breaking news
TDP
-
స్పోర్ట్స్ కోటా ఉద్యోగం.. నా దగ్గర డబ్బు తీసుకుంది ఆయనే..! లైవ్ లో DSC బాధితురాలి ఆవేదన
-
జగన్ కు భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు
-
ఏపీ డీఎస్సీ ఉద్యోగాల అమ్మకాల్లో మరో కొత్త కోణం
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ ఉద్యోగాల అమ్మకాల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రూ.14.5 లక్షలు బాధితురాలి నుంచి టీడీపీ నేతలు వసూలు చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కోసం రూ.14.5 లక్షలు వసూలు చేశారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి డీఎస్సీ బాధితురాలు రాధిక ఫిర్యాదు చేశారు. మంత్రి లోకేష్ కోటాలో ఉద్యోగం అంటూ మోసం చేశారని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పరీక్ష లేకుండా నాకు డీఎస్సీ ఉద్యోగం ఇస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలు మెడికొండ జ్యోతి, అడపా భాను ప్రకాష్లు డబ్బులు తీసుకున్నారు. ఆ ఉద్యోగం వేరే వ్యక్తికి ఇచ్చి నన్ను మోసం చేశారు. ఆ వ్యక్తి దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశా.. 10 నెలలైనా చర్యలు లేవు. నన్ను చంపుతామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు...ఎస్పీ ఆఫీస్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్ట్ ఇస్తామని మోసం చేశారు. నా దగ్గర ఆధారాలున్నా.. నిందితుడిని అరెస్ట్ చేయలేదు. నాకు జరిగిన మోసాన్ని వైఎస్ జగన్కు వివరించాను’’ అని రాధిక తెలిపారు. -
బాబూ...! 'ఓటుకు నోటు' కేసు మరిచిపోయావా?
ఎన్నికలలో డబ్బులు తీసుకోవడం మానేయలేమా? ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వచ్చిన ఒక పెద్ద సందేహం!కొందరు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం అయిన సందర్భంలో ఆయన ఈ ప్రశ్న వేశారు. నిజానికి చంద్రబాబు ప్రశ్న వేసుకోవలసింది తనకే కదా అని ఎవరికైనా డౌటు రావచ్చు. అసలు చంద్రబాబు చెప్పవలసిన మాటేమిటి? ఇకపై వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో సహా ఏ ఎన్నికలోను తాము పార్టీపరంగా ఓటర్లకు డబ్బు పంచబోమని, అలాగే ఏ పార్టీని పంచబోనివ్వబోమని కదా! నిజంగా ఈ మాట అని ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది.ఇంతకాలం జరిగిన విషయాల సంగతెలా ఉన్నా ఇకపై ఎన్నికలలో డబ్బు ప్రభావం తగ్గించడానికి చంద్రబాబు ఇప్పటికైనా పూనుకోవడం మంచి పరిణామం కదా అని అంతా అనుకునేవారు. వాస్తవంగా అలా జరుగుతుందా? లేదా? అన్నది పక్కనబెడితే, కనీసం మాటవరసకైనా అన్నారులే అని భావించవచ్చు. ఇప్పుడు ఆ మాట చెప్పకపోవడంతో ఆయన చిత్తశుద్దిని శంకించే పరిస్థితి ఏర్పడుతుంది కదా! పైగా మహిళలే డబ్బు తీసుకుంటున్నట్లు మాట్లాడడంపై మాజీ మంత్రి రోజా వంటి వారు అభ్యంతరం చెప్పారు. ఇది మహిళలను అవమానించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు అయితే ఘాటు వ్యాఖ్య చేస్తూ రాజకీయాన్ని వ్యాపారమయం చేసిందే చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరపాలని ఈసీకి లేఖ కూడా రాశారు. నాయకులు రెండువేలు ఇస్తే, రెండు లక్షలు సంపాదించుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండు లక్షలేమి ఖర్మ.. రెండు కోట్లు అయినా కావచ్చు. అదేమి రహస్యం కాదు. మాకు నీతి ఉంది.. డబ్బులు తీసుకోబోమని చెప్పండి అని ఆయన అన్నారు. నేతలు డబ్బు ఇస్తుంటే తమకు నీతి ఉందని చెప్పండని, డబ్బు తీసుకోకుండా ఓటేయండి అని ఆయన అన్నారు. ఇది మంచిమాటే.ఎన్నికలలో డబ్బు ఇచ్చేవారిది తప్పుకాదా! తీసుకునేవారిదే అవుతుందా? ఒకప్పుడు ఈ డబ్బు ప్రభావం పెద్దగా ఉండేది కాదు. టీడీపీ ఆవిర్భావం తర్వాత, అది చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాకే ఇది బాగా అధికం అయిందని వివిధ రాజకీయ పక్షాల నేతలు విమర్శిస్తుంటారు. అందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ డబ్బు ఖర్చు పెడుతోందా? లేదా? ఓట్ల కొనుగోలుకు డబ్బు వ్యయం చేయడం లేదని చంద్రబాబు గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చేముందు ఆయా అభ్యర్దులను వారి పరిస్థితిని బట్టి 25 కోట్ల నుంచి ఏభై కోట్ల వరకు ఖర్చు చేయగలరా? లేదా? అని అడుగుతున్నారా? లేదా? కొందరి నుంచి కోట్ల రూపాయలు టిక్కెట్ కోసం వసూలు చేస్తున్నారా? లేదా? ఇతర పార్టీలు చేయడం లేదా?అని అడగవచ్చు.ఒకరిని బట్టి మరొకరు చేసే పరిస్థితి ఎలా వచ్చింది? చంద్రబాబు ఈ సుభాషితాలు చెప్పగానే అనేక పాత విషయాలు గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో సహిత వ్యాఖ్యలు వచ్చాయి. ముఖ్యంగా ఓటుకు నోటు కేసును పలువురు ప్రస్తావించారు. 2015లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికిగాను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి టీడీపీ ప్రయత్నించిందన్న ఆరోపణ వచ్చింది. ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏభై లక్షల రూపాయలు తీసుకువెళ్లి ఏసీబీకి పట్టుబడిన వైనం, ఆ తర్వాత ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి భరోసా ఇవ్వడం వంటి సన్నివేశాలు మరోసారి తెరపైకి వచ్చాయి.ఆ క్రమంలో అప్పటి సీఎం అయిన కేసీఆర్తో రాజీలో భాగంగానే అప్పటికప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదలుకుని చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన ఘట్టాన్ని గుర్తు చేస్తున్నారు. 1995లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి కోట్లు వెచ్చించారని చంద్రబాబుపై స్వయంగా ఆయన మామ ఎన్టీ.రామారావు ఆరోపించారు. ఆ రోజుల్లో అత్తిలి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే ఓటుకు 500 రూపాయలు చొప్పున టీడీపీ పక్షాన పంచామని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి ఒక టీవీ షోలో ఓపెన్గానే కొన్నేళ్ల క్రితం చెప్పారు. అప్పటి నుంచి ఓటు రేటు పెరుగుతూ రెండువేలకు చేరుకుందని అంటారు.ఇక 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేసింది అందరికి తెలుసు. ఒక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తనకు ఏడు కోట్లు టీడీపీ నాయకత్వం ఇచ్చిందని ఆ రోజుల్లో బహిరంగంగానే వెల్లడించారు. మరో ఎమ్మెల్యే తనకు బెంగుళూరులో డబ్బు అందచేశారని అంటే, ఇంకొకరు తన అప్పు మొత్తం తీరిపోయిందని, అందుకే వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించానని ఆంతరంగికంగా చెప్పేవారు. నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది చంద్రబాబు అభిప్రాయం.కొద్ది రోజుల క్రితం కూడా ఆయన ఒక ఉపన్యాసంలో ఈ ప్రస్తావన చేశారు. ఇతర విషయాల సంగతేమో కాని, ఎన్నికల విషయంలో ఆయన డబ్బు వ్యయంలో రాజీపడరని కొందరు సీనియర్ టీడీపీ నేతలు చెబుతుంటారు. అవసరమైతే అప్పు చేయడానికి వెనుకాడరు. అలా అప్పులు ఇచ్చినవారిలో కొందరు ఎన్ఆర్ఐలు ఉన్నారని ప్రచారం జరిగేది.తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ కొత్తగా రాజకీయాలలోకి వచ్చి ఓటర్లకు డబ్బు ఇవ్వకుండా విజయం సాధించారని చెబుతారు. ఆయన మాదిరి ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు అదేబాటలో నడుస్తానని చెప్పి ఉండాల్సింది కదా! ఉచిత బస్ స్కీమ్ వల్ల మహిళల ఆత్మగౌరవం పెరిగిందట. అది ఎలా ఉందో కాని, బస్లలో జరుగుతున్న గొడవలపై పలుచోట్ల ప్రజలు చికాకు పడుతున్నారు. ఒకప్పుడు ఏదీ ఉచితం కాదని చెప్పిన చంద్రబాబు తాను ఉచిత బస్ వంటి స్కీమ్ అమలు చేస్తే మాత్రం గొప్ప సంగతి అని చెప్పుకుంటారు. అది ఆయన ప్రత్యేకత.ఈ సందర్భంలో ఒక మహిళ తాను ఫ్రీబస్ ఉందని హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని, విజయనగరం నుంచి రోజూ ఉచిత ప్రయాణం వల్ల 3500 రూపాయలు సేవ్ అవుతున్నాయని అన్నారు. తీరా చూస్తే ఆమె ఏదో చీరల వ్యాపారం చేస్తున్నారని, రీల్స్ చేస్తుంటారని సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో ఈ ఉదంతం నవ్వులపాలైనట్లయింది. పైగా హైదరాబాద్లో కూడా ఫ్రీబస్ స్కీమ్ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది కదా అని కొందరు పేర్కొంటున్నారు.మహిళలకు ఇచ్చిన ఇతర హామీల గురించి ప్రస్తావించకుండా చంద్రబాబు జాగ్రత్తపడుతుంటారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల ఇస్తానన్న ఆడబిడ్డ నిధి గురించి మాత్రం మాట్లాడలేదు. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ డబ్బు ఇస్తామని, వేలంపాట మాదిరి ఎన్నికల ప్రచారంలో చెప్పేవారు. దాని గురించి ఏమనుకుంటున్నారని చంద్రబాబు మహిళలను అడగలేదు. ఒక్కో కుటుంబానికి నాలుగు పథకాలు వస్తున్నాయని ఆయనే అంటారు. చేపలు ఇవ్వడం కాదు. చేపలు పట్టడం నేర్పాలి.. అని ఆయనే చెబుతారు. దేనిని నమ్మాలి!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
గంజాయి అమ్మిస్తున్న TDP నేతపై మహిళ సంచలన వ్యాఖ్యలు
-
ఖాకీ వనంలో ‘గంజాయి’!
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా శంఖవరప్పాడులో ఇద్దరు ఎస్ఐలు నేరుగా గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఘటనతో రాష్ట్రం నివ్వెరపోయింది. చంద్రబాబు సర్కారు చేతకానితనంతో రాష్ట్రం గంజాయి అక్రమ రవాణాకు గేట్ వేగా మారిపోయిందని మరోసారి రుజువైంది. గంజాయి సాగు, రవాణాను అరికట్టాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో కూటమి నేతల కనుసన్నల్లోనే యథేచ్ఛగా దందా సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దందా బయటపడినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడ డ్రగ్స్ పార్టీని ఛేదించినా టీడీపీ కూటమి నేతలే చిక్కుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో తెలంగాణ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుదీర్రెడ్డి డ్రగ్స్ దందాలో అడ్డంగా దొరకడం గమనార్హం. కుటీర పరిశ్రమలా లిక్విడ్ గంజాయి యూనిట్లు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో నమ్మబలికిన చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్రం గంజాయి దందాకు గేట్ వేగా మారినా చోద్యం చూస్తున్నారు. టీడీపీ కూటమి నేతలే రింగ్ మాస్టర్లుగా, మత్తు మాఫియాలా మారి రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుండటంతో పోలీసు శాఖ చోద్యం చూస్తుండిపోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లా కేంద్రంగా గంజాయి మాఫియాకు ఊపిరి పోసింది. మొత్తం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో గంజాయి సాగు చేయిస్తుండటంతోపాటు ఒడిశా, చత్తీస్ఘడ్ల నుంచి భారీగా గంజాయిని కొనుగోలు చేస్తూ ఏపీ పరిధిలో నిల్వ చేస్తున్నారు. ఏఎస్ఆర్ జిల్లాలో కుటీర పరిశ్రమ తరహాలో లిక్విడ్ గంజాయి యూనిట్లను నెలకొల్పారు. అంతటా ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సిండికేట్ భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ సాగిస్తోంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు దర్జాగా గంజాయి తరలిస్తున్నారు. హోంమంత్రి అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గంలో ఎక్కువగా గంజాయి పట్టుబడటం గమనార్హం. ఆదాయ వనరుగా గంజాయి.. రాష్ట్రంలో యధారాజా తథా పోలీస్ అనే చందంగా కొందరు ఖాకీలు వ్యవహరిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం గంజాయి నిర్మూలనను గాలికి వదిలేయడంతో కొందరు టీడీపీ నేతలు దాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అధికార పార్టీ నేతలే బరి తెగించడంతో రెడ్బుక్ రాజ్యాంగంలో తామేం తక్కువ తినలేదన్నట్లుగా కొందరు పోలీసులు సైతం గంజాయి దందాకు పాల్పడుతున్నారు. తాజాగా శంఖవరంపాడులో ఇద్దరు ఎస్ఐలు మరికొందరు పోలీసులతో ధూమ్ ధామ్గా పార్టీ చేసుకుని వెళుతూ యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్ చేసిన కారులో గంజాయి, మద్యం బాటిళ్లు దొరకడంతో అసలు బండారం బట్టబయలైంది. రెడ్బుక్ అమలు మినహా మరేమీ పట్టని పోలీసు వ్యవస్థ ఇప్పటికే రాష్ట్రంలో అబాసుపాలైంది. తాజా ఘటనతో గంజాయితో వచ్చిన ఆదాయంతో ఎంజాయ్ చేస్తున్నారనే విషయం బట్టబయలైంది. గంజాయి పట్టుకొచ్చారా.. పట్టుకున్నారా? గంజాయి వ్యవహారంలో ప్రకాశం జిల్లా పోలీసులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం ద్వారా తప్పు చేశారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. వేరేవారిపై కేసు పెట్టేందుకే గంజాయి తెచ్చినట్టు ఒకసారి.. కాదు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని మరోసారి నాలుక మడతేయడంతో అడ్డంగా బుక్ అయ్యారు. వాస్తవానికి గంజాయి, డ్రగ్స్ విషయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదు. ఎన్డీపీఎస్ చట్టం–1985, ఎన్డీపీఎస్ నియమావళి–2022, ఎన్సీబి స్టాండింగ్ ఆర్డర్ 1/89) ప్రకారం సోదా, స్వా«దీనం, నమూనా సేకరణ ప్రక్రియలను నిర్వహించేటప్పుడు దర్యాప్తు అధికారి కచ్చితమైన నిబంధనలను పాటించడం తప్పనిసరి. గంజాయి స్వాదీనం సమయంలో పోలీసులు పాటించాల్సిన కీలక నిబంధనలివీ..⇒ సోదాకు ముందు అవసరమైన చర్యలు, సమాచారాన్ని (సెక్షన్లు 41/42) ప్రకారం లిఖితపూర్వకంగా నమోదు చేశారా? ఆ సమాచారాన్ని 72 గంటల్లో పైఅధికారికి నివేదిక ఇచ్చారా? ⇒ సోదా నిర్వహణ, స్వతంత్ర సాక్షులు (సెక్షన్ 100 సీఆర్పీసీ, ఎన్డీపీఎస్ సెక్షన్ 50 ప్రకారం కనీసం ఇద్దరు సాక్షులు ఉన్నారా? ⇒ వ్యక్తిగత సోదా రక్షణ సెక్షన్ 50 ప్రకారం సోదాలు గెజిటెడ్ అధికారి, మేజిస్ట్రేట్ సమక్షంలో నిర్వహించే చట్టపరమైన హక్కు గురించి నిందితుడికి లిఖితపూర్వకంగా తెలిపారా? ⇒ రసాయన విశ్లేషణ కోసం స్వా«దీనం చేసుకున్న సరుకును అక్కడే సీల్ చేసి, తూకం వేసి, జాబితా తయారు చేయాలనే విషయం తెలియదా? సెక్షన్ 52 ఏ కింద నమూనా సేకరణ, జాబితా ధృవీకరణ, ఫోటోగ్రఫీ ప్రక్రియలు మేజిస్ట్రేట్ సమక్షంలోనే చేయాలనే విషయం తెలియదా? ⇒ సంఘటనా స్థలంలోనే నిందితుడు, సాక్షుల సంతకాలతో కూడిన సమగ్ర పంచనామా, స్వాధీన మెమోను సిద్ధం చేశారా? ⇒ స్వాదీనం చేసుకున్న భారీ మొత్తంలోని సరుకును సీళ్లు చెక్కుచెదరకుండా రిజిస్టర్లో నమోదు చేసి అధికారిక పోలీసు స్టోర్లో వెంటనే భద్రపరచాలనే నిబంధన ఎందుకు పాటించలేదు? ⇒ సెక్షన్ 57 కింద అరెస్టు/స్వాధీనానికి సంబంధించిన పూర్తి నివేదికను 48 గంటల లోపు తక్షణం పైఅధికారికి పంపాలనే విషయం తెలియదా? -
నా వీల్ చైర్ చూసి కూటమి ప్రభుత్వం వణికిపోతుంది
-
టీడీపీ నేత లైంగిక వేధింపులు
కృష్ణాజిల్లా: గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఏఎన్ఎం ఉద్యోగిని, ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా మానసికంగా, లైంగికంగా తన ఇంటికి రావాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఈ నెల 17న ఆమె తండ్రి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఫిర్యాదు అనంతరం ఆమెను అధికారం అండతో బంటుమిల్లికి బదిలీ చేయించిట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలని బాధితురాలు కోరారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే మార్కెట్ యార్డు చైర్మన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమని రవికుమార్ అన్నారు. ఆరోపణలపై డీఎస్పీ శ్రీనివాసకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
మార్గాని భరత్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
సుగాలి పార్వతిని అడ్డుకున్న పోలీసులు
-
చిన్నారెడ్డి VS మేఘారెడ్డి... డీసీసీ అధ్యక్ష పదవిపైనా వర్గపోరు
-
మంత్రులపై మండలి చైర్మన్ ఫైర్
-
జీతాలకే 98 శాతమా? చంద్రబాబు లెక్కలపై ఉద్యోగుల ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు ఎంత వ్యయం అవుతోంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 94 నుంచి 98 శాతం వ్యయం అవుతోందని, సంక్షేమ స్కీములకు అప్పులు తెస్తున్నామని ఆర్ధిక పరిస్థితి శ్వేతపత్రం విడుదల సందర్భంగా చెప్పారు. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన పడుతున్నారు. వారి సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. వీరిలో కొందరు టీడీపీ అనుకూల నేతలు కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఏపీ ఎన్జీవోల గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడుగా ఉన్న అలపర్తి విద్యాసాగర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి కాదని అంటారు. కాని ఆయన సైతం చంద్రబాబు అసత్యపు లెక్కలు చెప్పారని అంటున్నారు.చంద్రబాబు చెప్పేదానిలో నిజం ఉంటే, ఈ నేతలు ఇంత ధైర్యంగా ఖండించగలుగుతారా అన్నది చర్చ. చంద్రబాబు లెక్కల్లో ఎక్కువ సందర్భాలలో నిర్దిష్టత అన్నది ఉండదు. అందువల్ల ఆయన చెప్పేదానిలో సత్యం ఎంత ఉంది? అసత్యం ఎంత ఉంది అన్నది తేల్చడం అంత తేలికకాదు. మొత్తం ప్రభుత్వ లెక్కలన్నీ పరిశీలించి ఒక అవగాహనకు రావల్సి ఉంటుంది. అందువల్లే ఉద్యోగ సంఘాల నేతలు అన్నిటిని సరిపోల్చుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంంది. విద్యాసాగర్ చెబుతున్నదాని ప్రకారం 30 నుంచి 35 శాతమే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ఉ ద్యోగుల పెన్షన్లకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం తప్పుడు లెక్కలతో వంచిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరింత వివరంగా ఈ అంశంపై మాట్లాడారు. 2025లో ప్రభుత్వం వ్యయం చేసిన 2.26 లక్షల కోట్లలో 37.4 శాతం మాత్రమే ఉద్యోగులకు అయిన ఖర్చు అని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి వచ్చే పన్నుల రాబడిలో 59 శాతం, ఇతర రాబడి కూడా కలిపితే 49 శాతం మాత్రమే ఉద్యోగులకు పెడుతన్న ఖర్చు అని ఆయన వివరించారు. ఈ రెండేళ్లలో 41 వేల మంది రిటైరైతే, వచ్చే ఐదేళ్లలో లక్షన్నర మందికి పైగా రిటైర్ కాబోతున్నారని, అదే సమయంలో కొత్త రిక్రూట్ మెంట్ జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సంపద సృష్టించి హామీలు నెరవేర్చుతామని చంద్రబాబు అన్నారని, ఉద్యోగులకు పలు వరాలు ప్రకటించారని, జాబ్ కాలెండర్ ఇస్తామన్నారని, కాని ఇప్పుడేమో డబ్బంతా ఉద్యోగులకే అయిపోతోందని ప్రచారం చేస్తున్నారని వలిశెట్టి దామోదర్ అనే మరో ఉద్యోగ సంఘ నేత పేర్కొన్నారు.గతంలో ఉద్యోగుల నేతగా ఉండి, ప్రభుత్వ ఆగ్రహానికి గురైన మరో ప్రముఖుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని, ఉద్యోగులకు 30 వేల కోట్ల బకాయిలు చెల్లించామని ఆయన అనడం అసత్యమని అన్నారు. ఉద్యోగుల జీతాల ఖర్చు 35 నుంచి నలభై శాతమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికి 50 వేల కోట్ల మేర ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ పడిందని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం చర్చలు జరిపి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పినా, ఆచరణలో జరగడం లేదని ఈ నేతలంతా అంటున్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు ఇంకో విధంగా ఉన్నాయి. వారు సభలు పెట్టుకుని ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.తమపై పనిభారం పెంచడమేకాకుండా,తమ 22 డిమాండ్లను పక్కనబెట్టిందని వారు ధర్నా చేశారు. కరపత్రాలు పంచడానికి తమను ఇంటింటికి వెళ్లమంటున్నారని,సర్వేల పేరుతో విసిగిస్తున్నారని, ఆ క్రమంలోతాము ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కుంటున్నామని చెబుతున్నారు. ఇవన్ని చూస్తుంటే ప్రభుత్వంలో ఉద్యోగులలో దాదాపు ఎవరూ సంతోషంగా లేరనిపిస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి,కీలక మంత్రి ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతూ కోట్లు వ్యయం చేస్తున్నారని,మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రం ప్రజలలో చెడు అభిప్రాయం కలిగించడానికి యత్నిస్తున్నారని వారు ధ్వజమెత్తుతున్నారు.వీరు చెప్పే విషయాలలో చాలావరకు వాస్తవాలు ఉండవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని చెప్పడం ద్వారా కొత్తగా పిఆర్సి వేయలేమని, ఇంటెరిమ్ రిలీఫ్ ఇవ్వలేమని చంద్రబాబు సంకేతం పంపినట్లయిందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి ఇష్టారాజ్యంగా వ్యయం చేస్తున్న వైనాన్ని ఉద్యోగులు కూడా గమనిస్తున్నారు. ఏకంగా నాలుగు భవనాల అద్దాలకు 2500 కోట్లు, రీడిజైనింగ్ కన్సల్టెన్సీకి అదనంగా 206 కోట్లు, హైకోర్టు వెలుపల సుందరీకరణకు 540 కోట్లు.. ఇలా మితిమీరి ఖర్చు చేసే ప్రభుత్వం ఉద్యోగుల వద్దకు వచ్చేసరికి ఆదాయం అంతా జీతాలకే సరిపోతోందని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడానికేనన్నది వారి భావన. ఉద్యోగ సంఘాల నేతలపై కూడా రెడ్ బుక్ ప్రయోగం చేయకపోలేదు. అయినా వెంకట్రామిరెడ్డి వంటివారు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టోలో ఉద్యోగులకు ఏమి హామీలు ఇచ్చారో గమనించండి. ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్టిస్తామని ఒక సెంటిమెంట్ను రెచ్చగొట్టే యత్నం చేశారు. కాని ఇప్పుడేమో అవమానించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న భావన ఉద్యోగులలో కలుగుతోంది. జగన్ ప్రభుత్వం జిపిఎస్ తీసుకువచ్చి ఒక పరిష్కారాన్ని కనుగొనే యత్నం చేస్తే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు దానిపై దుష్ప్రచారం చేశారు.తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్, జిపిఎస్ విధానాలను పునఃసమీక్షించి పరిష్కారం చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆ ఊసే తేవడం లేదు. మెరుగైన పీఆర్సీ,ఐఆర్. వెంటనే ప్రకటిస్తామని మానిఫెస్టోలో చెప్పినా అతీగతీ లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైరైనవారికి మొదటి తేదీనే జీతాలు పెన్షన్ ఇస్తామని,వారికి రావల్సిన బకాయిలు చెల్లిస్తామని వాగ్దానం చేశారు. కాని చంద్రబాబు ఈ విషయంలో చెబుతున్న లెక్కలు తప్పని ఉద్యోగ నేతలు విమర్శిస్తున్నారు. వలంటీర్ల గౌరవ వేతనాన్ని ఐదువేల నుంచి పదివేలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దేవుళ్ల సాక్షిగా ప్రకటించారు కాని, అసలు మొత్తం వ్యవస్థనే లేకుండా చేయడం మోసం కాదా అన్నది వారి ప్రశ్నగా ఉంది. ఈ నేపధ్యంలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి సన్నద్దమవుతున్నాయి.అయితే ఏదో రకంగా వారిని భయపెట్టో, మభ్యపెట్టో వారి ఉద్యమానికి ప్రభుత్వపరంగా అడ్డుకట్ట వేసే యత్నం జరుగుతుంది. విశేషం ఏమిటంటే ఎల్లో మీడియా ద్వారా మాత్రం ఉద్యోగులకు ఏదో చాలా జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు. గత జగన్ ప్రభుత్వ టైమ్లో ఉద్యోగులను ఎన్నిరకాలుగా రెచ్చగొట్టాలో అన్ని విదాలుగా టీడీపీ,జనసేనలతో పాటు ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా రెచ్చగొట్టాయి. ఇప్పుడు అదేమీడియా ఉద్యోగులను మభ్యపెట్టే పనిలో పడింది. ప్రభుత్వ ఉద్యోగులు గత జగన్ టైమ్ లో తమ టైమ్ ప్రకారం డ్యూటీ చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకు జనాన్ని పోగు చేసే పనే ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. ఇప్పటికైనా పాలేవో,నీళ్లేవో ఉద్యోగులు గమనించారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కుప్పంలో TDPకి బిగ్ షాక్
-
మళ్లీ మాయోపాయం!
