విశాఖలో దంపతుల దారుణహత్య | old couples dies in visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో దంపతుల దారుణహత్య

Apr 26 2025 8:27 AM | Updated on Apr 26 2025 8:27 AM

old couples dies in visakhapatnam

విశాఖపట్నం: విశాఖ నగరం గాజువాక సమీపంలోని రాజీవ్‌నగర్‌లో భార్యాభర్తలు దారుణహత్యకు గురయ్యారు. డాక్‌యార్డులో పనిచేసి రిటైరైన గంపాల యోగేంద్రబాబు (66), లక్ష్మి (58) దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వారు 35 ఏళ్లుగా రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. రెండు రోజుల కిందట హైదరాబాద్‌ వెళ్లిన వారు గురువారం ఉదయం ఇంటికి చేరుకున్నారు.

శుక్రవారం రాత్రి వరకు వారి ఇంటి తలుపులు తెరవకపోవడం, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో స్థానికంగా ఉన్న బంధువుల అమ్మాయి ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి రెండువైపులా తాళం వేసి ఉండటాన్ని గమనించింది. అనుమానం వచ్చిన.. స్థానికుల సాయంతో పోలీ­సు­లకు సమాచారం అందించింది. 

సౌత్‌ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు అక్కడికి చేరుకుని తాళా­లు పగ­లు­గొట్టించి తలు­పులు తెరిచారు. లోపలికి వెళ్లి చూస్తే హాల్లో యోగేంద్రబా­బు, బెడ్‌రూమ్‌లో లక్ష్మి రక్తపుమడుగులో పడి ఉన్నా­రు. వారు అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. యో­గేంద్రబాబుది మ­చిలీపట్నం కాగా లక్ష్మిది శ్రీహరిపురం. 40 ఏళ్ల కిందట కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారికి వివాహాలు జరిగి, అమెరికాలో స్థిరపడ్డారు. క్లూస్‌ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement