ఆత్మహత్య
● మామిడిపల్లి రిసార్ట్లో ఘటన ● సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దేవరాపల్లి: విశాఖపట్నానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నడింపల్లి సత్యనారాయణరాజు(70) దేవరాపల్లి మండలం మామిడిపల్లిలోని రిసార్ట్లోని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన రాసిన సూసైడ్ నోట్ను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్చార్జి ఎస్ఐ ఆర్.ధనుంజయ్ తెలిపారు. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. విశాఖకు చెందిన సత్యనారాయణరాజు 40 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా కొంత మంది నుంచి తనకు రావలసిన బకాయిలు రూ.కోట్లలో ఉండిపోయాయి. దీంతో ఆయన తీవ్రంగా నష్టపోయారు. దేవరాపల్లి మండలం మామిడిపల్లి రిసార్ట్కు సత్యనారాయణరాజు అప్పుడప్పుడు వచ్చి ఒక్కరోజు ఉండి వెళ్లిపోయేవారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు రిసార్ట్కు వచ్చిన ఆయన రాత్రి ఇక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం రిసార్టు మేనేజర్ రాయిశివ చూసేసరికి గది బయట ఉన్న ఊయల కొక్కానికి సత్యనారాయణరాజు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని దేవరాపల్లి పోలీసులతో పాటు మృతుని బంధువులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చనిపోయే ముందు తనకు రావలసిన బకాయిల గురించి, ఆరుగురికి విడివిడిగా రాసిన ఉత్తరాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణరాజు రిసార్ట్కు వచ్చినప్పుడల్లా తీవ్రంగా మదనపడుతూ ఏడ్చేవారని రిసార్టులో పని చేస్తున్న సిబ్బంది పోలీసులకు తెలిపారు. మృతుడు భార్య, కుమారుడు సాయి చైతన్యవర్మ అందించిన సమాచారం మేరకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఇన్చార్జి ఎస్ఐ ధనుంజయ్ తెలిపారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
● నిరసనలతో హోరెత్తిన ప్రాంగణం ● తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు బీచ్రోడ్డు: వివిధ సమస్యలపై బాధితులు, రాజకీయ పక్షాలు చేపట్టిన ఆందోళనలతో సోమవారం కలెక్టరేట్ దద్దరిల్లింది. ఆ పరిసరాలు నిరసనల హోరుతో మార్మోగాయి. సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదనే ఆవేదనతో వివిధ వర్గాల ప్రజలు కలెక్టరేట్ ఎదుట ధర్నాలకు దిగారు. తమ డిమాండ్లను ప్రభుత్వం, అధికారులు ఆలకించి తక్షణమే పరిష్కరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ‘మోసగాడి అరెస్ట్లో పోలీసుల నిర్లక్ష్యం’ తమ సొమ్మును కాజేసిన మోసగాడిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పాల అప్పలరాజు అనే వ్యక్తి ఇళ్లు కట్టించి ఇస్తానని నమ్మించి దాదాపు 20 కుటుంబాల నుంచి కోటిన్నరకు పైగా వసూలు చేసి మోసగించాడని ఆరోపించారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర పోలీసు కమిషనర్ బాగ్చి ఆదేశాలు జారీ చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాల అప్పలరాజును తక్షణమే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని నినదించారు. అందరికీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఉచితంగా అందిస్తున్న మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి వర్తింపజేయాలని సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేశారు. ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల అనేక మంది పేదలు లబ్ధి పొందలేకపోతున్నారన్నారు. తెలుపు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ‘టెక్నికల్ చానల్ ద్వారానే పదోన్నతులు’ గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న తమకు టెక్నికల్ చానల్ ద్వారానే పదోన్నతులు కల్పించాలని పెందుర్తి, ఆనందపురం, భీమునిపట్నం మండలాల పరిధిలోని డిజిటల్ అసిస్టెంట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను కోరారు. ఈ మేరకు వారు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమను డిజిటల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్–5 పంచాయతీ సెక్రటరీగా పదోన్నతులు కల్పించడం సరికాదని వారు పేర్కొన్నారు. తమకు టెక్నికల్ చానల్ ద్వారానే పదోన్నతులుకల్పించాలని విజ్ఞప్తి చేశారు. జీవనోపాధి కోల్పోయాం ఆనందపురం మండలం తర్లువాడలో 303 ఎకరాల డీ పట్టా భూములను సర్వే నంబర్లు సరి చేస్తామని చెప్పి అధికారులు బలవంతంగా లాక్కున్నారని, ఆ భూములను తిరిగి తమకు ఇవ్వాలని ఆ గ్రామ దళితులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఐటీ కంపెనీల కోసం తమకు తెలియకుండా ఆ భూములను కేటాయించారని, తద్వారా జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ 303 ఎకరాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుడి పింఛన్ నిలిపివేతకలెక్టరేట్ చుట్టూ తల్లీకొడుకుల ప్రదక్షిణలు ఈ చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగుడి పేరు ఎ.శ్రీనివాస్. అతనిది మంగాపురం కాలనీ. గతంలో రూ.3 వేల పింఛన్ అందేది. ఇటీవల పింఛన్ నిలిపివేశారు. పింఛన్ పునరుద్ధరించా లని అతని తల్లి జయలక్ష్మి కొడుకును పట్టుకుని కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అయినప్పటికీ అధికారులు కరుణించడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు అర్జీ పెట్టుకు న్నా ఫలితం ఉండడం లేదని ఆమె వాపోయింది. -
అధికారులు వార్డుల్లో పర్యటించాలి
మేయర్ పీలా శ్రీనివాస్ ఆదేశండాబాగార్డెన్స్: నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మేయర్ పీలా శ్రీనివాస్ సోమవారం జీవీఎంసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశుధ్యం, ప్రజారోగ్యం, వీధిలైట్లు, తాగునీరు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు నిత్యం వార్డుల్లో పర్యటించి, పారిశుధ్య మెరుగుకు కృషి చేయాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీరు పూర్తి స్థాయిలో అందించాలన్నారు. జీవీఎంసీలో అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు గీతలు, హద్దులు దాటి విధులు నిర్వహించరాదన్నారు. జీవీఎంసీ డాష్ బోర్డ్, సిటీ ఆపరేషన్ సెంటర్ సమాచారం నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. తాను ప్రతి రోజూ వార్డుల్లో పర్యటిస్తానని తెలిపారు. ఇంతవరకు టెండర్లు తీసుకొని పనులు చేపట్టలేని వారిపై దృష్టి సారించి సకాలంలో పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా తాగునీటి విభాగానికి రూ.8 కోట్లు మంజూరయ్యాయని జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ పి.శివప్రసాదరాజు మేయర్కు వివరించారు. చలివేంద్రాలు పటిష్టంగా, పరిశుభ్రతతో నిర్విహించాలని ప్రధాన ఇంజనీర్కు మేయర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు, యూసీడీ పీడీ పీఎం సత్యవేణి పలువురు అధికారులు పాల్గొన్నారు. -
రేపే అప్పన్న చందనోత్సవం
● తెల్లవారుజామున 3.30 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం ● సాయంత్రం 6 గంటల తర్వాత సింహగిరిపైకి అనుమతి లేదు ● రాత్రి 7 గంటలకు సింహగిరిపై క్యూల ప్రవేశ గేట్లు మూసివేత ● ప్రోటోకాల్ వీఐపీలకు ఉదయం 6 గంటలతో అంతరాలయ దర్శనాలు పూర్తి ● ఆ తర్వాత అందరికీ నీలాద్రిగుమ్మం నుంచే లఘు దర్శనం ● 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా సింహాచలం : వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని సంవత్సరమంతా చందనం మణుగుల్లో నిత్యరూపంలో దర్శనమిచ్చే సింహాద్రినాథుడి నిజరూప దర్శనం లభించే సమయం ఆసన్నమైంది. సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం బుధవారం జరగనుంది. ఏడాదిలో కేవలం ఒక్క రోజులోని కొన్ని గంటలు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు తరలిరానున్నారు. ఈసారి 2 లక్షల మంది భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుంటారని అంచనా వేశారు. సాధారణ భక్తులకు పెద్ద పీట వేస్తూ.. వారికి దర్శనాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్, సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు నేతృత్వంలో జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. వెండిబొరుగులతో చందనం ఒలుపు చందనోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సుప్రభాతసేవ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, కలశారాధన చేస్తారు. అనంతరం వెండిబొరుగులతో స్వామిపై ఉన్న చందనాన్ని తీసి నిజరూపభరితుడిని చేస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజుకి తొలిదర్శనం కల్పిస్తారు. 3.30 గంటల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించే రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించేవారికి, ఇతర ప్రముఖులకు దర్శనం కల్పిస్తారు. ఉదయం 6 గంటలతో అంతరాలయ దర్శనాలు పూర్తిచేస్తారు. ఉదయం 3.30 గంటల నుంచి సర్వదర్శనం ఉదయం 3.30 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభిస్తారు. ఉచిత దర్శనం, రూ.300, రూ.1000 టికెట్లు క్యూల్లో ఉన్న వారందరికీ దర్శనాలు ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలలోపే సింహగిరిపై దర్శనాల క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాత ఖాళీ బస్సులను కొండపైకి పంపించి కొండపై ఉన్న భక్తులను కొండదిగువకి చేరుస్తారు. 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత కూడా భక్తులను కొండపైకి అనుమతించరు. భక్తులతో మర్యాదగా మెలగండి చందనోత్సవంలో విధులు నిర్వర్తించే పోలీసులు సామాన్య భక్తులతో మర్యాద కలిగి, అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. సోమవారం సింహాచలంలో ఆయన పోలీసులకు పలు సూచనలు చేశారు. క్యూల వద్ద దేవస్థానం అధికారులు సూచించిన విధంగా నడు చుకోవాలన్నారు. రాంగ్ పార్కింగ్ వాహనాలను టోయింగ్ చేసి తరలించాలని సూచించారు. డ్రోన్ సాంకేతికతను పూర్తిగా వినియోగిస్తామన్నారు. సామాన్య భక్తులకే పెద్దపీట బీచ్రోడ్డు: చందనోత్సంలో సాధారణ భక్తుల దర్శనానికి తొలి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. చందనోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్లో ఆయన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండపైన, కింద నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆర్టీసీ బస్సులను మాత్రమే నడపాలని ఆదేశించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా విక్రయించే టికెట్లపై సీరియల్ నంబర్, స్కానింగ్, క్యూలను సూచించే బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సింహాచలం ప్రాంతంలోని మద్యం షాపులను మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని అధికారులను ఆదేశించారు. -
ట్రాఫిక్ పోలీసులకు కూల్ జాకెట్లు
విశాఖ సిటీ : ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వేసవి తాపం నుంచి కొంత ఉపశమనం కలిగేలా కూల్ జాకెట్లు అందిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ సమావేశంలో మందిరంలో ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎండ వేడికి గురికాకుండా సిబ్బందికి తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచన చేసినట్లు చెప్పారు. ఇందుకోసం గతేడాది అక్టోబర్లో ఢిల్లీలో జరిగిన ‘ట్రాఫిక్ ఎక్స్ పో’కు విశాఖ ట్రాఫిక్ విభాగం నుంచి ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను పంపించామన్నారు. అక్కడ హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన 98ఎఫ్ అనే కంపెనీ వారు ‘కూల్ జాకెట్లను‘ ప్రదర్శించినట్లు చెప్పారు. నగరంలో కొందరు దాతల సహాయంతో రూ.5 లక్షలు విలువైన 200 కూల్ జాకెట్లను గురుగ్రామ్ నుంచి తెప్పించినట్లు వెల్లడించారు. ఈ జాకెట్లను సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో ముంచి తీస్తే వాటి ఉష్ణోగ్రత 8 డిగ్రీలకు పడిపోతుందని వివరించారు. అవి ధరించిన సిబ్బంది ఎండ వేడి నుంచి ఉపశమనం పొంది ట్రాఫిక్ విధులు సమర్థవంతంగా నిర్వర్తించడానికి వీలవుతుందన్నారు. అలాగే వీటిని శీతాకాలంలో సాధారణంగా వాడుకోవచ్చన్నారు. వీటికి రేడియం స్టిక్కరింగ్ ఉండడంతో రాత్రిపూట కూడా ధరించి విధులు నిర్వహించవచ్చని తెలిపారు. అనంతరం ఈ కూల్ జాకెట్లను ట్రాఫిక్ సిబ్బందికి అందజేశారు. -
జ్యూస్షాపులకు చేపల నిల్వకు వాడే ఐస్
ఎంవీపీకాలనీ: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం జరిపిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. జెట్టీల్లో చేపల నిల్వకు వాడే ఐస్ ముక్కలను కొన్ని ఫ్యాక్టరీలు నగరంలోని ఫ్రూట్ జ్యూస్ దుకాణాలకు సరఫరా చేస్తుండటం వారిని అవాక్కయ్యేలా చే సింది. కొంతకాలంగా ఈ తరహా వ్యాపా రం యథేచ్ఛగా జరుగుతున్నట్లు అధికా రులు గుర్తించారు. రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారి కింజరాపు ప్రభాకర్కు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో సోమవారం సంస్థ డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ సంతోష్కుమార్, జిల్లా లీగల్ మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ సేఫ్టీ సిబ్బందితో కూడిన బృందం గాజువాక, మధురవాడ, పెదగంట్యాడ ప్రాంతాల్లోని ఐస్ తయారీ ఫ్యాక్టరీల్లో దాడులు చేసింది. ఆయా ఫ్యాక్టరీల్లో కలుషిత నీటితో తయారు చేస్తున్న ఐస్ను జ్యూస్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. ఆహార భద్రత నియమాల ప్రకారం ఆ ఐస్కు నాణ్యత లేకపోవడంతో.. దాన్ని ఆహార పదార్థాల్లో ఉపయోగించకూడదని తేల్చింది. ఆయా ఫ్యాక్టరీల్లో ఐస్ ముక్కలను అధికారులను స్వాధీనం చేసుకుని.. కొన్ని శాంపిల్స్ ల్యాబ్ పరీక్షలకు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయా ఫ్యాక్టరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు రూ.30 వేల చొప్పున ఫైన్ విధించారు. ల్యాబ్లో పరీక్షించిన అనంతరం, ఆ రిపోర్ట్ ఆధారంగా ఆయా ఫ్యాక్టరీలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. విజిలెన్స్ దాడుల్లో వెలుగు చూసిన వైనం మూడు ఐస్ ఫ్యాక్టరీలకు రూ.30వేల చొప్పున జరిమానా -
పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం: సికింద్రాబాద్ డివిజన్ పరిధి మహబూబాబాద్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న 3వ లైన్ నిర్మాణం, పలు ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా తేదీల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని దారి మళ్లిస్తున్నట్లు, మరికొన్ని రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. రద్దయిన రైళ్లు ● విశాఖపట్నం–న్యూఢిల్లీ–విశాఖపట్నం(20805/06) ఏపీ ఎక్స్ప్రెస్ మే 27, 28, జూన్ 18, 19వ తేదీల్లోను, విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్(12803) స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ మే 23, 26, జూన్ 16వ తేదీల్లోను, హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(12804) స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ మే 25, 28, జూన్ 18వ తేదీల్లో రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు ● మే 22 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం (18519/20) ఎల్టీటీ ఎక్స్ప్రెస్లు, మే 27, 28వ తేదీల్లో షాలిమర్–హైదరాబాద్(18045)ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, మే 28, 29వ తేదీల్లో హైదరాబాద్–షాలిమర్(18046)ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, మే 27, 28వ తేదీల్లో చత్రపతి శివాజి టెర్మినస్ ముంబయి–భువనేశ్వర్–చత్రపతి శివాజి టెర్మినస్ ముంబయి (11019/20) కోణార్క్ ఎక్స్ప్రెస్లు, మే 28న షాలిమర్–సికింద్రాబాద్(22849) ఎక్స్ప్రెస్లు వయా విజయవాడ–గుంటూరు–నల్గొండ–పగిడిపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ● మే 22, జూన్ 19వ తేదీల్లో విశాఖపట్నం–గాంధీదాం(20803) వీక్లీ ఎక్స్ప్రెస్, మే 25, జూన్ 22వ తేదీల్లో గాంధీదాం–విశాఖపట్నం(20804) వీక్లీ ఎక్స్ప్రెస్, మే 25, జూన్ 15వ తేదీల్లో పూరీ–ఓఖా(20819) ఎక్స్ప్రెస్, మే 28, జూన్ 18వ తేదీల్లో ఓఖా–పూరీ(20820) ఎక్స్ప్రెస్లు వయా లఖోలి–రాయ్పూర్–నాగ్పూర్–బద్నెరా మీదుగా రాకపోకలు సాగిస్తాయి మహబూబాబాద్లో తాత్కాలికంగా హాల్ట్ తొలగింపు : ఆధునీకీకరణ పనుల నిమిత్తం మహబూబాబాద్ స్టేషన్లో కింది రైళ్లకు ఆయా తేదీల్లో తాత్కాలికంగా హాల్ట్ను రద్దు చేశారు. ● మే 24 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–హైదరాబాద్ (12727) గోదావరి ఎక్స్ప్రెస్, మే 24 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–మహబూబ్నగర్(12861) ఎక్స్ప్రెస్, మే 24, 25, 26వ తేదీల్లో భువనేశ్వర్–చత్రపతి శివాజి టెర్మినస్ ముంబయి (11020) కోణార్క్ ఎక్స్ప్రెస్, మే 24, 25, 26వ తేదీల్లో షాలిమర్–హైదరాబాద్(18045) ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లు ఆయా తేదీల్లో మహబూబాబాద్లో ఆగవు.అదనపు కోచ్ల ఏర్పాటుతాటిచెట్లపాలెం: ప్రయాణికుల సౌక ర్యార్థం పలు రైళ్లకు అదనంగా జనరల్, స్లీపర్ క్లాస్ కోచ్లను తాత్కాలికంగా జతచేస్తున్నారు. విశాఖపట్నం–బ్రహ్మపూర్–విశాఖపట్నం (18526/18525) ఎక్స్ప్రెస్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్లను, విశాఖపట్నం–రాయ్పూర్–విశాఖపట్నం (58528/58527)పాసింజర్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ను జతచేస్తున్నారు. అలాగే విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం (58538/58537)పాసింజర్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ను, విశాఖపట్నం–బ్రహ్మపూర్–విశాఖపట్నం (58532/58531)పాసింజర్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ను జతచేస్తున్నారు. విశాఖపట్నం–భువనేశ్వర్–విశాఖపట్నం (22820/22819) ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్లను, విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం(18512/18511) ఎక్స్ప్రెస్కు ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను జతచేస్తున్నారు. -
మేయర్గా పీలా ఏకగ్రీవం
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ మేయర్గా కూటమి కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ను కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషీయో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మేయర్ ఎన్నికకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. పీలా శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రతిపాదించారు. పీలా శ్రీనివాస్ ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి ప్రకటించి నియామక పత్రం అందజేశారు. అనంతరం పలువురు అధికారులు పీలాచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పీలాను అభినందించారు. నిస్వార్థంగా పనిచేస్తా.. మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన పీలా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మంచి నాయకత్వం నడుపుతానని, నాయకత్వానికి విలువ చూపుతానన్నారు. నిస్వార్థంగా విశాఖ ప్రజలకు సేవలందిస్తానన్నారు. అంతా పావు గంటలోనే.. ఉదయం 10.55 గంటలకు సభ్యులందరూ(కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషీయో సభ్యులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ) సభలో ఆశీనులయ్యారు. 11 గంటలకు ఎన్నికల అధికారి మయూర్ అశోక్ సమావేశ మందిరానికి చేరుకున్నారు. 5 నిమిషాల్లో ఎన్నికకు సంబంధించి నియమ నిబంధనలు సూచించారు. మరో 5 నిమిషాల్లో మేయర్ ఎన్నిక తంతు పూర్తి చేశారు. రెచ్చిపోయిన టీడీపీ గ్యాంగ్ మేయర్గా పీలా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే టీడీపీ తమ్ముళ్లు రెచ్చిపోయారు. వాహన చోదకులను ఇబ్బందులకు గురి చేశారు. ట్రాఫిక్ నియంత్రిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయారు. వీరంగం సృష్టించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఒకింత విసిగించారు. సంబరాలు చేసుకోవచ్చు.. కానీ పౌరులను ఇబ్బంది పెట్టి చేసుకోవడం సమంజసం కాదని పలువురు నగర పౌరులు బాహాటంగానే చెప్పుకున్నారు. ఇదిలా ఉండగా.. జీవీఎంసీ గాంధీ పార్కు నుంచి జీవీఎంసీ ప్రధాన ద్వారానికి వచ్చే మార్గాన్ని ట్రాఫిక్ పోలీసులు క్లోజ్ చేశారు. టీడీపీకి చెందిన కాళ్ల శంకర్ నువ్వు ఎవరంటూ అక్కడున్న మహిళా ట్రాఫిక్ పోలీసుపై చిందులేశారు. నువ్వు నన్ను ఆపుతావా.. అంటూ కారును స్పీడ్గా దూసుకుపోవడంపై పలువురు మండిపడ్డారు. గ్రేటర్ 3వ మేయర్గా.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు 7వ మేయర్గా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు 3వ మేయర్గా పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. విశాఖ తొలి మేయర్గా ఎన్ఎస్ఎన్ రెడ్డి, రెండో మేయర్గా డి.వి.సుబ్బారావు, మూడో మేయర్గా సబ్బం హరి, నాల్గో మేయర్గా రాజాన రమణి కొనసాగగా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిన తర్వాత పులుసు జనార్దనరావు తొలి మేయర్గా, రెండో మేయర్గా గొలగాని హరి వెంకటకుమారి కొనసాగారు. మూడో మేయర్గా పీలా శ్రీనివాస్ ఇప్పుడు ఎన్నికయ్యారు. -
ఏపీకి వర్షం అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఏపీలో రాబోయే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ మాట్లాడుతూ.. సోమవారం.. కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక, మంగళవారం.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.ఇదిలా ఉండగా.. కొన్ని జిల్లాలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో 41.4, విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక, తెలంగాణలో గత కొద్ది రోజులుగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదివారం హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై.. మోస్తరు వర్షం కురసింది. దీంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలో వర్షం కారణంగా కల్లాల్లో పోసిన ధాన్యం వర్షం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Gadwal right now. As expected, dangerous storms smashing the district 😱Zaheerabad - Vikarabad too on ALERTVC :- @chaitanyak19142 pic.twitter.com/S3cmnQ4UMy— Telangana Weatherman (@balaji25_t) April 27, 2025 -
సింహగిరికి పోటెత్తిన భక్తజనం
సింహాచలం: గంధం అమావాస్య పురస్కరించుకుని సింహగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు, గ్రామీణ ప్రాంత భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. శనివారం రాత్రికే సింహాచలం చేరుకున్న వీరంతా ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. స్వామి ప్రతిరూపాలుగా వెంట తీసుకొచ్చిన కోలలను పుష్కరిణి గట్టుపై ఉంచి పూజలు నిర్వహించారు. వంటలు వండి, కోలలకు ఆరగింపు చేశారు. అమృత కలశాలను, పళ్లను సమర్పించారు. కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. కోలలతో నృత్యాలు చేస్తూ స్వామిని కీర్తించారు. స్నానమాచరించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో వరాహ పుష్కరిణి ప్రాంగణం అంతా కిటకిలాడింది. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహగిరిపై దర్శనక్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, గంగధార మార్గం భక్తులతో కిటకిటలాడాయి. సింహగిరికి చేరుకున్న భక్తులు సింహగిరిపై కూడా కోలలకు పూజలు నిర్వహించారు. గరిడి నృత్యాలు చేశారు. దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పుష్కరిణి వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం గార్డులు బందోబస్తు నిర్వహించారు. -
చందనోత్సవంలో సామాన్యులకే పెద్ద పీట
● హోంమంత్రి వంగలపూడి అనితసింహాచలం: ఈనెల 30న జరిగే చందనోత్సవంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అప్పన్న స్వామి నిజరూపదర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చిలతో కలిసి ఆదివారం పరిశీలించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అంతరాలయ దర్శనాలు ఉదయం 3 గంటల నుంచి 6 గంటలలోపు మాత్రమే ఉంటాయన్నారు. ఉదయం 6 తర్వాత అంతరాలయ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అంతరాలయ తలుపులు మూసివేసి తాళాలు వేసుకుని దగ్గర ఉంచుకోవాలని ఆలయ వైదికులు, అధికారులకు సూచించారు. దివ్యాంగులు, వృద్ధులకు, ఏడాదిలోపు వయసున్న పిల్లలు ఉన్నవారికి లిఫ్టు ద్వారా తీసుకెళ్లి, దర్శనం కల్పిస్తామన్నారు. చందనోత్సవం రోజు ఏటా లక్షా 30 వేల వరకు భక్తుల సంఖ్య ఉంటోందని, ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక శ్రీశైలం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, విజయవాడ, తిరుపతి తదితర ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల సంఖ్య దాదాపు 30 శాతం పెరిగిందన్నారు. దీంతో సింహాచలంలో ఈసారి చందనోత్సవానికి సుమారు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్, దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్, దేవస్థానం ఈవో కె.సుబ్బారావు పాల్గొన్నారు. 2 వేల మందితో బందోబస్తు చందనోత్సవానికి 2 వేల మందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పించడం జరుగుతుందన్నారు. -
ఉత్సాహంగా రైల్వే వేసవి క్రీడా శిబిరాలు
విశాఖ స్పోర్ట్స్: యువ ప్రతిభను పెంపొందించడం, క్రీడాస్ఫూర్తిని చిరుప్రాయం నుంచే అలవరిచే లక్ష్యంతో రైల్వేలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే క్రీడా సంఘం(ఈకోర్సా) వాల్తేర్ ఆధ్వర్యంలో ఈనెల 22న ప్రారంభమైన క్రీడా శిబిరాలు నెలాఖరు వరకూ సాగనున్నాయి. 5 నుంచి 15 ఏళ్ల చిన్నారులు సుమారు 200 మంది ఈ శిబిరాల్లో తర్ఫీదు పొందుతున్నారు. ఇదిలా వుండగా ఆదివారం ఈకోర్సా డబ్ల్యూడబ్ల్యూవో అధ్యక్షురాలు జ్యోత్న్స బోహ్రా మార్గదర్శకంలో యోగా శిబిరంలో మరింత ఉత్సాహంగా సాగింది. యువతలో ఆరోగ్యకరమైన అలవాట్లు, మానసిక శ్రేయస్సును పెంపొందించడం లక్ష్యంగా యోగాతో పాటు స్విమ్మింగ్లోనూ శిక్షణ కొనసాగుతుంది. ఉదయం 6 నుంచి 8 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు రెండు సెషన్స్లో ఈ శిబిరం ప్రతీ రోజూ జరుగుతుంది. బాలురకు క్రికెట్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, వాలీబాల్లో శిక్షణ ఇస్తుండగా బాక్సింగ్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, బ్యాడ్మింటన్, యోగాలో బాలబాలికలు శిక్షణ నిర్వహిస్తున్నారు. -
మే 20న జాతీయ సమ్మె
డాబాగార్డెన్స్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల రద్దు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు మే 20న జాతీయ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, ఏఐటీయూసీ నాయకుడు డి.ఆదినారాయణ, ఐఎన్టీయూసీ నాయకుడు మంత్రి రాజశేఖర్, సీఎఫ్టీయూఐ అధ్యక్షుడు ఎన్.కనకారావు, హెచ్ఎంఎస్ నాయకుడు గణపతిరెడ్డి, ఏపీఎఫ్టీయూ నాయకుడు దేవా మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, దీని వల్ల నిరుద్యోగం పెరిగి, ఉద్యోగ భద్రత తగ్గిందని విమర్శించారు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ, 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఈ కోడ్స్ అమలైతే పని గంటలు 8 నుంచి 15కి పెరిగే ప్రమాదం ఉందని, కార్మికులు సంఘం నెలకొల్పడం, సమ్మె చేయడం, వేతనాల కోసం పోరాడే హక్కులు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలు, బ్యాంకులు మొదలైనవాటిని ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనం నెలకు రూ.26,000 ఇవ్వాలని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్, అగ్నిపథ్ రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగంలో ఖాళీలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. మే 3 లోపు పరిశ్రమల వారీగా సమ్మె నోటీసులు ఇవ్వాలని, 10 లోపు జిల్లా, మండల, పట్టణ స్థాయి సదస్సులు నిర్వహించాలని, 16 నుంచి 19 వరకు ప్రచార యాత్రలు చేపట్టాలని, మే 20న భారీ ప్రదర్శనలు, సభలు నిర్వహించాలని కార్యాచరణను ప్రకటించారు. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని రైతు సంఘాలు కూడా గ్రామీణ హర్తాళ్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆర్కేఎస్వీ కుమార్, బి.నాగభూషణం, మన్మధరావు, ఆయా యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల పిలుపు -
తెలిసిన వారి పనేనా?