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి బీసీ రిజర్వేషన్లపై కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఒకవైపు బీసీల ఎదుగుదలను అడ్డుకునే రాజకీయాలు చేస్తూనే వారికోసం తానే అంతా చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం ఆయనకు ‘వెన్నుపోటు’తో పెట్టిన విద్య. బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పించేస్తున్నామని, అది ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి నుంచీ రిజర్వేషన్లను లాక్కోవడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలకు ఇచ్చే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇదే విధమైన తీర్పులిస్తున్నాయి. ఈ మధ్యే తెలంగాణ హైకోర్టు కూడా 50శాతం రిజర్వేషన్ దాటరాదంటూ తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే.. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే పార్లమెంటులో చట్టబద్ధత తీసుకురావడమొక్కటే మార్గమని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇపుడు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వం ఉన్నప్పటికీ అలాంటి చట్టబద్ధత కోసం ప్రయత్నించకుండా తూతూమంత్రంలా 34శాతం రిజర్వేషన్ ప్రకటన చేసేసి చేతులుదులుపుకుంటే ప్రయోజనమేమిటి..? ఇది బీసీలను మరోసారి మోసం చేయడం కాదా? బీసీలను వంచించడంలో పీహెచ్డీ చేసిన చంద్రబాబు అందుకోసం ఎంత కష్టపడి చదివారో చూస్తే ఆశ్చర్యపోవలసిందే.. ఏపీ హైకోర్టు కూడా 50శాతం రిజర్వేషన్ దాటకూడదంటూ గతంలో తీర్పు ఇచ్చింది. దానికి కారకుడు చంద్రబాబే.. తమ పార్టీ నాయకుడితో కేసు వేయించి బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబే ఇప్పుడు బీసీల ఉద్ధారకుడిగా మాట్లాడుతుండడం గమనార్హం... కోర్టు కేసుతో అడ్డుకున్నా వైఎస్ జగన్ బీసీల తరఫున నిలబడ్డారు. వారిని బ్యాక్బోన్ క్లాస్గా నిలబెట్టారు. మంత్రి పదవులు, రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు.. ఇలా అన్నింటిలోనూ బీసీలకు గణనీయమైన ప్రాతినిద్యం కల్పించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ జీవోను అడ్డుకున్నా అంతకుమించి గరిష్ట సంఖ్యలో బీసీలకు పాతినిధ్యం కల్పించి రాజకీయ సాధికారతకు కొత్త అర్థం చెప్పారు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై జగన్ జీవో ఇస్తే అడ్డుకున్నది చంద్రబాబే.. 2020–21 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28వ తేదీనే జీవో నెంబరు 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 58.95 శాతం రిజర్వేషన్ల అమలుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయంటూ చంద్రబాబు కోర్టులో కేసు వేయించారు. బిర్రు ప్రతాప్రెడ్డి అనే టీడీపీ నాయకుడితో చంద్రబాబు ఈ నాటకం ఆడించారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ప్రతాప్రెడ్డి ఓ నామినేటెడ్ పదవి కూడా అనుభవించారు. చంద్రబాబు వేయించిన కేసు నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50శాతం మించరాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు కోర్టులో ఎందుకు అడ్డుకున్నారు చంద్రబాబూ..? బీసీలకు 34శాతం రిజర్వేషన్ వస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు అని సొంత పార్టీలోనే కొందరు నాయకులు విమర్శించడం నిజం కాదా..? మేనిఫెస్టోలోనూ మోసమే.. స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల అంశం న్యాయపరమైన చిక్కుల మధ్య ఉన్నా 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 34శాతం రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇది అమలు జరగాలంటే మొక్కుబడి ప్రకటనలు సరిపోవని, పార్లమెంటులో చట్టబద్ధత అవసరమని తెలిసినా చంద్రబాబు మోసగించారు. కేంద్రంలో తమపై పూర్తిగా ఆధారపడిన ప్రభుత్వమే కొనసాగుతున్పప్పటికీ రెండేళ్లగా ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. బీసీల విషయంలో చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు.. కేంద్రానికి ఓ వినతిపత్రం కూడా పంపలేదు. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు రూ.4వేల చొప్పున పెన్షన్ అందిస్తామన్నారు. ధోకా ఇచ్చారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామన్నారు.. ధోకా.. బీసీలకు సబ్ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నారు.. మూడు బడ్జెట్లలో బీసీలకు సబ్ప్లాన్ ఉందా.. వీటిని బట్టి అర్థం కావడంలేదూ వెన్నుపోటులో చంద్రబాబు గోల్డ్మెడల్ హోల్డరని... బీసీలకు మేలు జరిగింది జగన్ హయాంలోనే.. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు.. బీసీలు అంటే రాష్ట్రానికి బ్యాక్బోన్ క్లాసెస్ అని వైఎస్ జగన్ నమ్మారు.. నమ్మిన మాటను చేతల్లో చేసి చూపించారు. బీసీలకు అధికారం దక్కకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు వెనుక నుంచి రాజకీయాలు చేస్తే.. జగన్ మాత్రం బీసీలను రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 2019లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ఆ నిర్ణయాన్ని 50 శాతం రిజర్వేషన్ పరిమితిని సాకుగా చూపుతూ కోర్టు ద్వారా అడ్డుకునే ప్రయత్నం జరిగినా.. జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ, డిప్యూటీ సీఎం, కేబినెట్ పదవుల నుంచి బీసీ కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల వరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారు. ఎంపీపీలు, జిల్లాపరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్ల వంటి కీలక పదవుల్లో 34 శాతానికి మించి బీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ రాజకీయ సాధికారతకు కొత్త నిర్వచనం ఇచ్చారు. రాజ్యాధికారంలో బీసీలకు సమున్నత వాటా ఇచ్చిన జగన్ మంత్రివర్గంలో 25 మంది సభ్యులుండగా ఏకంగా 11 మంది బీసీలకు జగన్ స్థానం కల్పించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్ను డిప్యూటీ సీఎంలుగా నియమించారు. విద్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం లాంటి కీలక శాఖలను బీసీలకే అప్పగించారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు అవకాశం కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర కోటాలో ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా నలుగురు బీసీలను జగన్ రాజ్యసభకు పంపారు. అంతకు ముందు టీడీపీ హయాంలో చంద్రబాబు, ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. అలాగే శాసన మండలిలో జగన్ 28 పదవులు.. అంటే 48 శాతం పదవులు బీసీలకు ఇచ్చారు. పథకాల రూపంలో రూ.1.83 లక్షల కోట్లు లబ్ధి వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీబీటీ రూపంలో ఒక్క బీసీల ఖాతాల్లోనే జమ చేసిన మొత్తం రూ.1,29,866.54 కోట్లు కాగా, నాన్ డీబీటీ రూపంలో బీసీలకు అందించిన లబ్ధి విలువ మరో రూ.52,884.18 కోట్లు. అంటే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన వ్యయం రూ.1,82,750.71 కోట్లు. ఈ స్థాయిలో గతంలో ఏనాడైనా, చంద్రబాబు తాను పదవిలో ఉన్నప్పుడు అప్పుడైనా, ఇప్పుడైనా బీసీలకు ప్రయోజనాలు అందించారా? కోర్టులో కేసు వేసిన బిర్రు ప్రతాప్రెడ్డితో చంద్రబాబు (ఫైల్) చట్టం చేసి మరీ ‘నామినేటెడ్’దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వు చేస్తూ జగన్ ఏకంగా చట్టం తెచ్చారు. రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకే ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ వర్గాల వారికే అవకాశం కల్పించారు. 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకే (42 శాతం) ఇచ్చారు.స్థానిక సంస్థల్లోనూ బీసీలకు జగన్ పెద్దపీట స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలుచేయడానికి కోర్టు తీర్పు అడ్డం వచ్చినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన జగన్, దాన్ని ఆచరించి చూపారు. బీసీలకు పదవులు ఇచ్చారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే ఒక్క బీసీలకే 6 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులు (46 శాతం) కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 636 మండలపరిషత్ అధ్యక్ష పదవుల్లో 239 పదవులను బీసీలకు అంటే.. 38 శాతం పదవులను బీసీ వర్గాలకే ఇచ్చారు. 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయగా తొమ్మిది చోట్ల మేయర్ పదవులు (69 శాతం) బీసీలకు ఇచ్చారు. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ కైవశం చేసుకోగా చైర్పర్సన్ పదవులు బీసీలకు 44 (53 శాతం) ఇచ్చారు. చట్టసభల్లో 50శాతం సీట్లపై పార్లమెంటులో వైఎస్సార్సీపీ బిల్లుబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. చట్టసభల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టించి జగన్ చరిత్ర సష్టించారు. 2019 మార్చిలో వైఎస్సార్సీపీ ఎంపీలు చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కోరుతూ పార్లమెంట్లో బిల్లు ప్రతిపాదించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కూడా జగన్ కేంద్రాన్ని కోరారు. కుల గణన కోసం బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో, బీసీల కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ జగన్ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి పంపించారు. -
రెండవ రోజు కూడా తోకముడిచి.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు
-
ఎమ్మా హోమ్ మినిస్టర్... చూసావా మీ పోలీసుల బాగోతం!
-
కొంచెం తెలివి వచ్చింది అనుకునే లోపే... బుర్రలేనోడిలా మాట్లాడావ్...
-
లోకేష్ కాదు 'లీకేష్"! చర్చకు భయపడి పారిపోయాడు..! పదవులు ఎందుకు?
-
డ్యూటీ వేయమంటే గదికి రమ్మంటున్నారు
కర్నూలు(హాస్పిటల్): ‘ఫోన్లో మాట్లాడుతున్నానని నన్ను అకారణంగా సస్పెండ్ చేశారు. పనిచేసుకుంటానని, ఉద్యోగం తిరిగి ఇవ్వాలని కోరితే నా గదికి రా అని అంటున్నారు. నేను అలాంటిదాన్ని కాదంటే, ఇంకెవరినైనా తీసుకుని రమ్మని వేధిస్తున్నారు’ అని పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ మేనేజర్లపై ఓ మహిళ ఆరోపణలు చేశారు. మహిళలను వేధిస్తున్నారంటూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు సోమవారం ధర్నా చేశారు. అందులో రెండు నెలల క్రితం సస్పెండైన ఓ మహిళ మాట్లాడుతూ.. మేనేజర్లు చెప్పినట్లు వినకపోతే మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని, పని ఒత్తిడితో సతమతమయ్యేలా చేస్తున్నారని వాపోయారు. కొందరితో వారి ఇళ్లల్లోనూ పనిచేయించుకుంటున్నారని, దీనిపై ఎవరైనాప్రశ్నస్తే వారిపైనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు యువత రాష్ట్ర నేత జూటూరు రవికుమార్ మాట్లాడుతూ.. శానిటేషన్ ఏజెన్సీ మేనేజర్లు రత్నరాజు, రమణతోపాటు, మీడియేటర్ హరిప్రసాద్తో మాట్లాడేందుకు తాము వెళ్లామని, ఈ క్రమంలో వారి ఫరీ్నచర్ వారే పగులగొట్టుకుని, తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు తమకు బంధువని చెబుతూ అందరినీ బెదిరింపులకు గురిచేస్తూ, వారి అక్రమాలను బయటకు రాకుండా చేస్తున్నారని అన్నారు. -
అసెంబ్లీ అనుకున్నావా.. నీ ఇల్లు అనుకున్నావా? నోటికొచ్చినట్లు మాట్లాడకు చంద్రబాబు
-
AP అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. YSRCP ఎమ్మెల్సీల ర్యాలీ
-
టీచర్ల విషయంలో డబుల్ రూల్స్ ఎందుకు? లోకేష్ తీరుపై ఉపాధ్యాయ సంఘాల ఫైర్
-
ఇంకెంతకాలం పారిపోతారు.. - దమ్ముంటే చర్చకు రండి...!
-
LIVE: శాసనమండలిలో టెన్షన్ టెన్షన్!
-
అమరావతిలో సదుపాయాలు లేవు.. కూటమి పార్టీ MLA షాకింగ్ కామెంట్స్
-
చింతాడ రవి కుమార్ సంచల ప్రెస్ మీట్
-
పిఠాపురంలో TDPకి బిగ్ స్ట్రోక్..!
-
కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది: సుగాలి ప్రీతి తల్లి
కర్నూలు: కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సుగాలి ప్రీతి తల్లి పార్వతి మండిపడ్డారు. ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న ‘‘సుగాలి ప్రీతికి న్యాయం కోసం వీల్ చైర్ యాత్ర’’కు అన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న తమను పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.‘‘టీడీపీ ప్రభుత్వ పాలనలో కూతురిని కోల్పోయాను. న్యాయం కోసం పోరాటం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆపుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మాకు లేదు. మా కూతురు కోసం పోరాటం చేస్తున్నాను. రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలం రాస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం నారా లోకేశ్ యువగళం, పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేశారు. అయితే తాను వీల్ చైర్ యాత్ర చేస్తే తప్పు ఏమిటి?యాత్రను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం పోలీసులతో అర్ధరాత్రి సమయంలో మాపై వేధింపులకు పాల్పడింది. ప్రీతికి న్యాయం చేస్తామని ర్యాలీ చేసి పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. నిందితులకు కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తోంది. నిందితులకు శిక్ష పడే విధంగా నా పోరాటం కొనసాగుతుంది. రేపు ప్రీతి సమాధి నుంచి నా యాత్రను కొనసాగిస్తాను’’ అని తెలిపారు.కాగా, ఈ నెల 19వ తేదీన న్యాయం కోసం నిర్వహించనున్న ‘‘సుగాలి ప్రీతి వీల్ చైర్ యాత్ర’’కు అనుమతి లేదంటూ పోలీసులు చెప్పారు. పోలీసుల వేధింపులపై సుగాలి ప్రీతి తల్లి పార్వతి మండిపడుతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం తాను న్యాయం కోసం వీల్ చైర్ యాత్ర చేస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. యాత్ర చేసి తీరుతానని చెబుతున్నారు. -
తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం
తిరుమల: తిరుమలలో మరోసారి రీల్స్ వ్యవహారం చర్చనీయాంశమైంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఓ జంట దేవుడి పేరుతో రీల్స్ చేశారు. సర్వదర్శనం క్యూలైన్ పాటు రాంబగీచా ప్రాంతంలోనూ చేసిన రీల్స్ సోమవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దర్శనానికి వస్తూ రీల్స్ చేయడంపై ప్రశ్నలు సంధించారు. భక్తి పేరుతో ప్రచారం కోసం ఇలాంటి వీడియోలు చేయడం సరికాదంటూ పలువురు అభిప్రాయపడ్డారు. తిరుమలలో తరచూ ఇలాంటి రీల్స్ వెలుగులోకి వస్తుండడంపై చర్చ జరుగుతోంది. కొంతమంది కావాలనే ప్రచారం కోసం, వార్తల్లో నిలిచేందుకు రీల్స్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఆయిల్ఫెడ్ భూములపై కన్నేశారు
సాక్షి, అమరావతి: రైతుల కోసం ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ఫెడ్ను నిర్విర్యం చేసి, దాని విలువైన ఆస్తులను దశలవారీగా కబ్జా చేసేందుకు అధికార టీడీపీ నేతలుపావులు కదుపుతున్నారు. అనంతపురం నగర నడి»ొడ్డున రూ.50 కోట్ల విలువైన 2 ఎకరాల ఆయిల్ఫెడ్ భూమిని టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం లీజుకిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరొక వైపు లాభాల్లో నడుస్తోన్న ఏలూరు జిల్లా పెదవేగిలో ఆయిల్ఫెడ్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ పేరిట నిర్విర్యం చేసి వందల కోట్ల విలువైన భూములను కాజేయాలనే కుట్ర జరుగుతోంది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైలా నిబంధనలకు పాతరేస్తూ నూనెగింజల రైతుల అభివృద్ధి, ఆయిల్పామ్ సాగు విస్తరణ, రైతులకు మార్కెట్ మద్దతు కల్పన కోసం ఏర్పాటైన ఏపీ కో–ఆపరేటివ్ ఆయిల్సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ (ఆయిల్ఫెడ్)కు రాష్ట్రవ్యాప్తంగా రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అనంతపురంలో 21.84 ఎకరాలు, సర్వేపల్లిలో 50 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 18.5 ఎకరాలు, కాకినాడలో 3 ఎకరాలు సహా అనేక విలువైన భూములు సంస్థ సొంతం. వీటి మొత్తం విలువ రూ.2 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. వీటిలో అత్యంత విలువైనది అనంతపురంలోని ఎ.నారాయణపురంలో ఉన్న 21.84 ఎకరాల భూమి. ఇక్కడ ఎకరా మార్కెట్ విలువ రూ.25 కోట్లు పలుకుతోంది. అంటే మొత్తం భూమి విలువ దాదాపు రూ.550 కోట్ల పై మాటే. అలాంటి ఈ భూమిలో 2 ఎకరాలను ఏడాదికి కేవలం రూ.1000 చొప్పున లీజు ప్రాతిపదికన టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం ధారాదత్తం చేశారు.టీడీపీ కార్యాలయానికి భూమి ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆయిల్ఫెడ్ నిద్ద్వంద్వంగా తిరస్కరించింది. పైగా ఈ భూములు ప్రభుత్వం కేటాయించినవి కావు..సొంత నిధులతో ఏపీ ఆయిల్ ఫెడ్ సమకూర్చున్నవే. బైలా నిబంధనల ప్రకారం వీటిని ఇవ్వడానికి ఎంతమాత్రం కుదరదని తేల్చి చెప్పినా పట్టించుకోలేదు. ఈప్రతిపాదన కోసం ఏకంగా ఐదుగురు ఎండీలను మార్చి తమకు అనుకూలమైన అధికారిని ఎండీ స్థానంలో కూర్చోబెట్టి తతంగమంతా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేశారు. తొలుత టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాలు కేటాయించగా, ఇదే ప్రాంగణంలో ఉన్న మిగిలిన భూమిని కూడా దశలవారీగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. వాస్తవానికి ఈ భూముల్లో ప్యాకింగ్ స్టేషన్, పీనట్ బటర్ ప్లాంట్, వేరుశనగ నూనె మిల్లు ఏర్పాటు చేయాలని ఆయిల్ఫెడ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాయలసీమతో పాటు కర్ణాటక వరకు కార్యకలాపాలు విస్తరించాలని ఏపీఆయిల్ఫెడ్ సంకల్పించింది.ఈ భూమిని మార్ట్గేజ్ ద్వారా రూ.250 కోట్ల రుణం ఇచ్చేందుకు ఎన్సీడీసీ, ఎన్డీడీబీ సూత్ర ప్రాయంగా అంగీకరించింది. మరొక వైపు ప్రభుత్వం వద్ద పేరుకుపోయిన రూ.150 కోట్లకుపైగా బకాయిలు ఒత్తిడి తీసుకొచి్చంది. ఇలా సమకూరే రూ.400 కోట్ల నిధులతో పెదవేగిలోని అత్యాధునిక ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ నిరి్మంచేందుకు డీపీఆర్ను కూడా సిద్ధం చేసింది. అయితే ఆయిల్ ఫెడ్ భూములను దొడ్డి దారిన కాజేయాలనే కుట్రతో ఈ ప్రతిపాదనలను రెండేళ్లుగా బుట్టదాఖలు చేస్తున్నారు. రైతుల అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి నిర్విర్యం చేస్తూ వందల కోట్ల విలువైన భూములను కాజేయాలనే కుట్రలకు పాల్పడడం పట్ల రైతులు మండిపడుతున్నారు. -
ఒడిశా కూలీలు.. ఫేక్ జెన్జీలు!
సాక్షి, అమరావతి: ‘మెగా డీఎస్సీ నియామకాల్లో ఎక్కడా డీవియేషన్ లేదు. అయినా డీఎస్సీపై ఒడిశా కూలీలతో, 90 ఏళ్ల ఫేక్ జెన్జీ వ్యక్తులతో ధర్నాలు చేయించారు..’ అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. నియామక ప్రక్రియ వివరాలన్నీ పారదర్శకంగా ఆన్లైన్లో ఉంచినా వైఎస్సార్సీపీ నేతలు హిట్ అండ్ రన్ చర్యలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీ నియామకాల అంశంపై శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ 14 డీఎస్సీలు జరిగితే టీడీపీ, ఎన్డీఏ హయాంలో 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంత వరకూ అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. 2019–24 మధ్య 10–12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లకు రావటం మానేశారని, అందుకే తల్లికి వందనం అమలు చేశామన్నారు.ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా 2019–24 మధ్య పాలకులు విద్యారంగంపై డబ్బాలు కొట్టుకున్నారని విమర్శించారు. ఓ మాజీ ఐఏఎస్, మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు..తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశామని, కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు పూర్తి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు సహా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను కట్టుదిట్టంగా చేపట్టామన్నారు. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించామని తెలిపారు. 154 సెంటర్లలో పరీక్షలు సీబీటీ విధానంలో చేపట్టి ఫలితాలను పారదర్శకంగా విడుదల చేసి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేశామన్నారు. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలనే అమలు చేశామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఏఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, లిటిగెంట్ పార్టీకి చెందిన వ్యక్తులు వందల కేసులు వేసి అడ్డంకులు సృష్టించారని, అధికారికంగా వివరణ ఇచ్చినా రోజుకో కుట్ర చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారని విమర్శలు చేశారు. -
మహిళతో TDP నేత సంచలన ఆడియో లీక్
-
PV సింధుని 384 మంది ఫేక్ వాళ్లతో పోల్చటం సిగ్గుచేటు
-
మీరు తప్పు చేశారనే ఆ G.Oను రద్దు చేశారు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన వరుదు కళ్యాణి
-
టీచర్ల సస్పెన్షన్ పై YS జగన్ ఆగ్రహం
-
DSCపై ఆధారాలతో వస్తాం..! చర్చకు సిద్ధమా..? లోకేష్ కు ఎమ్మెల్సీ రమేష్ సవాల్
-
టీచర్ల సస్పెన్షన్ పై వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్
-
అచ్చెన్నాయుడికి ఓ రేంజ్ లో ఇచ్చిపడేసిన MLC అరుణ్ కుమార్
-
మీ నాయకుడు ఇదే నేర్పాడా బోండా ఉమా నీకు... ఏకిపారేసిన నాగమల్లేశ్వరి
-
బెయిల్ ఇచ్చిన జడ్జికి బాబు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
-
సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా
-
దద్దమ్మ.. ఎద్దులా పెరిగితే సరిపోదు... అచ్చెన్నాయుడుపై బొత్స ఫైర్
-
DSCపై చర్చకు సమయం ఇవ్వండి..! లోకేష్ రాజీనామా చేస్తారా..?
-
DSCపై సీబీఐ ఎంక్వైరీ.. లోకేష్ రాజీనామా..! మండలి వద్ద YSRCP ర్యాలీ
-
చింతమనేని ఇలాకాలో కమ్మవారికి ప్రాణరక్షణ లేకుండా పోయింది
ఏలూరు జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్వల్ల దెందులూరు నియోజకవర్గంలో కమ్మవారికి ప్రాణరక్షణ లేకుండా పోయిందని ప్రముఖ న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరులోని తన నివాసంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని బుల్డోజర్ పార్టీగా మారుస్తున్నారని విమర్శించారు. చింతమనేని దాడులు, దౌర్జన్యాలు అధికమవుతున్నాయని, గ్రామాల్లో ఆయన వర్గానికి చెందిన కొందరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.తన భూమిలో కొంతమంది అక్రమంగా రాళ్లు వేయగా వాటిని తొలగించినందుకు తనపై ఎస్సీ, ఎస్టీ తదితర కేసులు నమోదు చేశారన్నారు. పెదపాడు తహసీల్దార్, పెదపాడు సీఐ వారి పరిధి దాటి.. టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. పెదవేగి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబ సభ్యులు చిన్నòÙడ్డు నిరి్మంచుకుని వ్యాపారం చేసుకుంటుండగా ఎమ్మెల్యే చింతమనేని ఆ షెడ్డును బుల్డోజర్తో కూలి్చవేశారని తెలిపారు. జగన్నాథపురానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పాలడుగు భానుప్రకాష్ ఇంటికి వెళ్లి చింతమనేని అనుచరులు దాడి చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. 23 ఏళ్లుగా టీడీపీలో ఉన్నాం కాగా.. పాలడుగు భానుప్రకాష్, శ్రావణి దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. తాము 23 ఏళ్లుగా టీడీపీలో పనిచేస్తున్నామని తెలిపారు. రూ.కోటితో భూమిని కొనుగోలు చేసి మొత్తం సొమ్ము చెల్లించినప్పటికీ రిజి్రస్టేషన్ జరగకుండా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అడ్డుకున్నారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా, తిరిగి తనపైనే కేసు నమోదు చేశారని భానుప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. -
రాజధాని రోడ్డే ఇలా.. ప్రపంచస్థాయి అంట!
