breaking news
Visakhapatnam
-
విశాఖ : వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు (ఫొటోలు)
-
విశాఖ చేరుకున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్ సందడి (ఫొటోలు)
-
బాలికకు దేశంలో మొట్టమొదటి పాంక్రియాస్ శస్త్రచికిత్స
విశాఖపట్నం: మన శరీరంలో క్లోమం (పాంక్రియాస్) అత్యంత కీలకం. అదే సమయంలో బాగా సున్నితం. అలాంటి పాంక్రియస్లో కణితి ఏర్పడితే చాలా ప్రమాదకరం. కేవలం ఎనిమిదేళ్ల వయసులో అలాంటి ఇబ్బంది వచ్చిన ఒక పాపకు.. సీతమ్మధారలోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అత్యంత అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్స చేసి, ఊరట కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన చీఫ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్, హెపటో-బైలియరీ, పాంక్రియాటిక్ సర్జన్ డాక్టర్ మురళీధర్ నంబాడ తెలిపారు.“విశాఖ నగరానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చింది. ఈ చిన్న పాపను గ్యాస్ట్రోఎంటరాలజీ చీఫ్ డా. ఆచంట చలపతి రావు గారు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా పరీక్షించ చేసి, ఇది అత్యంత అరుదైన సాలిడ్ సూడోపాపిలరీ ఎపితెలియల్ నియోప్లాజమ్ (స్పెన్) అనే పాంక్రియాటిక్ కణితి ఉన్నట్లు తేలింది. భారత దేశంలో ఈ తరహా సమస్యకు శస్త్రచికిత్స జరిగిన అత్యంత చిన్నవయసు రోగిగా ఈ పాప చరిత్ర సృష్టించింది. పాపకు పాంక్రియాస్లో కణితి ఉండడం, అది అత్యంత అరుదైనది కావడంతో దాంట్లో క్యాన్సర్ లక్షణాలు చాలా తక్కువగానే ఉన్నా, తర్వాత ఎలాంటి సంక్లిష్ట సమస్యలు రాకూడదంటే శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించాలని నిర్ణయించాం.మూడు గంటల పాటు అత్యంత కచ్చితత్వంతో కీహోల్ సర్జరీ (లాప్రోస్కోపిక్ సెంట్రల్ ప్యాంక్రియాటెక్టమీ)మొదలుపెట్టాం వీలైనంత వరకు రక్తస్రావం లేకుండా చూడడంతో పాటు, పాంక్రియస్ కణజాలాన్ని కూడా వీలైనంత వరకు కాపాడుకుంటూ కణితి మొత్తాన్ని తొలగించగలిగాం. ఈ శస్త్రచికిత్స తర్వాత బాలిక చాలా త్వరగా కోలుకుంది. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఐదు రోజుల్లోనే పాపను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం. ఇప్పుడు ఆమె స్కూలుకు కూడా వెళ్తూ చదువులో, ఆట లో చక్కగా రాణిస్తోంది.ఇలాంటి అత్యంత అరుదైన పాంక్రియాటిక్ కణితులను తొలగించడంలో ఉన్న నైపుణ్యాలకు ఈ శస్త్రచికిత్సే నిదర్శనం. ఇలాంటి కణుతులు చాలా అరుదైనప్పటికీ, తమ అనుభవంలో గత పదేళ్ళలో 12 గుర్తించి వైద్యం చేశాం అని శస్త్ర చికిత్స నిపుణులు డా. మురళీధర్ నంబాడ వివరించారు. ఇలాంటివి త్వరగా గుర్తించడం, అసాధారణ సర్జికల్ నైపుణ్యాలు ఇలాంటి అరుదైన పరిస్థితుల్లో చాలా కీలకం.ఇలాంటి కేసుల్లో కూడా అత్యంత సురక్షితమైన ఫలితాలను తీసుకురావడంలో కిమ్స్ ఆస్పత్రికి పేరుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇలాంటి సమస్యలు వచ్చినవారు ఇక పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పిల్లలు, పెద్దలకు ఇలాంటి కీహోల్ శస్త్రచికిత్సల విషయంలో కిమ్స్ ఆస్పత్రి పేరు ప్రఖ్యాతులను ఈ శస్త్రచికిత్స మరింత పెంచింది” అని డాక్టర్ మురళీధర్ నంబాడ తెలిపారు. ఈ శాస్త్ర చికిత్స లో సర్జికల్ టీమ్ డా. రవి చంద్రారెడ్డి, డా. గోపాలకృష్ణ కూడా పాల్గొన్నారు. -
విశాఖలో అదానీ డేటా సెంటర్ బాబుకి చెంప చెల్లుమనేలా జీవోతో క్లారిటీ
-
కూటమి ప్రభుత్వ జీవో సాక్షిగా బట్టబయలైన క్రెడిట్ చోరీ
-
అవును.. అది అదానీ డేటా సెంటరే..!
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్త కాదు. హైదరాబాద్లో హైటెక్ సిటీతో మొదలు.. ప్రతీదాంట్లోనూ సొంత గొప్పలు చెప్పుకుంటూ సంకుచిత బుద్ధితో వ్యవహరిస్తుంటారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలోనూ అలాంటి పనే చేయబోయి.. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు.విశాఖలో గూగుల్ నెలకొల్పబోయే డేటా సెంటర్.. ఆదానీ డేటా సెంటరే. గత వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందమే ఇది!. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు.. ఎట్టకేలకు ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు ప్రభుత్వమే ఒప్పుకుంది. తాజాగా డాటా సెంటర్ కోసం భూకేటాయింపులు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అందులో.. అదానీ ఇన్ఫ్రా, అదానీ కనెక్స్ ఇండియా, అదానీ పవర్లకు భూ కేటాయింపు చేస్తున్నట్లు ప్రకటించింది. అడవివరంలో 120 ఎకరాలు, తర్లువాడలో 200 ఎకరాలు, రాంబిల్లిలో 160 ఎకరాలు.. మొత్తం 480 ఎకరాలు ఆదానీ సంస్థలకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో మెన్షన్ చేసింది. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా నోటిఫైడ్ పార్టనర్లుగా అదానీ, భారతి ఎయిర్ ఎయిర్ టెల్ లకు భూ కేటాయింపు ఉత్తర్వులతో పాటు అన్ని రాయితీలు కల్పించాలని కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జీవో కోసం 👉 ఇక్కడ క్లిక్ చేయండిదాదాపు రూ. 87 వేల కోట్ల పెట్టుబడి ఉన్న డాటా సెంటర్ విషయంలో యాజమాన్యం పేరు ఉసెత్తకుండా ఇంతకాలం చంద్రబాబు, నారా లోకేష్ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అందుకు కారణం.. ఆ ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు జీవోతో ఆ బండారం బయటపడింది. వైఎస్ జగన్ చెబుతోంది ఏంటంటే.. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ = అదానీ గ్రూప్ పెట్టుబడి + గూగుల్ క్లయింట్. అంటే ఈ డేటా సెంటర్లో గూగుల్ కేవలం క్లయింట్ మాత్రమే, కానీ అసలు నిర్మాణం, పెట్టుబడి అదానీ గ్రూప్దే. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అనేది నిజానికి అదానీ గ్రూప్తో కలిసి వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలోనే కుదిరింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు దానిని కొత్తగా తన ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్ట్లా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. -
విశాఖలో సినీ నటి సంయుక్త మీనన్ సందడి (ఫొటోలు)
-
ఉత్సాహంగా వైజాగ్ మారథాన్ ర్యాలీ (ఫొటోలు)
-
ఆకుపచ్చని ఉద్యమం
మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎడారిలాంటి చోట కూడ పచ్చని తోటై పలకరిస్తుంది. మహిళల సారథ్యంలోని ‘వనమాలి గార్డెనింగ్ గ్రూప్’ వాట్సాప్ వేదికగా విశాఖపట్టణంలో మిద్దెతోటల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వనమాలి గార్డెనింగ్ గ్రూప్లో మూడువేలమంది మహిళలు ఉన్నారు. అంతరించిపోతున్న అరుదైన సంప్రదాయ మొక్కలకు జీవం పోస్తున్నారు. గ్రీన్డ్రైవ్స్ నిర్వహిస్తూ రహదారుల పక్కన మొక్కలు నాటుతున్నారు...‘పై కప్పు ఇస్తారా...పచ్చగా మార్చేస్తాం, మాకు ఎటువంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటి మిద్దె చూపిస్తే చాలు మీకు కావాల్సిన ఆకు కూరలు, కూరగాయలు పండించే మార్గాల్ని చూపుతాం’ అంటున్నారు వనమాలి గార్డెనింగ్ గ్రూపుల నిర్వాహకులు అరుణ అరవల, సరితా మల్ల, జ్యోతి నాదెళ్ల. విశాఖపట్టణంలోని మురళీ నగర్కు చెందిన అరుణ అనే మహిళకు వచ్చిన ఆలోచన మూడువేల మంది మహిళల్లో చైతన్యాన్ని తెచ్చింది. ఆకు పచ్చని ఉద్యమానికి వేదికగా నిలిచింది.అవసరాలు తీరేలా....పర్యావరణానికి మేలు జరిగేలా...వనమాలి గార్డెనింగ్ గ్రూపులో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్, మన కూరగాయల తోట అనే రెండు గార్డెనింగ్ గ్రూపులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రూపులో నగర వ్యాప్తంగా మూడువేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వంట గది వ్యర్థాల నుంచి మొక్కలకు అవసరమైన కంపోస్టు ఎరువును తయారు చేసుకుంటున్నారు. దీనిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అంతరిస్తున్న ఆకుకూరలకు జీవంఅంతరిస్తున్న సాంప్రదాయ ఆకు కూరలు, కాయగూరల పునరుద్ధరణకు ‘వనమాలి గార్డెనింగ్’ వ్యవస్థాపకురాలు ఎ.అరుణ కృషి చేస్తున్నారు. కొండపిండి ఆకు, నల్లేరు, గలిజేరు, పొన్నగంటి కూర వంటి ఆకు కూరలతోపాటు, చెమ్మ చిక్కుడు, ముళ్ల వంకాయలు, ఇతర రాష్ట్రాలకు చెందిన క్లోవ్ బీన్స్, ఫ్యాషన్ ఫ్రూట్, వింగ్డ్ బీన్స్, ఎయిర్ పొటాటో, గుడ్డు వంగ (ఎగ్ బ్రింజాల్), ఎరుపు బర్బాటీ, ఎరుపు తోటకూర, ఎరుపు చిక్కుడు, ఎరుపు బెండ, రెడ్ ముల్లంగి, ఎరుపు బచ్చలి కూరలు, సీమ చింత... మొదలైన వాటిని తన ఇంటి మిద్దెపై పండిస్తున్నారు అరుణ. వీటితో పాటు వైజయంతి మాల, వాటర్ యాపిల్, నోనీ ఫ్రూట్, బిలంబి ఉసిరి, పొట్టి పొట్ల కాయలు, పాన్ మత్తా, మింట్ తులసి, పాండవబత్తి, దాల్చిన చెక్క, అంజీర్, మల్బరీ ఫ్రూట్స్ వంటి అరుదైన మొక్కలు ఉన్నాయి. వీటిని సంబంధించిన విత్తనాలు, నార్లు పంపిణీ చేస్తున్నారు.వనమాలి సమావేశాలువనమాలి పరిధిలో పదిహేను ఏరియా గ్రూపులు ఉన్నాయి. ప్రతి గ్రూపులో వంద నుంచి రెండు వందల మంది సభ్యులు ఉన్నారు. ప్రతి ఏరియాకి ఇద్దరు ఇంచార్జ్లు ఉంటారు. వీరు ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత సభ్యులకు అవసరమైన సలహాలు అందిస్తారు. విత్తనాలు, కొమ్మలు, మొక్కలు, నారు ఇచ్చి పుచ్చుకుంటారు. సీనియర్ గార్డెనర్స్ సూచనలు తీసుకుంటారు, కొత్త ఐడియాలు నేర్చుకుంటారు. నెలకోసారి గ్రీన్ డ్రైవ్స్ నిర్వహించి రహదారుల పక్కన పార్క్లో మొక్కలు నాటుతున్నారు.కమ్యూనిటీ గార్డెనింగ్‘బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్’్ట కాన్సెప్ట్లో భాగంగా పనికిరాని వస్తువుల్లో నుంచి మొక్కల పెంపకానికి ఉపయోగపడేవాటిని ఎంచుకుంటారు వనమాలి గ్రూప్ సభ్యులు. పాత వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్ బాటిల్స్, బకెట్లు, టబ్స్లో మొక్కలు పెంచుతారు. కమ్యూనిటీ గార్డెనింగ్ను ప్రోత్సహించడానికి అపార్ట్మెంట్ నివాసితుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది వనమాలి గార్డెనింగ్ గ్రూప్. ఈ కార్యక్రమాలలో భాగంగా కూరగాయల మొక్కలు, విత్తనాలు పంచుతారు.తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచేలా...ఇరవై ఏళ్ల క్రితం మిద్దె తోట ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మేడ మీద 500 కుండీల్లో మొక్కలు పెంచుతున్నాను. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచే టెక్నిక్ను తెలుసుకుని అమలు చేస్తున్నాను. మేడ పాడవకుండానే తోటను సృష్టించవచ్చు. మా గార్డెనింగ్ గ్రూప్ ద్వారా కొత్త రకాల మొక్కలు, విత్తనాలు పరిచయమయ్యాయి. కేరళ, తమిళనాడు, వాయువ్య రాష్ట్రాల నుంచి వచ్చే అరుదైన కూరగాయలు కూడా మా మేడపై పండిస్తున్నాను. గ్రీన్ క్లైమేట్ ఎం.రత్నం సహకారం అందిస్తున్నారు.– అరుణ అరవల– వి.ఆర్. కశిరెడ్డి, సాక్షి, మురళీనగర్, విశాఖపట్నం -
ఉత్సాహంగా ‘విశాఖ తరంగ్’ (ఫొటోలు)
-
విశాఖలో గ్రాండ్గా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మ్యూజికల్ కాన్సర్ట్ (ఫొటోలు)
-
కంచరపాలెం మిస్టరీ.. నరబలి కోణంలో దర్యాప్తు!
సాక్షి, విశాఖపట్నం: కంచరపాలెం కాలువలో పసికందు మృతదేహం లభ్యమైన కేసులో మిస్టరీ కొనసాగుతోంది. తల లేకుండా విడి భాగాలు మాత్రమే లభించడం స్థానికంగా కలకలం రేపింది. ఆ చిన్నారి ఎవరు? ఎందుకు అంత ఘోరంగా చంపారు?.. అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం ఉదయం కంచరపాలెం పీఎస్ పరిధిలోని.. ఓ కాలువలో పసికందు శరీర విడిభాగాలు కనిపించాయి. దీంతో ఉలిక్కిపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాళ్ళు, చేతులు ముక్కలుగా లభ్యం కాగా.. తల భాగం కోసం పోలీసులు కాలువలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు జరిపారు. మరోవైపు.. ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది. పసికందు శరీర బాగాల నుంచి శాంపిల్స్ తీసుకుని పరిశీలనకు తీసుకెళ్లింది. మరోవైపు.. శరీర భాగాలను కేజీహెచ్కు తరలించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆశా వర్కర్స్ ద్వారా గర్భిణీల వివరాలను పరిశీలిస్తున్నారు. అపహరణ కేసులు ఏమైనా నమోదు అయ్యాయో రికార్డులు పరిశీలిస్తున్నాయి. అమవాస్య కావడంతో నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. -
విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)
-
బిగ్ అలర్ట్.. ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. ఈ ప్రభావంతో ఏపీ అంతటా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా వాయుగుండంగా బలపడనుంది. వాయుగుండంగా బలపడిన తరువాత ప్రభావం పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి నాలుగు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఇప్పటికే రాయలసీమ తేలికపాటి వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే.మరోవైపు ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడుతుందన్నారు. పెరిగిన చలి తీవ్రతరాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, కిలగడలో 5.8, డుంబ్రిగూడ 7.8, కరిముక్కిపుట్టి 8, పాడేరు 8.1, అరకు, పెదబయలు 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదీ చదవండి: విస్తరించిన అల్పపీడనం -
Visakhapatnam: రైలుపై పడ్డ కరెంటు స్తంభం..
-
ఐ-బొమ్మ రవి అరెస్టుపై ఆయన తండ్రి ఏమన్నారంటే?
సాక్షి,విశాఖ: ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్టును ఆయన తండ్రి అప్పారావు సమర్ధించారు. ఇమ్మడి రవి అరెస్టు వేళ మీడియా తండ్రి అప్పారావును కదలించింది. ‘రవి నేరం చేయలేదని నేను చెప్పను పరిణామాలు చూసి నేరం చేసినట్టు అంగీకరించాల్సిందే. రవి ఇంటికి వచ్చి రెండేళ్లు అవుతుంది. పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఊరుకుంటారా..?. కోట్లు సంపాదించడం అంటే మాటలా..నేను సాదాసీదా జీవితం గడుపుతున్నాను. రవి తప్పు చేసి చేయలేదంటే ఊరుకుంటారా..?.రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యా, భర్తలిద్దరికీ విభేదాలు ఉన్నాయి. ఏది ఏమైనా రవి చేసింది తప్పే’అని వ్యాఖ్యానించారు. ఇమ్మడి రవి అరెస్టు ఇలావిదేశాల్లో ఉన్న ఇమ్మడి రవి భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు హైదరాబాద్కు వచ్చాడు. ఆ సమయంలో రవి గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో ఇమ్మడి రవి తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇమ్మడి రవి విడుదలైన కొత్త సినిమాను పైరసీ చేయడం వాటిని ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లలో అప్లోడ్ చేస్తుండేవాడు. తద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదని కొత్త మార్గాల్ని ఎంచుకున్నాడు. అందుకు టెలిగ్రామ్ను వేదిక చేసుకున్నాడు. టెలిగ్రామ్లో యూజర్లు సినిమా లింక్స్ క్లిక్ చేస్తే బెట్టింగ్ యాప్స్,గేమింగ్ యాప్స్ యాడ్స్ వచ్చేవి.వాటి ద్వారా భారీ ఆదాయాన్ని గడించాడు.పోలీసుల దర్యాప్తు ఇలా అదే సమయంలో తెలంగాణ సీఐడీ పోలీసులు బెట్టింగ్, గేమింగ్ యాప్స్పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్పై సిట్ను ఏర్పాటు చేశారు. ఆ దర్యాప్తులో ఉండగా పోలీసులకు ఇమ్మడి రవి సైతం బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఐబొమ్మ,బప్పం టీవీలో పైరసీ సినిమా చూసే సమయంలో అనైతిక గేమింగ్, బెట్టింగ్ యాప్స్కు సంబంధిత యాడ్స్ను ప్రసారం చేసేవాడు. పైరసీ సినిమాను ఓపెన్ చేయాలన్నా, డౌన్లోడ్ చేయాలన్నా, ఇంటర్వెల్ తర్వాత సినిమా చూడాలన్నా, సినిమా చూసే సమయంలో పాజ్ క్లిక్ మళ్లీ చూడాలన్నా ఆ యాడ్స్ను క్లిక్ చేసేలా వ్యవస్థను తయారు చేశాడు. ఇమ్మడి రవి అనుచరులు అరెస్టుఅలా పోలీసులు బెట్టింగ్ యాప్స్పై దర్యాప్తు చేస్తుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్లో పైరసీ కంటెంట్కు సంబంధించి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వారిలో శివాజీ,ప్రశాంత్ ఉన్నారు. వారిద్దరూ ఇమ్మడి రవికి ప్రధాన అనుచరులుగా పోలీసులు భావిస్తున్నారు. వాళ్లిద్దరూ అరెస్ట్ అనంతరం కూకట్పల్లి నుంచి తప్పించుకుని నెలకొకసారి దేశాలు మారుతూ వచ్చాడు. కూకట్ పల్లి నుంచి నెదర్లాండ్, ఫ్రాన్స్, కరేబీయన్ దీవుల్ని అడ్డగా చేసుకొని పైరసీ సైట్లను నిర్వహించాడు. ఐబొమ్మ రవి ప్రస్తుతం భార్యతో విడాకుల కేసులో హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరవుతున్నాడు. అదే క్రమంలో తదుపరి విచారణ కోసం అతడు ఫ్రాన్స్ నుంచి కూకట్ పల్లికి రాగా.. రవిని పోలీసులు అరెస్టు చేశారు. రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన విషయం అతడి దగ్గరి వ్యక్తుల నుంచి పోలీసులకు లీకైందని కూడా ఒక గుసగుస వినిపిస్తోంది. 70కి పైగా పైరసీ సైట్లు కూకట్పల్లిలో ఓ ఇంట్లో అతనిని అరెస్టు చేసే సమయంలో వందల సంఖ్యలో హార్డ్ డిస్క్లు, ఐబొమ్మ, బప్పం టీవీలో విడుదల చేసేందుకు అప్లోడ్ చేసిన కొత్తగా విడుదలైన సినిమాలు, సర్వర్లను మెయింటైన్ చేసేందుకు వినియోగించిన సాఫ్ట్వేర్లు కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్లను సీజ్ చేశారు. 2018 నుంచి నివాసం ఉంటున్న ఫ్లాట్ను కేంద్రంగా చేసుకున్న ఇమ్మడి రవి ఐబొమ్మ,బప్పంటీవీలలో సినిమాలను అప్లోడ్ చేసేవారని,కరేబియన్ దీవుల్లో సైతం కార్యకలాపాలు కొనసాగించినట్లు తేలింది. ఐబొమ్మ, బప్పంటీవీలను ప్రధానంగా ఉంచుకొని.. అదనంగా మరో 70కి పైగా ఆపరేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారాల్ని సేకరించారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అన్నాడనిఅనంతరం, తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీని నిలిపివేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఈ వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ ఇమ్మడి రవి విసిరిన సవాలను స్వీకరించి అతడితోనే ఐబొమ్మ, బప్పం టీవీలను నిలిపివేయించారు. ఇమ్మడి రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్లను, బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. -
చంద్రబాబుపై స్టీల్ప్లాంట్ కార్మికుల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబుపై స్టీల్ప్లాంట్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ప్లాంట్పై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రొడక్షన్ను బట్టి జీతాలు ఇస్తామనే సర్క్యూలర్ను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ నష్టానికి కార్మికులు కారణం కాదు. సొంతంగా గనులు లేకపోవడమేనన్నారు.‘‘దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు లేవు. చంద్రబాబు పీపీపీ అంటే ప్రజలు ఛీ.. ఛీ.. ఛీ. అంటున్నారు. చంద్రబాబు దృష్టి అంతా ప్రైవేటీకరణ మీదే ఉంది. విద్యా వైద్య రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్యాకేజీ వలన కార్మికులకు స్టీల్ ప్లాంట్కు ఎలాంటి ప్రయోజనం లేదు’’ అని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేత అన్నారు.వైఎస్సార్సీపీ నేత కేకే రాజు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు నయవంచనకు పాల్పడుతున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కార్మికులపై నెపాన్ని నెట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం’’ అని కేకే రాజు పేర్కొన్నారు. -
పని చేయకున్నా జీతాలివ్వాలా?... విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు
-
‘ఐ బొమ్మ’ రవి ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్
పైరసీ భూతంలో గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు ప్రశాంతత లేకుండా చేస్తున్న ఐ-బొమ్మ(ibomma) నిర్వాహకుల్లో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన ఇమ్మడి రవిని.. సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో శుక్రవారమే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు విచారణలో ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది. ఇమ్మడి రవికి, అతని భార్యకి కొంత కాలంగా తగాదాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం కేసు కోర్టులోనూ నడుస్తోంది కూడా. ఈ క్రమంలో.. విడాకుల కేసు కోసమే రవి ఇండియాకు వచ్చాడు. ఈ కోపంలోనే భర్త వస్తున్నాడనే సమాచారం పోలీసులకు అతని భార్యే అందించినట్లు తెలుస్తోంది. అలా.. భార్య అందించిన టిప్పుతో రవి హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. చంచల్గూడ జైలుకు రవి.. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు మెజిస్ట్రేట్ నివాసంలో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో రవిని 7 రోజులపాటు పోలీసులు కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు.. I BOMMA , BAPPAM వెబ్ సైట్లను పోలీసులు బ్లాక్ చేసినట్లు సమాచారం. అంతేకాదు.. పైరసీ కంటెంట్తో బెట్టింగ్ యాప్లను సైతం ప్రమోట్ చేశాడని తెలుస్తోంది.కంటెంట్ను ఆపేసి..ఇక విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి కీలక సమాచారం రాబట్టారు. కూకట్పల్లిలోని అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ను నిలిపివేశారు. నిందితుడు ఉపయోగించిన సర్వర్లనూ కూడా గుర్తించారు. కరీబియన్ దీవుల్లో ఉంటూ.. ఐ-బొమ్మ నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాదు.. ఇమ్మడి రవి స్వస్థలం విశాఖలో స్థానిక పోలీసుల సహాయంతో ఈ ఉదయం నుంచి సీసీఎస్ బృందాలు సోదాలు నిర్వహించాయి. అతని స్నేహితులనూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతనికి సంబంధించిన రూ.3 కోట్ల ఆస్తుల్ని ఫ్రీజ్ చేసింది. గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఐ బొమ్మపై కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో గతంలో పోలీసులకి, సినీ పెద్దలకి ఐ-బొమ్మ ఓ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ దాకా వస్తే.. పోలీసుల సంగతి చూడాల్సి వస్తుందంటూ ఓ బహిరంగ పోస్ట్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ వ్యవహారంలోనూ రవి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఐ-బొమ్మ కారణంగా.. సినిమా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా రూ.22వేల కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ పైరసీ ద్వారా కొన్నేళ్లుగా రూ.వందల కోట్లు ఇమ్మడి రవి సంపాదించినట్టుగా గుర్తించారు. ఈ నెట్వర్క్లో రవి పాత్ర ఇంకా ధృవీకరణ కావాల్సి ఉంది. ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారు? నెట్ వర్క్ ఎక్కడెక్కడ ఉంది? అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. -
విశాఖ బస్టాండ్లో మంత్రి రాంప్రసాద్కి షాక్
సాక్షి, విశాఖపట్నం: బస్టాండ్లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డికి షాక్ తగిలింది. ఉచిత బస్సు పథకం ఎలా ఉందంటూ ప్రయాణికురాలను మంత్రి అడిగారు. ఉచిత బస్సు పథకం వల్ల ఉపయోగం లేదంటూ ఆ మహిళ తేల్చి చెప్పింది. ఉచిత బస్సు పథకంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. ప్రయాణికుల మధ్య గొడవలు అవుతున్నాయని చెప్పింది. మహిళ సమాధానంతో షాక్ తిన్న మంత్రి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.కాగా, ఫ్రీ బస్సు పథకం మహిళల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. ఆర్టీసీ బస్సులో ఒకరిపై మరొకరు వాటర్ బాటిళ్లు విసిరేసుకున్న ఘటన ఇటీవల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు బయలుదేరిన ఆర్టీసీ బస్లో మహిళలు కొంతమంది సీట్లలో కూర్చున్నారు. సీట్లు ఖాళీలేక మరి కొంతమంది నిలబడ్డారు.సీట్లు లేని మహిళలు బస్సులో నిలబడలేకపోవటంతో సీట్లలో కూర్చున్న మహిళలపై అవాకులు చెవాకులు పేలారు. ఒకరిపై మరొకరు వాటర్ బాటిళ్లు విసిరేసుకున్నారు. అదే సమయంలో పక్కనున్న మహిళలకు కూడా తగలటంతో వారంతా మరో మహిళ చేయిపట్టుకుని దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కండక్టర్ వారితో మాట్లాడి ఘర్షణ సద్దుమణిగేలా చేశారు.మరో ఘటనలో.. ‘ఉచిత బస్సు కావాలని ఎవరడిగారు. ఉల్లి సాగుచేసి నాశనమయ్యాం. క్వింటాలు ఉల్లిని రూ.200కు అడుగుతున్నారు. రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. రైతులను పట్టించుకునే వారు లేరు. 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్నారు. ఇంతవరకు కొత్త పింఛన్లే లేవు. ఉచిత బస్సు ప్రయాణం వద్దు. టికెట్ ఇవ్వండి’ అంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ టికెట్ తీసుకున్నారు.కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న కొట్టాల గ్రామానికి చెందిన సుంకులమ్మ వెల్దుర్తి మండలంలోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్టోబర్ 26వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వెల్దుర్తిలో బస్సు ఎక్కి చిన్నటేకూరుకు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకునే సమయంలో ఉచిత బస్సు వద్దని, రైతుల్ని ఆదుకోవాలని ఆమె నినాదాలు చేశారు. -
మూడు రాష్ట్రాల్లో మదనపల్లె కిడ్నీ రాకెట్ లింకులు!
మదనపల్లె: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ ముఠా కార్యకలాపాలు మూడు రాష్ట్రాల్లో విస్తరించినట్టు తెలుస్తోంది. కిడ్నీ ఇచ్చినది విశాఖ జిల్లా యువతి, దానిని అమర్చింది గోవాకు చెందిన వ్యక్తికి, ఈ ఆపరేషన్ చేసినది బెంగళూరుకు చెందిన వైద్యుడని పోలీసులు గుర్తించారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉంది? ఎప్పటి నుంచి ఉంది? ట్రాన్స్ఫ్లాంటేషన్కి అనుమతిలేని ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఎలా చేశారు? ఇందులో అనుభవం కలిగిన వైద్యుల అవసరం కాబట్టి వాళ్లు ఎవరు? అన్న అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఏపీలోని విశాఖపట్నం సహా మరికొన్ని ప్రాంతాలతోపాటు కర్ణాటక, గోవా రాష్ట్రాలకు పోలీసు బృందాలు వెళ్లాయి. విశాఖతో మదనపల్లెకు లింకు ఎలా కుదిరింది? విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలేనికి చెందిన సాడి యమున (29) అనే యువతి కిడ్నీ తీసి గోవాకు చెందిన వ్యక్తికి అమర్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వ్యక్తి బెంగళూరుకు చెందిన యూరాలజీ వైద్యుడు పార్థసారథి అని గుర్తించారు. ఆయన కోసం గాలిస్తున్నారు. కిడ్నీ స్వీకరించినది గోవా వ్యక్తి.. అతని ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కిడ్నీ సేకరించే విషయంలో ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాకు చెందిన యువతికి, ఆపరేషన్ చేసిన ఆస్పత్రి ఉన్న రాయలసీమలోని మదనపల్లె ముఠాకు ఎలా లింకు కుదిరింది? వీటి మూలాలు ఎక్కడ ఉన్నాయనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో కీలక నిందితుడైన వైద్య, ఆరోగ్యశాఖలో జిల్లా డీసీహెచ్ఎస్గా పనిచేస్తున్న డాక్టర్ ఆంజనేయులు నుంచి వివరాలను రాబడితేనే గుట్టంతా వీడుతుందని భావిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేసిన మదనపల్లె గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడాదిన్నర కిందట ప్రారంభించారని పోలీసులు చెబుతున్నారు. అక్కడ ఇప్పటిదాకా ఎన్ని ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు చేశారో ఆరా తీస్తున్నారు.ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసేవారే కీలకం? ఈ వ్యవహారంలో వైద్య, ఆరోగ్యశాఖలో జిల్లా డీసీహెచ్ఎస్గా పనిచేస్తున్న డాక్టర్ ఆంజనేయులు, కదిరి, మదనపల్లె ప్రభుత్వాస్పత్రుల్లోని డయాలసిస్ విభాగంలో పనిచేస్తున్న బాలు, మెహరాజ్ కీలకమని పోలీసులు గుర్తించారు. సాడి యుమున మృతిచెందకుండా ఉంటే కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చేదికాదు. కిడ్నీ రాకెట్ ముఠా ఆమె మరణించిన తర్వాత కూడా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని అంబులెన్స్లో తరలించి, విషయం బయటకు రాకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. మరోవైపు యమునతో ఎమిదేళ్లుగా సహజీవనం చేస్తున్న సూరిబాబుకు ఈ విషయాలన్నీ తెలిసే కిడ్నీ మార్పిడి కోసం మధ్యవర్తులైన పిల్లి పద్మ, సత్యతో ఆమెను పంపినట్టు పోలీసులు గుర్తించారు. క్రైమ్ నంబర్ 179/2025గా నమోదైన కేసులో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. డాక్టర్ ఆంజనేయులును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఎఫ్ఐఆర్ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. -
టీడీపీ నేత గోడౌన్లో టన్నుల కొద్దీ గోమాంసం..
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అధికార టీడీపీ నాయకుడికి చెందిన గోడౌన్లో టన్నుల కొద్దీ గోమాంసం లభ్యమైంది. ఇంత పెద్ద మొత్తంలో గో మాంసం పట్టుబడటంతో ధార్మిక సంఘాలు.. కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడుతున్నాయి.వివరాల ప్రకారం.. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తా కోల్డ్ స్టోరేజ్లో పెద్ద మొత్తంలో గోమాంసం పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు సోమవారం ఉదయం గోమాంసం వ్యవహారాన్ని గుట్టు రట్టు చేశారు. అయితే, గోడౌన్లో లక్షా 89వేల కేజీల గోమాంసం పట్టుబడితే అసలు సూత్రధారులను మాత్రం పోలీసులు పట్టుకోకపోవడం గమనార్హం. అధికార టీడీపీ నేతలను కాపాడేందుకు పోలీసులు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. టన్నుల కొద్దీ గోమాంసం ఉండటంతో స్థానికులు షాకవుతున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని నెటిజన్లు నిలదీస్తున్నారు. పవన్ కల్యాణ్ను సైతం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. -
దొంగా పోలీస్ ఆటాడించి.. అత్త దారుణ హత్య
విశాఖపట్నం జిల్లా: పెళ్లి నాటినుంచీ పొసగని అత్తను ఒక కోడలు అత్యంత కిరాతకంగా.. అచ్చం హర్రర్ క్రైం సినిమా స్టోరీని తలపించే రీతిలో హతమార్చిన ఘటన ఇది. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపగుంట సమీపాన అప్పన్నపాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై విశాఖ వెస్ట్ జోన్ ఏసీపీ పృద్వితేజ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పన్నపాలెంలో వర్షిణి అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో జయంతి సుబ్రహ్మణ్యం, ఆయన భార్య లలితాదేవి (30), తల్లి జయంతి కనకమహాలక్ష్మి (63), పిల్లలు ఈశ్వర్చంద్ర, శ్రీనయన, మేనల్లుడు శరత్తో నివాసం ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం–లలితాదేవికి 12 ఏళ్ళ క్రితం పెళ్లయ్యింది. అత్తాకోడళ్లు లలితాదేవి, కనకమహాలక్ష్మికి పెళ్లయిన తొలినాళ్ల నుంచే విభేదాలు తలెత్తాయి. ఇద్దరికి రోజూ ఏదో విషయంలో గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అత్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని లలిత నిర్ణయించుకుంది. హత్యచేసి ఎలా తప్పించుకోవాలన్నది తెలుసుకోడానికి యూట్యూబ్లో క్రైమ్ వీడియోలు చూసింది. తద్వారా ఒక పథకం సిద్ధం చేసుకుంది. ఈ నెల 6న సింహచలం గోశాల వద్ద ఉన్న బంక్లో సీసాలో లీటరు పెట్రోలు తీసుకుని ఇంట్లో దాచిపెట్టింది. శుక్రవారం ఉదయం భర్త సుబ్రహ్మణ్యం, మేనల్లుడు శరత్ పనిమీద బయటకు వెళ్లారు. అత్తను హత్య చేసేందుకు అదే తగిన సమయమని భావించింది. ‘నాన్నమ్మతో దొంగాపోలీస్ ఆట ఆడి.. ఆమెను తాళ్లతో కట్టేసి కళ్లకు గంతలు కట్టండి’ అని పిల్లలకు పురమాయించింది. విషయం తెలియని పిల్లలు నాన్నమ్మను అడగ్గా.. కనకమహాలక్ష్మి పిల్లల సరదా కోసం ఒప్పుకుంది. అంతే పిల్లలు తాళ్లతో కట్టేసి, కళ్లకు గంతలు వేయడంతో కనకమహాలక్ష్మిపై అప్పటికే సిద్ధం చేసుకున్న పెట్రోల్ను క్షణాల్లో ఆమెపై పోసి, దేవుడి పటాల వద్ద ఉన్న దీపాన్ని ఆమె మీదకు విసిరింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని కనకమహాలక్ష్మి పెద్దగా కేకలు వేయడంలో చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే శరీరం పూర్తిగా కాలిపోయిన కనకమహాలక్ష్మి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కాగా, దీపం జారిపడటంతో మంటలు అంటుకుని తన అత్త ప్రమాదానికి గురైనట్టు ప్రజలతో పాటు పోలీసులను లలిత నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసులు పెట్రోల్ వాసన గమనించి తమదైన శైలిలో విచారణ చేయగా నిందితురాలు నేరం ఒప్పుకుంది. హతురాలి కుమారుడు సుబ్రహ్మణ్యం ఇచి్చన ఫిర్యాదు మేరకు నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రమాదంలో సుబ్రహ్మణ్యం కుమార్తె శ్రీనయనకు స్వల్ప గాయాలయ్యాయి. -
దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను కుర్చీకి కట్టేసి.. పెట్రోల్ పోసి..!