కూర్మన్నపాలెం: రాజీవ్నగర్లో జరిగిన దంపతుల హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. తొలుత ఈ హత్యలను దోపిడీ దొంగలే చేసి ఉంటారని పోలీసులు, స్థానికులు భావించారు. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే విదేశాల నుంచి వచ్చిన మృతుల కుమార్తె, కుమారుడు ఇంట్లోని బీరువాలను తెరిచి పరిశీలించగా.. అందులో నగదు, బంగారు నగలు చెక్కు చెదరకుండా ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల సమక్షంలోనే బీరువాలను పరిశీలించగా 30 తులాల బంగారం, రూ. 10 వేల నగదు సురక్షితంగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ హత్యలు డబ్బు లేదా ఆభరణాల కోసంజరగలేదని స్పష్టమైంది. ఈ కీలక పరిణామంతో హత్యలపై పోలీసుల దర్యాప్తు కోణం మరో మలుపు తిరిగింది. ఘటనా స్థలంలోని పరిస్థితులు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పరిశీలిస్తే.. వారికి బాగా తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వంట గదిలో కూరగాయలు కోసేందుకు ఉపయోగించే రెండు కత్తులతోనే ఈ హత్యలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంటితో బాగా పరిచయం ఉన్న వారికే వస్తువులు ఎక్కడ ఉంటాయో తెలుస్తుందని భావిస్తున్న పోలీసులు.. ఇప్పుడు దర్యాప్తును ఆ దిశగా మళ్లించారు. దీంతో మృతుల కుటుంబంతో సన్నిహిత పరిచయాలున్న వారిని, ఇంటికి తరచుగా వచ్చిపోయే వారిని, ఆ కుటుంబ సభ్యులకు చనువుగా ఉండేవారి వివరాలను సేకరించి.. వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై నగర పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడే ఉండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్రైం పోలీసులు, అధికారులు మఫ్టీలో ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు దొరక్కపోవడంతో.. కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొలిక్కిరాని దంపతుల హత్య కేసు -
జిల్లాకు చేరుకున్న పాఠ్య పుస్తకాలు
ఆరిలోవ: 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసేందుకు మొదటి విడత పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్లో వీటిని భద్రపరిచారు. ఈ కేంద్రాన్ని డీఈవో ఎన్. ప్రేమ్కుమార్ ఆదివారం సందర్శించి, పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చినగదిలి మండలంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ మొదటి విడతగా 31,560 పుస్తకాలు చేరినట్లు తెలిపారు. రెండో విడతలో మరో 34 వేల పుస్తకాలు వస్తాయన్నారు. సీఎంవో దేముడు బాబు, చినగదిలి ఎంఈవోలు సీహెచ్.రవీంద్రబాబు, పి.అనురాధ, సీఆర్పీలు పాల్గొన్నారు. -
‘మహా బోధి విహార్ను బౌద్ధులకే అప్పగించండి’
సీతమ్మధార: బిహార్లోని మహా బోధి విహార్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా బౌద్ధులకే అప్పగించాలని ఉత్తరాంధ్ర బౌద్ధ సంఘాల ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఎల్ఐసీ బిల్డింగ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు మహా శాంతి యాత్ర నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారంతా నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ మహా బోధి విహార్ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిందన్నారు. అటువంటి ఈ విహార్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా బౌద్ధులకే ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బి.టి.ఎం.సి.యాక్ట్ 1949 ప్రకారం చట్టం చేసి.. అందులో నలుగురు హిందూ మహంతులు, నలుగురు బౌద్ధ భిక్షువులతో పాటు కలెక్టర్ను చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. మొత్తం 9 మంది సభ్యుల్లో ఐదుగురు హిందువులే ఉండేలా చేసి.. ఆలయ అభివృద్ధి, విధానపరమైన నిర్ణయాల్లో బౌద్ధులకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేసిందని మండిపడ్డారు. మహా విహార విముక్తి ఆందోళనలో ఉత్తరాంధ్ర జిల్లాల జేఏసీ కన్వీనర్ వి.వి.దుర్గారావు, కో కన్వీనర్ బి.వి.జి.గౌతమ్, జేఏసీ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ మాటూరు శ్రీనివాస్, భీమ్ సేన్ వార్ జనరల్ సెక్రటరీ డాక్టర్ వసంత రాజేంద్రప్రసాద్, మాటూరి శ్రీనివాసరావు, పేకేటి రామారావు, ఎం.మల్లయ్య రాజు, తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
తాటిచెట్లపాలెం: ఇటీవల కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి సున్నీ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ మసీద్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. టీఎస్ఎన్ కాలనీలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం వీరు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉగ్రదాడిలో మృతులకు సంఘీభావంగా చిన్నారులు, పెద్దలు, మహిళలు జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో సున్నీ ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ యాక్ట్–2025ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పూర్వీకులు 4, 5 శతాబ్దాల కిందట ఆస్తులను అల్లా పేరున వక్ఫ్(దానం) చేశారని, వాటిని పేదలకు, వితంతువులకు ఉపయోగపడే చూడాలని వారు కోరారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అహ్మదుల్లా ఖాన్, జనరల్ సెక్రటరీ ఎస్.కె.నూర్ అహ్మద్, హైదర్ ఆలీ సింకా, ఎస్.కె.అహ్మద్ వల్లీ, రహ్మతుల్లా బేగ్, మీర్ అబ్బాస్ హుస్సేన్, మునీర్ఖాన్, రహమతుల్లా, సయ్యద్ అమీర్ఖాన్, మహబూబ్ షరీఫ్, హమ్మద్ హబీబ్, లుక్మాన్ పాల్గొన్నారు. -
ఆప్తాల్మిక్ అధికారులకు పదోన్నతులు కల్పించాలి
అల్లిపురం: రాష్ట్రంలోని ఆప్తాల్మిక్ అధికారులు గత 39 ఏళ్లుగా ఎటువంటి పదోన్నతులకు నోచుకోకుండానే.. పదవీ విరమణ చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఆప్తాల్మిక్ అధికారుల అసోసియేషన్ జోన్–1 అధ్యక్షుడు డి.వెంకటరమణ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని ఎన్జీవో హోం ఆవరణలో ఆదివారం జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పదోన్నతులపై తక్షణమే స్పందించాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఒక్క ఉద్యోగికి కనీసం రెండు పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పారా మెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జె.రఘురామరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్.వసంతరావు, ఎం.ఆర్.కె.దాస్, జోనల్ అధ్యక్షుడు డి.వెంకటరావు, జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కె.ఈశ్వరరావు పాల్గొని.. ఈ నెల పదవీ విరమణ చేయనున్న బీవీఎం ప్రసాద్ను సన్మానించారు. -
మధ్యాహ్నం నిర్మానుష్యం.. సాయంత్రం కిటకిట
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో.. సాయంత్రం 5 గంటల సమయంలో.. ఏయూక్యాంపస్: నగరంలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఎండ మంటతో పాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆ సమయంలో సాగర తీరం ఖాళీగానే కనిపిస్తోంది. అయితే సాయంత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ సమయానికి వాతావరణం కాస్త చల్లబడటంతో బీచ్లకు క్యూ కడుతున్నారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో నగరవాసులు కుటుంబ సభ్యులతో కలిసి బీచ్కు చేరుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలల హోరు వింటూ.. ఇసుకలో సేదతీరారు. దీంతో బీచ్ జనాలతో కిటకిటలాడింది. ఆర్.కె.బీచ్తో పాటు సాగర్నగర్, రుషికొండ, భీమిలి, యారాడ తదితర బీచ్లు కూడా సందడిగా కనిపించాయి. –ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
పెండింగ్ చలాన్ల వసూళ్ల డ్రైవ్
నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు ఏయూక్యాంపస్: నగరంలో పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. గతంలో విధించిన చలాన్లు చెల్లించని వాహనదారులను గుర్తిస్తున్నారు. వారి నుంచి బకాయిలను వసూలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం బీచ్రోడ్డులో పలు వాహనాలను తనిఖీ చేశారు. వాహన పత్రాలు సక్రమంగా లేని, హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వారికి జరిమానా విధించారు. భారీగా చలాన్లు పేరుకుపోయిన వాహనచోదకుల నుంచి ఆ రుసుం చెల్లించే విధంగా చర్యలు చేపట్టారు. -
సృజనాత్మకత.. నృత్య ఘనత
వైవిధ్యం కోసం నేర్చుకుంటున్నాను డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్లో బంగ్లాదేశ్, నేపాల్, పశ్చి మబెంగాల్ ప్రాంతాలకు చెందిన డ్యాన్స్లు నేర్చుకున్నాను. దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చాను. టర్కీలో జరిగిన పోటీల్లో విజయం సాధించడం మరిచిపోలేను. క్రియేటివ్ డ్యాన్స్లకు ఆదరణ ఎక్కువ. అమ్మానాన్నల ప్రోత్సాహంతో పన్నెండేళ్లుగా శిక్షణ పొందుతున్నాను. – గోక డింపుల్, ఏయూ ఇంజినీరింగ్ విద్యార్థిని సీతమ్మధార: నగరంలోని ‘స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్’ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. బాలబాలికలకు వివిధ రకాల నృత్య రీతుల్లో శిక్షణ ఇస్తూ.. వారి సృజనాత్మకతను వెలికితీస్తోంది. భారతీయ శాసీ్త్రయ నృత్యాలైన కథక్, మోహినియాట్టం, ఒడిస్సీ, మణిపురితో పాటు సంబల్పూరి, కోలాటం, రాజస్థానీ, కర్ణాటక, బిహు, పంజాబీ, తెలుగు జానపద, శాసీ్త్రయ నృత్యాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా నేపాలి, ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాల నృత్యరీతులను కూడా నేర్పిస్తున్నారు. అనకాపల్లి, పెందుర్తి, భీమునిపట్నం, సింహాచలం తదితర ప్రాంతాల నుంచి ప్రతి ఆదివారం సీతమ్మధార ఏపీఎస్ఈబీ కాలనీలోని నృత్యాలయానికి విద్యార్థులు వచ్చి మూడు గంటల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. శ్రీకాకుళం, రాజాం, చీపురుపల్లి ప్రాంతాలకు చెందిన బాల కళాకారులు రెండు, మూడు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక సదస్సుల్లో పాల్గొని సృజనాత్మక నృత్యాంశాలు నేర్చుకుంటున్నారు. ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న శ్రీలంక, ఒడిశా, బంగ్లాదేశ్, నేపాల్, కర్ణాటక, కేరళ, కోల్కతా వంటి ప్రాంతాల నుంచి శిక్షకులు వచ్చి బాలలకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు ప్రశంసా పత్రాలు అందిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు టర్కీ లోని ఇస్తాంబుల్, బల్గేరియా, సుబంగ్ (ఇండోనేషియా)లలో ప్రతి ఏటా జరిగే అంతర్జాతీయ ఆన్లైన్ నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులు సాధిస్తున్నారు. థాయిలాండ్,శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాల్లో నిర్వహించే అంతర్జాతీయ ఆహ్వాన నృత్య ప్రదర్శన పోటీలకు హాజరై.. భారతీయ జానపద, శాసీ్త్రయ నృత్యాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. బహుభాషా నృత్యాలు బాగుంటాయి ఒడిస్సీ, కథక్, మణిపురి, కర్ణాటక జానపద నృత్యాలను ప్రదర్శిస్తాను. బహుభాషా నృత్యాలు బాగుంటాయి. అందుకే ఆసక్తిగా నేర్చుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ బాలల సాంస్కృతిక ఉత్సవాల్లో పూజిత చందన (విశాఖ), ఎన్.జోషిత (సింహాచలం)లతో కలసి నృత్య ప్రదర్శనలిచ్చాను. కళాభిమానులు, నిర్వాహకుల అభినందనలు అందుకున్నాం. మన జానపద నృత్యాలకు విదేశాల్లో చూపుతున్న ఆదరణ.. నాలో ఆసక్తిని మరింత పెంచుతోంది. –డి.లక్ష్మీస్నేహిత, ఇంటర్ విద్యార్థిని, అనకాపల్లి వైవిధ్య నృత్యాలకు వేదిక‘స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్’ దేశ విదేశీ నృత్యాల్లో బాల కళాకారులకు శిక్షణ అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు, ప్రశంసలు అంతర్జాతీయ ప్రశంసలే ప్రోత్సాహం విదేశాల్లో భారత దేశ నృత్యాంశాలు ప్రదర్శించేటప్పుడు లభించే ప్రశంసలే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. టర్కీ, ఇండోనేషియా, సింగపూర్, థాయ్లాండ్లలో ప్రదర్శించే అవకాశాలు లభించడం మరువలేనది. విదేశీ కళాకారులు సైతం భారతీయ శాసీ్త్రయ, జానపద నృత్యాలకు ముగ్ధులవుతున్నారు. – ఆర్.హర్షిత టీనా,తగరపువలస -
రెడ్ సిగ్నల్
గ్రీన్ షెల్టర్లకు● మొక్కుబడిగా చలివేంద్రాల నిర్వహణ ● పట్టించుకునే అధికారి లేకపోవడంతో ఎండల బారిన ప్రజలు ● మౌలిక సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం డాబాగార్డెన్స్: ఎండలు మండుతున్నాయి. నానాటికీ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకు మొదలైన భానుడి ప్రతాపం సాయంత్రం 6 గంటలకు గాని తగ్గట్లేదు. ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏప్రిల్లోనే ఇలా ఉంటే.. ఇక మే నెలలో ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో, దైనందిన విధుల్లో భాగంగా రోడ్లపైకి వచ్చే ప్రజలకు అవసరమైన కనీస వసతుల కల్పనలో కూటమి పాలకులు విఫలమయ్యారనే చెప్పొచ్చు. గాడి తప్పిన జీవీఎంసీ పాలన జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ లేరు. మూడు నెలలుగా ఇన్చార్జ్ కమిషనర్ పాలనలోనే జీవీఎంసీ ఈదుతోంది. దీంతో జీవీఎంసీ అధికారుల్లో జవాబుదారీ తనం కరువైంది. 35 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా, నగరవాసులకు కనీస వసతుల కల్పనలో కూటమి ప్రభుత్వం ఫెయిలైందని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఆస్తి పన్నులు చెల్లించకపోతే జప్తు చేస్తామని బెదిరిస్తున్న అధికారులు, మండుతున్న ఎండల నేపథ్యంలో గ్రీన్షెల్టర్లు, చలివేంద్రాలపై దృష్టి సారించకపోవడంపై మండిపడతున్నారు. గతంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో 98 వార్డుల్లోని ప్రధాన కూడళ్లు, ఐలాండ్లు, జాతీయ రహదారుల వెంబడి, ట్రాపిక్ సిగ్నల్ పాయింట్ల వద్ద చలివేంద్రాలు, గ్రీన్షెల్టర్లను విరివిగా ఏర్పాటు చేసేవారు. గతంలో ఇలా.. గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీ పరిధిలో చలివేంద్రాలతో పాటు 63 గ్రీన్ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. జోన్–1 పరిధిలో 10 చలివేంద్రాలు, 4 గ్రీన్ షెల్టర్స్, జోన్–2లో 13 చలివేంద్రాలు, 7 గ్రీన్ షెల్టర్స్, జోన్–3లో 26 చలివేంద్రాలు, 4 గ్రీన్ షెల్టర్స్, జోన్–4లో 25 చలివేంద్రాలు, 6 గ్రీన్షెల్టర్స్, జోన్–5ఏ పరిధిలో 29 చలివేంద్రాలు, 5 గ్రీన్షెల్టర్స్, జోన్–5బీ పరిధిలో 13 చలివేంద్రాలు, 3 గ్రీన్షెల్టర్స్, జోన్–6 పరిధిలో 31 చలివేంద్రాలు, 16 గ్రీన్షెల్టర్స్, జోన్–7 పరిధిలో 12 చలివేంద్రాలు, 12 గ్రీన్షెల్టర్స్, జోన్–8 పరిధిలో 18 చలివేంద్రాలు, 6 గ్రీన్షెల్టర్స్ ఏర్పాటు చేసి పాదచారుల దాహార్తి, వాహనచోదకులకు ఉపశమనం కల్పించారు. మొక్కుబడిగా హరితాశ్రయాలు నగరంలో పలు ప్రాంతాల్లో జీవీఎంసీ ఏర్పాటు చేసిన హరితాశ్రయాలు లక్ష్యానికి దూరంగా ఉంటున్నాయి. నిర్వహణ లోపాలు, పర్యవేక్షణ కొరవడటంతో లక్ష్యం నెరవేరడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వీటి చుట్టూ ఆకుపచ్చని తెరను సరిగా ఏర్పాటు చేయలేదు. దీంతో ఎండ సమయంలో దీనిలో కూర్చునే అవకాశం ఉండడం లేదు. కొన్ని చోట్ల శునకాలు వీటిలో తిష్టవేస్తున్నాయి. అధికారులు హరితాశ్రయాలలో తాగునీరు సైతం ఏర్పాటు చేస్తే నగరవాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నగర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా.. నగర ప్రజల శ్రేయ స్సు దృష్ట్యా రూ.కోటితో 177 చలివేంద్రాలు, 63 గ్రీన్ షెల్టర్స్ను గతంలో ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఐలాండ్లు, హైవే, ముఖ్య కూడళ్ల వద్ద జీవీఎంసీ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశాం. అధికార యంత్రాంగం వీటిని సక్రమంగా నిర్వహించాలి. – గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్ -
ముక్కలు
రెక్కలు..గణనీయంగా పడిపోయిన వైజాగ్ ఎయిర్పోర్ట్ వృద్ధి రేటువిశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తును కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. గత ప్రభుత్వం చూపించిన శ్రద్ధతో ఎయిర్పోర్టు కొత్త రెక్కలు తొడుక్కుంది. నవ్య రూపం సంతరించుకుని అంతర్జాతీయ సర్వీసులను ఆకర్షించింది. కూటమి ప్రభుత్వం దీనికి రివర్స్లో విమానం రెక్కలు విరిచేసింది. దీంతో ఎయిర్పోర్టు వృద్ధి రేటులో తిరోగమనం దిశగా పయనిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : ఏడాది క్రితంతో పోలిస్తే విశాఖ విమానాశ్రయంలో విమాన సర్వీసులు, ప్రయాణికుల వృద్ధి క్రమంగా క్షీణిస్తోంది. కోవిడ్ తర్వాత మొదటిసారిగా ప్రయాణికుల రాకపోకల వృద్ధి రేటు 20 శాతం దిగువకు పడిపోవడమే దీనికి నిదర్శనం. గతంలో కనీసం 50 నుంచి 100 శాతానికి పైగా వృద్ధి నమోదయ్యేది. కానీ ఈ ఏడాది మార్చిలో కేవలం 17 శాతానికే పరిమితమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చేతకానితనం వల్ల ప్రయాణికుల రాకపోకల వృద్ధి రికార్డు స్థాయిలో తగ్గిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఉత్తరాంధ్రకు చెందిన వారైనా.. విమాన సర్వీసులు రద్దవుతున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని సర్వీసులు ఇతర ప్రాంతాలకు తరలించేయడం.. కొత్త సర్వీసులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. మార్చిలో 17 శాతం వృద్ధి మాత్రమే.! ప్రతి నెలా దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో విశాఖ ఎయిర్పోర్టు నుంచి ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్యను గణిస్తుంటారు. గతేడాది అదే నెలలో జరిగిన రాకపోకలతో పోల్చి వృద్ధి రేటు నమోదు చేస్తారు. ఈ వృద్ధి రేటు ఆధారంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తే ఎయిర్లైన్స్ సంస్థలు.. కొత్త సర్వీసులు నడిపేందుకు పోటీ పడుతుంటాయి. 2024 నవంబర్ వరకూ వైజాగ్ ఎయిర్పోర్టు గణనీయంగా వృద్ధి నమోదు చేసింది. దేశీయ విమాన సర్వీసుల్లో 80 నుంచి 100 శాతం వరకూ, అంతర్జాతీయ సర్వీసుల్లో 90 నుంచి 150 శాతం వరకూ వృద్ధి కనిపించింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం విశాఖను విస్మరించిందో అప్పటి నుంచి సర్వీసులు తగ్గిపోయాయి. ఫలితంగా ప్రయాణికుల వృద్ధి కూడా దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో 2,55,835 మంది ప్రయాణికులు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసుల్లో ప్రయాణించారు. 2024 మార్చిలో 2,17,243 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రయాణికుల సంఖ్య అంతగా పెరగకపోవడంతో వృద్ధి కేవలం 17.8 శాతం మాత్రమే నమోదైంది. గత ఐదేళ్ల కాలంలో కోవిడ్ మినహాయిస్తే.. ఇదే అత్యల్పం కావడం దురదృష్టకరం. ఈ ఏడాది మార్చిలో 2,55,835 మంది రాకపోకలు గతేడాది మార్చిలో 2,17,243 మంది ప్రయాణం గత మార్చితో పోలిస్తే కేవలం 17.8 శాతం మాత్రమే వృద్ధి కూటమి సర్కారు నిర్వాకంతో పలు విమాన సర్వీసుల రద్దు పట్టించుకోని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఏప్రిల్ నెలలో మరింత దిగజారనున్న వృద్ధి రేటు వచ్చిన విమానాలు వచ్చినట్లే మాయం మార్చిలో 20 శాతం దిగువన నమోదైతే.. ఏప్రిల్లో మరింత దిగువకు పడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏప్రిల్లో విజయవాడ సర్వీసులతో పాటు మరికొన్ని సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణించే వారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. ఇటీవల దుబాయ్ విమానం వైజాగ్ రాకుండా కూటమి సర్కారు అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. అదే నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయింది. ఇటీవలే బ్యాంకాక్, కౌలాలంపూర్ విమాన సర్వీసులు కూడా నిలిపేస్తున్నామని ప్రకటించాయి. విజయవాడ సర్వీసు ఆగిపోయింది. మిగిలిన డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో వైజాగ్ వచ్చేందుకు ఎయిర్లైన్స్ ఆసక్తి చూపిస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం రాకుండా మోకాలడ్డుతోంది. ఇలాగే కొనసాగితే వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి కొత్త సర్వీసులు వచ్చేందుకు అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోతాయని ప్రజలు, అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేడే మేయర్ ఎన్నిక
● కూటమి అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు ● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం డాబాగార్డెన్స్: జీవీఎంసీ మేయర్ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ను ప్రభుత్వం నియమించింది. కాగా కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ప్రకటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయనకు బీ–ఫారం అందజేశారు. మరోవైపు మేయర్ ఎన్నిక ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 10.30 గంటలకు గుర్తింపు కార్డులతో రావాలని సూచించారు. -
Visakha: జంట హత్యల కేసులో ఏం జరిగింది..?
విశాఖ: నగరంలోని చోటు చేసుకున్న జంట హత్యల కేసు పోలీసులకు కాస్త తలనొప్పిగా మారింది. దోపీడీ దొంగలు పనై ఉంటుందని తొలుత భావించిన పోలీసులకు ఆ అనావాళ్లు ఏవీ కనిపించడం లేదు. హత్యకు గురైన యోగేంద్ర(66), లక్ష్మీ(58) ఇంట్లో ఎటువంటి చోరీ జరగలేదని గుర్తించారు పోలీసులు. వారికి సంబంధించిన బంగారం ఆభరణాల్లో కొన్నింటిని ఇంట్లోనే గుర్తించారు. అయితే పాత కక్ష్యల కారణంగానే హత్య చేశారని భావిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు గుర్తించారు.ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు..ఈ జంట హత్యల కేసులో దుండగులు ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా.. అత్యంత పకడ్బందీగా నేరానికి పాల్పడటంతో కేసు ఛేదన పోలీసులకు సవాల్గా మారింది. ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి కేసు దర్యాప్తును అన్ని కోణాల్లోనూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. హత్యకు గురైన యోగేంద్రబాబు, ఆయన భార్య లక్ష్మి సుమారు 40 ఏళ్లుగా గాజువాకకు సమీపంలోని రాజీవ్నగర్ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారుయోగేంద్రబాబు నావల్ డాక్యార్డ్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. స్థానిక గ్లోరియా(ఎయిడెడ్) పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వారికి ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని స్థానికులు చెబుతున్నారు. వారి ఇద్దరు పిల్లలు శృతి, సుజన్ వివాహాలు చేసుకుని అమెరికాలో స్థిరపడటంతో.. ఇంట్లో వీరిద్దరు మాత్రమే ఉంటున్నారు. ఎవరితోనూ గొడవలు లేని వీరిని ఇంత దారుణంగా ఎవరు, ఎందుకు హత్య చేశారన్నది అంతుపట్టని ప్రశ్నగా మారింది.హత్య కోసం అదను చూసుకున్నారా?హత్యకు గురైన దంపతులు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లు సమాచారం. పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న దాని ప్రకారం గురువారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఈ హత్య జరిగి ఉండవచ్చు. అదే సమయంలో రాజీవ్నగర్లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుండగులు తమ పని కానిచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలో అదను చూసుకుని కాపు కాసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇంటికి బంధువులు వస్తే కానీ తెలియలేదు..శుక్రవారం రాత్రి వరకు ఈ దారుణం వెలుగులోకి రాలేదు. మృతుల బంధువుల కుమార్తె వారిని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి తాళం వేసి ఉండటం, లోపల ఫోన్ మోగుతుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి తలుపులు తెరవగా ఈ ఘోరం వెలుగుచూసింది. ఘటన జరిగిన సమయంలో పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వంటివి దర్యాప్తునకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. వారి పిల్లలు అమెరికా నుంచి వచ్చిన తర్వాతే ఇంట్లో ఏయే వస్తువులు, ఎంత నగదు, బంగారం పోయిందనే వివరాలు కచ్చితంగా తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
పాకిస్థాన్ నుంచి ఆపరేట్.. విశాఖలో లోన్ యాప్ ముఠా అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లోన్ యాప్.. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.ఈ ముఠా లోన్ యాప్ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్లో రూ. 2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నరేంద్ర భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. బంధువులకు పంపించారు. దీంతో అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.పాకిస్థాన్ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించిన పోలీసులు.. 18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్లు, రూ.60 లక్షల రూపాయల నగదును ఫ్రిజ్ చేశారు. -
సవాల్గా జంట హత్య కేసు
కూర్మన్నపాలెం: గాజువాకకు సమీపంలోని రాజీవ్నగర్లో జరిగిన జంట హత్యల కేసు పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారింది. దుండగులు ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా.. అత్యంత పకడ్బందీగా నేరానికి పాల్పడటంతో కేసు ఛేదన పోలీసులకు తలనొప్పిగా మారింది. ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి కేసు దర్యాప్తును అన్ని కోణాల్లోనూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. హత్యకు గురైన యోగేంద్రబాబు(66), ఆయన భార్య లక్ష్మి(58) సుమారు 40 ఏళ్లుగా రాజీవ్నగర్ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. యోగేంద్రబాబు నావల్ డాక్యార్డ్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. స్థానిక గ్లోరియా(ఎయిడెడ్) పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వారికి ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని స్థానికులు చెబుతున్నారు. వారి ఇద్దరు పిల్లలు శృతి, సుజన్ వివాహాలు చేసుకుని అమెరికాలో స్థిరపడటంతో.. ఇంట్లో వీరిద్దరు మాత్రమే ఉంటున్నారు. ఎవరితోనూ గొడవలు లేని వీరిని ఇంత దారుణంగా ఎవరు, ఎందుకు హత్య చేశారన్నది అంతుపట్టని ప్రశ్నగా మారింది. బంగారం కోసమా? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన ఇంటి ముందు, వెనుక తలుపులకు బయట నుంచి తాళాలు వేసి ఉన్నాయి. ఇంటి ప్రధాన ద్వారం తెరవగానే యోగేంద్రబాబు మృతదేహం కనిపించింది. లక్ష్మి మృతదేహం బెడ్రూమ్లో ఉంది. ఇంట్లో వస్తువులు కూడా చెల్లాచెదురుగా పడిలేవు. బీరువా తాళాలు కూడా పగలగొట్టినట్లు కనిపించలేదు. ఇది పోలీసులను మరింత గందరగోళానికి గురిచేస్తోంది. సాధారణంగా దొంగతనాలు జరిగితే ఇంట్లోని వస్తువులు అస్తవ్యస్తంగా ఉంటాయి. బీరువాలు పగలగొడతారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. అయితే హతురాలి మెడలో ఎప్పుడూ ఉండే నల్లపూస గొలుసు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. బహుశా బంగారం కోసమే ఈ హత్య జరిగి ఉండవచ్చనే ఓ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయినప్పటికీ ఇతర విలువైన వస్తువులు జోలికి వెళ్లకపోవడం అనుమానం కలిగిస్తోంది. వెలగని వీధిలైట్లు.. పనిచేయని సీసీ కెమెరాలు హత్యకు గురైన దంపతులు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లు సమాచారం. పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న దాని ప్రకారం గురువారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఈ హత్య జరిగి ఉండవచ్చు. అదే సమయంలో రాజీవ్నగర్లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుండగులు తమ పని కానిచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు ఈ దారుణం వెలుగులోకి రాలేదు. మృతుల బంధువుల కుమార్తె వారిని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి తాళం వేసి ఉండటం, లోపల ఫోన్ మోగుతుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి తలుపులు తెరవగా ఈ ఘోరం వెలుగుచూసింది. ఘటన జరిగిన సమయంలో పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వంటివి దర్యాప్తునకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. వారి పిల్లలు అమెరికా నుంచి వచ్చిన తర్వాతే ఇంట్లో ఏయే వస్తువులు, ఎంత నగదు, బంగారం పోయిందనే వివరాలు కచ్చితంగా తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కేసు ఛేదనకు క్రైం ఏసీపీ డి.లక్ష్మణరావు నేతృత్వంలో నగర క్రైం పోలీసులు, ఇన్స్పెక్టర్లు రాజీవ్నగర్లోనే మకాం వేసి జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేసులో కీలక ఆధారంగా భావిస్తున్న మిస్సింగ్ స్కూటీపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో రిపేర్ కోసం మెకానిక్లు వచ్చి స్కూటీని తీసుకెళ్లేవారని తెలియడంతో, స్థానిక మెకానిక్లందరినీ శనివారం సంఘటనా స్థలానికి పిలిపించారు. హతుల బంధువులతో గుర్తింపు పరేడ్ నిర్వహించారు. అయితే వారెవరూ హతులకు తెలిసిన వారు కాదని బంధువులు చెప్పడంతో పోలీసులు మరో కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. మెకానిక్ కాకుండా మరెవరైనా స్కూటీని తీసుకెళ్లే అవకాశం ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. మృతుల ఇంటి ముందు టు–లెట్ బోర్డు ఉండటంతో.. అద్దెకు కావాలని ఎవరైనా ఇంటి యజమానులను సంప్రదించారా అనే వివరాలను కూడా సేకరించారు. ఇదిలావుండగా దర్యాప్తులో భాగంగా మృతులిద్దరి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని కాల్ డేటా, ఇతర సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ కూడా సంఘటనా స్థలం నుంచి కొంత దూరం వరకు వెళ్లి వెనుతిరిగి వచ్చింది. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పంచనామా నిర్వహించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజీవ్నగర్లో దంపతుల దారుణ హత్య 8 బృందాలతో పోలీసుల దర్యాప్తు -
శతాబ్ది ఉత్సవాల లోగో రూపకర్త ఏయూ విద్యార్థి
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల లోగోను క్యాంపస్ ఫైన్ఆర్ట్స్ విభాగం బీఎఫ్ఏ విద్యార్థి షేక్ రఫీ రూపొందించారు. ఈ లోగో రూపకల్పన కోసం వీసీ ప్రత్యేక కమిటీని నియమించారు. వర్సిటీలో ఆసక్తి ఉన్న ఆచార్యులు, విద్యార్థులతో లోగోను తయారు చేయించారు. శతాబ్ది ఉత్సవాలకు అద్దం పట్టేలా సిద్ధం చేసిన మూడు లోగోలను కమిటీ సభ్యులు ఎంపిక చేసి.. వాటిని వీసీ ముందుంచింది. వీటిలో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి షేక్ రఫీ రూపొందించిన లోగోను ఎంపిక చేసి.. శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ వేదికపై అతిథులతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షేక్ రఫీను సత్కరించారు. -
మద్యం దుకాణం వద్దంటూ మహిళల ఆందోళన
కంచరపాలెం: ఇందిరానగర్–5 ప్రాంతంలోని జనావాసాల మధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. కంచరపాలెం జాతీయ రహదారికి ఆనుకుని సబ్వే పక్కన ఓ టిఫిన్ దుకాణంలో ఎస్వీఆర్ వైన్స్ పేరుతో మద్యం దుకాణాన్ని ప్రారంభించే ప్రయత్నం జరిగింది. దీంతో ఇందిరానగర్–5 కాలనీ మహిళలు మద్యం దుకాణం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జనావాసాలు, ఆలయాలకు దగ్గరలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకుల అండతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ధర్మాల ఆనందకుమార్ రెడ్డి, స్థానిక మహిళా నాయకులు పద్మ, అమ్మాజీ, మణి నేతృత్వంలో దుకాణం ముందు టెంట్లు వేసి, ప్లకార్డులతో ‘మద్యం దుకాణం వద్దు–భద్రతే మాకు ముద్దు’అంటూ నినాదాలు చేశారు. జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చినబాబు, యశోదరావు, త్రినాథ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఏరోస్పేస్ రంగానికి గ్లోబల్హబ్గా ఏపీ