ఇదిగో రాజధానిలో ప్రపంచస్థాయి వసతులు, రహదారులు నిర్మిస్తున్నామని పాలకులు చెబుతున్న మాటలన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. గుంటూరు నుంచి రాజధాని అమరావతికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. తాడికొండ అడ్డరోడ్డు నుంచి పెదపరిమి వరకు ఉన్న కీలక మార్గం పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాడికొండ సెంటర్లో టిప్పర్ల కారణంగా ట్రాఫిక్ జామ్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని నిర్మాణ పనుల పేరుతో భారీ సంఖ్యలో మట్టి, ఇసుక టిప్పర్లు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు వందలాది భారీ వాహనాలు పరిమితికి మించిన లోడుతో దూసుకుపోతుండటంతో రహదారి మరింత దెబ్బతింటోందని స్థానికులు చెబుతున్నారు. భారీ వాహనాల నిరంతర రాకపోకల కారణంగా రహదారి పైపొర పూర్తిగా దెబ్బతిని కంకర తేలిపోయింది. కొద్దిరోజుల క్రితం వరకు ప్రయాణానికి అనుకూలంగా ఉన్న మార్గం ఇప్పుడు అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు గోతుల్లో పడి లేస్తూ సాగాల్సిందే.. విద్యార్థుల ప్రమాదకర ప్రయాణం రాజధాని పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్, ఇతర ప్రైవేట్ కళాశాలలకు వెళ్లే వందలాది బస్సులు ప్రతిరోజూ ఇదే మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి. గుంతల్లోకి దిగిన బస్సులు ఒక్కసారిగా ఊగిపోతుండటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం కళాశాల సమయాల్లో ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రహదారి పరిస్థితి కారణంగా బస్సులు నెమ్మదిగా వెళ్లాల్సి రావడంతో ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఏ గుంతలో వాహనం అదుపుతప్పుతుందో, ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొంది. ప్రమాదకరంగా పరిస్థితి... పట్టించుకునే వారే కరువు ఈ మార్గంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సైతం నిత్యం రాకపోకలు సాగిస్తున్నప్పటికీ రహదారి దుస్థితిపై శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న పాలకులు, అదే రాజధానికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. రహదారి అధ్వానంగా మారడంతో వాహనాల మరమ్మతుల ఖర్చులు పెరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించే క్రమంలో అదుపుతప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాద ముప్పు మరింత ఎక్కువగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. సామాన్య ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులను అధికారులు పట్టించుకోకుండా మౌనం వహించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తుపల్లాలు... నిత్యం కష్టాలు: తాడికొండ అడ్డరోడ్డు – పెదపరిమి మార్గంలో గుంతలమయమైన రోడ్డుపై వాహనదారుల అవస్థలు వెంటనే మరమ్మతులు చేపట్టాలి తాడికొండ అడ్డరోడ్డు–పెదపరిమి మార్గం రాజధాని ప్రాంతానికి అత్యంత కీలకమైన రహదారి కావడంతో దాని నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు, పరిమితికి మించిన లోడుతో ప్రయాణించే టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రహదారిపై ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చి, అవసరమైన చోట పూర్తిస్థాయి పునరి్నర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
బాబుకు బిగ్ షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే.. అమరావతిపై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: అమరావతి రాజధాని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. దీంతో, రాజధాని గ్రామాల దుస్థితి బయటకు వచ్చింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కూటమి నేతలు చెబుతున్న అమరావతి అభివృద్ధి ఎలా ఉందో స్పష్టమవుతోంది.ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. అమరావతి గ్రామాల్లో ప్రజలు కనీస రహదారి సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మూడు, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే నీరు వస్తోందని అసెంబ్లీలో ప్రశ్నించారు. రాజధాని గ్రామాలకు సరైన ట్రంక్ రోడ్లు, కనెక్టివిటీ లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. అసెంబ్లీ, సచివాలయం ఉన్న వెంకటపాలెం ప్రాంతానికి కూడా సరైన కనెక్టివిటీ లేదని తెలిపారు.పూలింగ్లో భూములు ఇచ్చిన కాలనీలకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కానీ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు మాత్రం అవసరమైన సదుపాయాలు అందడం లేదని ఆరోపించారు. రాజధాని గ్రామాలకు మెరుగైన రహదారులు, తాగునీరు, కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని ప్రాంతంలోనే ఇలాంటి పరిస్థితులు ఉండటం సరికాదని అసెంబ్లీ వేదికగా శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. -
ఇంటింటికి వెళ్తే మాకు బడితపూజే
-
అడ్డంకులు.. ఆంక్షలు.. అయినా జగన్ వెంట జనం!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన ఏపీ ప్రజలకు మరింత స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న దారుణమైన పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించడంలో జగన్ కృతకృత్యమయ్యారు. అంతేకాదు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని నిర్భంధాలు పెట్టినా జగన్ పట్ల తమ అభిమానం చెక్కు చెదరదని వైఎస్సార్సీపీ క్యాడర్తో పాటు సామాన్య జనసందోహం కూడా తేల్చి చెబుతోంది.ఏపీ కూటమి ప్రభుత్వం పోలీసులనే నమ్ముకుని వందల సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెడుతున్నా వారు పట్టించుకోవడం మానేశారన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్ను కర్నూలు జైలులో అవమానించిన తీరు కూడా ఆయన అభిమానులలో ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులో అరెస్టు చేసి కర్నూలు జైలులో ఉంచారు. అది ఎలా అక్రమ కేసు అన్నది సాక్ష్యాధారాలతో సహా జగన్ చెప్పగలిగారు.వైఎస్సార్సీపీ కార్యకర్తపై కొందరు టీడీపీ వారు దాడి చేసిన సందర్భంలో అతనిని రక్షించడానికి విరూపాక్షి ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ టీడీపీ కార్యకర్త ఒకరు తన భార్య నైటీని తానే చించడమే కాకుండా, ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణ చేసి కేసు పెట్టారు. ఆ తర్వాత కారుపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ వివాదంలో పోలీసులు విరూపాక్షి ఇంటికి అర్ధరాత్రి వెళ్లి తలుపులు పగలకొట్టి లోపలకు వెళ్లడమే కాకుండా, ఆ సన్నివేశాలు తెలియకుండా ఉండడానికి సిసిటీవీ ఫుటేజ్ని, డిస్క్ లను అపహరించుకుని పోయారట. ఈ వివరాలన్నిటిని జగన్ తన టాబ్ ద్వారా మీడియాకు వివరించారు.జగన్ ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతారని ప్రజలు భావిస్తారు. దానికి తగినట్లుగానే తను చెప్పిన విషయాలకు ఆధారంగా సంబంధిత వీడియోలను ప్రదర్శించారు. పోలీసు అధికారులు కాని, ప్రభుత్వంలో ఉన్నవారు కాని వాటిపై ఇంతవరకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. బాధితులు వైఎస్సార్సీపీ అనుకూలురు అన్న భావన కలిగితే చాలు.. పోలీసులు వారిపైనే ఏదో రకంగా కేసు పెడుతున్నారనడానికి విరూపాక్షి అక్రమ అరెస్టు ఉదాహరణ అవుతుంది. పోలీసులు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ భార్య నైటి చించుతున్న వ్యక్తిని అడ్డుకోకపోవడం, వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి చేసినవారిమీద కేసు పెట్టకపోవడం వంటివి ఏపీ పోలీసు వ్యవస్థకు మచ్చగానే మిగులుతుంది.కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కూటమి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ద్వారా జగన్కు జనంలో విస్తారంగా పర్యటించే అవకాశాన్ని కూటమి నేతలే ఇస్తున్నారు. తద్వారా ఆయనకు జనంలో ఉన్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు తెలిసేలా చేస్తున్నారు. జగన్ శ్రీకాకుళం వెళ్లినా, తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వెళ్లినా, ఇప్పుడు కర్నూలు వెళ్లినా ఒకే రకమైన స్పందన కనిపిస్తుండడం విశేషం. అంతకుముందు గుంటూరు, కృష్ణా, నెల్లూరులలో పర్యటించినప్పుడు కూడా ఇదే సీన్ కనిపించింది. ఓర్వకల్లు విమానాశ్రయంలో హెలికాఫ్టర్ దిగినప్పటినుంచి కర్నూలు జైలు వద్దకు వెళ్లేవరకు 38 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి జగన్కు ఐదుగంటలకు పైగా పట్టింది. ఈ పరిస్థితి టీడీపీతో పాటు ఎల్లో మీడియాకు కూడా కడుపుమంటగా మారుతోంది. వారికి కంటగింపు అవుతోంది. ఇది పరామర్శయాత్రనా? లేక విజయ యాత్రనా అని ఎల్లో మీడియా వ్యాఖ్యానిస్తోంది. ఆ రకంగా జగన్కు జనంలో ఉన్న పట్టును టీడీపీ మీడియానే తెలియచేసినట్లవుతోంది.జగన్కు జనం రాలేదని రాయాలన్నది వారి కోరిక కావచ్చు. కాని పరిస్థితి అలా ఉండడం లేదు. కర్నూలుకు జనం రాకుండా పోలీసులు ఎక్కడకక్కడ చెక్ పోస్టులు పెట్టారు. దీనిపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఆ దశలో వైఎస్సార్సీపీ అభిమానులు పోలీసు చెక్ పోస్టులను తోసుకుంటూ ముందుకు వెళ్లిపోవడం కనిపించింది. తమపై పోలీసులు కేసులు పెడతారని తెలిసినా వారు అంత ధైర్యంగా ముందుకు కదులుతున్నారంటే జగన్ పై వారికి ఏర్పడిన అభిమానం అటువంటిదన్నమాట.అసలు ప్రజాస్వామ్యంలో తమ నాయకుడిని కలుసుకోవడానికి వెళుతున్న కార్యకర్తలను నిలువరించే పని పోలీసులు ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదు. ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనుకుంటే కట్టడి చేయవచ్చు. లేదా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంటే, దానికి తగ్గట్లు ఏర్పాటు చేయవచ్చు. అలాకాకుండా పాలక పార్టీల నేతల మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా జైలులో ఉన్న తన ఎమ్మెల్యేని కలవడానికి వెళితే పోలీసులు అవమానించిన తీరు కూడా తీవ్ర అభ్యంతరకరంగా ఉందని చెప్పాలి. సాదారణంగా రూల్ ప్రకారం ఎవరినైనా కూర్చోబెట్టి ఫోటో తీసిన తర్వాత ఖైదులో ఉన్న వ్యక్తిని కలవడానికి అనుమతిస్తారు. కాని జగన్ను మాత్రం నిలబెట్టి ఒక గేటు వద్ద ఫోటో తీయడం ద్వారా ఆయనే ఏదో కటకటాల వెనుక ఉన్నట్లు చూపించాలన్నది అధికారుల తాపత్రయం కావచ్చు. కాని ఈ విషయాన్ని జగన్ బయట చెప్పేయడంతో పోలీసు శాఖ ప్రతిష్ట మరింత దిగజారినట్లయింది.వైఎస్సార్సీపీవారితో పాటు సామాన్య ప్రజలలో కూడా ఇదేమిటి ప్రభుత్వం ఇంత సంకుచితంగా మారింది అన్న అభిప్రాయం ఏర్పడింది. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును కుప్పం, అనపర్తిలలో శాంతిభద్రతల సమస్య ఉందని నిలువరించే యత్నం చేశారు. దానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి వారి మాట కాదని టూర్ చేశారు. అనపర్తి వద్ద అయితే ఏకంగా నడుచుకుంటూ వెళతానని తన కార్యకర్తలతో కలిసి వెళ్లారు. ఆయన చేస్తే అదంతా చట్టబద్దం, వ్యతిరేక పార్టీవారు చేస్తే మాత్రం తప్పు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతుంటారు.కర్నూలు టూర్లో సుగాలి ప్రీతి తల్లి కూడా కలవడం విశేషం. పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన హామీలను విస్మరించి, కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నది ఆమె బాధ. అలాగే డీఎస్సీ అక్రమాల బాధితులు కూడా జగన్ను కలిశారు. ఇలా వివిధ వర్గాలవారిని కలుసుకుంటూ, రోడ్లపై ఉన్నవారికి అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు వెళ్లారు. జగన్కు ఇంత ఆదరణ ఎందుకు వస్తున్నదన్నదానిపై ఆత్మవిమర్శ చేసుకోవల్సిన చంద్రబాబు నాయుడు ఆ పని చేయకుండా జగన్ను, వైఎస్సార్సీపీని తీవ్రస్థాయిలో విమర్శించడానికి, కొన్నిసార్లు దూషించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఆయనలోని అసహనాన్ని తెలియచేస్తుంది.ప్రభుత్వం ఇకనైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. వైఎస్సార్సీపీని అణచివేయాలని చూస్తే, అది మరింత ప్రభావం చూపుతుందని, జగన్ను కలవకుండా ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే, అది తమకే నష్టమని చంద్రబాబు, లోకేష్లు తెలుసుకుంటే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పోలీసు కారులో గంజాయి.. టీడీపీ కారులో పరారైన పోలీసులు..
-
విశాఖలో రూ.300 కోట్ల భూమిపై ముఖ్యనేత కన్ను
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో అత్యంత విలువైన సిరిపురంలోని రూ.300 కోట్ల ఖరీదైన వీఎంఆర్డీఏ (విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) భూమిపై ‘ముఖ్య’నేత కన్ను పడింది! అత్యంత విలువైన ఆ భూమిని బినామీకి కట్టబెట్టి.. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు స్కెచ్ వేశారు! ఆ భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి వీఎంఆర్డీఏ జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేయించి పీపీపీ (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో బినామీకి కట్టబెట్టందుకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంపద సృష్టించకుండా బినామీలకు దోచిపెడుతున్నారనేందుకు ఇది మరో తార్కాణమిదని పారిశ్రామికవేత్తలు, ప్రజాసంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖలో అత్యంత ప్రధానమైన సిరిపురంలో డెక్ ఐకానిక్ టవర్ సమీపంలో సర్వే నెంబరు 83/1, 85/పీలో 0.98 ఎకరాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని వీఎంఆర్డీఏ నిర్ణయించింది. జీ+13 అంతస్తులతో 3,07,503 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో కాంప్లెక్స్ నిర్మాణ పనులకు రూ.71.17 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో గత మార్చి 16న టెండర్లు పిలిచింది. అత్యంత విలువైన ఈ భూమిపై ముఖ్యనేత కన్నుపడింది. దాన్ని బినామీకి కట్టబెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తే భారీ ఎత్తున లబ్ధి పొందవచ్చునని కన్నేశారు. అంతే.. వీఎంఆర్డీఏ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ టెండర్ రద్దు చేయించారు. గత మే 30న కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఈపీసీలో కాకుండా పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో నిర్మించేలా తీర్మానం చేయించారు. పీపీపీ పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడానికి వీఎంఆర్డీఏ సిద్ధమైంది. ఆ పనులను బినామీకి కట్టబెట్టేలా ముఖ్యనేత చక్రం తిప్పుతున్నారు.నాలుగేళ్లలో పెట్టుబడి వెనక్కి.. ఆ తర్వాత లాభాలుఅదే ఈపీసీ పద్ధతిలో నిర్మించి ఉంటే.. వీఎంఆర్డీఏకు సంపదగా మారేది. ఏటా కనీసం సగటున రూ.17.4 కోట్లు అద్దెల రూపంలో అదాయం వస్తుంది. నాలుగేళ్లలోనే ఆ కాంప్లెక్స్కు వెచ్చించిన వ్యయం వీఎంఆర్డీఏకు చేరేది. ఆ తర్వాత ఏటా రూ.17.4 కోట్ల మేర ఆదాయం వచ్చేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఐదో ఏట నుంచి ఏటా భారీ ఎత్తున వీఎంర్డీఏకు ఆదాయాల రూపంలో భారీ ఎత్తున లాభాలు వచ్చేవని పేర్కొంటున్నారు. విశాఖను విశ్వనగరంగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉండేదంటున్నారు. కానీ పీపీపీ పద్ధతిలో టెండర్లు పిలిచి.. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కాంట్రాక్టర్కు కట్టబెడితే వీఎంఆర్డీఏకు దక్కేది అత్తెసరేనని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి బినామీకి సంపద సృష్టిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.సంపద సృష్టి అంటే ఇదీ..వైఎస్సార్సీపీ హయాంలో రూ.91.65 కోట్ల వ్యయంతో 3.76 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో డెక్ ఐకానిక్ టవర్ను నిర్మించింది. డెక్ ఐకానిక్ టవర్ విశాఖ సిగలో కలికితురాయిగా మారింది. రైల్వే జోన్ కార్యాలయంసహా పలు ఐటీ కంపెనీలు అక్కడ కార్యాలయాలను ఏర్పాటుచేసుకున్నాయి. ఈ భవనానికి చేసిన వ్యయం అద్దెల రూపంలో నాలుగైదేళ్లలోనే వీఎంఆర్డీఏకు వస్తుంది. ఆ తర్వాత వీఎంఆర్డీకు ఏటా భారీ ఎత్తున ఆదాయం సమకూరుతుంది. సంపద సృష్టించడమంటే ఇదీ అని వీఎంఆర్డీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నారావారిపల్లి దళిత ఎంపీటీసీ సభ్యుడికి అవమానం
చంద్రగిరి: సీఎం చంద్రబాబు స్వగ్రామానికి చెందిన దళిత ఎంపీటీసీ సభ్యుడిని అధికారులు తీవ్రంగా అవమానించారు. ఆయనకు సమాచారం ఇవ్వకుండానే స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లి (కందులవారిపల్లి)కి చెందిన రాజయ్య గత ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. అయితే ఎంపీటీసీ సభ్యుడు రాజయ్యకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తనకు జరిగిన అవమానంపై రాజయ్య శనివారం చంద్రగిరిలోని ఎంపీడీవో కార్యాలయ ప్రవేశ మార్గంలో బైఠాయించి నిరసన చేపట్టారు. ‘దళిత ఎంపీటీసీ సభ్యులంటే మీకు గౌరవం లేదా’ అని ఎంపీడీవో చంద్రికను నిలదీశారు. సీఎం చంద్రబాబు సొంత పంచాయతీకి తాను ఎంపీటీసీ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించడం నేరమా? అని వాపోయారు. -
సీకే కుటుంబం ఇష్టమైతే నీ ఇంట్లో పెట్టుకో..
చిత్తూరు అర్బన్: చిత్తూరులో కూటమి నేతల మధ్య వైరం మరోమారు బట్టబయలయ్యింది. ఇటీవల నగరంలో జరుగుతున్న ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే వెంట సీకే కుటుంబ సభ్యులు వెళుతుండడాన్ని అధికార పార్టీలోని కొందరు సీనియర్లు అంగీకరించడంలేదు. వాళ్లు ఎందు కు వస్తున్నారని, అసలు వాళ్లను ఎందుకు చేరదీస్తున్నారంటూ సొంత పార్టీ నేతలపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వ్యవహారంపై రెండు రోజుల క్రితం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన ఓ సమావేశంలో ఇద్దరు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం అని చెప్పి ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడితో పాటు సీకే లావణ్య సైతం 11.30 గంటలకు సభాస్థలికి రావడంతో సీనియర్ కురువృద్ధుడు తీవ్ర అసహనానికి గురయ్యారు. అప్పటికే వేదికపై మొదటి వరుసలో జూనియర్లు కూర్చోవడం టీడీపీ చిత్తూరు నియోజకవర్గ పరిశీలకురాలు పూరిమెట్ల కుమారికి సైతం సీటు లేకపోవడంతో.. మరింత అసహనానికి లోనయ్యారు. దీంతో పరోక్షంగా సీకే కుటుంబాన్ని ప్రస్తావిస్తూ.. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో టీడీపీ సీనియర్లతో సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే (ఫైల్)ఎందుకు వాళ్లు..? టీడీపీలోని ఓ కురువృద్ధుడు ఈ సమావేశంలో ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుని, ఆయన అనుచరుడిపై విరుచుకుపడినట్లు సమాచారం. ‘‘ఏం యా.. సీకే కుటుంబాన్ని ఎందుకు మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు.? ఎక్కడకు పోయినా వాళ్లను వెంటబెట్టుకుని పోతా ఉండారు. ఇన్నాళ్లు రానివాళ్లు ఇప్పడు ఎందుకు మీ వెంట వస్తా ఉండారు..? ఇది పద్ధతికాదు. వాళ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. గంజాయి అమ్మే ఇద్దరు ఆడోళ్లను కూడా దూరం పెట్టమని చెప్పాను. వాళ్ల వల్ల పార్టీకి చాలా చెడ్డపేరు వస్తా ఉండాది. అయినా కూడా మీరు వినడంలేదు. పేపర్లలో ఎండకడతా ఉండారు. పోలీస్ స్టేషన్లలో పిలి వార్నింగులు ఇస్తా ఉండారు. ఇదంతా మంచిది కాదు..’’ అన్నట్లు తెలిసింది. ఇటీవల ఎమ్మెల్యే చెంతచేరి, అన్నీ తానై నడిపిస్తున్న ఆ వ్యక్తి ఆ కురువృద్ధుడికి ధీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘‘ఏందినా నువ్వు చెప్పేది. ఎలక్షన్లలో ఎమ్మెల్యేకి వాళ్లు పనిచేయలేదా..? కూడానే ఉంటూ ఎవరు ఎంత ద్రోహం చేసినారో మాకు అన్నీ తెలుసు. కానీ సీకే మాత్రం నిజాయితీగా పనిచేసినాడు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు ప్రియారిటీ ఇస్తే తప్పేముండాది..? మీకు మీకు మధ్య ఏదైనా పర్సనల్ గొడవలుంటే మీరు చూసుకోండి. పార్టీపైన రుద్దొద్దు..’’ అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఇదంతా కూడా పలువురు సీనియర్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే సమక్షంలోనే జరిగినట్లు సమాచారం. సొంత పార్టీ నేతలపైనే మీడియాకు లీకులు ఇచ్చి వార్తలు రాయించడం నీ నైజం కాదా..? అంటూ మరో నేత, ఎమ్మెల్యేకు దగ్గరి వ్యక్తిపై మండిపడ్డట్లు సమాచారం. తలనొప్పి తప్పదా..? ఓ వైపు మునిసిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభు త్వం చెబుతున్న తరుణంలో త్తూరులోని అధికార పార్టీ నేతల మధ్య చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్చడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు తలనొప్పి తప్పదన్నట్లుగా ఉంది. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసినవాళ్లు, కుటుంబ స భ్యుల ప్రాణాలే పోగొట్టుకున్న వాళ్లు, కరుడుగట్టిన టీడీపీ కోసం శ్రమింన వాళ్లను కాకుండా.. ఇప్పుడు వచ్చిన వాళ్లకు మేయర్ పీఠంపై హామీ ఇస్తే ఏమాత్రం సహించేదిలేదని సీనియర్లు తేల్చి చెబుతున్నారు. దీంతో చిత్తూరు టీడీపీలో సం‘కుల’ సమరం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈశ్వరరావు ద్వంద వైఖరి.. మరోవైపు రావూరి ఈశ్వరరావు ఇటీవల సీకే బాబును పొగుడుతూ వీడియోలు విడుదల చేయడంపై అటు టీడీపీలోని ఓ వర్గం, ఇటు వైఎస్సార్సీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఈశ్వరరావుకు సీకేపై అంత ప్రేమ ఉంటే, 2004 ఎన్నికల్లో తవణంపల్లె, చిత్తూరు ప్రాంతాల్లో ఊరూరా పర్యటించి స్థానికులకు బియ్యం, డప్పులు పంచిపెట్టి మరీ.. సీకేను ఓడించడానికి ఎందుకు కంకణం కట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. సీకే గెలిస్తే చిత్తూరు రౌడీ రాజ్యం అవుతుందని ఈశ్వరరావు నాడు చెప్పలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈశ్వరరావు కుటిల రాజకీయానికి, ద్వంద వైఖరికి ఆయన విడుదల చేసిన వీడియోలే నిదర్శమని వైఎస్సార్సీపీ నేతలు గట్టిగానే బదులిస్తున్నారు. -
జాతీయ జెండాకు అవమానం.. జెండాను తిరగేసి కట్టిన టీడీపీ నేతలు
-
లోకేష్ పని ఖతం.. Gen-Z చేతిలో మూడింది.. అమిత్ షా కాళ్లు పట్టుకున్న నో యూజ్
-
జాతీయ జెండాకు అవమానం!
శ్రీకాకుళం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం శ్రీకాకుళంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో జాతీయ జెండాకు టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ వల్ల అవమానం జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ గార మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి వమ్మరవెల్లికి బైక్లపై ర్యాలీగా బయలుదేరారు. రామ్మోహన్నాయుడు నడుపుతున్న బైక్పై వెనుక కూర్చున్న ఎమ్మెల్యే గొండు శంకర్ జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు.ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
చంద్రబాబూ.. గుర్తుంచుకో.. ఇవన్నీ సంకేతాలే: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఎక్కడైతే అణిచివేత ఉంటుందో.. అక్కడ ప్రజల తిరుగుబాటు కూడా అదే స్థాయిలో ఉంటుందని చంద్రబాబు తెలుసుకోవాలంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ నెల రోజూలు నాతో పాటు నా కుటుంబానికి కష్టకాలం. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడకు వచ్చిన వైఎస్ జగన్కు నమస్కారాలు’’..ప్రభుత్వంలోని వారు కూడబలుక్కుని ఒక సాధారణ ప్రమాదాన్ని.. హత్యాయత్నంగా చూపించి జైలుకి పంపారు.దీనిపై అన్ని వర్గాల ప్రజలు చిన్న పిల్లలపై రాజకీయాల అంటూ గొంతెత్తి మాట్లాడారు. ప్రభుత్వం అభద్రతా భావంతో చేసిన రాజకీయ కక్ష ఇది. రాజకీయాలలో తొక్కేసి మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆతృతతో చేశారు.’’ అని సీదిరి మండిపడ్డారు.‘‘ఈ జిల్లాలోనే ఎమ్మెల్యేలు, వారి పిల్లలే పిల్లలే ఆక్సిడెంట్ చేశారు. దానిపై ఈ ప్రభుత్వం ఎలా మాట్లాడింది? మా మీద కక్ష తీర్చుకోవటం కోసం నా కొడుకుని బలితీసుకోవటం పట్ల అంతటా చర్చ జరుగుతుంది. నేను ఏం తప్పు చేశాను.. నన్ను జైలులో పెట్టేశారని మొదట్లో నాకు చిన్న నిరాశభావం ఉండేది. ఎప్పుడైతే మా నాయకుడు రాడానికి నిర్ణయం తీసుకున్నారో.. ఇది రాష్ట్ర వ్యాప్త చర్చ అవుతుందని తెలిశాక జైలులో ఉండటాన్ని సానుకూలంగా తీసుకున్నాను. ఈ నెల రోజులు కాలం నాకు, నా కుటుంబానికి దీక్ష సమయం లాంటిది...మా నాయకుడు వచ్చేటప్పుడు ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే కిరణ్, తిలక్, జిల్లా పార్టీ అధ్యక్షులుపైన, ధర్మాన కుమారుడు పైన, చింతాడ రవి పైన కేసులు పెట్టారు. ఇవన్నీ చూస్తే ప్రజల్లో వచ్చిన నిరసన జ్వాలను ప్రభుత్వం తట్టుకోలేకోతుందేమోననుకుంటున్నాను. స్టేషన్ ఆఫీసర్లతో రాష్ట్ర ముఖ్యమ్మంత్రి రివ్యూ చేయటం దేశ చరిత్రలో ఇది మొదటిది. మరింత అణిచివేత ధోరణిలోకి వెళ్తామని మెసేజ్ ఇవ్వటమే ఇది. వైఎస్సార్సీపీకి, సాధారణ జనానికి మంచి రోజులు వచ్చినట్టే.. రానున్న కొద్ది రోజుల్లో వైఎస్ జగన్ సీఎం పీఠం అధిరోహిస్తాడనడానికి ఇవన్నీ సంకేతాలు. రాజకీయాలలో నేనొక ధన్యుడిని’’ అని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. -
ప్రభుత్వ టీచర్లపై నారా లోకేష్ రెడ్బుక్ కక్ష
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ టీచర్ల పై నారా లోకేష్ రెడ్ బుక్ కక్ష సాధింపులకు దిగింది. ముగ్గురు టీచర్లను చంద్రబాబు సర్కార్ సస్పెండ్ చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం పోరాడినందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులపై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసినందుకు టీచర్లను బాబు సర్కార్ సస్పెండ్ చేసింది.లక్షలాదిమంది ఉపాధ్యాయుల సమస్యపై కేంద్రమంత్రికి విన్నవించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే, వారితో వెళ్లారని ముగ్గురు ఉపాధ్యాయులను చంద్రబాబు ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. సంగమేశ్వర రెడ్డి, అమరనాథ రెడ్డి, వెంకటనాథ్ రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కడప డీఈవో.. తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేశారు. డీఎస్సీ అక్రమాల ర్యాలీలో పాల్గొన్నారంటూ తప్పుడు అభియోగాలతో సస్పెన్షన్ చేశారు. విద్యాశాఖలో టీచర్లపై రెడ్ బుక్ ప్రయోగించడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. -
జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదల
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదలయ్యారు. ఆయనకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 22న సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైన అనంతరం అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల రోజూలు నాతో పాటు నా కుటుంబానికి కష్టకాలం. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడకు వచ్చిన వైఎస్ జగన్కు నమస్కారాలు...ప్రభుత్వంలోని వారు కూడబలుక్కుని ఒక సాధారణ ప్రమాదాన్ని.. హత్యాయత్నంగా చూపించి జైలుకి పంపారు.దీనిపై అన్ని వర్గాల ప్రజలు చిన్న పిల్లలపై రాజకీయాల అంటూ గొంతెత్తి మాట్లాడారు. ప్రభుత్వం అభద్రతా భావంతో చేసిన రాజకీయ కక్ష ఇది. రాజకీయాలలో తొక్కేసి మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆతృతతో చేశారు.’’ అని సీదిరి మండిపడ్డారు.కాగా, వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది. సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది.పెదబాబు, చినబాబు డైరెక్షన్లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు. -
సీదిరి అప్పలరాజు కు బెయిల్
-
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్
-
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజురైంది. సీదిరి అప్పలరాజుకు సోంపేట కోర్టు.. ఇవాళ(శుక్రవారం) బెయిల్ మంజూరు చేసింది. గత నెల 22న సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే.సీదిరి అప్పలరాజుపై పెట్టిన కేసు రాజకీయ కక్షతోనేనని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోంది. యాక్సిడెంట్ కేసును.. హత్య కేసుగా మార్చడం, అందులో సీదిరిని ఏ3గా చేర్చి.. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది.వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది.సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది. పెదబాబు, చినబాబు డైరెక్షన్లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు.కాగా, సీదిరి అక్రమ అరెస్టు కేసులో నమోదైన సెక్షన్లు చూసిన వారెవరైనా రోడ్డు ప్రమాదం కేసులో ఇన్ని సెక్షన్లు పెట్టొచ్చా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. యు/ఎస్ 105 ఆర్/డబ్లూ 61(2) అఫ్ బీఎన్ఎస్, 231,238,240, 242,249 ఆర్/డబ్ల్యూ 49బిఎన్ఎస్ సెక్షన్లను సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీసులు బనాయించారంటే దానివెనక ఎంత రాజకీయం నడించిందో ఇట్టే అర్ధమవుతుంది. -
2 వేల కోట్ల అవినీతి... అధికారంలోకి రాగానే నీ అంతు తేలుస్తాం..
