సాక్షి, విశాఖపట్నం: సింహచలం కొండపై అపచారం జరిగింది. కొండపై టీడీపీ మహిళా నేత కేక్ కట్ చేసింది. సౌజన్య కుమారి కేక్ కట్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అత్యంత పవిత్రమైన క్షేత్రంలో ఆలయ, ఆగమ సంప్రదాయాలు పాటించకుండా కేక్ కటింగ్ చేయడంపై ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.