ఏయూక్యాంపస్: ఏరోస్పేస్, రక్షణ, నావికాదళ ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేవ్ గ్లోబల్ హబ్గా మారుతుందని డీఆర్డీవో పూర్వ చైర్మన్, రాష్ట్ర ఏరోస్సేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి అన్నారు. సీఐఐ విశాఖ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్తో సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇన్నోవేషన్ క్లస్టర్లు, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్సేస్, నీటిలోపల వ్యవస్థలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ల అభివృద్ధి ప్రాముఖ్యతను తెలిపారు. విశాఖ నగరం నీటిలోపల అవసరమైన ఉపకరణాలు ఉత్పత్తి, ఆవిష్కరణలకు భవిష్యత్ కేంద్రంగా నిలుస్తుందన్నారు. సీఐఐ విశాఖ చైర్మన్ డి.వి.ఎస్.నారాయణ రాజు, ఎస్ఐడీఎం ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ జె.శ్రీనివాస రాజు, రక్షణ రంగ పరిశ్రమల ప్రతినిధులు, విధానాల రూపకర్తలు, సాంకేతిక ఆవిష్కర్తలు, ఎంఎస్ఎంఈ ప్రతినిధులు పాల్గొన్నారు. -
మహనీయుల త్యాగఫలం ఏయూ
● బీచ్రోడ్డులో వాక్థాన్ నిర్వహణఏయూక్యాంపస్/విశాఖ విద్య: ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం బీచ్రోడ్డులో వాక్థాన్ నిర్వహించారు. ఏయూ ఉపకులపతి ఆచా ర్య జి.పి.రాజశేఖర్, పూర్వ ఉపకులపతులు, ఏయూ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్కె బీచ్ నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందన్నారు. వచ్చే సంవత్సరం ఇదే రోజున శతాబ్ది ఉత్సవాల వేడుకను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఏయూ విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బంది ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్. ధనుంజయరావు, మాజీ వీసీలు ఆచార్య బీల సత్యనారాయణ, జి.ఎస్.ఎన్. రాజు, వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, వి.బాలమోహన్ దాస్, ఆర్.సుదర్శన రావు, ఎస్.రామకృష్ణ రావు, ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కె.వి.వి.రావు పాల్గొన్నారు. ఏయూ పరిపాలన భవనం వద్ద జరిగిన ప్రారంభోత్సవంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పాల్గొన్నారు. బీచ్రోడ్డులో వాక్థాన్ను ప్రారంభిస్తున్న వీసీ రాజశేఖర్ -
గాదిరాజు ప్యాలెస్లో బ్రాండెడ్ దుస్తుల అమ్మకాలు
ఎంవీపీకాలనీ: ఎంవీపీ కాలనీ గాదిరాజు ప్యాలెస్లో నిర్వహిస్తున్న లగ్జరీ బ్రాండెడ్ దుస్తుల అమ్మకాలకు నగర వాసుల నుంచి విశేష స్పందన లభించింది. 40 వేలకు పైగా దుస్తులను 90 శాతం తగ్గింపు ధరలతో ఈ అమ్మకాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఈ అమ్మకాలు ప్రారంభం కాగా మూడు రోజులపాటు అమ్మకాలు జరగనున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన రెడీమేడ్ దుస్తులను ఇక్కడ అందుబాటులో ఉంచారు. కుటుంబం మొత్తానికి అవసరమైన దుస్తులతో పాటు పెళ్లి సీజన్కు అవసరమైన దుస్తులు అందుబాటులో ఉన్నాయి. జీన్స్, టీషర్ట్స్, లేడీస్ కుర్తాలు, వెస్ట్రన్ వేర్, ఆఫీస్ వేర్, కిడ్స్ వేర్ ఇలా అన్ని తరగతులకు చెందిన ఆకర్షణీయమైన దుస్తులను విక్రయిస్తున్నారు. దీంతో పాటు బ్రాండెడ్ స్పోర్ట్స్ వేర్, ఫుట్వేర్ కూడా అందుబాటులో ఉంది. పురుషులకు రూ.200 నుంచి రూ.1,200 వరకు మహిళలకు రూ.200 నుంచి రూ.800 వరకు, పిల్లలకు రూ.150 నుంచి రూ.600 వరకు ధరల్లో అందిస్తున్నారు. ఈ నెల 28 వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ అమ్మకాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
భార్యతో గొడవ పడి బలవన్మరణం
మేడపై నుంచి దూకి భర్త మృతి మల్కాపురం: భార్యతో జరిగిన స్వల్ప వాగ్వాదంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి తన ఇంటి మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండస్ట్రియల్ కాలనీలో జరిగింది. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 61వ వార్డు ఇండస్ట్రియల్ కాలనీలో తుంపాల గోవింద్ (50) తన భార్య లీలారాణి, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నాడు. గోవింద్ మస్కట్, దుబాయ్ వంటి దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లి వస్తుంటాడు. ఇటీవల మస్కట్ నుంచి తిరిగి వచ్చిన గోవింద్.. తన స్నేహితులతో కలిసి తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి వచ్చాడు. గత కొంతకాలంగా గోవింద్ దంపతుల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. శనివారం మధ్యా హ్నం సుమారు 3 గంటల సమయంలో మద్యం సేవించి ఉన్న గోవింద్.. ఇంటి హాల్లో టీవీని పెద్ద శబ్దంతో చూస్తున్నాడు. అదే సమయంలో గదిలో పిల్లలతో నిద్రిస్తున్న ఆయన భార్య లీలారాణి ఆ శబ్దానికి ఇబ్బంది పడింది. దీంతో బయటకు వచ్చి ఎందుకు అంత పెద్ద శబ్దంతో టీవీ చూస్తున్నావని ప్రశ్నించింది. దీనిపై ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన గోవింద్ ఇంటి రెండో అంతస్తు పైకి పరుగు తీసి.. అక్కడి నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలపాలైన గోవింద్ను చూసి లీలారాణి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. వెంటనే కుటుంబ సభ్యుల సహాయంతో గోవింద్ను స్థానిక సెయింట్ ఆన్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి, అప్పటికే గోవింద్ మరణించినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మల్కాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తు జరుగుతోంది. కాగా.. పది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో దుస్తులు ఆరేస్తూ మేడపై నుంచి జారిపడి కోమలి అనే మహిళ మరణించింది. -
‘మత్స్యకారుల సేవలో’ చెక్కు పంపిణీ
బీచ్రోడ్డు: ‘మత్స్యకారుల సేవలో’ పథకం 2025–26 కింద జిల్లా నుంచి 12,138 మంది లబ్ధిదారులకు రూ.20 వేల చొప్పున రూ.24,27,60,000ను ప్రభుత్వం మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించగా, ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీసీ హాలు నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, మత్స్యకారులు వీక్షించారు. సీఎం ప్రసంగం అనంతరం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ లబ్ధిదారులకు ఈ మొత్తం చెక్కును అందజేశారు. మత్స్యకార సంఘాల ప్రతినిధులు, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఏయూ వారసత్వాన్నినిలబెడదాం
● ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.మధుమూర్తి పిలుపు ● ఏయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం ● విజన్ డాక్యుమెంట్, లోగోలు ఆవిష్కరించిన అతిథులు ● ఉత్సవాల్లో భాగంగా బీచ్రోడ్డులో వాక్థాన్ విశ్రాంత ఆచార్యులకు సత్కారం ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ిసీహెచ్ శాంతమ్మ, ఆచార్య బి.ప్రసాద్ రావులను ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం ఆచార్య ప్రసాదరావు చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం విద్యార్థుల మనసులను హత్తుకుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయ రుణం తీర్చుకోవాలని, విలువలతో కూడిన విద్యను అందించాలని ఉద్దేశంతో తాను స్థాపించిన పాఠశాల అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఏయూ విజన్ డాక్యుమెంట్, లోగోలను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమం ఆరంభంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు పూర్వ ఉపకులపతులు, విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆచార్యులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. విశాఖ విద్య: ఘనమైన వారసత్వం కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అభ్యున్నతికి అందరూ సమష్టిగా కృషి చేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి పిలుపునిచ్చారు. ఏయూ శతాబ్ది వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా బీచ్రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేకమంది జీవితాలను ప్రభావితం చేసిందన్నారు. అదే విధంగా యువ మస్తిష్కాలను తీర్చిదిద్దిన ఘనత ఏయూ సొంతమని చెప్పారు. ఇది దేశ ప్రగతికి, ప్రపంచ ప్రగతికి దోహదపడిందన్నారు. తనకు ఇక్కడ చెప్పలేనన్ని అపురూప జ్ఞాపకాలు ఉన్నాయని, విద్యార్థిగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులకు జ్ఞానంతో పాటు విలువలు ఎంతో అవసరమని చెప్పారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేదిగా ఈ ప్రయాణం నిలుస్తుందని మధుమూర్తి అన్నారు. జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. త్వరలో రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు అవుతుందని చెబుతూ.. దాని ప్రాముఖ్యాన్ని వివరించారు. భారతదేశానికి యువ జనాభా ఎంతో లాభదాయకంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్లో బోధన విధానాన్ని ఏఐ సాంకేతికత సవాలు చేసే దిశగా మారుతుందన్నారు. విద్య, పరిశోధన, ప్రజాసేవ రంగాల్లో ఏయూ తనదైన శైలిలో ముందుకు వెళ్లాలని సూచించారు. విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. విశిష్ట అతిథి ఐఐటీ పాలక్కాడ్ డైరెక్టర్ ఎ.శేషాద్రి శేఖర్ మాట్లాడుతూ సమగ్ర విద్యను అందించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ప్రాథమిక సూత్రాలు, శాస్త్ర సంబంధ అంశాలపై బలమైన పట్టు సాధించడం ఎంతో అవసరమని, అదే విధంగా సాఫ్ట్ స్కిల్స్ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా తాను ఈ స్థానంలో నిలవడానికి గల కారణం, సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ప్రతి విద్యార్థి జాతీయ విద్యా విధానం డాక్యుమెంట్ను చదవాలని సూచించారు. ఏయూ ప్రగతికి తా ను సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ దార్శనికుల వారసత్వం, నాయకత్వం ఏయూను మిగతా IIవ పేజీలో -
అవిశ్వాసానికి రండి.. రూ.కోటి ఇస్తాం!
● డిప్యూటీ మేయర్ కోసం కూటమి కుయుక్తులు ● మహిళా కార్పొరేటర్లకు బంపర్ ఆఫర్ ● స్టేట్ డైరెక్టర్ పోస్టులు ఇస్తామంటూ ఫోన్లు ● అయినా తలొగ్గని వైఎస్సార్ సీపీ మహిళా నేతలు సాక్షి, విశాఖపట్నం/డాబాగార్డెన్స్: మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మ్యాజిక్ ఫిగర్ కోసం కూటమి నేతలు ఎలాంటి ప్రయత్నాలు చేశారో.. ఇప్పుడు డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్పై అవిశ్వాస తీర్మానంలోనూ అదే తరహా పరిస్థితి కొనసాగింది. గతంలో మేయర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని నెగ్గించుకుని, ఆ పీఠాన్ని దక్కించుకోవడానికి 74 మంది కార్పొరేటర్ల బలం అవసరం కాగా, దాన్ని సాధించేందుకు చివరి నిమిషం వరకు కార్పొరేటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటి ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు 74 మంది బలంతో ఆ అవిశ్వాసం నెగ్గింది. శనివారం జరిగిన డిప్యూటీ మేయర్ పీఠం విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. డిప్యూటీ మేయర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి 74 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందేమోనన్న భయంతో కూటమి నేతలు చివరి నిమిషం వరకు ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడ్డారు. తమ వద్ద ఉన్న కార్పొరేటర్లపై పూర్తి విశ్వాసం లేని తెలుగుదేశం, జనసేన, బీజేపీ శాసనసభ్యులు, కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి చెందిన మహిళా కార్పొరేటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. కొందరు మహిళా కార్పొరేటర్లకు ఫోన్లు చేసి, అవిశ్వాస ఓటింగ్కు హాజరై, డిప్యూటీ మేయర్కు వ్యతిరేకంగా ఓటు వేస్తే బంపర్ ఆఫర్ ఇస్తామంటూ ఆశ చూపారు. రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవిని కల్పిస్తామని, అదనంగా కోటి రూపాయలు కూడా ఇస్తామని ఫోన్లలో బేరసారాలు జరిపారు. వెంటనే నగదు బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఎలాగైనా వచ్చి ఓటు వేయాలని కోరారు. అయితే, కూటమి నేతల ప్రలోభాలకు వైఎస్సార్ సీపీ మహిళా కార్పొరేటర్లు ఏమాత్రం లొంగలేదు. వారి ఆఫర్లను గట్టిగా తిరస్కరించారు. పార్టీ గుర్తుపై గెలిచి, ఇలాంటి వాటికి లొంగే దుర్బుద్ధి తమకు లేదని ఘాటుగా బదులివ్వడంతో కూటమి నేతలు తొకముడిచారు. చివరికి తమ శిబిరంలో ఉన్న 74 మంది కార్పొరేటర్లను బతిమాలుకుని డిప్యూటీ మేయర్పై అవిశ్వాస ఓటింగ్కు తీసుకొచ్చారు. ఆ 74 మందిని కాపాడుకోవడానికి చివరి నిమిషం వరకు అష్టకష్టాలు పడిన కూటమి.. అవిశ్వాసంలో కేవలం ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించి బతుకు జీవుడా అని ఊపిరిపీల్చుకుంది. కాగా.. డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని కూడా వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ కార్పొరేటర్లు బహిష్కరించారు. గుర్తింపు కార్డు ఉన్నవారికే జీవీఎంసీ ప్రాంగణంలోకి అనుమతిస్తామని కలెక్టర్ ప్రకటించినా.. క్షేత్ర స్థాయిలో ఆయన ఆదేశాలు అమలు కాలేదు. కూటమి చోటా నాయకులు సైతం దర్జాగా జీవీఎంసీలోకి ప్రవేశించడం గమనార్హం. -
ఓటింగ్ను బహిష్కరించిన వైఎస్సార్ సీపీ
తాటిచెట్లపాలెం: జీవీఎంసీ డిప్యూటీ మేయర్పై శనివారం అవిశ్వాస తీర్మానం సందర్భంగా నిర్వహించిన ఓటింగ్ను వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బహిష్కరించారు. వీరంతా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మాట్లాడుతూ డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం విషయంలో కూటమి అడ్డదారుల్లో గెలిచిందని ఆరోపించారు. తమ పార్టీ మహిళా కార్పొరేటర్లకు అర్ధరాత్రి ఫోన్లు చేసి బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, కార్పొరేటర్లు జియ్యాని శ్రీధర్, బానాల శ్రీనివాసరావు, దౌలపల్లి ఏడుకొండలరావు, కోరుకొండ వెంకట రత్న స్వాతి, కె.అనిల్కుమార్ రాజు, నక్కెళ్ల లక్ష్మీ సురేష్, సాడి పద్మారెడ్డి, పల్లా అప్పలకొండ, తోట పద్మావతి, చెన్న జానకిరామ్, గుండాపు నాగేశ్వరరావు, కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్, అల్లు శంకరరావు, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, కరజాడ వెంకట నాగ శశికళ, పి.వి.సురేష్, బల్ల లక్ష్మణరావు, గుడివాడ అనూష లతీష్, పార్టీ నాయకులు గొలగాని శ్రీనివాస్, అక్కరమాని మంగరాజు, మొల్లి అప్పారావు, పల్లా దుర్గ, గులిగిందల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కేజీహెచ్ని అభివృద్ధి చేస్తాం
సీఎం చంద్రబాబుసాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్ని అభివృద్ధి చేసి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా మార్చుతామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో పూర్వ విద్యార్థులు నిర్మించిన సెంటనరీ భవనాన్ని శనివారం రాత్రి ప్రారంభించారు. అనంతరం అంబేడ్కర్ ఆడిటోరియం, డిజిటల్ లైబ్రరీ, విజ్ఞాన పరిశోధన కేంద్రాలను రిమోట్ సాయంతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ కేజీహెచ్ అభివృద్ధికి అవసరమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. కేజీహెచ్లో ప్రత్యేక క్యాన్సర్ బ్లాక్ రాబోతోందన్నారు. వైద్య రంగంలోనూ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరగాలని సూచించారు. మెడిసిన్ చదువుకున్న వారు కూడా పీజీకి అనుబంధంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. పూర్వ విద్యార్థులు కలిసికట్టుగా తాము చదివిన కళాశాలలను అభివృద్ధి చేస్తుండటం ప్రశంసనీయమన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఏఎంసీ అభివృద్ధి చెందాలని సూచించారు. ఆన్లైన్ విధానంలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందించే వ్యవసను తీసుకొచ్చేందుకు ప్రతి వైద్యుడు కృషి చెయ్యాలని చంద్రబాబు అన్నారు. మంత్రులు డోలా బాలా వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, సత్యకుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సెంటనరీ భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు -
రోజ్గార్ మేళాలో 278 మందికి నియామక పత్రాలు
తాటిచెట్లపాలెం: దేశవ్యాప్తంగా 15వ రోజ్గార్ మేళా శనివారం వివిధ ప్రాంతాల్లో జరిగింది. ఇందులో భాగంగా విశాఖపట్నం సాలగ్రామపురంలోని సాగరమాల పోర్ట్ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా మాట్లాడుతూ, యువత దేశ నిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నప్పుడే దేశం వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తుందని, ప్రపంచ వేదికపై గుర్తింపు లభిస్తుందని అన్నారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు 278 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్, జీఎస్టీ జోన్ చీఫ్ కమిషనర్ సంజయ్ రాఠీ, కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్. శ్రీధర్, సీజీఎస్టీ ఆడిట్ కమిషనర్ పి.ఆనంద్కుమార్, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల(నాసిన్) అదనపు డైరెక్టర్ జనరల్ ఈదర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటే భవిత
● అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఆపరేటింగ్ పార్టనర్ శివకుమార్ ● ఘనంగా ఐఐఎం ఈఎంబీఏ ప్రత్యేక స్నాతకోత్సవం ● 124 మందికి పట్టభద్రులకు అవార్డులు బీచ్రోడ్డు: వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడం వల్ల వ్యక్తిగత వృద్ధితోపాటు సంతృప్తిని పొందవచ్చని అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఆపరేటింగ్ పార్టనర్ డి.శివకుమార్ అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం (ఐఐఎం) ఈఎంబీఏ ప్రత్యేక స్నాతకోత్సవాన్ని శనివారం నగరంలోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు స్వీయ–విలువను స్వతంత్రంగా నిర్వచించుకోవాలన్నారు. పోలికల ఒత్తిళ్లను నిరోధించాలని సూచించారు. మోసపూరిత సిండ్రోమ్ను అధిగమించడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. ఐఐఎం గవర్నర్ల బోర్డు సభ్యుడు ప్రొఫెసర్ జనత్ షా మాట్లాడుతూ వ్యాపారం ద్వారా సానుకూల సామాజిక ప్రభావాన్ని సృష్టించడం, వాటి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఐఐఎం విశాఖపట్నం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ డైరెక్టర్ నివేదికను సమర్పించారు. ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తుచేసేందుకు ప్రత్యేక స్నాతకోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్థలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు (పీజీపీఎంసీఐ)ల్లో పనిచేస్తున్నవారు కోసం ప్రారంభించిన ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (ఈఎంబీఏ), పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ కోర్సులను వీరంతా దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు. అభ్యర్థుల్లో సుమారు 70 శాతం మంది వ్యూహాత్మక ఆలోచన, విస్త్తృత వ్యాపార దృక్పథాలు, మెరుగైన విశ్వాసం, విశ్వసనీయతలో మెరుగుదలను నివేదించారని పేర్కొన్నారు. దాదాపు 60 శాతం మంది తమ నాయకత్వ సామర్థ్యాల్లో వృద్ధిని చూశారన్నారు. 27 శాతం మంది గ్రాడ్యుయేట్లు ప్రమోషన్లు లేదా కొత్త అవకాశాల ద్వారా కెరీర్ పురోగతిని సాధించారన్నారు. ఇద్దరికి గోల్డ్ మెడల్ ఈఎంబీఏ ప్రోగ్రామ్ నుంచి మొత్తం 124 మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారు. ఈ కోర్సులో అగ్రస్థానంలో నిలిచిన నవనీత్ బత్రాకు, రెండో స్థానంలో నిలిచిన అనిర్బన్ దత్తాకు గోల్డ్ మెడల్ను అందజేశారు. వేడుకలో సుమారు 200 మంది గ్రాడ్యుయేట్లను సత్కరించారు. -
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?
విశాఖపట్నం, సాక్షి: కూటమి కీలక నేతలు బహిరంగంగానే.. అదీ కార్యకర్తల సమక్షంలో గొడవకు దిగారు. ఇంతకాలం టీడీపీ-జనసేన గొడవలు మాత్రమే చూస్తున్న ఏపీ ప్రజలకు ఇవాళ్టి కొత్త వివాదం ఆసక్తికరంగా అనిపించింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. బహిరంగంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కెమెరా కంటికి చిక్కింది.శనివారం బహిరంగంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణు కుమార్ రాజు మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే వేలు పెడుతున్నారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారు?’’ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ను ప్రశ్నించారు. అయితే.. లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో మీరు ఆరోజు అందుబాటులో లేరని, మీరు లేకపోవడంతో కలెక్టర్ ని కలిసి వినత పత్రం సమర్పించామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ సర్దిచెప్పబోయారు. అయినా కూడా వినకుండా గంటా విష్ణుతో వాగ్వాదం కొనసాగించారు. వాహనంలో కూర్చొనో గంటా విష్ణుపై కేకలు వేయగా.. దానికి బయటి నుంచే విష్ణుకుమార్ కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
చంద్రమౌళికి ఘన వీడ్కోలు
బీచ్రోడ్డు (విశాఖ): ఉగ్రమూకల చేతిలో మరణించిన చంద్రమౌళి భౌతిక కాయానికి విశాఖ నగరవాసులు, ప్రముఖులు ఘన వీడ్కోలు పలికారు. ఈ నెల 22న కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి భౌతిక కాయం 23న నగరానికి చేరుకుంది. కుమార్తెలిద్దరూ గురువారం సాయంత్రానికి నగరానికి చేరుకోవటంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.చంద్రమౌళి భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. హోంమంత్రి వంగలపూడి అనిత, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్,, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేశ్, వైఎస్సార్సీపీ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు అదీప్రాజు, కరణం ధర్మశ్రీ, డిప్యూటీ మేయర్ శ్రీధర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చంద్రమౌళి పాడెను మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేశ్, మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మోశారు. భౌతికకాయాన్ని అంతిమయాత్ర వాహనంలోకి ఎక్కించారు. అక్కడ నుంచి నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లి హిందూ సంప్రదాయంలో చంద్రమౌళికి దహన సంస్కారాలు చేపట్టారు. కాగా దేశంలో ఉగ్రవాదులు లేకుండా అంతం చేస్తేనే చంద్రమౌళి అత్మకు శాంతి లభిస్తుందని ఆయన స్నేహితులు, తోటి ఉద్యోగులు మీడియాకు తెలిపారు. -
విశాఖలో దంపతుల దారుణహత్య
విశాఖపట్నం: విశాఖ నగరం గాజువాక సమీపంలోని రాజీవ్నగర్లో భార్యాభర్తలు దారుణహత్యకు గురయ్యారు. డాక్యార్డులో పనిచేసి రిటైరైన గంపాల యోగేంద్రబాబు (66), లక్ష్మి (58) దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వారు 35 ఏళ్లుగా రాజీవ్నగర్లో ఉంటున్నారు. రెండు రోజుల కిందట హైదరాబాద్ వెళ్లిన వారు గురువారం ఉదయం ఇంటికి చేరుకున్నారు.శుక్రవారం రాత్రి వరకు వారి ఇంటి తలుపులు తెరవకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికంగా ఉన్న బంధువుల అమ్మాయి ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి రెండువైపులా తాళం వేసి ఉండటాన్ని గమనించింది. అనుమానం వచ్చిన.. స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు అక్కడికి చేరుకుని తాళాలు పగలుగొట్టించి తలుపులు తెరిచారు. లోపలికి వెళ్లి చూస్తే హాల్లో యోగేంద్రబాబు, బెడ్రూమ్లో లక్ష్మి రక్తపుమడుగులో పడి ఉన్నారు. వారు అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. యోగేంద్రబాబుది మచిలీపట్నం కాగా లక్ష్మిది శ్రీహరిపురం. 40 ఏళ్ల కిందట కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారికి వివాహాలు జరిగి, అమెరికాలో స్థిరపడ్డారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరించింది. -
ఆచార్య చలంకు అంబేడ్కర్ అవార్డు
విశాఖ సిటీ: యూపీఎస్సీ పూర్వ సభ్యుడిగా, ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా, ఉత్తరాంధ్ర ఉద్యమ నిర్మాతగా తెలుగు వారికి చిరపరిచితులైన ప్రొఫెసర్ చలంకు తమిళనాడు వీసీకే పార్టీ ఇచ్చే డాక్టర్ అంబేడ్కర్ అవార్డు వరించింది. ఏటా డాక్టర్ అంబేడ్కర్, పెరియార్ పేరు మీద ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డులను ఈ ఏడాది చలంనకు, ప్రముఖ కన్నడ రచయిత దేవనూర్ మహాదేవలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆచార్య చలం ఏయూ నుంచి జాతీయ స్థాయి రాజ్యాంగ పదవి(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు) పొందిన మొదటి ఆచార్యులు. గతంలో వీసీకే అంబేడ్కర్ అవార్డును తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ప్రదానం చేశారు. ఆచార్య చలం రాసిన పుస్తకాలు మూడు తమిళంలోకి చింతన్ బుక్స్ చైన్నె వారు అనువాదం చేయగా అవి ప్రాచుర్యం పొందాయి. నాలుగో పుస్తకం ఇంగ్లిష్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ సౌత్ ఇండియా ద్రవిడియన్ మార్వెల్ ఇపుడు తమిళంలోకి అనువాదం అవుతోంది. ఆయన ఇప్పటి వరకు ఇంగ్లీష్లో 28, తెలుగులో 14 పుస్తకాలు ప్రచురించారు. రాజకీయాలకు అతీతంగా, దేశ గౌరవాన్ని పెంచే ప్రముఖులకు మాత్రమే ఇచ్చే అవార్డును అందుకోవాలని వీసీకే పార్టీ కార్యదర్శి, ఎంపీ రవికుమార్ విజ్ఞప్తి చేయగా చలం అందుకు అంగీకరించారు. దీంతో వీసీకే వారు శుక్రవారం చైన్నెలో చలంనకు ఈ అవార్డును ప్రకటించారు. ఆచార్య చలం -
నాటి సంస్కరణల ఫలితం.. ‘పది’లో రికార్డ్ విజయం
● నడుపూరు ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఫలితాలు ● 500+ మార్కులతో మెరిసిన 49 మంది విద్యార్థులు ● విద్యార్థులను కార్లలో ఊరేగించిన టీచర్లు వసతులతో పెరిగిన ఆసక్తి నాడు–నేడుతో పాటు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం నిర్వహించిన ఆరోగ్య శిబిరాలు వంటి పథకాలు పేద విద్యార్థులను బడికి దగ్గర చేశాయి. ముఖ్యంగా ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులను సిద్ధం చేసే లక్ష్యంతో డిజిటల్ విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. పాఠశాలలకు డిజిటల్ బోర్డులు, టీవీలు ఏర్పాటు చేసి అద్భుతమైన కంటెంట్ను రూపొందించారు. విద్యార్థులు ఇళ్ల వద్ద కూడా ఆయా సబ్జెక్టులను రివిజన్ చేసుకునేందుకు వీలుగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించారు. ఈ పథకాలన్నీ విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచి.. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయి. పెదగంట్యాడ: నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సంచలన ఫలితాలు సాధించి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలిచారు. ఈ ఏడాది ఏకంగా 49 మంది విద్యార్థులు 600 మార్కులకు గాను 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో పాఠశాల ఉపాధ్యాయులు వినూత్నంగా సంబరాలు చేసుకున్నారు. ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యం, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలే అని చెప్పడంలో సందేహం లేదు. నాడు–నేడుతో మారిన రూపురేఖలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ‘నాడు–నేడు’పథకం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనే మార్చి వేసింది. నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.1.86 కోట్లు కేటాయించి, పాఠశాల భవనాలకు జీవం పోసింది. తరగతి గదులు ఆధునికీకరణ, డిజిటల్ బోర్డులు, టీవీల ఏర్పాటు, సురక్షితమైన టాయిలెట్లు, తాగునీటి ప్లాంట్, ఫ్లోరింగ్, మెరుగైన వాతావరణం కోసం మొక్కల పెంపకం వంటి మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇలా ప్రయివేటు పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించింది. అయితే.. ప్రభుత్వం మారిన తర్వాత 8 తరగతి గదుల నిర్మాణం నిధుల్లేక అసంపూర్తిగా మిగిలిపోవడం గమనార్హం. ప్రోత్సాహం, పట్టుదలతో ఫలితాలు ప్రభుత్వం కల్పించిన ఈ అద్భుతమైన మౌలిక వసతులు, ప్రోత్సాహకాలకు తోడు పాఠశాల ఉపాధ్యాయుల అంకితభావం, కృషి కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, వారి సందేహాలను నివృత్తి చేయడం, పరీక్షల భయాన్ని పోగొట్టి వారిని సన్నద్ధం చేయడంలో ఉపాధ్యాయులు సఫలీకృతులయ్యారు. ప్రజల్లోకి విజయం ఈ విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచేందుకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులను కార్లలో ఊరేగించారు. విద్యార్థులు సాధించిన మార్కులను ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ.. ప్రైవేటుకు స్వస్తి పలికి సర్కార్ బడుల్లో చేర్పించాలంటూ విస్తృత ప్రచారం చేశారు. అలాగే ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులకు హెచ్ఎం రాచకొండ శ్రీనివాస్ శుక్రవారం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయంతో గర్వంగా ఉందన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న పిల్లలను సైతం ఇక్కడ చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందితో కలసి ఆరు బృందాలను ఏర్పాటు చేశామని, నాలుగు రోజుల పాటు మండలంలోని ఇంటింటికీ వెళ్లి పిల్లలను తమ బడిలో చేర్పించాలని కోరుతున్నట్లు వివరించారు. 10వ తరగతిలో 584, 580 మార్కులు సాధించిన విద్యార్థులను ఊరేగిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు -
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
మర్రిపాలెం: ఈదుల పూర్ణ చంద్రిక (11) అనే బాలిక వింతగా ప్రవర్తిస్తూ, కేకలు వేస్తూ, పట్టుకుంటే కరవడంతో తల్లి, అమ్మమ్మ ఆమెను అదుపు చేసే ప్రయత్నంలో ముఖానికి గుడ్డ కట్టి, బోర్లా పడుకోబెట్టారు. కొంత సమయానికి బాలిక చలనం లేకుండా మృతి చెందింది. ఊపిరి ఆడకపోవడం వల్ల మృతి చెంది ఉండవచ్చని చర్చి ఫాదర్ తెలిపారు. అయితే, బాలిక మృతిపై తండ్రి మల్లేశ్వరరావు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వెస్ట్ ఏసీపీ జె. పృధ్వీతేజ తెలిపిన వివరాల ప్రకారం, బాలిక 20 రోజులుగా వింతగా ప్రవర్తిస్తుండటంతో దెయ్యం పట్టిందని భావించి తల్లి, అమ్మమ్మ చర్చిల్లో ప్రార్థనలు చేయించారు. గురువారం జ్ఞానాపురం చర్చిలో బాలిక మృతి చెందింది.తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ జి. అప్పారావు, ఎస్సై దివ్యభారతి పాల్గొన్నారు. -
ట్రైబల్ ఆర్చరీ పోటీలు ప్రారంభం
కొమ్మాది: బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని జన జాతీయ గౌరవ్ వర్ష్ కార్యక్రమంలో భాగంగా జన జాతీయ ఖేల్ మహోత్సవ్– ట్రైబల్ ఆర్చరీ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. గీతం కళాశాల ప్రాంగణంలో శుక్రవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన యువత తమ సంప్రదాయ విలువలు, నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇటువంటి వేదికలు ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్యా రంగంలోనూ గిరిజన విద్యార్థులు ముందంజలో ఉన్నారని, ఇటీవల విడుదలైన 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో మంచి ఫలితాలు సాధించడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల కోసం విలువిద్య(ఆర్చరీ) పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నివసిస్తున్న 27.39 లక్షల గిరిజనుల సమగ్ర సామాజిక, ఆర్థిక, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి గిరిజన కళా ప్రదర్శనలు, నృత్యోత్సవాలు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, గిరిజన పండుగలను విశాఖ, విజయవాడ, ఐటీడీఏ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఆర్చరీ పోటీలకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, అండమాన్ నికోబార్ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. టీసీఆర్టీఎం ఈడీ రాణిమందా సిబ్బంది పాల్గొన్నారు. -
ఉగ్రదాడి మృతులకు ముస్లింల నివాళి
తాటిచెట్లపాలెం: ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తాటిచెట్లపాలెంలో ముస్లింలు శాంతియుత ర్యాలీ చేపట్టారు. రైల్వే న్యూకాలనీ జంక్షన్ వద్ద గల మసీదులో శుక్రవారం ప్రార్థనలు పూర్తయిన అనంతరం, ఉగ్ర దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. హింసను విడనాడాలని, ఉగ్రవాదం పూర్తిగా అంతం కావాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో మసీదు పెద్దలతో పాటు ముస్లింలు, చిన్నారులు పాల్గొన్నారు. -
అవిశ్వాసం!