-
గుర్తుపెట్టుకో సవితా... ఇదే కంటిన్యూ అయితే నీకు జైలే...
-
ఏమైపోయింది నీ జోకర్ షో... కారుమూరి మాస్ ర్యాగింగ్
-
సొల్లు కబుర్లు ఎందుకు...? దమ్ముంటే నిరూపించు మామయ్య..! బోండా ఉమాకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
కూటమిలో కుంపటి.. మరో కొత్త తలనొప్పి!
ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత అద్వాన్నంగా పనిచేస్తున్నది ఆ పార్టీల నేతలే బహిర్గతం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంత అరాచకం సాగుతున్నది కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ఓపెన్గా మాట్లాడుతున్నారు. టీడీపీకి ఒకప్పుడు గట్టి మద్దతుదారులుగా ఉన్న కొంతమంది మేధావులు ప్రభుత్వ తీరుపై పెదవి విరవడమే కాకుండా, ప్రభుత్వం ఐసీయులో ఉందని కామెంట్ చేస్తున్నారు.ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య ఆరోపణల పర్వం, విజయవాడలో టీడీపీకే చెందిన డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులుతో బలవంతపు రాజీనామా చేయించడం తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లా సహాకార పాల ఉత్పత్తుల సంఘం విజయ డెయిరీ చైర్మన్గా చలసాని ఆంజనేయులు మరోసారి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్లకు నచ్చలేదేమో తెలియదు. క్యాబినెట్ సమావేశం జరుగుతుండగానే ఇద్దరు మంత్రులు హుటాహుటీన డెయిరీ ఆఫీస్కు వెళ్లి ఆంజనేయులు రాజీనామా చేయాలని కోరారు. చంద్రబాబు పంపకపోతే వారు ఎందుకు వస్తారన్నది టీడీపీ వర్గాలలో ఉన్న టాక్.ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారధి, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెంటనే రంగంలో దిగి డెయిరీ కార్యాలయానికి వెళ్లి ఆంజనేయులును బెదిరించారట. రాజీనామాకు ఆయన సుముఖంగా లేరు. అయినా మంత్రుల హూంకరింపులతో ఆంజనేయులు ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆంజనేయులు కూడా టీడీపీకి చెందినవారే అయినా ఎందుకు ఇంతగా కక్ష కట్టారన్న చర్చ జరుగుతోంది. ఒక టీడీపీ ఎమ్మెల్యే ఈయనపై అసంతృప్తిగా ఉన్నారట. ఆయన అలిగారట. దాంతో ఆయనను బుజ్జగించడానికి గాను ఆంజనేయులుతో రాజీనామా చేయించాలని అధిష్టానం భావించిందట.అయితే చంద్రబాబు కుటుంబానికి చెందిన పాల కంపెనీకి లాభం చేకూర్చడానికే చలసానితో రాజీనామా చేయించారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అది వేరే విషయం. చలసానిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆస్పత్రి యాజమాన్యానికి మంత్రులు చెప్పారట. అంతేకాక ఈ క్రమంలో ఆంజనేయులుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మద్దతుదారులుగా పేరొందిన కొందరు యూట్యూబ్ చానళ్లలో ఆవేదన వ్యక్తం చేశారు. పైగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి అయిన పార్ధసారధి స్వయంగా ఆస్పత్రికి వెళ్లి బెడ్పై ఉన్న ఆంజనేయులుతో రాజీనామా పత్రాన్ని తీసుకుని ఫోటో దిగడంపై వారు మండిపడ్డారు. పార్ధసారధి తన లాయల్టీని రుజువు చేసుకోవడానికి ఇంతగా తాపత్రయ పడ్డారని వీరు అంటున్నారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీకి వ్యతిరేకంగా అన్ని ఆరోపణలు చేసినా, మరికొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా, వారిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని టీడీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఘట్టం గుర్తుకు వస్తుంది. 1995లో పార్టీని చంద్రబాబు కైవసం చేసుకున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ ఆస్పత్రికి వెళ్లి ఎన్టీఆర్ నుంచి రాజీనామా పత్రం తీసుకున్నారని చెబుతారు. సరిగ్గా అదే రీతిలో టీడీపీ నాయకత్వం ఇప్పుడు వ్యవహరించిందన్నమాట. కాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ప్రభుత్వంలో సాగుతున్న అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పటికి పలుమార్లు ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన కొందరు సాగిస్తున్న గంజాయి, ఇసుక మాఫియాలపై ఓపెన్గానే మాట్లాడారు.తాజాగా జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్పై సంచలన ఆరోపణలు చేశారు. మద్యం, ఇసుక, గ్రావెల్ మాఫియాలలో దామచర్లకు వాటాలు ఉన్నాయని, రేషన్ బియ్యం మాఫియా నుంచి నెలకు 25 లక్షలు వసూలు చేస్తున్నారని, పోలీస్ స్టేషన్ అడ్డాగానే దందాలు సాగిస్తున్నారని కూడా బాలినేని అన్నారు. దీనికి ప్రతిగా దామచర్ల కూడా బాలినేనిపై పలు ఆరోపణలు చేశారు. బాలినేని పార్టీ మారకపోతే, బాలినేని ఆయన కుమారుడు ఈపాటికి జైలులో ఉండేవారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలు చూస్తే ఏమి అర్దం అవుతుంది. ప్రభుత్వంలోను, అలాగే అధికార కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు అడ్డూ, ఆపు లేకుండా పోయిందనే కదా! కాని వీరిద్దరు సమన్వయం పాటించాలని టీడీపీ, జనసేన ముఖ్యనేతలు ఒంగోలులోని తమ పార్టీ నేతలకు సందేశం పంపించారట. అంతే తప్ప ఇరువురు చేసుకున్న ఆరోపణలపై విచారణ చేయించి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా లేదన్నమాట.అవినీతిని కాపాడటమంటే ఇది కదా అన్నది ప్రజల భావన. దీనిని కప్పిపుచ్చుకోవడానికి మూడు పార్టీల సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశారు. మనలో మనం విమర్శలు చేసుకోవదని సలహా ఇచ్చాయి. అంతే తప్ప అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించలేదు. పనిలో పనిగా సోషల్ మీడియాలో కూటమి మిత్రపక్షాలలో విభేదాలు సృష్టించడానికి వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోందని పిచ్చి ఆరోపణ చేశారు.ఈ మధ్య ఒక సినిమాకు సంబంధించి టీడీపీ, జనసేనల అభిమానులు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారట. కొందరైతే దూషణలకు దిగారట. వాటిని వైఎస్సార్సీపీ అంటకట్టి తప్పించుకోవాలని చూస్తే ఎవరు నమ్ముతారు! కాగా రాష్ట్రంలో జరుగుతున్న అద్వాన్న పాలనను, అవినీతిని ప్రశ్నించని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీపై కొత్త ఆరోపణ చేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా గోవింద నామాన్ని పేరడిగా వాడుతున్నారన్నది ఆయన అభ్యంతరమట. నిజంగానే ఆయన చిత్తశుద్దితో అభిప్రాయపడితే తగు సూచన చేయడం తప్పుకాదు. కాని సినిమాలలో ఎన్ని రకాల పేరడిలు హిందూ మత విశ్వాసాలపై జరిగాయో ఆయనకు తెలియదా! గోవిందా పేరుతో సినిమానే వచ్చింది. గతంలో ఎన్టీఆర్ ఒక సినిమాలో గోవింద అంటూ ఒక బాబాపై పాటకట్టారే. ఇలా ఎన్నో సన్నివేశాలు సినిమాలలో ఉన్నాయి. వాటి గురించి ఏమంటారో తెలియదు.మంత్రి లోకేష్ కూడా గతంలో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా గోవిందా.. అంటూ నినాదాలు చేసిన వీడియోలు కూడా చక్కర్లు తిరుగుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పాటను కూడా చూపుతున్నారు. అందుకే ఏదైనా విమర్శ చేయాలనుకుంటే ముందూ, వెనక ఆలోచించాలని అంటారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో తిరుమల స్వామివారి ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఆరోపణ చేశారు. వైఎస్సార్సీపీపై బురద వేసే క్రమంలో ఈ ఆరోపణలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న విమర్శలు వచ్చాయి. తదుపరి సీబీఐ దర్యాప్తులో అలాంటి జంతు కొవ్వు కల్తీ ఏది జరగలేదని తేలింది. మరి దానిపై వీరు స్పందించలేదు. ఇప్పుడు మాత్రం మళ్లీ సనాతన ధర్మం పేరుతో ప్రజలను ఏమార్చడానికి వచ్చినట్లుగా ఉంది.ఒంగోలులో తన పార్టీ నేత చేసిన ఆరోపణలపై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు. పైగా రెండు పార్టీలు కాంప్రమైజ్ ఫార్ములా వర్కవుట్ చేయడం ఏమిటి? ఈ నేపథ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఒక కామెంట్ ఆసక్తికరంగా ఉంది. చలసాని ఆంజనేయులు నుంచి ఆస్పత్రిలోనే రాజీనామా పత్రాన్ని మంత్రి పార్ధసారధి తీసుకుంటున్న పోటో టాగ్ చేస్తూ ఐసీయూలో పార్టీ, ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ వారిని నిత్యం దూషించే చంద్రబాబు నాయుడు.. ఏబీతో పాటు మరికొందరు టీడీపీ వీర మద్దతుదారులు చేస్తున్న విమర్శలకు జవాబు ఇచ్చే ధైర్యం చేయగలరా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘కూటమి’ క్రైమ్ కథాచిత్రం!
మధురవాడ: విశాఖలో మైనార్టీ వర్గానికి చెందిన ఓ యువతిని పెళ్లి పెరుతో లొంగదీసుకొని మోసం చేసిన కేసు అధికార కూటమి నేతల మెడకు చుట్టుకుంటోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకోవడం, గర్భస్రావానికి ఒత్తిడి చేయడం, ఆపై బ్లాక్మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో కార్పురపు రాహుల్రెడ్డి, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సహా 11మందిపై మైనార్టీ యువతి కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు టీడీపీ కూటమి నేతలు రంగంలోకి దిగారు. బాధితురాలిని పలు విధాలుగా బెదిరింపులకు గురి చేస్తున్నారు. తనను బెదిరించి, లొంగదీసుకునేందుకు ఇద్దరు కూటమి ఎమ్మెల్యేలతో పాటు నేరుగా సీఎం కార్యాలయం నుంచి కూడా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారని బాధితురాలు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇవన్నీ నిందితుడు రాహుల్రెడ్డికి అధికార కూటమి నేతలతో ఉన్న బలమైన సంబంధాలను వెల్లడిస్తున్నాయని బాధితురాలి వర్గం చెబుతోంది వైరల్ అవుతున్న ఆడియో నిందితుడు రాహుల్రెడ్డికి విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్యాదవ్తో సన్నిహిత సంబం«దాలు ఉన్నాయని, కూటమికి చెందిన మరో ఎమ్మెల్యే అతనికి మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి బాధితురాలి తరపు న్యాయవాదికి సంబంధించినదిగా ప్రచారంలో ఉన్న ఒక ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ పేరు అందులో ప్రస్తావనకు రావడం పెద్ద దుమారానికే దారితీసింది. నిందితుడు రాహుల్రెడ్డికి ఆ ఎమ్మెల్యేతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన పేరును అడ్డుపెట్టుకుని తనను బెదిరించారని బాధితురాలు కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఎమ్మెల్యేకు చెందిన కీలక వ్యాపార వ్యవహారాలను కూడా రాహుల్రెడ్డి చూస్తున్నారనే విషయం ఆడియోలో ఉన్నట్లు బాధితురాలి వర్గాలు వెల్లడిస్తున్నాయి. రూ.20 కోట్ల బెదిరింపుల వెనుక ఎవరు? ఈ ఏడాది చివరికి రూ.20 కోట్లు సంపాదించి బాధితురాలి అంతం చూస్తానని రాహుల్రెడ్డి బెదిరింపులకు దిగడం కేసు తీవ్రతను వెల్లడిస్తోంది. ఒక వ్యక్తిగత వివాదం వెనుక ఇంత పెద్దమొత్తంలో ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయా? రాహుల్రెడ్డికి రూ.20 కోట్లు సంపాదిస్తాననే ధీమా ఇచ్చిన నాయకులు ఎవరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కక్షపూరిత వేధింపులు పలువురు తనను బెదిరించారని, బ్లాక్మెయిల్ చేశారని, తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు ఉపయోగించి ఒత్తిడికి గురిచేశారని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించారు. తాను హనీట్రాప్ అని, వ్యభిచారం చేస్తున్నట్లు.. హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఇంతటి స్థాయిలో వేధింపులు కొనసాగుతున్నాయంటే.. రాహుల్రెడ్డి వెనుక రాజకీయంగా, అధికారికంగా ఎవరు అండగా ఉన్నారని ఆమె ప్రశ్నిస్తోంది. -
బాబు కార్యక్రమానికి పవన్ డుమ్మా.. అసలేం జరిగింది?
-
గుర్తుపెట్టుకో చంద్రబాబు వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్
-
అసలు ఆ రోజు... మినిట్ టూ మినిట్ ఏమి జరిగిందో వివరించిన జగన్
-
కర్నూలు జైలులో బాబు సర్కార్ రెడ్బుక్ అరాచకం
సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలు జైలులో కూటమి సర్కార్ రెడ్బుక్ అరాచకానికి తెరలేపింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అవమానించేందుకు కుట్రలు చేసింది. కావాలనే గ్రిల్స్ వెనుక నిలబెట్టి జైలు సిబ్బంది ఫొటోలు తీశారు. అడిగితే పైనుంచి వచ్చిన ఆదేశాలంటూ జైలు సిబ్బంది చెప్పారు. చంద్రబాబు సర్కార్ కుట్రలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబుది శాడిస్ట్ మెంటాలిటీ. నన్ను అవమానించాలని చూశారు. మాజీ సీఎం అని చూడకుండా నన్ను అవమానించాలని చూశారు. ..నన్ను గ్రిల్ వెనుక నిలబెట్టి ఫొటో తీయించారు. అడిగితే పై నుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్పారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. బాబు నాటిన తప్పుడు విత్తనాలే రేపు విషవృక్షాలవుతాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘వెన్నుపోటు పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తుంది. బీసీ నాయకులపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?. సీదిరి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ చేస్తే. వెన్నుపోటు పార్టీ కుట్ర కేసుగా మార్చింది. మహిళా ఎస్ఐని చంపబోయాడని చింతాడ రవిపై కేసు పెట్టారు. ముస్తఫా, కారుమూరి సునీల్పై కూడా అక్రమ కేసులు కట్టారు. ఇప్పుడేమో విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
విరుపాక్షి ఏమైనా ఉగ్రవాదా ? కూటమికి జగన్ వార్నింగ్..
-
కూటమి పాలనలో కుట్ర రాజకీయాలు: వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు జిల్లా: రెడ్బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ రెచ్చిపోతుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. కుట్ర రాజకీయాలు చేస్తూ.. విరూపాక్షిని అరెస్ట్ చేయించారని.. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ నిలదీశారు.‘‘అధికార దుర్వినియోగం ఏస్థాయిలో ఉందో విరూపాక్షి అక్రమ అరెస్టే ఉదాహరణ. ఏపీలో బాధితులే నిందితులవుతున్నారు. దాడికి గురైనవారిపైనే కేసులు పెడుతున్నారు. బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఇంటిని ధ్వంసం చేసి మరీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో వందల మంది పోలీసులు.. దొంగల మాదిరి విరూపాక్షి ఇంటి కిటీకీలను ధ్వంసం చేశారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై 3 కేసులు పెట్టారు. ఒక కేసులో 34 మందిని ఇరికించారు. రెండో కేసులో మరో 14 మందిని చేర్చారు. మూడో కేసులో మరో 12 మందిని ఇరికించారు. మొత్తం 38 మందిని జైలుకు పంపారు. కార్యకర్త గిరిని తన కారులో ఎక్కించుకుని వెళ్తుండగా.. దారిలో ఎమ్మెల్యే విరూపాక్షిపై దాడి చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చేయిని విరగగొట్టారు. తప్పును కప్పిపుచ్చేందుకు టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపాడు. పైగా ఆమెతో తప్పుడు మాటలు చెప్పించారు..ఎమ్మెల్యే అనుచరులు చింపారని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. భర్తే భార్య బట్టలు చింపుతున్న వీడియో బయటకొచ్చింది. బాబు కుట్ర రాజకీయాలు చూసి రాష్ట్రం షాక్కు గురైంది. కారును ధ్వంసం చేశారని ఎమ్మెల్యేపై మూడో కేసు పెట్టారు. వాళ్లే కారును ధ్వంసం చేసి.. ఎమ్మెల్యేపై మూడో కేసు పెట్టారు. పీఎస్కు వెళ్లి గిరి, శ్రీరాములు చూపించి ఫిర్యాదు చేశారు. కనీసం పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మహేంద్ర దేవ్.. బాబు రాగానే మాట మారిందా?
దేశానికి మేధావులు ఎంతో కీలకం. వారు దేశాన్ని నడిపే రాజకీయ నేతలకు సరైన మార్గ నిర్దేశనం చేస్తే సమాజానికి మేలు చేసినవారు అవుతారు. కాని అదే మేధావులు కూడా, తమ స్వార్థ ప్రయోజనాలకోసమో, లేక ఏదో పార్టీకి మేలు చేయడం కోసమో రాజకీయ కోణంలో మాట్లాడితే అది దేశానికి తీరని నష్టం చేసినవారు అవుతారు. దురదృష్టవశాత్తు కొందరు మేధావుల ముసుగులో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగాను, మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఆ జాబితాలో ఆర్థికవేత్తగా ఉన్న సూర్యదేవర మహేంద్రదేవ్ కూడా చేరడం బాధాకరంగా ఉంది.ప్రముఖ చిత్రకారుడు సూర్యదేవర సంజీవదేవ్ అంటే తెలుగు ప్రజలకు ఎంతో గౌరవం. అలాంటి గొప్పవ్యక్తి కుమారుడు అయిన మహేంద్రదేవ్ గతంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఎంత తేడా ఉందో చూడండి. ఇది ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నదానిని పక్కనబెడితే, ప్రముఖ ఆర్థికవేత్తలు చెప్పే విషయాలను కూడా నమ్మకూడదన్న అభిప్రాయం ప్రజలలో కలగదా? అది మేధావి వర్గానికి సిగ్గు చేటు అవుతుందా? కాదా?మహేంద్రదేవ్ 2024 ఎన్నికలముందు ఏప్రిల్ నెలలో ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన ఈనాడు మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆంధ్రాకు అప్పులే శాపం అని వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఆధారంతో అన్నారో తెలియదు కాని ఏపీ అప్పులు 14 లక్షల కోట్లు దాటిపోయాయని విమర్శించారు. అందులో ఏ ప్రభుత్వ వాటా ఎంత అన్నది చెప్పినట్లు లేరనుకోండి. ఇది సరిగ్గా ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలిగా ఆ రోజుల్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వంటివారు చెప్పిన అసత్య మాటల మాదిరిగా ఉన్నట్లు అనిపిస్తుంది గదా!నిరుద్యోగం తాండవిస్తోందని, సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఎలా అని మహేంద్రదేవ్ ప్రశ్నించారు. ప్రత్యక్ష నగదు బదిలీ స్వల్పకాలికంగా బాగానే ఉంటుందని, దీర్ఘకాలంలో అన్ని రంగాలపైన దుష్ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. అప్పటి జగన్ ప్రభుత్వం చేపట్టిన స్కూళ్లు, ఆస్పత్రులను నాడు-నేడు స్కీమ్ కింద బాగు చేయడం పట్ల కూడా అంత సంతృప్తి చెందలేదు. జీడీపీలో అది ఐదు శాతంకన్నా తక్కువేనని ఆయన ఆనాడు వ్యాఖ్యానించారు. కారణం ఏదైతేనేం.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. లోకేష్ కీలక మంత్రిగా మారి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వారితో పాటు మహేంద్రదేవ్కు కూడా ప్రధాని కార్యాలయంలో ఆర్థిక సలహామండలి చైర్మన్ పదవి వచ్చింది. ఇక అంతా ఆల్ హాపీస్ అన్నమాట.తాజాగా ఆయన ఎల్లో మీడియాలోని మరో పత్రిక ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఎమన్నారో తెలుసా! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందడంలో అర్థం లేదట. అప్పులను కేవలం సంఖ్య రూపంలో కాకుండా జీడీపీతో పోల్చి చూడాలట. అంతేకాదు.. చంద్రబాబుకు కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. అమరావతి నిర్మాణంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, చంద్రబాబు మిగిలిన ప్రాంతాలను విస్మరించడం లేదని తెలిపారు. ఇవన్ని చదివితే ఏమి అర్థం అవుతుంది. బహుశా చంద్రబాబు సిఫారస్తోనే కేంద్రంలో ఈయనకు పదవి వచ్చిందేమో అన్న అనుమానం జనానికి కలగదా!ఆయన నిజాయితీగా చెప్పదలిస్తే ఏమి వివరించాలి.. గత ఎన్నికలకు ముందు ఏపీ అప్పు 14 లక్షలు ఉందని ఎందుకు చెప్పవలసివచ్చిందో వివరించాలి కదా! ఆ పని చేయలేదు. ప్రస్తుతం లోక్ సభ ఇచ్చిన వివరాల ప్రకారం ఏపీ అప్పు 6.45 లక్షలే అని ఎందుకు ఉంది? అంటే మహేంద్రదేవ్ కావాలనే జగన్ ప్రభుత్వంపై బురద వేసినట్లు అవ్వలేదా? జగన్ తన టరమ్లో రెండేళ్ల కరోనా సంక్షోభాన్ని ఎదుర్కున్నా ఐదేళ్ల పీరియడ్లో వైఎస్సార్సీపీ టైమ్లో జరిగిన అప్పు 3.63 లక్షల కోట్లేనని వెల్లడవుతోంది కదా! కాని కూటమి వచ్చిన రెండేళ్లలోనే చంద్రబాబు సర్కార్ 3.60 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసిందో ప్రభుత్వంలోని వారు చెప్పలేకపోతున్నారు. కనీసం మహేంద్రదేవ్ అయినా చెప్పి ఉంటే బాగుండేది కదా!అమరావతి నిర్మాణంతో ప్రయోజనాలు ఉన్నాయట. ఎవరూ రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేయవద్దని చెప్పడం లేదు. అభివృద్ది అన్నది సహజ సిద్దంగా ఉండాలి కాని, లక్షల కోట్ల వ్యయం చేసి, రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి చేయవద్దని కదా చాలామంది సలహా ఇస్తున్నది! ఒకే ప్రాంతంలో ఇప్పటికే 50 వేల కోట్లను, అది కూడా అప్పు చేసి ఖర్చు చేస్తుంటే మిగిలిన ప్రాంతాలవారికి అది అసంతృప్తి కలిగించదా? జగన్ మావిగన్ ప్రతిపాదన చేస్తే దాని గురించి మాట్లాడకుండా మూడు రాజధానులు అంటూ ఇప్పుడు అవసరం లేని ప్రస్తావన మహేంద్రదేవ్ తేవడం వల్ల ఏమి ప్రయోజనం కలుగుతుంది.జగన్ సంక్షేమ స్కీముల వల్ల ఉపయోగం లేదని అప్పట్లో చెప్పారు. మరి అంతకన్నా ఎక్కువ అమలు చేస్తామని, సంపద సృష్టిస్తామని చంద్రబాబు టీమ్ ప్రచారం చేసిందే! ఈ రెండేళ్లలో సంపద సృష్టించలేదే. ఖజానా ఖాళీ అయిందని, సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని చంద్రబాబు అడిగారే! కనీసం మహేంద్రదేవ్ అయినా ఆయన చెవిలో సలహా ఇచ్చి ఉండాల్సింది కదా! ఇక ఈనాడు మీడియా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాసిన కొన్ని అబద్దపు కథనాలు, పెట్టిన హెండింగ్లు చూస్తే జర్నలిజాన్ని ఇంత నీచంగా మార్చారా అన్న బాధ కలుగుతుంది. కొన్ని ఉదాహరణలు చూడండి..జగన్ బొమ్మవేసి రుణ కంఠుడు అంటూ హెడింగ్ పెట్టి, పది లక్షల కోట్ల అప్పు దాటించిన ఘనుడు అని రాసింది. పురందేశ్వరి రాష్ట్ర అప్పులు 12.50 లక్షల కోట్లు అని ఆరోపించారు. మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు 11 లక్షల కోట్లు అప్పు అంటూ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేస్తూ అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అప్పుల గురించి నోరు తెరిస్తే ఒట్టు. శ్రీలంక కంటే నాలుగు రెట్ల అప్పుల ఏపీ అని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయనే ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ శ్రీలంక ఏమైందో, ఇప్పుడు తామెందుకు భారీ అప్పులు చేస్తున్నారో కేశవ్ చెప్పడం లేదు.శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం అని పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. మేలుకోకుంటే మనకూ శ్రీలంక గతే అని ఈనాడు గుండెలు బాదుకున్నారు. శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అని చంద్రబాబు విమర్శించారు. ఇవన్ని జగన్ ప్రభుత్వంపై ప్రచారం చేసిన అబద్దాలు. వారు అప్పట్లో చేసిన ఆరోపణలన్నిటిని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో నిజం చేస్తోందేమో అని ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని బుద్దిజీవులు వ్యాఖ్యానిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మిమ్మల్ని రేప్ చేసినా అడిగే దిక్కులేదు
చిత్తూరు అర్బన్: సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఓ యువ మహిళా ఫ్యాషన్ డిజైనర్కు నరకం ఎలా ఉంటుందో టీడీపీ నేతలు చూపించారు. నెలల తరబడి వెట్టిచాకిరీ చేయించుకుని ఇంట్లో నిర్బంధించారు. కనీసం తిండి కూడా పెట్టకుండా, జీతం సైతం ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకున్నారు. ఓ దశలో.. ‘మీలాంటి వాళ్లను రేప్ చేసినా అడిగే దిక్కులేదు..’ అంటూ బెదిరించారు. చిత్తూరు నగర టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు దమయంతి లీలావతి, ఆమె కొడుకు అనూష్ చౌదరి చేసిన ఈ అరాచకాన్ని బుధవారం ఓ యువతి కన్నీటిపర్యంతమవుతూ సెల్ఫీ వీడియో ద్వారా బయటపెట్టింది. లీలావతి మోసాలపై బాధిత యువతి మాటల్లోనే.. ఆ వేధింపులు మాటల్లో చెప్పలేను.. ‘‘హాయ్.. నా పేరు అనురూప. బెంగళూరులో ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తున్న నేను మోసపోయిన విధానాన్ని ఈరోజు ప్రజలకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. నన్ను చిత్తూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు దమయంతి లీలావతి నెలకు రూ.25 వేలు వేతనం ఇప్పిస్తామంటూ తన బొటిక్ ఆకృతిలో పనిచేయాలని కోరారు. వసతి, భోజన సౌకర్యం ఇస్తామంటే వాళ్లను నమ్మి వచ్చేశాను. కానీ, అక్కడకు వచ్చిన తరువాత నాతో ఫ్యాషన్ డిజైన్తో పాటు వాళ్ల ఇంట్లో వంట పని, ఇల్లు శుభ్రంచేయడం బలవంతంగా చేయించారు. నరకం అంటే ఎలా ఉంటుందో లీలావతి, ఆమె కొడుకు అనూష్ చౌదరి నాకు ప్రత్యక్షంగా చూపించారు. తినడానికి తిండి పెట్టలేదు. జీతం ఇవ్వలేదు. ఇలాంటి వాళ్లు ఈ బొటిక్లో చాలామంది ఉన్నారు. నా మాస్టర్లు ముగ్గురు ఉంటే వాళ్లను బలవంతంగా పంపించేశారు. క్యాన్సర్తో బాధపడుతున్న తన భార్యకు వైద్యం చేయించుకోవాలని చెప్పినా మా మాస్టర్కు వేతనం ఇవ్వలేదు. నేను క్రియేటివిటీతో రూపొందించిన డిజైన్లతో ఓ ఫ్యాషన్ షో చేశారు. కనీసం నా పేరు వేయకుండా, నా కష్టాన్ని దోచుకున్నారు. కామెర్లు వచ్చి బాధపడి, వైద్యానికి డబ్బుల్లేవని చెప్పినా నన్ను పట్టించుకోలేదు. ఎక్కడైనా వెళ్లి ఫిర్యాదు చేసుకో అన్నారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన మిమ్మల్ని రేప్ చేయించినా అడిగే దిక్కులేదు అని బెదిరించారు. ఎంతో కష్టపడి వారి చెర నుంచి తప్పించుకున్నాను. ఇలాంటి మోసాలకు ఎవ్వరూ గురికావద్దు. అధికారులు వీళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..’’ అంటూ యువతి కన్నీటిపర్యంతమైంది.మహిళల ఆగ్రహం ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. వీడియో బయటకొచ్చి ఎనిమిది గంటలైనా లీలావతి నిర్వహిస్తున్న బొటిక్పై పోలీసులు ఎందుకు దాడులు చేయలేదని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు. లీలావతి, ఆమె కొడుకును వెంటనే అరెస్టుచేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై విచారించి నివేదిక అందజేయాలని చిత్తూరు మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరావును ఎస్పీ తుషార్ డూడీ ఆదేశించారు. -
కండ్రేగుల రవి వేధింపులు తట్టుకోలేక సుమన్ ఆత్మహత్యాయత్నం
-
ఫ్యాషన్ డిజైనర్ తో ఇంటి, వంట పనులు. సోషల్ మీడియాలో వీడియో వైరల్
-
టీడీపీ మహిళా నేతపై వేధింపుల ఆరోపణలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం నేత దమయంతి లీలావతి తనను వేధింపులకు గురిచేసిందంటూ ముంబైకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ అనురూప ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బెంగళూరులో పనిచేస్తున్న సమయంలో ఎక్కువ జీతం ఇస్తామని చిత్తూరుకు పిలిచారన్న అనురూప.. డిజైనింగ్ పనులతో పాటు ఇంటి, వంట పనులు చేయించారని ఆరోపించారు. చిత్తూరులో ఆకృతి బోటిక్ నిర్వహిస్తున్న లీలావతి.. అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తామని తీసుకువచ్చి.. జీతం చెల్లించకుండా మానసిక వేధింపులకు గురిచేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లీలావతి, ఆమె కుమారుడు అనుష్ చౌదరి టార్చర్ చేశారంటూ.. కన్నీటి పర్యంతమైన అనురూప వీడియో కలకలం రేపుతోంది. -
వీటన్నింటిపైనా అసెంబ్లీలో చర్చ జరగాలి: తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: పీపీపీ అని పబ్లిక్ను తీసుకెళ్లి ప్రైవేట్ చేతిలో పెడుతున్నారని.. వీటన్నింటిపైనా అసెంబ్లీలో చర్చ జరగాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షంలేని చర్చ ఎవరి కోసం?. అసెంబ్లీలో ప్రతిపక్షానికి అవకాశం, సమయం కేటాయించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడిని డిమాండ్ చేస్తున్నామని చంద్రశేఖర్ పేర్కొన్నారు.ప్రజల తరుఫున పోరాడతాం: కల్పలతా రెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని.. వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు. డీఎస్సీలో నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయి. దీంతో మెరిట్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. సీబీఐ విచారణ జరిపించాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.‘‘రైతులకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రంలో వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ పరిస్థితిపై పక్క రాష్ట్ర సీఎం కూడా మాట్లాడే దుస్థితి వచ్చింది. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా ఈ ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తిగా లేరు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరుఫున గట్టిగా పోరాడతాం. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం’’ అని కల్పలతారెడ్డి పేర్కొన్నారు. -
మంత్రి సహకారంతో పంచదర్లలో అక్రమ మైనింగ్.. ఆ మంత్రి పేరు...
-
TDP vs Janasena.. కూటమి నేతల మధ్య కుమ్ములాట
-
‘ప్రశ్నించండి’ అంటున్న మోదీ.. ఏపీలో ప్రశ్నిస్తే కేసులా?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఉపన్యాసం చేస్తూ ప్రతి అంశంపైన ప్రశ్నించాలని యువతకు పిలుపు ఇచ్చారు. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. కొద్దికాలం క్రితం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పత్రాల లీక్కు సంబంధించి యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన నేపథ్యంలో జరిగిన పరిణామాలకు, ఆ తర్వాత మోదీలో వచ్చిన మార్పునకు ఇది దర్పణం పడుతుంది. ప్రధాని వ్యూహాత్మకంగా తన వైఖరి మార్చుకున్నారా? లేక దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించేతత్వాన్ని బలపరచడానికి చేశారా? అన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కాని మోదీ ప్రసంగాలలో ఇది కీలకమైన మార్పుగా చెప్పవచ్చు.కానీ, దీనికి ఆయన కట్టుబడి ఉండడమే కాదు. తన మిత్రపక్షాలు ప్రభుత్వం నడుపుతున్న రాష్ట్రాలలో కూడా అలాగే వాతావరణం ఏర్పడేలా ఆయన చర్య తీసుకుంటేనే యువతలో విశ్వాసం ఏర్పడుతుంది. ఏపీలో ప్రశ్నించే యువతను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పెద్దలు గంజాయి బ్యాచ్ అని, బ్లేడ్ బాచ్ అంటూ అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్ది పార్టీని గొడ్డలి పార్టీ అంటూ అనుచిత భాష వాడుతున్నారు. దేశంలో ఇలాంటి పెడ పోకడలను నియంత్రించాల్సిన అవసరాన్ని ప్రధాని గుర్తించాలి. అయితే కాక్రోచ్ ఆందోళన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్కు బీజేపీ ఎంపీలు పార్లమెంటులో పూలదండలతో స్వాగతం చెప్పిన తీరు కూడా అంత శోభ నివ్వదు. దీనిని మోదీ ఎందుకు అనుమతించారో తెలియదు.మరోవైపు ఏపీలో డీఎస్సీ అక్రమాలపై విపక్ష వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ అక్రమాల వల్ల నష్టపోయిన యువత బహిరంగంగా అవి ఎలా సాగాయో వెల్లడిస్తున్నారు. దీనిపై సీఐఐ దర్యాప్తును, మంత్రి లోకేష్ రాజీనామాను వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. నిజంగా ఇందులో ఏ అవకతవక జరగకపోతే నీట్ పరీక్షల గొడవపై సీబీఐ దర్యాప్తు వేసినట్లు ఏపీలో కూడా చేసి ఉండవచ్చు. అలా చేయకపోగా ప్రశ్నించేవారి గొంతు నులమడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. తప్పుడు కేసులు పెట్టడం, వైఎస్సార్సీపీ దీక్ష శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు దాడులు చేయడం వంటివి చేస్తున్నారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిందో అర్దం చేసుకోవచ్చు. ఇంత చేస్తున్నా ఆందోళనలు ఆగడం లేదన్న అసహనంతో పోటీ ర్యాలీలు చేయించడం ఆరంభించారు.ఢిల్లీలో యువత ఆందోళన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యూహాలను కొన్నిటిని అమలు చేయకపోలేదు. పోలీసులు పెల్లెట్ గన్లను ప్రయోగించడం, లాఠీలను ఝళిపించడం వంటివి చేశారు. దీనివల్ల బీజేపీకి బాగా నష్టం జరిగింది. ఆ డ్యామేజీని గుర్తించిన ప్రధాని ఆందోళనకారులను ఫ్రెండ్స్ అంటూ అడ్రస్ చేశారు. కానీ ఏపీలో మాత్రం గంజాయి బ్యాచ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ, ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. పైగా ప్రభుత్వం తలచుకుంటే రెండు నిమిషాలలో అణచివేస్తుందని కూడా బెదిరిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించి వచ్చిన ఆరోపణల మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలకు సిద్దపడింది. ఏపీలో మాత్రం అలా చేయడం లేదు.ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకాలను ప్రభుత్వం సాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. పంజాబ్లో ఇలాంటి ఆరోపణలు వస్తే అక్కడ బీజేపీకి చెందినవారు కూడా ఆందోళనలు చేస్తున్నారు. జార్ఖండ్లో ఉద్యమానికి అక్కడ అధికారంలో ఉన్న భాగస్వామి అయిన కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తోంది. స్వయంగా రాహుల్ గాంధీ ఈ మేరకు ప్రకటన చేశారు. కానీ ఏపీలో విచిత్రంగా కాంగ్రెస్, బీజేపీలు నోరు విప్పడం లేదు. జనసేన ఎటూ 15 ఏళ్ల పాటు చంద్రబాబుకు మద్దతు ఇస్తామని ఓపెన్ గానే చెబుతోంది. అంటే అంతకాలం చంద్రబాబు సర్కార్ ఏం చేసినా నోరు విప్పదనుకోవాలి. ఆ రకంగా ఈ పార్టీలన్నిటిని చంద్రబాబు తన కంట్రోల్లో పెట్టుకున్నారన్న భావన ఉంది. అయితే, ప్రధాని మోదీ తన ప్రసంగంలో యువత ప్రశ్నించడాన్ని స్వాగతిస్తున్నామని అంటున్నారు. ప్రతి అంశంపైనా ప్రశ్నించాలని, అందరూ ఆమోదించారని అక్కడితో ఆగిపోవద్దు అని ఆయన చెబుతున్నారు. ఇందులో ఎంత చిత్తశుద్ది ఉందన్నది భవిష్యత్ పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది.ఇదే సందర్భంలో అమెరికాలో ప్రజాస్వామ్యం బలోపేతం అయిన తీరుపై ప్రముఖ చరిత్రకారుడు మైకేల్ బిష్లోన్ చేసిన ఒక ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించింది. సాక్షి దినపత్రిక ఈ వ్యాసంలోని ముఖ్యాంశాలను ప్రచురించింది. ఆ ఉపన్యాసంలో ఆయా పూర్వ అధ్యక్షులు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చేసిన కృషిని, వారి ఉత్తేజపూరిత వ్యాఖ్యలను కూడా ఆయన ఉదహరించారు. ఇది భారత ప్రజాస్వామ్యం బలపడటానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అమెరికాలో గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందిన బెంజిమిన్ ఫ్రాంక్లిన్ ప్రతి పౌరుడి తొలి బాధ్యత అధికారాన్ని ప్రశ్నించడమే అని వ్యాఖ్యానించారు. మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ చెప్పిన మాట ఏమిటంటే, అమెరికాలో గొప్పహోదా మిస్టర్ ప్రెసిడెంట్ కాదు.. మిస్టర్ సిటిజన్.. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రజలు అధ్యక్షుడి కోసం పనిచేయరు. అధ్యక్షుడే ప్రజల కోసం పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.దేశాన్ని పొగిడేవారికే కాదు.. దేశంలోని లోపాలను నిర్మాణాత్మకంగా సమర్ధించేవారికి సమాన గౌరవం ఉండాలని కూడా అమెరికా గొప్ప నేతలు నమ్మారని మైఖేల్ వివరించారు. ఇంకో ప్రముఖుడు ధామస్ జపర్సన్ మరో మాట చెప్పారు. మిత వ్యయంతో, సమర్ధవంతంగా పనిచేసే రాజకీయ వ్యవస్థ ఏర్పడితే ఆ ప్రజాస్వామ్య స్పూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుందని అన్నారు. ఇదే వ్యాసంలో మైఖేల్ ఒక విషయం చెప్పారు. చరిత్రకారులు తమకు అనుకూలంగానే మాట్లాడాలని 2026లో వాషింగ్టన్ డీసీలోని కొందరు రాజకీయ నేతలు ఆశిస్తున్నారని, సర్కస్ లోని విదూషకుల మాదిరి ప్రవర్తించాలని కోరుకుంటున్నారని, అమెరికా వ్యవస్థాపకులు ఇలాంటి ఆలోచనను చూసి బాధపడేవారిని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అమెరికాలో కూడా గత విలువలు కొరవడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారన్న మాట.మైఖేల్ చెప్పిన మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది? అమెరికా కన్నా పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ లో ఈ మధ్య కాలంలో జరుగుతున్న విపరిణామాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు పెరుగుతున్నాయనే అనిపిస్తుంది కదా! దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రత్యేకించి ఏపీ వంటి రాష్ట్రాలలో రెడ్ బుక్ అంటూ అరాచకపు వ్యవస్థను సృష్టించడం ప్రజలను కలవరపరుస్తుంది. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ వంటి రాజ్యాంగ రూపకర్తలు, దేశ నిర్మాతలు భారత్ లో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించి ఉండరు. ప్రజాస్వామ్యంతో నిమిత్తం లేకుండా నియంతృత్వంగా అల్ప బుద్దితో వ్యవహరిస్తున్న నేతల తీరును గమనిస్తే వారి ఆత్మలు క్షోభిస్తాయి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దామోదర్ నాయుడుకే మళ్లీ చాన్స్
సాక్షి, అమరావతి: పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ పోస్టు వ్యవహారం మళ్లీ వివాదంగా మారింది. ఏడాది క్రితం పదవీ విరమణ పొందిన డాక్టర్ టి.దామోదర్ నాయుడిని డైరెక్టర్గా మరోసారి నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతేడాది ఆగషు్టలో ఆయన్ని పునర్నియమిస్తూ జారీచేసిన జీవోను హైకోర్టు రద్దు చేసినా.. దామోదర నాయుడిని మరో ఏడాది పాటు కొనసాగించేలా ప్రయత్నాలు జరుగుతుండడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రిటైర్ అయిన సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారి కోసం సర్వీస్ రూల్స్ పక్కన పెడుతున్నారని, వరుసగా రెండో ఏడాది కూడా నిబంధనలకు విరుద్ధంగా పునర్నియమించడం ద్వారా డిపార్ట్మెంట్లో పదోన్నతుల ఛానల్ దెబ్బతింటుందని, అర్హులైన అధికారుల అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా దామోదరనాయుడు 2024 అక్టోబర్ 17న బాధ్యతలు చేపట్టారు. 2025 జూలై 31న పదవీవిరమణ పొందారు. ఆ వెంటనే డైరెక్టర్ పోస్టుకు అర్హులైన అధికారుల సీనియార్టీ జాబితాను జీవో ఎంఎస్ నెం.14 ద్వారా విడుదలచేశారు. సరిగ్గా అదే సమయంలో తనకు మరో ఏడాది అవకాశం ఇవ్వాలని రిటైర్ అయిన దామోదరనాయుడు ప్రభుత్వానికి వ్యక్తిగతంగా అభ్యర్థించడం, ఆయన్ని పునర్నియమిస్తూ 2025 ఆగష్టు 6న జీవో ఆర్టీ నెం.285జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. పరిపాలనా సౌలభ్యం పేరిట జరిగిన ఈ పునర్నియామకాన్ని సవాల్ చేస్తూ ఉద్యోగ, అధికారుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలి.. పశుసంవర్ధక చట్టం ప్రకారం 62 ఏళ్ల తర్వాత స్టాట్యుటరీ పోస్టులో కొనసాగడం చెల్లదు. 1996 సర్వీస్ రూల్స్ ప్రకారం డైరెక్టర్ పోస్టును కేవలం పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలి. కానీ దామోదరనాయుడు నియామకంలో ఇవేమీ పాటించలేదు. మరొక వైపు ఈ పునర్నియామకాన్ని సవాల్ చేస్తూ ఉద్యోగ, అధికారుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించగా, సింగిల్ బెంచ్ పునర్నియామక జీవోను రద్దు చేసింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు దాదాపు ఆర్నెల్ల పాటు కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్తో పాటు ఇతర ఉన్నతాధికారులకు కోర్టు దిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో జీవో రద్దుపై అప్పీల్కు వెళ్లడం, జీవో రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా, ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కాగా ఇప్పటికే ఈ పునర్నియామకం వలన ఏపీ ఎల్డీఏ ఎండీగా పనిచేస్తూ ఇటీవలే రిటైర్ అయిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మట్టపర్తి శ్రీనివాసరావు డైరెక్టర్ అవకాశాన్ని కోల్పోయారు. ఆయన తర్వాత ప్రస్తుతం డిపార్టుమెంట్లో డైరెక్టర్ హోదాలో ఏపీ షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ ఎండీ డాక్టర్ రెడ్నం దామోదర నాయుడుతో పాటు ఏపీఎల్డీఏ ఎండీ సింహాచలం కొనసాగుతున్నారు. వీరితో పాటు డాక్టర్ సత్య కుమారి, డాక్టర్ రజనీ కుమారి, డాక్టర్ రత్నకుమారిలు అదనపు డైరెక్టర్ హోదాలో పనిచేస్తూ డైరెక్టర్ పోస్టుకు అర్హత కలిగి ఉన్నారు. ఈపునర్నియామక సంస్కృతి వలన డైరెక్టర్ నుంచి ఏడీ వరకు దాదాపు 200 మందికిపైగా అధికారుల పదోన్నతుల ఛానల్ దెబ్బతింటుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దామోదరనాయుడు పునర్నియామక గడువు ఆగష్టు 5తో ముగిసింది. అయినా సరే మరో ఏడాది కొనసాగేందుకు మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారు. ఎలాగైనా సరే ఈయన్ని టీడీపీ ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ కొనసాగించేందుకు టీడీపీలోని ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
సోషల్ మీడియాపై రణభేరి!