-
విశాఖ: వృద్ధురాలి మృతి కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పెందుర్తిలో అత్త జయంతి కనక మహాలక్ష్మి (66) అనుమానాస్పద మృతి కేసులో హత్య కోణం బయటపడింది. కోడలు సినీ పక్కిలో పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.కోడలు, మనవరాలు ‘దొంగ-పోలీస్’ ఆట పేరుతో అత్తను కుర్చీకి కాళ్లను తాళ్లతో బంధించారు. కళ్లకు గంతలు కట్టి కదలకుండా బంధించిన కోడలు.. అనంతరం కుర్చీలో కదలలేని పరిస్థితుల్లో ఉన్న అత్తపై పెట్రోల్ పోసి.. దేవుడి గదిలో ఉన్న దీపం విసిరి నిప్పంటించింది.అనంతరం కోడలు.. అగ్ని ప్రమాదం జరిగిందంటూ అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. మొదట అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తనపై అనవసరంగా చిరాకు పెడుతుందనే కారణంతోనే అత్తను హతమార్చినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. భార్యాభర్తలు సుబ్రహ్మణ్య శర్మ, లలిత, మనవడు, మనవరాలు, అత్త జయంతి కనకమాలక్ష్మి పెందుర్తి అప్పన్నపాలెంలో నివాసముంటున్నారు. -
ఇండిచిప్.. ఇది మరో ఉర్సా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో ఉర్సా తరహా పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుందా? సొంత కార్యాలయం కూడా లేని ఉర్సా లాంటి కంపెనీకి విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన భూమి కట్టబెట్టడానికి ప్రయత్నించిన కూటమి సర్కారు, ఇప్పుడు అదే తరహాలో ఇండిచిప్ సెమికండక్టర్స్ అనే అతి తక్కువ మూలధనం కలిగిన కంపెనీ భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలపడానికి సిద్ధమయ్యింది. 10 లక్షల చొప్పున 150 ఎకరాలు కేవలం కోటి రూపాయల మూలధనం కలిగిన ఇండిచిప్ సెమికండక్టర్స్ రాష్ట్రంలోని ఓర్వకల్లులో ఏకంగా రూ.22,976 కోట్ల భారీ పెట్టుబడితో సెమీకండక్టర్ల తయారీ యూనిట్ పెట్టడానికి ముందుకు వచి్చంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ అధ్యక్షతన సమావేశమైన పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) ఆమోదం తెలపడమే కాకుండా అనేక రాయితీలను ప్రకటించింది. ఎకరం భూమి కేవలం 10 లక్షల చొప్పున 150 ఎకరాలు కట్టబెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ ప్రతిపాదనకు శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమయ్యే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలపనుంది. తరువాత 10వ తేదీన జరగబోయే మంత్రివర్గ సమావేశం కూడా దీనికి ఆమోదముద్ర వేయనుంది. భాగస్వామ్య కంపెనీ మూలధనమూ అరకొరే..! జపాన్కు చెందిన ఇతో మైక్రో టెక్నాలజీతో కలిసి ఈ యూనిట్ను ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఇండిచిప్ ఒప్పందం చేసుకుంది. సెమీ కండక్టర్స్ తయారీ రంగంలో ఉన్న ఇతి మైక్రో కంపెనీ పలు దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, ఆర్థికంగా భారీ కంపెనీ ఏమీ కాదు. షెన్ఝనోస్టాక్ మార్కెట్లో ఇతో మైక్రో టెక్నాలజీస్ నమోదైంది. ఇప్పుడు ఆ కంపెనీ మార్కెట్ క్యాప్ మన భారతీయ కరెన్సీలో కేవలం రూ.249 కోట్లని జపాన్కు చెందిన ఈఎన్–ఏఎంబీఐ డాట్ కామ్లో ఫైలింగ్స్ను పరిశీలిస్తే అర్థమవుతోంది. కేవలం కోటి రూపాయలతో ఏర్పాటైన ఇండిచిప్ కేవలం రూ.249 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఇతో మైక్రో టెక్నాలజీస్తో కలిపి ఏకంగా రూ.22,976 కోట్ల విలువైన పెట్టుబడులను ఎలా సమకూర్చుకుంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటువంటి కంపెనీకి వందల కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న అంశంపై చర్చ జరుగుతోంది. అందులోనూ కేంద్ర ప్రభుత్వ నిక్డిక్ట్ (ఎన్ఐసీడీఐటీ) నిధులతో అభివృద్ధి అవుతున్న ఓర్వకల్లు పారిశ్రామిక వాడ ప్రాంతంలో ఈ భూములను ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆశ్చర్యకరమైన ‘అడుగులు’! » ఇండిచిప్ ఒప్పందం పూర్తిగా పరిశీలిస్తే పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. » 2024 డిసెంబర్ నెలలో కొంతమంది వ్యక్తులు కూటమి సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తితో సమావేశమయ్యారు. » తర్వాత జనవరి 2, 2025న నొయిడా కేంద్రంగా ఇండిచిప్ సెమికండక్టర్స్ పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు. » కేవలం కోటి రూపాయల మూలధనంతో కాన్పూరు ఆర్వోసీలో ఈ కంపెనీ నమోదైనట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. » ఇలా ఏర్పాటైన 10 రోజుల్లోనే అంటే ఈ ఏడాది జనవరి 12న మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ సమక్షంలో రాష్ట్రంలో రూ.14,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెడుతున్నట్లుగా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. » ఇది జరిగిన 10 నెలలకే ఇప్పుడు ఈ ప్రతిపాదనను దాదాపు 9 వేల కోట్లు పెంచేసి ఏకంగా రూ.22,976 కోట్లకు చేర్చడం గమనార్హం. » నోయిడా కేంద్రంగా ఏర్పాటైన ఇండిచిప్లో పీయూష్ బిచోరియా, వెబ్ చాంగ్, సందీప్ గార్గ్ డైరెక్టర్లుగా, కీలక అధికారిగా రాజీవ్ వ్యవహరిస్తున్నారు. సందీప్ గార్గ్ 2024లో రెండు కంపెనీలు, 2025లో రెండు కంపెనీల్లో డైరెక్టర్లుగా చేరారు. హృషికేష్ దాస్ ఈ ఏడాది జూలై 31న అడిషనల్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. » వీరెవ్వరికి సెమికండక్టర్స్ తయారీ రంగంలో అనుభవం లేకపోవడం గమనించాల్సిన అంశం. గతంలో నెక్ట్స్ ఆర్బిట్.. ఇప్పుడు ఇండిచిప్ గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో భారీ సెమీకండక్టర్ యూనిట్ వస్తోందని తెగ ప్రచారం చేశారు. నెక్ట్స్ ఆర్బిట్ అనే సంస్థ రూ.50,000 కోట్లతో రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని, తద్వారా 1.10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని 2017లో చంద్రబాబు నాయుడు తెగ ఊదరగొట్టారు. అబుదాబీకి చెందిన నెక్ట్స్ ఆర్బిట్ వెంచర్స్ అప్పట్లోనే రెండు బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెడుతోందంటూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదిరాక ఆయన మూడేళ్లు అధికారంలో ఉన్నా.. కార్యాచరణ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విభజన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత కూడా చంద్రబాబు అదే ధోరణిని కొనసాగిస్తున్నారు. ప్రజలకు గత పెట్టుబడుల ప్రకటనలు ఏవీ గుర్తుండవని బలంగా విశ్వసించే ముఖ్యమంత్రి.. అబుదాబి నెక్ట్స్ ఆర్బిట్ స్థానంలో ఇప్పుడు జపాన్ భాగస్వామ్యంతో ఇండిచిప్ను ప్రచారంలోకి తీసుకొచ్చారు. -
‘అందుకే మా నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది’
విశాఖ కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఏపీలో అసలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అనేలా ఉందని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో హత్యలు, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలను అడిగితే మా చేతుల్లో లాటీ ఏమైనా ఉందా అని అడిగారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది.. కల్తీ మద్యం అంశంలో నకిలీ ఎవిడెన్స్తో అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చెయ్యడానికి మా నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. వైఎస్సార్సీపీ విద్యార్ధి సంఘం నాయకుడు కొండారెడ్డి ఏ తప్పు చెయ్యలేదని వారి తల్లితండ్రులు చెప్తున్నారు.. తప్పు చేస్తే ఏ శిక్షకైనా కొండారెడ్డి సిద్దమని.. ఏ టెస్టుకైనా సిద్దమని వారు చెప్తున్నారు.. కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్న సమయంలో కొండారెడ్డిపై చెయ్యి చేసుకున్నారు. 2వ తేదీ ఉదయం 7:10 నిమిషాలకు కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కొండా రెడ్డి అరెస్ట్ సమయంలో ఎందుకు వీడియో రికార్డ్ చేసి బయటకు ఇచ్చారు..?, రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసామని పోలీసులు ఎందుకు చెప్పారు..?, 2న సాయంత్రం పట్టుబడితే. ఉదయం 11 : 30 గంటలకు టీడీపీ ఆఫీషియల్ పేజ్ లో ఎలా పెట్టారు. టీడీపీ వాళ్ళ దగ్గర టైమ్ మిషన్ ఏమైనా ఉందా..?, టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నది ఎంవీపీ పిఎస్ పరిధి.కొండారెడ్డి బైక్ 14 కిమీ అధికంగా తిరిగింది.. ఎందుకు తిప్పారు..?, పోలీసులు ప్లాన్ ప్రకారమే కొండారెడ్డిని అరెస్ట్ చేశారు. గడిచిన ఏడాది కాలంగా ఎపిలో ఎక్కువ మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఎన్సీఆర్బీ రికార్డ్స్ ఈ లెక్కలు చెప్తున్నాయి. గుడికి దర్శనం కోసం వెళ్లిన వారి ప్రాణాలకు కూడా పాయకరావుపేట శాసన సభ్యురాలు రక్షణ కల్పించలేకపోతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అనే అనుమానం కలుగుతుంది. రాష్ట్రంలో గుడికి, బడికి వెళ్లిన వారు బ్రతుకుతారనే భరోసా లేదు. సొంత పొలానికి వెళ్లిన వారిని కూడా చంపేస్తున్నారు.ఊరు వెళదామని బస్సు ఎక్కినా ప్రాణానికి కూడా రక్షణ లేదు. చివరకు ఫ్లైట్ ఎక్కుదామన్నా భయమే. డ్రగ్స్ కేసులో తప్పుడు ఆరోపణలు సృష్టించి మా పార్టీకి అంటగట్టారు. గతంలో పట్టుబడిన డ్రగ్స్ కేసు మాట ఏమిటి?, కూటమి పెద్దలు వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తున్నారు’ అని విమర్శించారు. -
హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
విశాఖపట్నం: వీఐపీ రోడ్డు సమీపంలోని ఆర్చిడ్ వెల్నెస్ స్పా సెంటర్లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు, 3వ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ పైడయ్య తమ సిబ్బందితో కలిసి బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్పా సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అసాంఘిక కార్యకలాపాలు(వ్యభిచారం) నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో ఒక గదిలో ఓ విటుడు మహిళతో ఉండగా, మరో తొమ్మిది మంది మహిళలు పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తేలింది. వీరందరినీ వ్యభిచార కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సెంటర్లో పనిచేస్తున్న కల్లూరు పవన్ కుమార్, జానా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సెంటర్కు కాసిరెడ్డి అరుణ్ కుమార్ పేరు మీద అనుమతులు ఉండగా, థాయ్ స్పా మసాజ్ ముసుగులో డబ్బు కోసం మహిళలను లైంగిక దోపిడీకి గురిచేస్తున్నట్లు వెల్లడైంది. స్పా సెంటర్పై కేసు నమోదు చేసి, యజమానులు ఏ1గా కాసిరెడ్డి అరుణ్ కుమార్ (పరారీలో), ఏ2గా రాహుల్ (పరారీలో), సిబ్బంది ఏ3గా కల్లూరు పవన్ కుమార్, ఏ4గా జానా శ్రీనివాస, విటుడు ఏ5గా చీలి రామచంద్ర ప్రసాద్లను పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ. 7 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఏపీ వ్యాప్తంగా ఏసీబీ దాడులు
సాక్షి, తిరుపతి: ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వచ్చిన ఫిర్యాదులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 120 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విశాఖ, కోనసీమ, అన్నమయ్య, ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతూ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఏసీబీ దాడులు చేపట్టింది. కొనుగోలుదారులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజం పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. కార్యాలయం తలుపులు మూసివేసిన ఏసీబీ అధికారులు.. సిబ్బందిని అదుపులోకి ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలం నుండి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు నేపథ్యంలో ఏసీబీ దాడులు చేపట్టింది. దీంతో అప్రమత్తమైన రైటర్లు వారి షాపులకు తాళం వేసుకొని పరారయ్యారు. -
విశాఖ కేంద్రంగా బయటపడ్డ గోమాంసం అక్రమ రవాణా
-
విశాఖపట్నంలో పలు చోట్ల భూ ప్రకంపనలు
-
విశాఖలో భూ ప్రకంపనలు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున 4:16 నుంచి 4:20 నిమిషాల మధ్య ప్రకంపనలు వచ్చాయని ప్రజలు అంటున్నాయి. తెల్లవారు జామున కావడంతో కొద్ది మంది మాత్రమే ప్రకంపనలను గుర్తించారు.మురళీనగర్, రాంనగర్, అక్కయ్య పాలెం, సీతమ్మధార, సహా పాలు ప్రాంతాల్లో భూమి కంపించింది. పలు కాలనీ వాసులు భయంతో బయటకు వచ్చారు. అల్లూరి జిల్లా జీ.మాడుగులలో భూకంప కేందాన్ని గుర్తించారు. భూమి లోపల 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉంది. -
విశాఖలో యువ దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?
తాటిచెట్లపాలెం (విశాఖ): నగరంలోని అక్కయ్యపాలెంలో యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫోర్త్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భార్య అనిత, తల్లితో కలిసి సూరిశెట్టి వాసు అక్కయ్యపాలెం, దాలిరాజు సూపర్మార్కెట్ సమీపంలో ఉంటున్నారు. ఏడాది క్రితం వీరికి పెళ్లయింది. ప్రస్తుతం అనిత ఏడో నెల గర్భిణి. ఏం జరిగిందో తెలీదుగానీ ఆదివారం వీరిద్దరూ విగతజీవులయ్యారు.వాసు ఫ్యాన్ హుక్కు ఉరేసుకుని చనిపోగా, అనిత మంచం మీద చనిపోయి ఉంది. ఉదయం వాసు తల్లి ఫంక్షన్ నిమిత్తం బయటకెళ్లి సాయంత్రం తిరిగి వచ్చింది. తలుపు ఎంతసేపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి, కిటీకిలో నుంచి చూసి నిర్ఘాంతపోయింది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ మరణించి కనిపించడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. స్థానికంగా వాసు, అనితల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. మరోవైపు.. అనిత ఏడు నెలలు గర్భిణి కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. అనిత గర్భంలో ఉన్న బిడ్డను బతికించేందకు పోలీసులు మృతురాలిని ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్కు తీసుకెళ్లినప్పటికీ గర్భంలో ఉన్న ఆడ శిశువు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు.పలు కోణాల్లో దర్యాప్తువాసు ఉరేసుకొని ఉండగా, అనిత కిందపడి ఉండటంతో ముందు భార్యను చంపి, అతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా భార్యకు విషమిచ్చి అనంతరం ఉరేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. వీరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఆనందంగా ఉండేవారని తల్లి, బంధువులు పోలీసులకు తెలియజేశారు. చుట్టు పక్కల నివాసితులను విచారణ చేస్తున్నారు. -
విశాఖ: బిల్డింగ్పై నుంచి దూకేస్తాం.. సమతా కాలేజీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని సమతా కాలేజీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులకు గురిచేశారనే కారణంతో విశాఖ సమతా కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భవనంపై నుంచి దూకేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.సాయితేజ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు చెబుతున్నారు. యాజమాన్యం న్యాయం చేయకపోతే బిల్డింగ్పై నుంచి దూకేస్తానంటూ సాయితేజ సోదరుడు హెచ్చరించారు. న్యాయం జరిగేవరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు.విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థి కోన సాయితేజ బలవన్మరణం కలకలం రేపింది. ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులతోనే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు, అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సహచర విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన మేరకు.. తోటి విద్యార్థులతో సరదాగా ఉండే సాయితేజ కొంతకాలంగా తరగతులకు హాజరుకావడంలేదు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా అధ్యాపకులు వేధిస్తున్నట్లు తల్లిదండ్రులు, తమ్ముడి వద్ద పలుమార్లు వాపోయాడు.ఐదో సెమిస్టర్లో భాగంగా స్టాటిస్టిక్స్ రికార్డ్ పూర్తిచేసి ఇటీవల అధ్యాపకురాలికి సబ్మిట్ చేశాడు. అందులో కరెక్షన్స్ ఉన్నాయంటూ ఆమె రికార్డ్ను రిజెక్ట్ చేస్తూ వచ్చారు. దీంతో కొన్ని రోజులుగా సాయితేజ మరింత మనస్తాపానికి గురయ్యాడు. చాలాసార్లు కరెక్షన్లు చేసినా అధ్యాపకురాలు రికార్డ్ తీసుకోలేదు. దీంతో మరోసారి కరెక్షన్స్ చేసి సబ్మిట్ చేసేందుకు గురువారం తల్లిదండ్రులతో కలిసి కాలేజీకి వెళ్లాడు. సాయంత్రం వరకు ఆ అధ్యాపకురాలు కళాశాలకు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళదామని తల్లిదండ్రులు చెప్పారు.ముందు మీరు వెళ్లండి, నేను తరువాత వస్తా.. అని సాయితేజ తల్లిదండ్రులకు, తమ్ముడికి చెప్పాడు. వారు కళాశాలకు వెళ్లి ఎంతసేపు చూసినా.. సాయితేజ రాలేదు. ఫోన్ కూడా తీయలేదు. దీంతో ఇసుకతోటలోని ఇంటికి వెళ్లిన వారికి సాయితేజ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించి, అతడిని మెడికవర్ హాస్పటల్కు తరలించారు. అప్పటికే సాయితేజ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఎంవీపీ పోలీసులు అక్కడికు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు.ఏడాది కాలంగా సాయితేజ ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులకు గురవుతున్నట్లు సహచర విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. సహచర విద్యార్థులతో పాటు తమ్ముడికి కూడా సాయితేజ చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. ఒక అధ్యాపకురాలు ‘ఉదయాన్నే నన్ను ఎందుకు విష్ చేయడంలేదు.. నిన్ను కలవాలని ఉంది.. శివాజీపార్క్కి వస్తావా?.. నాగురించి ఒకసారైనా ఆలోచించవా..’ వంటి మెసేజ్లు పంపటంతో పాటు తరచు వాట్సాప్ కాల్స్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నట్లు సాయితేజ చెప్పాడని స్నేహితులు తెలిపారు. మరో అధ్యాపకురాలు సబ్జెక్ట్ పరంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు. -
ఎక్మోపై భువనేశ్వర్ నుంచి విశాఖ కిమ్స్
విశాఖపట్నం: ఎక్కడో ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఉన్న యువకుడికి ఉన్నట్టుండి పలు అవయవాల వైఫల్యం సమస్య వచ్చింది. అక్కడి వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి విషయం తెలిపారు. దాంతో డాక్టర్ ఎం. రవికృష్ణ నేతృత్వంలోని క్రిటికల్ కేర్ బృందం అక్కడకు వెళ్లి, ఆ 25 ఏళ్ల యువకుడికి ఎక్మో పెట్టి, రోడ్డు మార్గంలో అక్కడి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను క్రిటికల్ కేర్, ఎక్మో విభాగం అధిపతి డాక్టర్ రవికృష్ణ ఇలా తెలిపారు. ‘‘ఈ రోగి ఒక ఇంజినీర్. అతడికి ఉన్నట్టుండి మెదడు, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, కాలేయం.. ఇలా అన్ని అవయవాలూ విఫలం అయ్యాయి. భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రి నుంచి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి కబురు రావడంతో వెంటనే ఇక్కడినుంచి ప్రత్యేక ఎక్మో రిట్రీవల్ బృందం అక్కడకు బయల్దేరింది. వెళ్లగానే ఆ ఆస్పత్రిలోనే ఆ యువకుడికి ఎక్మో పెట్టాం. పోర్టబుల్ ఎక్మో కావడంతో అక్కడినుంచి ఆ మిషన్ ఉంచే 500 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తీసుకొచ్చాం. మధ్యలో ఒక్కసారి మాత్రం రక్తపరీక్షల కోసం తప్ప, మరెక్కడా ఆగలేదు.ఇక్కడకు రాగానే పరీక్షిస్తే.. ఆ యువకుడికి ఊపిరితిత్తులు గాయపడ్డాయని, కార్డియోజెనిక్ షాక్ వచ్చిందని, మెదడులో రక్తస్రావం అయ్యిందని, కాలేయం.. మూత్రపిండాలు విఫలమయ్యాయని తెలిసింది. ఇంత దూరం పాటు తీసుకొచ్చి రోగిని కాపాడడం చాలా పెద్ద సమస్య. ముందుగానే ఎక్మో పెట్టి తీసుకురావడం అతడి ప్రాణాలను కాపాడడంలో మొదటి ముందడుగు అయ్యింది. దానివల్ల అతడికి అవయవాలు ఇంకా విఫలం కాకుండా ఆగాయి. ఇక్కడకు వచ్చిన తర్వాతే అసలు చికిత్స మొదలైంది. ముందుగా అతడికి నైట్రిక్ ఆక్సైడ్ ఇచ్చాం. అది మెదడులోకి వెళ్లకుండానే పనిచేస్తుంది. దీంతోపాటు అతడికి మెదడులో రక్తస్రావం కాకుండా ఉండేందుకు తగిన చికిత్స చేశాం. ఫలితంగా రోగి వెంటనే కోలుకోవడం మొదలైంది. ఐదు రోజులకల్లా రోగికి ఎక్మో సహా అన్నిరకాల పరికరాలూ తీసేశాం. ప్రాణాపాయం నుంచి అతడు బయటపడ్డాడు. ప్రధాన సమస్యలన్నీ తీరిన తర్వాత అప్పుడు పూర్తిస్థాయి పరీక్షలు చేస్తే.. రెండేళ్ల నుంచి అతడికి తీవ్రమైన ఆందోళన, చెమటలు పట్టడం లాంటి లక్షణాలున్నట్లు తెలిసింది. దాంతో.. అతడు ఫియోక్రోమోసైటోమా (పీఎంసీ) అనే అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన సమస్య ఉన్నట్లు తెలిసింది. దానికి కారణం.. అడ్రినల్ గ్రంధిమీద ఏర్పడిన క్యాన్సర్ కణితి. ఈ కణితి వల్ల అతడికి చాలా ఎక్కువగా, నియంత్రణ లేకుండా అడ్రినలిన్ స్రవించడం మొదలైంది. అదికూడా అప్పుడప్పుడు మాత్రమే స్రవించడంతో ముందుగా దీనికి పరీక్షలు చేసినా నెగెటివ్ వచ్చింది. లక్షణాలు మాత్రం ఉన్నట్టుండి చాలా తీవ్రంగా వచ్చాయి. ముందుగా 9 రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జి చేశాం. అతడిని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ శ్రావణి తన్నా పరీక్షించారు. నాలుగు వారాల తర్వాత అతడికి లాప్రోస్కొపిక్ పద్ధతిలో కణితిని తొలగించారు. సీనియర్ ఎనస్థెటిస్టులు డాక్టర్ సోమరాజు, డాక్టర్ అప్పలరాజుల పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్స జరిగింది. అనంతరం పరీక్ష చేసినప్పుడు అది మొదటి దశ క్యాన్సర్ అని తేలింది. దాంతో ఇతర భాగాలకు అది విస్తరించలేదు. ఎలాంటి కారణం లేకుండానే ఇలా బహుళ అవయవాల వైఫల్యం వస్తే ఎలాంటి అరుదైన సమస్యలు కారణం అవుతాయనడానికి ఈ కేసు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్మో పెట్టి చికిత్స చేయడానికి చాలా నైపుణ్యం కావాలి. ఒక రకంగా ఇందులో మెడికల్ డిటెక్టివ్ పని చేయాలి. ఎక్మో పెట్టిన తర్వాత రోగి వేగంగా కోలుకోవడం, కొన్ని మందులు అస్సలు పడకపోవడం లాంటివి ఇందులో కీలకంగా మారాయి. అందువల్ల అతడికి సాధారణ సెప్సిస్ కాకుండా అరుదైన ఎండోక్రైన్ అత్యవసర పరిస్థితి అయ్యి ఉంటుందని ఆలోచించాం. అప్పుడు అందించిన చికిత్సతో అతడు బాగా కోలుకున్నాడు’’ అని డాక్టర్ రవికృష్ణ వివరించారు. -
బీచ్లో కలిశారు.. ‘గ్రీన్ వెడ్డింగ్’తో ఒక్కటయ్యారు
2018.. ముంబయిలో బీచ్ క్లీనింగ్ జరుగుతోంది. చాలామంది యువత కార్యక్రమంలో పాల్గొని ఫొటోలు తీసుకుంటున్నారు. కానీ.. ఓ యువకుడు, యువతి మాత్రం.. నిజాయతీగా బీచ్లో చెత్తను పోగేస్తూ.. మొదటి సారి కలుసుకున్నారు. ‘నా పేరు అశ్విన్ మాల్వాడే.. మర్చంట్ నేవీలో ఫస్ట్ ఆఫీసర్’ అని యువకుడు, ‘నా పేరు నుపూర్ అగర్వాల్.. మార్కెట్ రీసెర్చర్’ అని యువతి ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. మాటలు కలిశాయి.. మనసులు దగ్గరయ్యాయి. పర్యావరణంపై ఉన్న ప్రేమ వారిని మరింత దగ్గర చేసింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక, ఓ స్నేహితుడి వివాహంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార వృథా చూసి చలించిపోయారు. తమ పెళ్లిని పర్యావరణ హితంగా.. ‘గ్రీన్ వెడ్డింగ్’ కాన్సెప్ట్ లో చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అప్పుడే ‘గ్రీన్మైనా’స్వచ్ఛంద సంస్థ రెక్కలు తొడిగింది. తమ పెళ్లి నుంచి మొదలుపెట్టిన గ్రీన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ ను ముంబయితో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించారు. ఇప్పుడు క్రికెట్ మైదానాల్లో చెత్తపై సమరం ప్రారంభించారీ పర్యావరణ జంట. సాక్షి, విశాఖపట్నం: 2019 డిసెంబర్లో అశ్విన్, నుపూర్ పెళ్లి పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా జరిగింది. తమ పెళ్లి వేడుకలు సున్నా కర్బన ఉద్గారాలుగా ఉండాలని వెడ్డింగ్ ప్లానర్లని కోరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో వీరే వెడ్డింగ్ ప్లానర్లుగా మారి.. సమాజానికి సరికొత్త వివాహాన్ని పరిచయం చేశారు. ఆ పెళ్లిలో వాడిన ప్రతి వస్తువూ పర్యావరణ హితమైనదే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేతితో నేసిన కాటన్ దుస్తుల్నే పెళ్లిలో ధరించారు. నుపూర్ తన వెడ్డింగ్ లెహెంగాపై ‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్.. సేవ్ ది ప్లానెట్’అని.. అశ్విన్ ‘క్లైమేట్ క్రైసిస్.. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’అని నినాదాలు రాసి ధరించారు. అలంకరణకు తాజా పువ్వులు, గాజు సీసాలు, పునర్వినియోగం కాగితాలు వాడారు. మట్టి కప్పులు, వెదురు స్పూన్లు ఉపయోగించారు. పెళ్లి పత్రికను సైతం నాటితే మొక్కలు మొలిచేలా విత్తనాలతో తయారుచేశారు. ఊరేగింపునకు ఎలక్ట్రిక్ కారు వాడారు. పెళ్లికి ప్లాస్టిక్ వస్తువులు బహుమతిగా తేవద్దని కార్డులోనే ముద్రించారు. ఇలా జరిగిన అశ్విన్, నుపూర్ వివాహం అందరినీ ఆకట్టుకుంది. ‘గ్రీన్మైనా’ఆవిర్భావం తమ ఇంట్లో పెళ్లి కూడా ఇలాగే చేయాలంటూ చాలా మంది అశ్విన్, నూపూర్ జంటను సంప్రదించారు. తమ పెళ్లి స్ఫూర్తితో, పర్యావరణ హిత వివాహాలను ప్రోత్సహించడానికి వారు ‘గ్రీన్మైనా’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి 2020లో గ్రీన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ని ముంబయికి పరిచయం చేశారు. తర్వాత కోవిడ్ వచ్చినా.. క్రమంగా దేశ వ్యాప్తంగా గ్రీన్ వెడ్డింగ్ కార్యకలాపాలు విస్తరింపజేశారు. ఈ కాన్సెప్ట్తో ఇప్పటివరకు ముంబయి, ఢిల్లీ, రాయ్పూర్, జైపూర్, బెంగళూరు వంటి నగరాల్లో 50కి పైగా వివాహాలు జరిపించారు. 2022లో రాయ్పూర్లో జరిగిన ఓ పెళ్లిలో 1,225 కిలోల తడి చెత్తను, 800 కిలోల ప్లాస్టిక్ను భూమిపైకి రాకుండా కాపాడారు. మిగిలిన ఆహారాన్ని 1,200 మందికి పంచారు. నూతన దంపతులతో 50 చెట్లు నాటించారు. ప్రస్తుతం ఈ సంస్థలో 10 మంది ప్రధాన సభ్యులు ఉండగా.. పదుల సంఖ్యలో వలంటీర్లు చేరారు. మైదాన్ సాఫ్.. క్రికెట్ స్టేడియంలే లక్ష్యంగా.. క్రికెట్ అభిమానులైన ఈ జంట.. ఓ రోజు ముంబయిలో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ను చూసేందుకు వెళ్లారు. అక్కడ మ్యాచ్ల తర్వాత పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను గమనించారు. పారిశుధ్య కార్మికులకు చెత్త విభజనపై అవగాహన లేకపోవడంతో ‘మైదాన్ సాఫ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక మున్సిపాలిటీలు, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లతో మాట్లాడి మైదాన్ సాఫ్ అమలుకు మార్గం సుగుమం చేసుకున్నారు. 2023 ఐసీసీ ప్రపంచ కప్ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఐసీసీ, బీసీసీఐ మద్దతుతో.. కోకా–కోలా ఇండియాతో కలిసి ఇప్పుడు 2025 ఐసీసీ మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ల్లోనూ వ్యర్థాల నిర్వహణ చేస్తున్నారు. నవీ ముంబయి, గౌహతి, ఇండోర్, విశాఖపట్నంలోని స్టేడియాల్లోనే తడి, పొడి చెత్తను వేరు చేసి, పొడి చెత్తను రీసైక్లింగ్కు, తడి చెత్తను కంపోస్టింగ్కు పంపారు. పంపుతు న్నారు. 2030 నాటికి దేశంలో జరిగే పెద్ద కార్యక్రమాలన్నిటినీ వ్యర్థ రహితంగా మార్చడమే తమ లక్ష్యమని గ్రీన్ దంపతులు చెబుతున్నారు.గ్రీన్మైనా ఇంపాక్ట్ ఇదీ గ్రీన్మైనా సంస్థ ద్వారా గ్రీన్ వెడ్గింగ్స్, మైదాన్ సాఫ్ వంటి కార్యక్రమాలతో పర్యావరణంపై అశి్వన్, నుపూర్ దంపతులు గణనీయమైన ప్రభావాన్ని చూపారు. ఆ ఫలితాలను పరిశీలిస్తే.. కర్బన ఉద్గారాల నియంత్రణ 2,39,000 కిలోలు నాటిన మొక్కల సంఖ్య 5,860 ఆహార పంపిణీ(మిగిలిన ఆహారం) 12,000 మందికి పొడి చెత్త రీసైక్లింగ్ 30,750 కిలోలు తడి చెత్త కంపోస్టింగ్ 41,155 కిలోలు -
హైదరాబాద్-విశాఖ విమానం ‘యూటర్న్’
సాక్షి, విశాఖ: మోంథా తుపాను(Cyclone Montha) ప్రభావంతో ఏపీ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రవాణా వ్యవస్థపైన కూడా ప్రభావం చూపింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఇప్పటికే పలు విమాన సర్వీసులు నిలిచిపోగా.. తాజాగా హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ కాకుండానే తిరిగి వచ్చేసింది.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానం బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరింది. ఈ క్రమంలో విశాఖలో ల్యాండింగ్ కావాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ కాలేదు. దీంతో, ఎయిర్పోర్టు అధికారులు విమానాన్ని తిరిగి హైదరాబాద్కు పంపారు. అనంతరం, హైదరాబాద్ విమానం సేఫ్గా ల్యాండింగ్ అయ్యింది. ఈ క్రమంలో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు.. విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. మోంథా తుపాను (Cyclone Montha) ప్రభావం నేపథ్యంలో శంషాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరానికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం నుంచి శంషాబాద్ రావాల్సిన 17 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. రద్దయిన వాటిలో విశాఖపట్నం నుంచి 9, రాజమహేంద్రవరం నుంచి 5, విజయవాడ నుంచి 3 విమానాలు ఉన్నాయి. -
#CycloneMontha : రాకాసి అలలు.. అత్యంత భారీ వర్షాలతో వైజాగ్ అతలాకుతలం (చిత్రాలు)
-
Montha Cyclone: తుఫాన్ నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తం
-
Cyclone Montha: భారీ గాలులతో వర్షం విశాఖలో మొదలైన తుఫాను ప్రభావం
-
ఆర్కే బీచ్లో తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బీచ్ వద్దకు వెళ్లిన ఓ పదో తరగతి విద్యార్థి అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. సముద్రంలో మునిగిపోతుండటం గమనించిన లైఫ్ గార్డులు సురక్షితంగా అతడిని రక్షించారు. సదరు విద్యార్థి సురక్షితంగా బయటకు రావడంతో, కుటుంబ సభ్యులు, అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. విశాఖ ఆర్కే బీచ్లో తప్పిన ప్రమాదం.టెన్త్ విద్యార్థిని అలలకు కొట్టుకుపోగా, లైఫ్ గార్డులు సురక్షితంగా రక్షించారు.#Visakhapatnam #RKBeach pic.twitter.com/sU43mXZcaK— greatandhra (@greatandhranews) October 26, 2025 -
గో'లు'మా'లు'!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంపదను అప్పనంగా దోచిపెడుతోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడలో అత్యంత ఖరీదైన భూములను లులు గ్రూప్నకు అడ్డగోలుగా పంచిపెట్టిన చంద్రబాబు సర్కారు తాజాగా మల్లవల్లి మెగా ఫుడ్పార్కును కూడా రాసిచ్చేసింది! 7.48 ఎకరాల్లో విస్తరించిన మెగా ఫుడ్ పార్క్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ బాధ్యతను లులు గ్రూపు సంస్థ ఫెయిర్ ఎక్స్పోర్ట్ ఇండియాకు కారుచౌకగా అప్పగిస్తోంది. గంటకు ఆరు టన్నుల మామిడి, జామ, టమోటా లాంటి సీజనల్ ఉత్పత్తులను గుజ్జుగా మార్చి ప్యాకింగ్ సామర్థ్యంతో పాటు 4,009 టన్నుల వేర్హౌస్, 3,000 టన్నుల కోల్డ్స్టోరేజ్ సామర్థ్యం ఇక్కడి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కు ఉంది. అలాంటి యూనిట్ను నెలకు రూ.4.16 లక్షలు చొప్పున ఏడాదికి రూ.50 లక్షల అద్దెకు లులు పరం చేసేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణను జియాన్ బేవరేజెస్కి నెలకు రూ.16 లక్షలు చొప్పున ఏడాదికి రూ.1.92 కోట్లు అద్దె చెల్లించేలా ఐదేళ్ల కాలానికి 2023లో అప్పగించింది. అంతేకాదు.. ఏటా 10 శాతం చొప్పున అద్దె పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. రెండేళ్ల తర్వాత కూటమి సర్కారు అదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ను అతి తక్కువ రేటుకు అప్పగిస్తుండంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అద్దె కూడా ఏటా కాకుండా ఐదేళ్లకు ఒకసారి మాత్రమే అది కూడా కేవలం 5 శాతమే పెంచుతామనడం వెనుక ఆరి్థక లావాదేవీలున్నట్లు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐసీసీ)లో చర్చ జరుగుతోంది. ఎక్కడైనా సరే అద్దెలు పెరగడం సాధారమణని, కూటమి సర్కారు మాత్రం ఏకంగా నాలుగు రెట్లు తగ్గించేసి ఖజానాకు భారీగా గండి కొట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాబు సర్కారు నజరానాలపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. విశాఖలో దారుణం.. విశాఖలో వాల్తేరు హార్బర్పార్కు వద్ద బీచ్ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన 13.74 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు లులు గ్రూప్నకు 99 ఏళ్లకు అత్యంత తక్కువ ధరకే లీజుకు ఇచ్చింది. ఏటా కేవలం రూ.7.08 కోట్ల అద్దెపై అప్పగించేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అద్దె కూడా పదేళ్లకు ఒకసారి అది కూడా పది శాతం చొప్పున మాత్రమే పెంచడానికి పచ్చ జెండా ఊపింది. విశాఖలో లులు నిర్మించే షాపింగ్ మాల్ 2028 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. రూ.679.50 కోట్ల విలువైన భూమిని లులుకు అడ్డగోలుగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాన్ని రద్దు చేసి భూమిని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ)కు అప్పగించింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన వెంటనే వీఎంఆర్డీఏ నుంచి భూమిని ఏపీఐఐసీకి అప్పగించి.. ఇప్పుడు లులుకు కట్టబెట్టింది. ఆర్టీసీ భూములు హస్తగతం.. విజయవాడ నడి»ొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్పేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు లులు చేతిలో పెట్టింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.600 కోట్లపైనే ఉంటుంది. జీ+3 విధానంలో లులు ఇక్కడ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనుంది. 99 ఏళ్లు లీజుపై ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇలా విశాఖ, విజయవాడ, మల్లవల్లిలో కలిపి ఇప్పటి వరకు 25.37 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం లులు చేతిలో పెట్టేసింది. -
సాగర తీరాన అద్భుత మాయా ప్రపంచం (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. తీవ్ర తుపానుగా మోంథా
ఆగ్నేయ బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతూ వాయుగుండంగా క్రమక్రమంగా బలపడుతోంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి ఆ తరవాత తుఫాన్ గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే.. బంగాళాఖాతంలో 27 నాటికి తీవ్ర తుఫాన్ మోంథాగా రూపాంతరం చెందనుంది. ఈ ప్రభావంతో గరిష్టంగా గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. మోంథా ప్రభావంతో.. ఏపీ తీరానికి తీవ్ర తుపాను ఉండే అవకాశం ఉందని, ఈనెల 28న కాకినాడ దగ్గర తీరం దాటుందని తెలిపింది. ప్రస్తుతం.. ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్కు పశ్చిమ-నైరుతి దిశలో 420 కి.మీ., విశాఖపట్నంకి పశ్చిమ-నైరుతి దిశలో 990 కి.మీ., చెన్నైకి తూర్పు-ఆగ్నేయంలో 990 కి.మీ., కాకినాడకి ఆగ్నేయంగా 1000 కి.మీ,. గోపాల్పూర్ దక్షిణ-ఆగ్నేయంలో 1040 కి.మీ. కొనసాగుతూ వాయుగుండంగా బలపడుతోంది. ఎల్లుండి ఉదయం నాటికి (27వ తేదీ) నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మీదుగా తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ తుపానుకు థాయ్లాండ్ సూచన మేరకు మోంథాగా(Cyclone Montha) నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ తుపాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణాల్లో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు అప్రమత్తం అవుతున్నాయి. ఉద్యోగులకు సెలవులు రద్దుమోంథా తుఫాన్ హెచ్చరికలతో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే మూడు రోజులు ఎంతో కీలకమని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల ,గ్రామ స్థాయి అధికార యంత్రాంగం హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని.. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. వేటపై నిషేధం విధిస్తూ మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికీ సముద్రంలోకి వెళ్లి ఉంటే ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు రిలీఫ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. ‘‘చెట్లు పడిపోతే వెంటనే తొలగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేసుకోవాలి. విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలి.జనరేటర్లు,డీజిల్ అందుబాటు లో సిద్ధం గా ఉంచుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచాలి’’ అని అన్నారు. తుఫాను వల్ల భారీ వర్షాలు , పెనుగాలులు వచ్చే అవకాశం ఉన్నందున.. తీర ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పల్లపు ప్రాంతాల ప్రజలు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. -
ఏపీకి తుపాను ముప్పు..!
విశాఖ: ఏపీకి తుపాన్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అతాలకుతాలమైన ఏపీలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈనెల 27వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడబోయే తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. రేపటికి(శనివారం, అక్టోబర్ 25వ తేదీ నాటికి వాయుగుండంగా బలబడే అవకాశం ఉందని తెలిపిది. ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈరోజు(శుక్రవారం), రాయలసీమ, దక్షిణ కోస్తాలో బారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్ల తెలిపింది. దాంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హచ్చరించింది. నిండా ముంచిన వాన.. -
విశాఖ అభివృద్ధి గురించి ఆలోచించింది జగనే..
-
Google Data Center: క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్ డాటా సెంటర్ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది అని చెప్పుకొచ్చారు. 2023లోనే డాటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశామని వెల్లడించారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్ అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని యాడ్ ఏజెన్సీలా నడిపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం. వారం, పదిరోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాం. రాష్ట్రంలో పాలనను బాబు గాలికి ఎగిరిపోయింది. ఏదో యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. రాష్ట్ర పరిస్థితి వీక్. వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారు.ఏపీలో 2020లో కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం. 2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్కు శంకుస్థాపన కూడా చేశాం. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది. వైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్ డాటా సెంటర్ ఇది. వేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్. వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్ని నిర్మిస్తున్నాయి. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని అన్నారు.అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ వైజాగ్కి రాబోతోంది. వైఎస్సార్సీపీ వేసిన విత్తనమే ఇది. వేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయ్. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్. అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్ని నిర్మిస్తున్నాయి. ఇందుకు సంబంధించి.. ఐటీ సెక్రటరీ భాస్కర్కు గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారు. చంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. వైఎస్సార్సీపీకి ఆ ఘనత దక్కుతుందనే.. బాబు ఆ పని చేయడం లేదు’ అని తెలిపారు. ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్.. గూగుల్ డేటా సెంటర్ను నిర్మించేది అదానీనే. జగన్ సర్కార్ వల్లే డేటా సెంటర్ వచ్చిందని చెప్పలేకపోయారు.క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. బాబును చూసి గూగుల్ వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. డేటా సెంటర్తో ఉద్యోగాలు పెద్దగా రావు. కానీ, ఎకో సిస్టమ్ బిల్డు అవుతుంది. భవిష్యత్లో పెద్ద మార్పులకు డేటా సెంటర్ కీలకం. డేటా సెంటర్తో పెద్దగా ఉద్యోగాలు రావు కాబట్టి.. ఐటీ పార్క్, రిక్రేయేషన్, స్కిల్ సెంటర్ పెట్టాలని ఆలోచన చేశాం. 25వేల మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ఒప్పందం కూడా చేశాం. ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్’ అని సెటైర్లు వేశారు. -
Gudivada: తండ్రిని అడ్డం పెట్టుకొని నీలా మంత్రిని అవ్వలేదు కష్టబడి నిలబడి మంత్రిని అయ్యా..