డిప్యూటీ మేయర్పై సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్పై అవిశ్వాసం విషయంలో కూటమి పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ మేయర్ సీటు తమదేనని జనసేన నేతలు ప్రచారం చేస్తుండగా, కాదు కాదు మాకేనని టీడీపీ మేయర్ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు అనుచరులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి కట్టబెడతారో తేల్చకుండానే కూటమి అవిశ్వాసానికి సిద్ధమైంది. శనివారం డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్పై అవిశ్వాసానికి కూటమి ఏర్పాట్లు చేసింది. డిప్యూటీ మేయర్ ఎవరికి ఇస్తారో తేల్చకుండా అవిశ్వాసానికి కూటమి నేతలు వెళుతుండడంతో కార్పొరేటర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ వర్గానికి డిప్యూటీ మేయర్ పదవిపై స్పష్టత ఇస్తే తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటామని పదవి ఆశిస్తున్న కార్పొరేటర్లు కూటమి నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ముందుగా డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తే, మిగిలిన నేతల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీంతో అవిశ్వాసం వీగిపోయే ప్రమాదముందని కూటమి నేతలు భావిస్తున్నారు. మొన్నటి మేయర్ అవిశ్వాసం ఓటింగ్లో కూడా చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ మేయర్ విషయంలో మాత్రం అవిశ్వాసం వీగిపోతుందని కూటమి పార్టీల్లోని కార్పొరేటర్లే అంతర్గతంగా చర్చించుకుంటుండడం గమనార్హం. తమకంటే తమకు కావాలంటూ...! మేయర్ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో బహిరంగంగా అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ, అవిశ్వాసం సమయానికి స్పష్టత ఉంది. మేయర్ పోటీలో పీలా శ్రీనివాసరావు బరిలో ఉన్నట్లు కార్పొరేటర్లతో పాటు కూటమి పార్టీల్లోని నేతలకూ సమాచారం ఉంది. అయితే, డిప్యూటీ మేయర్ విషయంలో మాత్రం ఈ స్పష్టత ఎక్కడా లేదు. డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం విషయంలో కూటమి పార్టీలో చీలికలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి మేయర్ పదవి ఇచ్చిన నేపథ్యంలో పొత్తు ధర్మంలో భాగంగా డిప్యూటీ మేయర్ తమకు కావాలంటూ జనసేన పార్టీ కోరుకుంటోంది. డిప్యూటీ మేయర్ పదవి తమకే ఇస్తారని ఆ పార్టీ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ కార్పొరేటర్ల సమావేశంలో చెప్పారు. అయితే, అదే సమయంలో ఆ పార్టీ నుంచి ఆరుగురు ఆశావహులున్నారు. జనసేన నుంచి కందుల నాగరాజు, ఉష శ్రీ, హేమలత, భీశెట్టి వసంతలక్ష్మి, వంశీరెడ్డి, సాధిక్లు పదవి ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి ఇస్తారనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఎవరికివారుగా తమదే సీటు అని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీలో కూడా డిప్యూటీ మేయర్ పోస్టు కోసం పోటీ ఉంది. పల్లా శ్రీను, గంధం శ్రీనులు ఆశిస్తున్నారు. అభ్యర్థి తెలియక కూటమి పార్టీలో తికమక తమకేనంటూ జనసేన ప్రచారం తమకూ కావాల్సిందేనంటున్న టీడీపీలోని మరో వర్గం నేడు డిప్యూటీ మేయర్పై అవిశ్వాసంజనసేనలో కూడా చీలిక జనసేన పార్టీలో కూడా డిప్యూటీ మేయర్ పదవి ఆశిస్తున్న వారిలో రెండు వర్గాలుగా విడిపోయినట్టు తెలుస్తోంది. మొదటి నుంచీ పార్టీలో ఉండి..కార్పొరేటర్గా పార్టీ గుర్తుపై గెలిచిన వారికే ప్రాధాన్యత ఉండాలనే వాదన ఉంది. ఈ వాదనను జనసేన ఫ్లోర్ లీడర్తో పాటు నిత్యం వార్తల్లో ఉండే మరో కార్పొరేటర్ తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే మొదటి నుంచీ పార్టీలో లేరనే వాదనతో తమను పట్టించుకోకపోవడం సరికాదని ఉష శ్రీ, సాధిక్, కందుల నాగరాజు తదితరులు వాదనకు దిగుతున్నారు. డిప్యూటీ మేయర్గా మహిళలకే అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్తో పాటు ఉష శ్రీ కూడా మరో వాదన వినిపించడం ప్రారంభించారు. దీంతో అభ్యర్థిత్వం విషయంలో ఆ పార్టీ కూడా తేల్చుకోలేకపోతోంది. ఇక సందులో సడేమియా అన్నట్టుగా స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన విల్లూరి భాస్కరరావు కూడా డిప్యూటీ మేయర్ పదవి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేత, ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్ సీతంరాజు సుధాకర్ ద్వారా ఆయన పావులు కదుపుతున్నట్టు సమాచారం. మొత్తంగా డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం విషయంలో కూటమి పార్టీలో నెలకొన్న విభేదాలు ఓటింగు విషయంలో స్పష్టంగా బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తోంది. తద్వారా వైఎస్సార్ సీపీ ఖాతాలోనే డిప్యూటీ మేయర్ పదవి ఉంటుందని కూడా అంతే బలంగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
బీచ్రోడ్డు: దివ్యాంగులు తమలోని ప్రతిభను వెలికితీసి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ప్రభు త్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఐడీబీఐ సామాజిక బాధ్యత నిధులతో అలీంకో సంస్థ తయారు చేసిన రూ. 49.01 లక్షల విలువైన 380 అత్యాధునిక ఉపకరణాలను శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 241 మంది దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగుల శారీరక, మానసిక దృఢత్వం కోసం రూ. 200 కోట్లతో 25 ఎకరాల్లో అత్యాధునిక పారా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రీజినల్ సెంటర్ ఏర్పాటుకు కలెక్టర్ సహకారంతో స్థలం కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. గత డిసెంబర్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో దివ్యాంగుల అవసరాలు గుర్తించి ఈ ఉపకరణాలు ఎంపిక చేశామన్నారు. పంపిణీ చేసిన వాటిలో బ్యాటరీతో నడిచే మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, సాధారణ ట్రైసైకిళ్లు, వాకింగ్ స్టిక్స్, కమోడ్తో కూడిన వీల్ చైర్లు, ఫోల్డింగ్ వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలు, జాయ్స్టిక్ వీల్ చైర్లు, కర్రలు, కాలిపర్స్, రోలేటర్ వంటి 380 రకాల ఉపకరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ హరేందిర ప్రసాద్ దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణు కుమార్ రాజు, ఐడీబీఐ జనరల్ మేనేజర్ కన్వాడెబ్ దాస్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ మాధవి, దివ్యాంగులు పాల్గొన్నారు. రూ. 49 లక్షల విలువైన ఉపకరణాలు పంపిణీ జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి -
భద్రత కట్టుదిట్టం
● పాక్ కవ్వింపు చర్యల నేపథ్యంలో తూర్పు నౌకాదళం అప్రమత్తం ● సాగరజలాల్లో దూకుడుగా సన్రైజ్ ఫ్లీట్ ● సమర సన్నద్ధతపై సమీక్షించిన ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ పెందార్కర్ ● ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్న తూర్పు నౌకాదళం ● వార్షిప్స్, సబ్మైరెన్లలో పనిచేసే సిబ్బందికి సెలవులు రద్దు ● సముద్ర జలాల్లో పహారా కాస్తున్న యుద్ధ నౌకలు ● సాగర గర్భంలో మాటువేసిన జలాంతర్గాములు సాక్షి, విశాఖపట్నం : ముష్కరుల దమనకాండతో భారత్ రగిలిపోతోంది. దౌత్య పరమైన చర్యలు ఇప్పటికే తీసుకొని పాక్ మూలాలపై దెబ్బకొట్టిన భారత్.. మరో అడుగు ముందుకేసి.. సమరానికై నా సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. దేశ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఎలాంటి పరిస్ధితిని అయినా ఎదుర్కొనేందుకు విశాఖ కేంద్రంగా తూర్పు నౌకాదళం సిద్ధమవుతోంది. సాగర జలాల్లో యుద్ధ సన్నద్ధతను చాటుకునే ప్రయత్నాలను ప్రారంభించింది. పాక్ నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తీరంలో గస్తీని పెంచింది. సన్రైజ్ ఫ్లీట్ను అప్రమత్తం చేస్తూ ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏ సమయంలోనైనా ఎక్కడ నుంచైనా పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు సముద్ర జలాల్లో యుద్ధ నౌకలు, సబ్మైరెన్లు పహారా కాస్తున్నాయి. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకూ వార్షిప్స్, సబ్మైరెన్లలో విధులు నిర్వర్తించే సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రమూకల దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్ధితులను ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి. ఇదే క్రమంలో విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు నౌకాదళం కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అందాయి. దీంతో ఈస్ట్రన్ నేవల్ కమాండ్లో అలర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతంలో గస్తీని పెంచడంతో పాటు యుద్ధ నౌకలు, సబ్మైరెన్లలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సెలవులను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. తూర్పు నౌకాదళ పరిధిలోకి ఇతరుల ప్రవేశాన్ని కూడా నిషేధించారు. తూర్పు నౌకాదళాధిపతి రాజేష్ పెందార్కర్ తూర్పు స్వార్డ్ సన్రైజ్ ఫ్లీట్ సిబ్బందితో గురువారం సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించారు. నేవల్ బేస్లో జరిగిన ఈ సమావేశంలో ఇటీవల చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించిన సన్రైజ్ ఫ్లీట్ సిబ్బందిని ప్రశంసించారు. దేశ కార్యాచరణ అవసరాలు తీర్చేందుకు ప్రతి ఒక్క సెయిలర్, అధికారి సిద్ధంగా ఉండాలని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భద్రతా పరిస్థితిపై మరింత దృష్టిసారించాలంటూ దిశానిర్దేశం చేశారు. అత్యవసర కార్యకలాపాలకు సంయమనంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. మారిటైమ్ భద్రత, కార్యాచరణ సవాళ్లతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిపైనా దృష్టి సారించాలన్నారు. వ్యక్తిగత భద్రత, సైబర్, సమాచార భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. దేశ ప్రయోజనాల కోసం.. భారతీయుల భద్రత కోసం ఎక్కడ నుంచైనా.. ఏ సమయంలోనైనా పోరాటం సాగించేందుకు సన్రైజ్ ఫ్లీట్ సిద్ధంగా ఉందన్న నమ్మకాన్ని దేశానికి కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పిలుపునిచ్చారు. ఎలాంటి కవ్వింపు చర్యలనైనా ఎదుర్కొనేలా.. గతంలోనూ చైనా, పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు తూర్పు నౌకాదళం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. 1971లో పాక్పై విజయం సాధించడంలో ఈస్ట్రన్ నేవల్కమాండ్ కీలక పాత్ర పోషించింది. మన యుద్ధ సన్నద్ధతను తెలుసుకునేందుకు పాక్ మరోసారి ఏమైనా చర్యలకు పాల్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో బంగాళాఖాతంలో ఈఎన్సీ గస్తీ పెంచింది. తూర్పు నౌకాదళ పరిధిలో ఉన్న సుమారు 60 యుద్ధ నౌకలతో పాటు 6కిపైగా సబ్మైరెన్లు రంగంలోకి దిగాయి. సముద్ర జలాల్లో వార్షిప్స్ పహారా కాస్తుండగా.. సాగర గర్భంలో సబ్మైరెన్లు ఎలాంటి విపత్తునైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేశాయి. మరోవైపు.. కోస్ట్ గార్డ్ నౌకలతో నిరంతరం సముద్రంలో పహారా కాస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ ప్రత్యర్థి వ్యూహాలను అంచనా వేస్తున్నారు. -
ఏయూకి శతాబ్ది ఉత్సవ శోభ
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కాను న్నాయి. ఏడాదిపాటు జరిగే ఈ వేడుకల ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ కోర్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం 6 గంటలకు బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం వద్ద కలెక్టర్ హరేందిర ప్రసాద్ వాకథాన్ను ప్రారంభిస్తారు. అనంతరం సిరిపురం, స్నాతకోత్సవ మందిరం, పరిపాలన భవనం వద్ద ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రత్యేక బెలూన్ను ఎగురవేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన తర్వాత ఏయూ విజన్ డాక్యుమెంట్, లోగో ఆవిష్కరణ, ప్రత్యేక నృత్య రూపకం ప్రదర్శిస్తారు. అనంతరం పూ ర్వ విద్యార్థుల సంఘం చైర్మన్, వీసీ, అతిథుల ప్రసంగాలు ఉంటాయి. సాయంత్రం 6.30 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు పాల్గొంటారు. వర్సిటీ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఏడాది పొడవునా అకడమిక్, ఔట్రీచ్, మెగా ఈవెంట్లు నిర్వహిస్తామని, 2026 ఏప్రిల్ 26న ముగింపు వేడుకలు ఘనంగా ఉంటాయని తెలిపారు. మెగా ఈవెంట్లను విభిన్న విభాగాలు సమన్వయంతో నిర్వహించాలని, ప్రముఖు లను ఆహ్వానించాలని సూచించారు. రెక్టర్ ఆచార్య ఎన్. కిశోర్ బాబు, ప్రిన్సిపల్స్ కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏర్పాట్లను వీసీ స్వయంగా పరిశీలించారు. నేటి నుంచి శతాబ్ది సంవత్సరం ప్రారంభం ఏడాది పొడవునా కార్యక్రమాలు -
సీఎం కాన్వాయ్ కోసం.. షాపుల తొలగింపు
సింహగిరిపై వర్తకులకు హుకుం జారీ చేసిన అధికారులుసింహాచలం: చందనోత్సవం సమీపిస్తుండటంతో సింహాచలం దేవస్థానం అధికారులు హడావుడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా కాన్వాయ్ కోసం స్థలం సిద్ధం చేయాలంటూ ఉన్నట్టుండి దుకాణాలు ఖాళీ చేయాలని ఆదేశించడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరతరాలుగా సింహగిరిని నమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్న వీరు, చేసేది లేక అసంపూర్తిగా ఉన్న నూతన షాపింగ్ కాంప్లెక్స్లోకి సామాన్లు తరలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, సింహాచలం దివ్యక్షేత్ర అభివృద్ధి పనుల్లో భాగంగా 2008లో కొండపై బస్టాండ్ వద్ద రేకులతో తాత్కాలిక దుకాణాలు నిర్మించి వ్యాపారులకు కేటాయించారు. ప్రసాద్ స్కీమ్ కింద నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడంతో, 2023 డిసెంబర్లో వ్యాపారులను ఖాళీ చేయించి పాదాలమ్మ–బంగారమ్మ ఆలయాల సముదాయంలో తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేశారు. 2024 చందనోత్సవం నాటికి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి చేస్తామని చెప్పడంతో వ్యాపారులు అక్కడికి వెళ్లారు. అయితే, ఇప్పటికీ నూతన షాపింగ్ కాంప్లెక్స్ పనులు పూర్తి కాలేదు. ఇలా ఉండగా, రెండు రోజుల క్రితం దేవస్థానం అధికారులు హఠాత్తుగా తాత్కాలిక షాపింగ్ కాంప్లెక్స్ను ఖాళీ చేసి కొత్త కాంప్లెక్స్లోకి వెళ్లాలని ఆదేశించారు. చందనోత్సవానికి సీఎం వస్తున్నారని, ఆయన కాన్వాయ్ కోసం స్థలం కావాలని ఒకసారి, పార్కింగ్ స్థలం అవసరమని మరోసారి చెప్పడంతో వ్యాపారులు ఆందోళన చెందారు. కొత్త షాపింగ్ కాంప్లెక్స్లో ఇంకా విద్యుత్ సరఫరా లేదని, ఎక్కడపడితే అక్కడ రాళ్లు,రప్పలు ఉన్నాయని, ఉన్నట్టుండి ఎలా వెళ్లాలని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ నెల 26, 27 తేదీల్లో గంధం అమావాస్య పర్వదినాల కారణంగా భక్తులు ఎక్కువగా వస్తారని, అప్పుడు షాపులు మారిస్తే నష్టం వాటిల్లుతుందని వారు వాపోయారు. అయినా సరే దుకాణాలు ఖాళీ చేయాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక వ్యాపారులు శుక్రవారం నుంచి తమ సామాన్లను కొత్త కాంప్లెక్స్లోకి తరలిస్తున్నారు. 2024 చందనోత్సవం సమయంలో పాదాలమ్మ–బంగారమ్మ ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక షాపులు ఉండటంతో అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
రద్దీ ప్రాంతాల్లో కాపు కాసి.. బైక్ల చోరీ
ఎంవీపీకాలనీ: నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న కోట శివ అనే పాత నేరస్తుడిని ఎంవీపీ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అతను పార్వతీపురం మన్యం జిల్లా, సీతానగరం మండలం, కోట సీతారామపురం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. క్రైం ఏడీసీపీ మోహనరావు తెలిపిన వివరాలివి.. మార్చి 17న పెదవాల్తేర్ రిలయన్స్ మార్ట్ ఎదుట దాసరి శంకరరావు అనే వ్యక్తి హోండా యాక్టీవా దొంగతనానికి గురైంది. మార్ట్ ఎదుట వాహనాన్ని పార్క్ చేసిన శంకరావు పక్కనే ఉన్న చికెన్ షాపుకు వెళ్లి వచ్చేసరికి వాహనం కనిపించలేదు. దీనిపై ఎంవీపీ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ద్వారకా క్రైం సీఐ చక్రధర్రావు నేతృత్వంలో పోలీసులు మార్ట్ సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. అతను చివరిగా సంచరించిన ప్రాంతాన్ని గుర్తించి.. సెల్ఫోన్ నంబర్ను కనుగొన్నా రు. ఆ సెల్ఫోన్ ఆధారంగా నిందితుడు కోట శివగా నిర్ధారించారు. ఈ నెల 24న అతన్ని అదుపులోకి తీసు కుని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. నిందితుడు కోట శివ ముఖ్యంగా జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కాపు కాసేవాడు. ఏమరపాటుగా ఎవరైనా తమ బైక్కు తాళాలు వదిలి వెళితే.. వెంటనే బైక్ను దొంగిలించేవాడు. విచారణలో శివ ఎంవీపీ కాలనీ, వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్, ద్వారకా పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 17 ద్విచక్ర వాహనాలను దొంగలించినట్లు అంగీకరించాడు. అతను 2024 నుంచి నగరంలో వాహనాలు చోరీ చేస్తున్నట్లు తేలింది. శివపై గతంలో 31 కేసులు ఉన్నాయని, జీఆర్పీలో సస్పెక్ట్ షీట్ కూడా ఉందని పోలీసులు గుర్తించారు. అతని నుంచి సేకరించిన సమాచారంతో 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించింది. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన ద్వారకా క్రైం సీఐ చక్రధర్రావుతో పాటు ఎస్ఐ అప్పలరాజు, ఏఎస్ఐ కిశోర్బాబు, పీసీలు జగత్ కిరణ్, హరిప్రసాద్, సాయి, అప్పలరాజు, అగస్టీన్లను ఉన్నతాధికారులు అభినందించారు. సమావేశంలో ఏసీపీ లక్ష్మణరావు, సీఐ చక్రధర్రావు తదితరులు పాల్గొన్నారు. ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్ 17 వాహనాలు స్వాధీనం -
వీధి దీపాలు కూడా వెలిగించలేకపోతున్నాం
● డీఆర్సీలో టీడీపీ ఎమ్మెల్యేల పెదవి విరుపు ● ప్రజాసంక్షేమంపై దృష్టిపెట్టాలన్న శాసనమండలి విపక్ష నేత బొత్స ● పారిశుధ్య పోస్టుల్ని ఎప్పుడు భర్తీ చేస్తారన్న ఎమ్మెల్సీ వరుదు కల్యాణి సాక్షి, విశాఖపట్నం : ‘‘ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదవుతోంది. అయినా.. నగరంలో వీధి దీపాలను కూడా సరిగ్గా వెలిగించలేకపోతున్నాం. ఎటు చూసినా రాత్రి పూట అంధకారంగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలైతే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోకపోతే ఎలా.?’’ జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశం (డీఆర్సీ)లో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలివి. దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు వీధిదీపాల సమస్యలు, పారిశుద్ధ్యలోపంపై ఫిర్యాదులు చేశారు. నగరం అధ్వానంగా మారిందనే రీతిలో జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాలా వీరాంజనేయ స్వామి దృష్టికి సమస్యలు తీసుకెళ్లారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్సీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇన్చార్జి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కలెక్టర్ హరేందిర ప్రసాద్, వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్, జేసీ మయూర్ అశోక్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత ఇటీవల ఉగ్రవాద కాల్పుల్లో మృతి చెందిన చంద్రమౌళి, మధుసూధన్కు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. అనంతరం జరిగిన సమీక్షలో నియోజకవర్గాల వారీగా.. ఎమ్మెల్యేలు సమస్యలను ఇన్చార్జి మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టే మాస్టర్ ప్లాన్ రోడ్లను, ఇతర ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని ఇన్చార్జి మంత్రి ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సదరం స్లాట్ల విషయంలో వెసులుబాటు కల్పించాలని, ప్రజలకు సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో స్లాట్ ఇవ్వాలన్నారు. మేఘాద్రి గెడ్డ, గంభీరం రిజర్వాయర్ల నిర్వహణపై సమీక్షించిన ఆయన ప్రభుత్వ నిర్దేశాల మేరకు తుది చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీధిదీపాల నిర్వహణపై ఆడిట్ చేయించి యుద్ధప్రాతిపదికన వేయించాలని అధికారులను ఆదేశించారు. 100 గజాల లోపు స్థలంలో ఇళ్లు కట్టుకునే వారికి సెల్ఫ్ సర్టిఫికేషన్ విషయంలో అడ్డంకులు సృషించకుండా అవగాహన కల్పించాలన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించి.. వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచెయ్యాలని మండలి విపక్ష నేత బొత్స సూచించారు. ఇటీవల 60 ఏళ్లు దాటిన జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బందిని తొలగించిన ప్రభుత్వం.. వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడం వల్ల నగరంలో శానిటేషన్ మరుగున పడిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం 500 మంది సిబ్బంది ఖాళీలున్నాయనీ.. కాంట్రాక్టు వర్కర్లతో ప్రస్తుతానికి పనిచేయిస్తున్నామని అధికారులు తెలిపారు. జీవీఎంసీ జోన్ల పునర్వ్యవస్థీకరణపై చర్చ పరిపాలన సౌలభ్యం కోసం జీవీఎంసీ జోన్ల పునర్ వ్యవస్థీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ హరేందిర ప్రసాద్ ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న జోన్లని ఆయా నియోజకవర్గాలకు అనుగుణంగా సరిహద్దులు మార్పులు చేపడతామని వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో జోన్గా రూపాంతరం చెందనున్నట్లు తెలిపారు. రెండు సెంట్లు ఇస్తాం.. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇన్చార్జి మంత్రి బాలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లోనే ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే.. అప్పుడు తీసుకున్న ఒక సెంటు ఇంటి స్థలం వద్దనుకునేవారికి రెండు సెంట్లు స్థలం ఇస్తామని వ్యాఖ్యానించారు. సెంటు భూమి వద్దనకునేవారి జాబితాల్ని సేకరించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. ఆంఽధ్ర విశ్వవిద్యాలయంపై విజిలెన్స్ ఎంక్వయిరీ కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు. ‘సాక్షి’పై మంత్రి చిందులుకూటమి ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు పనులపై ప్రశ్నించినందుకు టీడీపీ ప్రజా ప్రతినిధులు చిందులేశారు. డీఆర్సీ సమావేశం అనంతరం మీడియాతో ఇన్చార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామితో పాటు ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సమయంలో ఊరు పేరు లేని ఉర్సా కంపెనీ, టీసీఎస్ కి 99 పైసలకు భూకేటాయింపులపై ‘సాక్షి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఏ కంపెనీకై నా ఇలాగే భూములు కేటాయిస్తారా అని ప్రశ్నించగా.. ఎమ్మెల్యే వెలగపూడి, ఇతర ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తోంది సాక్షి ప్రతినిధులని మంత్రికి చెప్పారు. దీంతో మంత్రి ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు మాట్లాడారు. కంపెనీ ప్రొఫైల్ చూసే భూములిచ్చామని, ప్రశ్నించడానికి మీరెవరంటూ చిర్రుబుర్రులాడారు. వెంటనే వెలగపూడి అందుకొని సాక్షిని ఎందుకు మీటింగులకి పిలుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
స్నేహశీలి.. చంద్రమౌళి
విశాఖపట్నం: స్నేహశీలిగా, సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా, ఆధ్యాత్మిక భావాలు గల విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి జె.ఎస్.చంద్రమౌళి మరణం ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తీరని వేదనను మిగిలింది. విహారం కోసం కాశ్మీర్ లోని పహల్గాం వెళ్లిన ఆయన.. ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న పుట్టినరోజు జరుపుకున్న ఆయన.. అదే రోజు తన భార్య, మరో రెండు కుటుంబాలతో కలిసి కశ్మీర్ బయలుదేరారు. ఉగ్రదాడిలో ఆయన మరణవార్త విని వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా చంద్రమౌళి ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. ఆదివాసీ ప్రాంతాలకు వెళ్లి దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు, విశ్రాంత ఉద్యోగుల సంఘం తరపున, వ్యక్తిగతంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉండటంతో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తరచుగా సందర్శించేవారు. చంద్రమౌళి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయనతో గడిపిన క్షణాలను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మంచి వ్యక్తిని కోల్పోయామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు తగిన శిక్ష పడాలని వారంతా కోరుతున్నారు. ప్రాణాలతో బయటపడ్డాం కానీ..కశ్మీర్ పహల్గాంలో జరిగిన దాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి మృతి చెందగా.. ఆయన మిత్రులు శశిధర్, సుచిత్రలు ప్రాణాలతో బయటపడ్డారు. చంద్రమౌళి, శశిధర్, అప్పన్న కుటుంబాలు ఈ నెల 18న కాశ్మీర్ విహారయాత్రకు బయలుదేరి వెళ్లాయి. ఈ నెల 25న అందరూ విశాఖకు తిరిగి రావాల్సి ఉంది. కానీ 22న పహల్గాం దాడిలో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో తాము ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వారు వివరించారు. దాడి జరిగిన సమయంలో కొండపై ఉన్న క్యాంటీన్ సమీపంలో ఉన్నామని, కాల్పుల శబ్దాలు వినిపించగానే భయంతో టాయిలెట్ల వెనుక దాక్కున్నామని సుచిత్ర తెలిపారు. తుపాకీతో కనిపించిన ఉగ్రవాది తమవైపు రావడం చూసి, ప్రాణ భయంతో నుదుటిన బొట్టు కూడా చెరుపుకుని, సమీపంలోని వాగులో ముఖాలు కడుక్కున్నామని చెప్పారు. భయం ఎక్కువగా ఉన్నా.. దైవనామస్మరణ చేస్తే ఆ శబ్దం విన్నా చంపేస్తారేమోననిపించి అది కూడా చేయలేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. శశిధర్ మాట్లాడుతూ కాల్పులకు భయపడి తాము ఫెన్సింగ్ కింద నుంచి దూరి చెట్ల వెనుక దాక్కునే ప్రయత్నం చేశామన్నారు. తన భార్య సుచిత్ర ఫెన్సింగ్ దాటడానికి చంద్రమౌళి సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. కాల్పులు జరుగుతున్నప్పుడు కళ్లముందే మనుషులు నేలకొరగడం చూశామన్నారు. చంద్రమౌళి కాల్పుల్లో మృతి చెందారని తర్వాత తెలిసి తీవ్ర ఆవేదనకు లోనైనట్లు చెప్పారు.కాశ్మీర్ వెళ్దామని రెండేళ్లుగా ప్లాన్ చేసుకుని ఇప్పుడు వెళ్తే, తమ మిత్రుడిని కోల్పోవాల్సి వచ్చిందని శశిధర్ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి ఏటా విహారయాత్రలకు వెళ్లే తమకు, ఈ పర్యటన తీరని విషాదాన్ని మిగిల్చిందని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. చంద్రమౌళి కుమార్తెలు అమెరికా నుంచి రావడంతో.. శుక్రవారం అతని అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. -
గ్రామాల అభివృద్ధికి పంచాయతీలే మూలస్తంభాలు