సామాజిక మాధ్యమాలు వచ్చాక ప్రపంచ పరిణామాలన్నీ వెంటవెంటనే అందరికీ చేరుతున్నాయి. అవి భావవ్యక్తీకరణ విస్తృతిని పెంచి కోట్లాదిమందికి గొంతునిస్తు న్నాయి. ఇన్నాళ్లూ మౌనంగా, నిస్సహాయంగా వీక్షించినవారంతా నిక్కచ్చిగా, నిర్మొహ మాటంగా తమ అభిప్రాయాలు వినిపిస్తున్నారు. కానీ మంచితోపాటే చెడు కూడా ఇందులో కలగలిసివుంది. వాటి కారణంగా అనవసర వదంతులు వ్యాపించి ఎందరో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన దేశం వరకే తీసుకుంటే దొంగ లుగా ముద్రపడి కొన్నిచోట్ల, గోవుల్ని తరలిస్తున్నారని ఆరోపణలొచ్చి మరికొన్నిచోట్ల ఉన్మాద గుంపులు దాడులు చేసి హతమార్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. టీనేజర్లు, పిల్లల మనసుల్లో ఈ వేదికల దుష్ప్రభావం కూడా నానాటికీ పెరుగుతోంది. మానసిక ఒత్తిళ్లకూ, రుగ్మతలకూ అవి కారణమవుతున్నాయి. అమెరికా అప్పీళ్ల కోర్టులో మెటా, ఆల్ఫాబెట్, స్నాప్చాట్, టిక్టాక్ తదితర సంస్థలపై సోమవారం 3,000కు పైగా పిటిషన్లు దాఖలు కావటాన్ని ఈ నేపథ్యంలో చూడాలి. ‘పబ్లిక్ న్యూసెన్స్’ కింద దాదాపు 40 రాష్ట్రాలతోపాటు మున్సిపాలిటీలు, పాఠశాలలు, వ్యక్తులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వాస్తవానికి మొన్న మార్చిలోనే లాస్ ఏంజెలెస్కి చెందిన న్యాయస్థానం సామాజిక మాధ్యమ వేదికల్ని యువతకు హానికరమైన రీతిలో రూపొందించటాన్ని తప్పుబట్టింది. చిన్న వయసులో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లు తనను బానిసగా మార్చాయనీ, ఇందువల్ల తీవ్రంగా నష్టపోయాననీ ఆరోపిస్తూ కోర్టుకెక్కిన 20 యేళ్ల యువతికి 60 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని ఆ న్యాయస్థానం తీర్పునిచ్చింది. న్యూమెక్సికోలో సైతం మెటాపై ఈ తరహా తీర్పే వెలువడింది. వేదికకు సంబంధించిన భద్రత విషయంలో వినియోగదారుల్ని అది తప్పుదోవ పట్టించిందని న్యాయస్థానం నిర్ధారించింది. 37.5 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని సంస్థను ఆదేశించింది. చాన్నాళ్లక్రితమే టీనేజర్లపైనా, పిల్లలపైనా సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం ఎలా ఉన్నదో ప్రభుత్వాలు గుర్తించాయి. ఆస్ట్రేలియా పదహారేళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునే బాధ్యతను టెక్ సంస్థలపైనే పెట్టింది. దీన్ని పాటించనట్టయితే దాదాపు 5 కోట్ల ఆస్ట్రేలియా డాలర్లు జరిమానా చెల్లించాలని చట్టం నిర్దేశించింది. బ్రిటన్, ఫ్రాన్స్ సైతం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్(ఈయూ) హానికర మైన పోస్టుల్ని తొలగించటంలో జాప్యం జరిగితే గ్లోబల్ టర్నోవర్లో 6 శాతం మొత్తాన్ని జరిమానా విధించే చట్టం తీసుకొచ్చింది.తెలిసో తెలియకో ఏదైనా వీడియో చూస్తే ఆ వెనువెంటనే అటువంటివే కుప్పలు తెప్పలుగా వచ్చిపడేలా ఆ మాధ్యమాలు అల్గారిథమ్లు రూపొందిస్తున్నాయి. తెలిసీ తెలియని వయసులో ఉన్న పిల్లల్ని వ్యామోహాల బారిన పడేస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలొచ్చినప్పుడల్లా ఈ మాధ్యమాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాము కేవలం ఒక వేదిక మాత్రమే కల్పిస్తున్నామనీ, అందులో వేరెవరో ఉంచే కంటెంట్కు తామెలా బాధ్యులమనీ ప్రశ్నిస్తున్నాయి. ఏటా వేలాదికోట్ల డాలర్ల లాభాలు ఆర్జించే ఉద్దేశంతోనే ఈ సంస్థలు జుగుప్సాకర, హింసాత్మక అంశాలున్న వీడియోల్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు భావప్రకటనా స్వేచ్ఛకు అనువైనవి. కానీ అవి దుర్వినియోగమైన పక్షంలో కఠినచర్యలుండాలి. మన దేశం ఈ విషయంలో వెనకబడే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, పాలకుల్ని కించపరిచేవిధంగానో పోస్టులున్నప్పుడే తక్షణ స్పందన కనిపిస్తోంది. తెలంగాణలో ఆన్లైన్ చానెళ్లు నిర్వహిస్తున్న మహిళా పాత్రికేయులపై అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు లేవు. ఆంధ్రప్రదేశ్లో పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్టుచేసినందుకే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టుచేస్తున్న ప్రభుత్వం... ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ, ఇతర నేతలనూ కించపరుస్తూ పోస్టులు పెట్టే టీడీపీ నేతలనూ, కార్యకర్తలనూ చూసీచూడనట్టు వదిలేస్తోంది. అందుకే అమెరికాలో మాదిరి మన దేశంలో కూడా మాధ్యమాల, ప్రభుత్వాల జవాబుదారీతనాన్ని పెంచే చట్టాన్ని తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి పెడధోరణులు ఆగుతాయి. -
భారతి సిమెంట్స్ వద్ద హై టెన్షన్.. TDP గూండాల బీభత్సం
-
ప్రశ్నిస్తే చాలు దాడులు చేస్తున్నారు.. కూటమి నేతలకు బొత్స వార్నింగ్
-
‘ఆనం అంటే అవినీతి.. అవినీతి అంటే ఆనం’
సాక్షి, నెల్లూరు జిల్లా: ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ప్రశ్నించడమే పాపం అన్నట్లు ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలొ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ఒక సుస్థిర స్థానం ఉంది. తమ సానుభూతిపరులను ఉద్దేశించి నీచంగా మాట్లాడటం సరికాదంటూ విక్రమ్రెడ్డి హితవు పలికారు.ఆనం గెలిచాక మర్రిపాడులో ఇసుక కొండను మాయం చేశారు. ఆత్మకూరులో ఇసుక దందాకు పాల్పడుతున్నారు. మంత్రి ఆనం ధనదాహానికి ఏడుగురు బలయ్యారు. మంత్రి ఆనం చికెన్ వేస్ట్ మాఫియా తయారు చేశారు. అవినీతి, అక్రమాలు, ఇసుక రవాణా, చికెన్ వేస్ట్ దందాలు చేసిన చరిత్ర మాది కాదు. వైఎస్ జగన్ని తిట్టి మంత్రి అయిన చరిత్ర హీనుడివి నువ్వు. భూ సేకరణ చేయకుండా నూతన ప్రాజెక్ట్ అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు. పోలీస్ స్టేషన్లో సైతం మాముళ్ళు వసూళ్లు చేసిన నీచపు చరిత్ర నీది’’ అంటూ విక్రమ్రెడ్డి దుయ్యబట్టారు.‘‘మంత్రి ఆనం ఇసుక దందా ద్వారా రూ.3 కోట్లు సంపాదిస్తున్నారు. ఐదేళ్లకోసారి పార్టీ మార్చే ఊసరవెల్లి నైజం మీదే. ఆనం అంటే అవినీతి.. అవినీతి అంటే ఆనం. నాపై ఆరోపణలునిరూపిస్తే రాజీనామా చేస్తా. నా సవాల్ స్వీకరించే దమ్ముందా?’’ అంటూ విక్రమ్రెడ్డి సవాల్ విసిరారు. -
YSRCP మాజీ సర్పంచ్ ఇల్లు కూల్చేసిన అధికారులు
-
చంద్రబాబు కాకి లెక్కలు.. ఆ భయంతోనేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణాంకాలు చెప్పడంలో ఘనాపాటి అని ఒప్పుకోవాలి. కొందరు వాటిని కాకి లెక్కలు అనవచ్చు. మరికొందరు భలే లెక్కలు అనవచ్చు. కాని వాటిని విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ ప్రజలు వాటిని ఎంతవరకు నమ్ముతారో తెలియదు. ఆయన మాత్రం ఏకధాటిగా మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి యత్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో ఇచ్చిన ప్రజెంటేషన్ రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఏపీ ఆర్థికంగా ఇబ్బందులలో ఉందన్న భయం. మరోపక్క లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రాంతి.. ఈ రెండు విషయాలు ఆయనే చెప్పగలరు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు బాండ్ పత్రాలు ఇచ్చారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఒక్కో కుటుంబానికి ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందో తెలిపారు. వీరిద్దరూ త్రికరణ శుద్దిగా ప్రమాణం చేసి బాండ్లు ఇస్తున్నామని అన్నారు. బాగానే ఉంది. త్రికరణ శుద్ది ఉంటే ఏమి చేసి ఉండాలి. నిజంగానే ఆయా కుటుంబాలకు ఈ రెండేళ్లలో ఎంతెంత ఇచ్చింది మళ్లీ లెక్కలు ఇవ్వాలి కదా! ఆ పని చేయకుండా ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నామని, అప్పులు చేసి సంక్షేమ స్కీములు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.గతంలో అప్పులు చేసేవారికి సంక్షేమ స్కీములు అమలు చేసే అర్హత ఉందా అని ఆయనే ప్రశ్నించేవారు. డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. సీమాంధ్ర, కోస్తా, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్దే లక్ష్యమని ఆయన చెప్పారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇచ్చిన లెక్కలు చూస్తే మతి పోవల్సిందే. ఈ మూడు ప్రాంతాలలో కలిపి ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల ద్వారా సుమారు 46 లక్షల ఉద్యోగాలు వస్తాయట. అందులో 2032 లోపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. బహుశా 1956 నుంచి ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో, లేదో తెలియదు. కాని విభజిత ఏపీలో మాత్రం అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే నమ్మగలమా? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అని ప్రచారం చేశారు. శ్వేతపత్రంలో వాటిని డబుల్ చేసేశారన్నమాట.ఒకవైపు ప్రపంచం అంతటా సంక్షోభం, ఎల్నినోలో ప్రభావం వంటివాటితో ఉపాధి సమస్యలు వస్తుంటే ఏపీలో మాత్రం ఈ రకంగా లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. నిజంగా అలా చేయగలిగితే గొప్పపేరే వస్తుంది. దానిని అంతా స్వాగతిస్తారు. కాని కేవలం ప్రజలను మభ్య పెట్టేరీతిలో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే మాత్రం ఏపీకి తీరని అన్యాయం చేసినట్లవుతుందని గ్రహించాలి. చంద్రబాబు చెబుతున్నదాని ప్రకారం అమరావతి ఆర్థిక రీజియన్ను టెక్నాలజీ, పరిశ్రమలు మౌలిక వసతులు, ఇంధనం విభిన్న ఆర్థిక వ్యవస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దుతారట. ఇక్కడ మొత్తం 6-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాథమిక అంచనా అట. వీటి ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చెబుతున్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్లో 49 ప్రాజెక్టులతో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట. ఈ పెట్టుబడుల ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లబ్ధిస్తుందని ఆయన అంటున్నారు. 2032 నాటికి పది లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందట. ఇక తిరుపతి ఆర్థిక రీజియన్లో 11-12 లక్షల కోట్ల పెట్టటుబడులు ఆకర్షించడం ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం అని ఆయన తెలిపారు. ఏపీ ఆదాయంలో 40 శాతం రాయలసీమ నుంచే వచ్చేలా తయారు చేస్తారట. లక్ష కోట్లతో ఉద్యానవన హబ్ను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక పక్క మామిడి రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎల్నినో ప్రభావంతో చీని తోటలు ఎండిపోతున్నాయని, టాంకర్లు తెచ్చి నీరు పెట్టుకోవల్సి వస్తోందని ఈ మధ్య ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. మరో వైపు చంద్రబాబు మాత్రం లక్ష కోట్ల ఉద్యానవన హబ్ అని ఊదరగొడుతున్నారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇవ్వాలట. ఇవన్ని ఎప్పటికి జరిగేనో ఎవరు చెప్పగలరు? మరో విషయం ఏమిటంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు.విశేషం ఏమిటంటే విశాఖ, తిరుపతి రీజియన్లకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టుబడి పెడతారన్నది క్లారిటీ లేదు కాని, అమరావతిలో నిర్మాణాలు, మౌలిక వసతులకోసం ఇంతవరకు 40887 కోట్ల మొత్తాన్ని సమీకరించామని ఆయన తెలిపారు. ఇటీవల ఏపీలో ఒక అసంతృప్తి ఏర్పడింది. ప్రభుత్వం వేల కోట్ల అప్పు చేసి మొత్తం అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తోందని మిగిలిన ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా విశాఖ, తిరుపతి రీజియన్లలో పెట్టుబడులు రాబోతున్నాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని నమ్మబలకాలని ఆశిస్తున్నట్లుగా ఉంది. ఇవన్ని చదువుతుంటే ఒకప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా 2002 ప్రాంతంలో విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అందులో కూడా ఏవేవో లెక్కలు రాస్తే అంతా చూసి నవ్వుకున్నారు. తదుపరి టీడీపీ 2004 ఎన్నికలలో ఓటమిపాలైంది. తిరిగి 2014లో విభజిత ఏపీలో టీడీపీ మళ్లీ పవర్లోకి వచ్చింది. ఆ టరమ్లో ఒక్కసారి కూడా విజన్ 2020 ఊసు ఎత్తినట్లు కనిపించలేదు. అప్పట్లో స్వర్ణాంధ్ర, 2029నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ అంటూ కొత్త నినాదాలతో కాలం గడిచిపోయింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. తిరిగి ఈ టరమ్లో 2047 విజన్తో పాటు డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అని కొత్త పదాలు అందుకున్నారు. అంటే ఒక్కో టరమ్లో ఒక్కో నినాదంతో కథ నడిపేయడం, ప్రజలు వాటిని వినీ.. విని విసుగుచెంది ఓడించడం జరుగుతోందని అనుకోవాలా? మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఎస్ఐ ప్రవళ్లిక కేసు.. ఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు!
శ్రీకాకుళం క్రైమ్ : టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్ జగన్ జిల్లా పర్యటన నాడు ఘటనా స్థలిలో లేని వ్యక్తిపై హత్యాయత్నం, ఇతర నాన్బెయిల్బుల్ సెక్షన్లు ఆపాదించిన పోలీసులు.. ఇప్పుడు తూచ్ తూచ్ అంటున్నారు. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో వైఎస్సార్సీపీ ఆమదాలవలస ఇన్చార్జి చింతాడ రవికుమార్తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసులు కట్టి రిమాండ్కు పంపిన విషయం విదితమే. వీరిలో ఓ ప్రైవేటు ఉద్యోగి గురుగుబెల్లి తేజేశ్వరరావు పంజాబ్ యూనివర్సిటీలో అదే రోజు తన కుమార్తెతో ఉన్నట్లు ఆధారాలు నిర్ధారణ కావడంతో కేసు నుంచి ఆయనని తొలగిస్తున్నట్లు కోర్టుకు మెమో సమరి్పంచామని డీఎస్పీ వివేకానంద స్పష్టం చేయడం విశేషం. ఇప్పటికే ఈ అక్రమ కేసుకు సంబంధించి జిల్లా పీడీఎం కోర్టు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి హత్యాయత్నం, ఉద్దేశపూర్వకంగా నేరం చేయు సెక్షన్లైన 109, 111 సెక్షన్లు వర్తించవని ఆదివారం రిమాండ్ రిపోర్టులో రాసిన విషయం పాఠకులకు విదితమే. ప్రజల్లో అబాసుపాలు.. టీడీపీ అధిష్టానం, స్థానిక నాయకత్వం ఒత్తిడి మేరకు పోలీసు ఉన్నతాధికారులు తమ పోలీసులతో ఇలాంటి నాన్బెయిల్బుల్ సెక్షన్లు వేయించడం, అదనంగా కేసులో మరో ఏడుగురిని కేసులో చేర్చడం, రి మాండ్కు తరలించే సమయంలో చింతాడ రవిని రెండు చోట్ల హైకోర్టు నిబంధనలు కాలరాసి నడిపించుకుని తీసుకువెళ్లడం వంటి అంశాలతో ప్రజల్లో అబాసుపాలయ్యారు. ఈ కేసులో 14 మంది రిమాండ్కు వెళ్లడం తెలిసిందే. మరికొంతమంది మంగళవారం ఆమదాలవలస స్టేషన్లో లొంగిపోతున్నట్లు సమాచారం. మరోసారి అప్పలరాజును కస్టడీ కోరిన పోలీసులు.. అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు మరోసారి కస్టడీ విచారణ కోరుతూ సోమవారం పలాస కోర్టులో పిటిషన్ వేసినట్లు సమాచారం. -
ఎమ్మెల్యే గోవిందరావు కుమారుడి వ్యవహారంలో సంచలన విషయాలు
శ్రీకాకుళం: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేశ్ కారు ప్రమాదం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది క్రితం ర్యాష్గా కారు నడుపుతూ ఆటోను ఢీకొట్టారు సాయి గణేశ్. ఈ ప్రమాదంలో చేపల భోగయ్య అనే వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో సాయి గణేశ్ను తప్పించి మరో వ్యక్తిని డ్రైవర్గా చూపించారు ఎమ్మెల్యే గోవిందరావు. మృతి చెందిన బాధితుడి కుటుంబానికి రూ.5 లక్షలు, ఉద్యోగం, పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఏడాది గడిచినా బాధితులకు గోవిందరావు సాయం చేయలేదు. తనకు చెప్ప లాయర్లు తెలుసంటూ బాధితులను బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బాధితులతో చర్చల సమయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బెదిరింపు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. -
బయటపడ్డ TDP ఎమ్మెల్యే గోవిందరావు బెదిరింపుల వీడియో
-
సుద్దపూస కబుర్లు వద్దు కూటమికి వల్లభనేని వార్నింగ్
-
డీఎస్సీపై ప్రశ్నిస్తే దాడులా?.. ‘క్రిమినల్స్ అడ్డా’ ఎవరిది బాబు?
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు తన అనుచరులతో కలిసి గత గురువారం నాడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష శిబిరంపై దాడి చేశారు. టెంట్ పీకేశారు. అక్కడ కొందరు టీడీపీ గూండాలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సరిగ్గా అదే టైమ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఉన్నారు. బోండా ఉమ అరాచక ప్రవర్తనపై ఆయనకు సమాచారం అందే ఉండాలి. అయినా అలాంటివి చేయవద్దని చెప్పకపోగా, వైఎస్సార్సీపీవారిని ఉద్దేశించి గొడ్డలి పార్టీ, క్రిమినల్స్ తయారీ అడ్డా అంటూ చంద్రబాబు విమర్శించారట.కొన్నాళ్ల క్రితం బోండా ఉమ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పక్కన కూర్చుంటే చంద్రబాబుకు కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ కమిటీ వేసి మందలించే ఏర్పాటు చేశారు. తదుపరి తన కుమారులతో కలిసి బోండా ఉమ చంద్రబాబును కలిశారు. అక్కడ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కాని, మరుసటి రోజే ఉమా విజయవాడలో గూండాయిజానికి బరి తెగించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఆయన అనుచరులు దాడి చేశారు. విజిటేరియన్ అయిన విష్ణుపై కోడిగుడ్లు విసిరారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు, మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. వారు తమ డిమాండ్తో ప్రశాంతంగా దీక్షలు చేస్తున్నారు. దీనిని భరించడం టీడీపీ నాయకత్వానికి కష్టంగా మారింది.నీట్ ప్రశ్నాపత్రాల లీక్పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఫలితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. జార్ఖండ్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. వాటికి ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మద్దతు ఇస్తున్నారు. ఏపీలో కూడా డీఎస్సీ టీచర్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్ ఆధార సహితంగా ఆరోపణలు చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ పక్షాన సరైన జవాబు ఇవ్వలేకపోతున్నారు. పలువురు డీఎస్సీ అభ్యర్ధులు తమకు అన్యాయం జరిగిందని సాక్ష్యాలు చూపుతున్నారు. అయినా ప్రభుత్వం డబాయించి తప్పించుకోవాలని చూస్తోంది.ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ వివిధ రూపాలలో ఆందోళనలు సాగిస్తోంది. డీఎస్సీ అక్రమాలపై జరుగుతున్న ప్రచారం ప్రజలలోకి వెళుతుండడంతో చంద్రబాబు, లోకేష్లు అసహనానికి గురవుతున్నారు. అందువల్లే ప్రభుత్వం అనుకుంటే రెండు నిమిషాలలో అణచివేయగలదని బెదిరించడం, ఆందోళన చేస్తున్న రైతులను, నిరుద్యోగ యువతను గంజాయి బాచ్ అని అనడం వంటివి చేశారనిపిస్తుంది. ఇవన్ని ముఖ్యమంత్రి స్థాయికి తగనివని ఆయనకు తెలిసినా ఏదో నిస్సహాయ స్థితిలో పడ్డారనిపిస్తుంది. ఎదురుదాడిలో భాగంగా కర్నూలులో కొందరితో ప్రదర్శన చేయించారు. వారు ఏ తరహా వారో తెలియదు. ఎల్లో మీడియా ప్రముఖంగా ఆ కథనాన్ని ఇచ్చింది. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ర్యాలీ చేస్తే వారు పవిత్రులు, వ్యతిరేకంగా చేస్తే గంజాయి బాచ్లని ప్రచారం చేస్తారన్నమాట. తనవైపు వాదన సరిగా లేనప్పుడే ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడతాయన్న అబిప్రాయం ఉంది. దేవరపల్లిలో జగన్ టూర్లో ఒక చిన్న హోటల్లో జరిగిన ఉదంతాన్ని కూడా పెద్దదిగా ఫోకస్ చేయాలని యత్నించి చంద్రబాబు అండ్ కో భంగపడ్డారు. ఆ హోటల్ యజమానురాలు లక్ష్మి వచ్చి జగన్ను కలిశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోకపోవడం గొప్ప విషయమే. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు, లోకేష్లను సంతృప్తిపరచడానికి బోండా ఉమా కాని, మరికొన్ని చోట్ల ఇతర టీడీపీ నేతలు కాని దాడులు చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. దానికి తగినట్లే ఉమా మాట్లాడుతూ లోకేష్ను విమర్శిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా దీక్ష శిబిరాలు నిర్వహిస్తారా అని అంటున్నారు.నిజానికి విష్ణు పోలీసులకు చెప్పే దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. చిత్రంగా శిబిరానికి రక్షణ కల్పించవలసిన పోలీసులు దాడికి పాల్పడ్డ ఉమాను కాకుండా, శాంతియుతంగా కూర్చుని ఉన్న విష్ణును వాహనం ఎక్కించి తరలించారు. అదే టీడీపీ ఎక్కడైనా సభ పెడితే ఆ సమీపంలోకి అయినా విపక్షాలను రానిస్తారా? ఇప్పుడు చెప్పండి.. క్రిమినల్స్ తయారీ అడ్డాగా టీడీపీ ఉందా? వైఎస్సార్సీపీ ఉందా? ఈ దాడుల ద్వారా డీఎస్సీ అక్రమాల వ్యవహరం మరింతగా ప్రజలలోకి వెళుతుంది. ప్రభుత్వ తీరుపై మరిన్ని అనుమానాలు బలపడతాయి. మరికొన్ని ఉదాహరణలు గమనించండి.ఒక మంత్రి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ స్వయంగా లోకేష్కు ఫిర్యాదు చేశారట. అయినా ఆ మంత్రిపై చర్య తీసుకోలేదే? అంటే ఎవరు క్రిమినల్స్ అడ్డాలో ఉన్నట్లు అవుతుంది! ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేశారే. ఒక టీడీపీ నేత తన భార్య నైటీని తానే చించి ఎమ్మెల్యేపై ఆరోపించిన విషయం వీడియో సహితంగా బయటపడి ఉండకపోతే, ఎమ్మెల్యేపై ఆరోపణలను నమ్మే పరిస్థితి వచ్చేది కదా? ఇలాంటివాటిని చేసేవారిని కదా క్రిమినల్స్ అనాల్సింది. అలాంటివారిని ఎంకరేజ్ చేసే పార్టీని కదా క్రిమినల్స్ తయారు చేసే అడ్డా అనాల్సింది అని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. దానిని కాదనగలరా?ఈ మధ్యనే గుంటూరులో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసింది కూడా టీడీపీ నేతే కదా! అంతేకాదు. కొందరు కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది మహిళలపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడింది ఫిర్యాదులు వచ్చాయే. ఏకంగా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన ఘట్టం మరిచిపోయారా? ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన యువతిని నడిరోడ్డులో పోలీసు లాఠీతో కొట్టింది జనసేన నేత కదా! ఆ ఎమ్మెల్యేపై కాని, దౌర్జన్యం చేసిన జనసేన నేతపై కాని ఏమైనా చర్య తీసుకున్నారా? పలు చోట్ల బాధితులపైనే కేసులు పెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేష్లు ఇలాగే క్రిమినల్స్ అంటూ ఆరోపణలు చేసేవారు. ఎన్నికల సమయానికి వారిలో పలువురిని టీడీపీలో చేర్చుకున్నారు. అంటే టీడీపీ క్రిమినల్స్ అడ్డాగా మారిందని ఒప్పుకుంటున్నటా?కాదా? డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. దానికి సమాధానం ఉంటే చెప్పాలి. లేదా ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవచ్చు.గతంలో చంద్రబాబు డిమాండ్ చేసిన వెంటనే తన కుమారుడు జగన్పై సీబీఐ విచారణకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒప్పుకున్న ఘటనను పలువురు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు తన కుమారుడిపై డీఎస్సీ ఆరోపణలు వస్తే ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలపైన, కార్యకర్తలపైన జరిగిన హత్యలు, హత్యాయత్నం ఘటనలు, టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇవన్ని చూస్తుంటే 1983లో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీ రామారావు చెప్పిన ఆదర్శాలు ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి?ఒక వైపు క్రిమినల్స్ను ప్రోత్సహిస్తూ మరో వైపు వైఎస్సార్సీపీపై అదే విమర్శ చేయడం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు తప్పు చేసినా తప్పే అని, నిష్ఫక్షపాతంగా పనిచేయండని పోలీసులకు చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు ఈ వయసులో కూడా ఇలాంటి ప్రమాణరహిత రాజకీయాలు చేయడం వల్ల ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. రెడ్బుక్ అరాచకాలకు స్వస్థి పలికి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే నష్టం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అంతులేని అరాచకం!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే పరిశ్రమలను అడ్డుకోవడానికి మించిన దుర్మార్గమేముంటుంది? రాయితీలు, ప్రోత్సాహకాలిచ్చి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం భారతీ సిమెంట్స్పై దారుణమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లో ఆరురోజులుగా సాగుతున్న దమనకాండను రాష్ట్రంలోని పరిశ్రమ వర్గాలు నిర్ఘాంతపోయి చూస్తున్నాయి. భారతీ సిమెంట్స్ను మూతపడేలా చేయడమే లక్ష్యమన్నట్లు టీడీపీ గూండాలు మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నా జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు గానీ స్పందించకపోవడాన్ని బట్టి ఇది ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా అమలు చేస్తున్న కుట్రగానే భావించాలని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దాదాపు 15 వేల మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తున్న భారతీ సిమెంట్స్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు యూనిట్లు మూతపడ్డాయి. మైనింగ్ ప్రాంతంలోకి కార్మికులను, వాహనాలను పోనీయకుండా అడ్డుకుంటున్న పచ్చముఠాలు అక్కడ రేయింబవళ్లు పహారా కాస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల దన్నుతో స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అనుచరుల ముసుగులో గూండాలు, రౌడీషీటర్లు ఈ దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఓ పరిశ్రమ తన కార్యకలాపాలను చట్టబద్ధంగా చేసుకోవడానికి జిల్లా యంత్రాంగం తమవంతు సహకారం అందించాలి. వైఎస్సార్ కడప జిల్లాలో మాత్రం చట్టాలు చెల్లడం లేదు. అధికార పార్టీ మూకలు ఓ పథకం ప్రకారం ప్లాంటుకు రావాల్సిన ముడి ఖనిజాన్ని రాకుండా అడ్డుకుంటూ దౌర్జన్యానికి దిగుతూనే ఉన్నారు.ఆరురోజులుగా మైనింగ్కు అడ్డుకట్ట..భారతి సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం గడిచిన ఆరు రోజులుగా పలుమార్లు మైనింగ్ ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.. ఒక్క అడుగు కూడా కదలనివ్వకుండా టీడీపీ గూండాలు రేయింబవళ్లు మైనింగ్ ప్రాంతంలోనే తిష్టవేసి మరీ అడ్డుకుంటున్నారు. కార్మికులు భయపడ్డట్లే భారతి సిమెంట్ పరిశ్రమలో శనివారం నుంచి సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. ప్లాంటులో ఉన్న సున్నపురాయి నిల్వలు కూడా నిండుకున్నాయి. మైనింగ్ నిర్వహించి, సున్నపురాయిని ప్లాంటుకు తరలించకపోతే, ప్లాంటులో సిమెంట్ ఉత్పత్తి కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని నాలుగు రోజులుగా భారతి సిమెంట్స్ యాజమాన్యం అధికారులకు వివరిస్తూనే ఉంది. అయినప్పటికీ జిల్లా అధికారులకు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ప్లాంటులో ముడిఖనిజం లేక సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది.15వేల కుటుంబాలపై ప్రభావం..గత 17సంవత్సరాలుగా భారతి సిమెంట్స్ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు.. ప్రత్యక్షంగా 3వేల మందికి, పరోక్షంగా 12వేల మందికి ఉపాధి పొందుతున్న పరిశ్రమపై చంద్రబాబు సర్కార్ కక్షబూనింది. పరిశ్రమ అంతర్భాగంగా ఉన్న మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుని, భారతీ సిమెంట్స్ మూతపడేలా చేయాలన్నదే సీఎంఓ లక్ష్యమన్నట్లు కనిపిస్తోందని అధికారవర్గాలలోనూ చర్చ నడుస్తోంది. తాము చేయగలిగింది ఏమీ లేదని, పైనుంచి వస్తున్న వత్తిడి వల్లే ఏమీ చేయలేకపోతున్నామని జిల్లా అధికారల్లో చర్చ జరుగుతోంది. భారతీ సిమెంట్స్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల 15వేల మంది కార్మికుల జీవితాలు, వారి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం పడనుంది. -
భారతి సిమెంట్స్ వద్ద ఆగని టీడీపీ మూకల దౌర్జన్యం
కడప: ఏపీ రాష్ట్ర ఖజానాకు భారీగా పన్నులు చెల్లిస్తున్న భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (భారతి సిమెంట్స్)పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పరాకాష్టకు చేరింది. నాలుగు రోజులుగా టీడీపీ మూకలు చేస్తున్న దౌర్జన్యంతో కాప్టివ్ మైన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.మైన్లోకి వాహనాలు వెళ్లకుండా టీడీపీ మూకలు పదే పదే అడ్డుకుంటున్నాయి. సున్నపురాయి సరఫరా జరగకుండా భారతి సిమెంట్స్ ఉత్పత్తిని అడ్డుకునే కుట్రకు తెరలేపారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్సీ, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. టీడీపీ మూకల దౌర్జన్యంతో భారతి సిమెంట్స్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. టీడీపీ మూకల దౌర్జన్యంతో ఉత్పత్తి ఆగిపోతు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 15 వేల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.చంద్రబాబు నుంచి అందిన ఆదేశాలతో అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందనే విషయం అర్థమవుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ కార్యకలాపాలను టీడీపీ మూకలు అడ్డుకుంటున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదంటే చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందా? అనే అనుమానం కలగమానదు.పరిశ్రమ నడవకూడదన్నదే లక్ష్యమా? రాజకీయ పగ కోసం రాష్ట్ర పారిశ్రామిక ప్రయోజనాలనే పణంగా పెడతారా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇదే తరహాలో రాజకీయ కక్షతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కార్యకలాపాలను అడ్డుకుని ఉంటే ఆ సంస్థ ప్రశాంతంగా వ్యాపారం కొనసాగించగలిగేదా? అని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ తరహా దాడులకు ప్రభుత్వ పెద్దలు ఉసిగొల్పుతున్నారని అభిప్రాయపడుతున్నారు. -
టీడీపీకి షాక్.. వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పెనుమంట్ర మండలంలో ఈ రోజు (ఆదివారం) టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ మంత్రి రంగనాథరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. పెద్దఎత్తున కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడంతో పచ్చపార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. -
ఎమ్మెల్యే సారూ.. ఒక్కసారి కిందకు దిగి చూడండి..
అనంతపురం: ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు స్థానిక సమస్యలపై ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. శనివారం పాతగుంతకల్లులోని ఆరో వార్డు వాల్మీకి సర్కిల్ ఏరియా నుంచి దోనిముక్కల రోడ్డులో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని మరోచోట తాగునీటి సరఫరా మెరుగుదల పథకం భూమిపూజకు కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో ఆరోవార్డు ప్రజలు ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకున్నారు. దోనిముక్కలకు వెళ్లే ప్రధాన రహదారిలో డ్రెయినేజీ లేక రోడ్డుకు ఇరు వైపులా మురుగు పారుతోందని, వర్షం పడిన సమయంలో రొచ్చురొచ్చుగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగుపై దోమలు వాలడం వల్ల తాము అనారోగ్యాల పాలవుతున్నామని ప్రజలు తెలిపారు. ‘ఎమ్మెల్యే సారూ... ఒక్కసారి కిందకు దిగి రోడ్డుపై ఉన్న మురుగును చూడండి.. మా బాధలు తెలుసుకోండి’ అంటూ వేడుకున్నా ఎమ్మెల్యే పలకలేదు. ప్రజాప్రతినిధే పట్టనట్టు ఉంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు డ్రెయినేజీ ఏర్పాటు చేస్తామని ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో వార్డు ప్రజలు శాంతించారు. -
రైతు బతుకులో ‘సోలార్’ చీకట్లు
మూడు తరాల నుంచి ఆరు ఎకరాల్లో సాగు చేస్తున్నాం. ఈ భూమిపై ఇప్పటికే రూ.7 లక్షల పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడేమో సోలార్ వాళ్లు నయా పైసా ఇవ్వకుండా భూములు కాజేయాలని చూస్తున్నారు. మాకు మా భూమి కావాలి. సోలార్ వద్దే వద్దు. ఉన్న భూమి పోతే మేమెలా బతకాలి? ఊరొదిలి వెళ్లిపోవాలా? – వేడిగింజల అనసూయమ్మసాక్షి, పుట్టపర్తి: రైతుల పొలాల్లో వెలుగులు నింపాల్సిన సోలార్ ప్రాజెక్టు.. అదే అన్నదాతల బతుకుల్లో చీకట్లు నింపుతోంది. పచ్చని పంట పొలాలపై సోలార్ పలకలు పరచేందుకు.. ఏళ్ల తరబడి ఆ భూములనే నమ్ముకుని జీవిస్తున్న రైతులను పక్కకు నెట్టేస్తున్నారు. మొత్తం మీద 16,000 ఎకరాలపై కన్నేయగా ముందుగా 600 ఎకరాలను ప్రైవేటు కంపెనీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. రైతుల ప్రయోజనాల కంటే కంపెనీ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని జౌకుల గ్రామంలో పరిస్థితి ఇది. 16వేల ఎకరాలలో ఈ సోలార్ ప్రాజెక్టు వస్తోందని చెబుతున్నారు. అందులోభాగంగా తొలిదశలో జౌకుల గ్రామంలో పనులు మొదలయ్యాయి. ఏళ్ల తరబడి ఆ భూముల్లో సాగుచేసుకుంటున్న రైతులకు పైసా పరిహారమివ్వకుండా భూముల నుంచి బలవంతంగా వెళ్లగొడుతున్నారు. అదేమంటే అధికారమదంతో బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దల దన్నుతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఓ ప్రైవేటు కంపెనీతో రూ.25 కోట్లకు అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్సుకూడా తీసేసుకున్నారని వినిపిస్తోంది. కదిరి ఆర్డీఓ, పుట్టపర్తిలోని జిల్లా కలెక్టరేట్ చుట్టూ రైతులు ప్రదక్షిణ చేస్తున్నారు. సోలార్ ప్లాంటు వల్ల రైతులకు ఎదురవుతున్న కష్టనష్టాల గురించి తెలుసుకునేందుకు నంబులపూలకుంట మండలంలోని జౌకుల గ్రామాన్ని ‘సాక్షి’ బృందం విజిట్ చేయగా.. పలు విషయాలు వెల్లడయ్యాయి.ముందుగా 600 ఎకరాలపై..జౌకుల గ్రామ పరిసరాల్లోని భూములపై ఇప్పుడు సోలార్ ప్రాజెక్టు నీడ పడింది. ఈ ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఓ ప్రైవేటు కంపెనీ రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సర్వే నంబరు 179 పరిధిలోని సుమారు 600 ఎకరాల్లో తొలి దశ పనులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ భూములను తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని రైతులు పేర్కొంటున్నారు. పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను ఒక్కసారిగా భూముల నుంచి దూరం చేస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. భూమిని సాగు చేసింది రైతు.. దానిపైనే కుటుంబాన్ని పోషించుకున్నది రైతు.. చివరకు భూమి పోతున్నప్పుడు పరిహారం మాత్రం శూన్యమా? అని నిలదీస్తున్నారు.శ్రీ సత్యసాయి జిల్లా జౌకులలో జేసీబీ యంత్రాలతో చేస్తున్న పనులు ప్రభుత్వ పెద్దల దన్నుతో..ప్రభుత్వ పెద్దల దన్నుతో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విపరీతంగా వ్యవహరిస్తున్నారని, తనను ఎవరూ అడ్డుకోలేరనే రీతిలో చెలరేగిపోతున్నారని రైతులు చెబుతున్నారు. తాము భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెబుతున్నప్పటికీ ‘ప్రాజెక్టు ఆగదు.. భూములు ఇవ్వాల్సిందే’ అన్న తరహాలో ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జౌకులలో ఎకరా రూ.6లక్షల వరకు పలుకుతోంది. 600 ఎకరాలు రూ. 36 కోట్లు. కానీ రైతుల నుంచి భూములు ఇప్పించే విషయంలో సోలార్ కంపెనీకి హామీ ఇచ్చి రూ.25 కోట్ల మేర ఎమ్మెల్యే ఒప్పందం కుదుర్చుకున్నారని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.కోటి వరకు అడ్వాన్స్గా ముట్టిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ‘రైతులు ధర్నాలు చేసినా.. ఆందోళనలు చేపట్టినా.. ప్రాణాలు అర్పించినా.. ఉరి వేసుకుని చచ్చిపోయినా అనుకున్న మేరకు కార్యక్రమాలు కొనసాగుతాయి’ అని ఇటీవల నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లు రైతులు చెబుతున్నారు. తమ సమస్యలు వినాల్సిన ప్రజాప్రతినిధి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలకంటే సోలార్ ప్రాజెక్టే ముఖ్యమా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రూ.20 లక్షల పెట్టుబడి అయింది సోలార్ పేరుతో బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. పనులు చేసేందుకు యంత్రాలు వస్తున్నాయి. మొత్తం 10 ఎకరాలలో బోరు బావులు తవ్వించి, డ్రిప్ ఏర్పాటు చేసుకుని మామిడి చెట్లు నాటి పదేళ్లయింది. దాదాపు రూ.20 లక్షల పెట్టుబడి అయింది.. సోలార్ వద్దు.. మా భూమి మాకు కావాలి. పంటలు సాగు చేసుకుని బతుక్కుంటాం. – రమణస్క్రూటినీ అయ్యింది.. బుక్ ఇవ్వలేదు మాకు 3.5 ఎకరాల భూమి ఉంది. అందులో 2.5 ఎకరాలకు స్క్రూటినీ కూడా పూర్తయింది. ఈ భూమి లాగేసుకుంటే ఊరొదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి. మండల స్థాయి నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదక్షిణ చేసినా ఫలితం లేకుండా పోయింది. సోలార్ వద్దు. భూమిలో పంట వేసుకుంటాం. – బాబా ఫకృద్దీన్గొర్రెలు ఎలా మేపుకోవాలి? సోలార్ పలకలు ఏర్పాటు చేస్తే గొర్రెలు ఎలా మేపాలి? ఊర్లో చాలా గుంపుల గొర్రెలు ఉన్నాయి. అందరికీ నష్టమే. నా దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. నాకు 9 ఎకరాల భూమి ఉంది. అది కూడా సోలార్కు లాగేయాలని చూస్తున్నారు. సోలార్ వస్తే బయట ప్రాంతాలకు వెళ్లేందుకు దారి కూడా ఉండదు. – మస్తాన్ వలి30 ఏళ్లుగా సాగులో ఉన్నాం మేం 30 ఏళ్ల నుంచి సాగులో ఉన్నాం. ఇప్పటి వరకు పది బోర్లు వేయించగా, మూడు చోట్ల నీళ్లు వస్తున్నాయి. ఇప్పటికే సుమారు రూ.5 లక్షల పెట్టుబడి అయ్యింది. బలవంతపు భూమి లాక్కోవాలనుకుంటే ఊరుకునేది లేదు. డబ్బులన్నీ భూమిపై పెట్టాం. భూమి పోతే రోడ్డున పడాల్సిన పరిస్థితి. – ఆర్.నగేశ్ఆత్మహత్యలే గతి మా తాతల కాలం నుంచి సాగులో ఉన్నాం. నిమ్మ సాగు చేస్తున్నాం. ఈ భూమి కూడా లాగేసుకుంటే ఆత్మహత్యలే గతి. రైతులకు పరిహారం చెల్లించకుండా సోలార్కు భూములు లాక్కోవాలని చూస్తే ఊరంతా ఖాళీ అవుతుంది. – ఖాదర్ వలిజీవాలకు గ్రాసమూ ఇబ్బందే.. మా గ్రామానికి ఈ భూములే జీవనాధారం. కొందరు పంటలు వేసుకుంటారు. ఇంకొందరు పశువులు, గొర్రెలు మేపుతుంటారు. సోలార్ ఏర్పాటు చేస్తే చిన్న జీవాలకు గ్రాసం ఇబ్బంది అవుతుంది. వేరే ఆధారం లేదు. ఊరొదిలి వలస వెళ్లాల్సిందే. సోలార్ను మా ఊరికి రానివ్వం. – వల్లెపు భారతిమా భూమి ఇచ్చేది లేదు..మా తాతల కాలం నుంచి సాగులో ఉన్నాం. శెనక్కాయ, వంకాయ, టమాట పంటలు వేస్తుంటాం. అప్పు చేసి బోరు బావి తవ్వించా. నీళ్లు పడ్డాయి. సోలార్కు ఇచ్చే పరిస్థితి లేదు. – వేమల రామచంద్ర -
నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు
-
DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్
-
షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని
-
దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన
-
నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి
-
అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే
-
ఈ దీక్షా శిబిరం వద్దకు వచ్చాక నాకు మా అమ్మా నాన్నలు గుర్తొచ్చారు
-
నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోము.. చంద్రబాబుకు పురుషోత్తం రెడ్డి వార్నింగ్
-
రోజులన్నీ ఒకేలా ఉండవు రెడ్ బుక్ సంగతి తేలుస్తాం
-
మంత్రి దుర్గేష్ ను అడ్డుకున్న రఘురామకృష్ణంరాజు గన్ మెన్
-
నాపైనా, నా భర్త పైన కక్ష సాధింపు... కూటమిపై విరుచుకుపడ్డ MLC కల్పలత
-
TDP ఫేక్ ట్రోల్స్ పై జగన్ ఫ్యాన్ మాస్ కౌంటర్
-
కడపలో మళ్లీ ఫ్యాక్షన్. కూటమి ఎమ్మెల్యేల గూండాగిరి
-
చంద్రబాబుపై బొప్పరాజు ఫైర్
-
భూ కబ్జాలో BR నాయుడు కొడుకు
-
ఏపీ విద్యాశాఖలో రెడ్బుక్ అరాచకం
సాక్షి, విజయవాడ: విద్యాశాఖలో రెడ్ బుక్ అరాచకం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. కల్పలత భర్త ప్రతాప్ రెడ్డిపై చర్యలకు ఛార్జ్ మెమో జారీ చేసింది. ఐదేళ్ల కిందట సెలవు పెట్టినందుకు ఇప్పుడు ఛార్జ్ మెమో ఇచ్చింది.ఎస్సీఈఆర్టీ డైరెక్టర్గా పనిచేసిన ప్రతాప్ రెడ్డి.. ప్రస్తుతం వయోజన విద్య జేడీగా ఉన్నారు. ఉద్యోగుల సమస్యలు లేవనెత్తినందుకు కల్పలత కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. ప్రభుత్వం కక్ష సాధింపుపై ఎమ్మెల్సీ కల్పలతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నా గొంతు నొక్కడానికి కక్ష సాధిస్తున్నారు. మొట్టమొదటి మహిళా టీచర్ ఎమ్మెల్సీపై కక్ష సాధిస్తారా..?’’ అంటూ ఆమె మండిపడ్డారు.‘‘టీచర్లు, ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్నందుకు కక్ష కట్టారు. నా భర్త సెలవు పెడితే ఎన్నికల్లో ఎలా ప్రభావితం చేస్తారు..?. ఎంఈవోలు అసలు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ పరిధిలో ఉంటారా?. ఐదేళ్లలో ఒక్క సమావేశంకూడా పెట్టలేదు. నేను ఉద్యోగుల కోసం మాట్లాడితే ఇంకో ఛార్జ్ మెమో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నా పైనా, నా భర్త పైన జరుగుతున్న కక్ష సాధింపుపై పోరాడతాను. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోరాడతాను...మీరు ఎంత టార్గెట్ చేసిన ఉద్యోగుల సమస్యలపై మాట్లాడతాను. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు ఐదు డీఏల బకాయిలు చెల్లించాలి. పోలీసులు, సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. మీరు ఎంత టార్గెట్ చేస్తే అంత గట్టిగా పోరాడతాను’’ అంటూ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి స్పష్టం చేశారు. -
రాష్ట్రానికి పట్టిన శని... నారా లోకేష్పై పెద్దిరెడ్డి ఫైర్
-
DSC స్కామ్ పై అదిరిపోయే స్కిట్.. లోకేష్, పవన్ ఫోటోతో మాస్ ర్యాగింగ్
-
మన్యం బంద్తో ఏపీలో హైటెన్షన్!
-
చెప్పడానికి నాకే అసహ్యంగా ఉంది.. మీరు చేసిన నీచమైన పని.. సంచలన వ్యాఖ్యలు..
-
పనులు చేయించుకుని డబ్బు ఎగ్గొట్టిన మంత్రి కొల్లు అనుచరుడు
విజయవాడ: మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు పామర్తి రాజా పెట్రోలు బంకుల నిర్మాణ పనులు చేయించుకుని తమకు ఇవ్వాల్సిన కూలి సొమ్ము రూ.1.54 కోట్లు ఎగ్గొట్టారని ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళలు ఆరోపించారు. విజయవాడ కనకదుర్గమ్మకు సారె సమర్పించి గోడు చెప్పుకొంటామంటూ శుక్రవారం సంప్రదాయ వస్త్రధారణతో ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని ఇబ్రహీంపట్నంలో కొద్దిసేపు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు తెలిపిన మేరకు.. పామర్తి రాజా పెట్రోలు బంకుల నిర్మాణ కాంట్రాక్టరు. అతడి వద్ద కట్టుబడిపాలేనికి చెందిన బాణావతు రాజునాయక్ సబ్ కాంట్రాక్టర్గా పలు ప్రాంతాల్లో హెచ్పీసీఎల్ పెట్రోలు బంకులను నిరి్మంచారు. రాజునాయక్ తమ గ్రామానికి చెందిన 250 మందితో ఈ పనులు చేయించారు. దీనికి సంబంధించిన కూలి సొమ్ము, ఇతరత్రా రూ.1.54 కోట్లను పామర్తి రాజా ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బు ఇవ్వమని 20 నెలల నుంచి రాజునాయక్, కూలీలుగా పనిచేసిన గిరిజనులు మంత్రి రవీంద్ర, పామర్తి రాజా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది మే 8న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అప్పుడు మంత్రి రవీంద్ర బాధితులను పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా తరువాత పట్టించుకోవడంలేదు. రూ.12 లక్షలు మాత్రమే ఇస్తామంటూ పామర్తి రాజా రాయబారాలు నడుపుతున్నారు. దీంతో బాధితులు శుక్రవారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ రావాల్సిన డబ్బు అడుగుతుంటే పామర్తి రాజా తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది: సుగాలి మహిళలు రెండేళ్ల తమ కష్టార్జితం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న వారికి మంచి మనస్సు ప్రసాదించాలని సుగాలి మహిళలు అమ్మవారిని వేడుకున్నారు. 24 గంటల్లో తమకు డబ్బులు చెల్లించకుంటే టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. అదే సమయంలో ఓ సుగాలి మహిళ తీవ్ర ఆందోళనకు లోనై స్పృహ కోల్పోవడంతో కలకలం రేగింది. -
బొండా ఉమామహేశ్వరరావు బాటలో బుద్దా వెంకన్న..!
టీడీపీలో అంతర్గత అసంతృప్తి, అధిష్టానం మెప్పు కోసం జరుగుతున్న పోటీ ఇప్పుడు బహిరంగ దూకుడుకు దారి తీస్తోందా? విజయవాడ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఈ ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి. ఇటీవల ముద్రగడ సంతాప సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. ఆ తర్వాత పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే యత్నాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరంపై దాడికి దిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బొండా చర్యకు మరుసటి రోజే పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ బుద్దా వెంకన్న కూడా అదే తరహాలో వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అధిష్టానం మెప్పు కోసం టీడీపీ నాయకుల మధ్య మొదలైన ఈ పోటీ నగర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధిష్టానం మెప్పు పొందేందుకు విజయవాడ నగరంలోని టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. తొలిరోజు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరంపై దాడి చేస్తే దాన్ని చూసి రెండోరోజు నగరంలోని టీడీపీ ‘పశ్చిమ’ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా అదే బాట పట్టారు. టీడీపీ నేతలు చేస్తున్న ఈ రచ్చను నగర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు.. తర్వాత ప్లేటు మార్చి.. తాను టీడీపీకి కట్టుబడి ఉన్నానని అధిష్టానం మెప్పు పొందేందుకే ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరంపై దాడికి దిగారు. ఇటీవల వరకూ అసంతృప్తితో ఉండటం, అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉమా ఒక్కసారిగా ప్లేటు మార్చారు. గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాపసభలో పాల్గొన్న బొండా ఉమా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ముద్రగడ చేసిన ఉద్యమాలే కారణమంటూ వ్యాఖ్యానించడం, వైఎస్సార్ సీపీతోపాటు అన్ని పార్టీల్లోని కాపు నేతలతో మాట్లాడటం అధిష్టానానికి కోపం తెప్పించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడితో కమిటీ వేయడం, అ కమిటీ ముందు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఆ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నివేదిక ఇచ్చిన తర్వాత బుధవారం సంజాయిషీ ఇచ్చుకుని వచ్చారు. దాడికి వ్యూహరచన తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అబద్ధం అని చెప్పేందుకే వైఎస్సార్ సీపీపై దాడికి వ్యూహరచన చేశారు. గురువారం ఉదయం సింగ్నగర్కు చేరుకుని అక్కడ జన సమీకరణ చేసుకున్న తర్వాత నేరుగా ముత్యాలంపాడు ప్రభుత్వ ముద్రణాలయం వద్ద డీఎస్సీలో అక్రమాలపై జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకుని దాడికి తెగబడ్డారు. షామియానాను తొలగించడంతో పాటు వైఎస్సార్ సీపీ నేతలపై తన అనుచరులను దాడులకు పురికొల్పారు. వెంకన్న దాడికి యత్నం రెండోరోజు శుక్రవారం పశ్చిమలో కేదారేశ్వరపేటలోని బాప్టిస్ట్పాలెంలో జరుగుతున్న దీక్షా శిబిరంపై దాడికి వెంకన్న ప్రయత్నించారు. ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేయగా, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున చేరుకుని దాడికి తెగబడ్డారు. గురువారం ఘటనతో పరువు పోగొట్టుకున్న పోలీసులు అప్రమత్తమై వారిని అక్కడి నుంచి పంపించివేశారు. అధిష్టానం మెప్పుకు ఒకరిని చూసి మరొకరు వాతలు పెట్టుకుంటుండటంతో ఈ ట్రెండ్ ఎక్కడికి పోతోందనన్న భయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.బ్రాహ్మణ నేతపై దాడి బ్రాహ్మణ సామాజికవర్గానికి చెంది రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో బొండా వర్గం దాడి చేయడాన్ని ఆ సామాజికవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్ నుంచి మార్కులు కొట్టేయడం కోసమే ఈ దాడులకు దిగినట్లు సమాచారం. ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడులకు దిగిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి పొలిట్బ్యూరోలో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే.లోకేష్ దృష్టిలో పడటానికే హడావుడి ఈ నేపథ్యంలోనే తాను కూడా లోకేష్ దృష్టిలో పడేందుకు ఈ హడావుడి చేసినట్లు తెలుస్తోంది. రాజధాని రైతులను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్సార్ సీపీ కమిటీ సభ్యులపై మహిళలతో కోడిగుడ్లతో దాడి చేసిన సంఘటన స్ఫూర్తితోనే మహిళలకు కోడిగుడ్లు ఇచ్చి వారిని గొడవకు తీసుకువచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. విజయవాడ నడి»ొడ్డున రెండుగంటలపాటు టీడీపీ నేతలు హడావుడి చేసినా పోలీసులు చోద్యం చూడటం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. -
చేతులెత్తేసిన గుడివాడ ఎమ్మెల్యే.. జనాలకు కుచ్చుటోపి
-
రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత
సాక్షి, అమరావతి: పచ్చ ముఠాల దౌర్జన్యం.. విధి నిర్వహణలో పోలీసుల ఉదాసీనతపై భారతీ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా హైకోర్టు స్పందించింది. భారతీ సిమెంట్స్ మైనింగ్ కార్యకలాపాలను టీడీపీ మూకలు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాంట్తో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న టీడీపీ మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు! భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. క్రమశిక్షణరాహిత్యంలో భాగంగా కాంట్రాక్టర్ తొలగించిన కొంత మంది, ఇతరులతో కలిసి భారతీ సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకుని ఉత్పత్తి నిలిపేయాలన్న కుట్రతో వ్యవహరిస్తున్నారన్నారు. ప్లాంట్లోకి వెళ్లే దారులను మూసివేసి రాకపోకలకు తీవ్ర ఆటంకాలు సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని నివేదించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అల్లరి మూకల దౌర్జన్యం వల్ల గని నుంచి లైమ్స్టోన్, ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. గతంలో రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా, ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదని మోహన్రెడ్డి వివరించారు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందన్నారు. అంతేకాక ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సైతం నష్టం కలుగుతోందని తెలిపారు. కొందరి రాజకీయాలతో ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం... ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి వేల మంది ఉద్యోగులు బతుకుతున్నారని, కొందరి రాజకీయాల వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం నెలకొందని మోహన్రెడ్డి తెలిపారు. దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తూ, ఖజానాకు పన్నుల రూపంలో భారీ మొత్తాలు చెల్లిస్తున్న కంపెనీ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. గతంలో ఇదే రీతిలో కొందరు ఇండియా సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకున్నారని, దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చిందని నివేదించారు. ఈ రోజు కూడా ప్లాంట్కు వెళ్లకుండా దారిలో టెంట్ వేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. 10 మందిపై చర్యలు తీసుకునేలా పరిస్థితిలో కూడా పోలీసులు లేరంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్లాంట్లో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కంపెనీపై ఆధారపడి బతుకుతున్న కారి్మకులను దృష్టిలో పెట్టుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. కాగా పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యం తొలిసారి విచారణకు వస్తోందని, పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
ఏపీలో మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
సాక్షి, తాడేపల్లి: ‘‘దిశ”ను ఉపసంహరించుకోవటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను.. రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు.‘‘మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం “దిశ”ను తీసుకొచ్చింది. నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం...దిశలో భాగంగా మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కినా, ఫోన్ను 5 సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు. 18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్రస్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించాం...900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక POCSO కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటాబేస్ను రూపొందించాం. అందుకనే దిశ విజయవంతగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అదించింది’’ అని వైఎస్ జగన్ వివరించారు.‘‘2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో డీఎన్ఏ నివేదికలకు నెలలు పట్టేది. దిశ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి...ఇదీ దిశ ఇచ్చిన భరోసా. ఇవీ దిశ సాధించిన ఫలితాలు. అందుకే 19జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో “దిశ’’ గెలుచుకుంది. “దిశ” అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ SOS నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం “BNS (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు” అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన SOS వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటాబేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తు! న్యాయం అనే లక్ష్యానికి BNS ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది?“దిశ”ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం.మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం,… pic.twitter.com/cF3dc8uSpT— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026..మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు 7 పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా దిశ ద్వారా తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా వైయస్సార్సీపీదే. 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం. ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే, దర్యాప్తులో జాప్యం ఉండకూడదు. విచారణలో ఆలస్యం ఉండకూడదు. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి.. వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పుపట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది?..మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?. “దిశ”ను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది. మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. దిశను రద్దు చేయడం కాదు.. రక్షించాలి. దిశను నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
మల్లాది విష్ణు టెంట్ వేసి దీక్ష చేస్తున్నాడు ... దమ్ముంటే ఈరోజు వెళ్లు.. బోండా ఉమాకు పేర్శినాని వార్నింగ్
-
Gen Z పై చంద్రబాబు సంచలన కామెంట్స్ ఇక మీకు చుక్కలే...
-
హోంమంత్రి అనితకు పుష్ప శ్రీ వాణి నాన్ స్టాప్ కోటింగ్
-
ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి... మీకు ఈ రెండేళ్లే టైం...
