రోడ్లు లేని గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోయా
గ్రామీణ నిరుద్యోగులు ఉపాధిలేక అల్లాడిపోతున్నారు
వారి పరిస్థితి కంటతడి పెట్టించింది.. మూడ్రోజుల పాటు 35 గ్రామాలు తిరిగి 480 కుటుంబాలతో మమేకమయ్యా
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
తిరువూరు: రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన వాట్సాప్లో స్టేటస్ పెట్టారు.
తాను మూడ్రోజులపాటు 35 గ్రామాలు తిరిగి 480 కుటుంబాలతో మమేకమయ్యానని, రహదారుల్లేని గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోయానంటూ ఆ స్టేటస్లో పేర్కొన్నారు. గ్రామీణ నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారని, వారి పరిస్థితి సైతం కంటతడి పెట్టించిందని కొలికపూడి పేర్కొన్నారు. ఇప్పుడు కొలికపూడి వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి.