బీచ్రోడ్డు: గ్రామాల అభివృద్ధికి పంచాయతీలే మూలస్తంభాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకంగా మారిందని, ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగిన అధికారులుగా పంచాయతీరాజ్ ఉద్యోగులు గొప్ప బాధ్యతను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో స్వయం సమృద్ధికి సర్పంచులు, వార్డు సెక్రటరీలు సేవలు అందించాలని సూచించారు. స్వయం శాసనం–గ్రామాల బలోపేతం అనే దృక్పథంతో పంచాయతీలను అభివృద్ధి దిశగా నడిపించాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి గ్రామం అభివృద్ధిలో ముందుండేందుకు పంచాయతీ ప్రతినిధు లు నిధుల సమీకరణపై దృష్టిసారించాలని సూ చించారు. అనంతరం విశేష సేవలందించిన మోడల్గా నిలిచిన సర్పంచ్లకు జ్ఞాపికలు బహూకరించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ బి.సత్యవతి, డిప్యూటీ సీఈవో రాజ్ కుమార్, ఏపీపీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.సత్తిబాబు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
ఉగ్రదాడి దేశానికి క్షోభ కలిగించింది
ఇది ముమ్మాటికీ హిందువులపై దాడి: పవన్ కల్యాణ్ ఏయూ క్యాంపస్: కశ్మీరులో ఉగ్రదాడి దేశం మొత్తానికి క్షోభ కలిగించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రదాడిలో మరణించిన విశాఖకు చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని గురువారం రాత్రి ఆయన పరామర్శించారు. తొలుత ఆస్పత్రిలోని చంద్రమౌళి మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాంతం, భాష, మతం అడిగి చంపటం అమానుషమన్నారు. హిందువులను టార్గెట్ చేసి చంపారని, దీనిపై మనమంతా ఏకతాటిగా నిలవాలన్నారు. భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కించపరిచేలా ఎవరైనా సోషల్మీడియాలో మాట్లాడినా, కామెంట్లు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. పోయిన ప్రాణాలు తిరిగి రావని, భవిష్యత్లో ఇలాంటి దాడులు జరుగకుండా కేంద్ర ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. యుద్దం మొదలుపెడితే అది ఎవరి చేతుల్లోనూ ఉండదనే విషయాన్ని గుర్తించాలన్నారు. -
చందనోత్సవం టికెట్ల విక్రయాలు ప్రారంభం
● ఒక ఆధార్పై 4 టికెట్లు మాత్రమే జారీ ● 30న ఉదయం 5 గంటలలోపే ప్రొటోకాల్ వీఐపీల దర్శనాలు పూర్తి సింహాచలం: సింహగిరిపై చందనోత్సవం టిక్కెట్ల విక్రయాలు గురువారం ప్రారంభమయ్యాయి. పాత పీఆర్వో కార్యాలయంలో ఉదయం 7 నుంచి రూ.300, రూ.వెయ్యి టికెట్ల విక్రయాలను ప్రారంభించి, దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు చేతుల మీదుగా భక్తులకు అందించారు. ఒక ఆధార్ నెంబరుతో నాలుగు టిక్కెట్లు మాత్రమే జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఈవో మాట్లాడుతూ రూ.300, రూ.వెయ్యి టికెట్లను ఉదయం 3.30 నుంచి రాత్రి 7 వరకు పలు టైం స్లాట్లుగా విభజించి జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30న తెల్లవారుజాము 3 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్గజపతిరాజు తొలిదర్శనం కాగానే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. ఉదయం 5లోపు ప్రొటోకాల్ వీఐపీల దర్శనాలు పూర్తిచేస్తామన్నారు. వారికి మాత్రమే అంతరాలయ దర్శనం కల్పిస్తామన్నారు. ఆ తర్వాత వచ్చిన వారికి నీలాద్రిగుమ్మం వద్ద నుంచే దర్శనం ఉంటుందన్నారు. ప్రొటోకాల్ వీఐపీలను రెండు కేటగిరీలుగా విభజించినట్లు పేర్కొన్నారు. దేవస్థానం చైర్మన్, సీఎం, మంత్రులు, సుంప్రీకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ఉచితంగానే దర్శనం కల్పిస్తామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రూ.1500 ప్రొటోకాల్ టిక్కెట్లు తీసుకోవాల్సిందేనని, వారితో పాటు ఆరుగురికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఈ టికెట్లను ఎవరెవరికి జారీ చేయాలో జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఈసారి నీలాద్రి గుమ్మం వద్ద ఆరు క్యూ లైన్లలోనే భక్తులు వెళ్లి స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. -
కేజీహెచ్ సూపరింటెండెంట్ ఆదేశం
రొటేషన్ పద్ధతిలో నైట్ డ్యూటీలు డాబాగార్డెన్స్: నర్సింగ్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ ఆదేశించారు. ‘కొందరికే నైట్ డ్యూటీ ఎందుకు?’ శీర్షికతో ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులతో గురువారం సూపరింటెండెంట్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, నైట్ డ్యూటీలను రొటేషన్ పద్ధతిలో చేసుకోవాలని సూచించారు. ఇటీవల కేజీహెచ్ను సందర్శించిన అదనపు డీఎంఈ కూ డా ఈ విషయమై పలు ఆదేశాలు జారీ చేశారన్నారు. వార్డుల్లో ఏ సమస్య తలెత్తినా దానికి హెడ్ నర్సులదే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రతి బ్లాక్కు తప్పనిసరిగా ఒక హెడ్ నర్సు ఉండాలని డీఎంఈ సూచించినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. -
వైశ్యరాజుజ్యుయలర్స్లో 18 క్యారెట్ బంగారం
విశాఖ సిటీ: బంగారం ధరలు పెరిగిన వేళ ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో బంగారు ఆభరణాలు అందించాలన్న లక్ష్యంతో 18 క్యారెట్ గోల్డ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్లు ఆశీల్మెట్టలో ప్రారంభించినట్లు వైశ్యరాజ్ జ్యుయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వైశ్యరాజ్ భద్రగిరి పేర్కొన్నారు. ఈ షోరూం గ్రౌండ్, సెకండ్ ఫ్లోర్లను వినయగర్ ప్యారడైజ్ భాగస్వాములు లగడపాటి కిరణ్కుమార్, మంత్రి శేషగిరి, మూడో ఫ్లోర్ను జామి నగేష్ ప్రారంభించినట్లు తెలిపారు. వినూత్నమైన డిజైన్లు, అత్యధిక కలెక్షన్లతో 18 క్యారెట్ బంగారు ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. దేశంలోనే ప్రథమంగా 18 క్యారెట్ ఎక్స్క్లూజివ్ షోరూం తమదే అన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్గా 18 క్యారెట్ జ్యుయలరీపై తరుగు(వీఏ) 6శాతం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైశ్యరాజు జ్యుయలర్స్ చైర్మన్ వైశ్యరాజు ఫల్గుణరాజు, సంస్థ డైరెక్టర్లు వైశ్యరాజు నరేష్, వైశ్యరాజు కిరణ్కుమార్, అధిక సంఖ్యలో కస్టమర్లు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ జిల్లాల అధ్యక్షులకు అభినందనలు
విశాఖ సిటీ: వైఎస్సార్ సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల నూతన అధ్యక్షులుగా నియమితులైన కె.కె.రాజు, గుడివాడ అమర్నాథ్లకు అభినందనలు వెల్లువెత్తాయి. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఇరువురికి నేతలు గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయ్ప్రసాద్, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కె.సతీష్, ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డి, రెయ్యి వెంకటరమణ, బర్కత్ అలీ, కె.వి.ఎన్.శశికళ, కోడిగుడ్ల పూర్ణిమ, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
అందరికీ నచ్చేలా ‘సారంగపాణి జాతకం’
డాబాగార్డెన్స్: ‘సారంగపాణి జాతకం’లో తాను చేసిన పాత్ర, ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని హీరో ప్రియదర్శి తెలిపారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ గురువారం నగరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా జగదాంబ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడారు. తాను నటించిన మల్లేశం, బలగం, కోర్ట్ సినిమా తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే సారంగపాణి జాతకం అన్నారు. ఇంద్రగంటితో ఒక ఫొటో దిగితే చాలనుకునే వాడినని.. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో ఆంధ్ర యాసలో డైలాగ్లు చెప్పినట్లు వివరించారు. హీరోయిన్ మాట్లాడుతూ అందర్నీ ఈ సినిమా ఆకట్టుకుంటుందన్నారు. ఆద్యంతం హాస్యంతో పాటు ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. మంచి కథతో అందరూ ఇష్టపడే హాస్యంతో రూపొందించిన ఈ సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. హీరో ప్రియదర్శి -
చర్చిలో బాలిక అనుమానాస్పద మృతి?
కంచరపాలెం: జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ చర్చిలో గురువారం సాయంత్రం 11 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. విజయనగరానికి చెందిన ఈదల పూర్ణచంద్రిక(11)కు ఎవరో చేతబడి చేశారని.. బాలిక తల్లి వరలక్ష్మి, అమ్మమ్మ సావిత్రి చర్చిల చుట్టూ తిప్పుతున్నారు. గురువారం సాయంత్రం జ్ఞానాపురంలోని సెయింట్ పీటర్స్ చర్చికి బాలికను తీసుకొచ్చారు. ప్రార్థనలు చేసిన సమయంలో తల చుట్టూ చున్ని కప్పి నోట్లో గుడ్డలు కుక్కినట్లు తెలుస్తోంది. ఊపిరాడక బాలిక చర్చిలోనే ప్రాణం వదిలినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూఢనమ్మకంతో తల్లి, అమ్మమ్మ ఈ విధంగా చేశారని స్థానికులు చెబుతున్నారు. చర్చి ప్రతినిధులు, స్థానికుల సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలిక తల్లి, అమ్మమ్మను విచారిస్తున్నారు. -
ఏడాదిలోపే ఇంతటి వ్యతిరేకతా?
● వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే అధికారం ● 11 నెలల మేయర్ పదవీ కాలం కోసం కూటమి కుట్రలు ● 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి రాజకీయాలు చూడలేదు ● ఎన్ని ప్రలోభాలు పెట్టినా నిబద్ధతతో ఉన్న కార్పొరేటర్లకు అభినందన ● డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని బహిష్కరిస్తున్నాం.. ● శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖ సిటీ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తిరగక ముందే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ సీపీయే అని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కశ్మీర్లో ఉగ్ర దాడిని రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. వారి కుటుంబాలకు ఆత్మస్థైర్యం కలగాలని ఆకాంక్షించారు. గెలుపోటములు సహజం రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఆయన పేర్కొన్నారు. విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 11 నెలల అధికారం కోసం కూటమి నేతలు అవిశ్వాసం పెట్టి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను ప్రలోభపెట్టి, లొంగకపోతే ఆర్థిక మూలలను దెబ్బతీస్తామని బెదిరించారని వెల్లడించారు. తమ కార్పొరేటర్ల కోసం రూ.25 లక్షలు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో కేరళకు వెళ్లడం పరాకాష్ట అన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను ఎన్ని ఇబ్బందులు, ప్రలోభాలకు గురి చేసినా మెజార్టీ సభ్యులు పార్టీలోనే ఉన్నారని వారిని అభినందించారు. ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటమే అని, ఇది ఒక గుణపాఠంగా తీసుకొని అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. రాబోయే విజయానికి ఇదే పునాదిరాయిగా అభివర్ణించారు. ఈ 11 నెలల కాలంలో కూటమి కార్పొరేటర్లు నగరాభివృద్ధి ఎలా చేస్తారో ప్రజలు గమనిస్తారని తెలిపారు. ఇదే విధంగా ఈ నెల 26న జరగనున్న డిప్యూటీ మేయర్పై అవిశ్వాస కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇది మంచి సంప్రదాయం కాదు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో జరిగిన దాడులు, ఘటనలను ఆయన ఖండించారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణమైన పాలన, ప్రవర్తన చూడలేదని చెప్పారు. ప్రత్యర్థి పార్టీ నేతలపైనే కాకుండా వారి ఆస్తులు, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం మంచి సంప్రదాయం కాదని హితవు పలికారు. తానెప్పుడూ ఇటువంటి రాజకీయాలు చూడలేదు, చేయలేదని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మళ్ల విజయ్ప్రసాద్, తిప్పల దేవన్రెడ్డి, మలసాల భరత్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తైనాల విజయ్కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కట్టమూరి సతీష్, ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు. -
స్నేహశీలి.. చంద్రమౌళి
కుటుంబ సభ్యులు, స్నేహితుల కన్నీటి పర్యంతం ఏయూక్యాంపస్: స్నేహశీలిగా, సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా, ఆధ్యాత్మిక భావాలు గల విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి జె.ఎస్.చంద్రమౌళి మరణం ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తీరని వేదనను మిగిల్చింది. విహారం కోసం కశ్మీర్లోని పహల్గాం వెళ్లిన ఆయన.. ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న పుట్టినరోజు జరుపుకున్న ఆయన.. అదే రోజు తన భార్య, మరో రెండు కుటుంబాలతో కలిసి కశ్మీర్ బయలుదేరారు. ఉగ్రదాడిలో ఆయన మరణవార్త విని వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా చంద్రమౌళి ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. ఆదివాసీ ప్రాంతాలకు వెళ్లి దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు, విశ్రాంత ఉద్యోగుల సంఘం తరపున, వ్యక్తిగతంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉండటంతో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తరచుగా సందర్శించేవారు. చంద్రమౌళి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయనతో గడిపిన క్షణాలను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మంచి వ్యక్తిని కోల్పోయామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు తగిన శిక్ష పడాలని వారంతా కోరుతున్నారు. -
పుట్టిన రోజునే ప్రయాణం
ఈ నెల 18న చంద్రమౌళి తన జన్మదినం చేసుకున్నారు. అదే రోజున చంద్రమౌళి కుటుంబం, మరో రెండు కుటుంబాలు కలిసి కశ్మీర్ వెళ్లాయి. అక్కడ వారు ఆలయాల దర్శనం చేసుకున్నారు. ఆయన నాకు వరుసకు మావయ్య అవుతారు. ఇలా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా బాధించింది. సామాజిక కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొనేవారు. ఇటువంటి దారుణమైన సంఘటన జరిగినప్పుడు సహనం వహించడం, ఉపేక్షించడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వం ఈ విషయంలో తగిన విధంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. – బి.చంద్రమౌళి, మృతుడి బంధువు -
1985 నుంచి స్నేహితులం
నిత్యం నాకు ఫోన్లో గుడ్మార్నింగ్ చెప్పేవారు. 1985 నుంచి ఆయనతో నాకు స్నేహం ఉంది. అక్కయ్యపాలెంలోని అతని ఇంటి దగ్గరలోనే మా ఇల్లు ఉంది. మంగళవారం ఉదయం కూడా నాకు మెసేజ్ పంపారు. బుధవారం నేను మెసేజ్ చేసినా.. ఆయన నుంచి సమాధానం రాలేదు. చంద్రమౌళి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. అరకు వంటి ప్రాంతాల్లో దుప్పట్లు పంచడం, వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఉగ్రవాదులు చంపడం కలచివేస్తోంది. మనసుకు చాలా బాధగా ఉంది. –శ్యాంప్రసాద్, స్నేహితుడు -
ఏయూలో వింత పోకడలు
● ఫీజు కట్టించుకొని పరీక్షలకు అనుమతించని వైనం ● వీసీ భవనం ముందు విద్యార్థులు ధర్నావిశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు అవలంబిస్తున్న విధానాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆరోపించారు. గురువారం రాత్రి వర్సిటీ వైస్ చాన్సలర్ భవనం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిగ్రీ రెండు, నాల్గో సెమిస్టర్ పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో సుమారు 30 మంది విద్యార్థులను గురువారం జరిగిన పరీక్షకు కాలేజీ నిర్వాహకులు అనుమతించలేదు. హాజరు శాతం సరిపోలేదనే కారణంతో పరీక్షలు రాయడానికి వీల్లేదని, హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో తొలిరోజు పరీక్షను విద్యార్థులు కోల్పోయారు. అయితే హాజరు సరిపోకున్నా, కొంతమంది విద్యార్థులను తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పరీక్షలకు అనుమతించారని తెలుసుకున్న బాధిత విద్యార్థులు దీనిపై వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారి గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సంఘాల నాయకులు విద్యార్థులతో చర్చించారు. విషయాన్ని కాలేజీ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోకపోవడంతో విద్యార్థులతో కలసి వైస్ చాన్సలర్ భవనం ముందు ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య శశిభూషణరావు అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. ఫీజు చెల్లించినందున, తదుపరి పరీక్షలకు అనుమతించాలని కోరారు. తాము పరీక్షలను పూర్తిగా కోల్పోతే, అది ఉత్తీర్ణతపై ప్రభావం చూపుతుందన్నారు దీనిపై పూర్తి స్థాయిలో సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ ఆచార్య శశిభూషణరావు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. ఆందోళనలో విద్యార్థి సంఘం నాయకులు అభిషేక్, సంజు, వికాస్, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. -
చౌక బేరం
● విశాఖలో రూ.99 పైసలకే ఎకరా భలే మంచి● ఎకరం 99 పైసలకు టీసీఎస్కి కట్టబెట్టిన కూటమి సర్కారు ● అక్కడ ఎకరం రూ.50 కోట్ల పైమాటే.. ● ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాల భూ కేటాయింపు ● ప్రభుత్వ రంగ సంస్థలకు మార్కెట్ ధర ప్రకారమే భూములు ● ప్రైవేట్ సంస్థలకు మాత్రం రూపాయికే దోచిపెడుతున్న సర్కారు ● లూలూకి బీచ్ రోడ్డులో రూ.వేల కోట్ల భూములు అప్పగింత విశాఖ ఐటీ సెజ్ మధురవాడ హిల్ నెం.3లో ఉర్సా కంపెనీకి కేటాయించిన భూములులూలూ మాల్కు కేటాయించిన భూములుప్రభుత్వ రంగ సంస్థలకు మార్కెట్ ధరకే..! గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా రిజిస్ట్రేషన్ ధరకు భూములు కేటాయింపులు చేపట్టింది. గతంలో భారత నౌకాదళానికి ఎకరా రూ.కోటి, పోస్టల్కు 30 సెంట్లు రూ.కోటి, సీబీఐకి ఎకరా భూమిని రూ.కోటి చొప్పున కేంద్ర ప్రభుత్వ శాఖలకు కేటాయింపులు జరిగాయి. వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్(వీటీపీఎల్)కు ఎకరం రూ.కోటి చొప్పున భూములు కేటాయించింది. 2022లో మధురవాడలో ఎన్సీసీ సంస్థకు ఎకరం భూమిని రూ.1.93 కోట్లకు ఇస్తే.. తక్కువ ధరకు అప్పగించేశారంటూ టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అదానీ డేటా సెంటర్కు కూడా ఎకరం రూ.కోటి చొప్పున కేటాయింపులు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఈఎస్ఐ, నేవీ, పోస్టల్ డిపార్ట్మెంట్కు కూడా నిబంధనల మేరకు మాత్రమే భూములు కేటాయించారు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం భూముల్ని దోచి పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి, ఉద్యోగాల ముసుగులో పెద్ద ఎత్తున భూదోపిడీతో పాటు భారీగా అవినీతి జరుగుతోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే తీరు కొనసాగితే త్వరలోనే వైజాగ్లో ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్ పరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేట్ సంస్థలకు భూముల ధారాదత్తం కూటమి సర్కారు కన్ను విశ్వనగరి విశాఖపై పడింది. ఊరు పేరు లేని కంపెనీలకు రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేసేస్తోంది. రూ.50 కోట్లు విలువ చేసే ఎకరం భూమిని 99 పైసలకే కట్టబెట్టేసింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు విశాఖ భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేసి రూ.వేల కోట్ల భూ కుంభకోణానానికి తెరతీసిన టీడీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అధికారదర్పంతో భూముల పందేరానికి తెగబడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలకు మార్కెట్ విలువ ప్రకారం భూకేటాయింపులు జరుపుతూ.. ప్రైవేట్ కంపెనీలకు కారుచౌకగా భూములను ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏయూలో శతాబ్ది ఉత్సవాల జోష్
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాల జోష్ కనిపిస్తోంది. ఈ నెల 26న వర్సిటీ వందో ఏట అడుగుపెట్టనున్న సందర్భంగా ఏడాది పొడవునా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందులో భాగంగా వర్సిటీ పరిపాలన భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో క్యాంపస్లో శతాబ్ది ఉత్సవాల శోభ వెల్లివిరుస్తోంది. ఈ వేడుకల కోసం క్యాంపస్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. గురువారం సాయంత్రం కాలేజీ విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులందరూ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలనే సందేశాన్ని ఇస్తూ.. నృత్యాలతో అలరించారు. -
మధురవాడ కొండలు బోడికొండలు కావా..?
అగ్గిపెట్టె లాంటి ఉర్సా కంపెనీకి ఎక్కడా సేవలు లేవు. అలాంటి సంస్థకు వేల కోట్ల విలువ చేసే భూములు కట్టబెట్టడం చూస్తుంటే ఇది ముమ్మాటికీ చేసిన లబ్ధికి కృతజ్ఞత చూపించినట్లే కనిపిస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో సహకరించిన వారికి చంద్రబాబు భూపందేరాలు చేస్తున్నారు. పాత రిసార్టుల స్థానంలో నిర్మాణాలు చేపట్టి రుషికొండని బోడికొండగా మార్చేశారని చెబుతున్న చంద్రబాబు.. ఇప్పుడు మధురవాడ కొండలను మొత్తం కొల్లగొట్టేస్తున్నారు. అవి బోడికొండలు కావా.? ఇది కేవలం రాజకీయ కేటాయింపులే. టీసీఎస్ భూములు అడగకుండానే ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి. – కె.లోకనాథం, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు -
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
టీసీఎస్ కంపెనీకి రుషికొండ ప్రాంతంలో విలువైన భూములను అతి తక్కువ లీజుకు ధారాదత్తం చేయడం ప్రజాప్రయోజనాలకు, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు ముమ్మాటికీ విరుద్ధమే. రుషికొండలో రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చదరపు గజం రూ.30 వేలు ఉంది. మార్కెట్ ధర అంతకంటే ఎక్కువ ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువ తీసుకున్నా 21.16 ఎకరాల భూమి రూ.320 కోట్లు మించి ఉంటుంది. అటువంటి భూమిని కేవలం 99 పైసలకు ఇవ్వడం హాస్యాస్పదం. రాష్ట్ర ప్రభుత్వం 2012లో జారీ చేసిన జీవో నెంబర్ 571 ప్రకారం ప్రభుత్వ భూములను మార్కెట్ విలువ మీద 10 శాతం కంటే తక్కువకు ప్రైవేట్ సంస్థలకు వార్షిక లీజుల కింద ఇవ్వకూడదు. ప్రైవేటు సంస్థలకు మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు 2జీ స్పెక్ట్రమ్, ఇతర కేసుల్లో అనేక సార్లు ఆదేశాలు జారీ చేసింది. కానీ టీసీఎస్కు అతి చవక ధరకు ప్రభుత్వ భూమిని ఇవ్వడం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుంది. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి -
రెవెన్యూ అంశాలపై అవగాహన ముఖ్యం
బీచ్రోడ్డు: రీ–సర్వే ప్రక్రియ, ఇతర రెవెన్యూ సంబంధి అంశాలపై క్షేత్రస్థాయి సిబ్బంది సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే విధి నిర్వహణ సజావుగా సాగుతుందని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ అన్నారు. సర్వే–ల్యాండ్ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగు హాలులో గురువారం ఒక్కరోజు వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా జేసీ రెవెన్యూ సంబంధిత అంశాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ప్రజా వినతుల పరిష్కారం, చర్యలు, రీ–సర్వే ప్రక్రియ నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సిబ్బంది అడిగిన పలు ప్రశ్నలకు బదులిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పులపై అప్డేట్ అవ్వాలన్నారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, సర్వే విభాగం సహాయ సంచాలకులు సూర్యారావు, పలువురు తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
నగరంలో నేరాలు తగ్గాలి
విశాఖ సిటీ: విశాఖలో క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టేలా రాత్రి పూట నిఘా మరింత పటిష్టం చేయాలని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో పోలీస్ ఉన్నతాదికారులతో కలిసి ఏడీసీపీల నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో యాక్టివ్గా ఉన్న రౌడీషీటర్లు, వారిపై పెడుతున్న నిఘాపై ఆరా తీశారు. పోలీస్స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పూర్తిగా నివారించాలని సూచించారు. ఆయా స్టేషన్ల పరిధిలో నిర్మానుష్య, సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలిస్తూ విజిబుల్ పోలీసింగ్, పికెట్లు, అవసరం మేరకు డికాయ్ టీమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. నగరంలో గంజాయి ఎక్కడా ఉండకూడదని, ఈవ్ టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటివి ఏ స్టేషన్ పరిధిలోనూ చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అదనంగా వెహికల్, మెన్ ఇతర అవసరాలు ఉంటే తనకు తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కొత్త సాఫ్ట్వేర్లు తీసుకొని నేరాల నియంత్రణకు వినియోగించాలని చెప్పారు. మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, వారిపై వేధింపులు, మిస్సింగ్ సంబంధిత కేసుల్లో జాప్యం లేకుండా దర్యాప్తు చేపట్టాలని చెప్పారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తి పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని, విధుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడినా తక్షణమే వారిపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీపీ–2 డి.మేరీప్రశాంతి, డీసీపీ(అడ్మిన్) కృష్ణ కాంత్ పటేల్, డీసీపీ(క్రైమ్స్) కె.లతామాధురి ఇతర అధికారులు పాల్గొన్నారు. రాత్రి పూట నిఘా పటిష్టం చేయాలి మహిళల భద్రతకు ప్రాధాన్యం నేర సమీక్ష సమావేశంలో సీపీ శంఖబ్రత బాగ్చి -
తొలి విడత చందనం అరగదీత ప్రారంభం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో తొలివిడత చందనం అరగదీత గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ నెల 30న వైశాఖ శుద్ధ తదియనాడు జరిగే స్వామివారి చందనోత్సవం(నిజరూప దర్శనం) అనంతరం ఆ రోజు రాత్రి తొలివిడతగా సమర్పించాల్సిన మూడు మణుగుల(సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని సమకూర్చేందుకు ఏకాదశిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. తొలుత ఆలయ బేడా మండపంలోని భాండాగారం వద్ద తొలి చందనం చెక్కను ఉంచి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, షోడషోపచారపూజలు జరిపారు. అనంతరం ఆ చందనం చెక్కతో ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు మంగళవాయిద్యాలు, వేద మంత్రోశ్చరణల మధ్య బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. అనంతరం నోటికి వస్త్రం చుట్టుకుని తొలిచందనాన్ని అరగదీశారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు చందనాన్ని అరగదీశారు. అరగదీసిన చందనాన్ని స్వామివారి మూలవిరాట్కి సమర్పించారు. అనంతరం 20 మంది నాల్గవ తరగతి సిబ్బంది చందనం అరగదీతలో పాల్గొన్నారు. ఆలయ ఏఈవో ఆనంద్కుమార్, సూపరింటెండెంట్ త్రిమూర్తులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
బినామీల చేతుల్లోకి భృతి?