-
గూగుల్తో ఆ మాట చెప్పిస్తే సన్మానం చేస్తాం: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్లో గూగుల్ డాటా సెంటర్ రాకతో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కూటమి ప్రభుత్వం, దాని అనుకూల మీడియా.. సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. వాస్తవానికి విరుద్ధంగా ఉన్న ఈ ప్రచారంపై క్లారిటీ ఇవ్వకపోగా.. గత వైఎస్సార్సీపీ పాలనపై, ఆ పార్టీ నేతలపై ఐటీ మంత్రి నారా లోకేష్ నిందలు వేస్తున్నారు. అయితే వాటికి మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ (Gudivada Amarnath on Google Data Center Jobs)ఇచ్చారు. శుక్రవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గూగుల్తో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు కదా. ఆ మాట గూగుల్తోనే చెప్పించండి. కనీసం ఆ సంస్థతో ఓ అధికారికి ప్రెస్నోట్ అయిన రిలీజ్ చేయించండి. అది నిజమని తెలిస్తే మేమే సన్మానం చేస్తాం.... గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం, ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లోకేష్ మీడియా ముఖంగా ప్రజల అనుమానాలకు సమాధానం చెపుతారు అని భావించాను. కానీ ఆ డేటా సెంటర్ను మా పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దీనిని స్వాగతిస్తున్నట్లు తొలిరోజే వైఎస్సార్సీపీ చెప్పింది. అయితే.. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాయని, ఎంత రెవెన్యూ రాష్ట్రానికి వస్తుందని మాత్రం అడిగాం. అందులో తప్పేముంది?.... 1 గిగా వాట్ డేటా సెంటర్ ద్వారా గూగుల్ ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తుంది?. గూగుల్ డేటా సెంటర్ వలన 200 మందికి ఉద్యోగాలు వస్తాయని ఈనాడు పేపర్ లో వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ లో ఉన్న ఉద్యోగులు 1.88 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో 1.88 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు చెపుతున్నారు. ఆ రెండింటికీ చాలా తేడా ఉంది కదా. అయినా ఉద్యోగాల గురించి లోకేష్, టీడీపీ నేతలు కాదు చెప్పాల్సింది. ఆ మాట ఆ సంస్థ చెప్పాలి. అసలు గూగుల్తో సమాధానం చెప్పించడానికి ఐటీ మంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంటి?. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నన్ను గుడ్డు అన్నా.. నేను లోకేష్ను పప్పు అన్నా.. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు.ముందు ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలి. మాయ మాటలతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయొద్దు. కష్టపడి పోరాటం చేసి జగన్ ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చాను. ఎవరో డబ్బులు కడితే చదువుకోలేదు(లోకేష్ను ఉద్దేశించి..). విశాఖ నగరానికి ఏడాదికి ఐదు టీఎంసీల నీళ్లు అవసరం. గూగుల్ డేటా సెంటర్కు ఏడాదికి మూడు టీఎంసీల నీళ్లు అవసరం, ఎలా సర్దుబాటు చేస్తారు?. డేటా సెంటర్ వలన ఒకటి నుంచి రెండు సెంటిగేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది అని మేధావులు చెబుతున్నారు. దాని మీద ఏమైనా స్టడీ చేశారా?. ఒక రోజు మొత్తానికి విశాఖ నగరంకు ఎంత కరెంట్ అవసరమో, గూగుల్ డేటా సెంటర్ కు ఒక గంటకు అంత కరెంట్ అవసరం అవుతుంది. రామాయపట్నం, బందరు మూలపేట, భోగాపురం ఎయిర్ పోర్టు, NTPC గ్రీన్ ఎనర్జీ దగ్గర నేను నిలబడి మా హయంలో వచ్చింది అని చెప్పగలను. నువ్వు మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తెచ్చావు నేను మంత్రి ఎన్ని పరిశ్రమలు తెచ్చావు కూర్చొని రాసుకుందాం రా?.. నారా లోకేష్ ఈ రాష్ట్రానికి మంత్రిగా ఏం తెచ్చారు.. ఏ ప్రయోజనం చేకూర్చారు. నువ్వు మంత్రిగా ఏమి చేశావో చెప్పగలవా.. అమరావతి రోడ్లు తప్ప. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే లోకేష్ భరించలేరు. వర్ధంతి జయంతికి తేడా తెలియని వ్యక్తి కూడా మాట్లాడుతున్నారా?. ఆయనలా నేను ఎవరి దగ్గర స్క్రిప్ట్ తీసుకొని చదవను. ట్రోలింగ్కు జాతి పితా లోకేష్ అని ఎద్దేశా చేశారు. వ్యక్తిగత విమర్శలు ఇకనైనా మానుకోవాలి’’ అని గుడివాడ అమర్నాథ్ లోకేష్కు హితవు పలికారు. ఇదీ చదవండి: కల్తీ మద్యం కేసు.. కమీషన్ మాట్లాడుకుందామా? -
డీఆర్వోకి పప్పు..ఉప్పు..కొనివ్వాల్సిందే..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) క్యాంపు కార్యాలయానికి అవసరమైన చింతపండు, పసుపు, గోధుమపిండితోపాటు ఫెయిర్ అండ్ లవ్లీ క్రీములు, బట్టల క్లిప్పులు ఇలా అన్ని కొనివ్వాల్సిందే. ఈ భారమంతా నా పరిధిలోని తహసీల్దారు కార్యాలయాలపై పడుతోంది. ప్రతి నెలా రూ.20 వేల విలువైన కిరాణా సామగ్రి పంపాల్సి వస్తోంది. అంతేకాకుండా శ్రీకాకుళంలోని డీఆర్వో కుటుంబానికి కూడా ప్రతి నెలా కిరాణా సామగ్రి పంపాల్సి వస్తోంది. గాజువాక, పెందుర్తి తహసీల్దారు కార్యాలయ సిబ్బందిపై ఈ భారాన్ని మోపుతున్నారు. దీనిపై విచారణ చేసి ఆ ఖర్చు పడకుండా చూడండి’ అంటూ కలెక్టరుకు విశాఖపట్నం ఆర్డీవో శ్రీలేఖ లేఖ రాయడం సంచలనమైంది. ప్రతి నెలా ఈ భారాన్ని మోపకుండా చూడాలంటూ కలెక్టరును అభ్యర్థించిన ఆమె.. దీని ప్రభావంతో రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడటం ద్వారా ప్రజల్లో చులకన అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ∙సీతమ్మధార, పద్మనాభం మండలాల పరిధిలోని రెవెన్యూ సిబ్బందిపై కూడా ఇదే తరహాలో ఉప్పు, పప్పు భారం మోపుతున్నట్టు ఆమె ఆరోపించారు. రెవెన్యూశాఖ ఉన్నతాధికారి కావడంతో సిబ్బంది ఏమీ అనలేకపోతున్నారని... ఈ కారణంగా సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారని శ్రీలేఖ పేర్కొన్నారు. అయితే దీనిపై కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. శ్రీకాకుళానికి కిరాణా సామగ్రి ప్రతి నెలా డీఆర్వో క్యాంపు కార్యాలయానికి అవసరమైన కిరాణా సామగ్రి ఖర్చు రూ.20 వేల వరకూ అవుతోందని తాను సేకరించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ఆర్డీవో తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా డీఆర్వో భవానీశంకర్ కుటుంబం ఉంటున్న శ్రీకాకుళానికి కూడా పంపాల్సి వస్తోందంటూ పేర్కొనడం గమనార్హం. కేజీ చింతపండు, కేజీ పసుపు కొమ్మలు, కిరాణాతోపాటు ఫెయిర్ అండ్ లవ్లీ క్రీములు, బట్టల క్లిప్పుల ఖర్చు భారం రెవెన్యూ సిబ్బందిపై వేస్తున్నారంటూ తన లేఖలో ఆరోపించడం గమనార్హం. రెవెన్యూశాఖ పరిధిలో డీఆర్వో ఉన్నతాధికారి కావడంతో.... రెవెన్యూ సిబ్బందిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని ఆమె పేర్కొన్నారు. తద్వారా కిందిస్థాయి రెవెన్యూ సిబ్బందిలో అవినీతి పెరిగిపోయేందుకు కూడా ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.విచారణ జరపండి.. డీఆర్వో క్యాంపు ఖర్చుల భారం తన పరిధిలోని పెందుర్తి, గాజువాక రెవెన్యూ సిబ్బందితో పాటు సీతమ్మధార, పద్మనాభం మండలాల పరిధిలోని రెవెన్యూ సిబ్బందిపై కూడా పడుతున్నట్టు పేర్కొన్నారు. క్యాంపు ఖర్చులకు సంబంధించిన బిల్లులన్నీ చేతితో రాసినవే ఉన్నాయని... కంప్యూటర్ బిల్లులు మాత్రం తన వద్ద లేవని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కలెక్టరుకు విన్నవించారు. తన పరిధిలోని తహసీల్దారు కార్యాలయ సిబ్బంది నుంచి డీఆర్వో క్యాంపు ఖర్చుల భారం పడకుండా చూడాలని కూడా ఆమె తన లేఖలో కలెక్టరును కోరారు. ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఈ లేఖపై కలెక్టర్ విచారణకు ఆదేశిస్తారా? లేఖ రాసిన ఆర్డీవోపై చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఇద్దరి మధ్య కోల్డ్వార్ వాస్తవానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో లోలోపల వివాదాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. డీఆర్వో భవానీశంకర్, ఆర్డీవో శ్రీలేఖల మధ్య కొంత కాలంగా పలు వ్యవహారాల్లో కోల్డ్ వార్ నడుస్తోందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఇరువురూ ఉప్పు–నిప్పుగా వ్యవహరిస్తున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. తాజాగా కలెక్టర్కు రాసిన లేఖతో వీరువురి మధ్య వివాదం కాస్తా ముదురు పాకాన పడినట్టు తెలుస్తోంది. -
చౌకగా వెండి ఇలా కొంటే రూ. 14 వేలు ఆదా! వైరల్ ట్వీట్
వెండి, బంగారం మాట ఎత్తాలంటేనే బెంబేలెత్తేపరిస్థితి. ఊహించని రీతిలో పెరిగి ఆకాశా న్నంటాయి. సామాన్య మానవులే కాదు, ధనవంతులు కూడా గోరెడు బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి. మరీ వెండి ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో ఎక్స్లో ఒక ట్వీట్వైరల్గా మారింది. దేశంలోని పలు నగరాల్లోని వెండి ధరల అంతరాలపై ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. దీని కథా కమామిష్షు ఏమింటే..ఫుడ్ కంటెంట్ క్రియేటర్ నళిని ఉనగర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. ఆమె ఏమంటుంది అంటే.. అక్టోబరు 14 నాటికి వెండి ధరలు పోలుస్తూ ఈ రైలు ప్రయాణం ద్వారా మీకు రూ.14వేల ఆదా చేసుకోవచ్చు ట్వీట్ చర్చకు దారితీసింది. ఆమె లెక్క ఆన్లైన్లో అటు వ్యాపారులు , ఇటు సాధారణ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది.అక్టోబర్ 14న దేశంలోని రెండు భారతీయ నగరాల్లో 1 కిలో వెండి ధర ఇలా ఉన్నాయిఅహ్మదాబాద్: రూ. 1,89,000విశాఖపట్నం: రూ. 2,06,0001 kg Silver Price- Ahmedabad: ₹1,89,000- Visakhapatnam: ₹2,06,000Return Train (Ahmedabad → Visakhapatnam): ₹2,000Gross Profit: ₹17,000Tax: ₹510Net Profit: ₹14,490 (per trip, ~3 days)If repeated 3–4 times a month, total monthly profit ≈ ₹43,000 – ₹58,000— Nalini Unagar (@NalinisKitchen) October 14, 2025 రెండు నగరాల మధ్య రైలు టికెట్ ధర దాదాపు రూ. 2,000. అంటే తక్కువగా ఉన్న నగరంలో వెండిని కొనుగోలుచేస్తే ప్రయాణ ఖర్చులు , ప్రాథమిక పన్నులు తరువాత ట్రిప్కు సుమారు రూ. 14,490 నికర లాభం ఉంటుందని అంచనా వేసింది. అంటే నెలకు 3–4 సార్లు చేస్తే చాలు రూ. 43వేల నుంచి రూ. 58వేలకు సంపాదించవచ్చు అని ఆమె పేర్కొంది.చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్దీనిపై భిన్న స్పందనలు వినిపించాయి. ఈ రేటులో భారీ వ్యత్యాసం ఉంది. కొనుగోలు ధర రూ. 2 లక్షలు అయితే, అమ్మకపు ధర రూ. 1.8 లక్షలు. కాబట్టి, మీరు అహ్మదాబాద్లో రూ. 1.89 లక్షలకు కొనుగోలు చేసినప్పటికీ, అదే ధరకు ఇక్కడ విక్రయించలేరు కదా ఒకరు ప్రశ్నించారు. సాధారణంగా వెండి ధరల్లో అంత తేడా ఉండదు. ( మరీ 17 వేలంత). ధరలు జాతీయంగా నియంత్రించబడతాయి. పైగా వెండిపై GST 3శాతం జీఎస్టీ. లాభాల్లో జీఎస్టీ భారం ఉంటుంది. పైగా మీరు రిజిస్టర్డ్ GST డీలర్ అయి ఉండాలి, చెల్లుబాటు అయ్యే ట్యాక్స్ ఇన్వాయిస్, ఇ-వే బిల్లును కలిగి ఉండాలి కాబట్టి మీ మరింత పన్నుభారం తప్పదు. పైగా వెండి ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. కాబట్టి విశాఖపట్నం చేరుకునే సమయానికి, ధర తగ్గితే, లాభం కాస్త నష్టంగా మారవచ్చు కదా అంటే కమెంట్ చేశారు. మీ "లాభం" నష్టంగా మారుతుంది. అయితే బులియన్ మార్కెట్లు, ధరలు స్థానిక డిమాండ్-సరఫరా, లాజిస్టిక్స్ ఖర్చులు, రాష్ట్ర పన్నులు ,డీలర్ మార్జిన్లు వంటి అంశాల కారణంగా ఈ తేడాలుంటాయనేది గమనించాలంటున్నారు బులియన్మార్కెట్ నిపుణులు.ఇదీ చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..! -
విశాఖలో 70 కోట్ల భూమి.. పిఠాపురం వర్మ కుమారుడి పేరుతో స్వాహా
సాక్షి, తగరపువలస: విశాఖ జిల్లా భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీలో సుమారు రూ.70 కోట్ల విలువైన ఆరు ఎకరాల 69 సెంట్ల భూమిని తమకు తెలియకుండా తప్పుడు పత్రాలతో జీపీ రాయించుకున్నారని ఈ భూమి వారసులు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ కుమారుడు ఎస్వీఎస్ గిరీష్ ఈ జీపీ చేయించుకున్నారని ఈ భూమి వారసులైన దంతులూరి సుజాత, కలిదిండి నరేంద్రవర్మ, బుద్ధరాజు వరలక్ష్మి శనివారం మీడియాకు తెలిపారు.ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. 13.2, 14.1, 15.1, 15.4, 15.5, 15.6, 15.8, 92.2, 93.1 తమ భూమి సర్వే నెంబర్లని చెప్పారు. అయితే, దంతులూరి రామకృష్ణరాజు కుమారుడు నారాయణరాజు వారసుల్లో ఒకరైన పకీరురాజు, మిగిలిన వారసులకు తెలీకుండా, ఆయనొక్కడే వారసుడినని చెప్పుకుని మోసపూరితంగా పాసు పుస్తకాలు, 1బీ సృష్టించి, 2023 అక్టోబరులో గిరీష్కు జీపీ ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తాళ్లవలస టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు డీఏఎన్ రాజు, పూసపాటి గోపాలమూర్తి రాజు సహకరించారని బాధితులు వివరించారు.దొడ్డిదారిన ఎల్పీ, నాలా అనుమతులు.. ఈ మోసాన్ని తాము గుర్తించి భీమిలి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, వీఎంఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు వాపోయారు. రెండేళ్లుగా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా పకీరు ఒక్కడే వారసుడు అనడానికి సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు ఇవ్వలేదన్నారు. ఈ భూములపై జిల్లా కోర్టులో ఓఎస్ 115/2025 కేసు రిజిస్టర్ అయి, ఆర్ఓఆర్ పిటిషన్పై విచారణ జరుగుతున్నప్పటికీ, జీపీ పొందిన టీడీపీనేత గిరీష్ దొడ్డిదారిన ఎల్పీ, నాలా అనుమతులు పొందాడని ఆరోపించారు.ఈనెల 5 నుంచి గిరీష్ తన మనుషులతో వచ్చి వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చే ప్రయత్నాలు రాత్రింబవళ్లు చేస్తున్నారని తెలిపారు. గిరీష్ అధికార టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో అధికారులు తమకు న్యాయం చేయడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు ప్రాణహాని ఉందని, ఇటీవల కారుతో తొక్కించి తమను అంతమొందించేందుకు కూడా యత్నించారని బుద్ధరాజు వరలక్ష్మి, ఆమె భర్త రామకృష్ణ రాజు ఆరోపించారు. తప్పుడు పత్రాలతో జీపీ చేసిన వారిపైనా, చేయించుకున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. -
జెడ్ ప్లస్ సెక్యూరిటీ తెలియదా?.. సీపీ హుందాగా మాట్లాడాలి: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో విశాఖ సీపీ వ్యాఖ్యలపై అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ జగన్ జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారనే విషయం సీపీకి తెలియదా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీలపై తమ విధానం ఏంటో మరోసారి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనేది వైస్ జగన్ విధానం. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు. ఉచితంగా ఇవాల్సిన మెడికల్ సీటును పీపీపీ పద్ధతిలో 66 లక్షలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి విద్యార్ధులకు ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకమని జగన్ చెప్పారు.చిరు వ్యాపారులు తమ కష్టాన్ని జగగ్కు చెప్పుకున్నారు. గోవాడ రైతులు ఫ్యాక్టరీ దుస్థితిని జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షుగర్ ఫ్యాక్టరీకి 89 కోట్లు సహాయం చేశారు. రైతులకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు జగన్ను కలిసి తమ వేదన చెప్పుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారమే బల్క్ డ్రగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తన పర్యటనలో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్న పిల్లలను పరామర్శించారు. చనిపోయిన వారికి ఐదు లక్షలు పరిహారం పార్టీ తరపున అందించారు అని తెలిపారు.అలాగే, వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారు. పర్యటనకు ప్రజలు రాకుండా అడ్డుకోవాలని చూశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా భారీ స్థాయిలో ప్రజలు వచ్చారు. విశాఖ నగర కమిషనర్ చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి. సీపీ హుందాగా మాట్లాడాలి. మాజీ సీఎం జగన్ జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్నారనే సంగతి సీపీకి తెలియదా?. వైఎస్ జగన్ను ఉద్దేశించి ఎమ్మెల్యే అంటూ సీపీ మాట్లాడడం సరికాదు. తన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి. ఎమ్మెల్యేకు అయితే ఎందుకు మూడువేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు?’ అని ప్రశ్నించారు. -
మీ అభిమానం సల్లగుండా.. జగనన్న కోసం ఏం చేశారో చూడండి (చిత్రాలు)
-
చిట్టితల్లులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
జడివానలో.. జన ఉప్పెన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, సాక్షి, అనకాపల్లి: సాగర తీరంలో జన ఉప్పెన ఎగసిపడింది. ఉత్తరాంధ్ర పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా, బెదిరింపులకు పాల్పడినా వెరవకుండా సంక్షేమ సారథికి తోడుగా జనవాహిని ఉప్పొంగింది. మండుటెండలో గంటల తరబడి నిరీక్షించి ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. మధ్యాహ్నం తర్వాత జోరు వర్షంలోనూ అదే జోరు కొనసాగింది. పూల వర్షాలు, హారతులు, గజ మాలలతో బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా నీరాజనంవిశాఖ విమానాశ్రయం నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన గోపాలపట్నం, పెందుర్తి, అనకాపల్లి మీదుగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వరకు సాగింది. 63 కిలోమీటర్ల దూరానికి సాధారణంగా గంటన్నర పడుతుంది. కానీ జనహోరులో వైఎస్ జగన్ పర్యటనకు 6 గంటలకు పైగా పట్టింది. గోపాలపట్నం వద్ద ప్రారంభమైన జన యాత్ర మాకవరపాలెం మెడికల్ కళాశాలకు చేరేసరికి సాగరాన్ని తలపించింది. వేపగుంట వద్ద పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు జగన్ను చూసేందుకు పోటెత్తారు. సుజాతనగర్, చినముషిడివాడలో కూడా పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. పెందుర్తి జంక్షన్ నుంచి పినగాడి జంక్షన్ వరకూ ఆత్మీయ నేతతో కరచాలనానికి పోటీ పడ్డారు. అక్కడి నుంచి జాతీయ రహదారిపై సబ్బవరం మీదుగా అనకాపల్లిలో కొత్తూరు జంక్షన్కు చేరుకున్నారు.జోరు వానలోనూ..అనకాపల్లి నుంచి జన ప్రవాహం జగన్ కాన్వాయ్ను ముందుకు కదలనీయకుండా చేసింది. ఆ సమయంలో భారీ వర్షం పడినా వెనక్కు తగ్గలేదు. కొత్తూరు జంక్షన్ నుంచి కశింకోట మీదుగా.. తాళ్లపాలెం వరుకూ జనాలతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు కుండపోతగా వర్షం పడుతున్నప్పటికీ.. తడుస్తూనే జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నర్సీపట్నంలోకి ప్రవేశించాక జై జగన్ నినాదాలు మిన్నంటాయి. వై.భీమవరం, కన్నూరుపాలెం మీదుగా సాయంత్రానికి మాకవరపాలెం మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. రాత్రి నుంచి అక్కడే బస..వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో మాకవరపాలెం మెడికల్ కళాశాల ప్రాంగణానికి గురువారం వేకువజామునే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. ముందురోజు సాయంత్రం నుంచి పోలీసులు బెదిరిస్తున్నా వెనుకంజ వేయలేదు. కొందరు ముందురోజు రాత్రే చేరుకుని అక్కడే నిద్రించారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు 12 గంటల పాటు ఎండ, వాన, తిండి పట్టించుకోకుండా వేచి చూశారు. వైఎస్ జగన్ మెడికల్ కళాశాల ప్రాంగణం వద్దకు రాగానే కేరింతలు కొట్టారు. ఆంక్షలు ఛేదించుకునిఒకవైపు పోలీసుల బారికేడ్లు.. ఆటోవాలాలకు బెదిరింపులు... అర్ధరాత్రి నుంచే పోలీస్ దిగ్భందంలో మెడికల్ కాలేజీ రోడ్డు..! ఇలా వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు ఎన్ని ఆంక్షలు పెట్టినా జనం హోరు ముందు తుస్సుమన్నాయి. జగన్ కాన్వాయ్ సాగిన ప్రతి జంక్షన్ జన హోరుతో దద్ధరిల్లిపోయింది. జోరు వర్షంతో పాటు ప్రజల అభిమానంతో తడిసి ముద్ద కావడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ 65 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణాన్ని ఏకంగా 6 గంటల పాటు ఎడతెరపి లేకుండా సాగించాల్సి వచ్చింది. ఉత్తరాంధ్రలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని చంద్రబాబు సర్కారు మొదటి నుంచీ తీవ్రంగా యత్నించింది. అందులో భాగంగా మొదట రోడ్డు మార్గానికి అనుమతిచ్చేది లేదని అటు అనకాపలి ఎస్పీ, ఇటు విశాఖ పోలీసు కమిషనర్ల ద్వారా చెప్పించారు. అవసరమైతే హెలికాప్టర్ ద్వారా వెళ్లాలంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతుందని... రోడ్డు మార్గంలోనే వస్తారని పార్టీ నేతలు తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వం చివరకు రోడ్డు మార్గం రూట్ మార్చి పర్యటనకు అనుమతించింది. అయితే ఇందుకోసం ఏకంగా 18 షరతులను విధించింది. ఇక ఆటోవాలాలను పిలిపించి జగన్ పర్యటనకు జనాలను తరలిస్తే కేసులు పెడతామంటూ పోలీసుల ద్వారా బెదిరించింది. మరోవైపు ఎక్కడికక్కడ రాత్రికి రాత్రి బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాత్రి నుంచే కార్లు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారిని ఎక్కడికక్కడ అడ్డగించి ఆరా తీశారు. ఎక్కడకు వెళుతున్నారంటూ సవాలక్ష ప్రశ్నలు వేశారు. అయినప్పటికీ వైఎస్ జగన్ వచ్చే సమయానికి ఎక్కడికక్కడ జనంతో జంక్షన్లన్నీ నిండిపోయాయి. ఆర్టీసీ బస్సుల్లో కొందరు... నడుచుకుంటూ మరికొందరు.... పోలీసుల కళ్లుగప్పి.... పొలాల్లో నడిచి, బైకులపై వచ్చి చివరకు తమ అభిమాన నేత వద్దకు చేరుకున్నారు. ఫలితంగా 65 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు ఏకంగా 6 గంటలకుపైగా సమయం తీసుకుందంటే జనవాహిని ఎలా ఉందో పరిస్థితిని ఊహించుకోవచ్చు. మొత్తంగా అటు పోలీసుల లెక్కలకు మించి ఇన్ని ఆంక్షల మధ్య కూడా ప్రభంజనంలా జనం తరలిరావడంతో చేసేదేమీ లేక చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. -
‘ఉక్కు’ సంకల్పంతో అండగా ఉంటాం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉక్కు సంకల్పంతో ఎప్పుడూ అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. గురువారం నర్సీపట్నం పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్న వైఎస్ జగన్ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. ప్లాంట్ను ఎలాగైనా కాపాడాలని కోరారు. కాకానినగర్ వద్ద వారంతా వైఎస్ జగన్ కోసం నిరీక్షించి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ, కార్మిక సంఘం నాయకులతో మాట్లాడిన వైఎస్ జగన్ తాజా పరిణామాల గురించి చర్చించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి మోసం చేస్తోందని వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంత వరకూ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో విభాగాన్ని ప్రైవేట్పరం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. స్టీల్ ప్లాంట్పై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం.. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకంగా గనులు కేటాయించడం.. సెయిల్లో విలీనం చేయడంతో పాటు సంస్థలో తొలగించిన ఉద్యోగులను తిరిగి వి«ధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్లతో పోరాటం చేస్తున్నామని కార్మిక సంఘాల నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. సంఘటితంగా పోరాడదాం.. స్టీల్ ప్లాంట్ కార్మికుల విన్నపాలపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. వారి ప్రతి డిమాండ్ని పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం ఎదుట ఉంచుతామని హామీ ఇచ్చారు. తాము అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా.. ఎప్పుడూ తమ వైఖరి ఒక్కటేనని, స్టీల్ప్లాంట్ను కాపాడుకోవడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. వైఎస్సార్సీపీ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని, ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదన్నదే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఆ దిశగా నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అన్ని డిమాండ్లపైనా కలసికట్టుగా పోరాటం చేద్దామని వారికి గట్టి భరోసా ఇచ్చారు. -
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: వైఎస్ జగన్
విశాఖ: నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం పాఠశాల విద్యార్థులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. గురువారు(అక్టోబర్ 9వ తేదీ) అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటనల సందర్భంగా కేజీహెచ్లోని పచ్చకామెర్ల బాధిత విద్యార్థులను వైఎస్ పరామర్శించారు. పచ్చకామెర్ల బారిన పడ్డ బాధిత విద్యార్థులతో వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్ బయట మీడియాతో మాట్లాడారు. మీడియాను కేజీహెచ్ ప్రాంగణంలోకి అనుమతి నిరాకరించడంతో బయట మీడియాతో మాట్లాడారు వైఎస్ జగన్. ‘170 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు వచ్చాయి. పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి. స్కూళ్లు, హాస్టల్స్లో బాత్రూమ్లను శానిటేషన్ చేయాలి. ఒకే స్కూల్ నుంచి 65 మంది విద్యార్థులు కేజీహెచ్లో చేరారు. కురుపాం నుంచి 200 కి.మీ దూరంలో కేజీహెచ్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి కేసులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పార్వతీపురంలో ఆస్పత్రి నిర్మాణం ఆపకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కలుషిత నీటి వల్లే పిల్లలకు ఈ పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. 170 మంది పిల్లలకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి. ఇప్పటికైనా వాటర్ ప్లాంట్ను రిపేర్ చేయించాలి. పిల్లల తరఫున మేం మెడికో లీగల్ కేసు వేస్తాం. వైఎస్సార్సీపీ తరఫున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం అందజేస్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే.. పేదవారికి వైద్యం ఎలా అందుతుంది?’ -
జగన్ పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం
అనకాపల్లి జిల్లా : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడింది. మాకవరపాలెం మెడికల్ కాలేజీలో పోలీసుల పనితీరు దారుణంగా ఉంది. ఏకంగా జగన్ కార్వాన్ మీదకు జనం ఎక్కినా పోలీసులు పట్టించుకోలేదు. జనం ఇలా కార్వాన్ మీదకు ఎక్కినా పోలీసులు మాత్రం చోద్యం చూశారు. ఈ పర్యటనలో మధ్మాహ్నం నుండి వర్షంలో తడుస్తూ వచ్చారు వైఎస్ జగన్. కార్వాన్ లోపలికి వెళ్లి దుస్తులు మార్చుకునేందుకు కూడా వైఎస్ జగన్ అవకాశం లేకుండా పోయింది. జనాన్ని అదుపు చేయకుండా వదిలేశారు ఖాకీలు. ప్రెస్మీట్ సమయంలోనూ గ్యాలరీలోకి జనాన్ని పంపారు పోలీసులు. దాంతో జగన్ మాట్లాడే సమయలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసుల కారణంగా అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. కొందరు ఖాకీలు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడింది. మరొకవైపు వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ కావడంతో పార్టీ కేడర్లో ఫుల్జోష్ నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం -
‘టీడీపీ కండువాలు వేసుకో.. సీఐని సస్పెండ్ చేయాల్సిందే’
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని పోలీసు స్టేషన్ను టీడీపీ కార్యాలయంగా మార్చిన కూడేరు సీఐ రాజును సస్పెండ్ చేయాలని వైఎస్సార్సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ కండువాలు వేసుకుంటేనే ఫిర్యాదు తీసుకుంటానని చెప్పటం హేయమైన చర్య అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై సీఐ రాజు వేధింపులకు పాల్పడుతున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ తొత్తుగా కూడేరు సీఐ రాజు వ్యవహరిస్తున్నారు. టీడీపీ కండువాలు వేసుకుంటేనే ఫిర్యాదు తీసుకుంటానని చెప్పటం హేయమైన చర్య. కూడేరు సీఐ రాజు ఖాకీ చొక్కా తీసేసి పచ్చ చొక్కా వేసుకుంటే మంచిది. మంత్రి పయ్యావుల కేశవ్ వర్గీయులు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు.ఉరవకొండ నియోజకవర్గంలోని సీఐ, ఎస్ఐలకు ముడుపులు ఇస్తున్నారు. మంత్రి పయ్యావుల లంచాలకు అలవాటు పడ్డ సీఐ రాజు.. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూడేరు సీఐ రాజుపై ఎస్పీ, డీఐజీకి ఫిర్యాదు చేస్తాం. కూడేరు సీఐ రాజును వెంటనే సస్పెండ్ చేయాలి’ అంటూ విమర్శలు చేశారు. చదవండి: పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా.. -
జగన్ పర్యటనలపై కక్ష సాధింపు: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాజకీయ పార్టీలకు ఉండే హక్కులను హరిస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కక్ష సాధిస్తోంది. విశాఖ ఎయిర్పోర్టు మొదలుకుని ప్రతీ చోటా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మాజీ సీఎం కాన్వాయ్ వెనుక పార్టీ నాయకుల వాహనాలను అనుమతించడం లేదు. ప్రతీ చోటా ఆంక్షలు, నియంత్రణలు పెడుతున్నారు. అనకాపల్లి నుంచి మాకవరపాలెం వరకూ ప్రజలెవ్వరినీ రానివ్వడం లేదు.ప్రజలను అడ్డుకునేందుకు దాదాపు మూడు వేల మంది పోలీసులను పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. రాజకీయ పార్టీలకు ఉండే హక్కులను హరిస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ప్రజా సమస్యలపై గలమెత్తితే సహించలేని పరిస్థితి కూటమి నేతలతో ఏర్పడింది. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు అని ఘాటు విమర్శలు స్తున్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. తమ సమస్యలపై కార్మికులు.. వైఎస్ జగన్కు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ వారితో మాట్లాడారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే స్టాండ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోం. స్టీల్ప్లాంట్ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశాం, ప్రధానికి లేఖలు రాశాం. స్టీల్ప్లాంట్పై పార్లమెంట్లోనూ ప్రశ్నిస్తాం అని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్ జగన్కు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్కు రావాలని వైఎస్ జగన్ను ఆహ్వానించాం. స్టీల్ ప్లాంట్కు వచ్చి మద్దతిస్తానని హామీ ఇచ్చారు. మాకు మద్దతు ఇచ్చిన వైఎస్ జగన్కు కృతజ్ఞతలు. మరోవైపు.. విశాఖలో వైఎస్ జగన్ను కలిసేందుకు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు వచ్చారు. నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు విశాఖకు తరలి వచ్చారు. ఈ క్రమంలో జి.భీమవరం వద్ద పోలీసులు.. మత్స్యకారులను అడ్డుకున్నారు. వైఎస్ జగన్ను కలిసేందుకు అనుమతి లేదన్నారు. దీంతో, ఎలాగైనా వైఎస్ జగన్ను కలిసి తీరుతామని మత్స్యకారులు తెలిపారు. అనంతరం, కూటమి నేతలను నమ్మి ఓటు వేసినందుకు తమను నిలువునా మోసం చేశారని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలు తమకు వద్దని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. -
సఫారీతో సవాల్కు భారత్ సై
శ్రీలంకతో మ్యాచ్లో 124/6... పాకిస్తాన్తో మ్యాచ్లో 159/5... అదృష్టవశాత్తూ ఈ రెండు సందర్భాలను అధిగమించి భారత జట్టు విజయాన్ని అందుకుంది. అయితే అవి రెండూ మనతో పోలిస్తే సహజంగానే బలహీన జట్లు. ఇలాంటి పొరపాటే పెద్ద జట్లతో జరిగితే కోలుకోవడానికి అవకాశం ఉండదు. టోర్నీలో వరుసగా దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లతో హర్మన్ప్రీత్ కౌర్ బృందం తలపడనుంది. వీటిలో మన ప్రదర్శనపైనే వరల్డ్ కప్లో సెమీఫైనల్ చేరే అవకాశాలతో పాటు జట్టు అసలు సత్తా ఏమిటో తేలనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వేదికగా సఫారీ టీమ్తో పోరుకు భారత్ ‘సై’ అంటోంది. గత మ్యాచ్లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా టీమ్ కూడా అమితోత్సాహంతో బరిలోకి దిగుతోంది. సాక్షి క్రీడా ప్రతినిధి, విశాఖపట్నం: మహిళల వన్డే వరల్డ్ కప్లో విశాఖపట్నం వేదికగా మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుండగా... భారత్ తొలి రెండు మ్యాచ్లు ఆడుతుంది. ఇందులో భాగంగా నేడు ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో హర్మన్ప్రీత్ బృందం తలపడుతుంది. టోర్నీలో భారత్ ఆడిన రెండు మ్యాచ్లలో గెలవగా... దక్షిణాఫ్రికా ఒకటి ఓడి, మరొకటి గెలిచింది. బరిలోకి అమన్జోత్... టోర్నీ తొలి రెండు మ్యాచ్లలో చూస్తే భారత బ్యాటింగ్ బలహీనత కనిపించింది. టాప్ బ్యాటర్లయిన స్మృతి, హర్మన్ విఫలం కాగా, లోయర్ ఆర్డర్ ఆదుకుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలించేలా ఉంది. ఇలాంటి స్థితిలో వీరిద్దరు తమ స్థాయికి తగిన ప్రదర్శన కనబర్చడం కీలకం. ఈ ఏడాది అసాధారణ ఫామ్లో ఉన్న స్మృతి అసలు సమరంలో విఫలం కావడం ఆందోళన కలిగించే అంశం. మిడిలార్డర్లో జెమీమా శ్రీలంకపై డకౌట్ అయినా, పాక్పై మ్యాచ్లో ఫర్వాలేదనిపించింది. గత రెండు మ్యాచ్లలో ఈ ముగ్గురి ఆటను కలిపి చూస్తే అత్యధిక స్కోరు 32 మాత్రమే. బౌలింగ్కు సంబంధించి గత మ్యాచ్లో ఐదుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ఆడింది. అయితే పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తే ప్రత్యర్థిని నిలువరించేందుకు ప్రత్యామ్నాయంగా ఆరో బౌలర్ అవసరం. అనారోగ్యంతో గత మ్యాచ్కు దూరమైన అమన్జోత్ కోలుకుంది. దాంతో తుది జట్టులోకి రావడం ఖాయం. అయితే ఎవరి స్థానంలో ఆమె ఆడుతుందనేది ఆసక్తికరం. ఆమె స్థానంలో ఆడిన రేణుక పాక్పై సత్తా చాటింది. తొలి రెండు మ్యాచ్లలో మన ఫీల్డింగ్ ప్రదర్శన కూడా పేలవంగా ఉంది. దీనిని కూడా సరిదిద్దుకోవాల్సి ఉంది. ఆత్మవిశ్వాసంతో సఫారీ టీమ్... ఇంగ్లండ్పై తొలి మ్యాచ్లో 69 ఆలౌట్ తర్వాత న్యూజిలాండ్పై దక్షిణాఫ్రికా ఆటతీరు చూస్తే ఆ జట్టు ఫామ్లోకి వచ్చినట్లు కనిపించింది. బ్రిట్స్ సెంచరీతో చెలరేగగా... లూస్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. సీనియర్లు వోల్వార్ట్, మరిజాన్ కాప్ అనుభవం జట్టుకు కీలకం కానుంది. పేసర్లు ఖాకా, క్లాస్ కూడా ప్రభావం చూపగలరు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో దక్షిణాఫ్రికా జట్టులో తడబాటు కనిపిస్తున్నా... బ్యాటింగ్కు పిచ్ అనుకూలిస్తే భారీ స్కోరు సాధించగల సామర్థ్యం టీమ్కు ఉంది. ఇద్దరు మాత్రమే... మ్యాచ్ ముందు రోజు భారత జట్టు ఆప్షనల్ ప్రాక్టీస్ అవకాశం ఇచ్చారు. దాంతో ఇద్దరు మినహా జట్టు సభ్యులెవరూ మైదానానికి రాలేదు. కెపె్టన్ హర్మన్ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్ మాత్రమే సాధనలో పాల్గొన్నారు. టీమ్ కొలంబో నుంచి వచ్చిన తర్వాత మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్కు దూరంగా ఉన్న వీరిద్దరు మరుసటి రోజు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. శ్రీచరణి సత్తా చాటేనా... భారత్తో మ్యాచ్లో ఇనోకా రణవీరా అద్భుత బంతితో జెమీమాను బౌల్డ్ చేసింది. ఇది టోర్నీలోనే అత్యుత్తమ బంతని, తానే కాదు ఎవరూ ఆడలేరని జెమీమా స్వయంగా అంగీకరించింది. మ్యాచ్లో మొత్తం 4 వికెట్లతో ఇనోకా సత్తా చాటింది. దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ బౌలర్ లిన్సీ స్మిత్ 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సఫారీ బౌలర్ ఎంలాబా 4 కీలక వికెట్లతో ప్రత్యర్థిని కట్టిపడేసింది. ఈ ముగ్గురూ లెఫ్టార్మ్ స్పిన్నర్లే కావడం విశేషం. టోర్నీలో వారి ప్రభావం ఎలా నడుస్తుందో ఇది చూపిస్తోంది. భారత జట్టులోని లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి కూడా సొంతగడ్డపై ఇదే తరహా ప్రదర్శన కనబర్చాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. రెండో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధ యాదవ్కు ఇంకా మ్యాచ్ దక్కలేదు కానీ... లంకపై శ్రీచరణి ఫర్వాలేదనిపించగా, పాక్తో పెద్దగా ప్రభావం చూపలేదు. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి 11 వన్డేల స్వల్ప కెరీర్లో అందరినీ ఆకట్టుకుంది. అయితే తనకంటూ ప్రత్యేకంగా చెప్పుకునే ప్రదర్శన ఆమె నుంచి ఇంకా రాలేదు. దానిని చూపించేందుకు ఆమెకు సొంత రాష్ట్రానికి మించి సరైన వేదిక లభించదు. వరల్డ్కప్ మ్యాచ్లో అంచనాలకు తగినట్లుగా చెలరేగితే చరణికి ఇకపై తిరుగుండదు. పిచ్, వాతావరణం భారత్ ఆడిన గత రెండు మ్యాచ్లతో పోలిస్తే ఇది బ్యాటింగ్కు బాగా అనుకూలం. జెమీమా పరిశీలన ప్రకారం కనీసం 270 స్కోరు చేయవచ్చు. బుధవారం నగరంలో వాన కురిసింది. మ్యాచ్ రోజు కూడా స్వల్పంగా అంతరాయం కలిగించే అవకాశం ఉంది.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీక, హర్లీన్, జెమీమా, దీప్తి, స్నేహ్, రిచా, శ్రీచరణి, క్రాంతి, రేణుక/అమన్జోత్. దక్షిణాఫ్రికా: వోల్వార్ట్ (కెప్టెన్), బ్రిట్స్, లూస్, కాప్, బాష్, జాఫ్తా, ట్రైఆన్, డి క్లెర్క్, క్లాస్, ఖాకా, ఎంలాబా.5 విశాఖపట్నంలో భారత మహిళల జట్టు ఆడిన 5 వన్డేల్లోనూ విజయం సాధించింది. ఈ వేదికలో శ్రీలంకపై 3 మ్యాచ్ల్లో, ఇంగ్లండ్పై 2 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది.20 భారత్, దక్షిణాఫ్రికా మధ్య 33 వన్డేలు జరిగాయి. 20 మ్యాచ్ల్లో భారత్ నెగ్గింది. 12 మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది. -
‘విద్యార్థుల మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత’
సాక్షి,విశాఖ: విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. విశాఖ కేజీహెచ్లో పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించారు. అంనతరం,ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు స్క్రినింగ్ టెస్టులు చేయించారనేది అబద్ధం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. గురుకుల పాఠశాలలో శాటినేషన్ లోపమే కారణం.ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించడం లేదు. అసలు ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారో చెప్పాలి. ఇవాళ మరో ఆరుగురు విద్యార్థులు కేజీహెచ్ వచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పచ్చ కామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు’అని ’ధ్వజమెత్తారు. -
విశాఖ పెదగంట్యాడలో ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం, కుర్చీలు విసిరేసి..
సాక్షి, విశాఖ: విశాఖపట్నంలోని పెదగంట్యాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబుజా సిమెంట్ ఫ్యాకర్టీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న వేదిక వద్ద స్థానికులు నిరసన చేపట్టారు. దీంతో, స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులపైకి స్థానికులు తిరగబడ్డారు. పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని నిరసనలు తెలుపుతూ ఖర్చీలను విసిరేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇదిలా ఉండగా.. విశాఖలోని పెదగంట్యాలడ (Pedagantyada)లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సిమెంట్ ఫ్యాక్టరీని స్థానికంగా ఉన్న 26 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న అన్ని గ్రామల ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అయితే, ముందస్తుగా పోలీసులతో బందోబస్తు (arrangement)ను ఏర్పాటు చేసినప్పటికీ.. నిరసన కారులతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో స్థానికులు. సిమెంట్ కంపెనీతో జనావాసాలకు ఇబ్బంది కలుగుతుందంటూ ఆందోళన దిగారు. గోబ్యాక్ అంబుజా సిమెంట్ (Ambuja Cement) అంటూ నినాదాలు చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసుల వారిని అదుపు చేసే ప్రయత్నం చేయడంతో.. ఆగ్రహించిన స్థానికులు మీటింగ్ స్థలంలో ఉన్న కూర్చీలను విసిరేశారు. -
జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుయుక్తులు
8 ఏప్రిల్ 2025న సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లెలో టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించినా ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. జనాభిమానాన్ని పోలీసులు నిలువరించలేకపోయారు. 18 జూన్ 2025న పోలీసుల వేధింపులు తట్టుకోలేక పోయిన పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు పల్నాడు జిల్లాకు వైఎస్ జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా కేవలం 100 మంది మాత్రమే రావాలంటూ అర్థంపర్థం లేని నిబంధనలను పోలీసులు విధించారు. ఎక్కడికక్కడ అరెస్టులకు తెగబడ్డారు. ఆంక్షలు పెట్టారు. అయినా ప్రజలు పొలాల మధ్యలోనుంచి గట్ల వెంబడి పరుగులు తీసుకుంటూ తమ అభిమాన నేతను చూసేందుకు వచ్చారు. 31 జూలై 2025న అక్రమ కేసులతో జైలుకు వెళ్లి తిరిగివచ్చిన మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లారు. పోలీసులు జగన్ పర్యటనను విఫలం చేయాలని శాయశక్తులా యత్నించారు. ఎవ్వరూ రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు ఏకంగా రోడ్లపైన అప్పటికప్పుడు తవ్వేశారు. అయినా ప్రజాభిమానాన్ని ఆపలేకపోయారు. ఈ ఘటనలను సాకుగా చూపి ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరోక్షంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నట్టుగా ఉంది. వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనకు 66వేల మంది వస్తారని, వారిని నిలువరించలేమని పోలీసులే పేర్కొనడం, జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలన్న సర్కారు కుట్రలో వారు పావులుగా మారడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా యత్నిస్తోంది. కొత్త ఎత్తులు వేస్తోంది. వైఎస్ జగన్ వెళ్లిన ఎక్కడికి వెళ్లినా జనాదరణ వెల్లువెత్తుతుండడంతో సర్కారులో వణుకుపుడుతోంది. ప్రజావ్యతిరేకత పెరిగిపోవడంతో జంకుతోంది. ఫలితంగా ఎలాగైనా వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకోవాలని ఆంక్షలు విధిస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగాట ఆడుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటనకు ఏకంగా 65 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మెడికల్ కాలేజీ నిర్మాణమవుతున్న మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెం వరకు రోడ్డు మార్గాన వెళితే భద్రత కల్పించలేమంటూ అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, విశాఖ సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చితో ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు పెట్టి మరీ అప్పటికప్పుడు ప్రకటించడం గమనార్హం. 63 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో అవసరమైన పోలీసు బలగాలను ఇప్పటికిప్పుడు కేటాయించలేమంటూ సెలవివ్వడం చర్చనీయాంశమైంది. విశాఖలో ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటూ సాకుగా చూపడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతిమంగా ఈ పర్యటన జరగకుండా చూసేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవైపు స్వయంగా పోలీసులే... 65 వేల మంది తరలివచ్చేందుకు అవకాశం ఉందని, అంత మందికి అక్కడి ప్రాంతం సరిపోదంటూ మాజీ మంత్రి అమర్నాథ్కు పంపిన సమాధానంలో పేర్కొనడం ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పరోక్షంగా అంగీకరించినట్టు స్పష్టమవుతోంది. సవాల్ విసిరి.... చల్లారిపోయి....! వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. ఉమ్మడి విశాఖలోని పాడేరు మెడికల్ కాలేజీని పూర్తిచేసి ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు 50 సీట్లు కేటాయించారు. మరో ఐదు కళాశాలలను అంతకుముందే ప్రారంభించారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవారిపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద రూ. 500 కోట్లతో 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వమే చేపట్టింది. ఇప్పటికే 60 శాతం మేర నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత ఈ పనులను పూర్తిగా నిలిపివేసింది. పైగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్దతిలో ప్రైవేటు పరంచేసేందుకు సర్కారు కుట్రపన్నింది. దీనిపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ కాలేజీకి అనుమతులు లేవంటూ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కొత్తరాగం అందుకున్నారు. శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అయితే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అసలు అనుమతి లేదని, జీఓ ఉందా? దమ్ముంటే రమ్మనండి.. ఎవరినైనా రమ్మను అంటూ బీరాలు పోయారు. అర్థంపర్థం లేని సవాల్ విసిరారు. అయితే, స్పీకర్ మాటలు అబద్ధాలేనని భీమబోయినపాలెంలో కనిపిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలే సమాధానమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీంతో నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాలను పరిశీలించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న రానున్నారు. ఇప్పటివరకు దమ్ముంటే రమ్మనండి అంటూ సవాళ్లు విసిరిన కూటమి నేతలు ఇప్పుడు వైఎస్ జగన్ వస్తుంటే నిజాలన్నీ బయటకు వస్తాయని వణికిపోతున్నారు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు.హెలికాప్టర్పై అయితే అనుమతిస్తారట..! వాస్తవానికి వివిధ సమస్యలపై ప్రజల వద్దకు వెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యత్నించిన ప్రతీసారి ఏదో ఒక రూపంలో అడ్డంకులు కల్పించడం పోలీసులకు పరిపాటిగా మారింది. అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటన సందర్బంగా జరిగిన ఘటనను పేర్కొంటూ హెలికాప్టర్ ల్యాండింగ్కు పలు సందర్భాల్లో అనుమతి నిరాకరించిన పోలీసులు... ఇప్పుడు అందుకు విరుద్ధంగా హెలికాప్టర్లో వస్తే అనుమతిస్తామంటూ కొత్త పల్లవి అందుకోవడం గమనార్హం. అయితే, గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హెలికాప్టర్లో ప్రయాణం సాధ్యం కాదని తెలిసినా.. అందుకు అంగీకరిస్తామని చెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదో విధంగా జగన్ను అడ్డుకోవాలన్న కుట్రలో భాగంగానే ఈ పల్లవి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. ఎట్టకేలకు ఆంక్షలతో అనుమతివిశాఖ సిటీ: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు లేవంటూ మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ అటు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, ఇటు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మీడియాకు స్పష్టం చేశారు. ఈ విషయమై తీవ్ర విమర్శలు రావడంతో నాటకీయ పరిణామాల మధ్య పలు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నామని మంగళవారం అర్ధరాత్రి విశాఖ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. పర్యటన ఇలా సాగాలి » విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్డు, బాజీ జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్, వేపగుంట జంక్షన్ రావాలి.» అక్కడి నుంచి సుజాతనగర్, పెందుర్తి పోలీస్ స్టేషన్ జంక్షన్, పెందుర్తి జంక్షన్, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లాలి. » ట్రాఫిక్ ఏసీపీ అనుమతి లేకుండా ఈ మార్గం నుంచి ఎటువంటి మార్పులు, పొడిగింపు లేదా అనుమతి లేని హాల్ట్ చేయకూడదు. » ఈ మార్గంలో ఏదైనా జంక్షన్, రోడ్డు పక్కన ఉన్న పాయింట్ లేదా వేదిక వద్ద నిర్వాహకులు ప్రజలను సమీకరించకూడదు. గుమిగూడటానికి కూడా అనుమతి లేదు. » మార్గంమధ్యలో సమావేశాలు, రిసెప్షన్లు, ప్రజల్ని సమీకరించడం చేయకూడదు. » ఊరేగింపులు, రోడ్ మార్చ్లపై నిషేధం ఉంటుంది. -
KGH: గిరిజన బాలికలకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్లో గిరిజన బాలికలను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. పచ్చ కామెర్లకు చికిత్స పొందుతున్న బాలికలను ఆ పార్టీ నేతలు పుష్పశ్రీవాణి, రాజన్నదొర, ఎంపీ తనూజారాణి, మజ్జి శ్రీను పరామర్శించి.. బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను వారు కోరారు.ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇద్దరు బాలికలు చనిపోయారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. బాలికల అస్వస్థతకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. కురుపాం గిరిజన హాస్టల్లో సమస్యలున్నాయని మేం ముందే చెప్పాం. ఈ నెల 1న బాలికలు అస్వస్థతకు గురైతే 5న మంత్రి వచ్చారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా?’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. -
సంక్షేమం.. అభివృద్ధే వైఎస్సార్సీపీ అజెండా: బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాబోయే కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై చర్చించాలని పట్టుబట్టామని.. ప్రజా సంక్షేమమే తమ అజెండా అన్నారు. ప్రజా సంక్షేమంపై తాము రాజీపడేది లేదని స్పష్టం చేశారు.‘‘మెడికల్ కాలేజీల ఏర్పాటు పేదవారి వైద్యానికి సంబంధించినది. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీపడం. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుంది. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెబుతూ బతుకుతారు. కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. అందులో ఇద్దరూ మరణించారు. కూటమి ప్రభుత్వానికి పర్యవేక్షణ కొరవడింది...అశోక్ గజపతిరాజు జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఆయనకు అహం ఎక్కువ. సింహాచలంలో ఆరుగురు భక్తులు మరణిస్తే కనీసం అశోక్ గజపతి రాజు పరామర్శించారా? ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు, హత్యలు హత్యాచారాలు పెరిగిపోయాయి. మా హయాంలో ఎన్ని నేరాలు జరిగాయి, ఏడాదిన్నరగా కూటమి పాలనలో ఎన్ని జరిగాయో లెక్కేసుకోండి’’ అని బొత్స పేర్కొన్నారు. -
యారాడ బీచ్లో విషాదం.. ఇద్దరు విదేశీయులు గల్లంతు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని యారాడ బీచ్లో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు విదేశీయులు.. అలలు ఎగసిపడటంతో కొట్టుకుపోయారు. ఇటలీ నుంచి విశాఖకి ఇద్దరు పర్యాటకులు వచ్చారు. ఒకరు మృతి చెందగా.. మరొకరిని లైఫ్ గార్డ్స్ రక్షించారు. కేసు నమోదు చేసిన న్యూ పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే సుందర సాగర తీరం.. ఒక్కోసారి వారిపైనే ఉగ్రరూపం చూపిస్తోంది. అనూహ్యంగా రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడి కాటేస్తున్నాయి. మరోవైపు అత్యుత్సాహంతో కొందరు కెరటాలకు బలైపోతున్నారు. పోలీసులు, మెరైన్ పోలీసులు, లైఫ్గార్డ్స్ నిరంతరం పహారా కాస్తున్నప్పటికీ తీరంలో విషాద ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తేన్నేటి పార్క్, సాగర్ నగర్, రుషి కొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో వాటిపై నిల్చుని సాగరం అందాలను వీక్షిస్తుంటారు. అయితే కొంత మంది సరదాగా స్నానాలు చేసేందుకు దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తీరం నుంచి ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లడంతో.. అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు.విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండడంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్ కరెంట్ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్ కరెంట్ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్న వారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్గార్డ్స్ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడడం అసాధ్యం. -
బలహీన పడ్డ తీవ్ర వాయుగుండం.. మరో మూడు రోజులు వర్షాలు..
విశాఖ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండ కాస్తా వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశాలో వాయుగుండంగా కొనసాగుతోంది. ఒడిశాలో దక్షిణ నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఒడిశా నుంచి ఉత్తర ఛత్తీస్ఘడ్ వరకు పయనించి మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఏపీలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు గా వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు జిల్లా లో కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు అవకాశం ఉంది. 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టం గా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. టెక్కలి, మందస 17 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీకాకులం జిల్లాలో భారీ వర్షాలుతీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కేరాసింగ్లో రోడ్డుపై కొండచరియుల విరిగిపడ్డాయి. వరద ఉధృతికి రహదారి భారీగా కోతకు గురైంది. ఆముదాలవలస, సిరుబుజ్జిలి మండలాల్లో భారీ వర్షం కురవగా, ఎల్ఎన్పేట, బూర్గ, జలుమూరు మండలాల్లో భారీ వర్షం పడింది. పార్వతీపురం నాగావళి నదికి వరద ఉధృతి పోటెత్తింది. బాసింగి గ్రామం వరద ముంపునకు గురైంది. సంగమేశ్వరస్వామి వారి ఆలయం నీట మునిగింది. మరొకవైపు అల్లూరి జిల్లాలో సైతం పలుచోట్ల వర్షం పడింది. చింతూరు, వీఆర్పురం మండలాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సోకిలేరు ఉధృతంగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీనిపై ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు తక్షణ ఆర్థిక సాయం అందక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం
విశాఖ: కళింగపట్నం వద్ద కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం నెమ్మదిగా పారాదీప్-గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటింది. ఈ విషయాన్ని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే ఈ తీవ్ర వాయుగుండం బలహీనపడినా దీని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుగుతుందని వెల్లడించింది. ఫలితంగా రేపు కూడా పలు ప్రాంత్లాఓ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో 55 కి.మీ నుంచి 75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి.కాగా, ఈ తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండ ప్రబావంతో సముద్రం అలజడిగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్ళ రాదని ఐఎండీ ముందుగానే హెచ్చరికలు పంపింది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరక కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. గాలి వానకు భారీ చెట్లు నేలకొరిగాయి.పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి. ద్వారకానగర్ రోడ్డులోని ఫార్చునర్ కారుపై చెట్టు కూలిపోయింది. కారు పార్క్ చేసి.. ఓనర్ షాపింగ్కు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. -
ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. వంశ ధార, నాగావళి నదులకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. ఫ్లాష్ ప్లడ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. 20 సెంటీమీటర్ల పైగా వర్షం నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.కళింగపట్నం సమీపంగా తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయువ్య దిశగా కదులుతూ అర్ధరాత్రి పారాదీప్-గోపాల్పూర్ మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 70 కి.మీ పైబడిన వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అలజడిగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరక కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. తీవ్ర వాయుగుండంతో ఉత్తరాంధ్రలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అలజడిగా మారింది. వాతావరణ శాఖ.. మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. విశాఖలో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. గాలి వానకు భారీ చెట్లు నేలకొరిగాయి.పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి. ద్వారకానగర్ రోడ్డులోని ఫార్చునర్ కారుపై చెట్టు కూలిపోయింది. కారు పార్క్ చేసి.. ఓనర్ షాపింగ్కు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఎక్కడికక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏయూ, శంకరమఠం, సత్యం జంక్షన్, బీవీకే కాలేజీ రోడ్లలో చెట్లు విరిగిపడ్డాయి. కాగా, వాయుగుండం ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా మాడుగులలో 7.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గాదిరాయిలో 5.1, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 3.8, శ్రీకాకుళం జిల్లా పలాసలో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండురోజుల్లో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఇవాళ(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
ఏపీకి బిగ్ అలర్ట్.. ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రైలు, రోడ్డు రవాణా మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాయువ్య దిశగా పయనించి రాగల 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.3వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని.. ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. ఇవాళ విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, యానాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.రానున్న మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వానలు పడనున్నాయని.. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఏపీలోని అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రా గల 3 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. చెట్ల కింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. -
నాటు కోళ్లకు ఫుల్ గిరాకీ
విశాఖపట్నం: దసరా పండుగ సందర్భంగా నాటుకోళ్లకు విపరీతంగా గిరాకీ పెరిగింది. సాధారణంగా దసరా సమయంలో కేవలం రూ.10 నుంచి రూ.25 మాత్రమే పెరిగే ధర ఈసారి ఏకంగా రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగింది. మటన్కు దీటుగా ధరలు పెరిగినప్పటికీ, దసరా మొక్కుల కోసం వినియోగదారులు నాటుకోళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పాత డెయిరీఫారం వద్ద ఉన్న నాటుకోళ్ల సంతలో ప్రస్తుతం కిలో నాటుకోడి ధర రూ.900కు చేరింది. మంగళ, బుధవారాల్లో ఇది రూ.1,000కు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం దీని ధర రూ.800 మాత్రమే ఉండేది. డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలను పెంచేశారు. 40 ఏళ్ల నాటుకోళ్ల సంత పాత డెయిరీఫారం వద్ద సుమారు 40 సంవత్సరాల నుంచి నాటుకోళ్ల సంత జరుగుతోంది. ప్రారంభంలో కోడి రూ.20, రూ.30కే విక్రయించేవారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతుంటారు. నగరంలో పారిశ్రామిక వాడలు ఎక్కువగా ఉండటం వల్ల దసరా సందడి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. పరిశ్రమలు, వాహనాలు, యంత్రాలకు నాటుకోళ్లతో మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ. గాజువాక, ఆటోనగర్, గోపాలపట్నం, అక్కయ్యపాలెం వంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా జనాలు ఇక్కడికి వస్తారు. గిరిరాజు కోళ్లతో జాగ్రత్త నాటుకోళ్ల మాదిరిగానే కనిపించే ‘గిరిరాజు’ కోళ్లను కొందరు వ్యాపారులు అధిక ధరకు అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్నారని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. గిరిరాజు కోళ్ల ధర కిలో రూ.400 మాత్రమే ఉంటుందని, కానీ నాటుకోడి ధరతో వాటిని విక్రయిస్తున్నారని వారు చెప్పారు. గిరిరాజు కోళ్లు పొట్టి కాళ్లతో, దట్టమైన వెంట్రుకలతో ఉంటాయని, వాటి బరువు ఒకటిన్నర కిలోలకు మించి ఉండదని తెలిపారు. నాటుకోడి కావాలనుకునేవారు ఈ తేడాలను గమనించి, తెలిసినవారిని తీసుకెళ్లి కొనుగోలు చేయాలని వారు సూచించారు. -
నాటి మెరుపులే తప్ప..కొత్త వెలుగులేవీ..?
సాక్షి, విశాఖపట్నం: ‘పర్యాటక రాజధానిగా’ విశాఖను మారుస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా టూరిజం రంగాన్ని గాలికొదిలేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయి పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయే తప్ప, కూటమి వచ్చాక ఒక్క కొత్త టూరిజం ప్రాజెక్టు అయినా పట్టాలెక్కకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కొత్త మెరుపులు లేకుండానే మరో పర్యాటక దినోత్సవం ముగిసిపోయిందని పర్యాటక ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఐఎస్–2023 సదస్సులో రూ. 8,806 కోట్ల విలువైన 66 టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ఎంవోయూలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సింగపూర్, టర్కీ, ఫ్రాన్స్ వంటి దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన ఈ ప్రాజెక్టులు పడకేయడంతో విశాఖకు ప్రపంచ పర్యాటక పటంలో లభించాల్సిన స్థానం చేజారిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు కూటమి నాయకులు ఉన్న భూములను కొల్లగొట్టేందుకు పీపీపీ పేరుతో స్కెచ్లు వేస్తున్నారే తప్ప, కొత్తగా అభివృద్ధి చేయడం లేదన్న విమర్శలున్నాయి. 2024 ఏప్రిల్లోనే గ్లాస్ బ్రిడ్జికి ఎల్వోఏ కైలాసగిరిపై నిర్మాణం పూర్తయిన గ్లాస్ బ్రిడ్జ్ ప్రాజెక్టు తమ ఘనతేనని కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా, వాస్తవానికి ఈ ప్రతిపాదన 2022లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందే. 2024 జనవరిలో పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టుకు ఎల్వోఏ ఇచ్చారని, ఇప్పుడు పనులు పూర్తవడంతో ఆ క్రెడిట్ కూటమి తన ఖాతాలో వేసుకుంటోంది. రూ. వేల కోట్ల భూములపై నేతల కన్ను మరోవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు చేయకుండా, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని రూ. వేల కోట్ల విలువైన పర్యాటక భూములను తమ అనుచరులకు కట్టబెట్టేందుకు కూటమి నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. యాత్రినివాస్ వంటి భవనాలను ఇప్పటికే పీపీపీ పేరుతో ప్రైవేట్కు అప్పగించింది. తమ నియోజకవర్గాల పరిధిలోని విలువైన పర్యాటక భూములను అనుచరులకు కట్టబెట్టడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. విశాఖ జిల్లాలో 176.15 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 22.67 ఎకరాలు, అల్లూరి జిల్లాలో 43.10 ఎకరాలు చొప్పున మొత్తం 241.92 ఎకరాల్ని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. త్వరలోనే కూటమి నేతల అనుచరులకు టూరిజం ప్రాజెక్టుల పేరుతో భూపందేరం జరగనుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే మార్గా లను అన్వేషించకుండా.. ఉన్న భూములను కూటమి నాయకులకు ధారాదత్తం చేసేందుకు.. ప్రభుత్వ పెద్దలు ఎవరికి చెబితే.. వారికి భూ కేటాయింపులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన రూ. వేల కోట్ల ఒప్పందాలను పక్కన పెట్టి, భూములను కూటమి నేతల అనుచరులకు ధారాదత్తం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అవకాశాలున్నా.. ఆలోచన సున్నా.! మాటల్లోనే విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారే తప్ప.. వాస్తవ రూపం దాల్చేలా ఒక్క అడుగు కూడా కూటమి ప్రభుత్వం వెయ్యడం లేదు. గత ప్రభుత్వం హయాంలో ఒప్పందం ప్రకారం అన్నవరంలో ఒబెరాయ్, మై ఫెయిర్ హోటల్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ తరహా ఒప్పందం ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం చెయ్యలేదు. విశాఖ నగరంలో పర్యాటక వనరులు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా.. పీపీపీ పద్ధతిలో భూములు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తుందే తప్ప.. కొత్త ఆలోచనల్ని అమలు చెయ్యడంలో పూర్తిగా విఫలమయ్యింది. రూ. వేల కోట్ల భూములపై నేతల కన్ను మరోవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు చేయకుండా, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని రూ. వేల కోట్ల విలువైన పర్యాటక భూములను తమ అనుచరులకు కట్టబెట్టేందుకు కూటమి నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. యాత్రినివాస్ వంటి భవనాలను ఇప్పటికే పీపీపీ పేరుతో ప్రైవేట్కు అప్పగించింది. తమ నియోజకవర్గాల పరిధిలోని విలువైన పర్యాటక భూములను అనుచరులకు కట్టబెట్టడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. విశాఖ జిల్లాలో 176.15 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 22.67 ఎకరాలు, అల్లూరి జిల్లాలో 43.10 ఎకరాలు చొప్పున మొత్తం 241.92 ఎకరాల్ని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. త్వరలోనే కూటమి నేతల అనుచరులకు టూరిజం ప్రాజెక్టుల పేరుతో భూపందేరం జరగనుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే మార్గా లను అన్వేషించకుండా.. ఉన్న భూములను కూటమి నాయకులకు ధారాదత్తం చేసేందుకు.. ప్రభుత్వ పెద్దలు ఎవరికి చెబితే.. వారికి భూ కేటాయింపులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన రూ. వేల కోట్ల ఒప్పందాలను పక్కన పెట్టి, భూములను కూటమి నేతల అనుచరులకు ధారాదత్తం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. త్వరలో మరో హిప్హాప్ బస్సు ఉమ్మడి విశాఖలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటికే బీచ్రోడ్డులో రూ.5 కోట్లతో రెండు హిప్హాప్ బస్సులు నడుపుతున్నాం. త్వరలోనే మరో హిప్హాప్ బస్సు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నాం. రుషికొండ, జోడుగుళ్ల పాలెం, భీమిలి బ్యాక్ వాటర్లో వాటర్స్పోర్ట్స్, కయాకింగ్, స్కూబాడైవింగ్ మొదలైనవి అందుబాటులోకి రాబోతున్నాయి. విశాఖ, అరకు క్యారవాన్స్ తీసుకొస్తున్నాం. టూరిజం హోటల్స్కు టెండర్లు వేశాం. త్వరలోనే వైజాగ్లో 2 వేల రూమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. స్పోర్ట్స్ టూరిజం, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ప్రణాళికలు తయారు చేస్తున్నాం. – జీవీబీ జగదీష్, ఏపీటీడీసీ డీవీఎంప్రపంచ స్థాయి హోటల్స్తో పర్యాటకుల తాకిడి ఈ ఏడాది టూరిజం డేని పర్యాటకంలో స్థిరమైన, సమగ్రాభివృద్ధి అనే థీమ్తో నిర్వహిస్తున్నాం. పర్యాటక రంగంలో హాస్పిటాలిటీ ప్రధాన పాత్రపోషిస్తోంది. ప్రపంచస్థాయి హోటల్స్ రాబోతుండటంతో.. విశాఖకు సందర్శకుల తాకిడి రెట్టింపయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం కోటికి పైగా ఉంది. ఇది రెట్టింపు చేసుకునే అవకాశాలు బోలెడు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. భవిష్యత్తులో విశాఖకు విమానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరిగితే మెడికల్ టూరిజం, స్పిరిచ్యువల్ టూరిజం అభివృద్ధి చెందనున్నాయి. – పవన్ కార్తీక్, ఏపీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన!
విశాఖ:: వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగానికి (IMD) చెందిన విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం (Visakha Cyclone Warning Center) వెల్లడించింది. అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడిన తర్వాత దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని ప్రకటించింది. దీని ప్రభావంతో ఇవాళ(శుక్రవారం) రేపు(శనివారం) ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఐదు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40 కి.మీ నుంచి 50 కి.మీ గరిష్ఠ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఐదు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని పేర్కొంది. కృష్ణపట్నం మినహా మిగిలిన అన్ని ఓడరేవుల్లోనూ మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీనిలో భాగంగా 9 జిల్లాలకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. జారీ చేసింది. అదే సమయంలో అల్లూరి, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్. హెచ్చరికలు జారీ చేసింది. మూసీ డేంజర్ బెల్స్.. ముసారంబాగ్ బ్రిడ్జి మూసివేత -
బీఈడీ విద్యార్థి మృతి.. ఏయూలో తీవ్ర ఉద్రిక్తత
విశాఖపట్నం: ఏపీలోని ప్రతిష్టాత్మక ఏయూ(ఆంధ్రా యూనివర్శిటీ)లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. బీఈడీ విద్యార్థి మణికంఠ మృతికి నిరసనగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం అస్వస్థతకు గురైన మణికంఠ.. సరైన వైద్యం అందక చనిపోయాడని ఆరోపిస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఏయూలో కనీసం వైద్య సదుపాయం అందకే విద్యార్థి చనిపోయాడని, అక్కడ ఆక్సిజన్ సదుపాయం కూడా లేకపోయిన కారణంగానే బీఈడీ విద్యార్థి మణికంఠ ప్రాణాలు కోల్పోయాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైస్ చాన్సలర్(వీసీ)ను చుట్టుముట్టి విద్యార్థి మృతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసుల్ని మోహరించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
విశాఖపట్నం..యూత్ జోష్ (ఫొటోలు)
-
విశాఖలో విధ్వంసకాండ
ఎంవీపీ కాలనీ (విశాఖ): ‘ఆపరేషన్ లంగ్స్’ పేరిట విశాఖలో కూటమి సర్కార్ సాగిస్తున్న విధ్వంసం బడుగుజీవుల ఊపిరి తీస్తోంది. దశాబ్దాలుగా చిరు వ్యాపారాలతో కుటుంబాల్ని నెట్టుకొస్తున్న బడుగుల బతుకులపై గుదిబండ మోపుతోంది. ఐదు రోజులుగా విశాఖలో జరుగుతున్న ఈ విధ్వంసకాండ ద్వారా ఇప్పటికే వేలాది కుటుంబాలను రోడ్డు పాల్జేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఈ కర్కశత్వానికి నాంది పలకగా.. టౌన్ప్లానింగ్ విభాగం కష్టజీవుల బతుకుల్ని రోడ్డుకీడుస్తోంది. దీంతో కొన్ని రోజులుగా విశాఖలోని ప్రధాన రహదారులు పేద, బడుగుల ఆర్తనాదాలతో నిండిపోయాయి. దశాబ్దాల జీవనాధారం కోల్పోవడంతో ఒక్కసారిగా తమ జీవితాలు ఛిద్రమయ్యాయంటూ బాధితులు ఎక్కడికక్కడ కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘ఎలా బతకాలి దేవుడా..’ అంటూ బరువెక్కిన గుండెలతో కూటమి సర్కారు తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.5 రోజుల్లో.. 3,039 దుకాణాల తొలగింపుఆపరేషన్ లంగ్స్ కార్యక్రమానికి జీవీఎంసీ ఈ నెల 19న శ్రీకారం చుట్టింది. నగరంలోని ప్రధాన రహదారుల్లో ఫుట్పాత్లపైన, వాటిని ఆనుకొని ఉన్న షాపులను, బడ్డీలను తొలగించడం దీని లక్ష్యం. తద్వారా నగర సుందరీకరణ, ట్రాఫిక్ సమస్యలు, స్ట్రీట్ ఫుడ్స్తో అనారోగ్య సమస్యలు, భద్రత, పరిశుభ్రత సమస్యలు ఉండవన్నది కూటమి సర్కార్, జీవీఎంసీ అధికార యంత్రాంగం చెబుతున్న మాట. ఇందుకోసం దశాబ్దాలుగా చిరు వ్యాపారాలను నమ్మకొని కుటుంబాల్ని పోషించుకుంటున్న బడుగుల గొంతు కోసేందుకు జీవీఎంసీ నడుం కట్టింది. బాధితుల ఆర్తనాదాలు, కన్నీటి వెతలు పట్టించుకోకుండా తొలగింపులు కొనసాగిస్తోంది. 19న మొదలైన ఈ ప్రక్రియ సోమవారం మినహా (సీఎం పర్యటనతో) 5 రోజులుగా కొనసాగుతోంది. కేవలం 5 రోజుల్లో నగరంలోని 8 జోన్లలో 3,039 షాపులను జీవీఎంసీ తొలగించింది. దీంతో నగరంలోని వేలాది కుటుంబాల్లోని జీవితాలు ఒక్కసారిగా ఛిద్రమయ్యాయి. నగరంలో ఎటుచూసినా చిరువ్యాపారుల కన్నీటి వ్యథలే దర్శనమిస్తున్నాయి. పునరావాసంపై శ్రద్ధ కరువువిశాఖ నగరంలో వేలాది మంది ఫుట్పాత్లపై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరిలో 80 శాతానికి పైగా జీవీఎంసీకి ఏటా పన్నులు చెల్లిస్తున్నారు. దీంతోపాటు జీవీఎంసీ మంజూరు చేసిన స్ట్రీట్ వెండర్ కార్డ్, ట్రేడ్ లైసెన్స్లు కలిగి ఉన్నారు. ఈ షాపులు, బడ్డీల తొలగింపు చర్యలు చేపట్టాల్సి వస్తే.. ముందుగానే జీవీఎంసీ వారికి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఆ దిశగా జీవీఎంసీ కనీస చర్యలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం విశాఖలో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. విశాఖ నగరంలో చాలా ఏళ్లుగా హాకర్స్ జోన్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నా జీవీఎంసీ పట్టించుకోలేదు. 1998 నుంచి పాన్షాప్ ఉంది ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా కూడలిలో 1998 నుంచి నేను పాన్షాపు నిర్వహిస్తున్నాను. దాదాపు 25 ఏళ్లుగా ఇదే నా కుటుంబ జీవనాధారం. జీవీఎంసీ అధికారులు అకస్మాత్తుగా వచ్చి నా షాపును తొలగించేశారు. ఎవరి మెప్పుకోసం, ఎవరి లబ్ధి కోసం కూటమి ప్రభుత్వం ఈ విధ్వంసానికి పూనుకుందో అర్థం కావడం లేదు. బడుగుల జీవితాలతో ఆడుకునే ఈ విధ్వంసకాండను ఆపాలని కోరుకుంటున్నాను. – డాలియ్య, చిరు వ్యాపారిభర్తలేడు.. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి నాకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త చనిపోవడంతో చిల్లర దుకాణం పెట్టుకున్నాను. 10 ఏళ్లుగా ఇదే మాకు జీవనాధారం. షాపులోని సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నా కుటుంబ పోషణకు ఎవరు బాధ్యత వహిస్తారు. నా ఆడపిల్లలను ఎలా చదివించుకోవాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ సమాధానం చెప్పాలి. నాలాంటి వేల మందిని రోడ్డుపాల్జేసిన ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది. – పార్వతి, చిరు వ్యాపారి -
నౌకా నిర్మాణంలో నవశకం
రక్షణ ఉత్పత్తులు, త్రివిధ దళాల పాటవాల్లో అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్న భారత్.. నౌకా నిర్మాణం విషయంలో మాత్రం ఇప్పటివరకు వెనుకబడే ఉంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఏటా ఈ రంగంలో దూసుకుపోతుంటే.. ఇన్నాళ్లూ నెమ్మదిగా నెట్టుకొచి్చన భారత్ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చింది. మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్లు, ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుతో భారత నౌకా నిర్మాణ రంగ దశ, దిశ మారబోతోంది. భారీ కార్గో నౌకల తయారీ కోసం అగ్రదేశాల వైపు చూసే పరిస్థితి నుంచి.. ఇకపై 3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలను తయారుచేసే శక్తిగా భారత్ అవతరించబోతోంది. దేశ తూర్పు, పశ్చిమ తీరాలకు మణిహారాల్లా ఈ మెగా షిప్ బిల్డింగ్ కేంద్రాలు రూపుదిద్దుకోనున్నాయి.సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ నౌకా నిర్మాణ మార్కెట్లో ప్రస్తుతం భారత్ వాటా కేవలం 0.06 శాతం మాత్రమే. చైనా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు 85 శాతం వాటాతో షిప్ బిల్డింగ్ పరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మన దేశ తీరానికి వచ్చే భారీ నౌకలకు ఏవైనా మరమ్మతులు అవసరమైతే, వాటిని బాగుచేసే అత్యాధునిక షిప్యార్డులు లేకపోవడం ఒక ప్రధాన లోటుగా కేంద్రం భావించింది. ఈ ఏడాది జూలైలో అరేబియా సముద్రంలో ‘ఎంవీ మెర్క్స్ ఫ్రాంక్ఫర్ట్’అనే భారీ కార్గో షిప్ అగి్నప్రమాదానికి గురైనప్పుడు.. దానికి అవసరమైన మరమ్మతు సౌకర్యాలు భారత్లో లేకపోవడంతో మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్ల ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.ఈ నేపథ్యంలో దేశంలోని రెండు ప్రాంతాల్లో రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. తూర్పు, పశి్చమ తీరాల్లో చెరొకటి చొప్పున ఈ క్లస్టర్లను 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ సమక్షంలో భావనగర్లో జరిగిన కార్యక్రమంలో విశాఖపట్నం పోర్టు, ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.ఏపీలో ఈ మెగా క్లస్టర్ను శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మెగా క్లస్టర్లను పీపీపీ పద్ధతిలో పూర్తి చేయనుండగా.. కేంద్ర ప్రభుత్వమే రోడ్లు, భూమి అభివృద్ధి, విద్యుత్, నీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించనుంది. నౌకల నిర్మాణం భారత్లో మొదలైనా.. సింధులోయ నాగరికత కాలంలోనే అంతర్జాతీయ వాణిజ్యం కోసం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నౌకల నిర్మాణాన్ని భారత్ ప్రారంభించింది. గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాల్లో భారీ చెక్క నౌకలను నిర్మించేవారు. మధ్యయుగంలో భారతీయ నౌకా నిర్మాణదారులు తయారు చేసిన నౌకలకు మంచి గిరాకీ ఉండేది. అయినప్పటికీ ఆధునిక షిప్బిల్డింగ్లో మనం వెనుకబడ్డాం.ప్రస్తుతం ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’కార్యక్రమాల కింద ఉపాధి, ఎగుమతులు, దేశ రక్షణ, ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా నౌకా నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మన నావికా దళాన్ని ఆధునీకరించడంలో భాగంగా విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, యుద్ధనౌకలను నిర్మించడంలో ఈ షిప్ బిల్డింగ్ క్లస్టర్లు కొత్త ఒరవడిని సృష్టించనున్నాయి. విశాఖలో ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ విశాఖలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ఆవరణలో సాగరమాల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ను(ఐఎస్టీసీ) ప్రధాని మోదీ శనివారం వర్చువల్గా ప్రారంభించారు. మారిటైమ్ విజన్–2030లో భాగంగా నెలకొల్పిన ఈ కేంద్రం.. మారిటైమ్ టెక్నాలజీకి జాతీయ హబ్గా మారనుంది. ఇక్కడ నౌకా నిర్మాణ అభివృద్ధిపై పరిశోధనలు, స్వదేశీ నౌకల రూపకల్పన, డిజిటల్ ఆవిష్కరణలు జరగనున్నాయి. ఇది దేశంలోని ప్రభుత్వ రంగ షిప్యార్డులకు అనుసంధానంగా పనిచేస్తూ, భారత నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని పెంచనుంది. ఇక్కడే నేషనల్ షిప్ డిజైన్ అండ్ రీసెర్చ్ సెంటర్ను కూడా పునరుద్ధరించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది.విస్తరణకు భారీ అవకాశాలు భారత నౌకానిర్మాణ పరిశ్రమ ఉద్యోగావకాశాల కల్పన, ఆర్థిక విస్తరణ, జాతీయ భద్రతకు అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. దేశంలో 200 కంటే ఎక్కువ చిన్న ఓడరేవులు, 12 ప్రధాన పోర్టులు, 7,500 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉండటం స్వదేశీ నౌకానిర్మాణాన్ని ప్రోత్సహించడానికి బలమైన పునాదిగా ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రపంచ మార్కెట్లో మన దేశ వాటా 1శాతం కంటే తక్కువగా ఉంది.ఈ వాటా దక్షిణ కొరియా (25శాతం), జపాన్ (18శాతం), చైనా (47శాతం) కంటే చాలా తక్కువ. ఆ దేశాలు బలమైన ఆర్థిక ప్రోత్సాహకాలు, అత్యాధునిక సాంకేతికతతో పర్యావరణ వ్యవస్థలను స్థాపించగా, భారత్ ఇప్పుడు ఆ దిశగా పయనిస్తోంది. 2024లో ప్రపంచ నౌకా నిర్మాణ మార్కెట్ విలువ 150.42 బిలియన్ డాలర్లుగా అంచనా వేయగా, ఇది 2033 నాటికి 203.76 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అంతర్జాతీయ సముద్ర రవాణాకు అనుగుణంగా నౌకలకు డిమాండ్ పెరగనుండటంతో, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత్ సిద్ధమైంది.భారీ నౌకల తయారీ సులభతరందేశంలో ప్రస్తుతం ఉన్న కొచి్చన్ షిప్యార్డ్ లిమిటెడ్, మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, గోవా షిప్యార్డ్ లిమిటెడ్, హిందూస్తాన్ షిప్యార్డ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, ఎల్ అండ్టీ, రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటి ప్రైవేట్ షిప్యార్డులకు ఈ కొత్త మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్ల ద్వారా విస్తృతమైన అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం గరిష్టంగా 1.25 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలను మాత్రమే నిరి్మస్తున్న భారత్.. ఈ క్లస్టర్లు పూర్తయితే ఏకంగా 3 మిలియన్ టన్నుల వరకు కార్గో సామర్థ్యంతో అతిపెద్ద నౌకలను నిర్మించగలుగుతుంది. అదేవిధంగా భారీ యుద్ధనౌకలు, ప్రత్యేక నౌకల నిర్మాణం కూడా ఈ మెగా క్లస్టర్లలో జరగనుంది. దేశంలో విస్తరిస్తున్న చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీతకు అవసరమైన డ్రెడ్జర్లు, ఆఫ్షోర్ సపోర్ట్ షిప్లకు పెరుగుతున్న గిరాకీని కూడా ఈ కేంద్రాలు తీర్చనున్నాయి. -
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: పైలట్ అప్రమత్తతతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి ప్రమాదం తప్పింది. విశాఖపట్నం-హైదరాబాద్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్కు విమానం బయల్దేరగా.. కొంతదూరం వెళ్లాక విమానం రెక్కలో పక్షి ఇరుక్కుంది. పక్షి ఇరుక్కోవడంతో ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి.పైలెట్.. చాకచక్యంగా మార్గమధ్యలోనే వెనుతిరిగి విశాఖలో విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
అంధుల T20లో వైజాగ్ అమ్మాయి
‘నాకు బాల్ కనపడదు. కాని నా మైండ్తో, చెవులతో దాని రాకను పసిగట్టి కొడతాను’ అంటోంది విశాఖ అంధబాలిక పాంగి కరుణ కుమారి. పదో తరగతి చదువుతున్న కరుణ బ్యాటింగ్లో దిట్ట. అందుకే నవంబర్ 11న ఢిల్లీలో తొలిసారి నిర్వహించనున్న అంధుల టి20 వరల్డ్ కప్కి భారత జట్టులో ఎంపికైంది. తెలుగువారు సంతోషపడాల్సిన సందర్భం ఇది. స్ఫూర్తినిస్తున్న కరుణ కుమారి పరిచయం.స్కూలు పుస్తకాల్లో అక్షరాలు కనపడటం లేదని చదువు మానేసి ఇంట్లో కూచున్న అమ్మాయి నేడు భారత దేశ అంధ మహిళల క్రికెట్ జట్టులో స్థానం సం పాదించింది. ఆ అమ్మాయి పాంగి కరుణకుమారి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వంట్ల మామిడికి చెందిన అరుణ ప్రస్తుతం విశాఖపట్నం అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఢిల్లీలో నవంబర్ 11 నుంచి జరగనున్న అంధ మహిళల టి20 వరల్డ్ కప్లో ఆమె భారత్ తరఫున ఆడనుంది. అంధ మహిళల కోసం టి20 వరల్డ్ కప్ నిర్వహించడం ఇదే ప్రథమం.ఆమె ఆల్రౌండర్వంట్ల మామిడిలో కూలినాలి చేసుకునే రాంబాబు, సంధ్యల మొదటి కుమార్తె కరుణ పుట్టుకతోనే దృష్టిలోపంతో పుట్టింది. ఒక కన్ను కొద్దిగా మరో కన్ను పూర్తిగా కనిపించేది కాదు. ఏడవ తరగతి వచ్చేసరికి చూపు దాదాపుగా పోవడంతో చదువు మానేసి ఇంట్లో కూచుంది. అయితే చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండేది. ఫోన్లో క్రికెట్ చూసేది. ఈ విషయం తెలిసి అంధ బాలికలను వెతికి చదివించే బాధ్యతతో విశాఖ అంధ బాలిక ఆశ్రమ పాఠశాల వారు కరుణ తల్లిదండ్రులను ఒప్పించి తమ స్కూల్లో చేర్పించారు. రెసిడెన్షియల్ స్కూల్ కావడం వల్ల అక్కడ కరుణ తిరిగి చదువులో, ఆటల్లో పడింది. క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి గమనించిన పీటీ మేడమ్ కరుణనుత్సహించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. మూడింటిలో ప్రతిభ చూపుతూ ఆల్రౌండర్గా ఎదిగింది కరుణ. నేషనల్ సెలక్షన్స్లో భాగంగా 2023లో హైదరాబాద్లో, 2024లో హుగ్లీలో, 2025లో కొచ్చిలో మేచెస్ ఆడింది. సెలెక్టర్ల దృష్టిలో పడింది.60 బాల్స్లో 100 పరుగులుఅంధ మహిళల టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక కోసం ఆగస్టు నెలలో బెంగళూరులో 20 రోజుల క్యాంప్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మ్యాచ్లో కరుణ 60 బంతుల్లో 100 పరుగులు చేయడమే కాక 114 నాటౌట్గా నిలిచింది. బౌలింగ్లో, ఫీల్డింగ్లో కూడా ప్రతిభ చూపింది. దాంతో భారత జట్టుకు కరుణను సెలెక్ట్ చేశారు. ‘నాకు బాల్ కనపడదు. కాని దాని రాకను పసిగట్టగలను. బాల్ రాకను అర్థం చేసుకోలేనప్పుడు అది ఒంటికి తగిలి దెబ్బలయ్యేవి’ అని తెలిపింది కరుణ. ఆమె ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు. ఇన్ని ప్రతికూలతల్లోనూ ప్రతిభ చూపుతోంది కరుణ.ఆరు దేశాలతో...అంధ మహిళల టి20 వరల్డ్ కప్లో మొత్తం ఆరు దేశాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ, బెంగళూరుల్లో మ్యాచ్లు జరుగుతాయి. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, నే పాల్, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కలిసి 21 లీగ్ మేచ్లు, 2 సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్ను ఆడనున్నారు. ఈ వరల్డ్ కప్లో మన దేశం కప్పు గెలవాలని, మన కరుణ గొప్ప ప్రతిభ చూ పాలని కోరుకుందాం. -
Visakhapatnam: టీడీపీ సిండికేట్ కుట్రలు... కులాల బార్లపై కూటమి కన్ను
-
విశాఖపట్నంలో నేషనల్ డాగ్ షో అదరహో (ఫొటోలు)
-
విశాఖ స్టీల్ప్లాంట్లో తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదం తప్పింది. స్టీల్ ప్లాంట్లో కన్వేయర్ బెల్ట్ను (conveyor belts) ఆగంతకులు కట్ చేశారు. కన్వేయర్ బెల్ట్లు ఉక్కు తయారీకి అవసరమైన బొగ్గు, ఐరన్ ఓర్ వంటి ముడి సరకులను తరలించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కన్వేయర్ బెల్ట్ కట్ చేయడంతో ముడిసరుకు రవాణా నిలిచిపోయింది. కన్వేయర్ బెల్ట్ను ఉద్దేశపూర్వకంగా కట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. -
అనగనగా.. ఒక విశాఖ మెట్రో..
గత ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది. ఇంతలో జట్టు కట్టి జనాన్ని మాటలతో మభ్యపెట్టిన మాంత్రిక ప్రభుత్వం వచ్చింది. హాఠ్ ... మెట్రో మీరు కాదు మేమే కడతామంటూ పాత డీపీఆర్ని రద్దు చేసేసింది. అమరావతి మాదిరిగా డిజైన్లుండాలంటూ కేంద్రానికి కొత్తగా డీపీఆర్ పంపించింది. అదేమో.. అక్కడ ఆమోదించలేదాయే.. కూటమి సామ్రాజ్య నేతలు బతిమాలుతున్నా వాళ్లు పట్టించుకోలేదు. అసలే ‘సిక్స్’ కొట్టబోయి.. సూపర్ ఫ్లాప్ అయిన బాబు జట్టు.. మరోసారి జనాలకు మాయమాటలు చెప్పేందుకు సిద్ధమైంది. ఇదిగో మెట్రో అంటే.. అదిగో టెండర్లు అంటూ ఊదరగొట్టారు. ఆహా.. వైజాగ్కి మెట్రో వచ్చేసిందంటూ.. సోషల్ మీడియా సామంతరాజులంతా గ్రాఫిక్స్ జిమ్మికులతో అదరగొట్టేశారు. తీరా చూస్తే.. టెండర్లు గడువు ముగుస్తున్నా ఎవరూ ముందుకు రాలేదు. బాబ్బాబూ.. రండి.. వచ్చి టెండర్ పెట్టండి అని బతిమాలుతున్నా పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకొని.. ఈ ‘భారీ’ ప్రాజెక్టును భాగాలుగా చేసి.. వాటాల పేరుతో టెండర్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో వైజాగ్ మెట్రో కథ మళ్లీ మొదటికొచ్చింది. సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం చేసేది గోరంత.. చెప్పేది కొండంత. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండా.. కేంద్ర ప్రభుత్వం డీపీఆర్కు ఆమోదం చెప్పకుండానే గ్రాఫిక్ జిమ్మిక్కులు చూపించింది. ప్రజలను మభ్యపెట్టేందుకు జూలై 25న టెండర్లు పిలిచింది. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.6,250 కోట్లు(జీఎస్టీ అదనం)తో టెండర్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.11,498 కోట్లు కాగా.. మూడు కారిడార్లలో ఫేజ్–1 పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన ఏఎంఆర్సీ టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పనులను మూడేళ్ల కాలపరిమితితో పూర్తి చేయాలని టెండర్ షెడ్యూలులో చెప్పింది. టెండర్ సమర్పించిన 180 రోజుల వరకూ బిడ్ వ్యాలిడిటీ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 12వ తేదీతో టెండరు గడువు ముగియనుంది. ఒక్క సంస్థ కూడా టెండర్లలో పాల్గొనేందుకు సాహసించలేదు. దీంతో సర్కార్కి షాక్ తగిలినట్లయింది.సమయమిస్తాం.. రండి.. ప్లీజ్.! టెండర్లు వేసేందుకు ఎవరూ రాకపోవడంతో అసలు లోపం ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రభుత్వం.. కాంట్రాక్టు నిర్మాణ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ బిడ్డింగ్ సమావేశంలో కారణాలు చెప్పాలంటూ అధికారులు కోరారు. భారీ మొత్తంలో ప్రాజెక్టు టెండరు దక్కించుకున్నా.. లాభార్జన సాధ్యం కాదనీ.. పైగా టెండర్లో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడం అసాధ్యమని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 30 నెలల్లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాలని షరతు విధించడంపై విమర్శలు వెల్లువెత్తినట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో పాలుపోక టెండరు గడువు పొడిగిస్తామనీ సలహాలు, సూచనలు చెప్పాలని ప్రభుత్వం అభ్యర్థించంది. ప్యాకేజీలుగా విభజిస్తే ఆలోచిస్తామని కొన్ని సంస్థలు బదులిచ్చాయనీ.. దీంతో కూటమి ప్రభుత్వం పరువు పోగొట్టుకోకుండా ఉండేందుకు టెండరు ప్రక్రియని సమూలంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. జాయింట్ వెంచర్ మోడల్లో పనులు చేసేందుకు అవకాశం కలిపంచాలి కొన్ని సంస్థలు కోరాయి. దానికి కూడా అంగీకరించినట్లు సమాచారం. ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించి.. టెండర్లు అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో రైల్ పాలక మండలి సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్ని ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతి ఫేజ్లోనూ టెండర్ల విభజన..! విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును మొత్తం 140.13 కి.మీ మేర చేపట్టనున్నారు. తొలి దశలో 46.23 కి.మీ మేర చేపట్టనుండగా.. ఇందులో మొత్తం 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఇందులో 20.16 కి.మీ డబుల్ డెక్కర్ తరహాలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్ప్లాంట్ వరకూ పై వంతెనలు నిర్మిస్తారు. కొమ్మాది– స్టీల్ప్లాంట్, గురుద్వారా–పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం–చినవాల్తేరు కారిడార్లలో తొలి దశ కింద మెట్రోకు ప్రణాళిక చేశారు. కొమ్మాది–స్టీల్ప్లాంట్ మధ్య కారిడార్లో 34.40 కి.మీ మేర డబుల్ డెక్కర్ ట్రాక్ నిర్మించనున్నారు. అలాగే మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15.06 కి.మీ మేర రెండో కారిడార్ను నిర్మిస్తారు. గాజువాక నుంచి స్టీల్ప్లాంట్ మధ్య మరొక కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. ఇలా ప్రతి ఫేజ్ పనుల టెండర్లను కూడా ప్యాకేజీలుగా విభజించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏమీ లేకుండానే ఏదో చేసేస్తున్నామని డప్పులు కొట్టిన కూటమి ప్రభుత్వానికి మెట్రో షాక్ తగిలింది. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోయినా టెండర్ల పేరుతో అరచేతిలో మెట్రో చూపించేందుకు కూటమి సర్కారు సిద్ధమవడం సిగ్గు చేటని పలువురు విమర్శిస్తున్నారు. -
విశాఖలో కుండపోత వర్షం.. ఏపీలో మూడు రోజులు గట్టి వానలు..
సాక్షి, విశాఖ: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి విశాఖలో కుండపోత వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొడుతోంది. అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రోడ్లపై భారీ వరద నీరు చేరుకుంది.ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణం కేంద్రం హెచ్చరించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శుక్రవారం ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గురువారం తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. 🔸ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపిలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు🔸అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు🔸మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం pic.twitter.com/NCNsiHxmKQ— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 9, 2025 -
విశాఖ స్టీల్ప్లాంట్లో అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్ఎంహెచ్పీ విభాగం వద్ద కోకింగ్ కోల్లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్ కోల్ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి. -
విశాఖలో దారుణం.. మూగ బాలికపై అత్యాచారం
విశాఖపట్నం: విశాఖలోని సీతమ్మధారలో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి మతిస్థిమితం లేని 11 ఏళ్ల మూగ బాలికపై మద్యం మత్తులో మైనర్ మూగ బాలిక పై అత్యాచారంకి ఒడిగట్టిన ఇద్దరు నిందితులు. ఎస్ఆర్నగర్ ప్రాంతంలో పొదల్లోకి తీసుకొని వెళ్ళి మైనర్ మూగ బాలిక పై అత్యాచారం చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనను పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సీరియస్గా తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. -
హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం.. పెట్రోలియం ట్యాంక్పై పిడుగు
సాక్షి, విశాఖపట్నం: హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం జరిగింది. పెట్రోలియం ట్యాంక్పై పడిన పిడుగు పడింది. 20 ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపు చేయడంతో పాటు మరొక ఈతనల్ ప్లాంట్కి మంటలు వ్యాపించకుండా అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
ఇదేనా పాలనంటే?.. చంద్రబాబు సర్కార్పై బొత్స ఫైర్
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్పరం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దురదృష్టకరమంటూ బొత్స దుయ్యబట్టారు.పేద ప్రజల ఆరోగ్యం కోసం దివంగత మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని.. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వైఎస్సార్పీ ప్రభుత్వం చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు సర్కార్ విరమించుకోవాలన్నారు.మెడికల్ కాలేజీలప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని బొత్స అన్నారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదు. కూటమి పాలనలో పంటల సాగు తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడూ యూరియా సమస్య రాలేదు. కూటమి పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలుపడుతున్నారు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.‘‘దోపిడీ కోసం ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు వారికి కట్టబెట్టడం దుర్మార్గం. చంద్రబాబు ఎప్పుడూ ప్రైవేట్ మనిషే.. గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు చేశారు. కట్టిన కాలేజీలను కూడా ప్రైవేట్కు ఇవ్వడం.. మెడికల్ సీట్లు తిరస్కరించిన ప్రభుత్వం ఇదే. పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం ఉండాలని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్సార్.. ఈ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు...చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. నిధులు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆసుప్రతుల్లో పేద వాడికి వైద్యం అందడం లేదు. రూ. 2 లక్షల కోట్లు అప్పు చేశారు. అందులో రూ. 6 వేల కోట్లు ప్రజా ఆరోగ్యానికి వెచ్చించలేరా?. యూరియా సమస్య కోసం మాట్లాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. యూరియా సమస్య ఎందుకు వచ్చిందని సీఎం ఆలోచన చేయాలి. అది మానేసి తిరిగి అడిగిన వారిపై చర్యలు తీసుంటారట. ఎవరి మీద చర్యలు తీసుకుంటావ్?..మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. యూరియా కోసం లైన్లో నిలబడితే బఫె భోజనంతో పోల్చుతున్నారు. మీ మాటలు ప్రజలు గమనిస్తున్నారు. యూరియా సమస్యకు పరిష్కారం చూపించండి. 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన తెలిపి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. ఇప్పటికే నెల రోజులుగా సమస్య చూస్తున్నాం. యూరియా వినియోగం, డిమాండ్, అందుబాటులో ఉన్న లెక్కలపై స్పష్టత ఇవ్వండి. రైతులకు భరోసా ఇవ్వండి. అది మానేసి ఎదురుదాడి చేయడం ఏంటి..?..అడిగితే జైల్లో పెడతాం అంటున్నారు.. రేపనే రోజు ఉండదా..?. తప్పు చేసిన వారిని క్షమించాల్సిన పనిలేదు. రుషికొండ భవనాల్లో నిజంగా పెచ్చులు ఊడిపోతే కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. రుషికొండ కాంట్రాక్టర్కు డబ్బులు ఎవరు ఇచ్చారు?. సంపద సృష్టి అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమా..?. ఏ కాలేజీ ఎవరికీ ఇవ్వాలని అనుకున్నారో పేర్లతో సహా త్వరలో చెప్తా. దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా?. ఇక్కడే ఎందుకు వస్తుంది..?. ఏపీలో కూడా బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమే కదా ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారు. ఎందుకు యూరియా అందుబాటులో లేదు....స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వం నిర్వాకం వలన పోరాటం తప్పడం లేదు. ప్లాంట్ రక్షణ కోసం గత్యంతరం లేక ప్రజా సంఘాలతో పోరాటం చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని ప్రధాని, లేదా ఉక్కు మంత్రితో చెప్పించండి. మీకు జై కొడతాం.. పార్లమెంట్లో అయినా చెప్పించండి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అందరి సమస్య. ఈనెల 12న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు.. నేను వెళ్తున్నా.. టీడీపీ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రైవేటీకరణ జరగదని చెప్పాలి. ప్రభుత్వ నియంత నిర్ణయాలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా’’ అని బొత్స చెప్పారు.అశోక్ గజపతి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ..రుషికొండ భవనాలపై అశోక్ గజపతి వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇస్తూ.. రుషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్ చేయాలని అన్నారంటే.. అశోక్ గజపతి రాజు మానసిక పరిస్థితి ఏమిటో అర్ధమవుతుందన్నారు. అలాంటి వాళ్లను మెంటల్ హాస్పటల్ లో పెట్టాలన్న బొత్స.. ఆయనకు అహంకారం పుట్టుకతో వచ్చిందన్నారు. -
విశాఖలో మరో అద్భుతం.. తప్పక చూడాల్సిందే (ఫొటోలు)
-
స్టాక్స్లో పెట్టుబడి పేరుతో రూ.5.25 కోట్ల మోసం
విశాఖపట్నం: స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకానగర్కు చెందిన ఒక వ్యక్తిని సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా సంప్రదించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.5.25 కోట్లు దోచుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.పోగొట్టుకున్న డబ్బులో రూ.27 లక్షలను బాధితుడు రాజస్థాన్లో ఉదయ్పూర్కి చెందిన వ్యక్తి ఐడీఎఫ్సీ బ్యాంక్ ఖాతాకు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేశారు. ఆ డబ్బు పలు ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. వీటిలో కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన పాసుల వేణు, మామిడిపల్లి విజయ్ ఖాతాలు ఉన్నట్లు తేల్చారు.దీనితో ఒక ప్రత్యేక పోలీసు బృందం కరీంనగర్కు వెళ్లి విచారణ చేపట్టింది. వేణు బ్యాంక్ ఖాతా ద్వారా జగిత్యాలకు చెందిన దుర్గం గోపీకృష్ణ సైబర్ నేరగాళ్లకు డబ్బు పంపుతున్నట్లు తేలింది. అక్రమ లావాదేవీల్లో అమెరికా డాలర్, క్రిప్టో కరెన్సీలను కూడా వినియోగించడం గమనార్హం. ఈ ఘటనలో వేణు, గోపీకృష్ణలతోపాటు నర్మెట్ట జీవ అనే మరో సైబర్ నేరస్తుడు అరెస్ట్ అయ్యాడు. -
పదేళ్ల తర్వాత యుద్ధ నౌకల పండగ
సాక్షి, విశాఖపట్నం : అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే మహోజ్వల ఘట్టానికి విశాఖ నగరం మరోసారి వేదికగా మారుతోంది. నీలి కెరటాల్లో నౌకదళ పరాక్రమాన్ని చాటిచెప్పే విన్యాసాలకు తూర్పు నౌకాదళం ఆతిథ్యమివ్వబోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత.. విశాఖ నగరంలో యుద్ధ నౌకల పండుగగా పిలిచే.. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2026 నిర్వహించేందుకు భారత నౌకాదళం ప్రణాళికలు రూపొందించింది. ఫిబ్రవరిలో ఐఎఫ్ఆర్తో పాటు మిలాన్–2026 కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 24 వరకూ ఐఎఫ్ఆర్తో పాటు మిలాన్–2026ని విశాఖలో నిర్వహించనున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా దాదాపు 145 దేశాలకు ఆహ్వానాలు పంపించేందుకు సమాయత్తమవుతుండగా.. చైనాని పిలవాలా వద్దా అనే అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నాయి. నౌకాదళ పరాక్రమాన్ని చాటిచెప్పేలా 2026 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్)కు విశాఖ మహా నగరం ఆహ్వానం పలకనుంది. తూర్పు నావికాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం.. అనేక ఆధునిక యుద్ధ వ్యవస్థలతో మన సైనిక సంపత్తిలో కీలక స్థానం సంపాదించింది. ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శన పేరు చెప్తే వెంటనే విశాఖ గుర్తొచ్చే స్థాయికి ఎదిగింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో 2022లో ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ని విజయవంతంగా నిర్వహించింది. అదేవిధంగా.. 2024 ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో మిలాన్ విన్యాసాల్ని మరోసారి నిర్వహించింది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఆర్కు ఆతిథ్యమిస్తోంది.ఏమిటీ ఫ్లీట్ రివ్యూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సాగరంలో ఎదురుదాడికి దిగగల తన సత్తాను ప్రపంచదేశాలకు చాటిచూపించేవే ఫ్లీట్ రివ్యూలు. త్రివిధ దళాల అధిపతి అయిన రాష్ట్రపతి ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. మనదేశంలో 2001లో ముంబైలోనూ 2016లో విశాఖలో ఐఎఫ్ఆర్ని నిర్వహించారు. ప్రస్తుతం మరోసారి అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలకు విశాఖ వేదికగా నిలవబోతోంది.చంద్రగుప్తుని కాలంనుంచే భారతీయులు సముద్రయానంపై మంచి పట్టు సాధించినట్లు చరిత్ర చెబుతోంది. ఆనాటి నుంచి నేడు స్వయం శక్తితో అణుజలాంతర్గాములు నిర్మించే స్థాయికి చేరుకున్న భారత్ ప్రపంచదేశాలను ఆకర్షిస్తూ ఉంది. అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనతో ప్రపంచదేశాలు మరోసారి విశాఖతీరంవైపు దృష్టిసారించనున్నాయి. చైనాని పిలవాలా..వద్దా.? ఇటీవల చైనాతో చర్చలు జరిగిన నేపథ్యంలో.. ఐఎఫ్ఆర్కు చైనాని ఆహ్వానించాలా వద్దా అనే అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్చలు జరుపుతోంది. 2016లో నిర్వహించిన ఐఎఫ్ఆర్కు చైనాని ఆహ్వానించగా రెండు యుద్ధ నౌకలు, ఓ జలాంతర్గామి విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. ఈసారి ఆహ్వానం అందించాలా వద్దా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తోందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకూ భారత్లో జరిగే ఏ విన్యాసాలకు పాక్ని ఆహ్వానించలేదు. రాబోతున్న ఐఎఫ్ఆర్, మిలాన్–2026కి కూడా ఆహ్వానం లేదని రక్షణ వర్గాలు తెగేసి చెబుతున్నాయి. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలకు చెందిన దేశాలు ఐఎఫ్ఆర్లో భాగస్వామ్యం కాబోతున్నాయి.తొలిసారి 25..మూడోసారి 1452001లో భారత్లో తొలిసారి ముంబైలో ఐఎఫ్ఆర్ నిర్వహించిన సమయంలో 25 దేశాలు హాజరయ్యాయి. 2016లో విశాఖలో నిర్వహించినప్పుడు 51 దేశాలు హాజరయ్యాయి. 2025లో ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో ఐఎఫ్ఆర్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో 145 దేశాలకు ఆహ్వానం పంపించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు ఇండియన్ నేవీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్దనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి మొదలైన తరగతులకు చెందిన యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ టాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్, గ్రీన్టగ్స్ సత్తా చాటనున్నాయి. అలాగే కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన నౌకలు ఈ ఫ్లీట్ రివ్యూలో భాగస్వామ్యం కానున్నాయి. -
‘మిస్ విశాఖ’గా డాక్టర్ సృజన (ఫొటోలు)
-
ఏపీలో మూడు రోజులు వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు జోరందుకోనున్నాయి. పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 నుంచి 1.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. సెప్టెంబర్ 2న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉంది.సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2వ తేదీన విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.మూడో తేదీన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందనీ, గురువారం వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
సుగాలి ప్రీతీని అడ్డుపెట్టుకొని డిప్యూటీ సీఎం అయ్యావ్.. పవన్ పై YSRCP మహిళలు ఫైర్
-
ఒంటరి పోటీతో ఎలా ఉండేదో!.. చిరంజీవిని ఉద్దేశించే వ్యాఖ్యలు!
అల్లిపురం/జగదాంబ(విశాఖ): ఒంటరి పోటీతో జనసేనకు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండేవన్న విషయం ఎప్పుడూ చర్చనీయాంశమేనని ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్టీలు పెట్టి, రాజకీయ వ్యూహం లేకపోవడం వల్ల ఎంతో మంది వెళ్లిపోయారని అన్నారు. అందుకే కేవలం ‘ఐడియాలజీ’పై మాత్రమే కాకుండా, రాజకీయ వ్యూహంతో గత ఎన్నికల్లో కలిసి జట్టుగా పోటీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ‘విడిగా వెళితే వచ్చి ఉండేదో.. రాదో..’ అని ఈ సందర్భంగా అన్నారు.రానున్న రోజుల్లో సినిమాలూ చేస్తానని పవన్ స్పష్టం చేశారు. ‘సేనతో సేనాని’ పేరుతో విశాఖలో మూడు రోజుల పాటు నిర్వహించిన సమావేశాల అనంతరం శనివారం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ‘పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు త్రిశూల్ కార్యక్రమాన్ని దసరా తర్వాత ప్రారంభిస్తాం. ఏదో ఒక రోజు జనసేన జాతీయ పార్టీ అవుతుంది. రాష్ట్రంలో కూటమి సుస్థిరంగా ఉండాలి. జనసేన వల్లే విశాఖ స్టీలు ప్రైవేటుపరం కాకుండా ఆగింది’ అని పవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. చిరంజీవిని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు! కాగా, ‘పార్టీలు పెట్టి సరైన రాజకీయ వ్యూహం లేక వెళ్లిపోయారు’ అంటూ పరోక్షంగా అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ గురించే ఆయన మాట్లాడరనే గుసగుసలు సమావేశంలోనే కార్యకర్తల నుంచి వినిపించడం గమనార్హం. దీంతో, పవన్ వ్యాఖ్యలపై అటు సోషల్ మీడియాలో సైతం పలువురు నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
జనసేన ప్రచార పిచ్చి పరాకాష్టకు..!
సాక్షి, విశాఖపట్నం: ఆర్థికాంశాల కంటే సామాజిక అంశాలే వెనుకబాటుతనానికి కారణమని అంబేద్కర్ గ్రహించారని.. అలాంటి వ్యక్తి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పడం తెలిసిందే. అయితే ఆయన పార్టీ వాళ్లేమో.. అంబేద్కర్ కంటే పవనే గొప్ప అనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. అవును.. పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనలో జనసేన నేతలు మరీ దుర్మార్గంగా వ్యవహరించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటో కనిపించకుండా.. దానిపై పవన్ కళ్యాణ్ పోస్టర్ను అంటించారు. తాటి చెట్ల పాలెం సిగ్నల్ వద్ద ఈ పోస్టర్ వెలిసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన ఇంచార్జి పసుపులేని ఉషాకిరణ్ పేరిట ఈ పోస్టర్లు వెలిసినట్లు తెలుస్తోంది. మహాత్ముల ఫొటోలు.. వాళ్ల కొటేషన్లు అక్కడున్న గోడపై వరుసగా ఉన్నాయి. అందులో అంబేద్కర్ చిత్రాన్ని మాత్రమే జనసేన పోస్టర్ కవర్ చేసింది. దీంతో ఆ దారి గుండా వెళ్తున్న వాళ్లు అది చూసి.. జనసేన ప్రచార పిచ్చి పరాకాష్టను చేరిందని, తమ ప్రచార పిచ్చి కోసం అంబేద్కర్ను అవమానించారంటూ వ్యాఖ్యానించారు. ఇటు సోషల్ మీడియాలోనూ.. అంబేద్కర్ కంటే పవన్ గొప్పాడని జనసేన భావిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. పవన్ పరువు తీసే పనిలో జనసేనవాళ్లు బిజీగా ఉన్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ చర్యపై మీరెలా స్పందిస్తారు?.. -
ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ను ప్రారంభించిన వైభవ్ సూర్యవంశీ (ఫొటోలు )
-
జగన్ ప్యాలెస్ కాదు.. పర్యాటక రిసార్ట్
ప్రతి విషయంపైనా ప్రజలను మభ్యపెట్టి, అబద్ధాలను నిజాలుగా భ్రమింపజేస్తూ దుష్ప్రచారం చేయడం చంద్రబాబు నైజం అని మరోసారి నిరూపితమైంది...! విశాఖపట్నం రుషికొండ భవనాల సాక్షిగా... ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందే కుట్రలో భాగంగా... చంద్రబాబుతో పాటు కూటమి పార్టీలు సాగించినదంతా తప్పుడు ప్రచారమేననితేలిపోయింది..! రుషికొండలో నిర్మించినది మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్యాలెస్ కాదని, అది పర్యాటక శాఖ రిసార్ట్ అనే వాస్తవాన్ని చంద్రబాబు ప్రభుత్వం బహిరంగంగానే అంగీకరించింది...! అవాస్తవాలను అడ్డగోలుగా ప్రచారం చేసి... వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి... దాదాపు ఏడాదిన్నర పాటు రుషికొండ భవనాలను విస్మరించింది...! ఇప్పుడు అది వైఎస్ జగన్ ప్యాలెస్ కాదు.. పర్యాటక శాఖ రిసార్ట్ అంటూ నిజాన్ని ఒప్పుకొని నాలుక్కర్చుకుంది...! ...అయితే, ఇంతకాలం తాము సాగించిన తప్పుడు ప్రచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు... రుషికొండ భవనాలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ముందుపెట్టి పెద్ద డ్రామా ఆడింది..! సీఎం చంద్రబాబు డైరెక్షన్లో... రుషికొండ భవనంలో పవన్ కళ్యాణ్ తన నట కౌశలాన్ని చూపించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన.. రీల్ యాక్షన్, డ్రామా సన్నివేశాలను రియల్గానూ కొనసాగించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సినిమా సాగిందిలా..సాక్షి, అమరావతి, విశాఖపట్నం: విశాఖపట్నంలో జనసేన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్... శుక్రవారం ఉదయం హఠాత్తుగా రుషికొండపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అత్యద్భుత పర్యాటక భవనాలను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ తన సినీ నటనా చతురతను ప్రదర్శించారు. అద్భుతంగా నిర్మించిన ఈ భవనంపై గతంలోనూ ఏడుపు ప్రదర్శించిన పవన్ మరోసారి అదే కంటగింపు కొనసాగించారు. రూ.లక్షల్లో కరెంట్ బిల్లు వస్తోందంటూ ఆరోపించారు. రూ.450 కోట్లతో నిర్మించిన భవనం పాడైపోతోందంటూ రాగాలు తీశారు. అసలు వాస్తవం ఏమంటే, రుషికొండపై ప్రపంచం మెచ్చుకోదగ్గ ప్రభుత్వ భవనాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించింది. దీన్నిచూసి ఓర్వలేక ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి విష ప్రచారం చేశారు. పర్యాటకానికి ప్రపంచ చిరునామాగా మార్చాల్సిన ఈ భవనాన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. మరమ్మతుల పేరుతో భారీగా దోచుకునేందుకు పన్నాగం మొదలుపెట్టింది. ప్రైవేటుకు ఇస్తున్నట్లు నేరుగా చెబితే వ్యతిరేకత వస్తుందని గ్రహించిన చంద్రబాబు... పవన్ కళ్యాణ్ను పంపించి డ్రామా సృష్టించినట్లు తెలుస్తోంది. నాసిరకం అని ముద్ర వేసే కుట్ర: రాజధాని పేరిట రూ.వేల కోట్లతో అమరావతిలో తాత్కాలిక భవనాలు నిర్మించిన చంద్రబాబు... కేవలం రూ.450 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలను చూసి అచ్చెరువొందారు. అద్భుతంగా నిర్మించారంటూ గతంలో చంద్రబాబుతో పాటు పవన్ కూడా కితాబిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భవనాలను పరిశీలించిన మంత్రులు, ఆ పారీ్టల నేతలంతా కూడా అద్భుతం అని కొనియాడారు. అమరావతి తాత్కాలిక భవనాలు, రుషికొండ నిర్మాణాల వ్యయాలను బేరీజు వేస్తూ నిపుణులు సైతం ప్రశంసించారు. మేధావులు చంద్రబాబు సాగించిన దుబారా వ్యయం పైనా చర్చ లేవనెత్తారు. దీంతో రుషికొండ భవనం అద్భుతం కాదని నిరూపించేందుకు కుట్ర ప్రారంభించారు. ఏడాదిన్నర ఖాళీగా ఉంచి... దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఖాళీగా ఉంచేశారు. ఇప్పుడు నాసిరకంగా నిర్మించారంటూ విమర్శలు మొదలుపెట్టేందుకు స్కెచ్ వేశారు. పవన్ కళ్యాణ్ వెళ్లి చూసినప్పుడు లోపల సీలింగ్ విరిగి పడినట్లుగా చూపించారు. ఆ వీడియోలను నిశితంగా పరిశీలిస్తే.. బరువైన సీలింగ్ నాసిరకంగా ఉండడం వల్ల పడిపోతే.. 90 డిగ్రీల కోణంలో సరిగ్గా కిందపడుతుంది. కానీ, ఈ ముక్కలు కాస్త పక్కన పడ్డాయి. పైగా సీలింగ్ను చూస్తే రంపంతో కోసినట్లుగా కనిపిస్తోంది. అంటే, పవన్ వస్తున్నారని తెలిసి.. ప్రభుత్వం ఇదే అదనుగా సీలింగ్ను విరగ్గొట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా ఎలాంటి లీకులు లేకుండా సీలింగ్ ఎలా పడిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తే.. కావాలని రుషికొండ భవనానికి చెడ్డ పేరు తెచ్చేందుకు డ్రామాలు ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇల్లు ఖాళీగా ఉన్నా కరెంటు బిల్లు రాదా? రుషికొండ భవనాలకు భారీగా కరెంటు బిల్లు వస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిర్మాణాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. అయితే, పటిష్ఠ నిర్మాణాన్ని ఏడాదిన్నరగా వినియోగించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనేది వాస్తవం కాదా? భవనం ఖాళీగా ఉన్నప్పటికీ కరెంటు బిల్లు రాకుండా ఉంటుందా? అంటూ అధికారులు గుసగుసలాడడం కనిపించింది. అయినప్పటికీ, ఇదికూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తప్పేనని చెప్పడం చూస్తే... అభాండాలు వేసేందుకు ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరమ్మతుల పేరుతో కొట్టేసి.. ప్రైవేట్కు ఇచ్చేసి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ భవన సముదాయాలను ఖాళీగా ఉంచారు. ఇప్పుడు ప్రైవేట్కు ఇచ్చేందుకు స్కెచ్ వేశారు. టూరిజం భవనాలు కాబట్టి.. టూరిజం పాలసీలో భాగంగా తక్కువ ధరకు లీజుకిచ్చి, దాని ద్వారా భారీగా నొక్కేసేందుకు యత్నాలు మొదలైనట్లు పర్యాటక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థలు రుషికొండ టూరిజం భవనాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. దీనిపై చంద్రబాబు ఆధ్వర్యంలో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కానీ, ఈ భవనాలు ఎందుకు పనికొస్తాయి? అని స్వయంగా చంద్రబాబు గతంలో వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రైవేట్కు ఇవ్వాలని చూస్తున్నామని నేరుగా చెబితే తనపై వ్యతిరేకత వస్తుందని భావించి, పవన్ను పావుగా వాడుకున్నట్లుంది. విశాఖ పర్యటనలో ఉన్న పవన్తో చంద్రబాబు మాట్లాడి రుషికొండ భవనాలను పరిశీలించాలని ప్రైవేట్కు ఇవ్వాలా? ఎలా వాడాలి? అనేదానిపై మీడియాతో మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. బాబు పథకం ప్రకారమే... అక్కడ ఏర్పాట్లు చేసిన తర్వాత పవన్ ప్రవేశించి.. సినిమా షూటింగ్ తరహాలో యాక్షన్ డ్రామా మొదలుపెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, కర్నూలుకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి హత్య అంశాన్ని ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ లబి్ధకి ఉపయోగించుకున్నారు. దీనిపై ప్రీతి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే మొదట సుగాలి ప్రీతి కేసు ఫైల్ పైనే సంతకం చేస్తానని పవన్కళ్యాణ్ చెప్పిన వైనాన్ని ప్రస్తావిస్తూ సూటిగా ప్రశ్నిoచారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని పూర్తిగా డైవర్ట్ చేసేందుకు పవన్.. విశాఖలో రుషికొండ డ్రామాకు తెరతీశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంత్రులూ.. ఏం చేద్దాం చెప్పండి..! రుషికొండ భవనాలు పర్యాటక శాఖ రిసార్ట్ అంటూ వాస్తవాన్ని అంగీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భవనాలను సముచితంగా ఉపయోగించుకునేలా అధ్యయనానికి, సిఫార్సులు చేయడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దీనికి కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ రిసార్ట్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో నిర్ణయం తీసుకోవడానికి మంత్రుల బృందం ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాలని ఉత్తర్వుల్లో సూచించారు.విశాఖ స్టీల్ప్లాంట్పై కిక్కురుమనకుండా..» అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ మాట మారిందేల? » ప్లాంట్ ప్రైవేటీ కరణపై జనసేనాని రెండు నాల్కల ధోరణివిశాఖ స్టీల్ ప్లాంట్లోని కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగిస్తూ ఇటీవల కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ గురించి పవన్ కిక్కురుమనలేదు. అసలు ఆ విషయం రాకుండా కవర్ చేయడానికి తాపత్రయపడ్డారు. స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలు చూసేందుకు వెళ్లారు. అందులో సీలింగ్ వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్నిచోట్ల ఊడిందని చెబుతూ రాద్ధాంతం చేశారు. అటు రూ.వేల కోట్ల విలువైన ఉక్కు పరిశ్రమపై మాట్లాడకుండా డైవర్ట్ చేస్తూ ఇలా పూట గడిపేశారని విశాఖ యువత దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో టీడీపీ, జనసేన ఎంపీల బలం ఉన్న ఈ సమయంలో పవన్కళ్యాణ్ కీలకమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై విశాఖ పర్యటనలో బేలగా మాట్లాడారు. ఇది కార్మికులతో పాటు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేంద్రం మెడలు వంచైనా ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కార్మికులు ప్రతిఘటిస్తుంటే.. ‘‘ఢిల్లీ అంటే ఏమనుకుంటారు?’’ అంటూ వారిని పరోక్షంగా తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వేగంగా చేపడుతున్న ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలేవీ చేపట్టకపోగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ తప్పించుకునే ధోరణి కనబరిచారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా దీక్షకూ సిద్ధమని మాట్లాడిన జనసేన అధినేత, ఇప్పుడు కార్మికులను తప్పుపట్టేలా మాట్లాడుతున్నారు. క్యాప్టివ్ మైన్స్ తేవడం చేతకాక వైఎస్సార్సీపీపై నిందలా? » చంద్రబాబు, పవన్ చేతికానితనంతోనే ప్రైవేటీకరణ » వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదని.. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతకానితనం వల్లే కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను వేగంగా కొనసాగిస్తోందని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో ఉంటూ టీడీపీ, జనసేనలు స్టీల్ ప్లాంట్కు ఎందుకు క్యాప్టివ్ మైన్స్ను సాధించలేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ లాస్లో ఉన్నట్టు చూపించి అమ్మేసే పనిలో ఉంటే మౌనం దాల్చారని పేర్కొన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని... తాము ఉద్యోగులు, కార్మికుల తరుఫున పోరాడతామని చెప్పారు. ఈ ప్లాంట్కు జపాన్, కొరియా, అమెరికా, రష్యాల్లో మార్కెట్ ఉందని, క్యాప్టివ్ మైన్స్ ఇస్తే అద్భుతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. టీడీపీ, జనసేనలు చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపింది వైఎస్ జగన్. ఆపలేక చేతులెత్తేసింది మీరు. చిత్తశుద్ధి లేని కూటమి నాయకులు, ఎన్నికలకు ముందు ఒకలా, గెలిచాక మరోలా మాట్లాడుతున్నారు’ అంటూ జూపూడి మండిపడ్డారు. -
టైటాన్స్ ఓటమితో మొదలు
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) కొత్త సీజన్ను కూడా తెలుగు టైటాన్స్ పరాజయంతో ప్రారంభించింది. గత సీజన్లో ఏడో స్థానంలో నిలిచిన టీమ్ ఈసారి విశాఖపట్నం వేదికగా కూడా శుభారంభం చేయలేకపోయింది. శుక్రవారం ప్రారంభమైన పీకేఎల్ 12వ సీజన్ తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 38–35 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్ను ఓడించింది. టైటాన్స్ తరఫున ఆల్రౌండర్ భరత్ 11 పాయింట్లు సాధించగా, కెప్టెన్ విజయ్ మలిక్ 6 పాయింట్లు నమోదు చేశాడు. తలైవాస్ జట్టులో రైడర్ అర్జున్ దేశ్వాల్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలవగా, కెపె్టన్ పవన్ సెహ్రావత్ చెలరేగి 9 పాయింట్లతో జట్టును విజయం దిశగా నడిపించాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి తలైవాస్ జట్టు 14–13తో ఆధిక్యంలో నిలవగా, రెండో అర్ధ భాగంలోనూ రెండు పాయింట్లు ముందంజలో నిలిచిన జట్టు చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. మొదటి రోజే జరిగిన రెండో మ్యాచ్లో ‘టైబ్రేక్’ ద్వారా ఫలితం వచ్చింది. బెంగళూరు బుల్స్, పుణేరి పల్టన్ మధ్య జరిగిన ఈ పోరు నిర్ణీత సమయంలో 32–32తో సమంగా ముగిసింది. బుల్స్ తరఫున ఆకాశ్ షిండే 12, ఆశిష్ మలిక్ 8 పాయింట్లు సాధించగా... పల్టన్ ఆటగాళ్లలో ఆదిత్య షిండే 9, పంకజ్ మోహితే 6 పాయింట్లు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత పుణేరీ ‘టైబ్రేక్’లో విజయం సాధించింది. ఐదు రైడ్ల ఈ టైబ్రేక్ను పల్టన్ 6–4తో గెలుచుకుంది. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటల నుంచి), గుజరాత్ జెయింట్స్తో యు ముంబా (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
విశాఖలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంపై పోతిన సెటైర్లు
-
విశాఖ: మంటల్లో ఆర్టీసీ బస్సు దగ్దం.. ఓవర్లోడ్ కారణమా?
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని శాంతిపురం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. అయితే, ఎలక్ట్రిక్ బస్సుల్లో విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.వివరాల ప్రకారం.. కుర్మన్నపలెం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి పురం జంక్షన్ వద్ద బస్సు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో, బస్సులో ఉన్న ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బస్సు పూర్తిగా దగ్దమైంది. అయితే, బస్సులో ఓవర్లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పలువురు చెబుతున్నారు. బస్సు కెపాసిటీ 65 మంది కాగా 100కు పైగా మంది ప్రయాణించినట్టు తెలిసింది. వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు సమాచారం. -
విశాఖలో విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్
మధురవాడ (విశాఖ జిల్లా): మాట వినలేదని ఓ విద్యార్థి చేయిని టీచర్ విరగ్గొట్టిన ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురవాడ ఆదిత్యనగర్లో ఉన్న శ్రీ తనుష్ ప్రైవేట్ స్కూల్లో మధురవాడకు చెందిన నరేష్ (13) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం క్లాసులో ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన సోషల్ టీచర్ మోహన్..కోపంతో నరేష్ను కొట్టి, షర్ట్ పట్టుకుని గట్టిగా తోశాడు. దీంతో బాధిత విద్యార్థి ఇనుప బెంచీపై పడడంతో చెయ్యి విరిగింది. అంతటితో ఆ టీచర్ ఆగకుండా.. అక్కడే మోకాళ్లపై నరేష్ను కూర్చోబెట్టి అమానుషంగా ప్రవర్తించాడు.ఇంటికి వెళ్లి విద్యార్థి తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పగా..వారు వైద్యం నిమిత్తం నరేష్ను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. టీచర్ మోహన్ పరారీలో ఉన్నాడు. బుధవారం వినాయక చవితి సందర్భంగా సెలవు కావడంతో, గురువారం పాఠశాలకు చేరుకున్న తండ్రి ఆదినారాయణ ఇతర కుటుంబ సభ్యులు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ బిడ్డకు న్యాయం చేయకపోతే ఊరుకునేది లేదంటూ నినదించారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల అసోసియేషన్ ప్రతినిధులు స్కూల్ యాజమాన్యానికి వంత పాడటం గమనార్హం. ఘటనాస్థలికి మండల విద్యాశాఖ అధికారి అనురాధ, పీఎంపాలెం పోలీసుస్టేషన్ ఎస్ఐ సునీత చేరుకుని విచారణ చేట్టారు. -
విశాఖతీరంలో కబడ్డీ కూత
విశాఖ స్పోర్ట్స్: భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా... చెప్పుకోదగిన స్థాయిలో అభిమానుల్ని సంపాదించుకున్న లీగ్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్). గత 11 ఏళ్లుగా కబడ్డీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న పీకేఎల్ 12వ సీజన్కు రంగం సిద్ధమైంది. నేడు ‘జాతీయ క్రీడా దినోత్సవం’ రోజున ఉక్కు నగరం విశాఖపట్నంలో కబడ్డీ కూత మొదలు కానుంది. ప్రతీ రోజు రెండు మ్యాచ్లు జరుగుతాయి. తొలి పోరు తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరుగుతుంది. తర్వాత రెండో మ్యాచ్లో బెంగళూరు బుల్స్తో పుణేరి పల్టన్ తలపడుతుంది. గత సీజన్లలా కాకుండా కొత్త షోకులతో ఈ సీజన్ పోటీలు జరుగుతాయి. మ్యాచ్ ‘టై’తో కాకుండా ఫలితంలో ముగించేందుకు టై–బ్రేకర్ను తీసుకొచ్చారు. లీగ్ దశ తర్వాత పాయింట్ల పట్టికలో తొలి 4 జట్లు కాకుండా మొత్తం 8 జట్లు టైటిల్ రేసులో ఉండేలా ప్లే ఆఫ్స్ను మార్చారు. ఫుట్బాల్లో పెనాల్టీ షూటౌట్ తరహా ఐదు రెయిడ్ల షూటౌట్ను ఇకపై చూడొచ్చు. జయజయధ్వానాలతో... సీజన్ ప్రారంభానికి ముందు గురువారం లీగ్లో పాల్గొనే 12 ఫ్రాంచైజీల కెపె్టన్లు భారత సాయుధ బలగాలకు జేజేలు పలికారు. ఇందులో భాగంగా విశాఖ తీరంలో ఉన్న ‘ఐఎన్ఎస్ కుర్సురా’ జలాంతర్గామిని 12 జట్ల కెపె్టన్లు సందర్శించారు. ఈ సబ్ మెరైన్ 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ‘కూత’ లేదు ఈ సీజన్ లీగ్ దశను నాలుగు వేదికల్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ఒక్క మ్యాచ్ను ఏర్పాటు చేయలేదు. తెలుగు టైటాన్స్ ఆడే మ్యాచ్లన్నీ వైజాగ్కు తరలించారు. ఈ అంచె పోటీలు సెప్టెంబర్ 11న ముగిశాక... జైపూర్లో 12 నుంచి 28 వరకు జరుగుతాయి. ఆ మరుసటి రోజే చెన్నై అంచె పోటీలు మొదలై అక్టోబర్ 10న ముగుస్తాయి. ఆఖరి లీగ్ దశ పోటీలు ఢిల్లీలో 11 నుంచి 23 వరకు జరుగుతాయి. బరిలో 12 ఫ్రాంచైజీలివే... తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, జైపూర్ పింక్పాంథర్స్, పట్నా పైరేట్స్, పుణేరి పల్టన్, తమిళ్ తలైవాస్, యుముంబా, యూపీ యోధాస్. లీగ్ దశలో 108 మ్యాచ్లు మారిన ఫార్మాట్లో 12వ సీజన్ను నిర్వహిస్తారు. లీగ్ దశలో 108 మ్యాచ్లు జరుగుతాయి. 12 ఫ్రాంచైజీలు 18 మ్యాచ్ల చొప్పున ఆడతాయి. గెలిచిన జట్టుకు 2 పాయింట్లు. ఓడితే పాయింట్ ఉండదు. బోనస్ పాయింట్ను ఎత్తేశారు. కొత్త టై–బ్రేక్ పద్ధతిలో స్కోరు సమమైతే గోల్డెన్ రెయిడ్కు వెళ్లాల్సి ఉంటుంది. -
విశాఖలో భక్తి ముసుగులో మరో మోసం
సాక్షి, విశాఖపట్నం: పాత గాజువాక లంకా మైదానంలో ఎస్వీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహం వద్ద నిర్వాహకులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. సుందర వస్త్ర మహాగణపతి దర్శనానికి విచ్చేసిన భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు విగ్రహం వద్దకు వచ్చి దర్శనాలను కొద్దిసేపు నిలిపివేశారు.ఆంక్షలకు తూట్లు పొడుస్తూ ఉత్సవ నిర్వాహకులు దర్శనానికి వచ్చేవారి నుంచి టికెట్ల పేరుతో వసూళ్లకు పాల్పడటంతో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. భారీ వినాయకుడి మండపం వద్ద అర్చనలు, అన్న సమారాధన, వాహనాల పార్కింగ్, చెప్పులు భద్రపరచడం వంటి పేర్లతో వ్యాపారానికి తెరలేపడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వినాయక మండపాల వద్ద కమర్షియల్ టికెట్లు ఉండకూడదని పెట్టిన నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని గాజువాక సీఐ పార్థసారథి హెచ్చరించారు. -
రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా భారత్
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్తో నౌకా నిర్మాణాల్లో నంబర్–1గా నిలిచామని పేర్కొన్నారు. విశాఖలోని తూర్పు నౌకాదళంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.అత్యాధునిక సాంకేతికతో నిర్మించిన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకల్ని కమిషనింగ్(ప్రారంబోత్సవం) చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి దేశ రక్షణ, ఆత్మనిర్భర్ భారత్ తదితర అంశాలపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఆర్థిక భద్రతకు నౌకాదళం మూలస్తంభం ‘‘సముద్ర రక్షణకే పరిమితం కాకుండా.. దేశ ఆర్థిక భద్రతకు మూలస్తంభంగా నౌకాదళం ఉంది. ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని పెంచేలా యుద్ధ నౌకల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాల్లోనూ నేవీ సేవలు శ్లాఘనీయం. అత్యాధునిక స్టెల్త్ ఫీచర్లు, రాడార్లు, అధునాతన నిఘా వ్యవస్థ, సూపర్ సోనిక్ క్షిపణులతో కూడిన వ్యవస్థలు పొందుపరిచిన ఐఎన్ఎస్, ఉదయగిరి, హిమగిరి లీడ్ షిప్స్గా వ్యవహరిస్తాయి. వార్షిప్ డిజైన్ బ్యూరో ద్వారా రూపొందించిన 100, 101 యుద్ధనౌకలు కావడం గర్వకారణం. ఆత్మనిర్భర్భారత్లో భాగంగా.. స్వదేశీ పరిజ్ఞానాన్ని భారత్ ఎంతలా అందిపుచ్చుకుంటుందో ఈ నిర్మాణాలే ప్రత్యక్ష ఉదాహరణ. స్వదేశీ పరిజ్ఞానం వినియోగంలో ముందు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠీ మాట్లాడుతూ.. లీడ్ వార్షిప్స్ డబుల్–కమిషనింగ్ భారతదేశ సాగర శక్తి నిరంతర పురోగతి, సామర్థ్య విస్తరణకు స్పష్టమైన సంకేతాలని పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించడంలో ఇండియన్ నేవీ ముందు వరసలో ఉందని తెలిపారు. యుద్ధ నౌకల పరిశీలన ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకల్ని జాతికి అంకితం చేసిన అనంతరం వాటిని మంత్రి రాజ్నాథ్సింగ్ పరిశీలించారు. తర్వాత పాతతరం ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకల్లో విధులు నిర్వర్తించిన ఎక్స్ కమాండింగ్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి ఫోటోలు తీసుకున్నారు. కార్యక్రమంలో తూర్పునౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, నేవీకి చెందిన ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.హిందూ మహాసముద్రంలో పెరిగిన బలం ఈ రెండు యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరడంతో హిందూ మహాసముద్రంలో భారత్ బలం మరింత పెరిగింది. మొదటి ప్రాధాన్య భద్రతా భాగస్వామిగా భారత్ అవతరించనుంది. పైరసీని ఎదుర్కోవడం, స్మగ్లింగ్, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటం, సముద్ర ఉగ్రవాదాన్ని అరికట్టడంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సేవలందించడంలో ఉదయగిరి, హిమగిరి గేమ్ ఛేంజర్స్ కానున్నాయి. అరేబియా సముద్రం నుంచి తూర్పు ఆఫ్రికన్ సముద్ర తీరం వరకు నావికాదళ కార్యకలాపాలు సజావుగా నిర్వహించడం ప్రశంసనీయం.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం యుద్ధాలు, శత్రుదేశాలైనా సరే దాడులకు భారత్ పూర్తి వ్యతిరేకం. దూకుడుగా వ్యవహరించి ఇప్పటివరకూ ఏ దేశంపైనా భారత్ దాడి చెయ్యలేదు. కానీ పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుంగదీసింది. దేశ భద్రతపై దాడి జరిగితే ఎలా స్పందించాలో భారత్కు తెలుసు. దానికి ఉదాహరణే ఆపరేషన్ సిందూర్. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదు. విరామం మాత్రమే ఇచ్చాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటానికి సిద్ధంగా ఉన్నాం.’’ -
కడలిపైకి కదననౌకలు
సాక్షి, విశాఖపట్నం: భారత రక్షణశాఖ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ.. రెండు భారీ యుద్ధనౌకలు మంగళవారం నౌకాదళ అమ్ములపొదిలో చేరనున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో నిరి్మతమైన నీలగిరి క్లాస్లో కీలకమైన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధనౌకలు విశాఖపట్నం వేదికగా జాతికి అంకితం కానున్నాయి. అత్యాధునిక ప్రాజెక్ట్–17లో భాగంగా మలీ్ట–మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్లుగా రూపుదిద్దుకున్న వీటిని విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ సర్కార్లో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ త్రిపాఠీ కమిషనింగ్ చేయనున్నారు. ముంబైలోని మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్)లో ఉదయగిరి, కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్–ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ)లో హిమగిరి యుద్ధనౌకలు నిర్మించారు. ఆధునిక కంబైడ్స్ డీజిల్ లేదా గ్యాస్ (సీవోడీవోజీ) ప్రొపల్షన్ ప్లాంట్లు, అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్తో పాటు ఇండియన్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ల సూట్స్ ఉన్న ఈ నౌకలకు సముద్రజలాల్లో నిర్దేశిత లక్ష్యాలను నూరుశాతం పూర్తిచేయగల సామర్థ్యం ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా సముద్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు, దేశ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఇవి ముఖ్య భూమిక పోషించనున్నాయి. 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యుద్ధనౌకలు పలు రికార్డులను లిఖించనున్నాయి.ఐఎన్ఎస్ ఉదయగిరి.. నేవీ వార్íÙప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ షిప్. రెండు వేర్వేరు షిప్యార్డ్ల్లో నిర్మించిన రెండు ఫ్రంట్లైన్ సర్ఫేస్ యుద్ధనౌకల్ని ఒకేసారి ప్రారంభించడం నౌకాదళ చరిత్రలో ఇదే తొలిసారి. భారత షిప్యార్డ్లు అవలంబించిన మాడ్యులర్ నిర్మాణ పద్ధతిలో భాగంగా నిరి్మతమై అత్యంత వేగవంతంగా కమిషనింగ్ అవుతున్న యుద్ధనౌక ఉదయగిరి. ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణంలో చైనాను భారత్ అధిగమించింది. చైనా 19 వార్íÙప్స్ నిరి్మస్తుండగా.. భారత్ నిర్మాణ సంఖ్య 20కి చేరుకుంది. ఈ షిప్స్ తయారీలో 200 ఎంఎస్ఎంఈలు పాల్గొన్నాయి. వీటి నిర్మాణం ద్వారా 4 వేలమందికి ప్రత్యక్షంగా, 10 వేలమందికి పరోక్షంగా ఉపాధి లభించింది. -
స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి: బొత్స
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతారు కానీ.. చర్యలు మాత్రం ఉండవా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. దోపిడీలు దౌర్జన్యాలు భూ కబ్జాలు పెరిగిపోయాయి.అర్హత కలిగిన వికలాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారు. వికలాంగులను తీసుకొని కలెక్టర్లను కలుస్తాం. ఈనెల 30 లోపు సమస్య పరిష్కరించాలి. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా?. దివ్యాంగుల తరఫున కూడా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పారు. 32 విభాగాలను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి. vదేశంలో ఎక్కడా లేనివిధంగా ఎందుకు జరుగుతుంది. ఈనెల 30 తేదీన విశాఖలో జరిగే జనసేన సమావేశంలో స్టీల్ ప్లాంట్పై పవన్ కళ్యాణ్ తన వైఖరి చెప్పాలి. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా గిన్నిస్ బుక్ గురించి ఆలోచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడలేదు. చంద్రబాబు, పవన్కు ప్రధానిని అడిగే బాధ్యత లేదా?. రాజకీయ, ప్రజా కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. స్టీల్ ప్లాంట్పై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే ప్రధాని దగ్గరకు వెళ్తాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలతో కలిసి వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటానికి అందరూ కలిసి రావాలి’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంఖ్య బలం ఉన్నపుడు పోటీ పెట్టడానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం. ప్రణబ్ ముఖర్జీ, రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, కోడెల శివ ప్రసాద్ ఎన్నికకు మద్దతు తెలిపాం. ఇండియా కూటమి అభ్యర్థి జడ్జిగా ఉన్నప్పుడే చంద్రబాబుకు సైకిల్ సింబల్ వచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. చంద్రబాబు ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్టు చేస్తారా? అని ప్రశ్నించారు. -
కోట్ల స్థలాన్ని ఆంధ్రజ్యోతికి ఎలా ఇస్తారు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని విలువైన స్థలాలను కారుచౌకగా అనుయాయులకు అప్పగిస్తున్న కూటమి ప్రభుత్వం, తాజాగా తన తోకపత్రిక ఆంధ్రజ్యోతికి అర ఎకరం హౌసింగ్ బోర్డు స్థలం విశాఖ నగరపాలక సంఘం ద్వారా కేటాయించాలన్న ప్రయత్నం చివరి నిమిషంలో నిలిచిపోయింది. కోట్లాది రూపాయల స్థలాన్ని ఆంధ్రజ్యోతికి నామమాత్రపు ధరకు ఎలా కేటాయిస్తారంటూ శుక్రవారం కౌన్సిల్లో వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించడంతో ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు.వివరాల్లోకి వెళితే, పరదేశీపాలెంలోని సర్వే నెంబరు 203/2పీలోని అర ఎకరం స్థలం కేటాయింపు అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ ముందుకు తెచ్చింది. నిజానికి రెగ్యులర్ అజెండాను నాలుగైదు రోజులు ముందుగానే కార్పొరేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఈ కేటాయింపును రెగ్యులర్ అజెండాలో చేర్చకుండా టేబుల్ అజెండాగా, అదీ చివరి 67వ అంశంగా ఆఖరు నిమిషంలో కౌన్సిల్ ముందుకు తెచ్చారు.అనంతరం టేబుల్ అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించారు. చివరి నిమిషంలో వైఎస్సార్సీపీ సభ్యులు 67 వ అంశాన్ని తిరిగి ప్రస్తావించారు. ఇంతటి కీలక అంశాన్ని టేబుల్ అజెండాగా చేర్చి, ఎలా ఆమోదింపజేస్తారంటూ గట్టిగా నిలదీశారు. దీనితో తప్పనిసరి పరిస్థితిల్లో 67వ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు. కాగా, ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరా ధర దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా.గతంలోనూ కారుచౌకగా కేటాయింపు, రద్దు చేసిన వైఎస్సార్సీపీ.. వాస్తవానికి 2017లో ఇదే ప్రాంతంలో రూ.7.26 కోట్లు విలువ చేసే స్థలాన్ని రూ.50.50 లక్షలకే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్, ఆమోద పబ్లికేషన్స్కు కేటాయించింది. ఆ కేటాయింపును గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసి, ఆ స్థలాన్ని పేదలకు పంచాలని నిర్ణయించింది. ఇప్పుడు బాబు ప్రభుత్వం మరోసారి అదే సంస్థకు భూమిని అతి తక్కువ ధరకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన మేయర్..
సాక్షి, విశాఖ: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా విశాఖలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిరసనలకు దిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు.వివరాల ప్రకారం.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల సమావేశానికి వచ్చారు. ఈ సందర్బంగా కౌన్సిల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేయర్ పోడియం ముందు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిరసనలకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్లో తీర్మానం చేయాలని నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేశారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు సీపీఎం, సీపీఐ కార్పోరేటర్లు మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన మేయర్..వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల పోరాటానికి జీవీఎంసీ మేయర్ దిగి వచ్చారు. స్టీల్ ప్లాంట్పై జీవీఎంసీ కౌన్సిల్లో కీలక తీర్మానం జరిగింది. స్టీల్ ప్లాంట్లో తాజా పరిణామాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కౌన్సిల్. ప్లాంట్లో 44 విభాగాల ప్రైవేటీకరణ ప్రకటనను ఉపసంహరించాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్కు ముడి ఇనుము కేటాయించాలి. ఆర్ కార్డులు కలిగిన నిర్వాసితులకు ఉక్కు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలనీ తీర్మానం చేశారు. ఈ తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం తీసుకుంది. -
పోక్సో కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు
సాక్షి,విశాఖ: పోక్సో కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి రూ. 3 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో 2024,సెప్టెంబర్ 24న కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు నిందితుడు చిత్తరంజన్ ఏడవ తరగతి చదువుతున్న బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదే విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక తన తోటి విద్యార్థులు తనపై జరుగుతున్న లైంగిక దాడికి గురించి చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. టీచర్ల సాయంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజా కేసు విచారణలో విశాఖ కోర్టు నిందితుడు చిత్తరంజన్కు కఠిన శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. -
Happy Anniversary : వరాహ లక్ష్మి నర్సింహ స్వామి వారి సేవలో మాజీ మంత్రి రోజా (ఫొటోలు)
-
బాలుడి కడుపులో ఫుట్బాల్ సైజ్ కణితి
విశాఖపట్నం: హాయిగా ఆడిపాడుతూ, ఎంచక్కా చదువుకునే వయసు ఆ బాలుడిది. పదహారేళ్ల ప్రాయంలో ఉరకలెత్తే ఉత్సాహంతో ఉండాల్సిన ఆ బాలుడు కాస్తా దాదాపు నెల రోజుల నుంచి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ, తరచు జ్వరం వస్తుండడంతో నీరసించిపోయాడు. వేరే ఆస్పత్రులలో చూపించగా.. కాలేయంలో ఇన్ఫెక్షన్ ఉందని మందులు వాడారు.అయినా ఫలితం లేకపోవడంతో విశాఖపట్నంలోని కిమ్స్ సీతమ్మధార ఆస్పత్రికి తీసుకురాగా.. ఇక్కడ పరీక్షలు చేస్తే అది కేన్సర్ అని తేలింది. అతడికి అరుదైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించిన సీనియర్ జీఐ, లివర్ సర్జన్ డాక్టర్ మురళీధర్ నంబాడ ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు.“ఆ బాలుడు ఇక్కడకు వచ్చేసరికే అతడికి పొట్ట బాగా ఉబ్బిపోయి ఉంది. దాంతో కాలేయంలో ఏదో ఇబ్బంది ఉందని గుర్తించాము. పరీక్షలు చేయగా అతడికి అత్యంత అరుదైన కాలేయ కేన్సర్ వచ్చిందని తెలిసింది. దాన్ని వైద్య పరిభాషలో మాలిగ్నెంట్ హెపాటిక్ యాంజియో మైలోలిపోమా అంటారు. ఇది కాలేయంలో కుడివైపు దాదాపు సగభాగాన్ని ఆక్రమించుకుని ఉంది. సీటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి పరీక్షలు కూడా చేసి, కణితి సరిగ్గా ఎక్కడినుంచి ఎక్కడివరకు ఉంది, ఏయే భాగాలను ఆక్రమించింది, ఎలాంటి పొజిషన్లో ఉందనే విషయాలను గుర్తించాం.అనంతరం వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. మొత్తం శస్త్రచికిత్సకు దాదాపు ఆరున్నర గంటల సమయం పట్టింది. 4.5 కిలోల బరువున్న ఆ కణితి.. దాదాపు ఫుట్బాల్ పరిమాణంలో ఉంది. ఇది చాలా పెద్ద కణితి. ఇలాంటి దాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా తొలగించడం కూడా చాలా కష్టం. కణితి నుంచి ఏమాత్రం రక్తస్రావం కాకూడదు. అలాగే కణితి కూడా కాలేయంలో మిగలకుండా పూర్తిగా తొలగించాలి. అదే సమయంలో ఆరోగ్యవంతమైన భాగాన్ని యథాతథంగా కాపాడుకోవాలి.ఎందుకంటే, కాలేయం అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. రోగి వయసు 16 సంవత్సరాలే కాబట్టి, తర్వాత కాలేయం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల మిగిలిన కాలేయాన్ని కాపాడుకోవాలి. అయితే కణితి పరిమాణంతో పాటు అది ఉన్న ప్రదేశం కూడా చాలా సమస్యాత్మకం. దాంతో అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసి, పూర్తి స్థాయి కచ్చితత్వంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది” అని డాక్టర్ మురళీధర్ వివరించారు.శస్త్రచికిత్స అనంతరం బాలుడు వేగంగా కోలుకోవడంతో ఐదోరోజే డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం కీమోథెరపీ ఆరు సైకిల్స్ కూడా పూర్తిచేసుకుని అతడు తన రోజువారీ కార్యకలాపాలను సాధారణంగానే చేసుకోగలుగుతున్నాడు. అత్యంత సంక్లిష్టమైన ఇలాంటి శస్త్రచికిత్సలను కూడా సీతమ్మధారలోని కిమ్స్ ఆస్పత్రిలో విజయవంతంగా చేసి, తమ కుమారుడి ప్రాణాలు కాపాడినందుకు బాలుడి తల్లిదండ్రులు ఆస్పత్రి వైద్యులకు, సిబ్బందికి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువతీ యువకుల దుర్మరణం
విశాఖపట్నం : బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో యువతీ యువకులు దుర్మరణం చెందారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో చంద్రంపాలెం జెడ్పీ హైసూ్కల్ ఎదురుగా హైవేపై చోటుచేసుకున్న ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు. నగర పరిధిలోని జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వాసుపల్లి సతీష్ (19) భవన నిర్మాణ సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అప్పుడప్పుడు చేపలుప్పాడ లో ఉంటున్న తాతగారి ఇంటికి వెళ్తుంటాడు. పలాస కు చెందిన ఉష(18)తో యువకుడికి పరిచయం ఉంది. తనను కలుసుకోవడానికి వచ్చిన ఆమెతో బైక్పై పలు ప్రాంతాల్లో తిరిగారు. ఈ క్రమంలో తాతగారి ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు వీరిద్దరూ బైక్పై పరదేశిపాలెం మీదుగా బయల్దేరారు. చంద్రంపాలెం హైసూ్కల్ ఎదురుగా హైవేపైకి వచ్చేసరికి ముందు వెళ్తున్న బస్సు, లారీలను తప్పించబోయి లారీకి బైక్ తగలడంతో కింద పడిపోయారు. ఇద్దరికీ తలకు బలమైన గాయాలై సంఘటనా స్థలిలోనే మరణించారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ రాము తెలిపారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, విశాఖపట్నం/విజయవాడ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయానికి తీరం దాటింది. గోపాల్పూర్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో.. ఏపీలో కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో.. గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది.కృష్ణానదికి ప్రవాహం పెరగడంతో.. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 4,01,087 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండడంతో.. ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ‘‘కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు.. కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు’’ అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో గడచిన 24 గంటల్లో.. పాడేరులో 16 సెంమీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రమంతటా ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు, అలాగే కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతాయని పేర్కొంది.చేపల వేటకు వెళ్ళి.. భారీ వర్షంలో.. చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. పెద్ద అల ఒక్కసారిగా రావడంతో యువకుడు తమ కళ్ల ముందే కొట్టుకుపోయాడని, రక్షించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని కొందరు మత్స్యకారులు తెలిపారు. సదరు యువకుడిని ఎంవీపీ కాలనీకి చెందిన సతీష్గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అప్పారావు వయసు 56 ఏళ్లు... పుట్టింది మాత్రం 1800లో..!
విశాఖపట్నం: భారత ఎన్నికల సంఘం (ఈసీ) నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ‘ఇప్పటికింకా నా వయసు నిండి పదహారేళ్లే’ అన్నట్టుగా, 56 ఏళ్ల వయసున్న ఒక ఓటరు వయసును 225 సంవత్సరాలుగా నమోదు చేసింది. ఈ ఘటనపై సామాజిక కార్యకర్త పట్టా రామ అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం అగనంపూడి నిర్వాసిత కాలనీ కొండయ్యవలసకు చెందిన తన సోదరుడు 1969లో జన్మించారని, ఆయన వయసు 56 ఏళ్లు నిండిందని రామ అప్పారావు తెలిపారు. అయితే ఆయన ఓటరు కార్డులో మాత్రం పుట్టిన తేదీ 01.01.1800గా నమోదై ఉండడం చూసి విస్మయం వ్యక్తం చేశారు. ‘ఇంత గుడ్డిగా ఓటరు నమోదు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఎలా నమోదవుతున్నాయో కూడా అర్థం కావడం లేదని రామ అప్పారావు పేర్కొన్నారు. బ్యాంక్ లావాదేవీలకు ఆధార్ను అనుసంధానం చేసే ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఓటరు నమోదు విషయంలో ఎందుకు ఆధార్ను అనుసంధానం చేయలేకపోతున్నాయో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఈసీ నిర్లక్ష్యానికి, డొల్లతనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. -
భారీ వర్షం విశాఖపట్నం విలవిల (ఫొటోలు)
-
మూడురోజుల పాటు భారీ వర్షాలు.. ఏపీకి ‘రెడ్ అలర్ట్’
సాక్షి,విశాఖ: ఏపీకి మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ఫలితంగా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. కర్నూల్, నెల్లూరు, తిరుపతి,చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బంగాఖాతంలో ఏర్పడిన వాయిగుండం కారణంగా మరో మూడు రోజులపాటు కొనసాగనున్న భారీ వర్షాలు కురియనున్నాయి. ప్రస్తుతం తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ సమయంలో మరో మూడు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ దక్షిణ ఛత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. 19న కోస్తాంధ్ర అంతటా మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ప్రఖర్ జైన్ సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కూటమి సర్కార్ మరో వెన్నుపోటు
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కూటమి సర్కార్ వెన్నుపోటు పొడిచింది. ఉక్కు పరిశ్రమలో మరో కీలక విభాగం ప్రైవేటీకరణకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే పలు కీలక విభాగాలు ప్రైవేటుకు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో కార్మిక సంఘాలు భగ్గుమంటున్నారు. దశల వారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రైవేటీకరణ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.స్టీల్ప్లాంట్ ఆసక్తి వ్యక్తీకరణ జాబితాలోకి మరో విభాగం చేరింది. శనివారం విడుదల చేసిన నోటీసులో స్టీల్ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ (టీపీపీ)–1కు సంబంధించి యాజమాన్యం ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) జారీ చేసింది. ‘కాంప్రహెన్సివ్ టెక్నికల్ మేనేజ్ మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కేప్టివ్ పవర్ ప్లాంట్–1 అండ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్’ పనులకు సంబంధించి ఈవోఐ దాఖలుకు సెప్టెంబర్ 9న ఆఖరు తేదీగా నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం బిడ్లు తెరవనున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వైజాగ్ స్టీల్ వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. -
విశాఖ ఆర్కే బీచ్లో విషాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ఆర్కే బీచ్లో సరదాగా స్నానానికి దిగి ఒకరు మృతి చెందగా.. ఒకరు క్షేమంగా బయపడ్డారు. మరొకరు గల్లంతయ్యారు. మునిగిపోతున్న మహిళను కాపాడడానికి వెళ్లిన ఒడిశాకు చెందిన 22 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. అతని కోసం సహాయక బృందాలు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాయి.బీచ్ చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన దంపతులు రాగా.. సరదాగా బీచ్లోకి దిగగా.. కెరటాల ఉధృతికి మహిళ (50) కొట్టుకుపోయింది. భార్య మృతి చెందగా, భర్తను స్థానికులు కాపాడారు. దంపతులను కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి మృతి చెందాడు. -
ఏపీకి భారత వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
విశాఖపట్నం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. పలు జిల్లాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో గురువారం భారత వాతావరణశాఖ ఏపీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని తెలుస్తోంది.పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు కదిలే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణకేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు.ఏపీ వ్యాప్తంగా గురువారం పలుజిల్లాలో భారీ వర్షాలు కొనసాగాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 22, ముమ్మిడివరంలో 18, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఏగురవేశారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. -
ఫేస్బుక్లో స్నేహం.. పెట్టుబడి మోసం
విశాఖపట్నం: ఫేస్బుక్లో పరిచయం పెంచుకుని పెట్టుబడి పేరుతో రిటైర్డ్ ప్రొఫెసర్ నుంచి రూ.49.72 లక్షలు దోచుకున్న రిలేషన్షి ప్ మేనేజర్ సతీష్ కుమార్ను నగర సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. డిజిటల్ మోసాలపై సైబర్ క్రైం పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంవీపీకాలనీ, సెక్టార్–6కి చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్తో నిందితుడు సతీష్ కుమార్ ఫేస్బుక్లో స్నేహం చేసి పెట్టుబడి పెట్టాలంటూ ఆశ చూపా డు. తద్వారా అతని నుంచి దశలవారీగా రూ.49.72 లక్షలు కాజేశాడు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని సెక్టార్–16కి చెందిన సతీష్ కుమార్గా గుర్తించారు. నిందితుడు నోయిడా వరల్డ్ ట్రేడ్ టవర్లో రిలేషన్íÙప్ మేనేజర్గా పని చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. విచారణలో భాగంగా సతీష్ కుమార్ తన ఐడీఎఫ్సీ బ్యాంక్ కరెంట్ అకౌంట్ను సైబర్ నేరగాళ్లకు ఇచ్చి భారీ మోసాలకు సహకరించినట్లు తేలింది. ఈ అకౌంట్ ద్వారా వారు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై 111(2), 319(2), 318(4) రెడ్/విత్ 61(2) బీఎన్ఎస్, 66–సీ, 66–డీ ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు(నం. 112/2025) నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
నవ వధువుదారుణ హత్య, 12 ఏళ్లకు చిక్కాడిలా!