-
వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాలపై దాడులు.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ దీక్షా శిబిరాల మీద దాడుల పట్ల ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. దాడుల వీడియోను ఎక్స్లో పోస్టు చేసిన వైఎస్ జగన్.. చంద్రబాబూ మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? అంటూ నిలదీశారు. నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘డీఎస్సీ-2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు...రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. నారా లోకేష్ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘డీఎస్సీ –2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి...చంద్రబాబూ.. మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు. ఆంధ్రప్రదేశ్ జెన్ జీ గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.@ncbn గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా?#DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ… pic.twitter.com/SbndqNaPsD— YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2026 -
రాష్ట్రమంతటా రౌడీ రాజ్యంపై YSRCP రిలే నిరాహార దీక్షలు
-
వెకిలి నవ్వు నవ్వడానికి సిగ్గులేదా.. అనితపై వరుడు కళ్యాణి ఫైర్
-
ప్రశ్నిస్తే కేసులు.. డీఎస్సీపై శ్వేతపత్రం ఎక్కడ?: అబ్బయ్య చౌదరి
సాక్షి, ఏలూరు: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు.మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తాజాగా మాట్లాడుతూ.. డీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ (SCERT) ద్వారా రూపొందించారని, వాటిని ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చింది కూడా అదే సంస్థేనని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడే పనిచేస్తున్న ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి మెరిట్ జాబితాలో తొలి ర్యాంకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. దీనివల్ల ప్రశ్నాపత్రం లీకైందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు.ఏళ్ల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోగా, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ వెంట నడిచిన వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆరోపించారు. ఇంటర్ కాలేజీ, ఇంటర్ స్టేట్ స్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి కూడా డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారని, ఇందుకోసం ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) సైతం మార్చారని విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అంశాలపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన రూ.15 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని ఫోన్, వీడియో కాల్ సంభాషణలు జరిగాయా లేదా అనే అంశంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి అన్యాయం జరిగినా ప్రతిపక్షంగా వారి తరఫున గళం వినిపిస్తాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థ ద్వారా 1.20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని, ఆ నియామకాల్లో ఎక్కడైనా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. ఉద్యోగ నియామకాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమపై కేసులు నమోదు చేస్తున్నారని, ఇంటి వద్ద సమావేశం నిర్వహించుకున్నా సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారని ఆరోపించారు. దెందులూరులో నిరసనలు ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.విజయవాడలో జరిగిన ఘటన దారుణమని వ్యాఖ్యానించిన అబ్బయ్య చౌదరి, బోండా ఉమా అనుచరులు రౌడీయిజానికి పాల్పడ్డారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగి ఉంటే అప్పటి ప్రతిపక్షం ధర్నాలు చేసేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే ప్రతిపక్షంగా తాము కూడా అభినందిస్తామని ఆయన అన్నారు. -
శ్వేతపత్రం గేమ్ ఇందుకేనా చంద్రబాబు ?
సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలను ఎలా గందరగోళ పరచాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. రెండేళ్ల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై శ్వేతపత్రం ఇవ్వవలసిన అవసరం ఏమి వచ్చింది? రానున్న రోజుల్లో ప్రజల నడ్డి విరిచే విధంగా అదనపు భారం పడే అవకాశం ఉంటుందా? లేక తను ఇచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదని సంకేతం ఇవ్వడమా? టీడీపీ, జనసేన కలిసి బాండ్ల రూపంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేసినట్లు భ్రమ పడాలనా? ఉద్యోగులు ఇకపై తమ డిమాండ్లను అడగకుండా బెదిరించడమా? 2024 ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన రీతిలో ఈ రెండేళ్లలో ఎంత సంపద సృష్టించారో ఎందుకు చెప్పలేకపోతున్నారు? పైగా అప్పులు చేయకపోతే సంక్షేమ స్కీములు ఇవ్వలేమన్న సందేశం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది. జగన్ టైమ్ లో రెండేళ్ల కరోనా ఉన్నా,ఎన్నడైనా ఆర్ధిక పరిస్థితిపై ప్రజలను బేజారెత్తించేలా మాట్లాడారా? ఆయన టైమ్ లో ఓడరేవులు, మెడికల్ కాలేజీలు,ఊరూరా సచివాలయ భవనాలు వంటి ఎన్నిటినో నిర్మించి సంపద సృష్టిస్తే, కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిన ప్రగతి ఏమిటి?ప్రైవేటువారు తప్ప, ప్రభుత్వం ఏమి చేయలేదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడడం బలహీనతగా కనిపించదా?అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా గత ప్రభుత్వంపైన విమర్శలు చేసి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా?లేదా?ఏతావాతా చూస్తే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఏభై ఏళ్లకే ఎస్సి,ఎస్టి,బిసి లకు పెన్షన్, ఉద్యోగులకు పిఆర్సి వంటివి ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ శ్వేతపత్రం కధను నడిపారా?అన్న ప్రశ్న వస్తోంది.అయితే ఆ విషయం మనసులో పెట్టుకుని పైకి మాత్రం సంక్షేమ కార్యక్రమాలు ఆపబోమని చెబుతున్నా,ఏదో జరగబోతోందన్న అనుమానం కలుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎపిలో ఎక్కడకు వెళ్లినా జన ప్రభంజనం కనిపిస్తుండడంతో, చంద్రబాబు తన మానిఫెస్టోలోని కొన్నిటిని అయినా, కొంతమేర అయినా అమలు చేశారనిపిస్తుంది. గతంలో ఆయన ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని, విభజిత ఎపికి 2014 టరమ్ లో సి.ఎమ్.గా పనిచేసినప్పుడు కాని ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోండి.2014 ఎన్నికలకు ముందు రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక కొద్ది మొత్తం చేసి ఆశకు హద్దు ఉండాలని వ్యాఖ్యానించారు. పలుహామీలను ఎగవేశారన్న విమర్శను ఎదుర్కున్నారు. 1995 లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావును కుర్చీ నుంచి దించేసి తాను సి.ఎఎమ్ అయ్యాక చేసిన డబుల్ గేమ్ ఒక ఉదాహరణ అవుతుంది. అప్పట్లో కిలో సబ్సిడి బియ్యం ధర రెండు రూపాయలు ఉండేది. ఎన్.టి.ఆర్. మద్య పాన నిషేధం అమలు చేశారు.ఇలాంటివి మరికొన్ని కూడా ఉన్నాయి. ఎన్.టి.ఆర్. 1996 జనవరిలో మరణించారు. అదే సంవత్సరం లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల ప్రచారంలో తాము గెలిస్తేనే ఈ స్కీములన్నీ కొనసాగించగలగుతామని చెప్పేవారు.మద్య నిషేధం మరింత గట్టిగా అమలు చేస్తానంటూ హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు. ఎన్నికలు పూర్తి అయ్యాక రాష్ట్ర ఆర్దిక పరిస్థితి బాగోలేదంటూ జనానికి చెప్పడం ఆరంభించారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ సమావేశాలు పెట్టించారు.ఆయన కూడా స్వయంగా కొన్నిటిలో పాల్గొనేవారు. ఉదాహరణకు ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో జరిగిన మీటింగ్ లో మద్య నిషేధంపై అభిప్రాయం అడిగారు.మద్య నిషేధాన్ని సరిగా అమలు చేయలేకపోతున్నామని, అక్రమ మద్యం రాష్ట్రంలోకి వస్తోందని చెప్పేవారు. 1994 ఎన్నికలకు ముందు ప్రజలను , వివిధ వర్గాలవారిని అడిగి వాగ్దానాలు ఇవ్వలేదు .ఎన్.టి.రామారావు వాటిని అమలు చేసిన నేపధ్యంలో తనపై వ్యతిరేకత రాకుండా ఉండడానికి చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేసేవారు.తదుపరి కిలో రేషన్ బియ్యాన్ని 5.50 రూపాయలకు పెంచారు. మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. ఇలా పలు నిర్ణయాలను తిరగదోడారు. అయితే ఇదంతా ప్రజల ఆమోదంతోనే జరిగిందన్న భావన కల్పించడానికి యత్నించారు. సరిగ్గా అదే పంధాలో ప్రస్తుతం కూడా ఆయన వెళ్లే యత్నం చేస్తున్నారా అన్న సందేహం వస్తుంది.అప్పటి రాజకీయ పరిస్థితులు, సమాచార వ్యవస్థ, ఇప్పుడున్న పరిస్థితి, సోషల్ మీడియా వేరు.అందువల్ల కొంత జంకుతున్నట్లు అనిపిస్తుంది. 2024 ఎన్నికలకు ముందు కూడా ఆకాశమే హద్దుగా వరాలు ప్రకటించారు.అదేమంటే సంపద సృష్టించడం తెలుసునని అన్నారు. తీరా చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. జగన్ టైమ్ లో రెండేళ్ల కరోనా ఉన్నప్పటికీ మొత్తం ఐదేళ్లలో సుమారు 35వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చగలిగితే ,ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం కేవలం 600 కోట్ల అదనపు ఆదాయమేనని వైసిపి నేతలు లెక్కలు చెబుతున్నారు. అయినా గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని, దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందన్న ప్రచారం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. ఆ విధ్వంసం ఏమిటో ఎంతకీ చెప్పకపోవడం విశేషం.చంద్రబాబు ఈసారి ఒక సంగతి చెప్పారు. రెండు హామీలు తప్ప మిగిలినవి అమలు చేశామని అన్నారు.ఇంతకుముందు అన్ని చేసేశామని, ఎవరైనా ఇంకేమైనా అడిగితే వారి నాలుక మందమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మాత్రం రెండు హామీలు అమలు చేయలేదని అంగీకరించడం విశేషం. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు.దానికి ప్రత్యామ్నాయంగా పి-4 అమలు చేస్తున్నామని కొన్నాళ్లు చెప్పినా ప్రజలు విశ్వసించడం లేదన్న సంగతి అర్దం అయి ఉండాలి. అలాగే 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని, 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని అన్నా,కేంద్రం వాటిలో ఉన్న సత్యం ఏమిటో చెప్పేసింది. కేవలం ఏడువేల కోట్ల లోపే పెట్టుబడులు వచ్చాయని, వాటివల్ల 22 వేల ఉద్యోగాలు వస్తాయని ఒక జవాబులో వెల్లడించింది. చంద్రబాబు అప్పట్లో ఇచ్చిన హామీల ప్రకారం ఏడాదికి సుమారు లక్షన్నర కోట్లు సంక్షేమ స్కీములకు వెచ్చించాలని అంచనా.కాని రెండేళ్లకు కలిపి అంత చేశానని ఆయన తెలిపిన లెక్కలను బట్టి అర్ధం అవుతుంది. మొదటి సంవత్సరం ఒక్క పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం తప్ప మరే స్కీమ్ అమలు చేయలేదు. ఆ తర్వాత అమలు చేస్తున్నా,అనేక పరిమితులు, కోతలు పెడుతున్నారన్న విమర్శ ఉంది. ఇక ఉద్యోగ సంఘాలు తమకు చేసిన వాగ్దానాల గురించి అడుగుతుంటే,ఇప్పటికే మొత్తం రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే పోతున్నదని ప్రకటిస్తున్నారు. అంటే ఇది ఒకరకంగా వారిని బెదిరించడమే అవుతుంది కదా అని అంటున్నారు.ఆయన ఎన్నికల మానిఫెస్టోని దగ్గర పెట్టుకుని ఎందుకు మాట్లాడరో ప్రజలు అర్ధం చేసుకోలేరా? అప్పుల గురించి నేరుగా వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. కాగా ద్రవ్యలోటు అన్నది మిద్య అని,కాకి లెక్కలు అని చంద్రబాబు వ్యాఖ్యానించడం విన్నవారికి మతిపోయినంత పని అయింది. అంటే బడ్జెట్ మిద్య, సంపద సృష్టి అన్నది మిద్య అని అనుకోవాలా? ఇంతకీ ఈ శ్వేత్రపత్రం విడుదలలో అసలు లక్ష్యం ఏమిటో తెలియడానికి మరికొంత సమయం పడుతుందేమో చూడాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మంత్రుల ఒత్తిడి.. ఆసుపత్రిలో చేరిన చలసాని
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులును మంత్రులు టార్గెట్ చేసి రాజీనామా చేయాలని ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆంజనేయులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే, బుధవారం సాయంత్రం జరిగిన విజయ డెయిరీ డైరెక్టర్ల సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ సమావేశం అనంతరం విజయ డెయిరీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి.. చలసాని ఆంజనేయులతో సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని, అధిష్టానం ఆదేశాలు ఉన్నాయని ఆయనకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.దీనిపై స్పందించిన చలసాని ఆంజనేయులు నిర్ణయం తీసుకోవడానికి ఒక్కరోజు గడువు ఇవ్వాలని కోరినప్పటికీ, అందుకు అవకాశం లేదని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని మంత్రులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాల మధ్య మంత్రుల సమక్షంలోనే చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురికాగా, వెంటనే ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. -
అసలు దాడి ఎలా చేసారంటే..! మీ కేసులకు, దాడులకు తగ్గేదేలే.. బోండా ఉమాపై మల్లాది విష్ణు ఫైర్
-
పచ్చ బ్యాచ్ రౌడీయిజం
సాక్షి, అమరావతి, సాక్షి, నెట్వర్క్: ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అయింది.. అధికార మదంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు... ఉన్మాదంతో నీచాతి నీచానికి ఒడిగట్టారు... మునుపెన్నడూ లేనివిధంగా నిరసన శిబిరాలపై పాశవిక దాడులకు తెగబడి, దారుణ ఘటనకు పురిగొల్పి విష సంస్కృతికి తెర తీశారు. మహాత్ముడు జన్మించిన దేశంలో నిరసన తెలియ చేయడం ప్రజల ప్రజాస్వామ్య హక్కు. అలాంటి హక్కును కిరాతకంగా కాలరాశారు. నిరసన శిబిరాలపై దాడులకు తెగబడి దౌర్జన్యం చేయడం.. విజయవాడలో ఏకంగా బాటిల్లో మూత్రం తీసుకొచ్చి పైశాచికంగా శిబిరంలో ఉన్నవారిపై చల్లడం.. నడిరోడ్డుపై రౌడీయిజానికి దిగడం.. కానీ దెబ్బలు తిన్నవారిపైనే పోలీసులు తిరిగి కేసులు పెట్టడం.. నిజంగా ఇది రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే! ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయడం.. యువతకు రెండేళ్లుగా ఎగ్గొడుతున్న నిరుద్యోగ భృతి చెల్లించడం.. మెగా డీఎస్సీ 2025 స్కామ్పై సీబీఐతో విచారణ.. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శాంతియుత ఆందోళనలపై చంద్రబాబు సర్కారు దమనకాండకు పాల్పడింది. మెగా డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు, అర్హులను వెనక్కి నెట్టి పోస్టులను అమ్ముకోవటాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6వతేదీ నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జెన్జీ యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉద్యమిస్తోంది. దగా పడిన డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, పార్టీ యువజన–విద్యార్థి విభాగాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుండటంతో తన కుమారుడి రాజకీయ భవిత అంధకారంలో పడుతుందని బెంబేలెత్తిన సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులు, పోలీసులను రంగంలోకి దించారు. ఖాకీల అండతో పచ్చమూకలు విచ్చలవిడిగా వ్యవహరించాయి. పలు ప్రాంతాల్లో నేరుగా శిబిరాల వద్దకు చేరుకుని వీరంగం సృష్టించాయి. రెడ్బుక్ రాజ్యాంగం అమలులో నిమగ్నమైన పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. శాంతియుత ఆందోళనలను అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను చంద్రబాబు సర్కారు కాలరాయడంపై యువత మండిపడుతోంది. వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలను భగ్నం చేసేందుకు యత్నించడంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు పీకేస్తున్న టీడీపీ మూకలు బ్రాహ్మణనేత మల్లాది శిబిరంపై కోడిగుడ్లు విసిరి.. మూత్రం పోసి!బ్రాహ్మణనేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలో పాల్గొన్న నిరసన దీక్ష శిబిరంపై కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలు విసిరిన పచ్చమూక అంతటితో ఆగకుండా అత్యంత దారుణంగా మూత్రం పోసి రెచ్చిపోయాయి. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్వయంగా దీన్ని పర్యవేక్షించడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే దీక్షా శిబిరం ఏర్పాటైంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో అక్కడకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ తన అనుచరులతో కలసి దుర్భాషలకు దిగారు. టెంట్ వేసి ధర్నాలు చేయడం ఏమిటి..? లోకేశ్, చంద్రబాబును తిడితే తోలు తీస్తామంటూ ఎమ్మెల్యే బొండా టెంట్ పీకేయడంతో ఆయన వెంట వచ్చిన అనుచరులు మరింత చెలరేగిపోయారు. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో శిబిరంలో ఉన్నవారిపై దాడి చేశారు. ముందుగానే బాటిల్లో తెచ్చుకున్న మూత్రాన్ని శిబిరంలో ఉన్నవారిపై చల్లి భీతావహ పరిస్థితి సృష్టించారు. మహిళా కార్యకర్తలపై కూడా దాడి చేశారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారే గానీ టీడీపీ మూకలను నిలువరించే యత్నం చేయలేదు. ఓ మహిళా కార్యకర్త టీడీపీ జెండా కర్రతో మల్లాది విష్ణు చేతిపై దాడి చేసింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి ధర్నా చౌక్కు తరలించడంతో అందులో కూర్చునే సాయంత్రం వరకు నిరసన తెలిపారు.టీడీపీ మూకల దాడిపై వైఎస్సార్సీపీ నిరసన..టీడీపీ మూకల దాడిని నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, ఎండీ రుహుల్లా, నగర మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్ తదితరులు విజయవాడ ధర్నా చౌక్లో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. శాంతియుత ఆందోళనకు ముందుగానే పోలీసుల అనుమతి తీసుకున్నామని, అయినప్పటికీ టీడీపీ మూకల నుంచి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాది విష్ణు శిబిరంపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ శ్రేణులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబును కలిసిన మర్నాడే బొండా బరి తెగింపు..సీఎం చంద్రబాబు వద్దకు తన కుమారులను వెంటబెట్టుకుని వెళ్లిన మరుసటి రోజే ఎమ్మెల్యే బొండా ఉమ ఈ దమనకాండకు తెగబడటం గమనార్హం. తన కుమారుడు లోకేశ్ రాజకీయ జీవితాన్ని రక్షించుకునేందుకే బొండాను ఉసిగొల్పినట్లు స్పష్టమవుతోంది. పలు సందర్భాల్లో కాపు నేతలనే చంద్రబాబు పావులుగా వాడుకుంటున్నారు. గతంలో గుడివాడ, మాచర్ల ఘటనల్లోనూ బొండా ఉమను పంపి దాడులకు పురిగొల్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్పై నమోదైన కేసులన్నీ జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనే ఉండటం గమనార్హం. చంద్రబాబు తన రాజకీయ కుతంత్రంతో కాపు యువతను వాడుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.⇒ గుంటూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, తాడిపత్రి, బాపట్ల తదితర ప్రాంతాల్లో దీక్షా శిబిరాలను పోలీసులు బలవంతంగా తొలగించారు. వైఎస్సార్సీపీ నేతలను నిర్బంధించి దీక్షలను అడ్డుకునే యత్నం చేశారు. మాచర్ల, గురజాలలో పోలీసుల ఓవరాక్షన్పై వైఎస్సార్సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న నిరసన దీక్ష టెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు బెదిరింపులకు దిగారు. దీక్షలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించగా.. అక్రమ కేసులకు భయపడేది లేదని పిన్నెల్లి తేల్చి చెప్పారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో రిలే దీక్షల్లో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ⇒ రేపల్లె, పలమనేరు, చిలకలూరిపేట, వేమూరు, పొన్నూరులో రిలే దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షా శిబిరాలను తొలగించే యత్నాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరోధించడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. మార్కాపురం జిల్లా కనిగిరిలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఉదయాన్నే కూల్చి వేశారు. కనిగిరి ఇంఛార్జ్ నారాయణయాదవ్ను పోలీసులు ఈడ్చేశారు. అనంతపురం జిల్లా యాడికిలో దీక్ష టెంట్ను టీడీపీ నేతలు దౌర్జన్యంగా తొలగించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన రిలే దీక్షలను దర్గామిట్ట పోలీసులు అడ్డుకున్నారు. 24 గంటల్లోగా బొండా ఉమాను అరెస్టు చేయాలిలేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉ«ధృతం చేస్తాం: మల్లాది విష్ణు టీడీపీ జెండాతో వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు, తదితరులపై దాడి చేస్తున్న టీడీపీ గూండాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ/గాంధీనగర్: పోలీసులు పూర్తిగా టీడీపీకి తొత్తులుగా మారారు. వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షకు అనుమతి ఉందా? లేదా? అనే విషయంలో ఎమ్మెల్యేకి ఏం సంబంధం? శిబిరం గురించి మేం పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఎమ్మెల్యే మాపై దాడికి వస్తున్నట్లు ఒక గంట ముందే పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఈ విషయం సీఐ సహా పై అధికారులందరికీ చెప్పాం. ధర్నా చేస్తుంటే టెంట్ పీకాల్సిన అవసరం ఏమిటి? రాళ్లు, కోడిగుడ్లు, టమోటాలు వేశారు. మహిళలపై దాడి చేశారు. ఇది మంచి ప్రభుత్వమా? ప్రతిపక్షం ఏమీ మాట్లాడకూడదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు.. ఏదైనా మాట్లాడితే తోలు తీస్తాం అంటూ బెదిరింపులు! ఇలాంటి రౌడీయిజం, గుండాయిజాన్ని సహించేది లేదు. మంత్రి లోకేశ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందే. అంతవరకు మా పోరాటం ఆగదు. సీఎంవో డైరెక్షన్లో..ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులు, రౌడీ మూకలతో వచ్చి దాడికి తెగబడ్డారు. దాదాపు రెండు గంటల పాటు వైఎస్సార్సీపీ దీక్షా శిబిరం వద్ద బీభత్సం సృష్టించారు. టీడీపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమోటాలు, కుళ్లు పట్టిన పదార్థాల్లో మూత్రం పోసి వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలపై విసిరి రాక్షసానందం పొందారు. దాడి చేస్తున్న బొండా ఉమా రౌడీ మూకలను పోలీసులు అడ్డుకోకుండా, మౌనంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే నేరుగా డైరెక్షన్ రావడం వల్లే పోలీసులు దాడిని అడ్డుకోలేదు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో యమధర్మరాజు స్కిట్ రూపంలో వినూత్నంగా రిలే నిరాహార దీక్ష.. సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ ఈ దాడి ఘటనపై హోంమంత్రి, డీజీపీ ఏం సమాధానం చెబుతారు? డీఎస్సీలో అక్రమాలు, అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. శాంతియుత దీక్షపై భౌతిక దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులపై 24 గంటల్లోగా పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను మరింత ఉ«ధృతం చేస్తాం. కాగా, శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై దాడి చేసి గాయపర్చిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు గుండె సుందర్పాల్, వరలక్ష్మీ, మాన్యం జగదీష్ ఎస్ఎన్ పురం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. -
విజయ డైరీ చైర్మన్పై టీడీపీ నేతల ఒత్తిళ్లు
ఆంధ్రప్రదేశ్, విజయవాడ: విజయ డెయిరీ చైర్మన్గా బుధవారం సాయంత్రం జరిగిన డైరెక్టర్ల సమావేశంలో చలసాని ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఆయన ఎన్నిక అనంతరం రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నట్లు సమాచారం.చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఇద్దరు మంత్రులు, టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రులు విజయ డెయిరీ కార్యాలయానికి వెళ్లి చలసాని ఆంజనేయులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఒత్తిళ్ల కారణంగా చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురై, విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.అయితే, టీడీపీ నేతలు, మంత్రుల నుంచి ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన లేదు. అలాగే, చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురికావడానికి గల అసలు కారణాలు రాజీనామా చేయాలనే ఒత్తిడేనా అనేదానిపై వైద్యుల నుంచి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
టెంట్లు పీకేసి, కోడిగుడ్లు విసిరి.. మూత్రం పోసి.. టీడీపీ సైకోల దాడి
-
APలో దిశా బిల్లు రద్దు.. హోంమంత్రి ప్రకటన
-
‘ఎన్ఆర్ఐ మహిళను వేధించిన ఆ మంత్రిపై చర్యలేవీ?’
సాక్షి, తాడేపల్లి: అమెరికాలోని డల్లాస్లో రాష్ట్ర మంత్రి ఒకరు తనను వేధించారంటూ ‘ప్యూర్’ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సంస్థ వ్యవస్థాపకురాలు, ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా తాళ్లూరి మంత్రి నారా లోకేష్కు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు వెన్నుపోటు పార్టీ కానీ, ఈ ప్రభుత్వం కానీ స్పందించలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి ఆక్షేపించారు.ఎన్ఆర్ఐ అయిన తెలుగు మహిళను వేధించిన ఆ మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు, ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల భద్రతను పూర్తిగా గాలికొదిలేసిందని, వారు అధికారంలోకి వచ్చిన 26 నెలలుగా మహిళలపై వేధింపులు, దాడులు, అవమానాలు పెరిగిపోయాయని చెప్పారు. మహిళలను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగ మల్లీశ్వరి గుర్తు చేశారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే..అమెరికాలోని డల్లాస్లో వెన్నుపోటు పార్టీకి చెందిన ఓ మంత్రి తనను వేధించారంటూ ఎన్ఆర్ఐ తెలుగు మహిళ సోషల్ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేసినా, ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఆ మహిళను ఒంటరిగా కాఫీకి రావాలని పిలవడం, ఫొటోలు పంపి ఇబ్బంది పెట్టడం వంటి ఆరోపణలను సైతం వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకోవడం అత్యంత హేయం.ఇంత జరిగినా వెన్నుపోటు పార్టీ తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తోంది. బాధిత మహిళ సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, హోం మంత్రి అనిత తదితరులని ట్యాగ్ చేస్తూ న్యాయం కోసం అభ్యర్థించినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం స్పందించక పోవడం హేయం.రాష్ట్రంలో మహిళలపై అన్యాయం జరిగిన ప్రతిసారీ తిరిగి బాధితుల పైనే కేసులు పెట్టే పరిస్థితిని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళా కమిషన్, హోం శాఖ, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రజల కోసం కాకుండా అధికార వెన్నుపోటు పార్టీ నాయకుల కోసం మాత్రమే పని చేస్తున్నాయనే భావన కలుగుతోంది.వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఇప్పుడు అవి సరిహద్దులు కూడా దాటాయి. చివరకు అమెరికాలో సైతం ఏకంగా రాష్ట్ర మంత్రి, ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించడం వెన్నుపోటు పార్టీ, ఈ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ట. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వానికి ఏ మాత్రమైనా నైతికత ఉంటే, తక్షణమే ఆ మంత్రిని బర్తరఫ్ చేసి, కేసు పెట్టి విచారణ చేయాలని నాగ మల్లీశ్వరి డిమాండ్ చేశారు. -
ధర్మేంద్ర బాటలో లోకేష్ రాజీనామా చెయ్యాల్సిందే..
-
అది పచ్చి అబద్ధం.. చిరంజీవి టీమ్ క్లారిటీ
-
ఏ1,ఏ2ను కాపాడుతున్న TDP ప్రభుత్వం
-
N (NARA) ట్యాక్స్ దెబ్బకు భారీ పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి
-
లీకుల లీడర్ లోకేష్.. YSRCP దీక్షలతో దద్దరిల్లిన AP
-
వైరల్ పోస్ట్ పై నారా లోకేష్ మౌనం ఎందుకు..? ఆ మంత్రి ఎవరు..?
-
అనిత వెస్ట్ అని పవన్ కల్యాణే... వెళ్తూ.. వెళ్తూ అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
మీ ప్రభుత్వం చేసే కంపును ఎన్ని రోజులు ఇసుకేసి ఆపుతారు పేర్ని నాని ఫైర్