● మత్స్యకార నిషేధ భృతి జాబితాలో అక్రమాలు! ● వాస్తవం కన్నా ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ● ఈ దందా వెనుక ఓ యూనియన్ నాయకుడు? డాబాగార్డెన్స్: వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన నిషేధ భృతిని గత ఏడాది కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఇప్పటికే వేట నిషేధం అమల్లోకి రాగా.. నిషేధ భృతిని ఈ నెల 26న అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మత్స్యకారులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ భృతి పంపిణీకి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని.. కొందరు అనర్హుల పేర్లను జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కొందరు యూనియన్ నాయకులు అర్హులైన వారి పేర్లు తప్పించి.. వారికి అనుకూలంగా ఉన్న మత్స్యకారుల పేర్లు చేర్చినట్లు సమాచారం. విశాఖ ఫిషింగ్ హార్బర్లో సుమారు 600 మర పడవలు, 300 తెప్పలు ఉన్నాయి. ఒక్కో మర పడవలో ఏడుగురు మత్స్యకారులు, ఒక్కో తెప్పకు నలుగురు మత్స్యకారులు ఉంటారు. అయితే అసలు మత్స్యకారుల సంఖ్యను పెంచి చూపుతున్నారని తెలుస్తోంది. ఉదాహరణకు ఏడుగురు సిబ్బంది ఉన్న మరపడవల్లో తొమ్మిది మంది ఉన్నట్లుగా ఓ యూనియన్ నాయకుడు లెక్కలు చూపి.. అదనంగా ఇద్దరు పేర్లు చేర్చినట్లు భోగట్టా. ఈ విధంగా 600 మర పడవలకు, 300 తెప్పలకు బినామీ పేర్లను చేర్చి.. లబ్ధిదారుల సంఖ్యను వాస్తవం కన్నా ఎక్కువగా చూపుతున్నట్లు తెలుస్తోంది. ‘నీకు సగం.. నాకు సగం’ ఓ మత్స్యకార సంఘం నాయకుడు ఈ దందా వెనుక ఉన్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అనర్హులైన వారి పేర్లు చేర్చి, వారికి వచ్చే భృతిలో సగం తనకు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నారని, ఈ తతంగం ద్వారా సుమారు రూ.కోట్ల అక్రమాలకు పాల్పడేందుకు స్కెచ్ వేశాడని కొందరు మత్స్యకారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ‘నీకు సగం... నాకు సగం’పద్ధతిలో అర్హులైన మత్స్యకారులకు రావాల్సిన భృతి.. అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా.. ఫిషింగ్ హార్బర్లో నమోదైన 600 మర పడవల్లో చాలా కాలంగా మూలనపడిన లేదా మరమ్మతులకు గురైన సుమారు 110కి పైగా పడవలు ఉన్నట్లు సమాచారం. అయితే విశాఖ పోర్టుకు జెట్టీ ఫీజు చెల్లిస్తూ.. ఈ బోట్ల కూడా వేటకు వెళ్తున్నట్లుగా పత్రాల్లో చూపినట్లు సమాచారం. వీటిల్లో పనిచేస్తున్నట్లుగా మత్స్యకారుల పేర్లను జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అర్హులుగానీ అనర్హులు మరో ప్రధాన సమస్య ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల కిందట కొంతమంది మత్స్యకారులకు గుర్తింపు కార్డులు జారీ చేసింది. ఆ తర్వాత మత్స్యకారులుగా మారిన ఎంతో మందికి ఇప్పటివరకు గుర్తింపు కార్డులు అందలేదు. దీంతో అర్హులైనప్పటికీ గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల వారు మత్స్యకార భరోసా పథకానికి అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఒకపక్క బినామీలు జాబితాలో చేరుతుంటే.. మరోపక్క అర్హులు గుర్తింపు కార్డులు లేక లబ్ధి పొందలేకపోవడంపై మత్స్యకార వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు దృష్టి సారించి.. అర్హులైన ప్రతి మత్స్యకారుడికీ భృతి అందేలా చూడాలని వారు కోరుతున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు అల్లిపురం: వేట నిషేధ భృతి జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పెదజాలారిపేటకు చెందిన సూరాడ సోమేశ్వరరావు కలెక్టర్ హరేందిర ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. మత్స్యశాఖ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ లంచాలు తీసుకుంటూ.. అర్హులైన మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బోట్లు, లైసెన్స్లు కలిగి ఉన్న అర్హులైన మత్స్యకారులను నమోదు చేయకుండా.. బినామీల పేరిట పాడైన బోట్లు కొని, వాటికి నకిలీ లైసెన్స్లు సృష్టించిన వారిని నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తమ రెండు బోట్లు రన్నింగ్లో ఉన్నప్పటికీ.. జాబితాలో నమోదు చేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని వాపోయారు. చేతకాకపోతే బోట్లు అమ్మేయండి అంటూ అధికారులు సలహాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకుని అధికారులను పిలిపించి మాట్లాడినా.. ఆ అధికారుల తీరు మారలేదన్నారు. పైగా తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారంతో పేర్ల నమోదు ప్రక్రియ దాదాపు పూర్తి కానున్న నేపథ్యంలో.. అర్హులైన మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరుతున్నారు. -
ఐకానికా సిటీ ప్రాజెక్టుకు భూమి పూజ
మధురవాడ: రుషికొండ సమీపంలో ఐకానికా గ్రాండ్, ఐకానికా క్యాపిటల్ ప్రీమియం, లగ్జరీ ప్రాజెక్టులు త్వరలో ఐకానికా సిటీ పేరుతో అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు గురువారం త్రిదండి చినజీయర్ స్వామి భూమి పూజ నిర్వహించారు. 97 ఎకరాల వీస్తీర్ణంలో వరల్డ్ క్లాస్ సదుపాయాలుతో దీనిని నిర్మాణం చేస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు. ఐకానికి సిటీ అభివృద్ధిలో భాగంగా మొదటి దశలో ఐకానికా సిటీ ఆఫ్ గోల్డ్ని నిర్మిస్తారని, ఇది పూర్తిగా అల్ట్రా లగ్జరీ విల్లాలతో అత్యంత ఆధునికంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ ఈ సిటీలోకి వచ్చిన వారికి కిరాణా దుకాణం నుంచి అన్ని రకాలు సదుపాయాలు ఉండాలన్నారు. యోగా ఇతర సదుపాయాలతో పాటు గుడి కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టు ప్రారంభమైందని, ఇప్పుడు తమ ఆధ్వర్యంలో భూమి పూజ కూడా జరగడం ఆనందించదగ్గ విషయమన్నారు. ఈ ప్రాజెక్టుకు తమ పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఇందులో యాజమాన్య ప్రతినిధులు, అతిథులు మురళీకృష్ణ, సంతోష్, తారక్, డాక్టర్ రాజేశ్వరరావు, వేణు వినోద్, అల్లూరి రంగరాజు, అల్లూరి సీతారామరాజు, కేఎల్ సంతోష్, శ్రీవర్ధన్, ఆధిత్య తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ: చంద్రమౌళి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ
విశాఖ: కశ్మీర్ లోని పెహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన జరజాపు చంద్రమౌళి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఈరోజు(గురువారం) చంద్రమౌళి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన వైఎస్ జగన్.. వారికి ధైర్యం చెప్పారు. కాగా, జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి మృతదేహం బుధవారం రాత్రి విశాఖకు చేరుకుంది. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా నుంచి గురువారం సాయంత్రం నగరానికి చేరుకునే అవకాశం ఉంది.. శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఉగ్రదాడిలో మృతిచెందిన కావలి వాసి మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను సైతం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వైఎస్ జగన్.. వారికి ధైర్యం చెప్పారు. మధుసూదన్ రావు భార్య ప్రసన్న లక్ష్మీ, బావ నరేస్లతో ఫోన్లో మాట్లాడారు వైఎస్ జగన్. -
‘ఎకరా భూమి 99 పైసలకే ఎలా కట్టబెడతారు?’
విశాఖ: కూటమి ప్రభుత్వం రాజకీయ అవినీతికి పాల్పడుతోందని సీపీఎం తీవ్రంగా మండిపడింది. ఉర్సా సంస్థకు కటాయించే భూములను వెంటనే రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈరోజు’(గురువారం) ఉర్సా కంపెనీకి కేటాయించే భూముల్లో పర్యటించారు సీపీఎం నేతలు. దీనిలో భాగంగా మాట్లాడుతూ ‘ నకిలీ సంస్థకు 60 ఎకరాల భూమి కేటాయిస్తారా. కూటమి ప్రభుత్వం రాజకీయ అవినీతికి పాల్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనునాయులకు భూ కేటాయింపులు చేస్తున్నారు. ఎకరా భూమిని ఏ విధంగా 99 పైసలకు కట్టబెడతారు. 10 లక్షల అధీకృత పెట్టుబడి ఉన్న కంపెనీకి 3 వేల కోట్ల భూమి కేటాయింపు ఎలా చేస్తారు?, ఉర్సా ఒక టీడీపీ నాయకుడి బినామీ సంస్థగా ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని టీడీపీ ఎంపీ సోదరుడే స్వయంగా చెప్పారు. 60 ఎకరాల భూ కేటాయింపుపై విచారణ జరిపించాలి’ అని సీపీఎం డిమాండ్ చేసింది. -
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు ప్రలోభాలు.. ప్రత్యేక విమానాలేంటి?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాజకీయాల్లో ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదని హితవు పలికారు. కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీతోనే ఉన్నారని అన్నారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా విశాఖలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా బొత్స మాట్లాడుతూ.. కశ్మీర్లో తీవ్రవాదుల కాల్పులు కారణంగా 26 మంది చనిపోవడం బాధాకరం. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించారు. నేనెప్పుడూ ఇటువంటి రాజకీయాలను చూడలేదు. రాజకీయాల్లో ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. 11 నెలల మేయర్ పదవి కోసం అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ 11 నెలల కాలంలో ఏం చేస్తారో ప్రజలకు చెబుదాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీతోనే ఉన్నారు. వారందరినీ అభినందిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ప్రియాంక విద్యోదయ విజయదుందుభి
అల్లిపురం: 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో అల్లిపురంలోని ప్రియాంక విద్యోదయ హైస్కూల్ విజయదుందుభి మోగించింది. పాఠశాలకు చెందిన సాయి యామిని 595 మార్కు లు సాధించి జిల్లా స్థాయి ర్యాంక్ సాధించింది. ఈగల దుర్గా భవానీ జ్యోతిక 592, కలే దయానంద్ 590, దండు కావ్య 590 మార్కులు సాధించి అద్బుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 190 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఉపాధ్యాయుల క్రమశిక్షణతో కూడిన బోధన, విద్యార్ధుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఈ విజయానికి కారణమని పాఠశాల హెచ్ఎం డాక్టర్ భగీరథ్ కుమార్ దధీచి అన్నారు. విద్యార్థులను అభినందించారు. -
బహుళ నైపుణ్యాలు అవసరం
విశాఖ సిటీ: పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా యువత బహుళ నైపుణాలతో రాణించాల్సిన అవసరం ఉందని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ పేర్కొన్నారు. ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని సాగరిక కన్వెన్షన్ సెంటర్లో బుధవారం ఫెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో పుస్తక జ్ఞానం ఒక్కటే సరిపోదన్నారు. ప్రతి శాస్త్రంతో సాంకేతికత, ఏఐ, ఎంఎల్ వంటివి అనుసంధానం అవుతున్నాయని, బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా వీటి ప్రాముఖ్యత ఉందన్నారు. ఏయూ సిబ్లో విభిన్న దేశాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వస్తున్నారని, తద్వారా భారతీయ విద్యార్థులకు విభిన్న సంస్కృతులను పరిచయం చేసుకోవడానికి, తెలుసుకోడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక శాతం విదేశీ విద్యార్థులను కలిగిన విశ్వవిద్యాలయంగా ఏయూ నిలుస్తోందన్నారు. విద్యార్థులకు విదేశాల్లో సైతం ఇంటర్న్షిప్ అందించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్రం సంచాలకుడు ఆచార్య పి.విశ్వనాథం మాట్లాడుతూ 26 దేశాలకు చెందిన విద్యార్థులు తమ వద్ద విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కామర్స్ మేనేజ్మెంట్ విభాగాధిపతి ఆచార్య జాలాది రవి, ఏయూ సిబ్ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్కాముల్లో చంద్రబాబు దిట్ట
● లిక్కర్ స్కాం జరిగింది చంద్రబాబు పాలనలోనే.. ● ఖజానాకు చేరాల్సిన రూ.5 వేల కోట్లు కూటమి నేతల జేబుల్లోకి.. ● మద్యం కేసులో వైఎస్ జగన్ పేరు చేర్చే కుట్ర చేస్తున్నారు ● మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ సాక్షి, విశాఖపట్నం: స్కామ్ల్లో చంద్రబాబు దిట్ట.. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగింది కూటమి ప్రభుత్వంలోనేనని మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 11 నెలల పాలనలో గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలిశాయని మండిపడ్డారు. ఎంఆర్పీ కన్నా అధికంగా మద్యం దుకాణాల్లో మద్యాన్ని విక్రయిస్తున్నారన్నారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో దొంగే దొంగ అన్నట్లు ఉందని, టీడీపీ నేతల కనుసన్నల్లోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. నాణ్యమైన మద్యం అందిస్తామని నాసిరకమైన మద్యాన్ని అమ్ముతున్నారంటూ మండిపడ్డారు. నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి మద్యం పేరు చెప్పి ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రూ.5 వేల కోట్లు కూటమి నేతల జేబుల్లోకి వెళ్తున్నాయంటూ ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో వారి పార్టీ నాయకులకు అడ్డదారిలో డిస్టిలరీ అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ రంగంలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగాయని, ప్రభుత్వ రంగంలో మద్యం షాపులు నిర్వహిస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందే తప్ప, లంచాలు వస్తాయా.. అని ప్రశ్నించారు. ప్రైవేట్ రంగంలో మద్యం షాపులు నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వంలోనే లంచాలు వస్తాయన్నారు. తమ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఒక్క బెల్టు షాపు అయినా కనిపించిందా? అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని, మద్యం కేసులో వైఎస్ జగన్ పేరు చేర్చే కుట్రకు ఈ కూటమి ప్రభుత్వ పాల్పడుతోందని ఆరోపించారు. అంతేకాకుండా 2014–19 టీడీపీ పాలనలో చంద్రబాబు మీద ఉన్న మద్యం కేసులపైన విచారించే దమ్ముందా...? అంటూ పశ్నించారు. -
చంద్రమౌళి భౌతికకాయానికి నివాళి
నవ్వుతూ వెళ్లారు.. డాబాగార్డెన్స్: కనకదుర్గ ఆస్పత్రి వద్ద చంద్రమౌళి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు అక్కడి వారిని కలచివేశాయి. ‘నవ్వుతూ వెళ్లారు. విగతజీవిగా తిరిగి వచ్చి అందరినీ ఏడిపించారు.’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పుడూ అందరితో సరదాగా ఉండే చంద్రమౌళి అకస్మాత్తుగా తమను విడిచి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ విలపించారు. సాక్షి, విశాఖపట్నం: జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జరజాపు చంద్రమౌళి మృతదేహం బుధవారం రాత్రి 8 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంది. సీఎం చంద్రబాబు ఎయిర్పోర్టులో చంద్రమౌళి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం చంద్రమౌళి సతీమణి నాగమణి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. అనంతరం పార్థివదేహాన్ని మహాప్రస్థానం వాహనంలో జిల్లా పరిషత్ జంక్షన్లో ఉన్న కనకదుర్గ ఆస్పత్రి వద్దకు తరలించారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా నుంచి గురువారం సాయంత్రం నగరానికి చేరుకుంటారు. శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి. సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, హోంమంత్రి అనిత, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు ఉన్నారు. శాంతి ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు -
తిరుమల విద్యార్థుల ప్రభంజనం
తగరపువలస: 10వ తరగతి పరీక్ష ఫలితాలలో తాళ్లవలస క్యాంపస్కు చెందిన తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. 600 మార్కులకు గానూ కె.దుర్గా కాశ్యప్, కె.శ్రీవల్లి 596 మార్కు లు సాధించారన్నారు. అలాగే జి.వెంకట్ వరుణ్ వర్షిత్, బి.కీర్తిశ్రీ, ఎం.కల్యాణ్రామ్ 595, ఎ.ఖ్యాతి మోధిక, కె.తన్వీర్, ఎల్.హన్సుజా, ఎన్.అమృతవర్షిణి, వై.అర్పిత విజయ 594, చిల్ల నిశాంత్రెడ్డి 591 మార్కులు సాధించినట్లు తెలిపారు. 42 మంది విద్యార్థులు 590 కంటే ఎక్కువ మార్కులు, 96 మంది 585 కంటే ఎక్కువ, 281 మంది 570 కంటే ఎక్కువ, 321 మంది 565 కంటే ఎక్కువ, 408 మంది 550 కంటే ఎక్కువ, 510 మంది 500 కంటే ఎక్కువ, 545 మంది 400 కంటే ఎక్కువ మార్కులు సాధించినట్లు వెల్లడించారు. -
శ్రీ చైతన్య విజయకేతనం
ఆరిలోవ: 10వ తరగతి ఫలితాల్లో ఉత్తరాంధ్ర జోన్ శ్రీ చైతన్య స్కూల్స్ విద్యార్థులు సత్తా చాటారు. అనీష యండ 599 మార్కులు సాధించి టాపర్గా నిలవగా, అబ్దుల్ సమీర భాను, బి.హృదయ శాంతి 598 మార్కులు సాధించి ద్వితీయ స్థానం సాధించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 40 మంది విద్యార్థులు 595 మార్కులు, 257 మంది విద్యార్థులు 590 మార్కులకు పైగా సాధించినట్లు విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. ఈ విజయంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందన్నారు. ఉత్తరాంధ్ర ఏజీఎం ఎం.వి.సురేష్, రీజినల్ ఇన్చార్జిలు ఆలీ, రమణ, శ్రీనివాస్, రామినాయుడు, ప్రసాద్, అకడమిక్ కోఆర్డినేటర్లు రాజేష్, ప్రిన్సిపాళ్లు, డీన్లు విద్యార్థులను అభినందించారు. -
పదో తరగతి ఫలితాల్లో శ్రీ విశ్వ విద్యార్థుల ప్రతిభ
సీతంపేట: 10వ ఫలితాల్లో శ్రీ విశ్వ స్కూల్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. షేక్ షాజిద్ అహ్మద్ 594 మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచాడు. రెడ్డి బాల ఆదిత్య 593, పసుపులేటి శశాంక్ 593, జల్ధు మహతి 591, మేడూరి సాహితి 589, మసాపు రోహిత్ 588 మార్కులు సాధించారు. 580కిపైగా 8 మంది, 550కిపైగా 53 మంది, 500లకు పైగా 91 మంది సాధించారు. వీరిని శ్రీవిశ్వ విద్యా సంస్థల చైర్మన్ కె.ఎస్.హెచ్.ఆర్.కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ అభినందించారు. -
63 ఏళ్ల వయసులో ఫస్ట్క్లాస్లో ఇంటర్ ఉత్తీర్ణత
అగనంపూడి: చదువు పట్ల ఆసక్తి, ఏదైనా సాధించాలనే తపన ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని నిరూపించారు పట్టా రామ అప్పారావు. అగనంపూడి నిర్వాసిత కాలనీలోని కొండయ్యవలసకు చెందిన అప్పారావు విశాఖ స్టీల్ప్లాంట్ నుంచి ఐదేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు కళలతో పాటు విద్యపై మక్కువ ఎక్కువ. ఈ ఆసక్తితోనే 63 ఏళ్ల వయసులో ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరై ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. విశేషమేమిటంటే ఆయన 1977లో 10వ తరగతి పరీక్షలు ఉత్తీర్ణులై, వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగ పరీక్షల్లో విజయం సాధించి విధుల్లో చేరారు. దాదాపు 48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఫస్ట్క్లాస్లో పాసవడం ఆయనకు చదువు పట్ల ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుంది. చదువుకోవాలనే కోరిక, కృషి ఉంటే వయసు ఎప్పుడూ అడ్డుకాదని పట్టా రామ అప్పారావు నిరూపించారు. -
మృత్యువులోనూ వీడని బంధం
● భర్త మరణించిన 15 నిమిషాలకే భార్య కన్నుమూత ● ఒకే పాడైపె అంతిమ యాత్ర.. ఒకే చితిపై దహనం ● రెడ్డిపల్లి పంచాయతీ రామన్నపేటలో విషాదం పద్మనాభం: బంధం అంటే ఆ దంపతులదే. మృత్యువు కూడా వారిని విడదీయలేకపోయింది. భర్త ఈ లోకం విడిచి వెళ్లిన కొద్ది నిమిషాలకే భార్య కూడా ఆయన వెంటే పయనమైంది. పద్మనాభం మండలం రెడ్డిపల్లి పంచాయతీ రామన్నపేటలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది. రామన్నపేటకు చెందిన సుంకర సత్యనారాయణ (78) కొంతకాలం కిందట పక్షవాతం బారినపడి కోలుకున్నారు. పది రోజులుగా తన పనులను తానే చేసుకుంటూ చురుగ్గా తిరుగుతున్నారు. అయితే మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సత్యనారాయణ అకస్మాత్తుగా మృతి చెందారు. భర్త మృతదేహం వద్ద భార్య రామయ్యమ్మ (73) గుండెలవిసేలా రోదించింది. ఆ దుఃఖంలోనే.. భర్త చనిపోయిన కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే రామయ్యమ్మ తుదిశ్వాస విడిచింది. జీవితాంతం అన్యోన్యంగా మెలిగిన ఆ వృద్ధ దంపతులు ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులను తామే చేసుకునేవారు. మృత్యువు కూడా వారిని విడదీయలేక ఒకే సారి ఇద్దరినీ తీసుకువెళ్లిపోవడం అందరినీ కంటతడి పెట్టించింది. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బుధవారం ఉదయం ఆ దంపతులకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇద్దరి మృతదేహాలకు పక్కపక్కనే కూర్చోబెట్టి స్నానం చేయించారు. అనంతరం ఒకే పాడైపె ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. రెడ్డిపల్లి కోమటి గుండం చెరువులోని శ్మశాన వాటికలో ఒకే చితిపై వారి దేహాలను పేర్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. -
సివిల్స్ విజేతకు ఘన సత్కారం
ఎంవీపీకాలనీ: సివిల్స్ విజేత డాక్టర్ రావాడ సాయిమోహిని మానసను ఎంవీపీ కాలనీలోని వైజాగ్ ఐఏఎస్ అకాడమీ ఘనంగా సత్కరించింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన ఆమె మంగళవారం విడుదలైన యూపీఎస్ఈ ఫలితాల్లో 975 ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంవీపీలోని అకాడమీలో బుధవారం మానసతో పాటు ఆమె తల్లిదండ్రులు ప్రకాశరావు, ఉషారాణి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ పోతుల గౌతమ్ మాట్లాడుతూ మానస చురుకై న విద్యార్థి అని కొనియాడారు. రెండు సార్లు యూపీఎస్ఈలో ఆమె పలు స్టేజ్లకు అర్హత సాధించిందని, మూడవ ప్రయత్నంలో ఆలిండియాలో 975వ ర్యాంకు సాధించిందన్నారు. వైజాగ్ ఐఏఎస్ అకాడమీ నిరంతరం ఆమెకు వెన్నుదన్నుగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఈ విజయంతో వైజాగ్ ఐఏఎస్ అకాడమీతో పాటు ఉత్తరాంధ్రకు ఆమె వన్నె తెచ్చారన్నారు. మానస మాట్లాడుతూ ఈ విజయంలో తల్లిదండ్రుల పాత్రతో పాటు వైజాగ్ ఐఏఎస్ అకాడమీ కృషి ఎంతో ఉందన్నారు. సీఎస్బీ బాలలత అందించిన మెలకువలు తన విజయానికి దోహదపడ్డాయన్నారు. ఇక్కడితో తన జర్నీ ఆగిపోలేదని, మరోసారి యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమై ఆలిండియాలో టాప్ 10 ర్యాంకు సాధించడమే తన లక్ష్యమన్నారు. సివిల్స్ సాధించాలనే ఆసక్తితో పాటు ప్లానింగ్, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆన్లైన్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రతీ అభ్యర్థి విజయం సాధించగలరని మానస వివరించారు. -
వార్డు అభివృద్ధి విస్మరించి ఆరోపణలా?
● మంకీ క్యాప్తో స్పాకు ఎందుకు వెళ్తున్నావ్? ● జనసేన కార్పొరేటర్పై డిప్యూటీ మేయర్ ఫైర్ ● ఒకే వార్డులో పోటీ చేద్దామా అని సవాల్ సీతమ్మధార: జీవీఎంసీ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్పై డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని వార్డు అభివృద్ధిని విస్మరించి.. ఇతరులపై నిరాధార ఆరోపణలతో నిత్యం పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. నగరంలోని హోటల్లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూర్తి యాదవ్ ఉదయం రూ.100 కోట్లు, రూ.1000 కోట్లు కుంభకోణాలు చేస్తున్నారని ఇతరులపై ఆరోపణలు చేసి.. సాయంత్రానికి స్టార్ హోటళ్లలో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడని ఆరోపించారు. 2007లో తాను కార్పొరేటర్గా వెయ్యి ఓట్లతో గెలిచానని, తర్వాత వైఎస్సార్ సీపీలో చేరి మరలా కార్పొరేటర్గా గెలిచి డిప్యూటీ మేయర్ అయినట్టు గుర్తు చేశారు. బికారిగా తిరుగుతున్న పీతల మూర్తిని యూత్ కాంగ్రెస్లో చేర్పించింది తానేనని గుర్తు చేస్తూ.. దమ్ముంటే వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో ఒకే వార్డులో పోటీ చేద్దామా అని సవాల్ విసిరారు. స్పా, మసాజ్ సెంటర్లకు మంకీ క్యాప్ వేసుకొని ఎందుకు వెళ్తున్నావని మూర్తిని ప్రశ్నించారు. తన పాస్ పోర్ట్ సీజ్ అయ్యిందనే ప్రచారం అవాస్తవమని, తాను ఇటీవల అమెరికా వెళ్లి వచ్చానని తెలిపారు. త్వరలో తానా సభలకు వెళ్తున్నట్లు తెలిపారు. మూర్తి యాదవ్ ప్రభుత్వ మహిళా డాక్టర్ శాలరీ కార్డు జేబులో పెట్టుకు ని జల్సాలు చేస్తున్నాడని.. ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క ఇంటిని మెయింటైన్ చేస్తున్నాడని ఆరోపించారు. ఎండాడలోని స్కై టవర్స్ బిల్డర్స్ని భయబ్రాంతులకు గురి చేసి డబ్బులు దండుకోలేదా అని మూర్తిని ప్రశ్నించారు. వార్డులో ఒక మహిళ వద్ద 90 తులాల బంగారం, రూ.30 లక్షలను మూర్తి దోచుకున్నాడని కమిషనర్కు ఫిర్యాదు కూడా అందిందని శ్రీధర్ చెప్పారు. చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతున్న మూర్తికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఆనందపురం మండలం గిడిజాల సర్వే నం. 332/1 1.24 సెంట్లు, 332/2లో సుమారు 7.03 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేశాననే ఆరోపణలు నిరూపించాలని మూర్తియాదవ్కు సవాల్ విసిరారు. తాను ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు రుజువైతే.. ఆ భూములను స్వాధీనం చేసుకోవచ్చన్నారు. డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, వైఎస్సార్సీపీ నాయకులు గొలగాని శ్రీనివాస్, బానాల శ్రీనివాస్, ఒమ్మి చిన్నారావు, కోరుకొండ స్వాతి, శశికళ, మొల్లి అప్పారావు, మువ్వల సురేష్ పాల్గొన్నారు. ఆరోపణలపై విచారణ చేయండి గోపాలపట్నం: తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ బుధవారం కలెక్టర్ హరేందిర ప్రసాద్ను కోరారు. కొద్ది రోజులుగా కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపై ఆరోపణలు చేస్తున్నాడని.. ప్రభుత్వ భూమిని తానెక్కడ కబ్జా చేశానో తేల్చాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తన, తన కుటుంబ సభ్యుల పేరుతో రెవెన్యూ స్థలాలు ఉన్నాయో సర్వే చేయించాలన్నారు. గ్రీన్ బెల్టులు ఆక్రమించినట్లు మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నాడని, అలాంటి వాటిపై సమగ్ర విచారణ జరపాలన్నారు. -
సాక్షి మీడియాపై దాడి గర్హణీయం
సీతమ్మధార : ఏలూరులో సాక్షి దినపత్రిక కార్యాలయంపై టీడీపీ గూండాల దాడి గర్హణీయమంటూ విశాఖలో పాత్రికేయులు బుధవారం ఆందోళన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీపార్కులో సాక్షి దినపత్రిక విశాఖ బ్యూరో చీఫ్ కేజీ రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది, పలు పాత్రికేయ సంఘాల ప్రతినిధులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక మీడియాపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సాక్షి బృందంపై పెట్టిన కేసుల గురించి ఆందోళనలు మరిచిపోకముందే ఏలూరు జిల్లాలో సాక్షి కార్యాలయం మీద టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడడం హేయమైన చర్య అన్నారు. డెస్క్ ఇన్చార్జి బి.బి.సాగర్ మాట్లాడుతూ పత్రికల్లో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే యాజమాన్యాలకు ఖండన పంపాలి తప్ప దాడులు సరికాదన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గతంలో కూడా తహసీల్దార్పై దాడులు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు సాక్షి మీద కూడా దాడులకు దిగడం, అధికార పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు కె.టి.రామునాయుడు మాట్లా డుతూ టీడీపీ గూండాలు పత్రికల మీద దాడి చేయడం, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టుగా పేర్కొన్నారు. నిరసనలో సాక్షి విశాఖ యూనిట్ పాత్రికేయులు, వివిధ పాత్రికేయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
26 నుంచి ఏయూ శతాబ్ది ఉత్సవాలు
విశాఖ సిటీ : ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 26న ప్రారంభం కానున్నాయని ఉపకులపతి ప్రొ.రాజశేఖర్ తెలిపారు. అకడమిక్ సెనేట్ మందిరంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ తొలి రోజు ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్లో శతాబ్ది వాక్థాన్తో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయన్నారు. ఉదయం 9 గంటల కు ఏయూ పరిపాలన భవనం వద్ద బెలూన్ లాంచింగ్, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రధాన వేడుకలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.మధుమూర్తి, ఐఐటీ పాలక్కడ్ డైరెక్టర్ ప్రొ.శేషాద్రి శేఖర్ అతిథులుగా హాజరవుతారన్నారు. ఇందులో భాగంగా విజన్ డాక్యుమెంట్, శతాబ్ది ఉత్సవాల వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. విశ్వ విద్యాలయంలో నూతన భవనాలు, సెంట్రల్ ల్యాబ్ ఫెసిలిటీ, పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన జ్ఞాపికగా ప్రత్యేక ఐకానిక్ టవర్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్బాబు, రిజిస్ట్రార్ ప్రొ.ధనుంజయ్రావు, తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి చందనోత్సవం టికెట్ల విక్రయం
ఆన్లైన్లో కూడా అందుబాటులో... సింహాచలం: ఈనెల 30న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి రూ.300, రూ.1000 దర్శన టికెట్ల విక్రయాలు గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు తెలిపారు. సింహాచలం కొండపైన దేవస్థానం పాత పీఆర్వో కార్యాలయం వద్ద, నగరంలోని పలు బ్యాంకుల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకుని ఆధార్ నెంబరుతో పూర్తిచేసి టికెట్లు నేరుగా పొందవచ్చన్నారు. సింహాచలంలోని యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ల్లోను, అక్కయ్యపాలెం, కేజీహెచ్, మహారాణిపేటలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ల్లో టికెట్లు లభిస్తాయని తెలిపారు. అలాగే బిర్లా జంక్షన్, సాలిగ్రామపురం(అక్కయ్యపాలెం) ఎస్బీఐ బ్రాంచ్ల్లో టికెట్లు లభిస్తాయని పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ వరకు మాత్రమే టికెట్లు విక్రయాలు జరుగుతాయన్నారు. చందనోత్సవం రోజు ఎలాంటి దర్శన టికెట్ల విక్రయాలు జరగవని పేర్కొన్నారు. ఈనెల 24వ తేదీ ఉదయం 7 నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు www. aptemples.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా టికెట్లు పొందవచ్చని తెలిపారు. అప్పన్న హుండీ ఆదాయం రూ.1.81 కోట్లు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీల ఆదా యం గత 28 రోజులకుగాను రూ.1,81,41,219 వచ్చినట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు తెలిపారు. 145.100 గ్రాముల బంగారం, 11.250 కిలోల వెండి, 8 దేశాల విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్టు తెలిపారు. -
ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్ సీపీ శాంతి ర్యాలీ
సీతమ్మధార: జమ్మూకశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అక్కడ నుంచి గుడివాడ గురునాథరావు విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్ సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ప్రపంచం మొత్తం ఖండిస్తుందన్నారు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న మట్టు పెట్టాలని, బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలందరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాదులను పట్టుకొని ఉరితీయాలని మండిపడ్డారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ ఈ దాడి దేశ సమగ్రతను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడులను సమర్ధంగా తిప్పికొట్టే క్రమంలో దేశ ప్రజలంతా కేంద్రానికి మద్దతు నిలవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట రామయ్య, డిప్యూటీ మేయర్లు కటుమూరి సతీష్, జియ్యాని శ్రీధర్, కార్పొరేటర్లు మొల్లి లక్ష్మీఅప్పారావు, మువ్వల లక్ష్మి, బిపిన్ కుమార్ జైన్, పి.వి.సురేష్, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు పేర్ల విజయ్చందర్, గ్రంథాలయం జిల్లా మాజీ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నడింపల్లి కష్ణంరాజు, చిన్న జానకి రాము, అధికార ప్రతినిధులు పల్లా దుర్గ, హరి కిరణ్రెడ్డి, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు దొడ్డి కిరణ్, పేడాడ రమణ కుమారి, బోని శివరామకష్ణ, మారుతీప్రసాద్, సేనాపతి అప్పారావు, రాయిపురెడ్డి అనిల్, పీలా ప్రేమ్కిరణ్, రామిరెడ్డి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
పదిలో తగ్గిన ఉత్తీర్ణత
● పదో తరగతి ఫలితాల్లో 2 శాతం తగ్గిన జిల్లా ఉత్తీర్ణత ● 89.14 శాతంతో 3వ స్థానంలో నిలిచిన విశాఖ జిల్లా ● 28,435 మందికి గాను 25,346 మంది పాస్ ● 90.05 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించిన బాలికలు ఆరిలోవ : రాష్ట్రంలో బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో విశాఖ జిల్లాలో గత ఏడాది కంటే 2 శాతం ఉత్తీర్ణత తగ్గింది. 2023–24 విద్యా సంవత్సరంలో 91.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఈ ఏడాది 89.14 శాతానికి పడిపోయింది. అలాగే విశాఖ జిల్లా గతేడాది పదో తరగతి ఫలితాల్లో నాలుగో స్థానంలో నిలవగా ఈ ఏడాది మూడో స్థానానికి చేరడంతో జిల్లా విద్యాశాఖాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లాలో 28,435 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 25,346 మంది(89.14 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది కూడా బాలికల హవా కొనసాగింది. 15,045 మంది బాలురు పరీక్ష రాయగా 13,288 మంది (88.32 శాతం), 13,390 మంది బాలికలు పరీక్ష రాయగా 12,058(90.05 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ డివిజన్లో 21,833 మంది ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 25,346 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 21,833 మంది ఫస్ట్ డివిజన్, 2,367 మంది సెకండ్ డివిజన్, 1,146 మంది థర్డ్ డివిజన్లో ఉత్తీర్ణుత పొందారు. కార్పొరేట్ పాఠశాలలదే పైచేయి.. వేపగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఇండిగ శ్రీవేద 593/600 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా టాపర్గా నిలవగా, భీమునిపట్నం రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని రెడ్డి భవ్యశ్రీ 592/600 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. జ్ఞానికేతన్ ఎయిడెడ్ పాఠశాలలో చదివిన డబ్బీరు చరణ్సాయి, నరవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన రెడ్డి సౌజన్య 591 మార్కులతో జిల్లాలో మూడో స్థానంలో నిలిశారు. నగరంలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన సాయితన్వీ 599/600, ఎ.లిఖిత 599/600, అనీష 599/600 మార్కులు సాధించారు. దీంతోపాటు 598, 597, 596 మార్కులు సాధించినవారు వేలల్లో ఉండటం విశేషం. ఏపీ రెసిడెన్షియల్స్లో శత శాతం ఉత్తీర్ణత జిల్లాలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. భీమునిపట్నం ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో 85 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. దీంతో పాటు ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న 10 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉండగా 42.17 శాతం ఉత్తీర్ణత సాధించిన ఏయూ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల జిల్లాలో అట్టడుగు స్థానంలో నిలిచింది. సోషల్ వెల్ఫేర్లో 73.07 శాతం ఉత్తీర్ణత జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లోని 10వ తరగతి విద్యార్థులు 73.07 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు వెల్లడించారు. ఈ ఏడాది వసతి గృహాలకు చెందిన 78 మంది పరీక్షలకు హాజరు కాగా 57 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. జిల్లా పరిధిలో మూడు హాస్టల్స్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మే 19 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28 వరకు జరగనున్నాయని డీఈవో ప్రేమ్కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈనెల 24 నుంచి 30 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. రీకౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.1000 చొప్పున మే ఒకటో తేదీ వరకు ఏపీ ఆన్లైన్లో ఫీజు చెల్లించాలన్నారు. ఐఏఎస్ అవుతా.. పదో తరగతిలో 599 మార్కులు రావడం ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో ఇది సాధ్యమైంది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూపు తీసుకుంటాను. జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు సాధించి ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేస్తాను. తరువాత సివిల్స్ రాసి ఐఏఎస్ అవుతాను. రాష్ట్రానికి, దేశానికి సేవలు అందిస్తాను. – సాయి తన్వీ, 599 మార్కులు ఐఐటీలో చదవడమే లక్ష్యం సైన్స్ సబ్జెక్టులో రెండు మార్కుల ప్రశ్నలో చేసిన తప్పిదం కారణంగా ఒక్క మార్కు తగ్గింది. అయినా మంచి మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. అమ్మనాన్న ప్రోత్సాహంతో పాటు స్కూల్ యాజమాన్యం అందించిన సహకారంతో ఇన్ని మార్కులు సాధించగలిగాను. ప్రముఖ ఐఐటీలో ఉన్నత విద్యనభ్యసించి అమ్మనాన్నలకు మరింత పేరు తెస్తాను. – ఆళ్ల లిఖిత, 599 మార్కులు -
మన షిప్యార్డు మినీ 'రత్న'o!
ఇండస్ట్రీ విభాగంలో దూసుకెళ్లేలా హిందుస్థాన్ షిప్యార్డు అడుగులు వేస్తోంది. దేశీయ నౌకల తయారీపై దృష్టి సారిస్తూ, అత్యుత్తమ సేవలందించేందుకు మినీరత్నగా ఆవిర్భవించనుంది. విశాఖపట్నంను కేవలం షిప్ రిపేర్ హబ్గా మాత్రమే కాకుండా.. షిప్ బిల్డింగ్ హబ్గా తీర్చిదిద్దేలా రూ.19,048 కోట్లతో 5 భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనులను దక్కించుకుంది. నష్టాల బాటలో కొట్టుమిట్టాడిన ఈ నౌకా నిర్మాణ సంస్థ.. దివంగత వైఎస్సార్ చొరవతో కొత్త అవతారం ఎత్తి, ఇప్పుడు తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. ఓ వైపు దేశీయ ఆర్డర్లతో పాటు అంతర్జాతీయ నౌకల మరమ్మతులను దక్కించుకుంటూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. – సాక్షి, విశాఖపట్నం1941లో సింథియా షిప్యార్డుగా ప్రారంభం కాగా.. 1961లో సంస్థను జాతీయం చేసి హిందుస్థాన్ షిప్యార్డుగా పేరు మార్చారు. జల రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోని షిప్యార్డు నష్టాలతోనే నడిచి, చివరికి ఉద్యోగాలకు జీతాలివ్వలేని స్థితికి చేరుకుంది. ఈ దశలో ప్రైవేటీకరణే శరణ్యమైంది. విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో 2010లో రక్షణ శాఖ పరిధిలోకి షిప్యార్డు వచ్చింది. తొలినాళ్లలో ఆర్డర్లు రాక ఇబ్బందులు పడినా.. క్రమంగా ఒక్కో అవరోధాన్ని అధిగమించింది. ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తున్న హెచ్ఎస్ఎల్.. ఇప్పుడు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్ల కాలంలో ఏకంగా 14 ప్రాజెక్టులను పూర్తి చేసి ఆర్డర్ల పెండెన్సీని గణనీయంగా తగ్గించుకుంది. 40 నౌకల రీఫిట్ పనులను ఐదేళ్ల కాలంలో పూర్తి చేసి ఔరా అనిపించుకుంది. మినీరత్న హోదా దిశగా.. వరుసగా లాభాల బాటలో పయనిస్తున్న హిందుస్థాన్ షిప్యార్డు త్వరలోనే అరుదైన ఘనతని సొంతం చేసుకోనుంది. ఎలాంటి అప్పులు లేకుండా.. ఏటా లాభాలు ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలకు అందించే మినీరత్న హోదాకు షిప్యార్డు పూర్తి అర్హత సాధించింది. ప్రస్తుతం దేశంలో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ), గోవా షిప్యార్డు వంటి కొన్ని సంస్థలకు మినీరత్న హోదా ఉంది. నిజానికి, 2023–24 ఆర్థిక సంవత్సరంలోనే షిప్యార్డు ఈ ఘనతను సొంతం చేసుకునేది. ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ నిర్మాణ పనులను తొలుత హెచ్ఎస్ఎల్కు ఇచ్చేందుకు రక్షణ శాఖ సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో రెండు షిప్స్ నిర్మాణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడంతో షిప్యార్డు మూడింటితోనే సరిపెట్టుకుంది. ఈ కారణంగా మినీరత్న హోదా ఒక ఏడాది ఆలస్యమైంది. 40 ఏళ్ల షిప్యార్డు చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,586 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతంతో పోలిస్తే 36 శాతం వృద్ధితో రూ.166 కోట్ల నికరలాభాన్ని పొందడంతో.. మినీరత్నగా అవతరించడం లాంఛనంగా మారింది.వరస ఆర్డర్లతో బిజీబిజీ మూడు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్(ఎఫ్ఎస్ఎస్) నిర్మాణానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖతో హిందుస్థాన్ షిప్యార్డు ఒప్పందం కుదుర్చుకుంది. 45 మిలియన్ టన్నుల డిస్ప్లేస్మెంట్ సామర్థ్యం కలిగిన ఈ నౌకల తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నౌకల నిర్మాణాల వల్ల హెచ్ఎస్ఎల్ వార్షిక టర్నోవర్ కూడా గణనీయంగా పెరిగింది. వీటిలో ఒక షిప్ని జూలైలో నౌకాదళానికి అందజేసేందుకు హెచ్ఎస్ఎల్ సిద్ధమవుతోంది.దీంతో పాటు భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు, కార్గో షిప్స్, పోర్టు గ్రీన్ టగ్లు, కోస్ట్గార్డ్ వెసల్స్, జలాంతర్గాముల రీఫిట్, మరమ్మతుల పనులతో షిప్యార్డు తీరిక లేకుండా ముందుకు సాగుతోంది. అలాగే ఆగ్నేయాసియా దేశాలకు ప్రధాన రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగానూ, నౌకల తయారీ కేంద్రంగానూ ఎదగడానికి షిప్యార్డు ప్రణాళికలు వేస్తోంది. విదేశీ నౌకలను మరమ్మతు చేయడం ద్వారా అంతర్జాతీయ వ్యాపారాన్ని ఇది వరకే ఆకర్షించిన షిప్యార్డు, ఇప్పుడు విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తోంది. 2021లో 17,000 టన్నుల విదేశీ నౌకను డాక్ చేసి మరమ్మతులు విజయవంతంగా పూర్తి చేసింది. భారత్లో స్వదేశీ పరిజ్ఞానంతో తొలి ఓషన్ సరై్వలెన్స్ షిప్ (ఓఎస్ఎస్) అయిన ఐఎన్ఎస్ ధృవ్ను నిర్మించిన హెచ్ఎస్ఎల్.. 2022లో 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన డైవింగ్ సపోర్ట్ వెసల్స్ ఐఎన్ఎస్ నిస్తార్, ఐఎన్ఎస్ నిపుణ్ నౌకలను విజయవంతంగా అందించి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇప్పటికే 364 ఎంఎస్ఎంఈ వెండార్ల సహకారం తీసుకుంటున్న హెచ్ఎస్ఎల్.. మరిన్ని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనందించేందుకు కృషి చేస్తోంది. ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషి వరుసగా లాభాల బాటలో షిప్యార్డు నడుస్తోందంటే దానికి కారణం ఉద్యోగులు, కార్మికులతో పాటు ఎంఎస్ఎంఈల సహకారమే. మినీరత్న హోదా పొందేందుకు అర్హత సాధించడం షిప్యార్డు చరిత్రలోనే గొప్ప రోజుగా భావిస్తున్నాం. పెరుగుతున్న ఒప్పందాలకు అనుగుణంగా.. షిప్యార్డును ఆధునికీకరించేందుకు సన్నద్ధమవుతున్నాం. రూ.1000 కోట్లతో యార్డుని రానున్న మూడేళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రక్షణ మంత్రిత్వ శాఖతో కుదర్చుకున్న ఒప్పందం.. షిప్యార్డు భవిష్యత్ను మార్చబోతోంది. ఫ్లీట్ షిప్స్ తయారీ ద్వారా అనుబంధ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు కూడా సహకారం లభిస్తుంది. షిప్స్ తయారీలో దాదాపు 90 శాతం వరకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పరికరాలు, సామగ్రిని వినియోగిస్తాం. దేశీయ నౌకల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపైనా దృష్టి సారించాం. – కమొడర్ హేమంత్ఖత్రి, సీఎండీ, హిందుస్థాన్ షిప్యార్డ్ -
కశ్మీర్ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీవాసులు మృతి
శ్రీనగర్/విశాఖపట్నం: జమ్ముకశ్మీర్లోని పహల్గాం సమీప బైసరన్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో విశాఖ వాసి చంద్రమౌళిని ముష్కరులు దారుణంగా హత్య చేసినట్టు తెలిసింది. ఉగ్రవాదులు.. చంద్రమౌళిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం.వివరాల ప్రకారం.. పహల్గాంలో మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విశాఖ వాసి ఉన్నారు. విశాఖ వాసి చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతడిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్నా.. మోదీకి చెప్పుకోవాలంటూ విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. ఇక, చంద్రమౌళి.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అని తెలిసింది. చంద్రమౌళి బంధువు DSP నాగేశ్వర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఈ నెల 18న చంద్రమౌళి కశ్మీర్కు బయలుదేరి వెళ్లారు. ఆరుగురు కలిసి విహారయాత్రకి వెళ్లారు. ఇలాంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య గ్రాండ్గా చంద్రమౌళి పుట్టినరోజు వేడుకలు జరిపాం. ఇప్పటికీ మా వదినకి ఆయన చనిపోయిన విషయం తెలియదు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళి సమీప బంధువు కుమార్ రాజా తాజాగా మాట్లాడుతూ..‘ఈనెల 16న ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కశ్మీర్ టూర్కి వెళ్లారు. మొత్తం ఆరుగురు వెళ్లారు. ఈనెల 25 నాటికి తిరిగి రావాల్సి ఉంది. చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు అప్పన్న, శశిధర్ ఫామిలీలు వెళ్లాయి. చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేశారు.. కానీ, ముష్కరులు హతమార్చారు. మిగిలిన ఐదుగురు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు తరలిస్తారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా ఉన్నారు. వారిద్దరూ రేపు.. విశాఖకు చేరుకుంటారు. ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతాయి. నెల్లూరు వాసి మృతి..కశ్మీర్లోని పహాల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు మృతిచెందాడు. నిన్న జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ని కాల్చి చంపిన ఉగ్రవాదులు. బెంగళూరులో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్న మధుసూదన్. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ విషాదకర ఘటన నెలకొంది. కావలి కుమ్మరి వీధిలో సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడుగా గుర్తింపు. మృతుడు మధుసూదనన్కు భార్య ఇద్దరు పిల్లలు. నేడు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలింపు.. సాయంత్రానికి కావలికి చేరుకోనున్న మధుసూదన్ మృతదేహాం. అతడి తల్లిదండ్రులు హార్ట్ పేషంట్స్ కావడంతో విషయం గోప్యంగా ఉంచిన బంధువులు. -
కన్ను తెరిచిన గౌరీ శంకరుడు!
అక్కిరెడ్డిపాలెం: గౌరీ శంకరుడు కుడి కన్ను తెరిచాడన్న వార్తా దావానంలా వ్యాపించడంతో ఆటోనగర్లోని స్వయంభూ శ్రీ దుర్గా రామలింగేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. ఆటోనగర్ బి–బ్లాక్లో భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెస్సెల్స్ (బీహెచ్పీవీ) గోడ పక్కన 1997లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆదివారం సాయంత్రం ఓ భక్తుడు పూజ చేస్తున్న సమయంలో విగ్రహం కుడి కన్ను స్పష్టంగా తెరుచుకున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులకు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఈ వార్తా దావానంలా వ్యాపించడంతో భక్తులు ఆలయానికి భారీగా క్యూ కట్టారు. -
తేదీ సరఫరా వినియోగం అదనపు లోడు (మిలియన్ (మిలియన్ (మిలియన్ యూనిట్లలో) యూనిట్లలో) యూనిట్లలో) 17–ఏప్రిల్ 25.743 26.378 0.635 18–ఏప్రిల్ 24.762 26.691 1.924 19–ఏప్రిల్ 26.000 27.045 1.045 20–ఏప్రిల్ 25.806 26.786 0.980
గరిష్ట స్థాయికి చేరుకుంటున్న డిమాండ్ ఉమ్మడి విశాఖ సర్కిల్(అనకాపల్లి, అల్లూరి జిల్లాలు)లో విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకనుగుణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకునేందుకు ఈపీడీసీఎల్ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి విశాఖ సర్కిల్ పరిధిలో సగటు వినియోగం 24 నుంచి 25 మిలియన్ యూనిట్లుగా ఉంది. ప్రస్తుతం 26 నుంచి 27 మిలియన్ యూనిట్లకు పైగా కరెంట్ ఖర్చవుతోంది. సరఫరాకు మించి వినియోగం ఉండటంతో అధికారులు లోటు భర్తీ చేసేందుకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనకాపల్లి జిల్లాల్లో లలితా త్రిపురసుందరీ ఫెర్రో అల్లాయిస్, అభిజిత్ ఫెర్రో అల్లాయిస్ వంటి భారీ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోవడంతో మూతపడ్డాయి. ఈ కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గింది లేదంటే.. 28 నుంచి 30 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం ఉండేదని అధికారులు చెబుతున్నారు. -
డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేస్తున్నాం..
రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. దానికనుగుణంగా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. పెరిగిన విద్యుత్ కనెక్షన్లు, వాటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మే నెలలో మరింత ఎక్కువగా డిమాండ్ ఉండబోతోంది. దానికోసం ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒకే సమయంలో అందరూ ఏసీలు, కూలర్లు ఆన్ చేస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో లోడ్ పెరిగి ట్రిప్ అవుతూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీన్ని కూడా తక్కువ సమయంలోనే పరిష్కరిస్తున్నాం. ఎంత అవసరమైనా కోతలు లేకుండా విద్యుత్ అందించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్యామ్బాబు, ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ -
వైద్య కళాశాలలు ప్రైవేట్పరం బాధ్యతారాహిత్యం
● ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డాబాగార్డెన్స్: ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతని, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేయడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ అన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగం..మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అనే అంశంపై డాక్టర్ హరిప్రసాద్ స్మారక ఉపన్యాసం నిర్వహించారు. ప్రభుత్వాలు మారుతున్నా ఆరోగ్య రంగంలో మార్పులు రావడం లేదని, ప్రైవేట్ రంగానికి వైద్యం అప్పగించడం ఆందోళనకరమన్నారు. కేరళ ఆరోగ్య రంగంలో ఆదర్శంగా ఉందని, అక్కడ మరణాల రేటు తక్కువగా, వైద్య సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని, పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం, క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయడం సమర్థనీయం కాదన్నారు. ప్రభుత్వ కళాశాలల కంటే ప్రైవేట్ కళాశాలల సంఖ్య ఎక్కువగా ఉండటం దారుణమన్నారు. వైద్య విద్యా మాజీ డైరెక్టర్ డాక్టర్ కె.సత్య వరప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం పరీక్షల పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. ఐదు జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూలు లేవని, వైద్యరంగంలో సేవా దృక్పథం తగ్గి వ్యాపార కాంక్ష పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ జరిగితే ఫీజులు పెరిగిపోతాయని, రిజర్వేషన్లు తగ్గిపోతాయని, పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉండదని డాక్టర్ ఎంవీ రమణయ్య అన్నారు. రాష్ట్రంలో మల్టీపర్పస్ అసిస్టెంట్ పోస్టులు, జనరల్ మెడిసిన్ పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆరోగ్య విభాగం ప్రతినిది, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తేదీ వినియోగం (మిలియన్ యూనిట్లలో) 15– ఏప్రిల్ 14.196 16– ఏప్రిల్ 14.464 17– ఏప్రిల్ 15.612 18– ఏప్రిల్ 15.060 19– ఏప్రిల్ 15.074 20– ఏప్రిల్ 14.454
2 మిలియన్ యూనిట్లు అదనంగా... విశాఖ సర్కిల్ పరిధిలో ప్రతి రోజూ సగటున 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగుతుంది. అయితే భానుడి ప్రతాపంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. గత కొద్ది వారాలుగా సగటు విద్యుత్ వినియోగం రోజుకు 14 నుంచి 15 మిలియన్ యూనిట్లుగా మారిపోయింది. ఏప్రిల్ 1న రికార్డు స్థాయిలో 15.976 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడేశారంటే.. ఎండ తీవ్రత నుంచి రక్షించుకునేందుకు ప్రజలు ఎంతలా కరెంట్ వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గత వారం రోజులుగా పరిశీలిస్తే ఏ రోజూ 14 మిలియన్ యూనిట్లకు దిగువన రీడింగ్ లేదు. -
ఇంతలోనే.. అంత మార్పా..!
● కాలుష్య నియంత్రణ చర్యలకు తూట్లు ● వ్యక్తిగత వాహనాలపైనే అధికారుల రాకపోకలు ● గేట్ నుంచి మాత్రం నడుచుకుంటూ చాంబర్లకు చేరిన వైనండాబాగార్డెన్స్: కాలుష్య రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి ఎంతగానో కృషి చేశారు. మేయర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారంలో ఓ రోజు(ప్రతి సోమవారం) తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనాన్ని వదిలి, ప్రజా రవాణా వ్యవస్థ(ఆర్టీసీ) బస్సులో జీవీఎంసీకి చేరుకునేవారు. కాలుష్య నియంత్రణకు ఉద్యోగులతో పాటు విశాఖ నగర పౌరులు కూడా సహకరించాలని ప్రతి వారం పిలుపునిచ్చేవారు. వారంలో ఒక రోజు వ్యక్తిగత వాహనాలు వీడి, ప్రజా రవాణాను వినియోంచాలని సూచించేవారు. అందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించారు. ఇప్పుడిదంతా గతం.. కానుంది. మేయర్ పీఠం మారడంతో.. కూటమి కార్పొరేటర్లు, నేతలు కుట్రలు, కుతంత్రాలతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇంకేముంది.. అధికారుల తీరు మారింది. కాలుష్య నియంత్రణపై మేయర్ పిలుపును పక్కన పెట్టేశారు. ఎలాగూ మేయర్ లేరన్న ధీమాతో దర్జాగా జీవీఎంసీ తమకు కేటాయించిన వాహనాల్లోనే ఇళ్ల వద్ద బయల్దేరి, కార్యాలయానికి చేరుకున్నారు. గేట్ వద్ద వాహనం దిగి, ఆ పది మీటర్లు మాత్రం నడిచి, ప్రధాన కార్యాలయం లోపలికి చేరుకున్నారు. పైకి కాలినడకన వస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్న అధికారుల తీరు తొలి వారమే బట్టబయలైంది. గేటు ముందు వాహనం దిగి.. వాస్తవంగా సోమవారం నో వెహికల్ డే. దీంతో ఇళ్ల వద్ద నుంచే వ్యక్తిగత వాహనాలను వీడాలి. అయితే మన అధికారులు మాత్రం మేయర్ పీఠం మారనుండటంతో.. కొత్త మేయర్ పదవీ బాధ్యతలు స్వీకరించి, ఆదేశాలివ్వకముందే.. కాలుష్య నియంత్రణ చర్యలకు తూట్లు పొడిచారు. ఇంటి నుంచే వాహనాల్లో దర్జాగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయ వద్ద దిగారు. ఆ గేట్ నుంచి నడుచుకుంటూ కార్యాలయంలోకి చేరారు. ఆ వాహనాలను డ్రైవర్లు జీవీఎంసీ కార్యాలయం చుట్టూ పార్కింగ్ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో కూడా కొందరు తమ వాహనంలో ఇంటికి వెళ్లి, వచ్చారు. సాయంత్రం విధులు ముగించుకుని మళ్లీ వాహనాల్లోనే హుందాగా ఎవరింటికి వారు చేరుకున్నారు. -
రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ రెండు, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని వర్సిటీ రిజిస్ట్రార్ ఇ.ఎన్.ధనుంజయరావు వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్, బీహెచ్ఎంసీటీ కోర్సులు చదువుతున్న 51,400 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. సెకండ్ సెమిస్టర్ హానర్స్, సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రతీ రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. నాల్గో సెమిస్టర్ హానర్స్, సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రతీ రోజూ మధ్యాహ్నం 2 గంటల నంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. -
న్యూరోసర్జరీ విభాగానికి వైద్య పరికరాల అందజేత
డాబాగార్డెన్స్: కేజీహెచ్లోని న్యూరో సర్జరీ విభాగానికి రూ.8 లక్షల విలువ గల వైద్య పరికరాలను డాక్టర్ సుంకర బాలపరమేశ్వరరావు కుటుంబ సభ్యులు సుంకర ఆదిలక్ష్మి, సుబ్బలక్ష్మి, డాక్టర్ ఎస్జే బాలపరమేశ్వరరావు(న్యూరో సర్జన్), సుంకర రాజగోపాల్ సోమవారం విరాళంగా అందజేశారు. ఈ మేరకు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ బాలపరమేశ్వరరావు కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో బాలపరమేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు కేజీహెచ్ న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్జిత్రే, ఇతర న్యూరో సర్జరీ వైద్యులు పాల్గొన్నారు. ఈ వార్డుకు గత నెల 17వ తేదీన ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ సుంకర బాలపరమేశ్వరరావు న్యూరోసర్జరీ వార్డుగా నామకరణం చేసిన విషయం విదితమే. -
గిరగిర!
భానుడుమండుతున్న ఎండలతో పెరుగుతున్న విద్యుత్ వినియోగం భగభగ..మీటర్మధ్యాహ్నం 1–3 గంటలు, రాత్రి 10 గంటల తర్వాత హెవీలోడ్ తేదీ మధ్యాహ్నం 1 గంటకు రాత్రి 10 గంటలకు వినియోగం వినియోగం (మెగావాట్లలో) (మెగావాట్లలో) 17–ఏప్రిల్ 25.464 29.246 18–ఏప్రిల్ 26.741 29.952 19–ఏప్రిల్ 27.552 30.434 20–ఏప్రిల్ 27.857 31.272విశాఖ సర్కిల్ పరిధిలో రోజూ సాధారణ వినియోగం 12 మిలియన్ యూనిట్లు ప్రస్తుతం 14–15 మిలియన్ యూనిట్లకు చేరిక డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేసేందుకు ఈపీడీసీఎల్ అష్టకష్టాలుఒక్కసారిగా లోడ్ పెరగడంతో సరఫరాలో లోపాలుఇక మిట్ట మధ్యాహ్నం సమయంలో నడి నెత్తిన సూరీడు తాండవమాడుతున్న సమయంలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. అదేవిధంగా రాత్రి 10 గంటల సమయంలోనూ డిమాండ్ పెరుగుతోంది. ఈ సమయంలో సరఫరా కంటే 3 నుంచి 5 మెగావాట్లు అధికంగా వినియోగిస్తున్నారు. ఆ గంటల్లో.. మంటలే..! సాక్షి, విశాఖపట్నం: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఉక్కబోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి అంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు విపరీతంగా వినియోగిస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంటోంది. సాధారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మార్చి మూడో వారం నుంచి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కరెంటు వినియోగం కూడా పెరుగుతుంటుంది. కానీ ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎండలు మండిపోతున్నాయి. అప్పటి నుంచి డిమాండ్ పీక్స్కు వెళ్లిపోయింది. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. లోడ్ పెరుగుతుండటంతో సరఫరాలోనూ లోపాలు తలెత్తుతున్నాయి. -
సమస్యల పరిష్కారంపై దృష్టి
● కలెక్టర్ హరేందిర ప్రసాద్ ● పీజీఆర్ఎస్లో 402 వినతుల స్వీకరణ బీచ్రోడ్డు : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానింగ్ అధికారి ప్రభాకర్ కూడా వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. 402 వినతుల స్వీకరణ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 402 వినతులను అధికారులు స్వీకరించారు. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 173 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 36, జీవీఎంసీ సంబంధించి 110 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 83 వినతులు వచ్చాయి. పీజీఆర్ఎస్పై సమీక్ష ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభానికి ముందు అధికారులతో కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ తెలిపారు. సీఎంవో, డిప్యూటీ సీఎంవో కార్యాలయాల నుంచి వచ్చే అర్జీలకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు శాఖాపరమైన సమీక్షలు నిర్వహించాలని, అర్జీలు ఎక్కువగా ఉంటే ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. పింఛన్లు, భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హౌస్ హోల్డ్ సర్వేలో ఉద్యోగుల నమోదు వివరాలు వారం రోజుల్లో పూర్తి చేయాలని, విజన్ డాక్యుమెంట్ ప్రగతిని సమీక్షించాలని ఆదేశించారు. అర్జీదారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని, పరిష్కరించిన తర్వాత ఫీడ్బ్యాక్ సేకరించాలని కలెక్టర్ సూచించారు. ఏపీ ట్రాన్స్కో పోస్టుల భర్తీలో అక్రమాలు ఏపీ ట్రాన్స్కోలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగుల భర్తీ జరుగుతోందని గాజువాకకు చెందిన జె.శ్రీలక్ష్మి ఆరోపించారు. రోస్టర్ విధానం (ఆర్వోఆర్) పాటించకుండా నియామకాలు చేస్తున్నారని, ఒక్కో పోస్టును రూ.10 లక్షలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎక్కువ మార్కులు వచ్చినా డబ్బులు ఇవ్వలేదని, తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని వాపోయింది. ఈ విషయంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్కు అర్జీ అందజేసింది. గ్రామాన్ని వెలివేయడం తగదు మరణించిన విద్యుత్ కార్మికుడికి నష్టపరిహారం కోరినందుకు మళ్లం గ్రామాన్ని వెలివేసిన ఘటనపై కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. నష్టపరిహారం అడిగినందుకే గ్రామాన్ని వెలివేయడం దారుణమన్నారు. కుల బహిష్కరణకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే తమపై దాడులు కొనసాగుతున్నాయని దళిత సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే మళ్లం గ్రామాన్ని సందర్శించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చూస్తాం.. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం..
డాబాగార్డెన్స్: కుట్రలు..కుతంత్రాలతో నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారిని కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం ద్వారా దించేశారు. మరోవైపు మూడు నెలలుగా కమిషనర్ను నియమించలేని దుస్థితి. ఓ అదనపు కమిషనర్ డిప్యూటేషన్పై తిరుమల తిరుపతికి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక బోసిపోయింది. మరో అదనపు కమిషనర్ కూడా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు వెళ్లడంతో అర్జీలకు సమాధానం చెప్పే అధికారి కరువయ్యారు. కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ముఖ్యంగా పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి సమస్యలు వెల్లువెత్తుతుంటాయి. ఆ సమస్యలు పరిష్కరించే అధికారులు (ఇద్దరు ఏసీపీలు తప్ప) లేకపోవడం గమనార్హం. ఎప్పటి మాదిరిగానే ఫిర్యాదులు స్వీకరించారు. చూస్తాం... సంబంధిత అధికారికి చెబుతాం అంటూ దిగువ స్థాయి సిబ్బంది అర్జీదారులకు సమాధానం చెప్పడంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిష్కార వేదికకు 73 వినతులు జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సోమవారం 73 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ఫిర్యాదులు స్వీకరించారు. జోన్ల వారీగా, ప్రధాన కార్యాలయానికి సంబంధించి వినతులు అందాయి. అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 47 ఫిర్యాదులు వచ్చాయి. ఇతర విభాగాలైన అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, ప్రజారోగ్యం, ఇంజనీరింగ్, మొక్కల విభాగానికి కూడా ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో పలువురు జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. దిగువస్థాయి సిబ్బంది సమాధానంతో అర్జీదారుల అసంతృప్తి తూతూ మంత్రంగా జీవీఎంసీ పీజీఆర్ఎస్ -
పోప్ ఫ్రాన్సిస్ మృతిపై ఆర్చ్ బిషప్ సంతాపం
డాబాగార్డెన్స్: పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల విశాఖపట్నం ఆర్చ్ బిషప్ ఉడుమల బాలశౌరిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పోప్ మరణం చర్చ్, సమాజానికి తీర ని నష్టమన్నారు. పోప్ తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాపసీ ప్రతిరూపాన్ని మార్చిన వినయపూర్వక నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. ఉక్రెయిన్–రష్యా, ఇజ్రాయిల్–పాలస్తీనాలో శాంతిని స్థిరంగా సమర్థించారని పేర్కొన్నారు. 2013లో పోప్ ఫ్రాన్సిస్ నియమించిన మొదటి భారతీయ బిషప్ తానేనని, ఇటీవల పోప్ తనను విశాఖపట్నం ఆర్చ్ బిషప్గా కూడా నియమించారని తెలిపారు. అంత్యక్రియల ప్రక్రియ పూర్తయిన తర్వాతి నెలలో కార్డినల్స్ సమావేశం నిర్వహించి కొత్త పోప్ను ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. -
నేపాల్లో మిస్సయిన యువతి తుంగ్లాంలో ప్రత్యక్షం
అక్కిరెడ్డిపాలెం: నేపాల్లో తప్పిపోయిన యువతిని గాజువాక పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. సౌత్ ఏసీపీ త్రినాథ్ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, నేపాల్లోని కాట్మాండ్కు చెందిన లాల్ బహుదురబన్ కుమార్తె అనూషకబమ్ ఈ నెల 11న కనిపించకుండా పోయింది. దీంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా అనూషకబమ్ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు కాట్మాండ్ పోలీసులు గుర్తించారు. ఆమె ఆచూకీ కోసం అక్కడి ఎస్ఐ అర్జున్, యువతి తండ్రి లాల్ బహుదూర్బమ్తో కలిసి విశాఖ వచ్చి పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చిని కలవగా, ఆయన ఆదేశాల మేరకు గాజువాక సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ టి.త్రినాథ్ సూచనలతో గాజువాక ఎస్ఐ నజీర్, సిబ్బంది తుంగ్లాంలో అనూషకబమ్ను గుర్తించారు. అనంతరం ఆమెను గాజువాక పోలీస్ స్టేషన్కు తరలించి, ఎస్ఐ నజీర్ అక్కడి ఎస్ఐ అర్జున్ సమక్షంలో ఆమె తండ్రి లాల్ బహుదూర్బమ్కు యువతిని అప్పగించారు. -
‘ఎకరా భూమిని 99 పైసలకు కట్టబెడతారా?’
విశాఖ: విశాఖలో ఎకరా భూమిని 99 పైసలకే ఇవ్వడానికి ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై సీఐటీయూ తీవ్రంగా ధ్వజమెత్తింది. దీని వెనుక క్విడ్ ప్రోకో ఉందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింహారావు మండిపడ్డారు. ‘విశాఖలో ఎకరా భూమి 99 పైసలుకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.దీని వెనక క్విడ్ ప్రోకో ఉంది. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఇష్టానుసారంగా ఇచ్చేస్తున్నారు..ఎకరా 99 పైసల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. ప్రభుత్వ భూములను 99 పైసలకు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరా ఐదు కోట్లకు అమ్ముతున్నారు. ప్రైవేట్ సంస్థలకు ఎకరా 99 పైసలుకు ఇస్తున్నారు. వేల కోట్ల విలువైన భూములను కమీషన్లు కోసం తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఈ అమ్మకాల ద్వారా తమ ఆస్తులను వ్యాపారాలను పెంచుకుంటున్నారు..ఉర్సా అనే సంస్థ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఆ సంస్థకు 99 పైసలకు ఎకరా ఎందుకు ఇస్తున్నారు అర్థం కావడం లేదు.’ అని సీహెచ్ నరసింహారావు ధ్వజమెత్తారు. -
హాస్య చోర చిత్రం ‘చౌర్యపాఠం’
ఏయూక్యాంపస్: దొంగతనం చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి పరిణామాలను హాస్య ప్రధానంగా చూపుతూ తెరకెక్కిన చిత్రం ‘చౌర్యపాఠం’. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను నవ్వించి, అలరిస్తుందని చిత్ర దర్శకుడు నిఖిల్ గొల్లమూరి తెలిపారు. నగరంలోని కిర్లంపూడిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చిత్ర విశేషాలను వెల్లడించారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా ప్రజల ముందుకు రాబోతోందన్నారు. చిత్ర నిర్మాత త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ తాను గతంలో పలు చిత్రాలకు దర్శకుడిగా పనిచేశానని చెప్పారు. హీరో ఇంద్రరామ్ మాట్లాడుతూ సినిమాలో టన్నెల్లో జరిగే దొంగతనం సన్నివేశం చాలా వినూత్నంగా, హాస్యభరితంగా ఉంటుందన్నారు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ సినిమాలో బ్యాంకు ఉద్యోగి అయిన నేను అనుకోని పరిస్థితుల్లో దొంగల ముఠాలో సభ్యురాలిగా మారే పాత్రలో నటించడం వైవిధ్యంగా అనిపించిందన్నారు. సినిమాలో గ్రామపెద్దగా కీలక పాత్రను పోషించానని చెప్పిన సీనియర్ నటుడు రాజీవ్ కనకాల విశాఖపట్నంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వివరించారు. దర్శకుడు నిఖిల్ గొల్లమూరి -
జేఈఈ మెయిన్స్లో శ్రీరామానుజ విద్యార్థుల ప్రతిభ
బీచ్రోడ్డు: జేఈఈ మెయిన్స్లో పెదవాల్తేరులోని శ్రీరామానుజ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివ రామ దత్తాత్రేయ మాట్లాడుతూ తమ విద్యార్థులు 99.493, 98.709, 98.619, 96.660, 96.454, 95.421 పర్సంటైల్తో టాప్ స్కోర్లు సాధించారని తెలిపారు. అలాగే ఫిజిక్స్లో అత్యధికంగా 99.738, కెమిస్ట్రీలో 99.717, మ్యాథ్స్లో 98.515 పర్సంటైల్ సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ర్యాంకర్లను ఆయన ఘనంగా సత్కరించారు. -
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మే 20న సమ్మె
డాబాగార్డెన్స్: కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ కె.హేమలత డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న తలపెట్టిన అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సిటు రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమేనని హేమలత విమర్శించారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు మారుస్తూ.. కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతోందని, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక, కర్షకులకు ద్రోహం చేస్తోందని ఆమె ఆరోపించారు. విశాఖ స్టీల్ప్లాంట్ సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వేగవంతం చేయడం దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమేనని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు, కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు పెంచి, పని భారం తగ్గించాలని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే వక్ఫ్ చట్టంలో మార్పులు చేసిందన్నారు. సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ 8 గంటల పని దినాన్ని 12–14 గంటలకు పెంచే ప్రయత్నం జరుగుతోందని, పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యమన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణను ఆపి, భారాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిటు అఖిల భారత ఉపాధ్యక్షురాలు బేబీరాణి, రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, అజయ్కుమార్, కె.సుబ్బరావమ్మ, కె.ధనలక్ష్మి, ముజఫర్ అహ్మద్, రమాదేవి, ఆర్.వి.నర్సింగరావు, ఆర్.కె.ఎస్.వి.కుమార్, డీఎన్వీడీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. సిటు అఖిల భారత అధ్యక్షురాలు కె.హేమలత -
రుషికొండలో ‘ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్’
అల్లిపురం: రుషికొండ ఐటీ హిల్స్ 3 సమీపంలో 97 ఎకరాల్లో ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ పేరిట టౌన్షిప్ నిర్మిస్తున్నట్లు సంస్థ చైర్మన్ కె.మురళీకృష్ణ, ఎండీ కేఎల్ సంతోష్ వెల్లడించారు. నగరంలోని ఒక హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మొదటి దశలో 4,500 నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల 180 విల్లాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కమర్షియల్ కాంప్లెక్స్లు, ఫైవ్ స్టార్ హోటల్, ఐటీ టవర్స్, ప్రీమియం అపార్ట్మెంట్స్ వంటి నిర్మాణాలు దశల వారీగా వస్తాయన్నారు. 45 వేల చదరపు అడుగుల్లో విశాలమైన క్లబ్ హౌస్ నిర్మిస్తామన్నారు. విశాఖ, తిరుపతిలో ఫైవ్స్టార్ హోటళ్లు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని తెలిపారు. అనంతరం వారు ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ బ్రోచర్ను ఆవిష్కరించారు. -
అండర్–7 చెస్ జట్టుకు ధనుష్, ధియా ఎంపిక
విశాఖ స్పోర్ట్స్: అండర్–7 అంతర జిల్లాల చదరంగం జట్టు ఎంపిక పోటీల్లో విశాఖకు చెందిన ధనుష్ (ఓపెన్ విభాగం), ధియా తేజశ్రీ బుద్ద (బాలికల విభాగం) రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరు పల్నాడు జిల్లాలో జరగనున్న స్టేట్ అంతర జిల్లాల అండర్–7 చాంపియన్షిప్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆల్ విశాఖ చదరంగం సంఘం ఆధ్వర్యంలో గాయత్రి విద్యా మందిర్లో ఆదివారం ఈ ఎంపిక పోటీలు జరిగాయి. ఓపెన్ విభాగంలో 23 మంది, బాలికల విభాగంలో 13 మంది చిన్నారులు పోటీపడ్డారు. ఓపెన్లో ఐదు రౌండ్లు, బాలికల కోసం నాలుగు రౌండ్లు నిర్వహించారు. ఓపెన్ విభాగంలో ధనుష్ పిల్ల ఐదు రౌండ్లలో నాలుగున్నర పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. ద్వితీయ స్థానంలో నిలిచిన అభినవ వైద్య భూషణ నాలుగు పాయింట్లు సాధించాడు. వీరిద్దరూ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఐదు రౌండ్ల తర్వాత బి.విఖ్యాత్, ఎ.కార్తికేయ, నిహాన్ దొగ్గాలు కూడా నాలుగేసి పాయింట్లతో నిలిచినా ప్రోగ్రెసివ్ స్కోరు ఆధారంగా వారు వెనుకబడిపోయారని నిర్వాహకులు తెలిపారు. బాలికల విభాగంలో దియా తేజశ్రీ బుద్ద నాలుగు రౌండ్లలోనూ విజయంతో నాలుగు పాయింట్లు సాధించింది. మూడు పాయింట్లు సాధించిన అదిత్రి ద్వితీయ స్థానంలో నిలిచింది. తేజోసన్విక, అదిత్రితో సమానంగా పాయింట్లు సాధించినా.. ప్రోగ్రెసివ్ స్కోరు కారణంగా అర్హత సాధించలేకపోయింది. ఓపెన్, బాలికల విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు. జిల్లా స్థాయి అండర్–7 ఓపెన్లోనూ, బాలికల్లోనూ తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారికి జిల్లా జట్టుగా అర్హత కల్పించినట్లు సంఘం కార్యదర్శి మణికంఠ తెలిపారు. -
ఉక్కు కేబీఆర్లో మహిళ మృతదేహం లభ్యం
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ కణితి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ (కేబీఆర్)–1లో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. స్టీల్ప్లాంట్ పోలీసులు అందించిన వివరాలివి.. విశాఖ ఇండస్ట్రీయల్ వాటర్ సప్లయ్ కంపెనీ (విస్కో)లో పనిచేస్తున్న పెందుర్తికి చెందిన బత్తిన పైడిరాజు (38) ఆదివారం ఉదయం గేటు వద్ద మహిళ మృతదేహాన్ని గమనించాడు. వెంటనే అక్కడి అధికారులకు సమాచారం అందించగా వారు స్టీల్ప్లాంట్ పోలీసులకు తెలిపారు. గేటు వద్ద బోర్లా పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ముక్కు నుంచి రక్తం బయటకు వస్తుండటం గమనించారు. 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండే ఆ మహిళ ఒంటిపై పసుపు జాకెట్, తెలుపు రంగు పెట్టీ కోట్ ఉంది. 5 అడుగులు ఎత్తు ఉన్న ఆమె కుడి చేతిపై టాటూ ఉంది. వివరాలకు స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు. -
నాటి సంస్కరణలే నేటి ఫలితాలు
సంకల్ప బలం ఉండాలే గానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎంతో దూరదృష్టితో ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు నేడు ఫలితాలను ఇస్తున్నాయి. నాడు–నేడు పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను కార్పొరేటుకు ధీటుగా తీర్చిదిద్దారు. విద్యాబోధనలోనూ సమూల మార్పులు చేశారు. ఫలితంగా తాజా ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడి మార్కులు సాధించారు. స్టేట్ టాపర్లుగా నిలిచి నత్తా చాటారు. వి.ఎస్.కృష్ణా కళాశాలలో విద్యా బోధన ● ప్రభుత్వ కాలేజీల్లో ఆధునిక సౌకర్యాలు ● విద్యాబోధనలో సమూల మార్పులు ● ఇంటర్లో మార్కులతో మెరిసిన విద్యార్థులు ● స్టేట్ టాపర్ల జాబితాలో జిల్లాలో నలుగురికి చోటు ● కార్పొరేట్కు దీటుగా రాణించిన విద్యార్థులు ● వైఎస్ జగన్ పాలనను తలచుకుంటున్న తల్లిదండ్రులు గతేడాది చదువులే బెస్ట్ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఫస్టియర్ కంటే, సెకండ్ ఇయర్లోనే మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఫస్టియర్లో జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలు మొత్తంగా 34.17 శాతం కాగా, సెకండ్ ఇయర్లో 55 శాతం ఫలితాలు వచ్చాయి. అదే ఒకేషనల్ కోర్సుల్లో ఫస్టియర్లో 69.9 శాతం కాగా, సెకండ్ ఇయర్ 81.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ లెక్కన ఈ ఏడాది కంటే గత ఏడాది వరకు సాగిన చదువులతో పడిన పటిష్టమైన పునాదుల కారణంగానే ప్రస్తుత ఫలితాల్లో విద్యార్థులు మెరిసినట్లు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విశాఖ విద్య/మద్దిలపాలెం: ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఫస్ట్క్లాస్లో పాసైతే ఒకప్పుడు పెద్దగొప్ప. కానీ నేడు పరిస్థితి మారింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులు సైతం కార్పొరేట్కు తీసుపోమన్నట్లుగా టాప్ మార్కులతో అదరగొట్టారు. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులు మార్కుల్లో మెరిశారు. ఏకంగా నలుగురు విద్యార్థులు స్టేట్ టాపర్ల జాబితాలో చోటు దక్కించుకొని షైనింగ్ స్టార్ పురస్కారాలను అందుకున్నారు. 900లకు పైగా మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు తమ చదువుల సారానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణల ఫలితమేనని బాహాటంగానే చెబుతున్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పేదింటి బిడ్డలు చదువుల్లో రాణించాలనే సంకల్పం, నేడు సత్ఫలితాలు దిశగా సాగుతుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు సైతం నాటి పాలనను గుర్తుచేసుకుంటున్నారు. ప్రభుత్వ కాలేజీలు బాగుండాలనే.. ఒకప్పుడు ప్రభుత్వ కాలేజీలంటే చిన్నచూపు ఉండేది. అందుకనే నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్యవైపు వచ్చేవారు కాదు. దీన్ని గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. నాడు–నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు, జూనియర్ కాలేజీల అభివృద్ధికి సైతం నిధులు కేటాయించారు. జిల్లాలోని భీమునిపట్నం, అగనంపూడి, పెదగంట్యాడ, పెందుర్తి, జైల్ రోడ్లోని బాలికల కాలేజీ, డాక్టర్ వీఎస్ కృష్ణా కాలేజీ, ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీలో మౌలిక సౌకర్యాలు పెంపొందించేలా రూ.6.2 కోట్లు మంజూరు చేశారు. దీంతో ఆయా కాలేజీల్లో గతంలో ఎన్నడూ లేని రీతిన మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో విద్యనభ్యసించాను. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా డాక్టర్ వి.ఎస్.కృష్ణా ఓకేషనల్ కళాశాలలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సు(ఈటీ)లో జాయిన్ అయ్యాను. 979 మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను సద్వినియోగం చేసుకుంటే ఉజ్వల భవిత ఉంటుంది. – ఎం.విజయకుమార్, 979 మార్కులు (ఈటీ) -
భగవద్గీతకు యునెస్కో గుర్తింపు హర్షణీయం
డాబాగార్డెన్స్: భగవద్గీతను యునెస్కో గుర్తించడం హర్షణీయమని గీతా ప్రచార సమితి ప్రతినిధి, ఆధ్యాత్మికవేత్త ఎంవీ రాజశేఖర్ అన్నారు. కురుక్షేత్ర మహా సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత ఆవిర్భవించి వేల సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ భగవద్గీత భక్తి జ్ఞానములతో కూడిన శోభ చెక్కు చెదరలేదన్నారు. ప్రపంచ దేశాలన్నీ విశ్వసిస్తున్న అత్యున్నతమైన ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీతేనన్నారు. ప్రతి ఒక్కరూ ధర్మంగా జీవించాలన్నా.. ధర్మాన్ని ఆచరించాలన్నా భగవద్గీతను అనుసరించాల్సిందేనన్నారు. విశ్వానికంతటికీ ఎన్నో విధాలుగా.. సగటు జీవికి అనేక రకాలుగా దిక్సూచిగా, మార్గదర్శిగా జీవన ప్రయాణంలో భగవద్గీత భాగంగా ఉందని పేర్కొన్నారు. భగవద్గీతను మరచిపోవద్దని, గీతను దాటొద్దని, సంపూర్ణ గీతా సారాంశం తెలుసుకుని జీవించాలని పిలుపునిచ్చారు. -
పర్యాటక రంగంలో రాణిస్తా
రైల్వేన్యూకాలనీలో గల జీవీఎంసీ హైస్కూల్లో ఉన్నత విద్యాభ్యాసం సాగింది. అప్పట్లో అమ్మ ఒడి ద్వారా ప్రోత్సాహం అందింది. పర్యాటక రంగం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే వి.ఎస్.కృష్ణా ఓకేషనల్ కళాశాలలో టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్ (టీటీటీ) కోర్సులో చేరాను. ఈ కోర్సులో రాష్ట్ర స్థాయిలో అఽత్యధికంగా 974 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి షైనింగ్ స్టార్స్ జాబితాలో నిలిచాను. బీఏ ట్రావెల్ మేనేజ్మెంట్లో చేరాలనుకుంటున్నాను. ఎంబీఏ పూర్తిచేసి సొంతంగా ట్రావెల్ మేనేజ్మెంట్ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను. –మహేష్ కార్తికేయ, 974 మార్కులు (టీటీటీ) -
ఉత్తరాంధ్రకు వడగాడ్పుల ప్రభావం
సాక్షి, విశాఖపట్నం: భానుడు రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం చూపనున్నాడు. ఆది, సోమవారాల్లో సాధారణం కంటే 4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 20న 12 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 19 మండలాల్లో వడగాడ్పులు, 21న 10 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 12 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయన్నారు. తీవ్ర వడగాడ్పుల ప్రభావం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలపైనే ఉంటుందని తెలిపారు. 20వ తేదీన విజయనగరం జిల్లాలోని 10 మండలాల్లో, పార్వతీపురం మన్యం జిల్లాలోని 2 మండలాల్లో మాత్రమే ఆదివారం వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 21న మన్యం జిల్లాలో 10 మండలాల్లో తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఉంటుంది. కర్ణాటక, తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వారం రోజులపాటు అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వారం రోజుల అనంతరం ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలున్నాయని తెలిపారు. -
శ్రీవిశ్వ విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు
సీతంపేట: జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో శ్రీవిశ్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. వివిధ కేటగిరిల్లో తెల్లూరి చరణ్ కార్తికేయ 311 ర్యాంకు, అంజూరి తారక్రామ్ 407, సిహెచ్.వెంకట హేమవర్ధన్ 586, బి.షణ్ముఖ నాయుడు 648, వై.రాజశేఖర్ 688 ర్యాంకులు సాధించారు. వెయ్యిలోపు ర్యాంకులు ఐదుగురు, 5 వేల లోపు ర్యాంకులు 29 మంది, 10 వేల లోపు ర్యాంకులు 47 మంది సాధించారు. మొత్తంగా 247 మంది ఎన్ఐటీ, ఐఐఐటీల్లో సీట్లు పొందే అర్హత తెచ్చుకోవడం విశేషం. విద్యార్థులను చైర్మన్ కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ అభినందించారు. -
‘అ అంటే అమలాపురం’.. అభిమానులకు చేదు అనుభవం
సీతమ్మధార/సీతంపేట: నగరంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ (పోర్టు స్టేడియం) వేదికగా శనివారం రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ కాన్సర్ట్ యువతను ఉర్రూతలూగించింది. ఆయన అందించిన ఉత్సాహభరితమైన పాటలకు, డ్యాన్స్లకు యువతి, యువకులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. రాత్రి 7 గంటలకే కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా, దేవిశ్రీ ప్రసాద్ రాక కాస్త ఆలస్యం కావడంతో 8.30 గంటలకు మొదలైంది. అయితే, ఈ కార్యక్రమంలో నిర్వాహకుల తీరు అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. టికెట్ల విక్రయంలో భారీ మోసానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఒకసారి స్కానింగ్ చేసి లోపలికి పంపిన టికెట్లను కూడా మళ్లీ అమ్మకానికి పెట్టినట్లు అభిమానులు గుర్తించి గొడవ చేశారు. కొంత మంది వ్యక్తులు బ్లాక్లో టిక్కెట్లు విక్రయించారని, దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు. హోరెత్తిన డీఎస్పీ మ్యూజికల్ కాన్సర్ట్ -
జేఈఈ మెయిన్స్లో ఎసెంట్ విద్యార్థుల సత్తా
మద్దిలపాలెం: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎసెంట్ ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు కళాశాల డైరెక్టర్లు తెలిపారు. కళాశాల విద్యార్థి ఎస్.పూజిత కృష్ణ రిజర్వడ్ కేటగిరిలో 4వ ర్యాంకు సాధించడం గర్వకారణమన్నారు. అలాగే జాతీయ స్థాయిలో వరుసగా 203, 208, 408, 450, 618, 813, 926, 941, 983, 1102, 1322 వంటి టాప్ ర్యాంకులను ఎసెంట్ విద్యార్థులు సాఽధించారని పేర్కొన్నారు. అలాగే అన్ని కేటగిరిల్లో కళాశాలకు చెందిన 31 మంది విద్యార్థులకు 5000లోపు ర్యాంకులు వచ్చాయన్నారు. 204 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని తెలిపారు. -
వెలవెలబోతున్న హార్బర్
ఎప్పుడు కళకళలాడే ఫిషింగ్ హార్బర్ మత్స్య వేట నిషేధం అమల్లోకి రావడంతో శనివారం బోసిపోయింది. తూర్పు తీరంలో ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపల వేట నిలిచిపోయింది. ఎక్కడ బోట్లు అక్కడే ఉండిపోయాయి. పది నెలలపాటు సముద్రంలో అవిశ్రాంతంగా చేపల వేట చేసే మత్స్యకారులకు రెండు నెలల పాటు విశ్రాంతి లభించనుంది. ఈ నెల 14వ తేదీ నాటికి దాదాపు 2,500 బోట్లు హార్బర్లో జెట్టీకి చేరుకున్నాయి. అన్ సీజన్ కావడంతో బోట్లకు మరమ్మతులు చేస్తున్నారు. జూన్ 15వ తేదీ నుంచి చేపల వేట మొదలవుతుంది. – మహారాణిపేటఖాళీగా దర్శనమిస్తున్న రోడ్డు -
కంప్యూటర్ ఇంజినీర్ అవుతా
జేఈఈ మెయిన్స్లో ఓపెన్ కేటగిరిలో 138 ర్యాంకు సాధించాను. ఇంటర్ శ్రీ చైతన్య రామన్ భవన్లో చదివాను. ఇంటర్లో 986 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సాధించి చైన్నె ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదవాలని అనుకుంటున్నాను. నాన్న బీఎస్ఎన్ఎల్లో అకౌంట్స్ ఆఫీసర్, అమ్మ కృష్ణా కళాశాలలో బోటనీ లెక్చరర్. అక్క మెడిసన్ చదువుతోంది. – డి.జి.ఎస్.ధర్మ ప్రతాప్, శ్రీనగర్, రామాటాకీస్ రోడ్ బ్రాండ్ కోసం ప్రయత్నిస్తా.. జేఈఈ మెయిన్స్లో దివ్యాంగుల కేటగిరీలో 4వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సాధించడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. మంచి ఇంజినీరింగ్ కళాశాలలో చేరి నాకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ వచ్చేలా కృషిచేస్తాను. అడ్వాన్స్డ్ పరీక్ష కోసం రోజుకి 10 గంటల పాటు ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నాను. అధ్యాపకుల ప్రోత్సాహం, గైడన్స్, పాఠ్యాంశాలపై పట్టుసాధించడానికి ఎంతగానో దోహదపడుతున్నాయి. – ఎస్.పూజిత కృష్ణ -
మైనర్పై యువకుని దాడి
పెదగంట్యాడ: మండలంలోని శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన స్వల్ప వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. మద్యం మత్తులో ఉన్న యువకుల మధ్య ఘర్షణ అనంతరం, ఓ యువకుడు మరో బాలుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనకు సంబంధించి న్యూపోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జీవీఎంసీ 74వ వార్డు పరిధిలోని టీజీఆర్ నగర్కు చెందిన మైనర్, భారత్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కోర్సు చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో మైనర్ తన స్నేహితులు గణేష్, మణిదీప్, వేణు మాధవ్ , లోకేష్తో కలిసి దయాల్నగర్ కొండపై మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో పెదగంట్యాడకు చెందిన వడ్డి శ్రీరామ్ తన స్నేహితులతో అక్కడికి రావడంతో ఇరువర్గాల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఇరువర్గాల వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సుమారు గంట తర్వాత, రాత్రి 9.30 గంటల సమయంలో మైనర్ తన స్నేహితులతో కలిసి మొల్లివానిపాలెం వెళ్లాడు. అక్కడ ఒక పాన్ షాపు వద్ద ఉండగా, శ్రీరామ్ తన స్నేహితులతో తిరిగి వచ్చి మైనర్పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మెడ , చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్నేహితులు అతడిని గాజువాకలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మైనర్ చికిత్స పొందుతున్నాడు. నిందితుడు వడ్డి శ్రీరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాకుతో గొంతుకోసిన వైనం