విశాఖపట్నం: ఓ హత్య కేసులో 12 ఏళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని న్యూపోర్టు పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు తెలిపిన వివరాలివి. 2013లో మండలంలో ఒక వీధిలోని నాలుగో అంతస్తు పెంట్హౌస్లో నవ వధువు త్రివేణి తన భర్తతో కలిసి నివసించేది. పక్కనే ఉన్న మరో పెంట్హౌస్లో అద్దెకు ఉంటున్న నీలాపు లోకేష్ ఆమెపై కన్నేశాడు. ఇంట్లో త్రివేణి ఒంటరిగా ఉండటం గమనించి, ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. త్రివేణిపై లైంగికదాడికి ప్రయతి్నంచగా, ఆమె ప్రతిఘటించి వంటగదిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో లోకేష్ ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహం పక్కన చున్నీని కాల్చివేసి, గ్యాస్ తెరిచి ఉంచాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. తర్వాత గాజువాకలోని ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఆ బంగారు ఆభరణాలను కుదువ పెట్టి రూ.55వేలు తీసుకున్నాడు. ఆ డబ్బులో రూ.30వేలతో బైక్ కొనుగోలు చేయడానికి అడ్వాన్స్గా ఇచ్చాడు. మిగతా రూ.25 వేలును తన స్నేహితునికి ఇచ్చి, ఏమీ తెలియనట్టుగా ఇంటికి చేరుకున్నాడు. పోలీసులు పట్టుకున్నారిలా.. నవ వధువు హత్య కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పటికే గాజువాక పోలీస్ స్టేషన్లో లోకేష్పై మోటార్ బైక్ దొంగతనం కేసు నమోదై ఉంది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారించగా.. త్రివేణిని తానే హత్య చేసినట్టు లోకేష్ అంగీకరించాడు. బెయిల్పై వచ్చి మళ్లీ.. వధువు హత్య కేసులో జైలుకెళ్లిన లోకేష్ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేయాలని కోర్టు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో లోకే‹Ùను వెతికి పట్టుకోవాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి న్యూపోర్టు పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో అతను విజయవాడలో ఉన్నాడని సమాచారం అందడంతో.. ఏఎస్ఐ మురళి, కానిస్టేబుల్ సింహాద్రిని న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు అక్కడకు పంపించారు. 12 సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు లోకేష్ ను ఎట్టకేలకు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
దూసుకొచ్చిన మృత్యువు
విశాఖపట్నం: ఆ కుటుంబం ఆదివారం ఎంతో సంతోషంగా గడిపింది. మనుమడి అన్నప్రాశన వేడుకను సంబరంగా జరుపుకుంది. మరుసటి రోజు ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి ప్రయాణమైన ఆమెను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం ద్వారకా బస్టాండ్లో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, పోతనాపల్లి గ్రామానికి చెందిన గేదెల ముత్యాలమ్మ (47), తన పెద్ద కుమార్తె కుమారుడి అన్నప్రాçశన కోసం గాజువాకలో ఉన్న ఇంటికి వచ్చింది. ఆదివారం కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణమై, ద్వారకా బస్టాండ్కు చేరుకుంది. సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో తన చిన్న కుమార్తెను బొబ్బిలి బస్సు ఎక్కించి, తాను ఎస్.కోట వెళ్లే బస్సు కోసం ప్లాట్ఫాం నంబర్ 25 వద్ద వేచి ఉంది. సరిగ్గా అదే సమయంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే పల్లె వెలుగు బస్సు అతి వేగంగా ప్లాట్ఫాంపైకి దూసుకువచ్చింది. ఆ బస్సు ఢీకొనడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆ తల్లి, మనుమడిని చూసుకున్న సంతోషం మనసులో మెదులుతుండగానే, విధి ఆడిన వింత నాటకానికి బలైపోయింది. ముత్యాలమ్మ మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ముత్యాలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. బస్సు స్పీడ్గా వచ్చేసింది.. నేను అరకు వెళ్లాలి. బస్సు కోసం ఎస్.కోట ప్లాట్ఫాం వద్ద సమీపాన కూర్చున్నా... పదడుగుల దూరంలో ఆ మహిళ బ్యాగ్ పట్టుకుని నిల్చున్నారు. ఇంతలో ఆర్టీసీ బస్సు స్పీడ్గా ఆమెను ఢీకొని లోపలికి వచ్చేసింది. చూస్తుండుగానే ఆ మహిళ బస్సుకు అక్కడున్న స్తంభానికి మధ్యలో నలిగిపోయింది. ఇంకో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. – కమిడి గురు, అరకు, ప్రత్యక్ష సాక్షిడ్రైవర్ నిర్లక్ష్యమే కారణం బస్టాండ్లోని ప్లాట్ఫాంపైకి బస్సు తీసుకొచ్చేటప్పుడు గంటకు 5 కిలోమీటర్ల వేగం మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, వేగంగా వచ్చిన బస్సు ప్రమాదానికి కారణమైందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ తర్వాత ఈ విషయం స్పష్టమైంది. దీనిపై డ్రైవర్ చంద్రరావును ప్రశ్నించగా, బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. -
సాక్షి ఎఫెక్ట్: సింహాచలం ఆలయంలో తనిఖీలు
సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో విచారణ కమిటీ పరిశీలన కొనసాగుతోంది. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి చెందిన బంగారు, వెండి, ఇతర విలువైన వస్తువులు, ఆభరణాల తనిఖీలను దేవదాయశాఖ, రాజమహేంద్రవరం ఆర్జేసీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ శనివారం ప్రారంభించింది. ఈ తనిఖీలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయి.రికార్డ్ మెయిన్టైన్ చేయకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆలయ ఉద్యోగుల నుంచి పలు వివరాలను కమిటీ సభ్యులు సేకరించారు. కడప జిల్లాకు చెందిన కె.ప్రభాకరాచారి గతేడాది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రికార్డుల్లో పేర్కొన్న వివరాలకు, వాస్తవంగా ఉన్న ఆభరణాలకు తేడాలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యా దుపై దేవదాయశాఖ జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పల్లంరాజు ఈ ఏడాది జనవరి 17 నుంచి నెలరోజుల పాటు రికార్డులను పరిశీలించి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా మరింత లోతుగా తనిఖీలు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించారు. ఆ తర్వాత ఆ విషయం మరుగున పడింది. ప్రస్తుతం రాజమండ్రి ఆర్జేసీగా కూడా విధులు నిర్వహిస్తున్న సింహాచలం ఇన్చార్జి ఈవో త్రినాథరావు చొరవతో ఈ తనిఖీలు మళ్లీ మొదలయ్యాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఆలయానికి చేరుకున్న కమిటీ సభ్యులు.. ముందుగా బండాగారంలోని ఆభరణాలు, వస్తువులను వాటి రికార్డులతో సరిపోల్చి బరువులు తనిఖీ చేశారు.ఈ కమిటీలో విజయనగరం డిప్యూటీ కమిషనర్ కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పల్లంరాజు, అంతర్వేది ఈవో ఎం.కె.టి.ఎన్.ప్రసాద్, తూర్పుగోదావరి డిప్యూటీ ఈవో ఇ.వి.సుబ్బారావు, ఆర్జేసీ కార్యాలయం సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఈ తనిఖీలు పారదర్శకంగా జరుగుతున్నాయని, పూర్తి నివేదికను సమరి్పస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. రాబోయే రోజుల్లో అర్చకుల ఆ«దీనంలో ఉన్న వస్తువులు, మ్యూజియం, బ్యాంకుల్లో ఉన్న వస్తువులను కూడా పరిశీలిస్తామని వారు పేర్కొన్నారు. -
‘విశాఖ సెంట్రల్ జైలు’ వివాదంలో ట్విస్ట్
విశాఖపట్నం: అధికారులు తమను హింసిస్తున్నారని కొందరు ఖైదీలు లేఖ రాసిన ఉదంతంపై దర్యాప్తు చేపట్టడానికి విశాఖ కేంద్ర కారాగారానికి జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ రవికాంత్ శనివారం వచ్చారు. బయట నుంచి తీసుకువచ్చిన తెల్ల కాగితంపై 25 మంది ఖైదీలు సంతకాలు పెట్టారని తెలిపారు. ఆ లేఖ ఖైదీలు రాసినది కాదని వెల్లడైందన్నారు.కొందరు ఖైదీలతో ముందుగా తెల్ల కాగితంపై సంతకాలు చేయించారని, ఇచ్చిన కాగితాలపై వేరే వ్యక్తి లేఖ రాసి బయటకు పంపినట్లు తమ విచారణలో తేలిందన్నారు. లేఖపై సంతకాలు పెట్టిన రాజేష్, నాగన్న, మీర్జాఖాన్లతో పాటు 25 మంది ఖైదీలను దర్యాప్తులో భాగంగా ప్రశి్నంచినట్లు తెలిపారు. ఒకరోజు ఒక ఖైదీ పప్పు బాగాలేదని చెప్పడంతో భోజనం బాగాలేదని రాసినట్లు తెలిపారన్నారు.అధికారులు గతంలో మాదిరిగా జైలు అంతటా ఇప్పుడు తిరగనీయకుండా స్వేచ్ఛ లేకుండా చేశారని, అందుకే లేఖపై సంతకాలు చేసినట్లు వెల్లడించారని డీఐజీ వివరించారు. దీని వెనుక జైలు కిందస్థాయి సిబ్బంది కొందరి హస్తం ఉండి ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఒకవేళ ఖైదీ లేఖ రాస్తే ప్రత్యేకంగా జైలు స్టాంప్ వేసిన పేపర్ సరఫరా చేస్తామన్నారు.కానీ వీరు లేఖ రాయడానికి ఉపయోగించిన పేపరుపై అలాంటి స్టాంప్ లేదన్నారు. బయట పేపరు ఉపయోగించారన్నారు. బయట నుంచి లోపలకు సిబ్బంది ప్రమేయంతోనే ఆ పేపరు చేరుతుందన్నారు. నియమ నిబంధనల ప్రకారం జైలు అధికారులు కచ్చితంగా ఉండటంతో కొందరికి ఇబ్బంది కలిగి ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని తెలిపారు. -
సింహాచలం అప్పన్న ఆభరణాలపై వివాదం
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం అప్పన్న ఆభరణాలపై వివాదం నెలకొంది. అప్పన్న ఆభరణాలు అపహారణకు గురయ్యాయంటూ గత ఏడాది విశాఖ జిల్లా కలెక్టర్కు ప్రభాకరాచారి ఫిర్యాదు చేశారు. ఆభరణాల విషయంలో వాస్తవాలు తేల్చేందుకు ఆలయ ఉన్నతాధికారులు కమిటీ వేశారు. కమిటీ ఎటువంటి విచారణ చేపట్టకపోవడంతో మరోసారి ప్రభాకరాచారి.. కలెక్టర్కు అర్జీ పెట్టారు.ఇవాళ కమిటీ విచారణ చేస్తుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కానీ నేడు కూడా కమిటీ సభ్యులు విచారణ చేయలేదు. భక్తులు ఇచ్చే బంగారు ఆభరణాల వివరాలు నమోదు చేసే రికార్డ్ కూడా మెయింటైన్ చేయడం లేదని ప్రభాకరాచారి ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అప్పన్న భక్తుల్లో ఆందోళన నెలకొంది.భైరవస్వామి హుండీలో నగదు చోరీ శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన భైరవవాకలోని భైరవస్వామి ఆలయంలో రెండు హుండీల తాళాలు విరగ్గొట్టి నగదు చోరీ చేసిన సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. దేవస్థానం అధికారుల ఫిర్యాదుతో గోపాలపట్నం క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. వివరాలిలోకి వెళ్తే.. గురువారం ఉదయం 6 గంటలకు తొలి షిఫ్టులో పనిచేసే సెక్యూరిటీ గార్డుతో కలిసి వెళ్లి ఆలయ తలుపులు తెరచిన అర్చకుడు సంతోష్శర్మ ఆలయంలో ఉన్న రెండు స్టీల్ హుండీల తాళాలు విరగ్గొట్టి ఉండటాన్ని గమనించారు. పక్కనే త్రిశూలం పడి ఉండటాన్ని చూశారు. దీంతో దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. గోపాలపట్నం క్రైమ్ పోలీసులకు దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేశారు.ఆలయం వద్దకు వచ్చిన క్రైమ్ ఎస్ఐ తేజేశ్వరరావు అంతా పరిశీలించారు. వేసిన ఆలయం తలుపులు వేసినట్టే ఉండటం, ఆలయంపై నుంచి ఎంతవరకు దొంగలు కిందకు దిగే అవకాశం ఉంది, త్రిశూలంతోనే హుండీల తాళాలు విరగకొట్టి ఉండవచ్చా.. తదితర విషయాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గడిచిన రెండు నెలల నుంచి హుండీలను తెరవలేదు. హుండీల్లో రూ. 2 వేల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. -
మర్రిపాలెం బుల్లోడు : షార్ట్ఫిల్మ్స్ టు ఆస్కార్స్ గోల్డ్ఫెలోషిప్
బెంగళూరులో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే ప్రకృతి, మూగజీవులపై పలు డాక్యుమెంటరీలను చిత్రీకరించాడు శ్రీహరి వర్మ(Sagi Sree Hari Varma). మూగజీవులు స్వేచ్ఛగా జీవించడానికి ఎలాంటి పరిస్థితులు కల్పించాలో వివరిస్తూ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాడు. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ‘పీపుల్స్ ఫర్ యానిమల్స్’ సంస్థలో వాలంటీర్గా చేరి మూగ జీవులపై డాక్యుమెంటరీ రూపొందించాడు. మూగ జీవులపై చిత్రీకరించిన షార్ట్ ఫిలిమ్స్ను రష్యాలోని విజీఐకె ఫిల్మ్ స్కూల్కు పంపిచాడు. రష్యా ప్రశంసలురష్యా ప్రభుత్వం తమ దేశ ప్రగతి, సంస్కృతి, అభివృద్ధిని చాటిచెప్పే షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు యువ దర్శకులను ఎంపిక చేయగా మన దేశం నుంచి శ్రీహరి వర్మకు మాత్రమే ఆ అరుదైన అవకాశం దక్కింది. ఫిఫా వరల్డ్ కప్ పోటీలకు సంబంధించి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను కళ్ళకు కట్టినట్టుగా ‘గో మారడోవియా’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించి రష్యా ప్రతినిధుల నుండి ప్రశంసలు పొందాడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ‘స్కూల్ ఆఫ్ సినిమా టెక్ ఆర్ట్స్’లో చేరి దర్శకత్వ నైపుణ్యాలపై సంవత్సరం పాటు శిక్షణ పొందాడు. హాలీవుడ్ సినిమా చిత్రీకరణపై అవగాహన పెంచుకున్నాడు. శిక్షణా సమయంలోనే ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన దళాలు (పీస్కీపింగ్ ఫోర్సెస్) పై డాక్యుమెంటరీ రూపొందించాడు. (Prasadam Recipes : వరమహాలక్ష్మీ దేవికి శుచిగా, రుచిగా ప్రసాదాలు)ఇదీ చదవండి: ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్బాక్స్ రిటన్ గిఫ్ట్స్ఫస్ట్ ఇండియన్షార్ట్ ఫిలిమ్స్తో మొదలైన శ్రీహరివర్మ ప్రస్థానం ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్ వరకు వెళ్ళింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ప్రతిభావంతులైన దర్శకులను తీర్చిదిద్దేందుకు ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్ అందజేస్తుంది. దీని కోసం ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 20 మంది ప్రతిభావంతులను ఎంపిక చేస్తుంది. ఈ ఫెలోషిప్కు 2019లో ఎంపికైన తొలి భారతీయుడుగా అరుదైన గౌరవం దక్కించుకున్నాడు శ్రీహరివర్మ. ఫెలోషిప్లో భాగంగా యువ దర్శకులు, ప్రముఖ హాలీవుడ్ దర్శకులతో కలసి పనిచేసే అవకాశం పొందాడు. గేమ్ ఆఫ్లైఫ్, హెడ్ అండ్ ఫిగర్స్, అమెరికన్ డ్రీమర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు టెడ్ మెల్ఫీ దగ్గర శిక్షణ పొందాడు.చదవండి: తండ్రి కల.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్.. ఐఏఎస్ లక్ష్యం సినీ–మదమారెలో అవకాశంఇటలీలో జరిగిన ఇటాలియన్ ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్ (సినీ మదమారె)లో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీహరివర్మకు అవకాశం లభించింది. ప్రతి ఏటా వివిధ దేశాల నుండి యువ దర్శకుల ప్రతిభను గుర్తించడానికి ఇటాలియన్ ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తుంది. సిని మదమారెలో శ్రీహరి వర్మ 4 విభిన్న షార్ట్ ఫిలిమ్స్ను చిత్రీకరించాడు.విశాఖ నగరం, మర్రిపాలెంకు చెందిన సాగి శ్రీహరివర్మ షార్ట్ ఫిలిమ్స్తో ప్రారంభించి ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఫిల్మ్ స్కూల్లో స్థానం సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ఇటీవల ఇటలీలో జరిగిన వేసవి చలన చిత్ర నిర్మాణ కార్యక్రమం (సినీ మదమారె)లో పాల్గొని తన సత్తా చాటాడు... -
‘మాజీ సైనికుడి భూ వివాదంపై విచారణ జరిపించండి’
సాక్షి, విశాఖపట్నం: మాజీ సైనికుడి భూ వివాదం, విశాఖలో ల్యాండ్ గ్రాబింగ్, రెవెన్యూ సంబంధిత భూములపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గురువారం లేఖ రాశారు. ఎండాడలో మాజీ సైనికుడి భూవివాదంపై విచారణ కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రెవెన్యూ మంత్రికి సైతం ఆయన లేఖ రాశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..‘ఎండాడలో మాజీ సైనికుడి భూవివాదంపై విచారణ కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రెవెన్యూ మంత్రికి సైతం ఆయన లేఖ రాశారు. ‘ప్రీహోల్డ్ భూముల స్వాధీనం వంటి వివాదాస్పద ఘటనల పట్ల తీవ్ర ఆందోళన చెందిన విషయాన్ని లేఖలో రాశాను. మీడియా ద్వారా ఈ వ్యవహారాలు ప్రస్తుతం మీ దృష్టికీ వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఆధారాలనూ ఈ లేఖకు జత చేశాను. ఆయా భూములు స్వాధీనపరచడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, సీనియర్ అధికారులు, రాజకీయ నేతల ప్రమేయం వంటి అంశాల్లో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.ముఖ్యంగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రెవెన్యూ శాఖలో ముఖ్య కార్యదర్శి స్థాయిలోనూ ఇందులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఈ విషయంపై న్యాయ విచారణ అవసరమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకుని, నిష్పక్షపాతమైన విచారణ ద్వారా వాస్తవాలను వెలికి తీయాలి. ప్రజల్లో పరిపాలనపై విశ్వాసం పునరుద్ధరించడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. భూ కబ్జాదారులు, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని ఆ లేఖలో బొత్స కోరారు. -
వైఎస్సార్సీపీ విక్టరీ.. టీడీపీ కూటమికి విశాఖలో బిగ్ షాక్ (చిత్రాలు)
-
మరో వివాదంలో ‘విశాఖ సెంట్రల్ జైలు’.. ఇద్దరు ఖైదీలు రాసిన లేఖ వైరల్
సాక్షి, విశాఖపట్నం: మరోసారి విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో చిక్కుకుంది. ఇద్దరు ఖైదీలు రాసిన లేఖ వైరల్ అవుతోంది. విశాఖ సెంట్రల్ జైల్ అధికారులపై ఖైదీల తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు సుపరింటెండెంట్ మహేశ్ బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ సాయి ప్రవీణ్ వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఓ కిడ్నాప్ కేసులో నిందితుడైన ఉలవల రాజేశ్, మరో ఖైదీ మీర్జాఖాన్ మీడియాకి లేఖ రాశారు.రౌడీషీటర్ ఉలవల రాజేశ్ లేఖలో సంచలన అంశాలు వెల్లడించాడు. రిమాండ్లో తాను మొబైల్స్ వినియోగించకపోయినా సరే తనపై కుట్ర పన్నారు అంటూ లేఖలో పేర్కొన్నాడు. ‘‘సెల్ ఫోన్ సిగ్నల్ వచ్చే బ్లాక్ వద్ద నన్ను బంధించి మొబైల్ వినియోగించినట్లు నాపై తప్పుడు సాక్షాలు సృష్టించారు. జైలు అధికారుల దాష్టీకాలపై 18-3-2025న కోర్టు వాయిదాకు వచ్చినపుడు జైలు అధికారులపై జడ్జికి ఫిర్యాదు చేశాను. జడ్జి దృష్టికి ఈ వ్యవహారాలను తీసుకు వెళ్తున్నానంటూ కక్ష కట్టి నన్ను వేధిస్తున్నారు’’ అంటూ లేఖలో పేర్కొన్నాడు.‘‘తోటి ఖైదీల వలె కాకుండా నన్ను లాకప్ నుంచి అస్సలు బయటకు రాకుండా సూపరింటెండెంట్ లోపలే బంధిస్తున్నారు. అందరు ఖైదీల్లాగా ఉదయం నుంచి నన్ను బయటకు పంపడం లేదు. జడ్జికి ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుక్కోవాలని వేధిస్తున్నారు. లేకుంటే జైల్లో ఇలానే హింస తప్పదని సూపరింటెండెంట్ బెదిరిస్తున్నారు. జైల్లో మాకు చట్టప్రకారం ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా ఇవ్వడం లేదు. జైలు క్యాంటీన్ల్లో అనేక అవకతవకలకు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారు. జరుగుతున్న అవకతవకలపై అధికారులను నిలదీస్తే, గంజాయి వాడుతున్నారని తప్పడు కేసులు పెటడతామంటూ నాగన్న అనే మరో ముద్దాయిని బెదిరిస్తున్నారు. జైల్లో మేము పడుతున్న బాధలను బయటకు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నాం’’ అంటూ రాజేశ్, మీర్జాఖాన్ చెప్పుకొచ్చారు. -
వైఎస్సార్సీపీకి ఓటేసిన కూటమి కార్పొరేటర్లు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమికి గట్టి షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పద్మ రెడ్డి విజయం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగ్గా.. కూటమి కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. మొత్తం సీట్లు గెలుస్తామంటూ కూటమి నేతలు బీరాలు పలికారు. 50 ఓట్లతో పద్మ రెడ్డి గెలుపొందారు. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లను ఓటింగ్కు వాడుకున్నా కానీ కూటమికి భంగపాటు తప్పలేదు.కార్పొరేటర్ పద్మా రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఓటు వేసిన 50 మంది కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన మహిళను మార్చారనే బాధ కార్పొరేటర్లలో ఉందన్నారు. గతంలో స్టాండింగ్ ఎన్నికలకు ఎక్కడా డబ్బులు ఖర్చు చేయలేదు. ఇప్పుడు కూటమి క్యాంపు రాజకీయాలకు తెర లేపింది. కూటమి బాధితులు తమకు సహకరించారని ఆమె పేర్కొన్నారు.కూటమి పాలనకు చెంప పెట్టు: కేకే రాజువైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంప పెట్టు అన్నారు. ‘‘గతంలో అడ్డగోలుగా మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. బీసీ మహిళకు జగన్ అవకాశం ఇస్తే అడ్డదారిలో మహిళా మేయర్ను దించేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఎన్నడూ డబ్బుతో రాజకీయం చేయలేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా క్యాంప్ రాజకీయం చేశారు. మాకున్న బలం 32 మంది కార్పొరేటర్లు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అందరికీ 32 ఓట్ల కంటే అధికంగా వచ్చాయి.50 ఓట్లతో ఒక స్టాండింగ్ కమిటీ సీట్ గెలిచాం. కూటమి కార్పొరేటర్లు కూడా మాకు ఓటు వేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలి. గెలిచిన స్థానాన్ని ప్రకటించడానికి కూడా ఇబ్బంది పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన కార్పొరేటర్లు పశ్చాత్తాప పడి మాకు ఓట్లు వేసి ఉండచ్చు. కూటమి భయభ్రాంతులకు గురి చేసినా పోటీ చేసిన వారికి అభినందనలు’’ అని కేకే రాజు పేర్కొన్నారు. -
అరకు విహారం.. ఘుమ ఘుమల కాపీ సేవనం..!
అరకు టూర్ అంటే అరకొరగా ఉండదు. జీఐ ట్యాగ్ సొంతమైన కాఫీ రుచిలా ఉంటుంది. చక్కటి పచ్చదనం మధ్య కాఫీ తోటల్లో విహారం. చిక్కటి కాఫీ ఘుమఘుమల మధ్య ప్రకృతి వీక్షణం. గాలికొండ నుంచి నేలమ్మకు వందనం చేయడం. బొర్రా గుహల రాతి శిలల శిల్పచాతుర్యం. ఆదివాసీ మ్యూజియం చెప్తున్న నాటి జీవనశైలి...అందుకే దీనిని తూర్పు కనుమల రత్నం అన్నారు. వీటన్నింటినీ చూపిస్తుంది అరకులోయ పర్యటన.విశాఖపట్నం నుంచి అరకుకు సాగే ప్రయాణమే ఓ అద్భుతం. కేరళలోని వయనాడు ప్రయాణం పశ్చిమ కనుమల సౌందర్యానికి అద్దం పడుతుంది. తూర్పు కనుమల లాలిత్యానికి అరకు ప్రయాణం దర్పణమవుతుంది. ఈ కాఫీ రుచి కొలమానం ప్రపంచస్థాయి అవార్డే. జీఐ ట్యాగ్ అందుకున్న కాఫీ ఇది. కాఫీ గింజలు ఓ రకమైన కమ్మదనాన్ని గాల్లో మోసుకొస్తుంటాయి. తోటల్లో విహరిస్తున్నప్పుడు చెట్ల ఆకులు ఒంటిని తాకుతూ కలిగించే గిలిగింతను మాటల్లో వర్ణించలేం. కాఫీ చెట్ల లేత ఆకులు ముదరు కాఫీ గింజ రంగులో ఉంటాయి. లేత కాఫీ గింజలు పచ్చగా ఉంటుంది. ముదిరే కొద్దీ చిక్కటి ఎరుపుదనం సంతరించుకుంటాయి. ఎండిన తర్వాత నల్లగా మారుతాయి. కాఫీ తోటల విహారం తర్వాత ముందుకు సాగే కొద్దీ ఒక్కొక్క ప్రదేశమూ మినిమమ్ గ్యారంటీ ఆహ్లాదాన్నిస్తాయి.ట్రైబల్ మ్యూజియంఅరకు బస్ స్టేషన్ నుంచి కేవలం పావుకిలోమీటరు లోపే ఉంటుంది మ్యూజియం. తూర్పు కనుమల ప్రకృతి సౌందర్యం ఈ విజిట్లో ప్రత్యేక ఆకర్షణ. అరకు, విశాఖపట్నం పరిసరాల్లో 19 రకాల ఆదివాసీ జాతుల వాళ్లు నివసించేవారు. ట్రైబల్ కల్చర్, అందులోని వైవిధ్యతను పరిరక్షించే ఉద్దేశంతో దీనిని 1996లో ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఆదివాసీలు ప్రాచీన కాలం నుంచి ఉపయోగించిన వస్తువులు, ధరించిన ఆభరణాలు, దుస్తులు, వేటాడే సాధనాలు, వంట సామగ్రి, వారి పెళ్లి వేడుక ఫొటోలు ఉన్నాయి. ఆదివాసీలు రూపొందించిన చిత్రలేఖనాలు, కళారూపాలను కూడా చూడవచ్చు. వారి మయూర నృత్యం, ధింసా నృత్యం (dhimsa dance) శిల్పాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఎర్రమట్టితో నిర్మించి తెల్లటి అంచులతో ఈ భవనం ఆర్కిటెక్చర్ బాగుంటుంది. ఈ మ్యూజియం ఉదయం పది గంల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న మ్యూజియం కావడంతో టికెట్ నామమాత్రమే. పెద్దవాళ్లకు పది రూపాయలు, పిల్లలకు ఐదు రూపాయలు.పద్మపురం గార్డెన్స్ఇది అరకు బస్ స్టేషన్ (Araku Bus Station) నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరాన ఉంది. చాలా ప్రసిద్ధి చెందిన గార్డెన్ ఇది. పాతిక ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ గార్డెన్ని స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలన కాలంలో 1942లో ఏర్పాటు చేశారు. ఇక్కడ పండిన కూరగాయలు రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికుల కోసం వెళ్లేవని చెబుతారు. యుద్ధం ముగిసిన తర్వాత ఈ గార్డెన్ని హార్టికల్చర్ నర్పరీ, మొక్కల పెంపకంలో శిక్షణ కేంద్రంగా మార్చారు. ఇక్కడి వృక్ష శిల్పాలు కనువిందు చేస్తాయి. చెట్టుని శిల్పం ఆకారంలో మలిచి పెంచడానికి కొన్నింటికి దశాబ్దాలు పడుతుంది. ఈ గార్డెన్ మొత్తం తిరిగి చూడడానికి టాయ్ ట్రైన్ ఎక్కాలి. ఈ గార్డెన్లో ట్రీ టాప్ హట్స్ ఉన్నాయి. అంటే చెట్టు మీద గుడిసెలన్నమాట. టూరిస్టులు రాత్రి బస కోసం బుక్ చేసుకోవచ్చు. వీటిని హ్యాంగింగ్ కాటేజ్ అంటారు. ఈ గార్డెన్స్లో రోజ్ గార్డెన్ ఉంది. పద్మపురం గార్డెన్స్కి ఎంట్రీ టికెట్ పది రూపాయలు, ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి.కుర్సురా మ్యూజియంఇది దేశ భద్రత కోసం 31 సంవత్సరాల΄ాటు నిర్విరామంగా సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్న సబ్ మెరైన్. ఇండో– పాక్ యుద్ధంలో ఈ సబ్మెరైన్ అరేబియా సముద్రంలో గస్తీ కాసింది. ఆ తర్వాత అండమాన్ దీవులలో సేవలందించి తన సర్వీస్ కాలంలో 73,500 నాటికల్ మైళ్లు ప్రయాణించిన ఈ సబ్మెరైన్ 2001 నుంచి విశ్రాంతిలో ఉంది. ఇంతటి సమగ్రమైన సబ్మెరైన్ను ప్రభుత్వం 2002 లో ప్రదర్శనశాలగా మార్చింది. ఇది పిల్లలకు, పెద్దవాళ్లకు కూడా వినోదభరితంగా జ్ఞానాన్ని పంచే అధ్యయన కేంద్రం. దీని నిర్వహణకు ప్రభుత్వానికి సుమారుగా ఎనభై లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. అయితే ఈ సబ్మెరైన్ వీక్షణానికి వచ్చే పర్యాటకుల ఎంట్రీ టికెట్ల మీద ఏడాదికి కోటి రూపాయలను సంపాదిస్తోందీ సబ్మెరైన్. రోజుకు ఐదారు వందల మంది పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంటుంది. విశాఖపట్నానికి వచ్చిన వాళ్ల రామకృష్ణ బీచ్ని, అందులో ఉన్న సబ్మెరైన్ మ్యూజియాన్ని చూడకుండా రారంటే అతిశయోక్తి కాదు.కైలాసగిరిఇది విశాఖపట్నం నగరానికి సమీపంలో ఆరువందల అడుగుల ఎత్తున్న కొండ. సుమారు నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎకోపార్కు ఇది. రోప్వేలో కొండమీదకు వెళ్లడం పిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా జాయ్ఫుల్గా ఉంటుంది. బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవార్డు అందుకున్న పర్యాటక ప్రదేశం ఇది. స్థానికులు, బయటి వాళ్లు అంతా కలిసి కైలాసగిరిని రోజుకు మూడు వేల మందికి పైగా సందర్శిస్తారు.గాలికొండ వ్యూపాయింట్ఈ టూర్లో తూర్పు కనుమల ప్రకృతి సౌందర్యాన్ని అనంతంగా ఆస్వాదించవచ్చు. విశాఖపట్నం– అరకు రీజియన్లో ఎత్తైన ప్రదేశం గాలికొండ. 4,320 అడుగుల ఎత్తు ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనంలో షేడ్స్ను లెక్కపెట్టాలంటే ఈ రోడ్డు వెంట ప్రయాణిస్తున్నంత సేపూ కనురెప్ప వేయకుండా చూడాలి. ఇక బొర్రా గుహలు (Borra Caves) ఓ ప్రకృతి అద్భుతం. గుహల పై కప్పు నుంచి స్టాలగ్మైట్ ధారలు ధారలుగా కారుతూ వాతావరణంలో మార్పులతో గడ్డకట్టి΄ోయి ఉంటుంది. అమరనాథ్ లో మంచు శివలింగం రూపం సంతరించుకున్నట్లు ఇక్కడ స్టాలగ్మైట్తో ఏర్పడిన శివలింగం రూపానికి పూజలు చేస్తారు. అమర్నాథ్ మంచులింగం ఏటా కరిగిపోతూ కొత్తగా రూపుదిద్దుకుంటుంది. బొర్రా గుహల్లోని స్టాలగ్మైట్ శివలింగం స్థిరంగా ఉంటూ ఉంటుంది.చందనోత్సవ సింహాచలంశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఏడాదంతా చందనలేపనంతో ఉంటాడు. ఏడాదికోసారి చందనోత్సవం జరుగుతుంది. ఈసందర్భంగా పాత చందన లేపనాన్ని తొలగించి కొత్తగా చందనలేపనం చేస్తారు. స్వామి దేహం నుంచి తీసిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఈ ఆలయంలో కప్పస్తంభం అని ఉంటుంది. అది కప్పం అనే పదం నుంచి వచ్చింది. రాజుకు కప్పం కట్టని ఉద్యోగులను ఆ స్తంభానికి కట్టేసి శిక్షించేవారని స్థానిక కథనం. ఇప్పుడు భక్తులను ఆ స్తంభానికి కట్టేసి, తాడుతో సున్నితంగా రెండు దెబ్బలు వేస్తారు. ఆ స్తంభాన్ని కౌగలించుకుని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయని ఒక విశ్వాసం. సంతానాన్ని కోరుకునే వారు. పుట్టిన సంతానాన్ని దేవుని దర్శనానికి తీసుకువచ్చి మొక్కు తీర్చుకునే వారు. దాంతో కప్పస్తంభాన్ని కౌగలించుకుని కోరుకుంటే సంతానం కలుగుతుందనే అభిప్రాయం వాడుకలోకి వచ్చింది. సింహాచలంలో సంపెంగ పూలు ప్రసిద్ధి. చందనం రంగులో పొడవుగా ఉండే ఈ పూలను అటవీ ప్రదేశం నుంచి ఆదివాసీలు సేకరించి తెస్తారు. వాటిని మాలలుగా కట్టి అమ్ముతారు. ఈ టూర్ గుర్తుగా ఓ దండ కొనుక్కుని తలకు అలంకరించుకోవచ్చు లేదా మెడలో మాలగా వేసుకుని పరిమళాన్ని ఆస్వాదించవచ్చు.అన్నవరంశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ఎంతటి ప్రసిద్ధి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం. పురాణాల్లో ఉదహరించిన రత్నాచలం అనే ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ ఆలయం ఉన్న కొండ పేరు రత్నగిరి. ఈ ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు. అరకు టూర్లో రైలు, రోడ్డు రవాణా సంస్థలు నిర్వహిస్తున్న ఈ రెండు ప్యాకేజ్లలో ఉన్న ప్రధానమైన తేడా అన్నవరం, సింహాచలం ఆలయాల విషయంలోనే. తెలంగాణ టూరిజమ్ బస్సు టూర్లో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ టూర్లో వెళ్తే సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి స్వామి దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన పర్యాటక ప్రదేశాలు రెండు టూర్లలోనూ ఒకే విధంగా ఉంటాయి. బస్ టూర్లో థింసా నృత్యం అదనం.జ్యూవెల్ ఆఫ్ ఈస్ట్కోస్ట్ ఐదు రోజుల టూర్లో విశాఖపట్నం, అరకు కవర్ అవుతాయి. అరకులో పర్యటించడానికి సెప్టెంబర్ నుంచి అనువైన సమయం. దసరా సెలవులకు ప్లాన్ చేసుకుంటే కాఫీ తోటల సౌందర్యాన్ని ఆస్వాదించడంతోపాటు పిల్లలకు సబ్ మెరైన్ నేవీ యుద్ధ నౌకను చూపించవచ్చు.ఐఆర్సీటీసీ టూర్ ఇలా ఉంది!మొదటి రోజు: గురువారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు 12728 నంబర్ గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతుంది.రెండవ రోజు: శుక్రవారం ఉదయం 5.55 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఐఆర్సీటీసీ టూర్ నిర్వహకులు పర్యాటకులను రిసీవ్ చేసుకుని హోటల్కు తీసుకెళ్తారు. చెక్ ఇన్, రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్ తర్వాత సిటీ టూర్. కాళీమాత ఆలయం, సబ్మెరైన్ మ్యూజియం వీక్షణం తర్వాత హోటల్కు వచ్చి లంచ్ చేయడం. మధ్యాహ్నం తర్వాత కైలాసగిరి సందర్శనం, రిషికొండ బీచ్ విహారం. రాత్రి బస విశాఖపట్నం హోటల్లో.మూడవ రోజు: బ్రేక్ఫాస్ట్ తర్వాత రోడ్డు మార్గాన అరకుకు ప్రయాణం. టైడా జంగిల్ బెల్స్ ఎకో టూరిజమ్ రిసార్ట్లో సేదదీరడం, పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం విజిట్ తర్వాత లంచ్ విరామం. మధ్యాహ్నం తర్వాత గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహల విహారం తర్వాత సాయంత్రానికి తిరిగి విశాఖపట్నంలోని హోటల్కు చేరడం, రాత్రి బస.నాలుగవ రోజు: బ్రేక్ఫాస్ట్ తరవాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. దారిలో సింహాచలం దేవస్థానం, రామకృష్ణ బీచ్లో విహారం తర్వాత నాలుగు గంటలకు విశాఖపట్నంలో స్టేషన్లో డ్రాప్ చేస్తారు. సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ట్రైన్ నంబర్ 12727 గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.ఐదవ రోజు: ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.ఐఆర్సీటీసీ ప్యాకేజ్ ధరలివి: కంపర్ట్ కేటగిరీ (థర్డ్ ఏసీ), సింగిల్ షేరింగ్లో ఒక్కొక్కరికి దాదాపుగా 28 వేల రూపాయలవుతాయి. ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి 17 వేలవుతాయి. ట్రిపుల్ షేరింగ్లో 13 వేలకు పైగా ఉంటుంది.స్టాండర్డ్ కేటగిరీ (స్లీపర్) సింగిల్ షేరింగ్లో 26 వేలకు పైగా అవుతుంది. ట్విన్ షేరింగ్లో 15 వేలకు పైగా, ట్రిపుల్ షేరింగ్లో 11 వేలకు పైగా అవుతుంది.ప్యాకేజ్లో మూడు బ్రేక్ఫాస్ట్లు, ఒక లంచ్, రెండు డిన్నర్లుంటాయి.ఇది వీక్లీ టూర్. గురువారం మాత్రమే ఉంటుంది. ఇవి వర్తించవు: ప్యాకేజ్లో సూచించిన భోజనాలు తప్ప ఇతర భోజనాలు పర్యాటకులు సొంతంగా భరించాలి. రైల్లో కొనుక్కున్న తినుబండారాలు, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, బోటింగ్, హార్స్రైడింగ్ వంటి ఇతర టికెట్లు వగైరాలు ప్యాకేజ్లో వర్తించవు.టూర్ కోడ్: https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR027తెలంగాణ టూరిజమ్ నిర్వహిస్తున్నరోడ్ ప్యాకేజ్ ఇలా ఉంది!మొదటి రోజు: సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లోని పర్యాటక భవన్ (బేగంపేట, గ్రీన్ల్యాండ్స్) నుంచి తెలంగాణ టూరిజమ్ బస్ బయలుదేరుతుంది. అదే బస్సు ఆరున్నరకు బషీర్బాగ్ సీఆర్వో ఆఫీసు చేరుతుంది. ఆ స్టాప్కు సమీపంలో ఉన్న వాళ్లు అక్కడే ఎక్కవచ్చు. రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది.రెండవ రోజు: ఉదయం ఆరు గంటలకు బస్సు విశాఖపట్నం చేరుతుంది. హోటల్ గదిలో చెక్ ఇన్, రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్ తర్వాత సిటీటూర్. కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్మెరైన్ మ్యూజియం విజిట్, బీచ్ విహారం తర్వాత హోటల్కు చేరడం, రాత్రి బస.మూడవ రోజు: ఉదయం ఆరు గంటలకు అరకుకు ప్రయాణం. ట్రైబల్ మ్యూజియం విజట్, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్లో విహారం, బొర్రా గుహల వీక్షణం, ధింసా నాట్యాన్ని ఆస్వాదించడం ఆ రాత్రికి అరకులో బస.నాలుగవ రోజు: అరకు నుంచి అన్నవరానికి ప్రయాణం. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత బస్సు ప్రయాణం హైదరాబాద్కు సాగుతుంది.ఐదవ రోజు: ఉదయం ఏడు గంటలకు బస్సు హైదరాబాద్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.బస్ ప్యాకేజ్ ఇలా...తెలంగాణ టూరిజమ్ నిర్వహిస్తున్న అరకు టూర్ ప్యాకేజ్లో పెద్దవాళ్లకు ఒక్కొక్కరికి 6,999 రూపాయలు, పిల్లలకు 5,599 రూపాయలు.ప్యాకేజ్లో నాన్ ఏసీ బస్సు ప్రయాణం, వైజాగ్లో ఏసీ బస, అరకులో నాన్ ఏసీ బస ఉంటాయి.ఆహారం, పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్లు, దర్శనం టికెట్లు, బోటింగ్ వంటివేవీ వర్తించవు.– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి చదవండి: వైష్ణోదేవి దర్శనం.. హిమాలయాల వీక్షణం..! -
విశాఖ : అందాల సాగ రతీరం..స్నేహితుల తీరంగా (ఫొటోలు)
-
కూటమి కక్ష సాధింపు.. కొడాలి నానిపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా: ఏపీలో వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా చంద్రబాబు కూటమి సర్కార్ అక్రమ కేసులో పెడుతోంది. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఐటీ యాక్ట్ కింద కొడాలి నానిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నానికి నోటీసులు ఇచ్చారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు కుటుంబాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ 2024లో విశాఖ-3 టౌన్ పోలీసు స్టేషన్లో విశాఖకు చెందిన అంజనా ప్రియ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు.. కొడాలి నానిపై U/S353(2),352,351(4), 196(1) BNS 467, IT Act కింద కేసు నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కొడాలి నానికి 41ఏ కింద విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. -
‘అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్కు చంద్రబాబు’
చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అమర్నాథ్ అన్నారాయన. శనివారం ఉదయం విశాఖపట్నంలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారాయన. శనివారం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు 30 ఏళ్లలో 58 సార్లు సింగపూర్కు వెళ్లారు. అక్రమంగా సంపాదించిందంతా దాచుకోవడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. అందుకే ఆయన అక్కడికి వెళ్లి సాధించింది ఏమిటో చెప్పుకోలేకపోతున్నారు.... ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమిటి?. సాధించింది ఏమీ లేకే వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారు. అదానీ డేటా సెంటర్ గురించి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అది ఏర్పాటైంది వైఎస్సార్సీపీ హయాం. సముద్ర జలాలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు, లోకేష్లకు ఎప్పుడైనా అనిపించిందా?. లోకేష్ చెబుతున్న బ్లూ ఎకానమీకి అంకురార్పణ జరిగింది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే. కేవలం ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ ప్రధానమైన మూడు పోర్టులను పూర్తి చేశారు.... భూములను ఉద్యోగాలు కల్పించే నాణ్యమైన కంపెనీలకు అప్పగిస్తే ఫర్వాలేదు. కానీ, విశాఖలో విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టారు. 99 పైసల చొప్పున.. రూ.1,350 కోట్ల విలువైన భూమిని అప్పన్నంగా అప్పగించారు. లులు సంస్థకు కారుచౌకగా భూములను, ఉర్సాకు 60 ఎకరాల భూమి ఇచ్చారు. ఎక్కడా పారదర్శకత లేకుండా భూములు కేటాయించారు. కంచె చేను మేసినట్లుగా ఉంది ఈ ప్రభుత్వ పరిస్థితి’’ అని అమర్నాథ్ మండిపడ్డారు. -
రియల్ ఎస్టేట్ సంస్థలకు.. భూ సమర్పయామి
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని ఖరీదైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టడంపై అన్ని వర్గాల నుంచి పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమైనా టీడీపీ కూటమి ప్రభుత్వం వాటిని ఖేఖాతరు చేస్తోంది. కొన్ని సంస్థలకు భూములు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. ఐటీ కంపెనీల ముసుగులో విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టింది.👉బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూపునకు మధురవాడ హిల్ నెంబర్–4లో 30 ఎకరాలను ఎకరా రూ.1.50 కోట్ల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో 50 శాతం ఐటీ అవసరాలకు వినియోగించుకుని మిగిలిన 50 శాతం రిటైల్, గృహ నిర్మాణం వంటి రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించుకో వచ్చని, ఇందుకు విశాఖపట్నం మెట్రోపా లిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ రూపాందించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.👉ఇదే విధంగా కపిల్ చిట్స్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్కు ఎండాడ వద్ద 10 ఎకరాల భూమిని ఎకరా రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించింది. ఇందులో 40 శాతం భూమిని అసోసియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంటే.. అసోసియేట్ ఇన్ఫ్రా పేరిట ఉద్యోగులకు గృహ సముదాయాలు, రిటైల్, వినోదం, మెడికల్, ఎడ్యుకేషన్ అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించింది.ఏఎన్ఎస్ఆర్కు 99 పైసలకే 10.29 ఎకరాలు..👉ఇక బెంగళూరుకు చెందిన మరో సంస్థ ఏఎన్ఎస్ఆర్కు మధురవాడ హిల్ నెంబర్–3లో 2.5 ఎకరాలు, హిల్ నెంబర్–4లో 7.79 ఎకరాలు మొత్తం 10.29 ఎకరాలను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాక.. ఐటీ ఇన్ఫ్రా డెవలపర్ కేటగిరీ కింద పలు రాయి తీలు కల్పించనున్నట్లు అందులో పేర్కొన్నారు.👉సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్కు మధురవాడ హిల్ నెంబర్–3లో ఎకరా కోటి రూపాయల చొప్పున 3.6 ఎకరాలతో పాటు పరదేశీపాలం వద్ద ఎకరా రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వును జారీచేసింది.👉అలాగే, ఫినోమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కు మధురవాడ ఐటీ హిల్ నెంబర్–2లో 0.45 ఎకరాలు, రుషికొండ హిల్ నెంబర్–4లో మరో నాలుగు ఎకరాలను ఎకరా రూ.4.05 కోట్లు చొప్పున కేటాయించింది. వీటితో పాటు ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీని విడుదల చేస్తూ కాటంనేని భాస్కర్ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
కుళ్లిన చికెన్, గడ్డ కట్టిన చేపలు, మాగిపోయిన పీతలు!!
కుళ్లిన చికెన్, గట్టిన చేపలు, మాగిపోయిన పీతలు, ముద్దగా మారిన రొయ్యలు, 15 రోజులకు పైగా నిల్వ ఉంచిన మసాలా ముద్దలు.. చదువుతుంటే ఎలా ఉంది?. కానీ, ఈ వీటితో తయారు చేసిన వంటకాలనే విశాఖపట్నంలోని ప్రముఖ రెస్టారెంట్లలో వడ్డిస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.. విశాఖలో ఇవాళ ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ విస్తుపోయే దృశ్యాలు బయటపడ్డాయి. ఫ్రీజర్లలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసాలను ఉపయోగిస్తున్నారు. పైగా వాటిల్లో వాడే మసాలాలు నిల్వతో బూజుపట్టి ఉండడం గమనించారు. ఈ క్రమంలో.. క్వాలిటీలేని ఫుడ్ను విక్రయిస్తున్న వాళ్లపై అధికారుల సీరియస్ అయినట్లు సమాచారం.జగదాంబ జంక్షన్ లోని ఆల్ఫా హోటల్ లో తనిఖీలు చేస్తున్న స్టేట్ ఫుడ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, సిబ్బంది సాక్షి టీవీతో మాట్లాడారు. ‘‘ఇవాళ 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు, 20 మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో తనిఖీలు చేస్తున్నాం. ఈ హోటల్లో ఫ్రీజ్ చేసిన ఫుడ్ని గుర్తించాం. వంటల్లో ఎక్కువగా కలర్స్ యూజ్ చేస్తున్నారు. కిచెన్లో పరిశుభ్రత పాటించడం లేదు. ఇక్కడి ఫుడ్ని టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపిస్తున్నాం. రిజల్ట్ వచ్చిన తర్వాత కేసులు నమోదు చేస్తాం. ఈ తనిఖీలు కంటిన్యూ అవుతాయి. నిబంధనలు పాటించని వాళ్లపై చర్యలు తీసుకుంటాం. పాయిజన్ ఫుడ్తో ప్రజల ఆరోగ్యాలతో చెలాగాటమాడేవాళ్లను క్షమించేది లేదు’’ అని హెచ్చరించారాయన. -
ఐటీ డెవలప్మెంట్ పేరిట విశాఖలో దోపిడీ: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి పాలనలో జరుగుతున్న విశాఖ దోపిడీతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇష్టానుసారం హత్యలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో కన్నా.. ఈ ఒక్క ఏడాదిలో కాలంలోనే క్రైమ్ రేటు ఎంతో పెరిగింది. కూటమి నేతల్లో అసహనం పెరిగిపోతోంది. మంత్రులు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్తే.. కార్యకర్లు రాకుండా రోడ్లు తవ్వారు అని అన్నారాయన.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దక్కులేదు. కానీ.. కొత్తగా డేటా సెంటర్లు తెచ్చినట్లు చెప్పుకోవడం ఏంటి?. లులు సంస్థకు భూముల విషయంలో లాలూచీ పడ్డారు. రూ.1,500 కోట్ల విలువైన స్థలాన్ని ఆ కంపెనీకి 99 ఏళ్లకు అప్పగిస్తున్నారు. కానీ, అందులో సగం పెట్టుబడి కూడా రాదు. అసలు కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన ఉందా?. అలాగే టీసీఎస్కు అప్పన్నంగా భూములు కట్టబెడుతున్నారు. డేటా సెంటర్ మేం పెట్టలేదా?. వైజాగ్లో ఐటీ సెంటర్ను ప్రొత్సహించింది డాక్టర్ వైఎస్సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విశాఖలో దోపిడీ జరుగుతోంది అని అన్నారాయన. చట్టానికి వ్యతిరేకంగా ఎవరిని మేం సమర్థించబోం. రోజా గురించి ఎలా మాట్లాడారో అంతా చూశారు. కానీ, కూటమి నుంచి తప్పని ఎవరైనా అన్నారా? అని బొత్స నిలదీశారు. -
'నకిలీ మద్యం' చెన్నై To విశాఖ!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : 1000 ఎంఎల్.. ఫుల్ బాటిల్.. అంటే మద్యం ప్రియులకు పండగే. అందులోనూ డిఫెన్స్ బాటిల్ అంటే ఎంత ధర అయినా కొనుగోలు చేద్దామనే ఆలోచన!. ఇంట్లో పార్టీ ఉన్నా.. పండగ ఉన్నా... ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే డిఫెన్స్ బాటిల్ ఇచ్చి ఖుషీ చేద్దామనుకుంటారు.. సరిగ్గా దీన్నే పక్కాగా క్యాష్ చేసుకుంటోంది విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంకు చెందిన వెంకటేష్ పిళ్లై టీం. చెన్నైలోని బర్మాకాలనీకి చెందిన ఓ టీం ఖరీదైన బ్రాండ్ మద్యం ఖాళీ సీసాలను సేకరించి.. అందులో మాములు బ్రాండ్ మద్యాన్ని నింపి.. ఖరీదైన మద్యంగా సరఫరా చేస్తోంది. వీరితో సంబంధాలు నెరుపుకుంటూ అక్కడ నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుంటూ విశాఖలో డిఫెన్స్ మద్యం పేరుతో విక్రయించి భారీగా దండుకుంటోంది వెంకటేష్ పిళ్లై బృందం. చెన్నై నుంచి ట్రావెల్స్ ద్వారా ఈ మద్యాన్ని తరలిస్తుండడం విశేషం. లావాదేవీలన్నీ ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ల ద్వారా నిర్వహిస్తుండటం గమనార్హం. ఇందులో ఇప్పటికే చెన్నైకు చెందిన ముగ్గురిలో ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వెంకటేష్ పిళ్లైను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. లోతుగా విచారించేందుకు నేటి నుంచి వెంకటేష్ పిళ్లైను ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బాటిలింగ్ యూనిట్ను ఏర్పాటుచేసుకొని.. చెన్నైలోని బర్మా కాలనీకి చెందిన ముఠా సభ్యులు పలు ప్రాంతాల నుంచి ఖరీదైన బ్రాండ్ మద్యం ఖాళీ సీసాలను సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని దాదాపుగా అన్ని జిల్లాల నుంచి ప్రీమియం బ్రాండ్ ఖాళీ సీసాలను అక్కడకు తరలిస్తున్నారు. అనంతరం పాండిచ్చేరి నుంచి తక్కువ ధరకు లభించే మద్యాన్ని (సాధారణ ఇతర బ్రాండ్లు) తీసుకొచ్చి ఈ ఖాళీ సీసాల్లో నింపేస్తున్నారు. ఇందుకోసం బాటిలింగ్ యూనిట్ను అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఆర్డర్లకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన వెంకటేష్ పిళ్లై.. ఈ ముఠాతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఈ మద్యాన్ని ఇక్కడకు తరలిస్తున్నారు. అయితే వెంకటేష్ పిళ్లై గత 20 సంవత్సరాలుగా అక్కయ్యపాలెంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డారు. అంతేకాకుండా అక్కడి నుంచి నకిలీ మద్యాన్ని తెచ్చిన తర్వాత.. కొన్నింటిలో నీటిని కూడా నింపి యథావిధిగా సీల్ వేసి విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ల ద్వారానే లావాదేవీలు కోయంబత్తూరు నుంచి విశాఖకు 20 ఏళ్ల క్రితం వచ్చిన వెంకటేష్ పిళ్లై మొదటి నుంచీ ఈ నకిలీ మద్యం సరఫరాలో ఆరితేరారు. గతంలోనూ ఇతనిపై పలుసార్లు కేసులు నమోదయ్యాయి. చెన్నైకు చెందిన ఇషాక్, మహమ్మద్ నిస్సార్ అహమ్మద్తో పాటు మహమ్మద్ సాధిక్ భాష ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ఖరీదైన మద్యం ఖాళీ సీసాలను సేకరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఈ వ్యాపారం చేసే వారితో సంబంధాలు పెట్టుకుని.. చెన్నైలోని బర్మా కాలనీకి చెందిన తమకే విక్రయించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి ఖరీదైన మద్యం పేరుతో నింపిన బాటిల్స్ను తమకు వచ్చే ఆర్డర్లకు అనుగుణంగా ట్రావెల్స్ ద్వారా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్డర్లకు అనుగుణంగా తమకు రావాల్సిన మొత్తాన్ని ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. రూ.వెయ్యి తగ్గించామని కలరింగ్ ఇస్తూ.. 1000 ఎంఎల్ బాటిల్ను రూ.500కే తయారుచేస్తున్న ఈ ముఠా రూ.4 వేలు చొప్పున విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అంతిమంగా బయట మార్కెట్లో రూ.5 వేల విలువ చేసే బాటిల్ను రూ.4 వేలకే విక్రయిస్తున్నామంటూ నకిలీ మద్యాన్ని ఖరీదైన మద్యంగా అంటగడుతున్నారు. బయటి మార్కెట్ కంటే రూ.వెయ్యి ధర తగ్గడమే కాకుండా.. అంత సులువుగా దొరకని డిఫెన్స్ మద్యం తమకు వస్తోందని భావిస్తున్న కొందరు వెంకటేష్ పిళ్లై నుంచి ఆర్డర్లు పెట్టి మరీ తీసుకుంటుండటం గమనార్హం. తాజాగా అక్కయ్యపాలెంలో పట్టుబడిన ఈ మద్యాన్ని పరీక్షల కోసం ల్యాబ్కు పంపగా.. ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే పదార్థాలు కూడా ఇందులో కలిసి ఉన్నట్టు ల్యాబ్ నివేదికలో తేలింది. ఇందులో పాండిచ్చేరి మద్యంతో పాటు ఇంకా ఏమైనా రసాయనాలు కలుపుతున్నారా? అనేది కూడా తేలాల్సి ఉంది. -
PKL 12: ఆరోజే ఆరంభం.. వైజాగ్లో తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు
సాక్షి, విశాఖపట్నం: కబడ్డీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. ఆగష్టు 29న ప్రారంభం కానున్న ఈ మెగా కబడ్డీ టోర్నమెంట్ను నాలుగు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. ఈసారి వైజాగ్, జైపూర్, చెన్నై, ఢిల్లీ నగరాలు 12 జట్లు తలపడే ఈ మెగా లీగ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్..ప్రొ కబడ్డీ 12వ సీజన్ ప్రారంభ వేడుకలు వైజాగ్లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరగనున్నాయి. ఆగస్టు 29 శుక్రవారం జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్తో తలపడనుంది. అదే రోజు జరిగే రెండో మ్యాచ్లో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టాన్ను ఢీకొట్టనుంది.ఇక ఆగస్టు 30న, తెలుగు టైటాన్స్ మరోసారి బరిలోకి దిగి యూపీ యోధాస్తో పోటీపడనుంది. ఆ తర్వాత జరిగే మ్యాచ్లో యు ముంబా, గుజరాత్ జెయింట్స్తో తలపడనుంది. ఇక సూపర్ సండే 30న తలైవాస్, యు ముంబా మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్ తమ టైటిల్ వేటను బెంగాల్ వారియర్స్ మ్యాచ్తో ప్రారంభించనుంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత పీకేఎల్ మళ్లీ వైజాగ్కు రావడం విశేషం. గతంలో 2018లో ఆరో సీజన్కు అంతకుముందు 1,3 వ సీజన్ పోటీలకు అతిథ్యం ఇచ్చిన ఈ నగరంలో ఇప్పుడు మళ్ళీ కబడ్డీ సందడి నెలకొననుంది.చాలా ఆనందంగా ఉందిఈ సందర్భంగా ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ, "ప్రో కబడ్డీ లీగ్ ఎదుగుదలలో 12వ సీజన్ ఒక కొత్త అధ్యాయం. ఈ మల్టీ-సిటీ ఫార్మాట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల వద్దకు అత్యుత్తమ కబడ్డీ యాక్షన్ను తీసుకువెళ్తున్నాం. ముఖ్యంగా ఈ ఆటకు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విశాఖపట్నంకు తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు. కాగా 12వ సీజన్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నారు.అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకేఎఫ్ఐ) ఆధ్వర్యంలో మషల్ స్పోర్ట్స్, జియోస్టార్ కలిసి ఈ లీగ్ను దేశంలో అత్యంత విజయవంతమైన స్పోర్ట్స్ లీగ్స్ లో ఒకటిగా నిలబెట్టాయి. ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జియో హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమ్ అవుతాయి.మిగతా నగరాల్లో షెడ్యూల్జైపూర్వైజాగ్లో తొలి అంచె ముగిసిన తర్వాత సెప్టెంబర్ 12 నుంచి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఇక్కడ జరిగే తొలి పోరులో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్తో తలపడనుంది. 10వ సీజన్లో చారిత్రాత్మక 1000వ మ్యాచ్కు జైపూర్ ఆతిథ్యం ఇచ్చింది.చెన్నైసెప్టెంబర్ 29 నుంచి చెన్నైలోని ఎస్డీఏటీ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో మూడో లెగ్ ప్రారంభమవుతుంది. ఇక్కడ దబాంగ్ ఢిల్లీ కేసీ.. హర్యానా స్టీలర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో స్టార్ రైడర్ నవీన్ కుమార్ తన మాజీ జట్టుపై పోటీపడనుండటం ఆసక్తి రేపుతోంది.ఢిల్లీఅక్టోబర్ 13 నుంచి ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో లీగ్ చివరి దశ మ్యాచ్లు జరుగుతాయి. ప్లేఆఫ్స్కు ముందు అభిమానులకు మరింత వినోదాన్ని పంచేందుకు, ఈ దశలో ట్రిపుల్ హెడర్ (రోజుకు మూడు మ్యాచ్లు) మ్యాచ్లు కూడా నిర్వహించనున్నారు. -
విశాఖలో ఎమ్మెల్సీ నాగబాబుకు షాక్ ఇచ్చిన జనసేన వీరమహిళ
-
ఎమ్మెల్సీ నాగబాబుకు జనసేన వీర మహిళ షాక్
సాక్షి, విశాఖపట్నం: ‘జనసేన నేతలకు, కార్యకర్తలకు ఏం పనులు జరగడం లేదు. మీ వెనుక మేమెందుకు నడవాలని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలి’ అని జనసేన 15వ వార్డు అధ్యక్షురాలు కళ ఆ పార్టీకీలక నేత, ఎమ్మెల్సీ కె.నాగబాబును నిలదీశారు. ఇదే విషయమై 33వ వార్డు జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త భీశెట్టి గోపీకృష్ణ కూడా ఎమ్మెల్సీ నాగబాబును నిలదీయగా.. వీరిద్దరినీ తీవ్రంగా అవమానించడం కలకలం రేపింది.ఎమ్మెల్సీ కె.నాగబాబు విశాఖ సీతంపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన వీరమహిళ కళ మాట్లాడారు. తమ వెనుక ఉన్న వారికి ఒక్క పని కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. పార్టీ నాయకులు వెంటనే ఆమె మాట్లాడుతున్న మైక్ను కట్ చేశారు. మైక్ ఇవ్వాలని ఆమె అడిగినప్పటికీ.. మైక్ను వేరొకరికి ఇవ్వాలని వేదికపై ఉన్న నాయకులు ఆదేశించారు. దీనిపై ఎమ్మెల్సీ నాగబాబు స్పందిస్తూ.. ‘పార్టీ కార్యకర్తలు అసహనంతో పనిచేయొద్దు. వ్యక్తిగతమైన సమస్యల్ని వదిలేసి కూటమితో కలిసి పనిచేయాల్సిందే’ అని తెగేసి చెప్పడంతో సమావేశానికి హాజరైన నాయకులు షాక్కు గురయ్యారు.జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భర్తకూ అవమానం ఇదే సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తల గోడును విన్నవించుకునే ప్రయత్నం చేసిన 33వ వార్డు జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త గోపీకృష్ణకు సైతం తీవ్ర అవమానం ఎదురైంది. కూటమి ప్రభుత్వం తమ మాటకు విలువ ఇవ్వడం లేదని గోపీకృష్ణ చెప్పే ప్రయత్నం చేయగా.. నాగబాబు సీరియస్ అయ్యారు. మైక్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు. పవన్ను నమ్మి తన భార్యను కార్పొరేటర్గా గెలిపించుకుంటే.. ఇలా అవమానిస్తారా? అని గోపీకృష్ణ సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. -
పాములు, కుక్కలతో వినూత్న నిరసన
సాక్షి, విశాఖపట్నం: ఓ వైపు పాములు.. మరో వైపు కుక్కలతో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ కార్మికులు సోమవారం విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో వెటర్నరీ కారి్మకులకు కౌన్సిల్ తీర్మానం 36 ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 53 మంది కార్మికులు ఏళ్ల తరబడి పాములు, కుక్కలను పట్టుకుంటున్నారని తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో కర్తవ్యాన్ని నిర్వహిస్తూ విశాఖ పౌరుల భద్రత కాపాడుతున్నారని, కానీ వారి జీతాలు అతి తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని, 2024 డిసెంబర్ 11న కౌన్సిల్ సమావేశంలో వారికి ఆరోగ్య అలవెన్స్ రూ.6 వేలు పెంచుతూ తీర్మానించారని తెలిపారు. ఏడు నెలలైనా వారికి పెంచిన జీతాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఏడు నెలల బకాయిలతోపాటు పెంచిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)
-
విశాఖ అయోధ్య రామయ్య సెట్ మూసివేత
సాక్షి, విశాఖపట్నం: దేవుడి పేరిట జరిగిన వ్యాపారానికి చెక్ పడింది. వివాదాల నేపథ్యంలో నగరంలో ఏర్పాటు అయిన అయోధ్య రామయ్య సెట్ మూతపడింది. నిర్వాహకులు ఇచ్చిన స్టేటమెంట్ తప్పు అని గుర్తించిన పోలీసులు.. వాళ్లకు నోటీసులు సైతం జారీ చేశారు. విశాఖపట్నంలో అయోధ్య ఆలయాన్ని తలపించే సెటప్ మొదటి నుంచి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తి ముసుగులో టికెట్ల పేరుతో భారీ మోసానికి దిగారనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో కల్యాణం పేరిట ప్రచారంతో భారీ దోపిడీకి స్కెచ్ వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. భద్రాచలం ఆలయ పండితులు పాల్గొంటారని చెప్పి అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అలాంటిదేం లేదంటూ నిర్వాహకులు మీడియా ముఖంగా ఓ ప్రకటన చేశారు. మరోవైపు.. సాక్షి సహా పలు మీడియా సంస్థలు అయోధ్య సెట్ నిర్వాహకుల కమర్షియల్ బాగోతాలను వరుస కథనాలతో బయటపెట్టింది. అదే సమయంలో.. ఫ్లెక్స్ యజమానితో మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ కావడంతో మొత్తం నిర్వాకం బయటపడింది. మీడియా కథనాలు, తీవ్ర విమర్శల నేపథ్యంలో అధికార యంత్రాంగం కదిలింది. జిల్లా కలెక్టర్, భద్రాచలం ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కదిలారు. కేవలం.. ఉద్దేశపూర్వకంగా ప్రచారం కోసమే భద్రాచలం పేరును నిర్వాహకులు వాడినట్లు పోలీసులు గుర్తించారు. బీఎన్ఎస్ సెక్షన్ 35 కింద విశాఖ త్రీ టౌన్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో నిర్వాహకులు సెట్ను మూసేసి.. సర్దుకుంటున్నారు. -
బాబుకు టెన్షన్!.. అమరావతి పుంజుకునేది ఇంకెన్నడు?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం రైతులకు ఇస్తున్న ప్యాకేజీ బాగుందా? లేక పంజాబ్లో ఇటీవల ప్రకటించింది మెరుగ్గా ఉందా?. అమరావతి రైతులు ఈ విషయంపై కొంత విశ్లేషణ చేసుకోవడం మేలు. పంజాబ్ ప్రభుత్వం గృహ నిర్మాణం, పారిశ్రామిక రంగం కోసం ఇటీవలే 21 ప్రాంతాల్లో సుమారు 65 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైంది. పరిహారం కోసం ముందుగా ఒక ప్యాకేజీ ప్రకటించింది కానీ విపక్షాలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సవరించాల్సి వచ్చింది.కొత్త ప్యాకేజీతో పూర్తిగా సంతృప్తి చెందకపోయినా కొన్నిచోట్ల మాత్రం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు పంజాబ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. వాణిజ్య అవసరాల కోసం ఇస్తే ఎకరా భూమికి 800 గజాల ప్లాట్ కేటాయించారు. పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తే వెయ్యి గజాల పారిశ్రామిక ఫ్లాట్, 300 గజాల నివాస ప్రాంతం, వంద గజాల వాణిజ్య ప్లాట్ ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎకరాకు రూ.30 వేల కౌలు ముందు ప్రకటించారు. వ్యతిరేకతతో దీన్ని రూ.50 వేలకు పెంచారు. సేకరించిన భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. భూమి అభివృద్దిలో ఆలస్యం జరిగితే కౌలు మొత్తాన్ని ఏడాదికి పది శాతం చొప్పున పెంచుతారు. సేకరించిన భూమి సెంట్లలో మాత్రమే ఉన్నా వారికి కూడా వాణిజ్య ప్లాట్లు ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు.అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీని పంజాబ్తో పోల్చి చూస్తే ఎన్నో లోటుపాట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత కౌలు మొత్తం రూ.లక్ష చెల్లించే అంశం ఉన్నట్లు లేదు. ప్రభుత్వం ఆ స్థలంలో అభివృద్ధి చేపట్టేలోగా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆ భూములలో పట్టణాభివృద్ధి పనులు ఆరంభం అయ్యే వరకు రైతులు వ్యవసాయం కొనసాగించుకోవచ్చు. ఏపీలో అసలు అభివృద్ది పనులు ఆరంభం కాకముందే వేల ఎకరాలలో గట్లను తొలగించి, రైతులు పంటలు వేసుకునే అవకాశం లేకుండా చేశారు. దాంతో అవి పిచ్చి చెట్లతో నిండిపోయాయి. ఇప్పుడు ఆ కంప కొట్టడానికి ఏపీ ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తోంది.మరోవైపు రైతులు స్వచ్చందంగా ఇస్తేనే భూమి తీసుకుంటామని, బలవంతంగా సమీకరించబోమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్పడం విశేషం. అయినప్పటికీ అక్కడి విపక్షం రైతుల భూములు దోచుకుంటున్నారని, ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం ఈ స్కీమును ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించాయి. ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని చేసిన హామీ మాటేమిటని ప్రశ్నించాయి. విపక్షాల ప్రచారాన్ని భగవంత్ సింగ్ మాన్ కొట్టిపారేసి, రైతులకు మేలైన ప్యాకేజీ ప్రకటించామని చెబుతున్నారు. ఈ రకంగా ఆలోచిస్తే ఏపీలో ఇప్పటికే 13 నెలల్లోనే సుమారు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని తరచూ ప్రకటిస్తోంది. సూపర్ సిక్స్లో ఒకటి అర హామీలు మాత్రమే అమలు చేసింది. అమలు చేయని వాటిలో ఆడబిడ్డ నిధి కూడా ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి సేకరణకు సిద్ధమైంది. ఈ విషయంలో ఇక వెనక్కు తగ్గేదే లేదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.పోలీసులు, మీడియాను అడ్డం పెట్టుకుని, అమరావతి సెంటిమెంట్ను ప్రయోగించి విపక్ష గొంతు నొక్కి అయినా తాను అనుకున్న విధంగా లక్ష ఎకరాల భూమిని తన అధీనంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర సఫలమవుతాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పంజాబ్ రైతుల మాదిరి మరింత గట్టిగా నిలబడితే అమరావతి ప్రాంత రైతులకు కాని, కొత్తగా భూములు తీసుకోబోతున్న గ్రామాల రైతులకు కానీ ప్రయోజనం ఉండవచ్చు. ప్రభుత్వం సకాలంలో భూమిని అభివృద్ధి చేసి వారికి ప్లాట్లు ఇస్తే, వాటికి మంచి ధర పలికితేనే రైతులకు, లేదా భూమి సొంతదారులకు ఉపయోగం ఉండవచ్చు. కానీ, ఏపీలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో లేకపోవడం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వం సృష్టించిన విపరీతమైన హైప్ వల్ల భూముల రేట్లు భారీగా పెరిగాయి. కానీ ఆచరణలో ప్రభుత్వం భూమిని అభివృద్ది చేయలేకపోవడం, ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ దేశవ్యాప్తంగా కొంత మందగించడం మొదలైన కారణాలు రియల్ ఎస్టేట్ను ప్రభావితం చేశాయి. దాంతో అమరావతి గ్రామాలలో కొనుగోలు, అమ్మకపు లావాదేవీలు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయం ఉంది. ధరలు కూడా గతంలో ఉన్న స్థాయిలో లేవని చెబుతున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీడియా బలంతో ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పిస్తుంటారు. కొన్నిసార్లు ఆ వ్యూహం సక్సెస్ అయినా, ఎక్కువ సార్లు విఫలమవుతుంటుంది. అప్పుడు దానిని వదలిపెట్టి కొత్తదేదో చేపడుతుంటారు. అమరావతి రాజధాని విషయంలో కూడా అలాగే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. తొలుత అమరావతి రాజధాని నిర్ణయాన్ని రకరకాలుగా ప్రచారం చేయడంతో కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా నూజివీడు పరిసర ప్రాంతాలలో భూములు కొన్నవారు అప్పట్లో తీవ్రంగా నష్టపోయారు. కానీ, అంతర్గత సమాచారం ఆధారంగా ప్రస్తుతం రాజధానిగా పరిగణిస్తున్న గ్రామాలలో టీడీపీ నేతలు పలువురు భూములు కొని లాభపడ్డారని చెబుతారు. కానీ, అది కూడా తాత్కాలికమే అయింది. రైతుల వద్ద కాస్త అధిక ధరకు కొనుగోలు చేసి, అంతకన్నా ఎక్కువకు అమ్ముకున్న వారు లాభపడ్డారు. కానీ, ఇంకా బాగా లాభాలు వస్తాయన్న భావనతో ఉన్నవారు మాత్రం కొంతమేర నష్టాల పాలయ్యారు.2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూముల ధరలు పెరుగుతాయని టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. ఎన్నికలలో కూడా ఆ పాయింట్ ఆధారంగా లబ్ది పొందే యత్నం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. భూముల రేట్లు కృత్రిమంగా పెంచడం కోసం టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా జనం పెద్దగా విశ్వసిస్తున్నట్లు కనబడడం లేదు. దానికి తోడు ప్రభుత్వం మరో 44వేల ఎకరాల భూమి సేకరించబోతుందన్న ప్రకటన రావడంతో మొత్తం అప్సెట్ అయ్యారు. ప్రభుత్వం ముందు రైతుల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాలతోపాటు, ప్రభుత్వ భూములు 20 వేల ఎకరాలు అభివృద్ది చేసిన తర్వాత తమ భూములు తీసుకోవాలి కాని, అదేమీ చేయకుండా భూ సమీకరణకు వస్తే అంగీకరించబోమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు.రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు సైతం చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపడుతూ రైతులు భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. గతంలో తీసుకున్న భూములకు రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లు కాగితాల మీదే ఉన్నాయి తప్ప ఎవరికి అందలేదు. ఎకరాకు 1200 గజాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపే డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదట. నెల రోజుల నుంచి రియల్ ఎస్టేట్ రంగం మరీ కుదేలైందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం తెలిపిన దాని ప్రకారం రైతులకు ఇచ్చిన ప్లాట్లను అన్ని సదుపాయాలతో అభివృద్ది చేయాలి. ఆ పని ఇంతవరకు మొదలే కాలేదు. రైతులు ఎక్కడ భూమి ఇస్తారో, అక్కడే ప్లాట్లు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆ పని చేయకుండా ఒక గ్రామంలో ఒక సంస్థకు భూమి కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థ అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడానికి వీలు లేకుండా రైతులు అడ్డుకున్నారట.మరోవైపు చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పెట్టి క్వాంటమ్ వ్యాలీ అని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అని, ఆదాని క్రీడా నగరమని, ఔటర్ రింగ్ రోడ్డు, ఆ రోడ్డు చుట్టూ హైటెక్ సిటీ అని విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఆ వార్తలను పతాక శీర్షికలుగా వండి వారుస్తోంది. ఇదంతా ఎప్పటికి అవుతుందో తెలియని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ.31 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం టెండర్లు మాత్రం రూ.ఏభై వేల కోట్లకు పైగానే పిలిచిందట. ఈ నిర్మాణాలన్నీ పూర్తి కావడానికి మూడు, నాలుగేళ్లు పట్టవచ్చని ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం వల్ల రియల్ ఎస్టేట్ ఎంతమేర పుంజుకుంటుందో చెప్పలేం. వ్యాపార, పారిశ్రామిక రంగంలో కొత్త సంస్థలు వస్తే కొంత అభివృద్ది ఉండవచ్చు. కాని ప్రస్తుత పరిస్థితి అంత అనువుగా లేదు.ఎంతో అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో సాగడం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇంకో మాట చెప్పాలి. విశాఖ వంటి నగరంలో పెద్ద కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం అమరావతిలో మాత్రం కొన్ని సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లకు చెల్లించాలని అంటోంది. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఎకరా ఇరవై కోట్లకు పైగానే అమ్ముడు పోతుందని తెలిపారట. భూముల అమ్మకం ద్వారా అప్పులు తీర్చుతామని చెబితే అదెప్పుడు ఆరంభం అవుతుందని ప్రపంచ బ్యాంక్ అడిగితే ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు మల్లగుల్లాలు పడుతోంది.అమరావతి ద్వారా సంపద సృష్టి ఎప్పటి నుంచి మొదలు అవుతుందని ఒక విలేకరి చంద్రబాబును అడిగితే అది నిరంతర ప్రక్రియ అని, మూడేళ్లలో సెట్ అవుతుందని, ఆ తర్వాత దాని ప్రభావం ఉంటుందని జవాబు ఇచ్చారు. ఒకప్పుడు ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ నగరం అని చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వేల కోట్ల అప్పులు చేయాల్సి వస్తోంది. అయినా రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వం కోరుకున్న రీతిలో సాగడం లేదు. ఈ వ్యాపారం సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వం రైతులకు మేలు చేయదలిస్తే పంజాబ్లో మాదిరి ప్యాకేజీని, ప్రత్యేకించి కౌలు మొత్తాన్ని పెంచితే కొంతవరకు మంచిదేమో ఆలోచించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విశాఖ పోలీసుల థర్డ్ డిగ్రీ.. మేజిస్ట్రేట్ ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: పొక్సో కేసులో ఏసీపీ చేతివాటం బయటపడింది. ఇంటర్ చదువుతున్న బాలికపై రామకృష్ణ అనే యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తానంటూ బాలిక ఇంటికి వచ్చి మరి.. బెదిరింపులకు దిగాడు. దీంతో తమ కూతురికి ప్రాణహాని ఉందని.. వేధింపులు భరించలేక పోతుందని హార్బర్ ఏసీపీ కాళిదాసును బాలిక తల్లిదండ్రులు ఆశ్రయించారు.పోక్సో కేసులో సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బాధితులపై ఏసీపీ కాళిదాసు తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. కాగా, ఏసీపీ అండతో పోలీస్ స్టేషన్లోనే బాధితురాలు తండ్రిపై నిందితుడు రామకృష్ణ దాడి చేశాడు. దాడి చేసినా కానీ బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ కాళిదాసు తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ హార్బర్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది.ఇదిలా ఉండగా.. ఈ కేసులో పోలీసులు డబుల్ గేమ్ ఆడారు. పోలీస్ స్టేషన్లో గొడవ బయటకి రావటంతో నిందితుడికి పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. నిందితుడి ప్రైవేట్ పార్ట్స్పై వేడి మైనపు చుక్కల్ని వేశారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడు రామకృష్ణ.. రిమాండ్ సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట థర్డ్ డిగ్రీ విషయం బయట పెట్టాడు. పోలీసులపై మేజిస్ట్రేట్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ సీపీ శంఖబ్రతబాగ్చికి మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.


